Karnataka
-
బెంగళూరులో ఆకలి తీర్చుకుందామని హోటల్కు వెళ్లేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ధరల మంట అలా ఉంది. ఏది ముట్టుకున్నా వాత తప్పదు
● రాజధానిలో మోతెక్కిపోతున్న రేట్లు ● మసాలా దోసె రూ.100 ● ప్లేటు పూరీ.. అంతే ధర ● యుద్ధం, గ్యాస్ ధరలతో మంట సాక్షి, బెంగళూరు: ఐటీ సిటీలో మామూలుగానే హోటళ్లలో ధరలు ఎక్కువ. ఇప్పుడు ఇరాన్ యుద్ధం, గ్యాస్ ధరల పెంపు వల్ల మరింతగా హోటల్ సందర్శకులపై భారం పడుతోంది. ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదు అనేలా హోటళ్లలో రేట్లు భగ్గుమంటున్నాయి. గత వారంలోనే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ. 993 మేర కేంద్రం పెంచింది. గత రెండు నెలల కాలంలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,490 మేర పెరిగింది. దీనిని కారణంగా చూపుతూ నగరంలోని ఎక్కువ శాతం హోటళ్లు ఆహార పదార్థాలు, టీ, కాఫీ ధరలను పెద్దమొత్తంలో పెంచేశాయి. దీంతో ఆరగిద్దామని వెళ్లేవారికి జేబులకు చిల్లులు పడుతున్నాయి. నెలరోజుల్లో రెండోసారి బాదుడు ● బెంగళూరు నగరంలో సుమారు 40 వేళ్లకు పైగా హోటళ్లు ఉన్నాయి. వీటన్నింటిలో ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ● ఒక నెల రోజుల క్రితమే గ్యాస్ కొరత నెపంతో హోటళ్లు టిఫిన్, భోజన ధరలను పెంచాయి. ● భోజనం ధర రూ. 10 నుంచి రూ. 20 మేర, టిఫిన్ ధరలు రూ 5–10 మేర పెరిగాయి. ఇడ్లీ రూ. 5, దోసె రూ. 10 వరకూ రేటు అధికమైంది. ● మల్లేశ్వరంలోని ప్రముఖ హోటళ్లలో రెండు పూరీలు, కూర ధర రూ. 100కు చేరింది. రెండు నెలల క్రితం ఈ ధర రూ. 80 వద్ద ఉండేది. ప్లేటు పులిహోరె రూ. 70 నుంచి రూ. 80కు పెరిగింది. ● జయనగర మూడో బ్లాక్లో దోసె క్యాంప్ హోటల్లో గతంలో మసాల దోసె రూ. 90 ఉండగా ఇప్పుడు రూ.100కు పెంచేశారు. భోజనం మరింత ప్రియం బెంగళూరులో కామత్ హోటళ్ల గురించి తెలిసిందే. వీటిలో గతంలో భోజన ధర రూ. 120 ఉండగా, నేడు అది రూ.140కి చేరింది. గతంలో దోసె రూ. 90 అయితే ఇప్పుడు వంద అయ్యింది. రూ.20 ఉన్న టీ ధర రూ.25కు పెరిగింది. సింగిల్ పూరీ రూ. 50 నుంచి రూ. 55కు చేరింది. కొన్ని దర్శిని హోటళ్లలో రూ.90 ఉన్న భోజనం రేటు రూ. 100కు పెంచారు. ఇలా ఏది ముట్టుకున్నా అదనంగా చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. సామాన్యులపై భారం రేట్ల పెంపు వల్ల కొన్ని నెలల్లో హోటళ్లకు 15–20 శాతం సందర్శకుల సంఖ్య క్షీణించినట్లు సమాచారం. బ్యాచిలర్లు, అల్పాదాయ ప్రజలు ధరల్ని తలచుకుని అమ్మో అంటున్నారు. చిన్నపాటి హోటళ్లలో 200 గ్రాముల కబాబ్కు రూ.100 ఉండగా ఇప్పుడు రూ. 120కి పెరిగింది. చికెన్ బిర్యానీ ధర కూడా చిన్నహోటళ్లలో రూ. 130 నుంచి రూ. 140కి పెంచారు. వంట గ్యాస్ కొరత తీరుతోందని అనుకునేలోపల ధరలతో ఇబ్బంది వచ్చింది. -
ప్రపంచస్థాయికి బెంగళూరు
● మాస్టర్ప్లాన్ తయారీకి ఒప్పందం: డీసీఎం బనశంకరి: బెంగళూరును ప్రపంచస్థాయి ప్రగతి హబ్ గా తీర్చిదిద్దడానికి గత మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నామని డీసీఎం డీకే.శివకుమార్ తెలిపారు. బెంగళూరు పురోగతికి ఆర్థిక మాస్టర్ప్లాన్ రూపొందించడం ఐఎస్ఈజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మంగళవారం విధానసౌధలో నగరాభివృద్ధిశాఖ కార్యదర్శి తుషార్ గిరినాథ్, ఐఎస్ఈజీ డైరెక్టర్ డాక్టర్ శిరీష్ సంఖ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డీకే మాట్లాడుతూ బెంగళూరు చుట్టుపక్కల రికార్డు స్థాయిలో ఆర్థిక శక్తిని అందించామని చెప్పారు. 8 వేల చదరపు కిలోమీటర్ల కంటే పెద్దదైన బెంగళూరు అభివృద్ధి, ఎగుమతుల్లో దూసుకెళ్తోందన్నారు. బెంగళూరుకు 500 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 2032 నుంచి 2037 వరకు చేపట్టాల్సిన ఆర్థిక మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. టూరిజం అభివృద్ధి, ఉద్యోగ కల్పన, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం తదితరాలు ఇందులో ఉంటాయన్నారు. సుమారు రూ.2 లక్షల కోట్ల విలువచేసే పథకాన్ని దశలవారీగా కార్యరూపంలోకి తీసుకువస్తామన్నారు. ఇందుకోసం ఐటీ, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పాటు ప్రజల నుంచి సలహాలను సేకరిస్తామన్నారు. బెంగళూరును ప్రపంచ నగరాలతో పోటీపడేలా చేస్తామని తెలిపారు.ఎయిర్పోర్టులో కొత్త భద్రతా చర్యలు శివాజీనగర: దేశ, విదేశాల్లో ఇటీవల విమాన ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ) భద్రత దృష్ట్యా కొత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విమానాలు సంచరించే స్థలంలో భద్రత పెంచేందుకు ‘స్మార్ట్ ఏర్సైడ్ సేఫ్టీ సిస్టం’ అనే కొత్త సాంకేతికను అమల్లోకి తీసుకొచ్చారు. స్మార్ట్ కెమెరాలు, ఏఐ పరిజ్ఞానంతో విమానాశ్రయ వాహనాల సంచారంపై నిఘా వేస్తారు. అలాగే పొగమంచులో, వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు విమానాలకు ప్రమాదం జరగకుండా చూస్తారు. కుర్చీ గందరగోళాన్ని సరిదిద్దాలి: మంత్రి సతీశ్ బనశంకరి: సీఎం పదవి మార్పు గురించి సీఎం, డిప్యూటీ సీఎంను పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించి గందరగోళాన్ని నివారించాలని ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి డిమాండ్ చేశారు. మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ సీఎం మార్పు గురించి మల్లికార్జున్ఖర్గే రెండురోజులక్రితం చెప్పారని, ఎన్ని రోజులు ఇలాచెబుతారని, హై కమాండ్ నేతలు అందరి అభిప్రాయాలు తీసుకుని తీర్మానం చేసి గందరగోళానికి చెక్ పెట్టాలన్నారు. అహింద ఓట్లతోనే గెలుపు సాధ్యమైందని, 2028లో అహిందను ఏకతాటిపైకి తీసుకురావడం సవాల్గా మారిందని అన్నారు. దావణగెరె ఉప ఎన్నికలో మైనారిటీల ఓట్లు మైనస్ కావడం చేతులారా జరిగిందని అన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, అంతలోగా దీనిని సరిదిద్దాలన్నారు. పోలీసు ఆత్మహత్య మైసూరు: మానసిక వేదనతో విసిగిపోయి పోలీసు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరులో జరిగింది. మృతున్ని మైసూరులోని దేవరాజ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్యాంప్రసాద్ (45)గా గుర్తించారు. నగరంలోని పోలీస్ లేఔట్లోని సొంత ఇల్లు కలిగిన శ్యాంప్రసాద్ దేవరాజ పోలీసు స్టేషన్లో గత ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. డ్యూటీకి రాకపోవడంతో మంగళవారం ఉదయం పోలీసులు వచ్చి చూడగా ఇంట్లో ఉరికి వేలాడుతూ ఉన్నాడు. నజరబాద్ పోలీసులు స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబ కలహాలు, ఉద్యోగంలో ఒత్తిళ్లే కారణమని అనుమానాలున్నాయి. -
బెంగళూరుతో పాటు జిల్లాలకు వర్షసూచన
బనశంకరి: భరించలేని వేసవి ఎండల మధ్య వాన హెచ్చరికలు వచ్చాయి. బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సుమారు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు, పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారముంది. దీంతో బెంగళూరు, రూరల్తో పాటు 13 జిల్లాల్లో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ను ప్రకటించింది. చిక్కబళ్లాపుర, రామనగర, మండ్య, మైసూరు, చామరాజనగర, కొడగు, కోలారు, బెళగావి, ధార్వాడకు అలర్ట్ వచ్చింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మంగళవారం సాయంత్రం బెంగళూరులో పలుచోట్ల జల్లు వర్షం కురిసింది. బెళగావి నగరంలో జోరువాన పడడంతో రోడ్లు జలమయం అయ్యాయి. నగరంలో జల్లులు, బెళగావిలో వర్షం -
మంత్రి జమీర్ ఇంట్లో నగల చోరీ
యశవంతపుర: ఏకంగా మంత్రి ఇంటికే కన్నం వేశారు కేటుగాళ్లు. గృహ నిర్మాణశాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ నివాసంలో బంగారు నగలను చోరీ చేసిన ఇద్దరు దొంగలను బెంగళూరు శివాజీనగర పోలీసులు అరెస్ట్ చేసి రూ.1.13 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేశారు. మత్తికెరెకి చెందిన సయ్యద్ అమీన్ అహ్మద్ (48), గోవిందపురవాసి అమీర్ అహ్మద్ (48) పట్టుబడిన దొంగలు, వారి నుంచి 759 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ సీమాంత్కుమార్ సింగ్ మంగళవారం తెలిపారు. శివాజీనగర స్టేషన్ రోడ్డులో మంత్రి ఇల్లు ఉంది, మంత్రి తల్లి అందులో ఉంటారు, ఏప్రిల్ 15న బీరువాలో ఉంచిన 1.2 కేజీల బంగారు నగలు పోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం వచ్చిన పై దొంగలు ఇంట్లోకి చొరబడి నగలను ఎత్తుకెళ్లారని తేలింది. బడా బైక్ దొంగల అరెస్టు స్కూటర్లు, బైకులను చోరీ చేసి వాటికి నకిలీ ఆర్సి కార్డులను సృష్టించి అమ్ముతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను మంగళవారం బెంగళూరు హెబ్బగోడి పోలీసులు అరెస్ట్ చేసి రూ.41.67 లక్షలు విలువగల 51 వాహనాలను సీజ్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన చిత్తప్పగారి ఆనంద్ (39), నంద్యాలకు చెందిన షేక్ షఫీర్ బాషా (31)ను అరెస్ట్ చేశారు. 501 నకిలీ ఆర్సి కార్డులు కూడా లభించాయి. ఇటీవల బెంగళూరులో పలుచోట్ల బైక్లు చోరీ అయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. హెబ్బగోడి పోలీసులు గత నెల 5న ఓ నిందితున్ని పట్టుకుని విచారించగా, గుట్టు రట్టయింది. హైదరాబాద్కు చెందిన ఓ ఏజెంట్ సాయంతో ఇంటర్నెట్ సెంటర్లో డూప్లికేట్ ఆర్సి కార్డులను రూపొందించినట్లు చెప్పారు. ఫేస్బుక్లో ప్రకటనలిచ్చి చోరీ వాహనాలను అసలుగా నమ్మించి అమ్మేసినట్లు ఒప్పుకున్నారు. వీరు బెంగళూరులో 9 పోలీసు స్టేషన్ల పరిధిలో బైక్ చోరీలకు పాల్పడ్డారు. 692 మొబైళ్ల రికవరీ బెంగళూరు ఈశాన్య పరిధిలో చోరీలకు గురైన 692 మొబైల్ఫోన్లను రికవరీ చేసి సొంతదారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ రూ.1.75 కోట్లు అని చెప్పారు. ఈశాన్య విభాగంలోని 11 పోలీసు స్టేషన్ల పరిధిలో చోరీలకు గురైన మొబైల్లను సీఈఐఆర్ పరిజ్ఞానం ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు దొంగల అరెస్టు ఆభరణాల స్వాధీనం -
టెన్నిస్ టోర్నీ షురూ
తుమకూరు: కల్పతరునాడు తుమకూరు నగరంలో ఐటీఎఫ్డబ్ల్యూ–35 ర్యాంకింగ్ తుమకూరు మహిళా ఓపెన్ టెన్నిస్ టోర్నీకి మంగళవారం లాంఛనంగా శ్రీకారం చుట్టారు. తుమకూరు విశ్వవిద్యాలయం ఆవరణలో నిర్మించిన టెన్నిస్ కోర్టు ఈ టోర్నీకి వేదికైంది. హోంమంత్రి జీ.పరమేశ్వర్, టోర్నీ ప్రముఖులు, జిల్లాధికారి, ఎమ్మెల్యేలు బెలూన్లను ఎగరేయడం ద్వారా నాంది పలికారు. కన్నికా పరమేశ్వర్, ఎమ్మెల్యేలు సురేష్గౌడ, జ్యోతిగణేష్, సురేష్బాబు, గోవిందరాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మ్యాచ్లలో పలువురు క్రీడాకారిణులు తలపడగా, పెద్దసంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. -
శృంగేరి.. తపాలా ఓట్ల కిరికిరి
శివాజీనగర: ప్రముఖ పుణ్యక్షేత్రం, శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ల పునర్ లెక్కింపులో బీజేపీ నాయకులు క్రిమినల్ పన్నాగం పన్ని ఓట్ల దొంగిలించారని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. శృంగేరిలో ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి జీవరాజ్ విజయం సాధించడం తెలిసిందే. దీంతో మూడేళ్లుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేగౌడ మాజీ కావడంతో కాంగ్రెస్ పెద్దల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎందుకు చెల్లలేదు? మంగళవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో సీఎం సిద్దరామయ్య మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజేగౌడ గత అసెంబ్లీ ఎన్నికల్లో 201 ఓట్లతో గెలుపు సాధించారు. రాజేగౌడకు ఈవీఎంలలో 59,171 ఓట్లు, 569 పోస్టల్ ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి జీవరాజ్కు ఈవీఎంలలో 58,970 ఓట్లు, పోస్టల్ ఓట్లు 692 వచ్చాయి. 200 ఓట్లతో రాజేగౌడ గెలిచారు. బీజేపీ అభ్యర్థి ఎన్నికల్లో అక్రమం జరిగిందని కేసు వేశారు అని సీఎం తెలిపారు. రీకౌంటింగ్లో 314 ఓట్లు మాత్రమే చెల్లినవి. 255 ఓట్లు చెల్లలేదు, అవి ఎందుకు చెల్లలేదో చెప్పాలన్నారు. జీవరాజ్కు రీకౌంటింగ్లో గతం కంటే 2 ఓట్లు తగ్గి 690 ఓట్లు వచ్చాయి, దీనిని చూస్తే బీజేపీ నాయకులు ఓట్ చోరీ చేశారనేది తెలుస్తుందన్నారు. రీకౌంటింగ్కు కేంద్ర పరిశీలకులు వచ్చారు, కుట్ర జరిగిందని వారే కేంద్రానికి లేఖ రాసినట్లు తనకు తెలిసిందన్నారు. ఏమవుతుందో చూడాలని అన్నారు. దావణగెరె, బాగల్కోట ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని, 2028 ఎన్నికల్లో కూడా తామే అధికారంలోకి వస్తామని చెప్పారు. అభ్యర్థిపై కేసు.. హైకోర్టు ఆగ్రహం శివాజీనగర: గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని శృంగేరి నూతన బీజేపీ ఎమ్మెల్యే జీవరాజ్ హైకోర్టులో అర్జీ దాఖలు చేశారు. మంగళవారం న్యాయమూర్తి విచారించారు. 2023 మే 13న జరిగిన ఘటన మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేస్తే ఎలా? ట్యాంపరింగ్ గురించి హైకోర్టుకు సమాచారం ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ చేస్తారా? ఓటమిపాలైనవారు ఎవరు కుట్ర చేస్తారు, ఎవరు వారు? పిలవండి, మీకు కళ్లు కనిపించవా, సస్పెండ్ చేయాల్సి ఉంటుంది.. అని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రస్తుత ఎన్నికలాధికారి గౌరవ్ శెట్టిపై ఎందుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు, రాజకీయ ప్రభావానికి లోనై కేసులు పెట్టరాదు అని సూచించారు. జీవరాజ్పై బలవంతపు చర్యలు తీసుకోరాదని స్టే జారీ చేసి విచారణను వాయిదా వేశారు. దీంతో జీవరాజ్కు ఊరట దక్కింది. అక్కడ బీజేపీ నేతలచే ఓట్ చోరీ జరిగింది సీఎం సిద్దరామయ్య ఆరోపణలు కోర్టులో బీజేపీ అభ్యర్థికి మరోసారి ఊరట -
అడ్డపల్లకీ వైభవం
గౌరిబిదనూరు: నగరంలో వీరశైవ లింగాయత పంచ పీఠాల భక్తులు ఏర్పాటు చేసిన జగద్గురు రంభాపురి వీర సింహాసనాధీశ్వర 1008 జగద్గురు ప్రసన్న రేణుకా వీరసోమేశ్వర రాజ దేశికేంద్ర శివాచార్య మహాస్వామి అడ్డపల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. సోమ, మంగళవారాలు పల్లకీ వేడుకలు పుర వీధులలో అట్టహాసంగా సాగాయి. జానపద బృందాల ప్రదర్శనలు అలరించాయి. స్వామీజీలు మాట్లాడుతూ సమాజంలో ధర్మ జాగృతి, శాంతి తదితర ప్రాముఖ్యతను వివరించారు. అంబాదేవి హారతి వేడుక తుమకూరు: జిల్లాలోని శిరా తాలూకా హులికుంటె ఫిర్కా హొసహళ్లి గ్రామంలోని శ్రీ అంబాదేవి దేవస్థానం 20వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. హొసహళ్లి, నేరలహళ్లితో పాటు చుట్టుపక్కల పలు గ్రామాల భక్తులు, మహిళలు జ్యోతులు మోసుకొచ్చి అంబాదేవికి హారతి ఉత్సవం నిర్వహించారు. అర్చకులు హెచ్ఎం శశిధర్ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. రాష్ట్ర సర్కారుతో ప్రజలకు విసుగు: కుమార తుమకూరు: రాష్ట్రంలోని ఇప్పటి ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెందారని, రాబోయే రోజుల్లో బీజేపీ, జేడీఎస్ కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి అన్నారు. తుమకూరు తాలూకా ముళకుంటె గ్రామంలో మంగళవారం జరిగిన విజయ చౌడేశ్వరి దేవి జాతర మహోత్సవంలో ఆయన పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. తరువాత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ సర్కారు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిందన్నారు. ఈ గెలుపు దేశ తదుపరి ఎన్నికలకు దిక్సూచి అన్నారు. ఈ సభలో జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.నింగప్ప, సీబీ సురే ష్బాబు, ఎమ్మెల్యేలు బీ.సురేష్గౌడ, ఎంటీ కృష్ణప్ప, మాజీ ఎమ్మెల్సీ చౌడరెడ్డి పాల్గొన్నారు. 8 నుంచి కబ్బన్పార్క్లో మామిడి, పనస మేళాశివాజీనగర: ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మే 8 నుంచి 17 వరకు బెంగళూరు కబ్బన్ పార్కులో రాష్ట్రస్థాయి మామిడి, పనస ప్రదర్శన, అమ్మక మేళా జరగనుంది. సహజంగా మాగబెట్టిన పండ్లు, రైతులు నేరుగా విక్రయించడం వల్ల మంచి ధరలకే లభిస్తాయని చెప్పారు. మామిడి రైతులకు మార్కెటింగ్ నేరుగా లాభాల గురించి సమాచారం అందస్తారు. ఉత్తమ రకాలైన పనస, మామిడి పండ్లు లభిస్తాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 1.45 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల మామిడి పూత ఆలస్యమైంది. మామిడి పండ్ల సరఫరా లేటుగా జరుగుతోంది. దీని వల్ల పండ్లు ఎక్కువ కాలం లభిస్తాయని చెప్పారు. ఇస్రో క్యాంపస్పై అనుమానిత డ్రోన్ శివాజీనగర: బెంగళూరులో ఇస్రో క్యాంపస్పై గుర్తుతెలియని డ్రోన్ విహారం కలకలం రేపింది. మే 2న ఉదయం 8:16 గంటల సమయంలో కార్తీక్ నగరలోని ఇస్రో ఉపగ్రహ యూనిట్, పరీక్షా కేంద్రంపై సుమారు 80 నుంచి 100 అడుగుల ఎత్తులో కొన్ని క్షణాల పాటు గుర్తు తెలియని డ్రోన్ విహరించిందని సీఐఎస్ఎఫ్ సిబ్బంది హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేశ భద్రత దృష్ట్యా ఇస్రో క్యాంపస్ సున్నిత ప్రదేశంకాగా, నో డ్రోన్ జోన్గా గుర్తించబడింది. డ్రోన్ను ఎగురవేసినవారిని గుర్తించి, దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు. పసిబిడ్డ విక్రయం ఉత్తిదే.. బనశంకరి: భార్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయి, రెండున్నరేళ్లు వయసుగల చిన్నారిని రూ.5 లక్షలకు అమ్మేసిందని భర్త తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలింది. అలాంటిది ఏదీ జరగలేదని బెంగళూరు వివేకనగర పోలీసులు కనిపెట్టారు. దంపతుల మధ్య గొడవలతో ఇలా ఫిర్యాదు చేశాడని చెప్పారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. -
భీమా నదిలో వ్యర్థాల తొలగింపు
రాయచూరు రూరల్: భీమా నదిలో స్వచ్ఛతకు యువ బ్రిగేడ్ శ్రీకారం చుట్టింది. ఆదివారం కలబుర్గి జిల్లా అప్జల్పుర వద్ద భీమా నదిలో చెత్త చెదారం, ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలు, దుస్తులు, ఇతరత్ర స్వచ్ఛత కార్యకమానికి శ్రీకారం చుట్టారు. వానకాలం ప్రారంభానికి ముందే వర్షపు నీరు వచ్చి నదిలో చేరక ముందే అపరిశుభ్రతను తొలగించారు. అప్జల్పుర యువ బ్రిగేడ్ సంచాలకుడు రాజేంద్ర ఆధ్వర్యంలో 15 మందితో కూడిన బృందం నదీ తీర ప్రాంతాలను శుభ్రం చేశారు. దేశ రక్షణలో సైనికుల పాత్ర అమోఘంరాయచూరు రూరల్: దేశ రక్షణలో సైనికుల పాత్ర అమోఘమని రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్ అన్నారు. ఆదివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో మాజీ సైనికుల క్షేమాభివృద్ధి సంఘాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో శాంతియుతంగా మానవుడు ఉన్నారంటే సైనికుల వల్లేనని గుర్తెరగాలన్నారు. వారిని గౌరవించడం మనందరి కర్తవ్యమన్నారు. మాజీ సైనికుల క్షేమాభివృద్ధి సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని జిల్లాధికారికి లేఖ రాసినట్లు తెలిపారు. కుటుంబం గురించి ఆలోచించని సైనికులు దేశ రక్షణ, శాంతి సౌభ్రాతృత్వం కోసం పాకులాడుతారన్నారు. కార్యక్రమంలో శివరామానంద భారతి స్వామీజీ, వెంకన గౌడ, ధర్మణ్ణ, కృష్టమూర్తి, వీరభద్రయ్య, పంపణ్ణ, చక్రవర్తి, విశ్వనాథ్, రంగనగౌడ, శరణ బసవ, హంపనగౌడ, బసవరాజ్లున్నారు. మసరకల్ ఆస్పత్రికి జాతీయ స్థాయి అవార్డు రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా మసరకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయి అవార్డును కై వసం చేసుకుంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ కమిటీ వచ్చి పరిశీలించిన బృందంలో మహారాష్ట్రకు చెందిన డాక్టర్ శ్రీశైల పాటిల్, తమిళనాడు కావేరి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సర్వేలో 91.27 శాతం జాతీయ ఆరోగ్య మిషన్ పథకం నుంచి ఆస్పత్రిలో శుభ్రత, మందుల లభ్యత, రోగులకు చికిత్సలు, స్నేహ సంబంధాలు, అత్యవసర చికిత్సల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, వైద్యులు, నర్సులు, సిబ్బంది మధ్య ఉన్న సమన్వయం వంటి అంశాలను గుర్తించిన బృందం ఎన్క్యూఏఎస్ అవార్డుకు ఎంపికై ంది. మసరకల్ ఆస్పత్రి వైద్యులు బనదేశ్, శంశుద్దీన్, సిబ్బంది హరీష్, మల్లయ్య, పర్వేజ్ల సేవలను గుర్తించారని జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు, ఆర్సీహెచ్ అధికారిణి నందిత పేర్కొన్నారు. కొప్పళ జిల్లాలో నవజాత శిశువు రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో నవజాత శిశువు లభ్యమైన ఘటన వీడియో వైరల్ అయింది. సోమవారం కుకనూరు తాలూకా ద్యాంపురలో అప్పుడే పుట్టిన బిడ్డను వీధి పక్కన పారేసి పరారయ్యారు. గ్రామస్తులు చేరి శిశువును ఎత్తుకుని సకల పరిచర్యలు చేశారు. అనంతరం బాలల సంక్షేమ సమితికి అప్పగించారు. ఎవరో పురిటి బిడ్డను కర్కశంగా రోడ్డు పక్కన పడేసి పోవడం చూపరులందరి మనస్సులను కలిచి వేసింది. రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యతరాయచూరు రూరల్: రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసనగౌడ పేర్కొన్నారు. సోమవారం రాయచూరు తాలూకా శక్తినగర్ నుంచి కాడ్లూరు వరకు రోడ్డు, గిల్లేసూగూరు–తురకనడోణ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి మాట్లాడారు. పనులు నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు. -
చెరువులో స్నానానికెళ్లి యువకుడు మృతి
హొసపేటె: సరదాగా చెరువులో స్నానం చేయడానికి వెళ్లిన ఓ యువకుడు మునిగి మృతి చెందిన ఘటన సోమవారం విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో జరిగింది. సిద్దాపుర వడ్డరహట్టికి చెందిన యువకుడు అరుణ్ (19) ఈ ఏడాది ద్వితీయ పీయూసీ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. వేసవి సెలవుల్లో కూలి పని కోసం మండ్యకు వెళ్లిన అరుణ్ తమ బంధువు వివాహం కోసం తమ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఇంటి నుంచి కానాహొసహళ్లికి జుట్టు కత్తిరించుకోవడానికి వచ్చిన అరుణ్, తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం సరదాగా చెరువులో స్నానానికి వెళ్లగా ఈ సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు చీకటి పడేంత వరకు చెరువులో గాలించినప్పటికీ మృతదేహం లభించలేదు. చివరకు కానాహొసహళ్లి పోలీసులు దావణగెరె జిల్లాలోని హరిహర నుంచి నలుగురు గత ఈతగాళ్లను రప్పించగా, యువకుడి మృతదేహాన్ని గజ ఈతగాళ్లు వెలికి తీశారు. పేదవారైన మృతుని తల్లిదండ్రులు, తమ ఏకై క కుమారుడిని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కానాహొసహళ్లి పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదైంది. క్యాన్సర్ బాధిత పిల్లల కోసం క్రీడా మైదానం ప్రారంభంహుబ్లీ: ఎస్బీఎం ఆస్పత్రిలో డాక్టర్ నిరంజన్కుమార్ 75వ జన్మదినం సందర్భంగా క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలకు ప్రత్యేక క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. పిల్లల క్యాన్సర్ విభాగం ఇటీవల ప్రారంభం కాగా కిమోథెరపీ పొందుతున్న పిల్లల సంఖ్య పెరిగింది. దీర్ఘకాలం పాటు ఆస్పత్రిలో ఉండే పిల్లల్లో ఉత్తేజం నింపడానికి ఈ కొత్త కార్యక్రమం చేపట్టారు. ఉత్తర కర్ణాటకలో తొలిసారిగా నిర్మించిన ఈ ఆట మైదానం చిన్న పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు. ఇక్కడ 100కు పైగా పుస్తకాలతో కూడిన గ్రంథాలయం ఉంది. మృదువైన సామాన్లు, బోర్డు గేమ్స్, క్యారంస్ ఆట, వైస్ ఛాన్సలర్ 2 ఏళ్ల పిల్లాడితో క్రికెట్ ఆడటం ద్వారా ఆట మైదానాన్ని అధికారికంగా ప్రారంభించారు. డాక్టర్ తన్వీర్ షేక్ మాట్లాడుతూ క్యాన్సర్ కిమోథెరపీ పిల్లల దేహాన్ని బలహీన పరుస్తుంది. అయితే వారి మనోనిబ్బరం, ఆత్మసైర్యాన్ని తగ్గించలేదన్నారు. ఈ ఆట మైదానం సమగ్ర చికిత్సకు ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో చికిత్స పూర్తి చేసుకున్న పిల్లలతో పాటు 4వ స్టేజ్ క్యాన్సర్ చికిత్స పొందిన ఓ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్తో 4వ స్టేజ్లో ఉన్న చిన్నారి వ్యాధిని జయించాడు. ముఖ్యంగా ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో 67 శాతం మార్కులు సాధించిన బాధిత బాలిక అందరిలో విశ్వాసాన్ని నింపారు. బహిరంగ స్థలంలో పొగాకు వాడితే రూ.1000 జరిమానాహుబ్లీ: బహిరంగ స్థలాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించారు. ఎవరైన వ్యక్తి బహిరంగ స్థలంలో పొగాకు ఉత్పత్తులను వాడరాదు. ఒక వేళ వాడిన పక్షంలో రూ.200 నుంచి రూ.2000 దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ విషయమై జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించారు. 21 ఏళ్ల లోపు వ్యక్తులపై నిర్ధిష్ట ప్రాంతంలో సిగరెట్, పొగాకు ఉత్పత్తుల వాడకంపై కూడా నిషేధం విధించారు. 21 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న వారికి, అలాగే విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో విడిగా లేదా కట్టల చొప్పున సిగరెట్లు, ఇతర ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదు. అమ్మేందుకు కూడా దుకాణం పెట్టరాదని ఆయన సూచించారు. ఈ నియమాలను ఉల్లంఘిస్తే కనీసం రూ.1000 వరకు జరిమానా విధిస్తామని ఆ ప్రకటనలో ఆయన వివరించారు. నరేగ పనుల పరిశీలన రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో నరేగ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పరిశీలించారు. సోమవారం రాయచూరు తాలూకా బిజినగేరలో చేపట్టిన నరేగ పథకం పనులను ఆయన పరిశీలించి కూలీ కార్మికులతో చర్చించారు. వేసవిలో ఎండలు అధికంగా ఉండడంతో ఉదయం 6 గంటలకే పనులకు రావాలని, 11 గంటల్లోపు ఇళ్లకు వెళ్లిపోవాలన్నారు. పనులు చేస్తున్న ప్రాంతంలో కార్మికులకు మౌలిక సౌకర్యాలైన తాగునీరు, నీడ కల్పించడం వంటివి చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. నిరంతర అధ్యయనం అవసరంరాయచూరు రూరల్: విద్యార్థులు వైద్య రంగంలో నిరంతర అధ్యయనంతో ఉత్తమ పరిణితిని సాధించాలని నవోదయ వైద్య కళాశాల అధ్యక్షుడు రాజేంద్రరెడ్డి పిలుపు ఇచ్చారు. నగరంలోని నవోదయ వైద్య కళాశాలలో జరిగిన విద్యార్థి సమావేశాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఉత్తమ విద్యాభ్యాసానికి కళాశాల అందిస్తున్న బోధనలు అనన్యమన్నారు. పేదలకు ఉచిత సేవ చేయడం అభినందనీయమని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ దొడ్డయ్య, రిజిస్ట్రార్ శ్రీనివాస్, మోహన్ గుప్త, చంద్రమౌళి, సురేష్ బాబు, లక్ష్మి, అపర్ణ, రశ్మీ, స్వప్నిల్లున్నారు. -
పాత టైర్లతో మొక్కల పెంపకం
రాయచూరు రూరల్: వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షణకు కొప్పళ నగరసభ ఒక అడుగు ముందుకేసింది. నగరంలో చెత్తను పారవేసే చోట మినీ ఉద్యానవనాల ఏర్పాటుకు సిద్ధమైంది. చెత్తను పారవేసిన వారిపై జరిమానాలు విధించినా ప్రజలు తీరు మారకపోవడంతో దీని నియంత్రణకు కొప్పళ నగరసభ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పాతబడిన టైర్లకు రంగులు వేసి వాటిని రక్షణగా పెట్టి మొక్కలు నాటారు. నగర సౌందర్యం పెంపొందించడానికి కొత్త మార్గాలు వెతికారు. బీజేపీ మాజీ నగరసభ సభ్యురాలు దివ్యా అగ్ని స్వచ్ఛత, పరిసరాల సంరక్షణకు ముందుకు రాగా, ప్రజలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. కొప్పళలో వినూత్న ప్రయోగం -
రైతుల జీవనాడి.. సేవకు మళ్లీ రెడీ
