breaking news
Karnataka
-
ఘనంగా ఆండాళ్ రంగమన్నార్ తిరుకళ్యాణోత్సవం
తుమకూరు: నగరంలోని శ్రీవైష్ణవ సమాజ్ ఆడిటోరియంలో తుమకూరు జిల్లా శ్రీవైష్ణవ కమ్యూనిటీ అసోసియేషన్, ఆండాళ్ గోష్టి ఆధ్వర్యంలో ఆండాళ్ రంగమన్నార్ తిరుకల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధార్మిక ఆచారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తుమకూరు నగర ఎమ్మెల్యే జి.బి. జ్యోతిగణేష్ మాట్లాడుతూ భక్తి, ధర్మానికి ప్రసిద్ధి చెందిన శ్రీవైష్ణవ సమాజం సంఘటితమై అభివృద్ధి చెందాలన్నారు. మాజీ ఎమ్మెల్యే హెచ్.నింగప్ప పూజలు చేశారు. జిల్లా శ్రీవైష్ణవ సంఘం ధార్మిక సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికై న టి.ఎస్.మోహన్కుమార్, గౌరవాధ్యక్షుడు నందగోపాల్, ఉపాధ్యక్షుడు నవరత్నకుమార్, కార్యదర్శి యోగానంద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్, కోశాధికారి భక్తవత్సల పాల్గొన్నారు. -
లక్కుండి ప్రాశస్త్యం
● లక్కుండి చరిత్రను అవలోకిస్తే ముందుగా ఇక్కడ లక్కుండి గ్రామం లేదు. సప్త గ్రామాల అగ్రహారంగా ఉండేది. సొకమనకట్టి, తంగాబెంచి, జవళబెంచి, నరసీపుర, మోటి బసప్ప, బూదిబసప్ప, లక్కుండి గ్రామాలతో కూడి ఉండేది. ● విజయనగర రాజుల పాలన తరువాత ఏడు గ్రామాల ప్రజలు లక్కుండికి వచ్చి ఉండేవారు. ● రాష్ట్రకూటులు, చాళుక్యులు, హొయసళ రాజులు ఇక్కడి నుంచి పరిపాలించడంతో చారిత్రకంగా గొప్ప స్థానం ఏర్పరచుకుంది. వందలాది శిల్పకళతో కూడిన కట్టడాలు ఇక్కడ కనువిందు చేస్తాయి. ● ఇక్కడ నాణేలను తయారుచేసే టంకశాలలు ఉండేవని చరిత్ర చెబుతోంది. ఇక్కడ విస్తారంగా ఉన్న ప్రాచీన ఆలయాలలో అక్కడక్కడ ఆ ఆధారాలు లభిస్తాయి. ● అంతేకాకుండగా వెండి, బంగారం, ముత్యం, రత్నం తదితర వస్తువులు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ దొరుకుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ● పూర్తిస్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తవ్వకాలు జరిపితే ప్రాచీన నిధి నిక్షేపాలు అనేకం బయటపడతాయనే ప్రచారం సాగుతోంది. శివాజీనగర: గదగ్ జిల్లా లక్కుండి గ్రామంలో వారం కిందట గంగవ్వ అనే మహిళ ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా రాగి కలశంలో సుమారు 460 గ్రాముల బంగారు నిక్షేపం దొరకడంతో అక్కడ పరిస్థితి మారిపోయింది. ఈ చారిత్రక గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పరిశోధనలు ప్రారంభించారు. ప్రాచీన నిధులు ఉంటాయన్న అంచనాతో లక్కుండిలోని కోటి వీరభద్రేశ్వర దేవాలయ ఆవరణలో తవ్వకాలను చేపట్టారు. ఇందులో పురాతన కాలానికి చెందిన ఓ శిలాకృతి బయటపడింది. ఒకటిన్నర అడుగుల పొడవు ఉంది. 10 మీటర్ల పొడవు, అంతే వెడల్పు ప్రాంతంలో తవ్వకాలు సాగుతున్నాయి. తవ్వకాల పని ముగిసేవరకు ఆలయ ఆవరణలోకి ప్రజల ప్రవేశాన్ని నిషేధించినట్లు జిల్లాధికారి సీ.ఎన్.శ్రీధర్ తెలిపారు. అక్కడ ఫొటోలు, వీడియోలు తీయడాన్ని కూడా నిషేధించామన్నారు. పర్యాటకశాఖ, ఆర్కియాలజీ, మ్యూజియంల విభాగం అధికారులు తవ్వకాల్లో పాల్గొంటున్నారు. పలు జేసీబీలు, ఇతర పరికరాలతో పాటు 20 మందికి పైగా కూలీలు పనిచేస్తున్నారు. వీరభద్రేశ్వర ఆలయంలో తవ్వకాలు ప్రదేశం లక్కుండిలోని ప్రాచీన ఆలయాలలో ఒకటి భారీ ఎత్తున తవ్వకాలకు ప్రణాళిక వీరభద్రేశ్వర ఆలయంలో అన్వేషణ గ్రామాన్ని ఖాళీ చేయించే అవకాశం గ్రామస్తుల తరలింపు? మరోవైపు లక్కుండిలో కొన్ని వందల కుటుంబాలు ఉండగా, వారిని పూర్తిగా మరోచోటుకు తరలించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. వీరభద్రేశ్వర ఆలయంలో జరుగుతున్న తవ్వకాలలో ఏవైనా పురాతన నిధులు లభిస్తే.. లక్కుండి కథ మారిపోతుంది. ఇక్కడి నుంచి జనావాసాలను తొలగించి ఖాళీ చేయిస్తాము. ఆపై భారీఎత్తున తవ్వకాలు జరుపుతాము. ప్రజలకు ఇతర గ్రామాల్లో పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ఇక్కడ భూగర్భంలో అపారమైన సంపదలు దాగి ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. -
డ్రగ్స్ను అరికట్టాలి, శాంతిభద్రతలను కాపాడాలి
శివాజీనగర: రాష్ట్రంలో పోలీసులు డ్రగ్స్ మీద కార్యాచరణను తీవ్రతరం చేసి అడ్డుకోవాలి. దళితులు, మహిళలు, పిల్లలపై దాడులను అరికట్టి శాంతిభద్రతలను కాపాడుతూ పోలీస్స్టేషన్లతో ప్రజలకు సత్సంబంధంగా ఉండేటట్లు చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని డీజీపీ ఆఫీసులో ఐపీఎస్లతో సీఎం వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మత ఘర్షణలు, అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరాలను కట్టడి చేయాలి. నేరాలు, దొంగతనం పెరిగాయంటే పోలీసు గస్తీ వ్యవస్థ విఫలమైందని అర్థం. ఇదే పరిస్థితి కొనసాగితే డీసీపీలు, ఎస్పీలను బాధ్యులుగా చేయాల్సి వస్తుంది’ అని సీఎం హెచ్చరించారు. పోలీసులే నేరాలకు పాల్పడితే.. మనది లౌకికవాద దేశం. రాష్ట్రంలో మతఘర్షణలు జరగలేదంటే శాంతిభద్రతలకు బాగున్నాయనేందుకు నిదర్శనమని సీఎం అన్నారు. కర్ణాటకను డ్రగ్స్ విముక్త రాష్ట్రంగా చేయాలి. మూలం నుంచే డ్రగ్స్ మాఫియాను రూపుమాపాలి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో శిక్షలు పడుతున్నది చాలా తక్కువ. ప్రభుత్వం పోలీసులకు నిర్భయంగా పనిచేసే వాతావరణం కల్పించింది. ఇది ప్రజలకు అనుకూలం అయ్యేటట్లు చూసుకోవాలి అని తెలిపారు. కాగా, గత ఏడాది 88 కేసుల్లో పోలీసులే నిందితులు కావడం చాలా సిగ్గుచేటని సీఎం మండిపడ్డారు. పోలీసు సిబ్బంది నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని కోరారు. ఈ సమావేశంలో హోం మంత్రి జీ.పరమేశ్వర్, డీజీపీ ఎంఏ సలీం, సీనియర్ ఐపీఎస్లు పాల్గొన్నారు. ఐపీఎస్ల భేటీలో సీఎం సిద్దు ఆదేశం -
బళ్లారిలో బీజేపీ సమరనాదం
సాక్షి,బళ్లారి: జనవరి 1వ తేదీన బళ్లారి నగరంలో మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి స్వగృహం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు బ్యానర్ కట్టడం, ఈ సందర్భంగా ఘర్షణ జరిగి కాల్పుల్లో రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త మరణం నేపథ్యంలో బీజేపీ ఆందోళనలను ఉధృతం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్రెడ్డిని అరెస్ట్ చేయాలని, కేసు ను సీబీఐకి అప్పగించాలని బీజేపీ నాయకులు శనివారం నగరంలో ఆందోళన చేశారు. ఏపీఎంసీలో సభ జరిపి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్, బీజేపీ పరిశీలకుడు పొంగులేటి సుధాకరరెడ్డి, గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు తదితర నాయకులు పాల్గొన్నారు. ఆందోళనలు తప్పవు నాయకులు ప్రసంగిస్తూ కాల్పుల ఘటనకు కారణమైన ఎమ్మెల్యే భరత్రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. అరెస్ట్ చేసి, సీబీఐకి అప్పగించకపోతే దశలవారీగా పోరాటం చేస్తామన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా బళ్లారి ఘటనపై తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆరోపించారు. కాల్పుల ఘటనలో ఎమ్మెల్యే భరత్రెడ్డిని అరెస్టు చేయాలి కాంగ్రెస్ సర్కారు పాలనలో అధోగతి భగ్గుమన్న కాషాయదళ నేతలు -
సీఎం ఇలాకాలో మహిళా ఉద్యోగినికి దూషణలు
మైసూరు: సీఎం సిద్దరామయ్య సొంత నియోజకవర్గం వరుణలో ఓ కబ్జాదారు మహిళా ఉద్యోగినిని దూషించాడు. గూడేమదనహళ్లిలో గ్రామాధికారిణి భవ్య, గ్రామ సహాయకుడు నవీన్కుమార్... నిమ్హాన్స్ మోడల్ ఆస్పత్రి నిర్మాణానికి స్థలం కోసం సర్కారు భూమిని పరిశీలించడానికి వెళ్లారు. స్థానికుడు జి.ఎం.పుట్టస్వామి సర్కారు భూమిని ఆక్రమించి వక్కతోట సాగిస్తున్నాడు. భవ్య ఆ తోటను పరిశీలిస్తుండగా పుట్టస్వామి, ఆమెను దుర్భాషలాడి చంపేస్తానని బెదిరించాడు. నవీన్కుమార్ దీనిని వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కుని వీడియోలు తీసేశాడు. ఆస్పత్రి కోసం మా భూమిని గుర్తించిన తహశీల్దార్ను తొలగించాలని చిందులు వేశాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు, నిన్ను చంపేస్తాను, ఏమనుకున్నావు అని వీరంగం చేశాడు. అతని ఆగడాలపై భవ్య మైసూరు రూరల్ సౌత్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. స్కూటరిస్టును బలిగొన్న కుక్క దొడ్డబళ్లాపురం: వీధి కుక్క వెంటబడడంతో దాని నుండి తప్పించుకునే ప్రయత్నంలో స్కూటరిస్టు అదుపుతప్పి గోడను ఢీకొనడంతో చనిపోయాడు. ఈ సంఘటన బెళగావి జిల్లా అథణి పట్టణంలోని కుంబార వీధిలో చోటుచేసుకుంది. విశ్వనాథ్ శిరోళ (44) స్కూటర్లో వెళ్తుండగా వీధికుక్క వెంటబడింది. అది కరుస్తుందనే భయంతో వేగంగా వెళ్లసాగాడు. ఈ క్రమంలో అదుపు తప్పి రోడ్డుపక్కన ఒక ఇంటి గోడను ఢీకొనగా తీవ్ర గాయాలై అక్కడే మరణించాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాసయ్యను సీఎం చేసినా సరే: మంత్రి జమీర్ హుబ్లీ: రాష్ట్రంలో ఏ క్రాంతీ లేదు, 2028 వరకు సిద్దరామయ్యే సీఎంగా కొనసాగుతారని రాష్ట్ర మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2028 వరకు సిద్దునే సీఎంగానే ఉంటారు, మా పార్టీ హైకమాండ్ వీధి దాసయ్యను సీఎంగా ప్రకటించినా మేం ఒప్పుకుంటాం. అయితే సిద్దునే సీఎంగా కొనసాగుతారనే విశ్వాసం ఉంది. నవంబర్ క్రాంతి, సంక్రాంతి క్రాంతి అన్నా కూడా ఏ క్రాంతీ జరగలేదు. ఇప్పుడేమో ఉగాది అనవచ్చు. అదీ జరగదు’ అని అన్నారు. డీసీఎం డీకే శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం, పార్టీ పనుల కోసం ఢిల్లీకి వెళ్లి ఉంటారన్నారు. ఈ నెల 24న హుబ్లీ స్లం బోర్డు ఆధ్వర్యంలో 42,345 ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తామన్నారు. టెన్త్ పేపర్ రూ.30 మాత్రమే ● లీకేజీ విచారణలో వెల్లడి యశవంతపుర: పదో తరగతి సన్నాహక పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీలో కొత్త సంగతుల బయటపడ్డాయి. పేపర్లను పొందిన విద్యార్థులను బెంగళూరు సీసీబీ పోలీసులు విచారించగా రూ.30 లకు కొనుగోలు చేశామని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. మరికొందరు విద్యార్థులు రూ.50, రూ.100కు కొన్నారు. పేపర్లు అమ్మిన ఉపాధ్యాయుల బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నారు. తమ ఐడీల ద్వారా ప్రశ్నపత్రాలను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అమ్ముకున్నట్లు నిందిత ఉపాధ్యాయులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. పలువురు ఉపాధ్యాయులను అరెస్టు చేయడం తెలిసిందే. మరో పక్క ఉపాధ్యాయుల కుటుంబసభ్యుల అకౌంట్లను కూడా పరిశీలించాలని నిర్ణయించారు. లీకేజీ దందా తరువాత అనేక మంది విద్యార్థులు సోషల్ మీడియా ఖాతాలను తొలగించుకున్నారు. -
నేత్రపర్వం.. శివయోగి బ్రహ్మ రథోత్సవం
● నంజనగూడు సుత్తూరు మఠంలో జనసంద్రంమైసూరు: మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని సుత్తూరు మఠంలో జాతర ఉత్సవాల సందర్భంగా శనివారం ముఖ్య ఘట్టమైన శివరాత్రి శివయోగి రథోత్సవం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారి సింహాసనాన్ని అలంకరించి పూజలు చేశారు. 6 గంటలకు మఠం రుద్రాభిషేకం జరిగింది. 10.30 గంటలకు విశేష పూజల మధ్య శివయోగి ఉత్సవమూర్తిని తేరులో ప్రతిష్టించారు. ఉదయం 11 గంటలకు, సిద్ధగంగ మఠం శివ సిద్ధేశ్వర స్వామి, సుత్తూరు శివరాత్రి దేశికేంద్ర స్వామి తదితరులు డోలు వాయించి, నంది జెండాకు ప్రార్థనలు చేసి తేరును లాగారు. రోబో ఏనుగు, ఆదిజగద్గురు శివరాత్రేశ్వరుడు, శివయోగి చిత్రపటంతో ముందుకు కదులుతుండగా 21 ఫిరంగులు పేల్చబడ్డాయి. వేలాది మంది భక్తులు తేరును లాగారు. కళా బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తేరు ఉత్సవంలో 40 కళా బృందాలు వైవిధ్య ప్రదర్శనలతో రక్తి కట్టించాయి. వీరభద్ర నృత్యం, వాయిద్యాల ఘోష వేడుకకు వన్నె తెచ్చాయి. -
వేణుగోపాల రథోత్సవం
మైసూరు: జిల్లాలోని సరగూరు సమీపంలోని హులికుర గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి జాతర, రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయాన్ని సుందరంగా అలంకరించి జాతర నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పుష్పమాలలతో తీర్చిదిద్ది మంగళ వాయిద్యాలతో తేరులో ప్రతిష్టించారు. స్వామి నామాన్ని జపిస్తూ వేలాదిమంది భక్తులు తేరును లాగారు. అరటిపండ్లు, దవనాన్ని తేరుపైకి విసిరారు. జానపద కళాకారుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. టిప్పర్ను బైక్ ఢీ.. ముగ్గురు యువకుల మృతి దొడ్డబళ్లాపురం: త్రిబుల్ రైడింగ్, అతి వేగం ముగ్గురు యువకుల ప్రాణం తీసింది. బెంగళూరు రూరల్లోని దేవనహళ్లి తాలూకా బూదిగెరె రోడ్డులో అదుపుతప్పిన బైక్ డివైడర్ను ఢీకొని అదే వేగంతో ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు క్షణాల్లో మరణించారు. మృతులు హుణసమారనహళ్లిలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీ విద్యార్థులని తెలిసింది. శనివారం ఉదయం ఒకే బైక్పై ముగ్గురూ బయల్దేరారు. అతి వేగం కారణంగా అదుపుతప్పింది. ప్రమాదంలో మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఒక యువకుని పేరు తౌసిఫ్ గా తెలిసింది. దేవనహళ్లి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాద దృశ్యం స్థానిక ఇళ్ల సీసీ కెమెరాలలో రికార్డయింది. జూలో పులి కన్నుమూతమైసూరు: మైసూరు నగరంలోని ప్రసిద్ధ చామరాజేంద్ర మృగాలయంలో పులి మరణించింది. తార– రాకీ అనే పులుల జంటకు 2022లో జన్మించిన ప్రీతి అనే 3 సంవత్సరాల 9 నెలల వయసున్న ఆడ పులి చనిపోయింది. గత 5 రోజులుగా ఆహారం తీసుకోవడం లేదు. పులి శరీరంలోని రక్తం కలుషితం కావడంతో వెటర్నరీ వైద్యులు చికిత్స అందించారు, కానీ చికిత్స ఫలించక శుక్రవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూసింది. మెట్రో చార్జీలను పెంచితే ధర్నా చేస్తా: ఎంపీ తేజస్వి శివాజీనగర: బెంగళూరు మెట్రో రైలులో టికెట్ ధరలు దేశంలో ఏ మెట్రోలో లేనంత ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు మండిపడుతున్నారు. కానీ మరోసారి ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ, చైన్నె, కొచ్చి మెట్రోల్లో 10 కిలోమీటర్ల ప్రయాణానికి ఉన్న చార్జీ కంటే బెంగళూరు మెట్రోలో రెట్టింపు రేటు ఉందని బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య మండిపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలో మళ్లీ బీఎంఆర్సీఎల్ 5 శాతం చార్జీలను పెంచడానికి సిద్ధమైంది, ఇదే జరిగితే మెట్రో స్టేషన్ ముందు ధర్నా చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, బీఎంఆర్సీఎల్ ప్రజలను మోసగిస్తున్నాయని ఆరోపించారు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు ధరల పెంపును అడ్డుకోవాలన్నారు. అబ్కారీ డీసీ.. రూ.25 లక్షల లంచం బనశంకరి: బెంగళూరులో భారీ మొత్తంలో లంచం తీసుకుంటున్న ఎకై ్సజ్శాఖ డిప్యూటీ కమిషనర్ జగదీశ్ నాయక్ను లోకాయుక్త పోలీసులు అరెస్ట్ చేశారు. మైక్రో బ్రూవరీ లైసెన్సుల కోసం రూ.75 లక్షల లంచం కావాలని డిమాండ్ పెట్టి, మొదటి కంతుగా రూ.25 లక్షలు స్వీకరిస్తుండగా బ్యాటరాయనపుర ఎకై ్సజ్ కార్యాలయంలో లోకాయుక్త పోలీసులు శనివారం దాడిచేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయనకు సహకరించిన అబ్కారీ కానిస్టేబుల్ లక్కప్పను నిర్బంధించారు. వివరాల ప్రకారం మైక్రో బ్రూవరి, సీఎల్ 7 లైసెన్సుల కోసం వ్యాపారి లక్ష్మినారాయణ దరఖాస్తు చేశారు. మంజూరు చేయాలంటే రూ.80 లక్షల ముడుపులు ఇవ్వాలని జగదీశ్నాయక్ డిమాండ్ చేశారు. మళ్లీ ఆ మొత్తాన్ని రూ.2.25 కోట్లకు పెంచారు. చివరికి రూ.75 లక్షలకు ఒప్పుకున్నారు. మొదట రూ.25 లక్షలను తీసుకోగా లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు. అప్పు చేసి ఈ డబ్బులు తెచ్చానని బాధితుడు తెలిపారు. ఎకై ్సజ్శాఖలో లంచం ఇవ్వకపోతే ఏ పనీ జరగదని వాపోయాడు. -
నేత్రపర్వం చూణోత్సవం
యశవంతపుర: ఉడుపి శ్రీకృష్ణ మఠంలో చూణోత్సవం(పగటి జాతర) వైభవంగా జరిగింది. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తిని బంగారు పల్లకీలో తెచ్చి రథంలో కొలువు దీర్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. మహామంగళారతి సమర్పించిన తరువాత బ్రహ్మ రథోత్సవాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య రథంముందుకు సాగింది. పర్యాయ పుత్తిగె మఠాధిపతి సుగుణేంద్రతీర్థస్వామి, చిన్నస్వామి యతి సుత్రీంద్ర తీర్థస్వామిలు భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అదమూరు మఠం విశ్వప్రియ తీర్థ శ్రీపాద, పేజావర మఠం విశ్వప్రసన్నతీర్థస్వామి పాల్గొన్నారు. అత్యాచార నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్ష హుబ్లీ: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి బెళగావి అదనపు జిల్లా సెషన్స్ ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1.18 లక్షలు జరిమానా విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. బెళగావి జిల్లాలోని హుక్కేరి తాలూకా బెళవి గ్రామ నివాసి ప్రవీణ్(23) అనే యువకుడు 2021 జూలై 21న సాయంత్రం వేళ సదరు బాలికను హుక్కేరి బస్టాండుకు రావాలని సూచించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ధార్వాడ మీదుగా బెంగళూరుకు వెళ్లారు. అక్కడికి తీసుకెళ్లాక ఇక్కడే పెళ్లి చేసుకుందామని నమ్మబలికి ఒత్తిడి చేసి ఆమైపె లైంగిక దాడికి పాల్పడినట్లు హుక్కేరి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దాఖలాధికారి ఎల్ఎల్ పట్టెనవర్ దర్యాప్తు ప్రారంభించారు. ఎంఎం తహసీల్దార్ తదుపరి దర్యాప్తు చేపట్టి బెళగావి పోక్సో కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి సీఎం పుష్పలత 11 మంది సాక్షుల విచారణతో పాటు 48 దాఖలాల ఆధారంగా నిందితునిపై నేరారోపణలు రుజువు కావడంతో పైవిధంగా తీర్పును ఇచ్చారు. పైగా బాధితురాలికి జిల్లా న్యాయసేవా ప్రాధికార ద్వారా రూ.4 లక్షల పరిహారధనం అందించాలని సూచించారు. ఆ సొమ్మును ఐదేళ్ల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కోర్టు న్యాయాధికారికి సూచించింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది ఎల్వీ.పాటిల్ వాదించారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల వెనుక దురుద్దేశాలు● బీ.వై.విజయేంద్ర ఆరోపణ శివాజీనగర: వీబీ జీ రామ్జీ పథకం గురించి చర్చ పేరుతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ఏర్పాటు ద్వారా ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వపు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ పవిత్రతను భగ్నం చేసేందుకు సిద్ధమైందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ధ్వజమెత్తారు. శుక్రవారం బెళగావిలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి అసెంబ్లీని దుర్వినియోగ పరచటం ఖండనీయమన్నారు. ప్రధాని మోదీ మార్పు చేసి మనరేగ పథకాన్ని వీబీ జీ రామ్జీ పథకంగా చేశారు. దేశంలో పేదలు, కార్మికులకు అనుకూలం చేయాలని ఈ చట్టాన్ని తెచ్చారు. దీని గురించి చర్చించాలనే నెపంతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి బీజేపీ నేతృత్వపు ఎన్డీఏ ప్రభుత్వంపై ద్వేష సాధనకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ గురించి తరచు మాట్లాడే సీఎం సమాఖ్య వ్యవస్థను భంగపరిచే కుట్ర చేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. లక్కుండిలో నిధి తవ్వకాలు షురూశివాజీనగర: గదగ్ జిల్లా వాస్తుశిల్ప పరంపర కేంద్రం, చారిత్రక లక్కుండి గ్రామంలో ఇంటి నిర్మాణ సమయంలో బంగారు ఆభరణాలు బయటపడిన తరువాత కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం నుంచి నిఽధి తవ్వకాలకు సిద్ధమైంది. లక్కుండిలోని కోటె వీరభద్రేశ్వర ఆలయ ఆవరణలో పూర్తి స్థాయిలో తవ్వకాలు ప్రారంభించారు. పర్యాటక, పురాతత్వ, వస్తు సేకరణ కేంద్రాలు, లక్కుండి పరంపర అభివృద్ధి ప్రాధికార, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఈ కార్యాచరణను చేపట్టాయి. ఆలయ ఆవరణలో తవ్వకాలు చేపట్టేందుకు జేసీబీలు, ట్రక్లు, ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే తవ్వకాల కోసం 10 మీటర్ల ప్రదేశాన్ని గుర్తించి సిబ్బందిని నియమించినట్లు అధికారి తెలిపారు. -
కన్నడ భాషను ప్రోత్సహిద్దాం
బొమ్మనహళ్లి : కన్నడ మన భాష, మన రాష్ట్ర భాష. ఇక్కడికి ఎవరు వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఇక్కడ నివసించేవారు కన్నడ నేర్చుకోవాలి. కన్నడను వ్యాపార భాషగా ఉపయోగించాలి. కన్నడకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం అవసరం, అనివార్యమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. శుక్రవారం విధానసౌధ ముందు భాగంలో ఉన్న మహా మెట్లపై కన్నడ సంస్కృతి శాఖ, వివిధ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించిన ’బెంగళూరు హబ్బ–2026’ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వచ్చి నివసించడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ కన్నడిగులుగా జీవించి కన్నడ నేర్చుకోండి. కన్నడిగులుగా బెంగళూరులో కన్నడత్వాన్ని పెంపొందించడానికి కృషి చేద్దాం. దీని కోసం మనమందరం చేతులు కలుపుదాం అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. బెంగళూరు ఉత్సవంలో భాగంగా శుక్రవారం నుంచి 10 రోజుల పాటు 30కి పైగా ప్రాంతాల్లో 350కి పైగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. బెంగళూరు పౌరులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని వాటిని ఆస్వాదించండి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసించే వారికి మన సాహిత్యం, కళలు, సంస్కృతిని పరిచయం చేయడంలో ఈ ఉత్సవం సహాయకరంగా ఉంటుందని ఆయన అన్నారు. శాసనమండలి స్పీకర్ బసవరాజ్ హొరట్టి, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి నసీర్ అహ్మద్, శాసనసభ చీఫ్ విప్ అశోక్ పట్టాన్, నటుడు డాక్టర్ శివరాజ్ కుమార్, నటి డాక్టర్ జయమాల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శాలినీ రజనీష్, కన్నడ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్షుడు డాక్టర్ పురుషోత్తం బిళిమలె, కర్ణాటక ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు కె.గోవిన్, పలువురు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య -
ప్రాణాలు తీసిన ఈత సరదా
దొడ్డబళ్లాపురం: సంక్రాంతి పండుగ సెలవులు ఎనిమిది కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. సెలవుల్లో సరదాగా ఈతకు వెళ్లి బాలలు మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఎనిమిది మంది జల సమాధి అయ్యారు. బాగలకోటె జిల్లా ముధోళ తాలూకా జాలికట్టికి చెందిన అన్నదమ్ములు మనోజ్(17)ప్రమోద్(17)లు గ్రామ శివారులోని క్వారీలోకి దిగారు. ఈత కొడుతూ నీట మునిగి మృతి చెందారు. స్నానం చేయడానికి క్వారీ గుంతలో దిగి ఈత కొడుతూ మృతి చెందారు. పోలీసులు వచ్చి మృతదేహాలను వెలికి తీశారు. కేసు దర్యాప్తులో ఉంది. అదేవిధంగా మాన్వి తాలూకా చిక్కపలర్విలోని తుంగభద్ర నదిలో పుణ్యస్నానం చేయడానికి వెళ్లిన రాజలదిన్ని గ్నామ నివాసి సురేంద్రగౌడ(17)నీటిలో మునిగి మృతిచెందాడు. హావేరి తాలూకా మణ్ణూరు గ్రామంలో వరదా నదిలో సంక్రాంతి సందర్భంగా ఎద్దుకు స్నానం చేయించడానికి నీటిలో దిగిన బసవరాజు(22)అనే యువకుడు నీటమునిగి మృతిచెందాడు. కనకపుర తాలూకాలో.. పండుగ పూట రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు జల సమాధి అయిన ఘటన కనకపుర తాలూకాలోని కబ్బాళులో జరిగింది. బెంగళూరు ఉత్తరహళ్లి నివాసులైన ధనుష్(18)సంతోష్(18)లు బనశంకరిలోని ప్రైవేటు కాలేజీలో పీయూసీ చదువుతున్నారు. ఇదే కాలేజీకి చెందిన తొమ్మిది మందితో కలిసి శుక్రవారం కబ్బాళు దేవాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా సరదాగా కబ్బాళు చెరువులో దిగారు. వీరిలో ఎవరికీ ఈత రాదు. ఈక్రమంలో ధనుష్, సంతోష్లు చెరువు మధ్యలోకి వెళ్లి మునిగిపోయారు. అగ్నిమాపకదళ సిబ్బంది పోలీసులు వచ్చి మృతదేహాలను వెలికి తీశారు. కేసు దర్యాప్తులో ఉంది. యశవంతపుర: ఉత్తరకన్నడ జిల్లాలో నీట మునిగి ఇద్దరు బాలలు మృతి చెందారు. కార్వార తాలూకా ముదగా నౌకదళం నిరాశ్రితర కాలనీలో నివాసం ఉంటున్న 8వ తరగతి విద్యార్థి సోనాల అరగేకర(12) గురువారం సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలకు సెలవు కావటంతో స్నేహితులతో కలిసి సముద్ర తీరం వద్దకు వెళ్లాడు. ఈతకొడుతూ అలల మధ్య చిక్కుకొని మృతి చెందాడు. అదేవిధంగా దాండేలి మౌళంగి సమీపంలో కాళీనది సంగమ ప్రాంతంలో దాండేలి గాంధీనగరకు చెందిన నవాజ్ నాయక్(18) అనే బాలుడు మృతి చెందాడు. పోలీసులు, అటవీశాఖ సిబ్బంది వెతికి మృతదేహంను బయటకు తీశారు. దాండేలి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వేర్వేరు ఘటనల్లో ఎనిమిది మంది మృతి -
క్రీడాభివృద్ధికి రూ.6 కోట్ల గ్రాంట్
తుమకూరు: అంతర్జాతీయ స్థాయి హాకీ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణంతో సహా జిల్లాలో క్రీడాభివృద్ధికి రూ.6 కోట్ల గ్రాంట్ అందిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. శుక్రవారం నగరంలోని మహాత్మా గాంధీ స్టేడియంలో యువజన సాధికారత, క్రీడా శాఖ, కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా యంత్రాంగం సహకారంతో జరిగిన కర్ణాటక స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. తుమకూరులో వివిధ స్టేడియంలు ఉన్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయి స్విమ్మింగ్ పూల్స్, హాకీ స్టేడియంలు అవసరమని ముఖ్యమంత్రిని రూ.25 కోట్ల గ్రాంట్ ఇవ్వాలని కోరగా ముఖ్యమంత్రి ఆ గ్రాంట్ ప్రకటించారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర అన్నారు. విద్యార్థి జీవితంలో చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కే.గోవిందరాజు, న్యూఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, శిరా ఎమ్మెల్యే టి.బి.జయచంద్ర, డీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె.ఎన్.రాజన్న, కెఎస్ఆర్టీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.ఆర్.శ్రీనివాస్, ఎమ్మెల్యే జి.బి. జ్యోతి గణేష్, బి.సురేష్ గౌడ, కలెక్టర్ శుభ కళ్యాణ్, ఎస్పీ కె.వి.అశోక్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య -
మరో ఇద్దరు ప్రైవేట్ గన్మెన్ల అరెస్ట్
సాక్షి,బళ్లారి: నగరంలో ఈనెల 1వ తేదీన మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి ఇంటి వద్ద చోటు చేసుకున్న రగడ, కాల్పుల్లో ఒక యువకుడు మృతి చెందిన కేసులో మరో ఇద్దరు ప్రైవేటు గన్మెన్లను అరెస్ట్ చేశారు. కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందడంతో పాటు గాలి జనార్ధనరెడ్డి, శ్రీరాములులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపిస్తూ వీడియోలను విడుదల చేస్తుండగా, ఇప్పటికే ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఆప్తుడు సతీష్రెడ్డి గన్మెన్లు ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. వీరిలో పలువురు బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించడంతో సీఐడీ అధికారుల బృందం నాలుగు రోజుల పాటు నగరంలో తిష్ట వేసి విచారణ చేస్తున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు ప్రైవేటు గన్మెన్లను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నేడు బీజేపీ భారీ ఆందోళన కాగా కాల్పులకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి, చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ ఈనెల 17న నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనుంది. నగరంలోని ఏపీఎంసీలో జరిగే సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర, ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్, కేంద్ర మంత్రి కుమారస్వామి తదితరులతో పాటు పలువురు బీజేపీ ప్రముఖులు విచ్చేస్తుండటంతో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సమావేశ వేదిక వద్ద ఏఎస్పీ రవికుమార్ నేతృత్వంలో బందోబస్తును తనిఖీ చేశారు. వేదిక స్థలానికి చేరుకున్న గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డితో కూడా ఏఎస్పీ కొంతసేపు మాట్లాడారు. ఏపీఎంసీతో పాటు ఇతర ప్రముఖ రహదారుల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేటి బీజేపీ సమావేశానికి గట్టి బందోబస్తు బహిరంగసభకు హాజరుకానున్న పార్టీ అగ్రనేతలు -
గనినాడులో మళ్లీ రాజకీయ వేడి
సాక్షి బెంగళూరు: గనినాడుగా పేరొందిన బళ్లారిలో జరిగిన అల్లర్లు, ఫైరింగ్ ఘటన సరికొత్త రాజకీయాలకు నాందిగా మారింది. వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణకు సంబంధించిన బ్యానర్ ఏర్పాటు విషయంలో జరిగిన గొడవ కాస్తా అనేక మలుపులు తిరుగుతోంది. బళ్లారి అల్లర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఈ అల్లర్లకు పూర్తి కారణం బీజేపీనే అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రత్యారోపణలు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం బీజేపీ భారీ ఆందోళన సమావేశం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం బళ్లారిలో జరిగిన అల్లర్లు, జరుగుతున్న ఆందోళనలు, పోరాటాలు, పాదయాత్రలు జిల్లా రాజకీయాన్ని వాడివేడిగా మార్చాయి. బళ్లారి ఒకప్పుడు మైనింగ్ వ్యాపారం చేసుకునే వారితో సందడిగా ఉండేది. గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీరాములు, రెడ్డి సోదరులు మైనింగ్ ద్వారా వెలుగులోకి వచ్చారు. ఇదే సందర్భంలో రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో చక్రం తిప్పారు. నాడు జోడెద్దుల్లా ఎన్నికల ప్రచారం 1999 లోక్సభ ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ బళ్లారిలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీరాములు సుష్మా స్వరాజ్ తరపున ఎన్నికల ప్రచారంలో జోడెద్దుల్లా వ్యవహరించారు. ఆ తర్వాత జిల్లాలో బీజేపీ ఒక వెలుగు వెలిగింది. అనంతరం జరిగిన ఆపరేషన్ కమలలో కూడా రెడ్డి సోదరుల పాత్ర ఎంతో కీలకంగా మారింది. అయితే మైనింగ్ కుంభకోణం కేసులో గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు కావడం, జైలుకెళ్లడం జిల్లా రాజకీయాలను మార్చివేసింది. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సిద్ధరామయ్య బళ్లారిలో పాదయాత్ర చేపట్టారు. అసెంబ్లీలో జరిగిన వాడివేడి చర్చలో భాగంగా రెడ్డి సోదరుల సవాల్ను స్వీకరించి సిద్ధరామయ్య బళ్లారికి పాదయాత్ర చేపట్టారు. అప్పట్లో అది రాజకీయంగా సంచలంగా మారింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావడానికి ఈ పాదయాత్ర ముఖ్య పాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బళ్లారి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకుంది. జనార్ధన్రెడ్డి అరెస్టుతో బీజేపీ పతనం 2011లో గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు తర్వాత జిల్లాలో బీజేపీ తీవ్రంగా వెనుకబడి పోయింది. ఇటీవలే గాలి జనార్ధన్ రెడ్డి మళ్లీ బీజేపీలో యాక్టివ్గా మారడంతో జిల్లా రాజకీయాలకు పూర్వ వైభవం వచ్చింది. తాజాగా బళ్లారిలో ఫైరింగ్ ఘటన అనంతరం బీజేపీ మరింత క్రియాశీలకంగా మారింది. ఈ ఫైరింగ్ ఘటనపై పోరాటం చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. నేడు బళ్లారి భారీ ఆందోళన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆందోళన అనంతరం పాదయాత్ర చేపట్టాలని జిల్లా బీజేపీ నిర్ణయించింది. బళ్లారిలో బీజేపీ ఆందోళన, పాదయాత్ర ద్వారా రాజకీయంగా ఎలాంటి లబ్ధి చేకూరుతుందనే ఆసక్తి ప్రస్తుతం అన్ని వైపులా కనిపిస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత తన స్నేహితుడు మాజీ మంత్రి శ్రీరాములుతో సత్సంబంధాలు దాదాపుగా దెబ్బతిన్నాయి. అయితే ఇటీవలే తిరిగి బీజేపీ గూటికి గాలి జనార్ధన్ రెడ్డి చేరడంతో మళ్లీ వీరి మధ్య పాత స్నేహం చిగురించింది. ఆ స్నేహం నేపథ్యంలో బళ్లారిలో బీజేపీకి పూర్వ వైభవం వస్తుందని ప్రతిపక్ష పార్టీ ఆశగా ఉంది. మరోవైపు బళ్లారిలో ఫైరింగ్ ఘటన కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే హోం మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్ మాత్రం సీబీఐ విచారణ అవసరం లేదని, స్థానిక పోలీసుల ద్వారా న్యాయం లభిస్తుందని తోసిపుచ్చారు. నేడు బళ్లారిలో బీజేపీ భారీ సమావేశం గాలి జనార్ధన్రెడ్డి, శ్రీరాములు ఐకమత్యంతో రాజకీయాలు యాక్టివ్ -
లాల్ బాగ్లో ఆకట్టుకున్న ప్రదర్శన
బొమ్మనహళ్లి: నందికొండలో యోగనందీశ్వరాలయ ప్రధాన అర్చకుడు టీ.ఎన్.నాగరాజు తమ కొండల్లో లభించిన ఎండిన చెట్టు వేర్ల నుంచి అనేక కళాఖండాలను తయారు చేశారు. వివిధ రకాల కళాఖండాలను బెంగళూరులోని లాల్బాగ్లో నిర్వహిస్తున్న ఫ్లవర్ షోలో ప్రదర్శిస్తున్నారు. సుమారు 500 కళాఖండాలు ఇక్కడి లాల్బాగ్కు వచ్చిన పర్యాటకులను ఆకటుకుంటున్నాయి. కళాఖండాలతో పాటు ఆయన సేకరించిన వివిధ దేశాలకు నాణేలు, నోట్లను ప్రదర్శనలో ఉంచారు. ఈ నెల 26 వరకు జరుగనున్న ఈ ప్రదర్శనలో ఇప్పటికే వీక్షకుల నుంచి విశేష స్పందన వస్తున్నట్లు నాగరాజు తెలిపారు. సుమారు 2 వేల నాణేలను ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. వీటిలో 110 సంవత్సరాల పాత నాణేలు, నోట్లు, బంగారు, వెండి, ఇత్తడి, రాగి నాణేలు, చోళులు, జార్జ్ ఎడ్వర్డ్, ఈస్ట్ ఇండియా కంపెనీ, విక్టోరియా మహారాణి, రష్యా దేశ నాణేలు సైతం ఉన్నాయి. చెట్ల వేర్లతో తయారైన కళాఖండాలు, ప్రాచీన నాణేలు, కరెన్సీ నోట్లు -
ముగ్గురు చైన్ స్నాచర్ల అరెస్టు
దొడ్డబళ్లాపురం: రామనగర గ్రామీణ పోలీసులు ముగ్గురు చైన్ స్నాచర్లను అరెస్టు చేశారు. మండ్య జిల్లా మళవళ్లి తాలూకా లింగాపట్టణ గ్రామ నివాసి దర్శన్(21),హలగూరు గ్రామ నివాసి మనోజ్(24),చెన్నపట్టణ తాలూకా కెంచయ్యనదొడ్డి గ్రామానికి చెందిన రాజు(26)ను అరెస్ట్ చేసి రూ.7.11లక్షల విలువైన 53.300 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రామనగర తాలూకా కూనముద్దనహళ్లి గ్రామంలో 2025 సెప్టెంబర్ 25న జయమ్మ అనే మహిళ మెడలోంచి నిందితులు బంగారు చైన్ లాక్కుని పరారయ్యారు. వీరు ఇంకా అనేక చైన్స్నాచింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్నారని విచారణలో తేలింది. -
యువకుల వేషాల్లో వచ్చి చోరీలు
యశవంతపుర: ఇద్దరు యువతులు యువకుల వేషాలు వేసి చోరీలకు పాల్పడుతుండగా బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సంపిగేహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలోని ట్యానరి రోడ్డుకు చెందిన శాలు, నీలు అనే యువతులు ఫ్యాంట్, షర్ట్, టోపిని ధరించి పగటి పూట బైకుల్లో తిరుగుతారు. తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రిళ్లు చోరీల పాల్పడేవారు. ఈ నెల 13న సంపిగేహళ్లికి చెందిన సంగమేశ్ ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. సీసీ కేమరాలను పరిశీలించగా ఇద్దరు యువకులు నడిచి వెళ్లతున్న దృశ్యాలను గుర్తించారు. అదుపులోకి తీసుకోని విచారించగా యువతులుగా బయట పడింది. బోటింగ్ చేస్తూ మహిళ మృతి దొడ్డబళ్లాపురం: ప్రసిద్ధ పర్యాటక స్థలం గోకర్ణకు వచ్చిన మహిళ బోటింగ్ చేస్తూ మృతిచెందింది. బెంగళూరుకు చెందిన నాగరతినమ్(58) తన కుటుంబ సభ్యులతో కలిసి గోకర్ణకు వచ్చింది. ప్యారడైజ్ బీచ్లో కుటుంబ సభ్యులతో కలిసి బోటింగ్ వెళ్లింది. బోట్ సముద్రంలో వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ మార్గం మధ్యలోనే మృతిచెందింది. గుండెపోటు వల్ల మృతిచెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.గోకర్ణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సైలెన్సర్లో మార్పు.. రూ.లక్ష జరిమానా యశవంతపుర: శబ్దం ఎక్కువగా వచ్చేలా కారు సైలెన్సర్లో మార్పులు చేసిన వ్యక్తికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు రూ.1.11 లక్షల జరిమానా విధించారు. బెంగళూరు హెణ్ణూరుకు చెందిన వ్యక్తికి చెందిన కారు పెద్ద శబ్దంతో వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకొని పరిశీలించగా సైలెన్సర్లో మార్పు చేసినట్లు గుర్తించి రూ.1.11 లక్షలు జరిమానా విధించి వాహనాన్ని సీజ్ చేశారు. కారుపై గతంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉండటంతో వాటికి జరిమానా విధించారు. -
అక్రమ వలసదారుల షెడ్లో పేలిన సిలిండర్
బొమ్మనహళ్లి : బెంగళూరు శివార్లలోని బేగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలెనహళ్లిలో బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు నివసిస్తున్న షెడ్లలో సిలిండర్ పేలుడు సంభవించింది. గృహోపకరణాలు, దుస్తులు కాలిపోయాయి. ఐదు ఎకరాల్లో బంగ్లాదేశ్ వలసదారులు షెడ్లు వేసుకొని నివసిస్తున్నారు. ప్లాస్టిక్ తదితర వాటిని సేకరించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇటీవల కొంతమంది అక్రమ వలసదారులను అక్కడినుంచి ఖాళీ చేయించారు. అయినా మళ్లీ వచ్చి షెడ్లలో ఉంటన్నారు. ఈక్రమంలో శుక్రవారం వేకువజామున 3గంటల సమయంలో ఒక షెడ్లోని సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. నిద్రలో ఉన్న అక్రమ వలసదారులు మేల్కొని షెడ్లనుంచి బయటకు వచ్చి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. జయనగర్, హులిమావు, ఎలక్ట్రానిక్ సిటీ మరియు అంజనపుర నుండి అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక చర్యలో పాల్గొని మంటలు అదుపు చేశారు. జయనగర్, హులిమావు, ఎలక్ట్రానిక్ సిటీ, అంజనపుర నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. అప్పటికే షెడ్లలోని వస్తు సామగ్రి, టీవీలు ఫ్రిజ్లు, ఇతర సామగ్రి కాలి బూడిందైనట్లు జిల్లా అగ్నిమాపక అధికారి మంజునాథ్ తెలిపారు. -
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో టోకరా
మైసూరు : వర్క్ ఫ్రం హోం ఉద్యోగంలో చేరిన ఒక మహిళ ఓ నకిలీ కంపెనీని నమ్మి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి రూ.9.7 లక్షలు కోల్పోయిన ఘటన మైసూరులో జరిగింది. మైసూరులోని రాజేంద్రనగర్లో నివసిస్తున్న బాధిత మహిళ సోషల్ మీడియాలో కనిపించిన ఒక ప్రకటనను గమనించింది. తర్వాత ఆమె ఇంటి నుంచే పని చేయడం ప్రారంభించి డబ్బు సంపాదించడానికి ఉద్యోగంలో చేరింది. మొదట ఆమెకు కంపెనీ నుంచి స్వల్ప జీతం వచ్చింది. తర్వాత అక్కడ కేటుగాళ్ల మాటలు నమ్మి, మరింత డబ్బు కోసం స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టింది. ఆ క్రమంలో ఆమె ఆ ఖాతాలో రూ.9.7 లక్షలు జమ చేసి మోసపోయింది. ఈ ఘటనపై మైసూరు సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాజలక్ష్మి దేవికి విశేష పూజలు గౌరిబిదనూరు: తాలూకాలోని చిక్కకురుగోడు సమీపంలో కొలువైన రాజలక్ష్మి దేవి అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు నరేంద్ర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు, అలంకరణలు, పూజలు నిర్వహించి మహామంగళహారతి ఇచ్చారు. అనంతరం గోపూజ చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్నదానం జరిగింది. చెక్ బౌన్స్ కేసులో నిందితునికి రూ.2.60 లక్షల జరిమానామైసూరు : చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి హుణసూరు జేఎంఎఫ్సీ సివిల్ కోర్టు రూ.2.60 లక్షల జరిమానా విధించింది. డబ్బు చెల్లించకపోతే 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. హుణసూరు నగరంలోని కల్కుణికె బరంగె నివాసి కె.కృష్ణ అనే ఫిర్యాదుదారుడు హెచ్.డీ.కోటె తాలూకాలోని వడ్డరగుడి నివాసి అశ్వత్కు రుణం రూపంలో ఇచ్చిన డబ్బుకు సెక్యూరిటీగా చెక్కు అందుకున్నాడు. సకాలంలో రుణం చెల్లించనందుకు చెక్కు బౌన్స్ అయినందున అతను సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశాడు. విచారణ చేసిన సీనియర్ సివిల్ జడ్జి భాగ్యమ్మ రుణగ్రహీత, నిందితుడు అశ్వత్కు రూ.2.60 లక్షల జరిమానా విధిస్తూ, నిర్ణీత గడువులోగా ఆ మొత్తం ఫిర్యాదుదారునికి చెల్లించకపోతే 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారుడు కే.కృష్ణ తరపున న్యాయవాది ఎం.ఆర్. హరీష్ ఈ కేసును వాదించారు. ఆస్తి వివాదంతో ఒకరి హత్యమండ్య: ఆస్తి వివాదంతో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. ఈఘటన తాలూకాలోని మాయప్పనహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన యోగేష్ (35), అతని అన్నయ్య లింగరాజు మధ్య కొంత కాలంగా ఆస్తి వివాదం నడుస్తోంది. శుక్రవారం మరోమారు గొడవ జరిగింది. ఓ దశలో యోగేష్పై అన్నయ్య, అతని కుమారులు భరత్, దర్శన్లు మారణాయుధాలతో దాడి చేసి నరికారు. కెరగోడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా హతుడు యోగేష్కు వివాహం నిశ్చయమైంది. వచ్చే బుధవారం వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే హత్యకు గురయ్యాడు. నేత్రపర్వం.. లక్ష దీపోత్సవంమండ్య : మండ్య జిల్లా శ్రీరంగ పట్టణంలోని వెలిసిన చారిత్రక శ్రీ రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో 36వ సంవత్సర లక్ష దీపోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఆలయం ముందు నుంచి గండ భేరుండ సర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపులా వెదురు స్తంభాలపై వెలిగించిన దీపాలు దేదీప్యమానంగా వెలిగాయి. కమిటీ సభ్యులు వేద బ్రహ్మ డాక్టర్ భానుప్రకాష్, లక్ష్మి నేతత్వంలో ఆలయం ముందు హోమ హవనాన్ని నిర్వహించి పూజలు చేసిన తర్వాత దీపాలను వెలిగించారు. మకర సంక్రాంతి సందర్భంగా ప్రధాన పూజారి విజయసారథి నేతత్వంలో శ్రీ రంగనాథ స్వామిని వెన్నతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించి నైవేద్యాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు క్యూలైన్లలో నిల్చొని ఆలయం వద్ద ఏర్పాటు చేసిన స్వర్గ ద్వారం గుండా నడిచి స్వామివారిని దర్శించుకున్నారు. -
పంకజతో ప్రపంచ స్థాయికి..
