breaking news
Karnataka
-
దాతలు ఇచ్చిన రక్తంలో హెచ్ఐవీ
రక్తదానం చేయడానికి ఎవరు అర్హులు? శిబిరంలో రక్తదానం చేస్తున్న దృశ్యం (ఫైల్)బనశంకరి: ప్రాణాధారమైన రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. వ్యక్తుల నుంచి సేకరించిన రక్తాన్నే ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నవారికి అందజేయడం ఒక్కటే మార్గం. ఈక్రమంలో రక్తం కొరత ఏర్పడుతుండటంతో రక్తదాన ఆవశ్యకతపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. స్వచ్ఛంద సంస్థలు కూడా శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలనుంచి రక్తాన్ని సేకరిస్తున్నారు. అయితే రక్తదాన రక్తదానం చేయడానికి వచ్చిన వారిలో హెచ్ఐవీ, హెపటైటిస్, బీపీ, సిఫిలిస్, మలేరియా వైరస్ వెలుగు చూడటంతో సేకరించిన రక్తం వ్యర్థమౌతోంది. పరీక్ష చేయకుండా రక్త సేకరణ రాష్ట్రంలో మొత్తం 230 రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటు 43 ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్లు, 66 చారిటబుల్, 108 ప్రైవేటు ఆసుపత్రులతో కూడిన బ్లడ్ బ్యాంకులు, 5 స్వతంత్ర బ్లడ్బ్యాంకులు, 8 ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. రక్తనిధి కేంద్రాలు సాధారణంగా కాలేజీ, ఐటీ, బీటీ కంపెనీలు, రాజకీయ నేతలు, నటీనటుల జన్మదిన వేడుకల కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి. రోడ్ల పక్కన వాహనాలు నిలిపి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. కానీ రక్తదాన శిబిరాల్లో దాతలకు ఆరోగ్య పరీక్షలు చేయకుండా రక్తం సేకరిస్తున్నారు. అనంతరం రక్తదాన శిబిరాల్లో సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకుల్లోని ల్యాబొరేటరీల్లో పరీక్షించే సమయంలో హెచ్ఐవీ, హెపటైటిస్, బీ.పీ, సిఫిలిస్, మలేరియాతో పాటు ఇతర అనారోగ్య వైరస్లతో బాధపడే వ్యక్తులు రక్తదానం చేసినట్లు బహిర్గతమవుతోంది. అలాంటి రక్తాన్ని డిస్కార్డ్ చేయాల్సి వస్తోంది. ప్రతి 10 మంది దాతల్లో ఒకరిలో హెచ్ఐవీ వైరస్ 10 మంది రక్తదానం చేసిన దాతల్లో ఒకరిలో హెచ్ఐవీ వైరస్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర రక్త విభాగం తెలిపిన వివరాల ప్రకారం 2024–25లో 44,776 యూనిట్లు, 2023–24లో 37,906 యూనిట్లు, 2022–23లో 43,857 యూనిట్ల రక్తాన్ని డిస్కార్డ్ చేశారు. 2023తో పోలిస్తే 2024లో అత్యధికంగా రక్తాన్ని డిస్కార్డ్ చేశారు.రక్తం సేకరణ ఏవిధంగా చేస్తారంటే... ఏ, బీ, ఏబీ, ఓ పాజిటివ్, నెగిటివ్తో పాటు 8 రకాల బ్లడ్ గ్రూపులు ఉన్నాయి. మూడునెలలకు ఒకసారి పురుషులు, 4 నెలలకు ఒకసారి మహిళలు రక్తదానం చేయవచ్చు. దాతల నుంచి రక్తం సేకరించి దానిని సెంట్రిఫికేషన్ చేస్తే కింది భాగంలో ఎర్ర రక్తకణాలు, మధ్యలో తెల్లరక్త కణాలుగా మారతాయి. ఆ రక్తాన్ని సురక్షిత బ్యాగుల్లో సేకరించి, ప్లేట్లెట్స్ కణాలను 24 డిగ్రీలు, ప్లాస్మా కణాన్ని మైనస్ 60 డిగ్రీల వాతావరణంలో సేకరిస్తారు. రోగికి ఆవశ్యకత ఉంటే ఆ రక్తాన్ని అందిస్తారు. హిమోగ్లోబిన్ అంశం తక్కువగా ఉన్న రోగులకు ప్లేట్లేట్స్ అందిస్తారు. రక్తదానం చేయడానికి ఎవరు అనర్హులు? అనారోగ్యం బారిన పడిన వ్యక్తులు, నియమితంగా ఔషధాలు వాడేవారు, అంటురోగాలు కలిగిన వ్యక్తులు, హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులు, హృద్రోగులు, క్షయరోగులు, హెపటైటీస్ బీ, రక్తహీనత, అపౌష్టికత లోపం ఉన్న వ్యక్తులు, గర్భిణులు, మధుమేహం నియంత్రణలో లేని వ్యక్తులు, డ్రగ్స్ బానిసలు, కిడ్నీతో పాటు ఇతర అవయవాలు ఇబ్బంది, వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు రక్తదానం చేయరాదు. శస్త్రచికిత్సకు గురైన వ్యక్తులు, రేబీస్ టీకా, ఒంటిపై ట్యాటూ వేసుకున్న వ్యక్తులు 6 నెలల పాటు రక్తదానం చేయరాదు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ ఇచ్చే మహత్కార్యమైన రక్తదానం కోసం ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అయితే తెలిసో తెలియకో వ్యాధిగ్రస్తులు ఇస్తున్న రక్తంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ప్రాణాధారంలో బయట పడిన ప్రాణాంతక వైరస్ ల్యాబొరేటరీలో పరీక్ష సమయంలో వైరస్ ఆచూకీ లభ్యం 2024–25లో సేకరించిన 44,776 యూనిట్ల రక్తం వ్యర్థం 18 నుంచి 65 ఏళ్లలోపు వయసున్న ఆరోగ్యవంతమైన, దేహం బరువు కనీసం 45 కిలోలు కలిగిన వారు అర్హులు. వీరు 350 ఎంఎల్ రక్తం దానం చేయవచ్చు. 55 కిలోల కంటే అధిక బరువు కలిగిన వ్యక్తులు 450 ఎంఎల్ రక్తదానం చేయవచ్చు. దాతలకు హిమోగ్లోబిన్ హెచ్బీ ప్రమాణం కనిష్టం 12.5 శాతం ఉండాలి. ప్రైవేటు బ్లడ్బ్యాంకులో అధిక డబ్బు వసూలు చాలా వరకు రక్తనిధి కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు యూనిట్ రక్తం విక్రయించడం లేదు. ఒక యూనిట్కు కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.1,400 నుంచి రూ.1,550 వరకు విక్రయధర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ప్రైవేటు ఆసుపత్రులువారు అధిక ధర నిర్ణయిస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞాన యంత్రాలు కారణం అని తెలిపి అధిక ధర విధిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కొన్ని జిల్లాల్లో బ్లడ్ బ్యాంకులు ఇష్టానుసారం అడ్వాన్స్గా డబ్బు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయి. -
ప్రజల రక్షణకే ఇంటింటికీ పోలీస్
● హోం మంత్రి పరమేశ్వర్ శివాజీనగర: ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పి వారి సమస్యలు ఆలకించేందుకు ప్రభుత్వం ఇంటింటికీ పోలీసు కార్యక్రమాన్ని రూపొందించిందని హోం మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్ అన్నారు. బెంగళూరులోని గోవిందరాజనగర ఎంసీ లేఔట్లో శుక్రవారం ఆయన ఇంటింటికీ పోలీస్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక ఇంటిని సందర్శించి వారి సమస్యలు ఆలకించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. పోలీసులు ప్రతి ఇంటికీ వెళ్లి ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, కొత్త వ్యక్తుల సంచారంపై ఆరా తీస్తారన్నారు. గృహ హింసపై అర్జీలు స్వీకరిస్తారన్నారు. ఇంటిలో ఎవరున్నారు, కొత్తగా వచ్చారా, అద్దెకు ఉన్నారా, వారి ఉద్యోగం తదితర సమాచారం సేకరించి బెంగళూరు డేటా బ్యాంక్లో పొందుపరుస్తామన్నారు. పోలీసులు వచ్చినపుడు ప్రజలు తమ కష్టసుఖాలు చెప్పవచ్చన్నారు. ఈ కార్యక్రమం దేశంలోనే ప్రప్రథమన్నారు. నేరాలను ముందుగానే కనిపెట్టడానికి ఈ కార్యక్రమం దోహద పడుతుందన్నారు. ‘ఇంటింటికీ పోలీస్’ మీ రక్షకులు, మీ ఇంటి తలుపు వద్దకు! అని బెంగళూరు ఆగ్నేయ డీసీపీ తన ఎక్స్ సందేశంలో తెలిపారు. సమాజంలో నిర్భయమైన వాతావరణాన్ని సృష్టించటంతో పాటు భద్రత, సురక్షతను కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఎమ్మెల్యే ప్రియాకృష్ణ, డీజీ, ఐజీపీ డాక్టర్ ఎం.ఏ.సలీం, నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. వికాస్కుమార్ కేసు విచారణ వాయిదా బనశంకరి: చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యవాతపడిన వ్యవహారంలో ఐపీఎస్ అధికారి, అదనపు పోలీస్కమిషనర్ వికాస్కుమార్పై విధించిన సస్పెన్షన్ను క్యాట్ కొట్టి వేయడాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ ఎస్జీ.పండిత్, జస్టిస్ టీఎం సదాఫ్తో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. వికాస్కుమార్ తరపున సీనియర్ న్యాయవాది ద్యానచిన్నప్ప వాదనలు వినిపించారు. పోలీసులు ఆర్సీబీ సేవకులుగా వ్యవహరించారనే వాదన దురదృష్టకరమన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులను సస్పెండ్చేశారన్నారు. భద్రత కల్పించిన పోలీసులను దూషిస్తున్నారన్నారు. దర్యాప్తు నివేదిక రాకముందే సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని వాదనలు వినిపించారు. వాదప్రతివాదనలు ఆలకించిన ధర్మాసనం ఈ కేసును ఈనెల 21కి వాయిదా వేసింది. గొంతుకు వేల్ చుట్టుకొని బాలిక మృతి యశవంతపుర: చుడీదార్ వేల్ గొంతుకు చుట్టుకొని బాలిక మృతి చెందిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా కార్వార జిల్లా భట్కళలో చోటు చేసుకుంది. కార్వార జిల్లా వ్యాప్తంగా భారీ వానలు పడుతున్న కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇంటివద్దనే ఉన్న తెర్నమక్కి సబ్బత్తికి చెందిన ప్రణీత జగన్నాథ్ నాయక్(12) ఊయల ఊగుతుండగా చుడీదార్ వేల్ గొంతుకు బిగుసుకొని మృతి చెందింది. మురుడేశ్వర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
హడలెత్తించిన బాంబు బెదిరింపులు
బనశంకరి: పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు ఈమెయిల్స్ రావడంతో బెంగళూరులోని పలు పాఠశాలల యాజమాన్యాలు వణికిపోయాయి. పిల్లలందరినీ హుటాహుటిన బయటకు పంపగా అప్పటికే విషయం బహిరంగం కావడంతో తల్లిదండ్రులు ఉరుకుల పరుగులతో పాఠశాలల వద్దకు చేరుకొని తమ పిల్లలను అక్కున చేర్చుకున్నారు. శుక్రవారం ఉదయం పాఠశాలలు తెరవగానే కంప్యూటర్లలో ఈ–మెయిల్స్ దర్శనమిచ్చాయి. వాటిని తెరిచి చూడగా నగరంలోని కెంగేరి, ఎంఎస్.థోని గ్లోబల్ స్కూల్, రాజరాజేశ్వరి నగర, భారతీనగర, కబ్బన్పార్కు, చామరాజపేటె, హెణ్ణూరు, శ్రీరాంపుర, రామమూర్తినగరతో పాటు 40కి పైగా ప్రైవేటు పాఠశాలల్లోని తరగతి గదుల్లో ట్రినిట్రూటూలైన్స్ అనే పేలుడు వస్తువులు పెట్టామని, ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చని కనిపించింది. భయభ్రాంతులకు గురైన ఉపాధ్యాయులు పిల్లలను బయటకు పంపించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు స్క్వాడ్తో వెళ్లిన సిబ్బంది అన్ని పాఠశాలల్లో క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఎలాంటి బాంబు ఆచూకీ లభించకపోవడంతో ఉత్తుత్తి బాంబు బెదిరింపు అని తేల్చారు. ఉదయమే మెయిల్ వచ్చింది శుక్రవారం ఉదయం 7.45 గంటల సమయంలో మెయిల్ వచ్చింది. పాఠశాలలో పరీక్ష జరుగుతోంది. తక్షణం పోలీసులకు సమాచారం అందించాం, పోలీసులు వచ్చి తనిఖీ చేయగా ఎలాంటి పేలుడు వస్తువులు కనబడలేదు. ఎవరో మానసికంగా ఇబ్బందికి గురైన వ్యక్తి మెయిల్ చేశారు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని సెయింట్ జర్మన్ అకాడమి స్కూల్ ప్రిన్సిపాల్ మోనికా ఆంటోని తెలిపారు. మీ అందరినీ ఈ లోకం నుంచి పంపించేస్తాం మీకు నమస్కారం, పేలుడు పదార్దాలను బ్లాక్ ప్లాస్టిక్ సంచిలో ఉంచి తరగతి గదుల్లో ఉంచాం. మీ అందరినీ ఈ లోకం నుంచి పైకి పంపిస్తామని, ఎవరూ బతకరు, ఈ సమాచారం నేను చూసి సంతోషంతో నవ్వుతా, మీరందరూ కష్టాలు అనుభవించాలి, ఈ సమాచారం బయట పడిన అనంతరం నేను గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటా అని ఈ–మెయిల్లో ఉంది. తనకు ఎవరూ సహాయం చేయలేదు, మానసిక వైద్యులు, మనో శాస్త్రవేత్తలు నాపై ప్రేమ చూపించలేదు అని పేర్కొన్నారు. మెయిల్ డొమైన్ బ్రిటిష్ ఇండియన్ ఓషియన్ టెరిటరీకి చెందిన వారు కాగా దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. 2023లో కూడా ఈ–మెయిల్ బెదిరింపు 2023 డిసెంబరులో బెంగళూరు నగరంలోని 15 ప్రైవేటు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసుల తనిఖీల్లో ఉత్తుత్తి బాంబు బెదిరింపు అని వెలుగు చూసింది. 2022 ఏప్రిల్లో కూడా నగరంలోని 10కి పైగా ప్రైవేటు స్కూల్స్కు ఈ–మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. బెంగళూరులో 40 ప్రైవేటు స్కూళ్లకు ఈ–మెయిల్స్ ఉరుకులు పరుగులు పెట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు ఉత్తుత్తి బెదిరింపుగా తేల్చిన బాంబు నిర్వీర్యదళం -
సింహవాహినిగా చాముండేశ్వరి దేవి
మైసూరు: ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా మైసూరు నగరంలో ఉన్న చాముండి కొండకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆషాఢ మాస శుక్రవారం కావడంతో చాముండేశ్వరి అమ్మవారు భక్తులకు సింహవాహిని అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తజనం అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. తెల్లవారు జాము నుంచే చాముండి కొండకు భక్తులు భారీగా చేరుకున్నారు. చల్లటి వాన చినుకుల మధ్యలో క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు శశిశేఖర్ దీక్షిత్ ఆధ్వర్యంలో అమ్మవారికి మహాన్యాసం, రుద్రాభిషేకం, పంచమృతాలతో అభిషేకం, కుంకుమార్చన, ఏకదశ పుష్పార్చన, సహస్రనామార్చనతోపాటు వివిధ రకాల పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కే.హెచ్.మునియప్ప, బీజేపీ అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, మాజీ మంత్రి హెచ్.డీ.రేవణ్ణ, ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ, భవాని రేవణ్ణ, ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య పార్వతి, కోడలు స్మితా రాకేష్తో పాటు అనేక మంది ప్రముఖులు దర్శించుకున్నారు. చాముండి కొండపై 4వ ఆషాఢ శుక్రవారం దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తజనం -
ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు
యశవంతపుర: బీఎంటీసీ బస్సు దూసుకెళ్లి యువతి మృతి చెందగా ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈఘటన బెంగళూరు పీణ్య సెకండ్స్టేజీ పరిధిలో జరిగింది. మండ్యకు చెందిన సుమ(20) సుంకదకట్టెలో నివాసం ఉంటూ గార్మెంట్ పరిశ్రమలో పని చేస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు విధులకు బయల్దేరి బస్సు కోసం ఫుట్పాత్పై నిలిచి ఉండగా మెజిస్టిక్ నుంచి పీణ్య వెళ్తున్న బీఎంటీసీ బస్సు అదుపుతప్పి దూసుకొచ్చి చిన్నపాటి హోటల్ను ఢీకొంది. ఘటనలో సుమపై బస్సు చక్రాలు వెళ్లడంతో కాళ్లు విరిగాయి. మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. సుమను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. కాగా బస్సు ఢీకొని గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. డ్రైవర్, కండక్టర్ గొడవ పడటం వల్ల అదుపుతప్పి ప్రమాదానికి కారణమైందని ప్రయాణికులు ఆరోపించారు. పీణ్య పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. యువతి మృతి, ముగ్గురికి గాయాలు -
చిరుత దాడిలో 13 గొర్రెల మృతి
హొసపేటె: కొప్పళ జిల్లా కుకనూరు తాలూకాలో కొన్ని రోజుల క్రితం అదే ప్రాంతంలోని గ్రామ సమీపంలో ఓ ఎలుగుబంటి పొలంలో పని చేస్తున్న రైతుపై దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు నెలజేరి గ్రామంలో చిరుతపులి దాడి చేసి సుమారు 13 గొర్రెలను చంపి తినింది. నెలజేరి గ్రామానికి చెందిన దేవప్ప నేవినాగిదాడకు చెందిన 13 గొర్రెలు చిరుతపులి దాడిలో మృతి చెందాయి. దేవప్ప కట్టివేసిన గొర్రెలపై చిరుత పులి దాడి చేసింది. దీంతో రైతుకు లక్షలాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. సంఘటన స్థలాన్ని సందర్శించిన అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందిస్తామని కూడా వారు హామీ ఇచ్చారు. చిరుత బెడదను నివారించాలని డిమాండ్ చిరుత గ్రామంలోకి రావడంతో రైతులు తమ ఆవులు, దూడలు, గేదెలు, మేకలు, గొర్రెలు మేపడానికి భయపడుతున్నారు. చిరుతపులి దాడి కారణంగా తాము ఇప్పటికే తమ పెంపుడు జంతువులను కోల్పోయాం. చిరుతపులి దాడులను నివారించడానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
ప్రతి క్షణం సద్వినియోగంతో జీవితానికి సార్థకత
బళ్లారిఅర్బన్: జీవితంలో ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆదర్శ వ్యక్తిత్వం రూపొందుతుందని, జీవితానికి సార్థకత చేకూరుతుందని హంపీ హేమకూట నిరంజన జగద్గురు కొట్టూరు బసవలింగ స్వామి పేర్కొన్నారు. సదరు మఠంలో అక్కన బళగ సహకారంతో నిర్వహించిన శివానుభవ సంపద, అఖిల భారత వీరశైవ మహాసభ మాజీ రాష్ట్రాధ్యక్షుడు, మఠం అప్తుడు ఎన్.తిప్పణ్ణకు శ్రద్ధాంజలి ఘటించి స్వామి అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని సార్థకమయం చేసుకోవడానికి కృషి చేయాలన్నారు. ఈ దిశలో విద్య, ఆరోగ్యం, ప్రజా, ధర్మ సేవ ఇలా వివిధ రంగాల్లో సంఘాల్లో పాలు పంచుకొని ఆదర్శ జీవితం రూపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా కన్నడ నాట 16 వేల వచనాలను ఇంటింటికి చేర్చి హలకట్టి చిరస్మణీయులు అయ్యారన్నారు. కన్నడ లెక్చరర్ బసవరాజ అమాటి ప్రత్యేక ప్రసంగం చేశారు. ముఖ్య అతిథులు సీనియర్ విలేకరి ఎన్.వీరభద్రగౌడ, తిమ్మప్ప జోళదరాశి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇందుమతి పాటిల్, డాక్టర్ రేణుకా మంజునాథ్, టీచర్ ఈరమ్మ తదితరులు పాల్గొని తిప్పణ్ణకు ఘనంగా నివాళి అర్పించారు. -
ఇకపై పారిశుధ్య కార్మికులకు ముఖహాజరు
హుబ్లీ: హుబ్లీ– ధార్వాడ నగర పాలక సంస్థ పారిశుధ్య కార్మికుల హాజరు కోసం ఫేస్ బయోమెట్రిక్ ఏర్పాటు అవుతుంది. ప్రస్తుతం రెండు జోన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీన్ని దశల వారీగా అన్ని జోన్లలో విస్తరిస్తారు. ప్రస్తుతం ముఖహాజరు వ్యవస్థ అమలు చేయడంలో రాష్ట్రంలో ప్రథమ నగర పాలికెగా హుబ్లీ ధార్వాడ కీర్తి దక్కించుకుంది. సిబ్బంది నిఖర హాజరు రికార్డు సమయానికి అనుగుణంగా వేతనాలు చెల్లింపు, పాలనలో పారిదర్శకత పారిశుద్ధ్య కార్మికుల పనితనాన్ని పెంచే ఉద్దేశంతో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ముఖముద్ర హాజరు వ్యవస్థ అమలు చేస్తున్నారు. పాలికెలోని 82 వార్డుల్లో సేవలు అందిస్తున్న సుమారు 2500 మంది ఆటో, టిప్పర్, డ్రైవర్ల విధుల మెరుగుదలకు, నగరాల స్వచ్ఛతలో సత్ఫలితాలకు పారదర్శక సేవలు అందించే సదుద్దేశంతో ఈ నూతన వ్యవస్థను ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. కేంద్రం, ఉడాయి నుంచి అనుమతి ఈ వ్యవస్థకు కేంద్ర సర్కారు, ఉడాయి నుంచి అధికారికంగా అనుమతి తీసుకున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే నికర హాజరు దాఖలు ద్వారా ఆలస్యంగా పనిలోకి వచ్చే వారికి కళ్లెం వేయవచ్చు. సదరు కార్మికులకు సకాలంలో వేతనాలకు దోహద పడుతుంది. కాగిత ఽఆధారిత హాజరు పద్ధతి నుంచి ఇక విముక్తి పాలన సంస్కరణలు కన్నడలో ధ్వని సూచనలు తదితర సులభ వినియోగం, జియో ఫెన్సింగ్ ద్వారా స్థలం ఆధారిత హాజరు ధృవీకరణ వ్యవస్థ ఈ యంత్రంలో అలవరచారు. ఈ విషయమై పాలికె పొడి చెత్త నిర్వహణ విభాగం చీఫ్ ఇంజినీర్ సంతోష్ యర్రంగళి మాట్లాడుతూ ఇది పాలికె మహదాశయ ప్రాజెక్ట్ అన్నారు. కార్మికులు ఇంట్లోనే కూర్చొని హాజరు వేస్తారు. పనిలోకి రారు, పనులు జరగవన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్ట్ కోసం 90 మిషన్లు సిద్ధం దీన్ని కూకటివేళ్లతో పెకలించడానికి ఐటీ విభాగం ద్వారా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. బయోమెట్రిక్ అండ్ ఫేస్ హాజరు తీసుకుంటాం. కొందరు కార్మికుల చేతి రేఖలు సమసిపోయినందు వల్ల ముఖ ముద్ర తీసుకుంటాం. కంటి రెటీనాల నుంచి హాజరు తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం 90 మిషన్లు కొనుగోలు చేశాము. వీటిలో 30 యంత్రాలు పని ప్రారంభించాయి. కార్మికులు తప్పనిసరిగా రోజులో మూడు సార్లు హాజరు వేయాలి. ఉదయం 6 గంటలకు తాము పని చేసే చోట ఏర్పాటు చేసిన మిషన్ వద్దకు వెళ్లి ముఖముద్ర వేయాలని, అనంతరం 10, 12 గంటల మధ్య కూడా హజరు వేయాలి. అప్పుడు మాత్రమే పూర్తిగా హాజరైనట్లుగా ఆమోదిస్తామన్నారు. అంతేగాక సకాలంలో నిర్ధిష్ట సమయంలో ఈ ప్రక్రియ ముగించాలని సూచించామన్నారు. టెండర్ ఆహ్వానించి ఆదేశాలు విజయ్ భజంత్రి, సిద్దలింగ, ఈ సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసి ఇచ్చారన్నారు. ఈ వ్యవస్థ అమలు కోసం స్వస్తి ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ కంపెనీకి పాలికె ఐటీ విభాగం నుంచి టెండర్ ఆహ్వానించి ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఇది తొలిసారి అని, ఇది కార్మికులకు చాలా అనుకూలంగా ఉంటుందని ఆ సంఘం జిల్లాధ్యక్షుడు డాక్టర్ విజయ్ గుండ్రాల అభిప్రాయ పడ్డారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ ప్రక్రియ వల్ల ఎంత మంది పనికి వస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఇది కార్మికుల ఎన్నో ఏళ్ల డిమాండ్ అన్నారు. 2018లో వేలిముద్ర హాజరు అమలు అయింది. ప్రస్తుతం అత్యుధునిక ఫెస్రిడిగ్ హాజరు కార్మికుల కోసం అన్ని విధాలైన డాటా అమర్చారు. దీంతో పౌరకార్మికులందరికీ లభించాల్సిన అన్ని వసతులు లభిస్తాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హుబ్లీ ధార్వాడ నగర పాలికెలో తొలిసారి ప్రస్తుతం రెండు జోన్లలో ప్రయోగాత్మకంగా అమలు -
యరగేర తాలూకా చేయరూ
రాయచూరు రూరల్: తాలూకాలోని యరగేరను నూతన తాలూకా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని యరగేర తాలూకా పోరాట సమితి డిమాండ్ చేసింది. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, శాసనసభ్యుడు బసవనగౌడలకు వినతిపత్రాలను సమర్పించి మాట్లాడారు. రాయచూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. కిరీట ప్రాయం ● నవరసాలను పండించి మెప్పించిన జూనియర్ హుబ్లీ: మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్రెడ్డి ఏకై క పుత్రుడు కిరీటి రెడ్డి నటించిన జూనియర్ కన్నడ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. జంట నగరాల్లోని లక్ష్మీసిటీ ప్రైడ్, పీవీఆర్, సుధా, ధార్వాడలోని విజయ్ థియేటర్లలో ఈ సినిమా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచే ప్రదర్శించారు. ప్రేక్షకుల నుంచి విశేషంగా స్పందన లభించింది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వంలో కన్నడ మేటి నటుడు రవిచంద్రన్, బొమ్మరిల్లు ఫేమ్ జెనిలియా తదితర తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో తొలి భాగంలో అల్లరి చేష్టలతో అటు ఫైట్లు, సంభాషణ పలికే తీరులో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. రెండో భాగంలో తండ్రి విలువ తెలుసుకున్న కుమారుడిగా, అప్పుడే తెలిసొచ్చిన అక్క జెనీలియాకు తమ్ముడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. పీటర్ హెయిన్స్ ఫైటింగ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సెఫిల్ఖాన్ ఫోటోగ్రఫిలో చిత్రీకరించిన చిత్రంలో నవరసాలు పండించి కుటుంబ తరహా సినిమాలకు ఓ మంచి యువ హీరో అనుభవం ఉన్న వాడిలా చిరంజీవి కిరీటి నటించారని నీలకంఠ శాస్త్రి, వెంకటేష్, బసవరాజ్, అశోక్ తదితర యువకులు, అలాగే పలువురు ఇంజినీరింగ్ విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. సముదాయ భవనం ఏర్పాటుకు వినతి రాయచూరు రూరల్: నగరంలో మైనార్టీల కోసం సముదాయం భవన్ ఏర్పాటు చేయాలని అంజుమన్ సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయం వద్ద రాష్ట్ర మంత్రి శరణ ప్రకాష్ పాటిల్కు సమితి నేతలు రజాక్ ఉస్తాద్ వినతిపత్రాన్ని సమర్పించి మాట్లాడారు. సుమారు 4 లక్షల జనాభా కలిగిన మైనార్టీలకు నూతనంగా సముదాయ భవనం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు సమకూర్చాలని విన్నవించారు. ఈ సందర్భంగా ఇక్బాల్ అహ్మద్, ఉస్మా, అమీనుల్లా తదితరులు పాల్గొన్నారు. -
ఇన్చార్జి మంత్రిపై ఎమ్మెల్యేల చిందులు
రాయచూరు రూరల్: ప్రభుత్వం ఏర్పాటై ఏడున్నరేళ్లు గడుస్తున్నా జిల్లాలో అభివృద్ధి పనుల విషయంలో మంత్రులు నిర్లక్ష్యం చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా పంచాయతీ సభాంగణంలో జరిగిన కేడీపీ సమావేశంలో జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్పై ఎమ్మెల్యేలు బసవనగౌడ దద్దల్, బసవనగౌడ తుర్విహాళ్, ఎమ్మెల్సీ వసంత్కుమార్ చిందులు తొక్కారు. జిల్లాలో అభివృద్ధి పనుల విషయంలో 6 నెలలకు ఒకసారి సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తే అభివృద్ధి పనులపై ఆలోచన చేయడం సాధ్యమవుతుందా? అని మంత్రిని ప్రశ్నించారు. మరో వైపు దేవదుర్గ శాసన సభ్యురాలు కరియమ్మ నాయక్ మాట్లాడుతూ రాయచూరు నుంచి దేవదుర్గ మార్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన టోల్గేట్ను తొలగించాలని కోరుతూ అరగంట సేపు బైఠాయించారు. బెంగళూరు ప్రాంతంలో శాసన సభ్యుడు దర్శన్ పుట్టణ్ణయ్య టోల్ను తొలగించాలని లేఖ సమర్పించిన వెంటనే తొలగించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఎరువుల కొరత లేకుండా చూడండి జిల్లాలో ఎరువుల కొరత నెలకొనకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రామాణికతతో విధులు నిర్వహించాలని, శాసన సభ్యుల గౌరవానికి భంగం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అక్రమంగా ఇసుక, బియ్యం రవాణా, ఎరువుల విక్రయం, నకిలీ విత్తనాల సరఫరా, జూదం, మట్కా వంటి అక్రమాలపై జిల్లా స్థాయి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు శరణేగౌడ బయ్యాపుర, బసవనగౌడ బాదర్లి, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, ఎస్పీ పుట్టమాదయ్య, డీహెచ్ఓ సురేంద్రబాబు, విద్యాశాఖ అధికారి బిరాదార్, వ్యవసాయ శాఖ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిపై కేడీపీ సమావేశంలో రసాభాస టోల్గేట్ను తొలగించాలని బైఠాయింపు -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
రాయచూరు రూరల్: నగర ప్రాంత విద్యార్థులు క్రీడల్లో రాణించి రాష్ట్ర స్థాయికి ఎదిగేందుకు పోటీ పడాలని నగరసభ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్ పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మగాంధీ క్రీడా మైదానంలో తాలూకా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు క్రీడల్లో కూడా పాల్గొని ప్రతిభను ప్రదర్శించి పేరు గడించాలన్నారు. ధార్వాడలో యువకుడు ఆత్మహత్య హుబ్లీ: అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ధార్వాడ తాలూకా కబ్బెనూరులో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన మక్తుమ్సాబ్ (26) ఆత్మహత్య చేసుకున్న యువకుడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ యువకుడు గురువారం రాత్రి తమ పొలంలో విషం తాగాడు. తక్షణమే కుటుంబ సభ్యులు అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయినట్లు ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో గుండెపోటుతో జిల్లాలోని నవలగుంద తాలూకా హేమనూరు గ్రామానికి చెందిన హనుమంతప్ప హుగార(48) మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, అపార సంఖ్యలో బంధువులు ఉన్నారు. గుండెపోటుతో వ్యాయామ ఉపాధ్యాయుడు మృతి హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని బహుదూర్ బండి గ్రామంలో గుండెపోటుతో వ్యాయామ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన జరిగింది. శాంతవీరస్వామి గంగాధర్(57) అనే వ్యక్తి హిరేబెణకల్ గ్రామ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా, యోగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతున్నందున ఉదయం గంగాధర్ ఆస్పత్రిలో చేరాడు. అయితే చికిత్స పొందుతూ అతను మరణించాడు. దీంతో కొప్పళ జిల్లాలో ఇప్పటి వరకు ఐదుగురు గుండెపోటుతో మరణించినట్లయింది. 20న బంజారా సాహిత్య పరిషత్ ప్రారంభం హొసపేటె: బంజారా సాహిత్య పరిషత్ విజయనగర జిల్లా శాఖ ప్రారంభోత్సవం, పదాధికారుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈనెల 20న ఉదయం 10 గంటలకు నగరంలోని అంబేడ్కర్ భవన్లో నిర్వహించనున్నారు. మాజీ మంత్రి పీటీ పరమేశ్వర నాయక్ పరిషత్ శాఖను లాంఛనంగా ప్రారంభిస్తారు. శివప్రకాష్ మహారాజ తిప్పేరుద్ర స్వామీజీ హాజరవుతారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప అధ్యక్షత వహిస్తారు. ఎమ్మెల్యేలు నేమిరాజ్ నాయక్, కృష్ణనాయక్, కేఎంఎఫ్ మాజీ అధ్యక్షుడు భీమా నాయక్, డీహెచ్ఓ డాక్టర్ ఎల్ఆర్.శంకర్ నాయక్, కూడ్లిగి డీఎస్పీ మల్లేష్ దొడ్డమని, హగరిబొమ్మనహళ్లి సీఐ వికాస్ లమాణి, పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ జాధవ్, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. సరిగమప ఫేమ్ రమేష్ లమాణి సంగీత కార్యక్రమం ఉంటుందని పరిషత్ జిల్లా అధ్యక్షుడు అలోక్ నాయక్ తెలిపారు. దుండగుడిని ఉరి తీయాలి బళ్లారి అర్బన్: ఉపాధి కోసం కొప్పళ జిల్లా హర్లాపుర గ్రామం నుంచి బెంగళూరుకు కట్టడ కార్మికురాలిగా పనికి వెళ్లిన రేణుకమ్మ, నాగప్ప దంపతుల కుమార్తె అరుణకుమారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని తక్షణమే ఉరి శిక్ష విధించాలని బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించాలి. ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చి ఆదుకోవాలని అలెమారి, అరె అలెమారి సంఘం జిల్లాధ్యక్షుడు తిమ్మణ్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో డీసీ కార్యాలయంలో ఆందోళన చేపట్టి అనంతరం జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. కట్టడ కార్మికురాలిగా బతకడానికి వచ్చిన అమాయకురాలైన అరుణ కుమారిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన క్రూరుడైన నిందితుడిని ఏ మాత్రం కరుణించకుండా ఉరి శిక్ష వేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. కార్మిక పరిషత్ అధ్యక్షుడు దేవ, ఆ సంఘం జిల్లా, తాలూకా పదాధికారులు పాల్గొన్నారు. ఆ కేసును విరమించుకోండి రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా సిరివార తాలూకా కరవే అధ్యక్షుడిపై బలవంతంగా పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని కరవే జిల్లా అధ్యక్షుడు వీరేష్ వీర డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వీరా మాట్లాడుతూ వారం రోజుల క్రితం తాలూకా అధ్యక్షుడు రాఘవేంద్ర, ఖాజనగౌడలపై పెట్టిన కేసు అసత్యంతో కూడినదని, దానిని విచారించి కేసును ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎస్పీ పుట్టమాదయ్యకు వినతిపత్రాన్ని సమర్పించారు. -
గ్యారంటీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం
మైసూరు: ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆధ్వర్యంలోని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని కేంద్రమంత్రి శోభా కరంద్లాజె ఆరోపించారు. శుక్రవారం ఆమె మైసురులోని చాముండికొండకు వెళ్లి చాముండేశ్వరిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గ్యారంటీలు అమలు చేయకపోగా పన్నుల ద్వారా వచ్చిన నిధులు ఏమవుతున్నాయో అంతుబట్టడం లేదన్నారు. దళితులను బీజేపీ అధ్యక్షుడిగా చేయాలన్న సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలను పాత్రికేయులు ప్రస్తావించగా సిద్దూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కుర్చీ కోసం సీఎం, డీసీఎం పోటీ పడుతున్నారన్నారు. -
రేపు రక్తదాన శిబిరం
బళ్లారిటౌన్: శ్రీరామరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20న సంగనకల్లు రోడ్డులోని కేఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో స్వామి వివేకానంద రక్త కేంద్రం సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఉదయం 8 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు రాజు తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ ఫౌండేషన్ నుంచి ప్రస్తుతం మూడోసారి ప్రతి ఏటా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి ప్రత్యేకంగా శిబిరంలో రక్తదానం చేసిన వారికి హెల్మెట్ కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ గతంలో కోవిడ్ సమయంలో రేషన్ కిట్లను అందజేయడంతో పాటు ప్రతి ఏటా పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగ్లను అందజేసిందని గుర్తు చేశారు. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న సాటి వ్యక్తిని కాపాడినట్లవుతుందన్నారు. -
అడవుల నాశనంతో ఉష్ణోగ్రతల పెరుగుదల
హొసపేటె: అడవుల నాశనం వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ విషయంపై విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని విజయనగర జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి అన్నారు. శుక్రవారం నగరంలో పోలీస్ శాఖ, ఎస్ఎల్ఆర్ మెటాలిక్స్ లిమిటెడ్ సీఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సాయుధ రిజర్వ్ ఫోర్స్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఆమె మాట్లాడారు. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అడవుల నిర్మూలన ప్రభావం కనిపించింది. ఈ ఉష్ణోగ్రతలను తగ్గించడానికి మొక్కలు నాటడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దీనితో పాటు గ్రామాలు, పట్టణాల్లో విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన కల్పించడం అవసరం. సాయుధ రిజర్వ్ ఫోర్స్ ప్రాంగణంలో మొక్కలు నాటడం నిజంగా ప్రశంసనీయమని అన్నారు. ఎస్ఎల్ఆర్ కంపెనీ అధికారి వేదవ్యాస్ మాట్లాడుతూ మా కంపెనీ చుట్టు ఉన్న గ్రామాల్లో ఇప్పటికే మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. మేము ప్రతి సంవత్సరం ఇదే చేస్తాము. మేము మొక్కలు నాటడమే కాకుండా వాటిని పోషించే బాధ్యతను కూడా తీసుకున్నాము, వాటిని విజయవంతంగా పెంచామని అన్నారు. కార్యక్రమంలో విజయనగర పోలీసు అధికారులు, డీఎస్పీ మంజునాథ్ తళ్వార్, డీఎస్పీ కూడ్లిగి మల్లేష్ దొడ్డమని, డీఎస్పీ హరపనహళ్లి వెంకటప్ప నాయక, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఎల్ఆర్ మెటాలిక్స్ కంపెనీ అధికారులు మల్లికార్జున, గణేష్, నాగరాజ్, బసవరాజ్ పాల్గొన్నారు. -
యూరియా అందుబాటులో ఉంది
హొసపేటె: జిల్లాలోని 18 ఫిర్కాల్లో మంచి వర్షాలు కురిశాయి. మొక్కజొన్న ప్రధానంగా 15 ఫిర్కాల్లో విత్తుతారు. ప్రతి సంవత్సరం 1.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న విత్తుతారు. ఈ సారి వర్షాకాలంలో 2.18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విత్తాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న పంటకు యూరియా ఎరువులను టాప్ డ్రెస్సింగ్గా ఇస్తున్నారు. చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న విత్తుతారు కాబట్టి యూరియా ఎరువులకు అధిక డిమాండ్ ఉంది. ఏప్రిల్ నుంచి జూలై వరకు 26,293 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువులకు డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు 30,059 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువులు సరఫరా అయ్యాయి. ఇప్పటికే డిమాండ్ కంటే 4000 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువులు ఎక్కువగా ఉన్నాయని అంచనా. రాబోయే 12 రోజుల్లో వివిధ సరఫరా సంస్థలు 2500 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువులను సరఫరా చేస్తాయి. కాబట్టి రైతులు ఎటువంటి పుకార్లను వినవద్దని అభ్యర్థించారు. విక్రేతలు ఎక్కువ ధరకు అమ్మితే, వారు సంబంధిత రైతు కేంద్రాన్ని లేదా వ్యవసాయ సహాయ సంచాలకుడి కార్యాలయాన్ని సందర్శించి ఫిర్యాదు చేయవచ్చన్నారు. మొక్కజొన్న పంటకు యూరియా ఎరువులకు ప్రత్యామ్నాయంగా రైతులు నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను కూడా వాడతారని ఆయన తెలిపారు. రైతులకు ఆందోళన అవసరం లేదు జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ వెల్లడి -
గ్రేటర్ బెంగళూరులో పంచ పాలికెలు
బనశంకరి: గ్రేటర్ బెంగళూరును 5 మహానగర పాలికెలుగా విభజన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 పాలికెలా, 7 పాలికెలా? అనే సస్పెన్స్ను ముగిస్తూ మంత్రిమండలి భేటీలో 5కు ఖరారు చేసింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట దుర్ఘటనలో ఆర్సీబీ దే బాధ్యత అని తేల్చి క్రిమినల్ కేసు నమోదు చేయనున్నారు. సమావేశం తరువాత వివరాలను న్యాయశాఖమంత్రి హెచ్కే.పాటిల్ మీడియాకు వివరించారు. ● రూ. 24 కోట్లతో రాయచూరు తాలూకాలో నూతన జౌళి పార్కు ఏర్పాటు. ● రాష్ట్రంలో అణు విద్యుత్ స్థావరం ఏర్పాటుకు ఆమోదం. ఇందుకు ఎన్టీపీసీ గుర్తించిన స్దలాల పరిశీలనకు నిర్ణయం. రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు సాధ్యమో అధ్యయనం చేస్తారు. కొప్పళ, రాయచూరు, విజయపుర సహా మిగిలిన స్థలాలను పరిశీలిస్తారు. ● గ్రేటర్ బెంగళూరును 5 పాలికెలుగా చేయాలని తీర్మానం. ప్రస్తుతం బీబీఎంపీ ఒక్కటే ఉంది. ● ఆయుష్శాఖ ఆయుర్వేద, సిద్ద, యునాని ఔషధాల సురక్షిత ల్యాబ్ను ఆహార సురక్షత శాఖలో విలీనం ● ప్రభుత్వ ప్రథమ డిగ్రీ కాలేజీల్లో మిగిలిపోయిన ఉర్దూ బాషా అసిస్టెంట్ అధ్యాపకుల పోస్టులను జనరల్ అభ్యర్థులతో భర్తీ ● రూ. 2.20 కోట్లతో న్యాయ విజ్ఞాన ప్రయోగాలయాల కోసం ఫోరెన్సిక్ వాహనాల కొనుగోలు ● హావేరి జిల్లా హానగల్ తాలూకా యళవట్టి గ్రామంలో 28 ఎకరాల ఆహార ఉత్పత్తుల తయారీకి ఫుడ్పార్క్ ఏర్పాటు ● బెంగళూరు నగరంలో మురుగునీటిని శుద్ధి చేసి కోలారు జిల్లా, చిక్కబళ్లాపుర జిల్లాల్లో 126 చెరువులను నింపడానికి 5 ఏళ్లు నిర్వహణ పనులకు రూ.128 కోట్ల మంజూరు ● మైనారిటీ వసతి పాఠశాలలు, కాలేజీల నిర్మాణ పనులకు రూ.264 కోట్లు మంజూరు ● బెళగావిలో కిత్తూరు కోటలో రూ.30 కోట్ల తో థీమ్ పార్క్ ఏర్పాటు ● బెంగళూరు గ్రామాంతర జిల్లా , దొడ్డబళ్లాపుర తాలూకా వీరభద్రనపాళ్య గ్రామ సర్వేనెంబరు 66లో 15 గుంటల భూమిని కాంగ్రెస్ ఆఫీసుకు కేటాయింపు ● గ్రామ పంచాయతీలలో 1,530 టెలిమెట్రిక్ వర్ష మాపన పరికరాలు రూ.19.89 కోట్లతో కొత్తవి ఏర్పాటు ● రూ.166 కోట్ల అంచనాతో బాదామి, ఐహోళె , హంపీ, పట్టదకల్లు, బీజాపుర తో కూడిన ఉత్తర కర్ణాటక పర్యాటక సర్కిల్ అభివృద్ధి. ● గ్రేటర్ బెంగళూరు పరిధిలో ఏఖాతా, బీ ఖాతాలు పంపిణీ. అక్రమ కట్టడాల నిర్మాణం, లేఔట్లకు చెక్. మంత్రిమండలిలో నిర్ణయం త్వరలోనే బీబీఎంపీ విభజన! జౌళి పార్కు, అణు విద్యుత్ కేంద్రం -
ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం
శివాజీనగర: రాజధానిలో అధికమవుతున్న ట్రాఫిక్ సమస్య నివారణకు అత్యవసర, దీర్ఘకాల చర్యలను చేపట్టనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. గురువారం బెంగళూరు ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందు అత్యవసర చర్యల ద్వారా రద్దీని తగ్గిస్తామని చెప్పారు. నగరంలో బేసిక్ పోలీసింగ్కు పెద్దపీట వేస్తాము, పోలీస్ సిబ్బంది ఇతర పనులు చేయడాన్ని అరికడతామన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరి సమస్యను తీవ్రంగా పరిగణించి పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. స్టేషన్కు వచ్చే ఎవరినీ నిర్లక్ష్యం చేయరాదు, అందులో మహిళలు, పిల్లల సమస్యలపై మరింత జాగ్రత్తలు తీసుకొని పని చేయాలని చెప్పానన్నారు. సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించటం, మత భావాలను రెచ్చగొట్టడం, మహిళల గౌరవానికి భంగం కలిగించే సామాజిక మాధ్యమ పోస్ట్లపై చర్యలు తప్పవన్నారు. సైబర్ క్రైమ్ నేరగాళ్లను కనిపెట్టడం, ప్రజల్లో అవగాహన పెంచటం ద్వారా సైబర్ నేరాలను తగ్గించవచ్చన్నారు. బైక్ వీలింగ్కు పాల్పడేవారిని అడ్డుకుంటామని, వీలింగ్కు అనుకూలమయ్యేలా బైక్లను చేసే మెకానిక్ల మీద చర్యలు తీసుకొంటామని తెలిపారు. రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగించేలా కార్యక్రమాలు చేసేవారిని అడ్డుకుంటామని తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం -
రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు?
