breaking news
Karnataka
-
కర్ణాటక: విహారయాత్రలో విషాదం.. చిన్నారులు మృతి
బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విషాద యాత్ర సందర్భంగా విషాదం నెలకొంది. విహార యాత్రకు వెళ్లిన వ్యక్తులు.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు ఏడుగురు గల్లంతు అవగా.. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలో మార్కోనహళ్లి ప్రాజెక్ట్ వద్దకు 15 మంది కలిసి విహార యాత్రకు వెళ్లారు. అనంతరం, వారిలో ఒక మహిళ, ఆరుగురు పిల్లలు కలిసి.. నీళ్లు ఉన్న ప్రాంతం వద్ద ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో, నీటిలో గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు నవాజ్ అనే వ్యక్తి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.పిల్లలను కాపాడే క్రమంలో నవాజ్ కూడా నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెస్య్కూ బృందాల అక్కడి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కేవలం నవాజ్ను మాత్రమే ప్రాణాలతో కాపాడారు. అనంతరం, ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మహిళ, పిల్లల కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, వీరంతా కర్ణాటకలోని తుమకూరుకు చెందిన వారిగా గుర్తించారు. విహార యాత్రకు వెళ్లి తమ పిల్లలు ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
పండుగ ముగిసింది.. ఆస్పత్రి కిక్కిరిసింది
బళ్లారి రూరల్ : గత కొద్దిరోజులుగా బళ్లారి నగరంలో తరుచుగా వానలు కురిశాయి. దీంతో వాతావరణ మార్పు, గాలి, నీరు కలుషితం కావడంతో చాలా మంది దగ్గు, జలుబు, జ్వరాల బారిన పడ్డారు. అయితే దసరా పండుగ అయ్యాక వైద్యం కోసం పోవచ్చు అనుకున్నారో ఏమోగాని పండుగ రోజుల్లో ఆసుపత్రులు ఖాళీగా ఉండేవి. సోమవారం ఒక్కసారిగా వెల్లువగా బీఎంసీఆర్సీ అంతా రోగులతో కిక్కిరిసింది. మంగళవారం కూడా కొంత మేర రద్దీ కొనసాగింది. ముఖ్యంగా మెడిసిన్ విభాగంలో అనూహ్యంగా రోగులు పెరిగిపోయారు. సర్జరీ, క్యాజువాలిటీ, ఈఎన్టీ తదితర విభాగాల్లోను రోగులు అధికంగానే ఉన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగుల్లో అత్యధికులు జ్వరం, జలుబు, దగ్గుతో వచ్చిన వారు ఉన్నారు. రోగులతో కిటకిటలాడిన బీఎంసీఆర్సీ అన్ని విభాగాల్లోను రోగులు బారులు -
రైతులను నిండా ముంచిన వర్షాలు
రాయచూరు రూరల్: ఉత్తర కర్ణాటక, కల్యాణ కర్ణాటక జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. మాన్వి, దేవదుర్గ గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు జలమయమయ్యాయి. పత్తి, మిరప, వరి, కందులు, ఉల్లిగడ్డలు, పొద్దు తిరుగుడు పంటలు నీటిలో తడిశాయి. పత్తి, ఉల్లి గడ్డల పంటలు రైతులకు వరంగా మారాల్సింది పోయి నేడు చిరు జల్లులకు పంట చిత్తడిగా మారింది. పత్తి, ఉల్లి గడ్డల పంటలకు నీరు సోకడంతో పూర్తి ముద్దగా మారి పురుగుల బెడద అధికమైంది. దీంతో రైతులకు పత్తి, ఉల్లి గడ్డల పంటలు శాపంగా పరిణమించాయి. అతివృష్టితో నేడు చేతికొచ్చిన పంటలు పనికి రాకుండా పోతున్నాయి. జిల్లాలో మమదాపుర, కల్లూరు, మటమారి, నెలెహాళ, బాగల్కోటె జిల్లాలో 31 వేల హెక్టార్లలో ఉల్లిగడ్డలు, ఇతర ప్రాంతాల్లో పత్తి చెట్లకున్న కాయలకు మరో సారి విత్తనాలు మొలకెత్తడం, కొన్నింటికి పురుగులు పడటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. జిల్లాలో 1,79,236 హెక్టార్లలో పత్తి పంటలు వేశారు. రైతులు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా వ్యయం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో పత్తి ధరలు క్వింటాల్కు రూ.7,500 ధర పలుకుతోంది. చిరు జల్లులకు పాడైన ఉల్లిగడ్డలు, పత్తి కొనుగోలుకు వ్యాపారులు తక్కువ ధరకు కొంటారని రైతులు వాపోతున్నారు. పాడైన పత్తి, ఉల్లి గడ్డల పంట నుంచి నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని కోరుతున్నారు. ఉత్తర కర్ణాటక, కల్యాణ కర్ణాటకలో కురిసిన వానలు ఉల్లి, పత్తి, మిరప, కంది తదితర పంటలకు నష్టం -
రైతన్నకు తప్పని ఎదురు చూపులు
సాక్షి,బళ్లారి: ఆరుగాలం కష్టపడి పని చేసి పంటలు పండించిన రైతన్నలకు పంట చేతికందేలోపు, ప్రతి ఏటా ఏదో రకంగా నష్టపోతూ తీవ్రంగా నష్టపోవాల్సిన దయనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు బాగా కురవడంతో అదునులోనే దుక్కులు దున్ని, సకాలంలో మొక్కజొన్న, రాగి, సజ్జ. వేరుశనగ తదితర విత్తనాలు వేయడంతో పాటు చెరుకు, వరి తదితర పంటలను కూడా విస్తృతంగా సాగు చేశారు. వీటితో పాటు పండ్ల తోటలు కూడా బాగా కళకళలాడాయి. అయితే పంట చేతికందే సమయంలో సెప్టెంబర్ మూడో వారం చివర, నాలుగో వారంలో కురిసిన భారీ వర్షాలు ఉత్తర కర్ణాటక జిల్లాలను అతలాకుతలం చేశాయి. దీంతో ఉత్తర కర్ణాటక పరిధిలోని విజయపుర, బాగల్కోటె, కొప్పళ, రాయచూరు, గదగ్, బళ్లారి, ధారవాడ, బెళగావి ముఖ్యంగా కలబుర్గి తదితర జిల్లాల్లో దాదాపు 25 లక్షల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న, చెరుకు, వరి, పత్తి, వేరుశనగ తదితర పంటలతో పాటు దానిమ్మ, జామ, ద్రాక్ష తదితర పండ్ల తోటలు కూడా పెద్ద ఎత్తున నీట మునిగి రైతులను నిండా ముంచేశాయి. చెరుకు తదితర పంటలకు ఒక ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టి పంట చేతికందుతుందనే సమయంలో ఒక్కసారిగా వరుణుడి ప్రతాపంతో పంటలు పూర్తిగా నష్టపోవాల్సిన దుస్థితులు కనిపిస్తున్నాయి. వైమానిక సర్వేతో సరిపెడుతున్న సీఎం సిద్ధరామయ్య లక్షలాది ఎకరాల్లో ఎటు చూసినా పంటలు నీటమునిగిన దృశ్యాలతో పాటు ఎక్కడ చూసినా పంటలు కుళ్లిపోయిన దృశ్యాలే కనిపించాయి. ఉల్లిగడ్డలు తదితర పంటలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్న దృశ్యాలు కోకొల్లలు. ఇలా రైతాంగం పూర్తిగా నష్టపోయి తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సీఎం సిద్ధరామయ్య కంటి తుడుపు చర్యగా అతివృష్టి ప్రాంతాల్లో వైమానిక సమీక్ష జరిపి చేతులు దులుపుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా తూతూమంత్రంగానే పని చేస్తున్నారు. దీంతో తమకు సరైన న్యాయం జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో పాటు పలు గ్రామాల్లో ఇళ్లు నేలమట్టం కావడం, రోడ్లు అస్తవ్యస్తం అయిన దృశ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటి గురించి కూడా సక్రమమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఒక ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులకు ఒక రూపాయి కూడా చేతికందని పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్షాధారిత భూములకు ఒక హెక్టారుకు రూ.17 వేలు, నీటిపారుదల సదుపాయం కలిగిన భూములకు ఒక హెక్టారుకు రూ.34 వేల చొప్పున పరిహారం కలిపి ఉత్తర కర్ణాటక పరిధిలోని అన్ని జిల్లాలకు అతివృష్టి వల్ల పంట నష్టపోయిన రైతులకు దాదాపు రూ.2500 కోట్లు ప్రకటించారు. పంట నష్టపరిహారం కోసం అన్నదాతల పాట్లు రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ అయ్యేదెన్నడో?లక్షలాది ఎకరాల్లో పంట నష్టమైనా కంటితుడుపు చర్యలే.! అతివృష్టి వల్ల 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కంటి తుడుపు చర్యలకు ప్రభుత్వాలు సిద్ధం కావడంపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రకటించిన నగదు కూడా రైతుల ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతుందోనని, ఎవరెవరికి పడుతుందోనని కూడా ఆందోళన చెందుతున్నారు. పంట నష్టంతో పాటు భారీ వర్షాల వల్ల 50 మందికిపైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దాదాపు 500 పశువులు కూడా మరణించాయి. ఇలా వివిధ రకాలుగా ఈ ప్రాంతంలో రైతాంగం పూర్తిగా నష్టపోయి ప్రభుత్వం అందించే పరిహారం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పరిహారం రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని, మళ్లీ రైతులు ఎలా జీవించాలని రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఒక ఎకరానికి కనీసం రూ.50 వేలకు పైగా పంట నష్ట పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రకటించిన పరిహారం కూడా వీలైనంత త్వరలో రైతులకు అందేలా గట్టి చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
సాక్షి,బళ్లారి: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మంగళవారం కొప్పళ జిల్లా హులిగెమ్మ దేవి దర్శనానికి పాదయాత్రగా బయలుదేరిన భక్తులపైకి స్లీపర్ కోచ్ బస్సు దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గదగ్ జిల్లా రోణ తాలూకా తల్లిహాళ గ్రామానికి చెందిన అన్నపూర్ణ(40), ప్రకాష్(25), శరణప్ప(19) అనే ముగ్గురు మృతి చెందారు. మరో మూడు గంటల్లో హులిగమ్మ దర్శనం చేసుకొనే సమయంలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరగడంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బైక్ ఢీకొనడంతో వీరేష్(28) అనే యువకుడు కూడా మృతి చెందాడు. కుకనూరు గ్రామం నుంచి హులిగమ్మ దేవి దర్శనానికి బయలుదేరిన సమయంలో బైక్ ఢీకొని కింద పడటంతో వీరేష్ మృతి చెందాడు. ఒకే రోజు వేర్వేరు ప్రాంతంలో హులిగమ్మ దేవి దర్శనానికి తరలి వస్తున్న భక్తులపై స్లీపర్ కోచ్ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలపై ఆయా స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వివిధ రంగాల్లో విరివిగా సేవలు
రాయచూరు రూరల్: విశ్వకర్మ సమాజం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందించామని రాష్ట్ర విశ్వకర్మ మండలి అధ్యక్షుడు సుజ్ఞానమూర్తి పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో బంగారు ఆభరణాల తయారీ పనులు చేసే 10 మందికి రూ.లక్ష చొప్పున రుణాలు మంజూరు చేశామన్నారు. మండలి నుంచి గంగా కళ్యాణ పథకం ద్వారా బోరు బావుల తవ్వకం, వాహన రుణాల మంజూరు చేపట్టామన్నారు. విశ్వకర్మ సమాజం సభ్యులతో కలిసి ప్రభుత్వాలు మంజూరు చేసే పథకాల గురించి ప్రచారం చేస్తామన్నారు. సమావేశంలో మారుతి, రాము, మనోహర్ పత్తార్, బ్రహ్మ గణేష్, వెంకటేష్లున్నారు. విద్యార్థుల అభివృద్ధికి సహకారం అవసరం రాయచూరు రూరల్ : విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం అవసరమని విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. సంస్కృతి, సంస్కారాలతో పాటు జీవిత విలువలను వారిలో అలవర్చుకొనేలా చూడాలన్నారు. కార్యక్రమంలో శరణప్ప, దండెప్ప, అస్లాం పాషా, బాబూ రావ్ శేగుణిషి, అబ్దుల్ రజాక్లున్నారు. -
శరన్నవ రాత్రి ఉత్సవాలకు తెర
రాయచూరు రూరల్ : జిల్లాలో మంగళవారం శరన్నవరాత్రి ఉత్సవాలకు తెరదించారు. సుల్తాన్పూర్ బృహన్మఠంలో శ్రీదేవి, కోటలోని కాళికా దేవి ఆలయంలో ప్రతిమకు ప్రత్యేకంగా పూజలు జరిపారు. సుల్తాన్పూర్ బృహన్మఠంలో శ్రీదేవి పురాణ మంగళం సందర్భంగా చిన్నారులతో నృత్య ప్రదర్శనలు జరిగాయి. కాళికా దేవి ఆలయంలో పున్నమి సందర్భంగా విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రశేఖర్ కపిలవాయి, శివ కుమార్, సభ్యులు సత్యనారాయణ, రవి, బ్రహ్మ, ఈశ్వర్, కేశవమూర్తిలున్నారు. -
మానవ హక్కుల రక్షణ సమితికి ఎంపిక
బళ్లారి రూరల్ : కర్ణాటక మానవ హక్కుల రక్షణ సమితి జిల్లాధ్యక్షుడుగా పి.అంజినిని ఎన్నుకొన్నట్లు రాష్ట్రాధ్యక్షుడు యూ.ఉరుకుంద ఓ ప్రకటనలో తెలిపారు. విశ్రాంత ఉపాధ్యాయుడు పి.అంజిని విద్యా శాఖలో ఉపాధ్యాయుడుగా, ప్రధానోపాధ్యాయుడుగా, మోకా క్లస్టర్ సీఆర్పీగా అందించిన ఉత్తమ సేవలను గుర్తించి జిల్లాధ్యక్షుడుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రాధ్యక్షుడు యూ.ఉరుకుంద, కోశాధికారి ఉప్పార వీరేశ్, ప్రముఖులు మల్లప్ప, హనుమంతప్పలు అంజినిని అభినందించారు. కులగణనలో ఉపాధ్యాయుడికి గుండెపోటు హుబ్లీ: దావణగెరె తాలూకాలోని హళెకడ్లెబాళు స్కూల్ టీచర్ సోమవారం గుండెపోటుకు గురై దావణగెరె ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. టీచర్ ప్రకాష్ నాయక్(44) గుండెపోటుకు గురైన వ్యక్తి. సర్వే వేళ గుండెపోటు సంభవించడంతో స్థానికులు సమయస్ఫూర్తితో ఆయన్ను తక్షణమే నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో వైద్యులు అప్పటికప్పుడే ఆపరేషన్ చేసి స్టంట్ అమర్చారు. మొత్తానికి ఆయన ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. కాగా కోలుకుంటున్న ప్రకాష్ నాయక్ను ఆ జిల్లాధికారి గంగాధరస్వామి పరామర్శించి ధైర్యం చెప్పారు. పదవికి రాజీనామా హొసపేటె: హొసపేటె సిటీ మున్సిపాల్టీ(నగరసభ) ఉపాధ్యక్షుడు రమేష్ గుప్తా రాజీనామా లేఖను జిల్లాధికారి కవితా ఎస్.మన్నికేరికి అందజేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి చేసిన రాజీనామా పత్రాన్ని రమేష్ గుప్తా మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి వెళ్లి విజయనగర జిల్లా మేజిస్ట్రేట్, జిల్లాధికారిణికి సమర్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ హొసపేటె సిటీ మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలో ఉండటం గమనార్హం రోడ్డు ఇలా.. ప్రయాణం ఎలా? రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రధాన రహదారిలో మురుగు నీరు నిలిచింది. దేవదుర్గ తాలూకా గబ్బూరు గ్రామంలో ప్రధాన రహదారిలో గత కొన్ని నెలల నుంచి గ్రామ ప్రజలు ఉపయోగించిన మురుగు నీరు, నారాయణ పుర కుడి కాలువ నీరు రెండు కలిసి రహదారిని ముంచెత్తుతున్నాయి. రాయచూరు, కలబుర్గి, విజయపుర, శహాపుర, యాదగిరి, పూనా, షోలాపుర వంటి నగరాలను అనుసంధానించే రహదారి అధ్వానంగా మారింది. ఈ ప్రాంతం మీదుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సంచారం చేస్తారు. గత నెల 28న గబ్బూరులో రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. నేరాల అదుపునకు ప్రజలు సహకరించాలిరాయచూరు రూరల్: నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులతో సహకరించాలని గురుమఠకల్ పోలీస్ స్టేషన్ సీఐ వీరన్న దొడ్డమని పేర్కొన్నారు. మంగళవారం గురుమఠకల్ తాలూకా నజరాపుర గ్రామంలో ఇంటింటికీ పోలీస్ అనే కార్యక్రమంలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ట్రాఫిక్ నియమాలు, ఈఆర్ఎస్ 112, 1930 సహాయవాణి ద్వారా ప్రజలు సహకరించాలన్నారు. -
మహర్షి మార్గం ఆదర్శప్రాయం
బళ్లారి అర్బన్: నగరంలోని వాల్మీకి సర్కిల్లో రూ.1.10 కోట్ల వ్యయంతో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సర్కిల్ను అభివృద్ధి పరుస్తామని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి హామీ ఇచ్చారు. నగరంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా నల్లచెరువులోని వాల్మీకి భవనంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అయోధ్యలో సీతారాముల శిల్పాలు చెక్కిన మైసూరుకు చెందిన ప్రముఖ శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చేతుల మీదుగా విగ్రహాన్ని చెక్కించామన్నారు. బళ్లారిలో వాల్మీకి శాఖ మఠం స్థాపిస్తామన్నారు. ప్రముఖులు ముండ్రగి నాగరాజ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకు ముందు వాల్మీకి విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పూజలు నెరవేర్చారు. జయంతి శుభవేళ నగర వీధుల్లో వాల్మీకి చిత్రపటాన్ని ఊరేగించారు. ఊరేగింపులో మేయర్ ముల్లంగి నందీష్, ఎస్పీ శోభారాణి తదితర అధికారులు, కార్పొరేటర్ వివేక్ తదితరులు పాల్గొన్నారు. బీఎంసీఆర్సీలో.. బళ్లారి రూరల్ : మహర్షి వాల్మీకి జయంతిని మంగళవారం బళ్లారి వైద్య కళాశాల పరిశోధన కేంద్రం(బీఎంసీఆర్సీ) లోని బీసీ రాయ్ హాల్లో ఘనంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం బీఎంసీఆర్సీ డీన్ డాక్టర్ గంగాధరగౌడ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులు మహర్షి వాల్మీకి జీవిత విశేషాలు, రామాయణం రచన గురించి తెలిపారు. ప్రిన్స్పాల్ డాక్టర్ మంజునాథ్, సూపరింటెండెంట్ డాక్టర్ ఇందుమతి, దంతవైద్య కళాశాల ప్రిన్స్పాల్ డాక్టర్ భారతి, సీఏఓ మహేష్ హళేగౌడ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. హొసపేటెలో.. హొసపేటె: మహర్షి వాల్మీకి జయంతి వేడుకల సందర్భంగా మంగళవారం విజయనగర జిల్లాధికారి కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గవియప్ప, జిల్లాధికారి కవితా ఎస్. మన్నికేరి, ఎస్పీ జాహ్నవి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే గవియప్ప మాట్లాడుతూ మహర్షి వాల్మీకి మనందరికీ ఆదర్శప్రాయమైన రామాయణం అనే గ్రంథాన్ని రచించారన్నారు. వాల్మీకి చూపిన సత్యం, ధర్మం, నీతి మార్గాల్లో నడుచుకుంటూ సమాజానికి సేవ చేయాలని సూచించారు. జెడ్పీ సీఈఓ నోంగ్జాయ్ మహమ్మద్ అక్రమ్ పాషా, అదనపు జిల్లాధికారి బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: నగరంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతిని సంబరంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి సర్కిల్ వద్ద మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. మహర్షి వాల్మీకి ప్రతిమకు నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, రాయచూరు శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, లోక్సభ సభ్యుడు కుమార నాయక్, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పూలమాల వేశారు. అనంతరం వాల్మీకి భవనంలో అదనపు జిల్లాధికారి శివప్ప, కన్నడ సంస్కృతి శాఖ అధికారి రాజేంద్ర జాలదార్, వెంకటేష్లున్నారు. ఊరేగింపులో కళాకారుల నృత్యం ఇతర కార్యక్రమాలు జరిగాయి. మహర్షి వాల్మీకి కన్న కల ప్రజారాజ్యం హుబ్లీ: జిల్లా వ్యాప్తంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ప్రభుత్వం, సంబంధిత వర్గాలు పలు సంఘ సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ధార్వాడలో జిల్లాధికారిణి దివ్యప్రభు తదితర అధికారుల ఆధ్వర్యంలో వివిధ చోట్ల వాల్మీకి విగ్రహాలను ప్రత్యేక పూజలు నెరవేర్చారు. అక్కడి ఆలూరు వెంకటరావ్ భవనంలో వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి వాల్మీకి రామాయణం గురించి వక్తలచే ప్రత్యేక ప్రసంగాలు చేయించారు. ప్రముఖ పరిశోధకులు డాక్టర్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి జయంతి వేడుకల్లో వక్తలు సంబరాల మధ్య చిత్రపటం ఊరేగింపు -
23 నుంచి వైభవంగా కిత్తూరు ఉత్సవాలు
హుబ్లీ: ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా ఈనెల 23, 24, 25 తేదీల్లో మూడు రోజుల పాటు కిత్తూరు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. ఈ సారి రాష్ట్రానికే ప్రసిద్ధి చెందిన వ్యక్తి చేతుల మీదుగా ప్రారంభింప చేస్తామని బెళగావి జిల్లా ఇన్చార్జి మంత్రి సతీష్ జార్కిహోళి తెలిపారు. చెన్నమ్మన కిత్తూరులో కిత్తూరు ఉత్సవాల ముందస్తు సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించాం. దీని తర్వాత మరో సమావేశం నిర్వహిస్తాం. మొత్తానికి మూడు సమావేశాలు నిర్వహించి ఉత్సవాలకు తుది రూపం ఇస్తామన్నారు. నిర్వహణ కోసం 17 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. వర్ధమాన కళాకారులకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. వివిధ సమస్యలను పరిష్కరించే దిశలో సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నాం. ఎమ్మెల్యే బాబా సాహెబ్ పాటిల్ సారథ్యంలో ఈ సారి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. కిత్తూరు అభివృద్ధి ప్రాధికారకు నిధుల విడుదలలో పక్షపాత ధోరణిపై అడిగిన ప్రశ్నకు సంగొళ్లి అభివృద్ధి ప్రాధికార ద్వారా సంగొళ్లి, నందగడలో అనేక నిర్మాణ పనులను చేపట్టినందు వల్ల దానికి ఎక్కువ నిధులు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రాధికార అధ్యక్షుడు ఆయా రెవెన్యూ మంత్రిని కలిసి కిత్తూరు అభివృద్ధి ప్రాధికారకు ఎక్కువ నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు. -
జయహో కవికోకిల వాల్మీకి
చిక్కబళ్లాపురం: కవి కోకిల, రామాయణ మహాకావ్య రచయితగా పేరుపొందిన పూజ్యులు వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలను మంగళవారం రాష్ట్రమంతటా ఘనంగా జరిపారు. ప్రభుత్వం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. చిక్కబళ్లాపురంలో మంత్రి ఎంసి సుధాకర్, జిల్లాధికారులు, నాయకులు పాల్గొన్నారు. వా ల్మీకి చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఆ వర్గానికి చెందిన ప్రముఖులను ఘనంగా సన్మానించారు. వాల్మీకి చిత్రపటాన్ని పూల పల్లకీలో ఊరేగించారు. అలాగే మైసూరు నగరంలో బృహత్ ర్యాలీ జరిగింది. కళాకారుల ప్రదర్శనలు రంజిపంజేశాయి. కలబుర్గిలో ఊరేగింపులో జిల్లా కలెక్టర్ ఫౌజియా తరున్నుం డ్రమ్స్ వాయించారు. కోలారులో నేత్రపర్వంగా పల్లకీ ఊరేగింపు జరిగింది. రాష్ట్రమంతటా జయంతి సంబరాలు -
కిక్కు లేని చుక్క విక్రయాలు
బనశంకరి: ఎకై ్సజ్శాఖ అర్ధవార్షిక కార్యకలాపాల డేటా ప్రకారం రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెద్దగా పెరగడం లేదు. 2023, 2024 తో పోలిస్తే మద్యం విక్రయాల్లో భారీ తగ్గుముఖం కనబడింది. బ్రాందీ, విస్కీ తదితరాలపై ఎకై ్సజ్ సుంకాలను తరచూ పెంచడమే దీనికి కారణంగా అనుమానాలున్నాయి. రేట్లు పెరగడం వల్ల మందుబాబులు వెనుకంజ వేస్తున్నారు. వినియోగం తగ్గినప్పటికీ ఎకై ్సజ్ రాయల్టీకి ఢోకా లేదని మద్యం వ్యాపారులు చెప్పారు. రేట్లు, సుంకాల పెంపు వల్ల సర్కారుకు అమ్మకాల లోటు కనిపించడం లేదు. గత మూడేళ్లలో ఇలా 2023 ఏప్రిల్– సెప్టెంబర్ మధ్యకాలంలో 352.83 లక్షల బాక్సులు (ఒక బాక్సుకు 8.64 లీటర్లు) ఐఎంఎల్ మద్యం విక్రయమైంది, 2024 ఇదే అవధిలో 345.76 లక్షల బాక్సులు అమ్ముడయ్యాయి. 2025లో 342.93 లక్షల బాక్సులను తాగేశారు. ఇది గిరాకీ తగ్గుదలకు అద్దం పడుతోంది. పాతాళానికి బీర్లు 2024 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో మొత్తం 242.73 లక్షల బాక్సులు (ఒక బాక్సులో 7.80 లీటర్లు) బీర్లను మందుబాబులు తాగేశారు. కానీ 2025 ఇదే అవధిలో 195.27 లక్షల బాక్సులే కొన్నారు. ఏకాఎకి 47.46 లక్షల బాక్సుల సరుకు అమ్ముడుపోలేదు. ఈ క్షీణత 19.55 శాతంగా నమోదైంది. బీర్ల ధరలను సర్కారు విచ్చలవిడిగా పెంచడమే కారణం. అంత డబ్బు పెట్టలేక పేద, మధ్యతరగతి మందుబాబులు, యువత బీరుకు టాటా చెబుతున్నారు. రాష్ట్రంలో గత 6 నెలల్లో భారీ క్షీణత అధిక ధరలే కారణం సర్కారుకు మాత్రం వేల కోట్ల ఆదాయంరాష్ట్ర ప్రభుత్వం పంచ గ్యారంటీల పథకానికి నిధుల కోసం మద్యం ధరలను రెండేళ్లుగా పెంచుతూ వస్తోంది. ఫలితంగా మందుప్రియులకు చేటుకాలం తలెత్తింది. అంత ఖర్చు పెట్టి మద్యం కొనలేకపోతున్నారు. బెంగళూరుతో సహా రాష్ట్రంలో మద్యం విక్రయాలు పడిపోవడమే దానికి నిదర్శనం. ఖజానాకు రూ.17 వేల కోట్లపైనే మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎకై ్సజ్ శాఖ రాయల్టీ సేకరణలో తగ్గలేదు. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు మద్యం విక్రయాలతో రూ.17,702 కోట్ల రాయల్టీ దక్కింది. ప్రస్తుతం ఇదే అవధిలో రూ.19,571 కోట్ల రాబడిని ఆర్జించింది. రూ.1,869 కోట్లు అదనంగా సమకూరడం గమనార్హం. -
కళామేళా కనువిందు
బనశంకరి: సిలికాన్ సిటీలో జేపీ నగరలో నిర్వహిస్తున్న రాజస్థానీ హస్తకళా, చేనేత మేళా మహిళలను ఆకట్టుకుంటోంది. 7వ ఫేజ్ ఆర్బీఐ లేఔట్ సోమేశ్వర సభాభవన్లో మేళా జరుగుతోంది. దేశంలో పేరుమోసిన ప్రాంతాలకు చెందిన చేనేత వస్త్రాలు, చీరలు, నూలు, పట్టుచీరలు ఇక్కడి స్టాళ్లలో విక్రయిస్తున్నారు. అలాగే గృహాలంకరణకు సారంగపుర కళా సామగ్రి, తివాచీలు, మార్బుల్ క్రాఫ్ట్స్, కంచు, దంత కళాసామగ్రి, పెయింటింగ్స్, హ్యాండ్బ్యాగులు, జ్యువెలరీ, పింగాణీ వస్తువులు లభిస్తున్నాయి. 22వ తేదీ వరకు నిర్వహిస్తారు. లాల్బాగ్ను చంపేయొద్దు: అశోక్ దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి నగరం గుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.26 వేల కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన సొరంగ మార్గం పథకాన్ని తక్షణం రద్దు చేయాలని బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ డిమాండు చేశారు. ప్రమాదంలో లాల్బాగ్ అనే పేరుతో ఎక్స్లో పోస్ట్ చేశారు. సొరంగ మార్గం ప్రాజెక్టు కోసం బెంగళూరు శ్వాసకోశంగా ఉన్న లాల్బాగ్ పార్క్ను బలి ఇస్తున్నారన్నారు. లాల్బాగ్లోని 6 ఎకరాలు పోతుందని, వేలాది చెట్లను నరికివేస్తారన్నారు. పరిసరవాదులు,మేధావులు ఇప్పటికే ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారన్నారు. ఒక వ్యక్తి ప్రచారం కోసం ఇంత విధ్వంసం అవసరమా అని డీసీఎం డీకే శివకుమార్పై మండిపడ్డారు. పార్కు రక్షణకు ప్రజలతో కలిసి పోరాడుతామన్నారు. కుర్చీ వివాదాన్ని తీర్చాలి: హోంమంత్రి శివాజీనగర: సీఎం పీఠం పంపిణీ వివాదాన్ని పార్టీ హై కమాండ్ పరిష్కరించాలని హోం మంత్రి జీ.పరమేశ్వర్ డిమాండ్ చేశారు. మంగళవారం బెంగళూరులో సదాశివనగర ఇంటి వద్ద మాట్లాడిన ఆయన, పవర్ షేరింగ్ వివాదాన్ని పరిష్కరించాలని మంత్రి సతీశ్ జార్కిహొళి చెప్పడాన్ని సమర్థించారు. దీనిపై గందరగోళం ఉంది, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రకటనలు చేస్తున్నారు. దీనిని హైకమాండ్ గమనిస్తోంది. బిహార్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో మార్పులు అంటూ ఏమీ చెప్పలేం. హైకమాండ్ మార్చాలంటే మారుస్తుంది, బెంగళూరులో, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని సరిజేయడం తమ బాధ్యత అన్నారు. కాగా, సుప్రీంకోర్టులో దళితుడు, సీజే జస్టిస్ గవాయ్పై దాడి జరిగింది, అది రాజ్యాంగానికి చేసిన అవమానం. అక్కడి భద్రతా వ్యవస్థ విఫలమైంది. దాడికి పాల్పడిన న్యాయవాదిని ఎందుకు అరెస్టు చేయలేదు అని ప్రశ్నించారు. గజిబిజిగా కులగణన● విజయేంద్ర దొడ్డబళ్లాపురం: బీసీలకు న్యాయం చేసేది బీజేపీ ఒక్కటేనని ఆ పార్టీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. మంగళవారంనాడు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే ఆ సర్వేలు శాసీ్త్రయంగా, న్యాయంగా జరగాలన్నారు. సర్వేలో జరుగుతున్న తప్పులను, గందరగోళాలను దిద్దుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంటే, సర్వేలకు వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అనేక చోట్ల సర్వే సిబ్బందిపై దౌర్జన్యాలు, కుక్కల దాడులు జరుగుతున్నాయి, సమస్యలు వస్తున్నాయి, అలాంటి జరగకుండా చూడాలని సర్కారుని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబాన్ని 60 ప్రశ్నలు అడగడం ఎంతవరకూ సమంజసమన్నారు. సీఎం, డీసీఎం కూడా ఈ విషయంలో విస్మయం వ్యక్తం చేశారన్నారు. టెన్త్ విద్యార్థుల ఫీజుల పెంపు దొడ్డబళ్లాపురం: రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) విద్యార్థులపై భారం మోపనుంది. వార్షిక పరీక్షల ఫీజును 5 శాతం పెంచింది. ఈ మేరకు కర్ణాటక పాఠశాలలు, వాల్యూయేషన్ బోర్డు ఉత్తర్వులను జారీచేసింది. ఇప్పుడు మొదటిసారి పరీక్షలు రాసే విద్యార్థి రూ.676 కు బదులుగా రూ.710 చెల్లించాలి. కొత్తగా నమోదు చేసుకునే ప్రైవేటు విద్యార్థులకు నమోదు మరియు అప్లికేషన్ రుసుము రూ.236 నుంచి 248కి పెంచారు. సబ్జెక్ట్ రాసే విద్యార్థులు రూ.427 కు బదులు రూ.448 చెల్లించాలి. రెండు అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్లు రాసే విద్యార్థులు రూ.532 కు బదులు రూ.559 చెల్లించాలి. సమాధానపత్రాల మదింపు, ఇతర పాలనాపరమైన ఖర్చులు పెరిగినందున ఫీజులను పెంచినట్లు బోర్డు సమర్థించుకుంది. -
మార్కొనహళ్లి డ్యాంలో మృత్యు కేక
తుమకూరు: తుమకూరు జిల్లాలోని మార్కొనహళ్ళిలో సెఫోన్ వద్దనున్న జలాశయాన్ని చూడడానికి వెళ్లిన రెండు కుటుంబాలకు చెందిన 6 మంది నీటిలో పడి మునిగిపోయారు. వీరిలో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. ఈత కొడుతూ ఉండగా.. ● ఈ విషాదకర సంఘటన కుణిగల్ తాలూకాలోని మార్కొనహళ్ళి డ్యాంలో మంగళవారం జరిగింది. ● తుమకూరులోని బీటిపాళ్య నుంచి మాగడిపాళ్యలోని బంధువుల ఇంటికి ఓ కుటుంబం వెళ్లింది. ● దగ్గరిలోని శింషా నదిపైనున్న జలాశయం వర్షాలకు కళకళాడుతూ ఉండడంతో చూడాలని అతిథులు, స్థానిక కుటుంబీకులు వెళ్లారు. ● ఏడుమంది జలాశయం తీరంలో ఈతకొడుతూ ఉండగా, లోతైన చోట 7 మంది మునిగిపోయారు. వారిలో ఒకరు మాత్రం ఎలాగో బయటకు వచ్చారు. ● స్థానికులకు తెలిసి పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వచ్చి గాలించి సాజియా (32), అర్బిన్ (30) అనే ఇద్దరు మహిళల శవాలను బయటకు తీసుకొచ్చారు. ● తబసుమ్ (45), షబాన (44), మీప్రా (4), మహిబా (1) జలాశయంలో గల్లంతయ్యారు. ● ప్రాణాలతో బయటపడిన నవాబ్ అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ● బంధువుల రోదనలతో డ్యాం వద్ద విషాదం అలముకొంది, రాత్రివరకూ గాలించినా మిగతా నలుగురి జాడ లేదు. రెండు కుటుంబాలకు చెందిన 6 మంది గల్లంతు ఇద్దరు మహిళల మృతదేహాల వెలికితీత తుమకూరు జిల్లాలో ఘోర విషాదం -
శాండల్వుడ్లో మళ్లీ మీ టూ బాంబు
యశవంతపుర: శాండల్వుడ్లో మరోసారి మీ టూ ప్రకంపనలు తలెత్తాయి. తమను సహ నటులు వేధించారని ఐదారేళ్ల కిందట అనేకమంది నటీమణులు ఆరోపణలు చేయడం, అది తీవ్ర సంచలనం కావడం తెలిసిందే. ఇప్పుడు మరో ఉదంతం బయటపడింది. ఓ కన్నడ నటికి లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై బెంగళూరు రాజాజీనగర పోలీసులు నటుడు, నిర్మాత హేమంత్కుమార్ (34) ను అరెస్ట్ చేశారు. రిచ్చి సినిమా షూటింగ్లో తనను వేధించాడని ఓ వర్ధమాన నటి (29) ఇటీవల ఫిర్యాదు చేసింది. సినిమా చాన్సు ఇస్తానని.. 2022లో రిచ్చి పేరుతో తీస్తున్న సినిమా షూటింగ్ సమయంలో తనను పరిచయం చేసుకొని, మరో సినిమాలో చాన్సు ఇస్తానని నమ్మించి లైంగికంగా వేధించినట్లు నటి ఫిర్యాదులో పేర్కొంది. అడ్వాన్స్గా తనకు రూ.60 వేలు ఇచ్చాడని, షూటింగ్ సమయంలో లైంగికంగా సతాయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. షూటింగ్లో అరకొర దుస్తులను ధరించి నటించాలని ఒత్తిడి చేశాడంది. ఆయన డిమాండ్లను నెరవేర్చని కారణంగా చిత్రంలో సెన్సార్ కానీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడని తెలిపింది. రాజాజినగర పోలీసులు నిందితుడు హేమంత్పై లైంగిక వేధింపులు, బెదిరింపులు, ఐటీ చట్టం తదితరాల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం కన్నడ సినీ లోకంలో సంచలనం కలిగిస్తోంది. మళ్లీ కొత్తగా మీ టూ ఉదంతాలు పుట్టుకొస్తాయేమోనని సినీ ప్రముఖుల్లో గుబులు నెలకొంది. నిర్మాత వేధించాడని నటి ఫిర్యాదు నిందితుడు అరెస్టు బెంగళూరులో సంఘటన సినిమా వేడుకలో మద్యం తాగించి.. 2023 ఆగస్టులో ముంబైలో జరిగిన ఓ సినిమా వేడుకలో తనను మద్యం తాగమని బలవంతం చేశాడని, కూల్డ్రింకులో మద్యం కలిపి ఇచ్చాడని సదరు నటి తెలిపింది. తాను తెలియకుండా తాగడంతో మత్తులోకి జారుకోగా తనను ఫోటోలు, వీడియోలను తీసుకుని అసభ్యంగా మారుస్తానని బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డాడని వాపోయింది. ఆ వీడియోలను తన తల్లికి పంపండంతో ఆమె భయాందోళనకు గురైందని తెలిపింది. ప్రశ్నించినందుకు గూండాలతో దాడికి యత్నించాడంది. తన వీడియోలు ఎక్కడా ప్రసారం కాకుండా కోర్టుకు వెళ్లి ఆదేశాలు పొందానని ఆమె తెలిపింది. పోలీసులు హేమంత్ను ఆదివారం అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
దెయ్యాలు బాబోయ్
మండ్య : సోషల్ మీడియాలో వైరల్ కావాలని చిత్ర విచిత్రమైన వీడియోలను తయారు చేస్తూ ఉంటారు కొందరు. అదే కోవలో దెయ్యాలు తిరుగుతున్నాయని, కనిపించినవారిపై దాడులు చేస్తున్నాయని వీడియోలు తీసిన ఓ ఘనుని ఉదంతమిది. మండ్య జిల్లాలోని నాగమంగలలో వెలుగుచూసింది. వివరాలు.. పట్టణవాసి గోపి యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు. దేవలాపుర హ్యాండ్పోస్ట్ వద్ద దెయ్యాలు తిరుగుతున్నాయని, అవి ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నాయని ఓ వీడియోను సృష్టించి పోస్ట్ చేశాడు. అందులో ఓ మహిళ దయ్యం మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ వీడియో చూసిన ప్రజలు నిమేననుకుని హడలిపోయారు. ఈ విషయం పోలీసులకు తెలిసి గోపిని పిలిపించారు. ఎలాంటి దయ్యాలు లేవని, వ్యూస్ కోసం నకిలీ వీడియోను రూపొందించానని గోపి చెప్పాడు. ఆ వీడియోను తొలగించాడు. ఎలాంటి దయ్యాలు లేవు, ప్రజలు భయపడకండి అని పోలీసులు ఫ్యాక్ట్ చెక్ అని ఓ పోస్టింగ్ను ఉంచారు. -
చెట్టు.. తీసింది కీర్తన ఊపిరి
దొడ్డబళ్లాపురం: బెంగళూరు నగరానికి చెట్లు ఎంత అందాన్ని ఇస్తాయో అంతే ముప్పుగా కూడా మారాయి. ఎప్పుడు ఏది విరిగిపడి ప్రాణం తీస్తుందో తెలియడం లేదు. చెట్టు పడి యువతి దుర్మరణం చెందగా, మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన సిటీలో సోలదేనహళ్లిలో జరిగింది. హెబ్బాళకు చెందిన కీర్తన (24) మృతురాలు కాగా, మరో బైకిస్టు భాస్కర్, రాధ క్షతగాత్రులు. గతంలో ఫిర్యాదు ఈ ఘటనతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోలదేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను కొట్టివేయాలని ఎన్నిసార్లు పాలికె సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. పడిపోయిన చెట్టు ఏడాది నుంచి ప్రమాదకరంగా ఉందని చెప్పారు. మ్యాచ్ చూసి వస్తుండగా.. ఎలా జరిగిందంటే.. ఆదివారం కీర్తన, ఆమె స్నేహితురాలు రాధతో ఆచార్య మైదానంలో జరిగే శాండల్వుడ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ను చూడడానికి స్కూటర్లో వెళ్లారు. మ్యాచ్ ముగిశాక సాయంత్రం 7 గంటల సమయంలో తమ స్కూటర్లో ఇళ్లకు బయల్దేరింది. కీర్తన స్కూటర్ వెనుక కూర్చుంది. సోలదేనహళ్లి పోలీస్స్టేషన్ సమీపంలో పెద్ద చెట్టు విరిగి పడింది. ఆ సమయంలో ఎలాంటి గాలి వాన లేవు.చెట్టు కింద నలిగిన కీర్తన క్షణాల్లోనే చనిపోయింది. రాధ, మరో బైక్పై వస్తున్న భాస్కర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అందరినీ స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు కీర్తన చనిపోయినట్లు తెలిపారు. మిగతా ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. -
వలస పక్షుల అడ్డా అంకసముద్ర
సాక్షి,బళ్లారి: ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి తుంగభద్ర డ్యాంలోకి నీరు పుష్కలంగా చేరడంతో పాటు స్థానికంగా వర్షాలు బాగా కురవడంతో ఉమ్మడి జిల్లాలోని హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని అంకసముద్ర చెరువు కూడా కళకళలాడుతోంది. అంకసముద్ర చెరువు అంటే ప్రత్యేకంగా నీరు నిల్వ ఉండే చెరువుగా ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీంతో ఇక్కడికి దేశ, విదేశీ వలస పక్షులు తరలి వచ్చి సందడి చేయడంతో పక్షిప్రేమికులకు అంకసముద్ర స్వర్గధామంగా మారింది. సాధారణంగా ప్రతి ఏటా దేశ, విదేశీ పక్షులు నవంబర్ నుంచి అంకసముద్ర చెరువుకు రావడం ఆనవాయితీ కాగా ఈ ఏడాది ముందస్తు వర్షాలతో చెరువు కళకళలాడుతుండటంతో పాటు దేశ, విదేశీ పక్షులు కూడా సెప్టెంబర్ నెల నుంచి రావడం ప్రారంభం కావడంతో అంకసముద్ర చెరువులో పక్షుల కిలకిలరావాలతో పర్యాటకుల సందడి రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న హంపీ కరడిధామ, తుంగభద్ర డ్యాం, ప్రముఖ పుణ్యక్షేత్రాలతో ఉమ్మడి బళ్లారి జిల్లా పేరు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ఉమ్మడి బళ్లారి జిల్లాలో పక్షుల కాశీగా అంకసముద్ర కూడా చేరిపోవడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పక్షి ప్రేమికులను మరిపిస్తున్న వైనం రాష్ట్రంలోనే అరుదైన పక్షిధామంగా పేరొందిన అంకసముద్ర చెరువులో పెయింటెడ్ స్టార్ట్, పెలికాన్, స్పూన్ బిల్లు, ఓపెన్ బిల్లు స్టార్ట్, గ్రోటర్ కార్మోరేట్, విదేశాలకు చెందిన బ్రాహ్మణీ బాతు, బ్లాక్ టెయిల్డ్ గాడ్ వీట్, మార్స్ స్యాండ్ పైపర్, యూరేషియన్ కర్లివ్, సైబోరియన్ స్టోన్ చాట్, కర్లివ్ స్యాండ్ పైపర్ తదితర 87 జాతులకు చెందిన పక్షులు విచ్చేయడంతో అంకసముద్ర చెరువు పక్షి ప్రేమికులను మైమరిపిస్తున్నాయి. దేశ, విదేశాల నుంచి 100 రకాలకు పైగా జాతి పక్షులు వస్తుండటంతో పక్షి ప్రేమికులను ఉదయం, సాయంత్రం వేళల్లో కనువిందు చేస్తున్నాయి. ఉదయం వేళల్లో బయటకు ఆహారం వెళ్లే పక్షులు ఉదయం బయటకు వెళ్లేటప్పుడు, సాయంత్రం తిరిగి మళ్లీ పక్షిగూటికి వచ్చేటప్పుడు పక్షి ప్రేమికులు అక్కడికి చేరుకుని పక్షులను వీక్షించి ఆహ్లాదం పొందుతున్నారు. ముఖ్యంగా అంతరించిపోతున్న అరుదైన నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. ఈ నీటి కుక్కలు(నీరునాయి) పర్యాటకులకు మరింత కనువిందు చేస్తున్నాయి. అంకసముద్ర గ్రామ సమీపంలో విజయనగర రాజుల కాలంలో కట్టించిన ఈ చెరువు దాదాపు 250 ఎకరాల్లో విస్తరించి పక్షులకు నిలయంగా మారింది. తుంగభద్ర నది నుంచి ఏడాది పొడవునా నీరు సరఫరా చేస్తుండటంతో ఎప్పటికప్పుడు ఈ చెరువు ఖాళీ కాకపోవడం విశేషం. దీంతో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అరుదైన పక్షులు ఇక్కడ ఏడాది పొడవునా వచ్చి వెళుతుంటాయి. చెరువులో 100కు పైగా రకాల పక్షుల సందడి దేశ, విదేశీ పక్షుల రాకతో సందర్శకులకు కనువిందు పక్షిప్రేమికులకు నిలయంగా చెరువు దాదాపు 100కు పైగా అందమైన పక్షుల రాకతో ప్రముఖ పక్షుల విడిది కేంద్రంగా, పక్షిధామంగా, పక్షిప్రేమికులకు నిలయంగా ఈ చెరువు విరాజిల్లుతోంది. నీటి కుక్కలు అంకసముద్ర చెరువులో చేస్తున్న నృత్యాలు పర్యాటకులను మరింత ఆనందోత్సవాల్లో ముంచెత్తుతున్నాయి. కలుషిత నీరు రాకుండా కొత్త నీటిలోనే ఈ నీటి కుక్కలు నివాసం ఉంటాయని పక్షి ప్రేమికుడు విజయ్ పేర్కొంటున్నారు. పేరుకు నీటికుక్కలు పిలుస్తారే కాని కుక్కల జాతికి చేరిన పక్షులు కావని, ఇవి అరుదైన ఒక రకమైన పక్షిజాతికి చేరినవి అన్నారు. వీటితో వివిధ రకాల అందమైన పక్షులు రావడంతో పెద్ద సంఖ్యలో జనం వచ్చి వీక్షించి చూసి ఆనందిస్తుంటారన్నారు. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, థాయ్లాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో మాత్రమే ఈ నీటి కుక్కలు కనిపిస్తాయని, చెరువుల్లో నీటిశుభ్రత చేసే అరుదైనవని గుర్తించారు. జనం కనిపిస్తే ఒకింత సిగ్గుపడుతూ వయ్యారాలు ఒలకబోస్తే అటు, ఇటు తిరగడం వల్ల పక్షిప్రేమికుల మనస్సులను కట్టిపడేస్తున్నాయన్నారు. ఎంతో చారిత్రాత్మక నేపథ్యం, ప్రపంచ పర్యాటక కేంద్రాలు ఉన్న ఉమ్మడి బళ్లారి జిల్లాలోని అంకసముద్ర చెరువు పక్షులకు స్థావరంగా ఏర్పాటు చేసుకోవడంతో ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఉమ్మడి బళ్లారి జిల్లాలో పక్షుల స్వర్గధామంగా కూడా గుర్తింపు పొందడం విశేషం. -
కేంద్రానికి బిహార్ తప్ప కర్ణాటక గుర్తు రాదా?