హొసపేటె: రైతుల జీవనాడిగా నిలిచిన, 70 ఏళ్ల చరిత్ర కలిగిన తుంగభద్ర డ్యాంలో మొత్తం 33 క్రస్ట్ గేట్ల ఏర్పాటు పనులు పూర్తి కావడంతో డ్యాం భద్రతపై రైతులు, అధికారుల్లో నెలకొన్న ఆందోళన తొలిగిపోయింది. ఈ డ్యాం రాబోయే మరో 50–60 ఏళ్ల పాటు సురక్షితంగా ఉంటుందని తుంగభద్ర బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2024 ఆగస్టు 10వ తేదీ రాత్రికి రాత్రే తుంగభద్ర డ్యాంకు చెందిన 19వ క్రస్ట్గేటు గొలుసు తెగిపోయి కొట్టుకు పోయిన ఘటనతో డ్యాం భద్రతపై సర్వత్రా ఆందోళన రేకెత్తింది. డ్యాంలోని మొత్తం 33 పాత క్రస్ట్గేట్ల స్థానంలో కొత్త గేట్లను అమర్చేందుకు ప్రభుత్వం, నీటి పారుదల నిపుణులు, తుంగభద్ర బోర్డు అధికారులు అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రస్తుతం ఆ పనులు విజయవంతంగా పూర్తి కావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 4–5 నెలల్లోనే పనులు పూర్తి తుంగభద్ర డ్యాంకు చెందిన 19వ క్రస్ట్ గేటు కొట్టుకుపోయిన సమయంలో డ్యాంలో నీటి నిల్వ, వరద భారీగా ఉన్నాయి. దీంతో నీరంతా వృథాగా నదిలోకి పారుతోందని రైతులు ఆందోళన చెందారు. అయితే ఆ క్రస్ట్గేటును అమర్చేందుకు 2025 జూన్లో గుజరాత్కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదిరినప్పటికీ జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పనులు చేపట్టడం సాధ్యం కాలేదు. అయితే డిసెంబర్ 5వ తేదీ నాటికి జలాశయంలో నీటిమట్టం 10 అడుగుల మేర తగ్గడంతో మొదట 18వ క్రస్ట్గేటు అమరిక పనులను ప్రారంభించారు. ఆ పనులు విజయవంతంగా పూర్తయిన తర్వాత 19వ క్రస్ గేటును మార్చాలని నిర్ణయించారు. ఈ రెండు గేట్లను అమర్చడానికి 2 నెలల సమయం పట్టింది. అనంతరం మిగిలిన క్రస్ట్ గేట్లను అమర్చే పనులు ముమ్మరంగా సాగాయి. డిసెంబర్ 25వ తేదీ నుంచి కేవలం 4–5 నెలల స్వల్ప వ్యవధిలోనే మొత్తం 33 క్రస్ట్గేట్ల ఏర్పాటు పనులు పూర్తి కావడం అందరి ప్రశంసలకు పాత్రమైంది. రైతాంగంలో హర్షాతిరేకాలు తుంగభద్ర డ్యాం నుంచి విజయనగర, బళ్లారి, కొప్పళ, రాయచూరు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోని లక్షలాది హెక్టార్ల భూమికి సాగునీరు అందుతోంది. అంతేకాకుండా పరిశ్రమలకు, తాగునీటి అవసరాలకు కీలకంగా ఉన్న ఈ డ్యాంకు చెందిన క్రస్ట్గేట్ల ఏర్పాటుకు 2–3 ఏళ్లు పట్టవచ్చనే భయంతో పాటు ప్రజల్లో అనేక రకాల ఆందోళనలు కూడా ఉండేవి. అయితే ఇప్పుడు కేవలం 4–5 నెలల స్వల్ప వ్యవధిలోనే అమర్చారు. నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలోని బృందంతో సహా పలువురు కార్మికులు ప్రాణాలకు తెగించి తొలుత తాత్కాలిక గేటును ఏర్పాటు చేశారు. రూ.52 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో భాగంగా 33 క్రస్ట్గేట్ల ఏర్పాటుకు అవసరమైన ఇనుప పలకలను జోడించడం వంటి వివిధ సన్నాహక పనుల కోసం హొసపేటె, గదగ్ వద్ద రోజుకు 60 మంది కార్మికులు పని చేయగా, డ్యాం వద్ద మరో 60 మంది కార్మికులు నిత్యం శ్రమించారు. ఈ జలాశయానికి చెందిన ఒక్కో క్రస్ట్గేటు 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు కలిగి, 5 టన్నుల బరువు ఉంది. నీటిని నిల్వ చేసే ఒక భారీ ఆనకట్టపై క్రస్ట్గేట్లను అమర్చే సాహసోపేతమైన ఈ పనిని హైడ్రాలిక్ క్రేన్లు, ట్రక్కుల వంటి ఆధునిక యంత్రాలను వినియోగించి ఎటువంటి ప్రమాదాలు లేకుండా పూర్తి చేసినందుకు తుంగభద్ర బోర్డు అధికారులు, ఇంజనీర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెల్డింగ్, పెయింటింగ్ పనులు పెండింగ్ తుంగభద్ర డ్యాంకు చెందిన 33 క్రస్ట్గేట్ల ఏర్పాటు పనులు పూర్తయినప్పటికీ కొన్ని గేట్ల వెల్డింగ్, పెయింటింగ్ పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న ఈ పనులన్ని ఈనెల 15 నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే జలాశయానికి చెందిన పాత క్రస్ట్గేట్లు 70 ఏళ్లకు పైగా మన్నిక వచ్చాయి. ఇప్పుడు కొత్త గేట్లను అమర్చిన నేపథ్యంలో వాటి నిర్వహణను సక్రమంగా చేపడితే రాబోయే మరో 50–60 ఏళ్ల పాటు ఎటువంటి సమస్యలు తలెత్తవని టీబీ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. తుంగభద్ర డ్యాంకు చెందిన 19వ క్రస్ట్గేటు కొట్టుకుపోవడంతో అప్పట్లో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఏడాది రుతుపవనాలు ప్రారంభం కాకముందే మొత్తం 33 క్రస్ట్గేట్ల ఏర్పాటు పనులు పూర్తి కావడంతో తుంగభద్ర ఆయకట్టు రైతులు, ఆయా గ్రామాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. హొసపేటె సమీపంలోని తుంగభద్ర జలాశయం(ఫైల్) డ్యాంకు ఇటీవల అమర్చిన కొత్త గేటు 70 ఏళ్ల నాటి పాత క్రస్ట్గేట్లన్ని ఇప్పుడు కొత్తవే మరో 60 ఏళ్ల వరకు డ్యాం భద్రతకు ఢోకా లేదు టీబీ డ్యాం 33 కొత్త క్రస్ట్గేట్ల ఏర్పాటు పనులు పూర్తి -
భార్య వైద్యానికి డబ్బు సమకూర్చలేక భర్త ఆత్మహత్య
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకా పరిధిలోని సంగాపుర గ్రామ పంచాయతీ పరిధిలో ఓ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య చికిత్స కోసం అవసరమైన లక్షల రూపాయలను సమకూర్చలేక, తీవ్ర నిరాశకు గురైన ఒక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని మల్లాపుర గ్రామానికి చెందిన శివప్ప (26)గా గుర్తించారు. మెదడు సంబంధిత పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) బారిన పడిన తన భార్యకు సకాలంలో చికిత్స అందించడానికి అవసరమైన డబ్బును సమకూర్చలేక పోవడంతో ఆ యువకుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రారంభంలో తన చేతిలో ఉన్న డబ్బును ఖర్చు చేసి అతను భార్యకు చికిత్స చేయించాడు. ఆ తర్వాత అప్పులు కూడా చేశాడు. అయినప్పటికీ అతని భార్య ఆరోగ్యంలో ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. దీంతో తన భార్య చికిత్స కోసం డబ్బును సమకూర్చలేక అతను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. సంగాపుర జీపీ పరిధిలోని విప్రమగనిలో దేవఘాట్లి వైపునకు వెళ్లే రహదారికి ఎడమ వైపున ఉన్న ఒక రైతు గిడ్డంగి పక్కన ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం శివప్ప మృతదేహం లభ్యమైంది. -
మున్సిపల్ అధ్యక్షురాలిగా రేష్మా
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి పురపాలక సంఘం నూతన అధ్యక్షురాలిగా రేష్మా సికందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సభ్యులందరి సహకారంతో రాబోయే రోజుల్లో అందరినీ విశ్వాసంలోకి తీసుకొని, పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తానని అన్నారు. తాగునీరు, సీసీ రోడ్ల నిర్మాణం, మురుగు నీటిపారుదల వ్యవస్థతో పాటు పారిశుధ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ఆమె తెలిపారు. సంఘం ఉపాధ్యక్షురాలు నేత్రావతి హుచ్చప్ప సెరెగార, మాజీ అధ్యక్షులు ఎం.మరిరామప్ప, మాజీ ఉపాధ్యక్షురాలు అంబికా దేవేంద్రప్ప, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోరి గోణిబసప్ప, మహిళా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సాహేరా బాను, తాలూకా అధ్యక్షురాలు యశోదా మంజునాథ్, నాయకులు సికందర్, గుండ్రు హనుమంత, సెరెగార హుచ్చప్ప, కవితా ఆల్దాళ్, ఉప్పర బాలప్ప, త్యావణిగి కొట్రేష్, బారికర్ బాపూజీ, మడివాళర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
అభిమానోత్సవానికి భారీగా తరలి రండి
సాక్షిబళ్లారి: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్.యడియూరప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టడమేగాకుండా రైతు సంక్షేమానికి ఎంతో శ్రమించారని విధాన పరిషత్ సభ్యుడు వైఎం సతీష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా పేర్కొన్నారు. సోమవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. చిత్రదుర్గలో ఈ నెల 9న యడియూరప్ప అభిమానోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు. బళ్లారి జిల్లా నుంచి వేలాది మంది తరలి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారన్నారు. బీజేపీ కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగి ఆదర్శ రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. రాష్ట్రంలో రైతు పర, నీటి పారుదల, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. బళ్లారి జిల్లా అభివృద్ధికి కూడా అందించిన సహకారం మరువలేనిదన్నారు. జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు గుత్తిగనూరు విరుపాక్షగౌడ, మురారీ గౌడ పాల్గొన్నారు. -
ట్రాక్టర్, లారీ ఢీ.. ఐదుగురికి తీవ్ర గాయాలు
సాక్షిబళ్లారి: ట్రాక్టర్, లారీ ఢీకొనడంతో ఐదు మందికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం ఉమ్మడి బళ్లారి జిల్లాలోని మరియమ్మనహళ్లి సమీపంలో తిమ్మలాపుర వద్ద టోల్ గేట్ వద్ద మొరార్జీ దేశాయి వసతి పాఠశాల ముందు జాతీయ రహదారిపై జరిగింది. లారీ, ట్రాక్టర్ ఢీకొనడంతో లారీ డ్రైవర్ ఫయాజ్, ట్రాక్టర్ డ్రైవర్ మల్లేష్, శివప్ప తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. సండూరు తాలూకా కాళింగేరి నుంచి ట్రాక్టర్లో మిర్చి బస్తాలు తీసుకొని మరియమ్మనహళ్లికి వెళుతుండగా, తమిళనాడులోని కృష్ణగిరి నుంచి ముంబైకి 12 టన్నుల మామిడి కాయలను లారీలో తీసుకొని వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై రెండు వాహనాలు బోల్తా పడటంతో రోడ్డుపై మామిడి కాయలు చెల్లాచెదురుగా పడి పోయాయి. రోడ్డుపై పడిన మామిడి కాయలను తీసుకోడానికి జనం పోటీ పడ్డారు. మిర్చి సంచులు కూడా రోడ్డుపై పడిపోయాయి. రోడ్డుకు అటు వైపు మామిడి కాయలు, ఇటు వైపు మిర్చి బస్తాలు పడి పోయి వాహనాలు కూడా రోడ్డు మీదే బోల్తా పడిన నేపథ్యంలో ట్రాఫిక్ స్తంభించి పోయింది. గాయపడిన వారిని హొసపేటె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరియమ్మనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పంచ రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపుపై విజయోత్సవం
రాయచూరు రూరల్: పంచ రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఘనవిజయం సాధించడంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సోమవారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన విజయోత్సవంలో శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, అధ్యక్షుడు వీరనగౌడ మిఠాయిలు పంపిణీ చేశారు. బీదర్ దక్షిణ శాసన సభ్యుడు శైలేంద్ర బెల్దాళ్ మాట్లాడుతూ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయ ఢంకా మోగించిందన్నారు. ఇది పార్టీ కార్యకర్తల విజయంగా భావించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్షా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం దక్కిందన్నారు. భవిష్యత్తులో మరోసారి లోక్సభ ఎన్నికల్లో కాషాయ పతాకం రెపరెపలాడుతుందన్నారు. కర్ణాటకలోని బాగల్కోటె, దావణగెరెల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, ఆ పార్టీ విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్, రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ హర్షం వ్యక్తం చేశారు. -
తాగునీటి వృథా.. తీరని వ్యథ
పగిలిన పైపు నుంచి వృథా అవుతున్న నీరు నీటి కోసం మినీ ట్యాంకు పైకెక్కిన ప్రజలు రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో తాగునీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెపుతుండగా మరో వైపు నీటి ఎద్దడి అధికమైంది. అయినా అధికారులు మౌనం వహిస్తున్నారు. జలనిర్మల పథకం కింద రూ.100 కోట్లు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రమైంది. హరిజనవాడ, దేవినగర్ల మధ్యలో తాగునీటి పైపులైన్లు పగిలి పోయాయి. తాగునీటి ఎద్దడి సమస్య నివారణ విషయంలో నగరసభ యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నీటి కోసం నానాపాట్లు ప్రజలు మాత్రం నీటి కోసం మినీ ట్యాంకు పైకెక్కి నీటిని తోడుకుంటున్నారు. వారం రోజుల నుంచి నీరు రాక విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అస్కిహాళ, దేవినగర్, హరిజన వాడ, అయ్యబోడి, మడ్డిపేటలకు వారం రోజుల కిందట నీటిని సరఫరా చేసే పైపులు పగిలి పోవడంతో మరమ్మతు పనులు చేపట్టడంలో నగరసభ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా నగరసభ అధికారులు మేల్కొని చర్యలు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. పగిలిన తాగునీటి సరఫరా పైపు వారం రోజులుగా అందని నీరు నీటి కోసం నగరవాసుల తహతహ -
బాగల్కోటె బీజేపీదే అనుకున్నాం
బనశంకరి: బాగల్కోటెలో తమ ఓటమిని ఊహించలేదని, ఇకపై పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్ర తెలిపారు. సోమవారం మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దావణగెరె దక్షిణ, బాగల్కోటెలో తమ కార్యకర్తలు చాలా కష్టపడ్డారని, బాగల్కోటెలో ఇలా అవుతుందని అనుకోలేదన్నారు. బాగల్కోటేలో సీఎం సిద్దరామయ్య 15 రోజులు మకాం పెట్టారని, మంత్రులు కూడా ఇక్కడే తిష్ట వేశారని అన్నారు. కాగా, పశ్చిమబెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలో బీజేపీ గెలుపు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వానికి శక్తి నింపిందని అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ అధికార మదంతో హిందువులకు అన్యాయం చేశారని, అందుకు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. బీజేపీ పక్షనేత ఆర్.అశోక్ మాట్లాడుతూ.. దావణగెరె దక్షిణలో గెలుస్తామనుకున్నారు. మూడు రాష్ట్రాల్లో గెలుపు సందర్భంగా నేతలు మిక్చర్ పంచి సంబరాలు నిర్వహించారు. బీజేపీ సారథి విజయేంద్ర -
ఘనంగా జ్యోతుల ఉత్సవం
బొమ్మనహళ్లి: బెంగళూరు పరిధిలో ఆనేకల్ తాలూకా హెన్నాగరంలో వెలసిన గ్రామ దేవత శ్రీయల్లమ్మ దేవి ఆలయంలో జ్యోతుల ఉత్సవం వైభవంగా జరిగింది. 10కి పైగా గ్రామాల నుంచి భక్తులు ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి జ్యోతులను సమర్పించారు. హెన్నాగరం, యరండహళ్లి, హెచ్.హోసహళ్లి, కాచనాయకనహళ్లి, చందాపుర, బనహళ్లి, శ్రీరాంపుర, బెల్లందూరు, అగర, హారగద్దె తదితర ఊళ్లనుంచి భక్తులు పాల్గొన్నారు. యల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో సహా పలు పూజలు నిర్వహించారు. ముళ్లపంది వేటగాడు అరెస్టు మైసూరు: అడవిలో ముళ్లపందిని చంపి, అమ్మడానికి ప్రయత్నించిన వేటగాన్ని అటవీ అధికారులు పట్టుకున్నారు. హెచ్డి కోట తాలూకాలోని అగసనహుండి బస్టాండు వద్ద హరీష్ అనే వ్యక్తిని నిర్బంధించి, వేట పనిముట్లు, ముళ్లపంది మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముళ్లపంది మాంసం, ముళ్లు, ఎముకలకు ఔషధ గుణాలు ఉన్నాయనే మూఢ నమ్మకం కారణంగా అక్రమ వేట కొనసాగుతోంది, వన్యప్రాణుల వేట పర్యావరణ సమతుల్యతకు ముప్పు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలను చూస్తే, వెంటనే అటవీ శాఖ హెల్ప్లైన్ 1926కు తెలియజేయాలి అని జోనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. జాతరలో ప్రమాదం, 20 మందికి గాయాలు దొడ్డబళ్లాపురం: గదగ్లోని తొంటాదార్య మఠంలో జరిగిన జాతరలో అపశృతి చోటుచేసుకుంది. జాతరలో ఎగ్జిబిషన్లో డ్యాన్సింగ్ ఫ్లోర్ వీల్ విరిగిపడి 20 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో వీల్ వేగంగా తిరుగుతుండగా అందరూ ఉత్సుకతతో కేకలు వేస్తున్నారు. ఈ సమయంలో అది విరిగి కుప్పకూలింది. క్షణాల్లోనే జనం హాహాకారాలతో దద్దరిల్లింది. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులను జిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గదగ్ పట్టణ పోలీసులు జాతర కమిటీ, ఫ్లోర్ వీల్ యజమానిపై కేసు నమోదు చేశారు. కూతుర్ని వేధిస్తున్నాడని డెలివరీ బాయ్ హత్య దొడ్డబళ్లాపురం: నీ కుమార్తెను ప్రేమిస్తున్నా, నాకు ఇచ్చి వివాహం చేయాలని వెంటబడి వేధిస్తున్న యువకున్ని యువతి తండ్రి మరో ముగ్గురితో కలిసి హతమార్చాడు, ఈ సంఘటన యలహంక పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి తండ్రి ఈరయ్య (44), బంధువులు చిన్నయ్య (29), చేతన్ (26), వినాయక (19)లను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. బెళగావికి చెందిన రమేశ్ (22) బెంగళూరుకు వచ్చి ఫుడ్ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రమేశ్ ఈరయ్య కుమార్తెను వేధించడంతోపాటు ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయాలని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేసేవాడు. పలుమార్లు హెచ్చరించినా అతడిలో మార్పు రాలేదు. దీంతో రమేశ్ని హతమార్చాలని పథకం వేశారు. మిగతా నిందితులతో కలిసి రమేశ్ను బార్కు తీసుకెళ్లి మద్యం తాగారు. తరువాత కారులో వెళ్తూ తాడుతో గొంతు బిగించి చంపి మృతదేహాన్ని అళ్లాలసంద్ర వద్ద రాజకాలువలో విసిరేసి పరారయ్యారు. పోలీసులు విచారించి అరెస్టు చేశారు. కాగా, రమేశ్పై బాగలకోటలో అత్యాచారయత్నం కేసు, మరో బెదిరింపుల కేసు ఉన్నాయి. ద్రాక్ష, మామిడి తోటలకు వాన దెబ్బచిక్కబళ్లాపురం: జిల్లాలోని కె.ముత్తుగదహళ్లి, కన్నమంగళ, చింతడిపి చుట్టుపక్కల గ్రామాలలో ఆదివారం రాత్రి ఈదురు గాలులు, జడివానకు మామిడి, ద్రాక్ష తోటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. ద్రాక్ష చెట్లు చెల్లాచెదురయ్యాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పరిహారం అందచేయాలని రైతులు కోరారు. -
శృంగేరి క్షేత్రానికి కొత్త ఎమ్మెల్యే
శివాజీనగర: చిక్కమగళూరు జిల్లా శృంగేరి ఎమ్మెల్యే మారిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేగౌడ కాదు.. బీజేపీ నేత జీవరాజ్ కొత్త శాసనసభ్యుడు. శనివారం నుంచి జరిగిన బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఈ పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల రీకౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి డీ.ఎన్.జీవరాజ్ 52 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. సుదీర్ఘంగా లెక్కింపు శనివారం ఉదయం నుంచి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కాగా, సాయంత్రం తానే గెలిచానని సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీటీ రాజేగౌడ ప్రకటించి విజయోత్సవం చేసుకోవడం తెలిసిందే. కానీ వాద వివాదాల మధ్య ఓట్ల బండిళ్ల లెక్కింపు ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకూ అధికారులు కొనసాగించారు. ఫలితాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు జిల్లా కలెక్టర్ గౌరవ్ కుమార్శెట్టి సమర్పించారు. తరువాత ఫలితాలను ప్రకటిస్తూ జీవరాజ్దే విజయమని తెలిపారు. సోమవారం నూతన ఎమ్మెల్యే జీవరాజ్కు ధృవీకరణ పత్రాన్ని కూడా పంపిణీ చేశారు. న్యాయం జరిగింది: జీవరాజ్ జీవరాజ్ శృంగేరి శారదమాత దేవస్థానంలో పూజలు చేసి మాట్లాడుతూ గత ఎన్నికలలో ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్ల బండిళ్లను రాజేగౌడ ఖాతాలోకి కలిపారని ఆ రోజునే ఫిర్యాదు చేశానని తెలిపారు. రెండు రోజుల తరువాత ఎన్నికల అధికారులు పోస్ట్ ద్వారా నాకు సమాధానాన్ని పంపించారు. నేను ఆ రోజే గెలిచాను, కానీ మోసం ద్వారా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఇప్పటికి న్యాయం లభించింది. చాలా సంతోషమన్నారు. ఆదివారం రాత్రి అధికారులు తనకు మెయిల్లో గెలుపు సమాచారం పంపారన్నారు. సోమవారం ఉదయం తనపై నగర పోలీస్ స్టేషన్లో కొందరు కేసు పెట్టారని, డిప్యూటీ సీఎం డీకే శివకుమారే తనకు భద్రత కల్పించాలని ఆయన కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఈ విజయాన్ని స్వాగతించారు. కలెక్టర్ ఏమన్నారు..? 1,822 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించామని కలెక్టర్ గౌరవ్శెట్టి తెలిపారు. 2023లో లెక్కింపులో బీజేపీ అభ్యర్థి జీవరాజ్కు 692 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాజేగౌడకు 569 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు రీకౌంటింగ్లో జీవరాజ్కు 690 ఓట్లు పడ్డాయి. రాజేగౌడకు 314 ఓట్లే వచ్చాయి. దీనిని బట్టి రాజేగౌడకు 251 ఓట్లు తగ్గాయని వివరించారు. రాజేగౌడకు మొత్తం 318 చెల్లని ఓట్లు పడ్డాయని తెలిపారు. ఇది క్రిమినల్స్ కుట్ర: డిప్యూటీ సీఎం శృంగేరి ఫలితాలు దేశానికే ప్రమాదకరం. అక్కడ కుట్ర జరిగింది, ప్రభుత్వ స్థాయిలో దర్యాప్తు చేస్తామని డీసీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ ‘బీజేపీలో ఇంతటి క్రిమినల్లు ఉన్నారని తెలియలేదు. సుప్రీంకోర్టుకై నా వెళతాం. అక్కడ బ్యాలెట్ బాక్సులను ముందే తెరిచారు, బ్యాలెట్ పేపర్ అవకతవకలు జరిగాయి. అప్పట్లో అంతా సక్రమమేనని అధికారులు సంతకాలు చేశారు. జయనగరలో కూడా సౌమ్యారెడ్డి 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ ఇప్పటికీ ఓట్ల లెక్కింపు జరగలేదు. శృంగేరిలో ఎలా లెక్కించారు’ అని డీకే ధ్వజమెత్తారు.తుంగా నది ఒడ్డున కొలువైన శృంగేరి పట్టణంలో రాజకీయ దుమారం కలెక్టర్ అందజేసిన ధృవీకరణ పత్రంతో నూతన ఎమ్మెల్యే జీవరాజ్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి జీవరాజ్ గెలుపు కాంగ్రెస్ శాసనసభ్యుడు రాజేగౌడకు చుక్కెదురు రాష్ట్రంలో రెండు చోట్ల ఉప ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి శృంగేరిలో షాక్ తగిలింది. అక్కడ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మూడేళ్ల తరువాత ఓడిపోయారు. బ్యాలెట్ల ఓట్ల పునర్ లెక్కింపులో బీజేపీ అభ్యర్థి గెలవడం రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. -
కాంగ్రెస్ విజయోత్సవ వేడుకలు
కోలారు: రాష్ట్రంలో జరిగిన దావణగెరె, బాగలకోటె ఉప ఎన్నికలు, కేరళ రాష్ట్రంలో ఘన విజయం సాధించడంపై కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం నగరంలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు టపాసులుకాల్చి స్వీట్లు పంచి విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పంచ గ్యారెంటీలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కారణమన్నారు. ఉప ఎన్నికల్లో విజయం ప్రజలు కాంగ్రెస్ పార్టీపై మరింతగా విశ్వాసం ఉంచారనేందుకు నిదర్శనమన్నారు. కేరళలో కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా బలోపేతానికి నిదర్శనమన్నారు. నగరసభ మాజీ ఉపాధ్యక్షుడు ఎస్ఆర్ మురళీగౌడ, లాల్ బహద్దూర్ శాస్త్రి, నాగరాజ్, శ్రీనివాస్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి గోడ కూలి వ్యక్తి మృతి
హొసపేటె/సాక్షి, బళ్లారి: కానహోసహళ్లి పట్టణంలోని ఉజ్జిని రోడ్డులో కొత్త ఇంటి నిర్మాణం జరుగుతుండగా.. పాత రాతి గోడ ఒకటి కూలిపోయింది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఇంటి యజమాని అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్త ఇంటి పునాది (బేస్మెంట్), పాత గోడ మధ్య పైప్లైన్ వేయడానికి పునాదిని చదును చేసే పనిలో నిమగ్నమైన ఇంటి యజమాని బసవరాజప్ప ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఆ గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో అతడి తల పైభాగం తప్ప, మిగిలిన శరీరమంతా మట్టిలో కూరుకుపోయింది. ఫలితంగా ఆయన ప్రాణాలు కోల్పోయాడు. కానహోసహళ్లి పోలీస్ స్టేషన్కు చెందిన పీసీఐ సిద్రమప్ప బిదరాని బృందం వెంటనే ఘటన స్థలానికి చేరుకుంది. స్థానికుల సహకారంతో 45 నిమిషాలకు పైగా శ్రమించి మట్టిలో కూరుకుపోయిన మృతదేహాన్ని వెలికితీశారు. ఈ విషాద ఘటనతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. కానహోసహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కూడ్లిగి తాలూకా, కనహోసహళ్లిలో ఘటన -
హోరాహోరీగా టెన్నిస్ టోర్నీ
తుమకూరు: తుమకూరులో జరుగుతున్న ఐటీఎఫ్డబ్ల్యూ టెన్నిస్ టోర్నీలో మహిళల సింగిల్స్ క్వాలిఫయర్స్ పోటీల్లో భారత క్రీడాకారిణి శ్రీనిధి చౌదరి అద్భుతమైన ఆటతో తదుపరి రౌండ్కు దూసుకెళ్లింది. 14వ సీడ్ నేమ్హా సారా కిస్పోట్టాను హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ఓడించింది. మరో పోటీలో స్నిగ్ధ కాంత, 13వ సీడ్ అరుణ ముండేను కఠినమైన మూడు సెట్ల పోరాటంలో మట్టి కరిపించింది. పలు మ్యాచ్లు రసవత్తరంగా సాగాయి. పెద్దసంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. 8 స్థానాల కోసం క్రీడాకారిణులు పోటీపడతారు. కారు దగ్ధం కేసు.. వ్యక్తి ఆత్మహత్య!దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకా బాశెట్టిహళ్లి పారిశ్రామికవాడలోని నిర్జన ప్రదేశంలో శనివారం ఓ కారు కాలిపోగా అందులో ఓ మహిళ సజీవ దహనమైన ఘటన మరింత క్లిష్టంగా మారింది. కారు నుంచి దూకి పరారైన వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మారసంద్ర గ్రామానికి చెందిన రామాంజినప్ప (43) మృతుడు. వివరాలు.. రామాంజినప్పకు పెళ్లయి, తరువాత విడిపోయాడు. ఈ క్రమంలో శనివారంనాడు కారులో ఒక మహిళతో ఏకాంతంగా గడపడానికి వచ్చాడు. ఈ సమయంలో కారు దగ్ధమై ఆమె సజీవ దహనమైంది, పోలీసులు కారును పరిశీలించి విచారణ చేపట్టారు. ఇంతలో ఆదివారం దగ్గరలో రైలు పట్టాలపై అతడు శవమై తేలాడు. చిక్కబళ్లాపురానికి చెందిన ఆ మహిళతో రామాంజినప్పకు అక్రమ సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఇద్దరూ చనిపోవడంతో కేసు మిస్టరీగా మారింది. భర్త రెండో పెళ్లికి మొదటి భార్య బ్రేక్● దొడ్డలో వింత ఘటన దొడ్డబళ్లాపురం: గర్భిణి అయిన మొదటి భార్య ఎంట్రీతో కళ్యాణ మండపంలో ఆమె భర్త రెండో పెళ్లి.. పందిరిలోనే నిలిచిపోయింది. పెళ్లికి వచ్చిన అతిథులు ఏమైందోనని చెవులు కొరుక్కున్నారు. సినిమా, సీరియల్స్లో జరిగే ఇలాంటి సంఘటన నిజంగానే చోటుచేసుకుంది. వివరాలు... దొడ్డ పట్టణంలో బసవ భవన్లో.. లెక్చరర్ కుమార్కు, వధువుకు ఆదివారం ఉదయం పెళ్లి జరుగుతోంది. మంత్రాలు, మంగళ వాయిద్యాల ఘోష మధ్య ఓ గర్భిణి అక్కడకు వచ్చింది. తాను కుమార్ భార్యనని చెప్పడంతో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి కుమార్ను, బాధిత మహిళను స్టేషన్ కి తీసికెళ్లారు. అంతకుముందు రోజు రాత్రి కుమార్ తన భార్యకు కాల్ చేసి పెద్దవాళ్లు తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని, తాను ఏం చేయలేకపోతున్నానని చెప్పాడు. దీంతో ఆమె ధైర్యం చేసి కేరళ నుంచి అక్కడకు వచ్చింది. తమ పెళ్లి ఫోటోలు, ఇతరత్రా ఆధారాలను చూపడంతో వధువు కుటుంబీకులు కంగుతిన్నారు. ఈ హఠాత్ పరిణామంతో పెళ్లి రద్దు కాగా, బంధుమిత్రులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. సీఎం సిద్దు మార్పు ఈజీ కాదు ● ఎమ్మెల్యే రాయరెడ్డి శివాజీనగర: ప్రస్తుతానికి ముఖ్యమంత్రి మార్పు లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారని సీఎం ఆర్థిక సలహాదారుడు, ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా గొంతెత్తారు. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలి, అందుకు ప్రజోపయోగ పరిపాలన చేయాలి అని ఖర్గేకు చెప్పానన్నారు. మంత్రివర్గ పునర్విభజన, ముఖ్యమంత్రి మార్పు గురించి ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు గందరగోళమైన ప్రకటనలు చేస్తున్నారు, దీనిపై స్పష్టత ఇవ్వాలని విన్నవించానని చెప్పారు. సీఎం మార్పు లేదు, ఒకవేళ చేయాలనుకుంటే హైకమాండ్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటుందని ఖర్గే తనకు చెప్పారన్నారు. అప్పట్లో సీఎల్పీ భేటీలో సిద్దరామయ్యను ఎన్నుకొన్నారు, ఇప్పుడు సీఎంను మార్పు చేయాలంటే మళ్లీ ఎమ్మెల్యేల అభిప్రాయం కోరాలన్నారు. మార్పు అంత సులభం కాదన్నారు. ఒకవేళ సీఎంను మార్చితే, మీరే ముఖ్యమంత్రి కావాలని ఖర్గేకు ఆహ్వానం పలికినట్లు రాయరెడ్డి తెలిపారు. సిద్దరామయ్య వర్గీయులు మౌనం దాల్చిన సమయంలో రాయరెడ్డి మద్దతుగా నిలబడడం విశేషం. -
లేట్గా వచ్చారని.. నీట్కు నిరాకరణ
శివాజీనగర: నీట్–యూజీ పరీక్షలకు ఆలస్యంగా రావడంతో పలువురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. బెంగళూరులోని యలహంక ప్రథమ శ్రేణి కాలేజీలో ఇద్దరు విద్యార్థినులు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. ఈ క్రమంలో సిబ్బంది వారిని అడ్డుకున్నారు. చాళుక్య సెంటర్లోని ఆర్సీ కాలేజీకి అత్తిబెలెకు చెందిన ఓ విద్యార్థిని 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది, ఆమెను కూడా లోపలికి పంపలేదు. మధ్యాహ్నం 2 గంటలకు నీట్ పరీక్ష ఆరంభంకాగా, మధ్యాహ్నం 1.30 గంటల వరకు గేట్లు తెరిచారు. ట్రాఫిక్ జాం వల్ల ఆలస్యమైనట్లు విద్యార్థినులు తెలిపారు. ఏడాది పాటు శిక్షణ పొందామని, ఆలస్యమంటూ అనుమతించలేదని విలపించారు. కాగా పరీక్షా కేంద్రాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. పలువురు విద్యార్థినుల కన్నీరు -
పసందైన మామిడి..