బొమ్మనహళ్లి: బెంగళూరు యువ దర్శకురాలు అనూయ స్వామి రూపొందించిన ’పంకజ’ అనే కన్నడ లఘు చిత్రం అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత ’సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’కు ఎంపికై న మొదటి కన్నడ లఘు చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలోని స్టార్ అగర ప్రభుత్వ పాఠశాల అమ్మాయి, న్యూయార్క్లో జర్నలిజం, సినిమాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుతున్న తెలంగాణకు చెందిన అనూయ బెంగళూరులోని అగరలోని ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న పద్మశ్రీ అనే అమ్మాయిని ప్రధాన పాత్రకు ఎంపిక చేశారు. హర్షణి ఆనే మహిళ ఆ బాలిక తల్లి పాత్రను పోషించింది. శుక్రవారం చిత్ర బృందం పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. అమెరికాలో ప్రదర్శిస్తున్నందుకు హర్షం ఈ సందర్భంగా బాలనటి పద్మశ్రీని సత్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. తను నటించిన చిత్రం అమెరికాలో ప్రదర్శిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉంది అని బాలిక పద్మశ్రీ అన్నారు. దర్శకురాలు అనూయ స్వామి మాట్లాడుతూ ‘నా తల్లిదండ్రులది తెలంగాణ రాష్ట్రం అని, కాని తాను అగర గ్రామంలో పుట్టి పెరిగాను. నేను పుట్టి పెరిగిన దేశంలో అది కూడా కన్నడ నాడులో నా మొదటి లఘు చిత్రానికి దర్శకత్వం వహించాలనుకున్నాను‘ అని అన్నారు. నేను ప్రామాణికతకు చాలా ప్రాముఖ్యత ఇస్తాను. నేను ఏ ప్రముఖ కళాకారుడినీ ఎంచుకోవాలనుకోలేదు. ఒక కొత్త వ్యక్తికి అవకాశం దొరికితే, వారు ఆ పాత్రకు చాలా సహజంగా, నిజాయితీగా ప్రాణం పోస్తారని నాకు నమ్మకం ఉంది. అది ఇప్పుడు నిజమైందని ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం ప్రత్యేకత ‘పంకజ’ షార్ట్ ఫిల్మ్ మానవ జీవితంలోని షాక్, విచారం, అస్పష్టత వంటి లోతైన ఇతివృత్తాలను సున్నితంగా అల్లుకుంది. ఈ చిత్రాన్ని హెచ్.ఎస్.ఆర్. లేఅవుట్, మల్లేశ్వరం, అగర, పోలీస్ స్టేషన్, బెంగళూరులోని రాళ్ల క్వారీలలో చిత్రీకరించారు. ఈ చిత్రం కోసం 50 మందికి పైగా సాంకేతిక సిబ్బంది కష్టపడి పని చేశారు అని అగర ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నడ రంగస్వామి సంతోషం వ్యక్తం చేశారు. చరిత్రలో కన్నడ సినిమా సరికొత్త మైలురాయి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన దర్శకురాలు అనూయ -
ఇంటింటా ఘనంగా సంక్రాంతి
బొమ్మనహళ్లి : కొత్త ఏడాది తొలి పెద్ద పండుగ సంక్రాంతి ఇంటింటా కాంతులు నింపింది. పొలాలనుంచి పంటలు ఇంటికొచ్చిన వేళ రైతన్నలు అత్యంత ఘనంగా నిర్వహించుకునే సంక్రాంతిని పల్లెవాసులతోపాటు నగరవాసులు కూడా ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. బుధవారం భోగి, గురువారం మకర సంక్రాంతి, శుక్రవారం కనుమను ఆచరించారు. ఇళ్ల ముందు ఆవు పేడనీళ్లతో కల్లాపి చల్లి గొబ్బెమ్మలు ఉంచి పూలతో అలంకరించారు. ఇంటిల్లిపాది ఉదయాన్నే స్నానాలు ఆచరించి కొత్త దుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి పూజలు చేసి పిండివంటలు చేసుకొని కుటుంబ సమేతంగా ఆరగించారు. బంధువులు, స్నేహితులు రావడంతో ప్రతి ఇల్లు కళకళలాడింది. బెంగళూరు నగరంలోని బీటీఎం లేఔట్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో రాష్ట్ర రవాణ శాఖ మంత్రి రామలింగారెడ్డి తన సతీమణి చాముండేశ్వరి, కుమార్తె, మాజీ ఎమ్మెల్యే, కేపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సౌమ్యారెడ్డితో కలిసి పాల్గొన్నారు. సూర్య దేవుడికి, గోవుకు పూజలు నిర్వహించారు. సుద్దగుంట పాళ్యవార్డు మాజీ కార్పొరేటర్ మంజునాథ్ అధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.సుబ్రహ్మణ్య స్వామి ఆవరణలో పూజలునిర్వహించారు. ఎడ్లను సంప్రదాయబద్దంగా అలంకరించారు. అడుగోడిలో సమాజ సేవకుడు ఎస్టీడీ మంజునాథ్ పేదలకు సంక్రాంతి కిట్లను ఆందజేశారు. కోరమంగళలోని కాంగ్రెస్ నాయకుడు వెంకటేశ్ ఆధ్వర్యంలో రంగోలి పోటిలు నిర్వహించారు. వడ్లు, రాగులు, రాసులుగా పోటి పేదలకు ఆందజేశారు. చెరుకు గడలు, నువ్వలు, బెల్లం పంపిణీచేశారు. సౌమ్య రెడ్డి, జీ.మంజునాథ్, అడుగొడిమోహన్, మంజులసంపత్ పాల్గొన్నారు. బనశంకరి: జయనగర నాలుగో బ్లాక్ గణపతి ఆలయం వద్ద వీరవనిత ఒనక ఓబవ్వ డాక్టర్ రాజ్మంటప, కన్నడసేవా సమితి కన్నడకట్టె మాజీ బీబీఎంపీ సభ్యుడు ఎస్జీ.రమేశ్రాజు నేతృత్వంలో గోపూజ, మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. నువ్వులు, బెల్లం, చెరుకులు అందజేశారు. బొమ్మనహళ్లి : ఎలక్ట్రానిక్ సిటీలో ఎలక్ట్రానిక్ సిటీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొన్నారు. ఎడ్లబండ్ల ఊరేగింపు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సింగర్స్ సమీరా భరద్వాజ్, నాగార్జున సినీ పాటలను ఆలపించి ఆకట్టుకున్నారు. జబర్దస్త్ టీమ్ చలాకీ చంటి, వెంకి నాగిరెడ్డి బృందం కామెడీ షో ప్రేక్షకులను అలరించింది.తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు రాధాకృష్ణరాజును ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ విల్లా, ప్రధాన కార్యదర్శి శంకర్, శేఖర్ శర్మ పాల్గొన్నారు. బనశంకరి: కెంగేరిలో కనుమ సందర్భంగా శుక్రవారం రైతులు తమ పశువులు, గోవులు, ఎద్దులను అందంగా అలంకరించి గోపూజ నిర్వహించిన అనంతరం నిప్పులపై దాటించారు. సాయంత్రం గ్రామంలో ఎద్దులను ఊరేగించి సందడి చేశారు. బనశంకరీదేవి సన్నిధి భక్తులతో పోటెత్తింది. ఆలయ ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ బనశంకరీదేవి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేపట్టి చెరుకులు, నువ్వులు, కొబ్బరి, పప్పులు, బెల్లంతో బనశంకరీదేవికి విశేష అలంకరణ చేపట్టారు. -
వ్యక్తిపై చిరుత దాడి
దొడ్డబళ్లాపురం: వ్యక్తిపై చిరుత దాడి చేయగా బాధితుడు సమయస్పూర్తితో వ్యవహరించి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా కన్యాడి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంజప్ప నాయక్ తన ఇంటి బయట పని చేసుకుంటుండగా హఠాత్తుగా చిరుత దాడి చేసింది. కాలు అందిపుచ్చుకుని కొరికింది. మంజప్ప ధైర్యం చేసి వక్క చెట్టు ఎక్కి కూర్చున్నాడు. గ్రామస్తులు పరుగున రావడంతో చిరుత పరారైంది. గాయపడ్డ మంజప్పను తక్షణం తాలూకా ఆస్పత్రికి తరలించారు. పట్టణంలో చైన్స్నాచింగ్ గౌరిబిదనూరు: పండుగ రోజున చైన్స్నాచర్లు తెగబడ్డారు. పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన మహిళ చంద్రలీల గురువారం ఉదయం పాల పాకెట్ కోసం వెళ్తుండగా పల్సర్ బైక్పై హెల్మెట్ ధరించి వచ్చిన దుండగులు ఆమె మెడలోని 50 గ్రాంల బంగారు గొలుసు లాగారు. అది తెగిపోయి దొంగల చేతికి 20 గ్రాముల చైన్ చిక్కడంతో ఉడాయించారు బాధితురాలి ఫిర్యాదుతో జిల్లా అడిషనల్ ఎస్పీ జగన్నాథ్, డీఎస్పీ ప్రకాశరెడ్డి, టౌన్ ఎస్ఐ గోపాల్, రూరల్ ఎస్ఐ రమేశ్ గుగ్గరి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. చైన్స్నాచర్ల కోసం గాలింపు చేపట్టారు. లంచం డబ్బులో వాటా ఇవ్వండి● తహసీల్దార్ ఆడియో వైరల్ దొడ్డబళ్లాపురం: కలబుర్గి జిల్లా జీవర్గి తహసీల్దార్ మల్లన్న యలగోడు లంచం డిమాండు చేసినట్లు ఆరోపణలపై ఆడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కిందస్థాయి అధికారులతో సమావేశమైన తహసీల్దార్ మట్లాడుతూ తన పేరు చెప్పుకునికొందరు లంచాలు తీసుకుంటున్నారని, ఆ డబ్బుల్లో తనకూ వాటా ఇవ్వాలని అడిగారు. ఇందుకు సంబంధించి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా మల్లన్న తీరుపై అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను ఎవరినీ లంచం అడగలేదని తహసీల్దార్ పేర్కొన్నారు. బైక్ను ఢీకొన్న కారు.. ఐదుగురికి గాయాలుదొడ్డబళ్లాపురం: కారు బైక్ను ఢీకొని ఐదుగురు గాయపడ్డారు. ఈఘటన గదగ్ జిల్లా లక్ష్మేశ్వర తాలూకా రామగిరిలో ఈప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్ను ఢీకొంది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గాల్లోకి ఎగిరి చెట్లపొదల్లోకి పడి గాయపడ్డారు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. కుమార్తెతో కలిసి తల్లి ఆత్మహత్య యశవంతపుర: కుమార్తెతో కలిసి నేపాలీ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు సంజయనగర కృష్ణప్ప లేఔట్లో జరిగింది. నేపాల్కు చెందిన గోవిందు బహుద్దూరు, సీతా దంపతులు సంజయనగరలో నివాసం ఉంటూ ఓ ఇంటిలో పనిమనుషులుగా పనిచేస్తున్నారు. ఐదారు నెలల క్రితం గోవిందు నేపాల్కు వెళ్లాడు. భర్త తిరిగి రాకపోవడంతో సీతా తన కుమార్తెతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. సంజయనగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. గవిగంగాధేశ్వరునికి సూర్యకిరణాల తాకిడి యశవంతపుర: బెంగళూరు గవిపురంలో వెలసిన గుట్టహళ్లి గవిగంగాధరేశ్వర దేవస్థానంలోని శివలింగాన్ని సూర్య కిరణాలు తాకాయి. గురువారం సాయంత్రం 5:19 గంటలకు శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. కుడి వైపున కిటికీ ద్వారా శివలింగంపై కిరణాలు నంది కొమ్ము ద్వారా శివుడి గర్భగుడిలోని శివలింగంపై పడటాన్ని చూసి భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఈ సమయంలో శివ స్త్రోత్రాన్ని పఠించారు. మంత్రికి తప్పిన ప్రమాదం శివాజీనగర: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు పెను ప్రమాదం నుంచి బయట పడ్డారు. సంక్రాంతి సంబరాల నేపథ్యంలో చిక్కపేటలో ఉన్న బళేపేటలో ఆలయం ముందు గురువారం నిర్వహించి ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు. రాత్రి 7 గంటల సమయంలో బాణసంచా పేల్చుతుండగా నిప్పు రవ్వలు బ్యానర్లు, తోరణాలపై పడి మంటలు చెలరేగాయి. నిర్వాహకులు అప్రమత్తమై మంటలను ఆర్పివేయడంతో మంత్రితోపాటు భక్తులకు ప్రమాదం తప్పింది. చిరుతను చంపిన వ్యక్తి అరెస్ట్మైసూరు : పశువులను వేటాడిందని చిరుతకు విషం ఇచ్చి హతమార్చిన చామరాజనగర్ తాలూకా ఆలూర్ హోమ్మ గ్రామానికి చెందిన దొరెస్వామి (60) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం చిరుతపులి కళేబరం దొరెస్వామి పొలం సమీపంలోనే కనిపించింది. అటవీ అధికారులు పరిశీలించి విష ప్రభావంతో మృతి చెందినట్లు గుర్తించారు. దొరెస్వామిని అనుమానంతో విచారణ చేపట్టగా పశువులను హతమార్చుతుండటంతో చిరుతకు మాంసంలో విషం పెట్టి చంపినట్లు అంగీకరించాడు. -
ఆస్తి కోసం అన్న కుమారులే కడతేర్చారు
దొడ్డబళ్లాపురం: ఆస్తి కోసం వృద్ధురాలిని ఆమె అన్న కుమారులే హత్య చేసిన సంఘటన బాగలకోటె జిల్లా జగదాళ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రవ్వ(80)కు, ఆమె అన్న కుమారుల మధ్య 11 ఎకరాలకు సంబంధించి వివాదం నడుస్తోంది. ఈనెల 13న ఆ భూమిని సర్వే చేయడానికి అధికారులు వచ్చారు. ఈక్రమంలో ఏం జరిగిందో ఏమో చంద్రవ్వ ఘటప్రభా కాలువలోకి పడిపోగా ఆమె అన్నకుమారులు కాపాడి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే అంత్యక్రియలు గుట్టుచప్పుడు కాకుండా చేయడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చంద్రవ్వ అన్న కుమారులు 5మందిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు అంగీకరించారని పోలీసులు తెలిపారు. కాగా హతురాలు చంద్రవ్వ ప్రభులింగేశ్వర దేవాలయం ముందు దుకాణం పెట్టుకుని జీవిస్తోంది. తాను సంపాదించిన డబ్బుతో రూ.16 లక్షలు ఖర్చు పెట్టి దేవాలయానికి 20 కేజీల వెండితో తలుపులు చేయించింది. -
వాచీని చోరీ చేసి ఫొటో వాట్సాప్ స్టేటస్లో...
బనశంకరి: ఇంటి యజమాని గడియారాన్ని కాజేసిన పనిమనిషి ఆ ఫొటోను వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని పట్టుబడింది. ఈ ఘటన సర్జాపురలో చోటుచేసుకుంది. సర్జాపురరోడ్డు అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న ప్రైవేటు కంపెనీ సీనియర్ మేనేజర్ రోహిత్ ఇంట్లో సౌమ్య అనే మహిళ పనిమనిషిగా ఉంది. డిసెంబరు 8వ తేదీ 42 గ్రాముల బంగారు మంగళసూత్రం, జత కమ్మలు, మైకెల్ కోర్సుబ్రాండెడ్ గడియారం కనిపించకపోవడంతో రోహిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పనిమనిషిని విచారణ చేపట్టగా తనకేమీ తెలియదని పేర్కొంది. అయితే సౌమ్య ఆ వాచ్ ధరించి ఫొటోను స్టేటస్లో పెట్టుకుంది. రోహిత్ గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా సౌమ్యాను అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని అంగీకరించడంతో రూ.4.5 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, రూ.20వేల విలువైన వాచీని ఆమెనుంచి స్వాధీనం చేసుకున్నారు. పాత కక్షలతో స్నేహితుడి చేతిలో వ్యక్తి హత్య మైసూరు: పాత కక్షలతో ఒక వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి చంపిన సంఘటన జిల్లాలోని సరగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మోలేయూర్ నివాసి రమేష్ అలియాస్ కరియప్ప (33)ను అతని స్నేహితుడు అనురాజ్ వచ్చి తన వెంట తెచ్చిన చాకుతో కడుపులో పొడిచి చంపాడు. అడవి జంతువులు లోపలికి రాకుండా వరి పొలాన్ని కాపలా కాస్తుండగా, అనురాజ్కు ఫోన్ చేసి రమేష్ గట్టిగా తిట్టాడు. దీంతో అనురాజ్ పొలంలో నిద్రిస్తున్న రమేష్ దగ్గరకు వెళ్లి కత్తితో పొడవడంతో రమేష్కు రక్తస్రావమై మరణించాడని పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి, ఏఎస్పీ రాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్.కిరణ్, సిబ్బంది మహ్మద్ ఇమ్రాన్, ఆనంద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై సరగూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. -
భక్తిశ్రద్ధలతో భంభం బాబా దీక్షల విరమణ
సాక్షి,బళ్లారి: మైసూరు సర్వధర్మ ఆశ్రమ సంస్థాపకులు భం అన్వరానందబాబా ప్రారంభించిన భంభంబాబా దీక్షల పరంపర ప్రస్తుతం మైసూరు సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతి భం కబీర్ కిరణ్ స్వామీజీ ఆధ్వర్యంలో భంభంబాబా దీక్షలు ముగిశాయి. బుధవారం భంభం బాబా దీక్షాపరులు భక్తిశ్రద్ధలతో దీక్షాకంకణాలను తొలగించి, పంచామృతం తీసుకుని, ఊరేగింపుగా వెళ్లి చెరువులు, బావులు, నదుల్లోని నీటిలో వదిలేశారు. బళ్లారితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దీక్షలు తీసుకున్న వారు ఆంధ్రాళ్ భంభం బాబా సేవా సమితిలో ప్రత్యేక పూజలు, భజనలు చేసి, భంభం స్వామి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. అలాగే మైసూరు సమీపంలోని సర్వధర్మ ఆశ్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి దీక్షలను విరమించి, సమీపంలోని కావేరి నదిలో దీక్షాకంకణాలను వదిలారు. మూడు రాష్ట్రాల పరిధిలో పెద్ద సంఖ్యలో భంభంబాబా దీక్ష తీసుకున్న భక్తులు ఆయా సేవా సమితుల పరిఽధిలో ప్రత్యేక పూజలు, భజనలు చేసి, దీక్ష విరమించారు. 21 రోజుల పాటు కఠిన నియమాలతో దీక్షలు ఆచరించిన భక్తులు -
గాలిపటం దారం గొంతుకు చిక్కి ఒకరి మృతి
హుబ్లీ: గాలిపటం దారం గొంతుకు చుట్టుకుని ఒకరు మృతి చెందిన ఘటన బీదర్ తాలూకా బొబ్బళగి గ్రామంలో హైవే– 65లో నిర్ణా క్రాస్ వద్ద బుధవారం ఉదయం చోటు చేసుకుంది. సదరు గ్రామ నివాసి సంజీవ్ కుమార్ బైక్లో వెళుతుండగా చైనా మాంజా గాలి పటం దారం కనిపించక పోవడంతో అలాగే దూసుకెళ్లగా నేరుగా ఆయన గొంతును చుట్టేసింది. దీంతో వేగంతో వెళుతున్న ఆయన తీవ్రంగా గాయపడగా బైక్ నుంచి రోడ్డు మీద పడిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడని ఆ జిల్లా ఎస్పీ ప్రదీప్ గుంటి తెలిపారు. మృతుడు లారీ క్లీనర్గా పని చేసేవాడు. హాస్టల్ ఉన్న కుమార్తెను ఇంటికి తీసుకెళ్లడానికి వెళుతుండగా మృత్యువు వెంటాడింది. ఘటనపై మన్నా–ఎ ఖెళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
ఉపాధి హామీ పేరు మాత్రమే మార్చలేదు
సాక్షి,బళ్లారి: దేశానికి స్వాతంత్య్రం తేవడానికి ప్రాణత్యాగం చేసిన జాతిపిత మహాత్మాగాంధీజీ పేరును నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పెడితే, ఆ పేరును మోదీ సర్కార్ తొలగించడం సరికాదని, పేరును మాత్రమే తొలగించలేదని, రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం ద్వారా రావాల్సిన నిధుల్లో 40 శాతం కోత విధించారని జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ మండిపడ్డారు. ఆయన బుధవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకానికి అయోధ్య రాముడు పేరు కాదని, గాంధీజీని హత్య చేసిన నాథురాం గాడ్సే పేరును పోలినట్లుగా పెట్టిన పేరు కనిపిస్తోందన్నారు. నిధుల్లో కోత విధించడం వల్ల పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అంతేగాకుండా కక్ష సాధింపు రాజకీయాలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. ఫ్లెక్సీ రగడ, కాల్పులపై సీఐడీ విచారణ చేస్తోంది బళ్లారిలో బ్యానర్ రగడ, కాల్పులకు సంబంధించి సమగ్ర విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును సీఐడీకి అప్పగించారన్నారు. తనిఖీ చేసిన తర్వాత పూర్తి ఆధారాలు లభ్యం అవుతాయన్నారు. తప్పు ఎవరు చేసినా, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. బ్యానర్ వివాదంపై బీజేపీ నాయకులు పాదయాత్ర చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఎవరి కోసం, ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఐదు సంవత్సరాలు కొనసాగుతారన్నారు. అయితే ఈ విషయంలో పార్టీ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటామన్నారు. సీఎల్పీ సమావేశంలో సీఎంగా సిద్దూ ఐదేళ్లు కొనసాగుతారని అప్పట్లో తీర్మానం చేశారన్నారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీలో ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు హంపీ ఉత్సవాలు నిర్వహిస్తామని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తారన్నారు. ఎమ్మెల్యేలు నారా భరత్రెడ్డి, గణేష్, లోక్సభ సభ్యుడు తుకారాం, మేయర్ గాదెప్ప, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో 40 శాతం కోత విధించారు ఐదేళ్ల పాటు సీఎం సిద్ధరామయ్యే బీజేపీ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలి జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ -
17న బీజేపీ, జేడీఎస్ భారీ సమావేశం
సాక్షి,బళ్లారి: జనవరి 1వ తేదీన నగరంలోని సిరుగుప్ప రోడ్డులో మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద జరిగిన ఫ్లెక్సీ రగడ, కాల్పులతో ఒక యువకుడు మృతి చెందిన ఘటనతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఈనెల 17వ తేదీన నగరంలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి శ్రీరాములు పేర్నొన్నారు. ఆయన బుధవారం గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. నగరంలో బ్యానర్ రగడ, కాల్పులకు సంబంధించి అన్ని ఆధారాలు, వీడియోలు పోలీసులకు లభించినా, ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, ఆయన ఆప్తుడు సతీష్రెడ్డిలపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగి 15 రోజులు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బాధిత కుటుంబానికి ఏం న్యాయం చేశారు? మరో పక్క బాధిత కుటుంబానికి ఏం న్యాయం చేశారు? అని శ్రీరాములు ప్రశ్నించారు. ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిని అంతం చేయడానికి కుట్రలు చేసి, కాల్పులు జరిపారని మండిపడ్డారు. ఈ విషయంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. వీటిన్నింటిపై ఈనెల 17న పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామన్నారు. బళ్లారి కేంద్రంగా బృహత్ సమావేశం ఏర్పాటు చేస్తుండటంతో ఆ సమావేశానికి కేంద్ర మంత్రి, జేడీఎస్ నాయకుడు కుమారరస్వామితో పాటు, ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, దాదాపు లక్ష మంది జనం చేరుతున్నట్లు తెలిపారు. అదే రోజున బళ్లారి నుంచి బెంగళూరుకు పాదయాత్ర చేయాలని తీర్మానం చేశామన్నారు. రూట్మ్యాప్ కూడా సిద్ధం చేసి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అనుమతిస్తే ఆ రోజు నుంచే పాదయాత్ర పాదయాత్రకు అనుమతి లభిస్తే అదే రోజు నుంచి 20 రోజుల పాటు బెంగళూరుకు పాదయాత్ర చేసి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తూర్పారబడతామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, హత్యలు, దోపిడీలు పెరిగిపోతున్నాయని భగ్గుమన్నారు. నగరంలో మట్కా, గ్యాంబ్లింగ్, పేకాట తదితర అసాంఘీక కార్యకలాపాలు పెట్రేగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి విపరీతంగా పెరిగిపోవడం వల్ల యువత పెడదోవ పడుతోందన్నారు. సతీష్రెడ్డి వద్ద ఉన్న గన్లైసెన్స్కు ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మాజీ ఎంపీ సన్నపక్కీరప్ప, మాజీ ఎమ్మెల్యే టీ.హెచ్.సురేష్బాబు, బీజేపీ నాయకులు గురులింగనగౌడ, ఓబుళేసు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతపై ప్రభుత్వాన్ని ఎండగడతాం కేంద్ర మంత్రి కుమార, పార్టీ నేతలు అశోక్, విజయేంద్రల రాక సమావేశం అనంతరం పాదయాత్రకు శ్రీకారం చుడతాం అన్ని ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీరాములు సూటి ప్రశ్న -
అంబరం.. భోగి సంబరం
సాక్షి,బళ్లారి: మన సంస్కృతి, వారసత్వాలకు అద్దం పట్టేలా భోగి పండుగను ఘనంగా ఆచరించారు. బుధవారం భోగి పండుగ నేపథ్యంలో ఇంటింటా భోగి మంటలు వేసుకుని పండుగకు శ్రీకారం చుట్టారు. సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు నేపథ్యంలో మొదటి రోజు జరుపుకునే భోగి పండుగ రోజున తెల్లవారుజామున లేచి ఇంటిముందు భోగి మంట వేసి మనలోని ఈర్ష, ద్వేషాలు, కోపం తదితర దుర్గుణాలను అగ్నిలో దహించి కొత్త జీవితానికి నాంది పలకాలనే ఉద్దేశ్యంతో భోగి పండుగను ఆచరిస్తున్నట్లు పండుగ నేపథ్యం చెబుతోంది. భోగి మంటలతో పండుగ ఆచరణ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా భోగి పండుగను పెద్ద ఎత్తున ప్రతి ఇంటి ముందు మంట వేసుకుని ఆచరించారు. ఉమ్మడి బళ్లారి జిల్లాతో పాటు తుంగభద్ర ఆయకట్టు పరిధిలో చుట్టుపక్కల గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు లక్షలాది మంది తెలుగు వారికి భోగి, సంక్రాంతి అంటే పెద్ద పండుగ కావడంతో తెలుగువారితో పాటు కన్నడిగులు అందరూ ఇంటింటా భోగి పండుగను ఘనంగా ఆచరించారు. ఇక ఇప్పటికే రైతుల ఇంటికి అన్ని రకాల పంటలు కూడా వచ్చి చేరాయి. తుంగభద్ర ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల్లో సాగు చేసిన వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు కూడా రైతులకు చేతికందాయి. దీంతో రైతన్నలు కూడా పల్లెల్లో సంతోషంగా పండుగను జరుపుకున్నారు. ఇంటింటా విరిసిన రంగవల్లులు ఇంటింటా మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి, గుమ్మడి కాయలు పగలగొట్టి, రంగురంగుల పువ్వులతో అలంకరించి ఆచరించారు. ఈ పండుగకు ప్రత్యేకంగా పిండివంటలతో పాటు సజ్జరొట్టెలు, నూనె వంకాయ తదితరాలు చేసుకుని కుటుంబసభ్యులతో కలిసి పండుగకు స్వాగతం పలికారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలో జిందాల్ స్టీల్ ఇండస్ట్రీతో పాటు వివిధ పరిశ్రమలు, తుంగభద్ర డ్యాం ఉండటంతో ఇక్కడ తెలుగు ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగాలు చేస్తున్న తరుణంలో గత మూడు రోజుల నుంచి వారి స్వగ్రామాలకు సంక్రాంతికి బయలుదేరి వెళ్లారు.దీంతో బస్సులు, రైళ్లు కిటకిటలాడాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా హరిదాసులు గంగిరెద్దులు పట్టుకుని పల్లెటూళ్లలో సందడి చేశారు. ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలు దాదాపు చేతికందడంతో హరిదాసులకు తమకు తోచిన దానం చేసి ఉదారతను చాటుకున్నారు. ధరలు పెరిగినా సంబరాలు అదుర్స్ రాయచూరు రూరల్ : నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటినా, కాయగూరల ధరలకు రెక్కలు వచ్చినా మార్కెట్లో పెరుగుతున్న రేట్లను లెక్కచేయకుండా జిల్లా ప్రజలు సంక్రాంతి సంబరాలకు సన్నద్ధం అయ్యారు. బజారులో ధరలు మాత్రం విపరీతంగా పెరగడంతో ప్రజలు గత్యంతరం లేక కొనుగోలు చేస్తున్నారు. తమ ఇళ్ల ముందు మహిళలు, బాలికలు రంగు రంగులతో కూడిన సంక్రాంతి ముగ్గులను వేశారు. చెరుకు గడ, గుమ్మడికాయలు, పూలు, చింతపండు, నువ్వులు, వేరుశనగ, బెల్లం ధరలు విపరీతంగా పెరిగాయి. కేజీ బెల్లం రూ.80, సేరు నువ్వులు రూ.150, గుమ్మడి కాయ రూ.75, కిలో చింతకాయలు రూ.175, చెరుకుగడ రూ.90 ఒకటి, మూర పూలు రూ.50 ధర పలకడంతో ప్రజలు సంప్రదాయం కోసం వాటిని కొనుగోలు చేయక తప్పడం లేదు. శెనగ చెట్ల కట్ట రూ.50 చొప్పున విక్రయించారు. మకర సంక్రాంతిని ఆచరించేందుకు ఇక్కడి ప్రజలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. బుధవారం తెల్లవారు జామున నిజలింగప్ప కాలనీ వద్ద భోగి మంటలు వేశారు. మరో వైపు మడివాళ నగర్లో యువతులు రంగులతో కూడిన ముగ్గులు వేశారు. ధార్వాడలో సంక్రాంతి సుగ్గి వేడుకలుహుబ్లీ: సూర్యుడు తన పథాన్ని మార్చుకొనే సందర్భంగా జరుపుకొనే మకర సంక్రాంతి పండుగ వేడుకలను ధార్వాడ సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం బేషుగ్గా జరిపారు. కళాశాల మీటింగ్ హాల్లో చక్కగా పాడి పంటలకు ప్రతీకగా వస్తువులను, ధాన్యాలను ఉంచి పూజలు చేశారు. పరస్పరం నువ్వులు, బెల్లం పంచుకొని నోటిని తీపి చేసుకొని సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులు తెల్ల దుస్తులతో ఆకట్టుకోగా బాలికలు వైవిధ్యమయమైన డ్రెస్సులతో, చీరలతో ఆదరగొట్టారు. తొలి పండుగ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలను కన్నడిగులు భక్తితో సుగ్గి హబ్బ అంటే సుగ్గి పండుగగా పిలుచుకుంటారు. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, భారత దేశ ఘనత, గొప్ప సత్సంప్రదాయాలకు ప్రతీక అయిన నాలుగు రోజుల భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ వేడుకల సమ్మేళనంగా కళాశాల ఆవరణలో ఆచరించారు. సంస్కృతి, వారసత్వాలకు అద్దం పట్టేలా వేడుకలకు శ్రీకారం సంక్రాంతి పండుగకు భారీగా పల్లెలకు తరలిన జనం -
కార్మికులను పర్మినెంట్ చేయండి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టాస్క్వర్క్ కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించకుండా విధుల నుంచి తొలగించినట్లు అధికారులు చెప్పడాన్ని తుంగభద్ర ఎడమ కాలువ టాస్క్వర్క్ కార్మికుల సంఘం అధ్యక్షుడు నాగలింగస్వామి ఖండించారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎనిమిది నెలల నుంచి వేతనాలు లేకపోవడంతో పాటు రబీ సీజన్లో తుంగభద్ర ఎడమ కాలువకు నీరు విడుదల చేయడం లేదన్నారు. పనులు లేని కారణంగా విధులకు రావడం తగదని ఇంజినీర్ విజయలక్ష్మి పేర్కొనడాన్ని తప్పుబట్టారు. టాస్క్వర్క్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. కూలీ కార్మికులకు చెల్లించాల్సిన రూ.10 కోట్ల దుర్వినియోగంపై విచారణ చేయాలన్నారు. యజమానులపై భారం తగదు రాయచూరు రూరల్: నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు, దుకాణాలకు సంబంధించి లారీల లోడింగ్, అన్లోడింగ్లకు పన్నుల చెల్లింపులో లారీ యజమానులు, డ్రైవర్లపై భారం మోపడం తగదని లారీ యజమానుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు సయ్యద్ హసన్ మాట్లాడుతూ పరిశ్రమలు,బ దుకాణాల యజమానులు లోడింగ్, అన్లోడింగ్లకు చెందిన చార్జీలు చెల్లించే విషయంలో అన్యాయం చేస్తున్నారని, దాని నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. క్రీడలతో శారీరక ఆరోగ్యం హొసపేటె: క్రీడల్లో తరచుగా పాల్గొనడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక బలం పెరుగుతుందని హంపీ కన్నడ విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ డీఏ పరమశివమూర్తి అన్నారు. హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయం విద్యారణ్య ప్రాంగణంలోని స్టేడియంలో నుడి హబ్బ–34లో భాగంగా నిర్వహించిన నమ్మ హబ్బ క్రీడా కూటమిని జ్యోతి వెలిగించి, ఆకాశంలోకి పావురాన్ని వదిలి మాట్లాడారు. క్రీడలు, చదువు రెండూ సమానంగా ఉన్నప్పుడు, విద్యార్థుల మనస్సులు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయంలో క్రీడలు ఆడటానికి విశాలమైన స్థలం అందుబాటులో ఉందన్నారు. క్రీడల్లో గొప్ప విజయాలు సాధించగల ప్రతిభావంతులు ఇక్కడ ఉన్నారన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు ప్రతిభను వెలికితీతకు వేదికగా ఉపయోగపడతాయన్నారు. ప్రతిభ వెలికితీతకు కారంజి దోహదంరాయచూరు రూరల్: విద్యార్థుల ప్రతిభ వెలికితీతకు ప్రతిభా కారంజి దోహదపడతాయని శాసన సభ్యులు బసన గౌడ, శివరాజ్ పాటిల్ అభిప్రాయ పడ్డారు. రాయచూరు తాలుకా జేగర్కల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కళోత్సవం, ప్రతిభా కారంజి– 2025–26ను ప్రారంభించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నేటి పోటీ యుగంలో చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకొని జ్ఞానంతో విద్యాభ్యాసం సాగించి, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి వేదికలు అవసరమన్నారు. కార్యక్రమంలో బీఈఓ ఈరణ్ణ, మల్లేష్ నాయక్, మొయిన్ ఉల్ హక్, రావుత్ రావ్, దేవమ్మ, సిద్దనగౌడ, చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణ, శ్రీనివాస రెడ్డి, హనుమేష్లున్నారు. నియమాలు పాటిస్తే ప్రమాదాలు దూరంహొసపేటె: రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించడం తప్పనిసరి అని ట్రాఫిక్ పోలీసు ఇన్స్పెక్టర్ డీ.హులుగప్ప తెలిపారు. ఆయన బుధవారం తాలూకా పంచాయతీ హాలులో ఏర్పాటు చేసిన 37వ అంతర్జాతీయ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ట్రాఫిక్ నియమాలను పాటించని డ్రైవర్లకు జరిమానా తప్పదన్నారు. వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, బీమా, ఆర్సీ తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆయన అన్నారు. టీపీ ఈఓ ఎండీ ఆలంబాషా, సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఖలీద్, ప్యానెల్ న్యాయవాది డీ.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
నాగేంద్రకు భారీ ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు
సాక్షి,బళ్లారి: వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటూ, ఇప్పటికే ఈ కేసులో మంత్రి పదవి కోల్పోవడంతో జైలుకు కూడా వెళ్లి వచ్చిన బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్రకు ఇదే కేసులో మళ్లీ నోటీసులిచ్చి వివిధ కోణాల్లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సీబీఐ నుంచి నాగేంద్రకు విచారణకు రావాలని నోటీసులు రావడంతో మళ్లీ అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది.ఈ నేపథ్యంలో నాగేంద్ర బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణ చేపట్టి బుధవారానికి విచారణను వాయిదా వేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాగేంద్రకు బెయిలా? జైలా? అనే విధంగా చర్చలు సాగాయి. అయితే బుధవారం సాయంత్రం సంబంధిత కోర్టులో న్యాయమూర్తి నాగేంద్రకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు. సీబీఐ దాఖలు చేసిన కేసులో నాగేంద్రకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో నాగేంద్ర మళ్లీ జైలుకు వెళ్లే పరిస్థితి నుంచి తప్పించుకున్నారు. దీంతో నాగేంద్రతో పాటు ఆయన అభిమానులు, కార్యకర్తల్లో సంతోషం వెల్లివిరిసింది. సిద్దరామేశ్వర జయంతికి గైర్హాజరుపై ఆందోళనరాయచూరు రూరల్ : నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో జిల్లా పాలన యంత్రాంగం, జెడ్పీ, నగరసభ, కన్నడ సంస్కృతి శాఖ, సాంఘీక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బుధవారం ప్రధాన వేదికలో జరిగిన సిద్దరామేశ్వర జయంతి ఉత్సవాలకు ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు గైర్హాజరు కావడంపై భోవి సమాజం అధ్యక్షుడు రామాంజినేయ, సమాజ సభ్యులు శశికళ, భీమణ్ణ తదితరులు ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పంట నష్టంపై పరిశీలన రాయచూరు రూరల్: గత ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు కళ్యాణ కర్ణాటక భాగంలో పంటలు అధికంగా నష్టపోయారు. బుధవారం పంట నష్టం అంచనాలపై కేంద్ర బృందం పర్యటించింది. కలబుర్గి జిల్లా కమలాపుర, యాదగిరి జిల్లా యాదగిరిలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ హైదరాబాద్ నూనె విత్తనాల డైరెక్టర్ డాక్టర్ పొన్నుస్వామి, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జయశ్రీల ఆధ్వర్యంలో పొలంలో పంటను, పాడైన రహదారులు, తెగిన వంతెనలు, ఇతర పనులను కూడా పరిశీలించారు. కలబుర్గి జిల్లాధికారి ఫౌజియా తరన్నుం అధికారులకు వివరిస్తూ అధిక శాతం వానలు కురవడం వల్ల పంటలు దెబ్బ తిన్న అంశాలను వివరించారు. జెడ్పీ సీఈఓ భవర్ సింగ్ మీనా, అధికారులు సంతోష్ ఇనాందార్, మహ్మద్ మోహిసిన్, అనసూయ, అరుణ్ కుమార్లున్నారు. సమాజాభివృద్ధికి విద్య ప్రధానంరాయచూరు రూరల్ : నగరంలోని ఆశాపూర్ క్రాస్ వద్ద భోవి సమాజం ఆధ్వర్యంలో బుధవారం సిద్దరామేశ్వర జయంతి ఉత్సవాలు నిర్వహించారు. సిద్దరామేశ్వర విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లా పాలన యంత్రాంగం, జెడ్పీ, నగరసభ, కన్నడ సంస్కృతి శాఖ, సాంఘీక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యుడు శివరాజ్ పాటిల్ పాల్గొని మాట్లాడారు. గురువుల మార్గదర్శనంలో సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య ప్రధానమన్నారు. -
ఫిబ్రవరి 13 నుంచి హంపీ ఉత్సవాలు
హొసపేటె: ప్రపంచ ప్రఖ్యాత హంపీ ఉత్సవాలు–2026ను ఈసారి ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర మైనార్టీ వ్యవహారాలు, గృహ నిర్మాణ, వక్ఫ్ శాఖ మంత్రి బీజెడ్.జమీర్ అహ్మద్ ఖాన్ వెల్లడించారు. బుధవారం హొసపేటెలోని అమరావతి అతిథిగృహంలో ఆయన ముందుగా హంపీ ఉత్సవం–2026 లోగోను విడుదల చేశారు. హంపీ ఉత్సవ సన్నాహాల గురించి ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రి ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం హంపీ ఉత్సవాలను అధికారికంగా ప్రారంభిస్తారన్నారు. అంతకు ముందు ఎంపీ ప్రకాష్ హయాంలో నవంబర్ నెలలో హంపీ ఉత్సవాలు జరిగేవని గుర్తు చేశారు. స్థానిక కళాకారులకు పెద్దపీట హంపీ ఉత్సవంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా స్థానిక కళాకారులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా రవాణా, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా తాను రెండు ఉత్సవాలను విజయవంతం చేశానని, ఇది మూడో ఉత్సవమని, దీనిని ఘనంగా జరుపుతామని ఆయన అన్నారు. బళ్లారి ఎంపీ ఈ.తుకారాం, ఎమ్మెల్యేలు లతా మల్లికార్జున్, గణేష్, నారా భరత్రెడ్డి, హుడా అధ్యక్షుడు ఇమాం నియాజీ, జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి, జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహ్మద్ అలీ అక్రం షా, జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మూడు రోజులు ఘనంగా నిర్వహణకు నిర్ణయం జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ వెల్లడి -
లాల్బాగ్లో ఫ్లవర్ షో షురూ
ప్రదర్శనను వీక్షిస్తున్న డీసీఎం శివకుమార్ తిలకిస్తున్న సందర్శకులు బనశంకరి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా బెంగళూరు లాల్బాగ్ గ్లాజ్హౌస్లో ఫలపుష్ప ప్రదర్శన బుధవారం సాయంత్రం నుంచి ఆరంభమైంది. డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, మంత్రులు ఎస్ఎస్.మల్లికార్జున్, రామలింగారెడ్డి ప్రారంభించారు. ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో దివంగత సాహితీవేత్త పూర్ణచంద్ర తేజస్వి జీవితం, రచనల స్ఫూర్తితో తేజస్వి విస్మయ పుష్ప థీమ్ను తీర్చిదిద్దారు. జనవరి 26వ తేదీ వరకు ఫ్లవర్ షో కొనసాగుతుంది. బిళిగిరిరంగన బెట్ట గ్రామీణ నేపద్యం, జానపద కళలు, నందిగిరిధామ ప్రకృతి అందాలతో పాటు వివిధ పుష్ప ఆకృతులు ఆకర్షిస్తాయి. -
ఇంటింటా సంక్రాంతి శోభ
యశవంతపుర: భోగి, సంక్రాంతి పండుగ సందడి బెంగళూరుతో పాటు రాష్ట్రమంతటా నెలకొంది. ఇంటింటా బంధువులతో కళకళలాడుతోంది. ప్రసిద్ధ దేవాలయాలలో రథోత్సవాలు, జాతరలు జరుగుతున్నాయి. ఇక ఇంటింటా పిండివంటలు, పూజల కోలాహలం నెలకొంది. అందమైన రంగువల్లులతో అలంకరించారు. పల్లెల్లో రైతులు పశుసంపదకు పూజలు చేసి కష్టసుఖాల్లో తమకు తోడుగా ఉన్నందుకు వంటకాల నైవేద్యాలను సమర్పించారు. మార్కెట్లలో రద్దీ మార్కెట్లు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యాపారాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. టన్నుల కొద్దీ చెరకు, పప్పుల విక్రయం సాగింది. పూలు, పండ్లు, చక్కెర బొమ్మలు, మిఠాయిల కొనుగోళ్లు ఎక్కువగా జరిగింది. శెనగలు, పప్పులు, గెణసు గడ్డల ధరలు గణనీయంగా పెరిగాయి. భోగి సంబరాలు బుధవారం ఆనందోత్సాహాలతో భోగిని ఆచరించారు. ఇళ్ల ముందు చెరుకు గడలను పాతి, కొత్త కుండల్లో పొంగల్, తీపి అన్నం వండి ఆరగించారు. గురువారం సంక్రాంతి పండుగకు సర్వం సిద్ధం చేశారు. సంప్రదాయం ప్రకారం ఎండు కొబ్బరి, పప్పులు, కలకండ, చెరకు, చెక్కర, అచ్చు బెల్లాన్ని బంధువులు, ఇరుగుపొరుగుకు ఇచ్చిపుచ్చుకున్నారు. వారం రోజుల నుంచి మహిళలు పండుగకు ఈ వస్తుసామగ్రిని కొనుగోలు చేశారు. బెంగళూరు నుంచి వేలాది మంది పండుగకు సొంతూళ్లకు వెళ్లారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఒక్క రోజు సెలవు మాత్రమే ఇచ్చాయి. పల్లెల్లో ఎద్దులను అలంకరించి మంటల మీద నుంచి ఎగిరించారు.బెంగళూరులోని జయనగరలో మహిళలచే భోగి సంబరాలు బుధవారం బెంగళూరులో చక్కెర అచ్చులు, మిఠాయిల కొనుగోళ్లు ఆనందోత్సాహాలతో భోగి పండుగ ఇళ్లూ, వాకిళ్లు కళకళ -
కుక్కల దాడిలో బాలిక బలి
దొడ్డబళ్లాపురం: వీధికుక్కల దాడిలో గాయపడిన బాలిక చికిత్స ఫలించక ప్రాణాలు విడిచింది. ఈ విషాద సంఘటన బాగలకోట పట్టణంలో వెలుగుచూసింది. పట్టణంలోని నవ నగర్లో గత డిసెంబర్ 27న అలైనా (10) అనే బాలికపై ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధికుక్కలు దాడి చేసి కరిచాయి. తీవ్ర గాయాలైన చిన్నారిని తల్లిదండ్రులు కిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఆనాటి నుంచి మృత్యువుతో పోరాడిన బాలిక చికిత్స ఫలించక మృతిచెందింది. మున్సిపల్ అధికారులకు కుక్కలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. బాలునిపై కుక్కల దాడి దొడ్డబళ్లాపురం: రెండేళ్ల బాలునిపై వీధికుక్కలు దాడి చేసిన సంఘటన బెళగావి జిల్లా చిక్కోడి పట్టణంలో జరిగింది. బాలుడు రుత్విక్ ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కలు మీదపడి కరిచాయి. బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.వర్గీకరణ బిల్లు వెనక్కి బనశంకరి: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుపై స్పష్టత ఇవ్వాలని గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆ బిల్లును వెనక్కిపంపారు. డిసెంబరులో జరిగిన బెళగావి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ఆమోదించింది. ఎస్సీలలోని ఉపకులాల మధ్య వివిధ నిష్పత్తిలో రిజర్వేషన్లను కేటాయించింది. బిల్లు ఆమోదం కోసం గత వారం గవర్నర్కు పంపింది. కానీ ఇప్పుడు వెనక్కి వచ్చింది. అది ఆమోదం పొందేవరకు ఉద్యోగ నియామకాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. స్కూటీకి ప్రాబ్లం.. చైన్ స్నాచింగ్ మైసూరు: మహిళ మెడలోని బంగారు గొలుసును ఓ దుండగుడు లాక్కొని పరారైన ఘటన నగరంలోని అశోకపురం రైల్వేస్టేషన్ వద్ద జరిగింది. చిక్కహరదనహళ్లి నివాసి రష్మి అనే మహిళ స్కూటీలో ఇంటికి వెళుతుండగా, రైల్వేస్టేషన్ వద్ద ఏదో ఇబ్బంది వచ్చి స్కూటర్ నిలిచిపోయింది. ఆ సమయంలో స్కూటీకి ఏమైందా? అని రశ్మి పరిశీలిస్తుండగా వెనుక నుంచి వచ్చిన దుండగుడు ఆమె మెడలోని 40 గ్రాముల బరువైన బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. అశోకపురం ఠాణాలో ఆమె ఫిర్యాదు చేసింది. మెట్రో పనుల్లో ప్రమాదం.. కూలిన క్రేన్ బొమ్మనహళ్లి: బెంగళూరు నగరంలోని బొమ్మనహళ్ళి హెచ్ఎ్స్ఆర్ లేఔట్ సమీపంలో ఉన్న అగరలో జరుగుతున్న బ్లూలైన్ మెట్రో రైలు వంతెన నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున భారీ క్రేన్ కుప్పకూలిపోయింది. ఇది సెంట్రల్ సిల్క్బోర్డు వద్ద నుంచి ఔటర్ రింగ్ రోడ్డును కలిపే మార్గం. ఈ క్రేన్ 500 టన్నుల బరువును ఎత్తే సామర్థ్యం కలది. 100 టన్నుల స్టీల్ గడ్డర్ను ఎత్తుతుండగా ఇలా జరిగిందని ఇంజనీర్లు తెలిపారు. అదృష్టవశాత్తు జన సంచారం లేకపోవడంతో ఎవరికీ హాని కలగలేదు. పడిపోయిన క్రేన్ను ఎత్తడానికి మరో రెండు భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు. -
నలుగురిని బలిగొన్న ఓవర్టేక్
శివమొగ్గ: కేఎస్ ఆర్టీసీ బస్సును స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మరణించగా, ముగ్గురు గాయపడిన ఘటన మంగళవారం రాత్రి జిల్లాలోని తీర్థహళ్లి తాలూకా భారతీపుర వద్ద జరిగింది. బాధితులు చిక్కమగళూరు జిల్లా శృంగేరి తాలూకా మెణసె గ్రామ నివాసులు. వివరాలు.. చెన్నగిరికి వెళ్లి శుభకార్యంలో పాల్గొని కారులో శృంగేరికి వాపసు వస్తున్నారు. మంగళూరు నుంచి రాయచూరుకు వెళుతున్న కేఎస్ఆర్టీసీ బస్సును భారతీపుర మలుపు వద్ద కారు ఢీకొంది. ఓవర్టేక్ చేసే హడావుడిలో కారు డ్రైవర్ అదుపు తప్పాడు. కారులోని బి.ఫాతిమా (70), రిహాన్ (14)లు అక్కడికక్కడే మరణించగా, రాహిల్ (9), జయాన్ (12) శివమొగ్గలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. జరీనా (35), రిహా(12), కారు డ్రైవర్ రియాజ్ (35)లు గాయపడ్డారు. కారు డ్రైవర్ అజాగ్రత్త డ్రైవింగే ప్రమాదానికి కారణమని పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. బైక్ను బస్సు ఢీ, ఇద్దరు మృతి మైసూరు: కేఎస్ ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొని ఇద్దరు మరణించిన ఘటన చామరాజనగర జిల్లా హనూరు తాలూకా రామపుర పోలీసు స్టేషన్ పరిధిలోని కోణనకెరె గ్రామం వద్ద జరిగింది. మృతులను హనూరు తాలూకా రామేగౌడనహళ్లి శివప్ప, సత్తిగా గుర్తించారు. మలెమహదేశ్వర బెట్ట నుంచి చామరాజనగరకు వెళుతున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న బైక్ని ఢీకొంది, యువకులు ఇద్దరూ అక్కడే దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రామాపుర పోలీసు కేసు నమోదు చేసుకున్నారు. ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు శివమొగ్గ జిల్లాలో దుర్ఘటన -
మహేశ్బాబు గుడ్న్యూస్.. ఆరోజే ఓపెనింగ్..