సాక్షి,బళ్లారి: రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ తలెత్తుతుందని, సీఎం కుర్చీ కోసం కుమ్ములాట సాగుతోందని మాజీ మంత్రి శ్రీరాములు ఆరోపించారు. ఆయన గురువారం నగరంలోని తన నివాసగృహంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో సీఎం సిద్ధరామయ్య కీలుబొమ్మలా అని, కాంగ్రెస్ ఇన్ఛార్జి సుర్జేవాలా సర్వాధికార ధోరణి అవలంభిస్తున్నారన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులతో ప్రత్యేక సమావేశాలు కావడం సీఎం తరహాలో వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్యా? కాదా? అని అనుమానం కలుగుతోందన్నారు. బళ్లారిలో డ్రగ్స్ మాఫియా బళ్లారిలో డ్రగ్స్ మాఫియా పెరిగిపోతోందన్నారు. కళాశాల విద్యార్థులకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని వాపోయారు. చిన్న ఖర్గే శిష్యుడు లింగరాజు డ్రగ్స్ మాఫియాలో ఇరుక్కున్నారని, జిల్లాలో మట్కా, పేకాట పెట్రేగి పోతోందని, విచ్చలవిడిగా జరుగుతున్నా పాలకులకు నియంత్రించాలనే ఆలోచన లేదన్నారు. బళ్లారి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పూర్తి చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా జమీర్ అహమ్మద్ ఉన్నాడో? లేదో? అర్థం కావడం లేదన్నారు. తుంగభద్ర డ్యాంలో 19వ క్రస్ట్గేటు గత ఏడాది కొట్టుపోయిన నేపథ్యంలో మిగిలిన గేట్ల పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని నిపుణులు సూచించినా ఎందుకు మరమ్మతు చేయలేదు? అని ప్రశ్నించారు. మాజీ మేయర్, పాలికె ప్రతిపక్ష నాయకుడు ఇబ్రహీంబాబు, కార్పొరేటర్లు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, హనుమంతు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వీరశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్లో కుమ్ములాట సర్కార్పై మాజీ మంత్రి శ్రీరాములు గరం -
హంపీలో మళ్లీ కూల్చివేతలు షురూ
హొసపేటె: హంపీ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో మళ్లీ జేసీబీల రణగొణ ప్రారంభమైంది. అక్రమ భవనాల తొలగింపునకు అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు. కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని సణాపుర, విరుపాపుర గడ్డ ప్రాంతాల్లో ఆరు అక్రమ హోంస్టేలు, రిసార్ట్లు తొలగించారు. హొసపేటె తాలూకాలోని వెంకటాపుర ప్రాంతంలో ఒక హోంస్టేను తొలగించారు. కొప్పళలోని విరుపాపుర గడ్డ ప్రాంతంలో ఒక అక్రమ హోంస్టేను బుధవారం హంపీ అథారిటీ తొలగించింది. మోడల్ గొర్రెల షెడ్ యజమాని స్వచ్ఛందంగా దానిని తొలగించారు. మరో హోంస్టేను తొలగించాలని అధికారులు ఆదేశించారు. దానిని తొలగించక పోతే తామే తొలగిస్తామని హెచ్చరించారు. హంపీ అథారిటీ కమిషనర్ రమేష్, గంగావతి తహసీల్దార్ నాగరాజ్, పీడీఓ రాజేశ్వరి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ తదితరులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. 25 అక్రమ రిసార్ట్లు, హోంస్టేలు, రిసార్ట్ల గుర్తింపు హంపీ డెవలప్మెంట్ అఽథారిటీ ఆపరేషన్ ప్రారంభం కార్యాచరణలో 7 అక్రమ హోంస్టేలు, రిసార్ట్ల తొలగింపు -
మహిళపై దుండగుల దాడి
హుబ్లీ: మంటూరు రోడ్డు అరళికట్టె వీధిలో ఇటీవల జరిగిన గుంపు ఘర్షణ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన మహిళపై దాడి చేసిన ఘటన గురువారం వెలుగు చూసింది. ఆ రోడ్డులోని మౌలాలి దర్గా వద్ద వెళుతుండగా బైక్ మీద మాస్క్ వేసుకొని వచ్చిన ఇద్దరు వ్యక్తులు మావుబీ బీజాపుర అనే మహిళ కంట్లో కారం చల్లి దాడి చేశారు. ప్రస్తుతం కేఎంసీ ఆస్పత్రిలో మహిళ చికిత్స పొందుతోంది. సదరు గుంపు ఘర్షణలో గాయపడిన ఈ మహిళ కూడా చికిత్స పొందుతోంది. అంతేగాక ఆమె కాలికి గాయమైంది. ఆమె పోలీస్ స్టేషన్కు వెళుతుండగా సాక్ష్యం చెప్పాలని పోలీసులు సూచించారు. దీంతో ఆమైపె దాడి జరిగినట్లు బాధితురాలు అనుమానం వ్యక్తం చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సర్కారు బడిలో పేలిన సిలిండర్ ● తృటిలో తప్పిన పెను ప్రమాదం సాక్షి,బళ్లారి: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేసే వంటగదిలో సిలిండర్ పేలడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం చిత్రదుర్గ జిల్లా మల్లాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో సిలిండర్ ఉన్నఫళంగా పేలడంతో వంట సామగ్రి, ఇతర వస్తువులు మాత్రమే కాలిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై చిత్రదుర్గ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒపెక్ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ రాయచూరు రూరల్ : రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ(ఒపెక్) ఆస్పత్రిలో ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించినట్లు జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. బుధవారం ఒపెక్ ఆస్పత్రిని సందర్శించి వైద్యాధికారులతో మాట్లాడారు. క్యాన్సర్కు చికిత్సతో పాటు రోగులందరికీ సమానంగా వైద్యం చేస్తారన్నారు. కార్డియాలజీ, యూరాలజీ, అనస్థిషియా, పీడియాట్రిక్, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్టో సర్జికల్, మెడికల్ గ్యాస్ట్రో, పైకో మ్యాక్సిలరీ సర్జరీ సౌకర్యాలు కల్పించారన్నారు. ఆస్పత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ సాగర్, నీలప్రభ, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు, విజయ్ శంకర్లున్నారు. దేశ సేవకు సిద్ధంగా ఉండాలి బళ్లారిఅర్బన్: దేశ సేవకు, సమాజ సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కళ్యాణ కర్ణాటక మాజీ పారా మిలిటరీ సంఘం ప్రధాన కార్యదర్శి బీఎన్.ప్రహ్లాద్రెడ్డి విద్యార్థులకు సూచించారు. బళ్లారి జిల్లా ఇన్నర్ వీల్ సంస్థ సహకారంతో ఎంజీఎం పాఠశాల, కళాశాల విద్యార్థులకు సదరు సంఘం ఆధ్వర్యంలో దేశ రక్షణలో పారా మిలిటరీ దళాల పాత్ర అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేటి పిల్లలే రేపటి పౌరులని అన్నారు. కన్న తల్లిదండ్రులకు ఉత్తమ కుమారుడిగా, గురువులకు మంచి శిష్యుడిగా, మంచి విద్యార్థిగా మెలగాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ సిబ్బంది, విద్యార్థులు, ఇన్నర్వీల్ అధ్యక్షులు, కార్యదర్శి, సభ్యులు, మాజీ సైనికులు జిల్లా హోంగార్డ్స్ కమాండెంట్ షేక్సాబ్, కళ్యాణ కర్ణాటక మాజీ పారా మిలిటరీ సంఘం ఉపాధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి, డైరెక్టర్లు లక్ష్మణ్, ఎంఆర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీచైతన్య కళాశాల డైరెక్టర్ రాధాకృష్ణ కన్నుమూతసాక్షి,బళ్లారి: నగరంలో పేరుగాంచిన శ్రీచైతన్య కళాశాల డైరెక్టర్ పయ్యావుల రాధాకృష్ణ(65) కన్నుమూశారు. ఆయన గురువారం హైదరాబాద్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నెల రోజులుగా ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతూ బళ్లారిలో చికిత్స తీసుకున్న అనంతరం హైదరాబాద్కు వెళ్లి చికిత్స పొందుతున్న తరుణంలో చికిత్స ఫలించిక మరణించారు. నెల రోజులుగా ఆయనకు వైద్యులు వివిధ రకాలుగా వైద్యం అందించినా చికిత్స ఫలించలేదు. ఆయన సొంత ఊరు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ కాగా బళ్లారిలో ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పని చేస్తూ, శ్రీచైతన్య విద్యా సంస్థలను స్థాపించి అంచెలంచెలుగా కళాశాలలను ముందుకు తీసుకెళ్లారు. గత 20 సంవత్సరాలకు పైగా శ్రీచైతన్య కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారు. బళ్లారితో పాటు చిత్రదుర్గ జిల్లాలో కూడా ఆయన విద్యా సంస్థలను స్థాపించారు. ఉన్నఫళంగా ఆరోగ్యంలో మార్పులు చోటు చేసుకొని ఆయన మృతి చెందడంపై కుటుంబ సభ్యులతో పాటు శ్రీచైతన్య కళాశాల సిబ్బంది, నగర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు భార్య పయ్యావుల రాధిక, పయ్యావుల విష్ణు, పయ్యావుల సంజయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. -
పరిహారం కోసం రైతుల ధర్నా
రాయచూరు రూరల్: భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేశారు. గురువారం మస్కి తాలూకాలోని గోనవార వద్ద చేపట్టిన ఆందోళనలో శరణప్ప ఉద్బాళ మాట్లాడారు. భారత్ మాలా పథకంలో నిర్మాణాలు చేపడుతున్న జాతీయ రహదారి పనులకు రైతుల నుంచి భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు రైతులకు పరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో భూస్వాధీన అధికారులు, రైతుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. లింగసూగూరు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ ఆధ్వర్యంలో పోలీసుల కవాతుతో రైతు సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించారు. రైతుల భూములను పోలీస్ రెవెన్యూ శాఖాధికారులు బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. లింగసూగూరు ఏసీ, డీఎస్పీ, తహసీల్దార్ల ఆధ్వర్యంలో భూములను స్వాధీనం చేసుకున్నారు. -
విద్యుత్ కోత నిరసిస్తూ ఆందోళన
రాయచూరు రూరల్: నగరంలో విద్యుత్ కోత విధించడం తగదని కేపీసీసీ వెనుక బడిన వర్గాల విభాగం ఉపాధ్యక్షుడు టి.మారెప్ప పేర్కొన్నారు. గురువారం నగరంలోని తిమ్మాపూర్ పేటలో జెస్కాం సబ్ స్టేషన్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. నగరంలో దేవి జాతర ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో విద్యుత్ కోత విధించడాన్ని తప్పుబట్టారు. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొనకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఆరో వేతనం చెల్లించరూ రాయచూరు రూరల్: పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆరో వేతన శ్రేణిని చెల్లించాలని పదవీ విరమణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మహదేవప్ప మాట్లాడారు. 2016లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వేతన పద్ధతిని అమలు చేయాలన్నారు. 2025లో పార్లమెంట్లో ఆర్థిక బిల్లుల బడ్జెట్లో పేర్కొన్నట్లు పెన్షన్ను కూడా ఆరో వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా వేతనాలను చెల్లించాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా ప్రధానమంత్రికి వినతిపత్రం సమర్పించారు. -
కుందగోళకు లోకాయుక్త డీఎస్పీ భేటీ
హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని కుందగోళ పట్టణంలోని శ్రీసితికంఠేశ్వర ప్రభుత్వ పీయూ కళాశాల ప్రిన్సిపాల్పై దాఖలైన కేసులకు సంబంధించి లోకాయుక్త డీఎస్పీ నేతృత్వంలోని బృందం గురువారం కళాశాలకు వెళ్లి దర్యాప్తు ప్రారంభించింది. ఆ కళాశాలలో నిధుల దుర్వినియోగం, విజ్ఞాన వస్తు ప్రయోగాలయానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20 లక్షల నిధుల్లో అవినీతిపై సామాజిక కార్యకర్త లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సదరు బృందం అక్కడికి వెళ్లింది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ గిరీష్ అంతర్గట్టిని విచారించింది. కొన్ని బిల్లులను పరిశీలించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గిరీష్ మాట్లాడుతూ కళాశాల కాంపౌండ్, ఉపాధ్యాయుల కొరత గురించి మాత్రమే తాను వారికి సమాచారం ఇచ్చినట్లు మీడియాకు తెలిపారు. ఆస్పత్రిలో విద్యుత్ కోతతో రోగుల నరకయాతన హొసపేటె: తల్లీబిడ్డల ఆస్పత్రిలో బుధవారం రాత్రి దాదాపు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచి పోవడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ సరఫరాతో పాటు జనరేటర్ కూడా పని చేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తల్లులు, నవజాత శిశువులు, ఐసీయూలో ఉన్న వారు సుమారు రెండున్నర గంటల పాటు నరకయాతన అనుభవించారు. విద్యుత్ వైఫల్యానికి కారణాన్ని తెలుసుకోవడానికి జెస్కాం అధికారులు కూడా ప్రయత్నించారు. చివరకు వేరే చోట నుంచి జనరేటర్ను కూడా తీసుకు రావడంతో ఆస్పత్రిలో ఉన్న బాలింతలు, నవజాత శిశువులు ఊపిరి పీల్చుకున్నారు. -
సామాజిక సేవలో ముందడుగు వేద్దాం
హొసపేటె: సామాజిక సేవలు దేశంలో నంబర్ వన్ కావడానికి ఉపయోగపడతాయని రోటరీ ఇన్నర్ వీల్ జాతీయ అధ్యక్షురాలు జ్యోతి మహిపాల్ అన్నారు. ఇన్నర్వీల్ జిల్లా 316 కొత్త అధ్యక్షురాలు జయశ్రీ రాజగోపాల్తో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె మాట్లాడారు. కొన్ని సార్లు సామాజిక సేవ కోసం మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. మన చుట్టూ దాతలు ఉన్నారు. మన సేవ నిజమైన లబ్ధిదారులకు చేరుతుందని మనకు కచ్చితంగా తెలిస్తే, దాతలు ఉదారంగా సహాయం చేస్తారు. ఇన్నర్వీల్ ఇప్పటికే విశ్వాసానికి అంకితమైన సంస్థ. జయశ్రీ తన మేధో సామర్థ్యాన్ని స్వరాజ్ సేవకు అంకితం చేసిందని, దానిని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఇన్నర్వీల్ సంస్థ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. -
మొబైల్ వ్యసనానికి మరో బాలుడు బలి
యశవంతపుర: మొబైల్ఫోన్కు అలవాటుపడిన బాలలు పెద్దలు మందలించారని ఆత్మహత్యలకు వెనుకాడడం లేదు. హావేరి జిల్లాలో ఓ బాలుని ఆత్మహత్య మరువకముందే ఉత్తరకన్నడ జిల్లా హళియాళ మంగళవాడి గ్రామంలో మరో ఘోరం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఓం కదం (13), ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రోజూ పాఠశాల అయిపోగానే మొబైల్తో కాలక్షేపం చేసేవాడు. ఎక్కువసేపు ఫోన్ చూడవద్దని తండ్రి మనోహర్ బుద్ధిమాటలు చెప్పాడు. దీంతో ఆక్రోశం చెందిన బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
మైనింగ్తో పర్యావరణానికి చేటు
చెళ్లకెరె రూరల్: జిల్లాలో మైనింగ్ కంపెనీల కార్యకలాపాలతో పరిసరాలపై దుష్పరిణామం పడింది. మీ ధోరణి మార్చుకోక పోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చిత్రదుర్గ లోక్సభ సభ్యుడు గోవింద కారజోళ హెచ్చరించారు. ఆయన గురువారం పావగడ రోడ్డులో నాగరిక హితరక్షణ వేదిక, రైతు సంఘాలు, బీజేపీ ఏర్పాటు చేసిన స్టీల్ కంపెనీలు నడుపుతున్న మైనింగ్ను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలో పాల్గొని మాట్లాడారు. వారు నిర్వహిస్తున్న మైనింగ్ వల్ల రైతుల పంటలకు హాని జరుగుతోంది. మట్టి, ధూళి వల్ల ప్రజలు రోగాలకు గురవుతున్నారు. ఈ మైనింగ్ కంపెనీ యజమానులు ఇతర జిల్లాల వాహనాలను ఉపయోగిస్తున్నందున ట్రాక్టర్, టిప్పర్ డ్రైవర్లు నిరుద్యోగులు అయ్యారు. మైనింగ్ నుంచి వచ్చే ధూళి వల్ల దగ్గరలోనే ఉన్న పాఠశాలకు, ప్రజలపై దుష్పరిణామం పడుతోందన్నారు. ఎమ్మెల్యే కుమ్ముక్కు వల్లే ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేటీ కుమారస్వామి, బీజేపీ నాయకులు సోమశేఖర్ మండిమట్, జయపాలయ్య, సూరనహళ్లి శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో అధిక మరణాలు అబద్ధం
హుబ్లీ: రాష్ట్రంలో గుండెపోటుతో ఎక్కువ మంది చనిపోతున్నారని తప్పుడు సందేశం ప్రచారం అయిందని, అయితే గుండెపోటు వల్లే ఎక్కువ మంది చనిపోతారనడం అబద్ధం అని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ పాటిల్ తెలిపారు. హావేరి తాలూకా నిలోగల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈటీటీసీ శిక్షణ సముదాయాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. గుండెపోటు కేసులపై వికాస సౌధలో ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్తో ఇటీవల సంయుక్త మీడియా సమావేశం నిర్వహించామన్నారు. ఆ మేరకు అన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అయిందన్నారు. గత 6 నెలల గణాంకాల వివరాలు విశ్లేషించాం. దీని కోసం ఓ సమితిని కూడా ఏర్పాటు చేశామన్నారు. సమితి నివేదిక ప్రకారం మరణాల సంఖ్య ఎక్కువ కాలేదన్న సమాచారం ఉందన్నారు. అయితే ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్లినందువల్ల భయకంపితులయ్యారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో గుండెపోటు మృతులపై పూర్తి సమాచారం తీసుకున్నాం. అంతేగాక ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండెపోటు వస్తుందన్న తప్పుడు విశ్వాసం ఉంది. గుండెపోటుకు సదరు వ్యాక్సిన్కు ఎటువంటి సంబంధం లేదన్నారు. హావేరి జిల్లా ఆస్పత్రిలో హృద్రోగ నిపుణులు లేరని తమ దృష్టికి వచ్చింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మాత్రమే హృద్రోగ నిపుణులు ఉంటారు. ప్రస్తుతం హావేరిలో మెడికల్ కళాశాల ప్రారంభం అయింది. ఈ క్రమంలో హృద్రోగ నిపుణులను ఇక్కడ నియమిస్తాం. ఈ జిల్లా ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్క్యానర్ ఇన్స్టలేషన్కు టెండర్ అయింది. త్వరలోనే స్క్యానర్ ఏర్పాటు చేసి రోగులకు సేవలు అందిస్తాము. హావేరి మెడికల్ కళాశాలను త్వరలో అధికారికంగా ప్రారంభిస్తామన్నారు. -
వీధి కుక్కల స్వైరవిహారం
● దేవసూగూరులో నలుగురికి గాయాలు రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా దేవసూగూరులో వీధి కుక్కలు స్వైరవిహారం చేయడంతో నలుగురికి గాయాలయ్యాయి. గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ వార్డుల్లో వీధి కుక్కలు కరవడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంజిరెడ్డి(30), నాగవేణి(40), రాజశేఖర్(22)తో పాటు వీధి కుక్కల దాడిలో 10 మంది గాయపడిన విషయం విదితమే. గ్రామ పంచాయతీ, జిల్లా యంత్రాంగం వీధి కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడాన్ని ఖండించారు. -
ద్రోణాచార్య అవార్డు ప్రదానం
రాయచూరు రూరల్: సాహిత్య రంగంలో విశేష సేవలు అందించిన జిల్లాలోని మాన్వి తాలూకా చీకలపర్వికి చెందిన నిహారికకు ద్రోణాచార్య అవార్డు లభించింది. ఈనెల 13న బెంగళూరులో కావ్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ పదాధికారులు ఆమెకు అవార్డు ఇచ్చి సత్కరించారు. కన్నడ భాష, సాహిత్య రంగంలో నిహారిక సేవలను గుర్తించి అవార్డును అందించారు. నేడే జూనియర్ చిత్రం విడుదల ●● గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటిరెడ్డి తొలి సినిమా సాక్షి, బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి తనయుడు గాలి కిరీటిరెడ్డి నటించిన తొలి చిత్రం జూనియర్ శుక్రవారం విడుదల కానుంది. హీరోయిన్గా శ్రీలీల, మెయిన్ క్యారెక్టర్గా జెనీలియా, కన్నడ నటుడు రవిచంద్రన్ తదితరులు ఇందులో నటించారు. దేశ, విదేశాల్లో 1116 థియేటర్లలో ప్రదర్శించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేశారు. బళ్లారిలో అభిమానులు కౌటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాధిక, నటరాజ్ గ్రూప్ థియేటర్లలో చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో జూనియర్ సినిమా రిలీజ్ కానుంది. ఇల్లు కూలి చిన్నారి మృతి ●● ఐదుగురికి గాయాలు సాక్షి,బళ్లారి: భారీ వర్షంతో ఇల్లు కూలి ఓ చిన్నారి మృతి చెందడంతో పాటు ఐదు మందికి గాయాలయ్యాయి. కొప్పళ జిల్లా గంగావతి తాలూకా హెబ్బాళ గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో ప్రశాంతి అనే చిన్నారి మృతి చెందగా, హనుమంతు, దుర్గమ్మ, భీమమ్మ, హుసేనప్ప, ఫక్కీరప్ప అనే ఐదుగురు గాయపడ్డారు. ఘటనపై గంగావతి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో యువతి.. రాయచూరు రూరల్: గుండెపోటుతో ఓ యువతి మరణించిన ఘటన కొప్పళలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి శివగంగా కాలనీలో నివాసముంటున్న మంజుల హూగార్(26) గుండెపోటుకు గురి కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. ఆమె ఇటీవల వరకు బెంగళూరులో పని చేస్తుండేది. అక్కడ పని వదిలిపెట్టి ఇటీవలే కొప్పళకు వచ్చింది. తల్లిదండ్రులు బస్టాండ్లో పూల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. దుర్గమ్మ గుడి హుండీల లెక్కింపు బళ్లారిఅర్బన్: నగర ప్రజల ఆరాధ్య దేవత కనకదుర్గమ్మ దేవస్థానంలోని 13 హుండీల్లోని కానుకలను గురువారం తెరిచి ఆలయ ఈఓ హనుమంతప్ప సారథ్యంలో లెక్కించారు. బళ్లారి ఏసీ, ఆలయ పాలన అధికారి ప్రమోద్, ధర్మదాయ శాఖ ఏసీ సవిత, గ్రేడ్– 2 తహసీల్దార్ సమక్షంలో హుండీలను తెరిచారు. సదరు కానుకలను లెక్కించగా నాలుగు నెలల అవధిలో సుమారు రూ.67,86,179 కానుకలు లభించాయని ఆలయ ఈఓ హనుమంతప్ప తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఇబ్బంది, హోంగార్డ్లు పాల్గొన్నారు. కాగా ఈ మొత్తం ప్రక్రియ సీసీ కెమెరాల నిఘాలో తగిన బందోబస్తు మధ్య చేపట్టారు. శ్రీపాదంగళ్ దండోదక స్నానం రాయచూరు రూరల్: మంత్రాలయంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ బుధవారం తుంగభద్ర నదిలో దక్షియానం సందర్భంగా దండోదక స్నానం ఆచరించారు. అనంతరం మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల మఠంలో మూల విరాట్కు ప్రత్యేక పూజలు నెరవేర్చారు. -
బెంగళూరులో హైటెన్షన్.. 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బెంగళూరు: ఓవైపు దేశరాజధానిలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్న వేళ.. ఇటు నగరంలోనూ ఒక్కసారిగా కలకలం రేగింది. బెంగళూరు ఈ ఉదయం ఒకేసారి 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.నగరంలోని రాజరాజేశ్వరీనగర్, కెంగేరి తదితర ప్రాంతాల్లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులను ఇళ్లకు పంపించి వేశారు. నగర పోలీసులు బృందాలుగా విడిపోయి ఆయా విద్యాసంస్థల్లో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్ టీమ్లు అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నాయి. ఇటు.. ఢిల్లీలో 20 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అక్కడ కూడా పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇటీవల దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు కాల్స్ , ఈమెయిల్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది, ముఖ్యంగా విమానాశ్రయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు లక్ష్యంగా మారాయి.40 Bengaluru schools receive bomb threats via emails, bomb squads and police team are at the spot #Bengaluru #Schools #BombThreats pic.twitter.com/3t9NMeZRpQ— News18 (@CNNnews18) July 18, 2025 -
గుండెపోటుతో మరో మరణం.. ఆ వదంతులను కొట్టిపారేసిన మంత్రి
రాయచూరు రూరల్: కర్ణాటకలో వరుసగా గండెపోటు మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ యువతి మరణించిన ఘటన కొప్పళలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి శివగంగా కాలనీలో నివాసముంటున్న మంజుల హూగార్(26) గుండెపోటుకు గురి కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. మంజుల ఇటీవల వరకు బెంగళూరులో పని చేస్తుండేది. అక్కడ పని వదిలిపెట్టి ఇటీవలే కొప్పళకు వచ్చింది. తల్లిదండ్రులు బస్టాండ్లో పూల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. మంజుల మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో గుండెపోటుతో ఎక్కువ మంది చనిపోతున్నారని తప్పుడు సందేశం ప్రచారం అయిందని, అయితే గుండెపోటు వల్లే ఎక్కువ మంది చనిపోతారనడం అబద్ధం అని ఆ రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ పాటిల్ తెలిపారు. హావేరి తాలూకా నిలోగల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈటీటీసీ శిక్షణ సముదాయాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. గుండెపోటు కేసులపై వికాస సౌధలో ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్తో ఇటీవల సంయుక్త మీడియా సమావేశం నిర్వహించామన్నారు. ఆ మేరకు అన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అయిందన్నారు. గత 6 నెలల గణాంకాల వివరాలు విశ్లేషించాం. దీని కోసం ఓ సమితిని కూడా ఏర్పాటు చేశామన్నారు. సమితి నివేదిక ప్రకారం మరణాల సంఖ్య ఎక్కువ కాలేదన్న సమాచారం ఉందన్నారు. అయితే ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్లినందువల్ల భయకంపితులయ్యారు. ఈ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో గుండెపోటు మృతులపై పూర్తి సమాచారం తీసుకున్నాం. అంతేగాక ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండెపోటు వస్తుందన్న తప్పుడు విశ్వాసం ఉంది. గుండెపోటుకు సదరు వ్యాక్సిన్కు ఎటువంటి సంబంధం లేదన్నారు. -
నటి రన్యా రావుకు ఏడాది జైలు
బనశంకరి: విదేశాల నుంచి భారత్కు బంగారాన్ని అక్రమంగా తరలించిన కేసులో నిందితురాలు, కన్నడ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష పడింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు కోర్టు ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. ఆమెతోపాటు సహచరుడు తరుణ్ కొండూరు రాజు, బంగారం వ్యాపారి సాహిల్ జైన్లకూ శిక్ష పడింది. ఇటీవలే నటి రన్యారావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ ఏడాదిలో రన్యా రావు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కును కోర్టు నిరాకరించింది. రన్యారావు ఏడాదిపాటు జైలు నుంచి విడుదల కాకుండా ఉండేందుకు సీఓఎఫ్ఈపీఓఎస్ఏ చట్టం జారీ చేశారు. నటి రన్యారావు ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన రూ.12.56 కోట్ల విలువైన 14.2 కేజీల బరువైన బంగారాన్ని దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. దీంతో రన్యా రావును డీఆర్ఐ అరెస్ట్చేసి విచారించింది. నటితోపాటు ఆమె సహచరుడు తరుణ్ కొండూరు రాజు, వజ్రాభరణాల వ్యాపారి సాహిల్ జైన్ ఈ స్మగ్లింగ్ రాకెట్లో భాగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. రన్యా రావు 2023 నుంచి 2025 వరకు దుబాయ్కు ఏకంగా 56 సార్లు ప్రయాణించినట్లు డీఆర్ఐ దర్యాప్తులో స్పష్టమైంది. దుబాయ్ పర్యటనలో భాగంగా భారత్ నుంచి తరుణ్తో కలిసి 20 సార్లు ప్రయాణించింది. ఇది గుర్తించిన అధికారులు విచారించగా నటి పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ. 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు రూ.2.67 కోట్ల విలువైన కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు. రన్యా రావు నుంచి మొత్తంగా రూ. 17.29 కోట్ల నగదు, బంగారాన్ని అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. రన్యా రావు గత 12 నెలలకాలంలో 27 సార్లు విదేశాలకు వెళ్లిందని, కస్టమ్స్ సుంకం మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. -
హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు అసంతృప్తి.. దర్శన్కు లీగల్ షాక్
సాక్షి,న్యూఢిల్లీ: అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్ తూగుదీపకు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై గురువారం (జులై 17) సుప్రీంకోర్టు ఆగ్రహ వ్యక్తం చేసింది. రేణుకా స్వామి హత్యకేసులో కర్ణాటక హైకోర్టు దర్శన్కు గతేడాది బెయిల్ మంజూరు చేసింది. అయితే, దర్శన్కు బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు తగిన ఆధారాలు, కేసు తీవ్రత, బాధితుడి (రేణుకాస్వామి) హక్కులను సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని భావించింది.గతేడాది ఏప్రిల్ నెలలో తన స్నేహితురాలు పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో రేణుకాస్వామిని దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడలు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడ సహా 15మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టిన కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో దర్శన్, పవిత్రగౌడతో పాటు పలువురు నిందితులు కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. అనంతరం, గతేడాది డిసెంబర్లో వీరికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.దర్శన్కు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై సుప్రీం కోర్టు జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టించింది. ఈ సందర్భంగా..దర్శన్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇచ్చిన తీరును తప్పుబట్టింది.రేణుకాస్వామి హత్య కేసు విచారణ సందర్భంగా, దర్శన్ తరపున వాదనలు వినిపిస్తున్న ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్తో సుప్రీం కోర్టు ధర్మాసనం ఇలా అన్నది.‘రేణుకాస్వామి కేసులో దర్శన్కు బెయిల్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు తీర్పు.. న్యాయబద్ధంగా తీసుకోలేదనే అభిప్రాయం కలుగుతోంది. తగిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, విచక్షణను సరిగ్గా అమలు చేయలేకపోయింది అనిపిస్తోంది. మిస్టర్ సిబల్..మీ అభిప్రాయం ఏమిటి?’అని అడిగింది.అందుకు కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టి సాక్షుల ఇచ్చిన స్టేట్మెంట్లపై దృష్టి పెట్టాలని కోరారు. కపిల్ సిబల్ విజ్ఞప్తిపై సుప్రీం ధర్మాసనం.. విచారణ తదుపరి మంగళవారానికి వాయిదా వేస్తున్నాం. హైకోర్టు తీర్పులో మేము ఎందుకు జోక్యం చేసుకోకూడదో వచ్చే విచారణలో మీరు వాదించండి. మీ వాదనల్ని మేం వినాలని అనుకుంటున్నామని తెలిపింది. Supreme Court hears Karnataka’s plea against bail granted to Kannada actor Darshan Thoogudeepa (Sri Darshan C). They are accused in the murder of a fan, Renukaswamy, allegedly triggered by derogatory messages the victim sent to actress Pavithra Gowda - Darshan’s alleged… pic.twitter.com/7Dw8eIL9vf— Bar and Bench (@barandbench) July 17, 2025 -
భార్యపై కానిస్టేబుల్ అత్యాచారం సహకరించిన భర్త..!
కర్ణాటక: మహిళపై అత్యాచారం కేసులో పోలీసు కానిస్టేబుల్ను దక్షిణకన్నడ జిల్లా మంగళూరు కంకనాడి పోలీసులు అరెస్ట్ చేశారు. కావూరు పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న చంద్రనాయక్ నిందితుడు. మంగళూరు నగర పోలీసు కమిషనర్ సుదీర్ కుమార్ రెడ్డి వివరాలను వెల్లడించారు. బాధిత మహిళను ఆమె భర్త నగ్న వీడియోలను తీసి తాను చెప్పినట్లు చేయాలని బెదిరించసాగాడు. భర్త వేధింపులను తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో చంద్రనాయక్ను ఆమెతో మాట్లాడాడు. భర్త ఫోన్లోని వీడియోలను అతడు తొలగించడంతో సమస్య సద్దుమణిగింది. అప్పటినుంచి బాధితురాలికి మాయమాటలు చెప్పిన చంద్రనాయక్ లైంగికంగా వాడుకున్నాడు. ఇందుకు భర్త కూడా సహకరించాడు. ఇద్దరి వేధింపులు మితిమీరడంతో తట్టుకోలేక బాధితురాలు పోలీసు కమిషనర్ సుధీర్కుమార్ రెడ్డిని కలిసి తన గోడును వెల్లబోసుకుంది. ఆయన ఆదేశాలతో చంద్రనాయక్ను, ఘరానా భర్తని అరెస్టు చేశారు. -
అనుమతి లేకుండానే విజయోత్సవాలు
బెంగళూరు: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయం తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ నెట్వర్క్స్ లిమిటెడ్తోపాటు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) కారణమని కర్ణాటక ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు ఒక నివేదికను హైకోర్టుకు సమర్పించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముందస్తుగా అనుమతి తీసుకోకుండానే విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు కర్ణాటక సర్కార్ స్పష్టంచేసింది. ఈ ర్యాలీ నిర్వహించాలని ఆర్సీబీ యాజమాన్యం, డీఎన్ఏ సంస్థ, కేఎస్సీఏ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తప్పు పట్టింది. పోలీసులకు ముందుగా సమా చారం ఇవ్వలేదని, చట్టప్రకారం తీసుకోవాల్సి అనుమతులేవీ తీసుకోలేదని వెల్లడించింది. జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, మరో 30 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ గెలిస్తే బెంగళూరులో విజయో త్సవాలు నిర్వహిస్తామంటూ మ్యాచ్కు కొన్ని గంటల ముందు కేవలం సమాచారం మాత్రమే ఇచ్చారని, అధికారికంగా అనుమతి తీసుకోలేదని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆ సమాచారంలో పూర్తి వివరాలు లేకపోవడంతో విజయోత్సవాలకు పోలీసులు అంగీకరించలేదని తెలిపింది. కేవలం సమాచారం ఇవ్వడాన్ని అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. అయినప్పటికీ జూన్ 4న ఆర్సీబీ టీమ్ యాజమన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, విధాన సౌధ నుంచి చిన్న స్వామి స్టేడియం ద్వారా విక్టరీ పరేడ్ నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేసిందని వెల్లడించింది. సోషల్ మీడియాలో మొదటి పోస్టు ఉదయం 7.01 గంటలకు, చివరి పోస్టు మధ్యాహ్నం 3.14 గంటలకు పెట్టినట్లు తెలిపింది. ఆన్లైన్లో ఉచిత పాసులు అందుబాటులో ఉన్నాయని యాజమాన్యం చెప్పగా, అప్పటికే జనం స్టేడియం వద్దకు చేరుకున్నారని వివ రించింది. మొత్తానికి ఆర్సీబీ యాజమాన్యం, డీఎన్ఏ నెట్వర్క్స్ లిమిటెడ్, కేఎస్సీఏ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు ప్రభు త్వం స్పష్టంచేసింది. ఈ దుర్ఘటనకు వారే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొంది. CAT says IPL Team #RCB is prima facie responsible for Bengaluru Stampede which claimed 11 lives.Police is not magician, can't be expected manage huge crowds if not given sufficient time to make arrangements, the Tribunal observed.@RCBTweets @KarnatakaCops #BengaluruStampede pic.twitter.com/2QdmvohATs— Live Law (@LiveLawIndia) July 1, 2025ఆర్సీబీ సేవకులుగా పోలీసులు బెంగళూరు తొక్కిసలాట ఘటనలో ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్తోపాటు మరికొందరు పోలీసులను సస్పెండ్ చేయడాన్ని కర్ణాటక ప్రభుత్వం సమర్థించుకుంది. పోలీసులు ఆర్సీబీ టీమ్కు సేవకులుగా వ్యవహరించారని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఆక్షేపించింది. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయకుండానే ఆర్సీబీ విజయోత్సవాల కోసం ఏర్పాటు చేశారని ఆరోపించింది. అనుమతి ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఆర్సీబీ సేవలో తరించారని విమర్శించింది. 🚨 Karnataka Govt blames RCB for Bengaluru Stampede🚨Govt to High Court—No permission was taken for RCB’s victory paradePublic was invited without police consultationOver 3 lakh people gathered near Chinnaswamy Stadium11 people died, 50+ injured in the chaos… pic.twitter.com/KQTFFJxoWx— VIPIN_UPDATE🚨 (@Vipin_Update) July 17, 2025 -
బైక్చోదకులపై కొరడా
రాయచూరు రూరల్: జిల్లాలో ద్విచక్రవాహనదారులు మంగళవారం నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రాయచూరు జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య ఆదేశం మేరకు పోలీసులు హెల్మెట్ ధరించని వారిపై కొరడా ఝళిపించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ను ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని విన్నవించినా హెల్మెట్ను ధరించని వారి నుంచి రూ.500 చొప్పున జరిమానా విధించడంతో మంగళవారం ఒకే రోజు రూ.55 వేలు వసూలు అయిందని ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. గదగ్లో లవ్ జిహాద్ రభస ● భార్యపై భర్త ఫిర్యాదు సాక్షి, బళ్లారి: గదగ్ జిల్లాలో విచిత్రమైన లవ్ జిహాద్ ఉదంతం వెలుగు చూసింది. ముస్లిం యువతి, హిందూ యువకుడిని ప్రేమించింది. వారిద్దరూ పరారై, పెళ్లి చేసుకోవడాన్ని లవ్ జిహాద్గా పిలుస్తున్నారు. అయితే గదగ్లో జరిగిన విచిత్ర ఘటనలో ముస్లిం యువతి హిందూ యువకుడిని పెళ్లి చేసుకుని, అతనిని ఇస్లాం మతానికి మత మార్పిడి చేయాలని ప్రయత్నం చేసింది. ఈమేరకు ఆ యువకుడే ఆరోపణలకు దిగారు. వివరాలు.. తహసీన్ హొసమనె అనే యువతిని విశాల్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నారు. గదగ్లోని గాంధీనగర్ సెటిల్మెంట్ ఏరియాకు చెందిన విశాల్కుమార్, తహసీన్తో గత ఏడాది నవంబర్ 24న రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. ఆమె కోరిక మేరకు ఏప్రిల్ 25న ముస్లిం సంప్రదాయం ప్రకారం తిరిగి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సందర్భంగా తన పేరు మార్చారని, మత సంప్రదాయాలను పాటించాలని భార్య, అత్త బలవంతం చేస్తున్నారని విశాల్ కుమార్ ఆరోపించారు. విశాల్కు మద్దతుగా హిందూ సంఘాలు గదగ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తా●● నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి బళ్లారి అర్బన్: డీఏఆర్ ఆవరణలో బుధవారం రూ.8 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 36 పోలీస్ సిబ్బంది వసతి గృహాల నిర్మాణ పనులకు నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి భూమిపూజ నెరవేర్చి పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ పోలీసులు పగలు రాత్రి తేడా లేకుండా విధులు నిర్వహిస్తు ప్రజలను, వారి కుటుంబాలను రక్షిస్తారన్నారు. అలాంటి పోలీసు అధికారులకు, సిబ్బందికి వారిలో శాంతి, సంతృప్తి కోసం కృషి చేయడం తన ప్రథమ కర్తవ్యం అన్నారు. మొత్తం 36 ఇళ్లు రూ.8 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత కాపాడుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. ఐజీపీ వర్థిక కటియార్, ఎస్పీ డాక్టర్ శోభారాణి, ఏఎస్పీ రవికుమార్, డీఎస్పీ నందారెడ్డి, కాంగ్రెస్ ప్రముఖులు సుబ్బారాయుడు, చానాళ్ శేఖర్, హగరి గోవింద తదితరులు పాల్గొన్నారు. కార్యాచరణ ప్రణాళిక సత్వర పూర్తికి సూచనహొసపేటె: తాలూకా స్థాయి అధికారులను తమ విజయాలను కాగితంపై చూపించడమే కాకుండా తమ విజయాలను భౌతికంగా చూపించాలని, కొత్త కార్యాచరణ ప్రణాళికను సకాలంలో పూర్తి చేయాలని కంప్లి అసిస్టెంట్ కమిషనర్ కావ్యరాణి తెలిపారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన తాలూకా స్థాయి అధికారులతో ప్రగతి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అందరు అధికారులు ముందస్తు తయారీతో వారి విభాగానికి సంబంధించిన అవసరమైన డేటాతో సమావేశానికి రావాలి. విభాగాధిపతులు ఎటువంటి కారణాలు చెప్పకుండా సమావేశానికి రావాలి. శాఖ ఎదుర్కొంటున్న సమస్యలు, శాఖ ప్రాజెక్టుల గురించి శాఖ తగిన సమాచారాన్ని అందించాలని తెలిపారు. తాలూకాలో 39 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, స్థానిక సంస్థలు అంగన్వాడీ కేంద్రాలకు స్థలం అందించాలని మహిళా సూపర్వైజర్ లతీఫా బేగంకు సూచించారు. విద్యా శాఖపై చర్చకు వచ్చినప్పుడు, తాలూకా ఎస్ఎస్ఎల్సీ ఫలితాలను మెరుగుపరచడానికి ఏమి చర్యలు తీసుకున్నారని అడిగినప్పుడు, ఈసీఓ టీఎం బసవరాజ్ అవసరమైన చర్యలు గురించి సమాచారం ఇచ్చారు. ఈ సారి 90 శాతం ఫలితాలు సాధించాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జూగుల మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు ఆరోగ్య పరీక్ష శిబిరం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని తాయకనహళ్లి గ్రామంలోని శ్రీ కనక విద్యా కేంద్రంలో, తుమకూరు అక్షర ఐ ఫౌండేషన్, హొసపేటె నేత్ర లక్ష్మీ వైద్యాలయం, కూడ్లిగి తాలూకా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దివంగత ఎన్టీ.బొమ్మణ్ణ జ్ఞాపకార్థం పేదలకు భారీ ఉచిత కంటి తనిఖీ, ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాధి రహిత జీవితాన్ని గడపడానికి నివారణ చర్యలు తీసుకోవడం ప్రధానమని అన్నారు. కొంతమందికి వ్యాధులు శరీరంలోకి ప్రవేశిస్తాయని తెలియదు. పరీక్ష ద్వారా వ్యాధులను గుర్తించవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. 40 ఏళ్లుపైబడిన వారు ఈసీజీ చేయించుకోవాలి. విదేశీ నిపుణుల బృందం ప్రత్యేకంగా శిబిరంలో ఉన్నందున, గ్రామస్తులను తనిఖీ చేయించుకోవాలని ఆయన అభ్యర్థించారు. ఈసారి సరిహద్దు గ్రామాలకు లబ్ధి కోసం.. తమ తండ్రి, మాజీ ఎమ్మెల్యే ఎన్.టి.బొమ్మణ్ణ జ్ఞాపకార్థం ఈ సారి సరిహద్దు గ్రామాలకు ప్రయోజనం చేకూర్చేలా తాయకనహళ్లి గ్రామంలో దీనిని ఏర్పాటు చేశారు. ప్రత్యేక కంటి పరీక్షతో పాటు అందరికీ ఉచిత అద్దాలు, మందులను అందజేశారు. గుండె సంబంధిత వ్యాధులకు ఈసీజీ, ఎకో, యాంజియోగ్రామ్, మహిళలు, పిల్లల వ్యాధులకు సలహా, డయాబెటిస్, బీపీ, ఉబ్బసం, అలెర్జీలు, పిత్తాశయం, మూత్రపిండాలు, ఎముకలు, వీపు, కడుపు నొప్పి, ఫైల్స్ వ్యాధులను తనిఖీ చేసి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో 2730 మంది సద్వినియోగం చేసుకున్నారు. ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరంలో సుమారు 270 మందికి తనిఖీలు, మందులు అందించారు. 96 మంది ఈసీజీ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీఎంసీ అధ్యక్షుడు కురిహట్టి బోసయ్య, ఉపాధ్యక్షుడు మడ్లకనహళ్లి కే.మహదేవప్ప, హుడెం గ్రామ పంచాయతీ సభ్యుడు కేఎన్ రాఘవేంద్ర, బోసు మల్లయ్య, రసూల్ సాబ్, బట్లర్ పాపన్న, గురు కనకవిద్యా సంస్థ కార్యదర్శి మంజన్న, నజీం సాబ్, ప్రత్యేకాధికారుల బృందం పాల్గొన్నారు. గ్రామ పెద్దలను ఎమ్మెల్యేలు బహుమతులు, సత్కారాలతో సత్కరించారు. స్టెతస్కోప్ పట్టిన ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ భారీగా తరలి వచ్చిన గ్రామీణ ప్రజలు -
త్వరలో గడిగి చెన్నప్ప సర్కిల్ ప్రారంభం
బళ్లారి అర్బన్: నగర నడిబొడ్డులోని గడిగి చెన్నప్ప సర్కిల్ పనులను అత్యంత నాణ్యతతో పూర్తి చేస్తున్నామని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో స్థానికులు సహకరించాలని కోరారు. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోక తప్పదని అన్నారు. నాణ్యతతో నిర్మాణ పనులు చేయాలన్న సదుద్దేశంతోనే ఈ పనులకు తగినంత సమయం పడుతోందన్నారు. అంత వరకు ఎవరు ఎంత ఒత్తిడి చేసినా నాణ్యతతో పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభిస్తామన్నారు. పనిలో జాప్యంపై అనేక సమస్యలు వచ్చాయి. కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. సదరు పనులకు ప్రభుత్వ అనుమతి కూడా ఆలస్యమైంది. అందువల్ల సర్కిల్ ప్రారంభం ఆలస్యం ఉందని, స్థానికులు సహకరించాలని ఆయన కోరారు. -
సమస్యల సుడిలో ప్రభుత్వ కళాశాలలు
సాక్షి బళ్లారి: 10వ తరగతి అనంతరం పీయూసీ ప్రతి ఒక్క విద్యార్థికి కీలకమైన, భవిష్యత్తు విద్యాభ్యాసానికి కీలక ముందడుగు సాధించే ఒక బృహత్తరమైన ఘట్టం. అయితే పీయూసీని పాలకులు నిర్లక్ష్యం చేస్తుండటంతో విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వ కళాశాలల్లో ఏటేటా విద్యాబోధన అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. కళాశాలల్లో తగినంత మంది అధ్యాపకులను నియమించకపోవడంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గిపోతోంది. పీయూసీ(ఇంటర్మీడియట్) రెండేళ్లు పూర్తయిన తర్వాత నీట్, జేఈఈ, కేసెట్ తదితర పోటీ పరీక్షలకు విద్యార్థులు పోటీ పడాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్, మెడికల్, ఇతర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి సీట్లు సాధించాలంటే నేటి పోటీ ప్రపంచంలో అంత సులభమైన పని కాదు. విద్యార్థుల్లో సామర్థ్యం ఉన్నా కళాశాలల్లో తగినంత మంది అధ్యాపకులు, సంబంధిత మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు సుముఖత చూపడం లేదు. పేద విద్యార్థులు కూడా అష్టకష్టాలతో ప్రైవేటు కళాశాలలను ఆశ్రయించి వారి తల్లిదండ్రులకు ఆర్థిక సమస్యలు తెచ్చిపెడుతున్నారు. వేధిస్తోన్న అధ్యాపకుల కొరత ప్రభుత్వ కళాశాలల్లో బోధకుల కొరత, మౌళిక సదుపాయాలు లేమి వారి లక్ష్యాలను చేరుకునేందుకు వీలు కాదనే ప్రభుత్వ కళాశాలల్లో చేరడం లేదు. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయిందని అధికార గణంకాలు చెబుతున్నాయి. జిల్లాలో 21 ప్రభుత్వ కళాశాలలుండగా ఇందులో 126 మంది అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 21 ప్రభుత్వ కళాశాలలకు గాను మూడు కాలేజీల్లో ఇప్పటి వరకు 50 మంది లోపు విద్యార్థులు మాత్రమే చేరారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2025–26వ విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఏడు వేల మందిలో 50 మంది లోపు విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ కళాశాలల్లో చేరారు. చేరిన విద్యార్థులు కూడా అక్కడ మౌలిక సదుపాయాలు, లెక్చరర్ల కొరత చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించి వారికి ఉచిత విద్యను అందించాలనే సంకల్పం పెట్టుకొన్నారే కానీ ఆ దిశగా విద్యార్థులకు తగిన విధంగా విద్యాబోధన చేయడానికి అధ్యాపకులను నియమించకపోవడంతో విద్యార్థులకు మెరుగైన విద్య అందని ద్రాక్షగా మారనుంది. ఖాళీ పోస్టుల వివరాలివే.. జిల్లాలో 21 ప్రభుత్వ కళాశాలల్లో ఇంగ్లిష్ లెక్చరర్లు 20 మంది, హిస్టరీ 14 మంది, రాజనీతి శాస్త్రం 14 మంది, సామాజిక శాస్త్రం 14, కామర్స్ 7, సైన్స్ 10, కన్నడ 13 మంది, ఇలా జిల్లా వ్యాప్తంగా దాదాపు 126 మంది ఉపన్యాసకుల పోస్టులు ఆయా కళాశాలల్లో ఖాళీగా ఉన్నప్పటికీ విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో వేలాది మంది చేరారు. అక్కడ సదుపాయాలను కల్పించకపోవడంతో వారి ఉన్నత విద్యాభ్యాసంపై తీవ్ర పరిణామం చూపనుంది. ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా పీయూసీ ఫలితాల్లో 10వ స్థానం లోపు చోటు సంపాదించుకోవాలని తీవ్ర కసరత్తు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. విద్యార్థులు వారి సొంత తెలివితేటలతో, సాంకేతికతను ఉపయోగించుకొని కొందరు విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించడంతోపాటు పోటీ పరీక్షలకు కూడా ప్రైవేటుగా శిక్షణ పొంది పరీక్షలను రాసి ఉత్తీర్ణతను సాధిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు నీట్( మెడిసిన్), జేఈఈ, సీఈటీ, కేసెట్( ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీఎస్సీ, బీఏఎంఎస్, వెటర్నరీ) తదితర వృత్తి విద్యా కోర్సులకు వెళ్లేందుకు పీయూసీ తర్వాత పరీక్షలు రాయడానికి ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత సాధించి ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నత విద్యాబోధన, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. పీయూ కళాశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో బోధన ఎన్నడో? నీట్, ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల సాధనలో విఫలం ప్రైవేటు కళాశాలల్లో చేరిక వైపే విద్యార్థుల మొగ్గు ప్రైవేటు కాలేజీల్లో రూ.లక్షలాది మేర ఫీజుల మోత పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు జిల్లాలో 21 ప్రభుత్వ కాలేజీల్లో 126 పోస్టులు ఖాళీ -
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై అట్రాసిటీ కేసా?