ప్రజల చెంతకే హుబ్లీ: వేసవి వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేవి మామిడి పండ్లు. దిగుబడిని బట్టి ధరలతో సంబంధం లేకుండా రుచిని ఆస్వాదిస్తాం. అయితే ఆరుగాలం కష్టపడి తోటలు సాగు చేసిన రైతులను దళారీలు మోసం చేస్తున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు పండ్లను కొనుగోలు చేసి వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తుంటారు. దీంతో రైతులకు లాభాలు దొరకడం లేదు. ధార్వాడా మామిడి సాగు రైతులు నేరుగా వినియోగదారులకు పండ్లను విక్రయించేందుకు శ్రీకారం చుట్టారు. ధార్వాడా గాంధీ భవన్లో జరుగుతున్న ఈ అభియానాలో వినియోగదారులకు వివిధ రకాల మామిడి పండ్లను అందుబాటులో ఉంచారు. దళారీలకు చరమగీతం పాడటంతో లాభాలు నేరుగా రైతులకు దక్కుతున్నాయి. బెళగావి, హవేరి, గదగ, ధార్వడా, బాగలకోట తదితర జిల్లాల నుంచి బంగినపల్లి, అల్పాన్ సో, బెంగళూరు బేనీసా తదితర మామిడి రకాలను తీసుకొచ్చి ఒకే చోట విక్రయిస్తున్నారు. కిలో రూ.100 నుంచి 200 దాకా ధరలు పలుకుతున్నాయి. రైతులు కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రసాయనాలు వాడకుండా సహజంగా పండ్లను మాగబెడుతున్నారు. వినియోగదారులకు మార్కెట్లో తిరిగే శ్రమ తొలగి ఒకే చోట్ల నాణ్యత గల పండ్లు లభిస్తున్నాయి. అల్పాన్ సో రకం మామిడి పండ్లకు జాతీయ, అంతర్జాతీయంగా చాలా డిమాండ్గా ఉంది. ఇక్కడి మట్టి వాతావరణం వల్ల ఈ పండుకు ప్రత్యేక రుచి తెచ్చి పెడుతుంది. జిల్లాలో సుమారు 12 వేల హెక్టార్ల కన్నా ఎక్కువ ప్రాంతంలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ఇందులో అల్పాన్ సో రకం అగ్రస్థానంలో ఉంది. ఈ మేలిమి రకం మామిడి పండ్లు సరసమైన ధరలకే దొరుకుతుండటంతో మామిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధార్వాడా గాంధీ మార్కెట్లో ఏర్పాటు చేసిన బ్యానర్ఆకట్టుకున్న మామిడి రకాలు ధార్వాడా గాంధీ భవన్లో సహజసిద్ధంగా మాగబెట్టిన మామిడి పండ్ల విక్రయ కేంద్రం ఏర్పాటు దళారీ వ్యవస్థకు చెక్ రైతులకు దక్కనున్న లాభాలు -
ప్రకృతిని రక్షించుకోవాలి
కెజీఎఫ్: భావి తరాల హితవును దృష్టిలో ఉంచుకుని ప్రకృతిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని 3వ అపర సెషన్స్ న్యాయమూర్తి బి.శివకుమార్ తెలిపారు. గుడ్ డీడ్స్ డే సంధర్భంగా బెళకు ట్రస్టు, తంబార్లహళ్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచి పనులు చేయాలనే సందేశాన్ని ఇవ్వడం ఈ దినం ప్రాముఖ్యత అన్నారు. ప్రకృతి సకల జీవరాశులను తన ఒడిలో ఉంచుకుని కాపాడుతుందని తెలిపారు. అయితే మనిషి తన స్వార్థానికి ప్రకృతిని నాశనం చేస్తున్నాడని పేర్కొన్నారు. అభివృద్ధి, నగరీకరణ పేరుతో ప్రకృతి, పరిసరాలను నాశనం చేయడం సరికాదని పేర్కొన్నారు. అందరూ విధిగా చెట్లను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో అపర సివిల్ సీనియర్ న్యాయమూర్తి ముజఫర్ మాంజరి, న్యాయమూర్తి జయలక్ష్మి, సివిల్ న్యాయమూర్తి శమిద, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎస్.ఎన్.రాజగోపాలగౌడ పాల్గొన్నారు. -
బళ్లారి అభివృద్ధికి యడియూరప్ప కృషి
సాక్షి, బళ్లారి: నగరాభివృద్ధి, బళ్లారి జిల్లా అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప విశేష కృషి చేశారు. ఆయన హయాంలో బళ్లారి జిల్లాకు భారీగా నిధులు విడుదల చేశారని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యడియూరప్ప అభిమానోత్సవానికి సంబంధించి ముందస్తు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈనెల 9వ తేదీన చిత్రదుర్గంలో జరిగే యడియూరప్ప అభిమానోత్సవ కార్యక్రమానికి బళ్లారి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో యడియూరప్ప ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని, అంచెలంచెలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారని గుర్తు చేశారు. తమ లాంటి ఎందరికో రాజకీయంగా ఎదిగేందుకు సహకారం అందించారన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో యడియూరప్ప తనదైన ముద్రవేసుకున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిత్యం పరితపించిన నాయకుడు అని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర ఫోన్ ద్వారా సమావేశంలో తన సందేశాన్ని వినిపించారు. యడియూరప్ప అభిమానోత్సవ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్షా హాజరవుతారన్నారు. అనివార్య కారణాలతో తాను బళ్లారి సమావేశానికి రాలేకపోయాయని తెలిపారు. చిత్రదుర్గంలో జరిగే సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలన్నారు. గంగావతి ఎమ్మెల్యే కూడా సమావేశంలో ఫోన్ ద్వారా మాట్లాడారు. యడియూరప్ప ఆశీస్సులతోనే రాజకీయాల్లో రాణించేందుకు అవకాశం కలిగిందని పేర్కొన్నారు. మాజీ లోక్సభ సభ్యుడు సన్న పక్కీరప్ప మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా యడియూరప్ప అభిమానోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వీరశైవ సమాజ ప్రముఖులు విరుపాక్షి గౌడ, జానేకుంట బసవరాజు, మహేశ్వరయ్య స్వామి, గురులింగన గౌడ, పంచాక్షరప్ప, కోలారు చంద్రశేఖర గౌడ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి -
బాగల్కోటెలో మేటి వర్సెస్ వీరణ్ణ
సాక్షి, బెంగళూరు: దావణగెరె దక్షిణం, బాగలకోటె విధానసభ నియోజకవర్గాలకు జరిగిన హైఓల్టేజ్ ఉప ఎన్నికల ఫలితాలు నేడు సోమవారం ఈవీఎంల నుంచి విడుదల కాబోతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరణించడంతో ఇక్కడ ఉప సమరం జరగడం తెలిసిందే. హస్తానికి అనేక రకాల సమీకరణాలు, అడ్డంకుల మధ్య అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్ వరకూ అగ్నిపరీక్షలా సాగింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రెండుచోట్లా ముమ్మరంగా ప్రచారం సాగించి తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. రాబోయే ఫలితాలను మూడేళ్ల కాంగ్రెస్ పరిపాలన మీద రిఫరెండంగా కొందరు పేర్కొంటున్నారు. కాంగ్రెస్కు రెండో ఉప ఎన్నిక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎదుర్కొన్న రెండో ఉప ఎన్నిక ఇది.. 2024, నవంబర్లో 3 నియోజకవర్గాలు శిగ్గాంవి, చెన్నపట్టణ, సండూరులో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు చోట్లా గెలిచి సత్తా చాటుకుంది. ఇప్పటి ఫలితాలు ప్రజలు పాస్ మార్కులు వేశారా లేదా అనేది తేటతెల్లం చేయబోతున్నాయి. ఎవరు గెలిస్తే ఏమవుతుంది? సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య సీఎం కుర్చీ కోసం పవర్ ఫైట్ జరుగుతోంది. నేటి ఫలితాల తరువాత ఇది క్లైమాక్స్కు చేరనుందనే ప్రచారం సాగుతోంది. దావణగెరె, బాగల్కోటెలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఒక లెక్క, ఓడితే మరో లెక్క అన్న చందంగా మారింది. గెలుపు ఓటములను సిద్దరామయ్య, డీకే శివ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోగలరు. రెండు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోతే సిద్ధరామయ్య మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారని డీకే వర్గం గళమెత్తే అవకాశముంది. కాంగ్రెస్ సర్కారు పనితీరు, పంచ గ్యారంటీ పథకాలు తదితరాలపై ప్రజాభిప్రాయంగా ఓటర్ల తీర్పును పరిగణించే అవకాశముంది. విజేతలు ఎవరో కొన్ని గంటల్లో తేలిపోనుంది నేడే దావణగెరె, బాగల్కోటె ఉప ఎన్నికల ఫలితాలు రెండింటిపై కాంగ్రెస్ కన్ను బీజేపీ సైతం గంపెడాశలు ఆశల పల్లకీలో బీజేపీశివాజీనగర: ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఏప్రిల్ 9న ఉప ఎన్నికలు జరిగాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. రెండు నియోజకవర్గాలలో భారీ భద్రత ఏర్పాటైంది. హెచ్.ఎం.మేటీ మరణంతో బాగల్కోటె సీటు ఖాళీ అయ్యింది. మేటి కుమారుడు ఉమేశ్ మేటి కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి పాత అభ్యర్థి వీరణ్ణ చరంతిమఠ పోటీ పడ్డారు. ఇక్కడ ఓటర్ల సంఖ్య 1,78,273 మంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరణ్ణ చరంతిమఠ సోదరుడు మల్లికార్జున చరంతిమఠ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 10 వేల ఓట్లను పొందారు, దీంతో అప్పటి బీజేపీ అభ్యర్థి వీరణ్న ఓటమి పాలయ్యారు. ఈసారి ఏమవుతుందోననే ఉత్కంఠ నెలకొంది. దావణగెరెలో సమర్థ్ వర్సెస్ శ్రీనివాస దావణగెరెలో మంత్రి శామనూరు మల్లికార్జున కుమారుడు శ్యామనూరు సమర్థ్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస దాస కరియప్ప పోటీలో ఉండగా, ఎవరిని విజయం వరిస్తుందనేది తేలబోతోంది. ఎన్నికల ఫలితాలపై అంతటా జోరుగా బెట్టింగ్లు సాగుతున్నట్లు సమాచారం.బీవై విజయేంద్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఈ ఎన్నికలలో శ్రమించారు. బీజేపీకి పట్టం కడితే విజయేంద్రకు ఊపు రానుంది. రెండింటిలోనూ జేడీఎస్ పోటీ చేయకుండా బీజేపీకి అండగా నిలిచింది. రెండుపార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరిగిందనేందుకు ఫలితాలు అద్దం పట్టబోతున్నాయి. ఒక్క సీటు గెలిచినా బీజేపీలో ఉత్సాహం ఇనుమడించడంతో పాటు జేడీఎస్తో దోస్తీ బలపడుతుంది. ఇలా ఫలితాలు ఒక దిక్సూచిగా, రాజకీయ లెక్కాచారాలకు ఒక మార్గం కానున్నాయి. -
ఆరోగ్య శిబిరాలు సద్వినియెగం చేసుకోండి
రాయచూరు రూరల్: పేద ప్రజలు ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియెగం చేసుకోవాలని నగరసభ మాజీ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని ఆర్.హెచ్.ఆరోగ్య కేంద్రంలో ఇషా, అసిఫ్, జామియా ఫౌండేషన్ ఆధర్యంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరాలను ఉద్దేశించి ప్రసంగించారు. 300 మందికి పైగా రోగులు ఆరోగ్య శిబిరాల్లో వైద్యం చేయించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డా.కార్తీక్ బాసిత్, లతీఫ్, హపీజ్, జావిద్, మనియార్, హజరత్ బాషా, హసన్ మూల్లా, హసీఫ్ ఖాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణే సర్కార్ లక్ష్యంరాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంత పేద ప్రజల ఆరోగ్య రక్షణే సర్కార్ లక్ష్యమని భారీ పరిశ్రమల శాఖ మంత్రి యం.బి.పాటిల్ తెలిపారు. ఆదివారం విజయపుర జిల్లా దేవర హిప్పరిగిలో 30 పడకల అరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. పేదలు సర్కారు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. సర్కారు ఆస్పత్రుల్లో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు రాజు గౌడ పాటిల్, తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ వ్యవస్థతో ఇబ్బందులుహుబ్లీ: కాగితం లేని ఆస్తుల నమోదు వంచనకు దారి తీస్తుందని సంబంధిత డాక్యుమెంట్ రైటర్ల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ధార్వాడ జిల్లా రిజిస్ట్రేషన్ ముద్రణ శాఖ ద్వారా అనుమతి పొందిన డాక్యుమెంట్ రైటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతరాజ్ పోలా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కావేరి సాంకేతిక ఆధారంగా పేపర్ లెస్ డిజిటల్ నమోదు అములుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ పద్దతి వల్ల ప్రజల ఆస్తువుల రికార్డులకు ఎటువంటి భద్రత ఉండదన్నారు. డీజీ లాకర్లో సేవ్ కావడం వల్ల ఆస్తి కొనుగోలుకు నికర దాఖలు లభించవని తెలిపారు. ఈ పద్ధతి వల్ల ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లకు తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. తక్షణమే ప్రభుత్వం పేపర్ లెస్తో పాటు గత వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. బుద్ధుడి బోధనలు ఆదర్శం కోలారు: బుద్ధుడి తత్వ సిద్ధాతాలను అనుసరించడం ద్వారా ప్రపంచంలో శాంతి నెలకొంటుంది. ప్రపంచంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో బుద్ధుడి సందేశాలు లోకానికి ఎంతో అవసరమని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు కె.వి.ప్రభాకర్ తెలిపారు. ఆదివారం నగర సమీపంలోని మంగసంద్ర వద్ద ఉన్న బెంగుళూరు ఉత్తర విశ్వ విద్యాలయంలో బుద్ధ పూర్ణిమ సంధర్భంగా కావ్య బెళదింగళు కవిగోష్టి కార్యక్రమం నిర్వహించారు. కవులు, రచయితలు రచించే ప్రతి వాక్యం లోకానికి ప్రేమను పంచాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆప్త కార్యదర్శి నెలకంటె వెంకటేశయ్య మాట్లాడుతూ.. బుద్ధుడి వ్యక్తిత్వం అత్యంత అధ్భుతమైన శక్తి అని అభివర్ణించారు. కార్యక్రమంలో శరీఫ్, అవధి పత్రిక సంపాదకుడు జి.ఎన్.మోహన్, సాహితి లక్ష్మీపతి కోలార, తదితరులు పాల్గొన్నారు. 2 వంతెనలకు ఆమోదం కోలారు: అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తిలో రూ.10 కోట్ల ఖర్చుతో రెండు చోట్ల బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ తెలిపారు. ఆదివారం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాలూకాలో క్యాలనూరు సమీపంలో రూ.6 కోట్ల వ్యయంతో కొత్త బ్రిడ్జి , ఛత్రకోడిహళ్లి వద్ద రూ.4 కోట్ల వ్యయంతో మరో బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిధుల విడుదలకు ఆమోదం లభించిందని అన్నారు. అధికారులే చురుగ్గా పని చేయాలని ఆయన కోరారు. -
ఘనంగా పడుబిద్రి రథోత్సవం
బొమ్మనహళ్లి: ఉడుపి జిల్లా పడుబిద్రిలో పునర్నిర్మించిన మహాలింగేశ్వర మహాగణపతి ఆలయంలో స్వామివారి బ్రహ్మకుంభాభిషేకం, రథోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ పూజలు, యాగాలు సాగాయి. ఆదివారం ఉదయం శుభ ముహూర్తంలో బ్రహ్మ కుంభాభిషేకం జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వేలాది మంది భక్తుల మధ్య తేరు సంబరం జరిగింది.ఘరానా జ్యోతిష్యుల గుట్టురట్టు● మహిళలకు వేధింపులు దొడ్డబళ్లాపురం: మహిళలను వేధిస్తున్న ఇద్దరు జ్యోతిష్యుల గుట్టు రట్టయింది. పూజల పేరుతో ఒక జ్యోతిష్యుడు తనపై అత్యాచారం చేస్తున్నట్లు ఓ బ్యూటీషియన్ బెంగళూరులోని సీకే అచ్చుకట్టు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. బాధితురాలు రాజాజీనగరలో బ్యూటీషియన్ శిక్షణనిస్తోంది. మోహన్కుమార్ అనే జ్యోతిష్యుడు ఆమెకు పరిచయమయ్యాడు. సంపాదన పెరగడానికి తాను ప్రత్యేక పూజలు, యాగాలు చేయిస్తానని నమ్మించి రామనగరలోని పిరమిడ్ వ్యాలీ సహా పలుచోట్లకు తీసుకువెళ్లి అత్యాచారాలు చేశాడు. ఎవరికై నా చెబితే ఇంట్లో అందరినీ చంపేస్తానని బెదిరించాడని ఆమె తెలిపింది. నిందితుడు మోహన్ కుమార్ పరారీలో ఉన్నాడు. నగ్నంలో పూజల్లో పాల్గొనాలని.. నగ్నంగా పూజల్లో పాల్గొంటే రూ.30 లక్షలు ఇస్తానని ఒక జ్యోతిష్యుడు తనను వేధిస్తున్నాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన రామనగర తాలూకా దొడ్డమణ్ణుగుడ్డె గ్రామంలో వెలుగు చూసింది. కిరణ్ అనే జ్యోతిష్యుడు గత కొన్ని రోజులుగా రాత్రి పూట మెసేజ్లు పంపిస్తున్నాడు, డబ్బులు రెట్టింపు చేసే పూజలో నువ్వు నగ్నంగా కూర్చున్నా, లేదా నీ నగ్న ఫోటోలు పంపించినా పూజలు ఫలిస్తాయని, ఇందుకు సహకరిస్తే రూ.30 లక్షలు ఇస్తానని వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కమనీయం.. కరగోత్సవంబొమ్మనహళ్లి: బెంగళూరు దక్షిణ జిల్లాలోని కనకపుర ధర్మరాయస్వామి, ద్రౌపతమ్మ కరగ మహోత్సవం శనివారం రాత్రి కనులపండువగా జరిగింది. అర్ధరాత్రి దేవీ దేవతలకు పుష్పాలతో అలంకరించి, నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణం నుంచి ధర్మరాయస్వామి, ఆదిశక్తి ద్రౌపతమ్మ దేవి పుష్పోత్సవం ప్రారంభమైంది. కరగ పూజారి మల్లెలతో అలంకరించిన కరగను ఎత్తుకుని నాట్యమాడుతూ ఊరంతా సంచరించారు. శృంగేరిలో కుట్రల్ని తిప్పికొట్టాం: డీసీఎం శివాజీనగర: శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లపై కుట్రను తిప్పికొట్టినట్లు డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ నేను రాత్రంతా ఓట్ల లెక్కింపు పరిణామాలను గమనించాను. బీజేపీ మాజీ ఎమ్మెల్యే జీవరాజ్, అధికారులను ఏ విధంగా దుర్వినియోగం చేసుకొన్నారనేది దేశానికి పెద్ద సాక్షి అయిందన్నారు ఆ నివేదిక వచ్చిందని, దానిని అధ్యయనం చేస్తున్నానన్నారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ఉన్న బాక్స్లను ఓపెన్ చేయడం నుంచి అన్నీ తనకు తెలుసని జీవరాజ్పై మండిపడ్డారు. గతంలో వారి ఏజెంట్ సమక్షంలో ఓట్ల లెక్కింపు జరిగింది, సంతకాలు కూడా తీసుకున్నారు, ఇప్పుడు జీవరాజ్ రచ్చ చేశారని ధ్వజమెత్తారు. జీవరాజ్పై న్యాయ పోరాటం చేపట్టామని తెలిపారు. -
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటులో ఉద్రిక్తత
మాలూరు: తాలూకాలోని మాస్తి ఫిర్కా రాజేనహళ్లి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని గొల్లహళ్లి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటులో రెండు గుంపుల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న తాలూకా యంత్రాంగం అధికారులు, మాస్తి పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. గొల్లహళ్లి గ్రామ సర్వే నంబర్ 4–1లో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు వివాదానికి కారణమైంది. భూమి హక్కు, చట్టపరమైన సంబంధాల విషయమై రెండు గుంపుల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాలూకా అధికారులు, పోలీసులు గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో చర్చించారు. తహసీల్దార్ ఎం.వి.రూప మాట్లాడుతూ.. గ్రామంలో శాంతిభద్రతలను కాపాడటం ముఖ్యమన్నారు. రెండు గుంపుల ప్రముఖులు అన్ని దాఖలాలను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. గ్రామంలో శాంతి సభ నిర్వహించి, అవసరమైతే 144 సెక్షన్ విధించాలని పోలీసులకు సూచించారు. -
ఉపాధ్యాయుల సంఘం ఎన్నికల్లో విజయ భేరి
కోలారు: జిల్లా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సురేష్ బాబు, నారాయణ స్వామి, అనిల్ కుమార్ వర్గానికి చెందిన అభ్యర్థులు అన్ని స్థానాల్లో గెలుపొందారు. ప్రస్తుత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అజయ్ కుమార్ వర్గం ఓటమి పాలైంది. ఎన్నిక జరిగిన 20 స్థానాలను అనిల్ కుమర్ వర్గానికి చెందిన వారు కై వసం చేసుకున్నారు. అన్ని స్థానాల్లో విజయం సాధించడంపై నారాయణ స్వామి, అనిల్ కుమార్, సురేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పని చేస్తామన్నారు. -
యుద్ధప్రాతిపదికన డ్యాం గేట్ల ఏర్పాటు పూర్తి
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాం గేట్ల ఏర్పాటు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి.కె.శివ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన కొప్పళలో విలేకరులతో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఖరీఫ్ నాటికి క్రస్ గేట్లు అమర్చే పనులను పూర్తి చేశామన్నారు. డ్యాం గేట్లు, ఇతర పనులకు రూ.315 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. రూ.54 కోట్లను క్రస్ట్ గేట్లకు కేటాయించడం జరగిందన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొని అనుకున్న సమయానికి పనులు పూర్తయినట్లు వెల్లడించారు. 22వ గేట్ వద్ద కొత్త చైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. నవలి వద్ద సమానంతర జలశయం నిర్మాణం కోసం తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాలెన్సింగ్ రిజర్యాయర్ నిర్మాణానికి విముఖత వ్యక్తం చేస్తున్నారనారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 10 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నట్లు వివరించారు. 33 టీయంసీల మేర పూడికతీత విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తుంగభద్ర డ్యాం పరిశీలన హొసపేటె: తుంగభద్ర డ్యాం గేట్ ఏర్పాటు పనులను ఆదివారం ఉప ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి డీకే.శివకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిపుణుల నివేదిక ప్రకారం పాత గొలుసులు బలంగానే ఉన్నప్పటికి.. ముందు జాగ్రత్త చర్యలు కొత్త గొలుసులు అమర్చాలని నిర్ణయించామన్నారు. పూడికతీత సమయంలో రైతుల భూములు, పర్యావరణానికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యామ్ పరిసరాల్లోని పరిశ్రమల నుంచి రసాయనాలతో కూడిన నీరు డ్యామ్లోకి ప్రవేశిస్తున్నట్లు నివేదికలు వచ్చాయన్నారు. అధికారుల నుంచి సమాచారం అందిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభివృద్ధి ముఖ్యమే అయినా, ప్రజల ఆరోగ్యం, పంటల పరిరక్షణే ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. జలాశయం మొత్తం 33 గేట్ల సంస్థాపన పనులు పూర్తయ్యాయని, సాంకేతిక బృందం సలహా మేరకు ఆధునీకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలియజేశారు. పనులు పూర్తయిన తర్వాత, రాయచూర్, బళ్లారితో సహా నాలుగు జిల్లాల రైతులను ఆహ్వానించి డ్యామ్కు ప్రతేక్య పూజ చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.315 కోట్ల వ్యయం డీసీఎం డి.కె.కుమార్ -
ఊటీ యాత్రలో కడతేరిన ప్రాణాలు
మైసూరు: ఊటీ విహారయాత్ర మధ్యలోనే రక్తసిక్తమైంది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకాలోని కేరళ రోడ్డుపై మద్దయనహుండి సమీపంలో ఆదివారం మట్టిని తీసుకువెళ్తున్న లారీ కారును ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. కారులోని ముగ్గురు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కేరళకు చెందిన కారు డ్రైవర్ మునీర్ (30), మునీరా (55), మోహిజ్ (3) మృతులు. వివరాలు... మునీరా కుటుంబం కేరళలోని కన్నూరులో జీవిస్తోంది. ఆమె రెండో అల్లుడు మునీర్ దుబాయ్లో పనిచేస్తుంటాడు. సెలవు పెట్టి అత్తగారింటికి వచ్చాడు, అతని భార్య గర్భవతిగా ఉంది. ఊటీ విహారయాత్రకు వెళ్లాలని కారులో బయల్దేరారు. కోజికోడ్ – కొళ్లేగాళ హైవే 766లో ప్రయాణిస్తూ అప్పుడే కేరళను దాటి కర్ణాటకలోకి ప్రవేశించారు. బండీపుర అడవి రేంజిలో ప్రయాణిస్తుండగా ఎర్ర మట్టి లోడుతో కేరళకు వెళ్తున్న కర్ణాటక లారీ కారును వేగంగా ఢీకొట్టింది. దీంతో కారు దూరంగా ఎగిరిపడి గుర్తుపట్టలేనంతగా తుక్కుగా మారిపోయింది. మునీర్, మునీరా, ఆమె పెద్ద కూతురి కొడుకు మోహిజ్ అక్కడే రక్తపు మడుగులో చనిపోయారు. సానియా మీర్జా (22), సహల్ పర్వీన్ (28), బిలాల్ అనేవారు తీవ్రంగా గాయపడగా, వారికి చామరాజనగరలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేరళ నుంచి వారి బంధువులు ఆస్పత్రికి చేరుకోగా రోదనలతో మార్మోగింది. స్థానికుల ఆందోళన మట్టి, రాళ్లను రవాణా చేసే లారీల కారణంగా కేరళకు వెళ్లే రోడ్డుపై నిరంతరం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వెంటనే రైతు సంఘాల కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేశారు. కొన్ని రోజుల క్రితమే టిప్పర్ లారీ, కారును ఢీకొనగా కేరళకు చెందిన నలుగురు చనిపోయారని తెలిపారు. టిప్పర్లు, లారీలు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రజలను బలిగొంటున్నారని ఆరోపించారు. సారవంతమైన మట్టి కేరళకు దొంగరవాణా జరుగుతోందని, దీనిని అరికట్టాలని కోరారు. కానీ అధికారులు డబ్బులు తీసుకుంటూ దొంగ రవాణాకు సహకరిస్తున్నారని దుయ్యబట్టారు. కేరళీయుల కారును మట్టి లారీ ఢీ అత్త, అల్లుడు, మనవడు మృతి చామరాజనగర వద్ద విషాదం -
కుల వివక్షకు తావులేని రథోత్సవం
మైసూరు: జిల్లాలోని హుణసూరులో బ్రాహ్మణ వీధిలో ఉన్న పురాతన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథోత్సవం కుల భావాలు లేకుండా సాగింది. బ్రాహ్మణులు, దళిత నేతలను అతిథులుగా ఆహ్వానించి వేడుక సాగించారు. డీఎస్ఎస్ రాష్ట్ర నేత నింగరాజు మల్లాడి మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవానికి దళిత నాయకులను ఊరేగింపుగా తీసుకువెళ్లి, రథాన్ని లాగడం మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది అని అన్నారు. దళిత నాయకులు చిక్కహున్సూర్ రాజు, బల్లేనహళ్లి కెంపరాజు, కిరిజాజీ గజేంద్ర, బెల్తూరు వెంకటేష్, నాగనహళ్లి మాదేవ, బన్నిబీడి శ్రీధర్, రేణుకమ్మ తదితరులు, బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు. -
జ్ఞాన బోధ చేయడం స్వామీజీల కర్తవ్యం
రాయచూరు రూరల్: సమాజంలో ప్రజలకు ధర్మ, జ్ఞాన బోధ చేయడం స్వామీజీల కర్తవ్యమని మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్ సూచించారు. ఆదివారం రాయచూరు తాలూకా మిట్టి మల్కాపూర్లో అరూడ జ్యోతి సిద్దరూడ మఠం పీఠాధిపతి నిజానంద శివాచార్యులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేడుకల్లో సన్మానాలు ముఖ్యం కాదన్నారు. నిరుపేదలకు అన్నదానం చేయాలని సూచించారు. సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భారతీయ సంస్కృతి ధర్మ ప్రచారంలో అందరు ముందుండాలని నిజానంద శివాచార్యులు సూచించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, మాజీ ఎంపీ బి.వి.నాయక్, మాజీ శాసన సభ్యుడు బసన గౌడ బ్యాగవాట్, తిమ్మప్ప, మహంతేష్ పాటిల్, ఈరేష్ తదితరులు పాల్గొన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలవాలిరాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో యువత సమాజానికి సేవలు చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి.కె.శివ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సింధనూర్ తాలుకా క్రీడా మైదానంలో విధాన పరిషత్ సభ్యుడు బసన గౌడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5001 మంది మహిళలకు ఒడి నింపడం, 151 మందికి ఉచితంగా సాముహిక వివాహాలు చేశారు. కార్యక్రమంలో స్పీకర్ యూటి ఖాదర్, మంత్రులు ఈశ్వర్ ఖండ్రే, శివరాజ్ తంగడిగి, మధు బంగారప్ప, భోసురా, శివానంద పాటిల్, శాసన సభ్యులు హంపన గౌడ బాదర్లి, బసన గౌడ, పుట్టణయ్య, నాగరాజ్, హంపయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. కలబురిగి జిల్లా అధికారిగా మహ్మద్ షరీఫ్ రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా అధికారి పౌజియాను తరూన్నమ్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మహేంతేష్ ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరు గ్రామీణ నీటి సరఫరా శాఖకు మార్చడం జరిగింది. ఆమె స్థానంలో ఆర్థికశాఖలో విధులు నిర్వర్తిస్తున్న మహ్మద్ ఇఖ్రముల్లా షరీఫ్ను నూతన జిల్లా అధికారిగా నియమించారు. తుంగభద్రలో పూడికతీత చేపట్టాలిసాక్షి, బళ్లారి: తుంగభద్ర డ్యాంలో పూడిక చేరడంతో 33 టీఎంసీల నీటి సామర్థ్యం కోల్పోయామని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తుంగభద్ర డ్యాం గేట్లను పరిశీలించేందుకు విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ను కలిసి సమస్యలను తెలియజేశారు. తుంగభద్ర డ్యాంలో పూడికతీతకు సంబంధించి సాధ్య, సాధ్యాలను వివరించారు. డ్యాం నిర్మాణం చేపట్టినప్పుడు డ్యాంలో 133 టీఎంసీలు నీటి నిల్వ ఉండేదని తెలిపారు. ఏటా పూడిక చేరడంతో డ్యాంలో ప్రస్తుతం 100 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంటోందని పేర్కొన్నారు. నవలి వద్ద జలాశయం అనుమతులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అనుమతులు అవసరం అన్నారు. పలు గ్రామాలు నీట ముగిగే అవకాశం ఉండటంతో ఆలోచించాలని సూచించారు. మైనింగ్ ఫండ్ ద్వారా పూడికతీత చేపట్టాలని సూచించారు. సుదీప్ హెలికాప్టర్ ల్యాండింగ్ మార్పురాయచూరు రూరల్: సింధనూరులో ఆదివారం జరిగిన మహిళలకు ఒడి నింపే కార్యక్రమానికి సినీ నటుడు కిచ్చా సుదీప్ విచ్చేశారు. అందులో భాగంగా ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాల మైదానంలో హెలిపాడ్ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ హెలికాప్టర్ వస్తున్న నేపథ్యంలో దానిని వేరే చోటుకు మళ్లించాలని పోలీసులు సూచించారు. మరో వైపు సామూహిక వివాహాల సందర్భంగా బహిరంగ సభలో నూతన వధువరులను ఆశీర్వదించి వేదికపై వెళ్తున్న తరుణంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్ జరిగింది. అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, వేదికపై కూర్చున్న మంత్రులు హుటాహుటిన కిందకి వచ్చేశారు. అధికారులు మంటలను అదుపు చేశారు. -
మామ వేధింపులు తట్టుకోలేక కోడలు..!
బెంగళూరు: భర్త ఇంట్లో అదనపు కట్న వేధింపులను తట్టుకోలేక వివాహిత తన మూడు నెలల పసికందును ఉయ్యాలలో ఉంచి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన బెంగళూరు హుళిమావు ఠాణా పరిధిలో జరిగింది. వందన (23) ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయింది. వివరాలు.. మూడేళ్ల క్రితం విక్రమశేషతో ఆమెకు పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. రూ. 4 లక్షల విలువగల బైకు, బంగారు అభరణాలు కట్నంగా ఇచ్చారు. వీరికి 3 నెలల పసిబిడ్డ ఉంది. భర్తతో పాటు మామ, ఆమెను అధిక కట్నం తేవాలంటూ రోజూ వేధించేవారు. వందన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేది. పెద్దలు అనేక సార్లు రాజీ పంచాయతీలు చేసినా భర్తలో మార్పు రాలేదు. గదిలో ఆమె శవమై తేలింది. విక్రంశేషు కుటుంబీకులే వందనాను కొట్టి చంపేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. భర్తతో మామ శ్రీనివాస్, మరిది వినిష్లపై హులిమావు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పసికందు తల్లి కోసం ఏడుస్తుంటే చూపరుల కళ్లు చెమర్చాయి. -
పాలికె విభజనకు రాజకీయ రంగు
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ పాలికెను విభజించి ప్రత్యేక ధార్వాడ పాలికె ఏర్పాటు చేసే నిర్ణయం ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంది. 16వ ఆర్థిక కమిషన్ నిధుల ఆశ కోసం బీజేపీ బృహత్ పాలికెగానే ఉండాలని పట్టుపడుతోంది. కాదు కూడదు అంటే విభజనే మంచిదని కాంగ్రెస్ మొండికేస్తోంది. ఈ ఇరువర్గాల రాజకీయ ఎత్తుగడలతో జంట నగరాల అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉత్తర కర్ణాటకలో ప్రముఖ జంట నగరాలైన హుబ్లీ– ధార్వాడ సిటీ కార్పొరేషన్ భవితపై రాజకీయ సంఘర్షణ పతాక స్థాయికి చేరింది. ఓ సమయంలో పాలికె విభజనకు పట్టుబట్టిన బీజేపీ ఇప్పుడేమో ఎక్కువ నిధులు వస్తాయన్న ఆశతో గ్రేటర్ హుబ్లీ ధార్వాడ మున్సిపల్ కార్పొరేషన్ రచన కోసం డిమాండ్ చేస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం పాలికె విభజన నిర్ణయానికే మొగ్గు చూపుతోంది. 1962లో హుబ్లీ ధార్వాడ నగరసభలను విలీనం చేసి కార్పొరేషన్గా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది 202.3 చదరపు కిలో మీటర్ల పరిధిలో 82 వార్డులను కలిగి ఉంది. అయితే నిధుల కేటాయింపులో ధార్వాడకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో ఎమ్మెల్యే అరవింద బెల్లద ప్రత్యేక ధార్వాడ కార్పొరేషన్ డిమాండ్కు శ్రీకారం చుట్టారు. గవర్నర్ అనుమతి కోసం ఎదురుచూపులు కాగా 2025 జనవరిలో విభజనకు మంత్రివర్గం ఆమోదం తెలిపి గవర్నర్ గ్రీన్సిగ్నల్ కోసం పంపించింది. ఇలా ఉండగా బీజేపీ వైఖరి మార్చుకుంది. కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం తీర్మానం ప్రకారం 10 లక్షలకు పైగా జనాభా ఉన్న సిటీ కార్పొరేషన్లకు వార్షికంగా రూ.500 కోట్ల నుంచి రూ.1000 కోట్ల మేర ఎక్కువ నిధులు ఇవ్వడానికి సిఫార్సు చేసింది. ఒక వేళ పాలికె విభజన జరిగితే రెండు నగరాల జనాభ 10 లక్షల కన్నా తక్కువ కానుంది. దీంతో ఈ పెద్ద నిధి చేజారుతుందని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన పాలికె సమావేశంలో విభజనకు గుడ్ బై చెప్పి బృహత్ పాలికె ఏర్పాటుకు తీర్మానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే బీజేపీ నేతల ఈ వైఖరిని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రసాద్ అబ్బయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందన్న గ్యారంటీ లేదు. కేంద్రం నియమావళికి మన పాలికెను అన్వయించడం అనుమానమే. దీంతో విభజనే మంచిదని ఎమ్మెల్యే వాదిస్తున్నారు. ఈ గందరగోళాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం చివరికి ఏ తీర్మానం తీసుకుంటుందోనని ప్రస్తుతం అందరిలో కుతూహలం కల్గిస్తున్న అంశం. బృహత్ పాలికె కోసం బీజేపీ పట్టు విభజనే ముద్దు అంటున్న కాంగ్రెస్ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రభుత్వం తీరు -
ఫీజుల్లో రాయితీ అందించండి
బళ్లారిటౌన్: జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలని జిల్లా వర్నింగ్ జర్నలిస్టు సంఘం జిల్లాధికారికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల పెరుగుతున్న ఫీజులతో తమ పిల్లలకు ఉత్తమ విద్యను అందించలేని సంక్లిష్ట స్థితిలో విలేకరులు ఉన్నారని తెలిపారు. జిల్లాలో ఎక్కువగా పార్ట్టైమ్ విలేకరులే ఉన్నందున ఫీజుల భారాన్ని భరించలేక పోతున్నారని సంఘం జిల్లా అధ్యక్షుడు వీరభద్రగౌడ తదితరులు పేర్కొన్నారు. రాజ్యాంగంలోని నాలుగో స్తంభం పత్రికా రంగం అని, ఇందులో పని చేసే విలేకరుల పిల్లలకు కూడా ఉన్నత స్థాయి విద్య కల్పించుకోవాలని ఆశ ఉంటుందన్నారు. సమాజం కోసం కష్టపడుతున్న విలేకరులకు తమ పిల్లలకు ఉత్తమ విద్యను కల్పించే దిశలో ఆయా విద్యా సంస్థల్లో రాయితీ కల్పించాలని విన్నవించారు. అనంతరం జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారిస్ సుమేరా, విద్యాశాఖ అధికారికి వినతిపత్రాలను అందజేశారు. ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, పదాధికారులు బసవరాజు, గురుశాంత్, హరీష్, నాగరాజు, వినాయక, శ్రీనివాస్ శెట్టి, నందీష్, జంబునాథ్, వెంకోబి, తిమ్మప్ప చౌదరి, మంజునాథ తదితరులు పాల్గొన్నారు. -
శృంగేరి రాజే..గౌడ
● రీ కౌంటింగ్లో మళ్లీ గెలుపు శివాజీనగర: చిక్కమగళూరు జిల్లా శృంగేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ.డీ.రాజేగౌడనే రెండోసారి గెలిచారు. ఉద్యోగుల ఓట్ల రీకౌంటింగ్లో ఇది సాధ్యమైంది. వివరాలు.. 2023 ఎన్నికల్లో రాజేగౌడ 201 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. అయితే పోస్టల్ ఓట్ల లెక్కింపులో అక్రమం జరిగిందని ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి డీ.ఎన్.జీవరాజ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పోస్టల్ ఓట్ల రీ కౌంటింగ్కు కోర్టు ఆదేశించింది. అదే ప్రకారంగా శనివారం స్థానిక ఐడీఎస్జీ కాలేజీలో పోస్టల్ ఓట్లను తిరిగి లెక్కించారు. అయితే ఈసారి 2 ఓట్లు అదనంగా రావడంతో రాజేగౌడ 203 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లయింది. జీవరాజ్కు మరోసారి పరాభవం తప్పలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం బయట చిందులు వేస్తూ టపాసులు పేల్చి సంబరాలు చేసుకొన్నారు. ప్రజా తీర్పును ఎవరూ మార్చలేరని నినాదాలు చేశారు. -
రోడ్డు పనులకు మోక్షమెన్నడో?