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు సినీప్రేమికులకు శుభవార్త చెప్పాడు. బెంగళూరులో కొత్తగా నిర్మించిన ఏఎమ్బీ సినిమాస్ జనవరి 16న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. జనవరి 16న AMB సినిమా హాల్ తలుపులు తెరుచుకోనున్నాయి. దక్షిణ భారతదేశంలో తొలిసారి డాల్బీ సినిమా అనుభవాన్ని పంచేందుకు మా థియేటర్ సిద్ధమైంది. రేపే ప్రారంభండాల్బీ కోసం ఎంతగానో కష్టపడ్డ AMB సినిమాస్ టీమ్కు కృతజ్ఞతలు. ప్రారంభ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. అని ట్వీట్ చేశారు. బెంగళూరు గాంధీ నగర్లో గతంలో కపాలి థియేటర్ ఉన్న స్థలంలోనే ఏఎమ్బీ మల్టీప్లెక్స్ నిర్మించారు. దక్షిణాదిలో ఇదే తొలి డాల్బీ థియేటర్. మరోవైపు హైదరాబాద్లోని అల్లు సినిమాస్లో డాల్బీ సినిమా స్క్రీన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇది దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ కావడం విశేషం.సినిమాసినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేశ్బాబు నటిస్తున్న ఫారెస్ట్ అడ్వెంచర్, మైథాలజీ మూవీ "వారణాసి". రుద్రగా మహేశ్బాబు నటిస్తుండగా, మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ వెండితెరపై కనిపించనున్నారు. ప్రకాశ్రాజ్ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి చెక్కుతున్న ఈ కళాఖండాన్ని కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2027 వేసవిలో విడుదల కానుంది. The doors formally open at AMB Cinemas in Bengaluru on Jan 16th with South India’s first Dolby Cinema experience! Extremely proud of TEAM AMB for putting in an extraordinary effort to see this through … 👏🏻👏🏻👏🏻Looking forward to seeing u all very soon in Namma Bengaluru…🤗🤗🤗…— Mahesh Babu (@urstrulyMahesh) January 14, 2026 చదవండి: నారీ నారీ నడుమ మురారి మూవీ రివ్యూ -
రాహుల్ వద్దకు కర్ణాటక పంచాయితీ.. సిద్దరామయ్య ప్లాన్ అదేనా?
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో సీఎం మార్పు లేదంటూ వార్తలు బయటకు వచ్చిన వేళ.. మరోసారి రాజకీయం వేడెక్కింది. రాహుల్తో సీఎం సిద్దరామయ్య సమావేశం కావాలనుకోవడం చర్చకు దారి తీసింది. ఈ మేరకు ఇండియా టుడే ఓ కథనంలో పేర్కొంది.వివరాల మేరకు.. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంటూ నెలకొన్న నిరంతర గందరగోళం గురించి బయట పడేందుకు సీఎం సిద్ధరామయ్య ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నుండి స్పష్టత కోరుతూ సిద్ధరామయ్య ఆయనతో సమావేశం కావాలని అభ్యర్థించారు. అంతేకాకుండా సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని విస్తరించడానికి ఆసక్తిగా ఉన్నానని చెప్పారని ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ సమావేశం కోసం చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే.. డీకే శివకుమార్ సహా ఆయన మద్దతుదారులకు అవకాశం ఉంటుందా? అనే చర్చ కూడా మొదలైంది.ఇదిలా ఉండగా.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం ఎలాంటి అంతర్గత సంక్షోభం లేదని పదేపదే ఖండిస్తోంది. అంతర్గత సమస్యలను రాష్ట్ర నాయకత్వమే పరిష్కరించుకోవాలని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం స్పష్టం చేశారు. ఇక, అంతకుముందు కూడా సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ సీఎం మార్పు విషయంలో స్పందించారు. ఇద్దరూ విభేదాల నివేదికలను నిరంతరం ఖండిస్తున్నారు. తాను పార్టీ నాయకత్వంపై విశ్వాసం కలిగి ఉన్నానని, తన పదవీకాలాన్ని పూర్తి చేస్తానని సిద్ధరామయ్య పేర్కొన్నారు, రొటేషనల్ ముఖ్యమంత్రి ఏర్పాటుకు సంబంధించిన వాదనలను తోసిపుచ్చారు.రాష్ట్రంలో సీఎం కుర్చీ కోసం ఎలాంటి గొడవ లేదని, ఇదంతా కేవలం మీడియా సృష్టి మాత్రమేనన్నారు. అనవసరమైన ప్రశ్నలతో గందరగోళం సృష్టించకండి అంటూ మీడియాపై సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సంక్రాంతి తర్వాత కాంగ్రెస్లో అసలు సిసలైన కుర్చీ పోరు మొదలవుతుందని బీజేపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. తన ప్రభుత్వానికి, పదవికి ఎలాంటి ఢోకా లేదని, ఐదేళ్లు తామే సుస్థిర పాలన అందిస్తామని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.అసలు గొడవ ఎందుకు వచ్చింది?కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండున్నరేళ్లు పూర్తైన క్రమంలో సీఎం మార్పు ఉంటుందన్న ప్రచారం జోరందుకుంది. గత నవంబర్ 20తో ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితిలో రెండున్నరేళ్లు దాటింది. 2023లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికార పంపిణీ ఒప్పందం జరిగిందన్న ఊహాగానాలు ఉన్నాయి. దీని ప్రకారం, సగం కాలం సిద్ధూ, మిగతా సగం డీకే సీఎంగా ఉంటారని టాక్. ఇప్పుడు ఆ సమయం దాటడంతో బీజేపీ దీనిని రాజకీయ అస్త్రంగా వాడుకుంటోంది. "సంక్రాంతి తర్వాత చూడండి, కాంగ్రెస్ కుర్చీలాట మొదలవుతుంది" అని బీజేపీ నేతలు, సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నాయి. దీనిపైనే సిద్ధరామయ్య సీరియస్గా స్పందించారు. "అసలు గొడవ ఎక్కడుంది? మీరే (మీడియా) సృష్టిస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కొనసాగుతున్న ఐపీల తంతు
సాక్షి,బళ్లారి/బళ్లారి అర్బన్: నగరంలో ఇటీవల ప్రజలను చీటీల పేరుతో రెట్టింపు డబ్బులు ఇస్తామని నమ్మబలికి మోసం చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటంతో నగరంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బంగారు వ్యాపారులు పెద్ద ఎత్తున మోసాలు చేసి, ప్రజలకు కుచ్చుటోపి పెట్టిన సంగతి మరవక ముందే నగరంలోని హవంబావికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి కోట్లాది రూపాయలు ప్రజల నుంచి చీటీలు కట్టించుకుని అదృశ్యమయ్యారు. దీంతో బాధితులు 10 రోజుల నుంచి ఆయన కనబడకపోవడంతో మంగళవారం బ్రూస్పేట పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన అనంతరం ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి వినతిపత్రం అందజేశారు. తమను నమ్మించి, మోసం చేసి చీటీలు కట్టించుకున్నారని, పెద్ద ఎత్తున నగదు కాజేసి ఐపీ పెట్టారని, వెంకటేశ్ను వెతికి పట్టుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భయాందోళనలో నగర వాసులు ప్రజలకు మోసం చేసి వెంకటేశ్ పరారీ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు -
లారీ నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ మృతి
హొసపేటె: తాలూకాలోని ధర్మసాగర శివార్ల సమీపంలో సోమవారం రాత్రి లారీ నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ మృతి చెందిన సంఘటన జరిగింది. మృతుడిని సంజయ్(40)గా గుర్తించారు. జిందాల్ నుంచి పుణె వైపు లారీ నడుపుతున్నాడని చెబుతున్నారు. ధర్మసాగర గ్రామంలోని జాతీయ రహదారి–67పై ఒక లారీ ఆగి ఉంది. నిన్నటి నుంచి ఆగి ఉన్న లారీని చూసిన స్థానికులు అనుమానం వచ్చి దర్యాప్తు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు వెంటనే గాదిగనూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాపు నిర్వహించి డ్రైవర్ మృతి చెందినట్లు నిర్ణయించారు. మృతుడు సంజయ్ పుణె నివాసి అని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. తరువాత సంజయ్ మృతదేహాన్ని హొసపేటె ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. 29 నుంచి ఎడెదొరెనాడు జిల్లా ఉత్సవాలు రాయచూరు రూరల్: జిల్లాలో ఈనెల 29 నుంచి 21 మూడు రోజుల పాటు జరగనున్న రాయచూరు జిల్లా ఎడెదొరె నాడు ఉత్సవాలకు ప్రతిఒక్కరూ సిద్ధం కావాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈసారి జిల్లా ఉత్సవాల్లో సాంస్కృతిక కళల ప్రదర్శనలకు సిద్ధం కావాలన్నారు. ఉత్సవాల్లో అందరూ చురుకుగా పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో ఏసీ హంపన్న, డీఎస్పీ శాంతవీర, తహసీల్దార్ సురేష్వర్మ, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, పవన్ పాటిల్, నాగేంద్రప్ప, చంద్రశేఖర్లున్నారు. సమాజ సేవకు పదవులు ముఖ్యం కాదురాయచూరు రూరల్: సమాజంలో విద్యా, రాజకీయ, సామాజిక, ధార్మిక సేవలకు పదవులు ముఖ్యం కాదని, మనస్సుకు మార్గముంటే ఏ సేవ చేయడానికై నా సిద్ధం కావాలని రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరక్టర్ రాజన్న పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని బసవ విద్యా నికేతన్ పాఠశాలలో స్వామి వివేకానంద జయంతిలో పాల్గొని మాట్లాడారు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా సమాజ సేవలందించిన మహోన్నత వ్యక్తి వివేకానంద చిరస్మరణీయుడన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. లలిత, బసనగౌడ, రావుత్రావ్, ఆంథోని, శారదలున్నారు. కాల్పుల ఘటనపై దర్యాప్తు షురూ సాక్షి,బళ్లారి: ఈనెల 1న ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి స్వగృహం వద్ద జరిగిన రగడ, కాల్పుల నేపథ్యంలో సతీష్రెడ్డి గన్మెన్ గురుచరణ్ సింగ్ జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసుల విచారణలో తేలిన నేపథ్యంలో ఈ కేసును సీఐడీ దర్యాప్తునకు అప్పగించారు. మూడు రోజుల క్రితం సీఐడీ ఎస్పీ హర్ష బళ్లారికి వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మంగళవారం సీఐడీ ఏడీజీపీ బీ.కే.సింగ్ బళ్లారికి విచ్చేసి సంబంధిత పోలీసు అధికారులతో వివరాలు సేకరించారు. సీఐడీ ఎస్పీ హర్ష బ్రూస్పేట పోలీసు అధికారులతో మాట్లాడి కేసు వివరాలను తెలుసుకుని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. శుభ్రతకు అందరూ సహకరించాలి రాయచూరు రూరల్: నగరంలోని ఆలయాల శుభ్రతకు అందరూ సహకరించాలని బిల్వ మందిరం అధ్యక్షురాలు విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం శ్రీకృష్ణ దేవరాయ కాలనీలో వెలసిన బిల్వ మందిరం శుభ్రతకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. పరిసరాలను సంరక్షించి సుందరంగా తీర్చిదిద్దడానికి ముందుకు రావాలన్నారు. ప్రజలు శుభ్రతపై మొగ్గు చూపాలని కోరారు. అనసూయ, లలిత, సువర్ణ, రవి శంకర్, రాజశేఖర్, అంబరీష్, వెంకటేష్, శరణప్ప, సుమాలున్నారు. -
ప్రతిభావంతులను ప్రోత్సహించాలి
బళ్లారిటౌన్: మన దేశంలో ప్రతిభావంతులకు తగిన వేదిక, శిక్షణ లభించాల్సి ఉందని, అప్పుడే మన పరంపర మోస్తున్న సంస్కృతిపై కూడా యువతలో అవగాహన కలుగుతుందని గదగ్ విజయపుర రామకృష్ణ వివేకానంద ఆశ్రమం అధ్యక్షుడు స్వామి నిర్భయానంద సరస్వతి స్వామీజీ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని పత్రికా భవనంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చేపట్టిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మన దేశంలో నేటి విద్యా పద్ధతి ఫలితాలపైనే దృష్టి సారించింది కానీ వారి జీవితం విధానాలను నేర్పడం లేదన్నారు. సంఘం అధ్యక్షుడు వీరభద్రగౌడ తదితరులు పాల్గొన్నారు. -
హెల్మెట్ ధారణ.. ప్రాణాలకు రక్షణ
రాయచూరు రూరల్: ద్విచక్ర వాహనంలో సంచరించేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్పీ అరుణాంగ్షు గిరి సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయం వద్ద హెల్మెట్ జాగృతి జాతాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాల బారి నుంచి రక్షణ పొందడానికి హెల్మెట్ ధరించాలన్నారు. జాతాలో డీఎస్పీ శాంతవీర, అధికారులు సాబయ్య, ఉమేష్ కాంబ్లే, మంజునాథ్, వెంకటేష్, నరసమ్మ, మహేష్ పాటిల్, ఈరేష్ నాయక్, వివిధ శాఖల ఉద్యోగులు, ిసిబ్బంది పాల్గొన్నారు. కురుబలను అగౌరవ పరచొద్దురాయచూరు రూరల్: రాష్ట్రంలో కురుబ కులస్తులను అగౌరవ పరచడం తగదని కోడిమఠం స్వామీజీ డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ వెల్లడించారు. మంగళవారం దేవదుర్గ తాలూకా తింథిణి వంతెన వద్ద కాగినెలె కనక గురు పీఠంలో ఏర్పాటు చేసిన హాలుమత సాహిత్య ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. శివ పార్వతి పుత్రులు కురబలన్నారు. కురుబ సమాజం వారికి అధికారం లభిస్తే త్వరగా వదలరని వివరించారు. కురుబలను కుర్చీ నుంచి దింపడం కష్టమని తానే పదవిని వదులుకోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జల, అగ్ని ప్రళయాలు సంభవించి మిలియన్ స్థాయిలో మరణాలు సంభవిస్తాయన్నారు. 2025 కంటే 2026లో పది రెట్ల మేర అపాయం ఉందన్నారు. దేశంలో ఇద్దరు పెద్ద నాయకులు మరణిస్తారన్నారు. కార్యక్రమంలో నిరంజనానంద, సిద్దరామానంద, నికేత రాజ్, చంద్రశేఖర్, హళ్లికేరి, చంద్రకాంత్, గుండప్ప, రేవణ్ణ, మంజునాథ్లున్నారు. మహనీయుల ఆదర్శాలు అనుసరణీయం రాయచూరు రూరల్ : ప్రతి ఒక్కరూ మహనీయుల ఆదర్శాలను అనుసరించాలని కన్నడ సాహిత్య పరిషత్ కార్యదర్శి దండెప్ప బిరాదార్ అన్నారు. మంగళవారం తాలూకాలోని ఉడుమగల్ ఖానాపూర్ ప్రాథమిక పాఠశాలలో స్వామి వివేకానంద జయంతిని ఆచరించి మాట్లాడారు. శరణుల తత్వాలను జీవితంలో అలవరచుకోవాలన్నారు. సమాజంలో నలుగురికి ఉపయోగ పడేలా బాటలు వేసుకోవాలన్నారు. సరస్వతి, శివలీల, పాండురంగ, వీరేష్, నీలకంఠ, వీణ, గీతాలున్నారు. మంటల్లో అడవి బుగ్గి హొసపేటె: నగర శివార్లలో జాతీయ రహదారి– 50కి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం మంటలు చెలరేగి విస్తృతంగా వ్యాపించాయి. వ్యాసనకెరె సమీపంలోని కొండకు కొంత మంది దుండగులు నిప్పంటించిన ప్రభావం మొదట్లో తక్కువగా ఉంది. తరువాత మంటలు కొండ అంతటా వ్యాపించాయి. హైవోల్టేజ్ విద్యుత్ లైన్ స్తంభాలు అదే ప్రాంతం గుండా వెళ్లాయి. పవన విద్యుత్ ఫ్యాన్లు కూడా పని చేస్తున్నాయి. అటవీ శాఖ సిబ్బంది సందర్శించి మంటలను ఆర్పే పనుల్లో నిమగ్నులయ్యారు. మోసకారి వ్యక్తిని అరెస్ట్ చేయాలిరాయచూరు రూరల్: నగర, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు, విద్యార్థులను మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని సమాజ సేవకుడు గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం హెచ్ఐఎస్ అకాడమీ నాగరాజ్ అనే వ్యక్తి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తమ మార్కులు పొందడానికి ప్రశ్న పత్రాలు, స్కాలర్షిప్లు అందిస్తామని, రూ.2,500 చెల్లించాలని కోరారన్నారు. సంస్థ పేరిట నిరుద్యోగులకు ఉద్యోగాల ఎర వేసి లక్షల్లో నిధులు దిగమింగాడని, అలాంటి వ్యక్తి వ్యామోహంలో పడి వంచనకు గురి కాకుండా నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నేటి నుంచి మైలార ఉత్సవాలు రాయచూరు రూరల్: యాదగిరి జిల్లా మైలారలో వెలసిన, భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచిన మైలార లింగేశ్వరుడి ఉత్సవాలు బుధవారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్నాయి. కురబ, యాదవుల కులదైవం, బండారు(పసుపు)సమర్పణలో తలమునకులైన భక్తులు దేవుడిని ఊరేగిస్తారు. నాగ పూజలు జరిపి నాగోళి రోజున బహు పరాక్ అంటూ నినాదాలు చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. -
కృత్రిమ అవయవాలతో ఆత్మవిశ్వాసం
బళ్లారిఅర్బన్: కృత్రిమ చేతులు, కాళ్లు అమర్చుకోవడం ద్వారా దివ్యాంగులు జీవితంలో కొత్త ఆశను, ఆత్మ విశ్వాసాన్ని పొందగలరని శిరిడి సాయి సేవా సత్సంగ్ ట్రస్ట్ అధ్యక్షుడు గోపాలకృష్ణ తెలిపారు. మంగళవారం కనకదుర్గమ్మ దేవస్థానం సమీపంలోని మ్యాక్స్ షోరూం కింద శిరిడి సాయి సేవా సత్సంగ్ ట్రస్ట్, రాజు గాంధీ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృత్రిమ చేతులు, కాళ్లు అమర్చే శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రమాదాలు, తదితర కారణాలతో చేతులు లేదా కాళ్లు కోల్పోయిన వారు శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా తీవ్రంగా బాధ పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితిలో కృత్రిమ అవయవాలు అమర్చుకోవడం ద్వారా పూర్తిగా కాక పోయిన స్వావలంబనతో జీవితం సాగించే అవకాశం లభిస్తుందన్నారు. ముఖ్య అతిథులు పోలా రాధాకృష్ణ, ట్రస్ట్ ఉపాధ్యక్షుడు కేహెచ్ రమేష్, కార్యదర్శి నాగబాలాజీ, ఖజానాదారు కే.గోవిందరాజు, సంయుక్త కార్యదర్శులు కొండయ్య, ఎం.రమేష్, వాసు, రామచంద్ర, వెంకటేష్, ఆర్.రమేష్కుమార్తో పాటు ట్రస్ట్ సభ్యులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
రోడ్డు నియమాలపై జాగృతి అవసరం
బళ్లారిటౌన్: రోడ్ల నియమాలపై ప్రజలకు జాగృతి కల్పించాలని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా రోడ్డు సురక్షత సమితి సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. నగర శివార్లలో ఎక్కువగా వినియోగిస్తున్న సర్వీసు రోడ్లను మరమ్మతు చేయాలన్నారు. అత్యవసరంగా ఉన్న చోట పాడైన రోడ్లను గుర్తించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. పెద్ద పెద్ద గోతులు ఉన్న చోట ముందు జాగ్రత్తగా ప్రమాద సూచిక బోర్డులను అమర్చాలన్నారు. జిల్లా ఆస్పత్రి, పాఠశాల వద్ద వాహనాల వేగాన్ని తగ్గించే దిశలో వేగ నిరోధక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో అక్రమించిన పుట్పాత్లపై అంగళ్లను తొలగించి ప్రజలకు సంచరించేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఆటోలకు పార్కింగ్ సౌకర్యం ఉన్న చోట బోర్డులు పెట్టాలన్నారు. ఏఎస్పీ నవీన్ కుమార్, బుడా కమిషనర్ ఖలీల్ సాబ్, వివిధ స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
నాపై హత్యాయత్నం చేశారు
సాక్షి,బళ్లారి: మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ నేపథ్యంలో బ్యానర్ ఏర్పాటు చేసే విషయంలో తమను పథకం ప్రకారం అంతం చేయాలనే ఉద్దేశ్యంతో కాలు దువ్వి రగడ పెట్టుకుని, వారు తవ్వుకున్న గోతిలో వారే పడ్డారని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని మోకా రోడ్డులోని వాజ్పేయి లేఅవుట్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాడి చేసిన ఘటనపై ఈనెల 17వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం, ఆందోళన చేయనున్నట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం లేనందుకే అడ్డు చెప్పాం నిబంధనల ప్రకారం బ్యానర్ ఏర్పాటు చేసి ఉంటే తాము ఎందుకు అడ్డు చెప్పామన్నారు. రోడ్డుకు, ఇంటికి అడ్డంగా బ్యానర్ వేస్తుండటంతో పోలీసులకు చెప్పి తీయించామన్నారు. తనను, శ్రీరాములును అంతం చేయాలనే ఉద్దేశంతో కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనపై సీఐడీతో విచారణ చేస్తే ఎలాంటి న్యాయం దొరకదన్నారు. సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ చేయించాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని రాజకీయ పరిణామాలతో తాము విడిగా పోటీ చేయడంతో లాటరీ ఎమ్మెల్యేగా నారా భరత్రెడ్డి గెలిచారన్నారు. ఆ తర్వాత అభివృద్ధిని పక్కన పెట్టి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పార్టీ కార్యవర్గ సభ్యులు, పలువురు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే భరత్రెడ్డిపై గాలి జనార్దనరెడ్డి ఆరోపణ సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ -
పేదల సంజీవిని హులకోటి ఆస్పత్రి
సాక్షి,బళ్లారి: మానవ శరీరంలో ప్రధానంగా ప్రతి ఒక్కరికీ అవసరమైన కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు సరైన వైద్యం దొరకక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి కిడ్నీ సమస్యలు వస్తే కర్ణాటకలోని గదగ్ జిల్లా హులకోటిలో వెలసిన కే.హెచ్.పాటిల్ ఆస్పత్రి కిడ్నీ రోగులకు సంజీవినిగా మారింది. మూత్ర పిండాల మార్పిడిలో ఈ ఆస్పత్రి ఆరుదైన రికార్డు సృష్టించింది. దేశ వైద్య రంగంలో గదగ్ తాలూకా హులకోటి ఆస్పత్రి పరిశోధన కేంద్రం వైద్యులు సరికొత్త రికార్డు సృష్టించడమే కాకుండా సుదీర్ఘ, తీవ్ర వ్యాధులకు, అతి తక్కువ ధరలోనే చికిత్సలు అందించారు. రక్త గ్రూపులు మారినా కిడ్నీ మార్పిడి చేస్తున్న వైద్యులు తొలిసారి వైద్య రంగంలో వేర్వేరు రక్త నమూనాలు కలిగిన వ్యక్తులకు మూత్ర పిండాలు మార్చడం ద్వారా రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగానే తోటి ఆస్పత్రులకు స్పూర్తిగా నిలిచారు. గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి(మూత్రపిండాల మార్పిడి) విజయవంతం కావడం విశేషం. ఈ అరుదైన సాధనపై ఇంగ్లండ్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ కథనం ప్రకటించడం ద్వారా గదగ్ జిల్లా హులకోటి ఆస్పత్రి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే పేరు గడించింది. కేవలం పెద్ద నగరాలకే పరిమితమైన ఆస్పత్రుల్లో మాత్రమే ఇన్నేళ్లుగా సాధ్యపడుతున్న కిడ్నీ మార్పిడి చికిత్సలు గ్రామీణ పేద ప్రజలకు చేరాలన్న సంకల్పంతో హులకోటిలోని ఆస్పత్రి యువ వైద్యుల బృందం సాహసానికి ఒడిగట్టింది. ఏడాదిలో 12 కిడ్నీ ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి కిడ్నీ బాధితులకు కే.హెచ్.పాటిల్ ఆస్పత్రి ఆసరా మూత్రపిండాల మార్పిడిలో రికార్డు సృష్టించిన వైనం దేశంలోనే గ్రామీణ ప్రాంతంలో నెలకొన్న ఏకై క ఆస్పత్రి ఈ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 12 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసి సదరు కిడ్నీ బాధితులకు ప్రాణ భిక్ష పెట్టారు. వీటిలో 9 కేసుల్లో బంధువులే కిడ్నీలు దానం చేయగా, మిగిలిన రెండు కేసుల్లో బ్రెయిన్డెడ్ ద్వారా తీసుకున్న కిడ్నీలతో మార్పిడి చేశారు. ఆ మేరకు బ్రెయిన్డెడ్ ద్వారా తీసుకున్న కిడ్నీలను హుబ్లీకి తరలించి, అక్కడ నుంచి హులకోటి ఆస్పత్రికి తరలించి అవయవమార్పిడి చేసి, యువ వైద్యుల బృందం తమ కృషిని చాటుకున్నారు. ఈ కీలకమైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ప్రక్రియలో నిపుణులైన వైద్యులు డాక్టర్ అవినాష్ ఓదుగౌడ్రు, డాక్టర్ పవన్ కోళివాడ, డాక్టర్ ఎస్.ఆర్.నాగనూరు నేతృత్వంలో సమస్యను సవాల్గా స్వీకరించిన యువ వైద్యుల బృందం రోగి, కిడ్నీ దాతలవి వేర్వేరు రక్త గ్రూపులు అయినా కూడా విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేయడం గమనార్హం. -
ప్రభుత్వ పథకాల లబ్ధి పొందండి
హొసపేటె: జిల్లాలోని సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, సమాజంలో అత్యంత అణగారిన వ్యక్తి కూడా ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలని ఎంపీ ఈ.తుకారాం అన్నారు. నగరంలోని జిల్లా స్టేడియంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ, అలీన్కో ఆధ్వర్యంలో విజయనగర జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులు, వృద్ధులకు సహాయక పరికరాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. వైకల్యాన్ని శాపంగా భావించే బదులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని, విజయవంతమైన జీవితాన్ని గడపాలన్నారు. జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి, జెడ్పీ డిప్యూటీ సెక్రటరీ తిమ్మప్ప, మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.రూపేష్కుమార్, హుడా కమిటీ అధ్యక్షుడు వెంకటరమణ, వివిధ శాఖల, జిల్లా, తాలూకా స్థాయి అధికారులు, ఎన్నికై న సభ్యులు పాల్గొన్నారు. -
అధిక లాభాల ఆశ చూపి టోకరా
హొసపేటె: డబ్బు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికిన ఆన్లైన్ కేటుగాళ్లు లక్షలాది రూపాయలు మోసం చేసిన కేసు తాలూకాలోని టీబీ డ్యాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక కంపెనీలో సభ్యుడిగా చేరి డబ్బు పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని గతేడాది నవంబర్ 11న ఓ కంపెనీ నుంచి ఆరోగ్య దాస్ అనే వ్యక్తి వాట్సాప్ నెంబర్కు ఒక సందేశం వచ్చింది. మీరు కంపెనీలో సభ్యులుగా చేరి డబ్బు పెట్టుబడి పెడితే మీకు మంచి లాభాలు వస్తాయని అందులో ఉంది. దాంతో అతను ఆ కంపెనీలో చేరారు. అప్పుడు కంపెనీ సభ్యుడి ఐడీ నెంబర్ను వాట్సాప్లో పంపింది. అప్పుడు కంపెనీ తనకు దాదాపు 12 బ్యాంక్ ఖాతా నెంబర్లను పంపింది. ఆ మేరకు తాను ఆ ఖాతాల్లో దశలవారీగా డబ్బు పెట్టుబడి పెట్టానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. డిసెంబర్ 12న మీ ఖాతాలో రూ.1.50 కోట్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. కమీషన్ డబ్బు మీ ఖాతాకు జమ కావాలంటే పన్ను చెల్లించిన నాలుగు గంటల్లోపు మీ బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేస్తామని తనకు సందేశం వచ్చిందన్నారు. దాంతో తాను వెంటనే ఆర్టీజీఎస్ ద్వారా రూ.14 లక్షలు బదిలీ చేశానని తెలిపారు. తాను ఫోన్ పే, ఆర్టీజీఎస్ ద్వారా దశల వారీగా దాదాపు రూ.44.50 లక్షలు బదిలీ చేశానన్నారు. జనవరి 1న మళ్లీ రూ.3 లక్షలు మీ ఖాతాలో జమ చేస్తామని ఒక సందేశం వచ్చింది. తనకు అనుమానం వచ్చి ఆడిట్ కార్యాలయానికి వెళ్లి విచారించగా అది నకిలీ కంపెనీ అని తేలిందని తెలిపారు. ఘటనపై టీబీ డ్యాం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుల పట్టివేతకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. రూ.45 లక్షలు కాజేసిన ఆన్లైన్ కేటుగాళ్లు -
అడవి పేరుతో మమ్మల్ని వెళ్లగొట్టొద్దు
డీసీఎఫ్ కాజల్ పాటిల్కు వినతిపత్రం బన్నేరుఘట్ట జూపార్క్ వద్ద పలు గ్రామాలవాసుల ధర్నా బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలోని బన్నేరుఘట్ట జాతీయ అభయారణ్యం వివాదంలో చిక్కుకుంది. ఈ అభయారణ్యం పర్యావరణ సూక్ష్మ మండలాన్ని అశాసీ్త్రయంగా విస్తరిస్తున్నారని, దీనివల్ల బన్నేరుఘట్ట చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు వస్తాయని ప్రజలు భారీగా నిరసనకు దిగారు. హక్కిపిక్కి కాలనీ, బన్నేరుఘట్ట, రాగిహళ్లితో సహా చుట్టుపక్కల గ్రామాలవాసులు మంగళవారం బన్నేరుఘట్ట సర్కిల్లో బైఠాయించారు. ఇటీవల సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర హై–పవర్ కమిటీ సభ్యుడు చంద్రప్రకాష్ గోయల్ బన్నేరుఘట్టను సందర్శించినప్పుడు, అధికారులకు ఆయనకు అశాసీ్త్రయ సమాచారం ఇచ్చారని నిరసనకారులు ఆరోపించారు. ఈ అటవీ ప్రాంతంలో ఏనుగులు, జంతువులు– మానవ సంఘర్షణల డేటాను సరిగ్గా రూపొందించలేదన్నారు. సూక్ష్మ మండలం పరిధిపై నిర్ణయాలు తీసుకోవడానికి అటవీ శాఖ అధికారులు ఆఫీసుల్లో కాదు, ప్రజల మధ్య సమావేశాలు జరపాలన్నారు. సర్వం కోల్పోతాం సూక్ష్మ మండలాలను విస్తరిస్తే ఆయా గ్రామాల నుంచి ప్రజలను దూరంగా పంపిస్తారు, దీనివల్ల గూడు కోల్పోతామని వాపోయారు. అడవిలో నివసించే పేదల జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయన్నారు. ఈ ప్రాంతంలో ఇళ్ళు నిర్మించే వారికి రుణ సౌకర్యాలు లభించవు, వ్యాపారాలకు ఆస్కారం ఉండదన్నారు. తమ 20 వేల కుటుంబాల పునరావాసం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అందువల్ల, మునుపటి నియమాలనే పాటించాలని డిమాండ్ చేశారు. ధర్నా నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. రోడ్లను విస్తరించాలి బన్నేరుఘట్ట జూపార్కును ప్రతిరోజూ వేలాది మంది సందర్శిస్తారు, కానీ ఆ రోడ్డు ఇరుకుగా ఉంది, ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయాలని బన్నేరుఘట్ట్ట గ్రామ పంచాయతీ అధ్యక్షుడు మంజునాథ్ కోరారు. ప్రయాణం సాగక ఇటీవల ఒక గర్భిణీ రోడ్డుపై ప్రసవించిందని తెలిపారు. బన్నేరుఘట్ట వాసుల ఆందోళన జూపార్క్ ముందు బైఠాయింపు సమస్య లేకుండా చూస్తాం: డీసీఎఫ్ డీసిఎఫ్ కాజల్ పాటిల్, జూపార్క్ ఈడీ సూర్య సేన్ నిరసనకారులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తుది తీర్పు ఇంకా రాలేదు. సుప్రీంకోర్టు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాము. రైతులు, స్థానికులకు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని కాజల్ పాటిల్ అన్నారు. -
గజ దాడిలో మహిళ బలి
● హాసన్ జిల్లాలో దుర్ఘటన దొడ్డబళ్లాపురం: అడవి ఏనుగు దాడిలో మహిళ మరణించిన ఘటన హాసన్ జిల్లా మూగలి గ్రామంలో జరిగింది. గ్రామ నివాసి శోభ (40) మృతురాలు. వివరాలు.. శోభ కుటుంబానికి ఒకటిన్నర ఎకరాలో కాఫీ తోట ఉంది. మంగళవారం ఉదయం శోభ రోజులాగే కాఫీ తోటలో పనికి బయలుదేరింది. కాస్త దూరంలో ఆమె తల్లి రాజమ్మ వస్తోంది. ఇంతలో దారి మధ్యలో ఏనుగు వచ్చి శోభను కాళ్లతో తొక్కి చంపింది. రాజమ్మ పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. కుటుంబీకులు, ప్రజలు ఘటనాస్థలికి వచ్చి మృతదేహాన్ని తరలించారు. హంతక ఏనుగు సంచారంతో భయం నెలకొంది. కాగా, గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ ఈ ప్రాంతంలో కాఫీ తోటలో పని చేస్తున్న సుశీలమ్మ అనే మహిళతో పాటు వేర్వేరు రోజుల్లో మొత్తం నలుగురిని అడవి ఏనుగులు బలితీసుకున్నాయి. జనం అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు తెలిపారు. భార్యను వదిలి, ప్రియురాలితో టెక్కీ..యశవంతపుర: ప్రేమించి పెళ్లాడిన భార్యను మోసం చేసి ప్రియురాలితో గడుపుతున్న టెక్కీని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జెడ్రెలా జబ్, రెండేళ్ల నుంచి భార్యతో కలిసి నివసిస్తున్నాడు. భార్య ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగిని. భర్త ఖాళీగా ఉండడంతో అతనికి కూడా ఉద్యోగం ఇప్పించింది. ఆమె గర్భం దాల్చగా అబార్షన్ చేయించుకోవాలని సతాయించాడు. కూతురు పుట్టగా అప్పటి నుంచి వేధిస్తూ, కుల దూషణ చేస్తూ దూరంగా ఉంటున్నాడు. అతని వేధింపులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని జెడ్రెలా జబ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రియురాలి ఇంటిలో ఉండగా అతన్ని పట్టుకున్నారు. కబ్జాల తొలగింపు శివమొగ్గ: శివమొగ్గ మున్సిపల్ కార్పొరేషన్లోని 31వ వార్డు పరిధిలోని గోపిశెట్టికొప్పలోని కెహెచ్బి లే ఔట్లోని రోడ్డు స్థలం, ఖాళీ స్థలాన్ని కొందరు కబ్జా చేసి గోడలు కట్టారు. ఈ నేపథ్యంలో పాలికె అధికారులు కబ్జాలను తొలగించారు. 60 అడుగుల రోడ్డు, ఖాళీ స్థలం, మరికొంత స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించి కాంపౌండ్ ఏర్పాటు చేశాడని ఫిర్యాదులు వచ్చాయి. పోలీసుల బందోబస్తుతో ఆక్రమణలను పడగొట్టి కోట్లాది రూపాయల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు శరణప్ప, హరీష్ కె, అన్వర్ బాబు, పూజార్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక ఒలింపిక్ క్రీడలతో చరిత్ర సృష్టిస్తాం తుమకూరు: తుమకూరులో ఈనెల 16 నుంచి 22 వరకు జరగనున్న కర్ణాటక ఒలింపిక్ క్రీడలు చారిత్రాత్మక ఘట్టమని హోంమంత్రి పరమేశ్వర అన్నారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఏర్పాటు చేసిన కర్ణాటక క్రీడల పూర్వ ఉత్సవం, ఇండోర్ స్టేడియం నామఫలక ఆవిష్కరణ, స్టేడియం పునరుద్ధరణకు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కర్ణాటక ఒలింపిక్ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొంటారన్నారు. పోటీలను జనవరి 16న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభిస్తారన్నారు. 22న ముగింపు వేడుకలలో గవర్నర్ పాల్గొంటారన్నారు. క్రీడలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తుమకూరులో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేసి పోటీలను నిర్వహిస్తామన్నారు. క్రీడాకారులకు, అథ్లెట్లకు మరింత ప్రోత్సాహం ఇచ్చేలా బడ్జెట్లో పలు అంశాలను సీఎం సిద్దరామయ్య పొందుపరుస్తారన్నారు. -
ప్రైవేటు స్కూలు బస్సు పల్టీ
మాలూరు: డ్రైవర్ నియంత్రణ తప్పి పాఠశాల బస్సు రోడ్డు పక్కకు బోల్తాపడిన ఘటన మంగళవారం ఉదయం తాలూకాలోని అరుణఘట్ట గేట్ వద్ద జరిగింది. వివరాలు.. తాలూకాలోని కుడియనూరు గ్రామ సమీపంలో ఉన్న బోస్ ప్రైవేటు పాఠశాల బస్సు పల్లెల నుంచి విద్యార్థులతో వస్తోంది. ఘటనాస్థలిలో డ్రైవరు అలసత్వం వల్ల బోల్తా పడింది. 17 మందికి పైగా 4, 5 తరగతుల విద్యార్థులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కోలారు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. బస్సు వెనుకే కారులో వస్తున్న సురేంద్రరెడ్డి అనే వ్యక్తి పిల్లలను బస్సులో నుంచి బయటకు తీసుకొని కారులో మాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శ్రీనివాస్, మంజునాథ్, సంగీత చికిత్స చేశారు. విషయం తెలిసి తల్లిదండ్రులు పరుగు పరుగున వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు. 17 మంది బాలలకు గాయాలు మాలూరు వద్ద ప్రమాదం -
కాఫీ పంటకు నష్టం
బనశంకరి: చిక్కమగళూరు జిల్లాలో మంగళవారం రెండుగంటల పాటు భారీ వర్షం కురిసింది. జిల్లాలో కాఫీ తోటల్లో రైతులు కోతలు చేపడుతున్నారు. కొన్నిప్రాంతాల్లో కాఫీ గింజలను ఎండబెడుతున్నారు. ఆకస్మిక వర్షంతో ఈ పనులకు ఆటంకం ఏర్పడింది. నాలుగైదురోజులుగా మలెనాడు ప్రాంతంలో మేఘావృతం కావడంతో కాఫీ గింజలను ఎండబెట్టడం సవాల్గా మారింది. ఆరుబయట ఎండబెట్టిన గింజలు వాననీటిలో తేలియాడుతూ కొట్టుకుపోవడంతో రైతులు కంగారుపడ్డారు. కళస, కుదురెముఖ, మూడిగెరె, హొరనాడు, శృంగేరి, చిక్కమగళూరులో రాత్రి వరకూ వాన కురిసింది. వరి పంటకు ప్రమాదం నెలకొంది. -
కొత్త ఏడాది ఎన్నికల రణరంగంతో కోలాహలం కాబోతోంది. ఇప్పటివరకు నిలిపి ఉంచిన బెంగళూరులో 5 పాలికెలకు ఓట్ల జాతర జరగవచ్చు. దీంతో సిలికాన్ సిటీ రాజకీయ ప్రచారాలతో రచ్చ కానుంది. టికెట్ల కోసం పోరాటం, అభ్యర్థుల ప్రచారం మామూలుగా అయితే ఉండవు.
బెంగళూరుకు పాలికె ఎన్నికల జోష్శివాజీనగర: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిర్ధారించిన తేదీలోగా గ్రేటర్ బెంగళూరు ప్రాధికారలోని పాలికెలకు ఎన్నికలు జరుపుతాం, ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఆదేశాలు ఇస్తామని డిప్యూటీ సీఎం, బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి డీ.కే.శివకుమార్ తెలిపారు. జూన్ 30 లోగా బెంగళూరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరపాలని, మరీ మరీ గడువు కోరవద్దని సోమవారం సుప్రీంకోర్టు రూలింగ్ ఇవ్వడం తెలిసిందే. ఈ అంశంపై బెంగళూరు ప్యాలెస్ మైదానంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ప్రభుత్వం ఎన్నికల కోసం ఆదేశాలిస్తుందని తెలిపారు. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలు కూడా జరపాలి, రాజ్యాంగ నిబంధనల ప్రకారం అన్నీ జరిగిపోవాలని అన్నారు. సాంకేతిక అంశాలపై కొందరు అభ్యంతరాలు సమర్పిస్తున్నారు, వాటి పరిశీలనకు ఓ కమిటీ నియమించామన్నారు. ఎన్నికలు జరిపే బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్దని చెప్పారు. పాలికె వార్డుల రిజర్వేషన్లలో మహిళలకు తక్కువ కేటాయించారనే మాటలువచ్చాయి, తప్పు జరిగిఉంటే సరిచేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలకు మరింత సమయం కావాలని కోర్టును కోరుతారా అని అడిగిన ప్రశ్నకు, లేదు, ఎలాంటి గడువు కోరమని తెలిపారు. తాము చేస్తున్న పనికి ప్రజలు మద్దతు ఇస్తారనే విశ్వాసముంది, సిటీలో ఐదు పాలికెల్లోను గెలుపొందుతామన్నారు. బీజేపీ, జేడీఎస్ పొత్తు గురించి ప్రస్తావించగా, వారు ఏమైనా చేసుకోనీ, కలిసి పోటీ చేసినా, ఫ్రెండ్లీ ఫైట్ చేసినా సరే అని అన్నారు. మేము రెడీ: సీఎం గ్రేటర్ బెంగళూరు అథారిటీ(జీబీఏ)తో పాటు జెడ్పీ, టీపీ తదితర స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం సిద్దరామయ్య మైసూరులో చెప్పారు. బీజేపీ, జేడీఎస్లు పొత్తుతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. గాంధీ అంటే బీజేపీకి అలర్జీ: సీఎం మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి, జీ రామ్ జీ చట్టం రద్దు అయ్యేవరకు తమ పోరాటాన్ని కొనసాగించాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేగా బచావ్ సంగ్రామం త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. ఇది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే ఆందోళన. ఉత్తర భారతంలో రైతులు పోరాడినట్లుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ పేరు అంటేనే బీజేపీ నాయకులకు అలర్జీ అని విమర్శించారు. నోట్లపై చిత్రాన్నీ తీసేస్తారు: డీసీఎం బీజేపీవారు గతంలో గాంధీజీని హత్యచేశారు. నేడు ఆయన పేరును అంతం చేశారు, మునుముందు నోట్లపై ఉన్న గాంధీ చిత్రాన్ని తొలగిస్తారు అని డీసీఎం ఆరోపించారు. గాంధీ పేరెత్తే అర్హతను బీజేపీ కోల్పోయిందన్నారు. దీనిపై అన్ని తాలూకాల్లో పార్టీచే ధర్నాలు, పాదయాత్రల పోరాటం జరగాలని సూచించారు. శికారిపురలో తానే ఐదారు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానని తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన పనిని చేయాలి, ఇందులో ఎలాంటి దయా దాక్షిణ్యం లేదు. ఎవరు పనిచేయరో వారిని తొలగిస్తామన్నారు. త్వరలో జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. కన్నడనాట.. సర్! దేశవ్యాప్తంగా భారీ వివాదం సృష్టించిన ఓటర్ల జాబితా ప్రత్యేక పరిష్కారం (ఎస్ఐఆర్) రాష్ట్రంలో గ్రేటర్ బెంగళూరు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే జరగనుంది. ఇప్పటికే ప్రకటించిన ఓటర్ల జాబితాలోనూ సవరణలు జరగవచ్చు. కేంద్ర ఈసీ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఈసీ అధికారులు ఏర్పాట్లు ఆరంభించారు. రాష్ట్రంలో ఓటు చోరీ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కాబట్టి త్వరలోనే సర్ను చేపట్టవచ్చని భావిస్తున్నారు. గ్రేటర్ బెంగళూరు సహా జడ్పీలు, టీపీలకు ఎలక్షన్స్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలని సూచన నాలుగైదు నెలల్లో అన్ని స్థానిక ఎన్నికలురాబోయే నాలుగైదు నెలల్లో రాష్ట్రంలో అన్ని నగర, గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి, అందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని డీసీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. మంగళవారం ప్యాలెస్ మైదానంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. నరేగా బచావ్ సంగ్రామ్, ఓటర్ల జాబితాల బీఎల్ఏలకు జాగృతి, స్థానిక సమరానికి సన్నద్ధతపై చర్చించారు. సుప్రీం ఆదేశాల ప్రకారం జూన్లో గ్రేటర్ బెంగళూరులోని 5 పాలికెలకు ఎన్నికలు జరుగుతాయని డీసీఎం ప్రకటించారు. జెడ్పీ, తాలూకా పంచాయతీ, గ్రామ పంచాయతీలకు కూడా త్వరలోనే ఎన్నికలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 186 కాంగ్రెస్ కార్యాలయాలు నిర్మించాల్సి ఉందన్నారు. 22 మందికి పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు తమ సొంత సొమ్ముతో కార్యాలయాలను నిర్మించి ఇచ్చారని చెప్పారు. 122 భవనాల నిర్మాణం సాగుతోంది, అన్ని జిల్లా, తాలూకాల్లో పార్టీకి సొంత కార్యాలయ భవనాలను నిర్మించడమే ఆశయమని చెప్పారు. -
ప్రమాదమే కాపాడింది.. అసలేం జరిగిందంటే..