రాయచూరు రూరల్: తనకు అన్యాయం జరిగిందంటూ చేసిన ఫిర్యాదును స్వీకరించాలని పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారని జనవాది మహిళా సంఘం అధ్యక్షురాలు శకుంతలా పాటిల్ తప్పుబట్టారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవదుర్గ తాలూకా మూడలగుండాలో రాధ స్నానం చేస్తున్న సమయంలో రామన్న చూశాడని, దానిని అడిగినందుకు ఆమెను చెంప దెబ్బ కొట్టిన రామన్న బలవంతంగా రాధపై అట్రాసిటీ కేసు నమోదు చేయించారని ఆరోపించారు. ఈ నెల 6న ఘటన చోటు చేసుకోవడంతో 7న పోలీస్ స్టేషన్లో జనవాది మహిళా సంఘం ఆధ్వర్యంలో కేసు నమోదు చేశామన్నారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా 8న రాధపై అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. మహిళలకు న్యాయం చేయకుండా తప్పుడు కేసులు బనాయించారని, రామన్నను అరెస్ట్ చేయాలన్నారు. -
యరగేరలో పీహెచ్సీ ఏర్పాటు చేయరూ
రాయచూరు రూరల్: జిల్లా కేంద్రం రాయచూరు నుంచి 25 కి.మీ దూరంలోని యరగేరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్సీ)న్ని ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ చేసింది. బుధవారం నాడా కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మహ్మద్ అనీస్ మాట్లాడారు. ప్రజలకు అనుకూలమయ్యే విధంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయడానికి సౌకర్యాలు ఉన్నాయన్నారు. యరగేర పరిధిలో 19 గ్రామ పంచాయతీలు, 78 గ్రామాలు ఉన్నాయన్నారు. పీహెచ్సీని ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రికి తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో ఇక్బాల్, భీమేష్, జిలాని, చంద్రశేఖర్, అప్పు, ఫయాజ్లున్నారు. కార్యకర్తలకు మండళ్లలో చోటు కల్పించాలిరాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని కార్యకర్తలకు బోర్డులు, కార్పొరేషన్ల పదవుల్లో చోటు కల్పించాలని కేపీసీసీ వెనుక బడిన వర్గాల విభాగం ఉపాధ్యక్షుడు టి.మారెప్ప డిమాండ్ చేశారు. బుధవారం బెంగళూరులో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గేకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. పార్టీలో క్రమశిక్షణతో పని చేసిన కార్యకర్తలకు అవకాశం కల్పించాలని విన్నవించారు. మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత రాయచూరు రూరల్: మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకా మారడగి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం వండిన వంటలను విద్యార్థులు భోజనం చేశారు. అయితే కాసేపటికే విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 117 మంది విద్యార్థుల్లో 68 మంది విద్యార్థులు భోజనం చేయగా వారిలో కడుపునొప్పితో బాధపడుతున్న 22 మందిని ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చేరిన విద్యార్థులను తహసీల్దార్ మల్లన్న, తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్ ఉమేష్ శర్మ, ఎస్ఐ గజానన, డీడీపీఐలు పరామర్శించారు. ఆర్టీఓ కార్యాలయంపై లోకాయుక్త దాడి రాయచూరు రూరల్: నగరంలోని ప్రాంతీయ రవాణా అధికారి(ఆర్టీఓ) కార్యాలయంపై లోకాయుక్త అధికారులు దాడి చేసి తనిఖీ చేశారు. బుధవారం లోకాయుక్త డీఎస్పీ రవి పురుషోత్తం ఆధ్వర్యంలో ప్రజల ఫిర్యాదు మేరకు ఆర్టీఓ కార్యాలయంలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు ఏవిధంగా పని చేస్తున్నారనే అంశంతో పాటు పెండింగ్లో ఉన్న రికార్డులను కూడా పరిశీలించారు. గుండెపోటుతో యువకుడు మృతి రాయచూరు రూరల్: గుండెపోటుతో ఓ యువకుడు మరణించిన ఘటన విజయపుర జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం విజయపుర జిల్లా శివణిగి గ్రామానికి చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి బసవరాజ్(18) ఇంటిలోనే గుండెపోటు రావడంతో మరణించాడు. అతనిని టీ తాగమని తల్లి ఎంతగా లేిపినా లేవక పోవడంతో దుఃఖం కట్టలు తెంచుకుంది. -
విజయనగర ప్రజలు శాంతి ప్రియులు
హొసపేటె: గత మూడేళ్లుగా విజయనగర జిల్లాలో నేరాలను అరికట్టడంలో ప్రజల సహకారం అమోఘమని, సమాజ ఆరోగ్యాన్ని కాపాడడంలో పౌరుల పాత్ర చాలా ముఖ్యమని విజయనగర జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు అన్నారు. మంగళవారం నగర ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్పీ శ్రీహరిబాబుకు వీడ్కోలు, కొత్త విజయనగర ఎస్పీ ఎస్.జాహ్నవికి స్వాగత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విజయనగరలో జరిగిన జీ–20 కార్యక్రమానికి 32 దేశాల నుంచి రాయబారులు వచ్చారు. ప్రధానమంత్రి హొసపేటెకు వచ్చినప్పుడు కూడా పోలీసు సిబ్బంది, ప్రజల సహకారం అద్భుతంగా పని చేసిందన్నారు. విజయనగరలో పెద్ద జాతరలు జరుగుతాయి. భద్రత కల్పించడంలో ఇది తనకు గొప్ప అనుభవాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. పిల్లల మొబైల్ వాడకంపై హెచ్చరిక: తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలు, మొబైల్ ఫోన్లు ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పిల్లలకు ఫోన్ ఇవ్వవద్దు పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇచ్చే ముందు ఆలోచించండి, తెలియకుండా చేసే చిన్న తప్పు కూడా భవిష్యత్తులో మీకు చాలా నష్టాన్ని కలిగించవచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగం పొందినా, ప్రవర్తనా ధృవీకరణ పత్రం పొందకుండానే మీరు ఉద్యోగం పొందినా, ప్రవర్తన ధృవీకరణపత్రం పొందకుండానే మీరు ఉద్యోగం కోల్పోవచ్చు. తల్లిదండ్రులు దీని గురించి జాగ్రత్తగా ఉండాలి అని ఆయన హెచ్చరించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడం తప్పనిసరి అని ఆయన పరోక్షంగా సూచించారు. విజయనగర జిల్లాలో శాంతి భద్రతలు మెరుగు పడ్డాయని, జిల్లాలో శాంతిభద్రతల మెరుగుదలను ఆయన స్వయంగా ప్రశంసించారు. విజయనగరలో పెద్ద నేరాలు ఏవీ జరగలేదు. హత్య, దొంగతనం వంటి కేసులు గణనీయంగా తగ్గాయని ఆయన అన్నారు. అయితే మెరుగైన సేవలను అందించడానికి అవకాశం ఉన్నందున భవిష్యత్తులో జిల్లా పోలీసు శాఖ మరింత విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ తాలూకాల డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయనగర జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు -
డిజిటల్ అరెస్టుకు విద్యుత్ ఉద్యోగి బలి
దొడ్డబళ్లాపురం: డిజిటల్ అరెస్టు పేరుతో భయపడ్డ బెస్కాం విద్యుత్ ఉద్యోగి లక్షలు పోగొట్టుకుని డెత్నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెన్నపట్టణ తాలూకా కెలగెరె గ్రామంలో చోటుచేసుకుంది. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్లో బెస్కాం కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగి కుమార్ (42) మృతుడు. డెత్నోట్లో రాసిన ప్రకారం... విక్రమ్ గోస్వామి అనే వ్యక్తి వీడియో కాల్ చేసి తాను సీబీఐ అధికారినని చెప్పుకొన్నాడు. మీరు డిజిటల్ అరెస్టయ్యారు, కేసు నుండి బయటపడాలంటే రూ.11 లక్షలు కట్టాలి అని బెదిరించాడు. దీంతో భయపడ్డ కుమార్ వారు చెప్పిన అకౌంట్కి డబ్బులు పంపించాడు. అయితే పదేపదే కాల్ చేస్తూ మరింత డబ్బు పంపాలని, లేదంటే అరెస్టు చేస్తామని వేధించసాగారు. భయపడ్డ కుమార్ డెత్నోట్ రాసి ఉరివేసుకుని చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును సైబర్ క్రైం కు బదిలీ చేశారు. మొబైల్ వ్యసనం.. బాలుని ఆత్మహత్య హుబ్లీ: 10వ తరగతి చదువుతున్నావు, మొబైల్ని పక్కన పెట్టి శ్రద్ధగా చదవాలి అని అవ్వా తాత మందలించారని బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన హావేరి జిల్లా బ్యాడగి తాలూకా ఇస్లాం పుర గల్లీలో మంగళవారం చోటు చేసుకుంది. బాలల్లో పెరిగిపోతున్న మొబైల్ వ్యవసనానికి అద్దం పడుతోంది. వివరాలు.. రుద్రేష్ శివప్ప గంజిగట్టి (15) ది సిగ్గావి తాలూకా అయితే, చదువుకోవడం కోసం అవ్వతాత ఊరైన ఇస్లాంపురలోని మల్లికార్జున బజప్పమఠ ఇంట్లో ఉండేవాడు. తరచు మొబైల్ఫోన్ను చూస్తూ ఉండడంతో కాస్త చదువు పై దృష్టి సారించు అని నాలుగు మంచి మాటలు చెప్పారు. దీంతో ఆవేదన చెందిన రుద్రేష మంగళవారం సాయంత్రం ఇంటి వెనుక గదిలో ఉరివేసుకుని మరణించాడు. రూ. 38 లక్షల సైబర్ మోసం హుబ్లీ: ఆన్లైన్ కేటుగాళ్లు ఓ వ్యక్తికి రూ.38 లక్షలు దోచేశారు. షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు గడించవచ్చునని స్థానిక పాత హుబ్లీ ముస్తాక్ ఖాద్రికి వాట్సాప్ సందేశం పంపించారు. లింక్ నొక్కగానే అతని బ్యాంకు ఖాతా దుండగుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. రూ.38 లక్షలు బదలాయించుకొని వంచించినట్లు బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. హంపీ జూలో బుజ్జి హిప్పోహొసపేటె: పర్యాటక నగరి హంపీ దగ్గర కమలాపురలోని జూ పార్క్లో కొత్త అతిథి వచ్చింది. బుధవారం మంగళూరు దగ్గర పిలికుల జూ పార్క్ నుండి చింటు అనే మగ హిప్పోపొటామస్ను తీసుకొచ్చారు. జూలో జంతు వైవిధ్యం కోసం తెచ్చారు. దీని వయసు ఆరేళ్లు అని జూ అధికారి రాజేష్ నాయక్ తెలిపారు. ఏనుగు వంటి భారీ కాయం ఉండడం చేత హిప్పోను తెలుగులో నీటి ఏనుగు అని పిలుస్తారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె హెచ్చరిక శివాజీనగర: వివిధ డిమాండ్లను తీర్చకుంటే ఆగస్టు 5 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని కేఎస్ ఆర్టీసీ, బీఎంటీసీ ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగుల విన్నపాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని కార్మిక సంఘాల జాయింట్ క్రియా సమితి ఆరోపించింది. ఒక వారంలో సమావేశమవుదామని సీఎం సిద్దరామయ్య చెప్పారు, ఇంతవరకు చర్చలకు పిలవలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి సమానమైన జీతం ఇవ్వాలి, సంస్థలో ప్రైవేటీకరణ, అవినీతిని అరికట్టాలి, కార్మికులపై వేధింపులను నిలిపేయాలి, ఉచిత వైద్య వసతి కల్పించాలి, విద్యుత్ బస్సుల డ్రైవర్లకు సంస్థ ఉద్యోగులనే నియమించాలి, గతంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని పలు డిమాండ్లు చేశారు. కొల్లాపురదమ్మ ఉత్సవాలు తుమకూరు: నగరంలోని హనుమంచపురంలోని శ్రీ పేట కొల్లాపురదమ్మ ఆలయంలో గురు, శుక్రవారం చాముండేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు జరుగుతాయి. ఈ సందర్భంగా బుధవారం నుంచి కొల్లాపురదమ్మకు ప్రత్యేక పుష్పాలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. -
చెన్నమ్మ, రాయణ్ణ విజయ స్ఫూర్తి
బనశంకరి: బెళగావి వీర నారి, రాణి కిత్తూరు చెన్నమ్మ ఆంగ్లేయులతో యుద్ధం చేసి సాధించిన విజయానికి 201 సంవత్సరాలు అయ్యింది. ఈ నేపద్యంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బెంగళూరు లాల్బాగ్లో పుష్ప ప్రదర్శన ఆమె థీమ్తో ఏర్పాటు కానుంది. రాణి చెన్నమ్మ, ఆమె సైనికాధికారి క్రాంతివీర సంగోళ్లి రాయణ్ణల విజయాలు, జీవిత చరిత్ర ను చాటేలా పుష్ప ప్రదర్శన ఉంటుంది. ఆగస్టు 7 నుంచి 18వ తేదీ వరకు లాల్బాగ్ గ్లాస్హౌస్లో ఫ్లవర్ షో జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి పూలు, వస్తు సామగ్రిని తెప్పిస్తున్నట్లు ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ (లాల్బాగ్) హెచ్టీ బాలకృష్ణ తెలిపారు. 7 లక్షల పుష్పాలతో కిత్తూరు కోట, చెన్నమ్మ ఐక్య మంటపాన్ని 6 లక్షల నుంచి 7 లక్షల వైవిధ్యభరిత పూలతో రూపొందిస్తారు. కోట ముందు అశ్వాన్ని అధిరోహించిన చెన్నమ్మ, రాయణ్ణ విగ్రహాలుంటాయి. అమటూరు బాళప్ప, సేనాధిపతి గురుసిద్దప్ప, రాజగురు కల్మఠ స్వామీజీల విగ్రహాలను నెలకొల్పుతారు. ఈసారి లాల్బాగ్ ఫ్లవర్ షో థీమ్ ఆగస్టు 7 నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ఫల పుష్ప ప్రదర్శన -
గృహిణిపై కీచకపర్వం
● ఖాకీ అరెస్టు యశవంతపుర: మహిళపై అత్యాచారం కేసులో పోలీసు కానిస్టేబుల్ను దక్షిణకన్నడ జిల్లా మంగళూరు కంకనాడి పోలీసులు అరెస్ట్ చేశారు. కావూరు పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న చంద్రనాయక్ నిందితుడు. మంగళూరు నగర పోలీసు కమిషనర్ సుధీర్ కుమార్ రెడ్డి వివరాలను వెల్లడించారు. బాధిత మహిళను ఆమె భర్త నగ్న వీడియోలను తీసి తాను చెప్పినట్లు చేయాలని బెదిరించసాగాడు. భర్త వేధింపులను తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో చంద్రనాయక్ను ఆమెతో మాట్లాడాడు. భర్త ఫోన్లోని వీడియోలను అతడు తొలగించడంతో సమస్య సద్దుమణిగింది. అప్పటినుంచి బాధితురాలికి మాయమాటలు చెప్పిన చంద్రనాయక్ లైంగికంగా వాడుకున్నాడు. ఇందుకు భర్త కూడా సహకరించాడు. ఇద్దరి వేధింపులు మితిమీరడంతో తట్టుకోలేక బాధితురాలు పోలీసు కమిషనర్ సుధీర్కుమార్ రెడ్డిని కలిసి తన గోడును వెల్లబోసుకుంది. ఆయన ఆదేశాలతో చంద్రనాయక్ను, ఘరానా భర్తని అరెస్టు చేశారు. సర్కారు భూమి స్వాహా... ఐఏఎస్పై కేసు శివాజీనగర: వందల కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమి అక్రమాలలో ఐఏఎస్ అధికారిణి వాసంతి అమర్పై బెంగళూరు హలసూరు గేట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. గతంలో ప్రత్యేక జిల్లాధికారిగా ఉండిన వాసంతి అమర్.. బెంగళూరు ఉత్తర తాలూకాలోని దాసనపుర హొబ్లి హుచ్చనపాళ్యలో 10 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఇతరులకు అమ్మేశారని ఆరోపణలున్నాయి. బెంగళూరు విభాగపు ప్రాంతీయ కమిషనర్ ఆదేశాలతో ఓ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ భూమి విలువ రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. -
రౌడీ హత్య.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు
శివాజీనగర: బెంగళూరులో రౌడీషీటర్ బిక్లు శివకుమార్ (40) హత్య కేసులో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. నగరంలోని కేఆర్ పురం ఎమ్మెల్యే భైరతి బసవరాజును 5ఎ నిందితునిగా పేర్కొన్నారు. హతుని తల్లి ఫిర్యాదు మేరకు... ఆమె కుమారుడు శివప్రకాశ్ ఏడాది నుంచి ఓ కంపెనీ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. పలు కేసుల్లో నిందితునిగా ఉన్నందున అతనిపై రౌడీషీట్ కూడా ఉంది. 2023లో అతని షెడ్డులోకి కొందరు ప్రవేశించి ధ్వంసం చేశారు. స్థలాన్ని తమ పేర రాసివ్వకపోతే ప్రాణాలతో విడచిపెట్టమని బెదిరించారు. భైరతి బసవరాజ్, విమల్ తదితరుల నుంచి ప్రాణభయం ఉందని ఇంట్లో చెప్పేవాడు. జూలై 15న ఇంటికి వచ్చి భోజనం చేసి, రాత్రి 8 గంటలకు బయటికి వచ్చాడు, శివ, డ్రైవర్ ఇమ్రాన్ ఖాన్, లోకేశ్ మాట్లాడుకొంటూ నిల్చుకొన్నారు. కొంతసేపటికి వారిద్దరూ వెళ్లిపోయారు. ఇంతలో 8–9 మంది గుర్తు తెలియని దుండగులు కొడవళ్లతో దాడి చేశారు. విడిపించేందుకు వెళ్లిన ఇమ్రాన్ ఖాన్ను కూడా రాడ్తో కొట్టారు. లోకేశ్ మొబైల్ ఫోన్లో చిత్రీకరిస్తున్నాడు. దుండగులు శివని హత్య చేసి తెలుపు రంగు స్కార్పియోలో పరారయ్యారు అని తెలిపింది. కిత్తకనూరు స్థలం కోసం జగదీశ్, కిరణ్, విమల్, అనిల్ అనేవారు ఎమ్మెల్యే బైరతి బసవరాజ్ ప్రోద్బలంతో తన కొడుకును హత్య చేశారని ఆరోపించారు. కిరణ్, విమల్, ప్రదీప్, మదన్, సామ్యేల్ ప్యాట్రిక్ అనేవారిని పోలీసులు అరెస్టు చేశారు. ఏ5గా నమోదు బెంగళూరులో సంచలనం నాకేం తెలియదన్న ఎమ్మెల్యే బసవరాజ్ నాకేమీ తెలియదు: బైరతి ఈ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే భైరతి బసవరాజ్ చెప్పారు. ఎవరు చనిపోయారో, ఎవరు చంపారో నాకు ఏమీ తెలియదు. కావాలనే నామీద ఎఫ్ఐఆర్ వేశారు. ఎవరో కావాలని ఫిర్యాదు చేసి ఉండవచ్చు. నేను న్యాయ పోరాటం చేస్తాను. హోం మంత్రి జీ.పరమేశ్వర్ను కలిసి వాస్తవాలను తెలియజేస్తాను అని చెప్పారు. -
ప్రధానిగారూ.. రోడ్డేయండి
● చిన్నారి సింధూరి లేఖ యశవంతపుర: తమ ఊరికి రోడ్డును నిర్మించాలని 8వ తరగతి విద్యార్థిని ఒకరు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకా మలగారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని సింధూరి లేఖలో సమస్యను వివరించింది. లోకనాథపుర గ్రామం నుంచి నుంచి 3–4 కిలోమీటర్ల దూరంలోని మలగారు పాఠశాలకు వెళ్తామని, మట్టి రోడ్డు కావడం వల్ల ఎప్పుడూ బురద, గుంతలతో ఉంటుందని తెలిపింది. వానా కాలం వస్తే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. సకాలంలో పాఠశాలకు వెళ్లలేం, చదువులు సాగడం లేదు, అలాగే తమ గ్రామానికి అంబులెన్స్తో పాటు ఇతర వాహనాలు రావడం కష్టంగా మారింది. స్థానిక గ్రామ పంచాయతీ అధికారులకు తెలిపినా ప్రయోజనం లేదు. శాశ్వతంగా పరిష్కారం చేయాలని లేఖలో కోరింది. శిశు హంతకునికి జీవితఖైదు మైసూరు: తాగుడుకు భార్య డబ్బులివ్వలేదని 7 నెలల శిశువుని చంపిన కిరాతకునికి మైసూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. వివరాలు.. మైసూరులోని కనకగిరి నివాసి నాగేంద్ర, కూరగాయల వ్యాపారి. అతని భార్య రమ్య, వారికి 7 నెలల పసికందు సంతానం ఉంది. మద్యానికి బానిసైన నాగేంద్ర నిత్యం తాగుడుకు డబ్బులివ్వమని భార్యను వేధించేవాడు. 2022 ఏప్రిల్ 24న భార్యను డబ్బుల కోసం వేధిస్తూ, డబ్బులివ్వకుంటే చిన్నారిని చంపుతానని బెదిరించాడు. వెంటనే రమ్య బిగ్గరగా అరుస్తూ ఇంటి నుంచి బయటకు, నాగేంద్ర తక్కెడతో చిన్నారిని కొట్టి చంపాడు. విద్యారణ్యపురం స్టేషన్ పోలీసులు నిందితున్ని పట్టుకుని అతనిపై కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. విచారణ జరిపిన జడ్జి వీహెచ్ దయానంద్ ఆరోపణలు రుజువైన నేపథ్యంలో నాగేంద్రకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రభుత్వం తరఫున ఎం.కామాక్షి వాదించారు. ఆస్పత్రుల్లో ఆహారం తనిఖీ మైసూరు: నగరంలోని కేఆర్ ఆస్పత్రి, చెలువాంబ ఆస్పత్రులను బుధవారం రాష్ట్ర ఆహార కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ హెచ్.కృష్ణ తనిఖీ చేశారు. చెలువాంబ ఆస్పత్రిలో తల్లీబిడ్డలకు అందిస్తున్న ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. భోజనం మెనూ, రోగులకు సరిగా చికిత్స అందుతోందా? మాత్రలను సక్రమంగా పంపిణీ చేస్తున్నారా? అని అడిగారు. సమయానికి సరిగా విధులకు హాజరు కావాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆస్పత్రిలో పరిశుభ్రతను కాపాడాలని ఆదేశించారు. ఆహార పౌర సరఫరా శాఖ జేడీ మంటేస్వామి, మైసూరు మెడికల్ కాలేజీ డీన్, డైరెక్టర్ దాక్షాయణి, అధికారులు పాల్గొన్నారు. గజ దాడిలో ఇల్లు ధ్వంసం యశవంతపుర: కొడగు జిల్లా మడికెరి వద్ద అడవి ఏనుగు ఓ ఇంటిని ధ్వంసం చేసింది. యవకపాడి గ్రామంలో కుడియర కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ఓ ఏనుగు చొరబడింది. ఓ ఇంటి పక్కన ఉన్న కొబ్బరి చెట్టును కూల్చగా ఆ చెట్టు ఇంటి మీద పడింది. దీంతో పెంకుటిల్లు ఓ వైపు నాశనమైంది. అలాగే పరిసరాల్లోని పంట పొలాలను పాడుచేసింది. ఈ సమయంలో ఇంట్లో వారు వేరే ఊరికి వెళ్లి ఉండడంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే మరమ్మతులకు డబ్బులు ఎలా అని ఆవేదన చెందారు. రెండేళ్ల నుంచి ఏనుగులు దాడుల వల్ల అపారంగా నష్టపోతున్నట్లు మడికెరి తాలూకా గిరిజన వ్యవసాయ సంఘం అధ్యక్షుడు కుడియర ముత్తప్ప తెలిపారు. గిరిజనుల ఇళ్లు ధ్వంసమై లక్షల రూపాయలను నష్టపోతున్నట్లు వివరించారు. ఇంటి యజమానికి, రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
నేల తల్లి ఒడికి సరోజమ్మ
దొడ్డబళ్లాపురం: అలనాటి మేటి అభినయ సరస్వతి, బహుభాషా నటి బి.సరోజాదేవికి అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. సకల ప్రభుత్వ లాంఛనాలతో మహా నటికి మంగళవారంనాడు ఆమె స్వగ్రామం చెన్నపట్టణ తాలూకా దశవార గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. సరోజాదేవి సోమవారం బెంగళూరులో మల్లేశ్వరంలో తమ నివాసంలో కన్నుమూయడం తెలిసిందే. రోజంతా అభిమానులు, ప్రముఖులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. దహనం చేయవద్దని కోరిక మంగళవారం నివాసం నుంచి పూలతో అలంకరించిన వాహనంలో పార్థివ దేహాన్ని దశవార గ్రామానికి ఊరేగింపుగా తరలించారు. ఒక్కలిగుల సంప్రదాయరీతిలో అంతిమ సంస్కారాలను జరిపారు. పార్థివ శరీరాన్ని కాల్చడం లేదా పూడ్చిపెట్టడం రెండు విధానాలు ఉన్నప్పటికీ, సరోజాదేవి తన దేహాన్ని కాల్చవద్దని, పూడ్చిపెట్టాలని జీవించి ఉన్నప్పుడు బంధువులకు సూచించింది. ఆ మేరకు రాజ లాంఛనాలతో ఆమె తల్లి రుద్రమ్మ సమాధి పక్కనే ఖననం చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. స్వగ్రామంలో మాతృమూర్తి సమాధి పక్కనే ఖననం అలనాటి అందాల నటికి అధికార లాంఛనాలతో వీడ్కోలు సొంతూరు అంటే మక్కువ సరోజాదేవి తరచూ విశ్రాంతి కోసం స్వగ్రామం వచ్చి కొన్ని రోజులు గడిపి వెళ్లేది. ఆమె గ్రామంలో పాఠశాలలు నిర్మించారు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కష్టం అని వచ్చిన వారికి తోచినంత సాయం చేసేదని గ్రామస్తులు తెలిపారు. -
హృదయం క్షేమం
యోగా, వ్యాయామం, మంచి ఆహారం..బనశంకరి: రాష్ట్రంలో గుండెపోటు మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న యువతీ యువకులు, మధ్య వయస్కులు కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. దీనిపై అనేక ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు మరోసారి దీనిపై స్పందించారు. హృదయఘాతాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు, ఆ టీకా పట్ల ప్రజల్లో ఎలాంటి అనుమానం వద్దు అని వైద్యవిద్యా మంత్రి డాక్టర్ శరణప్రకాష్ పాటిల్ తెలిపారు. మంగళవారం వికాససౌధలో ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావ్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. గుండెపోటు పట్ల యువకులు భయపడాల్సిన పని లేదు. గంటపాటు యోగా, వ్యాయామం చేస్తూ ఉండాలి. మంచి ఆహారం తీసుకుంటూ, ధూమపానం లాంటి వాటికి దూరంగా ఉండాలి. పాశ్చాత్య దేశ ఆహార పద్ధతి వద్దు, పూర్వపు ఆహార విధానాలను పాటించాలని అని సూచించారు. వీధి ఆహారంపై దృష్టి మంత్రి దినేశ్ మాట్లాడుతూ.. పిల్లలకు ఆరోగ్య పరీక్షలు అవసరం లేదన్నారు. రోడ్ల పక్కన ఆహారం, ఆహారం తయారీ విధానాలపై నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువత మంచి జీవనశైలిని అలవర్చుకోవాలని, వ్యాయామం, యోగా అలవాటు చేసుకోవాలని తెలిపారు. వైద్య ఆరోగ్య మంత్రుల ప్రకటన గుండెపోటు మరణాలకు, కోవిడ్ టీకాకు సంబంధం లేదు యువత మంచి జీవనశైలిని పాటించాలి బడికి వెళ్తూ బాలిక..సాక్షి, బళ్లారి: బాలిక పాఠశాలకు వెళుతూ కుప్పకూలిపోయింది. మంగళవారం బళ్లారి జిల్లాలోని సండూరు తాలూకా కాళింగేరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న దీక్ష (12).. రోజూ మాదిరిగానే ఇంటి నుంచి బడికి బయలుదేరింది. నడుస్తూ ఉండగానే పడిపోయింది. స్థానికులు బాలికను ఆస్పత్రి తరలించేలోగా కన్నుమూసింది. బాలిక మరణంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కారణాలు పోస్టుమార్టం నివేదిక తర్వాతే చెప్పగలమని వైద్యులు పేర్కొంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మృతి చెందుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షుగర్, కాలేయ జబ్బులు అధికం హాసన్లో గుండెపోటు మరణాలు పెరగలేదన్నారు. 23 మంది మృతులపై అధ్యయనం చేశామని, 10 మందికి గుండె సమస్య ఉన్నట్లు తెలిసిందని మంత్రి పాటిల్ చెప్పారు. కోవిడ్ తరువాత ప్రజల జీవనశైలి మారింది, షుగర్, హైపటైటిస్ వంటి కాలేయ జబ్బులు పెరిగాయి. ఈ కారణంతో గుండెపోట్లు వస్తున్నాయి, దీనిపై జయదేవ ఆసుపత్రి ప్రజలను జాగృతం చేస్తోందన్నారు. ఒత్తిడి, శ్వాసకోశ సమస్య, డయాబెటిస్, వాయుకాలుష్యం తో పాటు జీవనశైలిలో ప్రతికూల మార్పులు కారణమని తెలిపారు. ప్రజలు భయపడరాదని, ఏడాదికి ఒకసారి గుండె పరీక్ష చేసుకోవాలని తెలిపారు. కోవిడ్ టీకాతో గుండెపోట్లకు సంబంధం లేదన్నారు. -
గుహలోనే చాలా బాగుంది
దొడ్డబళ్లాపురం: ఉత్తర కన్నడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం గోకర్ణలోని రామతీర్థం వద్ద ఉన్న అటవీ ప్రాంతంలోని గుహలో ఇద్దరు పిల్లలతో రహస్యంగా నివసిస్తున్న రష్యన్ మహిళ నినా కుటినాను కాపాడి కార్వారలోని ఆశ్రయ కేంద్రంలో ఉంచారు. ఆమెను తిరిగి రష్యాకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కుటినా ఆన్లైన్లో స్పందిస్తూ.. గుహలో తన జీవితం ఎంతో సంతోషంగా గడిచిపోయేదని, అయితే ఆ జీవితం ముగిసిపోయిందని పేర్కొంది. అడవిలో ఏనాడు జంతువులు, పాముల వల్ల హాని కలగలేదని, ఇప్పుడు మనుషుల వల్ల ఇబ్బందులు వచ్చి పడ్డాయని వాపోయింది. ఇన్నాళ్లు ప్రకృతితో గడిపిన రోజులను జీవితంలో మర్చోపోలేనని, మనుషులు తమ చుట్టూ ఉన్న అన్నిటినీ నాశనం చేస్తారని పేర్కొంది. కుటినా, పిల్లలను తుమకూరులోని ఎఫ్ఆర్సీ కేంద్రానికి తరలించారు. రష్యన్ ఎంబసీ నుంచి అత్యవసర ప్రయాణ ఉత్తర్వు రాగానే వారిని పంపించివేస్తామని అధికారులు తెలిపారు. రష్యన్ మహిళ కుటినా -
పులుల హత్య కేసు.. డీసీఎఫ్ సస్పెండ్
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలే మహదేశ్వర బెట్ట అడవిలో తల్లి, నాలుగు పిల్ల పులులకు కొందరు విషాహారం పెట్టి చంపిన కేసులో సర్కారు చర్యలను తీసుకుంటోంది. విధి నిర్వహణ లోపం అనే ఆరోపణలపై ఉప అటవీ సంరక్షణాధికారి (డీసీఎఫ్) వై.చక్రపాణిని సస్పెండ్ చేసింది. ఉన్నత స్థాయి విచారణలో చక్రపాణి విధి నిర్వహణలో లోపం ఉన్నట్లు గుర్తించారు. అటవీశాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఏప్రిల్ జీతాలు విడుదల అయినప్పటికీ జూన్ వరకు వాటిని చెల్లించకుండా కాలం గడిపారు. దీనివల్ల ఆ సిబ్బంది గస్తీ విధులకు రాలేదు. మార్చి 3 నుంచి 3 నెలల వేతనాలు రాలేదని జూన్ 23న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అడవుల్లో గస్తీ లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అవకతవకలకు చక్రపాణి కారణమని తేల్చి రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు జిల్లాను విడిచి వెళ్లరాదని ఆయనను ఆదేశించింది. -
దేవనహళ్లి భూసేకరణ రద్దు
దొడ్డబళ్లాపురం: దేవనహళ్లి తాలూకాలో ఏరో డిఫెన్స్ పరిశ్రమల కోసం భూమిని సేకరించడాన్ని నిరసిస్తూ 13 గ్రామాల రైతులు మూడున్నరేళ్లుగా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. 1117 ఎకరాల భూస్వాధీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నట్టు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మంగళవారంనాడు విధానసౌధలో రైతులతో సమావేశమైన సీఎం ఈ మేరకు తెలిపారు. దేవనహళ్లి తాలూకాలో భూస్వాధీన నిర్ణయాన్ని పూర్తిగా విరమించుకున్నట్టు తెలిపారు. అయితే కొందరు రైతులు తమ భూముల్ని ఇస్తామని ముందుకు వచ్చారని, వారి భూములను స్వాధీనం చేసుకుని మంచి పరిహారంతోపాటు అభివృద్ధి చేయబడిన భూమిని ఇస్తామని తెలిపారు. వ్యవసాయం చేయాలనుకునే రైతులు సంతోషంగా చేసుకోవచ్చన్నారు. దేవనహళ్లికి అతి సమీపంలో విమానాశ్రయం ఉన్నందున ఈ చుట్టుపక్కల అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. కొత్త పరిశ్రమలు స్థాపించాలన్నారు. అప్పుడే అందరికీ ఉద్యోగాలు లభిస్తాయని, ప్రతి ఒక్కరి ఆదాయం పెరుగుతుందన్నారు. పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి భూములు చాలా అవసరమని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్, రైతు నేతలు పాల్గొన్నారు. రైతులకు సీఎం అభయం -
రెండు కార్లు ఢీ, తల్లీ కొడుకు మృతి
మాలూరు: వోక్స్వ్యాగన్ పోలో కారు, ఆడి కారు ఎదురెదురుగా ఢీకొన్న దుర్ఘటనలో వోక్స్వ్యాగన్లో ప్రయాణిస్తున్న తల్లీ కొడుకులు ఘటనా స్థలంలోనే మరణించారు. ఈ ఘటన మాలూరు దగ్గర బెంగుళూరు – చైన్నె ఎక్స్ప్రెస్ రహదారిలోపి టోల్గేట్ వద్ద జరిగింది. ఘటనలో ఈశ్వర్ (27), ఆయన తల్లి జనని (46)లు మరణించగా ఆడికారులో ఉన్నవారికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఈశ్వర్ ఇంజినీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నట్లుగా తెలిసింది. వారి స్వస్థలం కేజీఎఫ్, ఊరి నుంచి బెంగళూరుకు తిరిగి వెళ్తున్నారు. టోల్గేట్ సమీపంలో ముఖాముఖీ ఢీకొన్నాయి. సర్వీస్ రోడ్డులో నుంచి హైవే మీదకు వచ్చిన ఆడి కారు పోలో కారును ఢీకొంది. ఈ భయానక దృశ్యం టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో రికార్డయింది. పోలో కారు గుర్తుపట్టలేనంతగా నుజ్జయింది. ప్రమాదస్థలిలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. రోడ్డు మరమ్మతులే కారణమా డబుల్ లేన్ను సింగిల్ లేన్ గా చేసి హెచ్చరిక బోర్డులను పెట్టారు. అయితే ఉదయం పొగమంచు వల్ల దారి సరిగా కనిపించక ఢీకొన్నట్లు సమాచారం. మాలూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆడి కారులోని ముగ్గురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. నివారణ చర్యలు ఏవీ? పోలీసులు మాట్లాడుతూ హైవే మరమ్మతు పనుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైవే అధికారులకు సూచిస్తామన్నారు. స్థానికులు కూడా హైవే అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని, తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని కోరారు. నుజ్జయిన పోలో కారు మాలూరు వద్ద ప్రమాదం -
ద్రోణాచార్య అవార్డు ప్రదానం
రాయచూరు రూరల్: నగరంలోని సూగూరేశ్వర పాఠశాల చైర్పర్సన్కు ద్రోణాచార్య అవార్డు లభించింది. సోమవారం రాత్రి బెంగళూరులో కావ్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కన్నడ సాహిత్య సంభ్రమ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షురాలు సులోచనకు ట్రస్ట్ పదాధికారులు, సభ్యులు అవార్డు ఇచ్చి సత్కరించారు. విద్యార్థులకు సన్మానం సాక్షి, బళ్లారి: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా లక్ష్యం వైపు పరుగులు తీయాలని జిల్లా ఎస్పీ శోభారాణి పేర్కొన్నారు. మంగళవారం నగరంలో ఓ కళ్యాణ మండపంలో ఓం సాయి పూజితా ట్రస్టు ఆధ్వర్యంలో 10 తరగతి, పీయూసీలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసి, విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ట్రస్టు నిర్వహకులు రాఘవేంద్ర,సునితా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కోతి దాడిలో బాలిక మృతి హొసపేటె: కోతి దాడితో తీవ్రంగా గాయపడిన ఓ బాలిక మరణించిన సంఘటన నగరంలోని చలవాదికేరిలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు.. చలవాదికేరి నివాసురాలైన అనన్య(4) మరణించిన బాలిక. ఆమె పెరుగు తేవడానికి దుకాణానికి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా రోడ్డుపై కనిపించిన కోతి దాడి చేసిన ఫలితంగా బాలిక అనన్య తలకు తీవ్ర గాయమైంది. తల్లిదండ్రులు ఆ చిన్నారిని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించి ఇంటికి తీసుకువచ్చారు. రెండు రోజుల తర్వాత ఆ బాలికకు తీవ్ర జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు ఆ చిన్నారిని మళ్లీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. వైద్యుడి సలహా మేరకు ఆ చిన్నారిని కొప్పళ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెదడుకు గాయం కావడంతో బాలిక కోమాలోకి వెళ్లిందని వైద్యులు తెలిపారు. ఎనిమిది రోజులుగా కోమాలో ఉన్న బాలిక తుది శ్వాస విడిచింది. బాలిక మృతితో ఆమె ఇంటిలో విషాదం నెలకొంది. పన్ను మినహాయింపుపై సమాలోచన రాయచూరు రూరల్: వ్యాపారులకు ఆదాయ పన్ను మినహాయింపుపై సమాలోచన చేసినట్లు లోక్సభ సభ్యుడు కుమార నాయక్ తెలిపారు. సోమవారం రాయచూరు వాణిజ్యోద్యమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆదాయ పన్ను చట్టం– 2025 గురించి వివరించారు. సీఏలకు డిజిటల్ డివైస్ వాడకంతో వ్యాపారులకు ముప్పుగా మారుతుందన్నారు. కార్యక్రమంలో వాణిజ్యోద్యమ సంఘం అధ్యక్షుడు కమల్ కుమార్, జంబణ్ణ, నగరసభ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, చేతన్, సుధీర్, రంజిత్, పాటిల్, లక్ష్మిరెడ్డి, ఉదయ్ కిరణ్, మల్లికార్జునలున్నారు. గ్రామంలోకి ఏనుగు హోసూరు: డెంకణీకోట అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల మంద నుంచి ఓ ఏనుగు విడిపోయి సోమవారం రాత్రి గ్రామానికి చొరబడడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో మనియంబాడి, ఆలహళ్లి గ్రామాల్లోకి చొరబడి తీవ్ర సంచలనం సృష్టించింది. అదృష్టవశాత్తు జన సంచారం లేకపోవడంతో ఎవరికీ హాని కలగలేదు. అటవీశాఖాధికార్లు ఏనుగును దట్టమైన అటవీ ప్రాంతానికి మళ్లించాలని ప్రజలు కోరారు. గత కొద్ది రోజులుగా ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
సదస్సులతో ఉద్యోగులకు తోడ్పాటు
హొసపేటె: ప్రజాసేవలో శాంతిని కలిగించే విధంగా మీరు మీ విధులను నిర్వర్తించినప్పుడు, మీరు పని ఒత్తిడికి దూరంగా ఉండగలుగుతారని రిసోర్స్ పర్సన్ నాగరాజ్ తెలిపారు. సోమవారం పట్టణంలోని పర్యాటక మందిరంలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది కోసం జీవన్ సంగీత సంస్థ నిర్వహించిన ఒత్తిడి నిర్వహణపై సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను ఒత్తిడి లేకుండా నిర్వర్తించగలగాలన్నారు. అందుకోసం వారు తమ పనిలో విధేయత, నిబద్ధత, నిజాయితీ కలిగి ఉండాలన్నారు. సమస్యలు తలెత్తకుండా ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. వాటికి ప్రతిస్పందించే దిశగా వారు ముందుకు సాగాలన్నారు. క్రమం తప్పకుండా రోజు వారీ నడక, వ్యాయామం, ధ్యానం వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మనస్సుకు ఆనందం కలుగుతుందన్నారు. అనంతరం తహసీల్దార్ వీకే.నేత్రావతి మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ఉద్యోగులు తాలూకాలో తమ విధులను బాగా నిర్వహిస్తున్నారు. వృద్ధులు, మానసిక దివ్యాంగులు, మహిళలు సహా ప్రజలకు మంచి సేవలను అందించడం వల్ల మనశ్శాంతి కలుగుతుందన్నారు. వారు తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఒత్తిడి లేని రీతిలో తమ విధులను నిర్వర్తించాలని కోరారు. సంగీత జీవన్ సంస్థ అధ్యక్షురాలు గీతా వీరేష్, సంస్థ కార్యదర్శి సతీష్ శేష్, రాఘవేంద్ర, సిద్ధి వినాయక్ పాల్గొన్నారు. -
అధికారుల బదిలీకి వేళాయె
సాక్షి,బళ్లారి: బళ్లారి రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(ఐజీపీ)గా వర్తిక కటియార్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు బళ్లారి రేంజ్ ఐజీపీగా పని చేసిన లోకేష్కుమార్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రస్తుతం బెంగళూరులో గృహరక్షక, పౌరరక్షణ విభాగంలో డీఐజీగా పని చేస్తున్న వర్తిక కటియార్ను బళ్లారి రేంజ్ ఐజీపీగా నియమించారు. ఈమె 2010 ఐపీఎస్ అధికారిణి కాగా, రాష్ట్రంలో పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి మంచి పేరు గడించారు. బళ్లారి రేంజ్ ఐజీపీ పోస్టు ఖాళీ పడటంతో ఆమెను ప్రభుత్వం కొత్త ఐజీపీగా నియమించింది. ప్రస్తుతం బళ్లారి ఎస్పీగా కూడా మహిళా అధికారిణి శోభారాణి పని చేస్తుండటంతో ఐజీపీగా కూడా మహిళనే నియమించడంతో ఇద్దరు పోలీసు బాస్లు మహిళలే కావడం విశేషం. జిల్లాలో తొలిసారిగా మహిళా పోలీసు బాస్ల నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు విధులు నిర్వహించే అవకాశం కలిగింది. అలాగే ఉమ్మడి బళ్లారి జిల్లాలోని విజయనగర జిల్లా ఎస్పీగా కూడా జాహ్నవి అనే మహిళా అధికారిణిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు విజయనగర జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీహరిబాబు బదిలీ అయిన నేపథ్యంలో ఆయన స్థానంలో విజయనగర జిల్లా తొలి మహిళా ఎస్పీగా జాహ్నవి అధికార బాధ్యతలు చేపట్టబోతున్నారు. బళ్లారి రేంజ్ పరిధిలో విజయనగర జిల్లా కూడా ఉండటంతో బళ్లారి, విజయనగర రెండు జిల్లాలకు చెందిన ఎస్పీలు మహిళలే కావడంతో పాటు రేంజ్ ఐజీపీగా వర్తిక కటియార్ బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో రెండు జిల్లాలకు పోలీసు బాస్లు మహిళామణులే. బళ్లారి, విజయనగర జిల్లాలకు మహిళా ఎస్పీలు, రేంజ్ ఐజీపీగా వర్తిక కటియార్కు పని చేసే అవకాశం లభిస్తుండటం విశేషం అని చెప్పవచ్చు. బళ్లారి రేంజ్ ఐజీపీగా వర్తిక కటియార్ విజయనగర జిల్లా ఎస్పీగా జాహ్నవి నియామకం ఉమ్మడి బళ్లారి జిల్లాకు ఇద్దరు మహిళా పోలీసు బాస్లు మహిళా ఐజీపీ నియామకంతో ఎస్పీ, ఐజీపీ ఇద్దరూ మహిళలే బాగల్కోటె ఎస్పీగా సిద్దార్థ గోయల్ రాయచూరు రూరల్: బాగల్కోటె జిల్లా ఎస్పీగా సిద్దార్థ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. బాగల్కోటె జిల్లా ఎస్పీగా కొనసాగిన అమర్నాథరెడ్డిని మైసూరుకు బదిలీ చేశారు. విజయనగర జిల్లా కొత్త ఎస్పీగా జాహ్నవి నియామకం హొసపేటె: విజయనగర జిల్లాకు కొత్త ఎస్పీగా జాహ్నవిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆమె అధికార బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎస్పీగా ఉన్న డాక్టర్ బీఎల్ శ్రీహరిబాబు బెంగళూరుకు బదిలీ అయ్యారు. 2019 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి జాహ్నవి విజయనగర జిల్లాకు కొత్త ఎస్పీగా నియమితులయ్యారు. గదగ్ జిల్లా నూతన ఎస్పీగా రోహన్ జగదీశ్ హుబ్లీ: గదగ్ జిల్లా నూతన ఎస్పీగా 2019వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి రోహన్ జగదీశ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను వెల్లడించింది. బెళగావి నగర శాంతి భద్రతల విభాగం డిప్యూటీ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న రోహన్ జగదీశ్ను తక్షణమే జారీలోకి వచ్చేలా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గత మూడేళ్ల నుంచి గదగ్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించిన వీఎస్ నేమగౌడను బెంగళూరు సిటీ నార్త్ డివిజన్ డీసీపీగా నియమించారు. -
తాగునీటి కోసం కార్యాలయం ముట్టడి
రాయచూరు రూరల్: తాగునీటిని సరఫరా చేయాలని పంచాయతీ కార్యాలయం అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో ప్రజలు మంగళవారం కార్యాలయాన్ని ముట్టడించిన ఘటన రాయచూరు తాలూకా మర్చేడ్లో జరిగింది. గత నెల రోజుల నుంచి తాగునీరందించాలని కోరినా ఫలితం లేకపోవడంతో ఖాళీ బిందెలు చేతపట్టుకొని పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. చెరువులో మునిగి యువకుడు దుర్మరణం రాయచూరు రూరల్: చెరువులో మునిగి ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని మాన్వి తాలూకాలో చోటు చేసుకుంది. రబ్బణకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని జయనగర్ క్యాంపునకు చెందిన దండమూడి బాలకృష్ణ అనే రైతు చెరువులో మునిగి మరణించిన యువకుడిని మాన్విలోని మహాత్మా గాంధీ కాలనీకి చెందిన నాగరాజ్ బోవి(23)గా పోలీసులు గుర్తించారు. చెరువులో ఈత నేర్పేందుకు వెళ్లిన నాగరాజ్ బురదలో చిక్కుకుని మరణించాడని పోలీసులు తెలిపారు. విషయం తెలియగానే మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్ చెరువు వద్దకు చేరుకుని అధికారులతో చర్చించి మృతదేహాన్ని సత్వరం వెలికి తీయాలని సూచించారు. హత్య కేసు నిందితులపై పోలీసు కాల్పులు ●● ఇద్దరి కాళ్లకు తూటా గాయాలు ● తప్పించుకుని నలుగురు పరారీ సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లాలో జరిగిన హత్య కేసులో నిందితులపై పోలీసులు ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు హత్య కేసు నిందితుల కాళ్లకు తూటాలు తగిలిన గాయాలయ్యాయి. మంగళవారం విజయపుర నగరంలో ఎస్ఎస్ కాంప్లెక్స్లో వర్షిణి బ్యాంకు ఆవరణలో నళిని కుమార్ కాళే అనే వ్యక్తిపై హత్యాయత్నం చేయడంతో పిస్తోల్, మారణాయుధాలతో పరారయ్యారు. నళిని కుమార్ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో మృతి చెందారు.ఈ ఘటనపై హత్య కేసు నమోదు కావడంతో నిందితుల గాలింపు కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేయగా తప్పించుకుని పారిపోతున్న తరుణంలో పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. మరో నలుగురు తప్పించుకుని పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. పుస్తకావిష్కరణ రాయచూరు రూరల్: సమాజంలో అణగారిపోతున్న సంప్రదాయాలను కాపాడడానికి విప్లవకారులకు పాటలే ప్రాణవాయువు, పోరాటమే మార్గదర్శనం అని కేఆర్ఎస్ సంచాలకుడు మానసయ్య పేర్కొన్నారు. సోమవారం సింధనూరులో మస్కి ప్రకాశన ఆధ్వర్యంలో అంబేడ్కర్ మీరు ఎవరు? అనే పుస్తకాన్ని విడుదల చేసి మాట్లాడారు. రాజ్యాంగం అనుసరించి జారీ చేసిన అంశాలను గురించి ప్రస్తావించారు. దానప్ప నీలగల్ రాసిన పాటలు మనస్సును దోచిన విషయాన్ని వివరించారు. కార్యక్రమంలో విరుపాక్షి, పూజార్, అంబన్న, రాజు, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. వైద్య రంగానిదే భవిష్యత్తు రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో వైద్యరంగానికి భవిష్యత్తు ఉందని జిల్లా ఔషధ నియంత్రణాధికారి ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నవోదయ వైద్య కళాశాల ఔషధ ఆడిటోరియాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు మ్యూజియం ఎంతో సహాయకారిగా ఉంటుందన్నారు. రాయచూరు నవోదయ వైద్య కళాశాలలో డోసేజ్ ఫార్మ్స్, మాలిక్యూలర్, మానవ శరీర రచన, క్రియా శాస్త్రాలు, మందుల ప్రాక్టీస్ వంటివి ఉపయోగమన్నారు. నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ ఎస్.రాజేంద్ర రెడ్డి, రిజిస్ట్రార్ శ్రీనివాస్, అమృతరెడ్డి, డీ.దేవానంద, అరుణ కుమార్ నాయక్, దొడ్డయ్య, సూధన కుమారి, కౌశిక్ రెడ్డి, శ్యామల తదితరులున్నారు. -
హులిగమ్మకు కనక వర్షం
హుబ్లీ: కొప్పళ జిల్లాలోని హులిగిలో వెలసిన హులిగమ్మ దేవి ఆలయ హుండీ కానుకలను లెక్కించారు. ఆ మేరకు 40 రోజుల్లో మొత్తం రూ.1,17,52,515ల ఆదాయం వచ్చింది. ముడి బంగారం 133 గ్రాములు, 10 కేజీల వెండి వస్తువులు కానుకలుగా వచ్చాయి. హులిగమ్మ ఆలయానికి ప్రతి రోజు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. పున్నమి, అమావాస్య, అలాగే మంగళ, శుక్రవారాల్లో లక్ష మందికి పైగా భక్తులు హులిగమ్మను దర్శించుకుంటారు. మొన్నటి గురుపౌర్ణమి సందర్భంగా విశేషంగా భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకొని దర్శనం చేసుకున్నారు. భక్తులు విశేషంగా ధన, ధాన్య, కనక రాశులను కానుకలుగా అర్పిస్తారు. జూన్ 5 నుంచి జూలై 14 వరకు హుండీల్లో నిల్వ చేరిన కానుకలను సోమవారం లెక్కించినట్లు ఆలయ ఈఓ ఓ ప్రకటనలో తెలిపారు. రూ.కోటి దాటిన ఆలయ హుండీ ఆదాయం -
ఆర్టీసీ బస్సుల్లో ధ్వని స్పందన యంత్రం అమరిక
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని ఆర్టీసీ సంస్థలో 7000 కొత్త బస్సులకు ధ్వని స్పందన యంత్రం అమర్చనున్నట్లు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. మంగళవారం మంత్రాలయ మఠంలో రాఘవేంద్ర స్వాముల దర్శనం పొందిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రవణ లోపం ఉన్న వారికి యంత్రాలను అందించామన్నారు. బెంగళూరులో 125, మైసూరులో 200 బస్సులకు ధ్వని స్పందన యంత్రాలను అమర్చినట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ న్యూఢిల్లీ ఐఐటీ సంస్థ, జీ ఐజడ్ ఇండియా ఆధ్వర్యంలో దివ్యాంగులకు అనుకూలమయ్యే విధంగా అవకాశాలు కల్పించామన్నారు. మంత్రాలయంలో దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నూతనంగా నిర్మించిన భవనాలు, పాత భవనాలను మంత్రి పరిశీలించారు. కాగా పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగల్ మఠంలో మంత్రి రామలింగారెడ్డిని శాలువా కిప్పి సన్మానించి జ్ఞాపికను అందించారు. -
గ్యారేజీలో అగ్నిప్రమాదం.. అపార నష్టం
హుబ్లీ: జిల్లాలోని తాలూకా కేంద్రమైన కలఘటిగిలోని ఓ గ్యారేజీలో ఆకస్మికంగా నిప్పు రాజుకోవడంతో అక్కడ ఉన్న వస్తువులు పూర్తిగా బుగ్గిపాలైన ఘటన నాయక్ పెట్రోల్ బంక్లో చోటు చేసుకుంది. శ్రీవీరభద్రేశ్వర టూవీలర్ గ్యారేజీలో ఈ ప్రమాదం వాటిల్లింది. రిపేరీకి వచ్చిన బైక్లు, ఇతర వస్తువులు బూడిద అయ్యాయి. ఘటనలో రూ.లక్షలాది మేర నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయారు. సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. కత్తిపోటుకు గురైన యువకుడు మృతి హుబ్లీ: ఇటీవల ధార్వాడ కంటి గల్లిలో పట్టపగలు కత్తిపోటుకు గురై తీవ్రంగా గాయపడిన రాఘవేంద్ర గాయక్వాడ కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మల్లిక్ అనే యువకుడు రాఘవేంద్రపై చాకుతో దాడి చేసి పొడిచిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన రాఘవేంద్ర సదరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కత్తిపోటు బలంగా ఉండడంతో చికిత్స ఫలించక రాఘవేంద్ర మృతి చెందినట్లు ధార్వాడ గ్రామీణ పోలీసులు తెలిపారు. -
ప్లాస్టిక్ను పారదోలదాం
● జిల్లాధికారి గంగాధరస్వామి పిలుపు బళ్లారి రూరల్ : జిల్లాలో ప్లాస్టిక్ పారదోలి, ప్లాస్టిక్ రహిత నేల, నీరు, పర్యావరణ, పరిసర సంరక్షణ ఆవశ్యకమని దావణగెరె జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి తెలిపారు. మంగళవారం తన కార్యాలయ సభాంగణంలో అధికారులకు, రైతులకు పర్యావరణం, పరిసర పరిరక్షణపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జూలై 18న అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు, పీడీఓలకు, గ్రామాధికారులకు, రైతు సంఘాలకు, సంఘ సంస్థలతో వెబినార్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరిసర పరిరక్షణ మహత్తరమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, మొక్కలను పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శబ్ద, వాయు, జల కాలుష్యాలను తగ్గించాలన్నారు. జెడ్పీ సీఈఓ గిత్తె మాధవ విఠలరావ్, అదనపు జిల్లాధికారి శీలవంత శివకుమార్, రైతు ప్రముఖులు బల్లూరు రవికుమార్, వసంత్, విశ్వనాథ్ పాల్గొన్నారు. -
బెంగళూరులో దారుణం.. విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారం
బెంగళరూరు: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వెలుగుచూసింది. క్లాస్లో పాఠాలకు సంబంధించి ఓ విద్యార్థినికి టెక్ట్స్ మెసేజ్ చేసిన లెక్చరర్.. ఆపై సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఫ్రెండ్ రూమ్కు పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై మరొక లెక్చరర్, అతని ఫ్రెండ్ కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా వెలుగు చూడటంతో బెంగళూరులో తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటకలోని ఓ విద్యార్థినిని ఫిజిక్స్ బోధించే లెక్చరర్ నరేంద్ర పరిచయం చేసుకున్నాడు. చదువులో సాయంతో పరిచయాన్ని సాన్నిహిత్యంగా మార్చుకున్నాడు. ఇలా అనూప్ అనే స్నేహితుడి రూమ్కి తీసుకెళ్లాడు. అక్కడ అనూప్ కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డ వీడియోను చూపించి మరొక లెక్చరర్ సందీప్ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని ఆ విద్యార్థినిని నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వీరు కర్ణాటక మహిళా కమిషన్ను ఆశ్రయించడంతో విషయం బయటకొచ్చింది. దీంతో మారతహళ్లి పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇద్దరు లెక్చరర్లు సహా స్నేహితుడు అనూప్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఇదిలావుంచితే, ఒడిశాలో కూడా ఇదే తరహా దారుణం ఇటీవల చోటు చేసుకుంది. తనను లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్పై చర్యలు తీసుకోవాలని ఓ విద్యార్థిని కాలేజీ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసి ప్రాణాలు తీసుకుంది. ప్రిన్సిపాల్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాలాసోర్ బీఈడీ సెకండియర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. ఒంటికి నిప్పంటించుకుని 90 శాతం కాలిన గాయాల పాలైన ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయింది. ముందే చెబుతున్నా.. న్యాయం జరగకపోతే.. -
బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం ఇదే..