రాయచూరు రూరల్ : రాష్ట్రంలో అతివృష్టి, వరదలతో 17 జిల్లాల్లోని రైతులు పంట పొలాల్లో వేసుకున్న పంటలు సరిగా పండక, పశుగ్రాసం లేక తల్లడిల్లిపోతున్నామని, పంట నష్టపరిహారం అందించాలని కోరుతూ వ్యవసాయ కూలి కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. బాధితులు జీవితం ఎలా గడపాలా? అనే ఆలోచనలో ఉన్న సందర్భంలో తక్కువ పరిహారం అందించాలని అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు తమకేమి పట్టనట్లు ఉండటంపై రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణ కర్ణాటకలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆలకించే తహసీల్దారే మాయం కావడంతో బాధితుల్లో విచారం వ్యక్తం అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ కార్యదర్శులు, అధికారులు రైతులను చూసిన వెంటనే పరుగెడుతున్నారు. పంట నష్టపరిహారం కోసం 10 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోయారు. రాష్ట్రంలో బాధితులు, రైతులు, పేదలు అన్నమో రామచంద్రా అంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు మౌనం వహించడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ ట్విట్టర్లో సందేశాలు పంపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం రాష్ట్రంలో 17 జిల్లాల్లో 80 తాలూకాలో భారీ వరదలు సంభవించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. రాష్ట్రం నుంచి 25 మంది లోక్సభ సభ్యులు ఉన్నా వారి మౌనం ఎందుకో అర్థం కావడం లేదు. 2009లో వరదలు వచ్చిన సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పరిహారం ప్రకటించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో 40 మంది మృతి చెందగా, రూ.50 వేల కోట్ల మేర నష్టం సంభవించినా కేంద్రంలోని నేతలు నరేంద్ర మోదీ, అమిత్షా, నిర్మలా సీతారామన్లు కర్ణాటకను మరిచి బిహార్లో త్వరలో జరుగనున్న ఎన్నికలకు ఆపస్న హస్తం అందించడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న నెలకొంది. బిహార్కు రూ.10,219 కోట్లు, కర్ణాటకకు రూ.3,705 కోట్లు, తెలంగాణకు రూ.2,136 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ.4,112 కోట్లు, మహారాష్ట్రకు రూ.6,418 కోట్లు, తమిళనాడుకు రూ.4,144 కోట్ల నిధులు కేటాయించారు. పరిహారం కోసం రైతుల వెంపర్లాట కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్లో సందేశాలు 17 జిల్లాల్లోని 80 తాలూకాల్లో భారీ వరదలు రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ సభ్యులు మౌనం 2009లో వరదలకు కాంగ్రెస్ సర్కార్ పరిహారం ప్రకటన 40 మంది మృతి, రూ.50 వేల కోట్ల మేర వాటిల్లిన నష్టం -
ప్రతిభావంతులను ప్రోత్సహించాలి
మాలూరు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు ప్రోత్సాహం అందించాలని స్వాభిమాని జనతా పార్టీ సంస్థాపక అధ్యక్షుడు హూడి విజయ కుమార్ తెలిపారు. సోమవారం తాలూకాలోని బాళిగానహళ్లి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని నాగొండహళ్లి గ్రామంలో యోగామృత ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో రంగవర్తన పిల్లల నృత్య, నాటక, సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలలో అపర ప్రజ్ఞా పాటవాలు ఉంటాయని తెలిపారు. వాటిని వెలికి తీయడానికి సరైన వేదిక కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు సాంస్కృతికంగా ప్రగతిని సాధించాలని సూచించారు. యోగామృత ఫౌండేషన్ నుంచి పిల్లలకు నాటక, సంగీత, నృత్య తదితర కళా ప్రకారాల్లో శిక్షణ ఇవ్వడం సంతోషకరమని తెలిపారు. ఫౌండేషన్ నుంచి చిట్పట్ చిన్నర సంస్కృతి హబ్బ, సేవా అవార్డుల ప్రదానం, రాష్ట్ర స్థాయి బంగారు పతకం సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం గర్వించదగిన విషయమన్నారు. కార్యక్రమంలో కరవే తాలూకా అధ్యక్షుడు ఎం.ఎస్ శ్రీనివాస్, యోగా సంస్థ శంకర్, కరవే ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
క్షయపై నిరంతర పోరాటం
● మరోసారి బీసీసీ టీకా వేయించుకోవాలి ● ఆరోగ్య శాఖ తరఫున ముమ్మర ప్రచారం హుబ్లీ: విశ్వవ్యాప్తంగా భారత్లో ఒకప్పుడు క్షయ, పోలియో, కుష్టురోగం, నారి పుండు రోగం, తట్లమ్మ తదితర రోగాలతో గ్రామీణులు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రాణపాయం కొని తెచ్చుకొనే వారు. పెరిగిన వైద్య రంగంలో విజ్ఞానం ఫలితంగా పుట్టినప్పటి నుంచే 16 ఏళ్ల వరకు వివిధ రకాల టీకాలు గత 70, 80 ఏళ్ల నుంచి అందరూ వేసుకున్న వారమే. తాజాగా ప్రస్తుతం క్షయ(టీబీ)కు వ్యతిరేకంగా పోరాటంలో విశ్వాసార్హమైన బీసీసీ టీకా వేసుకోవాలని జిల్లా యంత్రాంగం, జెడ్పీ, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా క్షయ రోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బీసీసీ టీకా గత కొన్నాళ్లుగా తీసుకోవాలని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. క్షయ వ్యాధి లక్షణాలు ఇవే 18 ఏళ్లు పైబడిన వారు ఈ కింద లక్షణాలు కలిగి ఉంటే తీసుకోవచ్చు. గతంలో కానీ ప్రస్తుతం కానీ క్షయ వ్యాధి బారిన పడిన వారు, క్షయ రోగులతో రక్త సంబంధం కానీ ఇరుగుపొరుగున ఉండేవారు, 60 ఏళ్లు నిండిన వయోవృద్ధులు, పౌష్టిక ఆహారం లోపం గల వ్యక్తులు ప్రస్తుతం కానీ, గతంలో కానీ తెగ ధూమపానం చేసేవారు కానీ, మధుమేహం చేసే వారు ఉచితంగా తమ సన్నిహిత, సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సముదాయ ఆరోగ్య కేంద్రం, ఫిర్కా ఆరోగ్య కేంద్రం, తాలూకా ఆరోగ్య కేంద్రం, జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలోని క్షయ విభాగం, అలాగే కేఎంసీ ఆస్పత్రిలోని క్షయ వ్యాధి విభాగం జంట నగరాల్లో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీసీసీ టీకాను వేయించుకోవచ్చు. బీసీసీ టీకా వేయించుకోవాలి అయితే ఆసక్తి ఉందని ఆయా ఆరోగ్య కేంద్రాలను సంప్రదిస్తే బీసీజీ వాయిల్ 10 మందికి వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 10 మంది కూడే వరకు ఈ టీకాను వేయడానికి కుదరదు. కాబట్టి ఫోన్ నెంబర్లను ఆశా వర్కర్లకు, ఆరోగ్య సిబ్బందికి ఇచ్చి వెళితే వారు ఫోన్ చేసిన సమయంలో సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి బీసీసీ టీకాను వేయించుకొని శాశ్వతంగా క్షయ, అలాగే ఊపిరితిత్తుల వ్యాధులకు దూరంగా ఉండవచ్చని సంబంధిత జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కేఎంసీ ఆస్పత్రిలోని టీబీ విభాగం అయిన రూ.55తో ఆధార్ కార్డుతో వచ్చిన వారు ఎవరైనా ఆ లక్షణాలతో ఉండి ఉంటే ఈ టీకాను తీసుకోవచ్చని, ఈ ప్రక్రియ మొత్తం ఉచితమేనని అధికారులు తెలిపారు. వివరాలకు 1800116666 సహాయవాణి నెంబర్లో సంప్రదించాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు. -
రైలు ప్రయాణికుల పాట్లు
రాయచూరు రూరల్: దసరా పండుగకు రాజధాని నుంచి స్వస్థలాలకు చేరుకున్న కల్యాణ కర్ణాటక రైలు ప్రయాణికులు ఆదివారం రాత్రి తిరిగి రాజధానికి బయలుదేరి రైలులో నానా పాట్లు పడ్డారు. రాయచూరు రైల్వే స్టేషన్లో రైలు బోగీలను పరిశీలించగా ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయాయి. కిక్కిరిసిన బోగీల్లో కింద పడుకొని పిల్లా పాపలతో ప్రయాణించారు. బోగీల్లో ఎక్కడా అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. లాతూర్ నుంచి బెంగళూరు వరకు వెళ్లే ఈ రైలులో బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల నుంచి జీవనోపాధి కోసం వెళ్లే వ్యవసాయ కూలీలు, ఇతర ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. పండుగ సమయంలో అదనపు రైళ్లు నడపకుండా రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, అదనపు బోగీలను అమర్చకుండా ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనే ఆరోపణలున్నాయి. రైల్వేస్టేషన్ పరిసరాల్లో శుభ్రతకు శ్రీకారం రాయచూరు రూరల్: రాయచూరు రైల్వే స్టేషన్లో రైల్వే బోర్డు సలహా సమితి సభ్యులు శుభ్రతకు శ్రీకారం చుట్టారు. సోమవారం రైల్వేస్టేషన్లో సభ్యుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రధాని ఆదేశాల మేరకు ప్రతి రైల్వేస్టేషన్ శుభ్రతకు ప్రాధాన్యత కల్పించాలనే సదుద్దేశ్యంతో రైల్వే కాంపౌండ్లో పెరిగిన ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలను జేసీబీ సాయంతో తొలగించారు. నగరసభ, రైల్వే శాఖల ఆధ్వర్యంలో స్వచ్ఛత అభియాన్కు నడుం బిగించారు. రైల్వే బోర్డు సలహా సమితి సభ్యులు మారెప్ప, సీతా నాయక్, నవీన్ కుమార్, రమేష్, సిద్దలింగయ్య, మహేష్, అధికారులు అమరేష్, మల్లికార్జున, హేమరాజ్లున్నారు. మొసలి పట్టివేత రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా యక్లాస్పూర్లో సోమవారం మొసలి ప్రత్యక్షమైంది. యక్లాస్పూర్ గ్రామం చెరువు పక్కనే ఉండగా చెరువులో నీరు నిండా ఉన్నాయి. కాగా పైభాగంలో నుంచి మొసలి వచ్చిందంటూ చేపలు పట్టే మత్స్యకారులు అప్రమత్తమై మొసలిని పట్టుకొని బంధించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. రైతు సమస్యలపై స్పందిస్తాంరాయచూరు రూరల్: ఇటీవల కురిసిన వర్షాలకు యాదగిరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వరదల బారిన పడి నీరు చేరిన పంట పొలాల్లో నష్టం సంభవించిన రైతులకు పరిహారం అందించే దిశలో సమీక్షలపై సర్కార్, మంత్రులు స్పందిస్తారని రాయచూరు లోక్సభ సభ్యుడు కుమార నాయక్, యాదగిరి శాసన సభ్యుడు చెన్నారెడ్డి పాటిల్ పేర్కొన్నారు. సోమవారం యాదగిరి తాలూకా వడగేర, బాడియాళ, కట సంగావి ప్రాంతాల్లో పత్తి పంటలను పరిశీలించారు. రైతుల సమస్యలపై అధికారులు సత్వరం స్పందించాలని అన్నారు. రైతులకు వాటిల్లిన పంట నష్టాలపై సక్రమంగా సర్వే చేసి పరిహారం అందించాలన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని యాచకుడు మృతిహుబ్లీ: కేఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని యాచకుడు మృతి చెందిన ఘటన తాలూకాలోని వరూరు గ్రామంలో జరిగింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని ఓ యాచకుడు(45) రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్థానిక గోకుల్ రోడ్డులో బన్ని(జమ్మి) చెట్టు దగ్గర ఉన్న మొబైల్ టవర్లో ఏర్పాటు చేసిన సుమారు రూ.1.06 లక్షలు విలువైన పరికరాలను దుండగులు చోరీ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. -
కల్మఠంలో కుంభమేళా ప్రారంభం
రాయచూరు రూరల్ : జిల్లాలోని మాన్వి కల్మఠంలో దసరా దర్బార్లో భాగంగా కుంభమేళాకు ప్రజా ప్రతినిధులు శ్రీకారం చుట్టారు. సోమవారం మాన్వి కల్మఠంలో రాయచూరు లోక్సభ సభ్యుడు కుమార నాయక్, మాన్వి ఎమ్మెల్యే హంపయ్య నాయక్ పాల్గొని మాట్లాడారు. హిందూ సంప్రదాయాలను భక్తితో చేపట్టే విషయంలో కల్మఠం ముందుంటుందన్నారు. శ్రీదేవి మహా పురాణం, సువర్ణ దసరా మహోత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శ్రీశైల, రంభాపురి, కాశీ జగద్గురువులు పాల్గొన్నారు. అనంతరం మఠాధిపతి విరుపాక్ష పండితారాధ్య వారిని సన్మానించారు. రంభాపురి జగద్గురువులను అడ్డ పల్లకీ సేవలో ఊరేగించారు. -
సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోండి
కోలారు: సరిహద్దుల్లో సైనికుల పహారా, పొలంలో రైతులు వ్యవసాయం చేయడం వల్లనే నేడు దేశం సుభిక్షంగా ఉంది. ప్రభుత్వాలు ఈ రెండు రంగాలకు అధిక ప్రాదాన్యత ఇచ్చినప్పుడే దేశం మరింత బలిష్టంగా మారుతుందని బీకేఎస్ దక్షిణ ప్రాంత ఉపాధ్యక్షుడు ఏ.అప్పాజీ గౌడ తెలిపారు. తాలూకాలోని దుగ్గసంద్రరర్కా దిన్నహళ్లి గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ గ్రామ సమితిని ప్రారంభించి మాట్లాడారు. గ్రామ ఐక్యతను కాపాడుకోవాలని సూచించారు. రైతు సమస్యలు, గ్రామ అభివృద్ధిపై ప్రతి వారం సభ నిర్వహించి చర్చించుకోవాలన్నారు. గ్రామ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వారు స్పందించకపోతే ప్రతిఘటనలకు దిగాలని తెలిపారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆధునిక వ్యవసాయ యుగంలో సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తమ ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దరు ధరలు అందించాలన్నారు. కార్యక్రమంలో బీకేఎస్ జిల్లా కోశాధ్యక్షుడు న్యాయవాది వి.జయప్ప, భారతీయ కిసాన్ సంఘానికి చెందిన ఎన్.తమ్మణ్ణ, దిన్నహళ్లి గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడు ఎం.శ్రీరామప్ప, కార్యదర్శి వి.భార్గవరాం, సభ్యుడు కె.విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ ఫైలింగ్.. రేషన్ కటింగ్
శివాజీనగర: లేదు.. లేదంటూనే రాష్ట్రంలో బీపీఎల్ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అనర్హులనే పేరుతో అన్నభాగ్య కార్డుల తొలగింపు చేపట్టింది. రేషన్ స్టోర్లలో తొలగించిన కార్డుల జాబితాను ప్రదర్శిస్తోంది. మీ కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలకు పైబడింది. అందుచేత మీ రేషన్ను రద్దు చేయబోతున్నాం, ఈ నెల చివరిసారిగా రేషన్ ఇస్తాం, వచ్చే నెల నుంచి బంద్ అని అందులో పేర్కొన్నారు. ఆ ఒక్క కారణంతో రైతులు సేద్యం కోసం రూ. లక్ష, అంతకు మించి అప్పులు తీసుకోవాలంటే ఐటీ ఫైలింగ్ ను చేయాలి, అదే ఎంతోమంది కార్డుల రద్దుకు కారణమైంది, మీరు ఐటీ పన్ను చెల్లింపుదారులు కాబట్టి కార్డును తీసేస్తున్నాం అని అధికారులు చెప్పేస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలవారు పిల్లల చదువులకు, బైక్లు కొనడానికి, ఇతరత్రా అవసరాలకు రుణం పొందినా అది కార్డుకు సమస్య అవుతోంది. ఐటీ ఫైలింగ్కు బ్యాంకుల ఒత్తిళ్లు రుణం ఇవ్వాలంటే బ్యాంకుల సిబ్బంది ఐటీ ఫైలింగ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని పలువురు బాధితులు వాపోయారు. ఐటీ ఫైలింగ్ చేస్తున్న కార్డుదారుల ఆధార్, పాన్ కార్డు వివరాలను పౌరసరఫరా శాఖ సేకరించి వేటు వేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలో పలువురి రేషన్ కార్డుల రద్దయినట్లు అధికార వర్గాల సమాచారం. కార్డు కలిగిన కుటుంబంలో ఎవరైనా ఒక్కరు ఐటీ ఫైలింగ్ చేసినా, ఆదాయపు పన్ను కట్టినా కార్డు కట్ అవుతోంది. ఆ కుటుంబాన్ని స్థితిమంతులుగా సర్కారు పరిగణిస్తోంది. ఆ కారణంతో రేషన్ కార్డులను తొలగిస్తోన్న సర్కారు స్టోర్ల ముందు జాబితాలు -
వెట్టి చాకిరీ
మంగళవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్ శ్రీ 2025చిట్టి చేతులు.. సాక్షి, బెంగళూరు: గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వెళ్తుంటే చిన్నారి బాలలు కష్టించి పనిచేస్తూ కనిపిస్తారు. అంగళ్లు, మెకానిక్ షెడ్లు, హోటళ్లు, కర్మాగారాలు, కట్టడ పనుల్లో నలిగిపోతుంటారు. కన్నడనాట బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలని ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా, కోట్లు ఖర్చు పెడుతున్నా మార్పు రావడం లేదు. కుటుంబ పేదరికం, నిరక్షరాస్యత, బాలల అక్రమ రవాణా తదితర ఎన్నో కారణాల వల్ల పిల్లలు కార్మికులుగా మగ్గిపోతున్నారు. వారికి విద్య, ఆహారం, ఆరోగ్యం వంటి ప్రాథమిక హక్కులు దక్కడం లేదు. ఎవరూ కూడా 14 ఏళ్లలోపు బాలలను పనిలో పెట్టుకోరాదు, అతిక్రమించిన వారు శిక్షార్హులవుతారు. కానీ ఎవరూ పాటించడం లేదు. తక్కువ కూలీకే వస్తారని పిల్లలతో పనిచేయిస్తున్నారు. అప్పుడప్పుడూ దాడులు బాల, కిశోర వర్గ కార్మికుల నిషేధ, నియంత్రణ చట్టం–1986 సెక్షన్ 16,17 కింద ప్రభుత్వం 11 శాఖల అధికారులను పర్యవేక్షణాధికారులుగా నియమించింది. వీరి ద్వారా తరచూ తనిఖీలు చేపడుతూ బాల కార్మికులను గుర్తించి వారిని రక్షిస్తూ వస్తోంది. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో 1,599 కేసులు నమోదు అయ్యాయి. 2,834 మంది బాల కార్మికులను రక్షించారు. అయితే సరైన పునరావాస చర్యలు లేక ఆ బాలలు మళ్లీ పనులకు వెళ్తున్నట్లు సేవాసంస్థల కార్యకర్తలు చెబుతున్నారు. ఏటా రూ.6 కోట్ల వ్యయం బాల కార్మిక పద్ధతి నిర్మూలన కోసం కార్మిక శాఖ అవగాహన జాతాలను నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రతి ఏటా సుమారు రూ. 2 కోట్ల నుంచి రూ 6 కోట్ల వరకు ఖర్చు కూడా చేస్తున్నారు. 2020 నుంచి ఈ ఏడాది వరకు రూ 23.46 కోట్లు ఇందుకు వెచ్చించారు. కానీ ఫలితాలు కనిపించడం లేదు. పైగా ప్రతి ఏటా వారి సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. కోవిడ్ కొరడా కోవిడ్ విపత్తు అనేక కుటుంబాలను పేదరికంలోకి నెట్టేసింది. ఆ తరువాత బాల కార్మికుల సంఖ్య మరింతగా అధికమైంది. 2023 నుంచి 2025, జూన్ వరకు అధికారులు దాడులు జరిపి 651 బాల కార్మిక కేసులను నమోదు చేశారు. బాలలను పనిలో పెట్టుకున్నందుకు 50 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. సుమారు రూ. 31.91 లక్షల మేర జరిమానాలు వసూలు చేశారు. 2023 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 123 కేసులు ఒక్క బెంగళూరులోనే వచ్చాయి. ఈ మూడేళ్లలో 88 పిల్లలను అధికారులు రక్షించారు. మొత్తం 57 కేసులు కోర్టులో విచారణకు రాగా, ఇందులో 8 కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడ్డాయి. అనేక కేసుల్లో బాధితులు తెరవెనుక రాజీ పడుతుంటారు. చదువు లేదు. ఆటపాటలు లేవు. సరైన పోషకాహారం అందదు. లేత చేతులు రాళ్లు కొడుతూ, గిన్నెలు, కప్పులు కడుగుతున్నాయి, బరువులు మోస్తున్నాయి. ప్రమాదకర పరిస్థితుల్లో సమిధలవుతున్నారు. పాఠాలు నేర్చుకోవాల్సిన బాల్యం బీడీలు చుడుతోంది. పేదరికం, ప్రభుత్వ నిర్లక్ష్యం ఇందుకు కారణమని చెప్పక తప్పదు. సమాజాన్ని పీడిస్తున్న బాల కార్మిక దురాచారం చదువు సంధ్యలకు బాల్యం దూరం ఫలించని జాగృతి కార్యక్రమాలు ఐదేళ్లలో 1,599 కేసుల నమోదు -
చెట్టు.. తీసింది ఊపిరి
దొడ్డబళ్లాపురం: బెంగళూరు నగరానికి చెట్లు ఎంత అందాన్ని ఇస్తాయో అంతే ముప్పుగా కూడా మారాయి. ఎప్పుడు ఏది విరిగిపడి ప్రాణం తీస్తుందో తెలియడం లేదు. చెట్టు పడి యువతి దుర్మరణం చెందగా, మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన సిటీలో సోలదేనహళ్లిలో జరిగింది. హెబ్బాళకు చెందిన కీర్తన (24) మృతురాలు కాగా, మరో బైకిస్టు భాస్కర్, రాధ క్షతగాత్రులు. గతంలో ఫిర్యాదు ఈ ఘటనతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోలదేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను కొట్టివేయాలని ఎన్నిసార్లు పాలికె సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. పడిపోయిన చెట్టు ఏడాది నుంచి ప్రమాదకరంగా ఉందని చెప్పారు. కూలిపడి యువతి మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు బెంగళూరులో విషాద ఘటన -
దెయ్యాలు బాబోయ్
మండ్య: సోషల్ మీడియాలో వైరల్ కావాలని చిత్ర విచిత్రమైన వీడియోలను తయారు చేస్తూ ఉంటారు కొందరు. అదే కోవలో దెయ్యాలు తిరుగుతున్నాయని, కనిపించినవారిపై దాడులు చేస్తున్నాయని వీడియోలు తీసిన ఓ ఘనుని ఉదంతమిది. మండ్య జిల్లాలోని నాగమంగలలో వెలుగుచూసింది. వివరాలు.. పట్టణవాసి గోపి యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు. దేవలాపుర హ్యాండ్పోస్ట్ వద్ద దెయ్యాలు తిరుగుతున్నాయని, అవి ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నాయని ఓ వీడియోను సృష్టించి పోస్ట్ చేశాడు. అందులో ఓ మహిళ దయ్యం మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ వీడియో చూసిన ప్రజలు నిమేననుకుని హడలిపోయారు. ఈ విషయం పోలీసులకు తెలిసి గోపిని పిలిపించారు. ఎలాంటి దయ్యాలు లేవని, వ్యూస్ కోసం నకిలీ వీడియోను రూపొందించానని గోపి చెప్పాడు. ఆ వీడియోను తొలగించాడు. ఎలాంటి దయ్యాలు లేవు, ప్రజలు భయపడకండి అని పోలీసులు ఫ్యాక్ట్ చెక్ అని ఓ పోస్టింగ్ను ఉంచారు. ఓ యూట్యూబర్ నకిలీ వీడియోలు దండించిన మండ్య పోలీసులు -
భర్త వేధింపులకు భార్య బలి
దొడ్డబళ్లాపురం: ఆడపిల్ల పుట్టిందని భర్త వేధిస్తుండడంతో కలత చెందిన భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు లగ్గెరె లోని మునేశ్వర బ్లాక్లో జరిగింది. రక్షిత (26) మృతురాలు. ఈమెకు 4 ఏళ్ల క్రితం కుణిగల్కు చెందిన రవీశ్తో పెళ్లయింది. లగ్గెరెలో నివసిస్తున్నారు. వీరికి ఒక ఆడపిల్ల ఉంది. ఆడపిల్ల పుట్టింది, మగపిల్లాడు లేడంటూ రవీశ్ నిత్యం భార్యను నరక యాతనకు గురిచేసేవాడు. దీంతో ఆవేదన చెందిన రక్షిత ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తెను రవీశ్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని రక్షిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారిని చిదిమిన కారు శివాజీనగర: రివర్స్ తీసుకునేటపుడు కారు మీద నుంచి వెళ్లడంతో 11 నెలల బాలుడు బలైన ఘటన బెంగళూరు కామాక్షిపాళ్య ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి కెంపేగౌడ నగరలో సోమవారం ఉదయం జరిగింది. వివరాలు.. స్వామి అనే వ్యక్తికి అక్కడ నాలుగు ఇళ్లు ఉండగా బాడుగకు ఇచ్చాడు. వీటిలో ఒక ఇంట్లో ఉండే బంధువులను చూడాలని కుణిగల్ నుంచి వారం క్రితం ఓ కుటుంబం వచ్చింది. వారి పిల్లాడు అజాన్ (11 నెలలు) ఇంటి బయట ఆడుకుంటూ ఉన్నాడు. చిన్నారిని చూడకుండా యజమాని స్వామి కారును రివర్స్ తీసుకొన్నారు. కారు బాలుని మీద నుంచి వెళ్లిపోయింది. చిన్నారి ఆర్తనాదాలు విని తల్లిదండ్రులు పరుగున వచ్చి దగ్గరిలోని ఆసుపత్రికి తీసుకొళ్లారు, తీవ్ర గాయాలైనందున బాలుడు కొంతసేపటికే మరణించాడు. స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. కులగణన ఉద్యోగిపై దాడి మండ్య: మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలో కులగణన సమీక్ష కోసం ఇంటింటికీ తిరుగుతున్న ఉద్యోగి మీద ఓ వ్యక్తి దాడి చేసి దాఖలాలను చించిపడేశాడు. గంజాం ప్రాంతంలో అబ్దుల్ గఫార్ అనే వ్యక్తి కులగణన కోసం వచ్చిన ఉద్యోగి జనార్ధన్ పైన దాడి చేశాడు. రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలను ఇవ్వాలని గఫార్ను ఆయన అడిగాడు, దానికి అతడు నిరాకరించడంతో పాటు వాదనకు దిగి ఇష్టానుసారం దూషించి కొట్టాడు. దాఖలాలను లాక్కుని చించి పడేశాడు. దీంతో జనార్ధన్ కన్నీరుమున్నీరయ్యాడు. వృద్ధుడు డిజిటల్ అరెస్టు, రూ. 21 లక్షలు దోపిడీ మైసూరు: ఈడీ అధికారులమంటూ వృద్ధున్ని బెదిరించి రూ.21.5 లక్షలను ఆన్లైన్లో దోచుకున్నారు. మైసూరులో ఈ ఘరానా మోసం జరిగింది. వివరాలు.. మేటెగళ్ళికి చెందిన వృద్ధుడు (77)కి దుండగులు వాట్సాప్లో వీడియో కాల్ చేశారు. తాము ఈడీ అధికారులమని, నీ వద్ద అక్రమ నగదు ఉందని సమాచారం వచ్చిందని బెదిరించారు. నిన్ను బంధించి తనిఖీ చేయాలని కేసు నమోదైందని, ఇందుకు సహకరించాలన్నారు. నీ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును వెంటనే తాము చెప్పిన బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని, నీవు ఏ తప్పు చేయకుంటే నగదు వెంటనే వెనక్కి పంపిస్తామని అన్నారు. భయభ్రాంతులకు గురైన వృద్ధుడు తన ఖాతాల్లో ఉన్న రూ.21.5 లక్షలను వారికి బదిలీ చేశాడు. తరువాత దుండగుల ఫోన్ స్విచాఫ్ కావడంతో మోసపోయానని తెలిసి సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. చిరుత పట్టివేత మైసూరు: చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకాలోని కరకలమాదళ్ళి గ్రామంలో కొన్నిరోజులుగా ఓ చిరుత చొరబడుతోంది. మేకలు, గొర్రెలను చంపి ఎత్తుకెళ్తోంది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు బోనులు ఏర్పాటు చేయగా, ఆదివారం రాత్రి చిరుత బోనులోకి చిక్కింది. -
చాముండి గిరులపై రథ సంభ్రమం
మైసూరు: మైసూరు విజయదశమి పండుగ ముగిసిన తరువాత చాముండి కొండపై సంప్రదాయంగా జరిగే అమ్మవారి రథోత్సవం సోమవారం వైభవోపేతంగా జరిగింది. రాజ ప్రముఖులు, వేలాదిమంది భక్తుల మధ్య తేరు ఉత్సవం కమనీయంగా సాగింది. జిల్లా నుంచే కాకుండా బెంగళూరు, కేరళ, తమిళనాడు నుంచి భక్తజనం రావడంతో చాముండిగిరులు కిటకిటలాడాయి. రాజవంశీకుల హాజరు వివిధ రకాల ఆభరణాలతో పాటు వైవిధ్య పుష్పాలతో చాముండేశ్వరి దేవిని, ఉత్సవ విగ్రహాన్ని అర్చకులు ముస్తాబు చేశారు. ఉదయం 9:32 నుంచి 9:52 గంటల మధ్య శుభ ముహూర్తంలో ఉత్సవమూర్తిని తేరులో ప్రతిష్టించి జై చాముండేశ్వరి అని నినదిస్తూ తేరును లాగారు. మైసూరు ఎంపీ, రాజవంశీకుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్, త్రిషిక కుమారి దంపతులు, రాజమాత ప్రమోదాదేవి తదితరులు పాల్గొన్నారు. పోలీసులు సంప్రదాయ ప్రకారం 21 సార్లు గాలిలోకి తుపాకులను పేల్చి అమ్మవారికి గౌరవ వందనం చేశారు. భక్తులు రథంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని తన్మయులయ్యారు. చాముండి బెట్ట మీద తేరు ఉత్సవం వైభవోపేతంగా అమ్మవారి వేడుక -
సెంట్రల్ జైల్లో రౌడీ బర్త్డే.. వీడియో వైరల్
సెంట్రల్ జైలు అంటే ఎంత సెక్యురిటీ ఉంటుందో అందరికీ తెలిసింది. కారాగారంలో ఉన్నవారిని కలవాలంటే చాలా తతంగం ఉంటుంది. ఏదైనా తీసుకెళ్లాలన్న కూడా చాలా రూల్స్ ఉంటాయి. అలాంటిది సెంట్రల్ జైలులో ఏకంగా ఓ రౌడీ తన అనుచరులతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో జైలు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇదంతా ఎలా జరిగిందో విచారణ చేపడతామని చెబుతున్నారు.బెంగళూరు పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఈ ఘటన వెలుగు చూసింది. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న రౌడీ షీటర్ శ్రీనివాస అలియాస్ గుబ్బచ్చి సీనా (Gubbachhi Seena) కేక్ను కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నాడు. అతడు కేక్ కట్ చేస్తుండగా చుట్టూ ఉన్నవారు చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ కనిపించారు. ఆపిల్ పండ్లతో తయారు చేసిన దండను అతడి మెడలో వేశారు. ఈ వీడియోను ఒక ఖైదీ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 50 సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది.వీడియో ఎలా తీశారు?జైలులో రౌడీషీటర్ బర్త్ డే చేసుకోవడమే కాకుండా, దాన్ని సెల్ఫోన్లో వీడియో కూడా తీయడంపై విమర్శలు వస్తున్నాయి. జైలు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాదు కారాగారం లోపలవున్న తమ వారి భద్రతపై ఖైదీల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జైలు నిబంధనల ప్రకారం మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు. ఖైదీ వీడియోను ఎలా రికార్డ్ చేయగలడనే దానిపై కూడా వారు కూపీ లాగుతున్నారు.ఎవరీ సీనా?రౌడీ షీటర్ శ్రీనివాస తన ప్రత్యర్థి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోని దొడ్డ బొమ్మసంద్రలో తన ప్రత్యర్థి వెంకటేష్ను హత్య చేసినట్లు సీనాపై ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరిలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో దొరక్కుండా తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరపడంతో అతడి కాలికి గాయమైంది.Criminals in Comfort Video Shows Rowdy-Sheeter Enjoying Royal Treatment in Karnataka’s Parappana Agrahara JailParappana Agrahara Central Jail is once again under the spotlight, this time for a shocking display of privilege to a rowdy sheeter. Notorious Srinivas, alias Gubbachi… pic.twitter.com/bpdzxGLH19— Karnataka Portfolio (@karnatakaportf) October 5, 2025భాస్కరరావు ఫైర్ఈ వ్యహహారంపై బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, బీజేపీ నేత భాస్కరరావు ఎక్స్లో స్పందించారు. 'కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పరప్పణ అగ్రహార జైలు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. జైలులోకి ఒక భారీ కేక్ ప్రవేశించింది. జైలులో ఉన్న మినీ రౌడీలతో కలిసి ఒక రౌడీ తన పుట్టినరోజును జరుపుకున్నాడు. అంతేకాదు దీన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. కర్ణాటకలో పాలన కుప్పకూలిపోయింది. సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్లు ఇప్పుడు అవినీతి గురించి బహిరంగంగా ఏడుస్తున్నారు. ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ యువత వీధుల్లోకి వచ్చారు. బెంగళూరు పరిపాలన గుంతలు, చెత్తతో చెత్తగా ఉంది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైలులో ఉన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయ'ని ఎక్స్లో పోస్ట్ చేశారు. Parrapana Agrahara Jail is in news again !!!!! A massive cake enters the jail and a rowdy with all his incarcerated mini Rowdies celebrate his birthday with total impunity and the same is recorded and uploaded on Social Media…..!!!!!!🤣🤣🤣🤣@DrParameshwara has now abdicated &… pic.twitter.com/DsQxPi4kVj— Bhaskar Rao (@Nimmabhaskar22) October 5, 2025గతంలోనూ.. పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో గతంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. 2020, డిసెంబర్లో రిజ్వాన్ అలియాస్ రౌడీ కుల్లా తన మద్దతుదారులతో కలిసి తన పుట్టినరోజును జరుపుకోవడమే కాక, దాన్నంతా సెల్ఫోన్లో చిత్రీకరించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అటాచ్ చేసి మరీ సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. ఈ వ్యవహారం అప్పట్లో విస్తృత చర్చ జరిగింది. పోలీసులు ఎప్పటిలాగానే స్పందించారు. దర్యాప్తు చేస్తామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. పోలీసుల మెతక వైఖరి కారణంగానే ఇలాంటి ఘటనలు పునరావృతంఅవుతున్నాయని కర్ణాటక ప్రజలు అనుకుంటున్నారు. చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులు -
అస్తవ్యస్తంగా బళ్లారి నగరాభివృద్ధి
సాక్షి బళ్లారి: పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. బళ్లారి మహానగర పాలికె అని గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ నగరాభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది. మున్సిపాల్టీ స్థాయి నుంచి మహానగర పాలికెగా అప్గ్రేడ్ అయి 15 సంవత్సరాలు గడిచింది. పాలికెకు ఉండాల్సిన ఉన్నతాధికారులు కానీ ఆయా శాఖల ఇంజినీర్లు కానీ, చివరకు నగరంలో స్వచ్ఛత చేయాల్సిన పారిశుధ్య కార్మికులను తగినంత మందిని ప్రభుత్వం నియమించ లేదు. నగరాభివృద్ధి నత్తనడకన సాగుతోంది. ఓ వైపు నగరంలో రోజురోజుకు జనాభా కూడా పెరుగుతోంది. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఇతర వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. పారిశ్రామిక, స్టీల్ జిల్లా కేంద్రంగా పేరొందిన బళ్లారి నగరంలో 39 వార్డులకు గాను నగరాభివృద్ధి చేయడానికి మూడు డివిజన్లను ఏర్పాటు చేశారు. రాయల్ సర్కిల్, గాంధీనగర్, సుధా క్రాస్, కౌల్బజార్ మొదటి గేటు వద్ద మూడు డివిజన్లకు సంబంధించిన కార్యాలయాలతో పాటు మహానగర పాలికె ప్రధాన కార్యాలయం కూడా ఉంది. ఖాళీగా 26 ఇంజినీర్ల ఉద్యోగాలు నగరాభివృద్ధిలో రోడ్లు, డ్రైనేజీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ముఖ్యంగా ఇంజినీర్ల అవసరం ఉంటుంది. నగరంలో జనాభా, విస్తీర్ణంతో పోల్చితే పాలికె కనీసం 55 మంది ఇంజినీర్లను నియమించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు 19 మంది ఇంజినీర్లు మాత్రమే ఆయా డివిజన్లలో పని చేస్తున్నారు. మిలిగిన 26 మందికి పైగా ఇంజినీర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఓ వైపు మహానగర పాలికె నుంచి ఎమ్మెల్యే నిధులు, పీడబ్ల్యూడీ శాఖల నుంచి రూ.200 కోట్లకు పైగా అభివృద్ధి పనుల పేరుతో ప్రధాన రహదారులతో పాటు ఆయా వార్డుల్లో రోడ్ల విస్తీర్ణం, డ్రైనేజీ పనులు ప్రారంభించారు. అయితే పనులు నత్తనడకన సాగుతుండటంతో ఆయా రహదారుల్లో వెళ్లేందుకు జనం నరకయాతన అనుభవిస్తున్నారు. ఒక్కొక్క రోడ్డు పని నెలలు తరబడి పూర్తి చేయకపోవడంతో జనం గమ్యస్థానాలను చేరేందుకు కిలోమీటర్ల కొద్ది తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మౌలిక సౌకర్యాల కల్పనలో విఫలం నగరంలో రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో పాలికె ఆదాయం పెరుగుతోంది. అయితే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలువినిపిస్తున్నాయి. మూడు డివిజన్లలో సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులే అంగీకరిస్తున్నారు. ఏళ్ల తరబడి సిబ్బంది కొరత ఉందంటున్నారే కానీ ..ఆ సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవడంలో పాలకులు శ్రద్ధ వహించడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ సిటీ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన తర్వాత తగినంత సిబ్బందిని ఆయా శాఖలకు సంబంధించి అధికారులను నియమించకపోవడంతో నగరాభివృద్ధికి తీవ్ర విఘాతం ఏర్పడుతోందని అభిప్రాయం వెల్లడిస్తున్నారు. నగరంలో దాదాపు 170 మందికి పైగా విద్యుత్, రెవెన్యూ, ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీలు ఉండటంతో ఉన్న సిబ్బందికి పని భారమవుతోందని పలువురు అధికారులు వాపోతున్నారు. ఓ వైపు సిబ్బంది కొరత మరో వైపు ఇంజినీర్ల లేమి ఉన్న సిబ్బందికి పనిభారం పాలికెగా అప్గ్రేడైనా భర్తీ కాని పోస్టులు పట్టించుకోని ప్రజాప్రతినిధులు చెత్త సేకరణకూ ఇబ్బందులే అభివృద్ధి మాట అటు ఉంచితే నగర స్వచ్ఛతను కాపాడే పారిశుధ్య కార్మికులు, ఇంటింటా చెత్తను సేకరించే సిబ్బంది తగినంత మంది లేరు. దీందో నగరంలో చెత్త సేకరణ, పారిశుద్ధ్య సమస్య కూడా రోజు రోజుకు జటిలమవుతోంది. పారిశుధ్య కార్మికులు తగినంత మంది లేకపోవడంతో ఉన్న సిబ్బంది నగర స్వచ్ఛత చేయడానికి అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో ఆయా వార్డుల్లో డ్రైనేజీ పరిస్థితి అస్తవ్యస్తంగా కనిపిస్తోంది. రోడ్లలో చెత్త చెదారం ఎక్కడపడితే అక్కడ వేస్తున్న దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి. ఇది స్టీల్ సిటీనా, మహానగర పాలికేనా లేక మున్సిపాల్టీనా, పురసభ అనే అనుమానం కలుగుతోందని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నగరంలో మహానగర పాలికె పరిధిలోని సిబ్బంది కొరతను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ప్రమాదంలో అక్కాతమ్ముడు దుర్మరణం
రాయచూరు రూరల్: రహదారి ప్రమాదంలో అక్కా తమ్ముడు దుర్మరణం పాలైన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం మాన్వి తాలుకా పోత్నాళ్ వద్ద కారు–ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. రోడ్డు ప్రమాదంలో కరేగుడ్డకు చెందిన మరియమ్మ (28), శేఖరప్ప (25) మృతి చెందినట్లు మాన్వి పోలీసులు గుర్తించారు. వల్కం దిన్ని నుంచి కరేగుడ్డకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా.. దేశాయి క్యాంప్కు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మరియమ్మ, శేఖరప్ప అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిందనూరు డీఎస్పీ తెలిపారు. ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో చోరీ హొసపేటె: విజయనగర జిల్లా కొట్టురు పట్టణంలోని ఒకే రాత్రి నాలుగు ఇళ్ల తాళాలు పగులగొట్టిన దొంగలు.. రూ.97 వేల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ముదుకనకట్టె ప్రాంతంలోని నాలుగు ఇళ్లకు తాళం వేసి ఉండటంతో దొంగలు వాటిని పగులగొట్టి దోచుకునేందుకు ప్రయత్నించారు. అయితే వీటిలో మూడు ఇళ్లు ఖాళీగా ఉండటంతో ఏమీ కనిపించలేదు. అయితే వారు జి.విరుపాక్షప్ప ఇంట్లో బంగారం నెక్లెస్, చెవిపోగులు, ఉంగరం, 2 వెండి ప్లేట్లు, 2 వెండి గ్లాసులను దొంగలించారు. సమాచారం అందుకున్న డీవైఎస్పీ మల్లేష్ దొడ్డమణి, దురుగప్ప, పీఎస్ఐ గీతాంజలి షిండే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులు వచ్చారు. రద్దీగా ఉండే సందులో దొంగతనం జరగడం ఆశ్చర్యకరం. ఈ కేసులో దొంగలను గుర్తించడానికి పట్టణంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే, ప్రజలు పోలీస్ స్టేషన్, 112 లేదా పోలీస్ హెల్ప్లైన్ 18005700కు కాల్ చేసి సమాచారం అందించాలని డీవైఎస్పీ మల్లేష్ దొడ్డమణి కోరారు. ఆకట్టుకున్న పథ సంచలనంహుబ్లీ: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు అలాగే విజయదశమి సందర్భంగా నగరంలో కరసేవకులు కదం తొక్కారు. నెహ్రూ మైదానంలో నిర్వహించిన పథ సంచలనం అందరినీ ఆకట్టుకుంది. తొలుత ఒకటవ పథ సంచలనం కృష్ణభవన, సర్ సిద్దప్ప కంబలి మార్గం, సంగొళ్లి రాయన్న సర్కిల్, తొలిజా భవన్ సర్కిల్, శంకరమఠం, హిరేపేట, బెళగవి గల్లి, అలాగే 2వ మార్గం నెహ్రు మైదానం నుంచి ప్రారంభమైంది. జేసీ నగర్, శక్తి రోడ్డు, స్టేషన్ రోడ్డు, గణేష్ పేట సర్కిల్, సీబీటీ, మకాన్దారి గల్లి, మంగళవార పేట, రాధకృష్ణగల్లి మీదుగా కొనసాగింది. అనంతరం ఈ రెండు పథ సంచలన దుర్గదబైలు సర్కిల్లో కలిశాయి. బ్రాడ్వే, శివాజీ సర్కిల్, కొప్పికర్ రోడ్డు, కృష్ణ భవన మార్గం మీదుగా తిరిగి నెహ్రూ మైదానం చేరుకున్నాయి. అనంతరం జరిగిన వేదిక కార్యక్రమంలో దేశ భక్తి పరిడవిల్లెలా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు తన ప్రసంగంలో మాట్లాడారు. పథ సంచలనం జరిగిన చోట్ల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు హుబ్లీ: రెండు ఏళ్లలో నవళగుంద అసెంబ్లీ నియోజక వర్గానికి కురుబ సమాజం కనక భవనం అలాగే ఇతర అభివృద్ధి నిర్మాణ పనులకు సుమారు రూ.4 కోట్ల నిధులు విడుదల చేశానని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్హెచ్ కోనరెడ్డి తెలిపారు. ఆదివారం అణ్ణిగేరిలోని ఉడేదబైల వీధిలోని బీమలింగేశ్వర, నందీశ్వర భజన సంఘం ఆధ్వరంలోని లక్ష్మీదేవి విగ్రహం, నందీశ్వర అలాగే పొట్టేళ్ల మూర్తుల ప్రతిష్టాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అణ్ణిగేరి దాసోహమఠం డాక్టర్.శివకుమార్ స్వామి, ప్రమఖులు శివానంద, యల్లప్ప, షణ్ముఖ, విరుపాక్షప్పతో పాటు గ్యారెంటీ తాలూకా సమితి అధ్యక్షుడు మంజునాథ తదితరులు పాల్గొన్నారు. చెరుకు పంట దగ్ధం హొసపేటె: కంప్లి తాలూకా సమీపంలోని బుక్కసాగర్ శివారులో విద్యుత్ షాక్తో చెరుకు పంట పూర్తిగా కాలిపోయింది. కిన్నూరేశ్వర ఆలయం సమీపంలోని సర్వే నంబర్ 118, 119లో సుమారు 4 ఎకరాల 110 సెంట్ల భూమిలో చెరుకు సాగు చేశారు. పంట కోతకు రాబోతున్న తరుణంలో పొలంలో ఉన్న విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ ఘటనలో చెరుకు తోట పూర్తిగా కాలిపోయింది. ఎకరా చెరుకు సాగుకు రైతులు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. నష్టానికి పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ శాఖ ఆర్ఐ మహమ్మద్ షరీఫ్, వీఏ మౌనేషా, జేఈసీఓఎం జేఈ కృష్ణమూర్తి సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. చెరకు పంట నష్టంపై నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సమాజ అసమానతలు పోవాలి కోలారు: అంతర్జాతి (కులాంతర) వివాహాలతోనే సమాజంలో అంటరానితనం నివారణ అవుతుందని జిల్లా కలెక్టర్ ఎంఆర్ రవి తెలిపారు. సమాజంలో అసమానతలు కూడా తొలగిపోతాయన్నారు. ఆదివారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో సహభోజనం నిర్వహించగా ఆయన పాల్గొన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం గాంధీజీని స్మరించుకుంటే సరిపోదు, ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు.ప్రయత్నంతో మాత్ర మే మార్పులు సాధ్యమవుతాయన్నారు. అన్ని సంఘ సంస్థలు ఈ ప్రయత్నానికి చేతులు కలపాలన్నారు. జిల్లా ఎస్పీ బి.నిఖిల్ మాట్లాడుతూ సమాజ ఉద్ధారణ కార్యక్రమాలను సమాజంలోని ప్రతి గ్రామాలకు మూలలకు తీసుకుని వెళ్లాలన్నారు. అన్నదాన దాత చంద్రశేఖర్ను సన్మానించారు. కులాలను పాటించం అంటూ అందరూ ప్రతిజ్ఞ చేశారు. కసాప అధ్యక్షుడు గోపాలగౌడ, టి విజయకుమార్, పండిత్ మునివెంకటప్ప, ఏడీ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దు
హొసపేటె: జిల్లా పరిపాలన, జిల్లా పంచాయతీ, సాంఘిక సంక్షేమ శాఖ సహకారంతో ఈనెల 7న జరగనున్న వాల్మీకి జయంతిని బహిష్కరించాలని వాల్మీకి నాయక సమాజం నిర్ణయించిందని సంఘం అధ్యక్షుడు గోసాల భరమప్ప, ప్రధాన కార్యదర్శి దేవరమనే శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం నగరంలోని ప్రెస్క్లబ్లో వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ప్రభుత్వం కురుబ సమాజకులను ఎట్టి పరిస్థితుల్లో ఎస్టీలో చేర్చరాదని డిమాండ్ చేశారు. ఇందుకోసం నాయక సమాజం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన గడువు నేటితో ముగియబోతోందని తెలిపారు. అయితే ఈ అంశంపై ఏ పార్టీ నాయకుడూ తన స్వరం వినిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో సమాజ స్వామిజీ సహా వాల్మీకి జయంతిలో మాత్రమే కాకుండా ఏదైన ప్రభుత్వ కార్యక్రమంలో కూడా పాల్గొకూడదని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు స్పందించక పోవడం సరికాదన్నారు. కురుబ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చితే సహించేది లేదని పేర్కొన్నారు. తమ నిరసనను కొనసాగిస్తామని,.. జయంతి తర్వాత పోరాటపై చర్చిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కిన్నాళ్ హనుమంత, బేల గోడ అంబన్న, గుడుగుడి సోమనాథ్, గుజ్జల చంద్రశేఖర్, దేవేంద్రప్ప, కరి హనుమంత, శ్రీకంఠ, వసంత్, బేలగోడ అంబన్న మల్లికార్జున పాల్గొన్నారు. -
విజయపురలో కదం తొక్కిన నిరుద్యోగులు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఆదివారం విజయపురలో ఏఐడీవైఓ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐడీవైఓ రాష్ట్ర కార్యదర్శి భవాని శంకర్ గౌడ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఏటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకుని కాలం గడపడాన్ని తప్పు బట్టారు. బాధిత కుటుంబానికి చెక్కు అందజేతరాయచూరు రూరల్: దద్దల్ తుంగభద్రలో ఇటీవల పిడుగుపాటుకు మృతి చెందిన దేవప్ప కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచిందని రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసనగౌడ తెలిపారు. ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం దేవప్ప కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. క్రేన్ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిహుబ్లీ: గుర్తు తెలియని వ్యక్తిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆదివారం ఇక్కడి పాత బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. కిత్తూరు చెన్నమ్మ సర్కిల్ నుంచి వస్తున్న క్రేన్ వాహనం సదరు వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండవచ్చు. ఈ మేరకు ఉత్తర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని బలిగొన్న ఈత సరదా రాయచూరు రూరల్: సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటి మునిగి మృతి చెందారు. ఈ ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. లింగసూగురు తాలుకా ముదుగల్కు చెందిన యలాలింగ (28), వెంకటేష్ (28) మస్కిలో సినిమా చూడటానికి వచ్చారు. సినిమా చూసిన అనంతరం వీరు మస్కి వద్ద ప్రవహిస్తున్న తుంగభద్ర ఎడమ కాలువలో ఈతకొట్టేందుకు దిగారు. అయితే వీరికి సరిగా ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ పేర్కొన్నారు. కసాప అధ్యక్షుడిగా విజయ రాజేంద్ర రాయచూరు రూరల్: రాయచూరు తాలుకా కన్నడ సాహిత్య పరిషత్ అద్యక్షుడిగా డా.బి.విజయ రాజేంద్రను నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసినట్లు కన్నడ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు రంగణ్ణ పాటిల్ పేర్కొన్నారు. ఆదివారం ఓ పక్రటన విడుదల చేశారు. కసాప గౌరవ కార్యదర్శిగా రావుత రావ్, కార్యదర్శిగా ప్రతిభ, కోశాధ్యక్షుడిగా సయ్యద్ హఫీజుల్లా ఖాద్రి, సంఘటన కార్యదర్శిగా శరణప్ప, రేఖా పాటిల్, సభ్యులుగా దేవేంద్రమ్మ, వైశాలి పాటిల్, అమరేష్, ఖాన్ సాబ్, అశోక్ కుమార జైన్, మంజునాథ్ పాటిల్, విజయ కుమారి, వెంకటేష్ను నియమించారు. రూ.1.50 కోట్లతో తాయమ్మ చెరువు అభివృద్ధిరాయచూరు రూరల్: నగరంలో తాయమ్మ చెరువు అభివృద్ధికి రూ.1.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ వెల్లడించారు. ఆదివారం గద్వాల రహదారిలోని తాయమ్మ చెరువు పునరుద్ధరణకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూగర్భ జలాల పెంపుదలలో భాగంగా జిల్లాలో చెరువుల సంరక్షణకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతోందన్నారు. తాగు, సాగు సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు కూరగాయలు పండించుకుని జీవనోపాధి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి, నగర సభ అధ్యక్షురాలు నరసమ్మ, రుద్రప్ప, శాంతప్ప, అమరే గౌడ, జయన్న, రాజు, సుభాష్, నరసింహలు, శాలం, అధికారులు పాల్గొన్నారు. -
కులగణనలో కుక్కల దాడి
● టీచరమ్మకు తీవ్ర గాయాలు యశవంతపుర: జనగణన చేస్తున్న ఉపాధ్యాయులపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో జరిగింది. జైభీమ్ నగరలో ఉపాధ్యాయురాలు చిక్కమ్మ కుల సమీక్షకు వెళ్లారు. వీధి కుక్కలు ఆమెను వెంబడించి కరిచాయి. ఆమెను రక్షించడానికి వెళ్లిన ఏడు మందిపైనా స్వైర విహారం చేశాయి. భయపడిన వారు అక్కడ నుంచి పరుగులు తీశారు. తీవ్ర గాయాల పాలైన చిక్కమ్మ పట్టణంలో జిహెచ్పిఎస్ పాఠశాలలో పని చేస్తున్నారు. ఈ ఘటనలో శివకుమార్, ధర్మ, పృ థ్వి, సచిన్తో పాటు 7 మంది కూడా కుక్కల వల్ల గాయపడ్డారు. అక్కడ ఆటలాడుతున్న కిషన్ అనే బాలున్ని కరిచాయి. జనగణన చేయడానికి చిక్కమ్మకు ఆదివారం చివరి రోజు. మూడు ఇళ్లు మిగిలి ఉండగా భర్తతో కలిసి వెళ్తుండగా వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. ఆమెకు ముఖం, తల మీద తీవ్రగాయాలు తగిలాయి. బాధితులందరూ బేలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే సురేశ్ పరామర్శించారు. రాష్ట్రంలో పలువురు ఉద్యోగులు కులగణనకు వెళ్తూ ప్రమాదాల బారిన పడ్డారు. మంత్రి స్పెషల్ ఆఫీసరు లంచాల మోజుదొడ్డబళ్లాపురం: ఇంధన మంత్రి పనులు చూసుకునే స్పెషల్ ఆఫీసర్ ఒకరు లంచం తీసుకుంటూ లోకాయుక్తకు పట్టుబడ్డ సంఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు... విద్యుత్శాఖ మంత్రి కేజే జార్జ్కు స్పెషల్ ఆఫీసర్గా కేపీటీసీఎల్ ఈఓ జ్యోతిప్రకాశ్ పనిచేస్తున్నారు. బ్యాడరహళ్లి నివాసి అనంతరాజు తాను నిర్మిస్తున్న లేఔట్కి విద్యుత్ కనెక్షన్ కోసం ఎన్ఓసీ కావాలని దరఖాస్తు చేశాడు. అయితే జ్యోతిప్రకాశ్ రూ.1లక్ష లంచం డిమాండు చేశాడు. దీంతో బాధితుడు లోకాయుక్తను ఆశ్రయించాడు. రూ.50 వేలు తీసుకుంటుండగా జ్యోతిప్రకాశ్, అతని కారు డ్రైవర్ నవీన్ను లోకాయుక్త పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. రియాల్టీ సంస్థకు ఈడీ షాక్● రూ. 423 కోట్ల ఆస్తుల సీజ్ బనశంకరి: రాజధానిలో రియాల్టీ సంస్థకు చెందిన రూ.423 కోట్ల విలువచేసే స్థిరాస్తులను ఈడీ జప్తుచేసింది. అక్రమ నగదు బదిలీ ఆరోపణలు రావడమే కారణమని ఈడీ తెలిపింది. ఫ్లాట్లు, ఇళ్లు ఇస్తామని జనం నుంచి రూ.927 కోట్లు వసూలు చేశారు. కానీ గడువులోగా కేటాయించలేదు. పైగా జనం నుంచి సేకరించిన డబ్బుతో కుటుంబసభ్యుల పేర్ల మీద ఆస్తులను కొనుగోలు చేశారు. ఫిర్యాదులు రావడంతో కస్టమర్ల హితాసక్తిని కాపాడేందుకు సదరు సంస్థ యజమాని వాసుదేవన్, భార్య, కుటుంబీకుల పేర్లతో ఉన్న ఇళ్లు, స్థలాలు, 4.5 ఎకరాల వాణిజ్య భూమి, మూడిగెరె కన్నెహళ్లి గ్రామంలో 179 ఎకరాల భూమి తదితరాలతో కలిపి రూ.423 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసినట్లు ఈడీ పేర్కొంది. -
రాచనగరిలో అదే సందడి
మైసూరు: రాచనగరిలో దసరా మహోత్సవాలు ముగిసినా కూడా పర్యాటకుల సంఖ్య పర్యాటకులు మాత్రం తగ్గడం లేదు. జంబూసవారీని వీక్షించాలని వచ్చిన టూరిస్టులు, ఇతర జిల్లాలవారు నగరంలోనే మకాం వేశారు. మైసూరుతో పాటు పరిసర ప్రాంతాలలోని చారిత్రక కట్టడాలను తిలకిస్తూ గడుపుతున్నారు. ఆహారమేళాతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిలిచిపోయాయి. కానీ హోటళ్లలో భోజనాలు ఆరగిస్తూ నగర పర్యటనలో నిమగ్నమయ్యారు. సాయంత్రం కాగానే నగర కూడళ్లలో విరాజిల్లుతున్న విద్యుత్ కాంతులను చూస్తూ ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు. దాంతో సాయంత్రం 6 గంటల నుంచి సిటీలో ఎక్కడ చూసినా జనం, కార్ల సందడి నెలకొంటోంది. ఈ నెల, 12వ తేదీ వరకు దీపాలంకరణ కొనసాగుతుంది. విదేశీ టూరిస్టులతో కొందరు సెల్ఫీలు తీసుకున్నారు. ఎటుచూసినా పర్యాటకులే -
మృత్యుశకటమైన ప్రైవేటు బస్సు
తుమకూరు: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, కారు ఢీకొన్న దుర్ఘటనలో కారులోని ముగ్గురు చనిపోగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తుమకూరు తాలూకాలోని బెళదర గేట్ వద్ద శనివారం రాత్రి జరిగింది. కొరటిగెరె తాలుకాలోని కత్తినాగేనహళ్ళివాసులు శివకుమార్ (28), గోవిందప్ప (60), శివశంకర్ (28) మృతులు. పాల్ (28), రెడ్డిహళ్ళి శంకర్ (28)కు గాయాలు తగిలాయి. వీరందరూ ధర్మస్థలానికి కారులో వెళుతుండగా తుమకూరు నుంచి పావగడకు వెళుతున్న ప్రైవేటు బస్సు ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వచ్చి వీరి కారు మీదకు దూసుకెళ్లింది. కారు తుక్కుతుక్కయింది. ఐదుమంది కారులో చిక్కుకుపోయారు. బస్సు డ్రైవర్ బస్సును వదిలి పరారయ్యాడు. స్థానికులు, తుమకూరు గ్రామీణ పోలీసులు కారును విడదీసి మృతులను, గాయపడినవారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కారును ఢీ, ముగ్గురు మృతి తుమకూరు జిల్లాలో ఘటన -
ప్రమాద వేళలో ప్యానిక్ బటన్ ఏదీ?