సాక్షి,బళ్లారి: నిత్యం వాహనాల రాకపోకలు, జనం రద్దీగా తిరిగే రోడ్డు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. బళ్లారి నుంచి ఆంధ్రాళ్ మీదుగా బొమ్మనహాళు వెళ్లే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రధాన రహదారి అభివృద్ధి పనులు ఒక అడుగు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా కొనసాగుతుండటంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. 10 కిలో మీటర్ల రోడ్డు పనులకు రూ.30 కోట్ల నిధులు విడుదల చేశారు. 6 నెలల క్రితం పనులు ప్రారంభించారు. ఆంధ్రాళ్ నుంచి బైపాస్ వరకు నాలుగు లైన్ల రోడ్డు, మిగిలిన 8 కిలో మీటర్లు కర్ణాటక పరిధిలోని బుర్రనాయకనహళ్లి వరకు 12 బ్రిడ్జిలతో పాటు సిమెంట్ రోడ్డు వేయాలని ప్రభుత్వం నివేదిక రూపొందించి ఆదేశాలు జారీ చేసింది. సిమెంట్ రోడ్డు వేయడానికి రూ.30 కోట్ల నిధులను విడుదల చేసింది. దారి పొడవున రోడ్డు తవ్వేశారు. కంకర పరిచారు. ఎక్కడపడితే అక్కడ అధ్వానంగా రోడ్డును వదిలేశారు. సీసీ రోడ్డుకు బదులు తారు రోడ్డు నిర్మాణం సిమెంట్ రోడ్డు కోసం నిధులు విడుదల చేస్తే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క ఏం ఆలోచన వచ్చిందో కానీ తారు రోడ్డు వేయాలని సంకల్పించారు. దీంతో ప్రభుత్వం అనుమతి కోసం ప్రతిపాదనలు పంపి పనులు ఆపివేశారు. నాలుగు నెలల నుంచి ఈ రోడ్డు అధ్వానంగా ఉండటంతో బస్సులు, లారీలు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు 9 కిలోమీటర్ల పొడవైన రోడ్డును దాటేందుకు గంట సేపు ప్రయాణించాల్సి వస్తోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బళ్లారి నుంచి ఈ రోడ్డు గుండా కర్ణాటక పరిధిలోని వివిధ పల్లెలకే కాకుండా ఆంఽధ్రప్రదేశ్ పరిధిలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజక వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణం సాగిస్తుంటారు. ముఖ్యంగా బళ్లారి నుంచి పావగడ, మడికేరి, తుమకూరు, బెంగళూరు వరకు కూడా ఈ రోడ్డు గుండానే నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. కేఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు బళ్లారి నుంచి బెంగళూరుకు నిత్యం రాకపోకలు సాగిస్తాయి. పనుల్లో జాప్యంపై ప్రజల్లో అసంతృప్తి ఇంత పెద్ద ఎత్తున రద్దీ గల ప్రధాన రహదారి అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాల్సింది పోయి నెలల తరబడి 9 కిలో మీటర్ల మేర రోడ్డు అభివృద్ధి పనులకు ఎంతో సమయం వెచ్చించాల్సి వస్తుండటంతో అధికారులు, కాంట్రాక్టర్ల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు గుండా వెళ్లేటప్పుడు సమయం అధికంగా తీసుకోవడంతో విపరీతమైన దుమ్ము, దూళి లేస్తుండటంతో ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణించలేని విధంగా ఉన్నాయి. సీసీ రోడ్డుకు నిధులు మంజురు అయితే తారు రోడ్డు వేసేందుకు ఎందుకు వెచ్చిస్తున్నారో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సిమెంట్ రోడ్డు పేరుతో నిధులు మంజూరు అయిన తర్వాత తారు రోడ్డు వేసేందుకు మళ్లీ ప్లాన్ చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తారు రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ ఏదైనా ముందే ప్రతిపాదనలు చేసి ఆ దిశగా పనులు చేసి ఉంటే త్వరతగతిన పనులు పూర్తి చేసే అవకాశం ఉండేదని చెప్పవచ్చు. ఇకనైనా సంబంధిత అధికారులు నత్తనడకన సాగుతున్న రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధ్వానస్థితిలో ఉన్న కర్ణాటక, ఆంధ్ర ప్రధాన రహదారి దృశ్యం వాహన రాకపోకలతో రోడ్డులో దుమ్ము, ధూళి లేస్తున్న దృశ్యం ఆంధ్రాళ్ నుంచి 10 కి.మీ.మేర రూ.30 కోట్లతో రోడ్డు పనులు అధ్వానస్థితిలోని రోడ్డుతో నానాఇబ్బందులు పడుతున్న ప్రజలు -
అహింసా మార్గంతోనే ప్రపంచ శాంతి సాధ్యం
హొసపేటె: ప్రపంచానికి శాంతి, అహింస, కరుణ సందేశాన్ని అందించిన బుద్ధ జయంతి వేడుకలు కేవలం ఒక సంప్రదాయంగా మాత్రమే మిగిలిపోకూడదు. మనం బుద్ధుని బోధనలను, ఆదర్శాలను మన వ్యక్తిగత జీవితాల్లో అలవర్చుకోవాలి. శాంతిని సరైన మార్గంలో అనుసరించినప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఈ.బాలకృష్ణ అన్నారు. శనివారం నగరంలోని జెడ్పీ కార్యాలయ హాలులో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ, సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ బుద్ధ జయంతి కార్యక్రమంలో బుద్ధుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం ఆయన మాట్లాడారు. నేటి ప్రపంచ సంఘర్షణలు, అంతర్గత విభేదాలు, దేశంలోని సామాజిక సమస్యలను పరిష్కరించడంలో బుద్ధుని ఆలోచనలు అత్యంత సందర్భోచితమైనవన్నారు. రాజకుటుంబంలో జన్మించి, అన్ని సుఖాలు, సౌభాగ్యాలు అనుభవించిన సిద్ధార్థుడు సమాజ పరివర్తన కోసం వాటన్నింటినీ త్యజించి బుద్ధుడయ్యాడు. ఆయన ఆలోచనలు దేశ విదేశాలకు వ్యాపించాయి. నేడు మానవుల్లో బీపీ, షుగర్, ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలకు మితిమీరిన కోరిక, దురాశలే ప్రధాన కారణాలు. పొరుగువారితో కలహాలు లేదా భూమిపై దురాశ, ఇవన్ని మనల్ని శాంతికి దూరం చేస్తున్నాయి. చక్రవర్తి అశోకుడు బుద్ధుని శాంతి సందేశంతో ప్రభావితుడై బౌద్ధమతాన్ని వ్యాప్తి చేశాడు. నేటికీ మన జాతీయ పతాకంలో దానికి గౌరవం లభిస్తోంది. ఈ విషయంలో ఆయన, బుద్ధుని ఆలోచనలను కేవలం వినడమే కాకుండా వాటిని మన జీవితాల్లో ఆచరించడం వల్ల మన జీవితానికి అర్థాన్నిస్తుందని అన్నారు. ఉపన్యాసకురాలు డాక్టర్ ఉమా, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వైఏ కాళె, తహసీల్దార్ ఎం.శృతి, జెడ్పీ సీఈఓ అన్నదాన స్వామి, సంఘ నాయకుడు సోమశేఖర్ సంగమని, ఇతరులు హాజరయ్యారు. -
పనిచేయకపోతే వేటు తప్పదు
శివాజీనగర: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారుల మీద నిర్దాక్షిణ్యంగా క్రమశిక్షణా చర్యలు తీసుకొంటామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఘాటుగా హెచ్చరించారు. శనివారం విధానసౌధలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్, శాఖల అధిపతులు, ఐఏఎస్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆస్పత్రి గోడ కూలి 7 మంది చనిపోవడం, రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం లేదని ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో వాడీవేడిగా సభ సాగింది. అలసత్వం, అవినీతి వద్దు సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ ప్రజోపయోగ కార్యక్రమాలు, పథకాలలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తే సహించను. పనుల్లో లోపాలు కనిపిస్తే అధికారులను బాధ్యులుగా చేసి కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు. బడ్జెట్లో ప్రకటించిన కార్యక్రమాలను వేగిరం చేయాలన్నారు. ఈ పథకాలపై కొంతమంది అధికారులు సక్రమంగా పనిచేయడం లేదన్న సిద్దరామయ్య.. ఇలాంటి ధోరణిని సహించనని మండిపడ్డారు. పథకాల అమలుకు నిధుల కొరత ఉందని నెపం చెప్పి కాలక్షేపం చేయవద్దన్నారు. బడ్జెట్ పథకాలకు ఆర్థిక వనరులను అందజేస్తాం, కాలపరిమితిలో అమలు పరచాలని ఆదేశించారు. ఎక్కడా అవినీతికి తావుండరాదన్నారు. అధికారులు కార్యాలయాలకు వచ్చి పని చేయాలి. ఎక్కడో కూర్చొని ఫైళ్లు పరిష్కరిస్తామంటూ నేను సహించను అని తెలిపారు. ప్రజల సమస్యల మీద స్పందించాలని సూచించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల సమాచార పథకాల పరిశీలన గురించి నూతన కర్ణాటక ప్రగతి పోర్టల్, డెయిరీని సీఎం ఆవిష్కరించారు. సీఎం సలహాదారు బసవరాజ రాయరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఐఏఎస్లపై సీఎం సిద్దు ఉగ్రరూపం బడ్జెట్ పథకాలను అమలు చేయాలని ఆదేశం ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో భేటీ -
మౌలిక సదుపాయాలు కల్పించండి
బళ్లారిటౌన్: ట్రాన్స్జెండర్ల(హిజ్రాల)కు కూడా అన్ని శాఖల్లోను ఒక శాతం రిజర్వేషన్ అమలు చేయడమే కాక ఉత్తమ జీవితం సాగించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కర్ణాటక స్వాభిమాన నడక కన్వీనర్ వీణా డిమాండ్ చేశారు. శనివారం పత్రికా భవనంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 4న ఉదయం 11 గంటలకు మోతీ సర్కిల్ నుంచి గాంధీ భవన్ వరకు స్వాభిమాన నడకను చేపట్టి అనంతరం సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. సమాజంలో తమను చిన్నచూపు చూస్తున్నారన్నారు. తాము ఏ వృత్తిలో జీవించాలో ప్రభుత్వాలు దారి చూపాలన్నారు. తమకు సరైన సదుపాయాలు కల్పించక పోవడంతో విధి లేక భిక్షాటన చేస్తున్నామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా తమపై కొత్త చట్టం తీసుకొని రావడం గోరుచుట్టుపై రోకలి పోటుగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయలేదని, కర్ణాటకలోను ఈ చట్టాన్ని అమలు చేయరాదని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంతేకాక అన్ని శాఖల్లో కేటాయించిన 1 శాతం రిజర్వేషన్ను అమలు అయ్యేలా ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమితి ప్రముఖులు చాందిని, చంద్రకుమారి, పర్వీన్ బాను, గౌసియా బేగం, అరుణ, హేమలత తదితరులు పాల్గొన్నారు. -
ప్రముఖ న్యాయవాది కన్నుమూత
బళ్లారిఅర్బన్: నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది విరుపాక్షరెడ్డి(67) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన స్థానికంగా న్యాయవాదిగా, ఉపాధ్యాయుడిగా ఎంతో ఆదరణ పొందారు. ఈయన లాతో పాటు బీఈడీ పట్టభద్రులు. స్వస్థలం గుంతకల్లు సమీపంలోని కసాపురం. ఈయన సతీమణి బీఎస్ఎన్ఎల్ సీనియర్ ఉద్యోగి. ఈ దంపతులకు ఏకై క కుమారుడు ఇంజనీర్. తొలుత ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పని చేసిన విరుపాక్షరెడ్డి ఆ తర్వాత లా పట్టా పుచ్చుకొని ప్రైవేట్ శిక్షణ తీసుకున్నారు. వివిధ సామాజిక సమస్యలపై పోరాటాలు సాగించిన మృతుని అంత్యక్రియలు వారి స్వస్థలం కసాపురంలో శనివారం నెరవేరాయి. ఈయన మృతికి పలువురు ప్రముఖులతో పాటు సీనియర్ న్యాయవాది ఎస్.ఎర్రిస్వామి, జయరాం తదితరులు సంతాపం తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు సెలవులివ్వాలిరాయచూరు రూరల్: అంగన్వాడీ కార్యకర్తలకు వేసవిలో అధికంగా ఎండలు ఉండడంతో అదనంగా 15 రోజులు సెలవులివ్వాలని రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సీ్త్ర శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న కార్యకర్తలకు 15 రోజులు అదనంగా సెలవులు ఇవ్వాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. వైభవంగా లక్ష్మీ వేంకటేశ్వర ఉత్సవాలురాయచూరు రూరల్: రాయచూరు తాలూకా దిన్నిలో వెలసిన లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శుక్రవారం సాయంత్రం గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్ హవల్దార్ ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ వేడుకలో భాగంగా వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం జరిపారు. సమస్యలు పరిష్కరించరూరాయచూరు రూరల్: నగరంలోని లాల్ బహుద్దూర్ శాస్త్రి నగరలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఏఐఎంఎస్ఎస్ డిమాండ్ చేసింది. శనివారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఉస్మాన్ మాట్లాడుతూ నూతన ఆశ్రయ కాలనీలోని మురుగు కాలువల్లో పేరుకున్న పూడికతీత, వీధుల్లో విద్యుత్ దీపాల అమరిక, తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ధర్మ సందేశాలు అందరికీ చాటాలిరాయచూరు రూరల్: భారత దేశంలో హిందూ ధర్మ సందేశాలను అందరికీ చాటాలని మాజీ మంత్రి శివన గౌడ నాయక్ అభిప్రాయ పడ్డారు. శుక్రవారం రాత్రి కిల్లే బృహన్మఠంలో పీఠాధిపతి శాంతమల్ల శివాచార్య 31వ పట్టాధికార మహోత్సవంలో మాట్లాడారు. సనాతన సంప్రదాయాలు, ఆచార, విచారాలు, భారతీయ సంస్కృతిపై ధర్మ ప్రచారంలో స్వామీజీ ముందంజలో ఉన్నారన్నారు. కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు తిప్పరాజ్, బసనగౌడ బ్యాగవాట్ పాల్గొన్నారు. మలేరియాను నిర్మూలిద్దాంరాయచూరు రూరల్: జిల్లాలో మలేరియా వ్యాధి నిర్మూలనకు సహకరించాలని జిల్లా ఆరోగ్య కుటుంబ కళ్యాణ అధికారి డాక్టర్ సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. శనివారం లింగసూగూరు తాలుకా ఈచనాళ తాండాలో జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కుటుంబ కళ్యాణ శాఖ, తాలూకా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ మలేరియా వ్యాధి గురించి వివరించి, ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. రక్త పరీక్ష ద్వారా వ్యాధిని కనుగొనడాినికి వీలుంటుందన్నారు. -
పసికందు ముందే తల్లి ఆత్మహత్య
యశవంతపుర: భర్త ఇంట్లో అదనపు కట్న వేధింపులను తట్టుకోలేక వివాహిత తన మూడు నెలల పసికందును ఉయ్యాలలో ఉంచి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన బెంగళూరు హుళిమావు ఠాణా పరిధిలో జరిగింది. వందన (23) ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయింది. వివరాలు.. మూడేళ్ల క్రితం విక్రమశేషతో ఆమెకు పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. రూ. 4 లక్షల విలువగల బైకు, బంగారు అభరణాలు కట్నంగా ఇచ్చారు. వీరికి 3 నెలల పసిబిడ్డ ఉంది. భర్తతో పాటు మామ, ఆమెను అధిక కట్నం తేవాలంటూ రోజూ వేధించేవారు. వందన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేది. పెద్దలు అనేక సార్లు రాజీ పంచాయతీలు చేసినా భర్తలో మార్పు రాలేదు. గదిలో ఆమె శవమై తేలింది. విక్రంశేషు కుటుంబీకులే వందనాను కొట్టి చంపేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. భర్తతో మామ శ్రీనివాస్, మరిది వినిష్లపై హులిమావు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పసికందు తల్లి కోసం ఏడుస్తుంటే చూపరుల కళ్లు చెమర్చాయి. 5 నుంచి పీణ్య పై వంతెనపై ఆంక్షలుయశవంతపుర: బెంగళూరులో ఎంతో ముఖ్యమైన పీణ్య ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ పాక్షికంగా మూతపడనుంది. వంతెన కేబుల్ మరమ్మతుల కోసం కొన్నిరోజులు బంద్ అవుతుంది. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకూ రోజూ ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు పీణ్య వంతెనను మూసేస్తారు. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని అధికారులు తెలిపారు. బెంగళూరుకు వచ్చేవారు కెన్న మెటల్ ఫ్యాక్టరి సమీపంలో పై వంతెన కింది భాగంలో ఎన్హెచ్–4 సర్వీసు రోడ్డు ద్వారా నగరంలోకి ప్రవేశించాలని తెలిపారు. ఘనంగా చన్నకేశవ రథోత్సవంకేజీఎఫ్: కేజీఎఫ్ తాలూకాలోని రామసాగర గ్రామంలో వెలసిన శ్రీ భూనీల సమేత చన్నకేశవ స్వామి బ్రహ్మ రథోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయంలో మూలవిరాట్టుకు వివిధ హోమాలు సహా మహా మంగళారతి తరువాత ఉత్సవమూర్తులు తేరులో ప్రతిష్టించి రథోత్సవాన్ని ప్రారంభించారు. తేరుపైకి భక్తజనం దవనం, అరటి పండ్లు విసిరారు. సపలాంబదేవి ఊరేగింపు మాలూరు: తాలూకాలోని బంటహళ్లి గ్రామంలో నూతనంగా భక్తుల సహాయంతో నిర్మించిన శ్రీ సపలాంబ దేవి ప్రతిష్టాపనా మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. శనివారం దేవాలయంలో సపలాంబ దేవి ఉత్సవమూర్తికి విశేష పూజలు నిర్వహించి, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీలో గ్రామంలో ఊరేగించారు. మహిళలు తంబిట్లు దీపాలను తలపై మోసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే కె ఎస్ మంజునాథ్ గౌడ తదితర ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. -
15 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
బళ్లారిటౌన్: బళ్లారి గ్రామీణ నియోజకవర్గం పరిధిలో వివిధ సర్వే నెంబర్లలోని 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారి నుంచి జిల్లా యంత్రాంగం తిరిగి స్వాధీనం చేసుకుంది. సర్వే నెంబర్–977లో 9.20 ఎకరాలు, సర్వే నెంబర్– 976లో 4.72 ఎకరాలు, సర్వే నెంబర్–813లో 13 ఎకరాల భూమిని శనివారం అధికారికంగా జిల్లా యంత్రాంగం జప్తు చేసుకుంది. ఈ సందర్భంగా ఏడీసీ మహ్మద్ జుబేర, ఏసీ రాజేష్, తహసీల్దార్ టీ.రేఖ, పోలీస్ బలగాలు పాల్గొన్నాయి. నేత్రపర్వంగా వడకరాయ రథోత్సవంహొసపేటె: నగరంలోని చారిత్రాత్మక వడకరాయ స్వామి రథోత్సవం శుక్రవారం సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. నగరంలోని ప్రధాన బజారులో ఉన్న వడకరాయ స్వామి రథానికి పూజలు జరిపి, ఆ రథంలో వడకరాయను ప్రతిష్టించారు. అనంతరం ఆ రథాన్ని వడకరాయ ఆలయం నుంచి ఎదురుగా ఉన్న ఆంజనేయ ఆలయం వరకు లాగారు. భక్తులు రథంపైకి అరటి పండ్లు, ధవనం విసిరి తమ భక్తిని చాటుకున్నారు. రథాన్ని లాగిన భక్తులు వడకరాయ అనుగ్రహాన్ని పొందారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి, అదనపు ఎస్పీ జీ.మంజునాథ్ల మార్గదర్శనంలో డీఎస్పీ డాక్టర్ టీ.మంజునాథ్ ఆధ్వర్యంలో పీఐలు డీ.హులుగప్ప, గురురాజ కట్టిమని, మహమ్మద్ గౌస్, సోమనాయక్, తమ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బైక్ల దొంగ అరెస్టు● 14 మోటార్సైకిళ్లు స్వాధీనం రాయచూరు రూరల్: జిల్లాలోని కవితాళ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ల దొంగను అరెస్టు చేసి చోరీకి గురైన 14 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ వెల్లడించారు. శనివారం కవితాళ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బైక్ల చోరీ కేసుల దర్యాప్తు చేపట్టిన కవితాళ పోలీసులు బళగానూరుకు చెందిన దొడ్డ బసవ అనే నిందితుడిని అరెస్ట్ చేసి అతని నుంచి ద్విచక్రవాహనాలను జప్తు చేసినట్లు తెలిపారు. వేసవిలో పని వేళలు తగ్గించాలిహొసపేటె: వేసవి ఎండల నేపథ్యంలో కూలీ కార్మికులకు 30 శాతం పని వేళలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం తాలూకాలోని డణనాయకన కెరె వద్ద ఏర్పాటు చేసిన కూలీ కార్మికుల దినోత్సవంలో గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యకర్త షహనాజ్ మాట్లాడారు. జిల్లాలో అధిక వేడి కారణంగా పనిని 30 శాతం మేర తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్ఆర్ఈజీఏ కార్మికులు హైదరాబాద్ కర్ణాటక జిల్లాల్లో పని చేస్తున్నారు. ప్రతి ఏటా అధిక వేడి కారణంగా పని 30 శాతం తగ్గుతూ వచ్చింది. కానీ ఈ ఏడాది పని తగ్గించాలన్న ఉత్తర్వులు ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరారు. మంత్రి ప్రియాంక ఖర్గేను కోరుతూ లేఖల ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు. అంతేకాకుండా ఈ ఏడాది కార్యాచరణ ప్రణాళికకు ఇంకా ఆమోదం లభించనందున కార్మికులకు పని దొరకడం లేదన్నారు. ఈ నేపథ్యంలో కార్యాచరణ ప్రణాళికను తక్షణమే ఆమోదించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. నరేగ వేతన కార్మికులు కే.కూటన్న, తిండప్ప, రమాలి, భీమప్ప, రమేష్, వెంకటేష్, లక్ష్మీ, నబీసాబ్, యల్లమ్మ, గంగమ్మ, సువర్ణ, దేవక్క, కాళమ్మ తదితరులున్నారు. -
ఇల్లాలు రాసిన మృత్యుగీతం
తుమకూరు: రాష్ట్రంలో కుటుంబాల్లో సామూహిక ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోలారు జిల్లాలో ఇద్దరు కూతుళ్లతో తల్లి బావిలోకి దూకి ప్రాణాలు తీసుకున్న ఘటన మరువక ముందే మరో విషాదం వెలుగుచూసింది. భార్య మరొక పురుషునితో పరారు కావడంతో తీవ్ర వ్యథ చెందిన భర్త ఘోర కృత్యానికి ఒడిగట్టాడు. ఇద్దరు కొడుకును గొంతు పిసికి చంపి, ఆపై ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా ఆల్కెరె గ్రామంలో జరిగింది. శివణ్ణ (40), పిల్లలు జీవన్ (11), ప్రాణేష్ (6) మృతులు. ఇంటికి వచ్చినట్టే వచ్చి.. వివరాలు.. శివణ్ణ గ్రామంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో పూజారిగా ఉంటూ, ఓప్రైవేట్ కంపెనీలో కూడా పని చేస్తుండేవారు. భార్య కావ్య, ఇద్దరు పిల్లలతో ప్రశాంత జీవితం గడుపుతుండగా, వారం రోజుల కిత్రం కావ్య వేరే వ్యక్తితో కలిసి ఇంటి నుంచి పరారైంది. ఈ పరిణామంతో భర్త తీవ్రంగా ఆవేదన చెందాడు. భార్య మిస్సింగ్పై పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కావ్య మళ్లీ ఇంటికి వచ్చింది. మరుసటి రోజు భర్త పనిమీద వెళ్లగా, కావ్య ఇంటిలోని లక్షలాది రూపాయల విలువ చేసే బంగారు, డబ్బుతో మళ్లీ పరారైంది. దీంతో విరక్తి చెందిన శివణ్ణ శుక్రవారం రాత్రి తన ఇంటిలోనే ఇద్దరు మగ పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపి, తర్వాత తానూ ఉరి వేసుకున్నాడు. ఆమె కోసం గాలింపు శనివారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించగా ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా పోలీసు అధికారులు, కుణిగల్ పోలీసులు స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను మరణోత్తర పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కావ్య కోసం గాలింపు చేపట్టారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకు కారణమైన కావ్య, ఆమె ప్రియున్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.ఇంటి వద్ద పరిశీలిస్తున్న పోలీసులుభార్య కావ్య, పిల్లలతో శివణ్ణ (ఫైల్) పారిపోయి, మళ్లీ వచ్చి ఇంట్లో నగలు, డబ్బుతో సతీమణి పరారీ తట్టుకోలేక.. ఇద్దరు కొడుకులను చంపి, భర్త ఆత్మహత్య తుమకూరు జిల్లాలో విషాదం -
సకాలలో మైసూరు ప్రథమం
● 1.20 లక్షల అర్జీల పరిష్కారం మైసూరు: సకాల పథకం అమలు ప్రగతిలో ఏప్రిల్ నెలలో మైసూరు జిల్లా రాష్ట్రంలోనే ద్వితీయ స్థానాన్ని పొందింది. ప్రభుత్వ సేవలను నిర్ణీత గడువులో పొందేందుకు ప్రభుత్వం సకాల పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా కుల, ఆదాయ, వంశవృక్షతో పాటు వెయ్యికి పైగా సేవలను అందిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సకాల పథకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడంతో ఏప్రిల్ నెలలో 1,20,456 అర్జీలను పరిష్కరించారు. 1,19,801 అర్జీలను స్వీకరించారు. 9,937 అర్జీలు తిరస్కృతి అయ్యాయి. స్వీకృతి శాతం 98.34 ఉండగా, తిరస్కృతి కూడా 8.25 శాతం మేర ఉంది. నిర్ణీత కాలంలో 1,18,456 అర్జీలు బట్వాడా అయ్యాయి. ప్రజలు సకాల పథకాన్ని సద్వినియోగపరచుకోవాలని కలెక్టర్ లక్ష్మికాంతరెడ్డి తెలిపారు. కోలుకుంటున్న మంత్రి సుధాకర్ యశవంతపుర: తీవ్ర శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యోజనా, గణాంక శాఖ మంత్రి డి సుధాకర్ అరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆయన సోదరుడు డి.కుమార్ తెలిపారు. కళ్లు తెరిచి చూసి మాట్లాడారు, ఆరోగ్యం మెరుగుపడుతోంది, నూరు శాతం ఆరోగ్యవంతుడు అవుతారని కుమార్ తెలిపారు. సుమారు 10 రోజుల కిందట మోకాళ్ల నొప్పుల కారణంగా మంత్రి సుధాకర్ బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. తరువాత శ్వాసకోశ సమస్య తీవ్రం కావడంతో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కారు దగ్ధం.. మహిళ మృతి ● దొడ్డ వద్ద అనుమానాస్పద ఘటన దొడ్డబళ్లాపురం: కారులో మంటలు లేచి కాలిపోయిన ఘటనలో మహిళ సజీవ దహనమైంది. ఈ సంఘటన దొడ్డబళ్లాపురం తాలూకాలోని బాశెట్టిహళ్లి శివారులో వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బాశెట్టిహళ్లి పారిశ్రామికవాడలోని చపేరియా ఫ్యాక్టరీ వెనుక నిర్మానుష్య ప్రదేశంలో ఏకాంతంగా గడపడానికి బ్యాటరీ కారులో ఓ జంట వచ్చింది. కొంతసేపటికి కారులో మంటలు చెలరేగాయి. పురుషుడు బయటకు దూకి పరారయ్యాడని, మహిళ లోపలే సజీవంగా కాలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇది ప్రమాదమా, హత్యా అనేదానిపై భిన్నాంశాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ జంట ఊరు పేరు కూడా తెలియడం లేదని పోలీసులు చెప్పారు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారులోని అవశేషాలను సేకరించి ఆస్పత్రికి తరలించారు. టెన్త్ టాపర్ బలవన్మరణం దొడ్డబళ్లాపురం: ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షల్లో టాపర్గా నిలిచిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా భైరేగౌడనహళ్లి గ్రామంలో జరిగింది. చిక్కబళ్లాపురానికి చెందిన రాఘవేంద్ర, జ్యోతి దంపతుల కుమార్తె సంధ్య (16), నెలమంగల తాలూకా భైరేగౌడనహళ్లిలోని తన అక్క ఇంట్లో ఉండేది. ఇటీవల ఎస్ఎస్ఎల్సీ పరీక్షల్లో 90 శాతం మార్కులతో పాసై కాలేజీలో చేరడానికి సిద్ధమైంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఉన్న సంధ్య ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. సారీ నాన్నా అని డెత్నోట్ రాసింది. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సూచనశివాజీనగర: డిమాండ్ల సాధన కోసం కేఎస్ ఆర్టీసీ, బీఎంటీసీ ఉద్యోగులు ఈ నెల 20 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సంయుక్త క్రియా సమితి సంచాలకుడు జయదేవరాజ అరస్ శనివారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలి, లేనిపక్షంలో సమ్మెను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. 20 ఉదయం 6 గంటల నుంచి సమ్మె ఆరంభమవుతుందని ప్రకటించారు. సుమారు 1.25 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈ పోరాటంలో పాల్గొంటారన్నారు. -
ఎండిన నదులు.. పల్లెల్లో దాహాకారాలు
రాయచూరు రూరల్: జిల్లాలో నదులు, వాగుల కింద నీటి ఎద్దడి అధికమైంది. ప్రజలు తాగునీటి కోసం చాలా కష్టాలను అనుభవిస్తున్నారు. మాన్వి తాలూకాలో పోత్నాళ వాగు పూర్తిగా ఎండింది. ఈ నేపథ్యంలో ఎడమ వైపు 35 గ్రామాలు, కుడివైపు 25 గ్రామాల ప్రజలు పోత్నాళ వాగుపై ఆధార పడ్డారు. నేడు వర్షాభావంతో తాగునీటి ఎద్దడి తలెత్తి గ్రామాల్లో హాహాకారాలు ప్రారంభమయ్యాయి. తాగునీటి కోసం ప్రజలు చెలిమ గుంతలు తవ్వుతున్నారు. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలైన పోత్నాళ, నందిహాళ, దడేసూగూరు, హిరేహళ్లి, జాగీర్ పన్నూరు, రాయచూరు తాలూకాలోని అరోలి, తిమ్మాపూర్ తదితర 45కు పైగా గ్రామాల్లో తాగునీటి సమస్యలు అధికమయ్యాయి. ప్రజలు తోపుడుబండ్లపై నీటిని తేవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గంటల తరబడి వేచి ఉన్నా నాలుగు బిందెల నీరు దొరకడం కష్టసాధ్యమని ప్రజలు వాపోతున్నారు. కృష్ణా నదిలో కూడా నీరు ఇంకిపోయాయి. జిల్లాలో అధికమైన నీటి ఎద్దడి వర్షాభావంతో సమస్య జటిలం -
రైతు సంక్షేమమే సర్కార్ ప్రధాన లక్ష్యం
రాయచూరు రూరల్: రైతుల సంక్షేమమే సర్కార్ ప్రధాన లక్ష్యమని భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్, రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అభిప్రాయ పడ్డారు. విజయపురలో లోహగ్రాం, బరట్, అరికెరె, హంచినాళ పరిధిలోని 14 గ్రామాల రైతులకు నీటి సౌకర్యం కోసం రూ.17 కోట్లతో చెరువుల పునర్నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఆర్థికంగా రైతులు స్వావలంబన సాధించాలన్నారు. బోరుబావుల ద్వారా పంటలు పండించే రైతులు భూగర్భ జలాల వృద్ధికి కృషి చేయాలన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం వల్ల రైతుల మరింత అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. -
భార్య మరొక పురుషునితో.. తట్టుకోలేక భర్త..!