మీరేప్పుడైనా బెంగళూరు వెళ్లారా? అబ్బో చాలాసార్లు వెళ్లాం.. చాలా చూశాం అంటారా? ఎన్నిసార్లు చూసినా మారనిది ఏంటని అక్కడికి వెళ్లొచ్చిన వారిని లేదా అక్కడే ఉంటున్న వారిని అడిగితే వచ్చే సమాధానం ఒకటే. అదే ట్రాఫిక్ సమస్య. దీని కారణంగా రోజులో ఎక్కువ సమయం రోడ్లపైనే గడపాల్సి వస్తుందని బెంగళూరు నగర వాసులు తరచుగా వాపోతుంటారు. ట్రాఫిక్ సమస్య కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగా ఏకరువు పెడుతుంటారు. ఒక్క బెంగళూరే కాదు దేశంలోని ప్రధాన మహా నగరాలన్ని ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్నాయి.సింగపూర్ మోడల్తో చెక్ఇండియా ఐటీ రాజధానిగా వెలుగొందున్న బెంగళూరు (Bengaluru) మహా నగరాన్ని చాలా కాలంగా ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. అయితే దీనికో పరిష్కారం ఉందంటున్నారు సాఫ్ట్వేర్ కంపెనీ 'జోహో కార్పొరేషన్' సీఈఓ శ్రీధర్ వెంబు. బెంగళూరులో ప్రతిపాదిత భారీ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎక్స్లో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. సింగపూర్ అమలు చేస్తున్న ప్రజా రవాణా నమూనాతో భారత నగరాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చని ఆయన అంటున్నారు. ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధించి, పబ్లిస్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు."ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో సింగపూర్ ఒకటి. అత్యంత నివాసయోగ్యమైన నగరంగానూ పేరొందిన సింగపూర్.. ప్రజా రవాణాపై ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రైవేటు వాహనాలపై నియంత్రణను పక్కాగా అమలు చేస్తోంది. కొత్తగా కారు కొనుగోలు చేసే వారు కచ్చితంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎన్టైటిల్మెంట్ (COE) కలిగివుండాలి. ఈ సర్టిఫికెట్ ధర లక్ష సింగపూర్ డాలర్ల కంటే ఎక్కువ. ఇది కారు ధర కంటే అధికం. భారతీయ నగరాలు సింగపూర్ కంటే చాలా ఎక్కువ జనసాంద్రత కలిగి ఉన్నాయి. మన నగరాలను నివాసయోగ్యంగా మార్చడానికి విస్తృతమైన ప్రజా రవాణాను నిర్మించాలి. అది సాధ్యమే" అని ఎక్స్లో శ్రీధర్ వెంబు ((Sridhar Vembu) పోస్ట్ చేశారు. అయితే బెంగళూరులో ప్రతిపాదిత భారీ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు గురించి ఆయన నేరుగా ప్రస్తావించలేదు. కానీ బెంగళూరు లాంటి అత్యధిక జనసంద్రత కలిగిన నగరాల్లో బలమైన, సమ్మిళిత ప్రజా రవాణా అవసరాన్ని నొక్కి చెప్పారు.స్పందించిన ఎంపీ తేజస్వి సూర్య శ్రీధర్ అభిప్రాయంతో బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya) ఏకీభవించారు. రూ. 18,500 కోట్ల వ్యయంతో బెంగళూరులో ప్రతిపాదిత టన్నల్ రోడ్డు నిర్మాణాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ భారీ ప్రాజెక్ట్ వల్ల సామాన్యులకు ఒరిగేదేం లేదని, ప్రైవేట్ కార్లు కలిగి ఉన్న టాప్ 10% నివాసితులకు మాత్రమే ప్రయోజనం ఉంటుందని విమర్శించారు. దీనికి బదులుగా బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ), మెట్రో రైళ్ల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ సూర్య సూచించారు. 'బెంగళూరులో 2031 నాటికి 16,580 BMTC బస్సులు అవసరం. కానీ మన దగ్గర కేవలం 6,800 మాత్రమే ఉన్నాయి. 2031 నాటికి 317 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైళ్లు నడవాలి. ప్రస్తుతం 78 కి.మీ. వరకే మెట్రో సేవలు పరిమితమయ్యాయ'ని తెలిపారు. 20కి పైగా నిలిచిపోయిన ఫ్లైఓవర్లతో పాటు నగరంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.చదవండి: కోటి ఖర్చు పెడతా... ట్రాఫిక్ సమస్యను తీర్చేద్దాం!నెటిజన్ల రియాక్షన్ప్రభుత్వ రవాణా వ్యవస్థను మెరుగుపరిస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని శ్రీధర్ వెంబు వెలిబుచ్చిన అభిప్రాయంపై ఎక్స్లో నెటిజనులు స్పందించారు. ప్రజా రవాణా వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే.. ప్రజలు సహజంగానే ప్రైవేట్ వాహనాలకు దూరంగా ఉంటారని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మౌలిక సదుపాయాలంటే విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్ల మాత్రమే కాదని.. సంపన్నుల నుంచి సామాన్యూల వరకు ప్రయాణించేలా ప్రపంచ స్థాయి ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని మరొకరు సూచించారు. నివాస ప్రాంతాల నుంచి వాణిజ్య సముదాయాలకు ప్రజా రవాణాను అనుసంధానిస్తూ నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మరో నెటిజన్ అన్నారు. బెంగళూరు వంటి మహా నగరాల్లో కొత్తగా మౌలిక సదుపాయాలను కల్పించడం సులభమా, లేదా ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగైనదిగా అప్గ్రేడ్ (Upgrade) చేయడం సులభమా? అన్నది.. చూడాలని మరొకరు సూచించారు. I want to add that Singapore, one of the most advanced economies in the world and one of the most livable cities, relies extensively on public transport. Singapore also limits the number of private cars through the mechanism of open market trading of Certificate of Entitlement… https://t.co/ob7WjOiybJ— Sridhar Vembu (@svembu) July 15, 2025 -
కళ్యాణ వైభోగమే
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ పట్టణంలో దాతలు, సంఘాల సహకారంతో శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య భక్తి గీతాల ఆలాపన మధ్య, పండితుల వేద మంత్రోచ్ఛారణలతో వేడుక సాగింది. వెంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి విగ్రహాలను సుందరంగా అలంకరించి ఉత్సవాన్ని నిర్వహించారు. నీటి ట్యాంకులో పురుగుల మందు? ● విద్యార్థులకు అస్వస్థత దొడ్డబళ్లాపురం: కలుషిత నీరు తాగి 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన బెళగావి జిల్లా సవదత్తి తాలూకా హూలికట్టి గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. పాఠశాలలోని వాటర్ ట్యాంక్ నీటిని తాగిన కాసేపటికే కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. విద్యార్థులు అవస్థలు పడడంతో వారిని సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాటర్ ట్యాంక్లో ఎవరో దుండగులు పురుగుల మందును కలిపినట్టు పోలీసులు, అధికారులు అనుమానిస్తున్నారు. ఇదే వాటర్ ట్యాంక్ నుంచి గ్రామానికి నీరు సరఫరా అవుతుంది. ఉదయం 6 గంటలకు ఒకసారి నీరు సరఫరా చేస్తే మళ్లీ రెండు రోజులకు వదులుతారు. విద్యా, ఆరోగ్య అధికారులు పాఠశాలకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కంతు కట్టలేదని ఇల్లు జప్తు దొడ్డబళ్లాపురం: మైక్రో ఫైనాన్స్ సంస్థలు అప్పుల వసూళ్ల కోసం ప్రజలను వేధిస్తే కఠినంగా శిక్షిస్తాం, ప్రత్యేక చట్టం తెచ్చాం అని ప్రభుత్వం చెబుతున్నా వేధింపులు తగ్గడం లేదు. తీసుకున్న రుణానికి వాయిదా కట్టలేదని ఇంటిని సదరు ఫైనాన్స్ సిబ్బంది సీజ్ చేసిన సంఘటన రామనగర తాలూకా తొరెదొడ్డి గ్రామంలో జరిగింది. కోర్టు నుంచి ఆదేశాలు తీసుకుని సీజ్ నోటీసును అంటించారు. గ్రామానికి చెందిన అలివేలమ్మ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఇంటి రుణం తీసుకుంది. అయితే ఆర్థికంగా సమస్యల కారణంగా కంతులు కట్టలేకపోయింది. దీంతో ఇంటిని జప్తు చేస్తున్నట్లు నోటీసులు అతికించారు. బాధితురాలు ఆవేదనకు లోనైంది. సుపారీ ఇచ్చి నగల షాపు లూటీ? దొడ్డబళ్లాపురం: కలబుర్గి పట్టణంలోని నగల షాప్లో జొరబడి సిబ్బందిని తుపాకీతో బెదిరించి నగలను దోచుకున్న ఇద్దరు దొంగలను పోలీసులు ముంబైలో పట్టుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ప్రకటించలేదు. కలబుర్గిలోని సరాఫ్ బజార్లో ఉన్న జువెలరీ షాప్లో లూటీ చేయాలని దుండగులకు ఒకరు సుపారి ఇచ్చినట్టు సమాచారం. ఆ వ్యాపారితో శత్రుత్వం ఉన్నవారే సుపారి ఇచ్చి ఉంటారని అనుమానాలున్నాయి. ప్రధాన నిందితుడు తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్కు పరారైనట్టు పోలీసులకు సమాచారం అందింది. కొందరు నిందితులు హైదరాబాద్కు చెందినవారని తెలిసింది. విహారయాత్రలో గుండెపోటుకు బలి యశవంతపుర: విహారయాత్రకు వెళ్లిన టెక్కీని గుండెపోటు బలితీసుకుంది. వివరాలు.. బెంగళూరు అక్షయ నగరకు చెందిన రాహుల్ (29) ఓ కంపెనీలో ఐటీ ఉద్యోగి. స్నేహితులతో కలిసి చిక్కమగళూరుకు వెళ్లాడు. హోం స్టేలో బస చేశారు, ఇంతలో ఎద నొప్పి అంటూ కుప్పకూలాడు. మిత్రులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే చనిపోయాడు. చిక్కమగళూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇంట్లో మహిళ... చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా ముత్తిగెపుర గ్రామంలో గోపాల్ భార్య లలిత (50) గుండెనొప్పితో చనిపోయింది. డ్రైవర్ అయిన గోపాల్ ఆదివారం రాత్రి కారుతో బాడుగకు వెళ్లాడు. లలిత ఒక్కరే ఇంటిలో ఉన్నారు. గోపాల్ పని ముగించుకుని వచ్చి చూడగా లలిత వాకిలి వద్ద విగతజీవిగా పడి ఉంది. గుండెపోటుతో మృతి చెందినట్లు పోస్టుమార్టంలో బయటపడింది. -
వచ్చామప్పా.. తిమ్మప్పా
మండ్య: జిల్లాలోని మద్దూరు తాలూకాలోని అబలవాడి గ్రామంలో వెలసిన చరిత్ర ప్రసిద్ధ తోపిన తిమ్మప్ప దేవస్థానంలో హరి సేవకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చారు. భక్తులందరికీ తామర ఆకుల్లో భోజనం పంపిణీ చేశారు. అబలవాడి గ్రామస్తులు ఈ వేడుకను జరిపారు. సోమవారం దేవాలయం ఆవరణలో హరిసేవను సంప్రదాయతీరిలో నిర్వహించారు. వచ్చామప్పా తిమ్మప్పా అంటూ లక్షకు పైగా భక్తులు తోపిన తిమ్మప్పను దర్శించుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే దర్శనానికి బారులు తీరారు, అప్పటి నుంచే భక్తులకు అన్నదానాన్ని ఆరంభించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు తామర ఆకుల్లో భోజనం వడ్డించారు. తీపన్నం, అన్నం సాంబారు, గుమ్మడికాయల పళ్యం భోజనాన్ని సుష్టుగా ఆరగించారు. ఏటా ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీ. అబలవాడిలో ఘనంగా హరిసేవ లక్ష మందికి తామరాకుల్లో భోజనం -
సిగందూరు వంతెన అంకితం
శివమొగ్గ: దేశంలోనే రెండవ అతి పెద్ద కేబుల్ బ్రిడ్జిని శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకాలోని సిగందూరు వద్ద కేంద్ర భూ రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ వంతెన వల్ల స్థానిక గ్రామాల ప్రజలకు దూరాభారం సగానికిపైగా తగ్గుతుంది. ఇప్పటివరకు సాగరకు వెళ్లాలంటే నది చుట్టూ తిరిగి ప్రయాణించాలి. సుమారు ఐదారు దశాబ్దాల నుంచి వంతెన నిర్మించాలని డిమాండ్లు ఉండగా, ఎట్టకేలకు సాకారమైంది. వంతెన పొడవు సుమారు రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది. అయితే బ్రిడ్జి ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని సీఎం సిద్దరామయ్య ప్రకటించడంతో రచ్చ మొదలైంది. విశేష పూజలతో ఆరంభం సోమవారం మధ్యాహ్నం సుమారు 12:20 గంటలకు సిగందూరు వంతెన వద్దకు చేరుకొన్న కేంద్ర మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు వంతెనను పరిశీలించి విశేష పూజలు చేశారు. హారతి వెలిగించి కొబ్బరి కాయ కొట్టారు. తరువాత శరావతి నదికి వాయనం సమర్పించారు. వేద పండితులు హోమం నిర్వహించారు. ఈ వేడుకల్ళో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, జిల్లా ఎంపీ బీ.వై.రాఘవేంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, మాజీ మంత్రి కాగోడు తిమ్మప్ప, బీజేపీ నేతలు పాల్గొన్నారు. సీఎం సిద్దరామయ్య గానీ, మంత్రులు కానీ ఎవరూ పాల్గొనలేదు. తరువాత సాగర పట్టణంలోని నెహ్రూ మైదానంలో బహిరంగ సభలో గడ్కరీ, యడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. నన్ను పిలవకుండా ఎలా చేస్తారు: సీఎం శివాజీనగర: సిగందూరు వంతెన ప్రారంభం గురించి బీజేపీ, కాంగ్రెస్ మధ్య రచ్చ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానించకుండా వంతెనను లోకార్పణం, వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించే కార్యక్రమాన్ని జరపరాదు, వాయిదా వేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్ర భూఉపరితల మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. జులై 11న సీఎం ఈ లేఖ రాశారని, 13వ తేదీన లేఖను సీఎం ఆఫీసు మీడియాకు విడుదల చేసింది. కేంద్ర భూఉపరితల, రవాణా శాఖ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందలేదు, అందువల్ల నేను ఉత్తర కర్ణాటక పర్యటన చేపట్టడమైనది, ఇది ముందుగానే నిర్ణయించాం, కాబట్టి సోమవారం వంతెన ప్రారంభోత్సవాన్ని రద్దు చేసేలా ఆదేశించండి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా కార్యక్రమాన్ని నిర్వహించాలి అని లేఖలో సీఎం సూచించారు. సీఎంను ఆహ్వానించాం: గడ్కరీ సీఎం సిద్ధరామయ్యకు ఆహ్వానం పంపలేదనే వార్తలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ఎక్స్లో వివరణ ఇచ్చారు. ఈ నెల 11న సీఎం సిద్ధరామయ్యకు అధికారికంగా ఆహ్వాన పత్రిక పంపించినట్టు తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించాలని కోరామన్నారు. ముందే అనుకున్న కార్యక్రమం ఉండడం వల్ల రాలేకపోయానని సీఎం చెప్పారు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా పాల్గొనాలని 12న కూడా ఆహ్వానించామని చెప్పారు. శివమొగ్గ జిల్లాలో బృహత్ కేబుల్ బ్రిడ్జి శరావతి నది పరిసర ప్రజలకు అనుకూలం తనను పిలవలేదని సీఎం సిద్దు ఆగ్రహం ఆహ్వానించామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి -
ఉచిత ప్రయాణం కోలాహలం
శివాజీనగర: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నారీ శక్తి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం గురించి సోమవారం కోలాహలం నెలకొంది. పథకం కింద 500 కోట్ల సార్లు మహిళలు ప్రయాణించడమే కారణం. బెంగళూరులో కుమారకృపా విండ్సర్ సర్కిల్ సమీపంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఓ మహిళకు 500వ కోటి టికెట్ను అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐదు గ్యారెంటీ పథకాలను ప్రకటించామని, అధికారంలోకి వచ్చిన తక్షణమే అమలు చేశామని సీఎం చెప్పారు. కేంద్రంపై ఆగ్రహం సిగందూరులో వంతెన ప్రారంభాన్ని వాయిదా వేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఫోన్ చేసి చెప్పానని, ఆయన అంగీకరించారని, కానీ ఇక్కడి బీజేపీ నాయకుల ఒత్తిడికి లొంగిపోయి తనకు తెలియకుండా సోమవారమే ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇందులో తమ సర్కారులోని మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పాల్గొనడం లేదన్నారు. ఈ వివాదాన్ని సృష్టించినది కేంద్ర ప్రభుత్వమే, ఇక్కడి నియమాలను పాటించలేదని దుయ్యబట్టారు. ఇక ప్రముఖ నటి బి.సరోజాదేవి మృతికి సంతాపం తెలిపారు. గ్యారంటీ పథకాలను నిలిపే ప్రశ్నే లేదని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. 500వ కోటి బస్సు టికెట్ను ఇచ్చిన సీఎం సిద్దు -
దివికేగిన ధృవతార
బనశంకరి: కన్నడ, తెలుగు సహా అలనాటి మేటి బహు భాషా నటీమణి బి.సరోజాదేవి (87) సోమవారం కన్నుమూశారు. మంగళవారం రామనగర సమీపంలో చెన్నపట్టణ వద్ద దశావర గ్రామంలో సరోజాదేవి పార్థివదేహానికి అంత్యక్రియలు జరుగుతాయి. వయోభారంతో కూడిన అనారోగ్యాల వల్ల బాధపడతున్న సరోజాదేవి బెంగళూరులో మల్లేశ్వరంలోని తమ నివాసంలో శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు. ఆమె లేరన్న విషయం తెలియగానే వందలాది మంది అభిమానులు అక్కడికి తరలివచ్చారు. అంతిమ దర్శనం కోసం అక్కడే ఉంచారు. సరోజా దేవి భర్త 1987లో మరణించారు. ఆయన సమాధి పక్కనే అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రముఖుల నివాళులు సరోజాదేవి నిష్క్రమణంతో కన్నడ సినీ అభిమానులు, ప్రజలు తీవ్ర విచారానికి లోనయ్యారు. రాజకీయ, చిత్రరంగ ఉద్ధండులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎంతోమంది ప్రముఖ నటులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. బహుబాషానటి బీ. సరోజాదేవి కన్నుమూతఅందచందాలు, నటనా కౌశల్యం, ఆత్మవిశ్వాసం, సహనం వంటి అనేక సుగుణాల కలబోతే బి.సరోజాదేవి. సినిమాలలోకి అడుగుపెట్టడానికి మహిళలు సంశయించే రోజుల్లో ధైర్యంగా నటనా రంగాన్ని ఎంచుకుని వెండితెర మీద యువరాణిలా మెరిశారు. ఆమె కన్నడిగురాలైనా తెలుగువారి నీరాజనాలు అందుకోవడం మరో విశేషం. -
నటనలో చెరగని ముద్ర
● బైరప్ప, రుద్రమ్మ దంపతులకు సరోజాదేవి జన్మించారు. తండ్రి పోలీస్గా పనిచేసేవారు. ● 17వ ఏటనే సినీరంగంలోకి అడుగుపెట్టి దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించారు. ● కన్నడ వరనటుడు డాక్టర్ రాజ్కుమార్, కళ్యాణ్కుమార్, ఉదయ్కుమార్తో సరోజాదేవి నటించారు. ఇక హిందీలో దిలీప్కుమార్, రాజేంద్రకుమార్, షమ్మీకపూర్, సునీల్దత్ వంటి అగ్రనటులతో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ● కిత్తూరు రాణిచెన్నమ్మ, భక్త కనకదాస, బాళే బంగార, నాగకన్య, బెట్టదపూవు, కస్తూరి నివాస, బబ్రువాహన, కథాసంగమ, అమరశిల్పి జక్కణాచారి, మల్లమ్మన పవాడ తదితర వందలాది కన్నడ సినిమాల్లో నటించి శాండల్వుడ్ ధృవతారగా వెలుగొందారామె. ● కిత్తూరు రాణి చెన్నమ్మ సినిమాలో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించారు. ● ఆమె పాత్రలన్నీ ఎంతో ఉన్నతస్థాయి విలువలతో మహిళల గౌరవాన్ని పెంచేవిగా ఉంటాయి. ● 2019లో పవర్స్టార్ పునీత్రాజ్ కుమార్ హీరోగా రూపొందిన నటసార్వభౌమ సినిమాలో సరోజాదేవి నటించారు. ఇదే ఆమె చివరి సినిమా. ● కర్ణాటక ప్రభుత్వ రాజ్యోత్సవంతో పాటు అందుకున్న పురస్కారాలకు లెక్కేలేదు. -
కోటి ఖర్చు పెడతా... ట్రాఫిక్ సమస్యను తీర్చేద్దాం!
మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యల గురించి నిత్యం వింటూనే ఉన్నాం.. చినుకుపడితే చాలు.. కిలోమీటర్ల జామ్లు.. గతుకుల రోడ్లు, కార్పొరేషన్ల తవ్వకాలు.. పూర్తికాని నిర్మాణాలు..ట్రాఫిక్ చిక్కులకు బోలెడు కారణాలు ఉండవచ్చు కానీ.. పరిష్కార మార్గాలు మాత్రం గగన కుసుమాలే! వీటన్నింటితో ప్రశాంత్ పిట్టి ఎంత విసిగిపోయాడో కానీ.. ఈ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టాల్సిందేనని తీర్మానించాడు! కోటి రూపాయలు ఖర్చు పెడతా కలిసి రండని ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లకు పిలుపునిచ్చాడు!కర్ణాటక రాజధాని బెంగళూరును ఒకప్పుడు ఉద్యాన నగరి అని పిలుచుకునేవారు కానీ ఇప్పుడది వాహనాల పద్మవ్యూహం! అభిమన్యుడు సైతం ఛేదించలేని దుర్భర నరకం! ‘ఈజ్ మై ట్రిప్’ కంపెనీ వ్యవస్థాపకుడిగా ఎందరి ప్రయాణాలనో సులభతరం చేసిన ప్రశాంత్ పిట్టికి కూడా బెంగళూరు ట్రాఫిక్ రోజూ సవాళ్లు విసురుతూనే ఉంది. మొన్నటికి మొన్న శనివారం అర్ధరాత్రి.. 11.5 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు 145 నిమిషాల టైమ్ పట్టిందట.ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఉద్దేశించిన ఔటర్ రింగ్ రోడ్డులోనే ఒక చోట సుమారు వంద నిమిషాలు ఇరుక్కుపోయానని, అక్కడ కనీసం ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేదా సిగ్నల్ కానీ లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని వాపోయాడు ప్రశాంత్! ఈ జామ్లతో విసిగిపోయిన ప్రశాంత్... తన ఎక్స్ అకౌంట్లో ఒక ప్రకటన చేశాడు. ‘‘కోటి రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధం. గూగుల్ మ్యాప్స్, కృత్రిమ మేధల సాయంతో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్న ప్రాంతాలను గుర్తిద్దాం’’ అని కోరాడు.గూగుల్ మ్యాప్స్కు శాటిలైట్ ఇమేజరీ తోడు...ఈ ఏడాది ఏప్రిల్లో గూగుల్ మ్యాప్స్ ‘‘రోడ్ మేనేజ్మెంట్ ఇన్సైట్’’ పేరుతో కొన్ని వివరాలు ఇవ్వడం మొదలుపెట్టిన విషయాన్ని ప్రస్తావించాడు ప్రశాంత్. ఏ రోడ్డులో ట్రాఫిక్ ఉన్నదో గుర్తించి ఇంకోమార్గంలో వెళ్లమని సూచిస్తుందన్నమాట ఈ రోడ్ మేనేజ్మెంట్ ఇన్సైట్. దీనికి ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా అందే సమాచారాన్ని జోడించి బెంగళూరు నగరం మొత్తమ్మీద ట్రాఫిక్ను అడ్డుకునే ఇరుకు ప్రాంతాలను గుర్తిద్దామని ప్రశాంత్ పిలుపునిచ్చాడు. ఒక నెలరోజులపాటు గమనిస్తే ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందో తెలిసిపోతుందని, ఆ తరువాత ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరించగలరని వివరించాడు.I am committing INR 1 Cr to find Bangalore Choke-Points via Google Maps & AL.11 km → 2.15 hours in Bangalore Traffic on Saturday late night!I was stuck at one choke-point at ORR, where I spent 100 mins struggling to understand why there is no traffic-light or cop here!But… pic.twitter.com/b8Nf5vnUKf— Prashant Pitti (@ppitti) July 14, 2025ఈ పని తన ఒక్కడి వల్లే కాదన్న ఆయన ఒకరిద్దరు ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లు కలిసిరావాలని కోరాడు. గూగుల్ మ్యాప్స్, జీపీయూ, ఏపీఐ కాల్స్, ఉపగ్రహ ఛాయాచిత్రాల కోసం కావాల్సిన మొత్తాలతో కలిపి ఈ ప్రాజెక్టు కోసం కోటి రూపాయల వరకూ తాను ఖర్చు పెడతానని కూడా ప్రకటించాడు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు, కార్పొరేషన్లు ఇప్పటికే సేకరిస్తున్న సమాచారాన్ని అందించడంతోపాటు... తామిచ్చే సలహా, సూచనలను పాటించేందుకు ఒక టీమ్ను ఏర్పాటు చేస్తే చాలు పని మొదలుపెడతానని చెప్పారు.బెంగళూరు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపట్టిన ఈ ప్రాజెక్టు గురించి కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులకు తెలిసేంతవకూ తన ట్వీట్ను ట్యాగ్ చేయాలని పిలుపునిచ్చాడు. అలాగే ఈ పనిలో సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇంజినీర్లు తన ట్వీట్కు ‘ఇన్’ అని కామెంట్ చేయాలని, ట్రాఫిక్ కారణంగా సమయం వృథా అవుతోందని భావిస్తున్న వాహనదారులందరూ ట్వీట్పై కామెంట్ చేయడంతోపాటు నలుగురికి షేర్ చేయాలని కోరారు. ఆల్ ద బెస్ట్ ప్రశాంత్ పిట్టి! -
గురువులకు అనాదిగా గౌరవం
బళ్లారిటౌన్: పూర్వ కాలం నుంచి గురువులకు గౌరవం లభిస్తోందని, దీన్ని గురువులు గౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉందని కమ్మరచేడు కళ్యాణ స్వామీజీ పేర్కొన్నారు. పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో బసవేశ్వర నగర్ యోగా కేంద్రంలో ఏర్పాటు చేసిన గురువందన కార్యక్రమంలో నగరంలో వివిధ కేంద్రాల్లో పని చేస్తున్న యోగా ఉపాధ్యాయులను సన్మానించి మాట్లాడారు. యోగా మానవ జీవితంలో నిత్యవసర ప్రక్రియగా అలవరుచుకోవాలన్నారు. నేటి ఆధునిక జీవితంలో ఆహార పద్ధతుల వల్ల నానా రోగాలు ఉద్భవిస్తున్నాయన్నారు. నిత్యం యోగా చేయడం వల్ల రోగాల నుంచి దూరం కావచ్చన్నారు. కన్నడ చైతన్య వేదిక మహిళా అధ్యక్షురాలు జ్యోతి ప్రకాష్, ఆయుష్ అధికారి విరుపాక్షప్ప, పతంజలి జిల్లా అధ్యక్షుడు పంపనగౌడ, రాష్ట్ర సమితి సభ్యుడు ఇశ్వి పంపాపతి, నేతలు కప్పగల్ చేతన, మంజుల, ప్రభుకుమార్, విరుపాక్షప్ప, సంతోష్, ఎస్సీ పురాణిక్, రుద్రప్ప, సుమారెడ్డి, దొడ్డ బసప్ప, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. జేడీఎస్కు రాజీనామా.. కాంగ్రెస్లో చేరికరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంచ గ్యారెంటీలు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీకి అందిస్తున్న సేవలను పరిగణలోకి తీసుకొని జేడీఎస్ పార్టీకి రాజీనామా చేసి తాను తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు జేడీఎస్ కార్యదర్శి దానప్ప యాదవ్ పేర్కొన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరిక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాగా దానప్ప యాదవ్ వంద మంది జేడీఎస్ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శాంతప్ప, ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, తిమ్మారెడ్డి, రమేష్, తేజప్ప, విశ్వనాథ్ పట్టి, హాజీ శాలం, శ్రీనివాసరెడ్డిలున్నారు. మరమ్మతుల్లో జాప్యం.. రైతన్నకు శాపం● క్రస్ట్గేట్లు సరిగా లేనందున టీబీ డ్యాం నుంచి 30 టీఎంసీల నీరు వృథా హొసపేటె: తుంగభద్ర జలాశయంలో 19వ క్రస్ట్గేట్ తెగిపోయి ఏడాది గడిచింది. కొత్త క్రస్ట్గేట్ ఏర్పాటు చేయక పోవడంతో తుంగభద్ర జలాశయం నుంచి 30 టీఎంసీల నీరు అనవసరంగా నదిలోకి ప్రవహించింది. రాబోయే రోజుల్లో రైతులు తమ పంటలకు నీరు అందకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి దుస్థితి ఏర్పడటం శాపం. తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసి డ్యాం నిండినా రాబోయే రోజుల్లో రైతులు కచ్చితంగా నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగా రైతులకు ఈ దుస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో చెరకు, వరి రైతులకు డ్యాం నుండి సాగునీరు అందడం గగనమేనని రైతులు మండిపడుతున్నారు. ప్రేమించకుంటే చంపుతామని బెదిరింపులుహుబ్లీ: ఇద్దరు వ్యక్తులు తమను ప్రేమించాలని ఒత్తిడి చేస్తూ తాను స్కూటీపై వెళుతుండగా అడ్డుకొని చేతులు పట్టుకొని లాగి చంపేస్తామని బెదిరించినట్లు ఓ వివాహితురాలు కేశ్వాశ్వపుర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగశెట్టికొప్ప చెరువు వద్ద ఆ ఇద్దరు తన చేతులు పట్టుకొని లాగారని శబరినగర హుస్సేన్సాబ్, శ్రీరామనగర శ్రీనివాస్లపై ఆమె ఫిర్యాదు చేశారు. గతంలో పెట్రోల్ బంక్లో పని చేస్తుండగా నిందితుడు పరిచయం కావడంతో ఆమె మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. ఈ చొరవను దుర్వినియోగం చేసుకొని తనను నిత్యం ప్రేమించాలని వేధించేవాడని, ఈనేపథ్యంలో అతడి ఫోన్ నెంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాను. ఆ తర్వాత అతడి స్నేహితుడు శ్రీనివాస్ తనకు ఫోన్ చేసి హుస్సేన్సాబ్ను ప్రేమించక పోతే నిన్ను చంపుతానంటూ బెదిరించాడు. దీనికి నిరాకరించడంతో ఆదివారం సాయంత్రం స్కూటీలో పని నుంచి ఇంటికి వెళుతుండగా ఆ ఇద్దరూ తనను అడ్డగించి తన పరువు పోయే రీతిలో నడుచుకున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అలాగే మరో ఘటనలో కొత్త బస్టాండ్లో ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్ చోరీ చేస్తుండగా ఏపీలోని రాజమండ్రికి చెందిన రవితేజ(20) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.47 వేల విలువ చేసే మొబైల్ ఫోన్లను జప్తు చేసి కేసు దర్యాప్తు చేపట్టినట్లు గోకుల్ రోడ్డు పోలీసులు తెలిపారు. -
ఆస్పత్రుల్లో లొకేషన్ పద్ధతిలో హాజరు
సాక్షి బళ్లారి: వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు. వైద్యుడు దేవుడితో సమానమని అర్థం. అయితే కొందరు వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తూ లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ వారికి కేటాయించిన(నిర్ణీత) సమయంలో సేవలు అందించకుండా ఇలా వచ్చి అలా బయటకు వెళ్లిపోతూ విధులకు డుమ్మా కొడుతున్న ప్రభుత్వ డాక్టర్లకు చెక్ పెట్టేందుకు ప్రయోగాత్మకంగా, వినూత్నంగా లొకేషన్ పద్ధతిలో హాజరు స్వీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని విమ్స్ ఆస్పత్రిలో వెయ్యి మంది వైద్యులు పని చేస్తుండగా ఆరోగ్య శాఖ పరిధిలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు 800 మందికి పైగా వైద్యులు సేవలు అందిస్తున్నారు. వందలాది మంది ప్రభుత్వ నిపుణులైన వైద్యులు ఉన్నా ప్రైవేటు ఆస్పత్రులు ఉదయం నుంచి రాత్రి వరకు రోగులతో కిటకిటలాడుతుంటాయి. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు పేదోడి నుంచి కోటీశ్వరుడి వరకు ప్రైవేటు క్లినిక్లు, నర్సింహోంల్లో చికిత్సలు చేయించుకుంటున్నారంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు ఏమేరకు అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇకపై నామమాత్ర సేవలకు చెక్ ఏటేటా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు నామమాత్రంగా పని చేస్తూ నర్సింగ్హోంలు, క్లినిక్లకు అధిక సమయం కేటాయిస్తూ ఇటు ప్రభుత్వం నుంచి నెలనెలా లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. క్లినిక్లలో రోజుకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు టోకెన్ల రూపంలో వైద్య సేవలు అందిస్తూ డాక్టర్లు ఆర్జిస్తున్నారు. ఈ విషయం పాలకులకు ఎన్నో ఏళ్లుగా తలనొప్పిగా మారింది. విమ్స్ ఆస్పత్రిలో అన్ని రకాల రోగాలకు నిపుణులైన డాక్టర్లు ఉన్నా అందులో 75 శాతం మంది డాక్టర్లు కనీసం ఒకటి, రెండు గంటలు కూడా పని చేయడం లేదని విమర్శలున్నాయి. ఇక జిల్లాలో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాలు, నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు చిన్న చిన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో అక్కడ కూడా సగం మంది వైద్యులు హాజరు పట్టికలో అటెండెన్స్ వేసి ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లినిక్, నర్సింగ్హోంల్లో పని చేస్తూ మళ్లీ సాయంత్రం 5 గంటలకు ఇలా వచ్చి అలా బయటకు వెళ్లిపోయే డాక్టర్లు ఉండటంతో వారికి చెక్ పెట్టేందుకు మొబైల్ లొకేషన్ పద్ధతిలో జియో ట్యాగ్ ద్వారా వైద్యుడు ఎక్కడ పని చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని సంబంధిత ఇన్చార్జ్కు తెలియజేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. కొలిక్కి వస్తున్న కార్యాచరణ ఇందుకు సంబంధించి కార్యాచరణ దాదాపు పూర్తి కావస్తోంది. లొకేషన్ పద్ధతిలో వైద్యులు సేవలు అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేయాలన్న వారికి కొంత సమస్యగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ జియో ట్యాగ్ లొకేషన్ అధారంగా వారి వారి సెల్ఫోన్లకు, ఇన్చార్జ్ ఉన్నతాధికారులకు నేరుగా లింక్ కల్పిస్తూ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు లేదా వారికి కేటాయించిన సమయంలో కచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. లొకేషన్ పద్దతిలో ఫోటోతో పాటు వారు పని చేసే ఆస్పత్రి పరిధిలో 100 మీటర్ల దూరం వరకు పని చేస్తూ ఉంటుంది. మొబైల్ తప్పని సరిగా చేతిలో పెట్టుకొని లొకేషన్ అధారంగా ఇకపై ఆయా ఆస్పత్రుల్లో వైద్య సేవలను అందించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ పద్ధతి వీలైనంత త్వరగా అమల్లోకి తెచ్చి కార్యాచరణ పూర్తి చేస్తే కొద్ది వరకై నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు తమ విధులకు హాజరయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్య శాఖ పరిధిలో వినూత్న ప్రయోగం ప్రైవేటు దోపిడీకి చెక్ పెట్టేందుకు వ్యూహమా? ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిలో ఆందోళన -
ఎమ్మెల్యేల బలప్రదర్శనకు గుర్రాల వ్యాపారం
హుబ్లీ: ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవిని కాపాడుకోవడానికి ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ముఖ్యమంత్రి కావాలన్న ఆశతో ఎమ్మెల్యేలు తన తరుపున ఉన్నారని చూపించుకోవడానికి ధన బలం వాడుకొని గుర్రాల వ్యాపారానికి దిగారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. ఆయన సోమవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం పదవి కోసం కాంగ్రెస్లో ఆ పార్టీ ఎమ్మెల్యేల మధ్యనే కొనుగోళ్ల బేరం జరుగుతోంది. ఇది బహిరంగం కారాదని, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఆ పార్టీ ఎమ్మెల్యే కాశప్పనవర్ అబద్ధాలు చెబుతున్నారు. అక్రమాలు చేసిన వారిపై మాత్రమే ఈడీ దాడికి భయపడాలి. అయితే కాశప్పనవర అలాంటి తప్పు ఏం చేశారు. డీకే.శివకుమార్కు ఎమ్మెల్యేల మద్దతు లేదని సిద్దరామయ్య ప్రకటించడంతో కాంగ్రెస్లో అంతర్గత సలహాలు మొదలయ్యాయి. సీఎం, డీసీఎం ఒకరినొకరు మించి పోయే రీతిలో హైకమాండ్ ఎదుట తమ బలం ప్రదర్శించడానికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యాపారంలో బీజేపీ పాలు పంచుకోవడం లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్ను నియంత్రించలేక ఎవరికి ఎక్కువ ఎమ్మెల్యేల మద్దతు ఉందో వారే ముఖ్యమంత్రి అన్న స్థితికి వచ్చిందన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75 ఏళ్లకు పదవి విరమణ కావాలని సాధారణంగా చెప్పారన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీకి లీక్ చేస్తున్నారు. ఇది సమంజసం కాదన్నారు. అలాంటి ఎటువంటి ప్రతిపాదన బీజేపీలో లేదు. భగవత్ వ్యాఖ్యలను రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి -
అభివృద్ధితోనే విపక్షాలకు సమాధానం
సాక్షి,బళ్లారి: ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని వెంటనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చడంతో బీజేపీ నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని, తమ ప్రభుత్వంపై లేనిపోని అపప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన సోమవారం విజయపుర జిల్లా ఇండి తాలూకాలో శక్తి యోజన కింద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రూ.4559 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాము ఒకే రోజు రూ.4559 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. గతంలో కరువు కాలం వచ్చినప్పుడు, జనం నిమ్మకాయల చెట్లు పీకేసే దృశ్యాలను తాను చూశానని, అదే రోజు తాను ఇండికి రావడంతో ఈ ప్రాంతంలో కరువు ఛాయలు చూశానన్నారు. బీజేపీ, జేడీఎస్ నేతలు జనంలో అబద్ధాలను నిజాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. Æ>çÙ‰ Qgê¯é Rêä AƇ$$…§ýl° §ýl$[-çÙµ^éÆý‡… ^ólçÜ$¢-¯é²Æý‡¯é²Æý‡$. ©…™ø ™éÐ]l¬ Æ>[Úët°² AÀ-Ð]l–¨® ^ólĶæ$yýl… §éÓÆ> º§ýl$Ë$ CÝë¢-Ð]l$-¯é²Æý‡$. Æý‡*.1.23 MørÏ MýS$r$…-»êË$ VýS–çßæÌS-„ýSçి §éÓÆ> ÌS¼® ´÷…§é-Æý‡-¯é²Æý‡$. Æý‡*.1.63 MørÏ MýS$r$…-»ê-ÌSMýS$ E_-™èl…V> ѧýl$Å™Œæ MýSÍ-µ…-^éÐ]l$°, A¯]l²¿êVýSÅ, Ķæ¬Ð]l°«¨ §éÓÆ> MørÏ Ð]l$…¨MìS Ðól$Ë$ fÆý‡$VýS$™ø…-§ýl¯é²Æý‡$. CÌê…sìæ ç³£ýlM>ÌS §éÓÆ> {ç³f-ÌSMýS$ G…™ø Ð]l$…_ ^ólçÜ$¢-¯é²-Ð]l$-¯é²Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ Ð]l$…{™èl$Ë$, GÐðl$ÃÌôæÅË$ ´ëÌŸY-¯é²Æý‡$. ఒకే రోజు రూ.4559 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం విజయపుర జిల్లా ఇండి తాలూకాలో సీఎం సిద్దరామయ్య -
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో చర్చిద్దామా?