సాక్షి, బెంగళూరు: క్యాబ్లు, ట్యాక్సీల్లో వెళ్లే డ్రైవర్లు, ప్రయాణికులకు ఏమైనా సమస్య వస్తే తక్షణ సాయం కోసం జీపీఎస్, ప్యానిక్ బటన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి క్యాబ్లో ఉండేలా రవాణా శాఖ తప్పనిసరి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్భయ అత్యాచార ఘటన తరువాత అన్ని రాష్ట్రాల్లో ఎల్లో బోర్డు వాహనాలకు జీపీఎస్, ప్యానిక్ బటన్ను తప్పనిసరి చేసింది. దీనిమీద క్యాబ్ల డ్రైవర్లు, యజమానులు అసంతృప్తి వ్యక్త చేస్తున్నారు. 6 లక్షల వాహనాల్లో 1.5 లక్షలకే సిటీతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 6 లక్షలకు పైగా ఎల్లో బోర్డు వాహనాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు కేవలం 1.5 లక్షల వాహనాలకు మాత్రమే జీపీఎస్, ప్యానిక్ బటన్లు ఉన్నాయి. క్యాబ్లలో కానరాని జీపీఎస్, ప్యానిక్ మీట మహిళల భద్రతకు లేని భరోసా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు బేఖాతరు పాత వాహనాలకే సమస్య కొత్తగా కొనే వాహనాలకు షోరూంలవారే జీపీఎస్, ప్యానిక్ బటన్ను అమర్చి ఇస్తున్నారు. సమస్య అంతా పాత వాహనాలకే. వాటిని అమర్చాలంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ను చూపించాలి. ఈ నిర్ణయం మీద డ్రైవర్లు కోపంగా ఉన్నారు. ఎల్లో బోర్డు వాహనాలకు ఎఫ్సీ చేసేందుకు రూ.800 చెల్లించాల్సి వస్తుంది. అలాగే ప్యానిక్ బటన్, జీపీఎస్ అమర్చేందుకు మరో రూ. 13 వేల నుంచి రూ. 16 వేల వరకు ఖర్చు అవుతోంది. ప్రతి ఏటా రెన్యూవల్ కోసం రూ. 2,200 చెల్లించాలి. ఇంత భారాన్ని భరించలేమంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం డ్రైవర్లు పొరుగునే ఉన్న అనంతపురం, చిత్తూరు జిల్లాలకు వెళ్తున్నారు. అక్కడ చవగ్గా పనైపోతుందని చెబుతున్నారు. ఎలా పని చేస్తుందంటే ముఖ్యంగా మహిళలు, యువతులు ప్రయాణిస్తున్నప్పుడు భద్రతా సమస్య వస్తే ప్యానిక్ బటన్ను నొక్కితే సరి. ఆ సమాచారం ఆర్టీవో కంట్రోల్ రూమ్కు వెళుతోంది. కంట్రోల్ రూమ్ నుంచి సిబ్బంది వాహన యజమాని లేదా డ్రైవర్కు కాల్ చేస్తారు. సమస్య ఏమిటో కనుక్కుని అవసరమైతే పోలీసులకు, ఫైర్, ఆస్పత్రులకు కాల్ చేస్తారు. 800కు పైగా మొబైల్ కాల్స్ ప్రతినిత్యం కంట్రోల్రూమ్కు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సమస్య కంటే కూడా, ఆ బటన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలన్న కుతూహలమే ఉంటోందని తెలిసింది. ఇప్పటివరకు తీవ్ర సమస్య మీద కేవలం 22 కాల్స్ రాగా, వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు కంట్రోల్ రూమ్ అధికారి ఒకరు తెలిపారు. ఏమైనా గానీ ఆర్థిక భారం పేరుతో డ్రైవర్లు ప్యానిక్ బటన్కు మొగ్గు చూపడం లేదు. ఓ రాత్రి వేళ బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి ఓ మహిళ నగరంలోని ఇంటికి బయల్దేరారు. మధ్యలో డ్రైవరు వెకిలి చేష్టలు చేయడంతో ఆమె ట్యాక్సీలోని ప్యానిక్ బటన్ను నొక్కింది. కాసేపటికి పోలీసులు ఆ డ్రైవర్కు కాల్ చేశారు. ఇలా వాహనాలలో ప్యానిక్ బటన్ ఉంటే.. భయంతోనైనా డ్రైవర్లు, లేదా పోకిరీలు వేధింపులకు దూరంగా ఉంటారు. ఆ బటన్ లేకపోతే ఎవరైనా గానీ ఆకతాయిలు అల్లరి చేష్టలకు వెనుకాడడం లేదు. అబలల భద్రతకు ఎంతో ప్రధానమైన ప్యానిక్ బటన్ వ్యవస్థను బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. -
ప్లాస్టిక్ గోదాము మసి
దొడ్డబళ్లాపురం: గ్యాస్ సిలిండర్ పేలి ప్లాస్టిక్ గోడౌన్ కాలిబూడిదైన సంఘటన బెంగళూరులోని బేగూరులో జరిగింది. బేగూరు అక్షయ్నగర్లో ఉన్న ప్లాస్టిక్ గోడౌన్లో ఆదివారం ఉదయం హఠాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో క్షణాల్లో మంటలు గోడౌన్ మొత్తం వ్యాపించి లక్షల విలువ చేసే వస్తువులు మంటల్లో కాలిపోగా, ఆ సమయంలో జనం లేకపోవడంతో ప్రాణహాని తప్పింది. ఫైర్ సిబ్బంది చేరుకుని 2 గంటల పాటు శ్రమించి మంటలు అదుపు చేశారు. పొగ, మంటలను చూసి చుట్టుపక్కల ప్రాంతాల వారు భయాందోళనకు గురయ్యారు. దగ్గు సిరప్లపై నిఘా సాక్షి, బెంగళూరు: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓ నాసిరకం దగ్గుమందు వల్ల 11 మంది బాలలు మరణించిన ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సదరు కోల్డ్రిఫ్ అనే సిరప్ను నిషేధించింది. ఈ మందు రాష్ట్రంలో సరఫరాలో లేకున్నప్పటికీ ఎక్కడా అమ్మరాదని ఆదేశించింది. తల్లిదండ్రులు కోల్డ్రిఫ్ను కొనుగోలు చేయకూడదని ఆరోగ్య శాఖ సూచించింది. వైద్యులు సూచించిన సిరప్లనే ఉపయోగించాలని తెలిపింది. కోల్డ్రిఫ్ను ఎక్కడైనా అమ్ముతున్నట్లయితే వెంటనే బంద్ చేయాలన్నారు. సరఫరా జరుగుతుందా అనే విషయాన్ని కూడా పరిశీలించాలన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇతర కంపెనీలకు చెందిన దగ్గు మందులను ల్యాబోరేటరీలకు పరీక్షల నిమిత్తం తరలించారు. కన్నడనాట కల్లోలమే● బిహార్ ఎన్నికలు అయిపోనీ: విజయేంద్ర మైసూరు: బిహార్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తరువాత కర్ణాటక రాజకీయాల్లో అనేక మార్పులు రావడంతో పాటు కొన్ని పార్టీలలో అల్లకల్లోలం ఏర్పడుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర చెప్పారు. ఆదివారం మైసూరు నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నవంబర్లో పెను మార్పు వస్తుందంటున్నారు, కుర్చీని కాపాడుకునేందుకు సీఎం సిద్దరామయ్య అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. అందుకే సిద్దరామయ్య ఇటీవల మైసూరులో బల ప్రదర్శన చేశారని ఆయన హేళన చేశారు. ప్రజల మధ్య ర్యాంప్ వాక్ కూడా చేస్తున్నారని, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్ కంటే సిద్దరామయ్య హడావుడి ఎక్కువగా ఉందని అన్నారు. ఇదేమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్న నవంబరు క్రాంతికి అర్థం ఏమిటో సీఎం చెప్పాలన్నారు. అతి త్వరలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పకపోయినా, మార్పు సంకేతాలను ఇస్తున్నారని చెప్పారు. -
సంతోషం పంచి.. బాధగా వీడ్కోలు
● మైసూరు గజరాజులకు బైబై ● శాస్త్రోక్తంగా నిష్క్రమణం మైసూరు: ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా సంబరాలలో పాల్గొనడానికి అడవుల్లోని శిబిరాల నుంచి వచ్చిన గజరాజులు భారమైన హృదయాలతో మైసూరువాసులకు, పర్యాటకులకు వీడ్కోలు పలికాయి. ఇక వెళ్లొస్తాం.. అంటూ అడవులకు నిష్క్రమించాయి. దసరా ఉత్సవాలలో గజరాజుల సేవలను తలచుకుంటూ అందరూ ఆవేదన చెందారు, కొందరైతే కన్నీరు కార్చారు. పూజలు చేసి, పండ్లు తినిపించి జంబూసవారీ వేడుకల్లో ఏనుగులు విజయవంతంగా పాల్గొని ఉత్సవాలను సంపూర్ణం చేయడం తెలిసిందే. జంబూసవారీ కోసం గజరాజులకు చేసిన రంగురంగుల బొమ్మల అలంకారం ఇంకా తడి ఆరకముందే నగరాన్ని వీడాయి. ఆదివారం ఉదయమే కెప్టెన్ అభిమన్యు సహా 14 ఏనుగులకు స్నానాలు చేయించి అర్చకులు వివిధ రకాల పూజలు చేశారు. వాటికి పండ్లు, చెరుకులను తినిపించారు. ఏనుగులు తొండాలు ఎత్తి దండాలు పెట్టాయి. వీడ్కోలు వేడుకను చూడడానికి వేలాది మంది తరలివచ్చారు. అటవీ సిబ్బంది ఒక్కో ఏనుగును ఒక్కో లారీలోకి ఎక్కించారు. లారీలు కదిలిపోతుంటే, అధికారులు, ప్రజలు అందరూ బాధగా చూస్తుండిపోయారు. ఆగస్టు 4న వచ్చాయి జిల్లాలోని నాగరహోళె అడవుల్లోని శిబిరాల నుంచి ఏనుగులను ఆగస్టు 4న అట్టహాసంగా గజపయన ద్వారా మైసూరుకు తీసుకువచ్చారు. అప్పటినుంచి అంబావిలాస్ ప్యాలెస్ ఆవరణలో మకాం వేసి రాచ మర్యాదలను అందుకున్నాయి. నిత్యం వేలాది మంది గజరాజులను చూసేవారు. సరిగ్గా రెండు నెలల పాటు మైసూరులో గడిపాయి. మధ్యాహ్నం నుంచి బోసిపోయిన ప్యాలెస్ను చూసి అందరూ బాధగా నిట్టూర్చారు. -
ఆవు కళేబరంలో విషం పెట్టి..
మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు తాలూకాలోని మలెమహాదేశ్వర అభయారణ్యంలోని పచ్చెదొడ్డిలో పెద్ద పులిని చంపిన కేసులో నలుగురిని అటవీ సిబ్బంది అరెస్టు చేశారు. పచ్చెదొడ్డివాసులు పచ్చమళ్ళ, గణేష్, గోవిందగౌడ, సంపు నిందితులు. వారిని కొళ్లేగాల ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యపరీక్షలు చేసి అదుపులోకి తీసుకున్నారు. తమ ఆవులు, గొర్రెలపై పులి దాడి చేస్తోందనే కోపంతో ఆవు కళేబరంలో విషం కలిపి పెట్టారు, దానిని తిన్న పులి మృత్యువాత పడింది. ఆ పులి శరీరాన్ని ముక్కలుగా నరికి పడేశారు. ఆవు కళేబరం కోసం అటవీ సిబ్బంది గాలిస్తున్నారు. కంబన్న, మంజునాథ్ అనే గొర్రెల కాపరులను విచారిస్తున్నారు. ఇలా బయటపడింది అటవీ సిబ్బంది అడవిలో గస్తీ తిరుగుతుండగా భూమిలో సగం పాతిపెట్టిన పులి కళేబరం కనిపించింది. దీంతో విచారణ జరపగా గుట్టు రట్టయింది. పులి గోర్లు, కోరలు, 4 కాళ్లు లభించాయి. మగ పులి అని, 12 ఏళ్ల వయసని నిర్ధారించారు. కొన్నినెలల కిందట కూడా పశువులను చంపివేస్తోందని ఇదే మాదిరిగా తల్లి పులి, నాలుగు పిల్లలను కొందరు హతమార్చడం తెలిసిందే. అంతలోనే మరో ఘటన జరగడంతో ఈ ప్రాంతంలో పులుల భద్రత ప్రశ్నార్థకమైంది. అరుదైన వన్యప్రాణులపైన పులులను కాపాడడం గురించి అటవీశాఖ ప్రజల్లో జాగృతి కల్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి. పులిని చంపిన నలుగురు అరెస్టు వన్యప్రాణులకు రక్షణ కరువు -
కులగణన సర్వేకు సహకరించాలి
హొసపేటె: కర్ణాటకలో వెనుకబడిన తరగతుల కమిషన్ నేతృత్వంలో చేపట్టిన కులగణన సర్వేకు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని విజయనగర జిల్లా ఆహింద సంఘం ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ బన్నద మనే తెలిపారు. ఆదివారం నగరంలోని ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్యా సర్వే జరుగుతోందన్నారు. ఇది నిజంగా దోపిడీకి గురైన వారికి న్యాయం చేసే ప్రయత్నమని తెలిపారు. దళితులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు శతాబ్దాలుగా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నా చట్టబద్ధమైన రిజర్వేషన్లు పొందడంలో విఫలయ్యారనేది బహిరంగ సత్యం అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన కులగణన సర్వేలో పాల్గొనాలని కోరారు. కొంతమంది అగ్రకులాల వారు సర్వేను అడ్డుకోవడాన్ని ఖండించారు. ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప ఇప్పటికే కులగణన సర్వేలో అందరూ పాల్గొనాలని కోరుతూ కొన్ని సమావేశాలు నిర్వహించడం శుభపరిణామం అన్నారు. అక్టోబర్ 7వ తేదీ సర్వేకు చివరి తేదీగా ఇచ్చారన్నారు. అయితే సర్వే పూర్తి చేయడానికి మరో వారం సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కోరుతామని పేర్కొన్నారు. శతాబ్దాలుగా రిజర్వేషన్ల వల్ల మోసపోయిన వర్గాలకు సర్వే ఒక వరం అని వెల్లడించారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనార్టీలు ఈ కుల సర్వేలో తమ కులం పేరు, వంశ వృత్తిని కచ్చితంగా ప్రస్తావించాలన్నారు. హిందుయేతర సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వేకు దూరంగా ఉండకూడదని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు బుడ్డి బసవరాజ్, శివకుమార్, రవికుమార్, సద్దాం, సన్న ఈరప్ప, ప్రశాంత్, ఈరన్న తదితరులు పాల్గొన్నారు. -
అమ్మా.. నాన్నా కావాలి
ఉరవకొండ: తల్లిదండ్రులు మృత్యువాత పడ్డారని తెలియని ఈ బాలుడు తన ఒక కాళ్లు పూర్తి దెబ్బతిన్నా అంతటి నొప్పిలోను మమ్మి,. డాడీ కావాలి...అంటూ డాక్టర్లు, నర్సులను చూస్తూ రోదించడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. తల్లిదండ్రులను దూరం చేసి తన బాధను ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని దుస్థితిలో చిన్నారిని చూసి అందరూ అయ్యో అని అంగలార్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. విడపనకల్లు శివారులోని బళ్లారి– అనంతపురం జాతీయ రహదారిలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో తల్లిదండ్రులు చనిపోగా బాలుడు అద్విక్ (5) తీవ్రంగా గాయపడ్డాడు. విశాఖపట్టణానికి చెందిన రామ్సుధీర్ (38), లావణ్య (34) దంపతులు, రామ్సుధీర్కు పెనుకొండలోని కియా కంపెనీలో ఇంజనీర్గా ఉద్యోగం రావడంతో వచ్చాడు. అనంతపురంలో కుటుంబంతో ఉంటూ రోజూ కంపెనీ బస్సులో పెనుకొండకు వెళ్లివచ్చేవాడు. హంపీకి వెళుతుండగా.. దసరా సెలవులు కావడంతో కుటుంబంతో కలిసి హంపీ టూర్కు 4న కారులో బయలుదేరారు. ఘటనాస్థలిలో ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొంది, రెండు కార్లు దెబ్బతినగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లావణ్య అక్కడే చనిపోగా, రామ్సుధీర్ తీవ్రంగా గాయపడ్డాడు. కుమారుడు అద్విక్కు ఒక కాళ్లు విరిగి తీవ్రంగా అవస్థలు పడ్డాడు. మరో కారులో నలుగురు సంజీవ్రెడ్డి, శ్రీనివాసులు, పుల్లయ్యనాయుడు, నాగిరెడ్డి గాయపడ్డారు. బాధితులను ఉరవకొండకు, ఆపై అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. రామ్సుధీర్ అనంతపురం జీజీహెచ్లో చనిపోయాడు. అక్కడే బాలుడు అద్విక్ చికిత్స పొందుతూ అమ్మానాన్నల కోసం ఆరాటపడుతున్నాడు. విడపనకల్లు వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటన.. తల్లిదండ్రులు కొన్నిగంటల్లోనే మృతి అనాథగా మారిన వైజాగ్ బాలుడు -
ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో విస్తృత సేవలు
రాయచూరు రూరల్: ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర ఆర్యవైశ్య సమాజం మహసభ అధ్యక్షుడు రవి శంకర్ పేర్కొన్నారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరులత సమావేశంలో మాట్లాడారు. కులమత భేదాలు లేకుండా 1,600 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేశామని తెలిపారు. 102 పాఠశాలల్లో 6,300 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారని పేర్కొన్నారు. వాసవి చేతన్ పేరుతో 387 మంది వృద్ధులకు నెలకు రూ.1000, సంద్యా శ్రీ (వితంతువులకు) 536 మందికి రూ.1,500, వాసవీ అకాడమీలో 35 మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ కోసం శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు. 2 వేల మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ కోసం రూ.1.3 కోట్లు ఖర్చు చేయడం జరుగుతోందన్నారు. సమావేశంలో ఆర్యవైశ్య మండళి అధ్యక్షుడు రామ్ ప్రసాద్, కుంట్నాళ వెంకటేష్, జగదీష్, హన్మంతయ్య, వీరేష్, వాసుదేవ్, బీమా శంకర్ పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి రాయచూరు రూరల్: ఆర్యవైశ్య సమాజం సభ్యులు కుటుంబంగా ఏర్పడి అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఆర్యవైశ్య సమాజం మహసభ అధ్యక్షుడు రవిశంకర్, ఆర్యవైశ్య మండళి అధ్యక్షుడు రామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్లో జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్యవైశ్య సమాజం దానాలకు ప్రతి రూపమైన వ్యాపారాలతో పాటు సమాజంలో సాంఘికంగా, విద్య, రాజకీయంగా ఎదగాలని కోరారు. వ్యాపారాలతో కాలయాపన చేయకుండా భవిష్యత్తు తరాల వారికి ముందు చూపుతో నడవాలన్నారు. వ్యాపారాలు చేసుకుని జీవనం గడుపుతారనే భావన పోయి సమాజం కోసం యువకులు ముందుకు రావాలన్నారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు కుంట్నాళ వెంకటేష్, జగదీష్, హన్మంతయ్య, వీరేష్, వాసుదేవ్, బీమాశంకర్, సునీత, కిరణ్, రాఘవేంద్ర, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి రైతు కన్నీరు
రాయచూరు రూరల్: జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన ఉల్లికి గిటుబాటు ధర లేకపోవడంతో నష్టాలపాలవుతున్నారు. ఈ ఏడాది రాయచూరు జిల్లాలో 753 హెక్టార్లు, యాదగిరిలో 658 హెక్టార్లు, కొప్పళలో 569 హెక్టార్లు, బళ్లారిలో 489 హెక్టార్లలో ఉల్లి సాగు చేశారు. రాయచూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల నుంచి రాయచూరు ఏపీఎంసీకి ఉల్లిగడ్డలను తీసుకొస్తారు. అయితే ధరలు అమాంతం పడిపోయాయి. ప్రస్తుతం క్వింటాల్ రూ.705 నుంచి రూ.1,196 వరకూ ధరలు పలుకుతున్నాయి. ఉల్లిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా ముందుకు రావడం లేదు. రాయచూరు ఏపీఎంసీకి రోజు 200 క్వింటాళ్లకు పైగా ఉల్లిగడ్డలు వస్తాయి. శనివారం సాయంత్రం ఓ రైతు 62 క్వింటాళ్ల ఉల్లి గడ్డలను మార్కెట్కు తీసుకొచ్చాడు. ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో మార్కెట్లోనే వదిలేసిపోయాడు. రాయచూరు ఏసీఎంసీ మైదానంలో పశువులు ఉల్లిగడ్డలను తింటూ కనిపించాయి. తగ్గుముఖం పట్టిన ధరలు లబోదిబోమంటున్న రైతులు -
ప్రియురాలిని లాడ్జికి పిలుచుకెళ్లిన ప్రియుడు
కర్ణాటక రాష్ట్ర: వివాహమై ఇద్దరు పిల్లల తల్లి అయిన ఓ మహిళ తన ప్రియుడు మోసగించాడని మనో వేదనతో ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు.. యశోద ఆత్మహత్య చేసుకొన్న మహిళ. మృతురాలు యశోదకు వివాహమై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కూడా ఆమె పక్క వీధిలో ఉన్న ఆడిటర్ విశ్వనాథ్ అనే వ్యక్తితో గత తొమ్మిదేళ్లుగా అక్రమ సంబంధం కలిగి ఉంది. అయితే కొంతకాలం క్రితం యశోద తన స్నేహితురాలిని ప్రియుడు విశ్వనాథ్కి పరిచయం చేసింది. దీంతో ప్రియుడు యశోద స్నేహతురాలితో చనువు పెంచుకొని ఆమెను ప్రేమ వలలో పడేశాడు. అంతేకాకుండా ఆమెను ఓ గదికి తీసుకెళ్లాడు. ఈ విషయం యశోద చెవిలో పడింది. ప్రియుడితో కలిసి స్నేహితురాలు ఉన్న లాడ్జికి వెళ్లి గొడవ పడింది. ప్రియుడు సరిగా స్పందించకపోవటంతో మనోవేదనతో అక్కడే పక్క గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై మాగడి రోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
నార్త్ ఈస్ట్ టీచర్స్ ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్
హొసపేటె: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కర్ణాటక ఈశాన్య టీచర్స్ నియోజకవర్గ ఓటర్ల జాబితాను కొత్తగా తయారు చేస్తున్నాం. అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్ణాటక ఈశాన్య టీచర్స్ నియోజకవర్గ అసిస్టెంట్ ఓటర్ రిజిస్ట్రార్, డిప్యూటీ కమిషనర్ కవితా ఎస్ మన్నికేరి తెలిపారు. నవంబర్ 1వ తేదీని అర్హత తేదీగా పరిగణించి ఈ కొత్త జాబితాను తయారు చేసే పని ప్రారంభమైంది. మునుపటి జాబితాలో పేర్లు ఉన్న ఓటర్లు ఫారమ్–19లో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. నమోదుకు మార్గదర్శకాలు భారత పౌరులు, నియోజకవర్గంలో సాధారణంగా నివసిస్తూ ఉండాలి. నవంబర్ 1, 2025 తేదీకి 6 సంవత్సరాల్లో కనీసం 3 సంవత్సరాలుగా గుర్తింపు పొందిన విద్యా సంస్థలో ఉన్నత పాఠశాల కంటే తక్కువ కాకుండా బోధన వృత్తిలో నిమగ్నమై ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయంగా లేదా పోస్ట్ ద్వారా సమర్పించిన దరఖాస్తులు పరిగణించబడవు. బదులుగా, దరఖాస్తుదారు ఫారమ్–19 పూరించి, అనుబంధం–2 ప్రకారం వారి సంస్థ నుంచి వచ్చిన సర్టిఫికెట్తో పాటు సమర్పించాలి. బల్క్ దరఖాస్తులు అంగీకరించబడవు. ఎవరైనా పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, నియమించబడిన అధికారి విచారణకు హాజరు కావాలని నోటీసు జారీ చేస్తారు. విచారణకు హాజరు కాకపోతే లేదా అవసరమైన పత్రాలను సమర్పించకపోతే, దరఖాస్తులు తిరస్కరించబడతాయి. అర్హులైన ఉపాధ్యాయులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కర్ణాటక ఈశాన్య ఉపాధ్యాయుల ఓటర్ల జాబితాకు సంబంధించిన ఏవైన అభ్యంతరాలు ఉంటే సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం (మహానగర పాలికె, తహసీల్దార్ కార్యాలయంలో) ఓటర్ల రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కార్యాలయం, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కార్యాలయానికి నిర్ణీత కాలపరిమితిలోపు సమర్పించవచ్చు.నవంబర్ 6: దరఖాస్తు ఫారమ్–19 స్వీకరించడానికి చివరి రోజు నవంబర్ 25: డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకూ: క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ డిసెంబర్ 30: తుది ఓటర్ల జాబితా ప్రచురణ ముఖ్యమైన తేదీలు ఇవే.. -
చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి
హొసపేటె: విజయనగర జిల్లా హోస్పేట్ తాలూకా గడిగనూర్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో శనివారం మరో ఇద్దరు మరణించారు. గృహ నిర్మాణం, వక్ఫ్, మైనార్టీ సంక్షేమ శాఖ, విజయనగర్, బళ్లారి ఇన్చార్జ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఆస్పత్రిని సందర్శించారు. మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మరణించిన మైలారప్ప, కవిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని వెల్లడించారు. అనంతరం మృతదేహాలను అంబులెన్స్ ద్వారా వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. ఈ సంఘటనలో మొత్తం నలుగురు మరణించగా.. విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. గడిగనూర్లో వంట గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన -
విధి నిర్వహణలో అలసత్వం తగదు
రాయచూరు రూరల్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దౌర్జన్యాల నియంత్రణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని జిల్లాధికారి నీతిష్ హెచ్చరించారు. శనివారం జిల్లాధికారి కార్యాలయంలో శాంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరణించిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వ సౌలభ్యాలు పొందడానికి అవకాశాలు కల్పించాలన్నారు. నకిలీ కుల ప్రమాణ పత్రాలు పొందే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ పుట్టమాదయ్య, నగర సభ కమిషనర్ జుబీన్ మోహపాత్రో, అధికారి పురురాజ సింగ్, సభ్యులు రవీంద్ర, కుమార్, హేమరాజ, రవి, రఘువీర్ నాయక్, పవన్, బసవరాజ్, సుదామ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో రథోత్సవం
రాయచూరు రూరల్: సమాజంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు ప్రతీక దేవీ నవరాత్రులు అని కరేగుడ్డ మహంతేశ్వర మఠం పీఠాధిపతి మహంతలింగ శివాచార్య స్వామీజీ అన్నారు. శనివారం మహంతేఽశ్వర మఠంలో దసరా ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆధునిక భారతదేశంలో మహిళలపై జరుగుతున్న దురాచారాలను నియంత్రించాలన్నారు. దసరా ధర్మ సమ్మేళనం జాగృతి కార్యక్రమాలు చేపట్టమన్నారు. అనంతరం మహిళలతో కలసి రథాన్ని లాగారు. కార్యక్రమంలో సంగన బసవ, మాజీ శాసన సభ్యుడు బసన గౌడ, బసలింగప్ప, శేఖరయ్య, అణ్ణప్ప గౌడ, చంద్రయ్య, చెన్నయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి అరెస్ట్హుబ్లీ: నగరంలోని ఓ కాలనీలో బాలికలు ఆరవేసిన లోదుస్తులను ఎత్తుకెళ్తున్న వ్యక్తిని బెండిగేరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుస్తులను ఇతడు రహస్యంగా చోరీ వేసేవాడని విచారణలో ఒప్పుకున్నాడు. సీసీ కెమెరాల చోరీ కేసులు కూడా నిందితుడిపై ఉన్నాయని పోలీసులు వివరించారు. గ్రామాల అభివృద్ధికి సహకారం అవసరం రాయచూరు రూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని గ్రామీణ శాసన సభ్యుడు బసవన గౌడ పేర్కొన్నారు. శనివారం లింగన్ ఖాన్ దొడ్డి, హిరాపూర, ఏలెబిచ్చాలి, అరోలి, అడవిఖాన పూర్, ఉడుమగల్లో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు పాటుపడతామన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేహదానానికి అంగీకారంరాయచూరు రూరల్: కొప్పళ జిల్లా గంగావతి తాలుకా శ్రీరామ నగర్కు చెందిన గారపాటి రామకృష్ణ తన దేహదానానికి అంగీకరించారు. దేహాన్ని కొప్పళ ప్రభుత్వ వైద్యకీయ కళాశాల పరిశోధన సంస్థకు, కళ్లను హుబ్లీ ఎంఎం జోషి నేత్రాలయానికి ఇవ్వడానికి వీలునామా రాసి ఇచ్చారు. ప్రవాసాంధ్రుడు, కన్నడ సాహితి ప్రియుడు, స్వామి వివేకానంద సేవా సంఘం అధ్యక్షుడు అయిన గారపాటి రామకృష్ణ తెలుగు, కన్నడ భాషల్లో రచనలు చేశారు. ఔషధాల పేరుతో రూ.1.44 లక్షల టోకరాహుబ్లీ: కాళ్ల నొప్పులకు ఔషధాలు ఇచ్చి బాగు చేస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.1.44 లక్షలు తీసుకుని మోసగించారు. గురుగొల్ల, శీను, చంద్రగోకాక, కుమార, వినోద తళవార అనే వ్యక్తులు మాంగిలాల్కు ఔషధాన్ని ఇచ్చి డబ్బులు తీసుకున్నారు. అయితే ఆ ఔషధం వల్ల కాలి నొప్పి తగ్గలేదు. నిందితులు అంగడి వాకిలి వేసి పరారీ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నించినట్లు బాధితుడు కేశ్వపుర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆభరణాల చోరీ.. ఇంటి తాళాలు పగలగొట్టి ఆభరణాలు, రూ.4 లక్షల నగదు చోరీ చేసిన ఘటన గోకుల్ రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సదరు స్టేషన్ పరిధిలో మారుతీ నగర నజీమ్ మునిస్సా ఇంట్లోని బీరువాలో ఉంచిన రూ.50 వేల విలువ చేసే 10 గ్రాముల బంగారు ఆభరణాలు, అలాగే రూ.4 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. గోకుల్ రోడ్డు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నేత్రపర్వం.. దీపోత్సవం కోలారు: కోలారు తాలూకా వక్కలేరి గ్రామంలో అంబేడ్కర్ నగర్ ఆధ్వర్యంలో సామ్రాట్ అశోక విజయదశమి కార్యక్రమాలను ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి గణపతి పూజ, గ్రామ దేవతల దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పూలతో అలంకరించిన దీపాలను తలపై మోసుకుని ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి గ్రామ దేవతలకు సమర్పించారు. భక్తులు గ్రామదేవతలను దర్శించుకొని మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. -
సాహిత్యానికి కన్నడిగుల సేవలు భేష్
బళ్లారి అర్బన్: ప్రపంచ సాహిత్యానికి కన్నడిగులు విశేష సేవలు అందించారని ఎస్కేడీ వర్సిటీ ఆంగ్ల భాష ప్రొఫెసర్ శాంత నాయక్ తెలిపారు. స్థానిక శరణ సాహిత్య పరిషత్ జిల్లా శాఖ, అలాగే బళ్లారి సంస్కార భారతీ ఆధ్వర్యంలో బీపీఎస్సీ పాఠశాల మీటింగ్ హాల్లో భైరప్ప సంస్మరణ, నాడహబ్బ దసరా కవిగోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భైరప్ప నవలల్లో పౌరాణిక విషయాలను అద్దంలో పెట్టి చూస్తారన్నారు. భైరప్ప నవలలు పాఠకులకు ఎంతో ఇష్టమని తెలిపారు. అలాగే నాడ హబ్బ సందర్భంగా కవిగోష్టి ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. వర్ధమాన కవులతో కన్నడ సాహిత్యం మరింత సంపన్నం కావాలన్నారు. ఎస్ఎల్ భైరప్ప, మేటి కళాకారుడు యశ్వంత్ పర్దేశ్పాండే మృతి కన్నడ భాషకు అపారమైన నష్టం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. భైరప్ప బతుకు రచనలపై అధ్యాపకులు డాక్టర్ కొట్రెష్ చక్కగా వివరించారు. మున్సిపల్ కళాశాల ప్రిన్సిపాల్ కే.సుంకప్ప, కేవీ నాగిరెడ్డి, డాక్టర్ తిప్పేరుద్ర సండూరు, ఎర్రిస్వామి, రామరావు కులకర్ణి, వీరేష్ స్వామి, డాక్టర్ కె.బసప్ప, తదితర 25 మందికి పైగా కవులు తమ కవితలను పాడి వినిపించారు. కార్యక్రమంలో చాంద్పాషా, లెక్చలర్ వీరేష్ స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
‘వైద్య వృత్తి పవిత్రమైనది’
హుబ్లీ: వైద్య వృత్తిని ధన ధారదత్తం చేయరాదని సీ్త్ర రోగ నిపుణురాలు డాక్టర్ దత్తప్రసాద్ గిజరే సూచించారు. బెళగావిలోని సమీపంలో బసవన కుడచి దేవరాజ అరసు కాలనీలోని చెన్నమ్మ హిరేమఠ వృద్ధాశ్రమంలో వైద్య విద్యార్థులకు యూనిఫారం, వైద్య పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్య వృత్తి ఓ పవిత్రమైనదని తెలిపారు. 5 ఏళ్ల పాటు చక్కగా అధ్యయనం చేసి జ్ఞానాన్ని సంపాదించుకున్నారన్నారు. కారంజి మఠం గురుసిద్ధ స్వామి మాట్లాడుతూ.. జీవితంలో డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని తెలిపారు. మీరు ఎంపిక చేసుకున్న మార్గం అత్యంత పవిత్రమైందని కితాబిచ్చారు. క్రమశిక్షణతో వైద్య కోర్సు పూర్తి చేసి సమాజ స్పృహతో సేవలు అందించాలని సూచించారు. ధనమే సర్వస్వం కాదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య వృత్తిని డబ్బుతో ముడిపెట్టరాదన్నారు. డాక్టర్ మహంతేష రామన్నవర మాట్లాడుతూ.. విద్యార్థులు గురుతర బాధ్యతలను ఎరిగి విద్యార్జాన చేయాలన్నారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమ సమన్వయ అధికారి ఎంఎస్ చౌగల, డాక్టర్ రోహిణి రేగినాళ, సుభాష్ రేగినాళ, కిరణ్, సుజిత, అజయ్ పూజారి, సంకేత కులకర్ణి, ఓం శ్రీ తదితరులు పాల్గొన్నారు. -
పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలి
రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో పండించిన పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరలు ప్రకటించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కొప్పళ జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం అధ్యక్షుడు రుద్రప్ప మాట్లాడారు. కల్యాణ కర్ణాటక భాగంలోని కొప్పళ, బళ్లారి, రాయచూరు, యాదగిరి, కలబుర్గి, బీదర్, విజయనగరం జిల్లాల్లో వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. వాణిజ్య పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మెక్కజొన్న క్వింటాల్కు రూ.4,500 మద్దతు ధర ప్రకటించాలన్నారు. అనంతరం తహసీల్దార్ మురళీధర కులకర్ణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శివప్ప, మారుతి, శరణప్ప, సిద్ధప్ప, తిలక్, మరియప్ప, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటాం రాయచూరు రూరల్: జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్, మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్ తెలిపారు. శనివారం వారు వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిరవార తాలుకాలోని నవలకల్, కురుకుంద, వడవాటిలో దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రైతుల పొలాల వద్దకు వెళ్లి సర్వేలు జరపాలని మంత్రి అధికారులకు సూచించారు. పంట నష్ట పరిహరం రైతులకు అందలేదని ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎకరాకు రూ.25 వేల పంట నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. బీజేపీ బలోపేతానికి కృషి చేయాలిరాయచూరు రూరల్: నగరంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆత్మనిర్భర భారత్ శిబిరాలు ఏర్పాటు చేశారు. శాసన సభ్యుడు శివరాజ పాటిల్, మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఎన్డీఏ పాలనలో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలిపారు. ప్రధాని మోదీ పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, పదాదికారులు రాఘవేంద్ర, శశిరాజ్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మామిడి చెట్ల నరికివేతపై కేసు నమోదుహుబ్లీ: పొలంలోకి అక్రమంగా ప్రవేశించి మామిడి చెట్లను నరికివేశారనే ఆరోపణలపై హావేరి జిల్లా సిగ్గావి సవనూరు ఎమ్మెల్యే యాసీర్ అహ్మద్ ఖాన్ పఠాన్తో పాటు సర్వేశాఖ ముఖ్య అధికారి జగదీశ్, ఏడీఎల్ సత్యనారాయణప్ప, తాలూకా సర్వేయర్ మంజునాథ్పై హనగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. హనగల్ తాలూకా హాలెకోటె గ్రామం వద్ద తాము కొనుగోలు చేసిన పొలంలోకి ఎమ్మెల్యే యాసీర్ అహ్మద్ ఖాన్ పఠాన్ అక్రమంగా ప్రవేశించి కొలతలు వేశారని ధార్వాడ న్యాయవాది ఫక్కీర్ గౌడ వీరన్నగౌడ పాటిల్ తెలిపారు. అంతేకాకుండా 25 ఏళ్ల నాటి పాత మామిడి చెట్లను జేసీబీ తదితర యంత్రాలతో తొలగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. అంగన్వాడీల్లో సకల సౌకర్యాలు హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు తాలూకా ఉజ్జిని గ్రామం సిద్దేశ్వర్ నగర్లోని అంగన్వాడీ సెంటర్లో శనివారం ఎల్కేజీ, యుకేజీ తరగతులను ప్రారంభించారు. గ్రామ పంచాయతీ అధ్యక్షుడు బి.చౌడప్ప చెట్టుకు నీరు పోసిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు శివగంగమ్మ, కురుగోడు సిద్ధేష్, మాజీ ఉపాధ్యక్షురాలు రేఖ మరియప్ప, వార్డు సభ్యులు మంజునాథ్ స్వామి, నాగరత్నమ్మ వి.లోకేశ్, రవి, అంగన్వాడీ కార్యకర్తలు ఏ.శాంతమ్మ ఎం.జ్యోతి ఎం.రేణుక ఎన్.సుమంగళ, పుష్పావతి, సహాయకులు పాల్గొన్నారు. -
బాలింతల మరణాలను నియంత్రించాలి
రాయచూరు రూరల్: జిల్లాలో బాలింతల మరణాల నియంత్రణకు వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది ముందుండాలని కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి సుబోద్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం మాన్వి తల్లీబిడ్డల ఆస్పత్రిని సందర్శించారు. వైద్యులు, అధికారులు, సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాదిరిగా తల్లీబిడ్డల ఆస్పత్రిలో సౌలభ్యాలు ఉన్నాయని తెలిపారు. బాలింతలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. గర్భిణులకు సాధారణ కాన్పులు చేయాలని తెలిపారు. బాలింతల మరణాల నియంత్రణలో భాగంగా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్సీహెచ్ అధికారిణి నందిత, అశోక్, రంగనాథ్ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రారంభించలేదు
కోలారు: రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ఓటరు జాబితా సవరణను ఇంతవరకు ప్రారంభించలేదు. బిహార్ తరహాలో కర్ణాటకలోను ఓటరు జాబితా సవరణ చేస్తే వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జీఎస్ సంగ్రేషి తెలిపారు. శనివారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు చేసిన ఓటు చోరి ఆరోపణలపై తాను స్పందించేది లేదని, ఆ విషయం తనకు తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ జాబితా ఇచ్చిన తరువాత జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేపడతామని తెలిపారు. మాలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితాల రీకౌంటింగ్పై స్పందిస్తూ ఆ విషయం తమ పరిధిలో లేదన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని తెలిపారు. తాము పంచాయతీ, నగర, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు మాత్రమే చూస్తామని తెలిపారు. కులగణనకు వెళ్లి.. రోడ్డు గుంతకు బలై..దొడ్డబళ్లాపురం: కుల గణన సర్వేలో పాల్గొని ఇంటికి వెళ్తున్న టీచర్ రోడ్డు గుంతకు బలైంది. ఈ ఘటన బాగల్కోటె తాలూకా తిమ్మాపుర క్రాస్ వద్ద చోటుచేసుకుంది. బసవనబాగేవాడి గ్రామ నివాసి విజయకుమారి(52) రాంపుర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా విధులు నిర్వహిస్తోంది. ఈమెను కులగణనకు నియమించారు. శుక్రవారం సాయంత్రం సర్వే ముగించుకుని కుమారుడితో కలిసి బైక్పై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా దారి మధ్యలో బైక్ గుంతలో పడి స్కిడ్ అయ్యింది. దీంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డ విజయకుమారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక మృతిచెందింది. బాగలకోట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
బెంగళూరు సిటీలో కులగణన ఆరంభం
జయనగరలో వివరాలు సేకరిస్తున్న సర్వే సిబ్బందిడీకే.శివకుమార్ నివాసంలో కులగణన చేపడుతున్న అధికారులు బనశంకరి: రాష్ట్ర వెనుకబడినవర్గాల సామాజిక, విద్య, ఆర్థి సమీక్ష శనివారం బెంగళూరు నగరంలో ప్రారంభమైంది. సర్వే మొదటిరోజు అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కొన్ని చోట్ల యాప్ పనిచేయలేదు. మరికొన్నిచోట్ల సిగ్నల్ లభించలేదు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలని 200 మందికిపైగా సర్వేసిబ్బంది మల్లేశ్వరం గ్రేటర్ బెంగళూరు ప్రాధికార కార్యాలయం ముందు బైఠాయించారు. సాంకేతిక సమస్యలతో సర్వే ఎలా చేయాలని ప్రశ్నించారు. ఐదు పాలికెల్లో సర్వే సర్వే సిబ్బంది నగరంలో 32లక్షల ఇళ్లను సందర్శించి వివరాలు నమోదు చేయనున్నారు. సర్వేకోసం సుమారు 17500 సిబ్బందిని నియమించి శిక్షణ కూడా ఇచ్చారు. వారికి గుర్తింపు కార్డులు, క్యాప్, ప్యాడ్, బుక్లెట్ అందించారు రెండు వారాల్లో సమీక్ష ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గ్రేటర్ బెంగళూరు చీఫ్ కమిషనర్ మహేశ్వర్రావు తెలిపారు. ఐదు పాలికెల్లో ఈ సర్వే సాగుతుందన్నారు. సిబ్బంది కొరతతో సర్వే ప్రారంభంలో జాప్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఈనెల 7న సర్వే పూర్తి కానుండగా బెంగళూరులో మాత్రం గడువు పొడిగించే అవకాశం ఉందన్నారు. సర్వేలో ఇన్ని ప్రశ్నలా.. ఇది టూమచ్ : డీకే శివకుమార్ బెంగళూరు నగరంలో చేపట్టిన కులగణనలో భాగంగా సర్వే సిబ్బంది సదాశివనగరలోని డీసీఎం డీకే.శివకుమార్ నివాసానికి వెళ్లారు. డీకే.శివకుమార్, ఆయన సతీమణి ఉషానుంచి సర్వే అధికారులు వివరాలు సేకరించారు. కులగణ ఓటీపీ ఏ మొబైల్కు వచ్చిందని ఆరా తీశారు. కొన్ని సెల్ఫోన్లను పరిశీలించగా ఒక ఫోన్లో ఓటీపీ నంబర్ లభించింది. అనంతరం ఓటీపీ తెలిపి కులగణనకు సంబంధించిన సమాచారం అందించారు. కులగణనలో సమాచారం సేకరించిన రికార్డులను డీకే శివకుమార్ గమనించి ఇన్ని ప్రశ్నలు ఉన్నాయా? నేను ఫారం చూడలేదు.. ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రజలకు ఓపిక ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. ఇది చాలా టూమచ్ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్న సింపుల్గా ఉండాలన్నారు. వీటన్నింటికీ ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కోళ్లు, పశువులు, మేకలు, గొర్రెలు పెంచారా? బీమా చేశారా .. అనే ప్రశ్నలకు ప్రజలు సమాధానం చెప్పరని డీకే శివకుమార్ అన్నారు. 22 నిమిషాల్లో సర్వే పూర్తవుతుందని చెప్పిన అధికారులు.. తమ నివాసంలో గంట సమయ తీసుకున్నారని డీకే శివకుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోళ్లు పెంచారా? చేపలు పెంచుతున్నారా? బంగారం ఎంత ఉంది అని అడగరాదని అధికారులకు సూచించారు. 32 లక్షల ఇళ్లు, రెండువారాల టార్గెట్ 17వేల మంది సిబ్బంది వినియోగం తొలిరోజే సరిగా పనిచేయని యాప్ సిగ్నల్స్ అందక సమస్యలు ధర్నాకు దిగిన సర్వే సిబ్బంది కులగణనలో గందరగోళం -