ధార్వాడ్: కర్ణాటకలోని ధార్వాడ్లో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ కలకలం రేపింది. బైక్ ప్రమాదానికి గురవ్వడంతో నిందితుడు పట్టుబడగా.. చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. ధార్వాడ్లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మూడో తరగతి చదువుతున్న తన్వీర్ దొడ్మని, లక్ష్మి కరియప్పనవర్ అనే ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు.విరామం తర్వాత పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. వారు కిడ్నాప్కు గురయ్యారని అనుమానించారు. దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఓ వ్యక్తి ఆ పిల్లలిద్దరినీ బైక్పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. నిందితుడిని కరీం మేస్త్రీగా గుర్తించారు.పిల్లలను తీసుకుని వెళ్తున్న క్రమంలో నిందితుడు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాద సమాచారం అందుకున్న దండేలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గాయపడిన వ్యక్తితో పాటు ఇద్దరు పిల్లలు ఉండటాన్ని గమనించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి.. తాను పిల్లలను "ఉలవి చెన్నబసవేశ్వర జాతరకు తీసుకువెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాడు. అయితే కిడ్నాప్ ఉద్దేశంతోనే వారిని తీసుకువెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారులను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన నిందితుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
కురయ్లో క్రూరుడు..
కురయ్ పీయూసీ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో తల్లితో కలిసి ఉంటున్నాడు. మొబైల్లో పోర్న్ వీడియోలకు బానిస అయ్యాడు. అతడు షర్మిల మీద కన్నేశాడు. ఇంటి పక్కనే ఉండడంతో అతడు ఆమెను పలకరించేవాడు, చిన్న పిల్లాడు అనే భావనతో ఆమె నవ్వుతూ మాట్లాడేది. ఆమె మీద మనసు పారేసుకున్న నిందితుడు.. ఆ రోజు రాత్రి 19:30 సమయంలో ఇంటిలోకి చొరబడ్డాడు. ఆమెతో అనుచితంగా ప్రవర్తించసాగాడు. కంగారుపడిన ఆమె అతడిని పక్కను తోసి కేకలు వేయసాగింది. కోపోద్రిక్తుడైన కురయ్ ఆమె మీద దాడిచేసి గొంతు పిసికి హత్య చేశాడు. సైన్స్ విద్యార్థి అయిన నిందితుడు.. మంటల్లో కాలిపోతే సాక్ష్యాలు ఉండవని భావించి తలదిండు, రగ్గులు, ఇతర వస్తువులను రూమ్లో వేసి నిప్పుపెట్టాడు. ఆమె మొబైల్ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడు. పోలీసులు ఆమె ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలు, ఫోన్ కాల్ రికార్డులను పరిశీలించగా ఎక్కడా క్లూ లభించలేదు. కానీ ఆమె ఫోన్లోని సిమ్ను తీసేసి కురయ్ తన సిమ్ను వేసుకుని ఆన్ చేసుకున్నాడు. తద్వారా జాడ లభించింది. 3 రోజుల పాటు విచారణ జరిపి ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మార్చిలో వర్కింగ్ జర్నలిస్టుల సమ్మేళనం
రాయచూరు రూరల్: 2026 మార్చి నెలలో బీదర్లో 40వ వర్కింగ్ జర్నలిస్టుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు శివానంద తగడూరు వెల్లడించారు. ఆదివారం బీదర్ జిల్లా పాత్రికేయుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీదర్ జిల్లాలోని పాత్రికేయులు ఐకమత్యంతో సమ్మేళనం విజయవంతానికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర నలు మూలల నుంచి వచ్చే ప్రతినిధులకు మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. సమావేశంలో బీదర్ జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు దేవప్ప, ఇతర సభ్యులున్నారు. అశ్లీల మెసేజ్లు, వరకట్న వేధింపులు ● వీడెక్కడి పోలీస్ భర్త అంటూ భార్య ఆవేదన హుబ్లీ: అశ్లీల మెసేజ్లు, వరకట్న వేధింపులకు గురి చేస్తున్న భర్తపై వీడెక్కడి పోలీస్ భర్త అంటూ భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్త అయిన పోలీస్ కానిస్టేబుల్పై తాను పని చేసే బీదర్లో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చర్యలు తీసుకోలేదు. సంతానం కాలేదని వరకట్నం తేవాలంటూ భర్త డిమాండ్ చేస్తున్నాడు. అంతేగాక ప్రాణాలు తీస్తానని కూడా బెదిరిస్తున్నాడని ఆమె పేర్కొంటూ తగిన రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. వరకట్నం తేక పోతే అక్క కుమార్తెను పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. గతంలో ఔరాద్ తాలూకాలో చింతాకి స్టేషన్లో కేసు నమోదైంది. తాజాగా బీదర్ మైకో లేఅవుట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్పందన లేదని, తనకు న్యాయం కల్పించాలని ఆమె పోలీసులకు ఫిర్యాదులో విన్నవించారు. కత్తిపోటుకు వ్యక్తి బలి తుమకూరు: తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా హుళియారు హోబ్లిలోని కెంకెరె గ్రామానికి చెందిన మంజునాథ్ను ఆదివారం రాత్రి దుండగులు కత్తులతో పొడిచి చంపారు. వివరాలు.. మంజునాథ్ షామియానా, అలంకరణ పనులతో పాటు కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బకాయప్ప గుడ్లు సమీపంలో కొత్తగా నిర్మించిన ‘రాయర మనె‘ ఇంట్లోకి ప్రవేశించిన ఐదుగురు వ్యక్తులు మంజునాథ్పై కత్తులతో దాడి చేశారు. గమనించిన స్థానికులు మంజునాథ్ను చికిత్స కోసం హుళియారు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. హుళియారు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
ఉగాండా డ్రగ్స్ వ్యాపారి అరెస్టు
బనశంకరి: మంగళూరు పోలీసులు సోమవారం ఉగాండాకు చెందిన మహిళా డ్రగ్స్పెడ్లర్ జలియా రుల్వాంగోను అరెస్ట్ చేశారు. రూ.4 కోట్ల విలువచేసే 4 కిలోల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్కుమార్రెడ్డి తెలిపారు. ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు. ఆమె బెంగళూరు జిగణి నుంచి మంగళూరులో వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ను సరఫరా చేసేది. ఇది తెలిసి బెంగళూరుకు వెళ్లి అరెస్ట్ చేశారు. మంగళూరులో 6 మంది ఎండీఎంఏ డ్రగ్స్ విక్రేతలను అరెస్టు చేసి విచారించినప్పుడు జలియా గురించి చెప్పారు. దీంతో జలియా అరెస్టు సాధ్యమైందని తెలిపారు. -
భక్తిమార్గంలో భగవత్ దర్శనం
రాయచూరు రూరల్ : భక్తి మార్గంలో భక్తులకు భగవంతుడిని చూపించిన మహాన్ వ్యక్తి గోపాల్దా్స్ అని శ్రుతి సాహిత్య సమ్మేళనం అధ్యక్షుడు మురళీధర్ కులకర్ణి పేర్కొన్నారు. ఆదివారం జవహర్ నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో గోపాల్దాస్ మధ్యారాధన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో భక్తి, ధర్మం, దానం అనే పదాలను గురించి సంకీర్తనల్లో ఆనాడే వివరించారని అన్నారు. రోడ్డు పనులకు భూమిపూజ బళ్లారిఅర్బన్: నగరంలోని 5వ వార్డు కాకర్లతోటలో రోడ్డు పనులకు సోమవారం సిటీ ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి భూమిపూజ చేశారు. పీడబ్ల్యూడీ ఆర్టీ ఇండెంట్ కింద సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో కాకర్లతోట– ముండరిగి– మించేరి వైపు వెళ్లే ఎండీఆర్ రోడ్డు పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు, మేయర్ పూజారి గాదెప్ప యాదవ్, ఏపీఎంసీ అధ్యక్షుడు నాగేంద్ర, 5వ వార్డు కార్పొరేటర్ రాజశేఖర్, కాకర్లకోట సూరి, కేసీ వెంకటేష్, హగరి గోవిందు, హొన్నప్ప, కాంట్రాక్టర్ హనుమన గౌడ, కాంగ్రెస్ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. వైభవంగా బసవలింగ రథోత్సవం రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా ఉటకనూరులో బసవలింగ దేశికేంద్ర జాతర, రథోత్సవాన్ని ఆదివారం సాయంత్రం వందలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. శాంతమల్ల శివాచార్య, సిద్దరామేశ్వర స్వామీజీ తదితరులు పాల్గొని రథోత్సవాన్ని ప్రారంభించారు. పుస్తక పఠనంతో సమసమాజ నిర్మాణంరాయచూరు రూరల్: సమసమాజ నిర్మాణానికి మానవుడు పుస్తకాలు చదవాలని, స్వార్థం విడనాడాలని సీనియర్ కవి రుద్రప్ప పేర్కొన్నారు. ఆదివారం కన్నడ భవనంలో కన్నడ సాహిత్య పరిషత్ కురిడి రాసిన బిసిలు బసద కుసుమ పుస్తకాన్ని విడుదల చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేడు ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదివినప్పుడే అందులో ఉన్న విషయాలు, ద్వేషం, కక్ష, అసూయల గురించి అవగతం అవుతుందన్నారు. సామాజిక, విద్యా, సంగీత రంగాలకు సేవలను పెంచాలన్నారు. కార్యక్రమంలో కసాప అధ్యక్షుడు విజయ రాజేంద్ర, వీర హనుమాన్, నాగప్ప, మహేంద్ర కుర్డి, వైశాలి, దేవేంద్రమ్మ, రేఖ, బాబు భండారీగళ్, దండెప్ప బిరాదార్, రావుత్ రావ్, ఖాన్ సాబ్ మోమిన్లున్నారు. కలబుర్గి జిల్లాలో సీఎం, డీసీఎం పర్యటన రాయచూరు రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ సోమవారం కలబుర్గి జిల్లాలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కలబుర్గి, సేడం, యడ్రామి, జేవర్గిలో రూ.867.49 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి భూమిపూజ చేశారు. యడ్రామిలో రూ.38.367 కోట్లు, సేడంలో రూ.110.35 కోట్లతో పనులను ప్రారంభించారు. కార్యక్రమాల్లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, శాసన సభ్యులు అజయ్ సింగ్, ఖనీజా ఫాతిమా, అల్లమప్రభు పాటిల్, తిప్పణ్ణ కమకనూరులున్నారు. గాయత్రి భవన్ నిర్మాణానికి నిధులివ్వండి రాయచూరు రూరల్: నగరంలో గాయత్రి భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని అఖిల కర్ణాటక బ్రాహ్మణ సమాజం సంచాలకుడు నరసింగరావ్ డిమాండ్ చేశారు. సోమవారం లోక్సభ సభ్యుడు కుమార్ నాయక్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. నగరంలోని సిద్దనాథ కాలనీలో విధాన పరిషత్ సభ్యుడి రూ.25 లక్షలతో భవన నిర్మాణాలు చేపట్టారన్నారు. పాత జిల్లా కావడంతో అన్ని వర్గాల ప్రజలకు తగ్గట్లు మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయించాలన్నారు. వెంకట కృష్ణన్, అరవింద్ కులకర్ణి, రమేష్ కులకర్ణి, అనిల్, శ్రీనివాస్, హనుమేష్, ప్రవీణ్, రామారావ్లున్నారు. -
నగర పరిశుభ్రతకు అందరూ సహకరించండి
రాయచూరు రూరల్ : నగర పరిశుభ్రతకు అందరూ సహకరించాలని లోక్సభ సభ్యుడు జీ.కుమార నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో నగరసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మారథాన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నగరంలో పరిశుభ్రతకు తోడు పర్యావరణ సంరక్షణ, నగర సుందరీకరణకు యువత నడుం బిగించాలన్నారు. మారథాన్ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగరం పెరుగుతున్న కొద్దీ ప్రజలు పరిశుభ్రతపై మొగ్గు చూపాలని కోరారు. ర్యాలీలో జిల్లాధికారి నితీష్, ఎస్పీ అరుణాంగ్షు గిరి, ఏడీసీ శివానంద, ఏసీ హంపణ్ణ, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, జయన్న, రవి, సురేంద్రబాబు తదితరులున్నారు. -
పక్కింటి కుర్రవాడే ప్రాణం తీశాడు
బనశంకరి/ కృష్ణరాజపురం: బెంగళూరులో ఈ నెల 3వ తేదీన అద్దె ఇంట్లో అగ్ని ప్రమాదంలో చనిపోయిన మహిళా టెక్కీది సాధారణ మరణం కాదు, హత్య అని తేలింది. ఆమె పక్కింటిలో ఉండే యువకుడే హంతకుడని నిర్ధారించారు. రామమూర్తినగరలో సుబ్రమణ్య లేఔట్లో మహిళా టెక్కీ షర్మిలా కేసు మలుపు తిరిగింది. వివరాలు.. మంగళూరుకు చెందిన షర్మిలా (34) ఏడాది క్రితం బెంగళూరుకు చేరుకుని యాక్సెంచర్ ఐటీ కంపెనీలో టెక్కీగా పని చేస్తోంది. ఆమె గదిలో ఈ నెల 3వ తేదీ రాత్రి మంటలు లేచాయి, తెల్లవారుజామున ఇంటి యజమాని రామమూర్తినగర పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వగా వారు వచ్చి మంటలను ఆర్పివేసి నిర్జీవంగా ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఫోన్ స్విచాన్ కావడంతో.. పోలీసులు ఇది అగ్నిప్రమాదమా, లేక అనుమానాస్పద ఘటన అని విచారణ చేపట్టారు. షర్మిల మొబైల్ఫోన్ కనిపించలేదు. ఆమె స్నేహితురాలు కూడా అనుమానాస్పదమంటూ ఫిర్యాదు చేసింది. షార్ట్ సర్క్యూట్ ఏదీ జరగలేదని, శరీరంపై రక్త గాయాలున్నాయని గుర్తించారు. మరోవైపు 3 రోజులు తరువాత ఆమె మొబైల్ ఆన్ అయింది. పోలీసులు మొబైల్ టవర్ లొకేషన్ను పరిశీలిస్తే షర్మిల ఇంటి పక్కన ఉండే ఇంటిని చూపించింది. దీంతో ఆ ఇంటిలో నివసించే కర్నాల్ కురయ్ (20) అనే యువకున్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.నిప్పు పెట్టడంతో కాలిపోయిన గది షర్మిల (ఫైల్) బెంగళూరులో మహిళా టెక్కీ అనుమానాస్పద మృతి కేసు.. ప్రమాదం కాదని నిర్ధారణ కోరిక తీర్చాలని దాడి చేసి, హత్య -
విద్యార్థులకు టెన్త్ కీలక ఘట్టం
మాలూరు: విద్యార్థులకు పదవ తరగతి ప్రముఖ ఘట్టమని, టెన్త్లో విద్యార్థుల జీవితానికి పునాది పడుతుందని, బాగా చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పోలీస్ ఇన్స్పెక్టర్ రామప్ప గుత్తేదార్ తెలిపారు. సోమవారం తాలూకాలోని లక్కూరు గ్రామంలో గడినాడు సాంస్కృతిక భవనం సభాంగణంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత కాలపు విద్యా విధానానికి నేటి విద్యా విధానానికి ఎంతో తేడా ఉంది. విద్యార్థులు నిర్ధిష్ట లక్ష్యాలు ఉంచుకుని చదివితేనే లక్ష్యం సాధించడం సాధ్యమవుతుందన్నారు. పదో తరగతిలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులైతేనే ఉన్నత విద్యను అభ్యసించగలరన్నారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము చేయకుండా బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఈ సమయంలో సోమరిగా ఉంటే భవిష్యత్తు మొత్తం కష్టపడాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ శృతి, కళాశాల ప్రిన్సిపాల్ శంకరప్ప, డిప్యూటీ తహసీల్దార్ అలీం ఉన్నీసా తదితరులు పాల్గొన్నారు. -
నవలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కలేనా?
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాంలో పూడిక చేరడంతో ఆ నీటిని నిల్వ చేసుకుని వాడుకునేందుకు వీలుగా నూతనంగా కొప్పళ జిల్లా గంగావతి తాలూకా నవలి వద్ద నిర్మించతలపెట్టిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కలేనా? అనే అనుమానాలు అధికమయ్యాయి. బీజేపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి యడియూరప్ప రూ.15 వేల కోట్లతో నవలి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతినిచ్చారు. అయితే ఇంతవరకు ఆ పథకం కార్యరూపం దాల్చక పోవడంతో ఇక ఆ పథకానికి గ్రహణం పట్టినట్లేనని రైతులు భావిస్తున్నారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్గేట్ల అమరిక పనులు చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నవలి జలాశయం నిర్మాణానికి తిలోదకాలిచ్చినట్లేనని అనుకుంటున్నారు. రూ.15 వేల కోట్ల వ్యయంతో చేపట్టడం కంటే డ్యాంకు క్రస్ట్గేట్లు ఏర్పాటు చేస్తే మరో 50 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అంశాన్ని గమనించిన సర్కార్ నవలి వద్ద నిర్మించే జలాశయానికి వేసిన పునాదులు పేరుకు మాత్రమేననే చర్చలు వినబడుతున్నాయి. కొప్పళ, రాయచూరు జిల్లాల రైతులకు నవలి వద్ద జలాశయం ఏర్పాటైతే ఆయకట్టు చివరి భూముల రైతులకు సక్రమంగా నీరందుతాయనే భావనకు ప్రభుత్వం తీరు గొడ్డలిపెట్టుగా మారింది. ఆ పథకం మరుగున పడితే తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూముల రైతుల ఆశలు అడియాసలు అయ్యే ప్రమాదం ఉంది. -
నాణ్యతగా భవనాన్ని నిర్మించండి
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలోని హొసపేటె రోడ్డులో రూ.46.06 లక్షలతో షెడ్యూల్డ్ కులాల ప్రీ–మెట్రిక్ బాలికల హాస్టల్ నిర్మాణ పనులకు సోమవారం కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్.శ్రీనివాస్ భూమి పూజను నెరవేర్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నుంచి గ్రాంట్ను తెచ్చామన్నారు. భవనాన్ని నాణ్యమైన రీతిలో నిర్మించాలని ఆయన కాంట్రాక్టర్లను ఆదేశించారు. హాస్టల్ విద్యార్థుల శ్రేయస్సు గురించి ఆరా తీసిన ఆయన నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యపై మరింత శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాలను పరిశీలించి వారి ఫిర్యాదులను ఆలకించారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జగదీశ్ దిండూర్, బీఈఓ మిలేషా బేవూరు, పార్టీ నేతలు టీజీ మల్లికార్జున గౌడ, కావలి శివప్ప నాయక్, స్టాండింగ్ కమిటీ మాజీ అధ్యక్షుడు సయ్యద్ షుకూర్, రాఘవేంద్ర, విభూతి ఈరన్న, మల్లన్న, సిద్దరామేష్, బొమ్మలాపుర బసవరాజ, కబేర, లంకేష్, హాలేష్, ఫక్కీరప్ప, విద్యార్థులు పాల్గొన్నారు. -
యువకుడు ఆత్మహత్య
కెలమంగలం: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నాడు. వివరాల మేరకు తాలూకా కేంద్రం డెంకణీకోట కిద్వాయ్ వీధికి చెందిన చిన్నరాజ్ కుమారుడు హేరామ్ (26) రెండు రోజుల క్రితం ఇంట్లో ఉన్నట్లుండి స్పృహ కోల్పోయి కిందపడ్డాడు. విషయం గమనించిన బంధువులు చికిత్స కోసం డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు పురుగుల మందు తాగాడని తెలిపారు. మెరుగైన చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స ఫలించక హేరామ్ ఆదివారం రాత్రి చనిపోయాడు. ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి హోసూరు: క్రిష్ణగిరిలోని ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థులతో సైబర్ క్రైం డీఎస్పీ నరసింహన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా ర్యాలీ జరిగింది. బైకిస్టులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, మద్యం సేవించి, సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని తెలిపారు. రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ప్రతి విద్యార్థి ప్రతిభావంతుడే
బళ్లారి రూరల్: ప్రతి మనిషిలో 8 జ్ఞానపీఠ అవార్డులు పొందే ప్రతిభ దాగి ఉంటుందని గదగ్ విజయపుర రామకృష్ణ ఆశ్రమం ప్రముఖుడు స్వామి నిర్భయానంద సరస్వతి తెలిపారు. సోమవారం బీఎంసీఆర్సీలోని బీసీ రాయ్ ఆడిటోరియంలో యూత్ డే సందర్భంగా వైద్య విద్యార్థులకు ఏర్పాటు చేసిన సంవాదన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి అంతర్గతంగా ప్రతిభావంతులే. ప్రతిభను గుర్తించి వెలుగులోకి తెస్తే ఉన్నతిని సాధించవచ్చని తెలిపారు. వైద్య విద్యార్థుల ఆత్మహత్యల గురించి విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చారు. తల్లిదండ్రులు చదువుల విషయంలో స్వేచ్ఛను ఇవ్వాలి. పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో బీఎంసీఆర్సీ డైరెక్టర్ డాక్టర్ గంగాధరగౌడ, డాక్టర్లు పాల్గొన్నారు. -
యువతకు వివేకానంద ఆదర్శప్రాయుడు
రాయచూరు రూరల్: నేటి సమాజంలో యువకులు వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని సోమవారపేటె మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య పేర్కొన్నారు. సోమవారం నగరంలోని వివేకానంద సర్కిల్లో వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి స్వామీజీ ప్రసంగించారు. నగరంలోని మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో రాయచూరు ఉత్సవాల సందర్భంగా జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా మారధాన్ పరుగును ప్రారంభించి మాట్లాడారు. ఉత్తమ సమాజ సేవలందించిన మహోన్నత వ్యక్తి వివేకానందని సేవలు మరపురానివన్నారు. కార్యక్రమంలో రాకేష్ రాజలబండి, సురేష్, బీకే దేశాయి, బిరాదార్లున్నారు. ప్రచారంతో చికాగో ప్రసంగం వెలుగులోకి హుబ్లీ: ఉత్తర కర్ణాటకలోని హుబ్లీ–ధార్వాడ జంట నగరాలు, వివిధ జిల్లాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంఘ సంస్థల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజనోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కుందగోళలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంశి కేఎల్ఈ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ అత్తిగేరి మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆదర్శాలను, స్పూర్తిదాయక ప్రసంగాలను యువత అలవరుచుకోవాలన్నారు. డీసీ, ఏసీ, జెడ్పీ, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు సంఘ సంస్థల ఆధ్వర్యంలో కూడా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన ఆదర్శాలను తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం జనవరి 12ను యువజన దినోత్సవంగా ప్రకటించిందన్నారు. కొప్పళ జిల్లా కేంద్రంలో జిల్లాధికారి, జెడ్పీ సీఈఓ, ఎంపీ రాజశేఖర్ హిట్నాళ్, ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాళ్, ఇతర సంఘం సంస్థల ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ యువత సరికొత్త నైపుణ్యాలను ముఖ్యంగా కృత్రిమ మేధను అంది పుచ్చుకొని ప్రపంచ విజ్ఞాన రంగంలో భారతీయ యువత తమదైన శైలిలో రాణించాలన్నారు. గంగావతిలోని ఓ ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో యజమాన్యం వివేకానంద జయంతి వేడుకల వేళ చిన్నారులకు వివేకానంద చరిత్రపై పిల్లలకు అవగాహన కల్పించారు. -
రూ.460 కోట్లతో చెరువుల సంరక్షణ
రాయచూరు రూరల్: జిల్లాలో రూ.460 కోట్లతో 23 చెరువుల సంరక్షణకు తోడు పురాతన కాలం నాటి చెరువుల జీర్ణోద్ధరణకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడించారు. జిల్లాలోని లింగసూగూరు, మస్కి తాలూకాల్లో చెరువుల సంరక్షణకు వీలుగా నారాయణపుర క్యాంప్ వద్ద వెయ్యి ఎకరాల భూమికి సాగునీటిని అందించే ఎత్తిపోతల పథకానికి ఆయన శ్రీకారం చుట్టి మాట్లాడారు. నగరాలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పైపులైన్లను ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు మహర్దశ కల్పించడానికి బడ్జెట్లో నిధులు కేటాయించారన్నారు. భూగర్భ జలాల వృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. మస్కి ఎమ్మెల్యే బసనగౌడ తుర్విహాళ, శాంతప్ప, మల్లికార్జున, శివకుమార్, వెంకటరెడ్డి, మంజునాథ్, రుద్రప్ప అంగడి, శివమూర్తి, అమరేగౌడ, అధికారులు బసన గౌడ, కిరిలింగప్పలున్నారు. -
మహనీయుల జయంతుల ఆచరణకు పిలుపు
కేజీఎఫ్ : మహనీయుల జయంతులను వైభవంగా ఆచరించాలని ఎమ్మెల్యే రూపా శశిధర్ తెలిపారు. సోమవారం నగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన వేమన జయంతి, సవితా మహర్షి, అంబిగర చౌడయ్య జయంతి, రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలకు సంబంధించి జనవరి 26న ఉదయం 9 గంటలకు నగరసభ మైదానంలో కేజీఎఫ్ జిల్లా ఎస్పీతో ధ్వజారోహణం, అనంతరం కవాతు, గృహరక్షకదళ, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ కెడెట్లను ఆహ్వానించాలని సూచించారు. ధ్వజారోహణ వ్యవస్థ చేయడానికి పోలీస్ శాఖ, తహసీల్దార్, క్రీడాకారులు బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమాల సిద్ధతా సమితులను రచించి పూర్వ సిద్ధతా ఉపసమితుల సమావేశం నిర్వహించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్లాస్టిక్ జెండాల వాడకం పూర్తిగా నిషేధించి విద్యార్థులు ప్లాస్టిక్ జెండాలు తీసుకురాకుండా బీఈఓ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా సమావేశానికి తహసీల్దార్తో పాటు పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో మరోసారి సమావేశాన్ని నిర్వహించి చర్చించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. -
మళ్లీ కుర్చీ అలజడి
శివాజీనగర: సీఎం కుర్చీ మార్పు గురించి అవసరమైతే ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ను ఢిల్లీకి పిలిపించి మాట్లాడతామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. సోమవారం బెంగళూరు సదాశివనగరలో నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన గతంలో అసలు సీఎం మార్పు వివాదం హైకమాండ్ సృష్టించినది కాదు, రాష్ట్ర నాయకులే గొడవ చేసుకొన్నారు. వారే పరిష్కరించుకోవాలని చెప్పడం తెలిసిందే. దీంతో డిప్యూటీ సీఎం వర్గం నిరాశకు గురైంది. అధిష్టానం కలగజేసుకుంటే తమకు ప్రయోజనమని డీకే వర్గం ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి పిలుస్తామని ఖర్గే చెప్పడం గమనార్హం. అనూహ్యంగా భేటీ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మల్లికార్జున ఖర్గేతో మంతనాలు జరపడంతో సీఎం మార్పు అంశం మళ్లీ కాస్త వేడెక్కింది. సంక్రాంతి తరువాత రాష్ట్రంలో సంచలనం జరుగుతుందని, వేచి చూడండని డీకే సన్నిహితులు చెబుతున్న సందర్భంలో ఈ భేటీ జరిగింది. గత నెలలో సీఎం సిద్దరామయ్య, డీసీఎంలు, వారి అనుచర మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా ఢిల్లీ యాత్రలు, పోటీ సమావేశాలు జరపడం, వాడీవేడిగా ప్రకటనలు చేయడం తెలిసిందే. కానీ అధిష్టానం ఏమీ తేల్చకపోవడంతో విషయం చప్పబడిపోయింది. డీకే శివకుమార్.. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఖర్గేతో సమావేశం జరపడం ప్రాధాన్యంగా మారింది. సుమారు ముప్పావు గంటకు పైగా మాట్లాడినట్లు తెలిసింది. ఏం మాట్లాడారు..? ఒప్పందం ప్రకారం తనకు ముఖ్యమంత్రి కుర్చీని విడిచిపెట్టాలని డీకే డిమాండ్ చేశారని తెలిసింది. కానీ తాను ఏమీ చేయలేనని ఖర్గే బదులిచ్చారని సమాచారం. రాహుల్గాంధీని కాదని వెళ్లలేనన్నారు. రాహుల్గాంధీ, సోనియాగాంధీ భేటీకై నా సమయం ఇప్పించాలని డీకే విన్నవించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల గురించి ఈ నెల 16, 22న ఢిల్లీలో ముఖ్యమైన సమావేశాలు జరుగుతాయి, అందులో అవకాశం ఉంటుందని ఖర్గే భరోసా ఇచ్చారని తెలిసింది. కాంగ్రెస్ అసోం ఎన్నికల పరిశీలకునిగా డీకేను నియమించడం తెలిసిందే. దీంతో ఢిల్లీ సమావేశాలకు ఆయన వెళతారు. కాగా, డీకే, ఖర్గే ఒకే కారులో విమానాశ్రయానికి వెళ్లారు. కలబుర్గి జిల్లా యద్రామిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో వీరితో పాటు సీఎం సిద్దరామయ్య కూడా పాల్గొన్నారు. ఈ దఫా పోరాటాన్ని ఉధృతం చేయాలని డీకే నిశ్చయించినట్లు సమాచారం. రాహుల్గాంధీని ఎలాగైనా కలిసి పదవి కోసం ఒత్తిడి చేయాలని అనుకున్నారు. అసోం ఎన్నికల ఇన్చార్జిగా ప్రియాంకగాంధీ ఉండడంతో ఆమెతోనూ మాట్లాడి నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. సీఎం, డీసీఎంలను ఢిల్లీకి పిలిపిస్తాం: ఖర్గే ఖర్గేతో శివకుమార్ సుదీర్ఘ మంతనాలు పార్టీ పెద్దల అపాయింట్మెంట్కు వినతి -
మనోవాంఛల్ని తీర్చే హెబ్బెట్ట బసప్ప
● స్వామివారికి సంక్రాంతి పూజలు మండ్య: ప్రకృతి సౌందర్యం మధ్య మండ్య జిల్లాలోని హలగూరు సమీపంలోని బసవనహళ్లి గ్రామంలోని కొండపై ఉన్న హెబ్బెట్ట బసవేశ్వరునికి వ్రతం చేస్తే భక్తులకు కోరిన కోర్కెలు నెరవేరుతాయి. సంతానం, వివాహం,కోర్టు కేసులు వంటి సమస్యలు తొలగిపోతాయని పూజారి బసప్ప అన్నారు. సోమవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ధనుర్మాసం మొదటి రోజు నుంచి ప్రతిరోజు ప్రత్యేక అర్చనలు చేపట్టినట్లు తెలిపారు. సంక్రాంతి పర్వదినాలు రావడంతో పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించి, పూజలు జరిపారు. సుమారు 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన హెబ్బెట్టలోని బసవేశ్వర స్వామి ఆలయం చోళుల కాలం నాటిది, చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఇలవేల్పు అని తెలిపారు. సంతానం లేనివారు, పెళ్లి కానివారు, ఇతరత్రా కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఇక్కడ స్వామివారికి జంతు బలి ఇచ్చి పూజలు చేస్తే ఇట్టే పరిష్కారం అవుతాయని అర్చకుడు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏదైనా వేడుకలు లేదా జాతరలు చేయదలిస్తే మొదట హెబ్బెట్ట బసప్పను పూజించి ముందుకు సాగడం అనాది కాలం నుంచి వస్తున్న ఆచారమని చెప్పారు.సైబర్ వలలో పడకండి మైసూరు: ప్రజల భద్రత కోసం నగరంలోని వివిధ ప్రాంతాలలో చాముండి మహిళా సురక్ష పడే ద్వారా నేరాల నివారణపై జాగృతి నిర్వహించారు. పలు కూడళ్లలో మహిళా పోలీసులు మహిళలను కలిసి సైబర్ నేరాలను ఎలా నిరోధించాలో, ఆ నేరాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. చైన్ స్నాచింగ్లు జరగకుండా జాగృతి కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియమాలను పాటించడం గురించి వివరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే హెల్ప్లైన్ 1930 కు, ఇతర నేరాలు జరిగితే 112 నంబరుకు కాల్చేసి సహాయం పొందాలని తెలిపారు.మహిళలకు భద్రత కరువు మైసూరు: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేదని ఆరోపిస్తూ బిజెపి మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు సోమవారం రామస్వామి సర్కిల్లో ధర్నా చేశారు. ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హుబ్లీలో పోలీసులు ఓ మహిళను వివస్త్రగా ఠాణాకు తీసుకెళ్లారని ఆరోపించారు. ఎమ్మెల్యే టి.ఎస్. శ్రీవత్స మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మహిళల హత్యలు, అత్యాచారాలు ఎక్కువైనట్లు ధ్వజమెత్తారు. హుబ్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు పట్టపగలు ఒక మహిళపై అత్యాచారం చేశారన్నారు. ఉత్సాహంగా సిరిధాన్య నడక బొమ్మనహళ్లి: బెంగళూరు బీటీఎం లేఔట్లోని కోరమంగళలో సంక్రాంతి వేడుకలను సోమవారం రవాణా మంత్రి రామలింగారెడ్డి ప్రారంభించారు. చెరకు గడలతో పాటు, నువ్వులు, బెల్లం – ఆనప మేళా ప్రారంభించారు. ఉదయమే సిరిధాన్యాల నడకలో వేలాదిమంది పాల్గొన్నారు. రామలింగా రెడ్డి మాట్లాడుతూ మన ఆరోగ్యానికి చిరు ధాన్యాల ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో స్టాళ్లు ఏర్పాటయ్యాయి. రైతులు నేరుగా తీసుకొని వచ్చి చెరకు, నువ్వులు, బెల్లంతో పాటు వివిధ వంటకాలను మహిళలు విక్రయించారు. -
దక్షిణ కాశీలో పర్యాటకుల సందడి
● హంపీకి భారీగా పోటెత్తిన సందర్శకులు ● స్మారకాల అందాలు వీక్షించి తన్మయత్వం హొసపేటె: సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో దక్షిణ కాశీ హంపీకి స్థానికులతో పాటు మహారాష్ట్ర, ఆంఽఽధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి ఇరుగు పొరుగు, వివిధ రాష్ట్రాల నుంచి విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హంపీకి వచ్చిన భక్తులు మొదట హంపీలోని విరుపాక్షేశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తరువాత వారు హంపీలో ఉన్న ఎదురు బసవన్న, సాసివెకాళు గణపతి, బడవిలింగ, భూగర్భ శివాలయం, కమల్ మహల్, మహానవమి దిబ్బ, రాణి స్నాన మందిరం, సప్త స్వర స్తంభాలు, విజయ విఠల దేవస్థానం, ఏకశిలా రథం, హజార రామ ఆలయం, ఎలిఫెంట్ హౌస్, యంత్రోద్ధారక గణపతితో పాటు వివిధ స్మారక చిహ్నాలను వీక్షించడం ద్వారా హంపీలోని స్మారకాల అందాలను ఆస్వాదించారు. -
షాకింగ్ ట్విస్ట్: కోరిక తీర్చలేదన్న కోపంతోనే..
ఇంటర్నెట్లో బూతు సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో ఓ టీనేజర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. చాలారోజులుగా ఆమెపై ఓ కన్నేసి ఉంచిన ఆ కామాంధుడు.. అదను చూసి ఆమెపై విరుచుకుపడ్డాడు. ప్రతిఘటించడంతో ఆ కోపంలో ఆమెను అత్యంత కిరాతకంగా చంపాడు. వారం కిందట ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిందని భావిస్తున్న టెక్కీ షర్మిల(36) కేసులో ఈ షాకింగ్ ట్విస్ట్ బయటపడింది.రామమూర్తి నగర్లోని సుబ్రమణి లే అవుట్లోని ఓ అపార్ట్మెంట్ ప్లాట్లో జనవరి 3న అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో షర్మిల(36) అనే యువతి చనిపోయింది. షార్ట్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని.. మంటలు చెలరేగడంతో ఊపిరాడకే ఆమె మరణించినట్లు తొలుత అంతా భావించారు. అయితే.. పోలీసులకు మాత్రం అనుమానం వచ్చింది. అందుకే బీఎన్ఎస్ (BNSS) సెక్షన్ 194(3)(iv) కింద అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే..ఆ ఎవిడెన్స్తో..దర్యాప్తులో భాగంగా సైంటిఫిక్ మెథడ్స్, టెక్నాలజీని ఉపయోగించి కీలక ఆధారాలు సేకరించారు. ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్లు లేవని.. ఆమె ఊపిరి ఆడకే చనిపోయిందని.. అయితే అది హత్యే అని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో ఆమె పక్కింట్లోనే ఉండే కర్నాల్ కురై(18) కదలికలపై నిఘా వేశారు. చివరకు.. అతనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు.ఆరోజు ఏం జరిగిందంటే.. కొడగు జిల్లా విరాజ్పేట్కు చెందిన కర్నాల్ తన తల్లితో కలిసి సుబ్రమణి లే అవుట్లోని సంకల్ప నిలయలో అద్దెకు ఉంటున్నాడు. ఇంటర్ చదివే ఈ కుర్రాడు.. నీలి చిత్రాలకు, సోషల్ మీడియాకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో పక్క ఇంట్లోనే ఉంటున్న షర్మిల, ఆమె రూమ్మేట్లపై కన్నేశాడు. తన తల్లి ద్వారా వాళ్లతో పరిచయం చేసుకునే ప్రయత్నాలు చేశాడు. దక్షిణ కన్నడకు చెందిన షర్మిలకు ఇంకా పెళ్లి కాలేదు. ఓ ప్రముఖ కంపెనీలో జాబ్ చేస్తూ కొలీగ్తో ఉంటోంది. ఆమె రూమ్మేట్ రెండు నెలల కిందట స్వస్థలం అసోంకి వెళ్లింది. దీంతో షర్మిల ఒక్కతే ఉంటుందని గుర్తించాడు.ఘటన జరిగిన రోజు రాత్రి.. స్లైడింగ్ కిటికీ(పక్కకు జరిగే కిటికీ) గుండా లోపలికి చొరబడ్డాడు కర్నాల్. తన కోరిక తీర్చాలని బతిమిలాడాడు. ఆమె తిరస్కరించడంతో బలాత్కారం చేయబోయాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అరుస్తుందేమోనన్న భయంతో.. నోరు, ముక్కు మూసి స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆ పెనుగులాటలో ఆమెకు గాయాలై.. తీవ్ర రక్తస్రావం అయ్యింది కూడా. ఆపై భయంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ షాక్ నుంచి తేరుకుని ఆమె బట్టలు, నేరానికి కారణమైన వస్తువులను బెడ్పై ఉంచి వాటికి నిప్పంటించి, ఆమె మొబైల్ ను తీసుకుని పారిపోయాడు. చేసిన నేరాన్ని కర్నాల్ ఒప్పుకోవడంతో అతనిపై బీఎన్ఎస్ 103(1), 64 (2), 66, 238 కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. -
నా భార్య నిత్య పెళ్లికూతురు
బెంగళూరు: బెంగళూరులో భార్యాభర్తల వివాదం రచ్చకెక్కింది. తనపై ఫిర్యాదు చేసిన భార్యే అసలు మోసగత్తె అని భర్త ఆరోపిస్తున్నాడు. వివరాలు.. తన భర్త ఇంట్లో తల్లిదండ్రులు ముందు నగ్నంగా తిరుగుతాడని, వీడియోలు చూపించి అలా లైంగిక క్రియకు ఒత్తిడి చేస్తాడని మేఘశ్రీ అనే యువతి కేంద్ర మహిళా పోలీస్స్టేషన్లో ఇటీవల ఫిర్యాదు చేసింది. విల్సన్గార్డెన్ పోలీస్స్టేషన్ పరిధిలో నివసించే వీరికి 3 నెలల కిందటే పెళ్లయింది. ఇప్పుడు భర్త మంజునాథ్ స్పందిస్తూ మేఘశ్రీ అబద్ధాలు చెబుతోందని, రూ.30 లక్షల నగదు, 50 గ్రాముల బంగారం కోసం తనను బ్లాక్మెయిల్ చేస్తోందని ఆరోపించాడు. ఆమె నిత్య పెళ్లికూతురని, గతంలో రెండు వివాహాలు చేసుకుందని, భర్తలపై పోలీసులకు ఫిర్యాదులు చేసి విడాకులు తీసుకుని, తనను పెళ్లాడిందని చెప్పాడు. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తూ, పరిచయమై వివాహం చేసుకున్నామని మంజునాథ్ తెలిపాడు. మేఘశ్రీ స్పందిస్తూ నేను మంజునాథ్ నుంచి రూపాయి కూడా తీసుకోలేదని, నాకు రెండు వివాహాలు జరిగిన మాట నిజమని చెప్పింది. భర్త లైంగికంగా తీవ్రంగా వేధిస్తున్నాడని ఆరోపించింది.సినీ నటి కేసులో మలుపు సాక్షి బెంగళూరు: నగరంలో ఓ శాండల్వుడ్ నటిని నిర్మాత అరవింద్ వెంకటేశ్ రెడ్డి లైంగికంగా వేధించాడని కేసు పెట్టగా అతనిని పోలీసులు విచారించారు. అయితే ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. తనను నటి మోసం చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు, ఇందుకు అవసరమైన వారిద్దరు కలిసి ఉన్న ప్రైవేటు ఫోటోను కూడా అందించినట్లు తెలిసింది. తాను ఆమెకు ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చినట్లు చెప్పాడు. -
డాక్టర్ కృతికారెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్!
బెంగళూరు: గతేడాది సంచలనం రేపిన మహిళా వైద్యురాలు డాక్టర్ కృతికా రెడ్డి (28) హత్యకేసులో ఊహించని మలుపు తిరిగింది. ప్రియురాలి కోసం భార్య కృతికాను హత్య చేసిన మహేంద్రరెడ్డికి, అదే ప్రియురాలు పోలీసుల ముందు వ్యతిరేకంగా మాట్లాడింది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కృతికారెడ్డి గతేడాది ఏప్రిల్ నెల 23న అనుమానాస్పదంగా మరణించారు. విచారణ చేపట్టిన పోలీసులు 2,322 పేజీల ఛార్జ్ షీట్ను నమోదు చేసి కోర్టుకు అందించారు. మారతహళ్లి పోలీసులు తీగలాగితే డొంకంత కదిలింది అన్న చందంగా కృతికారెడ్డి మరణించక ముందు ఏం జరిగిందో చెప్పాలంటూ డాక్టర్ మహేందర్రెడ్డి నుంచి వాగ్మూలం తీసుకున్నారు.ఆ వాంగ్మూలంలో ‘ఏప్రిల్ 23వ తేదీ రాత్రి నేను నా భార్యకు క్యాన్యులా (ఇంట్రావీనస్ పైపు) ద్వారా మందు ఇచ్చాను. మేము అర్ధరాత్రి నిద్రపోయాము. తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో నేను నిద్రలేచి క్యాన్యులాను తీసేశాను’అని డాక్టర్ మహేంద్ర రెడ్డి పేర్కొన్నారు. అంతే ఈ ఒక్క వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భర్తే హంతకుడు అని నిర్ధారించేందుకు మొత్తం ఐదు రకాల ఆధారాలు, కారణాల్ని గుర్తించారు.ఇందుకోసం 23 డాక్టర్లతో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులు,స్నేహితులు,సాక్షులు ఇలా 77 మంది నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వాటి ఆధారంగా 2,322 పేజీల ఛార్జ్ షీట్ను కోర్టుకు అందించారు. విచారణ చేపట్టిన కోర్టు ఛార్జ్ షీట్లో 77మంది స్టేట్మెంట్, సేకరించిన ఆధారాలు,కారణాలు ఆధారంగా భర్తే హంతకుడని న్యాయస్థానం తేల్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరుఫు న్యాయవాది ప్రసన్న కుమార్ కోర్టులో తన వాదనల్ని వినిపించారు.వైద్యురాలు హత్యకేసులో భర్తే ప్రధాన నిందితుడు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసును విచారించాం. విచారణలో భర్తే హంతకుడని తేలింది. అందుకు ఊతం ఇచ్చేలా ఐదు రకాల ఆధారాల్ని సైతం సేకరించాం. వాటిల్లో నిందితుడు పోలీసులకు ఇచ్చిన ‘ఏప్రిల్ 23వ తేదీ రాత్రి నేను నా భార్యకు క్యాన్యులా (ఇంట్రావీనస్ పైపు) ద్వారా మందు ఇచ్చాను. మేము అర్ధరాత్రి నిద్రపోయాము. తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో నేను నిద్రలేచి క్యాన్యులాను తీసేశాను’ స్టేట్మెంట్ కీలకంగా వ్యవహరించినట్లు చెప్పారు. నిందితుడు కృతికాతో ఆమె మరణానికి ముందు కొన్ని గంటలపాటు ఆమెతో ఉన్నాడని సాక్ష్యాలు నిర్ధారిస్తున్నాయి. వైద్య ఆధారాల ప్రకారం, కృతికా శరీరంలో ప్రొపోఫోల్ అనే శక్తివంతమైన అనస్థీషియా మందు ఆనవాళ్లు బయటపడ్డాయి. ముఖ్యంగా ఆమె కాళ్లలో కూడా ఈ ఆనవాళ్లు కనిపించడం, మందు బయట నుంచి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చినట్లు స్పష్టంగా చూపుతోంది. కృతికా మరణం తర్వాత నిందితుడు పోస్ట్మార్టం జరగకుండా తీవ్రంగా వ్యతిరేకించాడు. తన మామగారు, కుటుంబ సభ్యులను ఒత్తిడి చేసి అడ్డుకోవాలని ప్రయత్నించాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఒక వైద్యుడిగా ఆయనకు పోస్ట్మార్టం ద్వారా నిజమైన మరణ కారణం బయటపడుతుందని తెలుసు’అదనంగా, నిందితుడు స్వయంగా ప్రొపోఫోల్ మందును ఒక ఫార్మసిస్ట్ వద్ద కొనుగోలు చేసినట్లు ఎలక్ట్రానిక్ ఆధారాలు చూపుతున్నాయి. “తన మొబైల్ ఫోన్ ద్వారా, తన బ్యాంక్ ఖాతా ద్వారా ఆన్లైన్ చెల్లింపు చేశాడు. కృతికా మరణం అనంతరం, నిందితుడు ఒక మహిళా స్నేహితురాలికి పేమెంట్ యాప్ ద్వారా సందేశాలు పంపినట్లు కూడా ఆధారాలు చూపుతున్నాయి.‘ప్రియురాలి కోసమే తన భార్యను హత్య చేసినట్లు చెప్పుకొచ్చాడు. కానీ సదరు ప్రియురాలు మాత్రం ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టి పారేసింది. దీంతో ‘నేను ఎప్పటికీ హంతకుడిగానే ఉంటాను, నువ్వు సంతోషంగా జీవించు’ అని ప్రతిస్పందించాడు” అని ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఈ సందేశాలు నిందితుడి ఉద్దేశాన్ని, ప్రేరణను స్పష్టంగా చూపడమే కాకుండా, అతని నేరాన్ని ఒప్పుకున్నట్లుగా ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించారు. జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్రరెడ్డి (32), డాక్టర్ కృతికారెడ్డి (28) 2024 మే 26న పెద్దలు వైభవంగా పెళ్లి చేశారు. ఇద్దరూ మారతహళ్లిలో నివాసం ఉన్నారు. డాక్టర్ కృతికారెడ్డి బెంగళూరు ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో చర్మ రోగ నిపుణురాలుగా పనిచేసే వారు. అదే ఆసుపత్రిలో భర్త జనరల్ సర్జన్. కాగా, తన వివాహేతర సంబంధానికి డాక్టర్ కృతికారెడ్డి అడ్డుగా ఉందనే ఆమె భర్త డాక్టర్ మహేంద్రరెడ్డి దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలితో సాన్నిహిత్యం కోసమే భార్యను హత్య చేశాడు. ఆ సమయంలో కృతిక సోదరి డాక్టర్ నిఖిత మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరితో వివాహం కాక మునుపు నుంచే మరో వైద్యురాలితో మహేంద్రరెడ్డికి సంబంధం ఉందని ఆరోపించారు. వివామైన అనంతరమూ ఆ సంబంధాన్ని కొనసాగించాడని తప్పుబట్టారు. వివాహమైన రెండు నెలల నుంచే సొంతంగా ఆసుపత్రి పెట్టుకునేందుకు నగదు కావాలని ఒత్తిడి చేయడం, ఆ తర్వాత చికిత్స పేరిట ఎక్కువ మోతాదులో అనస్తీషియా డోసు ఇచ్చాడని ఆక్రోశించారు. ఆపై నేరం భయటపడుతుందనే ఉద్దేశ్యం తన అక్క భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నించినట్లు మండిపడింది. -
డీకే శివకుమార్ సీఎం అయ్యేది అప్పుడే?!