హుబ్లీ: బీజేపీ ఎవరి గురించి అయినా విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు. ఇతరులు బీజేపీ వారిని ప్రశ్నిస్తే సహించుకోలేక సంకటాన్ని సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రి సంతోష్లాడ్ తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ 193 దేశాలకు గాను 183 దేశాలు పాక్కు అనుకూలంగా ఓట్లు వేశాయి. ఈ విషయాన్ని ప్రశ్నించాలా వద్దా? అని ఆయన నిలదీశారు. అధికారంలోకి రావడానికి ముందు ప్రధాని మోదీ బీజేపీ ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు. వాటి అమలు గురించి ప్రశ్నించాలా, వద్దా? అంటూ మండిపడ్డారు. విదేశీ పర్యటనకు వెళ్లే ప్రధాని మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులను తీసుకెళ్లకుండా కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. ఇది సమంజసమా? బీజేపీ నేతలు శశిథరూరు ఎందుకు కావాలి. బీజేపీలో ఇంగ్లిష్లో మాట్లాడే సామర్థ్యం లేకపోవడంతోనే శశిథరూరును వాడుకుంటున్నారన్నారు. 11 ఏళ్ల మోదీ పాలన కర్మకాండ గురించి ప్రశ్నించరాదా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్లో కొన్ని విబేధాలు ఉన్నాయి. వాటిని పెద్దగా రాద్ధాంతం చేయడం బీజేపీకి అలవాటు అని అన్నారు. అయితే వారిలో అసమ్మతి గ్రూపిజం బహిరంగ ప్రకటనలు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించలేని స్థితి గురించి బీజేపీ నేతలు మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి సంతోష్ లాడ్ సవాల్ -
యరగేరా తాలూకాను ప్రకటించండి
రాయచూరు రూరల్: రాయచూరు నుంచి 25 కి.మీ దూరంలోని యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని యరగేరా తాలూకా పోరాట సమితి అధ్యక్షుడు నిజాముద్దీన్ డిమాండ్ చేశారు. సోమవారం లోక్సభ సభ్యుడి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో లోక్సభ సభ్యుడు కుమార నాయక్కు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. ప్రజలకు అనుకూలమయ్యే విధంగా తాలూకాను ఏర్పాటు చేయడానికి అన్ని సౌకర్యాలున్నాయన్నారు. యరగేర వద్ద 256 ఎకరాల్లో ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వ విద్యాలయం ఉందన్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు జాతీయ రహదారి– 167 ఉందన్నారు. యరగేర పరిధిలో 19 గ్రామ పంచాయతీలు, 78 గ్రామాలు ఉన్నాయన్నారు. 2020 నుంచి యరగేరాను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రికి కుమార నాయక్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో బసవరాజ్, మెహబూబ్ పటేల్, విద్యానందరెడ్డి, తాయప్ప, మహ్మద్ రఫీలున్నారు. -
బకాయిలు చెల్లించాలని ధర్నా
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో బకాయి ఉన్న మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరగే)లో పనులు చేసిన కూలీలకు పనుల డబ్బులు చెల్లించాలని భారతీయ దళిత సేన సమితి డిమాండ్ చేసింది. సోమవారం జెడ్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ధర్మనగౌడ మాట్లాడారు. ఆరు నెలల నుంచి వ్యవసాయ కూలీలతో నరేగ పనులు చేయించుకొని అధికారులు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి వేతనాలు అందించక పోవడం తగదన్నారు. తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. సమాజ సేవకులకు గుర్తింపు అవసరంరాయచూరు రూరల్: సమాజంలో వివిధ రంగాల్లో సేవలందించిన సేవకులకు గుర్తింపు అవసరమని మాజీ విధాన పరిషత్ సభ్యుడు శంకరప్ప పేర్కొన్నారు. సోమవారం దేవదుర్గ మాజీ శాసన సభ్యుడు శివనగౌడ నాయక్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో మంచి పనులు చేసిన వారిని మరిచి పోకుండా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్ హవల్దార్, గంగాధర నాయక్, ఈరన్న, శరణప్ప గౌడలున్నారు. డెంగీ కట్టడికి జన జాగృతి రాయచూరు రూరల్: జిల్లాలో డెంగీ వ్యాధి నియంత్రణకు జన జాగృతి అవసరమని జిల్లా ఆరోగ్య శాఖాధికారి సురేంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం ఆజాద్నగరలో ఇంటింటికెళ్లి మాట్లాడారు. నగరంలో నీటి నిల్వలు, మురుగు కాలువల వద్ద శుభ్రతను పాటించాలన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రతను పాటించాలన్నారు. ఇకపై హెల్మెట్ ధారణ తప్పనిసరి రాయచూరు రూరల్: జిల్లాలో ద్విచక్ర వాహన చోదకులు మంగళవారం నుంచి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని రాయచూరు జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య ఆదేశించారు. సోమవారం పత్రికలకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన పైమేరకు పేర్కొన్నారు. ఎండా కాలంలో నాలుగు నెలల పాటు ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో పెద్దగా పట్టించుకోలేదన్నారు. వానా కాలంలో రహదారులపై నీరు నిలిచి జారీ పడే అవకాశాలు మెండుగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ హెల్మెట్లను ధరించి ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. హెల్మెట్లను ధరించకుంటే రూ.500 జరిమానా చెల్లించక తప్పదన్నారు. గుండెపోటుతో ఎమ్మెల్యే పీఏ మృతిరాయచూరు రూరల్: కుష్టిగి ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు గుండెపోటుతో మరణించిన ఘటన కొప్పళ జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం కుష్టిగి ఎమ్మెల్యే దొడ్డనగౌడ వద్ద 20 ఏళ్ల పాటు పర్సనల్ అసిస్టెంట్(పీఏ)గా విధులు నిర్వహిస్తున్న చంద్రకాంత్ (46)తన నివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. సంస్కృతి, సంప్రదాయాల్ని పరిరక్షించుకోవాలి బళ్లారిఅర్బన్: కర్ణాటక సాహిత్య, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకొని అభివృద్ధి చేసే దిశలో గ్రామీణ ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను విరివిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నాటక రంగ సీనియర్ కళాకారిణి బీ.వీణాకుమారి అన్నారు. కంప్లి తాలూకా రామసాగర పాఠశాలలో ఏర్పాటు చేసిన మూడవ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంత చిన్నారులు తమలోని ప్రతిభ పాటవాలను వెలికి తీయాలన్నారు. రామసాగర జీపీ చైర్పర్సన్ ఎం.ఆశా మాట్లాడుతూ రామసాగరలో అనేక జానపద కళాకారులు, విద్వాంసులు ఉన్నారన్నారు. వారు కర్ణాటకకు అనన్యమైన సేవలు అందించారన్నారు. కన్నడ సంస్కృతి శాఖ జిల్లా ఏడీ నాగరాజ్ మాట్లాడుతూ బళ్లారి కళాకారులకు పుట్టినిల్లు అని అన్నారు. కళాకారుడు మోహన్ కలబుర్గి వయోలిన్ వాదన, కే.దొడ్డబసప్ప గవాయి బృందంచే సుగమ సంగీతం, వనమాల కులకర్ణి బృందం సామూహిక నృత్యాలు, యల్లనగౌడ శంకర్బండే బృందం జానపద గీతాలు, ఏళుబెంచి సీఎం కరుణామూర్తి కథాకీర్తన, వరలక్ష్మీ బృందంచే హేమరెడ్డి మల్లమ్మ నాటకం ప్రదర్శించారు. -
శక్తి పథకం.. మహిళలకు గర్వకారణం
హొసపేటె: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శక్తి పథకం మహిళలకు గర్వకారణమని ఎమ్మెల్యే గవియప్ప తెలిపారు. సోమవారం నగరంలో ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన శక్తి పథకం సంభ్రమాచరణలో పాల్గొని ఆయన మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ ప్రభుత్వం ఐదు హామీ పథకాలను ప్రకటించిందని గుర్తు చేశారు. హుడా అధ్యక్షుడు ఇమాం, పార్టీ నేతలు కురి శివమూర్తి తదితరులు పాల్గొన్నారు. శక్తితో మహిళలకు ఎంతో లబ్ధి చెళ్లకెరె రూరల్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య అమలులోకి తెచ్చిన శక్తి యోజన పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఉపయోగపడిందని ఎమ్మెల్యే టీ.రఘుమూర్తి తెలిపారు. ఆయన సోమవారం కేఎస్ఆర్టీసీ బస్టాండ్లో శక్తి పథకం సంభ్రమాచరణలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చినందున ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై అపార నమ్మకం ఏర్పడిందన్నారు. తహసీల్దార్ రెహన్ పాషా, గ్యారెంటీల అమలు సమితి అధ్యక్షుడు గద్దిగె తిప్పయ్యస్వామి, నగరసభ అధ్యక్షురాలు శిల్పా మురళీధర్, ఉపాధ్యక్షురాలు కవితా బోరయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వీరభద్రయ్య, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మహిళలకు ఆసరా శక్తి పథకంరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పంచ గ్యారెంటీల్లో ఒకటైన శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆసరా అయిందని పంచ గ్యారెంటీల అమలు సమితి జిల్లాధ్యక్షుడు పామయ్య మురారి, మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్ పేర్కొన్నారు. సోమవారం ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఆర్డీఏ అధ్యక్షుడు రాజశేఖర్, పవన్ పాటిల్, సభ్యులు నాగేంద్ర, శశికళ, ఉరుకుందప్ప, మంజుల, అధికారులు చంద్రశేఖర్, హుడేద్, నవీన్ కుమార్, హరీష్, గవిసిద్దప్పలున్నారు. ఉచిత ప్రయాణంతో మహిళల్లో ఆనందం –బళ్లారిలో శక్తి సంబరాల్లో మేయర్ నందీష్ బళ్లారిఅర్బన్: పేదలు, శ్రామిక మహిళలకు మనోబలాన్ని ఇచ్చే నారీ శక్తి ఉచిత ప్రయాణం వల్ల మహిళల్లో ఆనందోత్సవాలతో పాటు ఆలయాల సందర్శన తదితర మంచి పనులకు ఎంతో ఉపయోగపడుతోందని బళ్లారి మేయర్ ముల్లంగి నందీష్ తెలిపారు. కేంద్ర బస్టాండ్లో సంబంధిత నారీ శక్తి పథకం 500 కోట్ల మహిళల ప్రయాణ సంబరాల వేడుకల్లో ఆయన మహిళా ప్రయాణికులకు మిఠాయిలను పంచి పెట్టి మాట్లాడారు. పథకాల అమలు సమితి జిల్లా అధ్యక్షుడు కేఈ చిదానందప్ప, డాక్టర్ బాబూ జగ్జీవన్ రాం చర్మ పరిశ్రమల సంస్థ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజ్, జిల్లా ఎస్పీ డాక్టర్ శోభారాణి తదితరులు మహిళా ప్రయాణికులకు మిఠాయిలు పంచి పెట్టి స్పూర్తిప్రదాయక మహిళా సాధకుల పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రముఖులు డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, నాగభూషణగౌడ, ఆర్టీసీ డీసీ వినాయక్ భగవాన్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే గవియప్ప -
ప్రముఖ నటి సరోజా దేవి కన్నుమూత
ప్రముఖ నటి, అభినయ సరస్వతి బి.సరోజా దేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం (జూలై 14న) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈమె తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో అనేక చిత్రాలు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. తెలుగులో భూకైలాస్, పెళ్లి సందడి (1959), జగదేక వీరుని కథ, సీతారామ కల్యాణం, శ్రీ కృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, శకుంతల, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, పండంటి కాపురం, సీతారామ వనవాసం, దాన వీర శూర కర్ణ వంటి అనేక సినిమాల్లో నటించి మెప్పించారు.200కి పైగా సినిమాలుబీ సరోజాదేవి (B.Saroja Devi) 1938 జనవరి 7న బెంగళూరులో జన్మించారు. "అభినయ సరస్వతి" అనే బిరుదుతో ప్రసిద్ధి పొందిన ఆమె, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించారు. 1955లో కన్నడ చిత్రం మహాకవి కాళిదాసుతో ఆమె సినీ రంగ ప్రయాణం ప్రారంభమైంది. పాండురంగ మహత్యం (1957) ద్వారా తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు. నాడోడి మన్నన్ (1958) ఆమెను తమిళ చిత్రసీమలో స్టార్గా నిలిపింది. హిందీలో పైఘామ్ (1959), ససురాల్ (1961) వంటి చిత్రాల్లో నటించారు.1955 నుండి 1984 వరకు 161 సినిమాల్లో ప్రధాన పాత్రధారిగా నటించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆమె కెరీర్లో.. కిట్టూరు రాణి చెన్నమ్మ (1961) దేశభక్తి భావనను ప్రతిబింబించే చిత్రంగా గుర్తింపు పొందింది. సినీ రంగంలో ఆమె కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ (1969), పద్మభూషణ్ (1992) పురస్కారాలతో సత్కరించింది. అలాగే సరోజా దేవికి కలైమామణి పురస్కారం దక్కింది. అంతేకాకుండా బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.కుటుంబ నేపథ్యంసరోజా దేవి తండ్రి భైరప్ప పోలీసు శాఖలో ఉద్యోగి, తల్లి రుద్రమ్మ గృహిణి. 1967లో శ్రీ హర్ష అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన 1986లో మరణించారు. సరోజాదేవి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారికి రామచంద్రన్, ఇందిరా అని పేర్లు పెట్టి పోషించారు.చదవండి: ఫ్రెండ్స్తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, ఇంతలోనే సిట్టింగా? -
కాలేజీకి వెళ్లే కూతుళ్లు ఉన్నా, జల్సాలకు మరిగిన భార్య..!
యశవంతపుర: భర్త అనే గౌరవంలేదు. పార్టీ, పబ్ అంటూ తిరగటం, తన విలాసవంతమైన జీవనం కోసం ఆరాటం, అందుకే హత్యాయత్నం చేశానని కన్నడ బుల్లితెర నటి మంజుళ శ్రుతి (38) భర్త అమరేశ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇటీవల బెంగళూరు హనుమంతనగర పోలీసుస్టేషన్ పరిధిలోని మునేశ్వర బ్లాక్లో ఇంట్లో ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేయడం తెలిసిందే. తీవ్ర గాయాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఫిర్యాదు మేరకు భర్త అమరేశ్ను అరెస్టు చేశారు. ఇందుకు భార్య ధోరణే కారణమని చెప్పాడు. ఆమెకు ఏమాత్రం మానవత్వం లేదు, పిల్లలను ఇంటిలో పెట్టి పబ్, పార్టీలంటూ తిరుగుతుంది. అర్ధరాత్రి ఇంటికొచ్చేది. ఒక్కోసారి ఇళ్లు వదిలితే 15 రోజులైనా కనబడదు. కుంభమేళా అంటూ 15 రోజులు అడ్రస్ లేదు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాలేజీకీ వెళ్లే ఇద్దరు కూతుళ్లు ఉండగా, నేను రూ.25 లక్షలతో ఒక అపార్ట్మెంట్ ఫ్లాటును కొనాలనుకున్నా. కానీ ఆ డబ్బు తీసుకుని పారిపోవాలని ప్లాన్ వేసుకొంది. విపరీతంగా వేధిస్తూ ఉండడంతో కత్తితో దాడి చేశాను అని విచారణలో తెలిపాడు. కాగా బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
భర్త వద్దని.. ప్రియుని చెంతకు
కర్ణాటక: ప్రియుని కోసం, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను కాదని వచ్చిందో యువతి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వద్ద ఉన్న రంపచోడవరం ప్రాంతానికి చెందిన తిరుపతమ్మ లవ్ కహాని ఇది. రాజధాని బెంగళూరులో కాంట్రాక్టర్గా పని చేస్తున్న తిరుపతమ్మ తండ్రి వద్ద కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకా సంగనాళకు చెందిన వెంకటేష్ గార పని చేసేవాడు. ఆ సమయంలో తిరుపతమ్మతో పరిచయమై మూడేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం జరిగింది. ఈ విషయంలో తిరుపతమ్మకు నచ్చచెప్పి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. వెంకటేష్ను బెదిరించడంతో పని మానేసి సంగనాళకు చేరుకున్నాడు. కానీ తిరుపతమ్మ భర్తను వదిలేసి సంగానాళులో ప్రియుని వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి కొప్పళ పట్టణానికి వచ్చి ఎస్పీని కలిసి రక్షణ కోరారు. మరోవైపు తిరుపతమ్మ తల్లిదండ్రులు నాలుగు కార్లలో కుమార్తెను వెతుకుతూ కొప్పళకు వచ్చారు. ఆమె పెళ్లి జరిగి 15 రోజులు కాకమునుపే ప్రేమించిన వాని కోసం వచ్చేసిందని చెబుతున్నారు. తాను ప్రియునితోనే ఉంటానని తిరుపతమ్మ భీష్మించుకుని. -
కన్నడకు ప్రాధాన్యత ఇవ్వాలి
రాయచూరు రూరల్ : పట్టణ ప్రాంతాలలో కన్నడ భాషకు ప్రోత్సాహం ఇవ్వాలని సీనియర్ సంపాదకుడు నాగరాజ్ అన్నారు. కన్నడ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన హోసమని కావ్య, రంగసిరి అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికీ కన్నడ తెలుగు, భాషలను కలిపి మాట్లాడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ కన్నడ భాషకు అధిక ప్రాదాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం అవార్డులు ప్రదానం చేశారు. బయలాట రామణ్ణ,జలాల్ సాబ్, రంగసిరి వీరయ్య, రంగభూమి నటుడు నాగప్ప, వెంకట నరసింహులు, రంగస్వామి, ప్రవీణ్ రెడ్డి, సుందరే్ష్, వాల్మీకి, బసవరాజ్లు అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో బషిరుద్దీన్ హోసమని శరణ బసవ, రుద్రయ్య, వీరేష్, రమేష్ చంద్ర శేఖర్ పాటిల్, పర్విన్ బేగం, ఋషి పాల్గొన్నారు. -
రూ.5వేల కోసం కళాకారుడి హత్య
హుబ్లీ: రూ.5 వేల కోసం కళాకారుడిపై మరుణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన బెళగావి జిల్లా రాయభాగ తాలూకా బుడిహళ్ వద్ద జరిగింది. 22 ఏళ్ల మారుతీ అడివప్ప లట్టే ఉత్తర కర్ణాటక శైలిలో పాటలు పాడటం ద్వారా ప్రజాదరణ పొందాడు. కుటుంబ అవసరాల కోసం ఈరప్ప అనే వ్యక్తి నుంచి మారుతీ రూ.50వేలు అప్పు తీసుకున్నాడు. రూ.45వేలు తిరిగి చెల్లించాడు. తన పాటలకు ఆదరణ పెరగడంతో పనికి వెళ్లకుండా పాటలు పాడటంతో నిమగ్నమై రూ.5వేల బాకీ చెల్లించచడంలో జాప్యం జరిగింది. ఈక్రమంలో స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్తుండగా ఈరప్ప హక్కివాటేతో పాటు 11 మంది మారుతీపై మారణాయుధాలతో దాడి చేశారు. అనంతరం అతనిపై కారు ఎక్కించారు. దీంతో మారుతీ ఘటన స్థలంలోనే మృతి చెందగా స్నేహితుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో నిందితులు కూడా గాయపడ్డారు. రాయభాగ్ పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి నిందితుడు ఈరప్ప గోకాక్, సిద్దరామ వడియార్, ఆకాశ్ పూజారిని అరెస్ట్ చేశారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలురాయచూరు రూరల్: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎంపీ కుమార నాయక్ సూచించారు. పండిత సిద్దరామ జంబల దిన్నిరంగ మందిరంలో వాల్మీకి నాయక్ సమాజం ఆధ్వర్యంలో ఆ సముదాయంలోని ప్రతిభావంత విద్యార్థులను ఆదివారం ఆయన ప్రతిభాపురస్కారాలతో సన్మానించి మాట్లాడారు. విద్యకు ఉన్న ప్రాధాన్యత ఇతర ఏరంగానికీ లేదన్నారు. స్వామీజీలు రవి, మాజీ శాసన సభ్యులు గంగాధర నాయక్, రాజా వెంకటప్ప నాయక్, నగరసభ ఉపాధ్యక్షుడు సమీర్, శ్రీనివాస రెడ్డి, రమేష్, సమాజం అధ్యక్షుడు వెంకటేష్ నాయక్ రూప, శివ కుమార్ నాయక్ పాల్గొన్నారు. వృత్తి శిక్షణ కోర్సు ప్రారంభంహుబ్లీ: స్థానిక సవాయి గంధర్వ హళ్ వద్ద ఉన్న జయప్రియ వృత్తిపర శిక్షణ కేంద్రంలో 2025 ఏడాదికి గాను డిప్లోమో ఇన్ అఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సును ప్రారంభించారు. హుబ్లీలోని ప్రముఖ జయప్రియ కంటి ఆస్పత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ వెంకటరామ్ కట్టి, ఈఎన్పీ నిపుణులైన డాక్టర్ ప్రియ కట్టి మార్గదర్శకత్వంలో మహిళా అభ్యర్థుల కోసం ఈ కోర్సు ప్రారంభించారు. ఎంఆర్ఐ సెంటర్ ప్రారంభం హొసపేటె: ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ సేవలను జిల్లావాసులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గవియప్ప సూచించారు. పట్టణంలోని రైల్వే రహదారిలో ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. టీబీ, క్యాన్సర్కు సంబంధించి స్కానింగ్ సేవలు ఇక్కడ లభిస్తాయన్నారు. ఆర్థో పెడిక్ వైద్యులు యువరాజ్, జిల్లా వైద్యాధికారి శంకర్నాయక్, వైద్యులు విశ్వానాథ్, సాలియా, జుబేర్ పాల్గొన్నారు. పాత్రికేయుల సేవలు అపారం చెళ్లకెరె రూరల్: పాత్రికేయులు సమాజానికి అందిస్తున్న సేవలు అపారమని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి చెందిన శివరశ్మి అన్నారు. పట్టణంలోని బ్రహ్మకుమారీ ఈశ్వరి విద్యాలయంలో ఆదివారం నిర్వహించిన పత్రికా దినాచరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పాత్రికేయులు సమాజంలోని లోపాలను ఎత్తిచూపి సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పాత్రికేయులు ఒత్తిడి నుంచి దూరం కావడానికి ధ్యానం చేయాలన్నారు. అనంతరం పాత్రికేయులను సన్మానించారు. 3 పులి కూనలు మృత్యువాత బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ తాలూకాలోని బన్నేరుఘట్టలోని జూ పార్క్లో ఐదు రోజుల క్రితం జన్మించిన పులి పిల్లలు తల్లి పులి పాలు ఇవ్వకపోవడంతో ఆకలితో చనిపోయాయి. 7వ తేదీన హిమాదాస్ అనే ఏడేళ్ల ఆడ పులి 3 పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఒకటి మగది. కానీ తల్లి పులి ఎందుకో ఆగ్రహంగా ప్రవర్తించింది. కూనలను దగ్గరకు రానివ్వలేదు. కరిచి గాయపరచడంతో పాటు కాళ్లతో తొక్కింది. పాలు కూడా ఇవ్వలేదు. ఈ పరిస్థితితో కూనలన్నీ మృత్యువాత పడ్డారు. అయితే పిల్లలను కాపాడడానికి తాము చాలా ప్రయత్నం చేశామని జూ సిబ్బంది చెబుతున్నారు. డివైడర్కు కారు ఢీ.. ఐదుమందికి గాయాలు చింతామణి: కారు అతివేగంగా వచ్చి అదుపుతప్పి డీవైడర్ని ఢీ కొన్న ప్రమాదంలో ఐదుమంది గాయపడ్డారు. కారు నుజ్జు నుజ్జు అయిన సంఘటన రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఐమరరెడ్డి పల్లి క్రాస్ దగ్గర ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. బెంగళూరు చిక్కజాలకు చెందిన అనంతకుమార, వెంకటేశ, లక్ష్మీకాంత, రామచంద్ర, అంబరీష్ కారులో బోయకొండ పుణ్యక్షేత్రానికి వెళ్లారు. దర్శనాలు చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా ప్రమాదం సంభవించింది. గాయపడి కారులో ఇరుక్కున్నవారిని స్థానికులు బయటకు తీసి చింతామణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించి బెంగళూరు ఆస్పత్రికి సాగించారు. -
సంగీత పితామహుడు పుట్టరాజు గవాయి
రాయచూరురూరల్ : పుట్టరాజు గవాయి సంగీత రంగంలో చక్రవర్తిగా రాణించారని కిల్లే బృహన్మఠ మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సోమవారి పేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య, గబ్బూరు బూది బసవ శివాచార్యలు అన్నారు. నగరంలోని గణదిన్ని కల్యాణ మంటపంలో ఆదివారం ఏర్పాటు చేసిన గవాయి పుణ్యా రాధన దినోత్సవం, 45వ సంగీతోత్సవ సమ్మేళనాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. గవాయి అంధుడైనా సంగీత సాధనతో ప్రఖ్యాతి పొందారన్నారు. అంధుల పాఠశాల ఏర్పాటు చేసి అంధుల జీవితాల్లో వెలుగులు నింపాడన్నారు. సమ్మేళనంలో కల్లయ్య, చంద్రశేఖర్, రాఘవేం ద్ర, నరసింహులు, సుధాకర్, సూగురేష్, ఇబ్రహీం, వెంకటేష్ పాల్గొన్నారు. బైక్ ఢీకొని గాయాలు హుబ్లీ: బైక్ ఢీకొని వ్యక్తి గాయపడిన ఘటన అంచటగేరి బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. తాలూకాలోని బ్యాహట్టి గ్రామానికి చెందిన సంతోష మునవళ్లి కాలినడకన వెళ్తుండగా చెన్నపుర గ్రామానికి చెందిన ఫక్కీరేశ నిర్లక్ష్యంగా బైక్ను నడిపి ఢీకొన్నాడని హుబ్లీ గ్రామీణ పోలీసులు తెలిపారు. గాయపడిన సంతోషను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రతి రోజూ యోగాను ఆచరించాలి రాయచూరురూరల్: దైనందిన జీవితంలో యోగాను ఆచరించడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు అన్నారు. నగరంలోని మహిళా సమాజ్లో పతంజలి యోగా విద్యా సంస్థ, సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి సందర్భంగా పోలీసులకు ఏర్పాటు చేసిన యోగా శిబిరం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామీజీ పాల్గొని మాట్లాడారు. రోజూ కొద్దిసేపు యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడినుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. యోగాతో ఆయుష్షు వృద్ధి చెందుతుందన్నారు. పతంజలి యోగా సంచాలకుడు విఠోబరావ్, ఈఐ ఉమేష్కాంబ్లే, ఎస్ఐ నరసమ్మ, పరమేశ్వర సాలిమఠ్్ రుతురాజ్ పాల్గొన్నారు. పోలీసులకు వాహనం అందజేతరాయచూరు రూరల్: ప్రభుత్వం మంజూరు చేసిన జీపును మస్కి శాసనసభ్యుడు బసన గౌడ తుర్విహళ్ అదివారం తుర్విహళ్ ఎస్ఐ సూజాత నాయక్కు అందజేశారు. మారుమూల ప్రాంతాల్లో నేరాలు జరిగినప్పుడు పోలీసులు స కాలంలో చేరుకునేందుకు సరైన వాహనం లేకపోవడంతో ప్రభుత్వంతో చర్చించి వాహనం మంజూరు చేయించినట్లు తెలిపారు. బోనుకు చిక్కిన చిరుతరాయచూరురూరల్: తాలూకాలోని దొంగరాంపురం వాసులను కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది. చిరుత గ్రామ సమీపంలో సంచరిస్తూ మూగజీవాలను హతమార్చుతోంది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకేవారు. అటవీశాఖ అధికారులు ఇటీవల గ్రామ సమీపంలోని పొలాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి ఆహారం కోసం వచ్చిన చిరుత బోనులో చిక్కింది. ఆదివారం అధికారులు వచ్చి పులిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు. మరో రైతు ఆత్మహత్యహుబ్లీ: ఆరుగాలం శ్రమించినా చేతుల కష్టం తప్ప ప్రతిఫలం దక్కలేదు. పెట్టుబడులకు తెచ్చిన అప్పులు గుదిబండగా మారడంతో జిల్లాలోని కుందగోళ తాలూకా భరత్వాడ గ్రామానికి చెందిన రవిరాజ్ జాడర్ (42) ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగైదు ఏళ్ల నుంచి అతివృష్టి, అనావృష్టి తీవ్రతకు పంటలు చేతికందక అప్పులు తీర్చే దారి కానరాక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఇదే గ్రామానికి చెందిన బసవన్నగౌడ శివన్నగౌడ పాటిల్(56) రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఒకే గ్రామంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఇరుకు బస్టాండుతో ప్రయాణికుల పాట్లు
రాయచూరురూరల్: దశాబ్దాల క్రితం అప్పటి ప్రయాణికుల రేషియోను బట్టి నిర్మించిన మాన్వి బస్టాండు నేడు ప్రయాణికులు, బస్సుల సంఖ్య పెరిగి ఇరుకుగా మారింది. దీంతో ప్రయాణికుల పాట్లు వర్ణణాతీతం. మాన్విలో 20 ఏళ్ల క్రితం ఎస్ఎం కృష్ణ హయాంలో ప్రజాపనుల శాఖ మంత్రి ధరంసింగ్, ఎమ్మెల్యే బోసురాజు నేతృత్వంలో హైదరాబాద్–కర్ణాటక అభివృద్ధి మండలి నిధులతో బస్టాండు నిర్మించారు. కాలక్రమేణా ప్రయాణికుల సంఖ్య పెరిగినా బస్టాండును విస్తరించిన పాపాన పోలేదు. ప్రస్తుతం బస్టాండులో ఐదు బస్సులు నిలబడితే ప్రయాణికులు బస్సుల మధ్య చిన్న చిన్న సందుల మధ్య దూరి పోవాల్సి వస్తోంది. జిల్లాలో రాయచూరు, లింగసూగూరు, దేవదుర్గ, హట్టి, సింధనూరు బస్టాండ్లు ఎంతో విశాలంగా ఉండగా మాన్వి బస్టాండ్ ఒక్కటే చిన్నదిగా ఉంది. మంత్రాలయం, హైదరాబాద్, రాయచూరు నుంచి మాన్వి బస్టాండ్ మీదుగ హోస్పేట్, గంగావతి, విజయవాడ, కర్నూలు, దావణగెరె, హుబ్లీ, ధార్వాడ, కార్వార, బెంగళూరు, శివమెగ్గ, తుమకూరు, సింధనూరు, కొప్పళ, బళ్లారి వంటి ప్రాంతాలకు బస్లు వెళ్తుంటాయి. గ్రామీణ ప్రాంతాలకు వేళ్లే బస్లు బస్టాండ్లో వచ్చి ఆగుతుంటాయి. బస్టాండులో స్థలాభావంతో బస్సులను ఒకదానిపక్కన ఒకటి ఆనుకొని నిలుపుతున్నారు. ప్రయాణికులు బస్సులోపలకు ఎక్కేందుకు నానా పాట్లు పడాల్సి వస్తోంది. బస్టాండ్ను మరో ప్రాంతంలో విస్తారంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. బస్టాండ్ను విస్తరించాలని 2013లో శా సన సభ్యుడు హంపయ్య నాయక్, 2018లో రాజా వెంకటప్ప నాయక్, 2023లో హంపయ్య నాయక్కు విన్నవించినా స్పందన లేదు. 20 ఏళ్ల క్రితం నిర్మాణం కాలక్రమేణా పెరిగిన ప్రయాణికుల సంఖ్య బస్సులు నిలిపేందుకు స్థలం లేక ఇబ్బందులు -
ఉద్యోగాలు సృష్టించే నైపుణ్యాలు కలిగి ఉండాలి
బళ్లారిఅర్బన్: ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులు ఏదైనా సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలు కలిగి ఉంటారని హావేరి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.సురేష్ హెచ్ జంగమ శెట్టి అన్నారు. వీరశైవ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని రావ్ బహుదూర్ వై. మహాబలేశ్వరప్ప ఇంజినీరింగ్ కళాశాల 2025వ సంవత్సర స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఎం.సురేష్ హెచ్ జంగమ శెట్టి, మానవ సంప్నమూల కార్యనిర్వహణ ఉపాధ్యక్షుడు డాక్టర్.నారాయణ, కిర్లోస్కర్ పరిశ్రమ కొప్పళ మేనేజర్, ఆ సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు బసవరాజ, డాక్టర్.అరవింద పాటిల్, బైలువద్దిగేరి ఎర్రిస్వామి, బాడద ప్రకాష్, ప్రిన్సిపాల్ డాక్టర్ సీ.హనుమంతు రెడ్డి, డిప్యూటీ ప్రిన్సిపాల్ డాక్టర్ సవితా సోనోలి, డీన్ పరీక్షల విభాగం కన్వీనర్ డాక్టర్ శ్రీపతి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎం.సురేష్ హెచ్ జంగమ శెట్టి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. ఇంజనీరింగ్లో ఏదైన సాధించడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు. శ్రేష్టత, ఉత్సాహం, తెలివితేటలతో ఎంచుకున్న రంగంలో రాణించవచ్చన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో మార్పులకు నాంది పలికిందని, అయితే కొన్ని కొత్త సమస్యలు సృష్టించబడ్డాయన్నారు. విద్యార్థులు ఉద్యోగాలపైనే అధార పడకుండా ఉపాధి కల్పించే ఉద్యోగ దాతలు కావాలని ఆయన సూచించారు. పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు డిగ్రీ పట్టాలు పంపిణీ చేశారు. రావ్ బహుదూర్ వై.మహాబలేశ్వరప్ప ఇంజినీరింగ్ కళాశాల స్నాతకోత్సవంలో వక్తలు -
వందలాది మంది నుంచి రూ.కోట్లాది వసూళ్లు
మండ్య: నగదు డబ్లింగ్ చేయడంతో పాటు, తమ వద్ద ఉన్న రూ.250 కోట్లకు పన్నులు కట్టాలని, ఆ డబ్బు రాగానే మీకు భారీ మొత్తంలో అందిస్తామని చెప్పి ఓ వ్యక్తి సుమారు వంద మందికి టోపీ వేశాడు, వారి నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేశాడు. మండ్య తాలూకాలోని ద్యాపసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. కెరెగోడు పోలీసులు తెలిపిన ప్రకారం, మైసూరు జిల్లాలో హుణసూరుకు చెందిన మోసగాడు డి.ఎన్.నాగరాజుని గాలించి ఉడుపిలో అరెస్టు చేశారు. కూలీ నుంచి కోటీశ్వరునిగా 10 ఏళ్ల కిందటి వరకు కెంపయ్య, కుమారుడు చిక్కనరసయ్య ద్యాపసంద్రలో కూలిపనులు చేసేవారు. తరువాత అప్పులు చేసి ఊరి నుంచి పరారయ్యారు. నాలుగేళ్ల కిందట ద్యాపసంద్రకు వచ్చి చంద్రశేఖర్, నాగయ్య అనేవారితో స్నేహం పెంచుకున్నారు. ఐపీఎస్ అధికారి తెలుసని, వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉన్నాయని, వాటిని తీయాలంటే కొంత శుల్కాలు చెల్లించాలని ప్రచారం చేసుకున్నాడు. రామలింగేగౌడ నుంచి రూ.2 కోట్లు వసూలు చేశారు. గ్రామంలో అనేక మంది వద్ద లక్షల్లో డబ్బులు తీసుకున్నారు కే.ఎస్.చేతన్ అనే వ్యక్తి ఇతని భ్రమలో పడి చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసినవారి నుంచి కూడా నాగరాజుకు డబ్బులు ఇప్పించాడు. అలాగే మీరు ఒక లక్ష ఇస్తే చాలు, డబ్బు చేతిలో పడ్డాక మీకు 10 లక్షలు ఇస్తాని నమ్మించాడు. అలా చేతన్, మిత్రులు రూ. 38 లక్షలు ఇచ్చుకున్నారు. కొందరిని మైసూరులో ఓ ఆడిటర్ వద్దకు, బ్యాంకుకు తీసుకెళ్లి నిజమేనని నమ్మకం కల్పించాడు. మరికొందరి నుంచి వసూళ్లు సాగించి ఇటీవల ఊరి నుంచి మాయమయ్యాడు. నాగరాజుకు ముగ్గురు భార్యలు, పిల్లలు ఉన్నారు. జనం నుంచి స్వాహా చేసిన డబ్బుతో వారికి ఇళ్లు, నగలు, ఇంటి స్థలాలు ఇప్పించాడు. చివరకు అంతా మోసమని తెలిసి చేతన్తో పాటు మరికొందరు కెరెగోడు పోలీసులకు ఫిర్యాదు చేయడం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రైస్ పుల్లింగ్ పాత్ర అని చెప్పే కొన్ని వస్తువులను సీజ్చేశారు. రైస్ పుల్లింగ్, మనీ డబ్లింగ్ పేరుతో కుచ్చుటోపీ మండ్య జిల్లాలో మోసగాని దందా -
నవంబర్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశం
సాక్షి,బళ్లారి: నవంబర్లో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని చీఫ్విప్ సలీమ్ అహ్మద్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన హావేరిలో విలేకరులతో మాట్లాడారు. మంత్రివర్గం విస్తరణ జరిగిన తర్వాత పదవులు కోల్పోయిన వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని, కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు పార్టీ హైకమాండ్, సీఎం సిద్దరామయ్య చర్యలు తీసుకుంటారన్నారు. పలువురు మంత్రులు కేపీసీసీ అధ్యక్షుడు మార్పు చేయాలని కోరుతున్న విషయం తనకు తెలియదన్నారు. తమది బీజేపీ తరహా పార్టీ కాదన్నారు. ప్రజాప్రభుత్వ వ్యవస్థలో మోదీ చెబితే అర్ధగంటలో నిర్ణయాలు జరుగుతాయని, అయితే తమ పార్టీలో అందరూ కలిసి చర్చించి, విశ్లేషణ చేసి అంతిమ నిర్ణయం తీసుకుంటామన్నారు. బీజేపీ సార్వదికారి ధోరణి అవలంభిస్తుందని, ఆ రీతిగా తాము వ్యవహరించబోమన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమ శిక్షణకు మారుపేరు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై సవతి తల్లి ధోరణి అవలంభిస్తుందని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదన్నారు. ప్రధాని మోదీ అబద్దాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని, ప్రజల ఆశయాలు నేరవేర్చడం లేదన్నారు. చీఫ్విప్ సలీమ్ అహ్మద్ -
కాంగ్రెస్ సర్కార్కు ఎలాంటి ఢోకా లేదు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్సర్కార్కు ఎలాంటి ఢోకా లేదని, బీజేపీ ఆటలు కొనసాగనివ్వబోమని రాష్ట్ర నగరాభివృద్ధి, హజ్ శాఖ మంత్రి రహీంఖాన్ అన్నారు. సింధనూరులో రూ. 30 కోట్లతో ఏర్పాటు చేసిన తాగునీటి పథకం, సుడా కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గతంలో అపరేషన్ కమల పేరుతో దొడ్డి దారిన అధికారం చేపట్టిన బీజేపీ.. కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 55 మంది కాంగ్రెస్ శాసన సభ్యులు బీజేపీతో రహస్య మంతానాలు జరిపారనేది సత్యదూరమన్నారు. రాష్ట్రంలో అక్రమ అస్తులకు సంబంధించి ఏబీ ఖాతాలు 50 శాతం పూర్తయ్యాయన్నారు. కార్యక్రమంలో కొప్పళ ఎంపీ రాజశేఖర్, శాసనసభ్యులు హంపన గౌడ, వసంత్ కుమార్, శరణేగౌడ, బసవన గౌడ, నాగవేణి పాల్గొన్నారు. అంతకు ముందు సుడా అధ్యక్షుడిగా బాపు గౌడ బాదర్లి బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అటలు సాగనివ్వం హజ్ శాఖ మంత్రి రహీంఖాన్ -
బాలునిపై వీధికుక్క దాడి
శివమొగ్గ: శివమొగ్గ నగరంలోని సొమినకొప్ప ప్రాంతంలో రోడ్డుపై నడిచి వెళుతున్న బాలునిపై వీధికుక్క దాడి చేసి గాయపరిచింది. మహమ్మద్ తమీమ్ అనే నాలుగేళ్ల బాలునికి పెదవి దగ్గర తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు మెగ్గాన్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. కుక్క బాలున్ని కరుస్తుండగా స్థానికులు కుక్కను తరిమికొట్టి బాలున్ని రక్షించారు. సొమినకొప్ప ప్రాంతంలో వీధికుక్కల బెడద అధికమైందని, నిరంతరం పశువులపై దాడి చేస్తున్నాయని ప్రజలు వాపోయారు. పురపాలక అధికారులు వీధికుక్కలను దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. కారు ప్రమాదంలో నలుగురు మృత్యువాత దొడ్డబళ్లాపురం: అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున బెంగళూరు–మైసూరు ఎక్స్ప్రెస్వేలో జరిగింది. జయపుర బ్రిడ్జ్ వద్ద అతి వేగం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొంది. మండ్య జిల్లా కేఆర్ పేటకు చెందిన ముత్తురాజు (55), తమ్మనగౌడ (27) , సంజు (28), కారు డ్రైవర్ సచిన్ (27) తీవ్ర గాయాలతో అక్కడే చనిపోయారు. రామనగర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వేధిస్తోందని.. కత్తితో పొడిచా ● టీవీ నటి శ్రుతి భర్త వెల్లడి యశవంతపుర: భర్త అనే గౌరవంలేదు. పార్టీలు, పబ్ అంటూ తిరగటం, తన విలాసవంతమైన జీవనం కోసం ఆరాటం, అందుకే హత్యాయత్నం చేశానని కన్నడ బుల్లితెర నటి మంజుళ శ్రుతి (38) భర్త అమరేశ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇటీవల బెంగళూరు హనుమంతనగర పోలీసుస్టేషన్ పరిధిలోని మునేశ్వర బ్లాక్లో ఇంట్లో ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేయడం తెలిసిందే. తీవ్ర గాయాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఫిర్యాదు మేరకు భర్త అమరేశ్ను అరెస్టు చేశారు. ఇందుకు భార్య ధోరణే కారణమని చెప్పాడు. ఆమెకు ఏమాత్రం మానవత్వం లేదు, పిల్లలను ఇంటిలో పెట్టి పబ్, పార్టీలంటూ తిరుగుతుంది. అర్ధరాత్రి ఇంటికొచ్చేది. ఒక్కోసారి ఇళ్లు వదిలితే 15 రోజులైనా కనబడదు. కుంభమేళా అంటూ 15 రోజులు అడ్రస్ లేదు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాలేజీకీ వెళ్లే ఇద్దరు కూతుళ్లు ఉండగా, నేను రూ.25 లక్షలతో ఒక అపార్ట్మెంట్ ఫ్లాటును కొనాలనుకున్నా. కానీ ఆ డబ్బు తీసుకుని పారిపోవాలని ప్లాన్ వేసుకొంది. విపరీతంగా వేధిస్తూ ఉండడంతో కత్తితో దాడి చేశాను అని విచారణలో తెలిపాడు. కాగా బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భర్త వద్దని.. ప్రియుని చెంతకు ● రంపచోడవరం టు కొప్పళ రాయచూరు రూరల్: ప్రియుని కోసం, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను కాదని వచ్చిందో యువతి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వద్ద ఉన్న రంపచోడవరం ప్రాంతానికి చెందిన తిరుపతమ్మ లవ్ కహాని ఇది. రాజధాని బెంగళూరులో కాంట్రాక్టర్గా పని చేస్తున్న తిరుపతమ్మ తండ్రి వద్ద కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకా సంగనాళకు చెందిన వెంకటేష్ గార పని చేసేవాడు. ఆ సమయంలో తిరుపతమ్మతో పరిచయమై మూడేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం జరిగింది. ఈ విషయంలో తిరుపతమ్మకు నచ్చచెప్పి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. వెంకటేష్ను బెదిరించడంతో పని మానేసి సంగనాళకు చేరుకున్నాడు. కానీ తిరుపతమ్మ భర్తను వదిలేసి సంగానాళులో ప్రియుని వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి కొప్పళ పట్టణానికి వచ్చి ఎస్పీని కలిసి రక్షణ కోరారు. మరోవైపు తిరుపతమ్మ తల్లిదండ్రులు నాలుగు కార్లలో కుమార్తెను వెతుకుతూ కొప్పళకు వచ్చారు. ఆమె పెళ్లి జరిగి 15 రోజులు కాకమునుపే ప్రేమించిన వాని కోసం వచ్చేసిందని చెబుతున్నారు. తాను భర్తతోనే ఉంటానని తిరుపతమ్మ భీష్మించుకుంది. -
గత 50 ఏళ్లలో వర్షాకాలంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, బెంగళూరు: ఎప్పుడూ సరాసరి చల్లదనంతో ఉండేది బెంగళూరు నగరం అని పేరు. అందుకే దేశంలో ఎక్కడెక్కడి నుంచో నగరానికి వచ్చి జీవిస్తున్నారు. కానీ చల్లని వాతావరణం కనుమరుగవుతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉద్యాన నగరి వాతావరణంలో వస్తున్న మార్పులే ఇందుకు కారణమని చెప్పాలి. గతంలో మాదిరి ఎప్పుడూ చల్లదనం కనిపించడం లేదు. నెమ్మదిగా ఐటీ సిటీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఒక్కరోజులో ఎండ, వర్షం, చలి ఇలా అన్ని రకాల పరిస్థితులను నగరవాసులు చూస్తున్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజాముల్లో తీవ్రమైన చలి, మధ్యాహ్నం వేళ చుర్రుమనే ఎండలు, సాయంత్రం, రాత్రి వేళల్లో చిరుజల్లులు, ఇలా బెంగళూరులో విపరీతమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీని వల్ల అనారోగ్య పీడితులు ఇబ్బందులు పడుతున్నారు. 34 డిగ్రీల ఎండ నగరీకరణ, పారిశ్రామికాభివృద్ధి, అడవుల ఆక్రమణ, విపరీతమైన వాహన కాలుష్యం తదతరాలను కారణాలని చెప్పాలి. నేడు వర్షాకాలంలో సైతం అధికమైన మండుటెండలను నగరవాసులు చవిచూస్తున్నారు. బెంగళూరులో వర్షాకాలంలో సాధారణంగా 27 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. కానీ ఇటీవల కాలంలో 30 నుంచి 34 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం వేళల్లో ఆకాశంలో మబ్బులు కమ్మేసినప్పటికీ కూడా ఉక్కపోతతో నగరం ఇబ్బంది పడుతోంది. కొద్దిసేపు ఎండ, అంతలోనే మేఘావృతమై జల్లులు పడుతుంటాయి. చల్లదనం క్షీణత క్రమక్రమంగా వర్షాకాలంలో కూడా పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. చల్లదనం ప్రమాణం గతంలో కంటే చాలా వరకు తగ్గిపోయింది. ముఖ్యంగా కళ్యాణ కర్ణాటక లో ఉండే కలబురిగి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లాల్లో 30 డిగ్రీల సెల్సియస్ మేర పగటి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. బెంగళూరు కూడా మినహాయింపు కాదు. మరోవైపు దేశంలో చాలా వరకు అన్ని నగరాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఢిల్లీ కంటే ఎక్కువే దేశ రాజధాని ఢిల్లీ కంటే కూడా బెంగళూరులో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. పొరుగు రాష్ట్రం తమిళనాడు నుంచి తూర్పు వడగాలులు వీస్తుండడంతో రాజధానితో పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వేడి తీవ్రత పెరిగింది. రానున్న మరో వారం, పక్షం రోజుల్లో రాష్ట్రంలో చల్లటి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బెంగళూరులో విపరీత వాతావరణం వర్షాకాలంలో ఎండ వేడిమి అంతలోనే జల్లు వర్షం రాత్రివేళ చలిగాలులు ఏడాది ఉష్ణోగ్రత (సెల్సియస్ డిగ్రీల్లో) 1970 16–18 1990 19 2000 21 2010 28 2025 34 -
సిగందూరు కేబుల్ వంతెన నేడు ప్రారంభం
శివమొగ్గ: దేశంలో అతి పెద్ద కేబుల్ బ్రిడ్జి గా పేరు పొందిన సిగందూరు చౌడేశ్వరి దేవి వంతెనను సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారు. శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకాలోని సిగందూరులో శరావతి నది మీద ఈ వంతెనను సుమారు రూ. 470 కోట్లతో నిర్మాణం చేయడం తెలిసిందే. సోమవారం ఘనంగా ప్రారంభోత్సవం చేసి, సాగర పట్టణంలో నెహ్రూ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. పలువురు కేంద్రమంత్రులు, ఎంపీ బీవై రాఘవేంద్ర, మాజీ సీఎం యడియూరప్ప పాల్గొంటారు. వంతెనను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. -
అలసిపోతోన్న గుండె
శివాజీనగర: రాష్ట్రంలో గుండెపోటు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం రాత్రి, ఆదివారం మైసూరులో ఇద్దరు, దావణగెర, గదగ, బెంగళూరులో ఒకరు చొప్పున 5 మంది చనిపోయారు. ● మైసూరులో ప్రభుత్వ ఉద్యోగి అరుణ్ (44) బస్సులో ప్రయాణిస్తూ ఉండగా గుండెపోటు అని కూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయారు. ఆయన స్వస్థలం మండ్య జిల్లాలోని కిలారి గ్రామం. ● మైసూరు జిల్లాలోని టీ.నరసీపుర దేవాలయ ప్రధాన అర్చకుడు సంపత్కుమార్కు అర్ధరాత్రి తీవ్ర గుండెపోటు వచ్చి మరణించారు. ● దావణగెరెలో శక్తినగరకు చెందిన అనిల్కుమార్ (40) వాకింగ్ చేస్తున్నప్పుడు కుప్పకూలిపోయాడు. అక్కడి సీసీ కెమెరాలలో ఇది రికార్డయింది. కొంతసేపటికే చనిపోయాడు. ● బెంగళూరులో డ్యాన్స్ చేస్తూ ప్రైవేటు ఉద్యోగి ఉసురు పోయింది. రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా సర్జాపురవాసి బసవరాజ్ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుండేవాడు. మిత్రులతో కలసి రిసార్ట్కు వచ్చి మజా చేస్తుండగా ఘోరం జరిగింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ● గదగ్ జిల్లా లక్ష్మేశ్వరకు చెందిన శోభా వడకణ్ణవర్ (42) మరణించారు, ఎద నొప్పి అని చెప్పడంతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు, తరువాత హుబ్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వివిధ ప్రాంతాల్లో 5 మంది మృత్యువాత -
మైసూరులో లోక్ అదాలత్
మైసూరు: కేసులను రాజీ ద్వారా పరిష్కరించేందుకునే జాతీయ లోక్ అదాలత్ను ఏర్పాటు చేశారు. మైసూరు నగరం, తాలూకాలోని కోర్టులలో మొత్తం 1,27,153 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో 61,193 సివిల్ కేసులు, 60,932 క్రిమినల్ కేసులు ఉన్నాయని, వీటిలో అదాలత్లో 39,640 పరిష్కరించగల కేసులున్నాని కోర్టు అధికారులు తెలిపారు. వాటిలో 22,161 కేసుల మీద చర్చించారు. మైసూరు, తాలూకా కోర్టులలో గొడవలతో విడాకుల కోసం ఆశ్రయించిన మొత్తం 44 జంటలు రాజీపడి మళ్లీ కలిసిపోయారు. జిల్లా జడ్జి ఉషారాణి, జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
పగ, ద్వేషం వద్దు, రాజీ మేలు
● లోక్ అదాలత్లో కలిసిన జంటలు గౌరిబిదనూరు: కోపం, ద్వేషం పక్కన పెట్టి రాజీ చేసుకుని మీ కాలాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని సీనియర్ జడ్జి గీతా కుంబార్ తెలిపారు. కోర్టు ఆవరణలో బృహత్ లోక్ అదాలత్ను నిర్వహించి మాట్లాడారు. కోప తాపాలను విడనాడి మానవ సంబంధాలకు విలువనిచ్చి కోర్టుల్లో కేసులను రాజీ సంధానాల మూలకంగా పరిష్కరించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా విడాకుల కోసం వచ్చిన 5 జంటలకు రాజీ చేశారు. దాంపత్య జీవితాన్ని కొనసాగించడానికి వారు అంగీకరించారు. 1.25 కోట్ల రూపాయల ఆర్థిక పరమైన కేసులను పరిష్కరించారు. ఇందులో ఎక్కువగా బ్యాంకుల కేసులే ఉన్నాయి. జడ్జిలు గణేశ్, పుష్ప, వకీళ్లు దినేశ్, లింగప్ప, సంధానకర్త రూప, చలువయ్య తదితరులు పాల్గొన్నారు. మళ్లీ ఒక్కటైన జంటలను అందరూ అభినందించారు. విదేశీ యువతి అరెస్టు.. 5 కేజీల డ్రగ్స్ సీజ్ బనశంకరి: బెంగళూరు నగరంలో కొన్ని పబ్లపై సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించి విదేశీ డ్రగ్ పెడ్లర్ను అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి ఎంజీ రోడ్డులోని మిరాజ్ పబ్, కోరమంగలలో సన్బర్గ్ పబ్లలో సోదాలు నిర్వహించారు. విదేశాల నుంచి చదువుకోవడానికి భారత్కు వచ్చిన ప్రిన్సెస్ అనే యువతి డ్రగ్స్ను అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఆమెను అరెస్టు చేసి 5 కేజీల 325 గ్రాముల ఎండీఎంఏ అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈమె బెంగళూరులో మకాం పెట్టి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. కబ్బన్పార్కు పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఉగ్ర నిందితులకు భారీగా సొమ్ములు ● ఎన్ఐఏ తనిఖీలో వెల్లడి దొడ్డబళ్లాపురం: బెంగళూరు సెంట్రల్ జైలులో ఉగ్రవాది నాసిర్, అతని బృందానికి సహాయం చేస్తున్నారని అరెస్టయిన జైలు మానసిక వైద్యుడు నాగరాజ్, ఏఎస్ఐ చాంద్ బాషా, అనుమానిత ఉగ్రవాది జునైద్ అహ్మద్ తల్లి అనీస్ ఫాతిమా బ్యాంకు అకౌంట్లను ఎన్ఐఏ అధికారులు తనిఖీ చేస్తున్నారు. వారికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లింపులు జరిగినట్టు గుర్తించారు. ఆన్లైన్ ద్వారా, నగదుగా, గిఫ్ట్ల రూపంలో స్వీకరించారు. టెర్రరిస్టు నాసిర్ సూచనల మేరకే డబ్బులు తీసుకున్నట్టు తెలిసింది. చాంద్ బాషా తన కొడుకు అకౌంట్కు కూడా డబ్బులు వేయించాడు. నాగరాజు సహాయకురాలు పవిత్ర ఖాతాలోకి రూ.70 లక్షల నగదు బదిలీ జరిగింది. చాంద్బాషా ఇంట్లో హార్డ్ డిస్క్, పెన్డ్రైవ్, డైరీని సీజ్ చేశారు. 2012 నుంచి ఉగ్ర ఖైదీలకు మొబైళ్లు ఇతర వస్తువులు, సౌకర్యాలు కల్పించారని తేలింది. ఆ డబ్బుతో నిందితులు చాలా చోట్ల ఆస్తులు కూడా ఖరీదు చేశారు. పుంజుకోనున్న వర్షాలు యశవంతపుర: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే వారం రోజుల పాటు ముంగారు వానలు పుంజుకొనే అవకాశం ఉన్నట్లు బెంగళూరు వాతావారణశాఖ అధికారులు తెలిపారు. వారం రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. కరావళి, మలెనాడు ప్రాంతాలలో భారీ వానలు పడవచ్చు. ఒళనాడు ప్రాంతాలలో వానలు తగ్గడం వల్ల రైతులు విత్తనాలు వేయడానికి ఆలస్యమైంది. జూన్, జూలైలో పడవలసినంత వానలు రాలేదు. అరేబియా సముద్రంలో ఆవర్తనం వల్ల రాష్ట్రంలో మేఘావృతమైంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని తెలిపారు. 18వ తేదీ వరకు అధిక వానలు పడడానికి ఆస్కారం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో కొత్త లగేజీ చార్జీలు బనశంకరి: ఇకపై కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో పెంపుడు జంతువులు, ఫ్రిడ్జ్, వాషింగ్మెషిన్ వంటి ఉపకరణాలను సైతం తీసుకెళ్లవచ్చు. అయితే నిర్ణీత చార్జీలు చెల్లించాలి. 30 కిలోలకు పైగా లగేజీ ఉంటే లగేజీ చార్జీ తీసుకోవాల్సిందే. శునకాన్ని చైనుతో బస్సులో తీసుకెళ్లవచ్చు, పెద్దవారు 30 కిలోల లోపు, పిల్లలు 15 కిలోల లోపు లగేజీని బస్సుల్లో ఉచితంగా తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. 30 కేజీలు దాటితే నాన్ ఏసీ బస్సుల్లో రూ.5, ఏసీ బస్సుల్లో రూ.10 రుసుము నిర్ణయించారు. 51 నుంచి 55 కేజీల వరకు అయితే రూ.44 – 55 మధ్య రుసుము విధిస్తారు. శునకం కూన, పిల్లి, పంజరంలో ఉన్న పక్షికి పిల్లల టికెట్ను వసూలు చేస్తారు. ఇంకా పలు వస్తువులకు రుసుమును నిర్ధారించారు. -
నేను మీ జోలికి రాను.. నా బిడ్డను ఏమీ చేయవద్దు..!