ప్రతి జిల్లాకూ మెడికల్ కళాశాల
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో ప్రతి జిల్లాకూ మెడికల్ కళాశాల, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. శనివారం ఆయన బెళగావిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారంతా పేద, మధ్యతరగతి ప్రజలేనని, వారికి మంచి వైద్యం,చికిత్స అందించడం ఎంతో అవసరమన్నారు. అందుకే ప్రతి జిల్లాలో వైద్యకళాశాల, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలనుకుంటున్నామన్నారు. అందుకు తగినట్టు వైద్యులను, వైద్య సిబ్బందిని నియమిస్తామన్నారు. గ్యారంటీ పథకాలకు వచ్చే ఆదరణ చూసి బీజేపీకి నిద్ర పట్టనివ్వడం లేదురాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలకు వస్తున్న ప్రజాదరణ చూసి బీజేపీ వారికి నిద్రపట్టడం లేదని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ నిధులను గ్యారంటీ పథకాలకు మళ్లించామని ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ అవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే అన్నారు. గ్యారంటీ పథకాలను బిహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యాణ తదితర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. బెళగావిలోని బిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి 2017లో శంకుస్థాపన చేయగా ఇప్పుడు ప్రారంభించడం ఆనందంగా ఉందని,ఆస్పత్రిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం చేయమన్నారు. సీఎం సిద్ధరామయ్య -
జిల్లాల వారీగా చిన్నారులు, మృతులు
బనశంకరి: రాష్ట్రంలో మూడేళ్లలో 18,931 మంది చిన్నారులు, శిశువులు మృత్యువాత పడ్డారు. ఏడాది వయసు లోపు చిన్నారులు అకాలమరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 2022–23లో 7,471 మంది శిశువులు, 2023–24లో 5,634 మంది, 2024–25లో 5,826తో కలిపి మొత్తం 18,931 మంది శిశువులు మృతి చెందారు. రాష్ట్రంలో ఇతర జిల్లాల కంటే బెంగళూరులోనే అధిక మంది చిన్నారులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. మైసూరు, రాయచూరు, బళ్లారి, బెళగావి తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ(హెచ్ఎంఐఎస్)లో నమోదైన వివరాల ప్రకారం 2022లో శిశువుల మరణాలు అధికమయ్యాయి. కానీ 2023–24లో తగ్గుముఖం పట్టినప్పటికీ 2024–25లో మళ్లీ మరణాలు పెరిగాయి. ఎస్ఆర్ఎస్ నివేదిక ప్రకారం కర్ణాటకలో శిశుమరణాల ప్రమాణం ప్రతి 1000 సజీవ జననాలకు 12కు తగ్గింది. దేశంలో ఈ సరాసరి 26గా ఉంది. ప్రభుత్వం చిన్నారుల వైద్యసేవలకు అనేక సౌకర్యాలతో కూడిన ఆరోగ్య సేవలు, సముదాయ ఆధారిత చికిత్స, ఆరోగ్య సిబ్బంది సామర్థ్య, ఇంటి ఆధారిత చిన్నారుల ఆరోగ్యసేవలు ఇతర పథకాలను అమలు చేస్తోంది. ప్రత్యేకంగా శిశు మరణాల నియంత్రణకు ప్రభుత్వంతో పాటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో శిశు ఆరోగ్య కేంద్రాలు (ఎస్ఎన్సీయూ) (ఎన్బీఎస్యూ)తో పాటు ఇతర ఆరోగ్య సేవలు అందిస్తోంది. అధికంగా ప్రసూతి కోసం ఎంపిక చేసిన తాలూకా ఆసుపత్రుల్లో 50 ఎస్ఎన్సీయూలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు 24 గంటలు పని చేస్తున్నాయి. పిల్లలు వైద్యనిపుణులు, డాక్టర్లు, నర్సులతో పాటు సహాయక సిబ్బంది ఉంటారు. అవధికి ముందే జననం, బరువు తక్కువగా ఉండటంతో పాటు అస్వస్థ శిశువులకు వెంటిలేటర్ సహాయానికి ఆధునిక శ్వాసకోశ వ్యవస్థతో పాటు అవసరమైన చికిత్స సేవలు అందుబాటులో ఉంచారు. ఎస్ఎన్సీయూల్లో (కేఎంసీ) వార్డులను సైతం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 165 ఎన్బీఎస్యూ పని చేస్తున్నాయి. ప్రసూతి నిర్వహించే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సముదాయ ఆరోగ్య కేంద్రాలు, తాలూకా స్దాయి ఆసుపత్రులు, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో 1,084 శిశు ఆరోగ్య కేంద్రాలు(ఎన్బీసీసీ) అందుబాటులో ఉన్నాయి. అంతేగాక తుమకూరు జిల్లా శిరా, మండ్య జిల్లా కేఆర్ పేటె, హాసన జిల్లా హొళెనరసీపుర, ఉడుపి జిల్లా కుందాపుర, బెళగావి జిల్లా గోకాక్, ఉత్తర కన్నడ జిల్లా శిరసి, కలబుర్గి జిల్లా జేవర్గి, బీదర్ జిల్లా హుమ్నాబాద్, కొప్పళ జిల్లా గంగావతి తాలూకా ఆసుపత్రుల్లో ప్రత్యేక శిశుకేంద్రాలను స్దాపించారు. ఇన్ని సౌకర్యాలు కల్పించినా చిన్నారుల మరణాల ప్రమాణం పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో మూడేళ్లలో 18,931 మంది చిన్నారుల మృత్యువాత ఏడాది వయస్సు లోపు శిశు మరణాలు అధికం శిశువుల మరణాల్లో అకాల మృతులు బెంగళూరులోనే ఎక్కువ రాష్ట్రంలో వైద్యసౌకర్యాలు అధికం... బెంగళూరులో 2,324, మైసూరు జిల్లాలో 1,561, రాయచూరులో 1,450, కొప్పళ 1,265, బళ్లారి 1,231, కలబుర్గి 1,062, బెళగావి 1,036, ధార్వాడ జిల్లాలో 1,023 మంది శిశుమరణాలు సంభవించాయి. -
విహారయాత్ర విషాదాంతం
యశవంతపుర: పిక్నిక్కు వెళ్లిన రెండు కుటుంబాలు అరేబియా సముద్రంలో బోటులో విహరిస్తుండగా అది బోల్తాపడి నలుగురు జల సమాధి అయ్యారు. మరో నలుగురు సురక్షితంగా బయట పడ్డారు. ఈ విషాదఘటన మహారాష్ట్ర సింధుదుర్గ జిల్లా వెంగుర్ల తాలూకా శిరోడ సమీపంలోని వేళాగర బీచ్లో జరిగింది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా లోండా గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు దసరా సెలవుల నేపథ్యంలో వేళాగర బీచ్కు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం బోటులో విహరిస్తుండగా భారీ అల లాక్కెళ్లింది. కొద్ది సేపుటి తరువాత ముగ్గరి మృతదేహాలు బయట పడగా నలుగురు సురక్షతంగా బయట పడ్డారు. మరో మృతదేహం శనివారం ఉదయం బయట పడింది. మృతులను లోండాకు చెందిన ఇర్పాన్ ఇసాక్ కిత్తూర(38), అయన భార్య ఫరినా ఇర్పాన్ కిత్తూర(31), వీరి కుమారుడు ఇబాద్ కిత్తూర(12), ఇర్పాన్ తమ్ముడి కుమారుడు ఇక్వాన్ ఇమ్రాన్ కిత్తూర(15)లుగా గుర్తించారు. ఇమ్రాన్ కిత్తూర, జబీన్ ఇమ్రాన్ కిత్తూర, ఇజాన్ ఇమ్రాన్ కిత్తూర, ఇస్రా ఇమ్రాన్ కిత్తూరలు సురక్షితంగా బయట పడ్డారు. మృతదేహాలను మహారాష్ట్ర సావంతవాడి ఆస్పత్రికి తరలించిపోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఖానాపుర తాలూకా లోండా గ్రామంలో శనివారం మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. నలుగురి మృతితో గ్రామాన్ని విషాదం కమ్మేసింది. బోటు మునిగి నలుగురు మృతి మృతులు బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా వాసులు మహారాష్ట్ర సింధుదుర్గ జిల్లాలో ఘటన -
శిశు మరణాలకు కారణాలివే..
అవధికి ముందే జననం, తక్కువ బరువుతో ఏర్పడే సమస్యలు, పుట్టుక సమయంలో శ్వాసకోశ సమస్య, న్యుమోనియా, సెప్సిస్, పుట్టుకతో గుండె సమస్య, నరవ్యూహ సంబంధించిన దోషాలతో అభివృద్ధి చెందిన దేశాల్లో శిశువుల మరణాల ప్రమాణం తక్కువగా ఉంది. కానీ అభివృద్ధి చెందుతున్న వెనకబడిన రాష్ట్రాల్లో అధికంగా ఉంది. రాష్ట్రంలో గతంతో పోలిస్తే ప్రస్తుత ఏడాది శిశుమరణాలు తగ్గాయని ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఉన్నా కొన్ని సార్లు అకాలిక శిశుమరణాలు సంభవిస్తున్నాయని భారతీయ వైద్య సంఘం కర్ణాటక శాఖ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. -
బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరాలు.. ఫ్రెండ్స్కు వీడియోలు పంపిన భర్త
కర్ణాటక: ఓ వికృత భర్త నిజ స్వరూపాన్ని చూసి భార్య నిశ్చేష్టురాలైంది. పడక గదిలో రహస్యంగా కెమెరాలను అమర్చి భార్యతో సన్నిహితంగా వీడియోలను తీసుకున్న భర్త వాటిని స్నేహితులకు పం పించి పైశాచికానందం పొందాడు. సభ్య సమాజాన్ని విస్తుగొలిపే ఈ ఘటన సిలికాన్ సిటీ బెంగళూరులో శుక్రవారం వెలుగుచూసింది. బాధితురాలు, పుట్టేనహళ్లి పోలీసుల కథనం ప్రకారం..బెంగళూరుకు చెందిన సయ్యద్ ఇనాముల్ గతంలో పెళ్లయిం ది. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి గతసెప్టెంబర్ బాధిత యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వ్యాపారం చేస్తానని, ఆస్తిపరుడిని అని చెప్పుకున్నాడు. 350 గ్రాముల బంగారం, ఓ ఖరీదైన బైకు కట్నంగా తీసుకున్నాడు. తొలిరోజు నుంచే భార్యను వేధించడం ప్రారంభించాడు. తనకు 19మంది మహిళలతో సంబంధాలున్నట్లు గొప్పలు చెప్పుకునేవాడు. బెడ్ రూంలో కెమెరాలను ఏర్పాటు చేసి భార్యతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను రికార్డ్ చేసేవాడు. ఆ వీడియోలను దుబాయ్లోని తన స్నేహితులకు పంపేవాడు. వారితో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని భార్యపై ఒత్తిడి చేసేవాడు. భర్తకు అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త సహకరించేవారు, వారూ వేధించేవారు. బయట సినిమాలు, పార్కులకు వెళ్లినప్పుడు కూడా సయ్యద్ భార్యను అవమానించేవాడు. దీంతో విసిగివేసారిన బాధితురాలు పుట్టేనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు విచారణలో సయ్యద్ భార్య ఆరోపణలు నిజమేనని అంగీకరించడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి ఫోన్, కంప్యూటర్ సీజ్ చేశారు. -
కుటుంబ నియంత్రణ నియమాలు పాటిద్దాం
రాయచూరు రూరల్: నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కుటుంబ సంక్షేమ, నియంత్రణ నియమాలను పాటించాలని కుటుంబ నియంత్రణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ వీ.ఏ.మాలి పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం రాయచూరులో భారతీయ కుటుంబ నియంత్రణ సంఘం(ఎఫ్పీఏఐ) భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మురికి వాడల ప్రాంతాల్లో నివసించే వారికి ఆరోగ్యపరమైన విషయాల గురించి వివరించడంలో ఎఫ్పీఏఐ ప్రముఖ పాత్రను పోషిస్తోందన్నారు. 9–14 ఏళ్ల మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే బాలికలకు భవిష్యత్తులో సెర్వికల్ క్యాన్సర్ వ్యాధి రాకుండా నియంత్రణకు తల్లిదండ్రుల అనుమతి మేరకు ఆరు నెలలకు ఒకసారి హెచ్పీవీ ఇంజెక్షన్ ఇస్తారన్నారు. దాతల నుంచి వాటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ నుంచి ఓపీడీని ప్రారంభించి ప్రజలకు వైద్య సౌకర్యాలను కల్పిస్తారన్నారు. సమావేశంలో డాక్టర్ బసనగౌడ, మహాలింగప్ప, విరుపాక్షరెడ్డి, ఇందర్ చంద్ సింగ్వి, రాజకుమారి, ఆలియా ఖానంలున్నారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
రాయచూరు రూరల్: ఎగువన భారీగా కురిిసిన వానలకు రాయచూరు జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. శుక్రవారం జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర వైద్యవిద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్, ఎమ్మెల్యే హంపయ్య నాయక్ తదితరులు లింగసూగూరు, మస్కి, మాన్వి, సింధనూరు తాలూకాల్లో వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ఆలకించారు. అక్కడక్కడా నీట మునిగిన పంటలను పరిశీలించారు. కాగా పంట నష్టపరిహారం ఎకరాకు రూ.25 వేలు చొప్పున చెల్లించాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో పంట నష్ట పరిహారం అందలేదని ఫిర్యాదులు వస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత ప్రతి రైతు పొలానికి వెళ్లి సర్వే జరపాలని సూచించారు. రూ.26 కోట్ల నిధులు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. ప్రాణహానికి రూ.35 లక్షల పరిహారం కేటాయించామన్నారు. సమావేశంలో జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య తదితరులున్నారు. -
ఆల్మట్టి డ్యాంలో 7.5 టీఎంసీల పూడిక
రాయచూరు రూరల్: కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర సర్కార్ మొండి వైఖరిని అవలంభిస్తోంది. కృష్ణా బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.25 మీటర్ల వరకు పెంచుకోడానికి అవకాశం ఉంది. 2023లో కర్ణాటక ఇంజినీరింగ్ పరిశోధన కేంద్రం జరిపిన సర్వేలో ఆల్మట్టి డ్యాంలో 7.5 టీఎంసీల మేర పూడిక పేరుకుంది. 123.081 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ డ్యాంలో 7.5 టీఎంసీల మేర పూడిక పేరుకొంది. ఆల్మట్టి డ్యాం పరిధిలోని హిప్పరిగి జలాశయం నుంచి కర్ణాటక ఇంజినీరింగ్ పరిశోధన కేంద్రం అధికారి కేజీ మహేష్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. నారాయణపూర్ డ్యాంలో 10.550 టీఎంసీల మేర పూడిక పేరుకున్నట్లు అధికారులు తెలిపారు. బాగల్కోటె, విజయపుర, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, గదగ్, కొప్పళ జిల్లాల జీవనాడి కృష్ణా నది ఆయకట్టు కింద 5.30 లక్షల హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం అందుబాటులో ఉంది. దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే బళ్లారిఅర్బన్: నగర ప్రజల ఆరాధ్య దేవత కనకదుర్గమ్మ ప్రత్యేక ఆశీస్సులను దసరా పండుగ సందర్భంగా నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి అందుకున్నారు. ఆలయ పూజారులు ఆయనను ప్రత్యేకంగా ఆలయ మర్యాదలతో సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా నారా భరత్రెడ్డి ఆలయం వద్ద భక్తులతో మాట్లాడుతూ పరస్పరం దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దుష్ట సంహారానికి ప్రతీకగా రావణ దిష్టిబొమ్మ దహన ప్రక్రియలో పాల్గొన్నారు. సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి● మృతులిద్దరూ తల్లీకుమారులు సాక్షి, బళ్లారి: ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హొసపేటె తాలూకా గాదిగనూరు గ్రామంలో గతనెల 27వ తేదీన సిలిండర్ పేలి తీవ్రంగా గాయపడిన 11 మందిలో ఇద్దరు మృతి చెందారు. సిలిండర్ పేలుడులో కుటుంబ తీవ్రంగా గాయపడటంతో పాటు ఇంటి పైకప్పు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హాలప్ప(43), గంగమ్మ(80) అనే తల్లీ కుమారులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో గ్యాస్ స్టౌ వెలిగించడానికి ప్రయత్నించగా గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో కవిత(32), హాలప్ప(42), మైలారప్ప(48), మల్లమ్మ(40), కావేరి(18), కావ్య(15), నిఖిల్ (13) గాయపడిన నేపథ్యంలో తోరణగల్లు ప్రభుత్వ, జిందాల్ సంజీవిని ఆస్పత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించిన సంగతి విదితమే. మహాత్ముడి బాటలో నడవాలి శ్రీనివాసపురం : మహాత్మాగాంధీ అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్య్ర తీసుకు వచ్చారని, ఆయన ఆదర్శ తత్వ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పీడీఓ మాళికాంబ పిలుపునిచ్చారు. తాలూకాలోని తళసనూరు గ్రామ పంచాయతీలో గురువారం నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహాత్ముడు శాంతియుత పోరాటంతో బ్రిటిష్ వారిని దేశం నుంచి వెళ్లగొట్టారన్నారు. సమాజంలోని అందరూ ఆర్థికంగా, సామాజికంగా సమానత సాధించాలని గాంధీజీ ఆశించారన్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా గ్రామాలలో పరిశుభ్రతను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు స్వాతి జయ ప్రకాష్, ఉపాధ్యక్షురాలు మమత, మాజీ ఉపాధ్యక్షుడు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ట్రంప్ పన్నుల విధింపుపై 13న సమావేశం
బళ్లారిఅర్బన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా ఇతర దేశాలపై పన్నులు విధించిన తీరుపై రైతు కార్మికుల సంఘం జిల్లా స్థాయి సంయుక్త సమావేశాన్ని నగరంలోని గాంధీ భవన్లో ఈనెల 13న ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసినట్లు కర్ణాటక ప్రాంత రైతు సంఘం రాష్ట్రాధ్యక్షుడు యూ.బసవరాజ్ తెలిపారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై ఆ దేశానికి ఎగుమతి చేసే వస్తువులపై 20 శాతం పన్ను, అదనంగా మరో 25 శాతం పన్ను మొత్తం కలిపి 45 శాతం పన్నులు విధించడమే కాకుండా 100 శాతం పన్ను విధిస్తానని బింకాలకు పోతున్న ట్రంప్ తీరుపై ధ్వజమెత్తారు. దీని వల్ల రూ.100కు విక్రయించే మన వస్తువుల ధర రూ.150 నుంచి రూ.200 వరకు పెరగనుంది. అలా జరిగితే ఆ వస్తువులు అమ్మడవబోవని, దీని వల్ల చిన్నతరహా వివిధ రకాల పరిశ్రమలతో పాటు రెడీమేడ్, కొర్ర చేపలు, చర్మ వస్తువులు, ఔషధాల ధరలు విపరీతంగా పెరిగి యువతకు ఉపాధి కరువయ్యే పరిస్థితులు ఏర్పడతాయని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ట్రంప్ తీరు వల్ల అభివృద్ధి చెందుతున్న ఎన్నో దేశాలు ఆర్థిక సంక్షోభానికి గురవుతాయన్నారు. సంఘం ప్రముఖులు సత్యబాబు, శివశంకర్, చెన్నబసయ్య, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల్లో ఎల్కేజీ విద్యకు శ్రీకారం
సాక్షి, బళ్లారి: సాధారణంగా ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టిక ఆహారాన్ని అందించడంతో పాటు చిన్నారుల ఆలనపాలన చూసుకునేందుకు ఆయాలు, అంగన్వాడీ టీచర్లు ఎంతో కృషి చేసేవారు. అంతే కాకుండా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు గర్భిణీలకు, బాలింతలకు కూడా పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ గుర్తింపు పొందింది. అయితే మారుతున్న కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులు, చేర్పులు చోటుచేసుకోవడంతో పాటు పేద విద్యార్థులకు ఎల్కేజీ విద్య భారంగా మారింది. ఈనేపథ్యంలో పేద విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు 0–6 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రాథమికంగా ఎల్కేజీ నుంచి విద్యాభ్యాసం చక్కగా అలవర్చుకునేందుకు అంగన్వాడీ కేంద్రాలు త్వరలో వేదిక కానున్నాయి. అంగన్వాడీలో ఎల్కేజీ విద్యాభ్యాసంతో పాటు యూకేజీ విద్యను కూడా ప్రారంభించేందుకు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులు గట్టిచర్యలు తీసుకుంటున్నారు. 1350కి పైగా కేంద్రాల్లో ఏర్పాట్లు జిల్లాలో బళ్లారి, సిరుగుప్ప, కురుగోడు, కంప్లి, సండూరు ఐదు తాలూకాల పరిధిలో దాదాపు 1350కి పైగా అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 0–6 ఏళ్ల లోపు చిన్నారులకు, గర్భిణులకు పౌష్టిక ఆహారాన్ని అందింస్తుండటంతో పాటు అరకొరగా ఏబీసీడీలు నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంగన్వాడీ కేంద్రాల నుంచే ఎల్కేజీ విద్యను అందిస్తే విద్యార్థుల బంగారు బాటకు దారులు ఏర్పడుతాయని అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 1350కి పైగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో తొలిదశలో 75 కేంద్రాల్లో ఎల్కేజీ విద్యాభ్యాసాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో బళ్లారి గ్రామీణ 23, సిరుగుప్ప 14, సండూరు 18, బళ్లారి నగర 20, అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్కేజీ విద్యను అందించేందుకు అధికారులు గుర్తించారు. వీరిలో 4–5 సంవత్సరాల లోపు వయస్సుగల చిన్నారులు 969, 5–6 సంవత్సరాల లోపు వయస్సుగల చిన్నారులకు ఎల్కేజీ విద్యను అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. త్వరలో ప్రారంభానికి సర్కార్ సన్నాహాలు చిన్నారులకు విద్యా బోధనకు గట్టి చర్యలు సిబ్బందికి తగిన శిక్షణకు చర్యలు అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్కేజీ, యూకేజీ విద్యను ప్రారంభించే నేపథ్యంలో అందులో పని చేసే సిబ్బందికి అందుకు సంబంధించిన శిక్షణను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 10వ తరగతి, పీయూసీ, డిగ్రీ పూర్తి చేసిన అంగన్వాడీ కార్యకర్తలకు అధికారులు తగిన శిక్షణను ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్కేజీ విద్యను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్ఈడీ టీవీ, ఆట సామగ్రి, సంబంధిత పుస్తకాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అధికారులు సూచిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్కేజీ, యూకేజీ విద్యను దశల వారిగా విస్తరిస్తామని తెలిపారు. ప్రస్తుతం 75 కేంద్రాల్లో ఎల్కేజీ విద్యా బోధన ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని, చిన్నారులకు ఇది ఎంతో ఉపయోగపడనుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. -
ఘనంగా గాంధీ జయంతి
రాయచూరు రూరల్ : నగరంలో మహాత్మా గాంధీ, లాల్బహద్దూర్ శాస్త్రి జయంతులను ఘనంగా ఆచరించారు. మహాత్మ గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. నగరసభభ అధ్యక్షురాలు నరసమ్మ, జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, నగరసభ ఉపాధ్యక్షుడు సమీర్, సభ్యులు జయన్న, బసవరాజ్, రవీంద్ర, శశిరాజ్ పాల్గొన్నారు. రైతు సమస్యలపై స్పందిస్తాంరాయచూరు రూరల్: ఇటీవల కురిసిన వర్షాలకు రాయచూరు గ్రామీణ ప్రాంతంలో వరదలకు నష్టానికి గురైన పంటలకు రైతులకు పరిహారం అందించడంపై సమీక్ష జరిపి సర్కార్, మంత్రులు స్పందిస్తారని గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ దద్దల్ పేర్కొన్నారు. శుక్రవారం రాయచూరు తాలూకా దేవసూగూరు, చిక్కసూగూరు, చంద్రబండ ప్రాంతాల్లో పత్తి పంటను పరిశీలించారు. రైతుల సమస్యలపై అధికారులు సత్వరం స్పందించాలని సూచించారు. సక్రమంగా సర్వే చేసి బాధిత రైతులకు పరిహారం అందించాలన్నారు. చెరువు అభివృద్ధి పనులపై సమీక్షరాయచూరు రూరల్ : నగరంలోని మావినకెరె చెరువు అభివృద్ధి పనులపై కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి సుభోద్ యాదవ్ సమీక్ష చేపట్టారు. శుక్రవారం కోట్లాది రూపాయలతో చేయనున్న చెరువు అభివృద్ధి పనుల గురించి అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. సిరవార, మాన్వి, మస్కి, కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. తల్లీబిడ్డల ఆస్పత్రిలో సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఆయన వెంట నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, జెడ్పీ అధికారి రోణ, సౌమ్యలున్నారు. అన్నదానం బళ్లారి అర్బన్: దేవీ శరన్నవరాత్రి దసరా పండుగను దాదాపు 11 రోజుల పాటు స్థానికులు ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా ఇక్కడి పటేల్ నగర్ వేంకటేశ్వర దేవస్థానం ఎదురుగా ఉన్న బన్ని మహంకాళమ్మ దేవస్థానంలో బాలాజీ యువక సంఘం అధ్యక్షుడు రాజేష్ ఆధ్వర్యంలో మహంకాళమ్మ దేవికి విశేష పూజలు, అన్నదానం చేశారు. వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ తాను, తమ బృందం గత 25 ఏళ్లుగా నవరాత్రి వేడుకల సమయంలో భక్తిశ్రద్ధలతో పూజలు జరిపి, విశేషంగా అన్నదానం చేపట్టామన్నారు. 20వ వార్డు పరిధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఈ నవరాత్రి వేడుకల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారన్నారు. తమ వార్డు కార్పొరేటర్ పేరం వివేక్ తమ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రత్యేక పూజలను నెరవేర్చారన్నారు. సంఘం ప్రముఖులు జీబీటీ రాజు, బీజీ చంద్ర, హులుగప్ప, దేవినగర్ శీన, రంగనాయకులు, రామాంజిని తదితరులు పాల్గొన్నారు. అహింసా మార్గమే గాంధీజీ ఆయుధం హొసపేటె: సత్యం, అహింస, సమానత్వాన్ని ప్రపంచానికి ప్రబోధించిన గొప్ప రాయబారి, గర్వించదగ్గ జాతిపిత మహాత్మాగాంధీ విశ్వ పురుషుడయ్యారని అసిస్టెంట్ కమిషనర్ పి.వివేకానంద అన్నారు. గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయ సభామందిరంలో నిర్వహించిన మహాత్మా గాంధీ, లాల్బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. బ్రిటిష్ వారిపై అహింసాయుతంగా పోరాడి దేశాన్ని బానిసత్వం నుంచి విముక్తి చేసిన గొప్ప యోధుల్లో ఒకరైన మహాత్మా గాంధీజీ తన సిద్ధాంతాలతో ప్రపంచమంతటా అహింసను వ్యాపింపజేయడం ద్వారా మహాత్ముడయ్యాడన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి త్యాగం, ఆత్మగౌరవం ఆదర్శప్రాయమైనవి. ఈ ఇద్దరు మహానుభావుల తత్వాలను నేటి యువత స్వీకరించాలి అని అన్నారు. టీబీ డ్యాం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.నారాయణ, జిల్లాధికారి కార్యాలయ ఆడిటర్ శ్రీనివాస్, సమాచార శాఖ సిబ్బంది రామాంజనేయ, అశోక్ ఉప్పర, తాయేష్, తిప్పేష్, దేవరాజ్, కృష్ణస్వామి, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
క.క.లో భారీ వర్షాలు.. పంటల సాగు కుదేలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాల్లో ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం రంగంపై వరుణ దేవుడు కక్ష కట్టాడు. భారీ వర్షాలు కురిసి పంటలు నీట మునిగి కుళ్లిపోయాయి. చేతికొస్తున్న పంటలు నీట మునిగి రైతుల జీవనోపాధికి మట్టికొట్టినట్లయింది. రాయచూరు, యాదగిరి, బీదర్, కలబుర్గి జిల్లాల ప్రజలు ప్రతి ఏడాది ఏదో ఒక సాకుతో వ్యవసాయం కుదేలు కావడంతో రైతులను కదిలిస్తే కళ్లలో కన్నీరు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు అధికమై వేలాది ఎకరాల్లో పంటలను పీకివేశారు. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలకు 200 ఇళ్లు కుప్పకూలాయి. వేలాది ఎకరాల్లో పెసలు, మినుములు, కంది, పత్తి పంటలు నీట మునిగాయి. మరో వైపు కురిసిన వానలకు ప్రధాన రహదారులు కోతకు గురయ్యాయి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను సర్కార్ ఆదుకోవాలని రైతు సంఘం అధ్యక్షుడు శివార్జున నాయక్ డిమాండ్ చేశారు. ఎడతెరిపి లేకుండా అకాల వర్షాలు పడినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రాజకీయాలు తప్ప రైతు ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేల్కొని అన్నదాతలను ఆదుకోవాలన్నారు. వ్యవసాయ రంగానికి వరుణదేవుడి శాపం వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగిన వైనం -
బీమా సొమ్ము కోసం అమాయకుడి బలి
హొసపేటె: రూ.5.20 కోట్ల బీమా సొమ్ము కోసం అమాయకుడిని చంపి, ప్రమాదంగా చిత్రించిన ఘటన నగర శివార్లలో గత నెల 28న జరిగిందని విజయనగర జిల్లా ఎస్పీ జాహ్నవి తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ విషయంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి ఆరుగురిని అరెస్టు చేశారన్నారు. మృతుడిని హొసపేటె కౌల్పేటె నివాసి గంగాధర్(35)గా గుర్తించారన్నారు. ఆరుగురు నిందితులైన కొప్పళ జిల్లా హొసలింగాపుర గ్రామంలో టింకరింగ్ పని చేస్తున్న రవి గోసంగి, హొసపేటె నగరంలోని 29వ వార్డు భగత్సింగ్నగర్ నివాసి పి.అజయ్, కిళ్లీ కొట్టు యజమాని రియాజ్, నగర యాక్సిస్ బ్యాంక్ సీనియర్ లోన్ సెక్షన్ మ్యాన్, బడావణె వీధి నివాసి ఆర్వై యోగరాజ్ సింగ్, కొప్పళ జిల్లా గంగావతి నగరంలోని ప్రభుత్వ పీయూ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కృష్ణప్ప, భగత్సింగ్నగర నివాసమంటున్న హులిగమ్మలను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. మృతుడి పేరున రూ.కోట్లాది పాలసీలు నేరస్తులు మృతుడు గంగాధర్ పేరుతో రూ.5.20 కోట్ల వరకు బీమా పాలసీలను చేయించారన్నారు. ఈ డబ్బును పొందాలనే కోరికతో వారు హత్యకు కుట్ర పన్నారన్నారు. మొదట వారు అతన్ని హొసపేటె సమీపంలోని మునిరాబాద్లో చంపి, ఆపై హొసపేటె శివార్లలోని జంబునాథహళ్లి గ్రామానికి వెళ్లే హెచ్ఎల్సీ రహదారికి తీసుకువచ్చారు. వారు ఒక సెకండ్ హ్యాండ్ ఎక్సెల్ బైక్ అద్దెకు తీసుకొని, అతన్ని దానిపై ఎక్కించుకుని కారుతో ఢీకొట్టారు. దానిని ప్రమాదంగా చిత్రీకరించి పారిపోయారు. మృతుడి భార్య ఈ విషయంపై హొసపేటె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పక్షవాతంతో బైక్ నడపలేడు మృతుడికి పక్షవాతం సోకి కాళ్లు, చేయి సరిగా పని చేయవని, తన భర్తకు బైక్ నడపడం రాదని పోలీసులకు తెలిపిందన్నారు. ఒక వేళ ప్రమాదం జరిగి ఉంటే బైక్ తాళంచెవి కారులోనే ఉండి ఉండాలి లేదా నేల మీద ఉండాలి అయితే తాళంచెవి సైడ్ బ్యాగ్లో ఎందుకు ఉంది? అని అనుమానిస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన కారు, బైక్ను కూడా వారు స్వాధీనం చేసుకున్నారన్నారు. అదనపు ఎస్పీ మంజునాథ్, డీఎస్పీ మంజునాథ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హులిగప్ప, టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లఖన్ ఆర్ మసగుప్పి తదితరులు పాల్గొన్నారు. రూ.5.20 కోట్ల కోసం హత్య చేసిన నిందితులు ప్రమాదంగా చూపించడానికి ప్రయత్నించిన ముఠా వాహనం తాళంచెవి ఆధారంగా నిందితుల గుర్తింపు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు -
ముంపు నివారణ పనులు పూర్తి చేయండి
బనశంకరి: బెంగళూరు తూర్పు నగరపాలికె పరిధిలోని సాయిలేఔట్ వద్ద రైల్వేవెంట్ ఇరుకుగా ఉండటంతో రాజకాలువనీరు సజావుగా ముందుకు వెళ్లలేక సాయిలేఔట్ పరిసరాల్లో ముంపు పరిస్థితులు తలెత్తుతున్నాయి .దీంతో రూ.13.36 కోట్లతో రైలు పట్టాల కింద 6 మీటర్ల వెడల్పు, 4.5 మీటర్ల ఎత్తులో రెండు బల్క్ కాస్టింగ్ పనులు చేపట్టారు. గ్రేటర్ కమిషనర్ మహేశ్వర్రావ్ శుక్రవారం పరిశీలించారు. డిసెంబర్లోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హెణ్ణూరు–బాగలూరు రోడ్డులో వైట్టాపింగ్ పనులను పరిశీలించారు. సాయిలేఔట్లో బ్లాక్స్పాట్లను తొలగించాలని ఆదేశించారు. -
జ్వరమని వెళ్తే ప్రాణమే బలి
వికటించిన ఆర్ఎంపీ వైద్యం మాలూరు: జ్వరంతో బాధపడుతున్న బాలికకు ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి మృత్యువాత పడింది. కోలారు జిల్లా మాలూరు తాలూకా రాజేనహళ్లి గ్రామ పంచాయతీ దొడ్డిగ్గలూరు గ్రామానికి చెందిన తానవి (8) మృతురాలు. బాలిక తల్లిదండ్రులు మాలూరు ఠాణాలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. బాలికకు జ్వరం రాగా సంతెహళ్లిలోని ఓ ఆర్ఎంపీ కి చూపించారు. అతడు ఇంజెక్షన్ ఇచ్చి, కొన్ని మందులు రాసిచ్చాడు. సూది వేసిన చోట రక్తం గడ్డ కట్టి కందిపోయింది. బాలిక విపరీతమైన నొప్పితో రెండు రోజులు బాధ పడింది. బాలిక ఆరోగ్యం దిగజారిపోడాన్ని గమనించిన పోషకులు మాలూరు పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స ఫలించక బాలిక గురువారంనాడు మరణించింది. నకిలీ వైద్యుడే కారణమని తెలిపారు. కాగా, సదరు ఆర్ఎంపీ పరారీలో ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐదేళ్లూ కుర్చీలో ఉంటా: సీఎం మైసూరు: ఐదేళ్లు నేనే సీఎం, ఇందులో రెండవ మాట లేదు, వచ్చే ఏడాది కూడా నేనే మైసూరు శక్తిదేవత చాముండేశ్వరి అంబారీకి ముఖ్యమంత్రిగా పుష్పాభిషేకం చేస్తాను అని సీఎం సిద్దరామయ్య చెప్పారు. మైసూరు దసరా వేడుకల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. నవంబర్లో విప్లవం వస్తుంది, తన పదవి పోతుందని బీజేపీ నాయకులు చెప్పేది నిజం కాదన్నారు. ఐదు సంవత్సరాలూ పదవిలో ఉంటాను, హైకమాండ్ చెప్పే మాటకు అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. హైకమాండే శిరోధార్యం ● త్వరలో 700 పదవుల పంపిణీ: డీసీఎం శివాజీనగర: హైకమాండ్ ఏమి చెబుతుందో దానిని పాటిస్తామని సీఎం సిద్దరామయ్య చెప్పారని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. కేపీసీసీ ఆఫీసులో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఆచరించి మాట్లాడారు. ఆరోపణలు మాసిపోతాయి, పనులు మిగులుతాయి. చాలా విషయాలు మాట్లాడాలి. దసరా అయిపోగానే మాట్లాడుతానని, ఎక్కడ శ్రమ ఉందో అక్కడ ఫలితం ఉందని డీకే వేదాంతం వల్లించారు. సుమారు 600–700 బోర్డులు, కార్పొరేషన్ల డైరెక్టర్ల పదవుల జాబితా సిద్ధమైంది, నేను– సీఎం మాట్లాడి రెండు మూడురోజుల్లో ప్రకటిస్తామన్నారు. వారు రెండేళ్లయిన తరువాత రాజీనామా చేయాలి. మేమందరం అధికారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం విశేషం. తమ గ్యారంటీలను బీజేపీ వారు కాపీ కొట్టారని హేళన చేశారు. కుర్చీ గురించి మాట్లాడితే నోటీసు సీఎం కుర్చీ పంపిణీ గురించి నేను మాట్లాడలేదు. దీని మీద చర్చించాల్సిన పని లేదు అన్నారు. శివరామేగౌడ, రంగనాథ్ మాత్రమే కాదు, అధికార పంపిణీ గురించి ఎవరు మాట్లాడినా పార్టీ నుంచి నోటీస్ వస్తుందన్నారు. శిరాడిఘాట్లో ట్రాఫిక్ జామ్ దొడ్డబళ్లాపురం: దసరా వరుస సెలవులు రావడంతో రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలు జనంతో కిటకిటలాడాయి. వేలాదిగా కార్లు, మినీ బస్సుల్లో యాత్రలు కట్టారు. ఇక సెలవులు ముగియడంతో శుక్రవారంనాడు తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారుజాము నుండే హాసన్ జిల్లాలో సకలేశపుర వద్ద శిరాఢి ఘాట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేల సంఖ్యలో వాహనాలు మంగళూరు, ఉడుపి, ధర్మస్థల తదితర ప్రదేశాల నుంచి బెంగళూరుకు వస్తుండడంతో కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి. ప్రయాణికులు గంటల కొద్దీ రోడ్లపై చిక్కుకుపోయారు. రద్దీ నివారణకు స్థానిక పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. -
జంబూసవారీ.. మహోజ్వలం
కన్నడనాట సాంస్కృతిక పరంపరగా భాసిల్లుతున్న, చరిత్రాత్మక నాడ హబ్బ మైసూరు దసరాలో ముఖ్యఘట్టమైన జంబూ సవారీ వేడుక నేత్రపర్వంగా జరిగింది. లక్షలాది ప్రజలు, భక్తుల మధ్య గజరాజుపై స్వర్ణ అంబారీలో నాడదేవత చాముండేశ్వరి మాత మైసూరు నగర విహారం గావించారు. శకటాలు, భేరీ నాదాలు, జానపద నృత్య వైభవం మిన్నంటింది. చూసిన కనులదే భాగ్యమనేలా అమ్మవారి యాత్ర సాగింది. నగర వీధుల గుండా సాగుతున్న గజ యాత్రమైసూరు: రాచనగరి వీధుల్లో జంబూసవారీ మహోత్సవం గురువారం అత్యంత ఆర్భాటంగా జరిగింది. రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచీ మైసూరుకు తరలివచ్చిన లక్షలాది మంది దసరా ఉజ్వల వైభవాన్ని వీక్షించి ఆనంద పరవశులయ్యారు. ఒకవైపు గజరాజుల దళం, అశ్వాలు, డోలు వాయిద్యాల సంభ్రమం, ఆకర్షణీయమైన శకటాలు.. ఇంకా అనేక విశేషాలతో కూడిన జంబూ సవారీ అమోఘం అనే మాదిరిగా జరిగింది. మధ్యాహ్నం నుంచి.. మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, మైసూరు ఎంపీ యదువీర్, మంత్రి మహాదేవప్ప, జిల్లాధికారి లక్ష్మికాంత్రెడ్డి సంప్రదాయంగా నంది ధ్వజానికి పూజలు చేశారు. తరువాత జానపద కళాకారుల ఊరేగింపును ప్రారంభించారు. ఈ సమయంలో ప్యాలెస్ నుంచి నిశాని ఏనుగు ధనుంజయ ముందుకు సాగింది. గోపి, మహేంద్ర, శ్రీకంఠ, లక్ష్మి, కంజన్, భీమా, ఏకలవ్య, ప్రశాంత, సుగ్రీవ, హేమావతి ఏనుగులతో కలిసి కెప్టెన్ అభిమన్యు తరలింంది. 59 శకటాలు, 75 కళాబృందాలు ముందుకు సాగాయి. బంగారు అంబారీలో చాముండేశ్వరి మాత మైసూరు విహారం నేత్రపర్వంగా మైసూరు దసరా సంభ్రమం అంబారీ సవారీ యాత్ర ఇలా.. సాయంత్రం 4:42 గంటల నుంచి కుంభ లగ్నంలో బంగారం అంబారీలో ప్రతిష్టించిన శక్తి దేవత చాముండేశ్వరి దేవితో అభిమన్యు ఏనుగుకు సీఎం, మంత్రులు పూలు చల్లి పూజలు చేసి జంబూసవారీకి నాంది పలికారు. గుర్రాల దళం వెంట రాగా ఏనుగులు నగర విహారానికి శ్రీకారం చుట్టాయి. కోటె మారమ్మదేవాలయం వద్ద 21 రౌండ్లు తుపాకులు, కుశాలతోపులో ఫిరంగులు పేలాయి. నగర పోలీసు వాద్య బృందం రాష్ట్ర గీతంతో గౌరవవందనం అందించారు. ఆపై అభిమన్యు, మిగతా ఏనుగులు సంతోషంతో తొండాలు ఎత్తి ధన్యవాదాలు తెలిపాయి. లక్షలాది ప్రజానీకం రోడ్లకు అటుఇటు ఉండి, చెట్లు, భవంతుల మీద నుంచి జంబూసవారీని తిలకించారు. సవారీ సుమారు ఐదున్నర కిలోమీటర్ల దూరం సాగి బన్నిమంటపకు చేరింది. అప్పుడప్పుడు జల్లులు పడ్డాయి. తోసుకువస్తున్న జనాన్ని పోలీసులు లాఠీలతో అడ్డుకున్నారు. ప్రభుత్వ శాఖల శకటాలు అలరించాయి. అవయవదానాన్ని చాటేలా హీరో పునీత్ ప్రతిమతో ఆరోగ్యశాఖ శకటం ఆకట్టుకుంది. -
నాన్నా.. నువ్వు రా..