తుమకూరు(కర్ణాటక): రాష్ట్రంలో కుటుంబాల్లో సామూహిక ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోలారు జిల్లాలో ఇద్దరు కూతుళ్లతో తల్లి బావిలోకి దూకి ప్రాణాలు తీసుకున్న ఘటన మరువక ముందే మరో విషాదం వెలుగుచూసింది. భార్య మరొక పురుషునితో పరారు కావడంతో తీవ్ర వ్యథ చెందిన భర్త ఘోర కృత్యానికి ఒడిగట్టాడు. ఇద్దరు కొడుకును గొంతు పిసికి చంపి, ఆపై ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా ఆల్కెరె గ్రామంలో జరిగింది. శివణ్ణ (40), పిల్లలు జీవన్ (11), ప్రాణేష్ (6) మృతులు. ఇంటికి వచ్చినట్టే వచ్చి.. వివరాలు.. శివణ్ణ గ్రామంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో పూజారిగా ఉంటూ, ఓప్రైవేట్ కంపెనీలో కూడా పని చేస్తుండేవారు. భార్య కావ్య, ఇద్దరు పిల్లలతో ప్రశాంత జీవితం గడుపుతుండగా, వారం రోజుల కిత్రం కావ్య వేరే వ్యక్తితో కలిసి ఇంటి నుంచి పరారైంది. ఈ పరిణామంతో భర్త తీవ్రంగా ఆవేదన చెందాడు. భార్య మిస్సింగ్పై పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కావ్య మళ్లీ ఇంటికి వచ్చింది. మరుసటి రోజు భర్త పనిమీద వెళ్లగా, కావ్య ఇంటిలోని లక్షలాది రూపాయల విలువ చేసే బంగారు, డబ్బుతో మళ్లీ పరారైంది. దీంతో విరక్తి చెందిన శివణ్ణ శుక్రవారం రాత్రి తన ఇంటిలోనే ఇద్దరు మగ పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపి, తర్వాత తానూ ఉరి వేసుకున్నాడు. ఆమె కోసం గాలింపు శనివారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించగా ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా పోలీసు అధికారులు, కుణిగల్ పోలీసులు స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను మరణోత్తర పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కావ్య కోసం గాలింపు చేపట్టారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకు కారణమైన కావ్య, ఆమె ప్రియున్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
‘చైల్డ్ లేబర్.. FIR వేయిస్తా.. వైభవ్ చదువుకోవాలి’
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గత కొన్నాళ్లుగా అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. భారత్ అండర్-19 జట్టుతో పాటు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున దుమ్ములేపుతున్నాడు. గతేడాది ఐపీఎల్లో 35 బంతుల్లోనే శతక్కొటిన ఈ బిహారీ పిల్లాడు.. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడి (14 ఏళ్లు)గా నిలిచాడు.సంచలనాలకు కేంద్రంనిజానికి అంతకంటే ముందే అంటే పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసి వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టుకు ఎంపికై.. ఆసియా రైజింగ్ స్టార్స్తో టోర్నీ పాటు ఇటీవలే వరల్డ్కప్ టోర్నీలోనూ ఆడాడు. ఫైనల్లో ఇంగ్లండ్పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు సాధించి భారత్కు ట్రోఫీ అందించాడు.ఆరెంజ్ క్యాప్ రేసులోఇక ఇటీవలే పదిహేనో వసంతంలోకి అడుగుపెట్టిన వైభవ్.. ఐపీఎల్-2026లో భాగంగా ఈ టోర్నీలో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్పై 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటికి పది మ్యాచ్లలో కలిపి ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 404 పరుగులు పూర్తి చేసుకుని.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్-4లో నిలిచాడు.ఈ నేపథ్యంలో అలెన్ బోర్డర్, బ్రియాన్ లారా, సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం వైభవ్ సూర్యవంశీ ఆటకు ఫిదా అవుతున్నారు. త్వరలోనే అతడిని టీమిండియాకు ఆడించాలని మరికొందరు మాజీ క్రికెటర్లు సైతం సెలక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.యాక్టివిస్ట్ సంచలన వ్యాఖ్యలుఇలాంటి తరుణంలో ఓ వ్యక్తి వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కన్నడ టీవీ చానెల్లో యాక్టివిస్ట్గా పరిచయమైన ఓ వ్యక్తి.. వైభవ్ను తక్షణమే ఇంటికి పంపాలని రాజస్తాన్ యాజమాన్యానికి సూచించాడు. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేసి.. FIR వేయిస్తానని హెచ్చరించాడు.చైల్డ్ లేబర్.. చదువుకోనివ్వండిఈ మేరకు.. ‘‘పదిహేనేళ్ల పిల్లాడు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడకూడదు. ఇలా చేయడం చైల్డ్ లేబర్ కిందకు వస్తుంది. ఈ పిల్లాడిని ఐపీఎల్ క్రికెట్ ఆడనివ్వద్దు. క్రికెట్ ఆడే బదులు అతడు చదువుకోవాలి’’ అని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్కాగా.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.This activist appeared on a Kannada TV channel and said he plans to file a police case or legal complaint against Rajasthan Royals. He said - Don't let this 15-year-old boy "Vaibhav Suryavanshi " play IPL cricket — it's child labour, he should study! pic.twitter.com/zEwVJQseGR— ExtraOrdinary (@Extreo_) May 2, 2026క్రీడాకారులకు వర్తిస్తుందా?కాగా భారత బాల కార్మిక నిరోధక సవరణ చట్టం 2016 ప్రకారం.. పద్నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో పని చేయించకూడదు. అయితే, సాధారణంగా బాల క్రీడాకారులను చైల్డ్ లేబర్గా పరిగణించరు. ప్రతిభకు పట్టం కడుతూ వారిని ప్రోత్సహిస్తారు. క్రికెట్ ఒక్కటే కాదు.. చెస్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో చాలా మంది పదేళ్లలోపు వయసులోనే ప్రవేశిస్తారు.ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్నిజానికి వైభవ్ సూర్యవంశీ ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గతేడాది డిసెంబరులో అతడు ఈ అవార్డు అందుకున్నాడు. అయితే, సదరు యాక్టివిస్టు మాత్రం వైభవ్ను ఐపీఎల్లో ఆడించడం సరికాదని.. ఇది చైల్డ్ లేబర్ కిందకు వస్తుందంటూ కొత్త వాదన తెరమీదకు తెచ్చాడు.ఎన్నో కష్టనష్టాలకు ఓర్చికాగా వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కుమారుడిని ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా కుమారుడు లక్ష్యాన్ని చేరుకునేలా చేశారు. అయితే, చదువులోనూ వైభవ్ ముందే ఉంటాడని ఇటీవలే అతడి స్కూల్ యాజమాన్యం తెలిపింది. కాకపోతే ఈసారి ఐపీఎల్ కారణంగా అతడు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలకు హాజరుకాలేకపోయాడు. ఇక గతేడాది మెగా వేలంలో 1.10 కోట్లకు వైభవ్ను కొన్న రాజస్తాన్ రాయల్స్.. ఈసారి పూర్తి స్థాయి ఓపెనర్గా బరిలోకి దించింది.చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు' -
గుప్త నిధి కోసం కన్నతల్లి బలి యత్నం..!
కర్ణాటక: ధనం కోసం కన్న తల్లిని బలివ్వబోయిన కర్కోటక తనయుడి ఉదంతం చామరాజనగర తాలూకా సగడే గ్రామంలో చోటు చేసుకుంది. మే 1వ తేదీన పౌర్ణమి రోజున ఒకరిని బలి ఇస్తే నిధి లభిస్తుందని స్కెచ్ గీసిన కొండయ్యన మదశెట్టి తన 80 ఏళ్ల అంధ, చెవిటి తల్లి మదమ్మ శెట్టిని బలివ్వడానికి సిద్ధమయ్యాడు. ఈ ఉదయం అతను తన ఇంట్లో 4 అడుగుల గొయ్యి తవ్వకం, అందులో ఒక మంత్రకుండం ఉంచి, నిమ్మ, పసుపు, కుంకుమపువ్వు, కలశంతో పూజ చేశాడు. దీనిపై అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. చామరాజనగర రూరల్ స్టేషన్ పోలీసులు ఇంటికి చేరుకోగానే మంత్రగత్తె పారిపోయింది. దీంతో మదశెట్టిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. నిధిని పొందడానికి ఉపయోగించిన మాయాజాలం గురించి తెలుసుకుని సగడే గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. -
బెంగళూరు చరిత్రలో అదే భారీ వర్షం
బనశంకరి: కర్ణాటక రాజధాని బెంగళూరు చరిత్రలో గత నెల 29న అత్యధిక వర్షపాతం నమోదైన రోజుగా రికార్డుల్లోకి ఎక్కింది. బుధవారం సాయంత్రం బెంగళూరు మధ్య భాగంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలి, వడగండ్లతో 11 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పోటెత్తిన వరద నీరు అకాల వర్షానికి బెంగళూరులో వరదనీరు పోటెత్తినట్టు అధికారులు గుర్తించారు. 200 చదరపు కిలోమీటర్లు పరిధిలో భారీ వర్షం కురిసిందని గ్రేటర్ బెంగళూరు ప్రాధికార సంస్థ తెలిపింది. 20 నుంచి 22 మిలియన్ ఘనపు మీటర్ల నీరు వచి్చందని అంచనా వేశారు. భౌగోళికంగా 900 మీటర్ల ఎత్తులో ఉన్న బెంగళూరులో వార్షికంగా 95 సెంటీమీటర్ల నుంచి 110 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. ఐఎండీ వివరాల ప్రకారం బెంగళూరులో వార్షికంగా కురిసే వర్షం కన్నా సుమారు 10 శాతం అధిక వర్షం కురిసిందని తెలిపింది. -
20 మంది మహిళలను లైంగికంగా వాడుకుని..!
కర్ణాటక: నకిలీ గుర్తింపుకార్డులతో మహిళలను పరిచయం చేసుకుని చనువు పెంచుకుని లైంగికంగా వాడుకున్న తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న నిందితుడిని బెంగళూరు ఆర్ఆర్ నగర పోలీసులు అరెస్టు చేశారు. రామనగర జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు చంద్రేగౌడ అరెస్టైన నిందితుడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...చంద్రేగౌడ రామనగర చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. అయితే ఇతడు తాను లాయర్, రిపోర్టర్, పోలీస్ అంటూ పరిచయం చేసుకుని మహిళలకు వల వేసేవాడు. కొన్నాళ్లు మంచివాడిగా నటించి చనువు పెంచుకుని, తాను డివోర్స్ తీసుకున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి చివరకు శారీరకంగా లోబర్చుకునేవాడు. ఏకాంత సమయంలో ఉన్నప్పుడు తెలివిగా ఫోటోలు, వీడియోలు తీసుకునేవాడు. తరువాత సదరు మహిళలను బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు. ఇలా సుమారు 20 మందికి పైగా మహిళలను లైంగికంగా వాడుకుని బ్లాక్మెయిల్ చేశాడని గుర్తించారు. వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించి ఒక మహిళ వద్ద రూ.5 లక్షలు వసూలు చేశాడు. అదే మహిళ ఒకసారి నిందితుడి మొబైల్ను పరిశీలించగా పదుల సంఖ్యలో మహిళల అశ్లీల వీడియోలు, ఫోటోలు కనిపించాయి. దీంతో సదరు బాధిత మహిళ ఆర్ఆర్ నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
కలబురగి అదనపు పోలీస్ కమిషనర్గా శాలు
రాయచూరు రూరల్: కర్ణాటక ప్రభుత్వం 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి శాలును కలబురగి నగర అదనపు పోలీస్ కమిషనర్గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి బీఎస్ సంజయ్ గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాలు.. కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు. 2021 బ్యాచ్లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. గతంలో హోళి నరసిపురలో అదనపు ఎస్పీగా పని చేశారు. బెంగళూరులో సీఐడీలో ప్రత్యేక అధికారిగా ఉంటూ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆకట్టుకున్న నృత్యాలు హొసపేటె: తాలూకాలో కడ్డిరాంపుర తండాలో శ్రీసంత సేవాలాల్, మరియమ్మ దేవి జాతర శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. డీజే శబ్ధాలకు అనుగుణంగా యువతీ యువకులు నృత్యం చేశారు. బంజారా సముదాయానికి చెందిన ప్రత్యేక వస్త్రధారణ, మహిళల నృత్య ప్రదర్శనలు అలరించాయి. అంతకుముందు శ్రీసంత సేవాలాల్, మరియమ్మ దేవిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పేలిన డీజిల్ ట్యాంక్ హొసపేటె: తాలూకా సండూర్ హుబ్లీలోని నందిహళ్లి సమీపంలో లారీ డ్రైవర్ మహమ్మద్ చిన్నపాటి మరమ్మతుల కోసం లారీని శుక్రవారం గ్యారేజీకి తీసుకెళ్లాడు. మరమ్మతుల అనంతరం లారీని యథావిధిగా బయటకు తీసుకొచ్చాడు. ఒక్కసారిగా డీజిల్ ట్యాంక్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మహమ్మద్, క్లీనర్ గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సండూర్లోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారిలోని ఓపీడీ ఆస్పత్రికి తరలించారు. ఉత్తమ సేవలందించాలిరాయచూరు రూరల్: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ఉత్తమ సేవలందించాలని జిల్లా అధికారి నితీష్ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి పండిత సిద్ద రామ జంబలదిన్ని రంగ మందిరంలో ప్రభుత్వ ఉద్యోగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలన్నారు. సర్కారీ ఉద్యోగులు సంఘటితంగా మెలగాలని సూచించారు. ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వహించి వెనుకబడిన జిల్లా అనే పేరును తుడిచి వేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ, ఎస్పీ అరుణాంగ్శు గిరి, కమిషనర్ జుబీన్ మోహపాత్రో, అదనపు ఎస్పీ కుమార స్వామి, నగర సభ కమిషనర్ శరణప్ప, తహసీల్దార్ సురేష్ వర్మ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 13 బైక్లు స్వాధీనం బళ్లారి అర్బన్: గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా హాలహర్వి మండలం మాచనూరుకు చెందిన నిందితుడు బైక్ను దొంగలిస్తుండగా అరెస్ట్ చేశారు. గాంధీ నగర్, బ్రూస్పేట్ ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగిలించిన 13 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్య బనశంకరి: బెంగళూరు శివారులోని బొమ్మసంద్ర బీటీఎల్ కాలేజీ హస్టల్లో ఉంటున్న కేరళకు చెందిన ఏపీ.ఆదిత్య(19) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ద్వితీయ సంవత్సవర బీఎస్సీ నర్సింగ్ చదువుతన్న ఇతను బుధవారం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ కుమారుడు చావుకు కాలేజీ పాలక మండలి కారణమని మృతుడి తండ్రి ప్రదీప్ హెబ్బగోడి పోలీస్స్టేషన్లో పిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. రెండు బైక్లు ఢీ.. ఒకరి మృతి మండ్య: మండ్య జిల్లా హలగూర్ వద్ద శుక్రవారం రెండు బైక్లు ఢీకొని ఒక బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని రామనగర జిల్లా చెన్నపట్న తాలూకా మడపుర గ్రామానికి చెందిన ముత్తురాజు (25)గా గుర్తించారు. ఇతను పని నిమిత్తం హలగూర్ నుంచి మాలవల్లి వైపు బైక్పై వెళ్తుండగా బెంగళూరు నుంచి వస్తున్న బైక్ ఎదురైంది. పరస్పరం ఢీకొనడంతో ముత్తురాజు అక్కడికక్కడే మృతి చెందాడు. హలగూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
రాజధానిలో షరా మామూలే.!
బనశంకరి: బెంగళూరు నగరంలో ప్రతి ఏడాది భారీవర్షాలకు నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కోవడం షరా మామూలుగా మారుతోంది. సిలికాన్సిటీలో ఎలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయనే దానిపై గ్రేటర్ బెంగళూరు ప్రాధికార, నగర పాలికె అధికారులు గుర్తించి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రతి సారీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు ఏయే ప్రదేశాల్లో ఎలాంటి సమస్య తలెత్తుతుంది అనే దాని గురించి గత ఐదారేళ్ల నుంచి బీబీఎంపీ, జీబీఏ జాబితా తయారు చేసింది. 209 స్థలాలను ముంపుప్రాంతాలుగా గుర్తించింది. ఇందులో 49 ప్రదేశాల్లో ఇంకా సమస్య కొనసాగుతోందని ఏప్రిల్ 2వ తేదీన గ్రేటర్ బెంగళూరు ప్రాధికార ఆదేశాల్లో తెలిపింది. వర్షాలు పడిన సమయంలో వరదల నియంత్రణకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుని ఎలాంటి సమస్య ఏర్పడకుండా అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలని జనవరి నుంచి నగర పాలికెలకు జీబీఏ సూచించింది. ఏయే పనులు ఎవరు చేయాలన్నదానిపై మార్గదర్శకాలు సిద్ధం చేసింది. కానీ వర్షం వచ్చేలోపు ఈ పనులు పూర్తి కావడం లేదు. వరద నివారణ మార్గదర్శకాలపై ఆదేశాలు భారీ వర్ష సూచన, వరద నివారణ మార్గదర్శకాలపై ఏప్రిల్ 30వ తేదీన జీబీఏ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఐదు నగర పాలికెల కమిషనర్లు, జీబీఏ అధికారులు వర్షాలపై ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని చేసిన సూచనల్లో 50 శాతం అమలు చేస్తే నగరంలో వర్షంతో ఇలాంటి సమస్య ఎదురయ్యేది కాదు. ఒకగంట భారీ వర్షం కురిసిందని కబుర్లు చెబుతున్నారు. కానీ అన్ని విధాలుగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని రెండు వారాల క్రితం తెలిపిన అధికారులు ప్రస్తుతం ఎలా సమర్థించుకుంటారు? అనే ప్రశ్న తలెత్తింది. బెంగళూరు నగరంలో కొత్త కట్టడాల్లో ఒక గోడ అదనంగా నిర్మిస్తే మూడో కంటి ద్వారా తెలుసుకునే ఇంజనీర్లకు తమ పరిధిలో శిథిలమైన కట్టడాలు, గోడలు గురించి తెలియదా? ఇలాంటి ప్రమాదకర ప్రదేశాల్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే బౌరింగ్ ఆసుపత్రి ప్రహరీగోడ కూలిపోయే దుర్ఘటన తప్పేదేమో? అనే ప్రశ్న ఎదురవుతోంది. అది ప్రైవేటు లేదా పాలికెకు సంబంధం లేదని చెప్పవచ్చు కానీ జవాబుదారీ నగర పాలికెది కదా? అని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. బాధ్యత తీసుకుంటే నష్టనివారణ సాధ్యం భారీ వర్షాలకు చెట్లు కూలిపోవడం, చెట్ల కొమ్మలు విరిగిపోతే వాటిని అత్యవసరంగా తొలగించడానికి బృందాన్ని ఏర్పాటు చేయాలి. నగర ప్రజల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే స్పందించాలి. చెట్లలో ఎండిపోయిన, కూలిపోయే దశలో ఉన్న చెట్ల కొమ్మలను ట్రిమ్మింగ్ చేసి తొలగించడంపై జీబీఏ అటవీ విభాగ ప్రత్యేక కమిషనర్ బాధ్యత వహించాలి. కానీ వీటిపై చర్యలు తీసుకుంటే గత నెల 29వ తేదీన కురిసిన వర్షానికి చెట్లు కూలిపోతే నష్టం సంభవించేది కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. వర్షాలతో సమస్య నివారణకు కొత్తగా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం లేదు. బీబీఎంపీ లేదా జీబీఏ గతంలో రూపొందించిన పథకాలను అమలు చేస్తే 2026 జనవరి నుంచి ఇచ్చిన సూచనలు, మార్గదర్శకాలు పాటిస్తే భారీ వర్షానికి ఇలాంటి ఇబ్బంది తలెత్తేది కాదు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందు అవసరమైన చర్యలు అత్యవసరంగా జీబీఏ, ఐదు నగర పాలికెలు చేపడితే ప్రమాదాల నుంచి తప్పించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బౌరింగ్ ఆసుపత్రి వద్ద కూలిన ప్రహరీగోడ (ఫైల్) ఉద్యాననగరిలో భారీ వర్షానికి ఏర్పడిన ట్రాఫిక్ జామ్ గత కొన్ని నెలలుగా జీబీఏ చేస్తున్న సూచనలు రోడ్ల పక్కన డ్రైనేజీలు, రాజ కాలువల్లో పూడిక, చెత్త, వ్యర్థాలను తొలగించాలి డ్రైనేజీలు, రాజకాలువల్లో తీసిన పూడిక మట్టిని తరలించాలి రోడ్లపై వర్షం నీరు సజావుగా డ్రైనేజీల్లో ప్రవహించడానికి కర్చ్ ప్రవేశాల్లో గ్రేటింగ్, అండర్పాస్ గ్రేటింగ్ శుభ్రం చేయాలి డ్రైనేజీ చాంబర్లను శుభ్రం చేసి నీరు సజావుగా ప్రవహించడానికి చర్యలు తీసుకోవాలి ప్రాథమిక, ద్వితీయ స్థాయి రాజ కాలువల్లో పూడిక తీసి ఆధునీకరించాలి. భారీ వర్షం కురిస్తే సిలికాన్ సిటీ అస్తవ్యస్తం ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం -
అసంఘటిత కార్మికులను ఆదుకోండి
రాయచూరు రూరల్: కేంద్ర సర్కార్ అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శరణు బసవ డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ కార్యాలయంలో ప్రపంచ కార్మిక దినోత్సవం నిర్వహించారు. కార్మిక జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. వేతనాలతో కూడిన సెలవులు ఇవ్వాలని కోరారు. ప్రతి నెల రూ.7,500 చొప్పున వేతనాలు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలన్నారు. అలాగే ఎస్యూసీఐ నాయకుడు వీరేష్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం జరుపుకున్నారు. కార్యక్రమంలో పద్మ, సులోచన, వరలక్ష్మి, మహేష్, చెన్న బసవ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా కార్మిక దినోత్సవం హొసపేటె: తాలూకా న్యాయ సేవల కమిటీ, బార్ అసోసియేషన్, పోలీస్ శాఖ, కార్మిక శాఖ, విద్యా శాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖల సహకారంతో నగరంలోని టీఎంఏఈఎస్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్లో శుక్రవారం కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సీజేఎం, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి సుబ్రమణ్య, ఎన్, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి, తాలూకా న్యాయ సేవా కమిటీ సభ్య కార్యదర్శి ప్రశాంత్ నాగలాపూర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుజ్జల నాగరాజ్, లేబర్ ఇన్స్పెక్టర్లు జీబీ.ధూపద్, శివశంకర్ తల్వార్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి హొసపేటె: హొసపేట తాలూకాలోని శ్రామిక భవన్ ఎదుట సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ కార్మిక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు ఆర్.భాస్కర్ రెడ్డి జెండా ఆవిష్కరించి, మాట్లాడారు. కోట్లాది మంది శ్రామిక ప్రజలను ఆకలి, పేదరికం, అవమానాల నుంచి విముక్తం చేయడానికి పోరాటం చేయాలన్నారు.ఈ మహత్తర పోరాటంలో ప్రపంచంలోని ఇద్దరు బడా పెట్టుబడిదారుల దోపిడీ, బానిసత్వం నుంచి కార్మికులు బయట పడాలన్నారు. సోదర భావం, స్వేచ్ఛా స్ఫూర్తితో ఒకరికొకరు అండగా నిలబడాలని సూచించారు. కార్యక్రమంలో నేతలు యాళ్లలింగ, జంబయ్య నాయక్, తాసప్ప, మహేష్, నాగరత్న తదితరులు పాల్గొన్నారు. బళ్లారి అర్బన్: అమ్మ శ్రీ కస్తూరి కన్నడ ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఆటో డ్రైవర్లతో కలసి జెండా ఆవిష్కరించారు. ఆ సంఘం అధ్యక్షుడు ఏ జాన్బాస్కో మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను పరిరక్షించాలని కోరారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు వందలాది మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో అమ్మ శ్రీ కస్తూరి ఆటో డ్రైవర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కే.వెంకటేష్, వెంకటేష్, సీఐ అన్వర్ బాషా, సయ్యద్, గంగాధర్, నూర్, శేఖర్, ధ్యానప్ప, ప్రసాద్, తారక్, యల్లప్ప, మహేష్, రాము, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన నగరిలో భారీ వర్షం
బనశంకరి: బెంగళూరు నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నగర రోడ్లు జలమయంగా మారగా విధులు ముగించుకుని ఇళ్లకు వెళుతున్న ఉద్యోగులు, నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వసంతనగర, సిటీమార్కెట్, మెజెస్టిక్, శాంతినగర, జయనగర, జేపీ నగర, బనశంకరి, కోణనకుంటె, హెబ్బాళ, యలహంక, సదాశివనగర, రాజాజీనగర, విజయనగర, చంద్రా లేఔట్, ఇందిరానగర, లగ్గెరె, నందిని లేఔట్, ఆడుగోడి, కోరమంగల, కార్పొరేషన్, మహాలక్ష్మీ లేఔట్, సుబ్రమణ్యనగర, నాగరబావి, మూడలపాళ్య, గిరినగర, బసవనగుడి, మల్లేశ్వరం, ఎంజీ రోడ్డు, కమర్షియల్స్ట్రీట్, శివాజీనగర తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫ్రీడంపార్కు వద్ద శేషాద్రిపురం రోడ్డు జలమయం కావడంతో వాహనాలు నీటిలో సంచరించాయి. కేఆర్ మార్కెట్ వద్ద కూడా వర్షంతో మినీచెరువుగా మారింది. ఎస్పీ రోడ్డు తదితర రోడ్లు వర్షం నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
ఘనంగా బుద్ధుడి జయంతి
రాయచూరు రూరల్: బుద్ధ గయంలోని బోధి వృక్షం కింద తపస్సు చేసి జ్ఞానం పొందిన మహా మానవతా వాది గౌతమ బుద్ధుడు. ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అసిస్టెంట్ కమిషనర్ హంపన్న సూచించారు. శుక్రవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో బుద్ధుడి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మానవుడు అరిషడ్ వర్గాలను త్యజించి జీవనం కొనసాగించాలన్నారు. కోరికలను అదుపులో పెట్టుకుని ప్రశాంత వాతావారణంలో జీవించాలని తెలిపారు. అంతకు ముందు బుద్దుడి విగ్రహానికి జిల్లా అధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ, ఎస్పీ అరుణాంగ్శు గిరి, కమిషనర్ జుబీన్ మోహపాత్రో, నరసింహలు, శ్రీనివాసులు తదితరులు పూజలు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కుమార స్వామి, నగర సభ కమిషనర్ శరణప్ప, తహసీల్దార్ సురేష్ వర్మ, తిమ్మారెడ్డి, గౌతం తదితరులు పాల్గొన్నారు. ప్రతిభావంతులకు సన్మానం బళ్లారి అర్బన్: దేవనామ ప్రియ బయలు బుద్ధ వివార ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం సంగనకల్లు బుద్ధవరంలో ధార్మిక కార్యక్రమం నిర్వహించారు. 2025–26 సంవత్సరంలో జరిగిన ఎస్ఎస్ఎల్సీ పరీక్షల్లో సత్తా చాటిన త్రిష, కస్తూరి, ఆశాబి, కామాక్షి, నబి రసూల్, తనుజ, వంశీ, శ్వేత, భాగ్య, చందన, వచన ప్రియ, గిరిసాయి, నాగవేణి తదితరులను సన్మానించారు. అలాగే ద్వితీయ పీయూసీలో మంచి మార్కులు సాధించిన ఉమాదేవి, దీక్షితను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తుల్లో మరిన్ని విజయాలను సాధించాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో కప్పగల్ ఓంకారప్ప, బళ్లారి మహనగర పాలికె సంస్థ మేయర్ గాదెప్ప, పన్నరాజ్, సంగనకల్లు విజయ్కుమార్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు మెహతాబ్, హెచ్ఎం.బాబుసాబ్, ఉపాధ్యాయులు ధర్మణ్ణ, శివశంకర్, చలవాద మహాసభ అధ్యక్షుడు గోవిందరాజ్ నాగరికరి, నరసప్ప, నాగరత్న, బీ.నాగరాజ్, లింగప్ప, శంకర్, హొనూరప్ప తదితరులు పాల్గొన్నారు. -
రమణీయం.. రథోత్సవం
కెలమంగలం: తళిలో వెలసిన చారిత్రక ప్రసిద్ది పొందిన రుక్మిణి, సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మ రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అవనంతరం రుక్మిణి, సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి ఉత్సవమూర్తిని రథంపై కొలువుదీర్చి ఊరేగించారు. తళి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, ఆనేకల్, చందాపుర, కనకపుర తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రథోత్సవాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు. రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. వేణుగోపాల స్వామి నామస్మరణ మార్మోగింది. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మజ్జిగ, పానకం, చల్లని పానీయాలు అందజేశారు. వివిధ స్వచ్ఛంధ సంస్థలు, స్థానిక ప్రజలతో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. -
కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
రాయచూరు రూరల్: నగరంలోని వివిధ ప్రాంతాల్లో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. రాయచూరు తాలుకా కోర్తుకుందలో నీలమ్మ, మామిడి దొడ్డిలో వెంకటేషను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. నిందితుల నుంచి కల్లును కల్తీ చేసేందుకు ఉపయోగించిన సీహెచ్్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే 67 లీటర్ల కల్తీ కల్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యాపలదిన్ని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమయానికి బస్సులు నడపాలి హొసపేటె: నగరంలోని కేంద్ర బస్టాండ్ నుంచి సండూరు పట్టణానికి వెళ్లే బస్సులు సమయానికి బయలుదేరక పోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి హోస్పేట పట్టణం నుంచి సండూరు వెళ్లే ప్రయాణికులు నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో ప్రయాణికులు ఉన్నప్పటికీ బస్సులు సమయానికి బయలుదేరక పోవడంతో కేకేఆర్టీసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రయాణికులు, రవాణా సంస్థ సిబ్బందికి మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వ్యవహారం చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. సండూరు మార్గంలో నడిచే బస్సులు సమయానికి బయలుదేరక పోవడంతో మహిళలు, పిల్లలు సహా ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సండూరు బస్టాండ్ స్థానాన్ని మార్చడంపై కూడా ప్రయాణికులు మండిపడ్డారు. నమో నారసింహా.. రాయచూరు రూరల్: నగరంలో లక్ష్మీ నరసింహ స్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పూర్ణిమ కావడంతో కోటలో వెలసిన లక్ష్మీ నరసింహ ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం సాయంత్రం ఘనంగా రథోత్సవం నిర్వహించారు. ధరలు తగ్గించాలి రాయచూరు రూరల్: పేదలు వినియోగించే వస్తువుల ధరలను తగ్గించి, నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని సీసీఐఎంల్ డిమాండ్ చేసింది. శుక్రవారం గాంధీ సర్కిల్ వద్ద నాయకులు ఆందోళన చేపట్టారు. సీసీఐఎంల్ కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ.. పంచ గ్యారెంటీలతో రాష్ట్ర ఖజానాను లూటీ చేశారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోందని పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ పాదయాత్ర చేశారు. సీఐపై సస్పెన్షన్ వేటు● విద్యార్థి ఆత్మహత్య కేసు హుబ్లీ: ధార్వాడ జిల్లా గిరినగరలో ఓ విద్యార్థి ఆత్మహత్య కేసులో విద్యాగిరి పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మద్ రఫిక్పై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు.. గంజాయి రహిత అభియాన నేపథ్యంలో పోలీసులు ఆదిత్య మ్యాగేరి అనే డిగ్రీ విద్యార్థిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు జరపగా ఆ విద్యార్థి గంజాయి సేవించలేదని నిర్ధారణ అయ్యింది. అయితే రూ.2000 లంచం ఇవ్వకుంటే వేరే కేసులో ఇరికిస్తామని బెదిరించారు. మనస్తాపం చెందిన ఆదిత్య మ్యాగేరి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో బుధవారం ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. తాజాగా సీఐపై కూడా వేటు పడింది. విధి నిర్వహణలో లోపం కారణంగా సీఐపై చర్యలు తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ శశికుమార్ వెల్లడించారు. ఘటనలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏబీవీపీతో బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తే సరిపోదని.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఆ మేరకే సీఐను కూడా సస్పెండ్ చేస్తూ ఉన్నతస్థాయి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. -
నయవంచనతో మహిళలకు వల
దొడ్డబళ్లాపురం: నకిలీ గుర్తింపుకార్డులతో మహిళలను పరిచయం చేసుకుని చనువు పెంచుకుని లైంగికంగా వాడుకున్న తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న నిందితుడిని బెంగళూరు ఆర్ఆర్ నగర పోలీసులు అరెస్టు చేశారు. రామనగర జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు చంద్రేగౌడ అరైస్టెన నిందితుడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...చంద్రేగౌడ రామనగర చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. అయితే ఇతడు తాను లాయర్, రిపోర్టర్, పోలీస్ అంటూ పరిచయం చేసుకుని మహిళలకు వల వేసేవాడు. కొన్నాళ్లు మంచివాడిగా నటించి చనువు పెంచుకుని, తాను డివోర్స్ తీసుకున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి చివరకు శారీరకంగా లోబర్చుకునేవాడు. ఏకాంత సమయంలో ఉన్నప్పుడు తెలివిగా ఫోటోలు, వీడియోలు తీసుకునేవాడు. తరువాత సదరు మహిళలను బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు. ఇలా సుమారు 20 మందికి పైగా మహిళలను లైంగికంగా వాడుకుని బ్లాక్మెయిల్ చేశాడని గుర్తించారు. వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించి ఒక మహిళ వద్ద రూ.5 లక్షలు వసూలు చేశాడు. అదే మహిళ ఒకసారి నిందితుడి మొబైల్ను పరిశీలించగా పదుల సంఖ్యలో మహిళల అశ్లీల వీడియోలు, ఫోటోలు కనిపించాయి. దీంతో సదరు బాధిత మహిళ ఆర్ఆర్ నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. లైంగికంగా వాడుకుని ఆపై బ్లాక్మెయిల్ మొబైల్లో మహిళల అశ్లీల వీడియోలు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడి అరెస్టు -
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు
రాయచూరు రూరల్: హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని పోలీస్ కమిషనర్ శరణప్ప తెలిపారు. శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్ క్రైమ్, ఇతర నేరాలపై జాగ్రతి, నేరాల నియంత్రణకు అందరు సహకరించాలన్నారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరాల నియంత్రణ కోసం నూతనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరంలో 58 చోట్ల 158 ఏఐ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. సీటు బెల్ట్ ధరించకుండా మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదన్నారు. మొబైల్లో మాట్లాడుతూ వాహనాలను వేగంగా నడిపితే జరిమానా విధిస్తామన్నారు. సంచార నియమాల ఉల్లంఘన, ట్రిపుల్ డ్రైవింగ్కు అవకాశాలు లేవన్నారు. -
మాదప్ప స్వామికి రూ. 3.13 కోట్ల కానుకలు
మైసూరు: చామరాజనగర్ జిల్లా, హనూర్ తాలూకాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహదేశ్వర బెట్టలో వెలసిన శ్రీ మలే మహదేశ్వర స్వామికి భక్తుల నుంచి కానుకల వర్షం కురిసింది. 33 రోజులకు సంబంధించి ఆలయంలోని హుండీలు లెక్కించగా రూ. 3,13,12,118 కానుకలు స్వామివారికి లభించాయి. దీంతోపాటు 64 గ్రాముల బంగారం, 2 కిలోల 50 గ్రాముల వెండి, చలామణిలో లేని రూ. 2వేల విలువైన 3 నోట్లు, 4 విదేశీ నోట్లను లభించాయి. ఆన్లైన్ హుండీ ద్వారా 6,88,214 ఆదాయం లభించింది. సాలూరు బహన్ మఠం అధ్యక్షుడు శ్రీ శాంత మల్లికార్జున స్వామిజీ, శ్రీ మలే మహదేశ్వర స్వామి ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శి ఎ. ఇ. రఘు సమక్షంలో హుండీలను లెక్కించారు. జిల్లా పరిపాలన కార్యాలయ అథారిటీ డిప్యూటీ సెక్రటరీ చంద్రశేఖర్ భారతి పాల్గొన్నారు. లైంగిక వేధింపులు.. నిందితుడి అరెస్టుదొడ్డబళ్లాపురం: ట్రైనీ ఎయిర్ హోస్టెస్ని లైంగికంగా వేధిస్తున్న నిందితుడిని బాగలూరు పోలీసులు అరెస్టు చేశారు. చంద్రశేఖర్ అరైస్టెన నిందితుడు. బాధిత యువతి ఎయిర్ హోస్టెస్గా ట్రైనింగ్లో ఉంది. నిందితుడు ఆమెకు పరిచయస్తుడే. ఒకే ప్రాంతంలో నివసించేవారు. దీంతో అతడితో తరచూ మాట్లాడేది. దీన్నే అలుసుగా తీసుకున్న చంద్రశేఖర్ ప్రేమించమంటూ వెంటబడేవాడు. దీంతో అతడ్ని పూర్తిగా దూరం పెట్టడంతో లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. రోడ్డుపై వెళ్తుండగా తాకడం లాంటివి చేసేవాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పరప్పన నుంచి భార్యకు విచారణఖైదీ వీడియోకాల్ బనశంకరి: పరప్పన అగ్రహార జైలులో ఖైదీలు విలాసవంతమైన జీవితం అనుభవించడం కొత్తేమీ కాదు. జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఖైదీలు మాత్రం తమ ఇష్టానుసారంగా జీవనం సాగిస్తున్నారు. విచారణఖైదీ సెల్లో కూర్చుని భార్యకు వీడియోకాల్ చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విచారణఖైదీ అక్బర్ జైలు అధికారుల కళ్లుగప్పి మొబైల్ వాడుతున్నట్లు తెలిసింది. ఇతను జైలులోని తన గదిలో నుంచి భార్యకు వీడియోకాల్ చేశాడు. భార్య ఆ వీడియో కాల్ను రికార్డ్ చేసి గత నెల 9వ తేదీన తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఏప్రిల్ 28వ తేదీ అక్బర్ జైలునుంచి విడుదలయ్యాడు. అతను విడుదలైన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగానే ఇన్స్టా నుంచి వీడియోను డిలీట్ చేశారు. పరప్పన అగ్రహార జైలులో ఇలాంటి అక్రమాలు కొత్తేమీ కాదని, గత కొన్నేళ్లుగా ఆ జైలు విలాసవంతమైన సౌకర్యాలకు నిలయంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మలే మహదేశ్వర బెట్ట రోడ్డుపై బస్సు బోల్తా ● 30 మందికి గాయాలు మైసూరు: చామరాజనగర్ జిల్లా, హనూర్ తాలూకాలోని మలే మహదేశ్వర బెట్ట నుంచి శుక్రవారం 50 మంది ప్రయాణికులతో కొల్లేగాళు బయల్దేరిన కేఎస్ ఆర్టీసీ బస్సు తాలుబెట్ట మలుపు వద్ద బ్యారియర్ సమీపంలో బోల్తా పడింది. దీంతో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు స్పందించి ప్రయాణికులను, క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చారు. కండక్టర్ పద్మావతి, మైసూరుకు చెందిన దాక్షాయణి, సిద్దయ్యనపురకు చెందిన సుందరమ్మ బసవరాజుకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను కౌడల్లి, హనూర్, కొల్లేగాళు ఆసుపత్రికి తరలించారు. బస్సు వేగంగా వెళ్తుండగా హెచ్చరించామని, అయినా డ్రైవర్ పట్టించుకోలేదని ప్రయాణికులు మండిపడ్డారు. బస్సు బోల్తా పడుతుండగానే డ్రైవర్ కిందకు దూకి పారిపోయాడు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్ను సులభతరం చేశారు. బస్సు ఢీకొని విద్యార్థి మృతి దొడ్డబళ్లాపురం: బస్సు ఢీకొని విద్యార్థి మృతిచెందిన ఘటన హెణ్ణూరు–బాగలూరు మెయిన్ రోడ్డులో చోటుచేసుకుంది. 9వ తరగతి పాస్ అయిన వరుణ్(15) ఇంటి నుంచి రోడ్డు అవతలి వైపు ఉన్న షాప్కి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొంది. ప్రమాదంలో వరుణ్ అక్కడికక్కడే మృతిచెందాడు.హెణ్ణూరు ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. -