మైసూరు: పెళ్లయి కోటి ఆశలతో మెట్టినింటికి వెళ్లింది, కానీ రెండు నెలలకే అత్తింట్లో యువ వైద్యురాలు నరకాన్ని చూసింది. ఆమెకు వేధింపులకు గురి చేసి బలవంతంగా గర్భస్రావం చేయించిన భర్త, అత్తమామలతో పాటు ఐదుగురిపై మైసూరులోని సరస్వతీపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. రూ.80 లక్షలతో పెళ్లి వేడుక వివరాలు.. మండ్య జిల్లా కేఆర్ పేటె ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి వైద్యురాలు నవ్య, ఆమె తండ్రి మహాదేవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవ్య భర్త అభిõÙక్, మామ గోవిందరాజు, అత్త లత, జ్ఞానశేఖర్, వైద్యురాలు లత అనేవారిపై కేసు నమోదైంది. నవ్యకు మైసూరులోని బిళికెరె నివాసి, బంగారు వ్యాపారి గోవిందరాజు కుమారుడు అభిõÙక్తో వివాహమైంది. మహాదేవ సుమారు రూ.80 లక్షలు ఖర్చు చేసి కుమార్తెకు ఘనంగా వివాహం చేశారు. నీకు పిల్లలెందుకు అని శుక్రవారం రాత్రి నవ్య మీడియాతో మాట్లాడుతూ వివాహమైన రెండు నెలల్లోనే నన్ను చిత్రవధ చేసిన భర్త, అతని కుటుంబ సభ్యుల నిజస్వరూపం ఏంటో చూశాను. డబ్బు కోసం తీవ్రంగా వేధించారు. తిరుపతికి వెళ్లాలి, సుదూర ప్రయాణం చేయాలంటూ అబద్ధం చెప్పి డబ్బులు తేవాలనేవారు. రూ.5 లక్షల వరకట్నం కూడా తేలేదు, నీకు పిల్లలెందుకు అని అబార్షన్ చేయించారు అని విలపించింది. మంగళసూత్రం, కాళ్ల ఉంగరాలు అన్నింటినీ తీసుకుని తనను నడివీధిలో వదిలేశారన్నారు. పెళ్లికి ముందు వైద్యురాలిగా ఉద్యోగానికి వెళ్లేదాన్నని, పెళ్లైన నాటి నుంచి ఉద్యోగాన్ని మాన్పించారు. ఒక వారం రోజులే తనను బాగా చూసుకున్నారని, తర్వాత రోజుకొక రకంగా హింసించారని రోదించింది. వదిలేయండి అని వేడుకున్నా.. బలవంతపు అబార్షన్కు ఓ ఆస్పత్రి వైద్యులు జ్ఞానశేఖర్, లత సహకరించారని ఆరోపించారు. మీరు వేరే పెళ్లి చేసుకోండి, నేను మీ జోలికి రాను, విడాకులు ఇస్తాను, కడుపులోని నా బిడ్డకు ఏమీ చేయవద్దని భర్తను వేడుకున్నా వినలేదు. నా ప్రైవేట్ వీడియో అడ్డు పెట్టుకుని బలవంతం చేశారు, నాకు న్యాయం కావాలని, తన భర్త కుటుంబాన్ని శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేశారు. -
ఫొటో తీస్తానని.. నదిలోకి నెట్టేసి..
కృష్ణా: కొత్తగా పెళ్లయిన జంట.. బైక్పై వెళ్తూ మాంచి లొకేషన్ కనిపిస్తే ఫొటోలు తీసుకోవాలని ముచ్చటపడ్డారు. వారు వెళ్తున్న దారిలో కృష్ణానదిపై గుర్జాపూర్ బ్రిడ్జి వచి్చంది. అదే మంచి స్పాట్ అనుకొని ఫొటోలు దిగటానికి సిద్ధమయ్యారు. భర్త తన భార్యకు ఫోన్ ఇచ్చి.. తనను ఫొటోలు తీయాలని కోరి వెళ్లి బ్రిడ్జి అంచున నిలబడ్డాడు. భార్య కూడా ఫొటోలు తీస్తూనే భర్త వద్దకు వెళ్లి ఒక్కసారిగా అతన్ని నదిలోకి తోసేసింది. బిక్కచచ్చిపోయారు భర్త నీళ్లలో పడి కొట్టుకుపోతూ.. నదిలో ఓ రాయిని పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. అతడి కేకలు విని జాలర్లు రక్షించి పైకి తీసుకొచ్చారు. అయితే, భార్యే తనను నదిలోకి తోసిందని భర్త చెబుతుండగా, లేదులేదు.. అతడే నదిలో పడిపోయాడని భార్య వాదిస్తోంది. ఏం చేయాలో తెలియని పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ ఘటన శనివారం తెలంగాణ– కర్ణాటక సరిహద్దులో నారాయణపేట జిల్లాలో ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. ప్రమాదమా? హత్యాయత్నమా? కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న శక్తినగర్కు చెందిన తాతప్ప (23)కు యాద్గిర్ జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టెమ్మ (20)తో మూడు నెలల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం ఇద్దరు బైక్పై వడిగేరికి వెళ్లి శనివారం ఉదయం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై ఫొటోలు దిగాలని భావించారు. భర్త తన ఫోన్ను భార్య చేతికి ఇచ్చి ఫొటో తీయమని చెప్పి ఆయన బ్రిడ్జి చివరన నిలబడ్డాడు. గెట్టెమ్మ ఫొటో తీస్తున్నట్లు నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది. తర్వాత భర్త తల్లికి ఫోన్ చేసి తాతప్ప నదిలో పడిపోయాడని చెప్పింది. నదిలో పడిన తాతప్ప బ్రిడ్జి పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరి ‘నన్ను రక్షించండి.. నా భార్య పారిపోకుండా పట్టుకోండి’అంటూ కేకలు వేశాడు. దీంతో సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు గమనించి తాతప్పను తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. పైకి వచి్చన తాతప్ప.. భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆగ్రహం వ్యక్తంచేయగా.. భార్య మాత్రం తాను తోయలేదని, ఆయనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని వాదించింది. ఈ విషయమై శక్తినగర్ రూరల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ బస్వరాజ్ను వివరణ కోరగా ఘటన జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. భార్యాభర్తల మధ్య పంచాయితీ ఉందని, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆదివారం ఫిర్యాదు ఇస్తామని చెప్పారని వివరించారు. -
కారుపై కూలిన చెట్టు
కృష్ణరాజపురం: చలిస్తున్న కారుపై భారీ వృక్షం పడింది. అదృష్టవశాత్తు డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. వివరాలు.. శుక్రవారం సాయంత్రం బెంగళూరు శేషాద్రిపురం లా కాలేజీ వద్ద ఉన్న పెద్ద చెట్టు హఠాత్తుగా కూలిపోయింది. రోడ్డు మీద వెళ్తున్న కారు మీద పడిపోయింది. కారులో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు, డ్రైవర్ కూడా సురక్షితంగా తప్పించుకున్నాడు. అలాగే చెట్టు కొమ్మలు తగిలి 3 విద్యుత్ స్తంభాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో గంటలకొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి.20న బోనాల జాతర బొమ్మనహళ్లి: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల వేడుకలు బెంగళూరు నగరంలో జూలై 20వ తేదీన జరగనున్నాయి. తెలంగాణవాసులతో పాటు తెలుగు ప్రజలు అందరూ పాల్గొనాలని కర్ణాటక తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సంస్థ సభ్యులు తెలిపారు. బెంగళూరు కళ్యాణ నగరలో ఉన్న ఓంశక్తి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు జరుగుతాయని చెప్పారు. పసికందును అమ్మేసిన తండ్రి ● అప్పులు తీర్చడానికి అకృత్యం యశవంతపుర: మైక్రో ఫైనాన్స్లో సహా పలు చోట్ల చేసిన అప్పులు తీర్చడానికి ఓ తండ్రి 20 రోజుల బిడ్డను అమ్మిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా దాండేలి తాలూకా దేశపాండే నగరలో జరిగింది. శిశువును రూ. 3 లక్షలకు అమ్మారు. వివరాలు.. జూన్ 17న వసీం చందు పటేల్ భార్య మోహీన్ దాండేలి ప్రభుత్వ ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. వసీం అనేక చోట్ల అప్పులు చేశాడు. తీర్చాలని ఒత్తిడి అధికమైంది. అప్పులు తీర్చే శక్తి లేని వసీంకు కిరాతకమైన ఆలోచన వచ్చింది. భార్యకు తెలియకుండా శిశువును అమ్మకానికి పెట్టాడు. బెళగావి జిల్లా అనగోళకు చెందిన నూరు మహమ్మద్ అబ్దుల్ మజీద్ (47), కిశన్ ఐరేకర్ (42) అనేవారు శిశువును కొనుగోలు చేశారు. కొడుకు కనిపించకపోవడంతో తల్లికి అనుమానం వచ్చి అంగనవాడి కార్యకర్తకు చెప్పగా, ఆమె దాండేలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో శిశువును తండ్రే అమ్మినట్లు తేలింది. కొనుగోలుచేసిన వారి కోసం గాలిస్తున్నారు. భార్య ముక్కును కొరికేశాడు దొడ్డబళ్లాపురం: అప్పు కంతు కట్టలేదనే కోపంతో భర్త, భార్య ముక్కును కొరికేసిన వింత సంఘటన దావణగెరెలో వద్ద జరిగింది. జిల్లాలో చన్నగిరి తాలూకా మంటరగట్టలో విజయ్, భార్య విద్య జీవిస్తున్నారు. వీరు ధర్మస్థలం స్వసహాయ సంఘంలో రూ.2 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే విద్య సరిగా కంతులు కట్టడం లేదని భర్త గొడవపడ్డారు. కోపం పట్టలేక ఆమె ముక్కును కొరికివేశాడు. దీంతో ముక్కు కొంతభాగం తెగిపోయింది. ఇరుగుపొరుగు విద్యను ఆస్పత్రికి తరలించారు, ఆమె చికిత్స పొందుతోంది. చన్నగిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
రిఫైనరీలో గ్యాస్ లీక్
● ఇద్దరు ఉద్యోగులు మృతి యశవంతపుర: మంగళూరు రిఫైనరీ, పెట్రో కెమికల్స్ సంస్థ (ఎంఆర్పీఎల్)లో గ్యాస్ పంపిణీ ప్రాంతంలో ట్యాంక్ నుంచి హానికర గ్యాస్ లీక్ కావటంతో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందగా, మరో కార్మికుడు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సీనియర్ ఆపరేటర్లు యూపీవాసి దీప చంద్ర (33), కేరళవాసి బిజిల్ ప్రసాద్ (33) మృతులు. సాధారణ తనిఖీల కోసం ట్యాంక్ ప్లాట్ఫారం ఎక్కారు. లీకైన వాయువులను పీల్చడంతో ఇద్దరు ట్యాంక్పైనే సృహతప్పి పడిపోయారు. వారిని రక్షించడానికి యత్నించిన మూడో ఆపరేటర్ వినాయక్ మైగేరి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అందరినీ ఆస్పత్రికి తరలించగా పై ఇద్దరూ చనిపోయారు. సంస్థ ఉన్నతాధికారులు ఘటనాస్థలిని పరిశీలించి, ఆస్పత్రికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి విచారణ చేయిస్తున్నట్లు తెలిపారు. హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు లీక్ కారణంగా ప్రమాదం జరిగినట్లు నగర పోలీసు కమిషనర్ సుధీర్కుమార్ రెడ్డి తెలిపారు.వైద్యం చేయించలేక కూతురి హత్య ● తండ్రికి జీవితఖైదు యశవంతపుర: 11 ఏళ్ల కూతురికి పురుగుల మందు తాగించి హత్య చేసిన తండ్రికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.17 వేల జరిమానా విధించింది. వివరాలు.. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర తాలూకా హెమ్మాడి గ్రామానికి చెందిన నాగరాజ పూజారి ఆర్థిక సమస్యలతో భార్య, పిల్లలపై దైహికంగా, మానసికంగా వేధించేవాడు. గుండె జబ్బుతో బాధపడుతున్న కుమార్తె నయన (11)కు వైద్యానికి చాలా ఖర్చవుతోందని నిత్యం గొడవపడేవాడు. ఇది తట్టుకోలే భార్య భర్తను, కూతుర్ని వదిలేసి పుట్టింటికి వెళ్లింది. 2019 జనవరి 9న తాగిన మత్తులో నాగరాజు.. నయనకు పురుగుల మందు తాగించి హత్య చేశాడు. యల్లాపుర పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. విచారించిన జిల్లా కోర్టు జడ్జి ఈ మేరకు తీర్పు వెలువరించారు. తప్పుడు ఆరోపణలతో ఈడీ సోదాలు ● ఎమ్మెల్యే సుబ్బారెడ్డి భాగ్యనగరం (బాగేపల్లి): విదేశాల్లో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టినా ఆ మొత్తం ఆస్తులను అఫిడివిట్ ద్వారా ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధమని బాగేపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్.ఎన్.సుబ్బారెడ్డి అన్నారు. తన నివాసాల్లో ఈడీ సోదాల తరువాత శనివారం బాగేపల్లికి వచ్చి సన్నిహితులతో సమావేశమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాపై ఓడిపోయిన అభ్యర్థి నకిలీ ఆరోపణలతో కేసులు పెట్టి, ఈడీకి ఫిర్యాదు చేశారన్నారు. దాడుల్లో ఈడీ అధికారులు కోరిన సమాచారం అంతా ఇచ్చానన్నారు. నేను విదేశాల్లో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టినా మొత్తం ఆస్తులకు ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధమని ఈడీకి చెప్పానన్నారు. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాల్సిన అవసం నాకు లేదు. సంవత్సరానికి రూ. 130 కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారనేత్తని, నా పిల్లలు లగ్జరీ కార్లు కలిగి ఉండడం తప్పా అని ప్రశ్నించారు. ఠాణాలో హల్చల్.. కటకటాలపాలు యశవంతపుర: వంచన కేసులో అరెస్టయిన మహిళకు మద్దతుగా వచ్చిన ఓ వ్యక్తి ఠాణాలో హల్చల్చేసి కటకటాల పాలయ్యాడు. బెంగళూరు బసవేశ్వరనగర ఠాణాలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. సవిత అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె పలువురి నుంచి డబ్బు వసూలు చేసినట్లు కేసులున్నాయి. సవిత వద్దనున్న ఇంటి తాళం కోసం నిందితుడు యోగానంద (52) వచ్చాడు. ఇంటి తాళం ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. దీంతో యోగానంద రెచ్చిపోయాడు, తాను న్యాయవాదినని, ప్రొఫెసర్నని, చాలామంది రాజకీయ నాయకులు తెలుసు, మీ సంగతి తేలుస్తానని అరుస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేశారు. -
ఇంటికి వస్తూ.. తిరిగిరాని లోకాలకు
బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వద్ద ఘోరం జరిగింది. బెంగళూరు నుంచి బుల్లెట్ బైక్లో ఇంటికి వస్తున్న టెక్కీ.. కొంతసేపట్లో ఇంటికి చేరుకోనుండగా కిందపడి దుర్మరణం చెందాడు. కొడుకు మంచి ఉద్యోగం సంపాదించాడని తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు, అయితే విధి చిన్నచూపు చూసి శోకం మిగిల్చింది. వివరాలు.. తాడిపత్రి పట్టణంలో కడవ చలపతి, జయమ్మ దంపతులు ఉంటున్నారు. చలపతి ఓ గ్రానైట్ షాపులో గుమాస్తా పని చేసేవాడు. వీరికి ఒక కుమారుడు బాలాజీ (26), కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేశారు. కుమారుడు బాలాజీ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. గత 3 ఏళ్లుగా చైన్నెలో కాగ్నిజెంట్లో పనిచేస్తూ ఏడాది నుంచి బెంగళూరులో టెక్ మహీంద్రలో ఉద్యోగంలోకి మారాడు. ఏడాదికి రూ. 14 లక్షల వేతనం వచ్చేది. వర్క్ ఫ్రం హోం అని.. 15 రోజులు ఆఫీసులో, 15 రోజులు వర్క్ ఫ్రం హోం కింద విధులు నిర్వహించాలి, వర్క్ ఫ్రం హోం రావడంతో శనివారం తెల్లవారు జామున బెంగళూరు నుంచి బుల్లెట్ ద్విచక్ర వాహనంలో ఇంటికి బయల్దేరాడు. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో అనంతపురం – తాడిపత్రి హైవేలో అదుపుతప్పి కింద పడ్డాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. తలకు హెల్మెట్ ఉన్నా ప్రాణాలు కాపాడలేక పోయింది. పెళ్లి చేద్దామనుకుంటిమే స్థానికులు చూసి జేబులో ఉన్న వివరాల ప్రకారం తండ్రి చలపతికి కాల్చేసి చెప్పగా పరుగున వచ్చారు. విగతజీవిగా పడి ఉన్న కుమారున్ని చూసి బోరుమని విలపించాడు. కుమారునికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, ఇంకా కొన్ని రోజులు ఆగండి నాన్నా, మంచి జీతం వస్తుంది, అప్పుడు చేసుకుంటానని చెప్పిన మాటలు తలుచుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు. వర్క్ ఫ్రం హోం ఉందని చెప్పి ఇంటికి వస్తూ.. తిరిగిరాని లోకాలకు వెల్లిపోయావా అంటూ కుమారున్ని పట్టుకుని రోదించడం చూసి అందరూ కంటతడి పెట్టారు. బైక్ ప్రమాదంలో టెక్కీ దుర్మరణం బెంగళూరు నుంచి తాడిపత్రికి వెళ్తుండగా ఘటన -
గుహలో తన ఇద్దరు పిల్లలతో రష్యన్ మహిళ నివాసం.. ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే?
గత రెండు వారాలుగా ఓ రష్యన్ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్రమాదకరమైన గుహలో నివసిస్తున్న ఘటన కర్ణాటకలో సంచలనం రేపింది. ఉత్తర కన్నడ జిల్లా కుమ్టా తాలూకాలోని రామతీర్థ కొండల్లోని మారుమూల గుహ నుంచి నినా కుటినా అలియాస్ మోహి (40), ఆమె ఇద్దరు పిల్లలను పోలీసులు రక్షించారు. ఈ నెల 9న సాయంత్రం 5 గంటల సమయంలో గోకర్ణ పోలీసులు పర్యాటకుల భద్రత కోసం గోకర్ణ అడవి ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా.. గుహ వద్ద వారి కదలికలు కనిపించాయి. ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి గుహలో నివసిస్తున్నట్లు కనుగొన్న పోలీసులు.. వారిని కాపాడారు.కొన్నేళ్ల క్రితం బిజినెస్ వీసాపై భారత్కు వచ్చిన మోహి.. గోవా నుంచి ఆధ్యాత్మిక తీర ప్రాంతమైన గోకర్ణకు చేరుకుంది. ఆమె వీసా గడువు కూడా ముగిసింది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ఆకర్షితురాలైన ఆమె తన ఇద్దరు పిల్లలు ప్రయా (6), అమా (4)లతో కలిసి రెండు వారాల క్రితం గోకర్ణలోని దట్టమైన అటవీప్రాంతంలోకి వెళ్లింది. అక్కడ ఒక గుహలో తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసించడం ప్రారంభించింది.ఆ గుహను ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేసిన ఆ మహిళ.. రుద్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు పూజలు నిర్వహించేంది. నిత్యం ధ్యానం చేస్తూ రోజులు గడిపింది. అయితే ఆ మహిళ, ఆమె పిల్లలు అడవిలో ఉన్న సమయంలో ఆహారాన్ని ఎలా సంపాదించారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2024 జూలైలో గుహ ఉన్న రామతీర్థ కొండ ప్రాంతం నుంచి పెద్ద పెద్ద కొండచరియలు విరిగిపపడ్డాయి. విష పూరిత పాములు సహా ప్రమాదకరమైన వన్య ప్రాణులకు నిలయమైన ఆ ప్రాంతం. చాలా ప్రమాదకరమైన ప్రదేశంగా పోలీసులు తెలిపారు. ఆ రష్యన్ మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసుల బృందం.. కొండ కిందకు తీసుకెళ్లింది. ఆమె అభ్యర్థన మేరకు కుంటా తాలూకాలోని బంకికోడ్ల గ్రామంలో 80 ఏళ్ల మహిళా సన్యాసిని యోగరత్న సరస్వతి నిర్వహిస్తున్న ఆశ్రమానికి తరలించారు. మోహి వీసా గడువు 2017లోనే ముగిసిందని అధికారులు తెలిపారు. ఆమె భారత్లో ఎంత కాలం నుంచి ఉంటుందో తెలుసుకునే పనిలో అధికారులు పడ్డారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సాయంతో రష్యా రాయబార కార్యాలయాన్ని అధికారులు సంప్రదించారు. -
సెల్పీ దిగుదాం రా బావా..!
భార్యభర్తల బంధాలకు ఈ మధ్యకాలంలో అనూహ్య ముగింపు లభిస్తోంది. వివాహేతర సంబంధాలతోనో, పాత పరిచయాల కోసమే ఒకరినొకరు కడతేర్చుతున్న ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సెల్ఫీ కోసం ఓ బ్రిడ్జి మీద ఆగిన కొత్తజంట.. వీడియోతో నెట్టింట రచ్చ చేస్తోంది. తన బావ(భర్త) ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడని ఆ నవవధువు, లేదు తన భార్యే తనను తోసేసి చంపాలని చూసిందని ఆ భర్త హల్ చల్ చేశారు. కర్ణాటక రాయ్చూర్లో తాజాగా జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..కాడ్లూరు సమీపంలో కృష్ణా నది వంతెన మీదుగా బైక్ మీద వెళ్తున్న ఓ జంట ఆగింది. కాసేపటికే ఆ వ్యక్తి చేతులు ఊపుతూ సాయం కోసం అరవసాగాడు. ఈలోపు వంతెన మీద ఉన్న అతని భార్య దారినపోయే వాళ్లను రక్షించమని సాయం కోరుతూ కనిపించింది. ఇది గమనించిన మత్స్యకారులు కొందరు తాడు సాయంతో ఆ వ్యక్తిని వంతెన పైకి తీసుకొచ్చారు. తమకు ఈ మధ్యే వివాహం అయ్యిందని, సెల్ఫీ దిగుదామని తన భార్య కోరిందని.. ఆ సమయంలో ఆమె తనను నీళ్లలోకి తోసేసిందని, ఎలాగోలా వచ్చిన కాస్త ఈతతో ఈదుకుంటూ బండరాళ్ల మీదకు చేరానని, తనను చంపేందుకు కుట్ర పన్నిందని సదరు వ్యక్తి వాపోయాడు. అయితే కాలు జారి తన భర్త నదిలో పడిపోయాడని, తనకు ఎలాంటి పాపం తెలియదని ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. దీంతో అక్కడ ఉన్నవాళ్లు ఆ జంటను స్థానికంగా ఉన్న పీఎస్కు తీసుకెళ్లగా.. వాళ్లు పెద్దల సమక్షంలో ఆ జంటకు కౌన్సెలింగ్ ఇప్పించి పంపించినట్లు తెలుస్తోంది.A newlywed man in #Raichur was allegedly pushed into the River by his wife during a photoshoot near Gurjapur Bridge.He clung to rocks & was rescued by fishermen.The wife claimed it was accidental but husband accused her of a deliberate act.Police are investigating the viral video pic.twitter.com/4Da9x8ShXx— Yasir Mushtaq (@path2shah) July 12, 2025 -
యువకుడి దారుణ హత్య
శివమొగ్గ : వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన శివమొగ్గ నగర శివారులోని బొమ్మనకట్టే లేఔట్లోని ఇ బ్లాక్లోని ఒక ఇంటి ఆవరణలో జరిగింది. హతుడిని బొమ్మనకట్టే ప్రాంతానికి చెందిన పవన్(28)గా గుర్తించారు. అతను టైల్స్ అచ్చువేసే పని చేసేవాడు. గురువారం రాత్రి పవన్.. శివకుమార్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. ఇద్దరు అక్కడే మద్యం సేవించి భోజనం చేశారు. ఏదో విషయంపై వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్తో పవన్పై దాడి చేశారు. తీవ్ర గాయపడిన పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ సంతోష్కుమార్, సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వినోభానగర్ పోలీసులు పవన్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి శివకుమార్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. -
గజలక్ష్మీదేవిగా చాముండేశ్వరి
మైసూరు : మూడవ ఆషాఢ శుక్రవారం సందర్భంగా మైసూరు నగరంలోని చాముండికొండ భక్తజనసంద్రమైంది. ఉదయం 7 గంటల నుంచి చల్లటి చిరు జల్లుల వర్షం పడుతున్నా ఏమాత్రం వెనుకంజ వేయకుండా వేలాది మంది భక్తులు క్యూలో నిలబడి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకొని పునీతులు అయ్యారు. కర్ణాటకతోపాటు చట్టు పక్కల రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. చిత ప్రవేశంతో పాటు రూ.300, రూ.2000 టికెట్ కొనుగొలు చేసి క్యూలో వెళ్లి ఆమ్మవారిని దర్శించుకున్నారు. అనేక మంది మహిళలు, యువతులు,1001 మెట్లకు పసుపు కుంకుమ పెడుతూ మెట్లు ఎక్కుతు పైకి రావడం కనిపించింది. ప్రత్యేక పూజలు... నాడ శక్తి దేవత శుక్రవారం గజలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారు జాము నుంచే ప్రధాన అర్చకులు శశిశేఖర్ దీక్షిత్ ఆధ్వర్యంలో అమ్మవారికి రుద్రాభిషేకం, పంచామృ అభిషేకం, కుంకుమార్చన, ఏకాదశ పుష్పార్చన, సహస్ర నామార్చన నిర్వహించారు. తెలుపు రంగు, నేరేడు రంగు చీర ధరించి ప్రత్యేకమైన గజలక్ష్మీదేవి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయం మొత్తం వివిధ రకాల రంగు రంగుల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు మాజీ సీఎం బీ.ఎస్.యడియూరప్ప, రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్, మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్, ఎంపీ బీ.వై.రాఘవేంద్ర, గ్యారెంటీ పథకాల అమలు సమతి ఆధ్యక్షుడు హెచ్ఎం.రేవణ్ణ, ఎమ్మెల్యే ఏ.మంజు, కొత్తూరు మంజునాథ్, బాలకృష్ణ, ఎమ్మెల్సీ శరవణ, నటుడు వశిష్ట సింహ, నటి కారుణ్య, కలెక్టర్ లక్ష్మీకాంత్రెడ్డి, నగర పోలీసు కమిషనర్ సిమా లాట్కర్తో పాటు అనేక మంది ప్రముఖులు హాజరై అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. కొండకు పోటెత్తిన భక్తజనం -
శారీరక దృఢత్వం.. అదే ఆరోగ్య సూత్రం
హుబ్లీ: పోలీస్ శాఖకు స్థూలకాయం తలనొప్పి తెప్పిస్తోంది. కొందరు పోలీస్ సిబ్బంది ఇంతింత పొట్టలతో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీంతో వారి పొట్టలను కరిగించేందుకు హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషరేట్ దేహదండన శిబిరాలను ఏర్పాటు చేయడం ద్వారా బొజ్జదేహాలు ఉన్న సిబ్బందికి వాటిని కరిగించే ప్రక్రియ మొదలైంది. విధుల్లో ఉన్న పోలీసులు ఫిట్ అండ్ ఫైన్(శారీరకంగా దృఢంగా)గా కనిపించడానికి జంట నగరాల్లో డ్యూటీలో ఉన్న 98 పోలీస్ సిబ్బందిని స్థూలకాయలుగా గుర్తించారు. బాడీ మాథ్ ఇండెక్స్(బీఎంఐ) పరీక్ష ద్వారా అలాంటి వారిని గుర్తించి మూడు నెలల లోపల స్థూలకాయం తగ్గించాలని కట్టుదిట్టమైన సూచనలు చేశారు. గోకుల్ రోడ్డు కొత్త సీఏఆర్ మైదానంలో శాఖ సిబ్బందికి ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు శారీరక వ్యాయామాలు చేయించి దేహం తూకం తగ్గించుకోవడానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సూచన మేరకు జంట నగరాలలో 19 పోలీస్ స్టేషన్ల సిబ్బంది, అధికారులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. తొలి దశలో 65 మందికి.. బీఎంఐ పరీక్షల్లో 30 కన్నా ఎక్కువ మార్కులు ఉన్న స్థూలకాయం, ఎక్కువ తూకం ఉన్న 25 మంది ఏఎస్ఐలు, 74 మంది హెడ్ కానిస్టేబుళ్లను గుర్తించారు. తొలి దశలో 65 మంది సిబ్బంది శిబిరంలో పాల్గొన్నారు. యోగా, పరుగు, నడక, ఇతర వ్యాయామాల ద్వారా తూకం తగ్గించుకోవడానికి శారీరక కసరత్తులు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు శిబిరం ప్రారంభం అవుతుంది. 50 ఏళ్లకు మించిన వారు 5 కిలోమీటర్ల దూరం నడవాలి. అంత కన్న తక్కువ వయస్సు గల వారు 5 కిలోమీటర్ల దూరం పరుగెత్తాలి. 8 గంటలకు ఫలాహారం, మధ్యాహ్నం 1 గంటకు ఆరోగ్యం గురించి నిపుణులైన వైద్యులు క్లాసులు, తిరిగి సాయంత్రం 3.30 నుంచి పరుగు, నడక ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు యోగా నేర్పిస్తారు. ఓ నెల పాటు జరిగే శిబిరం ఇది. బియ్యంతో చేసిన అన్నం మినహాయించి కొర్రబియ్యం, ఎర్రబియ్యం, జొన్నలతో చేసిన భోజనం వడ్డిస్తారు. జొన్నలు, రాగుల రొట్టె, అలాగే మజ్జిగ, సాంబార్ ఇస్తారు. పోలీస్ శాఖలో దృఢకాయం తప్పనిసరి ఈ విషయమై పోలీస్ కమిషన్ శశికుమార్ మాట్లాడుతూ శిబిరంలో 65 మంది సిబ్బంది పాల్గొనగా వీరిలో కొందరు 4 నుంచి 11 కేజీల వరకు తూకాన్ని తగ్గించుకున్నారన్నారు. సిబ్బంది సానుకూల దృక్పథంతో స్పందిస్తున్నారు. తమ శాఖలో చేరాలంటే దృఢకాయం తప్పనిసరి. అయితే వివిధ కారణాల వల్ల శారీరక తూకం పెరుగుతోంది. అలాంటి స్థూలకాయ దేహం కలిగిన వారికి గుర్తించి శిబిరానికి పంపిస్తున్నాం. పోలీస్ శాఖలో ఫిట్నెస్ చాలా ముఖ్యమన్నారు. బహిరంగ స్థలాల్లో, నిందితులను పట్టుకోవడంలో ఫిట్నెస్ ఉపయోగపడుతుంది. తొలిదశలో 90 కేజీలపై ఉన్న పురుషులు, 70 కేజీల పైన ఉన్న మహిళా సిబ్బందిని గుర్తించి ప్రభుత్వ ఆదేశం మేరకు శిబిరానికి పంపించాం. ప్రతి రోజూ యోగా, ఏరోబిక్, క్రికెట్, నడక, లాఠీ డ్రిల్, వెపన్ డ్రిల్, జిమ్లో కసరత్తులు చేయిస్తున్నాం. పథ్యం తప్పనిసరిగా పాటించాలి. మరో బ్యాచ్కు సరిపడేంత సిబ్బంది ఉన్నారు. వారికి కూడా శిబిరానికి పంపుతాం. దీంతో వ్యక్తిగతంగా తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్థూలకాయ దేహదండన ప్రారంభం ఇకపై పోలీసులు చెమటోడ్చక తప్పదు -
తుంగభద్ర హెచ్ఎల్సీకి నీరు విడుదల
హొసపేటె: తుంగభద్ర జలాశయం నుంచి కుడి ఎగువ కాలువ(హెచ్ఎల్సీ)కు తుంగభద్ర మండలి అధికారులు గురువారం నీటిని విడుదల చేశారు. కాల్వకు నీటిని విడుదల చేసే ముందు మండలి కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎస్ఈ నారాయణ నాయక్ క్రస్ట్గేట్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం క్రస్ట్గేట్లను స్విచాన్ చేసి పైకెత్తి తొలుత 100 క్యూసెక్కుల మేర నీటిని కాలువకు వదిలారు. అనంతరం నీటి సామర్థ్యాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ కోటా కింద 500 క్యూసెక్కుల వరకు నీటిని వదులుతామన్నారు. జెస్కాం అధికారిపై దాడి.. వ్యక్తి అరెస్ట్ రాయచూరు రూరల్: జిల్లాలో జెస్కాం అధికారిపై దాడి చేసిన వ్యక్తిని దేవదుర్గ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి అప్పగించారు. దేవదుర్గ తాలూకా మసరకల్ జెస్కాం ఇంజినీర్ మిథున్పై కరడిగుడ్డ రాజకుమార్ దాడి చేశారు. అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని పట్టుకున్నారు. కరడిగుడ్డలో ఇంటికి దొంగతనంగా విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. మరో వైపు జీపీ అధ్యక్షురాలి బంధువు అంటూ అన్ని పనుల్లో జోక్యం చేసుకోవడాన్ని ఇంజినీర్ తప్పుబట్టారు. దీంతో తనపై దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు. నిధుల సద్వినియోగానికి సూచన రాయచూరు రూరల్: జిల్లాలో అధికారులు ఎస్సీపీ, టీఎస్పీ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లాధికారి నితీష్ ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ జనాభాకు తగ్గట్లుగా లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను అందేలా చూడాలన్నారు. క్రీడా శాఖ నుంచి అథ్లెటిక్ పోటీలను ఏర్పాటు చేయాలన్నారు. యువకులు మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉండాలన్నారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, అధికారులు నవీన్ కుమార్, వీరేష్ నాయక్, చంద్రకళ, శ్రీదేవి, రాజేంద్ర, రవిలున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరిట రూ.6.15 లక్షల వంచన హుబ్లీ: వాట్సాప్లో వీడియో కాల్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించి ఆ సదరు వ్యక్తి రూ.6.15 లక్షలు వంచించారు. పింటో బాధితుడు. క్రైం బ్రాంచ్ ముంబై నుంచి మాట్లాడుతున్నామని చెప్పి మీ పైన మనీ ల్యాడరింగ్ కేసులు ఉన్నాయని చెప్పి భయ పెట్టి బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకొని ఆ నగదును ఆన్లైన్ కేటుగాళ్లు బదలాయించుకున్నట్లు బాధితుడు పింటో స్రైబర్ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ఘటనలో ఆధార్ కార్డును అప్డేట్ చేయాలని నమ్మించి ఓ వ్యక్తికి ఆన్లైన్ కేటుగాళ్లు యాప్ డౌన్లోడ్ చేయించి రూ.4.83 లక్షలను వంచించారు. ప్రసన్న అనే వ్యక్తి బాధితుడు. ప్రసన్నకు ఫోన్ చేసి బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డు అప్ డేట్ చేయించక పోతే మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని ఆన్లైన్ కేటుగాళ్లు ఫోన్లో బెదిరించారు. ఆ మేరకు ఖాతా వివరాలు తెలుసుకొని సొమ్మును కేటుగాళ్లు తమ ఖాతాలోకి బదలాయించుకున్నారని బాధితుడు విద్యానగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ఘటనలో విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదైంది. సదరు విద్యార్థినికి అసభ్యంగా సైగలు చేసిన ఆరోపణలపై ఓ యువకుడిపై విద్యానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువకుడిని సాయినాథ్గా గుర్తించారు. కేఎంసీ ఆస్పత్రి వెనుక ప్రాంతంలో విద్యార్థిని వెళుతుండగా నిందితుడు అసభ్యంగా సైగలు చేసి వేధించినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆంగ్ల బడుల మంజూరు తగదు రాయచూరు రూరల్: ప్రభుత్వ కన్నడ పాఠశాలల్లో ఆంగ్ల భాషను బోధించేందుకు ఆంగ్ల భాష పాఠశాలలను మంజూరు తగదని కన్నడ మిత్ర కూట పేర్కొంది. శుక్రవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బషీర్ హొసమని మాట్లాడారు. రాష్ట్రంలో 4143 ఆంగ్ల మాధ్యమ భాష పాఠశాలకు అనుమతివ్వడాన్ని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం కన్నడ భాష పాఠశాలలకు ప్రాధాన్యత కల్పించకుండా ఆంగ్ల భాషా పాఠశాలలకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
హాస్టల్ నిర్మాణ పనులకు భూమిపూజ
హొసపేటె: కూడ్లిగి తాలూకాలోని కానాహొసహళ్లిలో రూ.5 కోట్ల వ్యయంతో పోస్ట్మెట్రిక్ బాలికల హాస్టల్ నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ ఎన్టీ శ్రీనివాస్ భూమిపూజ చేశారు. నియోజకవర్గంలోని కానాహొసహళ్లిలో రూ.5 కోట్ల వ్యయంతో కొత్త దేవరాజ అరసు పోస్ట్ మెట్రిక్ బాలికల హాస్టల్ నిర్మాణానికి భూమిపూజ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. కూడ్లిగి నియోజకవర్గంలోని 14 హాస్టళ్లలో కానాహొసహళ్లి విద్యాభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. కేకేఆర్డీబీ నిధుల మంజూరుతో ప్రీమెట్రిక్ బాలికల హాస్టల్ పనులను ప్రారంభించడం హర్షణీయమన్నారు. కొత్త మొరార్జీ పాఠశాల ఏర్పాటుకు కార్మిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందుకోసం శివపుర సమీపంలో 9 ఎకరాల భూమిని గుర్తించారన్నారు. కూడ్లిగి టీపీ ఈఓ నరసప్ప, బీసీఎం జిల్లా అధికారి శశికళ, ఉపాధ్యక్షుడు లక్ష్మీ రజనీకాంత్, జుట్టలింగనహట్టి బొమ్మన్న, ఏపీఎంసీ అధ్యక్షుడు కురిహట్టి బోసయ్య, బళెగార జగదీష్, కేజీ కుమార్ గౌడ, హులికెరె మారెప్ప, సూర్యప్రకాష్, జి.ఓబన్న, హొన్నూరస్వామి, దర్నీరు రంగన్న, మాజీ ఉపాధ్యక్షుడు హెచ్ దురుగేశ పాల్గొన్నారు. -
మౌలిక సౌకర్యాల కోసం ఆందోళన
బళ్లారిఅర్బన్: కోళూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో మరుగుదొడ్లు, తాగునీరు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు, విద్యార్థులు ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో ఆ జీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ సంస్థ జిల్లాధ్యక్షుడు కే.ఈరణ్ణ మాట్లాడుతూ కోళూరు ప్రభుత్వ పాఠశాలలో 5 నుంచి 8వ తరగతి వరకు 200 మందికి పైగా పేద రైతుల పిల్లలైన విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలకు ప్రభుత్వ స్థలంలో సొంత భవనం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరుగుదొడ్లు లేనందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఆ పాఠశాల పక్కన ఉన్న స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించాలి. భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు తాత్కాలికంగా రక్షిత తాగునీరు, మరుగుదొడ్ల వ్యవస్థ కల్పించాలని సీఆర్పీ అధికారులకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. దీనిపై సీఆర్పీ అధికారులు స్పందిస్తూ మూడు నెలల్లో పాఠశాలకు సొంత భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పీడీఓ కూడా తాగునీటి వసతితో పాటు 15 రోజుల్లో మరుగుదొడ్లకు మరమ్మతులు చేయిస్తామని భరోసా ఇచ్చారు. సంస్థ వైస్ చైర్ పర్సన్ ఎం.శాంతి, జిల్లా కార్యదర్శి కంబళ్లి మంజునాథ్, గ్రామ ప్రముఖులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పనికి తగ్గ వేతనం అందించాలి
సాక్షి,బళ్లారి: నగర స్వచ్ఛతకు పాలికె సిబ్బంది చేస్తున్న కృషి శ్లాఘనీయం అని,అలాంటి వారికి పనికి తగ్గవేతనం అందించాలని మాజీ మంత్రి శ్రీరాములు డిమాండ్ చేశారు. బళ్లారి మహానగర పాలికె ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ధర్నా, ఆందోళన కార్యక్రమంలో ఆయన శుక్రవారం పాల్గొని వారికి మద్దతుగా నిలిచారు. సమావేశంలో గంటకు పైగా ధర్నాలో పాల్గొని పాలికె సిబ్బంది సమస్యలు,వాటి పరిష్కారం కోసం సుదీర్ఘంగా చర్చించారు. పాలికె సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సంబంధిత మంత్రి, చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. తక్కువ జీతాలతో వెట్టి చాకిరీ చేస్తున్న పాలికె పారిశుధ్య కార్మికుల పని తీరు శ్లాఘనీయం అన్నారు. తన వంతుగా పాలికె సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించేందుకు రూ.10 లక్షలు కాని, అంతకన్నా ఎక్కువగా ఖర్చు, బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్లు వెంకట రమణ, పాలికె ప్రతిపక్ష నాయకుడు ఇబ్రహీంబాబు, కార్పొరేటర్లు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, హనుమంతప్ప, ఆందోళనకారులు పాల్గొన్నారు. తక్కువ జీతాలతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు కార్మికులకు మాజీ మంత్రి శ్రీరాములు సంఘీభావం -
నగరాభివృద్ధికి కనీస చర్యలు చేపట్టాలి
● మౌలిక సదుపాయాల కల్పన అవసరం ● పాలికె ప్రతిపక్ష నాయకుడు ఇబ్రహీంబాబు సాక్షి,బళ్లారి: నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి కనీస చర్యలు చేపట్టాలని మాజీ మేయర్, ప్రస్తుత బళ్లారి మహానగర పాలికె ప్రతిపక్ష నాయకుడు ఇబ్రహీంబాబు సూచించారు. పౌరుల భాగస్వామ్యం, సామూహిక నాయకత్వం ద్వారా నగరాభివృద్ధి ఎలా సాధించాలన్న అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు. పెరుగుతున్న నగరాలు, నగర నాయకులు శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలోని ఇండియా హాబిట్యాక్ సెంటర్లో ప్రజాగ్రహ సంబంధిత సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరాల అభివృద్ధితో పాటు భారత్ అభివృద్ధి పథంలో సాగేందుకు దేశ బంగారు భవితను రూపొందించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారన్నారు. సమావేశంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికై న 30 మందికి పైగా నగర నాయకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అధ్యక్షులు, మేయర్లు పాల్గొనడం హర్షణీయమన్నారు. -
సిరిగంధం అలంకరణ
బొమ్మనహళ్లి: ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా బొమ్మనహళ్లి నియోజకవర్గం హెచ్ఎస్ఆర్ లేఔట్ వార్డు పరంగిపాళ్య గ్రామంలో గ్రామదేవత మారెమ్మదేవిని విశేషంగా అలంకరించారు. అర్చకులు వినయ్కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం సిరిగంధంతో అలంకరించి పూజలు నిర్వహించి మహామంగళహారతి ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని నిమ్మదొప్పెలతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భట్కళ పట్టణం పేల్చేస్తామని బెదిరింపు బనశంకరి: ఉత్తరకన్నడ జిల్లా భట్కళ పట్టణం పేల్చేస్తామని దుండగులు భట్కళ శహర పోలీస్స్టేషన్కు గురువారం ఉదయం 10.30 గంటలకు ఇ–మెయిల్ పంపారు. దీంతో పోలీసులు బస్టాండ్, రైల్వేస్టేషన్తో పాటు ప్రముఖ స్థలాల్లో బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు కనబడకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కలప గోదాము దగ్ధం దొడ్డబళ్లాపురం: కలప గోదాము అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన నెలమంగల తాలూకా కెంపలింగనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. బెంగళూరు–మంగళూరు జాతీయ రహదారి మార్గంలో మహేశ్ అనే వ్యక్తి ప్లైవుడ్ గోడౌన్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపకదళం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే లక్షల విలువ చేసే సరుకు కాలిపోయింది. నెలమంగల రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సిద్దరామయ్యే సీఎంగా కొనసాగుతారు ● మంత్రి కేహెచ్ మునియప్ప కోలారు: రాబోయే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యే కొనసాగుతారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప పేర్కొన్నారు. శనివారం ఆయన నగరంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి మార్పు గురించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఓడీసీ సలహా మండలిలో పలువురు నాయకులు ఉన్నారు. సిద్దరామయ్య ప్రస్తుతం ముఖ్యమంత్రి కావడం వల్ల ఆయనను కూడా చేర్చుకుని బాధ్యతలు అప్పగించారన్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని పలువురు స్వామీజీలు అంటుండడంపై మంత్రి స్పందిస్తూ ముఖ్యమంత్రి కావాలని ఆయన శ్రేయోభిలాషులు ఆకాక్షించడంలో తప్పు లేదు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా లేదన్నారు. ఈడీ అధికారులు కాంగ్రెస్ నాయకులపై దాడులు నిర్వహించడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. దురుద్దేశ పూర్వకంగానే ఈడీ దాడులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది బీజేపీకి శోభను తీసుకు రాదు, ఇలా చేయవద్దని తాను చాలా సార్లు చెప్పానన్నారు. -
గన్తో బెదిరించి నగల దోపిడీ
దొడ్డబళ్లాపురం: కలబుర్గిలో దోపిడీదారులు రెచ్చిపోయారు. పట్టపగలు జువెలరీ దుకాణంలోకి చొరబడి 3కేజీల బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. కలబుర్గి పట్టణంలోని సరాఫ్ బజార్లో జువెలరీ దుకాణం ఉంది. ముసుగలు ధరించిన దుండగులు లోపలకు చొరబడి గన్లు చూపించి సిబ్బందిని బెదిరించారు. అనంతరం బంగారు ఆభరణాలను మూటగట్టుకొని ఉడాయించారు. సుమారు 3కేజీల బంగారు ఆభరణాలు చోరీ అయినట్టు దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ద్వారా దొంగల ఆనవాళ్లను గుర్తించి గాలింపు చేపట్టారు. -
రాష్ట్రంలో కొనసాగుతున్న బాల్య వివాహాలు ● నాలుగేళ్లలో 2,165 పెళ్లిళ్లు ● త్వరలో బాల్య వివాహ నిషేధ చట్టానికి కొత్తగా సవరణలు ● రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టనున్న సర్కార్
సాక్షి బెంగళూరు: బాల్యంలోనే మూడుముళ్ల రూపంలో బాలల స్వేచ్ఛకు సంకెళ్లు పడుతన్నాయి. వారి భవిత ఎండమావులుగా మారుతోంది. భవిష్యత్ అంధకారమవుతోంది. కలలు కళ్లలవుతున్నాయి. విరిసీ విరియని... తెలిసీ తెలియని వయస్సులోనే పసిమొగ్గలకు మాంగల్యం తుంతునానేనా అని అంటున్నారు. యుక్త వయస్సు రాకుండానే తాళిబొట్టు మెడలో వేస్తున్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది. బాల్యంలోనే వివాహాలతో జరిగే అనర్థాలపై అధికారులు ఎంతగానో అవగాహన కలిగిస్తున్నా దురాచారాలను నిలువరించడం సాధ్యపడడం లేదు. ఈ క్రమంలో బాల్య వివాహాల కట్టడికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. కొత్తగా బాల్య వివాహ నిషేధ సవరణ చట్టం –2025ను తీసుకొచ్చేందుకు అడుగులు వేసింది. రానున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ కొత్త బిల్లును తీసుకొచ్చి ఈ సమస్యకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 2021–2022 నుంచి 2024–2025 వరకు మొత్తం 2,165 బాల్య వివాహాలు జరిగినట్లు మహిళ, శిశు సంక్షేమ శాఖ తెలిపింది. 2021–22లో 418, 2022–23లో 328 బాల్య వివాహాలు జరిగాయి. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023–24లో బాల్య వివాహాలు మరింతగా పెరిగాయి. ఆ ఏడాది 719కి బాల్య వివాహాలు పెరిగాయి. ఇక 2024–25 ఏడాదిలో మరో 700 జరిగాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ పాలనలో రెండేళ్లలో 1,416 బాల్య వివాహాలు జరిగాయి. 2024–25 ఏడాదిలో 700 బాల్య వివాహాలు జరిగాయి. మొత్తం 3,049 బాల్య వివాహాల గురించి ఫిర్యాదులు అందితే అందులో 2,349 వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. ఇందులో అత్యధికంగా శివమొగ్గ జిల్లాలో 79 బాల్య వివాహాలు జరిగాయి. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మిహెబ్బాళ్కర్ సొంత జిల్లా బెళగావిలో 78 బాల్య వివాహాలు జరిగాయి. రాష్ట్రంలో ఈ బెళగావి జిల్లా బాల్య వివాహాల అంశంలో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో చిత్రదుర్గ (74), బాగలకోటె (60), సీఎం సొంత జిల్లా మైసూరు (60), మండ్య (57) ఉన్నాయి. నిశ్చితార్థం చేసిన వాళ్లకు జైలు శిక్ష రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లులో బాల్య వివాహం జరిగించడమే కాదు..నిశ్చితార్థం చేసినా నేరంగా పరిగణించేలా రూపొందించనున్నారు. బాలబాలికలకు నిశ్చితార్థం చేసే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష అంతేకాకుండా రూ. లక్ష వరకు జరిమానా విధించేలా ఈ కొత్త సవరణ చట్టాన్ని తీసుకురానున్నారు. కేంద్ర చట్టంలో బాల్య వివాహం జరిగిస్తేనే నేరంగా భావించేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ కొత్త చట్టం ద్వారా నిశ్చితార్థం చేసినా వారిని నిందితులుగా చేర్చేలా సన్నాహకాలు చేస్తున్నారు.కేంద్ర చట్టంలో సవరణకు ఏర్పాట్లు ఇటీవలే కేంద్రంలో బాల్య వివాహా నిషేధ చట్టం –2006ను అమలు చేస్తున్నారు. దీనికితోడు బాల్య వివాహా నిషేధ సవరణ బిల్లు 2021 నుంచి పార్లమెంట్లో ఆమోదం కోసం పెండింగ్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాల్య వివాహా నిషేధ సవరణ బిల్లు–2025పై కసరత్తు చేస్తోంది. కేంద్ర బాల్య వివాహ నిషేధ చట్టం–2006లో కొన్ని సవరణలు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు పంపనుంది. ప్రస్తుత రాష్ట్ర బిల్లులో కేంద్ర మూల చట్టంలో కొత్త సెక్షన్లు అయిన 9ఏ, 13ఏను కూడా చేర్చనున్నట్లు తెలిసింది. అలాగే కేంద్ర చట్టం సెక్షన్ 10ని కూడా సవరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇలా కట్టుదిట్టంగా బాల్య వివాహ నిషేధ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి వాటిని నియంత్రించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. -