సాక్షి,బెంగళూరు: రాష్ట్రంలో సీఎం పదవి మార్పులపై వస్తున్న వదంతుల్ని గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ ఖండించారు. సీఎం సిద్దరామయ్య తరువాత డి కె శివకుమార్నే ముఖ్యమంత్రి అవుతారని, అయితే అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత జరుగుతుందని తెలిపారు. లక్ష్మీపురలో నూరాని మసీదు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నవంబర్ నెల తరువాత రాజకీయ విప్లవం వస్తుందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలలో వాస్తవం లేదన్నారు. తమ పార్టీలో ప్రతీది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 2028 వరకు సిద్దరామయ్యనే సీఎంగా కొనసాగుతారన్నారు. గతంలో కాంగ్రెసేతర ప్రభుత్వాల కంటే బాగా అభివృద్ధి పనులు చేశామని, వాటిని చెప్పుకుని ప్రజల ముందుకు వెళతామని తెలిపారు. ‘మేము ఎప్పటినుంచో చెబుతున్నాం. శివకుమార్ ముఖ్యమంత్రి కావాలి, కానీ సిద్దరామయ్య తర్వాత మాత్రమే. అదే మా డిమాండ్’. కాంగ్రెస్ అనేది శివకుమార్ రక్తంలో కాంగ్రెస్ ఉంది. మాలో చాలామంది వేరే పార్టీల నుంచి వచ్చాం. కానీ ఆయన రక్తంలో కాంగ్రెస్ ఉంది. రక్తాన్ని మార్చలేం’ అని అన్నారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నాయకత్వ మార్పు గురించి వస్తున్న వదంతులను ఖండిస్తూ జమీర్ స్పందించారు. ‘నవంబర్ విప్లవం, డిసెంబర్ విప్లవం, ఇప్పుడు జనవరి సంక్రాంతి అని చెప్పిన వారు అర్థం చేసుకోవాలి. ఏమీ జరగదు. హైకమాండ్ సిద్దరామయ్యతోనే ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు.మొత్తం మీద, కోలార్లో జమీర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలు,అధిష్టానం వద్ద సిద్దరామయ్య, శివకుమార్ నాయకత్వంపై స్పష్టత ఇచ్చినట్లైంది. -
రెండో పెళ్లి.. రూ.36 లక్షలతో భర్త జంప్
కర్ణాటక: విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడి, కూతురు పుట్టిన తరువాత రూ.36 లక్షల డబ్బుతో ఉడాయించిన ఘరానా భర్త ఉదంతమిది. బెంగళూరులో బనశంకరిపోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ యువతి భర్తకు అనారోగ్యం కారణంగా 2021లో విడాకులు తీసుకుని విడిగా ఉంటోంది. తరువాత మోసగాడు మోహన్రాజ్ పరిచయమై ప్రేమించింది, 2022లో వివాహం చేసుకున్నారు. తరువాతి ఏడాది వారికి కూతురు పుట్టింది. మోహన్రాజ్ను నమ్మిన ఆమె అడిగినంత డబ్బు ఇచ్చింది. కొత్తగా ఇల్లు కట్టిస్తానని చెప్పడంతో బంగారం కుదువ పెట్టి డబ్బులు ఇచ్చింది, ఇలా రూ.36 లక్షల వరకూ జేబులో వేసుకున్నాడు. గతేడాది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి జాడ లేదు. దీంతో కంగుతిన్న బాధితురాలు మోసపోయినట్లు గుర్తించింది. తనకు న్యాయం చేయాలని బనశంకరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
పిల్లలకు టాక్సిక్ టీజర్ చూపించవద్దు
ప్రముఖ నటుడు యశ్ నటించిన టాక్సిక్ సినిమా టీజర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. దీని ప్రసారం నిలిపివేయాలని, లేదా గైడ్లైన్స్ సమేతంగా టీజర్ ప్రసారం చేయాలని ఓ న్యాయవాది రాష్ట్ర సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. కేంద్ర సెన్సార్ బోర్డుకు కూడా లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆ లాయరు శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ టాక్సిక్ టీజర్లో బాలల చట్టాల ఉల్లంఘన జరిగింది. టీజర్లో అతి హింసాత్మకమైన దృశ్యాలు ఉన్నా కూడా గైడ్లైన్స్ లేవు. కాబట్టి దానిని చూసేముందు గైడ్లైన్స్ వేయాలి, దానిని బట్టి ప్రేక్షకులు చూడాలా, వద్దా అనేది నిర్ణయించుకుంటారు అని చెప్పారు. టాక్సిక్ సినిమాను కుటుంబ సమేతంగా చూడటానికి సాధ్యపడదని అన్నారు. పిల్లలతో కలసి కుటుంబంతో కలసి టీజర్ చూశామని అనేక మంది అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు. కుమారస్వామి వీడియో యశవంతపుర: టాక్సిక్ టీజర్ను ఆధారంగా కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి వీడియోను ఆయన అభిమానులు రూపొందించారు. టాక్సిక్ మ్యూజిక్ వస్తుండగా ఈ వీడియోలో మొదట సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్లు కనిపిస్తారు. 2028లో జరిగే ఎన్నికలపై వీరిద్దరూ మాట్లాడతారు. తరువాత కుమారస్వామి ఎంట్రీ ఇస్తారు. -
బంగ్లాదేశీయులకు ఇళ్లు ఇస్తే కఠిన చర్యలు
● హోం మంత్రి జి.పరమేశ్వర్శివాజీనగర: అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు నివసించేందుకు ఇళ్లు ఇచ్చిన యజమానులపై పోలీస్ శాఖ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి జి.పరమేశ్వర్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారత సరిహద్దులో బంగ్లా, ఇతర దేశపు నివాసులు అక్రమంగా చొరబడితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బీఎస్ఎఫ్తో పాటుగా అన్ని బలగాలను సరిహద్దులో నియమించి చొరబాటుదారులను అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. సరిహద్దులో సొమ్ము ఇచ్చి లోపలికి వచ్చామని కొందరు అక్రమ చొరబాటుదారులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. సొమ్ము ఇచ్చి లోపలికి వస్తున్నారంటే.. సరిహద్దుల్లో సరైన భద్రత లేదని అర్థమవుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ బంగ్లా చొరబాటుదారుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఇప్పటికే కొందరిని స్వాధీనంలోకి తీసుకుని సరిహద్దు దాటించామన్నారు. అక్రమ వలసదారులపై పోలీస్ స్టేషన్లలో రోజూ పరిశీలన జరుగుతోందని తెలిపారు. విదేశీయులు భారత్కు వచ్చిన తరువాత అధికారిక వీసా లేకపోతే అటువంటి వారికి నివసించేందుకు బాడుగ ఇల్లు ఇవ్వటం నేరమని పేర్కొన్నారు. ఇంటి యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఆకతాయి రైడర్ అరెస్టు బనశంకరి: డ్రాప్ సమయంలో మహిళను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన ర్యాపిడో బైక్ రైడర్ను అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాజీనగర మంజునాథ నగర నివాసి రోహిత్ (37) నిందితుడు. వివరాలు.. 7వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో నాగరబావి నుంచి హెబ్బాళ మాన్యతాటెక్ పార్కులో విధులకు వెళ్లడానికి మహిళ ర్యాపిడో బైక్ను బుక్చేసింది. మహిళ బైకులో కూర్చుంది, ఆమె బ్యాగును సీటు మీద ఉంచవద్దని రైడర్ కోరాడు. ఏకవచనంతో మాట్లాడుతూ మహిళను తాకాడు. కోపోద్రిక్తురాలైన మహిళ బైకును నిలిపింది, కానీ అతడు అసభ్యంగా ప్రవర్తిస్తూ, డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అతని ప్రవర్తనతో మనస్తాపం చెందిన మహిళ అన్నపూర్ణేశ్వరినగర ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు రైడర్ను అరెస్ట్చేసి బైక్ని సీజ్ చేశారు. ఈ శిశువు కన్నవారెవరో? శివమొగ్గ: ఎంతోమంది దంపతులు సంతానం లేక బాధపడుతుంటే, కొందరేమో పుట్టిన శిశువులను రోడ్లపై వదిలేస్తున్నారు. జిల్లాలో కొన్ని నెలల క్రితం రోడ్డు పక్కన లభించిన గుర్తు తెలియని నవజాత మగ శిశువు తల్లిదండ్రుల ఆచూకీ కనుగొనేందుకు సహాయపడాలని శిశు సంక్షేమ సమితి ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై శనివారంనాడు శిశువు చిత్రంతో పత్రికా ప్రకటన విడుదల చేసింది. భద్రావతి తాలూకా మల్లాపుర గ్రామ గేట్ వద్ద రోడ్డు పక్కన శిశువు లభించింది. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హొళెహొన్నూరు స్టేషన్ పోలీసులు శిశువును రక్షించి శిశు సంక్షేమ సమితి సంరక్షణలో ఉంచారు. తల్లిదండ్రులు, బంధువులు ఎవరైనా గానీ శివమొగ్గలోని ఆల్కోళలోని ప్రభుత్వ బాలమందిరంలో సంప్రదించాలని కోరారు. 2028 తరువాతే డీకే సీఎం: మంత్రి జమీర్ శ్రీనివాసపురం: రాష్ట్రంలో సీఎం సిద్దరామయ్య తరువాత డి కె శివకుమార్నే ముఖ్యమంత్రి అవుతారని, అయితే అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత జరుగుతుందని గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ అన్నారు. శనివారం తాలూకాలోని లక్ష్మీపురలో నూరాని మసీదు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నవంబర్ నెల తరువాత రాజకీయ విప్లవం వస్తుందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలలో వాస్తవం లేదన్నారు. తమ పార్టీలో ప్రతీది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 2028 వరకు సిద్దరామయ్యనే సీఎంగా కొనసాగుతారన్నారు. గతంలో కాంగ్రెసేతర ప్రభుత్వాల కంటే బాగా అభివృద్ధి పనులు చేశామని, వాటిని చెప్పుకుని ప్రజల ముందుకు వెళతామని అన్నారు. -
బళ్లారి అయ్యప్ప భక్తులకు గాయాలు
కొండ అంచుల్లో..వీకెండ్ కావడంతో శనివారం ప్రసిద్ధ బాదామిలోని గుహాలయాల కొండలను అధిరోహిస్తున్న సాహసికులు. ఓ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో యువతీ యువకులు ఈ ట్రెక్కింగ్లో పాల్గొన్నారు సేలం: కర్ణాటక రాష్ట్రం బళ్లారి ప్రాంతానికి చెందిన 15 మంది అయ్యప్ప భక్తులు మాల ధరించి శబరిమలకి వ్యాన్లో వెళ్లి వస్తూ తమిళనాడులో ప్రమాదానికి గురయ్యారు. శబరిమలకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుని సొంతూరికి తిరిగి వెళ్తున్నారు. శనివారం ఉదయం ఈరోడ్ జిల్లా ఆసనూర్ – పులింజూర్ మధ్య భక్తుల వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు గాయపడ్డారు. స్థానికులు, వాహనదారులు వారిని రక్షించి అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెన్సార్బోర్డుకు ఓ వకీలు ఫిర్యాదు -
పిల్లలకు టాక్సిక్ చూపించరాదు
శివాజీనగర: ప్రముఖ నటుడు యశ్ నటించిన టాక్సిక్ సినిమా టీజర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. దీని ప్రసారం నిలిపివేయాలని, లేదా గైడ్లైన్స్ సమేతంగా టీజర్ ప్రసారం చేయాలని ఓ న్యాయవాది రాష్ట్ర సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. కేంద్ర సెన్సార్ బోర్డుకు కూడా లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆ లాయరు శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ టాక్సిక్ టీజర్లో బాలల చట్టాల ఉల్లంఘన జరిగింది. టీజర్లో అతి హింసాత్మకమైన దృశ్యాలు ఉన్నా కూడా గైడ్లైన్స్ లేవు. కాబట్టి దానిని చూసేముందు గైడ్లైన్స్ వేయాలి, దానిని బట్టి ప్రేక్షకులు చూడాలా, వద్దా అనేది నిర్ణయించుకుంటారు అని చెప్పారు. టాక్సిక్ సినిమాను కుటుంబ సమేతంగా చూడటానికి సాధ్యపడదని అన్నారు. పిల్లలతో కలసి కుటుంబంతో కలసి టీజర్ చూశామని అనేక మంది అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు. కుమారస్వామి వీడియో యశవంతపుర: టాక్సిక్ టీజర్ను ఆధారంగా కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి వీడియోను ఆయన అభిమానులు రూపొందించారు. టాక్సిక్ మ్యూజిక్ వస్తుండగా ఈ వీడియోలో మొదట సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్లు కనిపిస్తారు. 2028లో జరిగే ఎన్నికలపై వీరిద్దరూ మాట్లాడతారు. తరువాత కుమారస్వామి ఎంట్రీ ఇస్తారు. -
అమ్మవారికి కూరగాయల అలంకారం
కోలారు: ధనుర్మాసం సందర్భంగా శనివారం ముళబాగిలు నగరంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు. వేకువజాము నుంచే భక్తులు దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. డ్రైవర్ మత్తు.. కారు చిత్తు బనశంకరి: మద్యం మత్తులో కారుడ్రైవరు అడ్డదిడ్డంగా నడిపి జనాల మీదకు దూసుకెళ్లాడు. ఈ ఘటన బెంగళూరు ఇందిరానగర 18 మెయిన్ రోడ్డులో చోటుచేసుకుంది. అక్కడే నిలబడిన యువకుడు, యువతులు ఇద్దరు బైకర్లు వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. హోటల్లో భోజనం చేసుకుని ఆరుమంది బయట నిలబడ్డారు. ఈ సమయంలో కారువేగంగా దూసుకువచ్చి డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డులోని హోటల్లోకి దూసుకెళ్లింది. యువకులు, యువతులు వెంటనే పక్కకు తప్పుకున్నారు. ఎదురుగా వస్తున్న ఇద్దరు బైకిస్టులు కూడా తప్పించుకున్నారు. సినిమా స్టైల్లో సంభవించిన ప్రమాదం అక్కడ సీసీ కెమెరాలలో నమోదైంది. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరచూ పుట్టింటికి.. భార్యను చంపి భర్త ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: తనను పట్టించుకోకుండా పదేపదే పుట్టింటికి వెళ్తోందని భార్యను హత్య చేసిన భర్త ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెళగావి జిల్లా బైలహొంగల తాలూకా తురుకర శీగిహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. శివప్ప సన్నబసప్ప (50) అనే వ్యక్తి తన భార్య యల్లవ్వ (46)ను హత్య చేసి తరువాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. యల్లవ్వ పదేపదే తన పుట్టింటికి వెళ్లి వస్తుండడంతో భర్త గొడవపడేవాడు. యల్లవ్వ తల్లి మంగళవారంనాడు చనిపోవడంతో పుట్టింటికి వెళ్లి వచ్చింది, శుక్రవారం మళ్లీ పుట్టింటికి బయలుదేరగా శివప్ప వద్దని అభ్యంతరం తెలిపాడు. దీంతో పోట్లాట మొదలైంది. ఆగ్రహం పట్టలేక కొడవలితో యల్లవ్వ మెడ నరికి హత్య చేసి, తరువాత తాను ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఉపాధి హామీలో అవినీతి.. అందుకే ప్రక్షాళన ● కేంద్రమంత్రి కుమారస్వామి, బీజేపీ నేతలు శివాజీనగర: ఇప్పటివరకు ఉన్న ఉపాధి హామీ పథకం స్వరూపాన్ని మార్చి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రాం జీ చట్టాన్ని బీజేపీ, జేడీఎస్ నాయకులు గట్టి సమర్థించారు. ఆ పథకంలో జరుగుతున్న అవినీతి, దుర్వినియోగాలను అరికట్టడం సాధ్యపడుతుందన్నారు. శనివారం బెంగళూరులో ఓ హోటల్లో కేంద్రమంత్రి హెచ్.డీ.కుమారస్వామి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. నరేగా పథకంలోని లోపాలను సరిచేసి కొత్తగా వీబీజీ రాం జీ చట్టం తీసుకువచ్చినట్లు చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వ పాలనలో నరేగా చట్టాన్ని అమలులోకి తెచ్చారు, ఇది ఎంతో దుర్వినియోగం అయ్యింది, బోగస్ బిల్లుల ద్వారా భారీగా అవినీతికి పాల్పడ్డారు. వీటిని అరికట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వరూపాన్ని మార్చి రాం జీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. దీని మీద చర్చకు సిద్ధమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సొమ్మును భరించాలనే అభ్యంతరం తీసుకొచ్చింది. కొత్త పథకం ద్వారా కూలీలకు ఏడాదికి 125 రోజులు పని దినాలు, రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా నిధులు లభిస్తాయన్నారు. -
రెండో పెళ్లి.. రూ.36 లక్షలతో భర్త జంప్
బనశంకరి: విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడి, కూతురు పుట్టిన తరువాత రూ.36 లక్షల డబ్బుతో ఉడాయించిన ఘరానా భర్త ఉదంతమిది. బెంగళూరులో బనశంకరిపోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ యువతి భర్తకు అనారోగ్యం కారణంగా 2021లో విడాకులు తీసుకుని విడిగా ఉంటోంది. తరువాత మోసగాడు మోహన్రాజ్ పరిచయమై ప్రేమించింది, 2022లో వివాహం చేసుకున్నారు. తరువాతి ఏడాది వారికి కూతురు పుట్టింది. మోహన్రాజ్ను నమ్మిన ఆమె అడిగినంత డబ్బు ఇచ్చింది. కొత్తగా ఇల్లు కట్టిస్తానని చెప్పడంతో బంగారం కుదువ పెట్టి డబ్బులు ఇచ్చింది, ఇలా రూ.36 లక్షల వరకూ జేబులో వేసుకున్నాడు. గతేడాది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి జాడ లేదు. దీంతో కంగుతిన్న బాధితురాలు మోసపోయినట్లు గుర్తించింది. తనకు న్యాయం చేయాలని బనశంకరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
షేర్ల పేరుతో రూ.కోటి సైబర్ లూటీ
బనశంకరి: డిజిటల్ అరెస్టులు అనేవి ఏవీ లేవు, సైబర్ మోసగాళ్ల వలలో పడవద్దు అని ఆర్బీఐ, పోలీస్శాఖ ఎంత జాగృతం చేసినప్పటికీ అమాయకులు వినిపించుకోవడం లేదు. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లల్లా చేసి భారీగా వంచనకు గురవుతున్నారు. అలాంటిదే ఈ సంఘటన. నిర్మల్ హెల్త్ ఆర్కిటెక్ట్ పేరుతో వాట్సాప్ గ్రూప్లోకి విశ్రాంత ఉద్యోగిని చేర్చుకుని రూ.1.01 కోట్లు కొట్టేశారు. బెంగళూరు తిప్పసంద్ర జీవనబీమానగర నివాసి హెచ్.శివప్రసాద్ (74) మోసపోయి తూర్పు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. వివరాలు.. ఇటీవల ఆయనకు కాల్ చేసిన ఓ యువతి విద్యా కపాడియా అని చెప్పుకుంది, షేరుమార్కెట్లో పెట్టుబడిపెడితే పెద్దమొత్తంలో లాభం వస్తుందని తెలిపింది. తరచూ వేర్వేరు నంబర్ల ద్వారా కాల్స్ చేస్తూ అతన్ని పలు వాట్సాప్ గ్రూపుల్లో చేర్పించింది. షేర్ ట్రేడర్స్ పేరుతో వృద్ధునికి మోసగాళ్లు కాల్స్ చేసి పెట్టుబడులగురించి చెప్పేవారు. 2025 నవంబరు 4 నుంచి డిసెంబరు 9 వరకు రూ.1,01,05,100 ను రెండు ఎస్బీఐ ఖాతాలు, మరో సహకార బ్యాంకు ఖాతా నుంచి దుండగుల ఖాతాలకు పంపించాడు. 10 అకౌంట్లకు జమ చేయడం గమనార్హం. కొన్నిరోజుల తరువాత అసలు, లాభం ఇవ్వాలని యువతిని అడిగాడు. కానీ మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆమె ఒత్తిడి చేసింది. మోసపోయానని తెలిసి అతడు సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. బెంగళూరులో రిటైర్డు ఉద్యోగికి టోకరా -
యువనిధి ప్లస్ ఉన్నా...
సాక్షి, బెంగళూరు: నిరుద్యోగ ఇంజనీరింగ్ పట్టభద్రుల సంఖ్య కర్ణాటకలో నానాటికీ పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం కన్నడనాట ఉద్యోగాలు లభించని ఇంజనీరింగ్ యువత సంఖ్య 43 వేల మందికి పైగా ఉన్నట్లు తెలిసింది. ఇంకా డిగ్రీ, డిప్లొమా చదువులు పూర్తి చేసినా ఉద్యోగాలు దొరకని వారు ప్రస్తుతం 3.79 లక్షల మందికి పైగా ఉన్నట్లు సమాచారం. వీరంతా రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ స్కీమ్ యువనిధికి నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 43,529 మంది వివిధ ఇంజనీరింగ్ కోర్సులు, 4,250 మంది టెక్నికల్ డిప్లొమా చేసిన వారు కాగా, మిగిలిన వారు ఇతరత్రా సాంకేతిక కోర్సులు చేసిన వారున్నారు. రాష్ట్ర నిరుద్యోగుల్లో 13 శాతం ఇంజనీరింగ్ చదివిన వారే ఉండడం గమనార్హం. అయితే వివిధ కారణాల వల్ల యువనిధికి దరఖాస్తు చేయని నిరుద్యోగుల సంఖ్య ఇంతకు రెట్టింపు ఉన్నా ఆశ్చర్యం లేదని సమాచారం. అవన్నీ చేరితే ఇంజనీరింగ్ నిరుద్యోగులు మరింత ఎక్కువమంది ఉండొచ్చని తెలుస్తోంది. భృతి మంజూరు యువనిధికి దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు 2025–26 ఏడాదిలో నిర్ణీత మొత్తం మేర ఆర్థిక సాయం లభించింది. దరఖాస్తు దారుల్లో ఇతర అంశాల్లో పీజీ చేసిన యువతీ యువకులు 27,843 మంది ఉండగా, ఇంజనీరింగ్లో పీజీ హోల్డర్లు 374 మంది ఉన్నారు. నైపుణ్యాలు కరువా? ప్రతి ఏటా కనిష్టంగా లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల నుంచి పట్టాలతో వస్తున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లు, వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా కొందరు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. అయితే చాలా మందికి ఆ చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించడం లేదు. నిర్ణీత ఉద్యోనికి అవసరమైన నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మంది యువతీ యువకులు వెనుకబడిపోతున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోఇంజనీరింగ్ కాలేజీల్లో నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయా కంపెనీలు చెబుతున్నాయి.బెంగళూరులో జాబ్ మేళాలో యువత రద్దీ (ఫైల్)రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇటీవల ధార్వాడలో ధర్నా కోర్సు చేసినా నిరుద్యోగమే రాష్ట్రంలో అలాంటివారు 43 వేల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మంత్రి శరణ ప్రకాశ పాటిల్ మాట్లాడుతూ ‘రాష్ట్ర యువతకు ఉద్యోగాలు లభించకపోవడానికి కారణం తగిన నైపుణ్యాలు లేకపోవడమే అని తెలిసింది. అందుకోసమే ప్రభుత్వం యువనిధి ప్లస్ అనే కార్యక్రమాన్ని రూపొందించింది’ అని చెప్పారు. ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేలా ఈ పథకం ఉందన్నారు. అయితే ఈ శిక్షణ తరగతులకు 90 శాతం మంది గైర్హాజరవుతున్నారని వాపోయారు. యువనిధికి 3.79 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే శిక్షణకు మాత్రం 27,843 మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో నైపుణ్య శిక్షణ కోసం కేటాయించిన రూ. 27 కోట్లను వినియోగించలేకపోయామని అన్నారు. -
జస్ట్ మిస్ భయ్యా.. అదృష్టం అంటే వీరిదే..
బెంగళూరు: కొన్ని సందర్భాల్లో నువ్వు లక్కీ ఫెలో రా.. అని అంటుంటాం కదా.. సరిగ్గా అలాగే ఓ బ్యాచ్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎందుకు అనుకుంటున్నారా?.. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను దాటుకుని వెళ్లి వారి వైపు దూసుకొచ్చింది. సెకన్ల వ్యవధిలో వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని ఇందిరానగర్లో డెరిక్ టోనీ(42) ఫుల్లుగా మద్యం సేవించి తన స్కోడా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. 18వ మెయిన్ రోడ్డు నుండి 100 అడుగుల రోడ్డు వైపు వెళ్తున్నాడు. ఇంతలో మద్యం మత్తులో కారుపై నియంత్రణ కోల్పోయి.. రోడ్డు వద్ద ఎడమ వైపునకు తిరగాల్సి ఉండగా నేరుగా డ్రైవ్ చేశాడు. దీంతో, అతి వేగంలో ఉన్న కారు ఒక్కసారిగా డివైడర్పై నుంచి సినిమా రేంజ్లో జంప్ చేసి అవతలి వైపునకు దూసుకెళ్లింది.ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, చివరకు అక్కడే ఉన్న ‘బార్బెక్యూ నేషన్’ రెస్టారెంట్ గోడను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ గోడ పూర్తిగా దెబ్బతినింది. ప్రమాదం శుక్రవారం రాత్రి 11:35 గంటల సమయంలో కొందరు వ్యక్తులు రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకుని బయట నిలబడి ఉన్నారు. వారిపై కారు దూసుకెళ్లినప్పటికీ సెకన్ల వ్యవధిలో అప్రమత్తమైన బ్యాచ్.. ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ భారీ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.ఇక, ఈ ఘటనలో కారు ఢీకొట్టిన బైక్ను నడుపుతున్న జాబిర్ అహ్మద్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జీవన్ భీమా నగర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి కారు నడిపిన డెరిక్ టోనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
ఉద్యోగం ఇవ్వలేదని భవన యజమాని అక్కసు
హుబ్లీ: స్వార్థం పరిమితి దాటిపోతోంది. తాజాగా తాను అంగన్వాడీ కేంద్రానికి బాడుగ ఇచ్చానని, అందువల్ల తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని పట్టుబట్టి ఆ ఉద్యోగానికి సహకరించలేదన్న కారణంగా సదరు అద్దె ఇంటి తలుపునకు తాళం వేసి విచిత్రంగా ప్రవర్తించిన యజమాని తీరు ఇది. వివరాలు.. ఈ ఘటన సాక్షాత్తు రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ సొంత జిల్లా బెళగావిలోని రాయబాగ తాలూకా నందికోరలి గ్రామంలోని వంజేరి తోట అంగన్వాడీ కేంద్రంలో జరిగింది. ఆ కేంద్రానికి గత నాలుగు రోజుల నుంచి బాబురావ్ వంజేరి అనే వ్యక్తి తాళం వేశారు. దీంతో అంగన్వాడీ చిన్నారులు అంగన్వాడీ బయట ఆవరణలో కూర్చొని చదువుకోవడంతో పాటు అక్కడే భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. హామీ మరిచి ఇతరులకు ఉద్యోగం సదరు కట్టడం నిర్మించి 22 ఏళ్లు దాటింది. 2000 సంవత్సరం నుంచే ఈ స్థలాన్ని ఇచ్చామని, స్థలాన్ని తీసుకున్న అధికారులు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారులు ఇచ్చిన ఆ మాటను మరచిపోయి తమ కుటుంబ సభ్యుడికి బదులుగా ఇతర వ్యక్తికి ఉద్యోగం కేటాయించారని ఆయన వివరించారు. అంగన్వాడీ కేంద్రం సహాయకురాలి పోస్టు ఖాళీ ఏర్పడటంతో అప్పట్లో జిల్లాధికారికి దరఖాస్తు చేశాం. అధికారులకు విన్నవిస్తే మీ కుటుంబ సభ్యులకు ఇస్తామని దరఖాస్తు వేసుకోమని సూచించారు. అధికారులు కూడా పరిశీలించి వెళ్లారు. సీడీపీఓ ఇక్కడికి వచ్చి చూస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఇటు వైపు తిరిగి చూడలేదన్నారు. ఉద్యోగం ఇస్తేనే తాళం తీస్తా తమ కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇస్తే తాళం తీస్తానని ఆ భవన యజమాని బాబూరావు మొండికేశారు. సదరు కేంద్రం అంగన్వాడీ టీచర్ మాలతీ మఠపతి మాట్లాడుతూ ఈ అంగన్వాడీలో యజమాని కుటుంబ సభ్యులకు సహాయకురాలి ఉద్యోగం కావాలి, ఆయన పొలంలోనే కేంద్రం ఉండటం వల్ల తాళం వేశారు. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లాలి. పిల్లలు గత నాలుగు రోజుల నుంచి బయటే ఉన్నారు. సూపర్వైజర్ వచ్చి పరిశీలించి వెళ్లారు. ఆమె తనను కార్యాలయానికి రావాలని సూచించడంతో తాను వెళ్లానని, రేపు వస్తానని ఆమె హామీ ఇచ్చారు. సాయంత్రం వరకు వేచి చూసినా ఆమె రాలేదని, ఉన్న స్థితిగతులను ఉన్నతాధికారులకు తెలియజేశానని అంగన్వాడీ కార్యకర్త వివరించారు. త్వరలో సమస్యకు పరిష్కారం రేపు వస్తామంటున్నారు. సీడీపీఓ అసలు రాలేదు. నేను ఓ మామూలు అంగన్వాడీ టీచర్ని, ఈ ఘటనపై ఇంతకన్నా ఎక్కువగా ఏమి చెప్పలేనన్నారు. ఈ విషయమై ఆ తాలూకా అధికారిణి భారతి ఫోన్లో స్పందించారు. గతంలోని అధికారులతో సదరు భవనం యజమానికి ఏం ఒప్పందం జరిగిందో తనకు తెలియదని, ఆయన విజ్ఞప్తిని రాతపూర్వకంగా ఇవ్వలేదు. గత 20 ఏళ్ల నుంచి కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం, తాళం తీయాలని విజ్ఞప్తి చేశామని, అయినా యజమాని స్పందించలేదని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చానని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని భారతి తెలిపారు. అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసిన వైనం విధి లేక ఆరు బయటే పిల్లల విద్యాభ్యాసం -
ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు ప్రారంభం
హుబ్లీ: హుబ్లీ నుంచి హైదరాబాద్, షోలాపూర్, శక్తినగరకు ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ డీసీ హెచ్.రామనగౌడర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల అనుకూలం కోసం ఈ మూడు నగరాలకు గోకుల్ రోడ్డు కేంద్ర బస్టాండ్ నుంచి బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి రోజూ హైదరాబాద్కు బస్సు సాయంత్రం 7 గంటలకు బయలుదేరి గదగ్, కొప్పళ, గంగావతి, సింధనూరు, రాయచూరు, మహబూబ్ నగర్ గుండా హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్టాండ్కు మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు చేరుతుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో అదే బస్సు అక్కడ నుంచి సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి హుబ్లీకి మరుసటి ఉదయం రోజు ఉదయం 6.30 గంటలకు చేరుతుందని తెలిపారు. ప్రమాద పరిహార బీమా, టోల్ ఫ్రీతో పాటు ప్రయాణ ధర హైదరాబాద్కు రూ.790, అలాగే రాయచూరుకు రూ.408గా టికెట్ ధర నిర్ణయించారు. అలాగే గోకుల్ రోడ్డు బస్టాండ్ నుంచి షోలాపూర్కు రాత్రి 8.30 గంటలకు బయలుదేరే బస్సు ధార్వాడ, సౌదత్తి, రామదుర్గ, లోకాపుర, ముధోళ, జమఖండి, విజయపుర మీదుగా మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చేరుతుందని తెలిపారు. తిరిగి అక్కడి నుంచి రాత్రి 8.30 గంటలకు బయలుదేరి హుబ్లీకి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు వచ్చే ఈ బస్సులో ప్రయాణ ధర రూ.491గా నిర్ణయించారు. అలాగే శక్తినగర్కు రాత్రి 10 గంటలకు బయలుదేరే బస్సు గదగ్, కొప్పళ, గంగావతి, సింధనూరు, రాయచూరు మీదుగా శక్తినగర్కు మరుసటి రోజు 5.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడ తిరిగి రాత్రి 8 గంటలకు బయలుదేరి హుబ్లీకి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. దీనికి కూడా ప్రమాద బీమా, టోల్ఫ్రీతో కలిపి రాయచూరుకు రూ.408 అలాగే శక్తినగర్కు రూ.441గా టికెట్ ధర నిర్ణయించారు. ఆన్లైన్, అడ్వాన్స్ బుకింగ్ ఏర్పాటు చేశారు. ఓ వ్యక్తి నాలుగు సీట్ల కన్నా ఎక్కువ రిజర్వు చేస్తే 5 శాతం రాయితీ, అలాగే వచ్చి పోయే ప్రయాణానికి ఒకేసారి కొంటే ప్రయాణ ధరలో 10 శాతం రాయితీ ఇస్తారని తెలిపారు. మొత్తానికి ప్రయాణీకుల రద్దీ, స్పందన చూసి ప్రముఖ స్థలాలకు ఇలాంటి మరిన్ని బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. -
కష్టాల సుడిలో మొక్కజొన్న రైతన్న
హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వాన్ని మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని ఎందుకు డిమాండ్ చేశామో, ఆందోళన ఎందుకు చేశామో తమకు అర్థం కావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నలను ప్రతి క్వింటాల్కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రూ.2400ల కనిష్ట ధర, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్వింటాల్కు రూ.600 ప్రోత్సాహధనం కోసం జిల్లాతో పాటు వివిధ చోట్ల ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఒక్కో రైతు నుంచి 100 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అయితే హావేరి జిల్లాధికారి కార్యాలయం ఎదుట సమస్యల సాధన కోసం ఆందోళన చేపట్టిన రైతుల సమస్యలపై తొలుత ప్రభుత్వం స్పందించలేదు. పోరాటం తీవ్రతరం కావడంతో ఆ మేరకు మొక్కజొన్నలకు క్వింటాల్కు రూ.2400ల మద్దతు ధర నిర్ణయించింది. 12 క్వింటాళ్ల మొక్కజొన్నను ప్రతి రైతు వద్ద నుంచి కొనుగోలు చేయాలని సూచించింది. అయినా రైతన్నలు మాత్రం తమ పోరాటానికి స్వస్తి పలకలేదు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని ఒక్కో రైతు నుంచి 20 క్వింటాళ్ల చొప్పున మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామని ప్రభుత్వంతో ప్రకటింపజేశారు. ప్రభుత్వ హామీతో ఆందోళన విరమణ అయినా కూడా రైతులు శాంతించక తమ ఆందోళన కొనసాగించారు. దీంతో ఎట్టకేలకు ప్రతి రైతు నుంచి 50 క్వింటాళ్ల మేర కొనుగోలుకు ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు తమ ఆందోళనను ఉపసంహరించుకున్నారు. ఇన్ని పోరాటాలు చేసి పట్టు సాధించినా కూడా తమకు ఎటువంటి లాభం కలగలేదని రైతులు అసంతృప్తి వెళ్లగక్కారు. రైతుల ఆందోళన కంటే ముందే మొక్కజొన్న క్వింటాల్కు రూ.1600 నుంచి రూ.1800 ధర ఉండేది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటనతో మొక్కజొన్నకు కొద్ది మేర డిమాండ్ పలికింది. వ్యాపారులు రూ.2000 వరకు క్వింటాల్కు చెల్లించారు. అయితే ప్రభుత్వం క్వింటాల్కు రూ.2400 ధర చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వ్యాపారులకు మొక్కజొన్న విక్రయించలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలుకు వీలుగా రైతుల పేర్ల నమోదుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతోటే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రతి రైతు నుంచి కేవలం 20 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసేలా పేర్లు నమోదు చేసుకున్నారు. హావేరి జిల్లా రైతన్నకు తప్పని నష్టాలు సర్కారుతో పోరాడినా ఫలితం అంతంతేరైతుల నుంచి మొక్కజొన్న శాంపిళ్లను సేకరించారు. అయితే సదరు శాంపిళ్ల ఫలితాలు వెల్లడించలేదు. ఫలితంగా రైతులు చకోర పక్షుల్లా పడిగాపులు కాస్తున్నారు. మరో వైపు హావేరి కేఎంఎఫ్ కార్యాలయ ఆవరణలో పేర్లు నమోదు చేసిన రైతులు ధార్వాడ, శికారిపురకు మొక్కజొన్న పంటను తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహన బాడుగలు చెల్లించి అక్కడికి తీసుకెళ్లిన రైతులకు వాటి విక్రయానికి వారాలు పట్టింది. దీంతో వాహనాలకు అద్దె, డ్రైవర్ల భత్యం తదితరాలతో రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చినా కూడా ఫలితం దక్కలేదు. పైగా మొక్కజొన్నకు తెగులు ఆశించింది. అలా కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లుగా ఖరీఫ్ ముగిసిన వెంటనే మొక్కజొన్న పంటను విక్రయించి ఉంటే తమకు ఈ పరిస్థితి దాపురించేది కాదని రాష్ట్రంలో అత్యధికంగా మొక్కజొన్నలు పండించే హావేరి జిల్లా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. -
జిల్లా ఎస్పీగా సుమన బాధ్యతల స్వీకారం
సాక్షి,బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద జరిగిన రగడ, కాల్పుల నేపథ్యంలో ఓ యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘర్షణను నివారించడంలో జిల్లా ఎస్పీ పవన్ నెజ్జూర్ నిర్లక్ష్యం వహించారనే కారణంలో ఆయన్ను ప్రభుత్వం ఏకంగా సస్పెండ్ చేయడంతో రాష్ట్రంలోని పోలీసు వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోను చర్చనీయాంశంగా మారింది. జనవరి 2వ తేదీ నుంచి బళ్లారి జిల్లాకు చిత్రదుర్గ జిల్లా ఎస్పీ రంజిత్కుమార్ బండారిని ఇన్ఛార్జిగా నియమించారు. వారం రోజులుగా రంజిత్కుమార్ జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణపై దృష్టి సారించారు. నూతన ఎస్పీగా నియమితులైన సుమన పన్నేకర్ గురువారం నగరంలోని ఎస్పీ కార్యాలయంలో రంజిత్ కుమార్ బండారి నుంచి బాధ్యతలు స్వీకరించడంతో ఆయన లాఠీని అందజేశారు. పోలీసు అధికారులతో కొత్త ఎస్పీ సమీక్ష అనంతరం ఆమె జిల్లాలోని పలువురు పోలీసు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో శాంతిభద్రతల పర్యవేక్షణపై చర్చించారు. నగరంలో గత వారం రోజుల నుంచి టెన్షన్ వాతావరణం ఉండటంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటానన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో రాజీ లేకుండా పని చేస్తానన్నారు. బ్యానర్ వివాదంలో ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, నారా భతర్రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ వివరాలను ఆమె సంబంధిత పోలీసు అధికారుల నుంచి తెలుసుకున్నారు. బళ్లారి డీఐజీగా పని చేసిన వర్తిక కటియార్ కూడా బదిలీ కావడంతో ఆమె స్థానంలో నియమితులైన డాక్టర్ ఎస్.పీ హర్షను కలుసుకుని చర్చించారు. డీఐజీ నేతృత్వంలో పలువురు పోలీసు అధికారులు కూడా గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద ఘర్షణ జరిగిన స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. మొదటి రోజునే విధినిర్వహణలో హడావుడి పవన్ నెజ్జూర్పై వేటు నేపథ్యంలో ముందు జాగ్రత్తలు -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
బళ్లారిఅర్బన్: బళ్లారి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గమ్మ గుడి అండర్ బ్రిడ్జిపై నడుచుకుంటూ పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన సుమారు 40 ఏళ్ల వయస్సుగల వ్యక్తిని రైలు ఢీకొనడంతో మరణించిన ఘటన గురువారం జరిగింది. వివరాలు.. ఉదయం బళ్లారి నుంచి గుంతకల్లు వైపునకు వెళుతున్న జోధ్పూర్– బెంగళూరు రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ నాగరాజ్, ఏఎస్ఐ శివమూర్తి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే రైలును అక్కడే నిలిపి వేశారు. రైలులో ఉన్న గార్డ్ పరిశీలించి మృతదేహాన్ని పట్టాల పైనుంచి పక్కకు మళ్లించారు. ఉదయం సుమారు 6.25 గంటల సమయంలో ఈ ఘటన జరగగా 7.30 గంటలకు మృతదేహాన్ని బీఎంసీఆర్సీ మార్చురీకి రైల్వే సిబ్బంది, పోలీసు బృందం అంబులెన్స్ సాయంతో తరలించారు. గంటకు పైగా మైసూరు, వారణాసి, చిక్కజాజూరుతో కలిపి మొత్తం మూడు రైళ్లను బళ్లారి స్టేషన్లోనే నిలిపి వేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడ్డారు. రెండు ట్రాక్ల మధ్యలో సేఫ్టీ ప్లాట్ఫాం వేసి ఉంటే ప్రాణాలతో బయట పడేవారని అక్కడి వాసులు తెలిపారు. ఈ ఘటనతో రైలు అక్కడే నిలిచిపోగా, బ్రిడ్జి కింద అండర్ గ్రౌండ్లో కూడా సుమారు గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. -
కర్మాగారాల కాలుష్యం అరికట్టండి