శివమొగ్గ: పండుగ వేళ తల్లీ కుమార్తె అనుమానాస్పద రీతిలో మరణించారు. వేట కొడవలితో నరికిన రీతిలో కుమార్తె మృతదేహం, ఉరికి వేలాడుతూ తల్లి దేహం ఉన్నాయి. ఈ దుర్ఘటన శివమొగ్గ నగరంలోని మెగ్గాన్ ఆస్పత్రి క్వార్టర్స్లో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మెగ్గాన్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్న రామన్న భార్య శృతి (38), 6వ తరగతి చదివే కుమార్తె పూర్విక (12) కుటుంబం జీవిస్తోంది. 10:30కు తండ్రికి చిన్నారి ఫోన్ రామన్న సాయంత్రం గురువారం రాత్రి డ్యూటీకి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఎంత పిలిచినా తలుపులు తెరవలేదు. చుట్టుపక్కలవారి సహకారంతో తలుపులను విరగ్గొట్టి వెళ్ళి చూడగా కూతురు రక్తపుమడుగులో ఉంది, భార్య ఉరికి వేలాడుతోంది. కొడవలితో ఆమె పాపను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలున్నాయి. రామన్న బోరుమంటూ విలపించాడు, కాగా, తన భార్యకు కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేదని, చికిత్స కూడా చేయిస్తున్నట్లు చెప్పాడు. రాత్రి 10:30 సమయంలో తన కూతురు ఫోన్ చేసిందని, తల్లి విచిత్రంగా ప్రవర్తిస్తోందని, భయంగా ఉందని చెప్పిందన్నాడు. తాను కూతురికి నచ్చజెప్పానని, తాను వెళ్లి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని రోదించాడు. దొడ్డపేటె పోలీసులు పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. ఈ సంఘటనతో మెగ్గాన్ క్వార్టర్స్లో భయం, విషాదం అలముకొంది. తండ్రికి కూతురి ఫోన్కాల్ కొంతసేపటికే తల్లి చేతిలో పాప హత్య, తల్లి ఆత్మహత్య శివమొగ్గలో విషాద ఘటన -
విషాదం: తల్లీ కూతుళ్ల అనుమానాస్పద మృతి
బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. తల్లీ కూతుళ్లు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శివమొగ్గలోని ప్రభుత్వ ఆసుపత్రి నర్సుల క్వార్టర్స్లో జరిగింది. ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న శ్రుతి(38) తన కూతురు పూర్విక(12)ని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శృతి భర్త రాత్రి షిఫ్ట్ ముగించుకుని ఇంటికి తిరిగి రాగా, తలుపు లోపల గడియ పెట్టి ఉంది.దీంతో అతను పొరుగువారి సాయంతో తలుపును పగలగొట్టి చూడగా ఈ దారుణం వెలుగు చూసింది. ఆరో తరగతి చదువుతున్న కూతురు పూర్విక తలకు గాయాలతో పడి ఉంది. పూర్విక మృతదేహం పక్కనే శృతి ఉరివేసుకుని కనిపించింది. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం శృతి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులు..
భర్త పెట్టిన చిత్రహింసలను మౌనంగా భరించింది. మానసికంగా, భౌతికంగా హించించినా ఓర్చుకుంది. పరాయి మహిళలతో తన పెనిమిటి పాడు సంబంధాలు పెట్టుకున్నా ఊరుకుంది. కానీ పరాయి మగాళ్ల కోరిక తీర్చాలని తనను భర్త ఒత్తిడి చేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. భర్తకు తోడు అతడి కుటుంబ సభ్యులు కూడా గలీజు పనులు చేయమని పోరు పెట్టడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని పుట్టెనహళ్లిలో (Puttenahalli) వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం.. 2024, డిసెంబర్లో సయ్యద్ ఇనాముల్ హక్ అనే వ్యక్తితో బాధితురాలికి పెళ్లి జరిగింది. వివాహ సమయంలో 340 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక యమహా బైక్ను ఇచ్చారు. పెళ్లైన కొద్దిరోజులకే వరుడి అసలు రూపం బయటపడింది. అతడికి అప్పటికే పెళ్లయిందని, తాను రెండో భార్యనని తెలిసి బాధితురాలు హతశురాలయింది. అంతేకాదు తనకు 19 మంది పరాయి మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయని స్వయంగా భర్త చెప్పడంతో ఆమె నిశ్చేష్టురాలయింది.అతడి ఆగడాలు అక్కడితో ఆగలేదు. బెడ్రూంలో సీక్రెట్ కెమెరా (Secret Camera) పెట్టి రికార్డు చేసిన వీడియోలను విదేశాల్లోని తన స్నేహితులకు పంపించాడని బాధితురాలు వెల్లడించింది. వారితో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని, తాను ఒప్పుకోకపోవడంతో.. ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించినట్టు పోలీసులకు ఆమె తెలిపింది. ఇంటా, బయట తనను పదేపదే చిత్రహింసలకు గురిచేశాడని వాపోయింది.ఫ్లాట్ (Flat) కొనడానికి తన బంగారు నగలను అమ్మమని అతడు ఒత్తిడి తెచ్చాడని, తాను నిరాకరించడంతో తనపై దాడి చేశాడని ఆమె చెప్పింది. అత్తమామలతో పాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 21న బాధితురాలిపై దాడి చేసి నిందితుడు పారిపోయాడు. అతడితో పాటు కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు ఇంకా పట్టుబడలేదని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని, అతడి బారి నుంచి మహిళలను కాపాడాలని పోలీసులను బాధితురాలు ప్రాధేయపడింది.చదవండి: 'నా కుమారుడిని వదలనంటున్న లేడీ గాడ్సే' -
పాము కడుపులో ప్లాస్టిక్ బాటిల్.. ఎలా బయటకు వచ్చిందో చూశారా?
ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్ని మింగేస్తున్న భయంకరమైన ముప్పు. ఇది మనకెప్పుడో తెలుసు, అయినా మన చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అయితే మనిషి నిర్లక్ష్యం ప్రకృతిలోని మిగతా జీవుల ప్రాణాలకూ ముప్పుగా మారుతోంది. తాజాగా కర్ణాటక చిత్రదుర్గలో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే మీరూ అయ్యో పాపం అనుకుంటున్నారు. 2025 సెప్టెంబర్ 16న కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా కల్లహళి గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఓ పాడుబడిన ఇంట్లో ఆరడుగుల పాము కదల్లేని స్థితిలో అవస్థలు పడుతూ కనిపించింది. అది విషపూరిత కేరు హావు సర్పం (రసెల్ వైపర్) కావడంతో గ్రామస్తులు స్థానికంగా ఉండే ఉరగప్రేమి(స్నేక్ క్యాచర్) ‘స్నేక్ శివు’కి సమాచారం అందించారు. ఆయన దానిని చాకచక్యంగా పట్టుకున్నాడు. అయితే.. దాని పొట్ట భాగం ఉబ్బిపోయి కనిపించడంతో దాని ఆ అవస్థకు అదే కారణమని గుర్తించారు. వెంటనే.. చిత్రదుర్గ పశువైద్య ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వాళ్లు చేతులెత్తేయడంతో.. దానిని బెంగళూరులోని “పీపుల్ ఫర్ అనిమల్స్” (People For Animals) ఆసుపత్రికి తరలించాడు స్నేక్ శివు. అక్కడ దాని కడుపులో ప్లాస్టిక్ బాటిల్ ఉన్నట్లు గుర్తించారు(Plastic Bottle in Snake Stomach). వెటర్నిటీ డాక్టర్లు డా. నవాజ్ షరీఫ్, డా. మాధవ్ బృందం అక్టోబర్ 2వ తేదీన అరుదైన శస్త్రచికిత్స నిర్వహించింది. సుమారు రెండు గంటలు శ్రమించి.. సర్జరీ చేసి దాని పొట్ట నుంచి బాటిల్ను తొలగించింది. అది ఒక సన్స్క్రీన్ లోషన్ బాటిల్ అని, ఆ బాటిల్ కారణంగా దాని పేగు తెగిపోయి కదల్లేని స్థితిలో.. ప్రాణాంతక పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడిందని తెలిపారు. ప్రస్తుతం పాము అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుందని, అది కోలుకునేందుకు 15 రోజుల సమయం పడుతుందని వారు అంటున్నారు. ఆ తర్వాతే దానిని సమీపంలోని అడవిలో వదిలిపెడతామని తెలిపారు. పామును రక్షించిన స్నేక్ శివుపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. ఇదీ చదవండి: ఒక్కో మెట్టు.. ఆరోగ్యం సూపర్ హిట్టూ! -
కాలం చెల్లిన ఔషధాలు విక్రయిస్తే చర్యలు
రాయచూరు రూరల్: నేటి ప్రపంచంలో ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారు. ప్రజలకు మందుల వాడకంపై అవగాహన కల్పించాలని జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయంలో పార్మాసిస్టులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో అధికమైన ఔషధాల వినియోగంపై వివరించారు. కాలం చెల్లిన ఔషధాలను విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యుల సలహా మేరకు రోగులకు మందులు, మాత్రలు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు గణేష్, శాఖిర్, ఉదయ కిశోర్, నందిత, చంద్రశేఖరయ్య, శివకుమార్, ప్రకాష, ఈశ్వర్, బసయ్య, హజీ మలంగ, కవిత, వెంకటేష్, మురళి పాల్గొన్నారు. మారెమ్మ దేవి ఆలయ ద్వారం ప్రారంభంహొసపేటె: దసరా ఉత్సవాల్లో భాగంగా డ్యాం రోడ్డులోని మారెమ్మ దేవి ఆలయ ముఖద్వారాన్ని ఎమ్మెల్యే గవియప్ప కుమారుడు విరుపాక్ష బుధవారం ప్రారంభించారు. రూ.కోటి నిధులతో ముఖ ద్వారం నిర్మాణం చేపట్టామన్నారు. కార్యక్రమంలో తలవార కేరి పెద్దలు కంప్లి కనిమప్ప గుజ్జల కణిమప్ప చంద్రశేఖర్ కటిగి జంబయ్య బెలగోడ అంబన్న తళవార హనుమంత, నగర పాలక సంస్థ మాజీ అధ్యక్షుడు గుజ్జల నింగప్ప, గుజ్జల హులుగప్ప పూజారి, దురుగప్ప పాల్గొన్నారు. ఆకట్టుకున్న కవిగోష్టి రాయచూరురూరల్: నాడ హబ్బా దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి సాంస్కృతిక ఉత్సవాలకు నగర సభ అధ్యక్షురాలు నరసమ్మ శ్రీకారం చుట్టారు. మక్కా దర్వాజలో నగర సభ, జిల్లా పాలనా యంత్రాంగం, కన్నడ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బహుభాషా కవి గోష్టిని ప్రారంభించారు. ఈ సందర్భంగ ఆమె మాట్లాడుతూ.. మన సంస్కృతిని సంరక్షించడం మనందరి కర్తవ్యం అన్నారు. కార్యక్రమంలో నగర సభ సభ్యులు జయన్న, కమిషనర్ విజయలక్ష్మి, సత్యనారాయణ పాల్గొన్నారు. కారు అద్దాలు ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్ హోసూరు: మద్యం మత్తులో కారు అద్దాలను ధ్వంసం చేసిన వ్యక్తిని హడ్కో పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు హోసూరు కార్పొరేషన్ పరిధిలోని వసంత్ నగర్ ప్రాంతానికి చెందిన రైతు నందకుమార్, అలసనత్తం ప్రాంతానికి చెందిన సిమెంట్ వ్యాపారి కుబేరన్ మిత్రులు. మూడు రోజుల క్రితం కుబేరన్ తన మిత్రులతో కలిసి మద్యం మత్తులో నందకుమార్ ఇంటి వద్దకు వెళ్లాడు. నందకుమార్కు చెందిన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు హడ్కో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కుబేరన్ను అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు జరుపుతున్నారు. పెట్టుబడి పేరుతో కుచ్చుటోపీ ● ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి నుంచి రూ.45.82 లక్షలు కొల్లగొట్టిన సైబర్ దుండగులు హోసూరు: పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని నిమ్మించి రూ.45.82 లక్షలు కొట్టేసిన సైబర్ దొంగల కోసం క్రిష్ణగిరి క్రైం బ్రాంచ్ పోలీసులు గాలిస్తున్నారు. వివరాల మేరకు జిల్లా కేంద్రం క్రిష్ణగిరికి చెందిన 58 ఏళ్ల ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి సెల్ఫోన్కు కొద్ది రోజుల క్రితం ఓ మెసేజ్ వచ్చింది. ఈ వెబ్సైట్ లింక్ ద్వారా పూర్తి వివరాలు నమోదు చేసుకుని పెట్టుబడి పెడితే రెండింతల లాభం వస్తుందని సైబర్ మోసగాళ్లు తెలిపారు. అధిక డబ్బు వస్తుందని ఆశపడిన ఉద్యోగి తన వద్ద ఉన్న రూ.45.82 లక్షలను వివిధ బ్యాంకు ఖాతాలకు జమ చేశాడు. రోజులు గడిచినా లాభం అందకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే క్రిష్ణగిరి క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సైబర్ దొంగల కోసం గాలిస్తున్నారు. -
కనకదుర్గా పాహిమాం
●నేడు రావణ దహనం బళ్లారి అర్బన్: విజయ దశమి వేడుకలను నగరంలోని ఆయా ఆలయాల్లో కనుల పండుగలా జరుపుకున్నారు. బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్, వివిధ దుకాణాల్లో ఆయుధ పూజ నిర్వహించారు. విజయదశమి రోజున బన్ని చెట్టుకు పూజలు నిర్వహించి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే విజయాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. 9 రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో అమ్మవారి శక్తి పీఠాలను ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించామని దేవస్థాన ఈఓ హనుమంతప్ప, ధర్మకర్త పూజారి గాదెప్ప తెలిపారు. జిలాన్ బాషా, అభిషేక్, బృందం ఆధ్వర్యంలో సాంస్కృతిక నృత్యాలు నిర్వహించారు. ఈ ఏడాది భక్తులకు పార్కింగ్ సౌకర్యం, క్యూ లైన్లు, మహిళలు దీపాలు వెలిగించేందుకు, టెంకాయలు కొట్టె స్థలం ఏర్పాట్లు చేశారు. ఆలయం చుట్టూ నాలుగు రాజ గోపురాలను విద్యుత్ దీపాలతో అలకరించారు. -
జయ జయ మహిషాసుర మర్దినీ
బళ్లారి అర్బన్: దసరా శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు బుధవారం నగరంలోని వివిధ ఆలయాల్లో అమ్మవార్లు మహిషాసుర మర్దినీ దేవిగా దర్శనమిచ్చారు. పటేల్ నగర్ చిన్నదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్ధిని, హవంబావి సీతారామ ఆశ్రమంలో మహకాళికా దేవిగా, బెంగళూరు రోడ్డు కన్యకా పరమేశ్వరి దేవస్థానం సంతాన లక్ష్మీ ఆలయ ప్రాంగణంలో గాయత్రి దేవి అలంకరణ, నగరేశ్వరి ఆలయంలో మహిషాసుర మర్దినీ, బెంకి మారెమ్మ ఆలయంలో మహకాళి అలంకరణ, మిల్లర్పేట్ మల్నాడు దుర్గమ్మ ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్దిని భక్తులకు దర్శనమిచ్చారు. సిరుగుప్ప రోడ్డు తొలిజ భవానికి యల్లమ్మ దేవి అలంకరణ, ఏళ్లు మక్కళతాయమ్మ ఆలయం, ఫైల్ ఆఫీసు ఆదిశక్తి ఆలయం, దేవినగర్ రేణుకా యల్లమ్మ ఆలయం, కొళ్లాపుర మహాలక్ష్మి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అమ్మవార్లకు విశేష పూజలు రాయచూరు రూరల్: నగరంలోని కిల్లే బ్రహన్మఠంలో అంభా భవాని మాతకు వెండి అలకరించి ప్రత్యేక పూజలు జరిపారు. కందగడ్డ మారెమ్మ దేవి, కోటలోని కాళికా దేవిని ప్రత్యేకంగా అలంకరించారు. రాత్రి పల్లకీ సేవ నిర్వహించారు. నగరేశ్వరాలయం, ఉప్పారవాడి లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం, కన్యకా పరమేశ్వర ఆలయంలో అశ్వ వాహనంలో అమ్మవారిని ఊరేగించారు. అంబ దేవాలయంలో చండీ హోమం నిర్వహించారు. కిల్లేరి మఠంలో శాంతమల్ల శివాచార్యులు బాల ముత్తయిదువులకు ఒడి బియ్యం అందజేశారు. విశేష అలంకరణలో చిన్నదుర్గమ్మ, కాళికా దేవి, బాల మారెమ్మ, హుబ్లీలో దుర్గామాత -
రైతుల సమస్యలపై స్పందించరా?
రాయచూరు రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయచూరు జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. పంట పొలాల్లోకి నీరు ప్రవహించడంతో కుళ్లిపోయాయి. రైతులకు అందజేసే పరిహారంపై సర్కారు, మంత్రులు స్పందించడం లేదని విధాన పరిషత్ ప్రతిపక్ష నాయకుడు నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాయచూరు తాలూకా గుంజల్లి వద్ద వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. రైతుల సమస్యలపై మంత్రులు స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. పంటలకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ పదాదికారులు వీరన గౌడ, రవీంద్ర, ఆంజనేయులు, రాఘవేంద్ర, అచ్యుత రెడ్డి పాల్గొన్నారు. పరిహారం ప్యాకేజీ ప్రకటించాలి.. రాయచూరు రూరల్: మహరాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, బీమా నదులు పొంగాయి. కలబుర్గి, యాదగిరి, బీదర్ జిల్లాల నదీ తీర ప్రాంతాల్లో ప్రజల రక్షణ, పరిహార సమీక్షను సీఎం సిద్దరామయ్య ఆకాశంలో తిరుగుతూ చేస్తారా అని విధాన పరిషత్ ప్రతిపక్ష నాయకుడు నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. బుధవారం రాయచూరులో మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్ నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.3 వేల కోట్ల పరిహారం ప్యాకేజీ ప్రకటించాలన్నారు. ఈ విషయంలో కేంద్రం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించి ఆపన్న హస్తం అందించడం జరుగుతుందన్నారు. అత్యవసరంగా రాష్ట్ర సర్కార్ రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో శాసన సభ్యుడు శివరాజ పాటిల్, పదాధికారులు వీరన గౌడ, రవీంద్ర, ఆంజనేయులు, రాఘవేంద్ర, అచ్యుత రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కులగణన సిబ్బందికి సన్మానం
కోలారు: జిల్లాలో సామాజిక కుల సర్వే 35 శాతం పూర్తయిన సందర్భంగా సిబ్బందిని కలెక్టర్ ఎం ఆర్ రవి అభినందించారు. ప్రతి తాలూకాలో 10 వేల ఇళ్లను ప్రతినిత్యం సమీక్ష నిర్వహించడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా సమీక్ష నిర్వహిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన 7వ తేదీ లోగా సమీక్షను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఎదురవుతున్న సాంకేతిక, ఇతర సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. పలుచోట్ల ప్రభుత్వ కట్టడాలలో శిబిరాలను ఏర్పాటు చేసి కులగణన చేస్తున్నట్లు తెలిపారు. జడ్పీ సీఈఓ ప్రవీణ్ పి బాగేవాడి, డిప్యూటీ కలెక్టర్ ఎస్ ఎం మంగళ తదితరులు పాల్గొన్నారు. -
విమానాశ్రయంలో దసరా సంబరాలు
దొడ్డబళ్లాపురం: దసరా నేపథ్యంలో కెంపేగౌడ ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రయాణికులను అలరించాయి. దేశ, విదేశీ ప్రయాణికులకు మైసూరులో జరిగే దసరా ఉత్సవాలను కళ్లకు కట్టినట్టు చూపేందుకు విమానాశ్రయ అధికారులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. రెండు టర్మినల్స్లోనూ గత నెల 22 నుండి దసరా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. రోజూ ఒక సాంస్కృతిక, సంగీత విభావరీ ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఆనందాన్ని పంచుతున్నారు. విమానాశ్రయ మహిళా సిబ్బందికి ముగ్గుల పోటీలు నిర్వహించారు. -
ఆగి ఉన్న లారీని బస్సు ఢీ..
● నలుగురికి గాయాలు కనగానపల్లి: అనంతపురం సమీపంలో కనగానపల్లి వద్ద పర్వతదేవరపల్లి సమీపంలో బెంగళూరు–హైదరాబాద్ 44వ హైవేలో బుధవారం ఐచర్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వివరాలు.. బెంగుళూరు నుంచి ఆదోని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రహదారిపై పక్కనే ఆగి ఉన్న ఐచర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న గౌస్, వంశీ, పరుశురామ్, పురుషోత్తం గాయపడ్డారు. వీరిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరిలో రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడిన గౌస్ను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడమే కారణమని ప్రయాణికులు ఆరోపించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రమాదంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. జిమ్ ట్రైనర్పై రాడ్లతో దాడి బనశంకరి: జిమ్లోకి చొరబడిన ఐదుగురు ట్రైనర్పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆనేకల్ పట్టణ నివాసి సందీప్ హెబ్బగోడి అనంతనగర రిప్డ్ జిమ్లో ట్రైనర్గా ఉన్నాడు. అనుషా అనే యువతి జిమ్లో సందీప్ వద్ద శిక్షణ పొందుతోంది. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి వాట్సాప్లో చాటింగ్ చేసుకునేవారు. యువతి సోదరులు గౌతమ్, అరుణ్లు ఆమె మొబైల్ పరిశీలించారు. తన మొబైల్ హ్యాక్ అయినట్లు అనుషా పేర్కొంది. అనంతరం అరుణ్, గౌతమ్, మరో ముగ్గురు జిమ్లోరి చొరబడి సందీప్పై రాడ్తో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సందీప్ను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. దాడి దృశ్యాలు జిమ్లోని సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. హెబ్బగోడి పోలీస్స్టేషన్లో ఐదుగురిపై కేసు నమోదైంది. డీకేశి సీఎం అవుతారు ● ఎమ్మెల్యే డాక్టర్ రంగనాథ్ శివాజీనగర: ఉపముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ తన రాజకీయ గురువని, ఏదో ఒక రోజు ఆయన సీఎం అవుతారని కుణిగల్ ఎమ్మెల్యే డాక్టర్ రంగనాథ్ జోష్యం చెప్పారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందడంలో డీకే శివకుమార్ పాత్ర చాలా ఉందన్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారన్నారు. ప్రస్తుతానికి సీఎం సిద్దరామయ్య రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. మారికాంబ దేవికి విశేష అలంకరణమాలూరు: దేవి నవరాత్రుల్లో భాగంగా పట్టణంలోని మారికాంబ దేవాలయంలో అమ్మవారికి బుధవారం విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మూల విగ్రహానికి అభిషేకం అనంతరం పూలతో అమ్మవారిని చక్కగా అలంకరణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. నియామకంమాలూరు: ప్రసిద్ద చిక్కతిరుపతి ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవాలయ వ్యవస్థాపనా సమితి అధ్యక్షుడిగా ఆలంబాడి గ్రామానికి చెందిన గోపాల్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. నూతన అధ్యక్షుడు గోపాల్ను ఎమ్మెల్యే కేవై నంజేగౌడ అభినందించారు. ప్రధాన అర్చకులతో పాటు మొత్తం 9 మంది సభ్యులను ఎంపిక చేశామన్నారు. నూతనసమితి సభ్యులు దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలన్నారు. ఆలయ ఈఓ సెల్వమణి, తాపం మాజీ స్థాయీ సమితి అధ్యక్షుడు నాగేష్ పాల్గొన్నారు. స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వండి శ్రీనివాసపురం: ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలని ఉప లోకాయుక్త బి.వీరప్ప సలహా ఇచ్చారు. తాలూకాలోని లక్ష్మీ సాగర గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించి మాట్లాడారు. గ్రామంలో పలుచోట్ల స్వచ్ఛత కొరవడిందన్నారు. గ్రామ పంచాయతీ సభ్యులు, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ సౌలభ్యాలను ప్రతి ఒక్కరికీ అందించాలన్నారు. -
భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ
బళ్లారి రూరల్: రేడియాలజీ విభాగంలో జరిగిన ఆయుధ పూజ హొసపేటె: ధర్మదగుడ్డకు అమ్మవారిని తీసుకెళ్తున్న దృశ్యం బళ్లారి రూరల్: శస్తచికిత్సలో వాడే కత్తెర్లకు పూజలుసాక్షి బళ్లారి: దసరా శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆయుధ పూజను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నగరంలో ఎటుచూసిన వాహనాలను శుభ్రం చేయించడం కనిపించింది. రైతులు, వ్యాపారస్తులు ఆయుధాలకు పూజలు చేశారు. జిల్లా ఎస్పీ శోభారాణి ఆధ్వర్యంలో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్టేషన్లలో తుపాకులను ఒక చోట ఉంచి విభూతి, కుంకుమ పూసి అలంకరించారు. దసరా పండుగ నేపథ్యంలో మార్కెట్లు కళకళలాడాయి. పూలు, పండ్లు, కొనుగోలు చేయడానికి ప్రజలు భారీగా తరలిరావడంతో నగరంలోని బెంగళూరు రోడ్డుతో పాటు వివిధ ప్రధాన రోడ్లు కిటకిటలాడాయి. పూలు, పండ్లకు గిరాకీ ఏర్పడింది. హొసపేటె: దసరా పండుగ నేపథ్యంలో పూలు, పండ్లు ధరలు విపరీతంగా పెరిగాయి. నగర కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్, మదకరి నాయక సర్కిల్, గాంధీ చౌక్లోని పూల మార్కెట్ ప్రజలతో కిక్కిరిశాయి. బంతిపూలు గుచ్చు రూ.100 నుంచి, రూ.150, చామంతి ఒక గుచ్చు రూ.300 నుంచి రూ.350, మల్లె ఒక గుచ్చు రూ.400, గులాబీ ఒక కిలో రూ.400, ఆపిల్ కిలో రూ.150 నుంచి రూ.200 ధరలు పలికాయి. అరటి డజను రూ.60 నుంచి 70, దానిమ్మ రూ.100 నుంచి రూ.150, బూడిద గుమ్మడికాయ రూ.120 నుంచి 150 (పరిమాణాన్ని బట్టి), అరటి ఆకులు, చెరకు గడలు రూ.50 నుంచి రూ.60 వరకు అమ్ముడయ్యాయి. బళ్లారి రూరల్: బీఎంసీఆర్సీ ఆసుపత్రిలోని ఎక్స్రే విభాగంలో యంత్రాలు, సీటీ స్కానింగ్ యంత్రాలు, కంపూటర్లకు పూజలు నిర్వహించారు. రేడియాలజీ విభాగంలో అమ్మవారిని కొలువుదీర్చారు. ప్రధాన ద్వారం వద్ద గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఆపరేషన్ థియేటర్ ముందు శస్త్ర చికిత్సలో వాడే కత్తెర్లు, యంత్రాలను పూజించారు. క్యాజువాలిటీ మందుల సరఫరా, గైనకాలజీ తదితర విభాగాల సిబ్బంది ఆయుధ పూజలు చేశారు. కార్యక్రమంలో బీఎంసీఆర్సీ డీన్ డాక్టర్ గంగాధర గౌడ, ప్రిన్సిపాల్ డాక్టర్ మంజునాథ్, సూపరింటెండెంట్ డాక్టర్ ఇందుమతి, రేడియాలజీ విభాగ ప్రముఖుడు డాక్టర్ సదాశివగౌడ, డాక్టర్ విజయ్, డాక్టర్ కృష్టమూర్తి, శస్తచికిత్స వైద్యులు డాక్టర్ రాజశేఖర్ గౌడ, డాక్టర్ మహేష్ దేశాయ్, అనస్తీషియా వైద్యుడు డాక్టర్ బాలభాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు. ధర్మదగుడ్డలో భక్తుల సందడి హొసపేటె: తాలూకాలో నాగేనహళ్లి వద్ద వెలసిన విజయనగర సామ్రాజ్యం కాలం నాటి ధర్మదగుడ్డ వద్ద జమ్మి చెట్టుకు ప్రజలు పూజలు చేశారు. ఈ ఏడాది కూడా నగరంలో ఏడు వార్డుల్లో వాల్మీకి నాయకులు అమ్మవారిని పల్లకీలో కొలువుదీర్చారు. ఊరేగింపుగా ధర్మదగుడ్డకు తీసుకెళ్లారు. జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శన చేసి మొక్కులు తీర్చుకున్నారు. హుబ్లీ: జంట నగరాల్లోని ఆలయాల్లో బుధవారం భక్తుల కోలాహలం నెలకొంది. కేఎంసీ ఆస్పత్రిలో దుర్గామాతను కొలువు దీర్చి ప్రత్యేక పూజలు చేయించారు. రిసెప్షన్ కౌంటర్, మానసిక విభాగం, మోదీ బిల్డింగ్ యూరాలజీ విభాగం, హృదయ విభాగాల ఉద్యోగులు వచ్చి అమ్మవారిని మొక్కుకున్నారు. మానసిక విభాగం హెచ్ఓడీ మహేష్ దేశాయి, అసోసియేషన్ ప్రొఫెసర్ సమీర్, డాక్టర్లు భాస్కర్, నివేదిక, రచన, అమూల్య, కేతరిన్, పలువురు సిస్టర్లు, మేల్ నర్సులు, వార్డు ఉమెన్ గంగమ్మ పాల్గొన్నారు. హొసపేటెలో కిటకిటలాడిన మార్కెట్ బళ్లారిలో పూజా సామగ్రి కొనుగోలు చేస్తున్న ప్రజలు -
Karnataka: సీఎం మార్పుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
‘సీఎం మార్పు’ అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఐదేళ్ల పదవీ కాలానికి తానే సీఎంగా ఉంటానని.. వచ్చే ఏడాది మైసూర్లో దసరాకీ తానే పూజ చేస్తానంటూ నొక్కి చెప్పారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలపై మాట్లాడుతూ.. "నేను రెండోసారి ముఖ్యమంత్రిని కాలేనని చాలామంది జోస్యం చెప్పారు, కానీ నేను అయ్యాను. నా కారుపై కాకి వాలడం దుశ్శకునం అని.. నేను సీఎం కొనసాగలేనని చాలామంది అన్నారు. నేను బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనన్నారు.. కానీ ఏం జరిగింది’’ అంటూ చెప్పుకొచ్చారు.కాగా, గత కొంతకాలంగా కర్ణాటకలో ‘సీఎం మార్పు’పై గందరగోళం కొనసాగుతన్న సంగతి తెలిసిందే.. తాజాగా డిప్యూటీ సీఎం శివకుమార్ దీనిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారాయన. ప్రపంచంలో ఏ మనిషైనా ఆశతోనే బతుకుతారని... ఆ ఆశే లేకుంటే జీవితమే లేదు. మీరడిగిన ప్రశ్నకు నేను కాదు.. కేవలం కాలమే దీనికి సమాధానం చెబుతుంది అని అన్నారాయన. సీఎం పదవి నిర్ణయం పార్టీ హై కమాండ్దేనని డీకే మరోసారి కుండబద్ధలు కొట్టారు.కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2023 మే 20న అధికారంలోకి వచ్చింది. ఈ నవంబర్కు రెండున్నర సంవత్సరాలు పూర్తవుతాయి. రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. -
ఏపీని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రయోజనాల్ని గాలి కొదిలేశారంటూ చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేదా అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు. చంద్రబాబూ.. మీరు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశానా మీలో కనిపించడంలేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేదు. అనేక ప్రాంతాలు సాగునీరు, తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నాసరే మీరెందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు? రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే, రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి? .@ncbn గారూ… మీరు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశానా మీలో కనిపించడంలేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 1, 2025 గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణాజలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. 1995లో ఆల్మట్టి ఎత్తు 509.016 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన పనులు, స్పిల్వే సహా, గేట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే అప్పట్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా, మీ ఎంపీల బలంమీదే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా, 1995-2004వరకూ కేంద్రంలో చక్రం తిప్పినట్టుగా మీకుమీరే గొప్పలు చెప్పుకున్న కాలంలో, మీకున్న రాజకీయబలాన్ని రాష్ట్ర ప్రయోజనాలకోసం వాడలేదన్నది నిజమే కదా? సుప్రీంకోర్టు ఆదేశాలతో 519 మీటర్లకు పరిమితం అయినా, చివరకు మీ హయాంలోనే తాను కోరుకున్న స్థాయిలో ఆల్మట్టి స్పిల్వే సహా గేట్లు పెట్టేందుకు అవసరమైన పనులు కర్ణాటక ప్రభుత్వం పూర్తిచేసిందనేది వాస్తవం కాదా?గడచిన రెండున్నర దశాబ్దాలుగా, వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో కృష్ణాజలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బతింటున్నాయో, తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మీ వైఫల్యాల పుణ్యమే కదా చంద్రబాబుగారూ? ఇప్పుడు మళ్లీ, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, మళ్లీ ఆల్మట్టి లో 519 మీటర్ల నుంచి 524.256 మీటర్ల కు పెంచి నీటిని నిల్వ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధమయ్యింది. నీటినిల్వ సామర్థ్యాన్ని 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాదు, దీనికోసం రానున్న 3 ఏళ్లలో రూ.70వేల కోట్లు ఖర్చు చేయాలని నిశ్చయించింది. ఇంత జరుగుతున్నా మీలో కదలిక కనిపించడంలేదు చంద్రబాబుగారూ?..ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మీరు చక్రం తిప్పుతున్నారని మీరు, మీ ఎల్లోమీడియా రోజూ ప్రచారం చేసుకుంటున్నారు. పైగా మీ ఎంపీల బలంమీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న మాటకూడా వాస్తవమే. మరి అలాంటప్పుడు మీకున్న రాజకీయ బలాన్ని ఉపయోగించి, ఒత్తిడి తెచ్చి తద్వారా పనుల నిలుపుదలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబరు 16న నిర్ణయం తీసుకుంటే ఇప్పటివరకూ మీరెందుకు స్పందించడంలేదు? అసలు రాష్ట్రం అంటే మీకు పట్టింపు ఉందా? లేదా? ..మరోవైపు జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన కృష్ణా జలవివాద ట్రైబ్యునల్ (KWDT-2) ముందు రాష్ట్రం తరఫున వినిపిస్తున్న వాదనలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. కృష్ణా నదిలో 75% నీటిలభ్యత ఆధారంగా చేసిన KWDT-2 తీర్పు అమల్లోకి వస్తే, రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది. ఆ స్థాయిలో నీటి లభ్యత పరిగణలోకి తీసుకున్న పరిస్థితుల్లో, దాన్ని ప్రామాణికంగా తీసుకుని కేటాయింపులు చేయడం వల్ల రాష్ట్రానికి ఊహించని విధంగా నష్టం జరుగుతుంది. కరువు వస్తే రాష్ట్రమే భరించాలి, ఎలాగూ దిగువ రాష్ట్రం మనదే కాబట్టి వరద వచ్చినా రాష్ట్రమే ఆ నష్టాన్ని భరించేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. దీన్ని గుర్తించి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు వైయస్సార్సీపీ ప్రభుత్వం 2023 అక్టోబరులోనే పిటిషన్ దాఖలు చేసి, న్యాయపోరాటాన్ని ప్రారంభించింది. కాని మీరు ఇప్పుడు సమర్థవంతంగా వాదనలు వినిపించి, రాష్ట్ర హక్కులను కాపాడ్డంలో చిత్తశుద్ధి చూపడంలేదు. ..చంద్రబాబు మీరు ఇప్పటికైనా మేలుకోండి. కేంద్రంలో ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతోపాటు, KWDT-2 విచారణపై దృష్టిపెట్టి, సమర్థవంతమైన వాదనలు వినిపించండి. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
జంబూసవారీకి కౌంట్డౌన్
మైసూరు: నాడ హబ్బ మైసూరు దసరా రోజున జరిగే చారిత్రక జంబూ సవారీ ఊరేగింపును వీక్షించేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మైసూరు రాజవీధుల్లో గురువారం జంబూ సవారీ ఉత్సవం జరుగుతుంది. రాష్ట్రం, దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా తరలివస్తున్నారు. 2 గంటలు ఆలస్యంగా ● ఈసారి సుమారు రెండు గంటల ఆలస్యంగా జంబూ సవారీ సాగనుంది. ● గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1:18 గంటల మధ్య శుభ ధనుర్ లగ్నంలో ప్యాలెస్ బలరామ ద్వారంలో నంది ధ్వజానికి సీఎం సిద్ధరామయ్య పూజ చేసి నాంది పలుకుతారు. ● సాయంత్రం 4:40 గంటల నుంచి 5:60 గంటల మధ్య కుంభ లగ్నంలో అభిమన్యు ఏనుగు మీద బంగారు అంబారీలో ప్రతిష్టించిన అధిదేవత శ్రీచాముండేశ్వరిదేవి విగ్రహానికి పుష్పార్చన చేస్తారు. ● వేదికపై నుంచి అంబారీకి పుష్పార్చన చేసేందుకు సీఎం, డీసీఎం, జిల్లా ఇంచార్జి మంత్రి, జిల్లాధికారి, నగర పోలీసు కమిషనర్, రాజవంశస్తులు యదువీర్ కృష్ణదత్తా, హైకోర్టు న్యాయమూర్తి ఉంటారు. ● పోలీసులు జరిపే కాగడాల ప్రదర్శన బన్నిమంటపం మైదానంలో సాయంత్రం 7 గంటలకు సాగుతుంది. ● మంగళవారం జరిగిన వాయుసేన సూర్యకిరణ్ విమానాల విన్యాసాలు ఉత్కంఠభరితంగా సాగాయి. రివ్వున ఎగురుతూ వైవిధ్యభరితంగా ఫీట్లు చేశాయి. దసరా రోజున మహా ఊరేగింపు రాచనగరికి తరలివస్తున్న ప్రజలు -
భారీ విస్ఫోటం
యశవంతపుర: హాసన్ జిల్లా పాత ఆలూరులో అనుమానాస్పదమైన పేలుడు జరిగి సుదర్శన్ అచారి (32), భార్య కావ్య (27) గాయపడ్డారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో బృహత్ విస్ఫోటం జరిగి ఇంటి గోడ బద్ధలైంది, వంట సామాన్లు చెల్లాచదురుగా పడ్డాయి. పెద్ధ శబ్ధం, ప్రకంపనలు రావడంతో ఏం ప్రమాదం ముంచుకొచ్చిందోనని గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. దంపతులు గాయపడగా, వారి ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు తగిలాయి. పేలుడు ఎంత తీవ్రంగా ఉందంటే కిటికీలు, తలుపులు లేచిపోయాయి. ఇంట్లోని సామగ్రి దూరంగా ఎగిరిపడింది. బెంగళూరుకు తరలింపు దంపతులకు ఆలూరు తాలూకా ఆస్పత్రిలో చికిత్స చేసి ఆందోళనకరంగా ఉండడంతో హాసన్లోని హిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చివరకు జీరో ట్రాఫిక్ ద్వారా బెంగళూరుకు తరలించారు. పేలుడుకు కారణాలపై తలోమాట ఉంది. గ్యాస్ సిలిండర్ పేలుడా, లేదా ఏవైనా పేలుడు పదార్థాలను నిల్వ చేసి ఉంటే విస్ఫోటం చెందాయా? అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. హాసన్ జిల్లా ఎస్పీతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు ఇంటిని పరిశీలించారు. అక్కడ కొన్ని తూటాల వంటి శకలాలు లభించాయి. దీపావళి కోసం టపాసులను తయారు చేయాలని భారీ మొత్తంలో మందుగుండు, ఇతరత్రా విస్ఫోటక వస్తువులను దాచి ఉంచారని కొందరు చెబుతున్నారు. పేలుడుకు చెల్లాచెదరైన ఇల్లు, వస్తు సామగ్రి (ఇన్సెట్) అనుమానిత మందుగుండు దంపతులకు తీవ్రగాయాలు హాసన్ జిల్లాలో కలకలం -
హస్తం ఎమ్మెల్యేపై లోకాయుక్త దాడులు
● 266 ఎకరాల తోట కొనుగోలుపై కిరికిరియశవంతపుర: అక్రమంగా ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలతో చిక్కమగళూరు జిల్లా శృంగేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే టిడి రాజేగౌడ ఇళ్లు, ఆఫీసులపై మంగళవారం ఉదయం నుంచి లోకాయుక్త అధికారులు దాడులు చేశారు. బెంగళూరు, హొసమనె, చిక్కమగళూరు, బసాపుర, హలసూరు తదితర ప్రాంతాల్లోని ఇళ్లు, తోటలు, సన్నిహితుల ఇళ్లలో సోదాలను చేపట్టారు. అక్రమ ఆస్తుల గురించి ఎమ్మెల్యే రాజేగౌడ, భార్య పుష్పలత, విదేశాలలో ఉన్న కొడుకుపై కేసు నమోదు చేశారు. సోదాలలో అనేక పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం. బాళెహొన్నూరు సమీపంలోని హలసూరులో రాజేగౌడ 266 ఎకరాల తోటను కొన్నారు. ఇది దివంగత వ్యాపారవేత్త కాఫీ డే యజమాని సిద్ధార్థకు చెందినది. ఈ లావాదేవీలపై బీజేపీ నాయకుడు దినేశ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. రాజేగౌడ ఎన్నికల అఫిడవిట్లో అనేక ఆస్తులను పేర్కొనలేదని కూడా చెప్పారు. తన వార్షిక ఆదాయం రూ.38 లక్షలుగా చూపించారు. ఇదే నిజామైతే వందల ఎకరాలను ఎలా కొన్నారని దినేశ్ ఫిర్యాదులో ప్రశ్నించాడు. రెండు వారాల క్రితం ప్రజాప్రతినిధుల కోర్టు రాజేగౌడపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో కేసు పెట్టారు. జై మహాకాళీ తుమకూరు: ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జిల్లా దసరా ఉత్సవాల మండపంలో ప్రతిష్టించిన చాముండేశ్వరీ దేవి మంగళవారం మహాకాళి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ పూజా కై ంకర్యాల్లో హోంమంత్రి పరమేశ్వర్ సతీమణి కన్నికా పరమేశ్వర్, జిల్లాధికారి శుభ కళ్యాణ్, రజనీ ప్రభు తదితరులు పాల్గొన్నారు. రోడ్ల దుస్థితిపై యమ, చిత్రగుప్తుల ఆరా యశవంతపుర: పర్యాటకులు ఎక్కువగా వెళ్లే చిక్కమగళూరులో రోడ్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి నరక లోకం నుంచి యమ ధర్మరాజు, చిత్రగుప్తులు కాఫీనాడుకు దిగివచ్చారు, మూడిగెరె పట్టణ పరిధిలో పర్యటించారు... ఇలా వినూత్నంగా గుంతల రోడ్లపై స్థానికులు నిరసన నాటికను ప్రదర్శించారు. నీడువాళె గ్రామంలో రోడ్లు చాలా అధ్వాన్నంగా గుంతలతో నిండిపోయాయి. గ్రామ పంచాయతీ సభ్యుడు నవీన్ హవళి, కామిడి కిలాడి రమేశ్ యాదవ్లు వినూత్నంగా చిత్రగుప్త, యమ ధర్మరాజ వేషాలను కట్టి సంచరించారు. బైకిస్టులను అడ్డగించి ఈ రోడ్లుపై ఎలా నడుస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యంగ్య ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకొంది. తమ గ్రామంలోని రోడ్ల దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఇలా చేసినట్లు యమ, చిత్రగుప్త తెలిపారు. వారితో జనం ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. -
ఇంత వరద నష్టం జరిగిందా!