బ్యానర్ గొడవ కారకులపై విచారణ
బళ్లారిఅర్బన్: మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ సందర్భంగా బ్యానర్ల ఏర్పాటుకు సంబంధించి జనవరి 1న నగరంలో జరిగిన గొడవ, కాల్పుల కేసులో సీఐడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. గత నాలుగు రోజులుగా నగరంలో మకాం వేసిన డీఎస్పీ అంజన్కుమార్ నేతృత్వంలో సీఐడీ అధికారుల బృందం నగరంలోని అతిథిగృహంలో ఈ కేసులోని నిందితులను ప్రశ్నిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అంతకు ముందు మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్రెడ్డి మద్దతు ఉన్న నిందితులకు బెంగళూరుకు రావాలని నోటీసులు జారీ చేశారు. వారిలో కొందరు వెళ్లి అప్పుడు తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. ఇప్పుడు ఇక్కడకు వచ్చి వాంగ్మూలాలను నమోదు చేసుకొని వారిని ఆ బృందం ప్రశ్నించింది. వారు అనంతరం కోర్టుకు హాజరు కావాలని తెలిసింది. మరో వైపు నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి మద్దతు ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మందికి పైగా వ్యక్తులను నగరంలోని ఎంఆర్వీ లేఔట్లో ఉన్న నిందితుడి ఇంటికి పిలిపించి నోటీసులు ఇచ్చారు. మే 11న బెంగళూరు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని వారికి సూచించారు. మొత్తం బ్యానర్ వివాదానికి సంబంధించిన కేసులపై త్వరలో చార్జిషీట్ సమర్పణకు సీఐడీ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 11న వాంగ్మూలం నమోదుకు సూచన నోటీసులు జారీ చేసిన సీఐడీ బృందం -
బెంగళూరులో సెమీకండక్టర్ హబ్ కోసం 140 ఎకరాలు
దేశంలోనే సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న కర్ణాటక మరో కీలక మైలురాయిని చేరుకుంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత సెమీకండక్టర్ పరికరాల తయారీ దిగ్గజం ‘అప్లైడ్ మెటీరియల్స్ ఇంక్’ కోసం బెంగళూరులో 140 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న ‘బెంగళూరు సిగ్నేచర్ బిజినెస్ పార్క్’ (బీఎస్బీపీ)లో ఈ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ భూ కేటాయింపు ద్వారా రాష్ట్రంలో సెమీకండక్టర్ రంగం మరింత బలోపేతం కానుంది.కేటాయింపు ముఖ్యాంశాలుప్రాజెక్టు స్థలం: కెంపెగౌడ విమానాశ్రయ సమీపంలోని బెంగళూరు సిగ్నేచర్ బిజినెస్ పార్క్.కేటాయింపు భూమి: 140 ఎకరాలు.నిబంధన: లీజు-కమ్-సేల్ ప్రాతిపదికన కేటాయింపు.ధర: చదరపు అడుగుకు రూ.1,288 చొప్పున, మొత్తం రూ.780 కోట్ల విలువైన భూమిని కంపెనీకి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.వ్యూహాత్మక ప్రాధాన్యతరాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల ఫ్యూచర్ ఆఫ్ వర్క్ సమ్మిట్లో మాట్లాడుతూ, రాష్ట్రంలో చిప్ తయారీకి సంబంధించిన ఒక భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని పేర్కొన్న తరుణంలో ఈ వార్త వెలువడింది. కర్ణాటక ప్రభుత్వం సెమీకండక్టర్ డిజైన్, పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), గ్లోబల్ క్యాబిలిటీ సెంటర్లపై (జీసీసీ) ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అప్లైడ్ మెటీరియల్స్ రాకతో ఈ రంగంలో రాష్ట్రం తన పట్టును మరింత పెంచుకోనుందని మంత్రి చెప్పారు.పారదర్శకతకు పెద్దపీటఈ భూ కేటాయింపు చట్టబద్ధమైన అనుమతులు, ధరల నిర్ణయానికి లోబడి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, బీఎస్బీపీలో మిగిలి ఉన్న 267 ఎకరాల భూమిని ఏ విధంగా వినియోగించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పారదర్శకత కోసం పోటీ బిడ్డింగ్, నిపుణుల సలహాల మేరకు తదుపరి విధివిధానాలను రూపొందించనున్నట్లు పరిశ్రమల శాఖ తెలిపింది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
వెంకటేష్ హత్య కేసులో ఆరుగురికి ఉరిశిక్ష
సాక్షి బళ్లారి: గంగావతి బీజేపీ యువమోర్చా నాయకుడు కురుబ వెంకటేష్ హత్య కేసులో గంగావతి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆరుగురికి ఉరిశిక్ష విధించగా.. మరో ఆరుగురిని నిర్ధోషులుగా తేల్చింది. 2025 అక్టోబర్లో కురుబ వెంకటేష్ స్నేహితుడితో కలిసి వెళ్తుండగా పాత కక్షలతో ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే రవి, అల్తాఫ్ బళ్లారి, గంగాధర్, దాదాపీర్, మైలారీ విజయ్, సలీమ్తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. చార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు పూర్తి దర్యాప్తు చేసి కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు. న్యాయమూర్తి సదానందప్ప వాదోపవాదనలు, సాక్ష్యాధారాలు పరిశీలించారు. కురుబ వెంకటేష్ హత్య కేసులో ప్రధాన నిందితులైన ఆరుగురికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన రవి, అల్తాఫ్, గంగాధర్, దాదాపీర్, మైలారీ, సలీమ్కు ఉరిశిక్ష విధించగా.. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఇదే కేసులో అరెస్టు అయిన కార్తీక్, భీంభరత్, ధనరాజ్, శరణబసవ, మల్లికార్జున్ తదితరులను నిర్ధోషులుగా ప్రకటించారు. వెంటనే వీరిని విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో ఆరుగురిని నిర్ధోషులుగా తేల్చిన కోర్టు -
మందుల లావాదేవీల నమోదు తప్పనిసరి
హొసపేటె: హొసపేటె సిటీ బస్టాండ్ సమీపంలోని మెడికల్ షాపులను గురువారం విజయనగర్ డీసీ కవితా ఎస్ మన్నికేరి, ఎస్పీ జాహ్నవి, డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రలు, మందులు ఇవ్వవద్దని మందుల దుకాణాల యజమానులను హెచ్చరించారు. మందుల దుకాణాల ముందు డ్రగ్స్ శాఖ అందించిన నోటీసు బోర్డును ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. మందుల లావాదేవీలను కంప్యూటర్, రిజిస్టర్ పుస్తకంలో నమోదు చేయాలన్నారు. డాక్టర్ రసీదు లేకుండా మాత్రలు, మందులు ఇవ్వకూడదని తెలిపారు. డాక్టర్ రసీదు లేకుండా మాత్రలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మందుల దుకాణదారులు విధిగా నిబంధనలు పాటించాలని సూచించారు. -
మత్తు పదార్థాలు ప్రాణాంతకం
రాయచూరు రూరల్: నేటి తరం యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కారాదని జిల్లా అధికారి నితీష్ సూచించారు. గురువారం రాయచూరు వైద్య కళాశాల పరిశోధన సంస్థలో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం, సీహెచ్ పౌడర్ గంజాయి, హపీం వంటి వాటికి యువత దూరంగా ఉండాలని పేర్కొన్నారు. మత్తుకు బానిస అయితే భవిష్యత్తు అంధకారం అవుతుందని తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా మద్య తరలిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించి వాటి నియంత్రణకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి, అదనపు ఎస్పీ కుమార స్వామి, హరీష్, రిమ్స్ అధికారులు రమేష్, ఉదయ్, విజయ శంకర్, బసవరాజ్ పాటిల్, డీఎస్పీ శాంతవీర, సీఐ మేకా నాగరాజ్, ఎస్ఐలు బసవరాజ్, మహ్మద్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు. ఉడుసలమ్మ ఆలయ ప్రారంభోత్సవంబళ్లారి అర్బన్: కంప్లి నియోజకవర్గ పరిధిలోని బాదనహట్టిలో పునర్నిర్మాణం చేసిన ఉడుసలమ్మ దేవి ఆలయ ప్రారంభోత్సవం, గోపుర కలశ ప్రతిష్ణ వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా కుటుంబంపై ఉడుసలమ్మ దేవి ఆశీస్సులు, బాదనహట్టి ప్రజల ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే భరత్రెడ్డి, వ్యాపార వేత్త సతీష్ రెడ్డిని గ్రామ పెద్దలు అభినందించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ ఎం.రాజేశ్వరి, కాంగ్రెస్ నాయకులు సుబ్బరాయుడు, చానాళ్శేఖర్, వ్యాపార వేత్త సతీష్ రెడ్డి, గ్రామస్తులు మేటి బసప్ప, హనుమంత రెడ్డి తిమ్మప్ప, గోవిందప్ప, బసప్పయ్య, మనూరు జడెప్ప, కరెన్న, హెచ్.ఈశ్వర గౌడ, పరశురాం తదితరులు పాల్గొన్నారు. భానుడి భగభగలు రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉదయం 10 గంటలు దాటితే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని పానీయాలు సేవిస్తున్నారు. రాయచూరులో 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని జిల్లా అధికారి నీతిష్ తెలిపారు. యాదగిరిలో44.5, కలబుర్గిలో 43.5, బాగల్ కోటలో 43.5, బీదర్లో 44.4, విజయపురలో 43, బెళగావి, కొప్పళ్, గదగ్లో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సర్కారు ఆస్పత్రిలో ఐఏఎస్ భార్యకు కాన్పురాయచూరు రూరల్: నగరంలోని తల్లీబిడ్డల ఆస్పత్రిలో గురువారం ఐఏఎస్ భార్యకు కాన్పు చేశారు. జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఈశ్వర్ కుమార్ కాందూ భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఈశ్వర్ కుమార్ కాందూ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని మౌలిక సౌలభ్యాలు కల్పించడం జరిగిందన్నారు. పేదలు వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాన్పు చేయించొద్దన్నారు. పేదలు అప్పులు చేసి బాధ పడకుండా సర్కారీ సౌలభ్యాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 14 కేంద్రాల్లో నీట్ పరీక్షబళ్లారి రూరల్: ఈనెల 3వ తేదీ జరగనున్న నీట్ పరీక్షకు దావణగెరెలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అధికారి జి.ఎం.గంగాధర స్వామి తెలిపారు. గురువారం జిల్లా అధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన నీట్ ముందస్తు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నీట్ పరీక్షకు దావణగెరెలో 13, హరహరలో 1 చొప్పున మొత్తం 14 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొత్తం 7,280 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేదాజ్ఞలు జారీ చేసినట్లు తెలిపారు. జిరాక్స్, కంప్యూటర్ సెంటర్లను బంద్ చేస్తామన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు, మొబైల్, క్యాలికులేటర్, బ్లూటూత్, తదితర ఎలాక్ట్రానిక్ వస్తువులు తీసుకుని రాకూడదని పేర్కొన్నారు. -
పెళ్లికి వెళ్తుండగా విషాదం
సాక్షి బళ్లారి: టీటీ వాహనాన్ని గూడ్స్ లారీ ఢీ కొట్టడంతో స్నేహితుడి పెళ్లికి బయలుదేరిన మిత్ర బృందంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన కూడ్లిగి సమీపంలో గురువారం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి టాటా టెంపో (తుపాన్) వాహనంలో ఓ ప్రైవేటు కంపెనీ (రిలయన్స్ డిజిటల్)లో పని చేస్తున్న 12 మంది యువతీ యువకులు స్నేహితుడి పెళ్లి కోసం కూడ్లిగి సమీపంలోని హిరేగినళ్లికి బయలుదేరారు. కూడ్లిగి తాలూకా హిరేకడూరు వైపు వెళ్తుండగా టీటీ వాహనం రిపేరీతో ఆగిపోవడంతో రోడ్డు పక్కన నిలబెట్టారు. వాహనంలో మధు, దిలీప్ మరో ఐదుగురు అలాగే ఉండిపోయారు. మిగిలిన వారు కిందకు దిగి వాహనాన్ని తోసేందుకు ప్రయత్నించారు. అంతలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ లారీ.. టీటీ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టాటా టెంపో వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. టెంపో వాహనంలో వెనుక సీట్లో కూర్చొన్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా కదరంపల్లి గ్రామానికి చెందిన తిప్పేస్వామి, రాధిక దంపతుల కుమారుడు పి.మధు అక్కడికక్కడే మృతి చెందాడు. హాసన్ జిల్లాకు చెందిన మరో యువకుడు దిలీప్ బళ్లారి విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఐదుగురు గాయాలపాలవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే డీవైఎస్పీ మల్లేష్దొడ్డమణె, సీఐ ప్రహ్లాద చెన్నగిరి, పీఎస్ఐ ప్రకాశ్, తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కదరంపల్లిలో విషాదచాయలు.. ఇదిలా ఉండగా.. కళ్యాణదుర్గం తాలూకా కుందుర్పి మండలం కదరంపల్లికి చెందిన పి.మధు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియడంతో రెండు వాహనాల్లో బంధువులు, కుటుంబ సభ్యులు తరలివచ్చారు. మధు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. బైక్ను ఢీకొన్న లారీ ● బైక్ చోదకుడు మృతి హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణ శివారులోని హోసహళ్లి రోడ్డుపై ఉన్న ఫ్లైఓవర్ అండర్ పాస్ వద్ద బైక్ను లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన బైకర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. సౌత్ సీడ్స్ కంపెనీలో పని చేస్తున్న సులదాహళ్లికి చెందిన బసవరాజ (35) మృతుడు. వివరాలు.. బసవరాజ సులదాహళ్లి నుంచి కూడ్లిగి పట్టణానికి వెళ్లాడు. అక్కడ సామాను తీసుకుని కూడ్లిగి పట్టణంలోకి వెళ్లాడు. కొత్త గ్రామం నుంచి కూడ్లిగి పట్టణం వైపు వస్తున్న లారీ డ్రైవర్.. ఫ్లైఓవర్ అండర్పాస్ రోడ్డుపై వేగంగా వచ్చి.. ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బసవరాజ తల, ఇతర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించారు. సోదరుడు రామచంద్ర ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లారీ డ్రైవర్పై కూడ్లిగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీటీ వాహనాన్ని ఢీ కొట్టిన గూడ్స్ లారీ ఇద్దరు మృతి, పలువురికి గాయాలు బెంగళూరు నుంచి కూడ్లిగికి వెళ్తుండగా ఘటన మృతుల్లో ఒకరు కళ్యాణదుర్గం తాలూకా నివాసి మరొకరు హాసన్ జిల్లా యువకుడు బసవరాజు మృతదేహం -
రింగ్ రోడ్డు నిర్మాణాలు చేపట్టాలి
రాయచూరు రూరల్: నగరంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా రహదారులను విస్తరించడంతో పాటు రింగ్ రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని మాజీ ఏపీఎంసీ ఉపాధ్యక్షుడు బాబురావ్ డిమాండ్ చేశారు. గురువారం ఆర్డీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భారీ వాహనాలు ప్రధాన రహదారిపై వెళ్తున్న సమయంలో ఇటీవల ముగ్గురు మరణించారని పేర్కొన్నారు. దేవ సూగురు నుంచి నవోదయ వైద్య కళాశాల వరకు రింగ్ రోడ్డు నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆర్డీఏ అధ్యక్షుడు రాజశేఖర్ రామస్వామికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. వడదెబ్బకు కూలీ మృతిరాయచూరురూరల్: కల్యాణ కర్ణాటకలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బకు కూలీ మృతి చెందిన ఘటన రాయచూరు జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం సింధనూర్ తాలూకా ఇజె మూళ్లూరుకు చెందిన వ్యవసాయ కూలీ అంబణ్ణ (62)గా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్న సమయంలో నరేగా పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో బీపీ పెరగడంతో కుప్ప కూలిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వారం రోజుల్లోనే ఐదుగురు వడదెబ్బతో మృతి చెందారు. పిడుగుపాటుకు ఎద్దులు మృతి లింగసూగురు తాలూకా ముదుగల్ మేగళ పేటలో పిడుగుపాటుకు ఎద్దులు మరణించాయి. బుధవారం సాయంత్రం హనుమంతు ఎద్దులను కట్టేసి వచ్చాడు. సాయ్రంతం పిడుగులు పడటంతో ఎద్దులు చనిపోయాయి. బౌద్ధ సన్యాసి హత్యహుబ్లీ: టిబెట్కు చెందిన బౌద్ధ సన్యాసి థాసిదొండు (39) దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి ధార్వాడ బైపాస్ అలియాళ రోడ్డులో వంతెన వద్ద చోటు చేసుకుంది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే ధార్వాడ గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. అతడి ముఖంపై గాయాలైనట్లు కనుగొన్నారు. బౌద్ధ సన్యాసి హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. దుండగులు వేరే చోట హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడికి తెచ్చి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి మృతుడి బంధువులు, ధార్వాడ గ్రామీణ పోలీసులు అలాగే ముండగోడ పోలీసులు వచ్చి సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. గుండెపోటుతో ఉద్యోగి మృతిహొసపేటె: విజయనగర జిల్లా హువినహడగలి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్న అకౌంటింగ్ అధికారి విజయ కుమార్ (40) గుండెపోటుకు గురై మరణించారు. గురువారం ఉదయం విజయకుమార్ యథావిధిగా కార్యాలయానికి వచ్చారు. విధులు నిర్వర్తిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుర్చీలోనే కుప్పకూలి పోయారు. ఇతర కార్యాలయ సిబ్బంది దీనిని గమనించి విజయ్కుమార్తో మాట్లాడటానికి ప్రయత్నించారు. అయితే ఆయన స్పందించక పోవడంతో హుటాహుటిన పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునే లోపే విజయ్కుమార్ చనిపోయారు. నిరంతరాయంగా అభివృద్ధి పనులు హుబ్లీ: 59వ డివిజన్ కార్పొరేటర్ సువర్ణ కల్లకుంట్ల తమ వార్డులో సమస్యల పరిష్కారానికి సాయశక్తుల కృషి చేస్తున్నారు. తాజాగా వార్డు పరిధిలోని గ్రీన్ వ్యాలీ లేఅవుట్లో రూ.19 లక్షల వ్యయంతో రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విద్యనగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రజత్ ఉల్లగడ్డి మఠ మాట్లాడుతూ.. ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహణ, ఇతర సహాయ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. కాగా రూ.19 లక్షల ఖర్చుతో భూగర్భ డ్రైనేజీ, వివిధ అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. పరిహారం పంపిణీరాయచూరు రూరల్: మూడు రోజల క్రితం పిడుగుపాటుతో 50 గొర్రెలు మృతి చెందిన విషయం విదితమే. బుధవారం సాయంత్రం గురుమిఠకల్ శాసన సభ్యుడు శరణ గౌడ కందకూరు కుటుంబాలను పరామర్శించారు. గురుమిఠకల్ తాలుకా బదూరులో రూ.5 లక్షల చెక్కు అందించారు. -
ఘనంగా నరసింహ స్వామి జయంతి
రాయచూరు రూరల్: మంత్రాలయం మఠంలో గురువారం లక్ష్మీ నరసింహ స్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహానికి మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీ పాదంగల్ అభిషేకం, ప్రత్యేక పూజలు చేపట్టారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు.. ఆలయ ప్రాంగణంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాక్షి, బళ్లారి: నగరంలోని సత్యనారాయణ పేటలో వెలసిన లక్ష్మీనరసింహా స్వామి దేవాలయంలో గురువారం స్వామి వారి కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్రెడ్డి, నారా శైలజా దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొని పూజలు చేయించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అంతకుముందు అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. -
విద్యుత్ షాక్తో యువకుడు మృతి
హొసపేటె: తాలూకాలోని కుంచూరు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నీటి మోటార్ను ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై ఒక యువకుడు గురువారం మరణించాడు. మృతుడు ఐరన్ మల్లజ్జ (19) తన ఇంటి సమీపంలో ఉన్న నీటి మోటారును ఆన్ చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతుడు దావణగెరెలోని ఆకాంక్ష అకాడమీ కళాశాలలో పీయూసీ చదివాడు. సీఈటీ పరీక్షను కూడా రాసిన అతను.. ఎన్ఈఈటీ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ఘటనపై విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈతకెళ్లి నవ వరుడు మృతి రాయచూరు రూరల్: వివాహం జరిగిన 15 రోజుల్లోనే నవ వరుడు దుర్మరణం పాలైన ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. వడిగేరలోని బి.మరాయ మ్యాగేరి (25) మృతుడు. వేసవికాలం కావడంతో ఈత కొట్టేందుకు వెళ్లాడు. లోతు ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లి నీట మునిగి చనిపోయాడు. బి.మరాయ మ్యాగేరి మృతదేహాన్ని చూసిన నవ వధువు రోదనలు మిన్నంటాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డాక్టర్ మంజునాథ్ సేవలు ఆదర్శం
బళ్లారి రూరల్: బీఎంసీఆర్లో డాక్టర్ మంజునాథ్ సేవలు మరువలేనివని బీఎంసీఆర్సీ డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ గంగాధర గౌడ తెలిపారు. గురువారం బీఎంసీఆర్సీ వైద్య భవన్లో డాక్టర్ మంజునాథ్ ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ గంగాధర గౌడ మాట్లాడుతూ.. ఈఎన్టీ విభాగ ప్రముఖుడు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంజునాథ్ శాంత స్వభావుడు అని తెలిపారు. ఈఎన్టీ విభాగంలో సదస్సులు, సమ్మేళనాలు, ఆధునిక వైద్యాన్ని తీసుకొచ్చి ఆ విభాగానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చారని కొనియాడారు. రాజీయ పలుకుబడి కుటుంబ నేపథ్యం ఉన్నా తాను సామాన్య వైద్యుడిలా బాధ్యతలను నిర్వర్తించారని తెలిపారు. డాక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కోరిక మేరకు వైద్య వృత్తి స్వీకరించడం జరిగిందన్నారు. ఉత్తమ జీవితాన్ని ప్రసాదించిన తన పెద్దనాన్న, గురువులకు రుణపడి ఉంటానన్నారు. అనంతరం డాక్టర్ మంజునాథ్ దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో బీఎంసీఆర్సీ ఇన్చార్జ్ డైరెక్టర్ డాక్టర్ చిదంబర మూర్తి, ట్రామాకేర్ సెంటర్ సూపరిన్టెండెంట్ డాక్టర్ శివనాయక్, టీబీ శానిటోరియం సూపరింటెండెంట్ డాక్టర్ మురుగేశ్, బీఎంసీఆర్సీ వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. -
ఒక్కటైన 30 జంటలు
బళ్లారి అర్బన్: బళ్లారి తాలూకా సిరివార గ్రామ సమీపంలోని అమరేశ్వర ఆలయ ప్రాంగణంలో కన్నడ రక్షణ యువ వేదిక ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించారు. డాక్టర్ సి.మునిస్వామి కప్పగల్లు నాయకత్వంలో 30 జంటలు దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాయి. శ్రీ రాయర సేవా ట్రస్ట్ అధ్యక్షురాలు ఎస్.రత్నమ్మ శ్రీధర్ 30 జంటలకు మంగళసూత్రాలు పంపిణీ చేశారు. అలాగే కన్నడ రక్షణ యువ వేదిక పదాధికారులు, సభ్యులు, ప్రముఖులు పాల్గొని సేవలందించారు. కార్యక్రమంలో సుశీలమ్మ మునిస్వామి, శృతి, శంకర్, కొరిబసవ, ద్యావన్న సిరివర, తిప్పేస్వామి బిసలల్లి, పరశురామప్ప, పూజారి శివప్ప స్వామి తదితరులు పాల్గొన్నారు. సేవా స్ఫూర్తికి ఎల్లలు లేవు హుబ్లీ: సేవా స్పూర్తికి ఎల్లలు ఉండవు. విక్రమ్ ఫౌండేషన్ ద్వారా నిరంతరాయంగా సేవలు కొనసాగిస్తామని ఆ ఫౌండేషన్ ప్రముఖుడు విక్రయ్ బాయి హామీ ఇచ్చారు. గురువారం స్థానిక పాత హుబ్లీ ప్రియదర్శిని బదిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అన్నదానం చేశారు. అలాగే ఆశ్రమానికి అవసరమైన వివిధ వస్తువులు వితరణ చేశారు. విక్రమ్ బాయిని ఆశ్రమ నిర్వాహకులు సన్మానించారు. -
ప్రీ వెడ్డింగ్ షూట్కెళ్తూ.. కాబోయే వరుడు మృతి
యశవంతపుర: ప్రీ వెడ్డింగ్ షూట్కు వధువును తీసుకురావడానికి కారులో వెళ్తూ ప్రమాదం జరిగి వరుడు మరణించాడు. ఈ ఘటన హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా మూగలి గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. బేలూరు తాలూకా లక్కుంద గ్రామం దర్బార్పేటకు చెందిన మను ఎల్ఎన్ (29), మే 10న కాంచన అనే యువతితో ఏడడుగులు నడవాల్సి ఉంది. వీరశైవ కళ్యాణ మండపాన్ని బుక్ చేశారు. రెండు కుటుంబాలూ పెళ్లి పనుల్లో ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసమని గురువారం ఉదయం మను కాంచనాను తీసుకురావాలని తొగరనహళ్లి గ్రామానికి కారులో బయలుదేరాడు. కారు మూగలి గ్రామం వద్ద అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొని చెట్టును ఢీకొట్టింది. కారు నుజ్జు కాగా, మను కారులో చిక్కుకుని ప్రాణాలను వదిలాడు. హఠాత్ మరణవార్తను విన్న రెండు కుటుంబాలు తీవ్ర వేదనలో మునిగిపోయాయి. పెళ్లి జరగాల్సిన ఇళ్లలో మౌనంగా ఆవహించింది. -
అగస్తేశ్వర బ్రహ్మ రథోత్సవం
కోలారు: ముళబాగిలు నగరంలోని పురాణ ప్రసిద్ధ శ్రీ సీతాపతి, శ్రీ రామచంద్ర, అగస్తేశ్వర స్వామి బ్రహ్మ రథోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆలయంలో మూలవిరాట్టుకు పంచామృత అభిషేకం నిర్వహించారు, గణపతి పూజ, కళశారాధన, నవగ్రహ శాంతిహోమం జరిపించారు. తేరులో ఉత్సవమూర్తిని ప్రతిష్టించి ఊరేగించారు. తేరు కదలగానే భక్తులు అరటి పండ్లు, పూలు, దవనం విసిరారు. ప్రయాణికుల వాహనాలపై పన్నుల తగ్గింపు దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో అన్ని రకాల ధరలు, బిల్లులు పెరుగుతున్న సమయంలో ఇదొక శుభవార్త కిందే లెక్క. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సవరించిన మోటారు వాహనాల చట్టం బిల్లు మే 1 నుంచి అమలులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం రవాణా శాఖకు ఆదేశాలిచ్చింది. మోటారు వాహనాలపై పన్నులు తగ్గుతాయి. 12 మంది కంటే ఎక్కువ మందిని తీసుకువెళ్లే వాహనాలపై ప్రతి సీటుకి విధిస్తున్న పన్నులో రూ.1000 తగ్గించారు. ఎక్కువ పన్నులు వసూలు చేస్తుండడం వల్ల వాహనాల యజమానులు పక్క రాష్ట్రాల్లో వాహనాల రిజిస్ట్రేషన్లు చేయించేవారు. దీంతో ప్రభుత్వం ఖజానాకు గండిపడుతోందని తెలిసి సవరణ చేసింది. భక్తిశ్రద్ధలతో ఉపనయనాలుమైసూరు: నగరంలోని శ్రీ కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీకే లేఔట్లోని శ్రీకృష్ణధామంలో గురువారం ఉచిత సామూహిక ఉపనయన బ్రహ్మోపదేశం క్రతువును నిర్వహించారు. వటువులచే శోభాయాత్ర, అశ్వత్థ పూజ సాగింది. పెద్దసంఖ్యలో విప్ర ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 3 డేటా సెంటర్లు!దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిలో భాగంగా శాశ్వత డేటా సెంటర్లను బెంగళూరు, మైసూరు, మంగళూరులో స్థాపించాలని గురువారం బెంగళూరులో జరిగిన మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఇంధన మంత్రి కేజే జార్జ్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటీల్, ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, అధికారులు హాజరయ్యారు. హొసకోట వద్ద 500 మెగావాట్ల సామర్థ్యం గల శాశ్వత డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. పావగడ నుంచి సౌర విద్యుత్ను ఆ సెంటర్కు అందిస్తారు. మంగళూరులో డేటా పార్క్ ఏర్పాటుకు భూమి అందుబాటులో ఉందని,ఇక మైసూరులో భూమిని గుర్తించే పనిలో ఉన్నట్టు తెలిపారు. ఈ పార్క్లలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తే వారికి విద్యుత్, నీరు అవసరమైనంత మేర అందిస్తామని తెలిపారు. ఖర్గే సీఎం అయితే ఓకే: యతీంద్రరాయచూరు రూరల్: ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం కావాలంటే, సిద్దరామయ్య ఆ పదవి నుంచి దిగిపోవాలి కదా? అని ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్య అన్నారు. ఖర్గే సీఎం అయితే స్వాగతిస్తానన్నారు. రాయచూరు తాలూకా కల్మఠలో కరియప్ప తాతా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డీసీఎం డీకే శివకుమార్కు పుట్టినరోజు కానుకగా హైకమాండ్ ఏమిచ్చినా సంతోషమని అన్నారు. మే 15న ఏమైనా జరగవచ్చన్నారు. -
ఈ ఘోరం సహించరానిది
బనశంకరి: బెంగళూరు శివాజీనగరలో బౌరింగ్ ఆసుపత్రి ప్రహరీగోడ కూలిపోయి 7 మంది మృత్యువాత పడిన ఘటనను తీవ్రంగా పరిగణించి సుమోటో కేసు నమోదు చేశామని రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ బీఎస్.పాటిల్ తెలిపారు. గురువారం ప్రమాదస్థలిని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కేసులో కిందిస్థాయి సిబ్బందినే కాకుండా ఉన్నతస్థాయి అధికారులను బాధ్యులుగా చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీష్తో పాటు ముఖ్యమైన అధికారులను బాధ్యులుగా చేస్తామని చెప్పారు. పాలనా వ్యవస్థ నిర్లక్ష్యంపై బీఎస్.పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రహరీ పునాది పూర్తిగా శిథిలం కావడమే ఈ ఘోరానికి ప్రధాన కారణమన్నారు. భారీ వర్షాలు కురుస్తాయని తెలిసినప్పటికీ ఇలాంటి శిథిలమైన గోడ పక్కన వీధి వ్యాపారులను అనుమతించడం అధికారుల నిర్లక్ష్యమన్నారు. బౌరింగ్ ఆసుపత్రి ఇన్చార్జ్ హరీశ్కుమార్ను మొదట విచారిస్తామన్నారు. అలాగే జీబీఏ కమిషనర్ మహేశ్వరరావ్, వైద్యవిద్యశాఖ కమిషనర్, ఐదు పాలికెల కమిషనర్లను చేర్చి కేసు నమోదు చేస్తామని తెలిపారు. వైద్య విద్యామంత్రి తనిఖీ వైద్య విద్యా శాఖ నిర్లక్ష్యం వల్లే ఆస్పత్రి ప్రహరీ కూలిందనే విమర్శలు వెల్లువెత్తాయి. పాత, కొత్త ప్రహరీగోడలు నాణ్యత పట్ల ప్రస్తుతం తీవ్ర అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వైద్య విద్యశాఖామంత్రి శరణప్రకాష్ పాటిల్ బౌరింగ్ ఆసుపత్రి వద్ద ప్రమాదస్థలిని పరిశీలించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగ్రాతులను పరామర్శించారు. బెంగళూరు నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ప్రహరీలు, సౌకర్యాలపై తనిఖీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఈ దుర్ఘటనతో బెంగళూరు ప్రభుత్వ ఆస్పత్రులు, భవనాల భద్రతపై ప్రజల్లో భయాందోళనలు పెచ్చుమీరాయి. ఇంజినీర్ సస్పెండ్ సీఎం సిద్దరామయ్య గోడ ప్రమాదంపై విధానసౌధలో సమావేశం నిర్వహించారు. బౌరింగ్ ఆసుపత్రి చీఫ్పై మండిపడ్డారు. ఆయనకు నోటీస్ జారీచేయాలని చీప్ సెక్రటరీని ఆదేశించారు. ఆస్పత్రి ఇంజినీర్ ను సస్పెండ్ చేశారు. గోడ దెబ్బతినేలా అక్కడ మట్టి ఎందుకు వేశారని, మీరు ఎందుకు పరిశీలించలేదని ఇంజినీర్ను ప్రశ్నించారు. ప్రధాని సంతాపం ప్రహరీగోడ మృతులకు ప్రధాని నరేంద్రమోదీ గురువారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ పరిహార నిధి నుంచి తలా రూ.2 లక్షలు, గాయపడినవారికి తలా రూ.50 వేలు సహాయం అందిస్తామని ఎక్స్లో తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా కమిషనర్లపై కేసు లోకాయుక్త జస్టిస్ బీఎస్ పాటిల్ -
బెంగళూరు అతలాకుతలం
బనశంకరి: సిలికాన్ సిటీని వరుణుడు వణికించాడు. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ కురిసిన ఆకస్మిక గాలీవానకు వందలాది చెట్లు, కరెంటు స్తంభాలు విరిగి, కార్లు, ఆటోలు, బైక్లపై పడ్డడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. బౌరింగ్ ఆస్పత్రి పాత ప్రహరీ కూలిపోయి 7 మంది మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడింది. జడివానకు నగరంలో రోడ్లు చెరువులను తలపించగా అనేక లేఔట్లలో ఇళ్లు, అపార్టుమెంట్ల సెల్లార్లలోకి నీరు చొరబడటంతో ప్రజలను నిద్రలేకుండా చేసింది. రెండుగంటలు పాటు కురిసిన వర్షానికే ఐటీ సిటీ అతలాకుతలమైంది. అండర్పాస్లలో నీళ్లు నిలిచి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అనేకచోట్ల షాపుల్లోకి నీరుచేరి వస్తుసామగ్రి తడిసిపోయింది. చెట్లు పెళపెళ 200 కు పైగా చెట్లు కూలిపోయాయి, 400కు పైగా చెట్ల కొమ్మలు విరిగిపడటంతో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం కలగకపోవడం ఊరట కలిగించింది. చెట్లు కూలి విద్యుత్ స్తంభాలపై పడటంతో దెబ్బతిన్నాయి. అనేక లేఔట్లలో కరెంటు పోయి ప్రజలు రాత్రంతా చీకట్లోనే మగ్గారు. విజయనగర, ఆర్టీ.నగర, శేషాద్రిపురం, జయనగర, చామరాజపేటే, జేపీ.నగర, సదాశివనగర తో పాటు 50కి పైగా ప్రదేశాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు కూలాయి. పాలికె సిబ్బంది సగం సగం చెట్లను తొలగించి వెళుతున్నారని ప్రజలు ఆరోపించారు. వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందికరంగా మారింది. జీబీఏ, 5 నగర పాలికెల కంట్రోల్ రూమ్లకు సుమారు 800 కు పైగా ఫోన్ కాల్స్ సాయం కోరుతూ వచ్చాయి. సిబ్బంది, యంత్రాల కొరత ఏర్పడింది. అకాల వర్షాలతో ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్తచర్యలు చేపట్టాలని సీఎం సిద్దరామయ్య అధికారులను ఆదేశించారు. అండర్పాస్లు, డ్రైనేజీలు, రోడ్లపై వాననీరు నిలబడకుండా చూడాలన్నారు. చెట్లను ట్రిమ్మింగ్ చేయాలన్నారు. బెంగళూరుకు 3 రోజులు వర్షసూచన ఉంది. నగర పాలికెల సిబ్బందికి సెలవులు లేవని, విధుల్లో ఉండాలని జీబీఏ కమిషనర్ మహేశ్వర్రావ్ తెలిపారు. వర్ష ప్రమాదాల్లో ముగ్గురు బలి విధ్వంసంతో వణికించిన వరుణుడు వందలాదిగా కూలిన చెట్లు, స్తంభాలు కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం లోతట్టు ప్రాంతాలు జలమయం బెంగళూరులో ఫుట్పాత్ వ్యాపారాలు బంద్డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బనశంకరి: బెంగళూరులో అడుగుపెడితే చాలు ఎక్కడ చూసినా రోడ్లకు అటూ ఇటూ ఫుట్పాత్ వ్యాపారులు కనిపిస్తారు. బౌరింగ్ ఆస్పత్రి ప్రహరీ గోడ కూలిపోవడంతో 7 మంది చనిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విధానసౌధలో గోడ ప్రమాదం, అకాల వర్షాల సమస్యపై నగరాభివృద్ధి మంత్రి, డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్ మాట్లాడారు. ఇకపై ఫుట్పాత్లపై ఎవరూ వ్యాపారం చేయరాదని తెలిపారు. గోడ కూలిన ఘటనలో అధికారులు నిర్లక్ష్యం ఉందని చెప్పలేమన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎత్తైన గోడలుఉ, ఆస్పత్రుల చుట్టుపక్క ప్రదేశాల్లో అసలు అనుమతించరాదని తెలిపారు. తక్షణం అన్ని ఆస్పత్రుల కట్టడాలు, కాంపౌండ్ల పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని తెలిపారు. సీఎం సమీక్ష వర్ష ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. బౌరింగ్ ఆసుపత్రి గోడ కూలిన చోట సయ్యద్ సోఫియాస్ (17) కరెంటు తీగ తగలడంతో షాక్ కొట్టి చనిపోయాడు. కేజీ.హళ్లివాసి అయిన ఇతను బట్టలు కొనాలని తల్లితో కలిసి కమర్షియల్ స్ట్రీట్ కు వెళుతున్నారు. ప్రహరీ గోడ కూలిపోవడంతో కరెంటు స్తంభం తీగ తెగి అతనికి తగిలింది. కళ్ల ముందే కుమారుని మృతితో తల్లి స్పృహ తప్పి పడిపోయింది, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మైసూరు రోడ్డు కస్తూరిబాయి నగరలో సిమెంటు షీట్లు కూలి ఇంట్లో ఉన్న మంజు (35) మరణించాడు. జేడీమర కూళగేరి నివాసి రఘు (35) అనే వ్యక్తి సారక్కి బస్టాప్లో కరెంటు పోల్ షాక్ కొట్టి చనిపోయాడు. -
తాకట్టు బంగారాన్ని కరిగించి...