హొసపేటె: మరియమ్మనహళ్లి, హగరిబొమ్మనహళ్లి చుట్టు పక్కల ఉన్న కర్మాగారాల నుంచి వెలువడే దుమ్ముతో వేలాది ఎకరాల భూమి సాగుకు పనికి రాకుండా పోయిందని, జిల్లా యంత్రాంగం ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కర్ణాటక రైతు సంఘం, గ్రీన్ సేనె హుచ్చవనహళ్లి (మంజునాథ వర్గం) డిమాండ్ చేశాయి. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.పరశురామప్ప మాట్లాడుతూ మరియమ్మనహళ్లి సమీపంలోని బీఎంఎం, హగరిబొమ్మనహళ్లి సమీపంలోని ప్రగతి స్టీల్స్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే దుమ్ముతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. మరియమ్మనహళ్లి చుట్టు పక్కల ఉన్న హనుమనహళ్లి, వెంకటాపుర, వ్యాసనకెరెల వద్ద దాదాపు 980 ఎకరాల్లో పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా హగరిబొమ్మనహళ్లిలో కూడా ఇలాంటి సమస్య తలెత్తిందన్నారు. కర్మాగారాల నుంచి వెలువడే తీవ్రమైన దుమ్ము వేరుశెనగ, మొక్కజొన్న తదితర పంటలపై పేరుకు పోయి పంటలుదెబ్బ తింటున్నాయని తెలిపారు. దీంతో ఆ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. అయితే ఈ కర్మాగారాలు రైతుల గురించి అసలు పట్టించుకోనట్లు కనిపిస్తోందన్నారు. ఈ నష్టాన్ని పూడ్చడానికి ఎకరానికి రూ.2 వేల పరిహారం ఇవ్వాలి. విజయనగర జిల్లాలో సత్వరం చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించాలి. పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలి. లేకుంటే భారీ పోరాటం ప్రారంభిస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు బణకార్ బసవరాజ్, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, తాలూకా అధ్యక్షుడు షేకప్ప నాగప్ప, హెచ్.పరశురామ, సీ.నాగరాజ్ పాల్గొన్నారు. కాలుష్య కారక పరిశ్రమలు వద్దు రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో బల్డోటా, టాటా ఇస్పాత్ తదితర ప్రైవేట్ కంపెనీలు, నూతన పరిశ్రమల స్థాపనకు చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని కొప్పళ జిల్లా రైతులు డిమాండ్ చేశారు. గురువారం నగరసభ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళననుద్దేశించి ఆందోళనకారుడు బసవప్రభు బెట్టదూరు మాట్లాడారు. దక్షిణ కర్ణాటకలో నెలకొల్పాల్సిన పరిశ్రమలను రైతులు అడ్డుకోవడంతో ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం తగదన్నారు. ఆ పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే పర్యావరణ వాతావరణం నాశనం కావడమే కాకుండా చిన్న పిల్లలకు, మానవులకు అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని ఆరోపించారు. అలాంటి కాలుష్య కారక పరిశ్రమలను నెలకొల్పకుండా అడ్డుకోవాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. క్రీడా పోటీల్లో రాణించాలి రాయచూరు రూరల్: క్రీడా పోటీల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రాణించాలని ఏడీసీ శివానంద పేర్కొన్నారు. గురువారం మహాత్మా గాంధీ క్రీడాంగణంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా క్రీడా శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాయచూరు జిల్లా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణతో పాటు సామాజిక పరిజ్ఞానంతో క్రీడల్లో రాణించాలని కోరారు. కేవలం పేరుకు మాత్రమే క్రీడల్లో పాల్గొన్నామంటే సరిపోదన్నారు. జిల్లా ఉత్సవాలకు మెరుగులు దిద్దాలన్నారు. రాయచూరు జిల్లా నుంచి 21 మంది ప్రభుత్వ ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనడం ముదావహం అన్నారు. కృష్ణ, చంద్రశేఖర్రెడ్డి, శంకరగౌడ, వీరేష్ నాయక్ పాల్గొన్నారు. -
అయ్యప్ప మాలధారులకు అన్నదానం
రాయచూరు రూరల్: మకరజ్యోతి దర్శనానికి వెళుతున్న అయ్యప్ప మాలధారులకు మైనార్టీ సోదరులు అన్నదానం చేశారు. గురువారం లింగసూగూరులో ముిస్లిం–ఏ–అంజుమన్ కమిటీ అధ్యక్షుడు రఫీ ఆధ్వర్యంలో 40 మందికి అన్నదానం నిర్వహించారు. హిందూ ముస్లింలు సఖ్యత, ఐకమత్యంతో శాంతి సౌహార్ధతను కాపాడుతున్నామని రఫీ అన్నారు. విజయ్, అన్వర్బాయి, హుస్సేన్బాషా, ముస్తఫా, సలీం, ఆసిఫ్, ఇబ్రహీం, అరీఫ్, ఆది పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు ఓటు హక్కు రాయచూరు రూరల్: ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ఆయువు పట్టు వంటిదని జిల్లా ఎన్నికల అధికారి పీ.బసవరాజ్ పేర్కొన్నారు. గురువారం జెడ్పీ జలనిర్మల సభాంగణంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, తొలగింపులపై ఆయన బీఎల్ఓలు, తహసీల్దార్లకు పలు సూచనలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంత ఓటరు జాబితాల్లోని లోపాలను సవరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో నోడల్ అధికారి వస్త్రద్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ హనుమంతప్ప, అధికారులు సురేష్వర్మ, రమేష్, సోమశేఖర్ పాల్గొన్నారు. నిందితునిపై చర్యలు చేపట్టండి హుబ్లీ: ఇటీవల దళిత మహిళ రంజితను హత్య చేసిన నిందితుడు రఫీని, అతడి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలని విశ్వ హిందూ పరిషత్, భజరంగదళ్ డిమాండ్ చేశాయి. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రవికృష్ణ మాట్లాడారు. నేటి ఆధునిక సమాజంలో హిందూ యువతులకు రక్షణ కరువైందన్నారు. మైనార్టీ యువకులు ప్రేమ పేరుతో హిందూ యువతులను మోసం చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టి శిక్షలను విధించాలని కోరుతూ స్థానిక అధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. శ్రీనివాస్, రాకేష్, రాజేష్, శరణులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో జాప్యం తగదు రాయచూరు రూరల్: ఇటీవల కాలంలో జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై అధికమవుతున్న దాడుల నియంత్రణకు అధికారులు శ్రద్ధ చూపాలని జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల నియంత్రణపై జరిగిన సమావేశంలో అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో దళిత వార్డుల్లో అంటరానితనం వంటి అమానుషాలను అరికట్టాలన్నారు. మరో వైపు దాడులు జరిగినప్పుడు కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు చేపట్టాలని దళిత నేతలు రవీంద్రనాథ్ పట్టి, విశ్వనాథ్, శరణప్ప జిల్లాధికారిని డిమాండ్ చేశారు. భూగర్భ జలాల వృద్ధికి సహకరించాలి రాయచూరు రూరల్: భూగర్భ జలాల పెరుగుదలకు రైతులు సహకరించాలని స్వామి వివేకానంద యువజన సంఘం అధికారి రమేష్ పేర్కొన్నారు. గురువారం రాయచూరు తాలూకా యాపలదిన్ని మండలం రాళ్లదొడ్డిలో పురాతన బావి జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. వర్షాకాలంలో భూమిలో, చెరువులు, ఇంకుడు గుంతల్లో భూగర్భ జలాలను పెంచడానికి ఇలాంటి శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో అడుగంటి పోతున్న జలవనరులను భావి తరాలకు అందించాలన్నారు. కార్యక్రమంలో రామిరెడ్డి, పంపాపతి, శరణయ్య, వినోద్, ఈరణ్ణలున్నారు. -
మైలార జాతర విజయవంతం చేయండి
హొసపేటె: జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరగనున్న మైలార లింగేశ్వర స్వామి జాతర మహోత్సవంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగుండా అవసరమైన చర్యలు తీసుకొని జాతరను విజయవంతం చేయాలని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి అధికారులను ఆదేశించారు. విజయనగర జిల్లా హడగలి తాలూకాలోని మైలారలో జరిగే మైలారలింగేశ్వర స్వామి జాతర మహోత్సవ సన్నాహాక సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. జాతర సందర్భంగా లక్షలాది మంది ప్రజలు పాల్గొనే దృష్ట్యా నది ఒడ్డున మహిళలు దుస్తులు మార్చుకోవడానికి షామియానా టెంట్లు వేయాలన్నారు. ముందు జాగ్రత్తగా నది ఒడ్డున గజ ఈతగాళ్లను నియమించాలన్నారు. తాత్కాలికంగా మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య శాఖ నుంచి వివిధ ప్రదేశాల్లో వైద్యులు, సిబ్బందితో ఆరోగ్య శిబిరాలను తెరవాలన్నారు. అత్యవసర సేవలకు అంబులెన్స్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ బస్టాప్లలో తాగునీరు, మరుగుదొడ్లు, అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను అందించాలని ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీ కట్టడికి ఏర్పాట్లు ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి పోలీసులు శాఖ తగిన ఏర్పాట్లు చేయాలి. జాతర స్థలంలో నిరంతరం పరిశుభ్రతను కాపాడుకోవాలన్నారు. వివిధ ప్రాంతాల్లో చెత్తబుట్టలను ఉంచాలని ఈఓ వారిని ఆదేశించారు. టాయిలెట్లు ఉన్న ప్రదేశాల్లో ప్రజలకు తెలియజేయడానికి సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణనాయక్, జిల్లా ఎస్పీ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. -
నాగమోహన్దాస్ సిఫార్సులు అమలు చేయాలి
హొసపేటె: రాష్ట్రంలో అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మాదిగ, సమాగర, దోహార, దక్కలిగ ఉపకుల సంస్థల కూటమి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్త నిరసన నిర్వహించనున్నట్లు ఆయా ఉపకుల సంస్థల నాయకుడు బ్యాలహుణసి రామన్న తెలిపారు. నగరంలోని ప్రెస్హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్ధంగా అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడానికి సువర్ణావకాశం ఉన్నప్పటికీ, సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 101 కులాలకు సామాజికంగా న్యాయమైన అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. 2024 ఆగస్టు 1న సుప్రీం కోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని స్పష్టంగా పేర్కొంది. ఈ విషయంలో హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కేవలం 6 నెలల్లో ఎటువంటి గందరగోళం లేకుండా శాసీ్త్రయంగా అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడంలో విజయం సాధించాయన్నారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన గందరగోళాల కారణంగా 16 నెలల తర్వాత కూడా అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడంలో ఇబ్బంది పడుతోందని ఆయన అన్నారు. సమాజ ప్రముఖులు శేషు, రమేష్, పూజప్ప, శ్రీనివాస్, దుర్గేష్ పాల్గొన్నారు. -
ప్రేమ వేధింపులకు బలి
మైసూరు: ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఓ పోకిరీ నిరంతరం వేధించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నంజనగూడులో జరిగింది. దివ్య (17) పీయూసీ ఫస్టియర్ చదువుతోంది, పొరుగూరికి చెందిన ఆదిత్య అనే యువకుడు ప్రేమించాలని వేధించేవాడు. దివ్య తండ్రి గురుమూర్తి ఊరి పెద్దలకు అతని మీద ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఆదిత్య ప్రవర్తనను మార్చుకోకపోవడంతో దివ్య భయపడిపోయింది. విరక్తి చెందిన దివ్య ఇంట్లో ఉరి వేసుకుంది. ప్రేమోన్మాదిపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బళ్లారిపై సీబీఐ దర్యాప్తు వద్దు ● హోంమంత్రి పరమేశ్వర్ శివాజీనగర: బళ్లారి గొడవపై సీబీఐ తనిఖీ చేపట్టాలనే డిమాండ్లను హోం మంత్రి జీ.పరమేశ్వర్ తిరస్కరించారు. గురువారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ సీబీఐ దర్యాప్తు అవసరం లేదు, మన పోలీసులకే దర్యాప్తు సామర్థ్యం ఉంది, వారిచేత కాలేదంటే సీబీఐకి ఇవ్వవచ్చు. అయితే అటువంటి సందర్భం రాలేదు అని చెప్పారు. హుబ్లీ గొడవపై.. హుబ్లీలో పోలీసులు ఓ మహిళను అరెస్టు సమయంలో వివస్త్రను చేశారనే ఘటనపై పోలీస్ కమిషనర్ వివరణ ఇచ్చారని, అది చాలని తనకు అనిపిస్తోందని అన్నారు. అన్నిటిలోనూ రాజకీయం చేయడం సరికాదని బీజేపీని విమర్శించారు. ఆమే బట్టలు తీసేసుకుందని కమిషనర్ చెప్పాడన్నారు. రాష్ట్రంలోను, బెంగళూరులోను బంగ్లాదేశీయులు ఉంటే వారిని కనిపెట్టి దేశం దాటిస్తామని చెప్పారు. తనను రబ్బరుస్టాంపు హోంమంత్రి అన్న కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి మాటలను స్వీకరిస్తానని అన్నారు. బాధ్యత కలిగిన హోమ్ మంత్రిగా పని చేస్తున్నానని చెప్పారు. కేఆర్ మార్కెట్లో భూగర్భ పార్కింగ్ పనులు బనశంకరి: బెంగళూరు కేఆర్ మార్కెట్ కట్టడం బేస్మెంట్లో చేపడుతున్న పార్కింగ్ లాట్ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని పాలికె అదనపు కమిషనర్ దల్జీత్కుమార్ సూచించారు. గురువారం పనులను పరిశీలించారు. ఇక్కడకు నిత్యం వేలాదిమంది వ్యాపారులు, ప్రజలు వస్తుంటారని, వాహనాల పార్కింగ్కు వసతి లేదన్నారు. మార్కెట్ బేస్మెంట్లో నిర్మిస్తున్న పార్కింగ్ సౌకర్యం అందరికీ చాలా ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, వాననీరు వెళ్లిపోయేలా డ్రైనేజీ ఉంటుందన్నారు. కేఆర్ మార్కెట్ చుట్టుపక్కల స్వచ్ఛత మెరుగుపడిందన్నారు. వ్యాపారస్తులు, ప్రజల కోసం శుభ్రతతో కూడిన మార్కెట్గా మార్చాలని సూచించారు. బైక్ను ఎత్తుకెళ్లి దగ్ధం మైసూరు: మైసూరు జిల్లాలోని నంజనగూడులో మహదేశ్వర బ్లాక్లో సురేష్ అనే కార్మికుడు నెస్లే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంటి ముందు పల్సర్ బైక్ను పార్క్ చేశాడు, కానీ అది కనిపించలేదు. ఓ కాలువ పక్కన బైక్ కాలిపోయి ఉంది. పట్టణ పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు. గత వారం ఒక యువకుడు తన బైక్తో సహా సజీవ దహనమైన సంఘటనకు కొంతదూరంలోనే ఈ బైక్ కాలిపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎవరో దుండగులు బైక్ను అపహరించి కాల్చివేశారని అనుమానాలున్నాయి.గంజాయి మత్తులో.. చెయ్యి పోయింది దొడ్డబళ్లాపురం: గంజాయి మత్తులో రైలుకింద పడి చెయ్యి తెగిపడ్డా యువకుడు ఆస్పత్రికి వెళ్లకుండా రోడ్లమీద తిరిగిన సంఘటన దేవనహళ్లిలో వెలుగు చూసింది. దేవనహళ్లి పట్టణంలోని కుంబార వీధిలో బుధవారం అర్ధరాత్రి ఉత్తర భారతానికి చెందిన వలస కూలీ దిలీప్, గంజాయి మత్తులో సమీపంలోని రైలు పట్టాలపై చెయ్యి పెట్టి పడుకున్నాడు. రైలు ఎడమ చెయ్యి మీద నుంచి వెళ్లడంతో మోచేయి కిందవరకు తెగిపోయింది. గంజాయి మత్తులో నొప్పి తెలియని అతడు మొండి చేతితోనే వీధిలో నడుకుంటు వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసి బెంబేలెత్తిపోయిన స్థానికులు అతనిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా దూకి పరిగెత్తాడు. పోలీసులు వచ్చి గంటసేపు యత్నించి అతనిని పట్టుకుని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కూడా వైద్యం చేయించుకోకుండా యాగీ చేశాడు. చివరికి అతనికి కట్టుకట్టి చికిత్స చేశారు. -
ప్రాణం విలువ రూ.2 లక్షలే
● మాజీ మంత్రి రేవణ్ణ దాష్టీకం దొడ్డబళ్లాపురం: మాజీ మంత్రి హెచ్ఎం రేవణ్ణ కుమారుని కారు ఢీకొని ఓ యువకుడు చనిపోయాడు, పరిహారం కోరుతూ అతని కుటుంబీకులు ఆయన ఇంటికి రాగా చుక్కెదురైంది. రూ.2 లక్షలు ఇస్తానని, ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే వెళ్లిపోండి అని రేవణ్ణ మండిపడ్డారు. గతేడాది డిసెంబరు 1న బెంగళూరు దక్షిణ జిల్లా మాగడి తాలూకా గుడేమారనహళ్లి వద్ద కుమారుడు శశాంక్ కారు ఢీకొని బైకిస్టు రాజేశ్ మరణించాడు. కేసు వద్దని, పరిహారం ఇస్తానని కుటుంబాన్ని పిలిపించుకున్న రేవణ్ణ రూ.2 లక్షలకు బేరం పెట్టారు. కష్టాల్లో ఉన్నామని, చెట్టంత కొడుకును పోగొట్టుకున్నామని తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. నాకేం సంబంధం, నేను ఇంతే ఇస్తాను, ఇష్టం లేదంటే వెళ్లిపోండి అని దబాయించాడు. మృతుని తండ్రి గుడ్డేగౌడ, తల్లి రత్నమ్మ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి తీరుపై ఆవేదన చెందారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.క్యాబిన్లో మంటలు.. తండ్రీ కూతురు మృతి మాలూరు: క్యాబిన్ తరహా ఇంటిలో అగ్నిప్రమాదం జరిగి తండ్రీ కూతురు మరణించిన విషాద ఘటన తాలూకాలోని దొమ్మలూరు గ్రామంలో జరిగింది. పంబన్ (44), కుమార్తె యామిని (2) మృతురాలు, వివరాలు.. దొమ్మలూరులోని ఆదిశేష లేఔట్లో తమిళనాడులోని ఉతరకెరె గ్రామానికి చెందిన పంబన్ కరెంటు పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. లేఔట్లోని ఓ క్యాబిన్లో నివసిస్తున్నారు. అయితే బుధవారం రాత్రి విద్యుత్ షార్టు సర్క్యూట్ లేదా మరేం కారణమో కానీ క్యాబిన్లో మంటలు వ్యాపించాయి. ముగ్గురికీ తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయి. బెంగుళూరులోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా తండ్రీ కూతురు చనిపోయారు. మాలూరు పోలీసులు లేఔట్ బిల్డర్లు రమేష్, ప్రదీప్ అనే వారిపై కేసు నమోదు చేశారు. రమేష్ను అరెస్టు చేయగా ప్రదీప్ పరారయ్యాడు. మెట్రో వంతెన కోసం 6 వేలకు పైగా చెట్ల కట్ !శివాజీనగర: మెట్రో రైలు నిర్మాణ పనుల వల్ల భారీసంఖ్యలో చెట్లను కొట్టేయాల్సి వస్తోంది. మెట్రో మూడో దశ పనులకు 6,868 చెట్లను కట్ చేయాలని పాలికె, మెట్రో అధికారులు నిర్ణయించారు. దీనిమీద నగర పర్యావరణ అభిమానులు మండిపడుతున్నారు. సుమారు 37.12 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ మెట్రో రైలు వంతెన పనులు ఈ జూన్లో ఆరంభమవుతాయి. మైసూరు రోడ్డు నుంచి జేపీ నగర వరకు వంతెన కట్టే మార్గంలో 1,092 చెట్లను తొలగించాలని నిర్ధారించారు. ఇప్పటికే బెంగళూరులోనూ ఢిల్లీ స్థాయిలో వాయు కాలుష్యం ఏర్పడుతోంది. ఈ సమస్య మరింత అధికమయ్యే అవకాశముంది. -
ఎంతో సున్నితమైన హృదయానికి ఇబ్బంది వచ్చింది. భారత సిలికాన్ రాజధానిలో గుండెజబ్బు మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నిన్నటివరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి హార్ట్ ఫెయిల్ అని ఆస్పత్రి పాలు కావడమో, మరణించడమో జరుగుతోంది. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు దుఃఖసాగరంలో మ
కారణాలపై నెలకొన్న సందిగ్ధంశివాజీనగర: బెంగళూరు నగరంలో కోవిడ్ మహమ్మారి తరువాత గుండెపోటుతో మరణాలు అధికమయ్యాయి. నగర పోలీసు విభాగం ఈ మేరకు గుండె ఝల్లుమనే సమాచారాన్ని పొందుపర్చింది. ఆ గణాంకాల ప్రకారం 2022 నుంచి బెంగళూరులో ఏటా సరాసరి 3000 హఠాన్మరణాలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రబలిన తరువాత అనేకమందికి ఈ సమస్య తలెత్తింది. దీనిమీద అనేక భిన్న ప్రచారాలు జరగడం తెలిసిందే. కోవిడ్ వైరస్ సోకిన తరువాత గుండె బలహీన పడుతుందని, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో చాలామందికి హృదయ సమస్యలు వస్తున్నాయని ప్రచారాలు వ్యాప్తిలోకి వచ్చాయి. కొన్ని వైద్య సంస్థలు కోవిడ్ టీకాతో ఇబ్బంది లేదని ప్రకటించాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగినట్లు తేటతెల్లమైంది. అధికమైన ఆకస్మిక మరణాల ముప్పు ఏటా 3000 మంది మరణం కరోనా తరువాత విపరిణామాలు ప్రతి సంఘటన నమోదు.. గుండెపోటు మరణాలు కలకలం రేకెత్తించడంతో రాష్ట్ర ప్రభుత్వం హఠాన్మరణాలను నమోదు చేయాలని, పోస్టుమార్టం కూడా జరిపి కారణాలను నిర్ధారించాలని గతేడాది ఆదేశించింది. ఇళ్లలోను, బయట ఆకస్మిక మరణం సంభవిస్తే దానిని పోలీసులు, వైద్యులు నమోదు చేయాలని తెలిపింది. ఆరోగ్యంగా ఉన్నవారు, 15 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలతో పాటుగా అందరూ సంవత్సరానికి ఓసారైనా గుండె, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో 86 వైద్యాలయాల్లో ఉన్న పునీత్ రాజ్కుమార్ హృదయ జ్యోతి పథకాన్ని తాలూకా స్థాయి ఆసుపత్రులకు విస్తరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆకస్మిక గుండెపోటు బాధితులకు తక్షణ చికిత్స అందించడమే ఈ పథకం ఉద్దేశం. ఇతరత్రా కారణాలు ఉన్నాయి: నిపుణులు ఆకస్మిక గుండెపోటు మరణాలకు అనేక అంశాలు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలలో అడ్డంకులు, శ్వాసకోశాల్లో రక్తం గడ్డ కట్టడం, అనియంత్రిత ఆస్తమా సమస్య, తీవ్రమైన అలర్జీలు, మితిమీరి మద్యం, పొగాకు సేవనం, జన్యు పరమైన ఇబ్బందులు వల్ల కూడా గుండెకు ఇబ్బంది కలిగి హఠాత్ మరణాలు సంభవించవచ్చని తెలిపారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని జాగృతి ర్యాలీలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు తదితరాలను ఆరోగ్య శాఖ ఏర్పాటు చేస్తోంది. మితాహారం తీసుకుంటూ రోజూ వ్యాయామం చేయాలని, అధిక చక్కెర, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు తెలిపారు. -
రక్షకభటులే విరక్తి చెందితే..
మండ్య: రాష్ట్రంలో మండ్య, శివమొగ్గలో ఇద్దరు పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. మండ్య జిల్లాలో మద్దూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసే టి. రమేష్ (35) బుధవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కబళ్లాపురంలోని దబలగెరె గ్రామానికి చెందిన రమేష్కు భార్య పుష్పలత, ఏడాదిన్నర కూతురు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం మద్దూరు స్టేషన్కు బదిలీ అయ్యాడు, కోర్టు వారెంట్లు, సమన్లను రవాణా చేసే పనిలో ఉన్నాడు. ఇంటికి వచ్చి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన రమేష్ ఒక గదిలో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కుటుంబ వివాదాలే కారణమని అనుమానాలున్నాయి. పోస్టుమార్టం తరువాత మృతదేహాన్ని స్టేషన్కు తీసుకువచ్చి, సిబ్బంది, ప్రజల సందర్శనార్థం ఉంచారు. తరువాత స్వగ్రామానికి తరలించి కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు జరిపారు. ఠాణాలోనే హెడ్ కానిస్టేబుల్.. శివమొగ్గ: నగరంలోని వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు జకారియా (53), ఆర్ఎంఎల్ నగర నివాసి. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్న జకారియా తన సహోద్యోగిని విశ్రాంతి తీసుకోమని కోరాడు. సరేనని సహోద్యోగి నిద్రపోయాడు, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మెలకువ వచ్చి చూడగా జకారియా ఉరికి వేలాడుతున్నాడు. ఓ కానిస్టేబుల్తో విభేదాల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు జకారియా డెత్నోట్ రాసి ఉంచాడు. పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు పోలీసుల బలవన్మరణాలు ఆ శాఖలో కలకలం సృష్టించాయి. కానిస్టేబుల్ రమేష్ హెడ్ కానిస్టేబుల్ జకారియా రాష్ట్రంలో ఇద్దరు పోలీసుల ఆత్మహత్య -
ఆర్టీసీ బస్సు– లారీ ఢీ
మైసూరు: చామరాజనగర తాలూకాలోని నంజనగూడు రోడ్డులో బెండరవడి గ్రామం సమీపంలో కేఎస్ ఆర్టీసీ (అశ్వమేధ) బస్సు, లారీ ఢీకొన్నాయి, రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. బస్సు, లారీ క్యాబిన్లను గ్యాస్ కట్టర్ తో కత్తిరించి డ్రైవర్లను బయటకు తీసుకువచ్చారు. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని, గ్రామస్తుల సహకారంతో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బయటకు తీసేటప్పటికి బస్సు డ్రైవర్ మృతి చెందగా, లారీ డ్రైవర్తో సహా మొత్తం 18 మంది గాయపడ్డారు. బస్సు డ్రైవర్, కో–ఆపరేటివ్ మంజు (38), చామరాజనగర తాలూకాలోని ఇరసావడి గ్రామవాసి, లారీ డ్రైవర్ గోవిందస్వామి (45) కూడా ఇదే తాలూకావాసే కాగా తీవ్ర గాయాలయ్యాయి. శివకుమార్, గీత దంపతులు సహా నలుగురు తీవ్ర గాయాలతో మైసూరులోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఐదుగురు సిమ్స్లో చికిత్స పొంది వెళ్లిపోయారు. చెట్టును బస్సు ఢీ.. 20 మంది ఆస్పత్రిపాలుయశవంతపుర: కేఎస్ ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా హళియాళ తాలూకా బానసగేరి వద్ద జరిగింది. 8 మంది కాలేజీ విద్యార్థులు, ఇద్దరు మొరార్జీ వసతి స్కూలు విద్యార్థులు, ఇద్దరు మహిళలతో పాటు కండక్టర్ గాయపడ్డారు. ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి రోడ్డు పక్కలోని చెట్టును బస్సు ఢీకొంది. స్థానికులు వచ్చి బాధితులను కాపాడారు. ఇద్దరు విద్యార్థులను.. ● కలబుర్గి జిల్లా జీవర్గి వద్ద సైకిల్పై స్కూల్కు వెళుతున్న దవలసాబ్ (15) అనే 9వ తరగతి విద్యార్థిని కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో చేయి, నడుములకు తీవ్ర గాయాలై విషమ పరిస్థితిలో ఉన్నాడు. జీవర్గి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ● హావేరి తాలూకా కోణనతంబిగికి చెందిన పీయూసీ విద్యార్థి రోహిత్ కెసరళ్లి కాలేజీలో పరీక్ష రాయడానికి నడిచి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొంది. అతనికి తీవ్ర గాయాలు తగిలాయి. హావేరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. డ్రైవర్ మృతి, 18 మందికి గాయాలు చామరాజనగర వద్ద ప్రమాదం రాష్ట్రంలో పలుచోట్ల బస్సు యాక్సిడెంట్లు -
చీటీల పేరుతో రూ.100 కోట్లు ఉఫ్?
● పరారీలో ఫైనాన్స్ వ్యాపారి ● బళ్లారి నగరంలో భారీ వంచన ● బాధితులు లబోదిబో సాక్షి, బళ్లారి: చీటీలంటే చీటింగ్గా మారిపోయింది. కొన్నాళ్లపాటు జనం నమ్మకం సంపాదించాక పెద్దమొత్తంలో ఉడాయిస్తుంటారు. బళ్లారి నగరంలో అలాంటి భారీ స్కాం బయటపడింది. వివరాలు.. నగరంలోని దేవీనగర్కు చెందిన వెంకటేశ్ అనే ఫైనాన్స్ వ్యాపారి చీటీలు నిర్వహించేవాడు. ఇలా దాదాపు 800 మంది నుంచి చీటీలు వేశారు. కట్టిన సొమ్ముకు రెట్టింపు నగదు ఇస్తానని నమ్మబలికేవాడు. దీంతో చాలామంది సంపాదించుకున్న డబ్బుతో పాటు అప్పులు చేసి అతనికి చెల్లించారు. ఈ మొత్తం సుమారు రూ.100 కోట్ల దాకా ఉంటుందని బాధిత ప్రజలు చెబుతున్నారు. పత్తా నై.. గత రెండు మూడు రోజులుగా వెంకటేశ్ జాడ లేకపోవడంతో గురువారం మధ్యాహ్నం లబోదిబోమన్నారు. బ్రూస్పేట పోలీసు స్టేషన్ ముందు చేరి నిరసన తెలిపారు. కొందరు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ ధరకే బంగారమంటూ ఇటీవలే ఓ వ్యాపారి జనం నుంచి రూ.50 కోట్ల దాకా వసూలు చేసి ఐపీ పెట్టడం తెలిసిందే. -
అనధికార లేఔట్ల స్థలాలకు ఏ ఖాతా
బనశంకరి: ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో గురువారం విధానసౌధలో మంత్రిమండలి సమావేశం జరిగింది, ఇందులో పలు ముఖ్య నిర్ణయాలను తీసుకున్నారు. తుమకూరు, రాయచూరులో కాంగ్రెస్ ఆఫీసులకు స్థలం మంజూరు చేశారు. నగర, స్థానిక సంస్థల పరిధిలో సక్రమ ప్రాధికార ఆమోదం పొందకుండా ఏర్పాటు చేసిన అనధికార లేఔట్లలో బీ–ఖాతా స్థలాలు, కట్టడాలు, అపార్టుమెంట్లు, ప్లాట్లకు ఏ–ఖాతా అందించాలని తీర్మానించారు. దీనివల్ల స్థల యజమానులకు ఊరట కలుగుతుంది. కొన్ని ముఖ్య నిర్ణయాలు ● కేఎస్డీఎల్ బెంగళూరు కాంప్లెక్స్ కోసం రూ.17.70 కోట్లతో ఆధునిక సబ్బుల తయారీ యంత్రం కొనుగోలు ● కోలారు వ్యవసాయ మార్కెట్లో రూ.24.96 కోట్ల వ్యయంతో బయో సీఎన్జీ కేంద్రం ఏర్పాటు ● కలబుర్గిలో రూ.50 కోట్ల వ్యయంతో మెగా డైరీ నిర్మాణం ● రూ.127 కోట్లతో పీఎం–అబిమ్ పథకం కింద రాష్ట్రంలో 196 రూరల్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు ● రూ.40 కోట్లతో చిక్కబళ్లాపుర నంది మెడికల్ కాలేజీకి పరికరాల కొనుగోలు ● కలబుర్గి మహానగర పాలికె పరిధిలో మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్గాంధీల విగ్రహాల ఏర్పాటుకు ఆమోదం ● రూ.11.03 కోట్లతో ఉత్తర కన్నడ జిల్లా కుమటా తాలూకా దుబ్బనశశి, గంగెకొళ్ల తీరంలో సముద్రకోత నియంత్రణ పనులు ● సత్ప్రవర్తన ఆధారంగా 33 మంది ఖైదీల విడుదలకు ఓకే. అలాగే పలు జిల్లాల్లో నూతన భవనాలు, అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. బీ ఖాతా నుంచి మార్చుకోవచ్చు కేబినెట్ భేటీలో నిర్ణయం -
కుమారా.. నీ పాఠాలొద్దు
శివాజీనగర: మంత్రిగా నాకు కుమారస్వామి కంటే అధిక అనుభవముంది. ఎవరితో సమావేశం జరపాలి అనేది నాకు బాగా తెలుసు. ఆయన నుంచి పాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ అన్నారు. గురువారం కేపీసీసీ కార్యాలయంలో కొందరు జేడీఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా డీకే మాట్లాడుతూ బళ్లారిలో తాను ఏ అధికారంలో పోలీసు అధికారులతో సమావేశం జరిపానని కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రశ్నించడాన్ని ప్రస్తావించారు. జేడీఎస్కు ఒక సిద్ధాంతం, తత్వం ఏదీది లేదు. అది త్వరలోనే బీజేపీలో విలీనం కావచ్చని అన్నారు. రాష్ట్రంలో లెక్కకు మూడు పార్టీలు. ఆడేందుకు రెండు పార్టీలు అన్నట్లు అయిందని ఎద్దేవా చేశారు. ఇది ఎన్నికల సంవత్సరమని, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని తెలిపారు. బెంగళూరు పాలికె ఎన్నికలు వస్తున్నాయన్నారు. అసోం పరిశీలకునిగా.. ఈ సందర్భంగా కాబోయే సీఎం డీ.కే.శివకుమార్ అని కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ డీకేను అసోం ఎన్నికలకు సీనియర్ పరిశీలనకునిగా నియమించింది. ఇది సీఎం కుర్చీ మార్పిడి గొడవకు హైకమాండ్ ఇచ్చే విరామమని అందరూ భావిస్తున్నారు. త్వరలో బీజేపీలో జేడీఎస్ విలీనం డీసీఎం శివకుమార్ -
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారా?
తెల్లవారు జామున లేవగానే.. రోడ్డుపై అడుగుపెట్టే వాహనదారులు.. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడెక్కడ ఉన్నారా? ఫోటోలు తీస్తున్నారా? చలానాలు వస్తాయెమోనన్న భయంతో బిక్కు బిక్కు మంటూ వెళ్లడం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. ఇక ముందు ట్రాఫిక్ పోలీసులున్నా.. లేకపోయినా... మనం మాత్రం ట్రాఫిక్ పోలీసుల కనుసైగల్లోనే ఉంటాం. నిబంధనలు ఉల్లంఘించగానే ఆ సమాచారం నేరుగా ట్రాఫిక్ కంట్రల్ రూం చేరి.. తద్వారా వాహనదారులకు జరిమానా చేరుతుంది. ఇదేం కొత్త టెక్నాలజీ అని ఆశ్చర్యపోతున్నారా.... అయితే జాగ్రత్తగా ఈ వీడియోను చూడండి..బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. నగరంలోని ట్రాఫిక్ సమస్యలను గమనించాడు. నిబంధనలు పాటించని వాహనదారుల కారణంగానే సమస్యలు పెరుగుతున్నాయని గుర్తించాడు. ట్రాఫిక్ పోలీసులున్నా.. వారిని గుర్తించి పట్టుకోలేరనే ధీమాతో వాహనదారులు ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తున్నారని గుర్తించి అలాంటి వాహనదారులను చెక్ పెడితే.. ట్రాఫిక్ సమస్యలను కొంత వరకు నివారించవచ్చని ఊహించాడు. సాధారణంగా వాహనదారులు తమకు కేటాయించిన దార్లలో కాకుండా.. రాంగ్సైడ్ వెళ్లడం.. అతివేగంగా వెళ్లడంతోనే ప్రమాదాలు జరగడం.. ఫలితంగా ట్రాఫిక్ అంతరాయాలు ఉంటాయని.. ఆ సమస్య నివారణ కోసం ఫోకస్ చేశాడు.రోడ్డుపై పోలీసులు ఉన్నా లేకున్నా.. వాహనదారుడు మాత్రం క్రమశిక్షణ పాటించాల్సిందేనని.. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిని గుర్తించడానికి ఓ హెల్మెట్ను సృష్టించాడు. ఏఐ టెక్నాలజీతో కెమెరాతో అనుసంధానించిన ఆ హెల్మెట్ పెట్టుకుని వాహనదారుడు వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలపై ఆ హెల్మెట్ దృష్టి సారిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాన్ని గుర్తించి వాటి ఫోటోలు తీసి ఏకంగా ట్రాఫిక్ అధికారులకు పంపించేలా ఏర్పాట్లు చేశాడు. ఆధారాలతో పోలీసులు తదుపరి చర్యలు చేపడతారు. కొత్త సాంకేతికతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా కృషి చేసిన బెంగళూరు నగర యువకుడు పంకజ్ తన్వర్ను బెంగళూరు పోలీసు కమిషనర్ అభినందించారు.i was tired of stupid people on road so i hacked my helmet into a traffic police device 🚨while i ride, ai agent runs in near real time, flags violations, and proof with location & no plate goes straight to police. blr people - so now ride safe… or regret it. pic.twitter.com/lWaRO01Jaq— Pankaj (@the2ndfloorguy) January 3, 2026ఈ హెల్మెట్ ఎలా పనిచేస్తుందంటే.. హెల్మెట్లో ఉన్న కెమెరాలో చిప్తో పాటు సిమ్ అమర్చి ఉంటుంది. తీసిన ఫోటోలు ఆటోమెటిక్గా పోలీసులకు అందుతాయి. అందులోని సాఫ్ట్వేర్ ఆధారంగా పోలీస్ కంట్రోల్ రూంకు మెయిల్ ద్వారా పంపించే ఏర్పాట్లు ఉన్నాయి. లభించిన ఆధారాలతో పోలీసులు వాహనదారుల్ని గుర్తించి చలానాలు విధించడం లేదా కోర్టులో హాజరు పరుస్తారు. ఇలాంటి కఠినచర్యలు తీసుకోవడంతో పాటు కనిపించని కెమెరాతో ఫోటోలు వస్తాయని వాహనదారులకు తెలిస్తే రోడ్డు నిబంధనలు పాటించే అవకాశముంది. -
మగవాళ్ల మూడ్.. నటి వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం
వీధికుక్కల కేసు విచారణలో.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తున్నది తెలిసిందే. అయితే కోర్టు వ్యాఖ్యల ఆధారంగా ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య(దివ్య స్పందన) చేసిన ఓ పోస్ట్పై నెటిజన్స్ భగ్గుమంటున్నారు. కుక్కలను.. మగవాళ్లకు ముడిపెట్టి ఆ పోస్ట్ ఉండడమే అందుకు కారణం. వీధి కుక్కల అంశంపై మరోసారి విచారణ జరుపుతున్న సర్వోన్నత న్యాయస్థానం.. వీధి కుక్కలను(Dogs) వాటి ప్రవర్తన ఆధారంగా వర్గీకరించడం సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ‘‘ఫలానా కుక్క కాటేస్తుంది.. ఫలానాది కాటేయదు అని వీధుల్లో తిరిగే కుక్కలను చూసి ముందుగా తెలుసుకోవడం సాధ్యం కాదు. వీధి కుక్కల మూడ్ ను ఎవరు అర్థం చేసుకోలేరు’’ అంటూ బుధవారం విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై రమ్య తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ‘మరి మగవాళ్ల మైండ్ను కూడా చదవలేం. వాళ్ళు ఎప్పుడు లైంగికదాడి చేస్తారో.. ఎప్పుడు హత్య చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్లందరినీ జైలులో పెట్టాలా?’ అని ఇన్స్టాలో ఓ పోస్టు చేశారు. దీంతో కుక్కలతో పోలుస్తావా? అంటూ కొందరు పురుషులు నటి రమ్యపై భగ్గుమంటున్నారు. ఆమె క్షమాపణలు చెప్పేదాకా ఊరుకునేది లేదని.. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. కన్నడ నటి రమ్య అలియాస్ దివ్య స్పందనకు శాండల్వుడ్ క్వీన్గా పేరుంది. ఆమె తెలుగు, తమిళ్ భాషల్లోనూ నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరారు. కాంగ్రెస్ తరఫున 2013 మాండ్య లోక్సభ ఉప ఎన్నికల్లో నెగ్గి ఎంపీ అయ్యారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. యువతలో ఆమెకు ఉన్న క్రేజ్ గుర్తించి.. రాహుల్ గాంధీ ఆమెకు సోషల్ మీడియా వింగ్ను అప్పగించారు. ఈ క్రమంలోనే తరచూ పలు అంశాలపై స్పందిస్తూ వస్తున్నారు. కన్నడనాట సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో స్టార్ నటుడు దర్శన్ నిందితుడిగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కన్నడ సినీ పరిశ్రమ మౌనంగా ఉండిపోయింది. అయితే.. ఎంతటి వారైనా చేసినదానికి ఫలితం అనుభవించాల్సిందే అంటూ రమ్య స్పందించడంతో దర్శన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆమెను రేప్ చేస్తామని, చంపుతామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. -
గదిలో బంధించి.. యువతిపై 12 మంది అత్యాచారం!
బెంగుళూరు: మంగళూరులో అమానుష ఘటన జరిగింది. యువతి తండ్రి అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న కామాంధులు బాధితురాలిని లోబర్చుకొని కామవంఛతీర్చుకున్నారు. రెండు రోజులు నరకం అనుభవించిన యువతి కామాంధుల బారి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. చిక్కమగళూరు జిల్లా బీరూరు గ్రామానికి చెందిన తల్లిలేని బిడ్డ తన బంధువుల ఇంటిలో ఉంటూ పీయూసీ వరకు చదివింది. అనంతరం తండ్రి వద్దకు వచ్చింది. గతనెలలో తన అవ్వ ఇంటికి వెళ్లి రెండు రోజులు అక్కడే ఉంది. మంగళూరుకు చెందిన భరత్శెట్టి అనే వ్యక్తి యువతి తండ్రి వద్దకు వెళ్లి స్నేహంగా ఉండేవాడు. మంగళూరులో తమకు ఇల్లు ఉందని, మీరిద్దరూ వస్తే ఆశ్రయం కల్పిస్తామని చెప్పడంతో యువతి, ఆమెతండ్రి, యువతి అవ్వ కలిసి భరత్శెట్టి వెంట వెళ్లారు. అక్కడ భరత్శెట్టి ఆ యువతి తండ్రిని మభ్య పెట్టి డబ్బు ఇచ్చాడు. అనంతరం యువతిని ఒక ఇంటిలో ఉంచి కొంతమంది విటులను పంపించాడు. రెండు రోజులపాటు కామాంధులు ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తనను వదిలేయాలని యువతి వేడుకున్నా కనికరించలేదు. భరత్శెట్టికి డబ్బులు ఇచ్చామని చెప్పి లైంగికదాడికి పాల్పడ్డారు. ఎట్టకేలకు యువతి తప్పించుకొని వచ్చి దక్షిణకన్నడ జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళూరుకు వెళ్లి భరత్శెట్టితోపాటు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. యువతి తండ్రి, అవ్వపై కూడా కేసు నమోదు చేశారు. -
యువతి తల్లికి ప్రేమోన్మాది నిప్పు..