శివాజీనగర/ రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో వరద పీడిత జిల్లాల్లో సీఎం సిద్దరామయ్య మంగళవారం గగన సమీక్ష జరిపారు. బెంగళూరు నుంచి మంగళవారం ఉదయం కల్బుర్గికి ప్రత్యేక విమానంలో చేరుకొన్న ముఖ్యమంత్రి అక్కడి విమానాశ్రయం నుంచి హైలికాప్టర్ ఎక్కి వరద పీడిత ప్రాంతాలకు వెళ్లారు. నీట మునిగిన పొలాలు, ఊళ్లను వీక్షించారు. సుమారు 2 గంటలకు పైగా సాగింది. సీఎంతో పాటు జిల్లా మంత్రి ప్రియాంక ఖర్గే, మరికొందరు మంత్రులు ఉన్నారు. కల్బుర్గి, బీదర్, యాదగిరి జిల్లాల్లో ఏరియల్ వ్యూ నిర్వహించారు. సహాయక చర్యలపై చర్చ తరువాత సీఎం, మంత్రులు కల్బుర్గిలో దిగి అధికారులతో సమావేశమయ్యారు. కల్బుర్గి, బీదర్, విజయపుర, యాదగిరి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరద పరిస్థితిని ఎదుర్కోవాలని, బాధితులకు సత్వర సాయం చేయాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి ప్రాణ హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంటలు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణమే పరిహార సొమ్మును విడుదల చేయాలన్నారు. అతివృష్టికి తోడు ఎగువన మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, భీమా, ఇతర నదులు ఉప్పొంగడంతో కలబుర్గి, యాదగిరి, బీదర్, రాయచూరు, విజయపుర జిల్లాల్లో ఊళ్లు, పొలాలు నీట మునిగాయని సీఎం తెలిపారు. జిల్లాధికారుల ఖాతాల్లో రూ.1,354 కోట్ల నిధులను వాడుకోవడానికి అవకాశం క ల్పించామన్నారు. 75 చోట్ల గంజి కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయస్వామి కలబుర్గిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి రైతుల పంట పొలాల్లో కుళ్లిన కంది పంటను పరిశీలించారు. ఈ జిల్లాల్లో 8.60 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. -
విపణి వీధులకు దసరా కళ
బనశంకరి: పండుగలలో ముఖ్య పర్వదినమైన దసరా ఆయుధ పూజ సంభ్రమం అంతటా నెలకొంది. నేడు బుధవారం ఆయుధ పూజ కాగా, మంగళవారం మార్కెట్లలో పూలు పండ్లు, మిఠాయిలు, ఇతర పండుగ సామగ్రి కొనుగోళ్లతో కిటకిటలాడాయి. బుధ, గురువారాలు సెలవులు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పలు ప్రైవేటు సంస్థలు, ఆఫీసుల్లో మంగళవారమే మామిడి, అరటి తోరణాలు, పూల హారాలు కట్టి అలంకరించి పూజలు చేశారు. అమ్మో ఇంత ధరలా బెంగళూరులోని కేఆర్.మార్కెట్, మల్లేశ్వరం, యశవంతపుర, గాంధీ బజార్, విజయనగర, ఉళ్లాల మెయిన్ రోడ్డు, మహాలక్ష్మీ లేఔట్, రాజాజీనగర, బనశంకరి, జయనగర, మడివాళ మార్కెట్లలో ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిండిపోయాయి. అన్ని ధరలనూ పెంచేశారు. గుమ్మడి కాయ ధర రూ.40 నుంచి 60గా ఉంది, చేమంతి మూర రూ.150, చెండుపూలు కిలో రూ.50–60, మల్లెపూలు కిలో రూ.400–800, గులాబీలు రూ.300, కనకాంబరాలు కిలో రూ.1000, సుగంధరాజ రూ.300 ధరలతో విక్రయిస్తున్నారు. పండ్ల ధరలు కూడా మామూలు కంటే ఎక్కువగా ఉన్నాయి. పండుగ సామగ్రి కొనుగోళ్లతో రద్దీ రెట్టింపైన పూలు, పండ్ల ధరలు ఆఫీసుల్లో ముందే ఆయుధ పూజ విధానసౌధ ముస్తాబు శివాజీనగర: పరిపాలనా శక్తికేంద్రాలైన విధానసౌధ, వికాససౌధ, బహుళ అంతస్థుల భవనంతో పాటుగా రాష్ట్రమంతటా మంగళవారం ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయుధ పూజను ఆచరించారు. ఉద్యోగులు ఉదయం నుంచే ఆఫీసులను సుందరంగా అలంకరించారు. విధానసౌధలో తమ తమ ఛాంబర్ల ముందు మహిళా సిబ్బంది ముగ్గులు వేసి పూలదండలతో సింగారించారు. సౌధ మొత్తం కొత్త కళ వచ్చింది. పోలీసు స్టేషన్లలో వాహనాలు, ఆయుధాలను శుభ్రం చేసి పూజలు చేశారు. సీఎం, డీసీఎం, మంత్రులు, ప్రతిపక్ష నేతల ఛాంబర్లను ముస్తాబు చేసి పూజలు చేశారు. -
మహిళా ఎస్ఐకి ముందస్తు బెయిల్ నిరాకరణ
దొడ్డబళ్లాపురం: లోకాయుక్త పోలీసులు దాడి చేసిన సమయంలో పరారైన దేవనహళ్లి మహిళా ఎస్ఐ జగదేవి పెట్టుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ను లోకాయుక్త కోర్టు తిరస్కరించింది. వివరాలు.. ఓ బాలిక లైంగిక దాడికి గురికాగా ఆమె తల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసింది. అయితే నిందితుడికి వ్యతిరేకంగా చార్జ్ïÙట్ వేయడానికి జగదేవి రూ.లక్ష డిమాండ్ చేసింది. అడ్వాన్స్గా రూ.25వేలు తీసుకుని మిగతా రూ.75వేలు జగదేవి సహోద్యోగిని తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. సమీపంలో ఉన్న జగదేవి తప్పించుకుని పారిపోయింది. ఈకేసులో జగదేవిని ఏ1 నిందితురాలిగా ఉన్నారు. అరెస్ట్ భయంతో ఎస్ఐ ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకుంది. పోక్సో కేసులో బాధితురాలి తల్లి నుంచి లంచం డిమాండు చేయడం అమానుషమని పేర్కొన్న కోర్టు... జగదేవి పెట్టుకున్న బెయిలు పిటిషన్ను తోసిపుచ్చింది. -
కరుణించమ్మా.. కనకదుర్గమ్మా
బళ్లారిఅర్బన్: విజయదశమిని పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా నగర ప్రజల ఆరాధ్య దైవం కనకదుర్గమ్మ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఈఓ హనుమంతప్ప తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది భక్తుల సందడి బాగా పెరిగిందన్నారు. కనకదుర్గమ్మకు బంగారు ఆభరణాలతో దుర్గాష్టమి రోజు నుంచి పండుగ పూర్తయ్యేంత వరకు అలంకరణ ఏర్పాటు చేయగా అమ్మవారి దర్శనానికి భక్తులు విశేషంగా తరలి వచ్చారు. ఆలయ పరిసరాలు తెల్లవారు జామున 3 గంటల నుంచి భక్తుల సందడితో కిటకిటలాడాయి. వీఐపీ దర్శనానికి ఓ గంట సమయం పట్టగా సాధారణ దర్శనానికి సుమారు 3 గంటల నుంచి 4 గంటల సేపు క్యూలైన్లో ఉండాల్సి వచ్చింది. ఆలయ నలువైపులా నాలుగు గోపురాలకు విద్యుత్ దీపాలంకరణ, వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టి పోలీస్, హోంగార్డ్స్ బందోబస్తు మధ్య దర్శనానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ ముందు భాగంలో ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక నృత్యాలు, ఆలయ ప్రాంగణంలో దేవి పురాణం, అమ్మవారి నమూనాను ఏర్పాటు చేసి ప్రతి రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారికి అలంకరణలను చేస్తున్నారు. దుర్గాదేవి రూపంలో అమ్మవార్ల దర్శనం దేవి నవరాత్రులను పురస్కరించుకుని 9వ రోజు దుర్గాష్టమి సందర్భంగా మంగళవారం అమ్మవారి ఆలయాల్లో దుర్గాదేవి రూపాల్లో అమ్మవార్లను అలంకరించి నవరాత్రి పూజలను జరిపారు. బళ్లారి కనకదుర్గమ్మ ఆలయంతో పాటు పటేల్ నగర్ చిన్నదుర్గమ్మ ఆలయంలో దుర్గాష్టమి పూజలను విశేషంగా నిర్వహించినట్లు అర్చకులు సంతోష్ స్వామి తెలిపారు. అమ్మవారికి అభిషేకం దుర్గాదేవి అలంకరణ భక్తులకు జలాభిషేకం, హోమ పూజలు, మహామంగళారతి, అన్నదానం జరిపారు. మిల్లర్పేట్ మల్నాడు దుర్గమ్మ ఆలయంలో దుర్గాదేవి అలంకరణ, మహామంగళారతి, భక్తులకు అన్నదానం చేశారు. బెంగళూరు రోడ్డు బెంకి మారెమ్మ ఆలయం, నగరేశ్వరి ఆలయం, వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం, చిన్న మార్కెట్ శాంభవి దేవి ఆలయం, హవంబావి సీతారామ ఆశ్రమం, ఏళు మక్కళ తాయమ్మ ఆలయం తదితర అమ్మవారి ఆలయాల్లో దుర్గాష్టమి పూజలను దసరా సందర్భంగా నేటి నుంచి మూడు రోజుల పాటు విశేషంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన అర్చకులు తెలిపారు. దర్శనానికి బారులు తీరిన భక్తులు కిటకిటలాడిన అమ్మవారి ఆలయం వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు రాయచూరు రూరల్ : జిల్లాలో మంగళవారం శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని కోటలోని కాళికా దేవి ఆలయంలో దేవిని పల్లకీలో ఊరేగించారు. మమదాపురలో మారికాంబ దేవి, కాస్బావి అంబా భవాని, కందగడ్డ మారెమ్మ దేవిని ఘనంగా అలంకరించారు. నిజలింగప్ప కాలనీలో దేవిగా అలంకరించారు. కిల్లే మఠంలో, ఉప్పరవాడి లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయంలో గరుడ వాహనంలో స్వామిని ఊరేగించారు. బోళమానుదొడ్డి రహదారిలోని తాయాంబిక ఆలయంలో కిల్లే మఠం శాంతమల్ల శివాచార్యులు హోమం చేశారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను తీర్చాలి
హొసపేటె: ఏఐయూటీయూసీలో విలీనమైన కర్ణాటక రాష్ట్ర యునైటెడ్ హాస్టల్ వర్కర్స్ అసోసియేషన్, విజయనగర యూనిట్, జిల్లాధికారి కవిత ఎస్.మన్నికేరి ద్వారా ముఖ్యమంత్రి, కార్మిక మంత్రి, సాంఘీక సంక్షేమ మంత్రి, ఇతర మంత్రులకు వినతిపత్రాన్ని సమర్పించింది. ఔట్ సోర్సింగ్ రద్దు, శాశ్వత నియామకం, ఇప్పటికే నిర్ణయించిన విధంగా కార్మికుల కోసం బహుళార్ధ సాధక సహకార సంఘం ఏర్పాటు, కనీస వేతన పెంపు నోటిఫికేషన్ అమలు, విజయనగర జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు, ఇతర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. కర్ణాటక రాష్ట్ర జాయింట్ హౌసింగ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్ మాట్లాడుతూ కార్మిక చట్టాలను గాలికి వదిలేసి, కాంట్రాక్టర్ల బారి నుంచి వారిని విడిపించాలనే కార్మికుల నిరంతర పోరాటం డిమాండ్కు ప్రతిస్పందనగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో బహుళార్ధ సాధక సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ సహకార సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ ఆలస్యం అయిందని, వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. -
అడ్డదారి కబ్జాపై మంత్రికి ఫిర్యాదు
బళ్లారిఅర్బన్: మూడు దశాబ్దాలుగా బడాబాబులు తమ స్వార్థ శక్తుల పలుకుబడితో వేలాది మందికి రహదారిగా ఉన్న మార్గంలో వెళ్లడానికి విలువైన స్థలాన్ని నిట్టనిలువునా దోచుకున్నారని, ఇప్పటికై నా ఆ స్థలానికి విముక్తి కల్పించి సామాన్య ప్రజలకు బాటగా మార్చాలని సామాజిక పోరాట యోధుడు సిద్దేశ్ హూళూరు, ఉప్పార సంఘం ప్రముఖ నేత, సీనియర్ సిటిజన్ సీ.మల్లప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన జనతాదర్శన్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్ఖాన్ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ వద్దనున్న అన్ని రికార్డులను ముఖ్యంగా 30 ఏళ్లుగా అక్కడి స్థానికులు స్థలం గురించి చేస్తున్న పోరాటం తీరుతెన్నులను వినతిపత్రం రూపంలో వివరించారు. రాజ్కుమార్ 18వ వార్డు పటేల్ నగర్ గురుకృప కాలనీలో ఆ దారిని అక్రమంగా అక్రమించుకొని ఇటుకలతో మూసి వేశారు. సమస్యపై జిల్లా ఫోరం, కర్ణాటక హైకోర్టుతో పాటు బళ్లారి బుడా సంస్థ తమకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశ పత్రాల వివరాలను కూడా వారు మంత్రికి సమగ్రంగా వివరించారు. కర్ణాటక హైకోర్టు కూడా సదరు సమస్యను సానుకూలంగా పరిశీలించి కేవలం ఒకరిద్దరు తమ స్వార్థం కోసం ఆర్ఆర్ థియేటర్ హద్దినగుండు రోడ్డుకు వెళ్లి ఈ ప్రజల ఆస్తిలో సామాన్య ప్రజలకు సంచరించడానికి వీలు లేకుండా అడ్డుగోడ కట్టారని వారు వాపోయారు. బళ్లారి సిటీ కార్పొరేషన్, బళ్లారి నగరాభివృద్ధి సంస్థ కూడా సానుకూలమైన ఆదేశాలు ఇచ్చినా అక్రమార్కులు మాత్రం తమ పలుకుబడితో మాయ చేస్తూ అందరిని మభ్యపెట్టి తమదైన రాజ్యాంగం అమలు చేస్తూ సదరు అడ్డదారి రోడ్డును వారు తమ సొంతానికి వాడుకుంటూ సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని సిద్దేశ్ హూళూరు, సీ.మల్లప్ప ఆరోపించారు. ఇప్పటికై నా ఈ రహదారిని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచి రాకపోకలు సాగించడానికి వీలు కల్పించాలని వారు ఆ వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. ఆక్రమణలు తొలగించి ప్రజలకు దారి కల్పించాలని వేడుకోలు -
కంటి శస్త్రచికిత్సలు విజయవంతం
హొసపేటె: నేత్రలక్ష్మిద వైద్యాలయ, అశ్విని కంటి ఆస్పత్రి సంయుక్త సంస్థ బల్డోటా గ్రూప్ ఎంఎస్పీఎల్ ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి విజయవంతంగా శస్త్రచికిత్సలు జరిగాయి. సోమవారం ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరంలో పాల్గొన్న సంస్థ అధికారి మధుసూదన్ మాట్లాడుతూ విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత మొత్తం 53 మంది లబ్ధిదారులు కంటి చూపును తిరిగి పొందారన్నారు. సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందంజలో ఉండే బల్డోటా గ్రూప్ సేవా స్పూర్తితో పని చేసే నేత్రలక్ష్మి వైద్యాలయం సహకారంతో ఈ శిబిరాన్ని విజయవంతం చేశామన్నారు. మైసూరు దసరాకు ప్రేరణ హంపీహొసపేటె: ఒక వైపు మైసూరు దసరాను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మైసూరులో జరిగే దసరాకు ప్రేరణ ప్రపంచ ప్రఖ్యాత హంపీ. ఏటా మైసూరులో జరిగే దసరాను 500 ఏళ్ల క్రితం విజయనగర సామ్రాజ్య రాజులు తొమ్మిది రోజుల పాటు హంపీలో మహానవమి దిబ్బ మీద నిర్వహించేవారు. అదే స్పూర్తితో ప్రస్తుతం మైసూరులో తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను జరుపుతున్నారు. అలాంటి మహానవమి దిబ్బ ఇప్పుడు కేవలం స్మారకంగానే మిగిలి ఉంది. మైసూరు దసరా సందర్భంగా మహానవమి దిబ్బపై కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చాలా మంది కళాకారులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు పెడచెవిన పెడుతుండటం శోచనీయం. మహిళ దారుణ హత్య బళ్లారిఅర్బన్: బళ్లారి జిల్లాలోని సిరుగుప్ప తాలూకా ముద్దటనూరు గ్రామంలో మహిళ దారుణ హత్యకు గురైనట్లు సిరిగేరి ఎస్ఐ తెలిపారు. లింగమ్మ(22) అనే మహిళ రాత్రి నిద్రిస్తుండగా ఆమె భర్త దేవరాజు గొడ్డలితో భార్య గొంతుపై నరికి చంపాడు. ఈ ఘటనపై సిరిగేరి పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ శోభారాణి మంగళవారం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దేవరాజ్, లింగమ్మ దంపతులకు ఐదేళ్ల క్రితం పెళ్లి కాగా ఇంతవరకు సంతానం కాలేదు. పైగా ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ భర్త దేవరాజ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులకు మంత్రి పరామర్శహొసపేటె: తాలూకాలోని గాదిగనూరులో శనివారం తెల్లవారు జామున వంట సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది గాయపడ్డ విషయం తెలిసిందే. మంగళవారం విజయనగర జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షత్రగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కులగణన పూర్తి చేసిన ఉపాధ్యాయుడికి సన్మానంరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన సమీక్షలో పాల్గొని వంద శాతం పూర్తి చేసిన ఉపాధ్యాయుడిని జిల్లాధికార యంత్రాంగం సన్మానించిన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం గ్రామీణ నియోజకవర్గంలోని కట్లటకూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి తన విధులను సమర్థవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. కులగణన సమీక్షలో సర్వర్ సమస్యలున్నా వాటిని లెక్క చేయకుండా సమీక్షను వంద శాతం పూర్తి చేయడంతో జిల్లాధికార యంత్రాంగం తరపున కృష్ణమూర్తిని తహసీల్దార్ సురేష్ వర్మ అభినందించారు. సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు నెట్వర్క్ ఇబ్బందులు కలిగించగా తిరిగి మూడు రోజుల్లో 150 ఇళ్ల కులగణన సమీక్షను నిర్వహించారు. -
మార్కెట్లకు దసరా పండుగ శోభ
బళ్లారి రూరల్ : దేశంలోనే అతిపెద్ద పండుగగా దసరా పండుగకు పేరుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుపుకొంటున్న దసరా పండుగలో భాగంగా బుధవారం ఆయుధ పూజ, గురువారం విజయదశమిని జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో నగరవాసులు, గ్రామీణులు పూలు, పండ్లు, అరటి పిలకలు, మావిడాకులు, కొత్త దుస్తులు, సరుకులు కొనడానికి ఎగబడ్డారు. దీంతో బెంగళూరు రోడ్డు, టైలర్ వీధి, తేరువీధి, బ్రాహ్మణ వీధులు కిక్కిరిశాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మూర పూల ధర రూ.50 నుంచి రూ.70 వరకు పలికింది. ఏదిఏమైనప్పటికీ నగరంలో పండుగ సందడి నెలకొంది. పూజ సామగ్రి కొనుగోలుదారులతో మార్కెట్ కిటకిట హొసపేటె: ఆయుధ పూజ, దసరా పండుగ సందర్భంగా మంగళవారం నగరంలో మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. దసరా నాడు మనం ఉపయోగించే సాధనాలు, యంత్రాలు, పుస్తకాలు, వాహనాలకు కృతజ్ఞతలు తెలియజేసే ఆచారం ఉంది. పూజ కోసం ఎర్ర చున్నీ, కొబ్బరికాయ, మామిడి ఆకులు, గంధం, పసుపు, అక్షతలు, పువ్వులు, అగరబత్తులు, పండ్లు, స్వీట్లు వంటివి అవసరమైన వస్తువులను కొనుగోలు చేశారు. అరటి, చెరుకు ముక్కలు, పండ్లు, పూలతో పాటు తదితర పూజ సామగ్రిని నగరంలో ప్రధాన వీధుల్లో అమ్మకందార్లు అందుబాటులో ఉంచారు. కొత్త దుస్తులు, పూలు, పండ్లు, మామిడాకుల కొనుగోళ్ల సందడి బెంగళూరు రోడ్డు, బ్రాహ్మణ వీధి, తేరువీధుల్లో ట్రాఫిక్ జామ్ -
అంగన్వాడీలపై వేటు విరమించుకోవాలి
రాయచూరు రూరల్: కులగణన సమీక్షపై నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్కు గురైన ఆరుగురు అంగన్వాడీ కార్యకర్తలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అంగన్వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకాలో గుండమ్మ, రంగమ్మ, ముత్తమ్మ, చాంద్బి, విజయలక్ష్మి, రేణుకలను విధుల నుంచి తొలగించారన్నారు. ప్రభుత్వం సమీక్షకు సంబంధించి సౌకర్యాలు కల్పించకుండా విధులు నిర్వహించడం కష్ట సాధ్యమని అధికారులకు వివరించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తలకు అధిక పని భారం ఉంటుందన్నారు. మానసికంగా అనారోగ్యంతో బాధపడుతూ విధులు నిర్వహించే వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు. శివాజీ విగ్రహం ఏర్పాటుకు వినతిరాయచూరు రూరల్: నగరంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలని రాయచూరు క్షత్రియ వేదిక డిమాండ్ చేసింది. మంగళవారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు అంబాజీ మాట్లాడారు. రాయచూరు కాస్ బావి వద్ద ఖాళీగా ఉన్న స్థలంలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు 2016లో నగరసభ సమావేశంలో తీర్మానం చేశారన్నారు. విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ కమిషనర్ జుబిన్ మహాపాత్రోకు వినతిపత్రం సమర్పించారు. కులగణనలో ఉపాధ్యాయినికి ప్రమాదం●స్పందించిన గ్రామీణ శాసన సభ్యుడు రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన సమీక్షలో పాల్గొన్న ఉపాధ్యాయురాలికి ప్రమాదం సంభవించిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం గ్రామీణ నియోజకవర్గంలో కులగణన సర్వేకు వెళుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో చిన్న పిల్లవాడితో పాటు పడి గాయపడ్డారు. అక్కడే ఉన్న గ్రామీణ శాసన సభ్యుడు బసవరాజ్ ముత్తిమోడ్ వారిద్దరిని తన వాహనంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తొందరపాటు వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయన్నారు. అధికారుల ఒత్తిడితో ప్రమాదాలు సంభవించడంపై ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. కృష్ణమ్మ పరవళ్లు.. ఆందోళనలో తీర ప్రాంత రైతులురాయచూరు రూరల్: ఎగువన మహారాష్ట్రలో అధికంగా వానలు కురుస్తుండడంతో ఉత్తర కర్ణాటకలోని నదీ తీర జిల్లాల్లో కృష్ణా నదికి వరద పోటెత్తింది. ఆయా జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల్లో భీమా, కృష్ణా నదీ తీరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కృష్ణా నదికి 4,26,604 క్యూసెక్కుల నీరు వదిలారు. దీంతో లింగసూగూరు తాలూకా శీలహళ్లి వంతెనను తాకుతూ వరద నీరు ప్రవహిస్తున్నాయి. రైతులు రాయచూరు తాలూకాలోని నదీ తీర ప్రాంతంలో అమర్చిన పంప్సెట్లను స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు. నేహా కేసులో సాక్షుల విచారణ హుబ్లీ: విద్యార్థిని నేహా హిరేమఠ హత్య కేసు విచారణ 1వ జిల్లా సెషన్స్ కోర్టులో శనివారం ప్రారంభం కాగా సోమవారం నలుగురు సాక్షులను విచారించారు. ఆ తర్వాత కేసు విచారణ వాయిదా వేశారు. ఈ నెల 30న కూడా 5 మంది సాక్షుల విచారణ జరగనుంది. శనివారం ఇద్దరు సాక్షులను విచారించారు. 2024 ఏప్రిల్ 18న విద్యార్థిని నేహా హిరేమఠను బీవీబీ కళాశాల క్యాంపస్లో ఫయాజ్ అనే యువకుడు దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. యువకుడు ఆత్మహత్య హుబ్లీ: మరో ఘటనలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ధార్వాడ తాలూకా నరేంద్ర గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మైలారగౌడ బసన్నగౌడ పాటిల్(36)ను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న యువకుడిగా గుర్తించారు. కొన్ని రోజుల క్రితం నుంచి కడుపునొప్పితో బాధ పడుతున్న ఇతడు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతుండగా ఉరి వేసుకొన్నాడు. ఈ ఘటనపై ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
మహిళలను గౌరవించాలి
కర్ణాటక: యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితునికి హైకోర్టు బెయిలును నిరాకరించింది. వివరాలు.. కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాకు చెందిన సయ్యద్ పర్వేజ్ నిందితుడు. ఈ ఏడాది ఏప్రిల్ 1న బిహార్ కూలీ యువతి (19) కేరళ నుంచి సొంతూరికి వెళ్లాలని బయల్దేరింది. బెంగళూరు కేఆర్ పురం రైల్వేస్టేషన్లో దిగింది. మరుసటి రోజు అర్ధరాత్రి యువతి తెలిసిన వ్యక్తితో భోజనం చేయాలని హోటల్కు నడుచుకుంటూ వెళ్తోంది. ఈ సమయంలో అక్కడే ఉన్న నిందితుడు పర్వేజ్, మరొక నిందితుడు వారిపై దాడి చేశారు. యువతిని లాక్కెళ్లి అఘాయిత్యం చేశారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి పరప్పన జైలుకు తరలించారు. బెయిలు ఇవ్వాలని నిందితుడు పర్వేజ్ హైకోర్టును ఆశ్రయించాడు. మహిళలను గౌరవించాలని మన పురాణాలు ఘోషిస్తున్నాయి, అర్ధరాత్రి మహిళలు నిర్భయంగా నడిచి వెళ్లినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు మహాత్మాగాంధీ చెప్పారు, ఈ నేరంలో బెయిలు ఇవ్వలేము అని జడ్జి ఎస్.రాచయ్య తీర్పు చెప్పారు. -
ఖర్గేకు పేస్మేకర్
బెంగళూరు: ఏఐసీసీ చీఫ్(AICC Chief) మల్లికార్జున ఖర్గే(83) ఆరోగ్యం నిలకడగానే ఉందని ఇటు వైద్యులు, అటు కుటుంబ సభ్యులు ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురైన ఆయన్ని నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. జ్వరం, కాళ్ల నొప్పులతో ఆయన బాధపడుతున్నట్లు తొలుత వైద్యులు ప్రకటించారు. అయితే.. ఆయనకు ఫేస్మేకర్(Kharge pacemaker) అమర్చాలని వైద్యులు సూచించారట. ఈ విషయాన్ని ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గ్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందన్న ఆయన.. ఆయన ఆరోగ్యం పట్ల ఆరా తీసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉంటే.. ప్రత్యేక వైద్య బృందం ఖర్గేకు చికిత్స అందిస్తోంది. సీఎం సిద్ధరామయ్య ఆస్పత్రికి వెళ్లి ఖర్గేను పరామర్శించారు. మరోవైపు.. Sri Kharge was advised pacemaker to be implanted and is admitted to the hospital for the planned procedure. He is stable and doing well.Grateful to all of you for your concern and wishes.— Priyank Kharge / ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ (@PriyankKharge) October 1, 2025ఖర్గే అస్వస్థత(Mallikarjun Kharge Hospitalised) వార్తతో కాంగ్రెస్ శ్రేణులు అందోళన వ్యక్తం చేశాయి. పార్టీ సీనియర్ నేతలు ఆయన ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 7వ తేదీన కోహిమా(నాగాలాండ్)లో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీకి ఖర్గే హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. పూర్తిగా కోలుకునేంత వరకు ఆస్పత్రిలోనే ఉంటారని ఖర్గే కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఆ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు.పేస్మేకర్ అంటే.. హృదయ స్పందన (heart rhythm) సరిగ్గా లేకపోతే దాన్ని నియంత్రించేందుకు శరీరంలో అమర్చే చిన్న ఎలక్ట్రానిక్ పరికరం. వయసు పైబడిన వాళ్లలో.. హార్ట్బీట్ మందగించిన సమస్యలుంటే దీనిని అమరుస్తారు. ఇదీ చదవండి: నన్ను ఏమైనా చేస్కోండి, కానీ..: టీవీకే విజయ్ ఆవేదన -
ఇవి స్మార్ట్ రోడ్లు కావు సామి షార్ట్ రోడ్లు!
‘‘యస్.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పినట్లు అధ్వాన్నమైన రోడ్లు అనేది దేశవ్యాప్తంగా ఉన్న సమస్యే. కానీ, దేశంలో ఎక్కడ కూడా బెంగళూరులో చేసినట్లు మాత్రం రిపేర్లు చేసి ఉండరు..’’ సోషల్ మీడియాలో బెంగళూరు రోడ్ల దుస్థితి గురించి ఓ నెటిజన్ చేసిన జోక్ ట్వీట్ ఇది.మొన్నటిదాకా బెంగళూరు ట్రాఫిక్ రద్దీ గురించే మాట్లాడుకునేవారు. కానీ, ఈ మధ్య అధ్వాన్నమైన రోడ్ల గురించి కూడా(Bengaluru Roads) చర్చించుకుంటున్నారు. ఓ ప్రముఖ కంపెనీ రోడ్లు బాగోలేకపోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ నగర శివారు నుంచి తరలిపోయింది. దీంతో రాజకీయంగానూ కర్ణాటక కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తామేమీ ఖాళీగా లేమని.. తమ ప్రయత్నం తాము చేస్తున్నామంటూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) చెబుతున్నారు. అంతేకాదు.. బెంగళూరు రోడ్ల మరమ్మత్తుల బాధ్యతలను కూడా సంబంధిత మంత్రిగా(పట్టణాభివృద్ధి) ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఈ తరుణంలో.. ఇప్పుడు నెట్టింట విమర్శలు మరింత పెరిగిపోయాయి. బెంగళూరు రోడ్ల రిపేర్ పనులు కొనసాగుతున్న వేళ.. పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతోంది. ఆ ప్యాచ్ వర్క్లు రెండు, మూడు రోజులకు మించి ఉండడం లేదు. వీటికి తోడు కొత్తగా కొట్టిన రోడ్లు కూడా 48 గంటలు తిరగకముందే పాడైపోతున్నాయి. ఫలితంగా.. ట్రాఫిక్ జాములు, ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో కొందరు ఆ రోడ్లనే ఎక్కుతున్నారు. మొన్నీమధ్యే కాక్స్ టౌన్లోని వెబ్స్టర్ రోడ్డులో రిపేర్లు చెదిరిపోయి మళ్లీ గుంతలు దర్శనమిచ్చాయి. దీంతో భారతినగర్ ప్రజలు ఆ గుంతలకు పూజలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది చూసి మరికొందరు కూడా అలాగే గుంతలను పూలతో అలంకరించి.. పసుపు, కుంకుమ చల్లి తమను చల్లగా చూడాలంటూ వీడియోలు చేసి వైరల్ అయిపోయారు. తాజాగా.. ఓ వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో చన్నసంద్ర సర్కిల్ వద్ద రిపేర్ అయిన రోడ్ల పరిస్థితి తెలియజేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. చన్నసంద్ర సర్కిల్ వద్ద సెప్టెంబర్ 27న రోడ్డుకు మరమ్మతులు చేశారట. గట్టిగా ఒక్క వాన పడితే ఈ రోడ్డు ఉండదు అంటూ ఆ వ్యక్తి ఆ వీడియోను క్యాప్షన్ ఉంచాడు. దీనికి Greater Bengaluru Authority (@GBA_office) ను ట్యాగ్ చేశాడు. They repaired this section - Channasandra Circle on 27th September. It's 29th September today and the road is gone. What kind of patchwork doesn't last 48hrs? Are your engineers and contractors so much unqualified @GBA_office?You see the water in the video? - it's leaking… https://t.co/2NfPTEA1sN pic.twitter.com/kOH0ExjG8J— Auro (@weekendbiker) September 29, 2025బెంగళూరు రోడ్ల మరమ్మత్తుల బాధ్యతలను గ్రేటర్ బెంగళూరు అథారిటీ.. వివిధ కాంట్రాక్టర్లకు అప్పజెప్పింది. నగరంలో దీర్ఘకాలిక రోడ్డు అభివృధ్ది ప్రాజెక్టులకు రూ.1,100 కోట్లు ఖర్చు చేయబోతుండగా.. ఇందులో కేవలం రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.750 కోట్లు కేటాయించారు. గుంతల పూడిక, వైట్ టాపింగ్, బ్లాక్టాపింగ్, కొత్త స్మార్ట్ రోడ్ల నిర్మాణం అన్నీ ఇందులోనే జరగనున్నాయి. అక్టోబర్ 31లోగా నగరంలో 10వేల గుంతలను పూడ్చాలంటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డెడ్లైన్ విధించారు. అయితే.. వర్షాలు, నిర్మాణ నాణ్యత లోపాలు, నిర్వహణ లోపాల కారణంగా విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. -
గానామృతం.. నిప్పుల వర్షం
సోమవారం సాయంత్రం మైసూరు ప్యాలెస్ ముందు జంబూసవారీ సాధన ఫిరంగుల విస్ఫోటాలతో ఏర్పడిన అగ్నిగోళాలు మైసూరు: పాటలు, సంగీతం మైసూరువాసులను, పర్యాటకులను తన్మయుల్ని చేస్తున్నాయి. మైసూరు దసరా వేడుకల సందర్భంగా ప్యాలెస్ ముందు వేదికపై ఆదివారం రాత్రి గాయకుడు విజయ్ ప్రకాశ్ బృందం పాడిన పాటలకు ప్రేక్షకులు ఆనందంతో స్టెప్పులు వేశారు. విజయప్రకాశ్ వేదిక పైకి వస్తూనే చాముండేశ్వరి కీర్తనను ఆలపించారు. తరువాత హబ్బ హబ్బ ఇది కరునాడు హబ్బ మనె అనే పాటలో అలరించారు. పవర్స్టార్ పునీత్ రాజ్ పాట అయిన బొంబే హేళుతైతె.. నీనే రాజకుమార అనే పాటకు ప్రేక్షకులు లేచి నిలబడి మొబైల్లో లైట్లు వేసి పునీత్కు నివాళులర్పించారు. ఇక బన్నిమంటప కవాతు మైదానంలో డ్రోన్లతో చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. మరోసారి ఫిరంగుల గర్జన గజరాజులకు మరోసారి ఫిరంగుల తాలీమును నిర్వహించారు. సోమవారం కవాతు మైదానంలో ఏనుగులు, గజరాజులను నిలబెట్టి ఫిరంగి మోతలను మోగించారు. భీకరంగా అగ్నిగోళాలు, శబ్ధాలు వెలువడినా అవి బెదరలేదు. అలాగే గజరాజు అభిమన్యుతో కలిసి ప్యాలెస్ ముందు జంబూసవారీ రిహార్సల్ను జరిపారు. నిజమైన జంబూసవారీలో మాదిరిగా పోలీసులు అంబారీ మీద పూలు చల్లి సెల్యూట్ చేశారు. డిసిఎఫ్ ప్రభుగౌడ, అధికారులు పాల్గొన్నారు. విజయ్ ప్రకాశ్ గానాలాపన అంబరంలో అద్భుతం.. వేలాది డ్రోన్లతో ఏనుగు అంబారీ రూపంభూగోళంలో భారతదేశం ఆవిష్కారం పతాకస్థాయికి మైసూరు దసరా సంబరాలు -
మహిషాసుర మర్దిని
తుమకూరు: తుమకూరు దసరా వేడుకల్లో కేఆర్ లేఔట్లో ఉన్న శ్రీరామ మందిరంలో సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. మహిషాసుర మర్దిని నృత్య వైభవం సమ్మోహితుల్ని చేసింది. అలాగే హిరణ్యక సంహార ఘట్టం, జానపద కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య యశవంతపుర: భార్యను 15 సార్లు కత్తితో పొడిచి చంపి, ఆపై భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు జ్ణానభారతి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఉళ్లాళ మెయిన్ రోడ్డు ప్రైస్ లేఔట్లో నివాసం ఉంటున్న మంజు (27), ఆమె భర్త ధర్మశీలన్ (29) మృతులు. తమిళనాడుకు చెందిన ధర్మశీలన్ దుబాయ్లో పెయింటర్గా పని చేసేవాడు. తరువాత బెంగళూరుకు వచ్చి ఓ ఇంటిలో బాడుగకు దిగారు. వ్యాపారం చేసేవాడు. అతడు మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో తరచూ భార్యతో గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు. ఆదివారం రాత్రి కూడా పెద్ద రగడ జరిగింది. ఈ ఆవేశంలో అకృత్యానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం పోలీసులు కేసు నమోదు చేశారు. వర్ష బాధితులను పట్టించుకోరా? ● సర్కారుకు బీజేపీ ప్రశ్న శివాజీనగర: కళ్యాణ కర్ణాటక, కిత్తూరు కర్ణాటక భాగంలో 8కి పైగా జిల్లాల్లో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం వర్ష బాధితుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ నేతృత్వంలో రెండు బృందాలు ఆయా జిల్లాలలో పర్యటించాయి. ఓవైపు అతివృష్టి, నదులు ఉప్పొంగి ఇబ్బందులు పడుతున్నా పరిష్కార చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పలు ప్రదేశాలలో ఇళ్లు కూలిపోగా వందలాది మంది నిరాశ్రయులయ్యారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ బాధితులను కలిసింది లేదని దుయ్యబట్టారు. ఆ భవనాలకూ నీరు, కరెంటు వసతి! శివాజీనగర: గ్రేటర్ బెంగళూరు పరిధిలో, రాష్ట్రంలో వివిధ చోట్ల పెద్ద స్థలాల్లో ప్లాన్ అనుమతి పొందకుండా, ప్లాన్ ఉల్లంఘించి నిర్మించిన భవనాలకు విద్యుత్, నీటి కనెక్షన్ల అంశం మీద సీఎం సిద్దరామయ్య సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. 30 ఇన్టు 40 చదరపు గజాల్లో అనుమతులు లేకుండా కట్టిన ఇళ్లకు కరెంటు, నీటి కనెక్షన్లు ఇవ్వాలని గతంలో సర్కారు ఆదేశించింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భవనాలకు కూడా ఇలాంటి వెసులుబాటు ఇవ్వడంపై చర్చించారు. చివరకు వాటికి కూడా ఓసీ, సీసీ ద్వారా రాయితీ ఇవ్వడానికి ఆమోదం తెలిపారని అధికారులు చెప్పారు. ఈ భేటీలో ఇంధన మంత్రి కే.జే.జార్జ్, నగరాభివృద్ధి మంత్రి భైరతి సురేశ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వాలిన 3 అంతస్తుల భవనం
● నెలమంగళలో కలకలం దొడ్డబళ్లాపురం: బెంగళూరు లో భవనాలు వాలిపోవడం పరిపాటిగా మారుతోంది. కోరమంగళలోని జక్కసంద్రలో చిన్న స్థలంలో 5 అంతస్తుల భవనాన్ని కట్టగా, అది వారంరోజుల కింద వాలిపోవడంతో కూల్చివేస్తున్నారు. ఇంతలోనే నెలమంగల సమీపంలోని మాదావరలో ఒక భవనం ఒరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం శ్రీనివాస్ అనే వ్యక్తి నిర్మించిన ఈ మూడు అంతస్తుల భవనం హఠాత్తుగా అర అడుగు మేర పక్కకు వాలింది. దీంతో ఇందులో నివసిస్తున్న 6 కుటుంబాలు భవనాన్ని ఖాళీ చేశాయి. నాసిరకంగా కట్టినట్లు స్థానికులు ఆరోపించారు. యజమాని మాట్లాడుతూ తాను కాంట్రాక్టర్నని, తన ఇంటిని ఎందుకు నాణ్యత లేకుండా కట్టుకుంటానని అన్నాడు. రూ.80 లక్షల ఖర్చుతో పటిష్టమైన పిల్లర్లు వేసి ఇల్లు కట్టించానన్నాడు. పోలీసులు, నగరసభ అధికారులు భవనాన్ని పరిశీలించారు. ఆనుకుని ఉన్న ఇళ్లవారిని ఖాళీ చేయాలని సూచించారు. దీనిని కూల్చివేసే అవకాశాలున్నాయి. రోడ్ల గుంతలు, చెత్త ఉండరాదు బనశంకరి: బెంగళూరు కేంద్ర నగర పాలికె పరిధిలో రోడ్ల గుంతలను పూడ్చివేయాలని ఆ ప్రాంత పాలికె కమిషనర్ రాజేంద్రచోళన్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం చిక్కపేటేలో స్కూటర్లలో సంచరిస్తూ పలు రోడ్లను పరిశీలించారు. రోడ్ల గుంతలను సరిచేసి జీబ్రా క్రాసింగ్లు, మార్కింగ్లు వేయాలని తెలిపారు. జంక్షన్లలో మిగిలిపోయిన మరమ్మతులు చేయాలన్నారు. హోసూరురోడ్డు అధ్వాన్నంగా ఉందని, తారు వేయాలని తెలిపారు. రోడ్ల పక్కన చెత్త రాశులను చూసి వెంటనే తొలగించాలని ఆదేశించారు. జేసీ రోడ్డులోని నగరపాలికె స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి అభివృద్ధి చేయాలన్నారు. అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. -
గోతుల రోడ్లు.. లారీ అతివేగం.. విద్యార్థిని దుర్మరణం
కృష్ణరాజపురం: సిలికాన్ సిటీలో విపరీతమైన వాహన రద్దీ, గుంతల రోడ్లు కలిసి యువత ప్రాణాలను తీస్తున్నాయి. తరచూ రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడమో, తీవ్ర గాయాలు కావడమో జరుగుతున్నా సర్కారులో చలనం రావడం లేదు. కాలేజీకి వెళుతున్న విద్యార్థినిని టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టిన ప్రమాదంలో ఆమె అక్కడే దుర్మరణం చెందింది, ఈ దుర్ఘటన బెంగళూరులోని కృష్ణరాజపురం ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆవులహళ్ళి మెయిన్రోడ్డులో జరిగింది. వివరాలు.. నారాయణమఠం నివాసి అయిన ధనుశ్రీ (22) అనే యువతి ఓ ప్రైవేటు కాలేజీలో బీకాం రెండో ఏడాది చదువుతోంది. సోమవారం ఉదయం 8:30 గంటలకు ఆమె కాలేజీకి స్కూటర్లో బయల్దేరింది. భూదిగెరె క్రాస్ రోడ్డులో ఎక్కడ చూసినా గుంతలు తేలాయి. ఆమె గుంతలను తప్పించుకుని నెమ్మదిగా వెళ్తుండగా వేగంగా వచ్చిన టిప్పర్ లారీ స్కూటర్ను ఢీకొని ఆమె మీద నుంచి వెళ్లిపోయింది. కిందపడి తీవ్ర గాయాలు అయిన ధనుశ్రీ రక్తపుమడుగులో ప్రాణాలు విడిచింది. మృతదేహం నుజ్జునుజ్జయి శరీరభాగాలు చెల్లాచెదరుగా పడ్డాయి. స్థానికులు చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆవులహళ్ళి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో గంటలకొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. లారీ కోసం గాలింపు చేపట్టారు. బెంగళూరులో ఘోరం -
రాయలసీమ రైతులకు న్యాయం చేయాలి
బనశంకరి: కేంద్ర ప్రభుత్వం రాయలసీమ పై కళ్లు తెరవాలని, తరతరాలుగా రాయలసీమ కు పాలకులు అన్యాయం చేస్తున్నారని రాయలసీమ రాష్ట్రసమితి వ్యవస్దాపక అద్యక్షుడు ఉద్యమనేత డాక్టర్ కుంచం వెంకటసుబ్బారెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ద్వజమెత్తారు. సోమవారం యలహంకలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రాయలసీమరైతులు కష్టాలు ఏనాటికి నెరవేరుతాయో కాలమే చెప్పాలన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే జలయజ్ఞం పేరుతో రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జలయజ్ఞంలో మరో ముఖ్యమైన ప్రాజెక్టు దుమ్ముగూడెం నాగార్జున టైల్ పాండ్ ఆయన మరణంతో నిలిచిపోయిందన్నారు. ఆయన జీవించి ఉంటే 160 టీఎంసీల గోదావరిజలాలను నాగార్జునసాగర్లోనికి పంపి, ఆ మేరకు కృష్ణా జలాలను శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు మళ్లించి ఉండేవారన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం పట్టిసీమ ద్వారా నీళ్లు ఇస్తామని అవాస్తవాలు చెప్పారన్నారు. ఈసారైనా గోదావరి జలాలను రాయలసీమ ప్రాజెక్టులకు తరలిస్తారని రైతులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారని, ఆ మేరకు ప్రభుత్వం సాకారం చేయాలని డిమాండ్ చేశారు. -
కేసు కొట్టివేతకు ప్రజ్వల్ అర్జీ
శివాజీనగర: ఇంటి పనిమనిషి మీద అత్యాచారం, అశ్లీల వీడియోల కేసులో జేడీఎస్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు ఆగస్టు నుంచి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జీవితఖైదును అనుభవిస్తుండడం తెలిసిందే. కింద కోర్టు విధించిన యావజ్జీవిత శిక్షను రద్దు చేయాలని ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో ఏముంది? 2021 జనవరి నుంచి 2022 జనవరి ఆఖరి వరకు బెంగళూరు బసవనగుడిలోని ఇంట్లో ఆమె మీద అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. 2024 మే 10న మా ఇంటికి వచ్చిన సిట్ అధికారులు పరుపులు, దిండ్లను తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. మూడేళ్లపాటు బెడ్పై బట్టలను మార్చకుండా, క్లీన్ చేయకుండా ఉంటారా అనేది కింది కోర్టు పరిగణించలేదు అని ప్రజ్వల్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఇంకా అనేక అంశాలను అందులో ప్రస్తావించి కేసును కొట్టివేయాలని కోరాడు. గోదాములో కూడా మూడేళ్ల తరువాత దుస్తులపై మరకలు, ఇతర ఆధారాలను సేకరించామనడం నమ్మశక్యం కాదని, కాబట్టి కేసును రద్దు చేయాలని విన్నవించాడు. హైకోర్టులో పిటిషన్ దాఖలు -
ఆకాశంలో మాయాజాలం
ఆకట్టుకున్న పాలపుంత, గర్జిస్తున్న పులి ఆకారాలు పొట్టేళ్ల ప్రదర్శనలో విన్యాసాలు మైసూరు: మైసూరు దసరా ఉత్సవాలలో ఆకాశంలో అద్భుతం జరిగింది. సింహవాహనంపై ఆసీనురాలైన చాముండేశ్వరి అమ్మవారు, దసరా అంబారీ ఏనుగు, పెద్ద పులి, సర్పంపై నర్తిస్తున్న శ్రీకృష్ణుడు, పాల పుంత ఇలా అనేక రూపాలు ఆవిష్కృతమయ్యాయి. వాటిని చూస్తూ ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. డ్రోన్ల ఇంద్రజాలం ఆదివారం రాత్రి అత్యంత ఆకర్షణీయమైన డ్రోన్ల కళా ప్రదర్శన విజయవంతంగా సాగింది. బన్ని మంటప కవాతు మైదానంలో రాష్ట్ర విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 3 వేల డ్రోన్లతో ప్రదర్శన ఆద్యంతం అబ్బురపరచింది. టెక్నీషియన్లు ఆకాశంలో డ్రోన్లను క్షణాల్లోనే రకరకాల రూపాల్లో అమర్చుతూ కళారూపాలను ఏర్పరిచారు. ఈ కార్యక్రమం గిన్నిస్బుక్ రికార్డులోకి ఎక్కడం గమనార్హం. వేలాదిమంది ప్రజలు తరలివచ్చి డ్రోన్ షోను వీక్షించారు. కొన్ని ఆకారాలకు 2 వేల డ్రోన్లు, కొన్ని ఆకారాలకు 3 వేల డ్రోన్లను ఉపయోగించారు. అవాంతరాలు లేకుండా సజావుగా సాగింది. నల్లటి ఆకాశంలో రకరకాల లైట్లతో డ్రోన్లు ఆకారాలను ఏర్పరిచాయి. ప్రజలు మొబైళ్లు, కెమెరాలతో బంధించారు. హుషారుగా గాన కచేరీ ప్యాలెస్ ఎదుట వేదికపై ప్రముఖ గాయకుడు కునాల్ గంజన్వాలా బృందం హిందీ, కన్నడ పాటల గానకచేరీ ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసింది. పాటలు, సంగీతానికి మైమరిచి చిందులేశారు. అలాగే శునకాల ప్రదర్శన ఆకట్టుకుంది. గాన కచేరీలో ప్రేక్షకుల ఉత్సాహం కునాల్ గంజన్వాలా పాట కచేరీకాళీయ మర్ధనం చేస్తున్న కన్నయ్య సింహ వాహనంపై చాముండేశ్వరి మాత రూపం ఆవిష్కరణ 3 వేల డ్రోన్లతో వినూత్న ప్రదర్శన మైసూరు దసరాలో మంత్రముగ్ధం -
ఇద్దరు శ్రీలంక పౌరులు అరెస్ట్