మైసూరు: నగరంలోని ఒక ఫైనాన్స్ కంపెనీ తమ నుంచి బంగారం కుదువ పెట్టుకుని, ఇప్పుడు కరిగించేసిందని బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాలు.. కువెంపునగరలోని ఆదిచుంచనగిరి రోడ్డులో ఉన్న ఒక ఫైనాన్స్ కంపెనీ మీద పోలీసు కమిషనర్కు పెద్దసంఖ్యలో బాధితులు ఫిర్యాదు చేశారు. మీ బంగారం తాకట్టులోఉంటే విడిపిస్తాం, ఆపై మంచి ధరకు మేమే కొంటాం.. అని మీడియాలో ప్రకటనలు చూసి చాలా మంది బంగారం యజమానులు ఆ ఫైనాన్స్ కంపెనీలో సంప్రదించారు. వారి సూచన మేరకు బంగారాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ప్రతి గ్రాము బంగారానికి రూ. 17,000 నుంచి రూ. 18,000 వరకు చెల్లిస్తామని కంపెనీ ఉద్యోగులు నమ్మబలికారు. బంగారం ఇచ్చిన తరువాత యజమానులకు చెప్పకుండా కరిగించారు. బంగారం స్వచ్ఛత అంత బాగా లేదని తక్కువ డబ్బు ఇచ్చి మమ్మల్ని మోసం చేశారని తెలిపారు. అనుమానంతో.. భార్య నరికివేత మైసూరు: అనుమానం పెనుభూతంగా మారి భార్యను హత్య చేశాడో కిరాతక భర్త. మైసూరులోని హలే కేసరిలో భార్యను గొడ్డలితో నరికి చంపాడు. వివరాలు.. పుష్ప (30) ఒక బట్టల షాపులో పనిచేసేది. బుధవారం రాత్రి, ఎప్పటిలాగే, పుష్ప పని ముగించుకుని ఇంటికి వచ్చినప్పుడు, భర్త ఆమెతో తీవ్రంగా గొడవపడ్డాడు. ఆ గొడవ తీవ్రరూపం దాల్చడంతో, భర్త కోపం పట్టలేక గొడ్డలితో పుష్పను నరికి హత్య చేశాడు. తరువాత నేరుగా నరసింహరాజ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి హంతకున్ని అరెస్టు చేశారు. ఘనంగా కలశారోహణం మైసూరు: జిల్లాలోని సరగూరు తాలూకా నంజీపురలోని కంఠే మడప్పన బెట్టపై శ్రీ మహదేశ్వర ఆలయం కలశారోహణ వేడుక ఘనంగా సాగింది. మహంతస్వామి, వివిధ మఠాల స్వామీజీల ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మెల్యే అనిల్ చిక్కమదు, ప్రముఖులు, వేలాది భక్తులు పాల్గొన్నారు. -
ఎస్ఐ భార్య ఆత్మహత్య
బెంగళూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సజావుగా సాగిపోతున్న కుటుంబంలో చిన్న గొడవలే పెద్దవయ్యాయి. కుటుంబ కలహాలతో ఎస్ఐ భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా బీరూరు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. బీరూరు ఎస్ఐ తిప్పేశ్ భార్య పద్మ (35) మంగళవారం రాత్రి ఇంటిలో ప్రాణాలు తీసుకుంది. బీరూరు పట్టణంలో బాడుగ ఇంటిలో తిప్పేశ్ కుటుంబం ఉంటోంది. పద్మది తుమకూరు జిల్లా కాగా, తిప్పేశ్ది దావణగెరె జిల్లా. వీరిద్దరూ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కానీ పిల్లలను ఎక్కడ చదివించాలి, సెలవుల గురించి గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. పోలీసులు విచారణ చేపట్టారు. -
బస్సు డ్రైవర్కు ఏడాది జైలు, జరిమానా
హుబ్లీ: గదగ్ రోడ్డు గాంధీవాడ క్రాస్లో 2023లో జరిగిన బస్సు ప్రమాదంలో రోడ్డు దాటుతున్న వ్యక్తి మృతి చెందిన కేసులో బస్సు డ్రైవర్కు ఏడాది సాధారణ శిక్షతో పాటు రూ.2000 జరిమానా విధిస్తూ స్థానిక ప్రధాన సీనియర్ సెషన్స్ కోర్టు జేఎంఎఫ్సీ ఫస్ట్గ్రేడ్ మేజిస్ట్రేట్ ఆదేశాలను వెల్లడించారు. బస్సు డ్రైవర్ బాలేష్ బోరన్నవర శిక్షకు గురైన వ్యక్తి. వివరాలు.. 2023 జూలై 23న గదగ్ రోడ్డులోని గాంధీవాడ క్రాస్ కళ్యాణ కేంద్రం సమీపంలో ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ బాలేష్ బోరన్నవర వేగంగా బస్సును నడుపుకుంటూ వెళుతున్న వేళ సీ.జాకోబ్ తైలాష్ను బస్సు ఢీకొనడంతో గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. సీఐ కాడదేవర మఠ దర్యాప్తు జరుపగా మరో సీఐ జాక్సన్ డిసౌజా కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. సదరు కోర్టు న్యాయయూర్తి యమునప్ప కరె హనుమంతప్ప ఈనెల 22న తీర్పు వెల్లడించారు. నిందితుడిపై నేరారోపణలు రుజువైన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు శిక్ష విధించింది. ప్రభుత్వం తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది సిద్దలింగప్ప నాగఠాణ వాదనలు వినిపించారు. లోకాయుక్త వలలో ఆర్టీఓ సిబ్బంది●రూ.21 వేల నగదు స్వాధీనం సాక్షి, బళ్లారి: కొప్పళ జిల్లాలో ఆర్టీఓ కార్యాలయంలో పని చేస్తున్న రంజిత్ అనే ఎస్డీఏ సిబ్బంది రూ.21 వేలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు పట్టుకొన్నారు. కొప్పళ ప్రాంతీయ రవాణాధికారి కార్యాలయంలో పని చేస్తున్న ఎస్డీఏ(సెకండ్ డివిజన్ అసిస్టెంట్) లోకాయుక్త అధికారులు రెడ్హ్యాండెడ్గా బంధించారు. ఒక ఫైల్కు సంబంధించి బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు పక్కా ప్రణాళికతో మెరుపుదాడి చేసి అరెస్టు చేశారు. బీఏ సోషియాలజీలో మూడు అధ్యాయాలు కల్పించాలిరాయచూరు రూరల్: విద్యార్థులకు అనుకూలంగా బీఏ సోషియాలజీలో మూడు పీజీ అధ్యాయాలను కల్పించాలని రాష్ట్ర అక్క మహాదేవి విశ్వ విద్యాలయం సోషియాలజీ అధ్యాపకుల సంఘం డిమాండ్ చేసింది. అక్క మహాదేవి విశ్వవిద్యాలయం ఆవరణలో సోషియాలజీ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు మహేష్ గంగ్వార్ మాట్లాడారు. ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక ఆధీనంలోని డిగ్రీ, పీజీ కోర్సుల్లో విద్యార్థులకు భవిష్యత్తులో సోషియాలజీ విషయం అర్థమయ్యే విధంగా మరికొన్ని అంశాలను చేర్చించాలన్నారు. ఈ విషయంపై దృష్టి సారించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్కు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ జిల్లాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బళిగార్, భారతి, శ్రీనివాస్ రెడ్డిలున్నారు. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వండి రాయచూరు రూరల్: వడ దెబ్బతో ప్రాణాలు కోల్పోయిన హుసేనప్ప కుటుంబానికి పరిహారం అందించాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ చేసింది. బుధవారం తాలూకా పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రాయచూరు తాలూకా యాపలదిన్నిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేసే ప్రాంతంలో నీటి సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలు లేవన్నారు. గ్రామ పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం అందించాలని కోరుతూ టీపీ ఈఓ చంద్రశేఖర్కు వినతిపత్రం సమర్పించారు. సీహెచ్ పౌడర్ విక్రేతల అరెస్ట్రాయచూరురూరల్: నగర ప్రాంతాల్లో సీహెచ్(క్లోరల్ హైడ్రేట్) పౌడర్ విక్రయించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అరుణాంగ్షు గిరి వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. నగరంలోని రైల్వే ఉద్యానవనం వద్ద మహ్మద్ హాజీ, నాగరాజ్లను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి 35 లీటర్ల కల్తీ కల్లు, 30 లీటర్ల సీహెచ్ పౌడర్ను స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. పశ్చిమ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మంజునాథ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
విద్యార్థి ఆత్మహత్య కేసులో కొరడా
హుబ్లీ: పోలీసుల వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి కేసుకు సంబంధించి ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. హెడ్కానిస్టేబుళ్లు చంద్రు నడువినమని, కిరణ్ డొక్కణ్ణవర్, సయ్యద్ తహసీల్దార్ సస్పెండ్కు గురైన పోలీసు సిబ్బంది. ధార్వాడ విద్యాగిరి పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఆ ముగ్గురు పోలీసు సిబ్బంది సస్పెండ్ అయ్యారు. ధార్వాడ గిరినగర ఇంట్లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మృతుడు ఆదిత్య మ్యాగేరి ధార్వాడలో బీఎస్సీ చదివేవాడు. స్వస్థలం బాగలకోటె జిల్లా బాదామి తాలూకా బేలూరు గ్రామం ధార్వాడ కిటిల్ కళాశాలలో బీఎస్సీ చదువుతూ గిరినగరలో తన స్నేహితుల అద్దె గదిలో ఉండేవాడు. గంజాయి డ్రైవ్ సందర్భంగా మృతుడు ఆదిత్యతో పాటు కొందరు విద్యార్థులను గంజాయి సేవనం ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకొని పరీక్ష జరపగా మృత విద్యార్థి పరీక్ష నివేదిక నెగిటివ్గా వచ్చింది. విద్యార్థుల నుంచీ లంచాలు అయినా కూడా పోలీసులు తమ వక్రబుద్ధిని ప్రదర్శించి విద్యార్థుల నుంచి వివిధ రూపాలతో లంచాలు తీసుకున్నారు. దీంతో సదరు ఆదిత్య కూడా తల్లిని డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి తల్లికి ఫోన్ చేసిన ఆదిత్య రూ.2000 ఫోన్పే ద్వారా పంపమని అడిగాడు. అయితే తల్లి డబ్బులు ఫోన్పే చేయలేదు. దీంతో పోలీసులు డబ్బుల కోసం మళ్లీ వేధిస్తారని ఆందోళనతో ఒత్తిడికి గురైన ఆదిత్య ఆరోజు రాత్రి గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన బిడ్డ చావుకు పోలీసులే కారణమని ఆదిత్య తల్లి కవిత మ్యాగేరి ఆరోపించారు. ఆదిత్య ఇచ్చిన సమాచారం మేరకు విద్యాగిరి పోలీసులు ఇద్దరు పెడ్లర్లను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. సదరు గంజాయి డ్రైవ్ వేళ ఇద్దరు విద్యార్థులు గంజాయి సేవించినట్లు ధృవ పడటంతో వారిపై కేసు నమోదు చేశారు. ముగ్గురు లంచగొండి ఖాకీలపై సస్పెన్షన్ వేటు లంచం ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారుల చర్య తప్పుడు సందేశం పోరాదని వేటు ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ శశికుమార్ మీడియాతో మాట్లాడుతూ మృత విద్యార్థి తల్లిదండ్రులు యూడీఆర్ ఫిర్యాదు చేశారు. అంతేగాక డ్రగ్స్ టెస్ట్ నెగిటివ్ వచ్చినా పోలీసులు రూ.2000 లంచం అడిగారని తల్లిదండ్రులు ఆరోపించారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు తప్పుడు సందేశం పోరాదన్న క్రమంలో బాధ్యులైన ఆ పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశామన్నారు. కేసును లా అండ్ ఆర్డర్ డీసీపీ శృతి దర్యాప్తు చేపట్టారు. సమగ్ర దర్యాప్తు జరిపి లోటుపాట్లు ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాగా విద్యార్థి ఆదిత్య పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి అయ్యాక మృతదేహాన్ని సొంత ఊరు బాగలకోటకు తీసుకెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో వారి స్థానిక బంధువు ఆర్థికంగా సహాయం అందించి అంబులెన్స్లో ఆదిత్య శవాన్ని తరలించినట్లు తెలిసింది. కాగా ఉన్న ఒక్క కుమారుడిని పోలీసుల లంచం దాహం బలిగొందని ఆదిత్య తల్లి కవిత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. -
ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతిలో డైలీ మార్కెట్, గణేష్ సర్కిల్, గాంధీ సర్కిల్ తదితర ప్రాంతాలతో సహా నగరంలోని పలు చోట్ల ఫుట్పాత్లపై ఏర్పాటు చేసిన ఆక్రమణలను తొలగించే కార్యాచరణను మున్సిపల్ కమిషనర్ ఆర్.విరుపాక్ష మూర్తి నేతృత్వంలో అధికారులు, పౌర కార్మికులు బుధవారం ప్రారంభించారు. గంగావతి నగరంలో అమృత్ సిటీ పథకం కింద నిర్మించిన పాదచారుల ఫుట్పాత్లను దుకాణదారులు గత కొన్నేళ్లుగా ఆక్రమించుకుని అక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఫుట్పాత్ ఆక్రమణలతో పాదచారులకు కలుగుతున్న అసౌకర్యం నేపథ్యంలో తొలగింపు చేపట్టారు. వడదెబ్బతో బాలుడు మృతి● విజయపుర జిల్లాలో ఘటన ● వారం రోజుల్లో నలుగురు బలి సాక్షి బళ్లారి/రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో రోజురోజుకు ఎండలు బీభత్సం సృష్టించడంతో వడదెబ్బకు గురై ఓ బాలుడు మృతి చెందాడు. బుధవారం విజయపుర జిల్లా ముద్దేబిహాళ తాలూకా ఇంగళిగి గ్రామానికి చెందిన శ్రీశైల బిరాదార్(15) అనే బాలుడు పాఠశాలకు వేసవి సెలవుల నేపథ్యంలో మండుటెండల్లో ఆటలాడుతున్న సమయంలో వడదెబ్బ సోకి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే స్థానికులు అతనిని ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా గత వారం రోజుల్లోనే నలుగురు వడదెబ్బకు అసువులు బాశారు. మే 15న శిఖండి విడుదల బళ్లారిఅర్బన్: పోలా మూవీ బ్యానర్పై నిర్మించిన శిఖండి చిత్రం 15న రాష్ట్ర వ్యాప్తంగా, ఆల్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నదని పోలా ప్రవీణ్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చిత్రం బృందం టీజర్ పాటలను విడుదల చేసి సినిమా విశేషాలను తెలియజేశారు. చిత్ర దర్శకుడు గురుమూర్తి మాట్లాడుతూ మహాభారతంలో శిఖండి పాత్రకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెప్పారు. బళ్లారి, బెంగళూరు, మైసూరు, మాగడి తదితర ప్రాంతాలలో సినిమా చిత్రీకరణ చేసినట్లు తెలిపారు. యువరాజ్ గౌడ, ఖ్యాతి, దీపా శెట్టి, ఆనంద్, చాందిని, ఫోటోగ్రాఫర్ మైసూరు స్వామి పాల్గొన్నారు. అఫ్జల్పూర్ హాస్టల్ వార్డెన్పై పోక్సో కేసు రాయచూరు రూరల్: బాలికలపై లైంగిక దౌర్జన్యాలు చేస్తున్నారన్న ఆరోపణల మేరకు హాస్టల్ వార్డెన్పై పోక్సో కేసు నమోదైంది. కలబుర్గి జిల్లా అఫ్జల్పూర్ హాస్టల్ వార్డెన్పై హనుమంతి అనే బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఈనెల 15వ తేదీన ఘటన జరగడంతో సమస్యల పరిష్కారానికి మార్గం కనబడుతుందని వేచి చూసినా జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోక పోవడంతో మంగళవారం సాయంత్రం తనకు రాత్రి సమయంలో ఫోన్ చేసి అసభ్యకర పదజాలంతో వార్డెన్ సంభాషిస్తున్నట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సమస్యలపై స్పందించరూ రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి పట్టణంలో నెలకొన్న సమస్యలపై అధికారులు స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాజీ శాసన సభ్యుడు గంగాధర నాయక్, జిల్లా రైతు మోర్చా అధ్యక్షుడు దొరబాబు మాట్లాడారు. బస్టాండ్ వద్ద ప్రయాణికుల రాకపోకలకు సౌకర్యం కల్పించాలని, ప్రధాన రహదారిలోని కూరగాయలు, మాంసం విక్రయ దుకాణాలను ఇతర చోట్లకు తరలించాలన్నారు. తాగునీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. తుంగభద్ర ఎడమ కాలువలో సక్రమంగా నీరు ప్రవహించేలా చూడాలని, నగరంలో మురుగు కాలువల్లో పేరుకు పోయిన చెత్తా చెదారాన్ని తొలగించాలని కోరుతూ జిల్లాధికారి నితీష్కు వినతిపత్రం సమర్పించారు. మలేరియా అడ్డుకట్టకు సహకరించండి రాయచూరు రూరల్: జిల్లాలో మలేరియా వ్యాధి నియంత్రణకు సహకరించాలని జిల్లా ఆరోగ్య కుటుంబ కళ్యాణ అధికారి డాక్టర్ సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా ఆరోగ్య కుటుంబ కళ్యాణ అధికారి కార్యాలయం వద్ద జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కుటుంబ కళ్యాణ శాఖ, తాలూకా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, నగరసభల ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవ జాతానుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మలేరియా వ్యాధి గురించి ప్రజలను చైతన్యపరిచి, ఇంటి పరిసరాల చుట్టు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. రక్త పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చన్నారు. జాతాలో మలేరియా నియంత్రణాధికారి శాకీర్, డాక్టర్ గణేష్, అధికారులు చంద్రశేఖరయ్య, సంధ్య, జయపాల్ రెడ్డి, సరోజ, అమృతలున్నారు. -
దివ్యాంగుల సమస్యలు తీర్చండి
హొసపేటె: దివ్యాంగులు సమాజంలో ప్రధాన స్రవంతిలోకి ప్రవేశించడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని, అధికారులు వారి సమస్యలపై ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించాలని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి అన్నారు. మంగళవారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో దివ్యాంగుల సమస్యలపై జరిగిన సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రభుత్వం నుంచి దివ్యాంగులకు నెలవారీ భత్యాలు, పరికరాలు, బస్పాస్ల పంపిణీలో ఎలాంటి లోపం జరగకుండా చూడాలన్నారు. ఖాళీ పోస్టుల భర్తీకి సూచన అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకించిన పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖలకు కట్టుదిట్టమైన సూచనలు ఇచ్చారు. సమావేశానికి హాజరైన వందలాది మంది దివ్యాంగులు, వివిధ శాఖల నుంచి తమకు అవసరమైన సౌకర్యాలు, పరికరాలు సకాలంలో అందడం లేదని తెలిపారు. దీని వల్ల దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ప్రాజెక్టుల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వారు జిల్లాధికారిణికి వినతిపత్రం సమర్పించారు. కాగా ఈ విషయాన్ని పరిశీలించి, అవసరమైన చర్యలు చేపడతామని జిల్లాధికారిణి సానుకూలంగా స్పందించారు. జిల్లా వికలాంగుల సంక్షేమ అధికారి, మహిళా శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గంగప్ప, పట్టణాభివృద్ధి శాఖ ప్లానింగ్ డైరెక్టర్ మనోహర్, వివిధ శాఖలకు చెందిన జిల్లా, తాలూకా స్థాయి అధికారులు హాజరయ్యారు. -
అన్న కుమారుడిని చంిపిన చిన్నాన్న
రాయచూరు రూరల్: ఆస్తుల పంపకాల విషయంలో జరిగిన ప్రమాదంలో సొంత అన్న భార్య వదినను హత్య చేయడానికి ముందుకు రాగా అడ్డుకున్న అన్న కుమారుడిని చిన్నాన్న చంిపిన ఘటన రాయచూరు జిల్లా సింధనూరు తాలూకాలో చోటు చేసుకుంది. బుధవారం అలబనూరులో బసవరాజ్(39) అనే వ్యక్తి తన అన్న కుమారుడు నాగరాజ్(12)ను హత్య చేశాడు. బాలుడి తల్లి అమృత(42) తీవ్రంగా గాయపడింది. సిద్దప్ప నివాసానికి వెళ్లిన బసవరాజ్ అన్న కుమారుడైన నాగరాజ్ను చాకుతో పొడిచి హత్య చేశాడు. ధనుష్, అమృత పూర్తిగా గాయపడ్డారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ చంద్రశేఖర్ పరిశీలించారు. నిందితుడు బసవరాజ్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆస్తుల పంపకాల్లో విభేదాలే కారణం -
ఎగ్రైస్ బండికి దుండగుల నిప్పు.!