కర్ణాటక: ఓ మహిళ ఆమె కూతురితో పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమోన్మాది పెట్రోలు చల్లి నిప్పంటించడంతో మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి కన్నుమూసింది. బాధితురాలు గీత (42) విక్టోరియా ఆసుపత్రిలో గత 20 రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతూ మంగళవారం రాత్రి చనిపోయింది. వివరాలు.. గీతా బసవేశ్వరనగర బోవికాలనీలో కిరాణా షాపును నడుపుతోంది. అక్కడే ప్రేమోన్మాది ముత్తు టీస్టాల్ పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంతో గీత కుమార్తె (19)ను ముత్తు ప్రేమించాడు. ఆమెతో తనకు వివాహం చేయాలని గీతను కోరేవాడు, ఇందుకు ఆమె నిరాకరించేది. కోపోద్రిక్తుడైన అతడు.. గీత ఇంట్లో ఉండగా పెట్రోలు చల్లి నిప్పు అంటించి ఉడాయించాడు. తీవ్రంగా గాయపడిన గీత ఆస్పత్రిలో మరణించింది. స్థానిక పోలీసులు దుండగున్ని అరెస్ట్ చేశారు. -
శాంతి భద్రతల రక్షణే ధ్యేయం
రాయచూరు రూరల్: నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని ఎస్పీ అరుణాంగ్షు గిరి పేర్కొన్నారు. బుధవారం నగరంలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ను సందర్శించి అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, ఈఆర్ఎస్ 112, 1930 సహాయవాణి ద్వారా ప్రజలు సహకరించాలన్నారు. నగరంలో రాత్రి వేళ పోకిరీల ఆగడాలు అధికం అయ్యాయని, వాటిని అరికట్టాలన్నారు. షేస్బుక్, వాట్సప్, ట్విటర్, ఇన్స్టా వంటి వాటిని వినియోగించే ముందు ఆలోచించుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ కాంబ్లే, సాబయ్య, లక్ష్మిలున్నారు. పాఠశాలల మూసివేత నిరసిస్తూ ఆందోళన రాయచూరు రూరల్ : రాష్ట్రంలోని కన్నడ ప్రభుత్వ పాఠశాలను బంద్ చేసి కర్ణాటక పబ్లిక్ పాఠశాలలోకి విలీనం చేయడానికి సర్కార్ ముందుకొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయబోమనే ఆదేశాలను జారీ చేయాలని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. బుధవారం రాయచూరు తాలూకా దేవసూగురు ప్రాథమిక పాఠశాల వద్ద చేపట్టిన ఆందోళన సంచాలకులు అయ్యప్ప,చెన్నబసవ మాట్లాడారు. ప్రాథమిక పాఠశాల విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప రాష్ట్రంలో కన్నడ భాష ప్రాథమిక పాఠశాలను మూసేయడం లేదని చెప్పిన సమాధానానికి లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పిల్లల అపహరణలు అరికట్టాలి రాయచూరు రూరల్: జిల్లాలో పిల్లల కిడ్నాప్ నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని రాయచూరు జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి హన్మంతు అనంతరావ్ సాత్విక్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ఎస్పీ కార్యాలయంలో న్యాయ సేవా ప్రాధికార, మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల రక్షణ శాఖాధికారుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అధికారులకు సలహా సూచనలు ఇచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అధిక భాగం పిల్లలు, మహిళలు, యువతులు అధికంగా కిడ్నాప్, విక్రయాలు చోటు చేసుకుంటున్న కేసులు అధికంగా నమోదైందని, అలాంటి వాటిపై నిఘా ఉంచాలని సూచించారు. ఎస్పీ అరుణాంగ్షు గిరి, ఏఎస్పీ కుమారస్వామి, డీఎస్పీ శాంతవీర, ఇతర పోలీస్ అధికారులున్నారు. -
కంది ధరలు తగ్గుముఖం.. ఆందోళనలో రైతాంగం
రాయచూరు రూరల్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మార్కెట్లో ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, కలబుర్గి, యాదగిరి, కొప్పళ వంటి జిల్లాలోల రైతులు పండించిన కంది పంటకు మార్కెట్లో ధర పూర్తిగా పడిపోయింది. కళ్యాణ కర్ణాటకలో 10 లక్షల టన్నుల కందులు కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కలబుర్గి, రాయచూరు ఏపీఎంసీల్లో నెలరోజుల్లో ధర క్వింటాల్కు రూ.వెయ్యి తగ్గింది. ప్రస్తుతం క్వింటాల్కు రూ.8,169 ధర ప్రకటించారు. జనవరి 1 నుంచి 4వ తేదీ వరకు 28,967 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. గతంలో 75,185 క్వింటాళ్లను కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో వైపు కంది పంటకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతులు జిల్లాధికారి కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ -
ధర వెలవెల.. రైతన్న విలవిల
బళ్లారి రూరల్ : ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటుధర లభించకపోతే ఆ రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కరలేదు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. రాష్ట్రప్రభుత్వం క్వింటాల్ మొక్కజొన్న పంటకు రూ.2400 ధర నిర్ణయించగా ఏపీఎంసీ మార్కెట్లో మాత్రం రైతుల నుంచి ఈ ధర ప్రకారం పంటను కొనుగోలు చేయడం లేదు. బాగా ఎండబెట్టిన మొక్కజొన్నకు రూ.1800 నుంచి రూ.1900 వరకు మాత్రమే ధర లభిస్తోంది. అంతకంటే నాణ్యత తగ్గితే పంటను రూ.1100లకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కౌలు రైతులకు పంటపై పెట్టుబడి, రసాయనాలు, గింజలు వేరు చేసే మిషన్ ఖర్చులు పోను ఏమాత్రం మిగలడం లేదని రైతులు అంటున్నారు. ఎకరం మొక్కజొన్న పంటకు రూ.35 వేలకు పైగా పెట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ సారి మిర్చి పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ప్రస్తుతం మొదటి రకం క్వింటాల్ మిర్చి పంటకు ధర రూ.14 వేలు లభిస్తోంది. రెండవ రకం రూ.11 వేలు, తెలుపు ఎరుపు కలిగిన మిర్చికి రూ.7 వేలు ధర లభిస్తున్నట్లు కొళగల్లు రైతు గంజి సురేశ్రెడ్డి తెలిపారు. గిట్టుబాటు ధర లభించడానికి రైతులు పంట పొలాల్లోని కల్లాల్లోనే మొక్కజొన్న, మిర్చి పంటలను కొన్ని రోజులు ఎండబెడుతున్నారు. మొక్కజొన్న, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఏదీ? కౌలు రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా దక్కని వైనం -
ఇంటింటికీ డీఈఓ మేడం
కోలారు: జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) అంటే తీరికలేనంత బిజీగా ఉంటారు, వారు విద్యార్థులకు ఇళ్లకు వెళ్తారా? అని అనుకుంటారు. కానీ కోలారు జిల్లా డీఈఓ అల్మాస్ పర్వీజ్ తాజ్ చొరవను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తరచుగా పాఠశాలకు గైర్హాజరు అవుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆమె ఎందుకు రావడం లేదని ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులు పాఠశాలలకు వచ్చి చదువుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. బుధవారం ఆమె కోలారు నగరంలో పలువురు విద్యార్థుల ఇళ్లకు వెళ్లారు. క్రమం తప్పకుండా బడికి రావాలని తెలిపారు. బాగా చదువుకుంటున్నారా? అని తల్లిదండ్రులను అడిగారు. విద్యార్థుల ముందు కూర్చుని వారు పరీక్షలకు ఏ విధంగా చదువుకుంటున్నారో పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ఇంట్లో సక్రమంగా చదువుతున్నారా, లేదో తెలుసుకోవడానికి ఇంటికి వెళ్లి పరిశీలన చేయడమే మంచి మార్గమని అన్నారు. టెన్త్లో ఎక్కువ ఉత్తీర్ణత సాధనకు శ్రమిస్తున్నట్లు చెప్పారు. పరీక్షలకు ఇంక 72 రోజులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. శిక్షణాధికారి వీణా, డివైపిసి రాజేశ్వరి తదితరులు ఉన్నారు.కలబుర్గి సెంట్రల్ జైలులో గ్యాంగ్వార్దొడ్డబళ్లాపురం: కలబుర్గిలోని సెంట్రల్ జైలు తరచూ వార్తల్లోకి వస్తోంది. తాజాగా ఖైదీలు కొట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన వెంకటరమణ అనే ఖైదీ, స్థానిక ఖైదీకి మధ్య మొదలైన వాగ్వాదం.. రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే వరకూ వెళ్లింది. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న వెంకటరమణను ఓ వీడియో వైరల్ చేసిన కారణంగా కలబుర్గి సెంట్రల్ జైలుకు తరలించారు. 5 రోజుల క్రితమే జైళ్ల శాఖ చీఫ్ అలోక్కుమార్ ఆ జైలును తనిఖీ చేశారు. ఖైదీలు మద్యం, సిగరెట్లు తాగడం, జూదం ఆడుతున్న వీడియో వైరల్ కావడంతో ఆయన వెళ్లి ఏం జరుగుతోందో విచారించారు. ఇంతలోనే ఖైదీల గ్యాంగ్ వార్తో ఈ కారాగారంలోని లోటుపాట్లు బయటపడ్డాయి.హోంశాఖలో డీసీఎం జోక్యమా?● కేంద్ర మంత్రి కుమారస్వామిశివాజీనగర: బళ్లారిలో పర్యటించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అక్కడ పోలీస్ అధికారుల సమావేశం ఎందుకు జరిపారు?, ఆయనకు ఆ అధికారం ఎవరు ఇచ్చారు? రాష్ట్రంలో ఉన్నది రబ్బర్ స్టాంప్ హోం మంత్రినా? అని కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖల మంత్రి హెచ్.డీ.కుమారస్వామి విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలో నివాసంలో మీడియాతో మాట్లాడుతూ డీకేపై మండిపడ్డారు. డీసీఎం ఏ అధికారంతో పోలీస్ అధికారులతో సమావేశం జరిపారని ప్రశ్నించారు. హోం శాఖలో ఆయన జోక్యం ఏమిటి అన్నారు.అన్నీ సందేహాలేబళ్లారి గొడవల కేసును మూసివేతకు ప్రభుత్వం యత్నిస్తోందని కుమార ఆరోపించారు. కేవలం బ్యానర్ గొడవకే వీధుల్లో తుపాకులను పేలుస్తారా?, పోస్టుమార్టం అయిన వెంటనే కార్యకర్త మృతదేహాన్ని హడావుడిగా ఎందుకు దహనం చేశారు అని అనుమానాలు వ్యక్తంచేశారు. దీనికి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలన్నారు. -
లోకాయుక్తలో 45 వేల కేసుల నమోదు
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటక భాగంలో ఈనెల 7వ తేదీ వరకు లోకాయుక్త అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారని లోకాయుక్త రిజిస్ట్రార్ ఏ.వీ.పాటిల్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల విధి నిర్వహణలో లోపాలు కనిపించాయన్నారు. ఆస్తి పన్ను, రిజిేస్ట్రేషన్ సాంకేతిక విభాగం, ఇతరత్ర పరిశీలన జరపాలన్నారు. అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును చూసి మండిపడ్డారు. రికార్డులను సక్రమంగా వినియోగించక పోవడం, ఇష్టం వచ్చినట్లు పేపర్లు పారవేయడంతో ఆక్రోశించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై విరుచుకు పడ్డారు. రారష్ట్రంలో లోకాయుక్త పరిధిలో 45 వేల కేసులు నమోదు కాగా 20 వేల కేసులు పరిష్కరించామని వివరించారు. చెరువులను, రాజ కాలువల ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కార్యదర్శి శ్రీనాథ్, లోకాయుక్త ఎస్పీ సతీష్, జిల్లాధికారి నితీష్, ఎస్పీ అరుణాంగ్షు గిరి, నగరసభ కమీషనర్ జుబిన్ మహాపాత్రోలున్నారు. ఇప్పటికే 20 వేల కేసుల పరిష్కారం లోకాయుక్త రిజిస్ట్రార్ ఏ.వీ.పాటిల్ -
జిల్లా ఎస్పీగా సుమన పెన్నేకర్
సాక్షి బళ్లారి: మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి ఇంటి సమీపంలో మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ బ్యానర్ గొడవ, కాల్పుల నేపథ్యంలో తాజాగా పోలీసు అధికారులపై కూడా రాష్ట్రప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. బుధవారం బళ్లారి రేంజ్ డీఐజీపీగా పని చేస్తున్న వర్తిక కటియార్ను బదిలీ చేశారు. రగడ జరిగిన రోజు ఆమె కూడా సక్రమంగా విధులు నిర్వహించలేదనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రతిపక్షం కూడా ఎస్పీ సస్పెండ్ను ఖండిస్తూ వచ్చింది. దీంతో కటియార్ను బదిలీ చేసి ఆమె స్థానంలో బళ్లారి రేంజ్ డీఐజీపీగా పీఎస్.హర్షను నియమించారు. ఇక బళ్లారి నూతన ఎస్పీగా సుమన పెన్నేకర్ను నియమించారు. కాగా బళ్లారి కాల్పుల ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. డీఐజీ వర్తికా కటియార్ బదిలీ నూతన డీఐజీగా హర్ష నియామకం కాల్పుల ఘటనతో అధికారులపై చర్యలు -
హుబ్లీలో పోలీసులు వర్సెస్ బీజేపీ
హుబ్లీ: హుబ్లీలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. తమ మహిళా కార్యకర్తను పోలీసులు వివస్త్రను చేశారంటూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఠాణాను చుట్టుముట్టడంతో గందరగోళం నెలకొంది. ఇంతకూ జరిగింది ఏమిటంటే.. సదరు మహిళ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు, ఇటీవల బీజేపీలోకి చేరారు. 5వ తేదీన ఓటరు జాబితా గురించి బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు గలాటా పడ్డారు. ఆమె మీద గదగ్ రోడ్డు గాంధీవాడ ప్రాంతవాసులతో కలిసి 59వ వార్డు కార్పొరేటర్ సువర్ణ కల్లకుంట్ల కేశ్వాపుర ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ప్రతిఘటించింది. దీంతో పోలీసులు, ఆమె మధ్య తోపులాట జరిగి దాడి వరకూ వచ్చింది. పోలీసులు ఆమెను ఈడ్చుకొచ్చి జీపులో కూర్చోబెట్టారు, అప్పటికే ఆమె వివస్త్రగా మారింది, అలాగే పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ మేరకు వీడియోలు వైరల్ అయ్యాయి. ఠాణా ముట్టడి ఈ నేపథ్యంలో బాధితురాలికి న్యాయం చేయాలని, దాడి చేసిన పోలీసులను శిక్షించాలని బుధవారం సాయంత్రం నుంచి కేశ్వాపుర ఠాణా ముందు బీజేపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. పోలీసులు ఎంత చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. కొందరిని అరెస్టు చేశారు. బాధిత మహిళ కూడా ఈ ధర్నాలో పాల్గొని పోలీసులపై ఆరోపణలు చేసింది. ఆమే తీసేశారు: కమిషనర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి వాహనంలో కూర్చోబెట్టగా, ఆమే బట్టలు తీసి వేశారని హుబ్లీ పోలీసు కమిషనర్ ఎన్.శశికుమార్ వివరణ ఇచ్చారు. కేశ్వాపుర ఠాణాకు వచ్చి ఏం జరిగిందో విచారించారు. మీడియాతో మాట్లాడారు. పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఆమె దుస్తులతోనే ఉన్నారు, అదుపులోకి తీసుకునేటప్పుడు ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతి దాడి చేశారు. మగ కానిస్టేబుల్ను తోసివేసి తప్పించుకునే యత్నం చేశారు, నోటితో కరిచారు, ఆమె అంతగా రెచ్చిపోతుంటే, పోలీసు వాహనంలోకి ఎక్కించుకొనే వేళ వివస్త్ర అయ్యారు, పోలీసులు స్థానికుల ద్వారా వేరే బట్టలను తెచ్చి ఆమెకు ధరింపజేశారు అని చెప్పారు. ఈమెకు నేరచరిత ఉందని, గతేడాది 5 కేసులు దాఖలయ్యాయి, ఈ 7 రోజుల్లో 7 కేసులతో నమోదైనట్లు తెలిపారు. మహిళ వివస్త్రగా మారిన వీడియోలను ఎవరు వైరల్ చేశారన్నది దర్యాప్తు చేస్తామని చెప్పారు. అరెస్టు వేళ బీజేపీ మహిళా కార్యకర్తను వివస్త్రను చేశారని ధ్వజం పోలీసు స్టేషన్ ముట్టడి.. ఉద్రిక్తత సీఎం ఏమన్నారు? సీఎం సిద్దరామయ్య ఈ ఘటనపై స్పందిస్తూ ఆ మహిళ పోలీసులను కొరికింది, వెరీబ్యాడ్, ఈ సమయంలో 10 మంది పోలీసులు, వారు చట్టపరమైన చర్యలు తీసుకున్నారని సమర్థించారు. -
పెద్ద పులి పట్టివేత
మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకాలోని హనగోడు సమీపంలోని బీరతమ్మనహళ్లి అడవి సరిహద్దుల్లో సంచరిస్తూ గత కొన్ని నెలలుగా ప్రజలకు ఆందోళన కలిగించిన పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. కొబ్బరి తోటలో పెట్టిన బోనులో సుమారు 6–7 ఏళ్ల వయస్సుగల మగ పులి పట్టుబడింది. గత ఐదారు నెలల నుంచి హనగోడుతో పాటు సమీపంలోని హెమ్మిగె, హెమ్మిగె కాలనీ చుట్టుపక్కల గ్రామాల్లో తరచుగా పులి సంచరిస్తూ కొన్ని పశువులను బలి తీసుకుంది. దీంతో గ్రామస్తుల ఒత్తిడి మేరకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆపరేషన్ని ప్రారంభించారు. బుధవారం ఉదయం సిద్దేగౌడర కొబ్బరి తోటలోని బోనులోకి పులి పడింది. పులిని చూడాలని వేలాదిమంది జనం తరలివచ్చారు. బోనుకు సమీపంలో కట్టేసిన దూడ పులి గాండ్రింపులకు భయపడి సొమ్మసిల్లింది. ఏసీఎఫ్ లక్ష్మీకాంత్, ఆర్ఎఫ్ఓలు సుబ్రహ్మణ్య, నందకుమార్ తదితరులు సిబ్బంది చేరుకుని దానికి మత్తు మందు ఇచ్చి ప్రత్యేక వ్యాన్లో బెంగళూరు బన్నేరుఘట్ట జూపార్క్కి తరలించారు. విమానాశ్రయంలో గాలింపు మైసూరులోని మండకళ్లి విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతంలో కనిపించిన పులిని పట్టుకునేందుకు అటవీ సిబ్బంది కొడగులోని దుబారె శిబిరం నుంచి ప్రశాంత్, కంజన్, హర్ష, సుగ్రీవ అనే ఏనుగులను తెప్పించి గాలింపు ప్రారంభించారు. డీసీఎఫ్ పరమేష్, ఆర్ఎఫ్ఓ సంతోష్ హూగార్ పాల్గొన్నారు. అటవీ శాఖ నిపుణులైన సిబ్బంది, షూటర్లు, పశువైద్యుల బృందం అక్కడే మకాం వేసింది. మైసూరు జిల్లా హుణసూరు వద్ద ఆపరేషన్ టైగర్ -
హిప్పరగి డ్యాం గేట్ ధ్వంసం
రాయచూరు రూరల్: బాగలకోటె జిల్లా జమఖండి తాలూకాలో హిప్పరగి గ్రామం వద్ద కృష్ణా నదిపైనున్న హిప్పరగి డ్యాం గేట్ తెగి నీరు వృథా అవుతోంది. మంగళవారం సాయంత్రం డ్యాం గేట్ గొలుసు తెగిపోయింది. దీంతో సదరు గేటు తెగిపోయి నీరు భారీగా వెళ్లిపోతోంది. డ్యాంలో ఇప్పుడు 6 టీఎంసీలు నీరుంది. 22వ గేటు ధ్వంసం కావడంతో నీటి నిల్వ తగ్గుతోంది. ఈ బ్యారేజ్ అథణి తాలూకాకు సాగు, తాగు నీటిని అందిస్తోంది. వేసవి రాబోతున్న సమయంలో నీరు వృథా అవుతోందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందగానే బాగల్కోటె ఇన్చార్జి, ఎకై ్సజ్ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ బుధవారం వెళ్లి పరిశీలించారు. డ్యాంలో నీటి నిల్వ ఎక్కువగా ఉన్నందున కృష్ణ భాగ్య జల మండలి అధికారులతో చర్చించి నీటిని వృథా కాకుండా అరికట్టాలని, సత్వరం మరో గేట్ను అమర్చాలని సూచించారు. మంత్రి వెంట జిల్లాధికారి, ఇతర నీటిపారుదల శాఖ అధికారులున్నారు. మరమ్మతు పనులు జరుగుతున్నాయి. వృథాగా పోతున్న కృష్ణా జలాలు బాగల్కోట జిల్లాలో ఘటన మంత్రి తిమ్మాపూర్ తనిఖీ -
మహా దాసోహకు భారీగా అప్పడాల తయారీ
హొసపేటె: గవిసిద్దేశ్వర జాతర మహోత్సవంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా జాతర మహోత్సవం మూడో బుధవారం ప్రత్యేక వంటకంగా అప్పడాల పంపిణీ జరిగింది. బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకాలోని సిరిగేరికి చెందిన గవిశ్రీ స్నేహ ఫ్రెండ్స్ గ్రూప్, ఉదయ ఫ్రెండ్స్ గ్రూపుతో గత 8 ఏళ్లుగా వివిధ ఇమి, జిలేబీ తయారీ సేవల్లో పాల్గొంటున్నారు. సిద్రాంపుర, హావినహాళ, సిరిగేరి, దాసాపుర, కొంచగేరి, ముద్దటనూరు, గుండిగనూరు, పరిసర ప్రాంతాల గ్రామస్తుల సహకారంతో ఈ సంవత్సరం అప్పడాల పంపిణీ సేవను చేపట్టారు. అప్పడాల తయారీకి 14 డబ్బాల నూనె, 50 మంది వంట వారు, వారికి సహాయం చేయడానికి 20 మందిని అందించారన్నారు. మొత్తం రూ.5 లక్షల అప్పడాలను తయారు చేసి జాతరకు వచ్చిన భక్తులకు ఉచితంగా చేసినట్లు గవిమఠం ప్రతినిధులు తెలిపారు. -
గరుడ రాష్ట్ర అవార్డు ప్రదానం
బళ్లారి అర్బన్: సండూరు తాలూకా గరుడ న్యూస్ సంపాదకులు మహేష్ కమ్మత్తూర బృందం ఆధ్వర్యంలో 2026వ సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రశస్తి సమాజ సేవా రత్న అవార్డును డీ.అరుణ్కుమార్కు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. అరుణ్కుమార్ కర్ణాటక జలహిత రక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడుగా, వందేమాతరం యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడుగా, జగజ్యోతి బసవేశ్వర యువక సంఘం గౌరవ అధ్యక్షుడుగా, నెహ్రు యువ కేంద్రంతో పాటు వివిధ రంగాల్లో సేవలు అందించారు. బళ్లారికి చెందిన ఈయన సమాజ సేవను మెచ్చి గరుడ న్యూస్ అవార్డుకు ఎంపిక చేశామని గరుడ న్యూస్ నిర్వాహకులు తెలిపారు. అరుణ్కుమార్ మాట్లాడుతూ ఈ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు తనకు మరింతగా సేవ చేసేందుకు ప్రోత్సాహం లభించిందన్నారు. తాను శాయశక్తులా సమాజ చేయడం ద్వారా ఆపన్నులకు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. -
హంపీ, అంజనాద్రిలో వైఎస్సార్సీపీ నేత ఉమా
సాక్షి బళ్లారి: వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రముఖ వైఎస్సార్సీపీ నాయకుడు ఉమా మహేశ్వరనాయుడు హంపి, ఆనెగుందిని దర్శించుకొన్నారు. బుధవారం ఆయన హంపీలోని విరుపాక్షేశ్వరస్వామి, భువనేశ్వరిదేవి, పంపాదేవి, కోదండరామ ఆలయం, యంత్రోద్ధారక శ్రీఆంజనేయస్వామి ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. చారిత్రాత్మకమైన హంపి కట్టడాలను వీక్షించారు. హంపీలోని విజయవిఠల ఆలయం, రాతిరథం, మహానవమిదిబ్బ, కమల మహల్ తదితర స్మారకాలను వీక్షించి శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఈ ప్రాంతాన్ని సువర్ణయుగంగా చేశారని కొనియాడారు. అనంతరం ఆంజనేయస్వామి జన్మస్థలమైన అంజనాద్రిని దర్శించి అంజనాద్రి కొండపై 575 మెట్లను ఎక్కి కొండపై వెలసిన ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చలు కూడా చేయించారు. -
మిస్ఫైర్ కాదు, పక్కా ఫైరే
సాక్షి బళ్లారి: నగరంలో జనవరి 1వ తేదీన తన ఇంటి వద్ద కాల్పులు జరిగింది మిస్ఫైర్తో కాదని, పథకం ప్రకారమే కాల్పులు జరిపి రాజశేఖర్ అనే యువకుడి మృతికి కారకులయ్యారని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు ఆరోపణలు చేశారు. బుధవారం తన నివాసం గృహం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఘటన జరిగిన రోజు వీడియోలను మీడియాకు విడుదల చేశారు. పెద్ద టీవీ స్క్రీన్పై వాటిని ప్రదర్శించారు. మృతుడు రాజశేఖర్ కూడా తమ ఇంటిపై బాటిల్ విసిరాడన్నారు. అదే సందర్భంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో చిందర వందరగా వదిలి వెళ్లిపోయారన్నారు. బ్యానర్ కట్టే సమయంలో ఘర్షణ ముగిసిన తర్వాత రాత్రి 9 గంటలకు నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి రావడంతో మళ్లీ గొడవ ప్రారంభమైందన్నారు. పెద్ద రగడ చేయాలని హైడ్రామా పథకం ప్రకారం తమ వారిపై కాల్పులు జరిపి పెద్ద రగడ చేయాలని హైడ్రామా చేశారన్నారు. ఆ వీడియో చూస్తే మిస్ఫైర్ కాదు, పథకం ప్రకారం ఫైర్ చేశారనే విషయం స్పష్టమవుతోందన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎమ్మెల్యే నారా భరత్రెడ్డిని, సతీష్రెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని లేకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు రావడం ఖాయమన్నారు. 17వ తేదీన ఆందోళన చేపడతామని, సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ బళ్లారిలో విలేకరులతో మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయన శాంతి భద్రతలను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే భరత్రెడ్డి రాకతోనే మళ్లీ గొడవ ప్రారంభం విలేకరులతో మాజీ మంత్రులు గాలి జనార్దన్రెడ్డి, శ్రీరాములు -
ఎమ్మెల్యే చాటింగ్ రచ్చ
శివాజీనగర: తన ఇన్స్టా ఖాతాను హ్యాక్ చేసి ఓ యువతికి మెసేజ్ పంపి చెడ్డపేరు తీసుకొచ్చే కుట్ర జరిగింది, ఇది కాంగ్రెస్ ఐటీ టీం పని అని బీజేపీ ఎమ్మెల్యే సీ.కే.రామమూర్తి ఆరోపించారు. ఆయన ఖాతాతో ఫేస్బుక్, ఇన్స్టాలో చాటింగ్లు వైరల్ అయ్యాయి. దీనిపై మీడియాతో స్పందిస్తూ, రీల్స్ బాగుందని హాసన్కు చెందిన మహిళకు మెసేజ్ వెళ్లింది, వెంటనే కాంగ్రెస్ ఐటీ టీం వైరల్ చేసింది. ఇది ఎలా సాధ్యం? అని అన్నారు. నా పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలున్నాయి, నా ఖాతా రెండుసార్లు హ్యాక్ అయ్యింది అని చెప్పారు. యూత్ కాంగ్రెస్ టీంపై పరువునష్టం కేసు వేస్తానని అన్నారు. -
గ్రామాభివృద్ధికి సభ్యుల నిర్ణయమే అంతిమం
బళ్లారి రూరల్ : గ్రామాభివృద్దికి ఆ గ్రామ పంచాయతీ సభ్యులే తీర్మానించి తగు చర్యలు తీసుకోవాలని దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున తెలిపారు. దావణగెరె జెడ్పీ, టీపీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మాయకొండ నియోజకవర్గంలోని హొన్నూరు గ్రామంలో పనికి ఆహార పధకం కూలికార్మికులకు ఏర్పాటు చేసిన ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. గ్రామాల్లో అవసరమైన పాఠశాలలు, మరుగుదొడ్లు, రోడ్ల నిర్మాణానికి తీర్మానాలు తీసుకొని తగు చర్యలు చేపట్టాలన్నారు. హొన్నూరు గ్రామ పంచాయితీ అధికారులు పనికి ఆహార పథకం అమలు చేయడంలో తమ కర్తవ్యాన్ని నిర్వహించారని కొనియాడారు. ఉత్తమ కూలీకార్మికులకు ఉద్యోగాన్ని కల్పించారన్నారు. పనికి ఆహార పథకం కూలికార్మికులు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగ పడుతోందన్నారు. ఈ పథకాన్ని యూపీఏ ప్రభుత్వంలో దివంగత మాజీ ప్రధాని 2005లో ప్రవేశ పెట్టింది. ఈ పథకాన్ని ఇప్పటికి కేంద్రప్రభుత్వం పేరు మార్చి అమలు చేస్తోందన్నారు. ఎమ్మెల్యే బసవంతప్ప, జెడ్పీ సీఈఓ గిత్త మాధవరావు విఠ్ఠల్, జీపీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు పౌష్టికాహారం అందించరూ
రాయచూరు రూరల్ : రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం సగం మేర బంద్ చేశారని అంగన్వాడీ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. బుధవారం మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు పద్మ మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలో మూడేళ్ల నుంచి ఆరేళ్ల వరకు వయస్సు గల పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ విషయంలో సర్కార్ కేవలం గుడ్డు, గోధుమ పిండి, బియ్యం, పొడి, చిన్నపాటి సరుకులు ఇస్తుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు పిల్లలతో పాటు ఇతర పనులు అప్పగించడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి లోపాలు రాకుండా పని చేస్తున్నారన్నారు. న్యాయసమ్మతంగా విధులు నిర్వహించే కార్యకర్తలపై ఆరోపణలను పరిగణనలోకి తీసుకోకూడదని అధికారి నవీన్కు వినతిపత్రం సమర్పించారు. -
కన్నడకు కువెంపు సేవలు భేష్
రాయచూరు రూరల్ : జాతీయ కవి కువెంపు కన్నడ భాషకు చేసిన సేవలు భేష్ అని జిల్లా వార్త ప్రచార శాఖాధికారి గవిసిద్దప్ప హొసమని వెల్లడించారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో కువెంపు జయంతిని జ్యోతి వెలిగించి మాట్లాడారు. కువెంపు కన్నడ భాషకు చేసిన సేవలను గురించి వివరించి కొనియాడారు. కన్నడ భాషకు జ్ఞానపీఠ అవార్డు రావడానికి ప్రధాన కారకుడన్నారు. కార్యక్రమంలో వెంకట్రావ్ కులకర్ణి, వీర హనుమాన్, సీకే జైన్, మ్యాదర్, రావుత్రావ్, ప్రతిభ పాల్గొన్నారు. కుస్తీ పోటీలు అదుర్స్ హొసపేటె: కొప్పళ గవిసిద్దేశ్వర జాతర సందర్భంగా బుధవారం క్రీడా మైదానంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేశారు. గవిమఠం ప్రాంగణంలో పురుషులు, మహిళల కుస్తీ పోటీలు హోరాహోరీగా జరిగాయి. వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నాగవేణి మాట్లాడుతూ కుస్తీ ఓ పురాతన క్రీడ అన్నారు. ఈ క్రీడ ప్రతి వ్యక్తిలో శారీరక, మానసిక సమతుల్యతను పెంపొందించడంలో సహాయ పడుతుంది. తద్వారా వారిని బలమైన వ్యక్తిగా మార్చడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. పురుషుల విభాగంలోని 16 జట్ల కుస్తీ పోటీదారులు పాల్గొన్నారు. ఘనంగా ఫలపుష్ప ప్రదర్శనహొసపేటె: గవిసిద్దేశ్వర జాతర మహోత్సవంలో భాగంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జనవరి 5 నుంచి 14 వరకు గవిమఠం తేరు మైదానంలో 10 రోజుల ఉద్యానవన, ఫల, పుష్ప ప్రదర్శన–2026 నిర్వహిస్తున్నారు. ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ కృష్ణ ఉక్కుంద మాట్లాడుతూ ఈ సంవత్సరం ఉద్యానవన పండ్ల, పుష్పాల ప్రదర్శనలో ఉద్యానవన శాఖ నుంచి అందుబాటులో ఉన్న వివిధ పథకాల గురించి రైతులకు తెలియజేశారన్నారు. ఈ సంవత్సరం రైతుల కోసం విదేశీ కూరగాయలను, పండ్ల ప్రదర్శనను ఏర్పాటు చేశామన్నారు. నేల రహిత వ్యవసాయం(హైడ్రో ఫోనిక్స్ లేదా నీటి వ్యవసాయం)లో కూరగాయల సాగుపై ప్రదర్శన ఇస్తున్నామన్నారు, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థిని చితకబాదిన గెస్ట్ టీచర్ రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకాలో ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని అతిథి ఉపాధ్యాయిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడో తరగతి చదువుతున్న ఖాజాసాబ్ను కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న అతిథి ఉపాధ్యాయిని తరగతి గదిలో కట్టేసి వంటిపై వాతలు తేలేలా కొట్టారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి పరిశీలించగా తరగతి గదిలో కట్టేసి కొట్టిన ఖాజాసాబ్ను ఇంటికి తీసుకొచ్చి ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. కాగా విద్యార్థిని చితక బాదిన ఉపాధ్యాయినిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వెనెజువెలాపై దాడి తగదు రాయచూరు రూరల్ : అగ్రరాజ్యం అమెరికా చిన్న దేశం వెనెజువెలా రాజధానిపై దాడి చేయడం తగదని ఎస్యూసీఐ పేర్కొంది. బుధవారం అంబేడ్కర్ ప్రతిమ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు ఎన్ఎస్ వీరేష్ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సైనిక బలంతో వెనెజువెలాపై దాడికి దిగి, అధ్యక్షుడు నికోలాస్ మదురో, అతని భార్య సిలియో ఫ్లోరిస్ను కిడ్నాప్ చేయించడం సరికాదన్నారు. ఈ ఘటనను యూరప్ దేశాలు ఖండించక పోగా దానికి మద్దతు పలకడం శోచనీయమన్నారు. కిడ్నాప్కు గురైన వారి విడుదలకు భారత్తో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు ముందుకు రావాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. తుపాకీ స్వాధీనం కెలమంగలం: అంచెట్టి సమీపంలో గెస్తూరు గ్రామంలో హుచ్చేగౌడు తోటలో పోలీసులు సోదాలు జరిపారు. గడ్డి వాము కింద దాచి ఉంచిన నాటు తుపాకీని స్వాధీనపరుచుకొన్నారు. సొంతదారు మునిశివణ్ణ (45)ను అరెస్ట్ చేశారు. అంచెట్టి సీఐ సమిద్రావ్, పోలీసులు పాల్గొన్నారు. -
హెల్మెట్తో.. టెక్కీ బ్రిలియంట్ ఐడియా
సాక్షి,బెంగళూరు: ఐటీ ఉద్యోగి వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. పంకజ్ తన్వర్ తన హెల్మెట్ను వినూత్నంగా మార్చారు. సాధారణ హెల్మెట్ను కృత్రిమ మేధస్సు ఆధారిత రోడ్ సేఫ్టీ టూల్గా మార్చేశారు.పంకజ్ తన్వర్ ఆవిష్కరణ ఒక సాధారణ ఆలోచనతో మొదలైంది. ‘టెక్నాలజీని కేవలం సౌకర్యం కోసం కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించాలి’ అనే సదుద్దేశ్యంతో ఆయన ఈ హెల్మెట్ను రూపొందించారు.ఈ స్మార్ట్ హెల్మెట్ ద్వారా ట్రాఫిక్ పోలీసులకు నిర్ధారిత ఆధారాలు చేరుతాయి. ఫలితంగా, రోడ్లపై క్రమశిక్షణ పెరుగుతుంది. చిన్న ఆవిష్కరణ కూడా ప్రతిరోజు జీవనాన్ని మరింత సురక్షితంగా మార్చగలదని నమ్ముతున్నారు.బెంగళూరులో పుట్టిన ఈ ఆవిష్కరణతో ఇన్నోవేషన్, టెక్నాలజీ కలిస్తే సమాజానికి ఎంతటి మేలు జరుగుతుందో స్పష్టంగా తెలుస్తోంది. ఒక సాధారణ హెల్మెట్ను ఏఐ ఆధారిత రోడ్ సేఫ్టీ సాధనంగా మార్చిన పంకజ్ తన్వర్ ఆవిష్కరణ, రోడ్లపై క్రమశిక్షణను పెంచుతూ, ప్రజల జీవనాన్ని మరింత సురక్షితంగా మార్చే దిశగా అడుగులు పడినట్లేనని పలువురు వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హెల్మెట్ ప్రత్యేకతలు ఈ స్మార్ట్ హెల్మెట్ రియల్ టైమ్లోనే ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించగలదువిజువల్స్ను క్యాప్చర్ చేయడంలొకేషన్ వివరాలు నమోదు చేయడం వాహన నంబర్ ప్లేట్ను గుర్తించడం సమాచారాన్ని ధృవీకరించి ట్రాఫిక్ పోలీసులకు పంపించడం విధంగా, రోడ్లపై జరుగుతున్న ఉల్లంఘనలకు తక్షణ సాక్ష్యాలు అందుబాటులోకి వస్తాయి -
అతి కిరాతకంగా భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త..
విజయనగర జిల్లా: విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలో వరుసగా హత్యలు జరగడంతో నగర ప్రజలు హడలెత్తుతున్నారు. ఇటీవల తాలూకాలోని కారిగనూరు వద్ద పురుషుడు, కమలాపుర సమీపంలోని వెంకటాపుర క్యాంప్లో వివాహిత హత్య ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు హత్య కేసులను మరువక ముందే నగరంలోని చాపలగడ్డ ప్రాంతంలో మంగళవారం ఉదయం మరో మహిళ గొంతు కోసి హత్య చేసిన ఘటన నగరంలో చర్చనీయంగా మారింది. హత్యకు గురైన మహిళ ఉమా (35) నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని చాపలగడ్డ ప్రాంతవాసి. ఆమె భర్త ఖాజా హుస్సేన్ ని చిత్తవాడ్గి పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే రెండో పెళ్లి.. ఉమాకు 13 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్కు చెందిన రఘు అలియాస్ రామాంజినితో వివాహమైంది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉమా గత 6 ఏళ్లుగా తన భర్త నుంచి విడిపోయి చాపలగడ్డలోని తన ఇంట్లో ఉంటోంది. ఉమా నాలుగు నెలల క్రితం నగరానికి చెందిన ఖాజా హుస్సేన్ అనే వ్యక్తిని పరిచయం చేసుకొని కొండనాయకనహళ్లిలోని సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకొంది. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరగడంతో ఖాజా హుస్సేన్ కోపోద్రేకంలో ఉమాను కత్తితో గొంతు కోసి చంపినట్లు చిత్తవాడిగి పోలీసులు తెలిపారు. విజయనగర జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి, ఏఎస్పీ మంజునాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై చిత్తవాడిగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.భర్తపై భార్య దాడి బనశంకరి: రెండో భార్యను వదిలేయాలని మొదటి భార్య.. భర్తపై (రౌడీషిటర్) దాడికి పాల్పడింది. ఈ ఘటన జేజే నగర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దాడికి గురైన భర్త మొదటి భార్యపై జేజే నగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివరాలు.. జేజే నగర నివాసి సయ్యద్ అస్గర్ చోరీలు, డ్రగ్స్ విక్రయాల కేసులో జైలు పాలయ్యాడు. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్యను వదిలేయాలని భర్త సయ్యద్ అస్గర్ను మొదటి భార్య కోరింది. భర్త ఒప్పుకోక పోవడంతో మొదటి భార్య దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ అస్గర్ను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జేజే నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘర్షణ కారకులను అరెస్ట్ చేయాలి
సాక్షి,బళ్లారి: మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ జరిగే క్రమంలో గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద ఘటనకు మూల కారణమైన వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని డీసీఎంపై మాజీ మంత్రి బీ.శ్రీరాములు మండిపడ్డారు. ఆయన మంగళవారం నగరంలోని గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. ఘటనకు కారణమైన నారా భరత్రెడ్డితో సీఎం మాట్లాడతారు, డీసీఎం ఆయన్ను పక్కన కూర్చొబెట్టుకుని పత్రికా సమావేశం నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు మృతుడి కుటుంబానికి ఏం న్యాయం చేస్తారు? ఘటనకు మూల కారకులైన వారిని అరెస్ట్ చేస్తారా, లేదా వేచిచూస్తామన్నారు. దాడి చేయడానికి పెద్ద ఎత్తున గూండాలను తీసుకుని వచ్చి రగడ సృష్టించారు, కాల్పులు జరిపారు, తమపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? దాడికి ప్రతి దాడి చేయడం సహజమేనని మండిపడ్డారు. అయితే ఘర్షణను తాను ఏమాత్రం సమర్థించేది లేదన్నారు. ఎమ్మెల్యే ఏమైనా సత్యవంతుడా? ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఏమైనా సత్యవంతుడా? అని ప్రశ్నించారు. తమ వారు ప్రాణ రక్షణ కోసం కట్టెలు, కారంపొడి తెచ్చి ఉండవచ్చు. అంతమాత్రాన కాంగ్రెస్ వారు దాన్ని బూతద్దంలో చూపడంలో అర్థం లేదన్నారు. మనుషుల ప్రాణాలు తీసేందుకు కాల్పులు జరపడం ఎక్కడైనా చూశామా? సతీష్రెడ్డి గన్మెన్ కాల్చడంతోనే వ్యక్తి మృతి చెందారని దర్యాప్తులో కూడా తేలిందన్నారు. వారు ఎవరిని హత్య చేయడానికి కాల్పులు జరిపారో అందరికీ తెలిసిందేనన్నారు. ప్రైవేటు వ్యక్తులు గన్మెన్ను కాల్చారంటే వారికి ఎంత ధైర్యం? అని మండిపడ్డారు. శ్రీరాములుపై, గాలి జనార్దనరెడ్డిపై కాల్పులు జరుగుతున్నాయని జనం పరుగెత్తుకుని వచ్చారన్నారు. గాలి జనార్దనరెడ్డి పక్కనే ఉన్నప్పుడు కాల్పులు జరిగాయన్నారు. ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారన్నారు. నిన్న సత్యశోధన కమిటీని పంపారు. నేడు మృతుడి కుటుంబ పరామర్శకు శివకుమార్ వచ్చారన్నారు. ప్రాణరక్షణకు కట్టెలు, కారంపొడి తెచ్చి ఉండవచ్చు విలేకరులతో మాజీ మంత్రి శ్రీరాములు వెల్లడి -
నిఘా నీడలో ఇనాం వీరాపుర
హుబ్లీ: కులాంతర వివాహం చేసుకొని కన్న తండ్రి చేతిలో కర్కశంగా బలైన 7 నెలల గర్భిణి మాన్య నివసించే ఇనాం వీరాపుర గ్రామం సీసీ టీవీ డేగ కళ్ల పహారాలో చిక్కుకుంది. ఇనాం వీరాపుర గ్రామంలో భయంతో కూడిన వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గత నెల 21న మాన్య పాటిల్ హత్యతో ఆందోళనకు గురైన ఈ చిన్న గ్రామ ప్రజలు భయంతో ఇల్లు వదిలి బయటకు రావడం లేదు. ప్రస్తుతం ఆ గ్రామంలో పరిస్థితులు కుదుట పడటంతో ప్రజలు కాసింత ఊరట చెంది భయాన్ని వదిలి బయటకు వస్తున్నారు. ఎప్పటిలాగే రోజు వారీ పనులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు, అంగళ్లు యథావిధిగా ప్రారంభించారు. పోలీస్ బందోబస్తు కొనసాగుతూనే ఉంది. ఘటనపై స్థానికులు పెదవి విప్పడానికి ఇప్పటికీ భయపడుతున్నారు. ఇలాంటి దారుణ హత్య జరిగి ఉండాల్సింది కాదని, అయినా ఏం చేయగలమని అని వారు నిస్సహాయతను వ్యక్తం చేశారు. ప్రతి వీధిలోనూ సీసీ కెమెరాలు కాగా ఆ ఊరిలోని ప్రతి వీధిలో కూడా సీసీ టీవీ కెమెరాలు పహారా కాస్తున్నాయి. పరువు హత్యతో తమ గ్రామానికి చెడ్డ పేరు రావడంతో ప్రజలు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. భారీ బందోబస్తు మధ్య సీసీ టీవీల నిఘా కళ్లతో పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితులను విశ్లేషిస్తోంది. స్థానికులు కూడా ఈ విషయమై సామరస్య వాతావరణం ఉండాలని, జరిగిన హత్య వ్యక్తిగత కారణంగా జరిగిందన్నారు. అన్ని కులాల వారికి చెందిన 150 ఇళ్లు ఉన్నాయని, గ్రామంలో సుమారు 600 జనాభా ఉందని స్థానికులు వివరించారు. అందరూ సామరస్యంతో సుహృద్భావంతో జీవిస్తున్నామన్నారు. మొత్తం మీద 17 రోజులుగా ఉన్న భయానక వాతావరణం నుంచి ఇనాం వీరాపుర గ్రామస్తులు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. -
అధికారులపై ఎమ్మెల్యే విసుర్లు
రాయచూరు రూరల్: గ్రామీణ అసెంబ్లీ పరిధిలో వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి జరిగిన కేడీపీ సమావేశంలో గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్ అధికారులపై మండిపడ్డారు. మంగళవారం తాలూకా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జెస్కాం, సాంఘీక సంక్షేమ శాఖ, పంచాయతీ అభివృద్ధి అధికారుల మధ్య సమన్వయం లభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అధికారులు, కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. తోటల పెంపకానికి ప్రాధాన్యత కల్పించాలని, విద్యుత్ మీటర్ లేదు, బిల్ కట్టలేదంటూ విద్యుత్ను కట్ చేయరాదన్నారు. అక్రమంగా ఇసుక రవాణ నియంత్రణకు అధికారులు ముందుండాలన్నారు. పీడీఓలు గ్రామాల్లో పర్యటించి సమస్యలపై స్పందించాలని సూచించారు. సమావేశంలో ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, ఆర్ ఏపీఎంసీ అధ్యక్షుడు జయంతిరావ్, పంచ గ్యారెంటీల అధ్యక్షుడు పవన్ పాటిల్, టీపీ ఈఓ చంద్రశేఖర్, ఏసీ హంపన్న, తహసీల్దార్ సురేష్ వర్మ, అధికారిణి వనిత, శరణ బసవ, సభ్యులు పల్లవి, ఈరేశ, రామప్ప, శ్రావణి, తిమ్మప్ప, చెన్నబసవనాయక్, ఫారూక్, జిలానీలున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
సాక్షి,బళ్లారి: వారందరూ వక్కలు వ్యాపారం చేసేవారు. వక్కతోటకు వెళ్లి పంట కోయడానికి ఏర్పాట్లు చేసుకుని తిరిగి వస్తుండగా, రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం రాత్రి చిత్రదుర్గ జిల్లా హొళల్కెరె తాలూకా సాసలు సమీపంలో బొలెరో వాహనం బోల్తా పడటంతో కల్లవ్వనాగతిహళ్లి గ్రామానికి చెందిన గిరిరాజ్, కిరణ్, అరుణ్, హనుమంతప్ప అనే నలుగురు మృతి చెందారు. బొలెరో వాహన డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంతో వాహనం నడుపుతూ రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో ఘటన స్థలంలో, గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరో ఇద్దరు కలిపి మొత్తం నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని దావణగెరె ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే హొళల్కెరె పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవించే వక్కల వ్యాపారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కల్లవ్వనాగతిహళ్లిలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. బొలెరో వాహనం బోల్తా చిత్రదుర్గం జిల్లాలో ఘోరం ఘటనా స్థలంలో ఇద్దరు మృతి ఇదే ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి -
ఎక్కడైనా బ్యానర్ కట్టవచ్చు
సాక్షి,బళ్లారి: బ్యానర్లు నా ఇంటి ముందూ కట్టవచ్చు, సీఎం ఇంటి ముందు కూడా బ్యానర్లు కడతారని, అంతమాత్రాన ఇంత రాద్ధాంతం చేయాలా? అని ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రశ్నించారు. ఆయన మంగళవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. రగడకు కారకులందరిపై చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. బళ్లారి గౌరవాన్ని కాపాడేందుకు పార్టీలకతీతంగా పని చేయాలన్నారు. ఉన్నతాధికారుల సలహా సూచనలతోనే ఎస్పీని సస్పెండ్ చేశారన్నారు. పుణ్య పురుషుడు వాల్మీకి విగ్రహావిష్కరణ చేయడంలో రగడ జరగడం, ఒక యువకుడు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. గొడవ జరిగిన వెంటనే తనకు మొదట ఫోన్ చేసిన వ్యక్తి మాజీ మంత్రి శ్రీరాములులేనన్నారు. పరిస్థితి అదుపు తప్పుతోందని చెప్పారని, తాను వెంటనే ఎస్పీతో మాట్లాడానన్నారు. అయితే ఎందుకు, ఎలా జరిగింది అనేదానిపై పోలీసులు విచారణ చేసి, చట్టప్రకారం ఇప్పటికే పలువురు అరెస్ట్ చేశారని, ఇంకా అరెస్ట్లు కూడా చేస్తారన్నారు. కాల్పుల ఘటన జరగకూడదని, అందుకు సంబంధించిన గన్మెన్లను కూడా అరెస్ట్ చేశారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా పని చేస్తున్నారన్నారు. గాలి జనార్దనరెడ్డి పైకి గురిపెట్టి ఎక్కడ కాల్చారు? ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మండిపాటు బళ్లారిలో పర్యటన, మృతుని కుటుంబానికి పరామర్శ పక్కా స్కెచ్తోనే విగ్రహావిష్కరణకు బ్రేక్ నగరంలో రెండు రోజుల తర్వాత జరగాల్సిన వాల్మీకి విగ్రహావిష్కరణను పథకం ప్రకారమే అడ్డుకున్నారనే అనుమానం కలుగుతోందని డీసీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. రాజశేఖర్ మృతదేహానికి రెండుసార్లు పోస్టుమార్టం నిర్వహించారని కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి పేర్కొనడంలో అర్థరహితమన్నారు. ఆయన రాజకీయంగా దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదన్నారు. ఆయన వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కచ్చితంగా ఒకేసారి పోస్టుమార్టం జరిగిందని అధికారులు సమాధానం ఇచ్చారన్నారు. రెండుసార్లు పోస్టుమార్టం కోరితే చేస్తారని, ఎలా పడితే అలా పోస్టుమార్టం చేయరన్నారు. తనపై కాల్పులు జరిపారని, హత్య చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్న గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిని ఎక్కడ కాల్చారు, ఎలా కాల్చారో చెప్పాలని ఎద్దేవా చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్, ఎమ్మెల్యేలు నారా భరత్రెడ్డి, నాగేంద్ర, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ధార్వాడ హైకోర్టుకు బాంబు బూచీ
హుబ్లీ: ధార్వాడ హైకోర్టు పీఠంలో బాంబు పెట్టినట్లు అధికారులకు ఈ–మెయిల్ చిరునామాకు సందేశం అందింది. ఈ నేపథ్యంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జిల్లా ఎస్పీ గుజ్జన్ ఆర్య నేతృత్వంలో తీవ్రంగా గాలించారు. కోర్టు హాలు నుంచి న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగులు తదితరులతో పాటు కక్షిదారులను హుటాహుటిన బయటకు పంపి వేసి బాంబు స్క్వాడ్ దళంతో అణువణువు పరిశీలించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ–మెయిల్ ద్వారా సమాచారం వచ్చిందన్నారు. దీంతో తాను తక్షణమే పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశానన్నారు. అందరినీ బయటకు పంపించి వివిధ బృందాలతో కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. పరిశ్రమల అభివృద్ధికి చొరవ చూపాలి రాయచూరు రూరల్: రాయచూరులో పరిశ్రమల అభివృద్ధికి చొరవ చూపాలని రాయచూరు కాటన్ మిల్లర్స్ సంఘం అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాటన్ మిల్లర్స్ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాయచూరులో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కురుబదొడ్డి, సింగనోడి, చంద్రబండల్లో 693 ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. ఖాళీ స్థలానికి ప్రభుత్వం పన్ను విధించడాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రాయచూరు జిల్లాలో యువతకు ఉద్యోగాలు కల్పించేలా స్పిన్నింగ్ మిల్లును ప్రారంభించాలన్నారు. అన్నదాన కేంద్రం ప్రారంభం హుబ్లీ: నగరంలో నిరాశ్రయులకు కాసింత ఓదార్పునిచ్చి తమకు చేతనైన రీతిలో వారికి అండదండగా నిలిచిన నగరంలోని కరియప్ప శిరహట్టి దంపతులు తమ సమాజ సేవలను విస్తరించారు. క్రమంలో వారు గదగ్ జిల్లా చారిత్రాత్మక స్థలం లక్ష్మేశ్వరలో ఆకలిగొన్న వారికి అన్నం పెట్టే అన్నదాత సత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆ మేరకు మంగళవారం సంబంధిత బోర్డును ఆ గ్రామ ప్రముఖులచే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరియప్ప శిరహట్టి సేవా సంఘం అధ్యక్షుడు కరియప్ప మాట్లాడుతూ గత 15 ఏళ్ల నుంచి హుబ్లీలోని వీధుల్లో నిరాశ్రయులకు, దిక్కుమొక్కులేని వారికి స్నానం, గడ్డం చేయించి, బట్టల పంపిణీతో పాటు అన్నం, చపాతీలు పెట్టే వారమన్నారు. ఈ క్రమంలో తమ సేవలను తమ సొంత ఊరు అయిన లక్ష్మేశ్వరలో కూడా చేపట్టాలని స్థానికులు మద్దతు తెలపడమే కాక అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించడంతో లక్ష్మేశ్వరలో ఆకలిగొన్న వారికి అన్నం పెట్టే కేంద్రంగా హసిదవర అన్నజోళిగె కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. నిరాశ్రయులు తమను సంప్రదించి, తమ ఆకలి బాధలను, ఇతర సమస్యలను తీర్చుకోవచ్చని కరియప్ప, సునంద దంపతులు తెలిపారు. -