యశవంతపుర: బెంగళూరులో అక్రమంగా నివాసం ఉన్న ముగ్గురు శ్రీలంక పౌరులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. దేవనహళ్లి సమీపంలోని అపార్ట్మెంట్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టారు. విదేశీ చట్టం కింది కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఎందుకు నివాసం ఉంటున్నారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. పాస్పోర్టు, వీసా లేకూండా 2024లో జాప్నా నుంచి బోటులో తమిళనాడు రామేశ్వరానికి శ్రీలకం పౌరులు వచ్చారు. అక్కడి నుంచి బెంగళూరుకు చేరుకుని.. దేవనహళ్లి సమీపంలోని ఒక అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విదేశీ పౌరులకు బాడుగ ఇళ్లు ఇవ్వాలంటే బాడిగ ఇంటి యజమాని పోలీసులకు సీ ఫారం ఇవ్వాలనే నిబంధన తప్పనిసరిగా ఉంటుందని పోలీసులు తెలిపారు. కంటైనర్ పల్టీదొడ్డబళ్లాపురం: అదుపు తప్పిన కంటెయినర్ వాహనం రహదారిపై పల్టీ కొట్టిన సంఘటన నెలమంగల టోల్ వద్ద చోటుచేసుకుంది. తుమకూరు నుంచి బెంగళూరు వస్తున్న కంటెయినర్ ఒకటి నెలమంగల టోల్ వద్ద హఠాత్తుగా అదుపుతప్పింది. రోడ్డుపై అడ్డంగా బోల్తా పడింది. గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్రేన్ల సాయంతో కంటెయినర్ను రోడ్డు పక్కకు తొలగించారు. కంటెయినర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులకు ఆరోగ్య శిబిరంయశవంతపుర: బెంగళూరు నగరంలో పని చేస్తున్న పోలీసు సిబ్బంది, అధికారులకు అరోగ్య శిబిరం నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్ సీమంత కుమార్ సింగ్ నేతృత్వంలో ఉప పోలీసు కమిషనర్ల సహకారంతో ఒక వారం వ్యవధిలో మానసిక అరోగ్య శిబిరం నిర్వహించారు. మానసిక అరోగ్య సమస్యలు, ఆత్మహత్యల నివారణపై వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో 100 మంది అధికారులు, సిబ్బంది పాల్లొన్నారు. నవదుర్గ నృత్య రూపకం గౌరిబిదనూరు: ఆదివారం రాత్రి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నగరంలో శారదామాత ఆలయంలో నాట్యాలయ విద్యార్థుల నవదుర్గా భరతనాట్య రూపకం భక్తులను ఆకటుకుంది. దుర్గామాత గొప్పతనాన్ని నృత్యం ద్వారా మనోహరంగా చాటిచెప్పారు. గ్రామ చెరువులోకి భైరప్ప చితాభస్మందొడ్డబళ్లాపురం: ప్రముఖ రచయిత, పద్మభూషణ్ ఎస్ఎల్ భైరప్ప చితాభస్మాన్ని ఆయన స్వగ్రామం చెన్నపట్టణ తాలూకా సంతేశివర చెరువులో కలిపారు. సోమవారంనాడు ఆయన కుమారులు రవిశంకర్, ఉదయ్లు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సీఎన్ బాలక్రిష్ణ, మాజీ ఎమ్మెల్సీ గోపాలస్వామి, వందలాది మంది గ్రామస్తులు హాజరయ్యారు. హాస్యనటుడు యశ్వంత్ మృతియశవంతపుర: రంగస్థల కళాకారుడు, కన్నడ సినిమా రంగంలో హాస్యనటుడిగా గుర్తింపు పొందిన యశ్వంత్ సరదేశ పాండె (62) గుండెపోటుతో కన్ను మూశారు. బెంగళూరు బన్నేరఘట్ట సమీపంలోని ఫోటీస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించిన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కన్నడ సూపర్ హిట్ సినిమా రామ శామ భామ సినిమాలో నటించడంతో యశ్వంత్కు గుర్తింపు వచ్చింది. గస్థలంలో మంచి నాటకాలకు దర్శకత్వం వహించారు. ఈయన విజయపుర జిల్లా బసవన బాగేవాడి తాలూకా ఉక్కలి గ్రామానికి చెందిన వారు. ఆల్ ది బెస్ట్ నాటకాన్ని అయనే రచించి, దర్శకత్వం వహించి అందులో నటించి మంచి పేరు సంపాదించారు. ఈయనకు భార్య మాలతి, పిల్లలు ఉన్నారు. శారదా మాతగా దర్శనంతుమకూరు: తుమకూరు జిల్లా పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా వేడుకల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మండపంలో చాముండేశ్వరి దేవిని సోమవారం శారదా దేవి రూపంలో అలంకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టీబీ జయచంద్ర, భార్య నిర్మల, జడ్పీ సీఈఓ ప్రభు, నాగన్న తదితరులు దర్శించుకుని పూజలు చేశారు. -
చదువుల తల్లీ పాహిమాం
చంద్రలేఖ విభూషిత మాత రూపంలో శాకంబరీ దేవి సరస్వతీ దేవి అలంకరణలో లక్ష్మీ వేంకటేశ్వరుడుసరస్వతీ దేవి అలంకారంబనశంకరి: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో 8వ రోజు సరస్వతీ మాత అలంకారంలో భక్తులకు బనశంకరీదేవీ దర్శనమిచ్చింది. అర్చకులు సోమవారం వేకువజామున సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం చేపట్టి తరువాత అమ్మవారికి విశేష అలంకారం చేశారు. యాగశాలలో శ్రీసరస్వతి హోమం చేపట్టి మధ్యాహ్నం 1 గంటకు పూర్ణాహుతి చేశారు. ఆలయంలోని శాకంబరీదేవిని శ్రీచంద్రలేఖ విభూషిత దేవి రూపంలో అలంకరించారు. పెద్దఎత్తున అమ్మవారిని దర్శించుకుని నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన గావించారు. బొమ్మనహళ్లి: హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని ఆగర గ్రామంలో వెలసిన లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. సోమవారం స్వామివారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయ ప్రధాన అర్చకుడు అనంతపురం చంద్రమౌళి ఆధ్వర్యంలో స్వామిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యుడు అయిన సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. -
నగదు దొంగ అరెస్ట్
చిక్కబళ్లాపురం: నగదు చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. ఈనెల 23వ తేదీన నగరంలోని బీబీ రోడ్డులో ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో తాలూకా పరిధిలోని దిబ్బూరు గ్రామానికి చెందిన మునిరాజు దేవుడి దర్శనానికి వెళ్లాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మునిరాజు జేబులో నుంచి రూ.50 వేలు చోరీ చేశాడు. బాధితుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒడిషాకు చెందిన దాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. నగదు తానే చోరీ చేసినట్లు దాస్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అనంతరం అతడి నుంచి రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ మంజునాథ్, పీఎస్ఐ రత్నాబాయి ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సె అభినందించారు. ఉచిత ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోండిగౌరిబిదనూరు: గ్రామీణ ప్రదేశాల్లో వివిధ సంస్థలు నిర్వహించే ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాలూకా వైద్యాధికారి హేమలత పిలుపునిచ్చారు. సోమవారం నక్కలపల్లి పీహెచ్సీలో ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరం నిర్వహించారు. రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ క్యాన్సర్ తదితరుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థలోని జ్ఞానవికాస కార్యక్రమాల గురించి ప్రాజెక్ట్ అధికారి నాగరాజ నాయక్ తెలిపారు. కార్యక్రమంలో అశ్విని, సుధ, తదితరులు పాల్గొన్నారు. రక్తదానంతో ప్రాణదానం బొమ్మనహళ్లి: అన్నిదానాల్లోకి రక్తదానం చాలా గొప్పదని, ఒకరు రక్తదానం చేయడం ద్వారా ప్రమాదాలలో గాయపడిన, ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న సుమారు ఐదుమంది ప్రాణాలను కాపాడవచ్చని, ఇందుకోసం యువతతో పాటు ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని బొమ్మనహళ్ళి ఎమ్మెల్యే.ఎం.సతీష్రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సాయిబాబా ఆలయ ఆవరణలో ఉచిత ఆరోగ్య శిబిరం, రక్తదాన శిబిరాలను ఆయన ప్రారంభించారు. సమారు 70 మందికి పైగా యువకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. విద్యతోనే ఉన్నతస్థాయికిగౌరిబిదనూరు: శ్రీకృష్ణుడు గొప్ప తత్వజ్ఞాని, దార్శనికుడని, ఆయన ఆదర్శాలు ఆచరణయోగ్యమని ఎమ్మెల్యే పుట్టస్వామిగౌడ అన్నారు. హెచ్ఎన్ కళాభవనంలో యాదవ సంఘంచే ఆదివారం సాయంకాలం జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రారంభించి ప్రసంగించారు. మీ పిల్లలను విద్యావంతులు చేయండి, చదువుద్వారానే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి, బీపి కృష్ణమూర్తి, దొడ్డబళ్ళాపురం ఎమ్మెల్యే ధీరజ్ మునిరాజు, ఆ వర్గం ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభావంత విద్యార్థులను సన్మానించారు. ప్రైవేట్ ప్రాణి పాలన కేంద్రంపై దాడి యశవంతపుర: ఉడుపి జిల్లా బ్రహ్మవర తాలూకా సాలుగ్రామంలో అనధీకృతంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ ప్రాణిపాలనా కేంద్రంపై అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడ ఉన్న అనేక జంతువులను రక్షించారు. పేటా ఇండియా సంస్థ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ దాడులు చేశారు. గతంలోనూ ఇలానే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దాడులు చేపట్టారు. మళ్లీ నిర్వహకులు అనధీకృతంగా కుక్కలను పెంచుతుండటంతో నిర్వహకుడు సుదీంద్ర ఐతాళను అధికారులు హెచ్చరించి పంపారు. అక్కడ దొరికిన కుక్కలను సురక్షితమైన చోట వదిలినట్లు అధికారులు తెలిపారు. కుక్కలతో పాటు పిల్లులను రక్షించారు. -
హౌస్కీపర్ దొంగావతారం
యశవంతపుర: పని చేస్తున్న ఇంటిలో బంగారం, వజ్రాలను చోరీ చేసిన ఉత్తరప్రదేశ్కు చెందిన దొంగని బెంగళూరు జేసీ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. మిల్లర్ రోడ్డులోని ఒక ఇంటిలో యూపీ నుంచి వచ్చిన వలస కార్మికుడు హౌస్కీపర్గా పని చేస్తున్నాడు. ఇంటిలో విలువైన బంగారం, వజ్రాల నగలు ఉన్నట్లు చూశాడు. ఇటీవల 236 గ్రాముల బంగారం, వజ్రాల నగలను దోచుకొని పరారయ్యాడు. యజమాని జేసీ నగర పోలీసులకు ఫిర్యాదు చేయగా, యూపీలో దాగి ఉన్న దొంగని పట్టుకుని వచ్చారు. రూ.53 లక్షల విలువైన సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. హైవేలలో పిల్ల దొంగల ముఠా.. దొడ్డబళ్లాపురం: 3 రోజుల్లో 37 దోపిడీలకు పాల్పడిన 6 మంది మైనర్ల గ్యాంగ్ను దొడ్డబళ్లాపురం గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. మాదనాయకనహళ్లి, దొడ్డబళ్లాపురం, సూర్యనగర, బ్యాడరహళ్లి నెలమంగల పోలీస్స్టేషన్ల పరిధిలో మూడు బైక్లపై హైవేలలో తిరిగేవారు. బైకిస్టులు, లారీలు, కార్లు తదితర వాహనదారులను అడ్డగించి దోపిడీలకు పాల్పడేవారు. డబ్బులు ఇస్తే సరే, ఎవరైనా ఎదురుతిరిగితే కత్తితో దాడి చేసి దోచుకుని పరారయ్యేవారు. అన్ని దోపిడీలు ఒకే రకంగా జరగడంతో సీసీ కెమెరాల చిత్రాలు, బాధితుల సమాచారం మేరకు సోదాలు చేసి పిల్ల దొంగల ముఠాను పట్టుకున్నారు. కొంత డబ్బు, విలువైన వస్తువులు, బైక్లను సీజ్ చేశారు. వజ్రాల నగలు సీజ్ -
బోల్తాపడిన టెంపో ట్రావెలర్
శివమొగ్గ: వేగంగా వెళ్తున్న టెంపో ట్రావెలర్ వాహనం అదుపు తప్పడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న సుమారు 14 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శివమొగ్గ జిల్లా, సాగర తాలుకా సిగందూరు రోడ్డులో ఉన్న హులిదేవరబన సమీపంలోని కోరనకొప్ప గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. గాయపడిన వారందరూ బెంగళూరు నగరానికి చెందిన వారని గుర్తించారు. బెంగళూరుకు చెందిన కొందరు సిగందూరు దేవాలయానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తొలుత బెంగళూరు నగరం నుంచి సాగర వరకు రైలులో వచ్చారు. అక్కడి నుంచి సిగందూరుకు అద్దెకు టెంపో ట్రావెలర్ వాహనం మాట్లాడుకుని బయలుదేరారు. హులిదేవరబన సమీపంలోని కోరనకొప్ప గ్రామం వద్దకు చేరుకోగానే.. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయిన టెంపో ట్రావెలర్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రెక్ వేశాడు. అదుపుతప్పిన వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సాగర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 14 మంది ప్రయాణికులకు గాయాలు -
దసరా ఆఫర్.. లాఠీచార్జీ
బనశంకరి: దుస్తులు తక్కువ రేటు అని ఆఫర్ ఇవ్వడంతో ఒక్కసారి కస్టమర్లు దుకాణంలోకి ఎగబడటంతో తొక్కిసలాట నెలకొంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటన హాసన్ నగర ఉదయగిరి లేఔట్లో జరిగింది. లక్ష్మీ బ్యాడ్మింటన్ అకాడమి భవనంలో ఓ షాపులో దసరా ఆఫర్ని ప్రకటించారు. ఆదివారం భారీగా యువకులు రావడంతో తొక్కిసలాట ఏర్పడింది. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పి చెదరగొట్టారు. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కేరళ విద్యార్థుల గంజాయి దందా బనశంకరి: గంజాయి భూతం విద్యార్థులు, యువత మీద పంజా విసురుతోంది. ఆదివారం మంగళూరు దక్షిణ పోలీసులు ఓ ఫ్లాటులో సోదాలు చేయగా 12 కేజీల గంజాయి లభించింది. అందులో ఉంటున్న 11 మంది కేరళ విద్యార్థులను అరెస్టు చేశారు. నగర పోలీస్ కమిషనర్ సుధీర్కుమార్ రెడ్డి వివరాలను వెల్లడించారు. అత్తావర కాపీగుడ్డ మసీదు వద్ద గల కింగ్స్ కోర్ట్ అపార్టుమెంట్లోని ఓ ఫ్లాట్లో గంజాయిని అమ్ముతున్నట్లు తెలిసింది. వెంటనే పోలీసులు దాడిచేశారు. 11 మంది బీబీఏ విద్యార్థులను అరెస్టు చేశారు. వీరు మంగళూరు కాలేజీలో బీబీఏ రెండో ఏడాది చదువుతున్నారు. గంజాయిని సేవించడంతో పాటు ఈజీ మనీ కోసం దానిని అమ్మేవారని గుర్తించారు. అరెస్టు చేసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గంజాయి దందాపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. మహిళలకు బైక్ రైడింగ్ పోటీలుతుమకూరు: తుమకూరు దసరా ఉత్సవాల సందర్భంగా ఆదివారం మహిళా దసరా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బైక్ రైడింగ్ పోటీలు నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హెల్మెట్ ధరించి రోడ్లపై దూసుకెళ్లారు. అంతకుముందు బైక్ రైడింగ్ను మంత్రి పరమేశ్వర్ ప్రారంభించారు. కలెక్టర్ శుభకళ్యాణ్, ఉప విభాగం అధికారి పాల్గొన్నారు. -
బైక్ను ఆర్టీసీ బస్సు ఢీ.. ముగ్గురు బలి
దొడ్డబళ్లాపురం: బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందిన సంఘటన హాసన్ జిల్లా హొళేనరసీపుర తాలూకా యడెగౌడనహళ్లిలో జరిగింది. మృతులను హొళేనరసీపుర పట్టణ నివాసులు తరుణ్ (19), రేవంత్ (26), ఇర్ఫాన్(20)లుగా గుర్తించారు. హాసన్ నుంచి మైసూరు వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు.. ఘటనాస్థలిలో వేగంగా బైక్ను ఢీకొంది. బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు తీవ్ర గాయాలతో పడిపోయారు. ఇర్ఫాన్ అక్కడే చనిపోగా, రేవంత్, తరుణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. హళ్లి మైసూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రామకోటి మహాయజ్ఞంచింతామణి: తాలూకాలో కై వారం గవి దగ్గర ప్రకృతి ఒడిలో ఉన్న యోగా నరసింహస్వామి వైకుంఠ యోగశాలలో రామభావతార మంత్ర రామకోటి జపయజ్ఞ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గోపూజతో ప్రారంభించారు. గణపతి, మహాలక్ష్మీ ,యోగానరసింహస్వామి, సద్గురు యోగినారేయణ తాతయ్య విగ్రహాలకు విశేష పూజలను నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రామకోటిని 24 గంటలపాటు చేపట్టారు. కై వార ధర్మాధికారి జయరాం దంపతులు, విభాకరరెడ్డి, సత్యనారాయణ, విద్వాన్ బాలకృష్ణ పాల్గొన్నారు. నకిలీ పత్రాలతో బీడీఏ స్థలాలకు ఎసరు దొడ్డబళ్లాపురం: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బీడీఏ స్థలాలను కబళిస్తున్న ముగ్గురు కిలాడీలను బెంగళూరు శేషాద్రిపురం పోలీసులు అరెస్టు చేశారు. కే.చిక్కరాయి (68), మురళీధర్ (60), మంజునాథ్ (48)అరైస్టెన నిందితులు. బీడీఏ నాడప్రభు కెంపేగౌడ కాలనీలో ఓ స్థల యజమాని మరణించారు. ఆ స్థలాన్ని వీరు నకిలీ పత్రాలతో వారి పేరున రిజిస్టర్ చేయించుకున్నారు. మృతుని భార్య లక్ష్మిదేవమ్మ స్థలం వద్దకు వెళ్లగా నీది కాదు అని దౌర్జన్యం చేశారు. దీంతో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. గతంలో బీడీఏలో పని చేసి రిటైరైన ఉద్యోగి కే చిక్కరాయి, మంజునాథ్, బ్రోకర్ మురళీధర్ ముగ్గురూ కలిసి బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి మరో వ్యక్తిని స్థల యజమాని చూపి సైటును రిజిస్టర్ చేసుకున్నారు. ఇదేమాదిరిగా అనేక సైట్లను బోగస్ పత్రాలతో సొంతం చేసుకుని విక్రయించినట్టు తేలింది. వీరిని అరెస్టు చేసిన పోలీసులు మరిన్ని వివరాలు రాబడుతున్నారు. మైసూరుకు బస్సు చార్జీల వాత దొడ్డబళ్లాపురం: మైసూరు దసరా నేపథ్యంలో ప్రభుత్వం ప్రయాణికుల జేబుల్ని గుల్ల చేస్తోంది. కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రేట్లను రూ.20 చొప్పున పెంచింది. దసరా ఉత్సవాలు ప్రజలందరూ చూడాలని చార్జీలను తగ్గించి ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని ఎక్కడి నుంచైనా మైసూరుకు బస్సులో వెళ్తే రూ.20 అదనపు చార్జీని చెల్లించాలి. వేగదూత, ఐరావత, నాన్ స్టాప్, రాజహంస తదితర బస్సుల్లో కూడా ఇదే వర్తిస్తుంది. దసరా ఉత్సవాలు ముగిసే వరకూ చార్జీల బాదుడే. -
పండుగ వేళ.. వానల హోరు
యశవంతపుర: కన్నడనాట అనేక జిల్లాలలో నేటి నుంచి అక్టోబరు 4 వరకు భారీగా వానలు పడే అవకాశం ఉందని బెంగళూరు వాతావారణశాఖ ఆధికారులు తెలిపారు. ఈ కారణంగా కరావళి, మలెనాడు జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు. ఈ నెల 30న తుపాన్గా ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒడిశా తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అలజడి వల్ల కర్ణాటకలో వారంరోజులు కుండపోత వానలు పడే ఆస్కారముంది. చేపలు పట్టడానికి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు తెలిపారు. మరోవైపు బెంగళూరుతో పాటు ఽహావేరి, ధారవాడ, చిత్రదుర్గ, దావణగెరె, కోలార, రామనగర, మైసూరు, చామరాజనగర, శివమొగ్గ జిల్లాలో ఆదివారం నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయి. కరావళి జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉంది. ఉత్తర కర్ణాటకలో బాగలకోట, బీదర్, గదగ్, కలబురగి, కొప్పళ, రాయచూరు, విజయపుర, దక్షిణకన్నడ, ఉడుపి, యాదగిరితో పాటు 8 జిల్లాలలో ఆరెంజ్ ఆలర్ట్ను ప్రకటించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇప్పటికే అక్కడ వానలు జోరందుకున్నాయి. అత్యవసర చర్యలకు సీఎం ఆదేశం ఉత్తర కర్ణాటకతో సహా రాష్ట్రంలో భారీ వానలు పడే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎం సిద్ధరామయ్య సూచించారు. మహారాష్ట్రలో కురుస్తున్న వానలతో కృష్ణా, భీమా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భీమా తీరంలో నదికి అటు ఇటు ఉన్న గ్రామాలలోకి వరదనీరు ప్రవేశించింది. వరద ప్రాంతాలలో మకాం వేసి సహాయక చర్యలను చేపట్టాలని, జిల్లా ఇన్చార్జి మంత్రులు, ఐఏఎస్లు పర్యటించాలని సీఎం ఆదేశించారు. కలబురగి జిల్లాలో అతివృష్టి నెలకొంది. ఉత్తర జిల్లాల్లో అతలాకుతలం కళ్యాణ కర్ణాటకలో కలబురగి, విజయపుర, బీదర్, రాయచూరు, కొప్పళలో భారీ వానల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నవరాత్రుల సమయంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వ్యాపారాలు స్తంభించిపోయాయి. చేతికి వచ్చిన పంట నీటి పాలయ్యే ప్రమాదం ఉందని అన్నదాతలు వాపోతున్నారు. వరద ప్రాంతాలలో సహాయక చర్యలను చేపట్టాలని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత తాలూకాలలో గంజి కేంద్రాలను తెరవాలి, అత్యవసర సౌకర్యాలను కల్పించాలని కోరారు. బెళగావి బస్టాండు వద్ద జల్లువాన ఉత్తర కర్ణాటక జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయ్యింది అక్టోబర్ 4 వరకు భారీ వర్షసూచన ఉత్తర కర్ణాటకకు ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే ముమ్మరంగా వానలు పొంగిపొర్లుతున్న కృష్ణా, భీమా నదులు -
యువ దసరా ఉల్లాసం
మైసూరు: నాడ హబ్బ మైసూరు దసరాలో సుమారు 10 రోజుల నుంచి నిత్యం సాయంత్రం నగరవాసులను, పర్యాటకులను గాన సుధామృతంతో, నృత్యాలతో రంజిపంజేసిన యువ దసరా సంభ్రమం కన్నుల పండువగా ముగిసింది. నగర సమీపంలోని ఉత్తనహళి జ్వాలాముఖి దేవాలయం వద్ద సాగిన యువత దసరాలో ఆద్యంతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చివరిరోజు శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ పాటలు, డ్యాన్సులు, డీజే ఇంద్రజాలంతో ఉత్సాహభరింతగా సాగింది. ధూమ్ మచాలే, ధూమ్ మచాలే అనే పాట పాడుతూ ప్రఖ్యాత గాయని సునిధి చౌహాన్ డ్యాన్సు చేస్తూ ఉంటే ప్రేక్షకులు ఉత్సాహంతో ఊగిపోయారు. వేదిక ముందు భాగంలో వేలాదిమంది యువత సైతం నృత్యాలు చేస్తూ మైమరిచారు. ఆమె పలు హిట్ కన్నడ, హిందీ పాటలను ఆలపిస్తూ నృత్యంతో ఆకట్టుకున్నారు. జల్లుల మధ్య యువతరం కేరింతలు కొట్టారు. ● సునిధి చౌహాన్ గానంతో సమాప్తం ● పదిరోజులు నాన్ స్టాప్ కేరింతలు -
శరావతిపై 2 వేల మెగావాట్ల ప్రాజెక్టు!
బనశంకరి: శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకాలోని అంబుతీర్థ వద్ద జన్మించే శరావతి నది పశ్చిమ కనుమల్లో అత్యంత ప్రకృతి రమణీయ ప్రదేశంగా పేరుపొందింది. పర్యావరణపరంగా వైవిధ్యభరితమైన ప్రాంతాల గుండా దాదాపు 130 కిలోమీటర్లు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది కర్ణాటకలో విద్యుత్ ఉత్పత్తికి కూడా ప్రధాన వనరు. ఈ నదీజలాలపైనే... శరావతి జనరేటింగ్ స్టేషన్ (1,035 మెగావాట్లు), మహాత్మగాంధీ జలవిద్యుత్ కేంద్రం (139 మెగావాట్ల), లింగనమక్కి డ్యామ్ పవర్హౌస్ (55 మెగావాట్లు) విద్యుదుత్పాదనలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. విద్యుత్ వెలుగుల శరావతి దశాబ్దాలుగా ఈ కేంద్రాలు, థర్మల్ పవర్ యూనిట్లు కంటే తక్కువ ఖర్చుతో కర్ణాటకకు మిలియన్ల కొద్దీ యూనిట్ల విద్యుత్ను అందిస్తున్నాయి. కానీ ఈ నది వెంబడి ఉన్న ప్రాజెక్టులు తరచుగా పర్యావరణవేత్తలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణమౌతున్నాయి. ప్రస్తుతం కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీసీఎల్) శరావతి లోయ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుదుత్పత్తి పథకాలకు ప్రణాళికవేస్తోంది. శివమొగ్గ– ఉత్తర కన్నడ జిల్లా పరిధిలో ఈ ప్రాజెక్టు నిర్మాణమవుతోంది. లోయలో ఉన్న రెండు జలాశయాలను ఉపయోగించి మరో 2 వేల మెగావాట్లను ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాజెక్టు ప్లాన్ చేశారు. రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు అవుతుంది. దీని వల్ల మరింత విద్యుదుత్పత్తి జరిగి పరిశ్రమలకు, ఇళ్లకు వెలుగులు నింపుతుంది. అలాగే వేలాది ఉద్యోగ, ఉపాధి అవకావాలను సృష్టిస్తుందని విద్యుత్ అధికారులు తెలిపారు. మరింత ఉప్పునీటి సమస్య ఇది పర్యావరణ చట్టాల ఉల్లంఘన అని జీవవైవిధ్య మండలి మాజీ అధ్యక్షుడు అనంతహెగ్డే చెబుతున్నారు. వేలాది చెట్లను కొట్టివేస్తున్నారు. మామూలుగా శరావతి నదిలో 14 కిలోమీటర్ల వరకు సముద్రం నుంచి ఉప్పు నీరు చొరబడుతుంది. పంప్డ్ స్టోరేజ్ పథకం అమలైతే కోట్ల లీటర్ల నీటిని పైన ఉన్న రిజర్వాయరుకు తరలిస్తారు. గేరుసొప్పు జలాశయం నుంచి నదిలోకి ప్రవహించే నీటి ప్రమాణం తగ్గుతుంది. దీంతో ఉప్పు నీరు మరితం దూరం వరకు చొరబడి నది, అందులోని జలచరాల సంతతి ఆహారం దొరక్క నశిస్తుందని చెప్పారు. మరింత విద్యుదుత్పత్తి, ఉపాధి అవకాశాలు ప్రకృతికి నష్టమని పర్యావరణవేత్తల ఆందోళనలు అడకత్తెరలో చిక్కిన భారీ పథకం భూమి కుంగే ప్రమాదం శరావతి నది పరిసరాలు సున్నితమైన భూ ప్రదేశాలని, ఇక్కడ భారీ యంత్రాలతో సొరంగాలు, రిజర్వాయర్లను తవ్వితే భూమిపొరలు సడలిపోయి కుంగిపొయే ప్రమాదం సంభవించవచ్చని చెప్పారు. తవ్వకాల కోసం జరిపే పేలుళ్ల వల్ల వన్యజీవులు వలస వెళ్లవచ్చు. అంతేగాక లింగనమక్కితో పాటు ప్రముఖ జలాశయాలకు ఇది ప్రమాదం కావచ్చుననే భయం ఉందని సంరక్షణా జీవశాస్త్రవేత్త కేశవ కోర్క అన్నారు. గేరుసొప్ప నుంచి భూమి లోపల సొరంగం తవ్వడానికి కనీసం 1500 కార్మికులు 5– 6 ఏళ్లు పనులు చేస్తారు. నీటి వనరులు, అడవి కలుషితమౌతుందని పేర్కొన్నారు. రూ.10 వేల కోట్ల పథకంతో నష్టాలా? మరోవైపు ఇది పర్యావరణానికి మంచిది కాదని మేధావులు, పర్యావరణ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. రూ.10 వేల కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల వేలాదిగా చెట్లను కొట్టివేస్తారు, అడవి, నది ముప్పులో పడతాయన్నారు. విస్తృతమైన జంతువులు, వృక్ష జాతుల జీవ వైవిధ్యంతో కూడిన అభయారణ్యాన్ని సంరక్షించాల్సిన ప్రభుత్వమే ఉల్లంఘించి పథకం అమలుకు సిద్ధమైందని పర్యావరణవాదులు ఆరోపిస్తున్నారు. ఈ విద్యుత్ పథకం వద్దని అటవీశాఖ అధికారులు సర్కారుకు నివేదిక అందజేసినప్పటికీ సర్కారు పక్కన పెట్టి అనుమతి ఇచ్చిందని ఆరోపణలున్నాయి. -
ఖాకీలమంటూ రూ.1.1 కోట్లు దోపిడీ
దొడ్డబళ్లాపురం: దంపతులను, కారు డ్రైవర్ను కిడ్నాప్ చేసి రూ.1.1 కోట్లు దోచుకున్న 8 మంది దుండగులను బెంగళూరు హుళిమావు పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... శనివారం సాయంత్రం ఆర్ఆర్ నగర్కు చెందిన వ్యాపారి మోహన్ తన కారుడ్రైవర్ హేమంత్కు ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్లి రియల్ ఎస్టేట్ వ్యాపారి మోటరామ్ వద్ద డబ్బును తీసుకురావాలని చెప్పాడు. ఆ మేరకు హేమంత్ హుళిమావు పీఎస్ పరిధిలోని అక్షయనగరకు వెళ్లి మోటరామ్కు ఫోన్ చేశాడు. కాసేపటికి అక్కడకు తన భార్యతో కలిసి కారులో వచ్చిన మోటరామ్ కారు వెనుక డబ్బు ఉందని తీసుకోవాలని చెప్పాడు. అయితే అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు తాము పోలీసులమని, కారు చెక్ చేయాలని వీడియో తీస్తూ బెదిరించారు. దంపతులపై దాడి చేశారు. హేమంత్ను, మోటరామ్ దంపతులను బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసికెళ్లారు. అక్కడ మరో ఆరుగురు దుండగులు కలిసి వారిని బంధించారు. మరో 10 లక్షలు పంపాలని ఫోన్ హేమంత్ చేత యజమాని మోహన్కు ఫోన్ చేయించి రూ.10 లక్షలు పంపించాలని, లేదంటే హేమంత్ను చంపేస్తామని బెదిరించారు. అందుకు మోహన్ ఒప్పుకోలేదు. వెంటనే హుళిమావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు గాలింపు జరిపి 15 నిమిషాల్లో దుండగులు ఉన్న స్థలాన్ని కనిపెట్టారు. 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.1.1 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కమిషనర్ సీమంత్కుమార్ సింగ్ నగదును, స్వాధీనం చేసుకున్న 2 కార్లు, ఇతరత్రా సామగ్రిని పరిశీలించారు. ముగ్గురి కిడ్నాప్... పావుగంటలో పట్టేసిన పోలీసులు బెంగళూరు హుళిమావులో ఘటన -
వరద హోరు
వరుణుడి జోరు.. రాయచూరు రూరల్: మహరాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడు దంచికొడుతున్నాడు. భారీ వర్షాలకు వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కలబుర్గి, యాదగిరి, బీదర్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఉజ్జయిని, సీనా, బోరి వాగులు నీటితో కళకళలాడుతున్నాయి. భీమా నది నుంచి 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో గంజి కేంద్రాలను ఏర్పాటు చేశామని కలబుర్గి జిల్లా కలెక్టర్ పౌజియా తర్నూమ్ వెల్లడించారు. బీదర్ జిల్లా కమలా నగర్, ఔరాద్, హులసూరు, బాల్కీ, బీదర్లో పంట పొలాలు, ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. కలబుర్గి జిల్లా షేడమ్ తాలూకా ఉత్తరాది మఠం నీటిలో మునిగింది. వరద ఉధృతికి నీటిలో రెండు లారీలు ఆగిపోయాయి. జేవర్గి తాలూకా కట్ట సంగావి వద్ద జాతీయ రహదారి–50పై రాకపోకలకు ఆంటకం కలిగింది. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవడంతో ప్రజలు నడుచుకుంటూ వెళ్లిపోయారు. బెళగావి జిల్లాలో బాదామి, రామదుర్గలో నవిల్ తీర్థ జలాశయాల నుంచి నీరు దిగువకు విడుదల చేశారు. బస్సులు నీటిలోనే రాకపోకలు సాగించాయి. విజయపుర సోలాపూర్ మధ్య వాహనాల రాకపోకలను బంద్ చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. బీదర్లో కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోయింది. వర్షపు నీరు గ్రామంలోకి చేరింది. చించోళి తాలుకా జెట్టూరులో వాగులో నీటి ప్రవాహానికి 40 ఎద్దులు కొట్టుకుని పోయాయి. బీదర్ తాలూకా మల్ఖేడ్లో నెల రోజుల పసికందుతో మహిళ మిద్దె పైకి ఎక్కింది. క.క.భాగంలో విస్తారంగా వర్షాలు భీమా నది నుంచి 3.50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల దెబ్బతిన్న పంటలు నీటిలో కొట్టుకుపోయిన 40 ఎద్దులు బీదర్లో చెరువు కట్ట తెగడంతో గ్రామంలోకి ప్రవేశించిన నీరు -
ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి ప్రాధాన్యత
రాయచూరు రూరల్: జిల్లాలో ఎత్తిపోతల పథకాల అభివృద్ధిఇక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం మాన్వి తాలూకా ముద్దన గుడ్డ ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నదాతలకు శాశ్వత నీటి పారుదల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహిస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల రైతుల జీవన విధానంలో మార్పులు తెచ్చేందుకు సర్కార్ కృషి చేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు హంపయ్య నాయక్, జిల్లా అధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ, ఎస్పీ పుట్ట మాదయ్య, అమరేశప్ప, అబ్దుల్, బసనగౌడ పాటిల్, బాల స్వామి, రుద్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
బీవీబీ కళాశాలలో స్నేహ సమ్మేళనం
హుబ్లీ: తాలూకాలోని నుల్వి గ్రామంలో ఉన్న శ్రీ జగద్గురు రేణుకాచార్య బీవీబీ కళాశాలలో ఆదివారం వార్షిక స్నేహ సమ్మేళనం, దీపదాన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యుడు డాక్టర్.ఎస్వీ బెళగలి మాట్లాడుతూ.. గురువు కన్నా శ్రేష్టమైన స్థానం సమాజంలో ఏది లేదన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. బీవీబీ విభాగం ముఖ్యులు ఎంఆర్ పాటిల్, సువర్త న్యూస్ చానల్ సీనియర్ పాత్రికేయుడు గురురాజ హుగారను సన్మాంచారు. కార్యక్రమంలో డాక్టర్ బండివాడ కావ్య ఉమాసారే పాల్గొన్నారు. -
హళేబాతి గ్రామంలో శ్రమదానం
బళ్లారి రూరల్: దావణగెరె జిల్లా జెడ్పీ సీఈఓ గిత్తమాధవ విఠల్రావు శనివారం హళేబాతి గ్రామంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ స్వయంగా పరకను చేతపట్టుకుని వీధుల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు. చెత్తబండిని నడిపారు. ఇంటింటికి వెళ్లి పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. రోడ్లపై చెత్త వేయడం ద్వారా పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతాయని తెలిపారు. ఇంటి వద్ద పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛత హీ సేవా పాక్షిక–2025లో భాగంగా శ్రమదానం కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ అధికారులు, జీపీ అధ్యక్షుడు, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
భగత్సింగ్కు ఘన నివాళి
రాయచూరు రూరల్: నగరంలో ఆదివారం భగత్సింగ్ జయంతిని ఘనంగా నిర్వమించారు. సూపర్ మార్కెట్ వద్ద ఏఐడీవైఓ, ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో నాయకులు భగత్సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చెన్నబసవ మాట్లాడుతూ.. భగత్సింగ్ క్రాంతితో కూడిన ఆందోళనలు చేపట్టారన్నారు. దేశంలో ప్రజలకు గృహం, విద్య, ఉద్యోగం, ఆహార భద్రత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరుస్తున్న వ్యతిరేక విధానాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అంతకు ముందు భగత్సింగ్ చిత్రపటం వద్ద నినాదాలు చేశారు. హొసపేటె: షహీద్ భగత్ సింగ్ ఆశయ సాధనకు నేటి యువత కృషి చేయాలని ఏఐడీవైఓ జిల్లా నేత పాలక్ష కోరారు. ఆదివారం స్థానిక పునీత్ రాజ్కుమార్ మైదానంలో భగత్సింగ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాలక్ష మాట్లాడుతూ.. భగత్సింగ్ ఆశయం దోపిడీని అంతం చేయడమే నిజమైన స్వేచ్ఛ అని తెలిపారు. కార్యక్రమంలో ప్రకాష్ నాయక్ ఉమా తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి ధరలు ఢమాల్
సాక్షి, బళ్లారి/హొసపేటె/హుబ్లీ: ఈ ఏడాది ఉల్లి ధరలు భారీగా పతనమయ్యాయి. దేశంలో ఉల్లిగడ్డలు సాగు చేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర తర్వాత కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో హావేరి, బాగల్కోట, చిత్రదుర్గం తదితర జిల్లాల్లో వేలాది ఎకరాల్లో రైతులు ఉత్సాహంగా ఉల్లి సాగు చేశారు. విజయనగర జిల్లాలో ఈ సంవత్సరం 6,300 హెక్టార్ల విస్తీర్ణంలో ఉల్లి సాగు చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, మంచు కారణంగా 50 శాతానికి పైగా పంట దెబ్బతింది. ఉల్లికి మజ్జిగ వ్యాధి, ట్విస్టర్ వ్యాధి, తెగుళ్లు సోకాయి. పంట నాణ్యత లేకపోవడంతో ధరలు పడిపోయాయి. ధర ఒక్క సారిగా క్వింటాల్ రూ.300 పడిపోయింది. దళారులు, వ్యాపారులు, బ్రోకర్లు ఉల్లిని రిటైల్ వ్యాపారులకు మంచి ధరకు అమ్ముతున్నారని రైతులు భీమన్న సోము, దళవాయి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పంట సాగుకు చేసిన పెట్టుబడి ఖర్చు కూడా రాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లికి సరైన మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. ఒక వైపు భారీ వర్షాలు మరో వైపు పడిపోయిన ధరలతో హావేరి రైతన్నలు ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హవేరి జిల్లాలో 744 హెక్టార్ల ప్రాంతంలో ఉల్లి సాగు చేశారు. అయితే విఫరీతమైన వానలతో నాణ్యత లేకుండా పంట మారడంతో పైగా సగం పంట భూమిలోనే కుళ్లి పోయింది. ఉన్న ఫలంగా క్వింటా రూ.300లకు పడిపోవడంతో రైతన్నలు దిగులు చెందుతున్నారు. ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టి తక్కువ ధరకు విక్రయించడంతో వాహనం అద్దెకు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఒక్క హావేరిలోనే కాక బాగళకోట జిల్లాలోని ముదోళ, బాదామి తాలూకాల్లోని సివికేరి, నీరళగేరి, భగవతి, హొన్నకట్టి, అలాగు ముదోళ తాలూకాలోని లోకపుర, బోమ్మనగుడ్ని, మెట్టగుడ్డ, తిమ్మపురలో సాగు చేసిన ఉల్లి పరిస్థితి కూడా దయనీయంగా మారింది. సంబంధిత అధికారులు తక్షణమే దృష్టి సారించి పంట నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. లబోదిబోమంటున్న రైతులు -
కాత్యాయనీ.. జగజ్జననీ
● కొనసాగుతున్న శరన్నవ రాత్రి ఉత్సవాలు బళ్లారి రూరల్/బళ్లారి అర్బన్: నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం బళ్లారి నగరంలోని విద్యా నగర్లో గంగా మాత, అభయాంజనేయ స్వామి ఆలయాల్లో కాత్యాయిని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా పుష్పాలంకరణ, అర్చనలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. బళ్లారి నగర ఆరాధ్య దైవమైన కనక దుర్గమ్మను ఆభరణాలతో అలంకరించారు. విజయదశమి వరకు రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈఓ హనుమంతప్ప తెలిపారు. అలాగే హవంబావి సీతారామ ఆశ్రమంలో మహాలక్ష్మి అలంకరణ, పటేల్ నగర్ చిన్నదుర్గమ్మను సరస్వతీ దేవిగా అలంకరించారు. మిల్లర్పేట్ మల్నాడు దుర్గమ్మను విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఏళ్లు మక్కళ తాయి, బెంగళూరు రోడ్డు వాసవీ మాత, నగరేశ్వరి, బెంకి మారెమ్మ తదితర అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. బన్ని మహంకాళికి పూజలు.. సిరుగుప్ప: శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏడవ రోజున ఆదివారం నగరంలో వివిధ ఆలయాల్లో అమ్మవార్లను విశేషంగా అలకరించారు. 16వ వార్డు కృష్ణానగర్లో బన్ని మహంకాళి అమ్మవారికి విశేష పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అమ్మవార్లకు విశేష అలంకరణ.. హొసపేటె: ఆలయాల్లో దసరా శరన్నవ రాత్రి ఉత్సవాల కోలాహలం నెలకొంది. ఏడవ రోజు ఆదివారం నగరంలోని అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఎంజీ నగర్, టీబీ డ్యాం రహదారిలో ఉన్న ముకాంబిక దేవాలయం, ఎల్లమ్మగుడ్డలో ఉన్న రేణుక దేవికి పూజలు చేశారు. ఉచ్చమ్మ దేవిని తమలపాకులతో విశేషంగా అలంకరించారు. మహిళలతో అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం ఆలయాల్లో అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన, మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. పల్లకీలో ఊరేగిన కాళికా మాత.. రాయచూరు రూరల్: నగరంలోని కాళికా దేవాలయంలో అమ్మవారిని పల్లకీలో ఊరేగించారు. మమదాపూర్లో మారికాంబ దేవి, కాస్ బావి అంబా భవానీ, కందగడ్డ మారెమ్మ, గుంజల్లిలో శారదా దేవి రూపంలో అలకరించారు. సుంకులమ్మ దేవిని దుర్గామాతగా పూజించారు. కిల్లేరి మఠంలో శాంత మల్ల శివాచార్యులు మహిళలకు ఒడి బియ్యం పంచారు. ఉప్పరవాడి లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం, కన్యకా పరమేశ్వర ఆలయంలో గరుడ వాహనంలో స్వామిని ఊరేగించారు. మూన్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో శరన్నవ రాత్రి సాంస్కృతిక ఉత్సవాలను మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప ప్రారంభించారు. తెలంగాణ, కర్ణాటక, కేరళ, పంజాబ్, న్యూఢిల్లీ నుంచి వచ్చిన కళా బృందాలు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. కళాకారులు చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను అలరించింది. ఇక వైజాగ్ నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రతిభను చాటారు. -
వైద్య శిబిరానికి స్పందన
రాయచూరు రూరల్: పేదలు ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నగర సభ ప్రొబేషన్ కమిషనర్ పురురాజ్ సింగ్ సోలంకి, సభ్యుడు రమేష్ పేర్కొన్నారు. ఆదివారం ఆజాద్ నగరంలోని వి.జి.కులకర్ణి ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ముందు జాగ్రత్తలు పాటించి వ్యాధి నివారణకు సలహాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విజి కులకర్ణి, ఆస్పత్రి వైద్యుడు అజిత్ కులకర్ణి, హరీష్, అమరేష్, దండెప్ప బిరదార్ తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో 150 మందికి వైద్య చికిత్సలు చేశారు. 2న మైలార లింగేశ్వర కార్నికోత్సవం హుబ్లీ: తాలూకాలోని అమరగోళ అధ్యాపక నగర్లో వెలసిన లింగేశ్వర దేవస్థానంలో మాళతేశ స్వామి దసరా ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 2న సాయంత్రం 5 గంటలకు కార్నికోత్సవం జరగనుంది. ఈనెల 30 దుర్గాష్టమి, అక్టోబర్ 2న మహానవమి, అక్టోబర్ 2 విజయదశమి సందర్భంగా ఉదయం 11:15 గంటలకు పల్లకీ ఉత్సవం, మధ్యాహ్నం 3 గంటలకు జాతర, సాయంత్రం 5:15 గంటలకు గురువుల ఆశీర్వాదంతో కార్నికోత్సవం నిర్వహించనున్నారు. జమ్మిపత్రి సమర్పణ కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం చేస్తారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని మైలార లింగేశ్వర దేవస్థాన కమిటీ సభ్యులు కోరారు. దివ్యాంగులకు స్కాలర్షిప్స్ హుబ్లీ: దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు స్కాలర్షిప్స్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. 40 శాతం అంతకంటే ఎక్కువ అంగవైక్యలం కలిగిన వారు స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం 9, 10వ తరగతుల విద్యార్థులు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్ నుంచి పీజీ చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీ, పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్కు తల్లిదండ్రులు వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల్లోపు ఉండాలి. ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉండాలి. దేశ వ్యాప్తంగా 25 వేల మందికి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, 17 వేల మందికి పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్స్, టాప్క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ 300 మందికి మంజూరు చేస్తామని జిల్లా వృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారిణి కవిత ఓ ప్రకటనలో తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సస్పెండ్రాయచూరు రూరల్: రాష్ట్రంలో జరుగుతున్న కులగణన సమీక్షలో నిర్లక్ష్యం వహించిన అధికారిని సస్పెండ్ చేశారు. రాయచూరు జిల్లా లింగసూగురు తాలుకా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రమేష్ రాథోడ్పై సస్పెన్షన్ వేటు పడింది. ఆదివారం తహసీల్దార్ సత్యమ్మ ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా అధికారి నితీష్ రాథోడ్ విచారణ చేపట్టారు. విధుల నిర్వహణలో అలసత్వం, బీఎల్ఓలకు సహకారం అందించ పోవడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురిపై వేటు బళ్లారి రూరల్: దావణగెరె జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు, సిబ్బంది ఒకరిని శనివారం జిల్లా అధికారి జి.ఎం.గంగాధరయ్య స్వామి సస్పెండ్ చేశారు. జిల్లాలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 వరకు సామాజిక, శైక్షిణిక సమీక్ష నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జమాపురం ప్రాథమిక పాఠశాల సహ ఉపాధ్యాయుడు డి.కె.మంజునాథ్, దావణగెరె ఉత్తర వలయ వ్యాయామ ఉపాధ్యాయుడు హెచ్.బసవరాజును సస్పెండ్ చేశారు. అదేవిధంగా సిబ్బంది కె.ఆర్.దుర్గప్పను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
గుప్పెడంత స్థలంలో ఐదంతస్తుల ఇల్లు.. గృహప్రవేశానికి ముందే కూల్చివేత!