మాజీ ఎమ్మెల్సీ తిప్పణ్ణ కన్నుమూత
సాక్షి,బళ్లారి: సీనియర్ న్యాయవాది, మాజీ విధాన పరిషత్ సభ్యుడు, మాజీ అఖిల భారత వీరశైవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు తదితర ఎన్నో పదవులను అలంకరించి వాటికి వన్నె తెచ్చిన సీనియర్ రాజకీయ దురంధరుడు ఎన్.తిప్పణ్ణ(97) ఇక లేరు. ఆయన శుక్రవారం నగరంలోని తన నివాస గృహంలో వయస్సు రీత్యా అనారోగ్య కారణాలతో మృతి చెందారు. జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడుగా గుర్తింపు పొందిన ఈయన అంచెలంచెలుగా ఎన్నో పదవులు చేపట్టారు. రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని, మచ్చలేని నాయకుడుగా ఎదుగుతూ రాష్ట్రంలోనే తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్సీగా సేవలందించి, సభాపతిగా కూడా పని చేశారు. 2012 నుంచి అఖిల భారత వీరశైవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నో సంవత్సరాలు సేవలందించారు. వీరశైవ లింగాయత్ సమాజంలోనే కాకుండా అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, పేదలకు తనదైన సేవలు అందించేవారు. విద్యాభివృద్ధికి ఇతోధిక కృషి వీరశైవ విద్యావర్ధక సంఘానికి అధ్యక్షుడుగా పని చేసి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఎన్నో సంవత్సరాల పాటు న్యాయవాదిగా కూడా పని చేయడంతో జిల్లా కోర్టుల్లోనే కాకుండా హైకోర్టుల్లో కూడా తిప్పణ్ణ ఒక వెలుగు వెలిగారు. ఆయన సొంత ఊరు చిత్రదుర్గ జిల్లా తురువనూరు కాగా ఆయన అంత్యక్రియలు తురువనూరులో శనివారం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు కుమారుడు ఉన్నారు. ఎన్.తిప్పణ్ణ మృతిపై కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి వీ.సోమణ్ణ, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, నగర ఎమ్మెల్యేలు నాగేంద్ర, నారా భరత్రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తదితర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈయన మృతి జిల్లాకు తీరని లోటు అని, జిల్లాభివృద్ధికి తన వంతు కృషి చేశారని, రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పరితపించేవారని కొనియాడారు. -
రైతుల డిమాండ్ల పరిష్కారంపై సీఎం నాటకాలు
మైసూరు : బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దేవనహళ్లి రైతుల డిమాండ్ల విషయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాటకాలు ఆడుతున్నారని బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు నగరంలోని జిల్లా విలేకరుల భవనంలో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం, దళిత సంఘర్ష సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఆయన మాట్లాడారు. ఈనెల 4వ తేదీన బెంగళూరు నగరంలో రైతు ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య సమావేశం నిర్వహించగా దేవనహళ్లి తాలూకాలోని 13 గ్రామాల్లో 1,777 ఎకరాల భూ స్వాధీనాన్ని వెనక్కు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారన్నారు. చట్టపరంగా రైతుల డిమాండ్లను పరిష్కరించడానికి ఈనెల 15వ తేదీ వరకు సమయం కోరిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇటీవలే ఢిల్లీకి వెళ్లి అక్కడ రక్షణ శాఖ, ఎయిరోస్పేస్ కారిడార్లను ఏర్పాటు చేయడానికి కేంద్రాన్ని అనుమతి కోరారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో రక్షణ కారిడార్కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అనుమతి అడగటం ఏ ఉద్దేశంతో అని ప్రశ్నించారు. రక్షణ శాఖ, ఎయిరో స్పేస్ కారిడార్కు కేంద్రం నుంచి అనుమతి లేకపోతే రైతుల నుంచి భూమిని ఎందుకు స్వాధీనం చెసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం -
పెండింగ్ పనులు పూర్తి చేస్తాం
సాక్షి,బళ్లారి: బళ్లారి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అవసరమైన చోట్ల రైల్వే ఎఫ్ఓబీ(ఫ్లైఓవర్ బ్రిడ్జి) నిర్మాణాలతో పాటు పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం రాత్రి బళ్లారికి ప్రత్యేక రైలులో విచ్చేశారు. ఈ సందర్భంగా బళ్లారి రైల్వే స్టేషన్లో మాజీ మంత్రి శ్రీరాములు, నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, రైల్వే క్రియాశీల సమితి అధ్యక్షుడు మహేశ్వరస్వామి తదితరులు కలుసుకుని ఘన స్వాగతం పలికారు. అనంతరం సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వరస్వామి జిల్లాలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు సంబంధించి వినతిపత్రం అందజేశారు. రైల్వే స్టేషన్లలో సమస్యలను పరిష్కరించాలని తదితర డిమాండ్లపై మంత్రికి విన్నవించారు. సమితి అందజేసిన మనవి పత్రానికి సానుకూలంగా స్పందించి వీలైనన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైలు మార్గాలను పెంచేందుకు తన వంతు కృషి చేస్తున్నానన్నారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తామన్నారు. బళ్లారి నగరంతో పాటు జిల్లాలోని మోతీ సమీపంలో బ్రిడ్జి వెడల్పు చేయాలని, కనకదుర్గమ్మ ఆలయం వద్ద మయూర హోటల్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, రేడియో పార్కు సమీపంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని, గుగ్గరహట్టి వద్ద ఫ్లైఓవర్, బైపాస్ వద్ద, దరోజీ సమీపంలో ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని సమితి విన్నవించిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైల్వే ఎఫ్ఓబీల ఏర్పాటుకు చర్యలు కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సోమణ్ణ -
ఘర్షణ కేసులో 20 మంది అరెస్ట్
హుబ్లీ: మంటూరు రోడ్డు అరళికట్టె వీధిలో రెండు గుంపుల మధ్య జరిగిన ఘర్షణపై మూడు ప్రత్యేక కేసులను నమోదు చేసుకొని 20 మందిని అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. జిలాని, జాధవ్ల మధ్య పరస్పరం మాటా మాటా పెంచుకున్న ఫలితంగా సెటిల్మెంట్, మంటూరు రోడ్డులకు చెందిన రెండు గుంపులు కత్తులు, హాకీ స్టిక్లు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణలో మంజునాథ, రాజేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ రెండు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేశాయి. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బందిపై కూడా దాడి చేశారు. పోలీసులు విధులను అడ్డుకున్న ఆరోపణలపై కూడా వీరిపై కేసు దాఖలైంది. సీసీ టీవీ కెమెరాలను పరిశీలించి వివరాలను సేకరించాం. కేసులో రౌడీషీటర్లు కూడా పాలు పంచుకున్నారు. త్వరలో వారిపై కూడా గూండా చట్టంతో పాటు సరిహద్దుల నుంచి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం అన్నారు. ఈ కేసులకు సంబంధించి గణేష్, శుభం, పవన్, వినాయక, గౌతమ్, అశ్వథ్, రాఘవేంద్ర, విశాల్ తదితర 20 మందిని అరెస్ట్ చేశామన్నారు. చిన్న కారణానికి గొడవ.. యువకుడికి కత్తిపోటు హుబ్లీ: ధార్వాడలో హావేరి పేట కంటి గల్లిలో చిన్న కారణంతో ఓ యువకుడిపై కత్తితో పొడిచిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ వీధికి చెందిన మల్లిక్కు రాఘవేంద్ర వెన్నెముకపై చాకుతో పొడిచాడు. ఈ క్రమంలో చాకులోని చివరి భాగం వెన్నులో విరిగి మిగిలి పోయింది. తక్షణమే రాఘవేంద్రను చికిత్స కోసం హుబ్లీ కిమ్స్కు తరలించారు. నిందితుడు మల్లిక్ పరారయ్యాడు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ధార్వాడ ఉపనగర పోలీసులు తెలిపారు. అంతేగాక రాఘవేంద్ర ఇంటికి వెళ్లిన కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ రాఘవేంద్ర, మల్లిక్ ఇద్దరు స్నేహితులు. కట్టడ కార్మికులుగా పని చేసే వారు. మల్లిక్ రాఘవేంద్ర సోదరుడికి డబ్బులు ఇచ్చాడు. ఈ విషయమై వారి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. శుక్రవారం మల్లిక్ ఇంటికి వచ్చిన వేళ డబ్బులు తీసుకున్న వ్యక్తి ఇంట్లో ఉండలేదు. దీంతో రాఘవేంద్ర, మల్లిక్ మధ్య మాటామాటా పెరిగిన పర్యవసానంగా మల్లిక్ రాఘవేంద్ర వెన్ను భాగంలో పొడిచి పరారయ్యాడని, నిందితులు ఒక్కరా, ఇద్దరా అనేది దర్యాప్తులో తేలుస్తామని పోలీసులు తెలిపారు. నగరసభ అధ్యక్షురాలికి కాంగ్రెస్ మోసం రాయచూరు రూరల్: రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఆధారంగా అధ్యక్షురాలైన నగరసభ అధ్యక్షురాలు నరసమ్మకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాదిగ రిజర్వేషన్ పోరాట ఐక్య వేదిక అధ్యక్షుడు విరుపాక్షి ఆరోపించారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యక్షురాలు నరసమ్మతో లేఖ రాయించుకున్నట్లు తెలిపారు. అనారోగ్యం కారణంగా నగరసభ ఇంచార్జి అధ్యక్షుడిగా సాజిద్ సమీర్ గురువారం నగరసభ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టడం తగదన్నారు. ఏడాది క్రితం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నరసమ్మ స్థానంలో ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్న సాజిద్ సమీర్ మూడు నెలల కోసం అధ్యక్ష పదవిలో కొనసాగడానికి అధిష్టానం ఆదేశించడాన్ని ఖండించారు. మూడు నెలల్లో నగరసభ ఎన్నికలు రానుండడంతో అధ్యక్ష పదవిని మైనార్టీలకు కేటాయించామని చెప్పుకొని ఓట్లను రాబట్టడానికి ఈ పని చేశారని విమర్శించారు. అధ్యక్షురాలు నరసమ్మ ఆరోగ్యంగా ఉన్నారని, మంత్రి బోసురాజు మాదిగలకు, మైనార్టీలకు మోసం చేశారని, తిరిగి నరసమ్మకు అధ్యక్ష పదవిని అప్పగించాలన్నారు. ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తామన్నారు. యల్లమ్మ సన్నిధిలో వ్యక్తిపై దాడి హుబ్లీ: బెళగావి జిల్లా సవదత్తి తాలూకాలోని రేణుకా యల్లమ్మ ఆలయంలో శ్రీరామ సేన జిల్లాధ్యక్షుడిపై మారణాయుధాలతో దాడి చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ సదరు సేన జిల్లాధ్యక్షుడిపై మారణాయుధాలతో దాడి చేసినట్లు సవదత్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ధార్వాడ జిల్లాధ్యక్షుడు అణ్ణప్పపై ఈ దాడి జరిగింది. అణ్ణప్ప తన భార్య, పిల్లలతో ఆలయానికి దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా అణ్ణప్ప భార్య తన బిడ్డకు ప్రసాదం తినిపిస్తుండగా దేవాలయంలో బయట తిండి పదార్థాలు తినిపించరాదని హోంగార్డు సిబ్బంది ఆమెకు సూచించారు. దీంతో ఆమె బయటకు వచ్చి బిడ్డకు తిండి పదార్థాలు తినిపించారు. దీంతో పోలీస్ సిబ్బంది అసభ్యంగా తిట్టగా దీన్ని ప్రశ్నించిన అణ్ణప్పపై తీవ్రంగా దాడి చేసినట్లు సవదత్తి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. దుకాణాలపై అధికారుల దాడులు● విషపూరిత పదార్థాల స్వాధీనం రాయచూరు రూరల్: విషపూరితమైన పదార్థాలను విక్రయిస్తున్న దుకాణాలపై ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు జరిపారు. శుక్రవారం మాన్విలోని ఇస్లాంపురలో ఖాళీ స్థలంలో ఉంచిన ప్రాణ హానికారకమైన విషంతో కూడిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతర, దర్గా, ఉరుసు ఇతర ఉత్సవాల్లో మసాలా వంటి పదార్థాల్లో విష పదార్థాలను కలుషితం చేసి లడ్డూ, కారాలు ఇతర పదార్థాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను తీయడానికి ప్రయత్నం చేస్తున్న దుకాణాలపై దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. 967 కేజీల మిశ్రిత మసాలా పౌడర్, 152 కేజీల ఎర్ర బ్యాళ్లు, 220 కేజీల పసుపు, రంగు రంగుల బ్యాళ్లు, బొప్పాయి విత్తనాలు, చెక్క, కొబ్బరి పుడి, 842 కేజీల కలుషిత ఆహార పదార్థాలను సీజ్ చేసి వాటిని ఎఫ్ఎస్ఎల్ ప్రయోగశాలకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య ముక్కు కొరికేసిన భర్త.. అసలేం జరిగిందంటే?
బెంగళూరు: ఓ భర్త.. భార్య ముక్కును కొరికేసిన ఘటన కర్ణాటకలోని దేవనగరిలో కలకలం సృష్టించింది. అప్పు చెల్లింపు విషయంలో భార్య, భర్తల మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలో కోపంతో భార్య ముక్కును కొరికాడు. భార్య విద్య అప్పు తీసుకోగా, భర్త విజయ్ పూచీకత్తు ఇచ్చాడు. విద్య.. కిస్తీలు చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారు వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.మంగళవారం జరిగిన ఈ గొడవలో భార్యపై దాడి చేశాడు.. ఆమె నేలపై పడిపోగా.. తర్వాత విజయ్ ఆమె ముక్కును కొరికేశాడు. ఆమెను స్థానికులు వెంటనే చిన్నగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ముక్కుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.విద్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, విజయ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదటగా శివమొగ్గలోని జయనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, పరిధి ఆధారంగా దావణగేరె జిల్లా చిన్నగిరి పోలీస్ స్టేషన్కు కేసు బదిలీ చేశారు. -
హడపద అప్పణ్ణ తత్వాలు ఆచరణీయం
బళ్లారి రూరల్ : ప్రతి ఒక్కరూ శివశరణ హడపద అప్పణ్ణ తత్వాలను అనుసరించాలని దావణగెరె జెడ్పీ సీఈఓ గిత్తె మాధవ్ విఠల్రావ్ తెలిపారు. ఆయన గురువారం దావణగెరె జెడ్పీ కార్యాలయంలో అప్పణ్ణ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బసవణ్ణ సిద్ధాంతాలను, ప్రజలకు బోధించిన తత్వాలను ఆచరిస్తూ ప్రసిద్ధిగాంచిన అప్పణ్ణ మనందరికీ ఆదర్శప్రాయుడని తెలిపారు. దుడా అధ్యక్షుడు దినేశ్ కె.శెట్టి, ఉపవిభాగాధికారి సంతోష్ పాటిల్, కన్నడ సంస్కృతి శాఖ సహాయ సంచాలకుడు రవిచంద్ర, దుడా సభ్యులు వాణి బక్కేశ్, బసాపుర శశిధర్ పాల్గొన్నారు. గొప్ప పండితుడు హడపద అప్పణ్ణ హొసపేటె: 12వ శతాబ్దపు గొప్ప పండితుడు, బసవణ్ణ సన్నిహితుడు హడపద అప్పణ్ణ అని అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణప్ప అన్నారు. గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సామాజిక సంస్కరణల కోసం కులం, మతం రంగు, వర్గం లేని సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేశారన్నారు. కన్నడ సంస్కృతి శాఖ అధికారి సిద్దలింగేష్ తదితరులు పాల్గొన్నారు. దావణగెరె జెడ్పీ సీఈఓ గిత్తె మాధవ్ విఠల్రావ్ -
భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
సాక్షి,బళ్లారి: పరాసుర మహర్షి, మత్య్సగంధికి జన్మించిన కారణజన్ముడు, మహాభారతాన్ని రచించిన మహానుభావుడు, వేదవేదాంగాలను ఔపోసన పట్టిన వ్యాసుడు పుట్టిన రోజున జరుపుకునే గురుపౌర్ణమి వేడుకలు గురువారం రోజున గురు పౌర్ణమి రావడం గురు భక్తులకు మరింత పరమపవిత్రం కావడంతో నగరంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని అనంతపురం రోడ్డులోని విశాల్నగర్లో షిర్డీలో వెలసిన శ్రీ షిర్డిసాయి బాబా ఆలయం తరహాలో నిర్మించిన సాయిబాబా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అన్నదానం చేపట్టారు. ఆలయ ధర్మకర్త కుమారస్వామి ఆధ్వర్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో వద్ద రక్తదాన శిబిరంతో పాటు అన్నదానం నిర్వహించారు. ఆలయంలో శ్రీ షిర్డిసాయిబాబాను దర్శించుకునేందుకు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. అలాగే కోట ప్రాంతంలో వెలసిన శ్రీషిర్డిసాయిబాబా ఆలయం, పటేల్నగర్లో వెలసిన శ్రీ షిర్డిసాయిబాబా ఆలయంతో పాటు శ్రీ గురురాఘవేంద్ర స్వామి ఆలయాల్లో కూడా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఆయా ఆలయాల వద్ద అన్నదాన కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ భక్తిని చాటుకున్నారు. రాయచూరులో.. రాయచూరు రూరల్ : నగరంలోని పబ్లిక్ గార్డెన్లోని సాయి బాబా ధ్యాన మందిరంలో గురువారం ప్రత్యేక పూజలను సాయి బాబా ధ్యాన మందిరం ట్రస్టీ కిరణ్ ఆదోని నిర్వహించారు.కాకడ హారతి, మహారుద్రాభిషేకం, పుష్పాభిషేకం, సాయి సత్యనారాయణ పూజలు, పల్లకీ సేవలు, ధూప హారతి, అన్న దాసోహ కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా రాజేష్ మడివాళ, ప్రవీణ్ ప్రభ శెట్టర్, కేశవమూర్తి, ఈరన్న, అన్వర్ పాషా, తానాజీలున్నారు. గురువందన ఉత్సవాలను నగరంలోని గురు పీఠానికి చెందిన కిల్లే బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్యులు అభిషేకం, పాదుకా పట్టాభిషేకం, జలాభిషేకం, పుష్పాలంకరణ చేశారు. తాలూకాలోని మిట్టి మల్కాపూర్ సిద్దారూఢ మఠంలో గురు పౌర్ణిమ ఉత్సవాల్లో గురువును ఆరాధించి, పూజలు చేశారు. మంత్రాలయంలో.. మంత్రాలయ మఠం భక్త జనంతో కిక్కిరిసిపోయింది. గురువారం గురు పౌర్ణమి కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. మంత్రాలయ మఠంలో రాఘవేంద్రస్వాముల పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ భక్తులకు దర్శనం కల్పించారు. బుధవారం రాత్రి మంత్రాలయ మఠంలోకి భక్తులు రావడంతో మంత్రాలయం మఠం జనసందోహంతో కిక్కిరిసింది. రాయల వారిని దర్శనం చేసుకోవడానికి ఆరేడు గంటల పాటు సమయం పట్టిందని భక్తులు పేర్కొన్నారు. ముఖ ద్వారం నుంచి రాయల ప్రాంగణం వరకు భక్తుల సందోహం కనిపించింది. సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ఆలయంలో ప్రదక్షిణం చేశారు. హొసపేటెలో.. హొసపేటె: గురుపౌర్ణమి సందర్భంగా గురువారం నగరంలో సాయినాథుడి ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. వేకువ జాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని సాయిబాబాను దర్శించుకున్నారు. నగరంలోని టీబీ డ్యాం రహదారిలో ఉన్న సాయిబాబా మందిరం, రైల్వే స్టేషన్ రహదారి, హంపీ రహదారిలో కొండనాయకనహళ్లిలో ఉన్న సాయిబాబా ఆలయాలకు భక్తులు భారీగా చేరుకొని సాయినాథుడికి పూజలు చేశారు. విజయనగర జిల్లా వ్యాప్తిలో ఉన్న కూడ్లిగి, హడగలి, కొట్టూరు, హరపనహళ్లి, హగరిబొమ్మనహళ్లి తాలూకాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో వైభవోపేతంగా గురుపౌర్ణమి వేడుకలు జరిగాయి. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు చేరుకుని సాయిబాబాను దర్శించుకున్నారు. ఆలయాలకు భారీగా పోటెత్తిన భక్తులు జోరుగా అన్నదానం, రక్తదాన శిబిరాలు -
అధికారులకు జెడ్పీ సీఈఓ క్లాస్
రాయచూరు రూరల్: రాయచూరు జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉద్యోగులకు, అధికారులకు, సిబ్బందికి క్లాస్ తీసుకున్నారు. బుధవారం అకస్మాత్తుగా కార్యాలయంలో విధులకు హాజరైన వారి పని తీరును జెడ్పీ సీఈఓ పరిశీలించారు. వారానికి ఒకసారి స్వచ్ఛత కార్యక్రమాలను చేపట్టాలని, రికార్డులను భద్రపరుచుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. రైలు కింద పడి తల్లీబిడ్డల ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: రైలు కింద పడి తల్లీ, కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సంఘటన దావణగెరె జిల్లా హరిహర తాలూకాలోని తుంగభద్ర నది వంతెన వద్ద చోటు చేసుకుంది. గంగనరసి గ్రామానికి చెందిన సువర్ణమ్మ(65), గౌరమ్మ(45) ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లీ, కుమార్తె. రైలు పట్టాలపై పడుకుని ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ధర్మస్థల సంస్థ సేవలు ప్రశంసనీయం
బళ్లారిఅర్బన్: డాక్టర్ వీరేంద్ర హెగ్డే, హేమావతి దంపతులు స్థాపించిన ధర్మస్థల గ్రామీణ అభివృద్ధి సంస్థ కేవలం ఆర్థిక సమస్యల పరిష్కారంతో పాటు వృద్ధులకు, దివ్యాంగులకు నెలవారి పింఛన్ పంపిణీ, నిరాశ్రయులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం పేద విద్యార్థుల విద్య, ఆర్థిక సహాయం, ఆలయాల నిర్మాణాలకు తగిన సహాయం అందించడం తదితర ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని 22వ వార్డు కార్పొరేటర్ కే.హనుమంతప్ప ప్రశంసించారు. ఆ వార్డు పరిధిలో సదరు బీసీ ట్రస్ట్ డివిజన్ గాంధీనగర్లో దృష్టిహీన దివ్యాంగుడైన బీ.లింగన్నకు నెలవారి పింఛన్ ఆదేశ ప్రతిని పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ సంస్థ సమాఖ్య చైర్పర్సన్ వనిత, సూపర్వైజర్ సంజీవ్, సంఘం సభ్యులు, ఆ ప్రాంత ప్రముఖులు, మహిళా జ్ఞాన వికాస సమన్వయ అధికారిణి ఆశా, స్థానిక సేవా ప్రతినిధి దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ద్రోణాచార్య అవార్డు ప్రదానం
హుబ్లీ: బెళగావిలోని విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కే.బాలవీరారెడ్డికి ద్రోణాచార్య పురస్కార్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా బెంగళూరులో న్యూ హోరిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ రజతోత్సవాల సందర్భంగా బాలవీరారెడ్డికి విద్యా రంగానికి చేసిన సేవలను గుర్తిస్తు ద్రోణాచార్య పురస్కార్ అవార్డును ప్రదానం చేశారు. ఆ విద్యా సంస్థ స్థాపకుడు డాక్టర్ మోహన్ మంగనాని మాట్లాడుతూ డాక్టర్ బాలవీరారెడ్డి విద్యా రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయం అని, ఆయన ఇలాంటి అవార్డులను మరెన్నో అందుకోవాలని అభిలషించారు. ప్రముఖులు మధు పండిత్దాస్ ఇస్కాన్, ప్రొఫెసర్ టీజీ సీతారాం, రేణుకా మంగనాని, వైస్ చైర్పర్సన్, ప్రిన్సిపాల్ డాక్టర్ మంజునాథ్ పాల్గొన్నారు. తల్లే మొదటి గురువు హొసపేటె: తల్లే మొదటి గురువు, ఇంట్లో తల్లిదండ్రులు బోధించే సంస్కారం పిల్లలకు చాలా ముఖ్యం, దీనిని అందరూ అర్థం చేసుకుంటే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చని రిటైర్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అరవింద్ కులకర్ణి అన్నారు. గురువారం నగరంలోని ఫ్రీడం పార్క్లో పతంజలి యోగా సమితి జనని వివిధోద్దేశ సహకార సంఘం సహకారంతో నిర్వహించిన గురు పౌర్ణమి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వేద వ్యాసుడు గొప్ప గురువు. మానవాళి ప్రయోజనం కోసం అఖండమైన, అనంతమైన వేదాలను రచించిన వ్యక్తి ఆయన అన్నారు. వేదాల సారాంశం ప్రజలకు మరింత సులభంగా అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఆయన 18 పురాణాలు, మహాభారతాన్ని రచించారన్నారు. రిమ్స్లో శిశువుల అపహరణ.. వ్యక్తి అరెస్ట్ రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల, పరిశోధన కేంద్రంలో శిశువులను కిడ్నాప్ చేయడానికి వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి రిమ్స్లోకి వెళ్లి శరణప్ప చీర కట్టుకొని వార్డులో తిరుగుతున్న వ్యక్తిని విచారించారు. అతడి నుంచి ఎలాంటి సమాధానం రాక పోవడంతో మార్కెట్ యార్డు పొలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. నగరసభ ఇంచార్జి అధ్యక్షుడిగా సాజిద్ సమీర్ రాయచూరు రూరల్: నగరసభ ఇంచార్జి అధ్యక్షుడిగా సాజిద్ సమీర్ గురువారం నగరసభ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏడాది క్రితం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నరసమ్మ స్థానంలో ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్న సాజిద్ సమీర్ మూడు నెలల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగడానికి అధిష్టానం ఆదేశించింది. అధ్యక్షురాలు నరసమ్మ అనారోగ్యం కారణంగా మూడు నెలల సెలవు పెట్టడంతో సమీర్ బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలల్లో నగరసభ ఎన్నికల రానుండడంతో అధ్యక్ష పదవిని మైనార్టీలకు కేటాయించామని చెప్పుకొని ఓట్లను రాబట్టడానికి ఈ పని చేశారని రాజకీయ నేతలు విశ్లేషణల్లో చెప్పారు. వైభవంగా గురు వందన ఉత్సవాలు రాయచూరు రూరల్ : నగరంలో గురువందన ఉత్సవాలు వైభవంగా జరిపారు. గురువారం సోమవారపేటె మఠంలో గురు వందన కార్యక్రమాలను మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య నెరవేర్చారు. గురు పీఠానికి శిష్య గణం అభిషేకం, పాదుకా పట్టాభిషేకం, జలాభిషేకం, పుష్పాలంకరణ నెరవేర్చారు. భక్తులు తులాభారం నిర్వహించారు. ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ తదితరులను సన్మానించారు. -
బ్యాంకు రుణాలకు గ్యారెంటీ సొమ్ము జమ తగదు
రాయచూరు రూరల్: ప్రజలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ప్రభుత్వం నుంచి గ్యారెంటీల ద్వారా అందించే సొమ్మును జమ చేసుకోవడం తగదని పంచ గ్యారెంటీల అమలు సమితి జిల్లాధ్యక్షుడు పామయ్య మురారి పేర్కొన్నారు. బుధవారం జిల్లా పంచాయతీ జలనిర్మల సభాంగణంలో జరిగిన పంచ గ్యారెంటీల అమలు సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. పంచ గ్యారెంటీల నుంచి మహిళల బ్యాంక్ పొదుపు ఖాతాలకు డబ్బులు పడిన వెంటనే బ్యాంకు అధికారులు ఆ మొత్తాన్ని జమ చేసుకునే పద్ధతికి స్వస్తి పలకాలన్నారు. గృహలక్ష్మితో పాటు వితంతు, దివ్యాంగ, వృద్ధాప్య పింఛన్ పథకాల నుంచి వచ్చే నిధులను బ్యాంక్ అధికారులు జమ చేసుకోకుండా ఖాతాదారులకు అందించాలన్నారు. సమావేశంలో సభ్యులు శంకరగౌడ, నజీర్ పంజాబి, బసవరాజ్, అధికారులు చంద్రశేఖర్, హుడేద్, నవీన్ కుమార్, హరీష్, గవిసిద్దప్పలున్నారు. -
కుల దూషణ కేసుకు భయపడి యువకుడు ఆత్మహత్య
● కొడుకు మృతి వార్త తెలిసి గుండెపోటుతో తండ్రి మృతి ● యాదగిరి జిల్లా వడగేరా పట్టణంలో విషాద ఛాయలు సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్: కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో ఓ యువకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో సదరు యువకుడు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మరణ వార్త తెలిసిన వెంటనే తండ్రి గుండెపోటుతో మరణించిన ఘటన యాదగిరి జిల్లా వడగేరా పట్టణంలో జరిగింది. వివరాలు.. తమ పొలానికి వెళ్లడానికి దారి వదలాలని మహబూబ్(19) అనే యువకుడు తన పక్క పొలం వారితో ఏర్పడిన వివాదంలో దళితుడు నింగప్పను కులం పేరుతో దూషించాడని కేసు నమోదైంది. దీంతో యువకుడు మహబూబ్ తాను జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విని తండ్రి సయ్యద్ అలీ(50)కి గుండెపోటు రావడంతో అతనిని కలబుర్గిలోని జయదేవ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనతో వడగేరా పట్టణంలో విఽషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులను శిక్షించాలని రాష్ట్ర రైతు సంఘం జిల్లాధ్యక్షుడు మల్లనగౌడ డిమాండ్ చేశారు. అంబేడ్కర్ ప్రతిమపై దాడి.. నిందితుల్ని బంధించరూ రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హరివిలో అంబేడ్కర్ ప్రతిమపై దాడి చేసిన వారిని బంధించాలని అంబేడ్కర్ సేన అధ్యక్షుడు విశ్వనాథ్ డిమాండ్ చేశారు. గురువారం ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. వారం రోజుల క్రితం అంబేడ్కర్ ప్రతిమను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీ పుట్టమాదయ్యకు వినతిపత్రం సమర్పించారు. వేడుకగా దిండి ఉత్సవాలు రాయచూరు రూరల్ : భావసార క్షత్రియ సమాజంచే గురు పౌర్ణిమ ఉత్సవాల్లో భాగంగా భంగికుంటలో దిండి ఉత్సవాలు, ఆషాఢ మాసోత్సవం జరిగాయి. గురువారం నగరంలోని పాండురంగ విఠల్ రుక్మిణి ఆలయంలో ప్రత్యేక పూజలను భక్తులు నిర్వహించారు. భంగికుంట నుంచి ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. సమాజం అధ్యక్షుడు శ్రీనివాస్ పతంగి, జయంత్ రావ్ పతంగి తదితరులు పాల్గొన్నారు. -
జీవితాన్ని తీర్చిదిద్దేది గురువులే
● మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి సాక్షి,బళ్లారి: ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేది గురువులేనని, అలాంటి గురువులను మరువకుండా జీవితాంతం గుర్తుకు పెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం పరమ పవిత్రమైన గురుపౌర్ణమి సందర్భంగా తనకు విద్యను బోధించిన గురువుల చెంతకు వెళ్లి వారికి పాదాభివందనం చేసి, తన గురు భక్తిని చాటుకున్నారు. నగరంలో తనకు విద్యను నేర్పించిన మూలా శ్రీనివాస్, రామచంద్రప్ప, కాండ్ర శ్రీరాములు, సరళ తదితరులను కలిసి, వారిని శాలువాతో సన్మానించి, పూలమాలలు వేసి పాదాభివందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కండక్టర్ నుంచి కలెక్టర్ వరకు దేశంలో అత్యున్నత పదవులను అలంకరించిన వారికి కూడా గురువులు ఉంటారన్నారు. జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే జీవితాన్ని ఇచ్చేది గురువులేనన్నారు. అనంతరం ఆయన షిర్డీసాయి బాబా ఆలయాల్లో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. -
యరగేరాను తాలూకాగా ప్రకటించండి
రాయచూరు రూరల్: రాయచూరు నుంచి 25 కి.మీ దూరంలోని యరగేరాను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని యరగేరా తాలూకా పోరాట సమితి అధ్యక్షుడు నిజాముద్దీన్ డిమాండ్ చేశారు. జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అనుకూలమయ్యే విధంగా తాలూకాను ఏర్పాటు చేయడానికి సౌకర్యాలున్నాయన్నారు. యరగేరా వద్ద 256 ఎకరాల్లో ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం ఉందన్నారు. రాయచూరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు జాతీయ రహదారి– 167 ఉందన్నారు. యరగేరా పరిధిలో 19 గ్రామ పంచాయతీలు, 78 గ్రామాలు ఉన్నాయన్నారు. 2020 నుంచి యరగేరాను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రికి జిల్లాధికారి నితీష్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో బసవరాజ్, మహబూబ్ పటేల్, విద్యానందరెడ్డి, తాయప్ప, మహ్మద్ రఫీలున్నారు. -
శ్రీశైల జగద్గురువును దర్శించుకున్న గాలి జనార్దనరెడ్డి
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర కూడా సాక్షి,బళ్లారి: పవిత్ర వ్యాసపూర్ణిమను పురస్కరించుకుని మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి శ్రీశైల జగద్గురువులను దర్శించుకున్నారు. గురువారం గురపౌర్ణమి సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్రతో కలిసి పరమపూజ్య శ్రీశైల జగద్గురువులు డాక్టర్ చెన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా గాలి జనార్దనరెడ్డి మాట్లాడుతూ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని మన పురాణ, ఇతిహాసాలు ఘోషిస్తున్నాయన్నారు. మన పూర్వీకుల నుంచి కూడా గురువుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. గురువు లేనిదే ఎవరూ ఏదీ సాధించలేరన్నారు. గురువుకు గులాం అయ్యే వరకు మోక్షం దొరకదన్న పెద్దల వాక్కు నూటికి నూరు పాళ్లు కచ్చితం అన్నారు. అలాంటి పరమ పవిత్రమైన గురుపౌర్ణమి రోజు సాక్షాత్తు శ్రీశైల జగద్గురువులను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. -
మోక్షదాతా.. గురుదేవా, పాహిమాం
బనశంకరి: గురు పౌర్ణమి సందర్భంగా గురువారం బెంగళూరుతో సహా ప్రముఖ దేవస్థానాల్లో విశేష పూజలు, ఉత్సవాలు జరిగాయి. సరస్వతీ, వినాయక, విష్ణు, పరమేశ్వర, రాఘవేంద్రస్వామి, వ్యాస– వాల్మీకి, సాయిబాబా ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. ఉదయం నుంచే భక్తజనం బారులు తీరి దర్శించుకున్నారు. బెంగళూరులో వివిధ ఆలయాలలో అభిషేకం, మహామంగళ హారతి, పల్లకీ సేవలు, సత్యనారాయణస్వామి పూజలు చేపట్టారు. విజయనగరలో బసవేశ్వర సుజ్ఞాన మండపంలో ఇష్టలింగ మహాపూజ చేశారు. చామరాజపేటే శృంగేరి శంకర మఠంలో పూజలు, ప్రవచనాలు జరిగాయి. మల్లేశ్వరంలోని సాయిబాబా మందిరంలో, 15వ క్రాస్లోని షిరిడి సాయి ఆలయంలో, వాసవి మందిరం, జక్కూరు సాయిబాబా గుడి తదితర చోట్ల భక్తులు వెల్లువెత్తారు. భక్తిశ్రద్ధలతో గురు పూర్ణిమ -
గ్రెనేడ్ పేల్చి ఉగ్రవాదిని తప్పించాలి
బనశంకరి: కటకటాల్లోని ఉగ్రవాదులతో కుమ్మక్కయిన బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు మానసిక వైద్యుడు నాగరాజ్, ఏఎస్ఐ చాంద్పాషా, అనుమానిత ఉగ్రవాది తల్లి ఫాతిమాను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారణ చేపట్టారు. జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న ఉగ్రవాది నాసీర్ తప్పించుకోవడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చింది. గ్రెనేడ్ నాసీర్ ను బయటికి తీసుకురావడానికి ప్లాన్ వేశారని ముగ్గురు నిందితులు తెలిపారు. ఎన్ఐఏ తాజా దాడులతో ఈ కుట్ర విఫలమైంది. నాసీర్ గత 2009 నుంచి పరప్పన జైలులో ఖైదీగా ఉన్నాడు. అతన్ని తప్పించడానికి ఉగ్రవాదులు రెండుసార్లు విఫలయత్నం చేసినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. కోర్టుకెళ్లే సమయంలో.. దీనికి ఏఎస్ఐ చాంద్పాషా ప్రముఖ సూత్రధారి. పోలీసులు ఏఎస్ఐ చాంద్పాషాకు నాసీర్ ను కోర్టుకు తీసుకెళ్లే బాధ్యతను అప్పగించారు. కోర్టుకు తీసుకెళ్లే దారిలో ఉగ్రవాదులు గ్రెనేడ్ పేల్చి పోలీసుల దృష్టి మళ్లించి నాసీర్ను తీసుకుపోవాలన్నది కుట్ర. ఫాతిమా, పరారీలో ఉన్న ఆమె కొడుకు జునైద్ దీనిపై చర్చించుకున్నారు. జునైద్ ద్వారా కుట్రదారులకు గ్రెనేడ్ పంపారు. 2023లో సీసీబీ కొడిగేహళ్లి జునైద్ తదితరుల ఇంట్లో తనిఖీలు చేయగా నాలుగు గ్రెనేడ్లు లభించడం కుట్రకు ఊతమిచ్చింది. ఉగ్రవాదులు ఏం చేయాలన్నా చాంద్పాషా సహాయం చేశారు. అనుచరుల కుట్ర గుట్టురట్టు ఎన్ఐఏచే ముగ్గురు నిందితుల విచారణ -
●హరోం హర.. చామరాజేశ్వర
ఆషాఢ మాసం, గురు పూర్ణిమ సందర్భంగా చామరాజనగరలో చరిత్ర ప్రసిద్ధ చామరాజేశ్వర ఆలయ రథోత్సవం గురువారం వేలాదిమంది భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల జిల్లా నుంచే కాకుండా కేరళ, తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ప్రత్యేకించి నూతన దంపతులు ఎక్కువగా పాల్గొని స్వామిని సేవించారు. తెల్లవారుజాము నుంచి పూజలు చేసి ఉదయం 11.30 గంటల నుంచి 12.15 గంట శుభ కన్యా లగ్నంలో తేరు ఉత్సవాన్ని జరిపారు. మైసూరు: వాహనం బోల్తా.. కూలీలకు గాయాలు మాలూరు : పికప్ వాహనం బోల్తాపడి 11 మంది కూలీలు గాయపడిన ఘటన మాలూరు – మాస్తి మెయిన్ రోడ్డులో రాజేనహళ్లి క్రాస్ వద్ద చోటు చేసుకుంది. తాలూకాలోని లక్కూరు ఫిర్కా డీఎన్ దొడ్డి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని బండహట్టి గ్రామానికి చెందిన 11 మంది కూలీలు కొత్తమిర పీకడానికి బొలెరోపికప్ వాహనంలో వెళ్తుండగా రాజేనహళ్లి క్రాస్ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. గాయపడిన కూలీలను నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూలీలకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. -
సీఎం కుర్చీ పంపకం ఉత్తిదే
హస్తిన టూర్ని సీఎం సిద్దరామయ్య అనువుగా మలచుకున్నారు. రెండున్నరేళ్ల పాటు ఒక్కొక్కరు ముఖ్యమంత్రిగా ఉండాలన్న నియమం ఏదీ లేదని కుండబద్ధలు కొట్టారు. పైగా పోటీదారు డీకే శివకుమార్కు ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లేదని చెప్పి తనకెవరూ పోటీ కాదని సంకేతాలిచ్చారు. ఈ పరిణామాలతో హస్తం రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో? అనే చర్చకు బీజం పడింది. శివాజీనగర: 5 సంవత్సరాలూ నేనే ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటాను అని సీఎం సిద్దరామయ్య ఢిల్లీలో తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశానని అన్నారు. జూలై 2న చెప్పినప్పుడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. రెండున్నర సంవత్సరాల తరువాత సీఎం పదవి పంపకాలు చేసుకోవాలేది మాట్లాడుకోలేదన్నారు. తానే ముఖ్యమంత్రి కు ర్చీలో ఉంటానని చెప్పడం ద్వారా డీకేశి, ఆయన అనుచరుల ఆశలపై నీళ్లు చల్లారు. మాది హైకమాండ్ ఆధారంగా నడిచే పార్టీ, 2023 సమావేశంలో రెండున్నరేళ్ల సీఎం కుర్చీ గురించి ఎలాంటి చర్చలు జరగలేదు. తాము చెప్పిన దానిని అనుసరించాలని హైకమాండ్ ఆదేశించింది, వారు ఏమి చెప్పినా దానిని తాము అనుసరించాలి. నేను అదే చేస్తారు, డీకే శివకుమార్ కూడా అనుసరిస్తారని సిద్దు చెప్పడం ద్వారా మరో మాటకు తావు లేదని స్పష్టీకరించారు. సీఎం కావాలని డీకే కూడా కోరుకుంటున్నారు అని విలేకరులు ప్రశ్నించగా, డీకే కూడా సీఎం ఆకాంక్షి. అందులో ఎలాంటి తప్పులేదు. అయితే సీఎం కుర్చీ ఖాళీగా లేదని ఆయన నోటి నుంచే చెప్పారు. సీఎం పదవి గురించి సుర్జేవాలా ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. డీకే శివకుమార్కు మద్దతు పలికే కొందరు ఎమ్మెల్యేలు ఎప్పటికీ ఉంటారు. అయితే అధిక సంఖ్యలో లేరు అని తెలిపారు. ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని సిద్దు పరోక్షంగా ప్రకటించారు. దీంతో సీఎం మార్పు చర్చలకు పుల్స్టాప్ పెట్టారు. ఇప్పుడేం చేయాలి.. డీకేశి ఐదేళ్లూ నేనే పదవిలో ఉంటా సీఎం సిద్దరామయ్య ప్రకటన ఢిల్లీలో కన్నడ రాజకీయం డీకేశి శిబిరంలో నిరుత్సాహం నేను డ్రామాలు ఆడను: హోంమంత్రి సీఎం పదవి మార్పు వార్తలు, పార్టీ పరిణామాల మీద హోంమంత్రి పరమేశ్వర్ కొత్తగా స్పందించారు. మీరు చెప్పినట్లుగానే డ్రామా జరుగుతూ ఉంది. అంతే తప్ప ఇంకేమీ లేదు అని అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. అనవసరంగా డ్రామా కంపెనీని పెట్టడం నాకు ఇష్టం లేదని అన్నారు. సీఎం రేసు, ఢిల్లీ టూర్లో తాను లేకపోవడం గురించి ఇలా చెప్పారు. సీఎం మార్పు గురించి తరచూ చర్చించడం, ఏదో ఒకటి చెప్పడం సరికాదు, హైకమాండ్ అన్నింటినీ గమనిస్తుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు నిర్ణయాలను తీసుకొంటుందన్నారు. ఇక పోస్టు మార్పు లేనట్టేనా? సీఎం సిద్దరామయ్య విస్పష్ట ప్రకటన రాష్ట్ర కాంగ్రెస్లో చర్చనీయాంశమైంది. ఆయన అభిమాన ఎమ్మెల్యేలకు ఉపశమనం కలిగించగా, డీకేశి వర్గంలో నిరుత్సాహం చోటుచేసుకుంది. సీఎం ఆ మాటను బెంగళూరులో చెప్పి ఉంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఢిల్లీలో, రాహుల్గాంధీ, ఖర్గే తదితర అగ్రనేతలతో సమావేశం తరువాత అంత స్పష్టంగా చెప్పారంటే, ఇక డీకేశికి ఈ దఫా ముఖ్యమంత్రి పదవి దక్కడం సులభం కాదని రెండు వర్గాలు భావిస్తున్నాయి. సీఎం సిద్దరామయ్య ఎంతో ప్లాన్గా ఢిల్లీ పర్యటనను ఉపయోగించుకుని డీసీఎంకు చెక్ పెట్టినట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు డీకే శివకుమార్ ఏం చేస్తారన్నది తేలాల్సి ఉంది. డీకే ఇంకా స్పందించినట్లు లేదు. -
హఠాత్తుగా కారు దగ్ధం
శివమొగ్గ: హైవేలో వెళ్తున్న కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. శివమొగ్గ నగర శివార్లలోని త్యావరెకొప్ప పులి సింహధామం వద్ద బుధవారం రాత్రి జరిగింది. శివమొగ్గవాసి వీరేష్ హుండై ఐ20 కారులో ఇంటి నుంచి తోటకు వెళుతుండగా ఆకస్మికంగా కారులో పొగ వ్యాపించింది. వెంటనే కారును రోడ్డు పక్కన నిలపగా మంటలు ఎగసిపడి కాలిపోయింది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు దాదాపుగా కాలిపోయింది. తుంగానగర పోలీసులు పరిశీలించారు. మంటలకు కారణాలేమిటి? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. గజ దాడిపై జనాందోళన దొడ్డబళ్లాపురం: అడవి ఏనుగు దాడిలో రైతు కాలు విరిగిన సంఘటన కనకపుర తాలూకా నారాయణపుర గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై ధర్నా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ (45) పొలంలో పని చేస్తుండగా హఠాత్తుగా వచ్చిన అడవి ఏనుగు తొండంతో కొట్టి తొక్కింది. రైతు కాలు విరిగి గాయాలపాలయ్యాడు. స్థానికులు అతనిని కాపాడి తీసుకొచ్చారు, శ్రీనివాస్ను రోడ్డుమీదే పడుకోబెట్టి ఆందోళన చేశారు. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తరచూ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అటవీశాఖ అధికారులు, పోలీసులు వచ్చి బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. తగిన చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. న్యూస్రీల్ -
బాలికపై లైంగికదాడి, హత్య
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలో దారుణం సంభవించింది. రామనగర జిల్లా తావరెకెరెలో బాలిక మీద ఓ దుండగుడు అత్యాచారం చేసి ప్రాణాలు తీశాడు. వివరాలు.. కొప్పళ నుంచి పొట్టకూటి కోసం వచ్చిన కుటుంబం తావరెకెరెలో నివసిస్తోంది. బుధవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో బాలిక (14) ఇంట్లో ఒంటరిగా ఉండగా ఇంట్లోకి చొరబడ్డ నిందితుడు యల్లప్ప ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో గంజాయి మత్తులో ఉన్నాడు. తరువాత గ్యాస్ సిలిండర్తో కొట్టి బాలికను హత్య చేసి పరారయ్యాడు. సిలిండర్ను తీసికెళ్లి పక్క గ్రామంలో విక్రయించాడు. యల్లప్ప రాయచూరు నుంచి జీవనోపాధికై ఇక్కడకు వచ్చాడు. గార పని చేస్తూ తరచూ హతురాలి ఇంటికి వచ్చి తల్లిదండ్రులను పలకరించేవాడు. అదే సమయంలో బాలికపై కన్నేసి ఘోరానికి ఒడిగట్టాడు. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక ఘోరం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా దుండగుడు బైక్పై రావడం, వెళ్లడం కనిపించింది. యల్లప్పను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. తావరకెరెలో ఘోరం నిందితుడు వలస కూలీ -
మనిషికేల భేదభావాలు?