నేరాల నియంత్రణపై ముమ్మర ప్రచారం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగం నడుం బిగించాలని ఎస్పీ అరుణాంగ్షు గిరి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని సైబర్ పోలీస్ స్టేషన్ను సందర్శించి అధికారులకు సలహా సూచనలు ఇచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ట్రాఫిక్ నియమాలు, ఈఆర్ఎస్ 112, 1930 సహాయవాణి ద్వారా ప్రజలు సహకరించాలన్నారు. ఈ విషయంలో సాంకేతిక రంగంలో మార్పులు వచ్చినా నేరాలు కట్టడి కాకపోవడంపై అందరూ ఆలోచించాలన్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్ట్రాగాంవంటి వాటిని వినియోగించే ముందు ఆలోచించుకోవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ హరీష్, డీఎస్పీ శాంతవీర, ఇతర పోలీస్ అధికారులున్నారు. -
జోషి పరిశోధనా సహకారం అపారం
హొసపేటె: కన్నడ భాష, సంస్కృతి, పరిశోధన రంగానికి లోతైన, విమర్శనాత్మక కృషి చేసిన ప్రముఖ ఆలోచనాపరుడిగా డాక్టర్ శంబా జోషి గుర్తింపు పొందారని హంపీ కన్నడ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ డీవీ.పరమశివమూర్తి తెలిపారు. ఆయన కన్నడ యూనివర్సిటీలో జరిగిన డాక్టర్ శంబా జోషి 130వ జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. డాక్టర్ శంబా జోషి తనను తాను ఉపరితల అధ్యయనాలకే పరిమితం చేసుకోలేదు. కానీ సమాజంలోని లోతుల్లోకి వెళ్లి కొత్త పరిశోధనలు చేశారన్నారు. ఇప్పటికే స్థాపించిన నమూనాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా అతను విమర్శనాత్మక, ప్రశ్నించే పరిశోధన పద్ధతిని అనుసరించారన్నారు. డాక్టర్ శ్యామ్ బీ.జోషి బంధుత్వం, జానపద కథలు, సంస్కృతం మూలాలపై అనేక ముఖ్యమైన పరిశోధనలు నిర్వహించారన్నారు. కనిపించని మూలాల విలువలు, సాంస్కృతిక చిహ్నాలను కనిపించే మూలాల కంటే ఎక్కువగా అధ్యయనం చేయాలనే అభిప్రాయాన్ని ఆయన సమర్థించాడు. ఈ రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై అల్లర్లు జరుగుతున్న సమయంలో, కన్నడ, మరాఠీ మాట్లాడే వారి మధ్య సాంస్కృతిక జీవితం సామాజిక ప్రవర్తన, రాజకీయ అంశాలు దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయని డాక్టర్ శ్యామ్.బీ జోషి చాలా కాలం క్రితమే స్పష్టం చేశారని వైస్ ఛాన్సలర్ గుర్తు చేశారు. భాష విభజన సాధనంగా కాకుండా సృజనాత్మకతకు వారధిగా నిలిచిందన్నారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేదు
రాయచూరు రూరల్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ పార్టీకి పొత్తు లేదని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జెడ్పీ, టీపీ, జీపీ, నగరసభ, సిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. బీఎల్ఓల వద్ద ఉన్న ఓటర్ల జాబితాను సరి చేసి విడిచి పెట్టిన వారి పేర్లను నమోదు చేయడానికి అందరూ ముందుండాలని అన్నారు. ఈ నెల 11 నుంచి దేవదుర్గలో సోషల్ మీడియా ద్వారా ప్రచారానికి శ్రీకారం చుడతామన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మాత్రమే బీజేపీ, జేడీఎస్ పార్టీల మైత్రి కొనసాగుతుందన్నారు. విలేఖర్ల సమావేశంలో శివశంకర్, నరసింహ నాయక్, రామకృష్ణ, లక్ష్మిపతి, అమరేష్ పాటిల్, నాగరాజ్లున్నారు. వెనెజువెలాపై దాడి తగదు హొసపేటె: దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాపై శనివారం అమెరికా సైనిక దళాలు నిర్వహించిన వైమానిక దాడిని ఖండిస్తూ నగరంలో సీపీఐ(ఎం) కార్యకర్తలు నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బోర్డు సభ్యుడు బసవరాజ్ మాట్లాడుతూ వెనెజువెలాపై అమెరికా దాడిని, అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోరెస్ అపహరణను సీపీఎం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. భారత్ సీపీఎంతో సహా వామపక్షాలు వెనెజువెలా దేశ ప్రజలకు మద్దతు తెలిపాయని ఆయన అన్నారు. నిరసనలో సీపీఎం కార్యదర్శి ఎన్.యల్లాలింగ, రాష్ట్ర కమిటీ నాయకురాలు బి.మాళమ్మ, ఎం.గోపాల్, ఎం.జంబయ్య నాయక్, వి.స్వామి, బీ.మహేష్, కే.నాగరత్నమ్మ, సిద్దలింగప్ప, సుంకమ్మ, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. వెనెజువెలాపై దాడికి నిరసన రాయచూరు రూరల్: అమెరికా సైన్యం వెనెజువెలా వంటి చిన్న దేశంపై దాడి చేయడం తగదని సీపీఐ(ఎంఎల్) పేర్కొంది. మంగళవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు వీరేష్ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిన్న దేశమైన వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురో, భార్యను కిడ్నాప్ చేయడం సరి కాదన్నారు. ఈ ఘటనను ఇతర యూరప్ దేశాలు ఖండించక పోవడంతో పాటు దానికి మద్దతు పలకడం అమానుషమన్నారు. కిడ్నాప్కు గురైన వారి విడుదలకు భారత్తో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర దేశాలు ముందుకు రావాలని కోరుతూ డొనాల్డ్ ట్రంప్ చిత్రపటాన్ని దహనం చేశారు.నీలగల్ జాతరకు శ్రీకారం రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా నీలగల్లో ఈ నెల 10 నుంచి జరగనున్న జాతర ఉత్సవాలకు నాల్వార కోరి సిద్దేశ్వర పీఠాధిపతి తోటేంద్ర స్వామీజీ శ్రీకారం చుట్టారు. సోమవారం రాత్రి మఠంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం హేమరెడ్డి మల్లమ్మ పురాణం గురించి వివరించారు. కేవలం సహనంతో ఆదర్శ గృహిణిగా జీవితాన్ని సాగించిన సాధ్వి అని అన్నారు. శివభక్తితో పాటు సంసారిక జంజాటంలో ఉన్న ఒడిదుడుకులను సైతం ఎదిరించిన మహా సాధ్విగా కొనియాడారు. మానవుడు సమాజంలో సత్పురుషునిగా మారాలని సూచించారు. పంచాక్షరి, అభినవ రాచోటి రేణుక శాంతమల్ల శివాచార్య, విరుపాక్ష పండితారాధ్య, శంభు సోమనాథ శివాచార్య, విశ్వారాధ్య, మహాంతదేవరులున్నారు. విద్యుదుత్పత్తి కేంద్రాల పరిశీలన రాయచూరు రూరల్: ఆర్టీపీఎస్, వైటీపీఎస్ విద్యుత్ స్ధావరాలను తుమకూరు సిద్దగంగ మఠం పీఠాధిపతి సిద్దలింగ స్వామీజీ వీక్షించారు. సోమవారం ఆర్టీపీఎస్, వైటీపీఎస్ అధికారులు స్వామీజీకి యూనిట్ల పని తీరు, బాయిలర్, కూలింగ్ టవర్, ఉత్పత్తి సామర్థ్యం కల ప్లాంట్లను చూపించారు. రాయచూరు నుంచి రాష్ట్రానికి 60 శాతం విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలను చూశారు. నీటి ఆవిరితో విద్యుత్ ఉత్పత్తి వల్ల ఈ ప్రాంత ప్రజలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం విచిత్రమన్నారు. ఈ ప్రాంతంలో అధిక మొత్తంలో చెట్లు నాటాలని అధికారులకు సూచించారు. -
మృతుడి కుటుంబానికి డీకేశి పరామర్శ
సాక్షి,బళ్లారి: జనవరి 1వ తేదీన నగరంలోని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద చోటు చేసుకున్న రగడలో ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఆప్తుడు సతీష్రెడ్డి గన్మెన్ గురుచరణ్ సింగ్ కాల్పులు చేసిన నేపథ్యంలో మృతి చెందిన రాజశేఖర్ కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పరామర్శించారు. మంగళవారం ఆయన బెంగళూరు నుంచి బళ్లారికి విచ్చేసి, నేరుగా నగరంలోని హుస్సేన్ నగర్లో మృతుడు రాజశేఖర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కాల్పుల్లో మృతి చెందిన రాజశేఖర్ తల్లి తులసి, సోదరి ఉమా, సోదరుడు ఈశ్వర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. రగడలో మీ కుటుంబ సభ్యుడు మృతి చెందడం తనను ఎంతో బాధిస్తోందన్నారు. అయితే మృతి చెందిన వ్యక్తిని ఎవరూ వెనక్కు తేలేమన్నారు. ధైర్యంగా ఉండాలని ఓదార్పు అయితే తమకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులకు ఉద్యోగం, ఇల్లు కట్టించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని మనవి చేశారు. తమకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు మృతి చెందాడని, తన భర్త కూడా మరణించారని మృతుడి తల్లి కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులందరిని ఆయన ఓదార్చారు. మంత్రి జమీర్ అహమ్మద్, ఎమ్మెల్యేలు నారా భరత్రెడ్డి, నాగేంద్ర, గణేష్, బుడా అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, కార్పొరేటర్ వివేక్(విక్కీ) పాల్గొన్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా డీసీఎంకు ఘన స్వాగతం పలికిన నేతలు -
వీడిన చోరీ కేసుల మిస్టరీ
చెళ్లకెరె రూరల్: నగరంలో జరిగిన ప్రత్యేక దొంగతనాల కేసుల మిస్టరీని ఛేదించడంలో చెళ్లకెరె పోలీసులు సఫలీకృతులయ్యారు. ఈ కేసులకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.లక్షలాది విలువ చేసే బంగారు, వెండి, నగదును స్వాధీనపరుచుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 9న నగరంలోని రాణిచెన్నమ్మ రహదారిలో వీ.లక్ష్మి అనే మహిళ నడుచుకుంటూ వెళుతుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 65 గ్రాముల బంగారు మాంగల్యం చైన్ను లాక్కొని పరారయ్యారు. శ్యామసుందర్, దుర్గావర గ్రామానికి చెందిన జేఎస్.మంజునాథ్ అనే వారిని అజ్జనగుడి వద్ద అరెస్ట్ చేసి రూ.7 లక్షల విలువ చేసే 65 గ్రాముల బంగారు చైన్, బైక్ను జప్తు చేసుకున్నారు. మరో ఘటనలో .. నగరంలోని కుబేర నగరలో జరిగిన మరో ఇంటి దొంగతనంలో బెంగళూరుకు చెందిన నిందితుడు మహ్మద్ ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.1.74 లక్షల నగదు, రూ.1.18 లక్షల విలువ చేసే 493 గ్రాముల వెండిని స్వాధీనపరుచుకున్నారు. జిల్లా ఎస్పీ రంజిత్కుమార్ బండారు, ఏఎస్పీ శివకుమార్, డీఎస్పీ సత్యనారాయణరావ్ల మార్గదర్శనంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కే.కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఈరేష్, కానిస్టేబుల్ శివరాజ్ కార్యాచరణలో పాల్గొన్నారు. ముగ్గురు దొంగల అరెస్టు రూ.లక్షలాది సొత్తు స్వాధీనం -
జీ రాం జీ మాకొద్దు
మండ్య: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నరేగా పథకం స్వరూపాన్ని మార్చివేసి ఆ స్థానంలో జీ రాం జీ పథకాన్ని అమలు చేయడంపై వ్యవసాయ గ్రామీణ కార్మికుల సంఘం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్ ముందు బైఠాయించారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. కొత్త పథకంతో కూలికార్మికులకు 125 రోజుల పాటు పని దొరకదని, ఇబ్బందులు తప్పవని తెలిపారు. అందువల్ల పాత చట్టాన్ని పునరుద్ధరించాలని కోరారు. పెద్దసంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ధర్మస్థల మిస్సింగులపై సుప్రీంలో విచారణ శివాజీనగర: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల పోలీస్ స్టేషన్లో గత కొన్ని సంవత్సరాల నుంచి నమోదైన 74 మంది మహిళల అదృశ్యం, అనాథ శవాల కేసులపై కొత్తగా దర్యాప్తు చేపట్టాలని దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మార్చి 23 కు వాయిదా వేసింది. అత్యాచారం, హత్యకు గురైన విద్యార్థిని సౌజన్య తల్లి కుసుమావతి గౌడ ఈ పిటిషన్ వేశారు. న్యాయమూర్తి జస్టిస్ సంజయ్కుమార్ నేతృత్వపు ద్విసభ్య ధర్మాసనం విచారించింది. వరుసగా రెండేళ్ల పాటు వందలాది అనాథ మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు గతంలో మాస్క్మ్యాన్ చిన్నయ్య ప్రకటించడాన్ని న్యాయవాదులు ప్రస్తావించారు. అక్కడి నేత్రావతి నది ఒడ్డులో 74 అనాథ శవాలను పూడ్చిపెట్టినట్లు ఆరోపణలు వినిపించాయి, ఆ అన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదై, విచారణ జరపాలి, అనాథ శవాలు, అదృశ్యం కేసులకు న్యాయం లభించాలని కుసుమావతి కోరారు. ఇరువర్గాల విచారణల తరువాత జడ్జిలు మార్చి ఆఖరికి వాయిదా వేశారు. కోగిలు లేఔట్లో 37 కుటుంబాలే లోకల్ ● 119 ఇళ్లలో అధికారుల సర్వే శివాజీనగర: బెంగళూరులోని యలహంక కోగిలు లేఔట్లో ఆక్రమణల తొలగింపు తెలిసిందే. ఇందులో 37 కుటుంబాలను మినహాయిస్తే మిగిలినవారంతా వేరే రాష్ట్రాల నుంచి వచ్చినవారని గ్రేటర్ బెంగళూరు, రెవిన్యూ, గృహవసతి అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. అక్కడ కూల్చివేసిన 119 ఇళ్లను సర్వే చేశారు, 118 కుటుంబాలకు ఆధార్ కార్డులు ఉన్నాయి, 102 కుటుంబాలకు ఓటర్ కార్డులు, 77 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నట్లు తెలిపారు. 63 కుటుంబాలకు ఆదాయ ధృవీకరణ పత్రం, 56 కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలు ఉన్నాయి. వీరిలో 37 కుటుంబాలకు మాత్రమే గృహ వసతి లభించే అవకాశముంది. అపార్టుమెంటులో ఫ్లాట్లు కోగిలు బండె క్వారీ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన 167 ఇళ్లు, షెడ్లను తొలగించాక, తమకు గృహవసతి ఇవ్వాలని 250 కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇళ్ల కూల్చివేతను కేరళ సర్కారు వ్యతిరేకించడంతో ఇది రెండు రాష్ట్రాల సమస్యగా మారింది. అర్హులకు బైయప్పనహళ్లిలో నిర్మించిన వసతి అపార్టుమెంట్లో ఫ్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానించింది. 8 నుంచి వర్షసూచన యశవంతపుర: బంగాళాఖాతం సముద్రంలో మార్పుల కారణంగా ఈ నెల 8 నుంచి కరావళి, మలెనాడు, దక్షిణ ఒళనాడుతో అనేక ప్రాంతాలలో వానలు పడే అవకాశం ఉన్నట్లు బెంగళూరు వాతావారణశాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో మేఘావృతమై ఉంటుంది. చలిగాలులు వీచనున్నాయి. దీంతో తెల్లవారుజామున చలి అధికం కానుంది. ఎక్కువ ప్రాంతాలలో పొగమంచు ఆవరిస్తుంది. ఉత్తర ఒళనాడు, మధ్య కర్ణాటక భాగంలో చలి అధికంగా ఉంటుంది. నాలుగైదు రోజుల నుంచి చలి తగ్గినట్లే తగ్గి మళ్లీ ఎక్కువ కావడం తెలిసిందే. పగటిపూట కొంచెం ఎండలు తీవ్రత పెంచాయి. ఈ తరుణంలో వర్షసూచన వెలువడింది. ఇంటి దొంగల అరెస్టు, భారీగా నగలు సీజ్ యశవంతపుర: ఇంటి యజమాని అభిషేక్ తాళం చెవిని ఇచ్చేసి, కుటుంబంతో కలిసి తమిళనాడుకు విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఇంటిలో పనిమనిషులు దోచుకుని పరారైన కేసులో బెంగళూరు సదాశివనగర పోలీసులు పురోగతి సాధించారు. ఇంటిలో పని చేస్తున్న హాజిరా బేగం (19), ఆమె భర్త షబ్బీర్ హుసేన్(23) ను అసోంలో అరెస్ట్ చేశారు. గత నెల 30న ఈ చోరీ జరిగింది. 7 విలువైన గడియారాలతో పాటు రూ.1.37 కోట్ల విలువగల బంగారు నగలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. -
ఆనేకల్లో భారీ భూ డీల్
బొమ్మనహళ్ళి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలో ఓ ఐటీ సంస్థ 53.5 ఎకరాల భూమిని మరో రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించడం పెద్ద దుమారం రేపుతోంది. ఈ కేసుపై బెంగళూరు జిల్లా కలెక్టర్ దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని రెవిన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ తెలిపారు. ఏమిటీ డీల్.. ఓ ఐటీ సంస్థ ఆనేకల్ తాలూకాలోని తన 53.5 ఎకరాల భూమిని రియాల్టీ దిగ్గజానికి రూ.250 కోట్లకు విక్రయించింది. తన ఆస్తుల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ ఆస్తిని విక్రయించినట్లు పేర్కొంది. అలాగే, భూమి అమ్మకంలో ఎటువంటి చట్టాన్ని ఉల్లంఘించలేదు. అన్ని నియమాలను పాటించాం, ఈ భూమిని ప్రభుత్వం కేటాయించలేదని పేర్కొంది. అభ్యంతరాలు? కానీ ఈ వాదనను ప్రభుత్వం అంగీకరించలేదు. భూవిక్రయాలను ఆమోదించిన సర్జాపుర సబ్ రిజి స్ట్రార్ రవి సంకనగౌడను సస్పెండ్ చేసింది. అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా 40 సేల్ డీడ్లు పుట్టుకొచ్చాయని ఆరోపణలు ఉన్నాయి. అలాగే రిజిస్ట్రేషన్ శాఖ సాఫ్ట్వేర్ కావేరి 2.0లోని లోపాలను వాడుకున్నారని, కోర్టు ఆదేశం ఉన్నట్లయితే సేల్ డీడ్లు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు పొందే నిబంధన ఉంది. దీనిని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. రెండు ప్రైవేటు సంస్థల ఒప్పందం సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు -
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నెట్టుకురావాల్సిన జీవితాన్ని కొందరు మధ్యలోనే వదిలేస్తున్నారు. సమస్యలు, సంకటాలు వచ్చాయంటూ అకాల మరణాన్ని ఆశ్రయిస్తున్నారు. భారత ఐటీ రాజధానిలో ఈ ప్రమాదకర ధోరణి మరీ అధికమైంది. అందులోనూ యువత, విద్యార్థులు అధికంగా ఆత్మహత్యల పాలవుతూ కన్నవ
మానసిక సమస్యల పాపం ● నిమ్హాన్స్ సంస్థ విశ్లేషణ ప్రకారం బాధితుల్లో మూడోవంతు మానసిక రోగాలతో బాధపడేవారే. మిగిలిన రెండు భాగాల మంది ఆర్థిక సమస్యలు, కుటుంబంలో బాంధవ్యాలను కోల్పోవడంతో వ్యథచెంది తనువు చాలిస్తున్నారు. ● గతంలో ఆత్మహత్యకు దోహదంచేసే క్రిమిసంహారక మందులతో పాటు విషపూరిత సాధనాలు సులభంగా లభించేవి కావని మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ బీఎన్. రవీశ్ చెప్పారు. మానసిక ఒత్తిళ్లతోనూ బలవన్మరణాలుటెలిమనస్ సహాయం బనశంకరి: ఎంతో విలువైన జీవితం మధ్యలోనే కడతేరిపోతోంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ గొడవలు, నిరుద్యోగం, అనారోగ్యం.. ఇలా ఎన్నో కారణాల వల్ల బెంగళూరు నగరంలో ఆత్మహత్యల సంఖ్య విస్తరిస్తోంది. గత నాలుగేళ్లలో 9,450 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ప్రతిరోజు సరాసరి 6 లేదా 7 మంది ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. మానసిక అనారోగ్యాలు కూడా బలవన్మరణాలకు కారణం అవుతున్నాయి. ఏటా 2 వేల మంది.. రాష్ట్ర హోంశాఖ తెలిపిన సమాచారం ప్రకారం బెంగళూరు లో ప్రతి ఏటా 2 వేల మంది ఆత్మహత్యతో అకాల మృత్యువాత పడుతున్నారు. భవనాల పై నుంచి దూకడం, ఉరివేసుకోవడం, పురుగుల మందు తాగడం, రైలు కింద పడడం, తుపాకీతో కాల్చుకోవడం తదితర మార్గాల్లో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది యువత కావడం మరింత విషాదకరం. 2022 జనవరి నుంచి 2025 నవంబరు వరకు ఆత్మహత్యకు పాల్పడిన 9,450 మందిలో 8,148 మంది ఉరివేసుకున్నారు. 740 మంది విషం తాగి చనిపోగా 204 మంది ఎత్తైన కట్టడాల నుంచి దూకారు. 2022లో 2,313 మంది, 2023లో 2,370 మంది, 2024లో 2,403 మంది, 2025 నవంబరు నాటికి 2,364 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిమ్హాన్స్ ప్రారంభించిన టెలిమనస్ సహాయవాణికి (14416) ప్రతినిత్యం వేలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మానసిక కల్లోలంతో కాల్ చేస్తున్నారు. మానసికంగా దృఢంగా ఉండాలని వారికి కౌన్సిలింగ్ ఇస్తుంటారు. 2022 అక్టోబరులో ఆరంభించిన టెలిమనస్కు ఇప్పటివరకు 30 లక్షల మందికి పైగా కాల్ చేశారు. ఇందులో ఎక్కువమంది 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు ఉన్నారు. దుఃఖం, భయం, పెళ్లి, ఆర్థిక ఇబ్బందుల గురించి, పరీక్షల ఒత్తిడి మీద ఫిర్యాదు చేశారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అండగా నిలిచినట్లు టెలిమనస్ చీఫ్ అర్చనా కార్తీక్ తెలిపారు. -
గ్రేటయ్యా.. సిద్దరామయ్య
మైసూరు: దేవరాజ అరసు తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యంత ఎక్కువ కాలం ఉన్న నేతగా సిద్దరామయ్య మంగళవారంతో రికార్డు సృష్టించారు. దీంతో ఆయన సన్నిహిత మంత్రులు, అభిమానులు అభినందనలతో ముంచెత్తారు. మైసూరులో టి.కె. లేఔట్లోని నివాసంలోనే ఉన్న సిద్దరామయ్యను కలవడానికి నేతలు, అధికారులు తరలివచ్చారు. జిల్లా, నగర నేతలు సంబరాలు చేసుకుని లడ్డు, పలావు, మైసూరు పాక్లు తదితరాలను ప్రజలకు పంపిణీ చేశారు. కె.ఎస్. శివరాము, యోగేష్ ఉప్పర్, హెచ్.ఎస్. ప్రకాష్, జె.గోపీ, మోహన్, కోటేహుండి సి. మహదేవ్, హరీష్ మోగన్న తదితరులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద పోస్టర్లు, బ్యానర్లతో సందడి చేశారు. జిల్లా కలెక్టర్ జి. లక్షీమాకాంత్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్, డీఐజీ బోరలింగయ్య, ఎస్పీ మల్లికార్జున బాలదండి తదితరులు సీఎంను కలిశారు. నాటుకోడి బిర్యానీ పంపిణీ సీఎం సిద్ధరామయ్య నివాసం సమీపంలో నాటు కోడి బిర్యానీని ప్రజలకు పంపిణీ చేశారు. మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని నినాదాలు చేశారు. చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సిటీ బస్టాండ్లో మైసూర్ పాక్ను పంచిపెట్టారు. ఎస్.ఎన్. రాజేష్, నవీన్ కెంపి, రవిచంద్ర, రాకేష్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. సిద్దరామయ్యే సరైన వ్యక్తి: మహదేవప్ప సిద్ధరామయ్య లేకుండా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఊహించడం కష్టం అని ఆయన మిత్రుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.సి. మహదేవప్ప అన్నారు. మంగళవారం మైసూరులోని సెనేట్ భవన్లో ఓ వేడుకలో మాట్లాడారు, 2028 వరకు సిద్ధరామయ్య పదవిలో ఉంటారు. అధికారం ఎల్లప్పుడూ సరైన వ్యక్తుల చేతుల్లోనే ఉండాలి. నన్ను, పరమేశ్వర్ను ఎవరైనా సీఎం కావాలని కోరవచ్చు. కానీ ఏకై క వ్యక్తి సిద్ధరామయ్య మాత్రమే అని చెప్పారు. సిద్ధరామయ్య అధికారం నుంచి తప్పుకుంటే, అహింద వర్గం మునిగిపోతుందన్నారు. ఐదేళ్లూ ఆయనే సీఎం: రాయరెడ్డి బనశంకరి: సీఎంగా సిద్దరామయ్య ఐదేళ్లు ఉంటారు. ఆయనను సగం కాలానికి ఎన్నుకోలేదు అని ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి అన్నారు. విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మార్పు అనేది మీడియా సృష్టి అన్నారు. కొంతమంది కాలక్షేపానికి డీకే.శివకుమార్ సీఎంఅని చెబుతున్నారని, ఆయనకు తరువాత అవకాశం దక్కవచ్చు అన్నారు. ఈసారి బడ్జెట్ పరిమాణం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు. సిద్దునే చెప్పారు కదా: హోంమంత్రి శివాజీనగర: దేవరాజ అరసు రికార్డు బద్దలుకొట్టారని సీఎం సిద్దరామయ్యకు హోం మంత్రి పరమేశ్వర్ అభినందనలు తెలిపారు. ఇందుకు సోనియా, రాహుల్, ఖర్గే, వేణుగోపాల్ కూడా సహకారం అందించారన్నారు. పూర్తికాలం నేనే సీఎం అని సిద్దరామయ్య చెప్పిన తరువాత ఇంకేముంది? ఆయన విశ్వాసం అది, నాకు కూడా ఆ నమ్మకం ఉంది అని చెప్పారు. అత్యంత దుష్పరిపాలన: జేడీఎస్ శివాజీనగర: సిద్దరామయ్యది దుష్పపరిపాలన అని ప్రతిపక్ష జేడీఎస్ ఎక్స్లో దుయ్యబట్టింది. రాష్ట్రంలో అత్యధిక మతకలహాలు, హింస, అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు, అవినీతిలో కర్ణాటక నంబర్ 1 రాష్ట్రమైంది. ఎంతోమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లారు. ప్రభుత్వ అధికారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాల్మీకి మండలి, భోవి మండలి, అంబేద్కర్ మండలిలో కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి, నిత్యావసరాల ధరలు పెంచి సామాన్య ప్రజల బతుకును నకరయాతనకు గురిచేస్తున్నారు, గుంతల రోడ్ల వల్ల ప్రజలు చనిపోతున్నారు. రాష్ట్రం అప్పులు పెరిగాయి, కులమతాల విద్వేషాలు పెచ్చరిల్లాయి అని ఆరోపించింది. అత్యధిక కాలం సీఎంగా రికార్డు సన్నిహితులు, అభిమానుల సంబరాలు -
నమో లక్ష్మీనారాయణా..
మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామంలో ఉన్న పురాతన శ్రీలక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలను మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు సురేష్ చైతన్య నేతృత్వంలో మూల విగ్రహానికి పంచామృత అ భిషేకం, వేదమంత్రపారాయణం, అలంకారం, మంగళహారతి సాగించారు. ఆలయంలోని శ్రీ కన్నికా పరమేశ్వరి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీసోమేశ్వర స్వామి, శ్రీఆంజనేయస్వామి, నవగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. సంపులో పడి తల్లీబిడ్డల మృతి ● తుమకూరు వద్ద ఘోరం తుమకూరు: తుమకూరు తాలూకాలోని హిరేహళ్లి సమీపంలోని సంగనహళ్లి కాలనీలో మంగళవారం తమ ఇంటి పక్కన ఉన్న సంప్లో పడి తల్లి, ఆమె కవల పిల్లలు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. విజయలక్ష్మి (26), 5 ఏళ్ల పాప చేతన, బాబు చైతన్య మృతులు. సాయంత్రం 4 గంటలప్పుడు సంప్లో పడిపోయారని తెలిసి ఫైర్ సిబ్బంది వచ్చారు. అందులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. సంపు సుమారు 10 అడుగుల లోతు ఉంది. అనుకోకుండా పడిపోయారా, లేక ఆత్మహత్యా? అనేది తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బళ్లారిపై సీబీఐ దర్యాప్తు: బీజేపీ శివాజీనగర: బళ్లారిలో 1వ తేదీన జరిగిన అవాంఛనీయ ఘటనల గురించి రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసిందని ఎమ్మెల్సీ సీటీ రవి తెలిపారు. బెంగళూరులో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బళ్లారిలో జనార్దనరెడ్డి హత్యకు ప్రయత్నం జరిగింది. అదుపు తప్పి కాంగ్రెస్ కార్యకర్త చనిపోయాడు, దీనిమీద సీబీఐ దర్యాప్తు చేయించాలని కోర్ కమిటీలో నేతలు తీర్మానించారన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై జేడీఎస్తో సమాలోచన జరిపి అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర.. జేడీఎస్తో మాట్లాడతారని కోర్ కమిటీ నిర్ణయించిందన్నారు. యడియూరప్ప, సహ ఇన్చార్జి సుధాకర్రెడ్డి, కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి తదితరులు కమిటీ భేటీలో పాల్గొని రాజకీయ అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారన్నారు. రూ.3.5 కోట్ల డ్రగ్స్ సీజ్ ● టెక్కీ, మరొకరు అరెస్టు బనశంకరి: న్యూ ఇయర్ పార్టీల్లో విక్రయాల కోసం శ్మఽశానంలో డ్రగ్స్ దాచిపెట్టిన ఇద్దరిని బెంగళూరు అశోకనగర పోలీసులు అరెస్ట్చేశారు. వీరి నుంచి రూ.3.5 కోట్ల విలువచేసే ఎండీఎంఏ క్రిస్టల్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. కేసు వివరాలను ఆయన తెలిపారు. చిక్కబాణసవాడి నివాసి, టెక్కీ మహమ్మద్ తారిఖ్ ఇక్బాల్, కాడుగోడి శీగేహళ్లివాసి షేక్ అహ్మద్ అబ్రాజ్ అనే ఇద్దరు నిందితులు. హోసూరురోడ్డు హిందూశ్మశానంలో ఓ సమాధి పక్కన డ్రగ్స్ను దాచి ఉంచి, గిరాకీలకు విక్రయించేవారు. పోలీసులకు తెలిసి దాడి చేసి 2.48 కేజీల ఎండీఎంఏ, బైక్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే సీగేహళ్లి ఇంట్లో దాచిపెట్టిన 720 గ్రాముల ఎండీఎంని వశపరచుకున్నారు. మొత్తం డ్రగ్స్ విలువ రూ.3.5 కోట్లు అని తెలిపారు. ల్యాప్టాప్ చోరీల్లో స్పెషలిస్టులు యశవంతపుర: సిలికాన్ సిటీలో పీజీ హాస్టళ్లలోకి చొరబడి ల్యాప్టాప్లను ఎత్తుకెళ్లే ఇద్దరు ఘరానా చోరులను ఎలక్ట్రానిక్ సీటీ పోలీసులు అరెస్ట్ చేసి రూ.40 లక్షల విలువగల 48 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని ఓ ఎమ్మెల్యే బంధువు, ఐటీ ఇంజనీరు గౌతమ్, రాజదొరైలను పోలీసులు అరెస్ట్ చేశారు. దొడ్డతోగూరు అబ్బయ్యస్టీట్లోని ఒక పీజీలో డిసెంబర్ 28న ల్యాప్టాప్లు చోరీ కావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టగా మొదట రాజదొరై దొరికాడు. అతనిని ప్రశ్నించగా నగరంలో వివిధచోట్ల ల్యాప్టాప్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. అతడు ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడు గౌతమ్ను అత్తిబెళెలో అరెస్ట్ చేశారు. వీరు తమిళనాడులో అమ్మిన 6 ల్యాప్టాప్లు, స్నేహితులకు అమ్మిన 9 ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 38 మంది సొంతదారులను ఇప్పటివరకు గుర్తించారు. -
పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె?
సోషల్ మీడియా రోజుకో వింత వైరల్గా మారుతుంది. తాజాగా మరోసారి వైరల్ వింత మిస్టరీగా మార్చింది. ఎక్కడ చూసినా ఆమె ఫోటోనే. ఇంతింత కళ్లతో ఉన్న ఒక మహిళ ఫోటోను దిష్టి బొమ్మలా కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలలో తెగ వాడేస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ దీనిపై ఎక్స్లో ఒక పోస్ట్ పంచుకోవడంతో చర్చ జోరందుకుంది. బెంగళూరు వెలుపల ఉన్న ఒక నిర్మాణ స్థలంలో ఈ ఫోటో చూశాననీ, Google Lens, ఆన్లైన్ శోధనలను ప్రయత్నించానని, కానీ స్పష్టమైన సమాధానాలు దొరకలేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ "ఆమె ఎవరు?" కోరింది. దీంతో ఆన్లైన్లో హాస్యాస్పదమైన ఊహాగానాలతోపాటు, రకరకాల సమాధానాలు వచ్చాయి.I see this woman everywhere in Karnataka outside bangalore where there’s a construction happening. I tried google lens to check for discussions but can’t find any details. Who is she? pic.twitter.com/RAgMDXXJMt— unc unitechy (@unitechy) January 5, 2026కర్ణాటకలో నిర్మాణ ప్రదేశాలు, దుకాణాలు, పొలాలలో కూడా పదే పదే కనిపించే ఒక మహిళ ఫోటోపై దృష్టి సారించింది. సగం నిర్మించిన ఇళ్ల నుండి వ్యవసాయ భూమి వరకు ఈ మహిళ ఫోటోను ఎందుకు పెట్టారనే చర్చ ఇంటర్నెట్ వినియోగదారులను ఆశ్చర్యపర్చింది. ఆఖరికి AI చాట్బాట్లను కూడా ఈ పిక్ గురించి అడిగేశారు. ఈ ఫోటోను'దిష్టి పరిహారం'గా వాడుతున్నారని కొందరంటే, చిక్కబల్లాపుర సమీపంలోని ఒక పొలంలో దిష్టిబొమ్మలా ఇదే ఫోటోలను చూశానని మరొకరు కమెంట్ చేశారు.ఇదీ చదవండి: గ్వాలియర్లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్This lady is Niharika Rao, a You Tuber. Hundreds of people in Karnataka are putting up her photo in front of their shops, houses, farms to ward off negativity (drishti)This, is the true power of feminism pic.twitter.com/xsPRbFX7OD— 𝕲𝖆𝖓𝖊𝖘𝖍 * (@ggganeshh) May 16, 2024ఇంతకీ ఆమె ఎవరంటేగణేష్ అనే వినియోగదారు వివరణాత్మక వివరణ ఇవ్వడంతో దీనిపై ష్టత వచ్చింది. అతని ప్రకారం, ఫోటోలో ఉన్న మహిళ పేరు నిహారిక రావు. ఒక యూట్యూబర్. స్థానికులు ఆమె ఫోటోను ఇళ్ళు, దుకాణాలు, పొలాలు, నిర్మాణ ప్రదేశాల వెలుపల ఉంచిన తరువాత నెగిటివిటీ పోయిందట, మంచి జరిగిందట. ఇది ఆ నోటా ఈ నోటా పాకి దీన్ని దిష్టిబొమ్మగా వాడేస్తున్నారన్నమాట. ఇదీ చదవండి: సీనియర్ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలి -
ఇంట్లో మంటలు.. మహిళా టెక్కీ మృతి
బెంగళూరు: అనుమానాస్పదంగా మహిళా టెక్కీ మృతిచెందిన ఘటన ఈ నెల 3 తేదీన రామమూర్తినగర పోలీస్స్టేషన్ పరిధిలోని సుబ్రమణ్య లేఔట్లో జరిగింది. మృతురాలు శర్మిలా (34) ఇంట్లో శవమై తేలింది. వివరాలు.. మంగళూరుకు చెందిన శర్మిలా గత ఏడాది నుంచి బెంగళూరులో ఓ కంపెనీలో టెక్కీగా పనిచేస్తోంది. 3వ తేదీ రాత్రి 10.30 సమయంలో ఆమె ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంటి యజమాని విజయేంద్ర చూసి రామమూర్తినగర పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకుని తలుపులు బద్ధలుకొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. సోఫా, తెరలు, బెడ్షీట్లు కాలిపోగా శర్మిలా స్పృహ కోల్పోయినట్లు కనబడింది. మంటలు అదుపుచేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చనిపోయిందని తెలిపారు. అగ్నిప్రమాదం ఎలా జరిగింది, ఆమె మృతికి కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. -
మనసంతా చిత్రసంతె
● సిలికాన్ సిటీని మురిపించిన పెయింటింగ్స్ జాతా బనశంకరి: బెంగళూరులో ఏడాదికి ఒకరోజు జరిగే చిత్రలేఖనాల ప్రదర్శన.. చిత్రసంతె ప్రజలకు కనువిందు చేసింది. కుమారకృప రోడ్డు ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ, అలాగే సోమవారం కూడా కొన్ని స్టాళ్లలో చిత్రలేఖనాల ప్రదర్శన, విక్రయాలు జరిగాయి. విభిన్న రూపాల పెయింటింగ్స్ అబ్బురపరిచాయి. ఈదఫా చిత్రసంతెను 3 లక్షల మందికిపైగా సందర్శకులు వీక్షించగా, రూ.3 కోట్లకు పైగా పెయింటింగ్స్ వ్యాపారం జరిగినట్లు చిత్రకళాపరిషత్ సభ్యులు తెలిపారు. భారీ ధరలకు విక్రయం కొన్ని కళాఖండాలు భారీ రేట్లకు అమ్ముడుపోయాయి. బెంగళూరు కళాకారుడు భరణి ధరణ్ తైలవర్ణ నెమలి పెయింటింగ్ను రూ.లక్షకు విక్రయించారు. మైసూరు కళాకారుడు వీరేశ్ గీసిన ప్రకృతిలో శివుడు కళాకృతి రూ.1.30 లక్షలకు కొనుగోలు చేశారు. కోయంబత్తూరు సతీశ్ గీసిన ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులు ఒకేచోట చేరిన పెద్ద చిత్రలేఖనం రూ.3 లక్షల అమ్ముడుపోయింది. ఇలా కొందరు చిత్రకారులకు కాసుల వర్షం కురిసింది. వైవిధ్య వర్ణచిత్రాలను తిలకించి నగరవాసులు మురిసిపోయారు. వందలాది చిత్రకారులు తమ చిత్రలేఖనాలను అమ్ముకుని సంతృప్తిగా వెనుదిరిగారు.లెక్కకు మిక్కిలి పెయింటింగ్స్ముఖానికి వర్ణ అలంకారంతో బాలిక చిత్రలేఖనాలతో ఓ చిత్రకారిణి రమణీయంగా మయూరాలు పెయింటింగ్స్ వీక్షణం -
కొప్పళలో హైడ్రామా
సాక్షి,బళ్లారి: రైల్వే వంతెన పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి వీ.సోమణ్ణపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం కొప్పళ జిల్లా హిట్నాళ గ్రామంలో రూ.27 కోట్లతో నూతనంగా రైల్వే వంతెన ఏర్పాటు చేసే పనులకు ఆయన భూమిపూజ చేసేందుకు వచ్చారు. అయితే శంకుస్థాపన శిలాఫలకంలో స్థానిక జిల్లా మంత్రి, లోక్సభ సభ్యుడి పేర్లు లేవని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో చేరి, కేంద్రమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలను ఆయనపైకి విసిరేందుకు ప్రయత్నించి, చిందర వందర చేసి, నిరసన వ్యక్తం చేశారు. శంకుస్థాపన ముగిసిన తర్వాత కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, ఆయన వ్యక్తిగత సిబ్బంది భద్రత మధ్య ఆయనను సురక్షితంగా కారులోకి ఎక్కించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాము నిబంధనలకు వ్యతిరేకంగా శంకుస్థాపన చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ రైల్వే వంతెన నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధి వ్యతిరేకించడం బాధాకరమన్నారు. అయితే అభివృద్ధి పనులను ఎవరు అడ్డుకున్నా ఆపేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి సోమణ్ణ ఎదుట కాంగ్రెస్ నేతల ఆగ్రహం రైల్వే వంతెనకు శంకుస్థాపనలో చోటు చేసుకున్న రగడ కార్యక్రమంలో కుర్చీలను చిందర వందర చేసిన వైనం -
మళ్లీ మళ్లీ పోస్టుమార్టం చేశారా, లేదా?
సాక్షి,బళ్లారి: మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిని పథకం ప్రకారం హత్య చేసేందుకు కుట్ర పన్ని, రగడ సృష్టించి, కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, అందుకు నారా భరత్రెడ్డి ఆప్తుడు సతీష్రెడ్డి గన్మెన్ గురుచరణ్సింగ్ కాల్చడంతోనే మృతి చెందాడని నివేదిక వచ్చినందున వెంటనే ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, సతీష్రెడ్డిలను అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన సోమవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. కాల్పుల్లో మృతి చెందిన రాజశేఖర్ మృతదేహానికి మూడు, నాలుగు సార్లు పోస్టుమార్టం చేశారన్నారు. రాజకీయ ఒత్తిడితో మృతదేహంలోని బుల్లెట్ను వెలికితీయకుండానే అంత్యక్రియలు పూర్తి చేసేందుకు సిద్ధం అయ్యారన్నారు. అయితే కొందరు పోలీసు అధికారులు నిజాయితీగా పని చేసి పోస్టుమార్టం మరోసారి చేయడంతో 12 ఎంఎం బుల్లెట్ దొరికిందన్నారు. అది సతీష్రెడ్డి గన్మెన్ తుపాకీది అని తేలిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు, బళ్లారికి న్యాయం జరుగుతుందనే భరోసా లేదన్నారు. అందువల్ల సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐకి కేసు దర్యాప్తును అప్పగిస్తే న్యాయం జరుగుతుందన్నారు. ఈ ఘటనలో గాలి జనార్దనరెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నించి వారు తవ్వుకున్న గోతిలో వారే పడ్డారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయం జరగపోతే తమ పార్టీ పెద్దలు అనుమతి ఇస్తే బళ్లారి నుంచి బెంగళూరుకు పాదయాత్ర చేపట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే టీ.హెచ్ సురేష్బాబు, మాజీ మేయర్ వెంకటరమణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కే.ఎస్.దివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
స్కావెంజర్లతో మలమూత్రాదుల తొలగింపు సరి కాదు
రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహించే స్కావెంజర్లతో మలమూత్ర తొలగింపు పనులు చేయిస్తున్నారని బహుజన దళిత సంఘర్ష సమితి సంచాలకుడు నరసింహులు ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్వామ్యంలో పని చేస్తున్న అధికారులు సఫాయి కర్మచారులతో మ్యాన్ హోల్లో నిండిన మలమూత్రాదులను గుంతలోకి దింపి తొలగించే పనులు చేయిస్తున్నారని, బాధ్యులపై చర్యలు చేపట్టాలన్నారు. కాంట్రాక్ట్ పొందిన సంస్థ లైసెన్స్ను రద్దు చేయాలని ఒత్తిడి చేశారు. సఫాయి కర్మచారులతో కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించుకున్న సంస్థలు నిండిన మ్యాన్హోల్లోకి దింపి పనులు చేయించారని, వారికి ఎలాంటి రక్షణ, భద్రతా చర్యలు తీసుకోలేదన్నారు. -
ఇద్దరు దొంగల పట్టివేత
హొసపేటె: కర్ణాటకలో కొప్పళ జిల్లా గంగావతి పోలీసులు రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రూ.13.10 లక్షల విలువైన సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పట్టణంలోని మారెమ్మ గుడి ప్రాంత నివాసి రామాంజనేయ అలియాస్ రామాంజి గురుస్వామి, హొసపేటె తాలూకాలోని మలపనగుడి నివాసి మహేష్ గురుస్వామిగా గుర్తించారు. దొంగతనం కేసులో రూ.12 లక్షల విలువైన 110 గ్రాముల బంగారు, రూ.1.10 లక్షల విలువైన 440 గ్రాముల వెండి ఆభరణాలను సీజ్ చేశారు. గంగావతి డీఎస్పీ న్యామగౌడ మాట్లాడుతూ గంగావతిలోని హొసళ్లి రోడ్డులో రవాణా శాఖ ఉద్యోగి కే.కొట్రేష్ రామప్ప ఇంటిలో జరిగిన చోరీ ఘటనపై జనవరి 17న ఫిర్యాదు నమోదైందని తెలిపారు. అలాగే నీలకంఠేశ్వర క్యాంప్ రవాణా శాఖ డిపో వద్ద అనసూయ మల్లయ్య శెట్టి తన ఇంట్లోనూ చోరీ చేశారని చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు కుమారుడిపై ఎఫ్ఐఆర్ హుబ్లీ: బెళగావి డీసీసీ బ్యాంక్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లింగరాజ్పై దాడి చేసిన ఆరోపణలకు సంబంధించి అథణి ఎమ్మెల్యే లక్ష్మణ సవధిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దాడికి గురైన బాధితుడు బెళగావి ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి నుంచే అథణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే సవధి, ఆయన కుమారుడు చిదానందప్పతో పాటు 8 మందిపై కేసులు నమోదు చేసుకున్నారు. కాగా లక్ష్మణ సవధి అభిమానులు తమ నేతపై కుట్ర చేసి కేసు పెట్టారని ఆరోపిస్తూ అథణి పట్టణ బంద్ను సోమవారం చేపట్టారు.భక్తిశ్రద్ధలతో కొప్పళ గవిసిద్దేశ్వర రథోత్సవం ● లక్షలాదిగా తరలి వచ్చిన భక్త జనం సాక్షి బళ్లారి: కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఆరాధించి, కొలిచే మఠాల్లో ఒకటైన కొప్పళ గవిసిద్దేశ్వరస్వామి జాతర, రథోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం కొప్పళ పట్టణ నడిబొడ్డున వెలసిన గవిసిద్దేశ్వరస్వామి మఠం ఆవరణలో ఏటా నిర్వహించే రథోత్సవాన్ని ఈఏడాది కూడా కొప్పళ గవిసిద్దేశ్వరస్వామి మఠం పీఠాధిపతితో పాటు మేఘాలయ గవర్నర్ సీహెచ్.విజయ్శంకర్, కేంద్ర మంత్రి సోమణ్ణ, రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, స్వామీజీలు పాల్గొని రథోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. దాదాపు 5 లక్షల మందికి పైగా భక్త జనసందోహం పాల్గొనడంతో కొప్పళలో జనజాతర కనిపించింది. గవిసిద్దేశ్వర స్వామి మఠంలో పూజలు, అన్నదానాలతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో వారం రోజుల నుంచి జాతర మహోత్సవాన్ని పండుగలా జరుపుకొన్నారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనడంతో కొప్పళ వీధుల్లో భారీ భద్రతను కల్పించారు. పోక్సో కేసుల్లో ఏడుగురు అరెస్ట్ హుబ్లీ: నగరంలో ఒకే రోజు రెండు ప్రత్యేక పోక్సో కేసులు నమోదయ్యాయి. హుబ్లీ టౌన్, అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో చిన్నారులపై మైనర్ బాలలు లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారు. టౌన్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ముగ్గురు మైనర్లు చిన్నారిపై హత్యాచారానికి ఒడిగట్టారు. అశోక్ నగర్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మైనర్ బాలురు ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులతో పాటు దాడి కూడా చేశారు. పైగా ఆ చిన్నారి తండ్రిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తొలి కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, రెండో కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ రెండు ఘటనలపై పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ తమ పిల్లలు తీరిక వేళల్లో ఎవరెవరితో కలుస్తున్నారో, స్నేహం చేస్తున్నారో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా గమనించాలన్నారు. లేకుంటే ఇలాంటి దుష్కృత్యాల బారిన పడి చిన్నారులు తమ భవితను నాశనం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన తల్లిదండ్రులకు హితవు పలికారు. -
కేంద్ర కారాగారంలో డీజీపీ తనిఖీ
రాయచూరు రూరల్: కలబుర్గిలోని కేంద్ర కారాగారాన్ని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ అలోక్ కుమార్ తనిఖీ చేశారు. రాష్ట్రంలో జైళ్లలో ఉన్న ఖైదీల విలాసవంతమైన జీవితంపై వీడియోలు వైరల్ కావడంతో తీవ్రమైన నిఘా ఉంచినట్లు తెలిపారు. జైలు అధికారి అనిత, అధికారులు, ఇతర సిబ్బందిపై విచారణకు అదనపు డీజీపీ ఆనందరెడ్డితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కమిటీ విచారణ జరిపి 10 రోజుల్లో నివేదికను అందించాలని సూచించామన్నారు. నాలుగు గంటల పాటు జైలు ఆవరణలో గడిిపిన డీజీపీ మాట్లాడుతూ ఖైదీలకు జైలులోనే జూదం, ఇస్పేట్ వంటివి ఆడటానికి, మద్యం, ధూమపానం చేయడానికి అవకాశం కల్పించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా జైలులో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం వల్లనే ఇలాంటి కుట్రలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయని, దీనిపై కూడా విచారణ చేపట్టినట్లు తెలిపారు. -
యువకుడు ఆత్మహత్యాయత్నం
చెళ్లకెరె రూరల్: నన్నివాళ గ్రామానికి చెందిన యువకుడు మహేష్ వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసిన ఘటన పట్టణంలోని ప్రైవేట్ బస్టాండ్ వెనుక భాగంలో జరిగింది. సగం మేర కాలిన యువకుడిపై ప్రజలు నీరు పోసి మంటలను ఆర్పివేశారు. విషయం తెలుసుకున్న వెంటనే 112 హొయ్సళ వాహనంలో పోలీసులు స్థలానికి వచ్చి యువకుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్రదుర్గ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు కారణాలు తెలియరాలేదు. స్థలాన్ని సబ్ఇన్స్పెక్టర్ శివరాజ్, పోలీసులు సంతోష్, చౌహాన్ పరిశీలించారు. -
క–కలో రైల్వే అభివృద్ధికి రూ.12,900 కోట్లు
హొసపేటె: అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారని, కళ్యాణ కర్ణాటక(క–క)లో రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.12,900 కోట్ల గ్రాంట్ను కల్పించిందని కేంద్ర జలశక్తి, రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ తెలిపారు. హగరిబొమ్మనహళ్లిలోని లెవెల్ క్రాసింగ్ 35 వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి సమగ్ర సమాచారం ఇచ్చారు. గతంలో కర్ణాటకకు రైల్వే శాఖ నుంచి ఏటా రూ.882 కోట్లు మాత్రమే అందేవి. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా రూ.7,500 కోట్ల నుంచి రూ.8,000 కోట్లు ఇస్తున్నట్లు ఆయన గణాంకాలతో సహా వివరించారు. బళ్లారి–చిక్కజాజూరు డబుల్ లైన్ నిర్మాణ ప్రాజెక్టుకు రూ.3,400 కోట్లు, బళ్లారి, చిత్రదుర్గ జిల్లాల్లో చేపట్టే మైనింగ్ కార్యకలాపాలతో సరుకు రవాణాకు, మంగళూరు–హైదరాబాద్ మధ్య కనెక్టివిటీకి ముఖ్యమైన బళ్లారి–చిక్కజాజూరు డబుల్ లైన్ ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం 2025 జూన్లో ఆమోదించిందన్నారు. రైల్వే కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పు సుమారు రూ.3,400 కోట్ల వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలో రైల్వే కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పును తెస్తుందని మంత్రి తెలిపారు. హగరిబొమ్మనహళ్లిలోని ఎల్సీ–35కు బదులుగా గుండా రోడ్–కొట్టూరు మధ్య రూ.38.7 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఎల్సీ– 37, 38 పనులు కూడా ప్రారంభించామన్నారు. హొసపేటె రైల్వే స్టేషన్ను రూ.15.17 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. 80 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. హంపాపట్టణ, హగరిబొమ్మనహళ్లి కనెక్షన్కు అవసరమైన 1 ఎకరం 41 గుంటల భూమిని సేకరించడంలో ఆలస్యం చేయవద్దని మంత్రి వేదికపై ఉన్న జిల్లాధికారికి సూచించారు. రైల్వే పనులకు అవసరమైన అనుమతులను త్వరగా అందించాలని ఆయన జిల్లా యంత్రాంగాన్ని కోరారు. బళ్లారి ఎంపీ తుకారాం, హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే నేమిరాజ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే చంద్రనాయక్, డిప్యూటీ కమిషనర్ కవిత ఎస్.మన్నికేరి, జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి, మరియమ్మనహళ్లి మల్లికార్జున స్వామీజీ, డాక్టర్ మహేశ్వర స్వామీజీ, రైల్వే శాఖ సీఈఓ అజయ్ శర్మ, ఏడీఆర్ఎం ఎం.విష్ణుభూషన్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు వద్దు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమణ్ణ