బనశంకరి(కర్ణాటక): బెంగళూరులో మరో భవనం కూలిపోవడానికి సిద్ధమైంది. కోరమంగల జక్కసంద్రలో ప్లాన్ను ఉల్లంఘించి అతి తక్కువ స్థలంలో నిర్మించిన ఐదు అంతస్తుల బిల్డింగ్ వాలిపోయింది. మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని ఐదు అంతస్తులు నిర్మించారు. రూ. కోటితో నిర్మాణం వివరాలు.. శాంతమ్మ అనే మహిళ ఏడాది క్రితం 3 అంతస్తుల కట్టడానికి పాలికె నుంచి అనుమతి తీసుకుంది. కానీ 15 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు స్థలంలో 5 అంతస్తుల కట్టడాన్ని నిర్మించింది. దీనికి రూ. కోటి వరకూ ఖర్చు చేసింది. వచ్చేవారం గృహప్రవేశం చేయాలని సిద్ధమయ్యారు. ఇంతలోనే భవనం పిల్లర్లు, గోడల్లో తీవ్రంగా పగుళ్లు వచ్చి ఓ వైపునకు వాలిపోయింది. ఎప్పుడైనా కూలితుందని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దక్షిణ నగర పాలికె అధికారులు పరిశీలించి కూల్చివేయాలని తీర్మానించారు. 2 రోజుల నుంచి కూలి్చవేత పనులు జరుగుతున్నాయి. ఈ ఖర్చును భవన యజమానే భరించాలని తెలిపారు. ఈ పని పూర్తయ్యేవరకు చుట్టుపక్కల ఇళ్లవారిని ఖాళీ చేయించారు. -
నకిలీ బంగారం.. రూ.65 లక్షలు మాయం
కృష్ణరాజపురం: బంగారం రేటు భారీగా పెరగడంతో మోసాలు చేసేవారికి అనువుగా మారింది. నకిలీ బంగారాన్ని అసలు బంగారమంటూ విక్రయించిన కోలారుకు చెందిన ఖతర్నాక్ ముఠాను హొసకోటె పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగర శివారు ప్రాంతాలనే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ముఠా హొసకోటె, నందగుడి, శిడ్లఘట్టల్లో ఎనిమిది మందికి రూ.65 లక్షలు టోకరా వేసింది. తాలూకాఫీసు, హోటళ్ల వద్ద తెలుగులో మాట్లాడేవారిని గమనించి, వారితో ఎంతో తీయగా మాట్లాడేవారు. కేరళలో ఒక చోట భూమి చదును చేసే పనిని చేస్తుండగా రాజుల కాలంనాటి బంగారు గొలుసు దొరికిందని నమ్మిస్తారు. రెండు అసలైన బంగారు గుండ్లను చూపించి, ఇవి గొలుసులోనివని చెబుతారు. ఎనిమిది కేజీల బంగారు హారాన్ని తక్కువ ధరకు ఇస్తామని చెప్పి కొందరికి ఫలానా చోటుకు రమ్మన్నారు. అక్కడికి వెళ్లగా నకిలీ గొలుసును ఇచ్చి రూ.65 లక్షలను తీసుకుని వెళ్లిపోయారు. ఇంటికి వచ్చి పరిశీలించిన కొనుగోలుదారులు అది నకిలీదని తెలిసి నివ్వెరపోయారు. హొసకోటె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు జరిపి ప్రధాన నిందితుడు రాజేష్ తో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. తెలుగువారే లక్ష్యం కోలారు ముఠా పట్టివేత -
బెంగళూరులో సైబర్ కమాండ్
రియల్ ఎస్టేట్ అని రూ.11 కోట్లు టోపీ● సైబర్క్రైం వింగ్, సైబర్ సెక్యూరిటీ వింగ్, జనజాగృతి దళం సహా మరో విభాగం ఈ సీసీసీలో ఉంటుంది. ● బెంగళూరులో మొత్తం 45 సైబర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాటిలోను, సైబర్క్రైం సహాయవాణి 1930లో నమోదయ్యే ఫిర్యాదులను సీసీసీ నిర్వహిస్తుంది. కేసు నమోదు చేయడంతో పాటు దర్యాప్తు నివేదికను కోర్టుకు అందజేస్తుంది. ● అన్నిరకాల ఆన్లైన్ నేరాలు, నేరగాళ్ల ఆచూకీ కనిపెట్టడమే సీసీసీ పని. ● ఆధునిక టెక్నాలజీ ద్వారా దుండగుల ఫోన్లు, కంప్యూటర్ల ఐపీ అడ్రస్ను కనిపెట్టడం, ఎక్కడి నుంచి వంచనకు పాల్పడుతున్నారో గుర్తించి అరెస్ట్ చేస్తుంది. ● అలాగే పోలీసు సిబ్బంది, ఇతర విభాగాలకు సైబర్ నేరాల కట్టడి గురించి శిక్షణనందిస్తుంది.బనశంకరి: కన్నడనాట సైబర్ నేరాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. డిజిటల్ అరెస్టు చేసి, ఈకేవైసీ అని లక్షల రూపాయలను కేటుగాళ్లు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ సైబర్ కమాండ్ సెంటర్ (సీసీసీ)ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్నేరాలకు అడ్డుకట్టవేయడానికి స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పరచాలని ఏప్రిల్నెలలో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం సీసీసీని ఏర్పాటు చేసి దానికి చీఫ్గా డీఐజీ ప్రణవ్ మొహంతిని నియమించింది. సైబర్ నేరాల కేసులను సీఐడీ నుంచి సీసీసీ కి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. సీఐడీ కార్యాలయంలోనే సీసీసీ ఏర్పాటైంది. మహిళ డిజిటల్ అరెస్టు, రూ.8.80 లక్షల వసూలు మహిళా శాస్త్రవేత్తను మూడురోజుల పాటు డిజిటల్ అరెస్టు చేసిన సైబర్ వంచకులు రూ.8.80 లక్షలు దోచేశారు. బెంగళూరు న్యూ హౌసింగ్కాలనీ నివాసి డాక్టర్ ఎస్.సంధ్య బాధితురాలు. ఈ నెల 16న ఆమెకు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి.. తాను పోలీస్ అధికారిని, మీ సిమ్ను దుర్వినియోగం చేయడం వల్ల 17 కేసులు ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయిలో మానవ అక్రమ రవాణా దందాలో మీరు భాగస్వాములయ్యారు అని బెదిరించారు. అలా ఆమె నుంచి రూ.8.80 లక్షలను తమ ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. తరువాత మోసాన్ని గుర్తించిన బాధితురాలు సైబర్క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆన్లైన్ నేరాల సత్వర దర్యాప్తు ఏర్పాటు చేసిన సర్కారు 4 విభాగాలుగా నిఘా16 వేలకు పైగా పెండింగ్ కేసులు 2025 జూలై చివరినాటికి రాష్ట్రంలో 16 వేలకు పైగా సైబర్క్రైం కేసులు పెండింగ్లో ఉన్నాయి. పోలీసు సిబ్బంది కొరత ఇందుకు కారణం. సీసీసీలో అధికారులు, టెక్ నిపుణులను నియమిస్తారు. దీనివల్ల కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని ఆశాభావం ఉంది.బనశంకరి: స్థిరాస్తి వ్యాపారంలో అధిక లాభం ఇప్పిస్తామని రూ.11.28 కోట్లు వంచనకు పాల్పడ్డాడో మోసగాడు. బెంగళూరు ఇందిరానగర డిఫెన్స్ కాలనీ నివాసి అశోక్కుమార్, అతని మిత్రులు బాధితులు. అతని ఫిర్యాదు మేరకు.. అశోక్కుమార్ 2014 నుంచి రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడి స్నేహితుడైన మధుబాబు, భాస్కర్ అనే వ్యక్తిని పరిచయం చేశారు. తాను రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని, మీరు డబ్బు పెట్టుబడిపెడితే దండిగా లాభం ఇస్తానని చెప్పాడు. ఇతని మాటలు నమ్మిన అశోక్కుమార్ తనకు పరిచయం ఉన్న 9 మందిని భాస్కర్ వద్దకు తీసుకెళ్లాడు. వారి నుంచి భాస్కర్ రూ. 6.54 కోట్లు, అశోక్కుమార్ నుంచి రూ.4.74 కోట్లు వసూలు చేశాడు. అందరూ కలిసి రియల్ఎస్టేట్ను ప్రారంభిద్దామని చెప్పి ఓ ఆఫీసును తెరిచాడు. కానీ భాస్కర్ మోసగాడు అని గుర్తించారు. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా అతడు పట్టించుకోలేదు. అంతేగాక వీరు ఇచ్చిన చెక్లను కూడా దుర్వినియోగానికి చేశాడు. దీంతో బాధితులు వైట్ఫీల్డ్ సీసీబీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. -
శారదామాత నమోస్తుతే
కోలారు: శరన్నవరాత్రుల సందర్భంగా నగరంలోని శంకరమఠంలో ఉన్న శ్రీశారదా మాత ఆలయంలో అమ్మవారికి తామర పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం చేసి విశేషాలంకరణ చేశారు. సాయంత్రం మహిళలు లలితా సహస్రనామం పఠించారు. శిశువు తండ్రి అతడే.. తేల్చిన డీఎన్ఏ టెస్టు యశవంతపుర: దక్షిణకన్నడ జిల్లా పుత్తూరు బీజేపీ నాయకుడు జగన్నివాస్రావు కుమారుడు కృష్ణాజీరావ్ ఓ యువతిని ప్రేమపేరుతో మభ్యపెట్టి వాంఛలు తీర్చుకున్నాడు, ఆమె గర్భం దాల్చి శిశువు జన్మించగా తనకు సంబంధం లేదని కృష్ణాజిరావ్ ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం కోర్టుకెళ్లింది. కోర్టు ఆదేశాలతో తల్లీ బిడ్డ, నిందితుని నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించి పరిశీలించారు. ఈ కేసులో మహత్వమైన తీర్పు వచ్చింది. శిశువు, కృష్ణాజిరావ్ డీఎన్ఏ ఒక్కటేనని నిర్ధారణ అయ్యింది. దీంతో అతడే తండ్రి అని శాసీ్త్రయంగా నిర్ధారణ అయినట్లు యువతి కుటుంబీకులు, విశ్వకర్మ సంఘం నాయకులు తెలిపారు. మంగళూరులో వారు విలేకరులతో మాట్లాడారు. కొద్దిరోజుల నుంచి యువతి కుటుంబం న్యాయం కోసం పోరాటం చేస్తోంది. పుత్తూరు కోర్టు ఆదేశాల మేరకు రక్తనమూనాలను సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయగా పాజిటివ్గా వచ్చినట్లు తెలిపారు.బెంగళూరు– ముంబై మధ్య త్వరలో సూపర్ఫాస్ట్ రైలు శివాజీనగర: ఉద్యాననగరి– ముంబై మహానగరాల మధ్య కొత్త సూపర్ఫాస్ట్ రైలుకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదించిందని బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య సోషల్ మీడియాలో తెలిపారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బెంగళూరు, ముంబై మధ్య తాము త్వరలోనే సూపర్ఫాస్ట్ రైలును ప్రారంభిస్తామని తెలిపారన్నారు. ప్రధాన ఆర్థిక నగరాలైనప్పటికీ బెంగళూరు, ముంబై మధ్య ఉద్యాన ఎక్స్ప్రెస్ ఒక్క రైలే నడుస్తోందని చెప్పారు. సుమారు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణానికి 24 గంటల కంటే అధిక సమయం పడుతోంది. 30 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న డిమాండ్ త్వరలో తీరుతోందన్నారు. గతేడాది 26 లక్షల మందికి పైగా ఈ రెండు నగరాల మధ్య విమానంలో ప్రయాణించారన్నారు. సూపర్ఫాస్ట్ రైలుతో తక్కువ ఖర్చు, సమయంతో ప్రయాణం చేయవచ్చన్నారు. బొమ్మల కొలువు ముచ్చట బనశంకరి: దసరా అంటే బొమ్మల కొలువులను ఏర్పాటు చేయడం కొందరికి సరదా. బెంగళూరు జేపీ నగరలో రూపశ్రీ నివాసంలో దసరా బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. రకరకాల బొమ్మలతో అలంకరించారు. శనివారం కొలువు చుట్టూ మహిళలు చేరి భక్తి గీతాలు ఆలపించారు. గజదళంతో రీల్స్కు జరిమానాతో సరి మైసూరు: మైసూరులో అంబా విలాస ప్యాలెస్ ఆవరణలో బస చేసిన దసరా ఏనుగులతో దొంగచాటుగా రాత్రివేళ ఫొటో, వీడియోలు తీసుకున్న నలుగురిపై అటవీ శాఖ జరిమానాస్త్రం సంధించింది. ఈ నెల 18న ఓ యువతి ఏనుగుల వద్ద రీల్స్ చేసిన వీడియో వైరలైంది. పోలీసు, అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై జోరుగా విమర్శలు వినవచ్చాయి. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు గాలింపు జరిపి రీల్స్ చేసిన ప్రజ్వల్, ఎండీ రాఘవేంద్రలకు రూ.500, కే.నవీన్కు రూ.2 వేలు, యువతి కృతికి రూ.1000 చొప్పున జరిమానాలను విధించారు. -
రోడ్లపై కళ్లు మూసుకుని తిరుగుతున్నారా?
బనశంకరి: రోడ్లపై కళ్లు మూసుకుని తిరుగుతున్నారా? రోడ్ల పక్కన ఉన్న చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోరా అని సీఎం సిద్దరామయ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన బెంగళూరులో నగర పర్యటన చేశారు. బళ్లారి రోడ్డు విండ్సర్ మ్యానర్ సర్కిల్ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీరు నిలుస్తుందని అధికారులు తెలిపారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని గ్రేటర్ అధికారులకు సూచించారు. విండ్సర్ మ్యానర్ సర్కిల్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రింగ్ రోడ్డులో కట్టడ వ్యర్థాలు పడేయడంతో అసహనం వ్యక్తం చేశారు. చెత్త పడేసిన వారిని కనిపెట్టి వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేయాలన్నారు. హెణ్ణూరు ఫ్లై ఓవర్ కింద ఉన్న కట్టడ నిర్మాణ వ్యర్థాలు, చెత్తను 24 గంటల్లోపు తొలగించాలని తెలిపారు. బీస్మైల్ సాంకేతిక డైరెక్టర్ ప్రహ్లాద్కు నోటీస్ ఇవ్వాలని సూచించారు. వార్డు నంబరు 23లో పొడిచెత్త సేకరణ కేంద్రం లోపల ఉండాల్సిన చెత్త బయటి ఉండటాన్ని గమనించిన ముఖ్యమంత్రి.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నుంచి కొద్ది దూరంలో రోడ్డులో కంకరజెల్లి పడటాన్ని గమనించి దీనికి కారణమైన ఇంజనీర్ రాఘవేంద్ర ప్రసాద్కు నోటీసులు ఇవ్వాలని సూచించారు. హెణ్ణూరు బాగలూరు వైట్ టాపింగ్ రోడ్డుపై గుంతలు పూడ్చేందుకు కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమర్థవంతంగా వైట్ టాపింగ్ రోడ్లు నిర్వహణ చేపట్టని కాంట్రాక్టర్లు, ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు బైరతి సురేశ్, కేజే జార్జ్ పాల్గొన్నారు. అధికారులపై సీఎం సిద్దరామయ్య ఆగ్రహం -
నింగీ నేలా వినోదహేల
మైసూరు/ మండ్య: మైసూరు నగరం దసరా నవరాత్రి వేడుకలతో మురిసిపోతోంది. పలు వేదికలలో జరుగుతున్న నానారకాల వినోద సాంస్కృతిక కార్యక్రమాలను చూడడానికి నగరవాసులు, టూరిస్టులు చలో అంటున్నారు. జట్కా బండ్లలో విహారం ● శనివారం వాయుసేన హెలికాప్టర్ల ప్రదర్శన ఆకట్టుకుంది. ఎర్రని పొగ వదులుతూ గాలిమోటార్లు చేసిన విన్యాసాలను కేరింతలు కొడుతూ తిలకించారు. ● తరువాత వారసత్వ జట్కా బండ్ల ర్యాలీ సాగింది. టూరిస్టులను తీసుకుని గుర్రపుబండ్లు నగరంలో రౌండ్లు వేశాయి. ● మరోవైపు మైసూరు దసరా గజరాజులు బంగారు అంబారీని మోసే సాధనను తీవ్రతరం చేశాయి. గజరాజు అభిమన్యుపై చెక్క అంబారీని బిగించి నగరవీధుల్లో నడిపించారు. ● పర్యాటక దినోత్సవాల పేరుతో ప్యాలెస్ ముందు మహిళల నృత్యాలు అబ్బురపరిచాయి ● సాయంత్రం నుంచి విద్యద్దీపాల వెలుగుల మధ్య టాప్లెస్ బస్సులో పర్యాటకుల నగర యాత్ర హుషారుగా సాగింది. శ్రీరంగపట్టణంలో యోగా మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలో దసరా సంబరాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఆలయం ముందు శనివారం సామూహిక యోగా వేడుకను నిర్వహించారు. జిల్లాధికారి డా.కుమార్ ప్రారంభించారు. జీవితంలో యోగాను నిత్యం ఆచరించి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. మైసూరులో దసరా సంబరాల అట్టహాసం -
గుప్పెడంత స్థలంలో 5 అంతస్తులు
వాలిపోయిన భవనం ఇదే కూల్చివేత పనుల్లో కార్మికులు బనశంకరి: బెంగళూరులో మరో భవనం కూలిపోవడానికి సిద్ధమైంది. కోరమంగల జక్కసంద్రలో ప్లాన్ను ఉల్లంఘించి అతి తక్కువ స్థలంలో నిర్మించిన ఐదు అంతస్తుల బిల్డింగ్ వాలిపోయింది. మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని ఐదు అంతస్తులు నిర్మించారు. రూ. కోటితో నిర్మాణం వివరాలు.. శాంతమ్మ అనే మహిళ ఏడాది క్రితం 3 అంతస్తుల కట్టడానికి పాలికె నుంచి అనుమతి తీసుకుంది. కానీ 15 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు స్థలంలో 5 అంతస్తుల కట్టడాన్ని నిర్మించింది. దీనికి రూ. కోటి వరకూ ఖర్చు చేసింది. వచ్చేవారం గృహప్రవేశం చేయాలని సిద్ధమయ్యారు. ఇంతలోనే భవనం పిల్లర్లు, గోడల్లో తీవ్రంగా పగుళ్లు వచ్చి ఓ వైపునకు వాలిపోయింది. ఎప్పుడైనా కూలితుందని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దక్షిణ నగర పాలికె అధికారులు పరిశీలించి కూల్చివేయాలని తీర్మానించారు. 2 రోజుల నుంచి కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఈ ఖర్చును భవన యజమానే భరించాలని తెలిపారు. ఈ పని పూర్తయ్యేవరకు చుట్టుపక్కల ఇళ్లవారిని ఖాళీ చేయించారు. గృహ ప్రవేశానికి ముందే పగుళ్లు కూల్చివేస్తున్న పాలికె సిబ్బంది -
కోముల్ భేటీలో ఎమ్మెల్యేల గొడవ
కోలారు: నగర సమీపంలోని నందిని ప్యాలెస్లో నిర్వహించిన కోముల్ సర్వ సభ్య వార్షిక సమావేశంలో పాలక మండలి తీర్మానాలపై డైరెక్టర్ల మధ్య న వాడి వేడి చర్చ జరిగింది. సమావేశంలో బంగారుపేట ఎమ్మెల్యే, కోముల్ డైరెక్టర్ అయిన ఎస్ ఎన్ నారాయణస్వామి, కోముల్ పాలనాధికారి డాక్టర్ మైత్రి అవధిలో తీసుకున్న పలు నిర్ణయాల పై ఆక్షేపణలు వ్యక్తం చేశారు. మైత్రి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని దీని వల్ల పాడి రైతులకు నష్టం కలిగిందన్నారు. ఇందుకు మాలూరు ఎమ్మెల్యే, కోముల్ అధ్యక్షుడు కైవె నంజేగౌడ సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో మీరు పాలనాధికారి డాక్టర్ మైత్రి పరంగా ఎందుకు వకాలత్తు తీసుకుంటారని ప్రశ్నించారు. నారాయణస్వామి మాట్లాడుతూ గతపాలక మండలి తీసుకున్న నిర్నయాల పట్ల తమ అభ్యంతరం లేదని అయితే పాల సమాఖ్యకు జరిగిన నష్టం మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాల పై తమ వ్యతిరేకత ఉందని అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యన వాగ్వాదం తీవ్రం కాగా డైరెక్టర్లు, సభ్యులు ఇద్దరికి సర్ధిచెప్పారు. రైతుల సమస్యలపై చర్చకు బదులు రభస చోటుచేసుకుంది. -
వరుణ ప్రతాపం.. లోతట్టు జలమయం
రాయచూరు రూరల్: ఎగువ భాగంలోని మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాయచూరు, కలబుర్గి, యాదగిరి, బీదర్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు భీమా నదికి వరద పోటెత్తింది. నదిలో 3.40 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నందున నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలబుర్గి జిల్లాధికారి ఫౌజియా తరన్నుమ్ హెచ్చరించారు. బీదర్ జిల్లా హులసూరు, బసవ కళ్యాణ ప్రాంతాల్లో పంట పొలాల్లోకి, ఇళ్లలోకి నీరు చేరాయి. హులసూరు శాసన సభ్యుడు శరణు సలగార్ అంబేవాడి, సూలదాబాక, గోవర్దన తాండా, అంతర్ భారతి తాండాల్లో నీటిలో నడుచుకుంటూ వెళ్లి పంటలను పరీశీలించారు. కలబుర్గి గాణాగపుర నారద దత్తాత్రేయ ఆలయంలోకి నీరు చేరాయి. భక్తులు నీటిలో వెళ్లి పూజలు చేశారు.చిత్తాపూర్ తాలూకా దండోతి, సేడం తాలూకా సటపటనహళ్లి పూర్తిగా నీట మునిగింది. గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్సింగ్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. భీమా నది ప్రవాహాన్ని పరిశీలించి బాధిత ప్రజలను పరామర్శించారు. విజయపుర–షోలాపూర్ మధ్య రాకపోకలు బంద్ కావడంతో వాహనాలు స్తంభించి పోయాయి. బాగల్కోటె జిల్లా రబకవి బనహట్టి తాలూకాలోని మహాలింగపురలో దర్శన్(11) అనే బాలుడు గోడ కూలి మరణించాడు. కల్యాణ కర్ణాటకలో వరద విలయం భీమా నదికి 3.40 లక్షల క్యూసెక్కుల నీరు బాధిత ప్రాంతాల్లో మంత్రి, ఎమ్మెల్యేల పర్యటన -
పంచాయతీపై
నిందలు వేయొద్దు కోలారు: పారదర్శక పాలన, అత్యుత్తుమ గ్రామ పంచాయతీగా పేరుపొందిన సూలూరు గ్రామ పంచాయతీపై కొంతమంది అకారణంగా యూట్యూట్లలో దుష్ప్రచారం చేస్తున్నారని పంచాయతీ అధ్యక్షుడు పెమ్మశెట్టి హళ్లి సురేష్ తెలిపారు. శనివారం నగరంలోని పాత్రికేయుల భవనంలో విలేకరులతో మాట్లాడారు. చొక్కహళ్లి చిన్మయ విద్యాలయ పన్నుల వసూలు గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిని ఆపకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ సభ్యులు ఎం నారాయణస్వామి, సూలూరు అశోక్, గాయత్రమ్మ, నందిని మాలతేష్, శ్యామలమ్మ పాల్గొన్నారు. వేమగల్ ప్రగతికి పెద్దపీట కోలారు: వేమగల్– కురుగల్ పట్టణ పంచాయతీ కి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా డి.అనూష, సీఎస్ వెంకటేష్లు శనివారం పట్టణ పంచాయతీ కార్యాలయంలో పదవులను స్వీకరించారు. సభ్యులందరి సహకారంతో అభివృద్ది కార్యక్రమాలను పెద్దపీట వేస్తామన్నారు. తాగునీరు, స్వచ్చత, డ్రైనేజీ వ్యవస్థ తదితర మౌలిక సౌలభ్యాలను అందించడానికి ప్రామాణిక ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారిని పూలదండలతో సన్మానించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం మాలూరు : తాలూకాలోని చిక్కతిరుపతి జీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు శనివారం జరిగిన ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్ష స్థానానికి కాంగ్రెస్కు చెందిన జీవీ కుమార్ , ఉపాధ్యక్ష స్థానానికి గాయత్రి మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎమ్మెల్యే కైవె నంజేగౌడ అభినందించారు. పంచాయతీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. తాపం స్థాయీ సమితి మాజీ అధ్యక్షుడు నాగేష్, దరఖాస్తు సమితి అధ్యక్షుడు హనుమంతప్ప పాల్గొన్నారు. -
పేలిన వంట గ్యాస్ సిలిండర్
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా గాదిగనూరు గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి తృటిలో పెనుప్రమాదం తప్పింది. గ్రామంలోని హాలప్ప అనే న్యాయవాదికి చెందిన ఇంట్లో ప్రతి రోజూ మాదిరిగానే కాఫీ కలిపేందుకు పొయ్యిని వెలిగిస్తుండగా అప్పటికే సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఉన్నఫళంగా సిలిండర్ పేలి మిద్దె పైకప్పు కూలిపోయింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హాలప్ప(42), కవిత(32) గంగమ్మ(63), మైలారప్ప(48), మల్లమ్మ, మల్లికార్జున, మలియమ్మ, కృత్తిక, గంగమ్మ తదితర 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే మెరుగైన చికిత్స కోసం సండూరు తాలూకా తోరణగల్లులోని సంజీవిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, హొసపేటె గ్రామీణ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటన స్థలానికి పలువురు ప్రముఖులు చేరుకొని బాధితులకు అండగా నిలిచారు. ఘటనపై గాదిగనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందగానే జిల్లా పర్యటనలో ఉన్న ఇన్చార్జి మంత్రి జమీర్ అహమ్మద్ఖాన్ ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. గాయపడిన వారికి అన్ని విధాలుగా మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో పరామర్శిస్తున్న మంత్రి తదితరులు పేలుడు తీవ్రతకు ధ్వంసమైన ఇల్లు 8 మందికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం తృటిలో తప్పిన పెనుప్రమాదం పేలుడు తీవ్రతకు ఇల్లు ధ్వంసం -
డ్రగ్స్ రహిత బళ్లారిగా మారుద్దాం
సాక్షి బళ్లారి: మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో అభివృద్దితో పాటు చెడు అలవాట్లకు కూడా యువత తొందరగా లోను కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే వాటికి దూరంగా ఉంటూ సన్మార్గంలో దేశ భవిష్యత్తుకు, తోడ్పాటుకు కృషి చేయాల్సిన అవసరముందని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం జిల్లా బీజేపీ బళ్లారి నగరచ మండల, నగర యువ మోర్చా ఆధ్వర్యంలో డగ్స్ రహిత భారత్ సంకల్ప అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా కనక దుర్గమ్మ ఆలయం నుంచి నమో మారథాన్ను ప్రారంభించి యువతను ఉత్సాహపరిచేలా నేతలందరూ పాల్గొని మాట్లాడారు. నగరంలోని కనకదుర్గమ్మ ఆలయం నుంచి అండర్బ్రిడ్జి, రాయల్ సర్కిల్, జిల్లాధికారి కార్యాలయం నుంచి మోతీ సర్కిల్ వరకు మారథాన్ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ డ్రగ్స్ రహిత బళ్లారిగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల్సిన అవసరముందన్నారు. యువత దేశాభివృద్ధికి మూల స్తంభాలన్నారు. దురలవాట్లకు దూరంగా ఉండండి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా మంచి నడక అలవర్చుకోవాలన్నారు. డ్రగ్స్, మద్యానికి ఎట్టిపరిస్థితుల్లోను అలవాటు పడకుండా ఉండాలన్నారు. డ్రగ్స్ అమ్మినా, కొన్నా చట్టరీత్య నేరమన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాటిని గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతూ కొందరు వ్యాపారాలు చేసుకుంటూ యువతను చెడు దారుల్లో నడిపిస్తున్నారన్నారు. తోటి స్నేహితులు, అలాంటి అలవాట్లకు దగ్గర ఉంటే వారిని కూడా మంచి మార్గంలో నడిపించాలని యువతకు సూచించారు. డ్రగ్స్ రహిత భారత్గా ప్రధాని మోదీ సంకల్పించారన్నారు. డ్రగ్స్కు దూరంగా ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలుంటుందన్నారు. ఆరోగ్యాన్ని క్షీణింపజేసే డ్రగ్స్ను ముట్టకోకూడదన్నారు. ప్రభుత్వాలు కూడా డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బీజేపీ ప్రముఖులు డాక్టర్ బీకే.సుందర్, కేఎస్.దివాకర్, గుర్రం వెంకటరమణ, కోనంకి తిలక్, ఐనాథ్రెడ్డి, హనుమంతప్ప, విరుపాక్షిగౌడ తదితరులు పాల్గొన్నారు. వివిధ కళాశాలల విద్యార్థులు నమో మారథాన్లో పాల్గొన్నారు. నేటి బాలురే రేపటి దేశ పౌరులు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి -
తుంగభద్ర నదీ తీరంలో మొసలి ప్రత్యక్షం
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని శివాపుర సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున ఒక పెద్ద మొసలి సేద తీరుతూ శనివారం కనిపించింది. ఉన్నట్టుండి మొసలి ప్రత్యక్షం కావడంతో నది ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శివాపుర గ్రామ పంచాయతీలోని నారాయణపేట సమీపంలో ప్రవహించే తుంగభద్ర నది ఒడ్డున ఈ మొసలి కనిపించింది. ఈ అరుదైన దృశ్యాన్ని ఒక పర్యాటకుడు తన మొబైల్ కెమెరాలో బంధించాడు. కత్తితో యువకుడి హల్చల్హుబ్లీ: దావణగెరెలో ఓ ఆలయం ఎదుట ఇతర మతానికి చెందిన యువకుడు తల్వార్ పట్టుకొని సినీ ఫక్కీలో సంచరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మట్టికల్లోని బసవేశ్వర ఆలయం ఎదుట ఉన్న రోడ్డులో ఓ యువకుడు తల్వార్ చేతపట్టుకొని సినిమా స్టైల్లో నడుస్తున్నాడు. దీనిని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ఆధారంగా ఆర్ఎంసీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
బన్నినగరలో ఫ్లెక్స్ వివాదం
హుబ్లీ: ఓ ఫ్లెక్స్ విషయంగా కారల్మార్క్స్ నగర్లో జరిగిన రెండు గుంపుల మధ్య వాగ్వాదం కేసుకు సంబంధించి మూడు కేసులు దాఖలు చేసుకున్న పోలీస్ శాఖ మొత్తం 8 మందిని అరెస్ట్ చేసింది. ఈ గొడవకు సంబంధించి ఆజాద్ నగర్ పోలీసులు రెండు కేసులు నమోదు చేసుకున్నట్లు ఆ జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్ మీడియాకు వివరణ ఇచ్చారు. ఇదే కేసుకు సంబంధించి ఆమె మీడియాతో మాట్లాడుతూ సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశాం. దర్యాప్తు చురుగ్గా సాగుతోందన్నారు. ఎవరూ కూడా సోషల్ మీడియాలో ఉద్వేగ, ఉద్రేకంతో కూడిన ప్రకటనలు చూడరాదని, పోస్టులు పెట్టరాదని హెచ్చరించారు. ఈ హెచ్చరికలను ఉపేక్షిస్తే అలాంటి వారిపై నిర్దాక్షిణ్యంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం పరిస్థితి శాంతియుతంగా ఉందన్నారు. ఎవరూ కూడా అసత్య వార్తలను వ్యాపింపజేయరాదన్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వరాదని ఆమె సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్లెక్స్ని తొలగించాలని ఓ గుంపు, కుదరదని మరో గుంపు మధ్య వివాదం రేకెత్తింది. తక్షణమే ఘర్షణ హద్దుమీరకుండా పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిహొసపేటె: అతి వేగంగా వస్తున్న బస్సును బైక్ ఢీకొనడంతో ద్విచక్రవాహన చోదకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. వెనుక ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని మోరగేరి గ్రామానికి చెందిన హరీష్(23)గా గుర్తించారు. అతని స్నేహితుడు సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు స్నేహితులు బైక్పై ఇట్టిగి గ్రామం నుంచి హగరిబొమ్మనహళ్లికి వెళుతుండగా హొసపేటె నుంచి దావణగెరెకు వెళుతున్న బస్సును బైక్ ఢీకొంది. గాయపడిన సంతోష్ను చికిత్స కోసం హగరిబొమ్మనహళ్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఇట్టిగి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై నిర్లక్ష్యం రాయచూరు రూరల్: రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పరచడంలో అధికారులు, ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం తగదని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు చెన్నారెడ్డి విచారం వ్యక్తం చేశారు. శనివారం నవరంగ్ దర్వాజ భవనంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో చారిత్రకత కలగిన పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పరచడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని ఖండించారు. కార్యక్రమంలో సుగుణ, శివ ప్రకాష్, కాశప్ప, చంద్రశేఖర్లున్నారు. ఇద్దరిపై పోక్సో కేసు నమోదు హుబ్లీ: ౖమెనర్ విద్యార్ధినిని లిఫ్ట్ ఇస్తామంటూ మభ్య పెట్టి కారులో ఎక్కించుకొని దారి మధ్యలో లైంగికంగా అత్యాచారం చేసిన కేసులో ఇద్దరిపై తడక్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసుకున్నారు. ప్యారా మెడికల్ కోర్సు తొలి సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థిని కళాశాలకు వెళ్లి కున్నూరు గ్రామం నుంచి మమదాపుర గ్రామానికి నడుచుకుంటూ తిరిగి వస్తుండగా ఆ గ్రామ పరిచయస్తుడు ప్రవీణ్ లమాణి, అభిషేక్ లిఫ్ట్ ఇస్తామంటూ కారులో కూర్చొబెట్టుకున్నారు. అనంతరం మార్గమధ్యంలో అటవీ ప్రాంతంలో నోటిలో దుస్తులు కుక్కి అత్యాచారం చేసినట్లు విద్యార్థిని తల్లి గంగవ్వ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన క్రమంలో తడక్ పోలీసులు పోక్సో కేసు దాఖలు చేసుకున్నట్లు ఎస్ఐ పరశురామ తెలిపారు. బాధిత విద్యార్థినిని ఆ జిల్లా బాలల సంరక్షణాధికారి కార్యాలయ సిబ్బందికి అప్పగించారు. అధ్యాపకులను నియమించాలని ధర్నా రాయచూరు రూరల్: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులను భర్తీ చేయాలని కోరుతూ ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించుకోకుండా కాలయాపన చేయడాన్ని తప్పుబట్టారు. త్వరితగతిన అతిథి అధ్యాపకులను నియమించాలని ఒత్తిడి చేశారు. -
అధికారులు సమర్థంగా పని చేయాలి
హొసపేటె: అధికారులు తమ ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ సూచించారు. శనివారం జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ప్రగతి పరిశీలన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా స్థాయి అధికారులు జిల్లాలోని తమ కార్యాలయానికే పరిమితం కాకుండా జిల్లాలోని ఇతర తాలూకాలో ఉన్న తాలూకా కార్యాలయాలను సందర్శించి తనిఖీ చేయాలని ఆదేశించారు. అధికారులు ఆయా తాలూకాలను సందర్శించినప్పుడు తప్పకుండా మూమెంట్ బుక్ను మెయింటెయిన్ చేయాలన్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అనేక తాలూకాల్లో ఉల్లి పంటకు తీవ్ర నష్టం ఏర్పడిందన్నారు. ఈ విషయంపై ఉల్లి పంటకు మద్దతు ధర కల్పించాలని హరపనహళ్లి ఎమ్మెల్యే లతా మల్లికార్జున జిల్లా మంత్రిని కోరారు. బస్సు సౌకర్యం కల్పించండి గ్రామీణ భాగంలో అనేక మంది విద్యార్థులకు సరిగ్గా బస్సు సౌకర్యం లేకుండా పోవడంతో విద్యార్థులు ట్రాక్టర్లలో వెళుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయం పై జిల్లా విద్యాశాఖ అధికారి తగిన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. వాతావరణం సరిగా అనుకూలించక పోవడంతో రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతోందని, ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు అన్ని విధాలుగా ఉత్తమ వైద్య చికిత్స అందించాలని మంత్రి జిల్లా వైద్యాధికారి శంకర్నాయక్కు సూచించారు. పక్కా సమాచారంతో రావాలి అధికారులు సమావేశానికి వచ్చే ముందు పక్కా, సరైన సమాచారంతో హాజరు కావాలన్నారు. సరైన సమాచారం లేకుండా వస్తే సహించబోనని అన్నారు. అదే విధంగా వివిధ కార్యాలయాల్లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడంపై సుదీర్ఘ చర్చ జరిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఈ.తుకారాం, ఎమ్మెల్యేలు నేమిరాజ్ నాయక్, లతా మల్లికార్జున, డాక్టర్ శ్రీనివాస్, కృష్ణనాయక్, జిల్లాధికారి కవితా ఎస్ మన్నికేరి, జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహమ్మద్ అక్రమ్ షా, ఎస్పీ జాహ్నవి, అదనపు జిల్లాధికారి బాలకృష్ణ, వివిధ శాఖల జిల్లా కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ప్రారంభం విజయనగర జిల్లా నూతన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టును శనివారం హైకోర్టు న్యాయమూర్తి ఆర్.నటరాజ్, మంత్రి జమీర్ అహమ్మద్ఖాన్ ప్రారంభించారు. హొసపేటె కోర్టు సముదాయం ప్రాంగణంలో ఉన్న జిల్లా కోర్టు ప్రారంభోత్సవానికి వధువులా అలంకరించారు. జిల్లా స్థాయి న్యాయమూర్తులు, జిల్లాధికారిణి కవితా మన్నికేరి, ఎస్పీ జాహ్నవి, జెడ్పీ సీఈఓ అక్రమ్ షా, ఇతర అధికారులు పాల్గొన్నారు. విజయనగర జిల్లా స్థాపితమైన నాలుగేళ్ల తర్వాత కూడా జిల్లా కోర్టు లేదు. న్యాయవాదుల ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కల నెరవేరినట్లు కనిపిస్తోంది. ఏ సమస్య ఉన్నా ఇంతకు ముందు విజయనగర జిల్లా ప్రజలు కేసులను విచారించడానికి బళ్లారికి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం జిల్లా కోర్టు ప్రారంభం కావడంతో ఆ సమస్య పరిష్కారమైంది. జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ వాడీవేడిగా జిల్లా స్థాయి ప్రగతి పరిశీలన సమావేశం -
స్వదేశానికి రష్యా మహిళ, పిల్లలు
బెంగళూరు: కర్ణాటకలోని ఒక గుహలో నివసిస్తూ పట్టుబడిన రష్యా మహిళ, ఆమె ఇద్దరు మైనర్ కుమార్తెలు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ప్రయాణ పత్రాలను జారీ చేయవచ్చని కేంద్ర ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. పిల్లల తండ్రిగా చెప్పుకొంటున్న ఇజ్రాయెల్ జాతీయుడు ద్రోర్ శ్లోమో గోల్డ్స్టెయిన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి బి.ఎం.శ్యామ్ ప్రసాద్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మైనర్ పిల్లలను వెంటనే దేశం నుంచి పంపించేయవద్దని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ గోల్డ్స్టెయిన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నీనా కుటీనాగా అనే రష్యన్ మహిళ, ఆమె పిల్లలు జూలై 11న కుమ్టా తాలూకాలోని గోకర్ణ సమీపంలోని రామతీర్థ కొండల్లోని గుహలో కనిపించారు. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి దాదాపు రెండు నెలల పాటు తగిన నివాస పత్రాలు లేకుండా అక్కడ నివసించినట్లు అధికారులు తెలిపారు. భారతదేశంలో తన పిల్లలు ఎక్కడున్నారో గుర్తించలేకపోయానంటూ వారి తండ్రి గోల్డ్స్టెయిన్ గత డిసెంబర్లో గోవాలోని పనాజీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై శుక్రవారం జరిగిన విచారణలో, కుటీనా, ఆమె కుమార్తెలకు రష్యా కాన్సులేట్ అక్టోబర్ 9 వరకు మాత్రమే చెల్లుబాటయ్యే అత్యవసర ప్రయాణ పత్రాలను జారీ చేసినట్లు కోర్టు నమోదు చేసింది. అలాగే, వీలైనంత త్వరగా రష్యాకు తిరిగి వెళ్లడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తూ కుటీనా స్వయంగా కాన్సులేట్కు చేసిన విన్నపాన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. కస్టడీకి సంబంధించిన ప్రక్రియలు ఇంకా పెండింగ్లో ఉన్నందున, పిల్లల శ్రేయస్సుకు విఘాతం కలిగించేలా వారిని దేశం నుంచి పంపించడం సరికాదని గోల్డ్స్టెయిన్ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, భార్య, పిల్లలు గుహలో ఏకాంతంగా ఎందుకు నివసించవలసి వచ్చిందనే దానిపై గోల్డ్స్టెయిన్ సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేదని కోర్టు వ్యాఖ్యానించింది. పిల్లల సంక్షేమం, రష్యాకు తిరిగి వెళ్లాలనే తల్లి అభ్యర్థన, వారి ప్రయాణానికి సహాయం చేయడానికి రష్యా ప్రభుత్వం సిద్ధంగా ఉండటం వంటివి.. ఇతర అంశాల కంటే ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది. శుక్రవారం విచారణ సందర్భంగా, రష్యా మహిళ రెండో కుమార్తెకు సంబంధించిన డీఎన్ఏ నివేదిక అందిందని, దానిని రష్యా ప్రభుత్వానికి అందజేసినట్లు అదనపు సొలిసిటర్ జనరల్ అరవింద్ కామత్ కోర్టుకు తెలియజేశారు. దీని ఆధారంగా, రష్యా ప్రభుత్వం వారికి పౌరసత్వం, రష్యాకు ప్రయాణించడానికి అత్యవసర ప్రయాణ పత్రాలను జారీ చేసిందని వివరించారు. -
పిల్లల ముఖం చూసైనా ఇంటికి రా.. ప్రియుడే కావాలన్న భార్య
కర్ణాటక రాష్ట్రం: బెంగళూరు బన్నేరుఘట్ట సమీపంలో బసవనహళ్లి గ్రామంలో తన భార్య ప్రియునిపై వ్యక్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. మంజునాథ్ భార్య లీలావతి.. సంతు ఏళె అనే వ్యక్తితో వెళ్లిపోయింది. ఇద్దరు కొడుకులు, ఓ కూతురుని భర్త వద్దే వదిలేసింది. మంజునాథ్ న్యాయం చేయాలని బన్నేరుఘట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో పోలీసులు ఇద్దరిని వెతికి పట్టుకొచ్చారు.తాను భర్తతో కాపురం చేయనని లీలావతి తెగేసి చెప్పింది. పిల్లల ముఖం చూసి అయినా ఇంటికి రావాలని మంజునాథ్ వేడుకున్నా లీలావతి ససేమిరా అంది. ఈ విషయమై భర్త సోషల్ మీడియా ద్వారా గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హుళిమావు పరిధిలోని బసవనపురలో సంతు ఇంటికి వెళ్లిన మంజునాథ్ గొడవ పడ్డాడు. బీర్ బాటిల్ తీసుకొని దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సంతు ఇందిరాగాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హుళిమావు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా
రాయచూరు రూరల్: రాయచూరుకు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దావణగెర నుంచి రాయచూరుకు వస్తున్న బస్సుకు కుక్క అడ్డుగా వచ్చింది. కుక్క తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సును పక్కకు తిప్పడంతో బోల్తా పడింది. ఏడవ మైలు మలుపు తిరుగు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ప్రొక్లెయిన్ ద్వారా ద్వారా బస్సును యాథాస్థితికి తీసుకొచ్చారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. 15 మందికి గాయాలు -
స్వచ్ఛతపై దృష్టి సారించాలి
హొసపేటె: ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నోంగ్జోయ్ మొహమ్మద్ అలీ అక్రమ్ షా సూచించారు. స్వచ్ఛతా హీ సేవ పక్షం రోజుల ప్రచారంలో భాగంగా, జిల్లా పంచాయతీ, హోస్పేట్ తాలూకా పంచాయతీ నగరసభ, సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏక్దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా తాలూకా, గ్రామ పంచాయతీ స్థాయిలో స్వచ్ఛత కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ యూనిట్లను నిర్మించడం ద్వారా స్థిరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించడానికి జిల్లా పంచాయతీ చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. చెత్తను రోడ్లపై వేయరాదని ప్రజలకు సూచించారు. ఇంటి వద్దకు వచ్చే కార్మికులకు చెత్త ఇవ్వాలని సూచించారు. ప్రతి 3 నెలలకు ఒక సారి తమ ఇళ్ల చుట్టూ శ్రమదానం చేయడం ద్వారా జిల్లా అంతటా స్థిరమైన, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాల నిర్మాణానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ కె.తిమ్మప్ప, గ్రామీణ తాగునీరు, పారిశుధ్య విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దీప, జెడ్పీ చీఫ్ అకౌంటెంట్ రుద్రప్ప అక్కి, సహాయ కార్యదర్శి వీబీ మౌనేషా, సహాయ ప్రణాళిక అధికారి ఎం.ఉమేష్, హోస్పేట్ తాలూకా పంచాయతీ కార్యనిర్వహక అధికారి ఆలం భాషా, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ప్రాజెక్టు జిల్లా కన్సల్టెంట్, జిల్లా పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. -
కొనసాగుతున్న భారీ వర్షాలు
నీట మునిగిన వరి పంటహొసపేటె: బురదమయంగా మారిన ఏపీఎంసీ మార్కెట్ ఆవరణరాయచూరు రూరల్: జిల్లాలో వరుణుడి జోరు కొనసాగుతోంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము వరకు జడివాన కురిసింది. జిల్లాలో 52 మి.మీ వర్షపాతం నమోదైంది. రహదారులు బురదమయంగా మారాయి. మూన్నూరు వాడి, గాంధీ చౌక్, మహవీర చౌక్, కూరగాయల మార్కెట్లోకి వర్షపు నీరు చేరింది. తీన్ కందిల్ రాతి ఏనుగు విగ్రహం వద్ద మురుగు నిలిచింది. అరబ్ మెహల్లా, షియాత లాబలో, ఖాదర్ గుండా, నవాబ్ గడ్డలో నీరు చేరింది. మహరాష్ట్ర పైభాగంలో కురుస్తున్న వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాయచూరు, కలబుర్గి, యాదగిరి, బీదర్ జిల్లాలో కురిసిన వర్షాలకు రెండు అడుగుల మేర నీరు ప్రవహించింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఉజ్జయిని, సీనా, బోరి వాగుల నుంచి నీరు రావడంతో భీమా నది నుంచి 3.40 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలబుర్గి జిల్లా కలెక్టర్ పౌజియా తర్నూమ్ సూచించారు. బీదర్ జిల్లా హులసూరు, బసవ కళ్యాణలో ఇళ్లు, పంట పొలాల్లోకి నీరు చేరింది. రోడ్డు బురదమయం హొసపేటె: నగరంలో జోరువాన కురవడంతో ప్రముఖ ఏపీఎంసీ మార్కెట్ బురదమయంగా మారింది. మార్కెట్ మొత్తం రచ్చరచ్చగా ఉండటంతో అడుగు తీసి బయట వేయలేని పరిస్థితి నెలకొంది. చిరు వ్యాపారులు బురదలోని కూర్చొని కూరగాయలు విక్రయించారు. మార్కెట్లో అపరిశుభ్రత పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. మార్కెట్ వచ్చే వారు ముక్కు మూసుకొని కూరగాయలు కొన్నారు. మార్కెట్లో నెలకొన్న సమస్యలను ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. నీటిలో నడుస్తున్న కూరగాయల వ్యాపారిఇళ్లలో చేరిన మురికి నీరు రాయచూరులో కాలనీలు జలమయం భీమా నది నుంచి దిగువకు నీరు విడుదల -
నేడు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ప్రారంభం
హొసపేటె: స్థానిక కోర్టు ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టును శనివారం ప్రధాన న్యాయమూర్తి ఆర్ఏ నటరాజ ప్రారంభించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా చట్టం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కే.పాటిల్, రక్షణ, మైనార్టీ సంక్షేమ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్, ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు జేఎం అనిల్ కుమార్ కే.కొట్రేశ్వర రావు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి బళ్లారిలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కేజీ.శాంతి అధ్యక్షత వహిస్తారు. అభివృద్ధి పనులకు భూమిపూజ రాయచూరు రూరల్: నగరంలోని వార్డుల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని మాజీ నగర సభ అధ్యక్షురాలు లలిత పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని 14వ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి పాటుపడుతామన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేదలకు ఇళ్లు కేటాయించాలి రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు భూమి పంపిణీ చేసి, ఇళ్లు కేటాయించాలని ఎస్టీ, ఎస్టీ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాయచూరు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. అటవీ శాఖ ఆధీనంలోని భూములను సాగు చేస్తున్న సన్నకారు రైతులపై కేసు నమోదు చేయడం సరికాదన్నారు. వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ గజాననకు వినతిపత్రం సమర్పించారు. స్వచ్ఛత అభియాన్కు శ్రీకారం రాయచూరు రూరల్: సమాజంలో మానవుడు స్వచ్ఛతకు చేతులు జోడించాలని యాదగిరి నగర సభ అధ్యక్షురాలు లలిత అనపూర్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలో స్వచ్ఛత అభియాన్కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో ఎక్కడ పడితే అక్కడ వేయడవ ద్వారా పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నట్లు పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు. నగరంలో ఐదు రోజుల పాటు చేపట్టనున్న శ్రమదానంలో అందరూ పాల్గొనాలని సూచించారు. జనగణన సహాయవాణి ఏర్పాటు హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక విద్య స్థితిగతులపై వివరాలు తెలియజేసేందుకు బీసీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో సహయవాణి (ఫోన్ నంబర్) ఏర్పాటు చేశారు. 08062447961 నంబర్కు ఫోన్ చేయాలని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో సూచించారు. -
అలరించిన తుమకూరు దసరా
కళాకారిణుల సామూహిక నృత్యప్రదర్శనతుమకూరు దసరా వేదికపై కళాకారుల యక్షగాన ప్రదర్శనతుమకూరు: సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సాంస్కృతిక రాయబారిగా ఆయ్యే వ్యక్తి జీవితం సన్మార్గంలో సాగుతుందని జెడ్పీ సీఈఓ జీ.ప్రభు తెలిపారు. తుమకూరు నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తుమకూరు దసరా వేడుకలు, ఉత్సవం సందర్భంగా నరసింహరాజు వేదికలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల కళాకారులు, విద్యార్థులు చేసిన నృత్యాలను చూసి వారికి బహుమతులు అందించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి, కళాకారుడు ప్రతిఒక్కరూ కూడా సంస్కారవంతులు అవుతారని, కళలపై చిన్నారులు, యువత మక్కువను పెంచుకోవాలని అన్నారు. అనంతరం కళాకారులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అదుర్స్