చింతామణి: సూర్యుడు అందరికీ సమానంగా ఎండ ప్రసాదిస్తాడు, ప్రకృతికి భేదభావం లేదు, కానీ మానవునిలోనే భేదం వుంది, దీంతో మానవుడు సామరస్యంగా ఉండాలంటే గురుచింతన అవసరమని కై వార ధర్మాధికారి జయరాం అన్నారు. గురువారం కై వారం మఠంలో సంగీతోత్సవాలు మూడవ రోజుకు చేరుకోగా రాష్ట్రంతో పాటు తెలుగు ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలు వచ్చారు. భగవంతుని నామస్మరణం చేయడం ద్వారా భక్తులు పావనమవుతారని యోగినారేయణ తాతయ్య కీర్తనల్లో బోధించారని గుర్తుచేశారు. గురు పూర్ణిమ కావడంతో యోగి నారేయణ తాతయ్య మూల విరాట్టుకు అభిషేకం, రాజోపచార తదితర సేవలను నిర్వర్తించారు. ఈ సందర్భంగా భక్తి గీతాలాపనలు, సంగీత కచేరీలు భక్తులను మైమరిపించాయి. యోగి నారేయణ తాతయ్య బాటలో సాగుదాం -
రీల్స్ సైకో
శివాజీనగర: సిలికాన్ సిటీలో రోడ్లపై వెళ్తున్న మహిళలు, యువతుల ఫోటోలు, వీడియోలు తీసి ఇన్స్టా గ్రాంలో పోస్టు చేస్తున్న పోకిరీని పోలీసులు అరెస్టు చేశారు. అశ్లీల రీతిలో చిత్రీకరించి పోస్టులు పెట్టేవాడు. చర్చ్ స్ట్రీట్, కమర్షియల్ స్ట్రీట్ సహా జనసమ్మర్ధ ప్రాంతాలలో ఈ అకృత్యానికి పాల్పడుతున్న గురుదీప్ సింగ్ (26) ని బనశంకరి పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ మేనేజ్మెంట్ చేసి నిరుద్యోగిగా తిరిగే గురుదీప్ సిటీలో కేఆర్ పురంలో సోదరుని ఇంట్లో ఉండేవాడు. ఇటీవల ఓ యువతి తన వీడియోలను ఇన్స్టాలో చూసి కంగుతిని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తంచేసింది. దీంతో పోలీసులు అతని ఇన్స్టా ఖాతాను పరిశీలించగా చాలామంది మహిళలు, యువతుల వీడియోలు దర్శనమిచ్చాయి. వాటి మీద అసభ్య కామెంట్లు కూడా ఉన్నాయి. యువతి ఆక్రోశం నా అంగీకారం లేకుండా చిత్రీకరించాడు, ఆ పోస్ట్ను తొలగించాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని యువతి వాపోయింది. ఆ వీడియో కింద అశ్లీల వ్యాఖ్యలు వస్తున్నాయి అని గోడు వెళ్లబోసుకుంది. పోకిరీ ఎక్కువగా చర్చ్ స్ట్రీట్లో అమాయకునిలా తిరుగుతూ చిత్రీకరిస్తూ ఉంటాడని గుర్తించారు. బాధితురాలు తన పోస్టును బెంగళూరు సిటీ పోలీస్, సైబర్ క్రైమ్ పోలీసులకు ట్యాగ్ చేసింది. ఈ నేపథ్యంలో అరెస్టు చేసి విచారణ చేపట్టారు. వీధుల్లో మహిళల వీడియోలు తీసి పోస్టింగ్ -
గుండెపోటు భయాలు.. ఆ ఒక్క ఆస్పత్రికే వేలమంది క్యూ!
గుండె సమస్యలతో ఉన్నట్లుండి కుప్పకూలి చనిపోతున్న ఉదంతాలు నిత్యం చూస్తున్నాం. కర్ణాటక హసన్ జిల్లాలో 40 రోజుల వ్యవధిలో 23 మంది మరణించారు. ఈ కథనాలు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందునా 25-40 మధ్యవయసున్న వాళ్లే ఎక్కువగా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది.దేశంలో నిత్యం ఏదో ఒక మూల హఠాన్మరణం ఘటన చోటు చేసుకుంటోంది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వ్యక్తులు, ఎలాంటి అరోగ్య సమస్యలు లేని వ్యక్తులు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణం విడుస్తున్నారు. హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్టులతోనే వాళ్లు చనిపోతున్నారని డాక్టర్లు సైతం నిర్ధారిస్తున్నారు. దీంతో కొందరు ఎలాంటి లక్షణాలు లేకున్నా పోటు తప్పదని అంచనాకి వస్తున్నారు. ఈ క్రమంలో..ముందస్తుగా గుండె పరీక్షలు చేయించుకుంటున్నారు. కర్ణాటక మైసూర్లోని ప్రముఖ జయదేవ ఆస్పత్రికి గత మూడు నాలుగు రోజుల నుంచి వేలమంది జనం క్యూ కట్టారు. ఓపీ కోసం వేకువ జాము నుంచే ఆస్పత్రి వద్ద పడిగాపులు పడుతున్నారు. క్యూ లైన్లలో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. మైసూర్తో పాటు బెంగళూరు బ్రాంచ్ ముందు కూడా ఇదే పరిస్థితి. జయదేవ ఆస్పత్రి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అటానమస్ ఆస్పత్రి.ಮೈಸೂರು: ರಾಜ್ಯದಲ್ಲಿ ಹೃದಯಾಘಾತ ಹೆಚ್ಚಿದ ಹಿನ್ನಲೆ, ಜಯದೇವ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಬೆಳಿಗ್ಗೆಯಿಂದಲೇ ಕ್ಯೂ.#mysore #jayadevahospital #newskarnataka pic.twitter.com/KJDtN2DwwV— News Karnataka (@Newskarnataka) July 8, 2025VIDEO Credits: News Karnatakaఅయితే మీడియా కథనాలతో, సోషల్ మీడియా ప్రచారాలతో ఆందోళన చెందవద్దని జయదేవ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ కేఎస్ సదానంద ప్రజలకు సూచిస్తున్నారు. ‘‘జనాలు అంతా ఒక్కసారిగా ఇక్కడికి ఎగబడినంత మాత్రాన.. సమస్య పరిష్కారం కాదు. కేవలం పరీక్షలు చేసుకున్నంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి ఊహాగానాలకు అతిగా స్పందించొద్దు. మీరు ఆస్పత్రులకు ఎగబడడం వల్ల.. అత్యవసర పరిస్థితి ఉన్న రోగులకు చికిత్సలో అంతరాయం కలగవచ్చు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకున్న మాత్రాన సమస్య పరిష్కారం కాదు. మంచి ఆహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి’’ అని సూచించారాయన.హసన్ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. వీటిపై విచారణకుత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ తాజాగా నివేదికను సమర్పించింది కూడా. అదే సమయం కోవిడ్ వ్యాక్సిన్ల పనితనం గురించి ఆయన అనుమానాలు వ్యక్తం చేయగా.. కేంద్ర ఆరోగ్య శాఖ పలు అధ్యయనాలను ప్రస్తావిస్తూ ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. -
అమ్మాయిల ఫొటోలు, వీడియోలతో పోకిరి హల్చల్.. తర్వాత ఏమైందంటే?
బెంగళూరు: అమ్మాయిలను సీక్రెట్గా ఫొటోలు, వీడియోలు తీస్తూ వేధింపులకు గురి చేస్తున్న ఓ పోకిరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి.. రోడ్డుపై వెళ్తున్న అమ్మాయిలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో వీడియోలను అప్లోడ్ చేస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.వివరాల ప్రకారం.. గురుదీప్ సింగ్ (26) అనే వ్యక్తి బెంగళూరులోని చర్చి స్ట్రీట్, కోరమంగళ సహా పలు ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. ఈ సమయంలో రోడ్లపై వెళ్తున్న అమ్మాయిలను వారికి తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. అనంతరం, వాటిని ఇన్స్స్టాగ్రామ్లో పోస్టు చేస్తున్నాడు. అయితే, ఓ యువతికి చెందిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా షాకైంది. ఈ వీడియోలకు అసభ్యకరంగా కామెంట్స్ రావడంతో ఆవేదన చెందింది. అనంతరం, తన వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని సదరు యువతి.. గురుదీప్ సింగ్కు మెసేజ్ పెట్టింది. ఈ క్రమంలో నిందితుడు.. దురుసుగా ప్రవర్తించాడు. ఆమె ఫొటోలు, వీడియోలు తొలగించకపోగా.. అసభ్య పదజాలంతో ఆమెను దూషించాడు.దీంతో, గురుప్రీత్ సింగ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సహాయం కోసం @blrcitypolice, @cybercrimecid పోలీసులకు ఈ పోస్టులను ట్యాగ్ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. గురుప్రీత్ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలు స్పందిస్తూ.. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి వ్యక్తులు ఇంకా బెంగళూరులో తిరుగుతున్నారన చెప్పుకొచ్చింది. వారిపై కూడా చర్చలు తీసుకోవాలని పోలీసులను కోరింది. -
ఐఏఎస్ కల చెదిరింది
కర్ణాటక: రాష్ట్రంలో గుండెపోటు మరణాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. తమ ఆప్తులు కళ్లముందే తిరిగి రాని లోకాలకు వెళ్తుంటే కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గత 24 గంటల్లో పలు జిల్లాలలో 7 మంది వరకూ హఠాన్మరణం పాలయ్యారు. కలబుర్గి జిల్లా చించోళి తాలూకా చందనకేరాలో మెహసిన్ ఒశా పటేల్ (22) అనే యువకుడు మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలాడు. ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. ఇతనికి గత నెల 15న పెళ్లయింది. ఇంతలోనే ఘోరం జరిగిందని కుటుంబీకులు విలపించారు. కాగా, కలబురగి జిల్లా వ్యాప్తంగా ఆరు నెలల నుంచి గుండెసమస్యలతో 40 మంది వరకు చనిపోయినట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో 15 మంది 45 ఏళ్ల లోపువారు. సివిల్స్ కలలు భగ్నంహుబ్లీ: సివిల్స్ పరీక్షల్లో పాస్ కావాలి, ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాలనేది ఆమె కల. కానీ మాయదారి గుండెపోటు ఆ కలల్ని ఛిద్రం చేసింది. బుధవారం ధార్వాడ పురోహిత నగరలో జీవిత కుసగూర (26) అనే విద్యావంతురాలు ఆకస్మికంగా మరణించింది. ఉదయం ఇంట్లో ఉండగా తల తిప్పినట్లుగా ఉందని చెబుతూ కూర్చుండిపోయింది. కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే శ్వాస వదిలింది. ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించగా గుండెపోటుతో మరణించిందని ప్రకటించారు. ఎంఎస్సీ అగ్రిక ల్చర్ చదువుతున్న జీవిత యూపీఎస్ఈ పరీక్షలు రాసి ఐఏఎస్ అధికారి కావాలని కలలు కంది. ఈమె తండ్రి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. బిడ్డ చిరుప్రాయంలోనే మృత్యువాత పడటంతో కన్నీటి సంద్రంలో మునిగి పోయారు. పారిశ్రామికవేత్త కొడుకు.. దావణగెరె నగరంలోని జయనగరలో పారిశ్రామికవేత్త రేఖా ముర్గేశ్ కొడుకు అక్షయ్ (22) ఇంటిలో గుండెపోటుతో కిందపడి మరణించాడు. ఇతడు కాలేజీలో చదివేవాడు. ఎలాంటి అనారోగ్యం లేదని తెలిసింది. బెళగావిలో రైతు.. బెళగావి జిల్లా సవదత్తి పట్టణంలోని ఎపిఎంసీలో వాహన డ్రైవర్ అశోక్ జీరిగవాడ (40) కుప్పకూలి మృతి చెందారు. రైతు అయిన అశోక్ తన పొలంలో పెసర్లను అమ్మడానికి వచ్చి ప్రాణాలు విడిచాడు. కనకపురలో అటవీ ఉద్యోగి కనకపుర తాలూకా కోగ్గె దొడ్డి గ్రామానికి చెందిన మాదేశ్ నాయక్ (30) ఫారెస్ట్ గార్డ్గా పని చేస్తున్నాడు. ఒక్కసారిగా ఎద నొప్పి వచ్చి కింద పడి మృతి చెందారు. తరగతిలో బాలుడు.. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా కురుబగెరి గ్రామంలో నాలుగో తరగతి చదువుతున్న మనోజ్కుమార్ (9) అనే బాలుడు తరగతిలోనే కన్నుమూశాడు. పాఠం వింటూ కుప్పకూలాడు. మనోజ్ ఇప్పటికే గుండెలో రంధ్రం పడి చికిత్స పొందుతున్నాడు. అవుల కాపరి.. బెంగళూరు దక్షిణ జిల్లా గోల్లరదొడ్డికి చెందిన పశువుల కాపరి గిరీశ్ (25) గుండెపోటుకు బలయ్యాడు. గత మూడు రోజుల నుంచి గిరీశ్ ఎద నొప్పి అని కుటుంబీకులకు చెప్పేవాడు. బుధవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురై మరణించాడు. -
డీకే శివకుమార్ సీఎం కాలేరు
బళ్లారి అర్బన్: సీఎం సిద్దరామయ్య సీజనల్ పొలిటీషియన్తో పాటు మేధావి రాజకీయ నాయకుడని, ఆయన ఎట్టి పరిస్థితిలోను తాను అట్టిపెట్టుకున్న సీఎం స్థానాన్ని వదులుకోడానికి సిద్ధంగా లేరు, దీంతో డీకే.శివకుమార్ సీఎం అయ్యే ప్రసక్తే లేదని మాజీ మంత్రి శ్రీరాములు జోస్యం చెప్పారు. ఆయన తమ నివాసంలో స్థానిక మీడియాతో మాట్లాడారు. గతం 30 నెలల నుంచి కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉంది. వీరి హయాంలో ఏ అభివృద్ధి జరగలేదు. కేవలం గ్యారెంటీ గ్యారెంటీ అంటూ తమ ప్రభుత్వానికి గ్యారెంటీ లేకుండా చేసుకున్నారని ఎద్దేవా చేశారు. డీకే.శివకుమార్ సీఎం కుర్చీ కోసం, అలాగే సీఎం సిద్దరామయ్య ఆ పదవిని కాపాడుకోవడానికి తాపత్రయ పడుతున్నారన్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని సిద్దు సర్కారుపై శ్రీరాములు మండిపడ్డారు. దళిత సీఎం పేరుతో డీకేశికి చెక్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సుర్జేవాలా గత వారంలో రెండు సార్లు రాష్ట్రానికి వచ్చారు. సీఎం మార్పు డిమాండ్ తీవ్రత పెరగడంతో రాష్ట్ర రాజకీయాలను అతుకుల బొంతలా మార్చి వెళ్లిపోయారన్నారు. శివకుమార్ సీఎం కుర్చీ కోసం పరితపిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దరామయ్య తన పదవిని కాపాడుకోవడానికి అనివార్యంగా పోరాటం చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం కూలిపోతుందన్న శ్రీరాములు, ఇది తాను చెప్పే జోస్యం కాదు, నగ్న సత్యం అని అభివర్ణించారు. దళిత సీఎంను తెరపైకి తెచ్చి శివకుమార్ను అణచివేసే కుట్ర జరిగిందన్నారు. దళిత సీఎంకు తమ అభ్యంతరం ఏమీ లేదు. అయితే కుర్చీల కొట్లాటలో రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకూడదన్నారు. తమ స్వపక్ష ఎమ్మెల్యేలే సర్కారును నిధుల కోసం దేబిరించే పరిస్థితి గత 30 నెలల్లో చాలాసార్లు చూశామన్నారు. పలువురు ఎమ్మెల్యేలు గ్యారెంటీలను పక్కన పెట్టి తమకు నిధులు ఇవ్వాలని వేడుకుంటున్నారన్నారు. రాష్ట్ర ఖజానా దివాలా రాష్ట్రానికి ఈ దుర్గతి రాకుండా ఉండాల్సింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థులకు షూ, సాక్స్ ఇవ్వడానికి ప్రభుత్వం దాతలను వెతుకుతోందన్నారు. అలాగే అజీమ్ ప్రేమ్జీ ఇచ్చిన గుడ్లను వారానికి 6 రోజుల పాటు పంపిణీ చేయకుండా కేవలం మూడు రోజులకే పరిమితం చేశారన్నారు. దాతలు ఇచ్చిన నిధులను కూడా స్వాహా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని 10 పాలికె ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవన్నారు. దీంతో సదరు ఉద్యోగులు గత రెండు రోజుల నుంచి ఆందోళన చేపట్టారన్నారు. అన్ని శాఖలు కూడా దివాలా తీశాయన్నారు. ప్రభుత్వాన్ని నడపడానికి చేతకాక పోతే రాజీనామా చేస్తే తాము ఎన్నికలకు సిద్ధం అన్నారు. పార్టీ ప్రముఖులు వీరశేఖర్రెడ్డి, ఓబులేష్, భీమన్న, కార్పొరేటర్లు రేణుక మల్లనగౌడ, కే.హనుమంతప్ప, గుడిగంటి హనుమంతప్ప, వెంకటరామిరెడ్డి, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీరాములు జోస్యం మధ్యంతర ఎన్నికలకు మేం సిద్ధం -
పారిశుధ్య కార్మికుల ర్యాలీ
హొసపేటె: హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు బకాయి ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దళిత హక్కుల కమిటీ కార్యకర్తలు విశ్వవిద్యాలయంలోని క్రియాశక్తి భవనం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత కమిటీ నేత జంబయ్య నాయక్ మాట్లాడుతూ వందలాది ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులు కన్నడ విశ్వవిద్యాలయం స్థాపన కోసం తమ భూములను చాలా తక్కువ ధరకు ఇచ్చారు. మరికొందరు తమ భూములను ఉచితంగా ఇచ్చారు. అటువంటి ఎస్సీ, ఎస్టీ పేద రైతులు, వారి పిల్లలు, బంధువులు, వెనుకబడిన తరగతులు, దళిత సమాజానికి చెందిన 48 మంది గత 15–20 ఏళ్లుగా పారిశుధ్య కార్మికులుగా తక్కువ వేతనాలకు కన్నడ విశ్వవిద్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరు గత 11 నెలలుగా వేతనాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారన్నారు. అనంతరం వినతిపత్రాన్ని వర్సిటీ వైస్ ఛాన్సలర్ పరశివమూర్తికి అందజేశారు. -
గుండెపోటుతో మహిళ మృతి?
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లిలోని ఒక దుకాణంలో కూర్చున్న మహిళ అకస్మాత్తుగా కుప్పకూలి మరణించింది. మృతురాలిని హరపనహళ్లి తాలూకాలోని దిద్దగితాండా నివాసి జయాబాయి(52)గా గుర్తించారు. ఆ మహిళ కుప్పకూలిన వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే జయాబాయి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించింది. ఆమె గుండెపోటుతో మరణించి ఉంటుందని అనుమానిస్తున్నారు. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం రాయచూరు రూరల్: గ్రామాల్లో మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యత కల్పిస్తామని విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్ పేర్కొన్నారు. బుధవారం రాయచూరు తాలూకా మలయాబాద్లో కేకేఆర్డీబీ నుంచి విడుదలైన రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, రూ.10 లక్షలతో తాగునీటి సౌకర్యాల కల్పన పనులకు శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో విద్య, అరోగ్య రంగాలకు ప్రాముఖ్యత కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు మురళీ యాదవ్, ఆంజనేయలున్నారు. నగరసభ అధ్యక్షుడిగా నియామకం రాయచూరు రూరల్: నగరసభ అధ్యక్షుడిగా సాజిద్ సమీర్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఏడాది క్రితం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నరసమ్మ స్థానంలో ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్న సాజిద్ సమీర్ మూడు నెలల కోసం అధ్యక్ష పదవిలో కొనసాగడానికి అధిష్టానం అనుమతించినట్లు సమాచారం. -
కార్మికులకు పని గంటలు తగ్గించాలి
రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు పని గంటలు తగ్గించాలని సంయుక్త కార్మిక సంఘాల అధ్యక్షుడు వీరేష్ తెలిపారు. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. పనికి తగ్గట్లుగా వేతనాలు ఇవ్వాలని, పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.36 వేలు, రూ.26 వేలు చొప్పున వేతనాలు చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ పద్ధతికి స్వస్తి పలికి వారిని పర్మినెంట్ చేయాలని కోరారు. అసంఘటిత కార్మికులకు నెలకు రూ.9 వేల ఆర్థిక సహాయం అందించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విరమించుకొని, పెంచిన ధరలను తగ్గించాలన్నారు. -
సంచార నియమాలు పరిశీలించిన కలెక్టర్
బళ్లారి రూరల్ : పెరుగుతున్న ట్రాఫిక్తో ప్రమాదాలు అధికమౌతున్న నేపథ్యంలో దావణగెరె జిల్లాధికారి ట్రాఫిక్ కంట్రోలర్గా మారారు. దావణగెరె జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి బుధవారం ఉదయం 6 నుంచి 12 గంటల వరకు డెంటల్ కళాశాల రోడ్డు, బాయ్స్ హాస్టల్, స్పోర్ట్స్ హాస్టల్, ఎంసీసీ, బీ బ్లాక్, శ్యామనూరు వర్తుల రోడ్లలో వాహనాలను పరిశీలించి నేమ్ప్లేట్ లేని 30 వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. వాహనదారులకు కోర్టు నుంచి నోటీసులు ఇవ్వాలని సూచించారు. ప్రమాదాలు పెరుగుతుండటంతో ట్రాఫిక్ నియమాలు, వాహనాల నేమ్ప్లేట్లు, హెల్మెట్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లాధికారి వెంట ట్రాఫిక్ పోలీసు అధికారులు ఉన్నారు. నేమ్ ప్లేట్ లేని 30 వాహనాల స్వాధీనం చోదకులకు కోర్టు ద్వారా నోటీసులుఇవ్వాలని అధికారులకు సూచన -
నేడు గురు పౌర్ణమి వేడుకలు
బళ్లారిఅర్బన్: గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం బాబాకు అలంకరణ, ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతపూజలను అర్చకులు నరసింహ స్వామి నిర్వహించారని దేవస్థాన ధర్మకర్త నామాల కుమారస్వామి తెలిపారు. గురు పౌర్ణమి వేడుకలకు నగరంలోని షిర్డీ సాయిబాబా ఆలయాలు ముస్తాబయ్యాయి. అనంతపురం రోడ్డులో ఎంజీ సమీపంలోని విశాల్నగర్లో వెలసిన షిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం తెల్లవారు జాము నుంచి కాకడ హారతి, గణపతి పూజ, సాయిబాబాకు పంచామృత, క్షీరాభిషేకం, అలంకరణ, భక్తి గీతాలు, కీర్తనలు, అర్చనలు, లఘు హారతి, మహామంగళ హారతి అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. యువతీ యువకులైన భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. ఆలయం వద్ద భక్తులకు అనుకూలం కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. కాగా నగరంలోని కౌల్బజార్ షిర్డీ సాయిబాబా ఆలయంలో, కోటలో వెలసిన షిర్డీసాయి బాబా ఆలయంలో, పటేల్ నగర్లో వెలసిన షిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పూజలు జరుపుకునేందుకు భక్తులకు ఏర్పాట్లు చేశారు. ముస్తాబైన షిర్డీ సాయిబాబా ఆలయాలు -
రాయచూరు జెడ్పీ సీఈఓగా నియామకం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి రాహుల్ తుకారాం పాండే కలబుర్గి డివిజనల్ విద్యా శాఖ కమిషనర్గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో కారవార జెడ్పీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ఆయన విధులకు హాజరయ్యారు. జిల్లాలో భూసార పరీక్షలు, ప్రధానమంత్రి కృషి సంచయిని, మాతృవందనం, జాతీయ వ్యవసాయ వికాస్, నరేగ, తోటల పెంపకం, వివిధ పథకాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా కాడ్లూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుధవారం భారత జ్ఞాన విజ్ఞాన సమితి, వాసవి వనితా సేవా సమితి ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వాసవి వనితా సేవా సమితి కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం నుంచి కల్పించిన యూనిఫాం, పుస్తకాలు, మధ్యాహ్న భోజన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భారత జ్ఞాన విజ్ఞాన సమితి సంచాలకుడు హఫీజుల్లా, ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలకు రూ.2.5 కోట్ల భూమి దానం హొసపేటె: ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం కోసం ఒక రైతు కోట్ల విలువైన భూమిని దానంగా ఇచ్చిన ఘటన తాలూకాలోని హంపనకట్టెలో జరిగింది. గ్రామంలో ఎల్కేజీ, యూకేజీ నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన అందుబాటులో ఉంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో తాలూకాలో నెంబర్ వన్గా కొనసాగుతోంది. పాఠశాలలోని 14 గదుల్లో 750 మందికి పైగా పిల్లలు చదువుకోవాల్సి ఉంది. విద్యార్థులకు సరైన పాఠశాల భవనం, గదులు లేకుండా పోవడంతో స్థల యజమాని అమరేష్గౌడ పాఠశాల నిర్మాణం కోసం రూ.2.5 కోట్ల విలువైన ఒక ఎకరం భూమిని దానంగా ఇచ్చారు. -
దైన్యంగా కాలువలు
నిండుగా జలాశయాలు.. రాయచూరు రూరల్: జిల్లాలో రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండించుకోవాలనే ఆశలు అడియాసలు కానున్నాయి. రాయచూరు జిల్లాలోని సింధనూరు, మాన్వి, రాయచూరు తాలూకాల్లో తుంగభద్ర ఎడమ కాలువ, కృష్ణా నదిపై నిర్మించిన నారాయణపూర్ డ్యాం నుంచి రాయచూరు, యాదగిరి, కలబుర్గి జిల్లాల్లో నారాయణపుర కుడి, ఎడమ గట్టు కాలువలున్నాయి. గత కొన్నేళ్ల నుంచి వర్షాభావంతో జిల్లా రైతులు, ప్రజలు దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉన్న నీటి వనరులను వినియోగించుకొని రైతులను ఆదుకోవాలన్న ధ్యాస అధికారులకు, ప్రజా ప్రతినిధులకు లేకుండా పోతోంది. జలాశయాల కింద ఆయకట్టు చివరి భూముల రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా తయారైంది. పంట భూములు కళ్ల ముందే బీళ్లుగా మారడంతో రైతులు తల్లడిల్లి పోతున్నారు. పిచ్చి మొక్కలు, పూడికలతో కాలువలు పూడిపోయాయి. జిల్లాకు వర్షాభావం శాపమైతే, పాలకుల శీతకన్ను కాలువల పాలిట శాపమైంది. జిల్లాకు వరప్రసాదమైన తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణపుర కుడి కాలువల ఆధునికీకరణ పేరుతో ప్రతి ఏటా రూ.కోట్లలో నిధులు ఖర్చైనా ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి. కాలువకు నీరు వదిలిన మొదట్లోనే కాలువలకు గండ్లు పడడం, ఆయకట్టు చివరి భూములకు నీరందక రైతులు ఇబ్బందులకు గురి కావడం షరామామూలైంది. నిర్లక్ష్యానికి నిదర్శనంగా నాసిరకం పనులు తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణపుర కుడి కాలువల ఆధునికీకరణల పేరుతో చేపట్టిన పనులు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. కాలువలపై జంగిల్ కటింగ్, పూడికతీత వంటి పనులు చేసినట్లు కాంట్రాక్టర్లు రికార్డులు చూపించి సొమ్ములను స్వాహా చేస్తున్నారు. తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో రాయచూరు తాలూకాలో 99, 101, 102 డిస్టిబ్యూటర్ల వద్ద తూతూమంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు. నారాయణపుర కుడి కాలువ పరిధిలో లింగసూగూరు, దేవదుర్గ తాలూకాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మమదాపుర, మర్చటహాళ్లలో పీస్ వర్క్ల పేరుతో పనులు చేపట్టారు. కాలువల స్వరూపం మారింది. కొన్ని చోట్ల బండలు తీసి నల్లమట్టిని కప్పి పూడికను తీసినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఈ ఏడాది కాలువ చివరి ఆయకట్టు భూములకు నీరందడం గగనమని రైతులు వాపోయారు. పనులు నాసిరకంగా జరిగినా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. కాంట్రాక్టర్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కమీషన్ ఇవ్వడం వల్ల పనుల్లో పర్యవేక్షణ లోపించిందని రైతులు ఆరోపిస్తున్నారు. పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర, కృష్ణా నదులు ఈసారైనా చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందేనా? వర్ణనాతీతంగా కళ్యాణ కర్ణాటక రైతుల బాధలు -
చెరసాలలో ఉగ్రవాదులతో కుమ్మక్కు
బనశంకరి: ప్రమాదకర లష్కరే తోయిబా ఉగ్రవాదులతో ఓ పోలీస్ అధికారి, మానసిక వైద్యుడు, మహిళ కుమ్మక్కయ్యారు, వారి చేతిలో పావులుగా మారి దేశద్రోహానికి పాల్పడ్డారు, ఇది సినిమా కథ కాదు, బెంగళూరులో పేరుమోసిన పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జరుగుతున్న దందా. చివరకు ఎన్ఐఏ దాడుల్లో ముగ్గురు దుండగుల గుట్టు రట్టయింది. నాసీర్ నెట్వర్క్ మంగళూరు కుక్కర్బాంబ్, శివమొగ్గ ఉగ్రకార్యకలాపాలు, బెంగళూరులో కెఫె పేలుడుతో పాటు అనేక ఉగ్రవాద ఘటనలతో ప్రముఖ లష్కరే ఉగ్రవాది టి.నాసీర్కు సంబంధాలున్నాయి. అతనితో లింకులు ఉన్న వైద్యుడు, ఏఎస్ఐ, మరో మహిళను ఎన్ఐఏ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఉగ్రవాద కేసుల్లో నాసీర్ ఈ జైల్లోనే జీవితఖైదును అనుభవిస్తున్నాడు. పరప్పన జైలులో పనిచేసే మానసిక వైద్యుడు డాక్టర్ నాగరాజ్, జైలులోని ఏఎస్ఐ చాంద్పాషాలతో అనుమానిత ఉగ్రవాది తల్లి అనీశ్ ఫాతిమాతో నాసీర్ నిత్యం టచ్లో ఉన్నట్లు కనిపెట్టారు. ఇలా నాసీర్ ఊచల మధ్య నుంచే ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడైంది. కర్ణాటక, తమిళనాడు, కేరళలో స్లీపర్ సెల్స్తో సంబంధాలు కొనసాగిస్తూ బెంగళూరులో పెద్దఎత్తున విధ్వంసక చర్యలకు కుట్రపన్నాడనేది సమాచారం. గతంలో అరెస్టయిన ఉగ్ర అనుమానితులు జునైద్, మహమ్మద్ హర్షద్ఖాన్, సుహైల్, ఫైజల్, జాహిద్ తబ్రేజ్, ముదాసీర్ లకు కూడా డాక్టర్ నాగరాజ్, చాంద్పాషా, అనీస్ ఫాతిమా సహాయం చేస్తున్నారు. వీరూ పరప్పన జైల్లోనే ఉన్నారు. ఏఎస్ఐ చాంద్పాషా.. 2022 నుంచి నాసీర్తో ఏఎస్ఐ చాంద్పాషా కుమ్మక్కయ్యాడు. నాసీర్ను జైలు నుంచి వాయిదాల కోసం ఏయే కోర్టుకు తీసుకెళతారు అనే సమాచారం అతని సంబంధీకులకు లీక్ చేసేవాడు. పరారీలోనున్న ఉగ్రవాది జునైద్ అహ్మద్ తల్లి అనీస్ ఫాతిమా, నిరంతరం నాసీర్తో సంప్రదించేది. ఉగ్రవాదులకు నిధులు, శిక్షణ గురించి మాట్లాడుకునేవారు. ఆమె ఈ సమాచారాన్ని విదేశాల్లో ఉన్న కుమారుడు జునైద్ కు తెలిపేది. నాగరాజు.. జైల్లో మొబైల్ వ్యాపారం డాక్టర్ నాగరాజ్ నాలుగైదేళ్ల నుంచి పరప్పన జైలులో మానసిక వైద్యునిగా పనిచేస్తూ అక్రమాలకు నాంది పలికాడు. అతని అసిస్టెంట్ పవిత్ర కూడా తోడైంది. నాసీర్ తో పాటు ఖైదీలకు మొబైల్ స్మగ్లింగ్ చేసేవాడు. పవిత్ర పరారీలో ఉంది. నాగరాజు పరప్పన జైలులోకి దొంగచాటు మొబైల్ఫోన్స్ తీసుకెళ్లి రూ.10 వేల మొబైల్ ను రూ.50 వేలకు ఖైదీలకు విక్రయించేవాడు. ఇలా లక్షలాది రూపాయలను సంపాదించాడు. మొబైల్ కొనుగోలుదారుల నుంచి వాటిని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. దేశాన్ని అస్థిరపరిచేలా పరప్పన జైలు లోపల సాగుతున్న కార్యకలాపాలను చూసి ఎన్ఐఏ అధికారులే దిగ్భాంత్రికి లోనయ్యారు. 6 రోజుల కస్టడీ నాగరాజ్ , చాంద్పాషా, అనీస్ ఫాతిమా ఇళ్లు, సంబంధీకుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు సాగిస్తోంది. ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఉపకరణాలు, పుస్తకాలు, సీడీలు వంటి సామగ్రిని సేకరిస్తోంది. ఈ ముగ్గురినీ అనుమానిత ఉగ్రవాదులుగానే పేర్కొన్నారు. బుధవారం నగరంలోని సిటీ సివిల్ కోర్టులో హాజరుపరచగా కోర్టు 6 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి ఆదేశించింది. విచారణలో మరిన్ని నిజాలు వెల్లడి కావచ్చు. పరప్పన జైలు మానసిక వైద్యుడు, పోలీసు అరెస్టు అనుమానిత ఉగ్రవాది తల్లి కూడా ఎన్ఐఏ కార్యాచరణలో గుట్టురట్టు -
సంక్షేమ ప్రదాత డాక్టర్ వైఎస్సార్
బనశంకరి: ఆరోగ్యశ్రీ రూపకర్త, జలయజ్ఞ ప్రదాత, సంక్షేమ పథకాల సారథి దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ ఐటీ విభాగం బెంగళూరు టీమ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం హెచ్ఎస్ఆర్ లేఔట్ సమర్థనం ట్రస్ట్లో కేక్ కట్ చేసి వృద్ధులకు, పిల్లలకు అందజేశారు. పిల్లలు, విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు అందజేసి, అన్నదానం నిర్వహించారు. అందరి జీవితాల్లో వెలుగు వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్సార్ చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, జలయజ్ఞంతో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. ఫీజు రీఇంబర్స్మెంట్ పథకంతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని, అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడిన మహోన్నత నేత డాక్టర్ వైఎస్సార్ ఒక్కరే అని కొనియాడారు. పాల్గొన్న నేతలు ఈ కార్యక్రమంలో కడప జిల్లా వైఎస్సార్సీపీ ఐటీవింగ్ అధ్యక్షుడు కుమారస్వామిరెడ్డి, వైఎస్సార్ీసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ లయన్ భాస్కర్రెడ్డి, వైఎస్సార్సీపీ ఐటీవింగ్ రాష్ట్ర ప్రతినిధి జగన్ పూసపాటి, ఐటీ వింగ్ రాష్ట్ర సెక్రటరీ ప్రవీణ్కుమార్రెడ్డి, తంబళ్లపల్లి ఐటీవింగ్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, కర్ణాటక డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కే.భక్తవత్సలరెడ్డి, అనిల్కుమార్రెడ్డి, శ్రీధర్రెడ్డి, రామ్ సుదేశ్రెడ్డి, రామ్ పులివెందుల, సతీశ్చంద్ర, విజయరాఘవరెడ్డి, కేశవరెడ్డి, పూల సురేంద్రరెడ్డి, అభిమానులు పాల్గొన్నారు. కాగా, పలుచోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు మహా నేత జయంతిని జరిపించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బెంగళూరులో ఘనంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు పాల్గొన్న ఐటీ వింగ్ సభ్యులు, అభిమానులు -
ఎమ్మెల్యేపై భార్య, కూతురు ఫిర్యాదు
దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్పై ఆయన భార్య, కుమార్తె కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. బెంగళూరుకు వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ రణదీప్ సుర్జేవాలాను భార్య మాళవిక సోలంకి, కుమార్తె నిషా కలిశారు. యోగేశ్వర్ తమను ఎంతో వేధింపులకు గురిచేస్తున్నారని, కేసులు పెడుతూ కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడని తెలిపారు. ఆయన చర్యలతో తాము మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తున్నామని, తమకు పార్టీ తరఫున న్యాయం చేయాలని కోరారు. కాగా యోగేశ్వర్ కుటుంబ కలహాలు గతంలోనూ రచ్చకెక్కాయి. ఎన్నికల సమయంలో ఆయన కూతురు తండ్రిపై పోటీకి సై అన్నారు. యోగేశ్వర్ శీలాకుమారి అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. లంచగొండి పట్టివేత కోలారు: నివేశనానికి ఈ–ఖాతా చేసివ్వడానికి వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఉండగా ముళబాగిలు నగరసభ ఎస్డిఎ ప్రశాంత్ లోకాయుక్త కు చిక్కారు. ఇతనిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వివరాలు.. నేర్నహళ్లి గ్రామానికి జయరాం అనే వ్యక్తి ఇంటి ఈ–ఖాతా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ పని చేసివ్వడానికి ఎస్డిఎ ప్రశాంత్ రూ.6 వేల లంచం అడిగాడు. దీంతో జయరాం లోకాయుక్త అధికారులకు సమాచారమిచ్చాడు. బుధవారం ఆఫీసులో రూ.5 వేలు ముడుపు తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త ఇన్స్పెక్టర్ అంజనప్ప, సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. బైక్లు ఢీ, హెచ్ఎం దుర్మరణం శివమొగ్గ: రెండు బైక్లు ఎదురెదురు ఢీకొనడంతో ప్రధానోపాధ్యాయుడు మరణించగా, మరొకరికి గాయాలైన ఘటన జిల్లాలోని హొసనగర తాలూకా రిప్పన్పేటె పట్టణంలోని శివమందిరం వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. మృతుడు అరసాళు గ్రామానికి చెందిన టీ.మంజయ్య (59) కాగా, కోటెతారిగ ప్రభుత్వ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. పాఠశాలలో విధులు ముగించుకుని మంజయ్య బైక్పై ఇంటికి వెళుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన మరో బైకిస్టు ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన మంజయ్యను స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ రాజురెడ్డి సందర్శించి పరిశీలించారు. మంజయ్య మృతితో ఉపాధ్యాయులు, విద్యార్థులు విషాదానికి లోనయ్యారు. మహిళపై సామూహిక అత్యాచారంబనశంకరి: స్నేహితుల ఇంటికి వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన నగరంలో పరప్పన అగ్రహార పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. దొడ్డనాగమంగల సాయి లేఔట్లో స్నేహితుని ఇంటికి వచ్చిన మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. మహిళ వద్ద డబ్బు, మొబైల్ లాక్కుని ఉడాయించారు. ఈ ఘటన మూడురోజుల కిందట జరగ్గా, బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పౌర కార్మికులకు వాయనం మైసూరు: శ్రీదుర్గా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా మైసూరు చాముండి కొండలో శ్రీచాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో మహిళా పౌర కార్మికులకు చీరలు, గాజులు, పసుపు, కుంకుమతో వాయనం సమర్పించారు. వారి సేవలను అభినందించారు. షేర్ల పేరుతో రూ.34 లక్షల మస్కా శివమొగ్గ: షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు గడించవచ్చని వాట్సాప్కు వచ్చిన సందేశాన్ని నమ్మి ఓ వ్యక్తి లక్షలాది రూపాయలను కోల్పోయిన ఘటన శివమొగ్గ నగరంలో వెలుగు చూసింది. వివరాలు.. బీబీ రోడ్డు నివాసి, 30 ఏళ్ల బాధితుని మొబైల్కు సైబర్ నేరగాళ్ల నుంచి ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తమ ద్వారా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు గడించవచ్చని అందులో ఉంది. దీనిని నమ్మిన బాధితుడు దశల వారీగా వంచకుల బ్యాంకు ఖాతాలకు ఆన్లైన్ ద్వారా మొత్తం రూ.34.16 లక్షలను బదలాయించాడు. త్వరలోనే భారీ లాభం చూపిస్తామని నమ్మించారు. అయితే అతని నంబరును బ్లాక్ చేసి అందుబాటులో లేకుండాపోయారు. ఈ మోసంపై శివమొగ్గ సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.