బళ్లారిఅర్బన్: నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కోర్టు ఎదురుగా పెట్టుకున్న ఎగ్రైస్ బండిని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. వివరాల ప్రకారం.. జీవనోపాధి కోసం ఎగ్రైస్ బండి నడుపుతున్న సరస్వతి, రవి అనే దంపతులు మంగళవారం రాత్రి రోజూ మాదిరిగానే ఎగ్రైస్ బండి నడుపుకుని రాత్రి 12 గంటలకు బండిలో స్టవ్, చెయిర్లు, వాటర్ బాటిళ్లు, జగ్గులు వంటి సామగ్రిలు ఉంచి సిలిండర్ మాత్రం ఇంటికి తీసుకెళ్లారు. అయితే రాత్రి 2 గంటలకు పక్కన ఉన్న హాస్టల్ విద్యార్థుల సమాచారం మేరకు ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయగా నిప్పంటుకున్న బండిని ఆర్పేందుకు వచ్చేటప్పటికే బండి కాలి బూడిద అయింది. బండి, అందులోని సామగ్రి తదితరాలతో కలిపి మొత్తం రూ.50 వేల వరకు నష్టం వాటిల్లినట్లు సరస్వతి ఆరోపించింది. గత కొన్నేళ్లుగా బండితోనేజీవనాధారం సాగిస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నామన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో వారు భోరుమన్నారు. విషయం తెలిసిన అక్క వాసంతి, కళావతి, స్థానిక బంధువులు బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై గాంధీనగర్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రూ.50 వేల మేర వాటిల్లిన నష్టం జీవనాధారం కోల్పోయిన కుటుంబం -
9న చిత్రదుర్గలో అభిమానోత్సవం
హొసపేటె: బీజేపీలో ఒక దిగ్గజ నాయకుడిగా, సహజ పోరాట యోధుడిగా, రాజకీయ ఉద్దండుడిగా, రైతు నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడియూరప్ప రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని సీనియర్ నాయకులు, రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు, మైనార్టీ కార్యకర్తలు ఆయనను వచ్చే నెల 9న చిత్రదుర్గలో ఘనంగా సన్మానించి గౌరవించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర తెలిపారు. బుధవారం నగరంలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్ షా నాయకత్వంలో అభిమానోత్సవ పేరిట చిత్రదుర్గలో ఈ సన్మాన కార్యక్రమం జరగనున్నందున పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు, యడియూరప్ప అభిమానులు పెద్ద సంఖ్యలో ఆరోజు చిత్రదుర్గకు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యకర్తలు నడుం బిగించాలన్నారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు ఈ సన్మాన కార్యక్రమానికి సంబంధించిన ఒక స్టిక్కర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రులు గోవింద కారజోళ, బీ.శ్రీరాములు, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి దొడ్డనగౌడ పాటిల్, మాజీ మంత్రి ఆనంద్సింగ్, హడగలి ఎమ్మెల్యే కృష్ణా నాయక్, ఎమ్మెల్సీలు వైఎం.సతీష్, హేమలత నాయక్, హాలప్ప ఆచార్, పీ.రాజీవ్, శరణు సలగార్, సురేష్బాబు, సోమలింగప్ప, కేఎస్.దివాకర్, బసవరాజ కెవటర్, అమర్నాథ్ పాటిల్, చెన్నబసవనగౌడ పాటిల్, అరుణ్ శహాపుర, బ్యాలహుణసి రామణ్ణ, సంజీవ రెడ్డి, అనిల్కుమార్ మోకా, నవీన్ గులగణ్ణవర, దడేసూగూరు బసవరాజ్, పరణ్ణ మునవళ్లి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరు కావాలి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర -
కాంగ్రెస్ రోజురోజుకు బలహీనం
హొసపేటె: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనపడుతోందని, తన ముఖ్యమంత్రి పీఠాన్ని పదిలం చేసుకోవడానికి తాను హిందూయేతర నాయకుడినని సీఎం సిద్దరామయ్య చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి బీ.శ్రీరాములు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను ఢిల్లీకి వెళ్లి ఒక హిందూయేతర సదస్సు నిర్వహిస్తానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆసలు ఏ ఉద్దేశంతో ఆయన ఆ హిందూయేతర సదస్సు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈరోజు ఒక మాట మాట్లాడి, రేపు మరొక మాట మార్చే ముఖ్యమంత్రిగా మారిపోయారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోనే కూర్చుని, తాము ఢిల్లీకి వెళ్లి హిందూయేతర సదస్సు నిర్వహిస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో నీటి కొరతతో పాటు తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పశువులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయన్నారు. అనుమతి లేకుండానే చెట్ల నరికివేత బళ్లారి నగరంలో ఎటువంటి అనుమతి లేకుండానే యథేచ్ఛగా చెట్లను నరికి వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందన్నారు. బళ్లారిలో అనుమతి లేకుండా చెట్లను నరికివేస్తున్న ఘటనపై తాను ఫిర్యాదు చేస్తానన్నారు. రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు. ఈ అంశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలను మోసం చేశారన్నారు. వీఎస్ ఉగ్రప్ప తమ మామ వంటివారు. ఉగ్రప్ప మామా.. మీరు నిజం మాట్లాడాలన్నారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియ విజయవంతమైందని చెబుతూ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్వీట్లు పంచడం సమంజసం కాదన్నారు. ప్రజల ఆగ్రహానికి గురై కాంగ్రెస్ పార్టీ సర్వనాశమైపోతుందని జోస్యం చెప్పారు. మాజీ మంత్రి శ్రీరాములు -
రాజధాని అస్తవ్యస్తం
అకాల వర్షం.. ● సాయంత్రం నుంచి కుదిపేసిన గాలీవాన ● దట్టంగా కురిసిన వడగండ్లు ● పలుచోట్ల కూలిన చెట్లు బసవనగుడిలో చెట్టు పడడంతో ధ్వంసమైన కారు బుధవారం సాయంత్రం యశవంతపురలో జోరువాన నృపతుంగ రోడ్డులో భారీ వర్షంలో వీధి వ్యాపారి బనశంకరి: రోజూ 35– 40 డిగ్రీల ఎండ వేడిమితో అల్లాడుతున్న సిలికాన్ సిటీలో బుధవారం సాయంత్రం హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. తీవ్రమైన ఈదురుగాలులు, వడగండ్లతో అకాల వర్షం కుదిపేసింది. గాలులకు చెట్లు కూలి రోడ్లపై, వాహనాలపై పడడంతో విధ్వంసం చోటుచేసుకుంది. కొన్నిచోట్ల అడుగు ఎత్తున వడగండ్లు పేరుకుపోవడం నగరవాసులకు ఆశ్చర్యం పంచింది. మండుటెండలు, ఉక్కపోతతో సతమతమౌతున్న నగరవాసులకు ఈ వానలతో ఉపశమనం కలిగింది. సాయంత్రం నుంచి జోరువాన మొదలైంది. దీంతో వాహనదారులు, పాదచారులు చాటు కోసం పరుగులు తీశారు. రోడ్లపై వాహన సంచారం అస్తవ్యస్తమైంది. జేపీ.నగర, జయనగర, బన్నేరుఘట్ట, బనశంకరి, బీటీఎం లేఔట్. శాంతినగర, లాల్బాగ్, విల్సన్ గార్డెన్, కార్పొరేషన్, చిన్నస్వామి స్టేడియం, ఎంజీరోడ్డు, హలసూరు, శివాజీనగర, రేస్కోర్సురోడ్డు, మెజెస్టిక్, శివానందసర్కిల్, మల్లేశ్వరం, బసవనగుడి, ట్రినిటి సర్కిల్, రాజాజీనగర, కేఆర్. మార్కెట్, మల్లేశ్వరం, కోరమంగల తదితర ప్రాంతాల్లో వడగండ్లు వర్షం కురిసింది. విల్సన్గార్డెన్ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో జలమయమైంది. వాహనాలు కూడా మునిగిపోయాయి. మల్లేశ్వరంతో పాటు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. కొన్నిచోట్ల కార్లు, బైక్లు ధ్వంసమయ్యాయి. విధానసౌధలో పలు చాంబర్లలోకి వాననీరు చేరింది. శివాజీనగర: హాసన్, తుమకూరు, బెంగళూరు గ్రామీణ, చిక్కమగళూరు, దావణగెర, శివమొగ్గ, భద్రావతి, రాయచూరు జిల్లాల్లో వర్షం కురిసింది. గాలులు చెలరేగడంతో కరెంటు స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో ప్రజలు కరెంటు లేక అవస్థలు పడ్డారు. యాదగిరి జిల్లాలో గురుమిఠ్కల్ తాలూకా బూదురు గ్రామంలో పిడుగులు పడి ఇద్దరికి చెందిన 60 గొర్రెలు చనిపోయాయి. బెంగళూరు గ్రామీణ జిల్లాలో కూడా మెరుపులు, పిడుగుల వర్షం కురిపింది. 3 పశువులు చనిపోయాయి. తుమకూరులో పిడుగు పడి షీట్ల ఇల్లు ధ్వంసమైంది. హఠాత్తుగా వర్షం... పలు జిల్లాల్లో గాలీవాన -
బెంగళూరులో రూ.36 కోట్ల డ్రగ్స్ పట్టివేత
బనశంకరి: బెంగళూరులో 16 మంది డ్రగ్స్ విక్రేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.36.67 కోట్ల విలువచేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన నగర పోలీసు కమిషనరేట్లో డ్రగ్స్ను పరిశీలించి మాట్లాడారు. బాగలూరు, ఆడుగోడి, చిక్కజాల, హెచ్ఎస్ఆర్.లేఔట్, యశవంతపుర, జాలహళ్లి, జ్ఞానభారతి ఠాణాల పరిధిలో డ్రగ్స్ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న 16 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిలో నలుగురు విదేశీయులు, 8 మంది బయటి రాష్ట్రాలవారు ఉన్నారు. వీరికి జాతీయ, అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఏమేం దొరికాయి.. 9 కేజీల ఎండీఎంఏ, 5 కేజీల హైడ్రో గంజాయి, 19,755 ఎల్ఎస్డీ స్ట్రిప్స్, 156 గ్రాముల హెరాయిన్, 618 గ్రాముల చరస్, 332 గ్రాముల కొకై న్, 315 గ్రాముల గమ్మిస్ మిశ్రమం, 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలో కాలేజీ విద్యార్థులు, ఐటీ బీటీ ఉద్యోగులకు విక్రయిస్తుండడం గమనార్హం. మత్తు పదార్థాల గురించి తెలిస్తే ప్రజలు 1922 లేదా 112 నంబర్లుకు సమాచారం అందించాలని తెలిపారు. వారం రోజుల్లో రూ.50 కోట్ల డ్రగ్స్ సీజ్ ఈ వారం రోజుల్లో నగర పోలీసులు రూ.50 కోట్ల విలువచేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఒక్కరోజైనా డ్రగ్స్ దొరకని రీతిలో పోలీసులు పనిచేయాలని హోంమంత్రి అన్నారు. డ్రగ్స్తో అమాయకులు బలి అవుతున్నారు, వాటి నిర్మూలనే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాఠశాలలు, కాలేజీలకు పోలీసులు వెళ్లి విద్యార్థులను జాగృతం చేస్తున్నారని తెలిపారు. కమిషనర్ సీమంత్కుమార్ సింగ్, పాల్గొన్నారు. ఇద్దరు నైజీరియన్ల అరెస్టు కృష్ణరాజపురం: ఆడుగోడి పోలీసులు, జాలహళ్లి పోలీసులు కార్యాచరణ జరిపి ఇద్దరు నైజీరియన్లను అరెస్టు చేసి కోట్లాది రూపాయల మత్తు పదార్థాలను పట్టుకున్నారు. నగరంలో విదేశీ పోస్టాఫీసుకు పార్శిళ్ల ద్వారా హైడ్రో గంజాయి, గమ్మిస్ అనే మత్తు పదార్థాలను తెప్పించేవారు. పార్సిళ్లు ఏ దేశం నుంచి వచ్చాయో దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన నైజీరియన్లు 16 మంది విక్రేతల అరెస్టు -
వాకర్లపైకి దూసుకెళ్లిన కారు
దొడ్డబళ్లాపురం: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నవారి మీదకు మృత్యు శకటంలా ఓ కారు దూసుకొచ్చింది, ఈ దుర్ఘటనలో ఇద్దరు చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు. గదగ్ జల్లా లక్ష్మేశ్వరలో జరిగింది. బుధవారం ఉదయం రాణి చెన్నమ్మ కాలేజ్ వద్ద వాకింగ్ చేస్తున్న వారిపైకి ఓ కారు దూసుకెళ్లడంతో అశోక్ సర్వి (53), శివానంద హులుకోటి (57) అనే ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులని తెలిసింది. వీరితో పాటు వాకింగ్ చేస్తున్న మరో ఇద్దరు ఉపాధ్యాయులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కారు డ్రైవర్ను అరెస్టు చేశారు. అతడు మహారాష్ట్ర నుంచి లక్ష్మేశ్వర్కు వచ్చాడని సమాచారం. అతడు నిద్రమత్తులో నడిపినట్లు పోలీసులు చెబుతున్నారు. వాకింగ్కు వెళ్లినవారు మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇద్దరు ఉపాధ్యాయుల మృతి, ఇద్దరికి గాయాలు గదగ్ జిల్లాలో విషాద ఘటన -
కాలువలోకి కారు పల్టీ
● తల్లీ, చిన్నారి కొడుకు మృతి యశవంతపుర: తీర్థయాత్ర విషాదమయమైంది. హాసన్ జిల్లా చన్నరాయపట్టణ తాలూకా మల్లఘట్ట సమీపంలో బుధవారం మధ్యాహ్నం కారు కాలువలోకి పడడంతో తల్లీ బిడ్డ చనిపోయారు. ఓ కుటుంబం ధర్మస్థల యాత్రకు వెళ్లి తిరిగి చన్నరాయపట్టణానికి వస్తుండగా కారు వేగంలో అదుపుతప్పి హేమావతి నీటి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రియాంక (30), ఆమె ఏడాదిన్నర కొడుకు కారులో చిక్కుకుని ప్రాణాలు వదిలారు. మిగిలినవారు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రాణనష్టం జరిగింది. చన్నరాయపట్టణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. తల్లీ బిడ్డను పోగొట్టుకున్న కుటుంబం కన్నీమున్నీరైంది. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదందొడ్డబళ్లాపురం: బీదర్ పట్టణంలోని గురునానక్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రిలో ఒకచోట షార్ట్ సర్క్యూట్ జరిగి క్షణాల్లో వ్యాపించాయి. దట్టమైన పొగ కూడా కమ్ముకోవడంతో వందల సంఖ్యలో రోగులు, వారి బంధువులు, ఆస్పత్రి సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరిగెత్తారు. ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డుల్లో ఉన్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. హావేరిలో పిచ్చికుక్కల దాడులుదొడ్డబళ్లాపురం: హావేరి పట్టణంలో వీధికుక్కలు స్వైర విహారం చేశాయి. పలు ప్రాంతాలలో పిల్లలతో కలిపి మొత్తం 10 మందిపై దాడిచేసి గాయపరిచాయి. పృథ్విక్ (7), యశ్వంత్ (3), ఫాతిమా (5), అహ్మద్ వలి (4), భువన్ (2), కార్తీక్ (6), నింగమ్మ (70) తదితరులను కరిచాయి. ఆ కుక్కలు పిచ్చిపట్టి కనిపించినవారి మీదల్లా దాడి చేశాయి. బాధితులకు హావేరి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రజలు మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. వీధి కుక్కల గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. చెట్టును ఢీకొన్న కారు● కుటుంబానికి గాయాలు చింతామణి: టైరు పేలడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొనింది. ఈ సంఘటన బుధవారం పట్టణంలోని కన్నపల్లిలో జరిగింది. వివరాలు.. చింతామణి కెఆర్ లేఔట్లో నివసించే ఇదయతుల్లా, భార్య రోహి, పిల్లలు మహమ్మద్ ఉమర్, రోహినా, రిహా ఫిర్దోజా కారులో బెంగళూరుకు బయల్దేరారు. అయితే కొంతసేపటికే కారు వెనుక టైర్ పేలిపోయి ఓ చెట్టును ఢీకొన్నారు. గాయపడిన ఐదుగురినీ జనం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో దంపతులు, కొడుకు ఉమర్ పరిస్ధితి ఆందోళకరంగా ఉండంతో బెంగళూరుకు పంపించారు. ఇద్దరు పిల్లలు చింతామణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ భార్య ఆత్మహత్యయశవంతపుర: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సజావుగా సాగిపోతున్న కుటుంబంలో చిన్న గొడవలే పెద్దవయ్యాయి. కుటుంబ కలహాలతో ఎస్ఐ భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా బీరూరు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. బీరూరు ఎస్ఐ తిప్పేశ్ భార్య పద్మ (35) మంగళవారం రాత్రి ఇంటిలో ప్రాణాలు తీసుకుంది. బీరూరు పట్టణంలో బాడుగ ఇంటిలో తిప్పేశ్ కుటుంబం ఉంటోంది. పద్మది తుమకూరు జిల్లా కాగా, తిప్పేశ్ది దావణగెరె జిల్లా. వీరిద్దరూ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కానీ పిల్లలను ఎక్కడ చదివించాలి, సెలవుల గురించి గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. పోలీసులు విచారణ చేపట్టారు. -
కూతుళ్లతో కలిసి బావిలోకి దూకిన తల్లి
కోలారు: భర్తతో కలహాల వల్ల ఓ తల్లి, ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన కోలారు జిల్లా ముళబాగిలు తాలూకా బి.కొరవనూరు గ్రామంలో జరిగింది. లక్ష్మీదేవమ్మ (35), పిల్లలు గగనశ్రీ (14), రెడ్డమ్మ (9) మృతులు. వివరాలు.. లక్ష్మీదేవమ్మకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు అరవింద్ ఉన్నారు. భర్త నారాయణప్ప ఏ పనీ చేయకుండా రోజూ తాగి వచ్చి వేధించే వాడని తెలిసింది. ఇల్లు గడవడం కూడా కష్టమైంది. దీంతో విరక్తి చెందిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది, అయితే ఆడపిల్లలు అనాథలవుతారనుకుని వారిని కూడా తీసుకుని ఊరిబయటకు వచ్చి ఓ బావిలోకి దూకింది. కొన్ని గంటల తరువాత కొందరు గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. అందరూ వచ్చి చూసేసరికి చనిపోయి ఉన్నారు. ముళబాగిలు రూరల్ పోలీసులు మృతదేహాలను బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బంధువుల శోకాలు మిన్నంటాయి. ముళబాగిలు వద్ద ఘోరం -
వివాహేతర సంబంధం.. పోక్సో కేసుతో చిక్కుల్లో ఆనంద్ నాయుడు
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ నాయకుడు రెచ్చిపోయారు. తన ప్రేయసి.. పిల్లలపై(మైనర్లు) సదరు కాంగ్రెస్ నేత దాడి చేసిన విషయంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో, ఆమె భర్త.. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించడంతో పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు ఉత్తర జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ప్రధాన కార్యదర్శి ఆనంద్ నాయుడు.. గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఒక వివాహితతో సంబంధంలో ఉన్నాడు. వీరిద్దరి సంబంధంపై ఆమె పిల్లలు వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆగ్రహంతో రగిలిపోయిన ఆనంద్.. వారిని చితకబాదాడు. ఇనుప రాడ్తో పిల్లలపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో, వారికి గాయాలయ్యాయి.అనంతరం, ఇంటికి వచ్చిన ఆమె భర్త.. పిల్లల గాయాలు చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో, ఆనంద్, తన భార్య మధ్య ఉన్న సంబంధం బహిర్గతమైంది. వెంటనే తేరుకున్న బాధితులు.. స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఆనంద్ నాయుడు.. తన పిల్లల కాళ్లు, చేతులు, శరీరంలోని ఇతర భాగాలపై రాడ్లతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడి ఆరోపణలను పిల్లలు కూడా ధృవీకరించినట్లు సమాచారం. అనంతరం, పోలీసులు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా తన అనుమతి లేకుండా తన భార్య, నాయుడు ఆస్తిని బదిలీ చేశారని బాధితుడు ఆరోపించారు. దర్యాప్తు అధికారులు కేసులోని అన్ని కోణాలను పరిశీలిస్తున్నారని తెలిపారు.Congress MLA assaults minors with rod for questioning his extra-marital affair in KarnatakaAnand Naidu, the general secretary of Bengaluru North District Congress Committee, has been booked under the POCSO Act for allegedly assaulting two minors with a rod. pic.twitter.com/Bnq6WukHmZ— monkey. D. luffy (@luffy_735) April 29, 2026 -
కుళ్లిన స్థితిలో యువతి మృతదేహం
బొమ్మనహళ్లి: బెంగళూరులో మంగళవారం ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. అడుగోడిలో అద్దె ఇంట్లో పూజ దత్తా (34) అనే యువతి నగ్న స్థితిలో శవమై తేలింది. మొదట్లో హత్య అనుకున్నా, తరువాత ఆత్మహత్య అని అనుమానాలు బలపడ్డాయి. వివరాలు... జార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన పూజ దత్తా గత మూడేళ్లుగా అదే ఇంట్లో నివసిస్తూ ప్రముఖ ఆటోమొబైల్ ఉత్పత్తుల సంస్థలో పనిచేస్తోంది. కొన్నాళ్ల కిందటే ఉద్యోగం వదిలేసిందని తెలుస్తోంది. మూడు రోజులుగా ఆమె ఇంటి తలుపు లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఇంట్లోంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇంటి యజమాని తలుపు పగలగొట్టి చూడగా, పూజ మృతదేహం దాదాపు కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా, చేరుకుని విచారణ చేపట్టారు. ఆమె ఎవరితోను మాట్లాడేది కాదు, తరచుగా ఒంటరిగా రోడ్డుపై తిరిగేదని స్థానికులు తెలిపారు. ఆమె మానసికంగా కుంగిపోయినట్లు కనిపించిందని చెప్పారు. ఒక యువకుడు బైక్లో పూజ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడని చెప్పారు. ఆమె ఫోన్ స్విచాఫ్లో ఉండగా, కాల్ డీటైల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఇల్లంతా చెత్త చెత్త ఆమె ఇల్లంతా చెత్తకుప్పలా ఉంది. గోడపై రకరకాల రాతలు రాసి ఉన్న పేపర్లు అతికించి ఉన్నాయి. అవి ఆంగ్లం, హిందీ భాషల్లో ఉన్నాయి. ఒక గది మొత్తం చెత్తతో, చిరిగిన కాగితాలతో నిండి ఉంది. ఇంట్లో సుమారు ఐదారు పాత కాగితాల కట్టలు దొరికాయి. ఆమె మానసిక స్థితి సరిగా లేదా అనేది సందేహంగా ఉంది. పోస్టమార్టం నివేదిక వస్తే హత్యా, ఆత్మహత్యా అనేది తెలుస్తుందని పోలీసులు చెప్పారు. -
భిక్షమెత్తుకుంటూ ఫస్టు క్లాస్
కర్ణాటక: ఇంట్లో కడు పేదరికం, నాలుగు అన్నం మెతుకులు దొరకడం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అమ్మాయి బిచ్చమెత్తుతూ ఆకలి తీర్చుకునేది. కానీ చదువులో మాత్రం మేటి, ఎస్ఎస్ఎల్సీ ఫలితాలలో 84 శాతం మార్కులతో పాసైంది. కలబుర్గి జిల్లా అళంద తాలూకా మాదన హిప్పరిగి ప్రభుత్వ పబ్లిక్ పాఠశాల విద్యార్థిని సుజాత భీమేష్ ఘనత ఇది. ఆకలి మంటలతోనే అక్షర యాత్ర గావించి అందరి ప్రశంసలనూ అందుకుంటోంది. గొల్ల సముదాయానికి చెందిన సుజాత ఇల్లు ఓ రేకుల షెడ్డు, తల్లిదండ్రులు కూలీ పనిచేస్తారు. ఇంట్లో అన్నం లేని రోజున గిన్నె పట్టుకుని యాచిస్తుంది. స్కూలుకు వెళ్లి శ్రద్ధగా చదువుకునే ఆమెకు సరస్వతీ కటాక్షం దొరికింది. సుజాత ఫస్టు క్లాసులో పాస్ కావడంతో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు ఆమె ఇంటికెళ్లి సన్మానించారు. -
‘ఆ రోజు’ ఇంకా మరిచిపోలేదు
బెంగళూరు: మంచు కొండలు, గలగలపారే సెలయేర్లు, ఆకాశాన్నంటే మంచు పర్వతాలు, ఆహ్లాద వాతావరణంతో కూడిన జమ్మూ కాశ్మీర్ లో పర్యటనకు వెళ్దామంటే ఆమె సంతోషపడింది. కానీ ఆ యాత్ర తన జీవితంలో అంతులేని చీకట్లను నింపుతుందని ఊహించలేకపోయింది. భర్తను పోగొట్టుకుని జీవితం దుఃఖభరితమైంది. పహల్గాంలో యాత్రికులపై పాక్ ముష్కర ఉగ్రవాదుల దాడి జరిగి ఏడాది అవుతోంది, బెంగళూరుకు చెందిన టెక్కీ భరత్ భూషణ్.. ఉగ్రవాదుల తుపాకులకు బలయ్యాడు. ఆయన కుటుంబంలో విషాదకరమైన మౌనం నెలకొంది. భవిష్యత్తుపై ఎన్నో కలలు ఏడాది కిందటి దుర్ఘటనను తలచుకుని భరత్ భూషణ్ (41) సతీమణి, తల్లిదండ్రులు కన్నీరు పెడుతున్నారు. పహల్గాం భైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల రక్తపాతానికి అనేకమంది అమాయక పర్యాటకులు ప్రాణాలు విడిచారు. ఈ దురాగతానికి భారత దేశం ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ప్రతీకారం తీర్చుకోవడమైనది. ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన బెంగళూరులోని మత్తికెరెకు చెందిన భరత్ భూషణ్ జ్ఞాపకాలతో ఆయన సతీమణి డాక్టర్ సుజాత, చిన్నారి కుమారుడు జీవిస్తున్నారు. భవిష్యత్పై ఎన్నో కలలు కన్నామని ఆమె, తల్లిదండ్రులు తెలిపారు. రోజువారీ పనుల మధ్య చేదు జ్ఞాపకాలను మరవటానికి డాక్టర్ సుజాత ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా ఆ ఘోరమైన రోజు కళ్లముందే వచ్చి నిలబడుతుంది. ఆత్మయున్ని కోల్పోయిన బాధ మరువడం సాధ్యం కావడం లేదు. ఈ ఘోరాలకు అంతమెన్నడు? ఒక సంవత్సరం అయినట్లే తెలియడం లేదు, నిన్ననో, మొన్ననో నా భర్త చెంతనే ఉన్నాడు అనిపించేలా జ్ఞాపకాలు నెలకొన్నాయి. వాస్తవం కొంతసేపటికే అర్థమై జీవితం భారంగా గడుస్తోంది. ఉగ్రమూకలు సరిహద్దులు దాటి వచ్చి ఘోరాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇది ఎప్పుడు ముగుస్తుందో అప్పుడే క్షేమంగా ఉంటామని చెప్పవచ్చు. సేఫ్గా ఉందనే మేము కాశ్మీర్ కు వెళ్లాము. కానీ నమ్మకం లేకుండాపోయింది. జీవితంలో ఆశలు ఉండేవి. ఉగ్రవాదులు అక్కడ పనిచేసేవారి తరహా దుస్తుల్లో నడుచుకుంటూ వచ్చారు, గన్ తీసి షూట్ చేశారు అని డా.సుజాత కన్నీటితో గుర్తుచేసుకున్నారు. టూరిస్టులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. -
భార్యను చంపి.. శిశువుతో కలిసి బావిలోకి దూకిన భర్త
రాయచూరు రూరల్: చిన్న గొడవలకే కుటుంబాలు కడతేరిపోతున్నాయి. భార్యను చంపి బావిలోకి దూకి భర్త అత్మహత్య చేసుకున్నాడు. 9 నెలల శిశువును ఎత్తుకుని అతడు బావిలోకి దూకగా, స్థానికులు ఆ శిశువును కాపాడారు. ఈ హృదయ విదారక సంఘటన కలబుర్గి జిల్లాలో అఫ్జలపుర తాలూకా కె.మాదారలో జరిగింది. వివరాలు.. లక్ష్మిపుత్ర (23) చిన్నపాటి రైతు కాగా, అతనికి భార్య అంజలి (22), 9 నెలల పసికందు ఉన్నారు. తరచుగా భార్యాభర్తలు గొడవలు పడేవారు. ఇదే మాదిరిగా సోమవారం సాయంత్రం కూడా ఘర్షణ జరిగింది. భర్త భార్యను కొడవలితో నరికి చంపి శిశువును ఎత్తుకుని ఊరిబయటకు వచ్చాడు, అక్కడ ఓ బావిలోకి దూకాడు. దూరం నుంచి చూసిన స్థానికులు పరుగున వచ్చి బావిలోకి దూకి శిశువును బయటకు తెచ్చారు. ఇంతలో లక్ష్మిపుత్ర నీట మునిగి చనిపోయాడు. రేవూర్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను కలబుర్గి అస్పత్రికి తరలించారు. నెలల వయసుకే అనాథగా మారిన పసిబిడ్డను చూసి బంధుమిత్రులు అయ్యో అని విలపించారు. పలు జిల్లాలకు వర్షసూచనదొడ్డబళ్లాపురం: ఎండలతో అల్లాడిపోతున్న సమయంలో వాతావరణ శాఖ ప్రజలకు చల్లని వార్త అందించింది. పలు జిల్లాల్లో వడగండ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి జిల్లాల్లో మంగళవారం నుంచి ఉరుములతో వానలు పడవచ్చు. బెళగావి, బాగలకోట, రాయచూరు, ధార్వాడ, గదగ్, హావేరి, కలబుర్గి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయి. నల్ల చిరుత కనువిందు మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలె మహదేశ్వర వన్యధామం పీజీ పాళ్య వలయంలో లొక్కనహళ్లిలో నల్ల చిరుత కనిపించింది. టూరిస్టులను సఫారీ వాహనంలో తీసుకెళ్తుండగా అరుదైన నల్ల చిరుత దర్శనమిచ్చింది. పర్యాటలకు ఫోటోలు, వీడియోలు తీసుకోవడంతో పాటు ఆనందంతో తబ్బిబ్బయ్యారు. వేసవి కావడంతో ఆహారం కోసం వెదుక్కుంటూ వచ్చే చిరుతలు, ఇతర వన్యప్రాణులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. డీసీఎంపై అశోక్ ధ్వజం శివాజీనగర: నాలుగు ఓట్ల కోసం దేశద్రోహులను బ్రదర్స్ అని సమర్థించుకునే స్వార్థపరులు రాష్ట్రంలో సీఎం కావడానికి ప్రయత్నించటం కర్ణాటక దురదృష్టకరమని బీజేపీ పక్షనేత ఆర్.అశోక్, డీసీఎం డీకే శివకుమార్ మీద ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. మంగళూరు కుక్కర్ బాంబు పేలుడుని డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఉగ్రవాదికి డీకే అండగా నిలిచారన్నారు. దేశ భద్రత కంటే కాంగ్రెస్కు ఓటు బ్యాంక్ రాజకీయమే ముఖ్యమైనదన్నారు. -
జీవితాన్ని చిదిమేసిన మంచుకొండలు
శివాజీనగర: మంచు కొండలు, గలగలపారే సెలయేర్లు, ఆకాశాన్నంటే మంచు పర్వతాలు, ఆహ్లాద వాతావరణంతో కూడిన జమ్ము కశ్మీర్లో పర్యటనకు వెళ్దామంటే ఆమె సంతోషపడింది. కానీ ఆ యాత్ర తన జీవితంలో అంతులేని చీకట్లను నింపుతుందని ఊహించలేకపోయింది. భర్తను పోగొట్టుకుని జీవితం దుఃఖభరితమైంది. పహల్గాంలో యాత్రికులపై పాక్ ముష్కర ఉగ్రవాదుల దాడి జరిగి ఏడాది అవుతోంది, బెంగళూరుకు చెందిన టెక్కీ భరత్ భూషణ్.. ఉగ్రవాదుల తుపాకులకు బలయ్యాడు. ఆయన కుటుంబంలో విషాదకరమైన మౌనం నెలకొంది. భవిష్యత్తుపై ఎన్నో కలలు ఏడాది కిందటి దుర్ఘటనను తలచుకుని భరత్ భూషణ్ (41) సతీమణి, తల్లిదండ్రులు కన్నీరు పెడుతున్నారు. పహల్గాం భైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల రక్తపాతానికి అనేకమంది అమాయక పర్యాటకులు ప్రాణాలు విడిచారు. ఈ దురాగతానికి భారత దేశం ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ప్రతీకారం తీర్చుకోవడమైనది. ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన బెంగళూరులోని మత్తికెరెకు చెందిన భరత్ భూషణ్ జ్ఞాపకాలతో ఆయన సతీమణి డాక్టర్ సుజాత, చిన్నారి కుమారుడు జీవిస్తున్నారు. భవిష్యత్పై ఎన్నో కలలు కన్నామని ఆమె, తల్లిదండ్రులు తెలిపారు. రోజువారీ పనుల మధ్య చేదు జ్ఞాపకాలను మరవటానికి డాక్టర్ సుజాత ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా ఆ ఘోరమైన రోజు కళ్లముందే వచ్చి నిలబడుతుంది. ఆత్మీయున్ని కోల్పోయిన బాధ మరువడం సాధ్యం కావడం లేదు. పహల్గామ్ మారణహోమంలో బెంగళూరు టెక్కీ భరత్భూషణ్ బలి ఆ ఘోరానికి ఏడాది భర్త జ్ఞాపకాలతోనే సతీమణి జీవనంఈ ఘోరాలకు అంతమెన్నడు? ఒక సంవత్సరం అయినట్లే తెలియడం లేదు, నిన్ననో, మొన్ననో నా భర్త చెంతనే ఉన్నాడు అనిపించేలా జ్ఞాపకాలు నెలకొన్నాయి. వాస్తవం కొంతసేపటికే అర్థమై జీవితం భారంగా గడుస్తోంది. ఉగ్రమూకలు సరిహద్దులు దాటి వచ్చి ఘోరాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇది ఎప్పుడు ముగుస్తుందో అప్పుడే క్షేమంగా ఉంటామని చెప్పవచ్చు. సేఫ్గా ఉందనే మేము కశ్మీర్కు వెళ్లాము. కానీ నమ్మకం లేకుండాపోయింది. జీవితంలో ఆశలు ఉండేవి. ఉగ్రవాదులు అక్కడ పనిచేసేవారి తరహా దుస్తుల్లో నడుచుకుంటూ వచ్చారు, గన్ తీసి షూట్ చేశారు అని డా.సుజాత కన్నీటితో గుర్తుచేసుకున్నారు. టూరిస్టులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. -
మనోహరం.. మల్లె కరగ
బొమ్మనహళ్లి: బెంగళూరు వద్ద ఆనేకల్ తాలూకాలో ముత్సంద్ర గ్రామంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ కరగ వేడుక కమనీయంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఊర హబ్బ పేరిట గ్రామ దేవతల పల్లకీ ఉత్సవం జరిగింది. గ్రామ దేవతల ఉత్సవ విగ్రహాలను పూల పల్లకీలలో ఊరేగించారు. మహిళలు దీపాలను మోస్తూ నడిచారు. వీర కుమారుల ఖడ్గ సేవ మధ్య కరగ పూజారి మల్లెపూల కరగనెత్తుకుని గ్రామంలో నాట్యమాడుతూ సంచరించారు. ఘనంగా బందంతమ్మన పండుగ మండ్య: మండ్య నగరంలోని హొసహళ్లి, రామనహళ్లి గ్రామాల్లో పెద్దలు, గ్రామస్తుల నేతృత్వంలో ఘనంగా బందంతమ్మన పండుగను ఆచరించారు. గ్రామ ప్రముఖుడు హెచ్సీ శివలింగేగౌడ మాట్లాడుతూ తమ తాత, ముత్తాతల కాలం నుంచి ఈ బందంతమ్మన పండుగను తాము సాంప్రదాయబద్ధంగా ఆచరిస్తున్నామన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు సోకే వ్యాధులు అమ్మవారి కృపతో దూరం కావాలని, గ్రామానికి మంచి జరగాలన్నది తమ నమ్మకమన్నారు. అమ్మవారి విగ్రహాన్ని హొసహళ్లి గ్రామ సరిహద్దుల నుంచి గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగించి అన్నదానం చేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీ: కుమార కోలారు: బీజేపీ– జేడీఎస్ మైత్రిలో ఎలాంటి సమస్య లేదని, అంతా సజావుగా సాగుతోందని కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. మాలూరులో జేడీఎస్ నాయకుడు రామేగౌడ నివాసంలో జరిగిన శుభకార్యానికి హాజరై విలేకరులతో మాట్లాడారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా పరిష్కరించుకుంటామని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీ నడుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందని అంటున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలన్నారు. కాంగ్రెస్ పరిపాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి కూడా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల నిర్వహణకు డబ్బులు లేవని కోర్టుకు వెళ్లిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్డిఎ వస్తే తనకు ముఖ్యమంత్రి పదవి కంటే, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటానని చెప్పారు. కొల్లూరులో కేంద్ర ఆర్థికమంత్రి యశవంతపుర: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉడుపి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొల్లూరు మూకాంబికా దేవి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి పూజలు చేశారు. ఆమెకు దేవస్థానం అర్చకులు సకల లాంఛనాలతో స్వాగతించారు. తరువాత ఆమె ఉడుపికి పయనమయ్యారు. షారిక్కు శిక్ష పెంచాలన్న ఎన్ఐఏ యశవంతపుర: మంగళూరు కుక్కర్ బాంబ్ పేలుడు కేసులో ఉగ్రవాది మహమ్మద్ షారిక్కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 10 ఏళ్లు శిక్ష విధించడం తెలిసిందే. ఇప్పటికే నాలుగేళ్లు జైలులో ఉన్నందున 6 ఏళ్లు శిక్ష అనుభవిస్తే విడుదల కావచ్చు. ఇది చాలా తక్కువ శిక్ష అని, అతడు బయటకు వస్తే ప్రమాదకరమని, కాబట్టి జైలు శిక్షను పెంచాలని ఎన్ఐఎ అధికారులు హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. అంత పెద్ద కేసులో 10 ఏళ్ల శిక్ష చాల తక్కువని అసంతృప్తితో ఉన్నారు. -
భిక్షమెత్తుకుంటూ ఫస్టు క్లాస్
రాయచూరు రూరల్: ఇంట్లో కడు పేదరికం, నాలుగు అన్నం మెతుకులు దొరకడం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అమ్మాయి బిచ్చమెత్తుతూ ఆకలి తీర్చుకునేది. కానీ చదువులో మాత్రం మేటి, ఎస్ఎస్ఎల్సీ ఫలితాలలో 84 శాతం మార్కులతో పాసైంది. కలబుర్గి జిల్లా అళంద తాలూకా మాదన హిప్పరిగి ప్రభుత్వ పబ్లిక్ పాఠశాల విద్యార్థిని సుజాత భీమేష్ ఘనత ఇది. ఆకలి మంటలతోనే అక్షర యాత్ర గావించి అందరి ప్రశంసలనూ అందుకుంటోంది. గొల్ల సముదాయానికి చెందిన సుజాత ఇల్లు ఓ రేకుల షెడ్డు, తల్లిదండ్రులు కూలీ పనిచేస్తారు. ఇంట్లో అన్నం లేని రోజున గిన్నె పట్టుకుని యాచిస్తుంది. స్కూలుకు వెళ్లి శ్రద్ధగా చదువుకునే ఆమెకు సరస్వతీ కటాక్షం దొరికింది. సుజాత ఫస్టు క్లాసులో పాస్ కావడంతో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు ఆమె ఇంటికెళ్లి సన్మానించారు. కలబుర్గి జిల్లా బాలిక ఘనత -
రేపు ద్వితీయ పీయూ సప్లిమెంటరీ పరీక్షలు
● జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు సర్వం సిద్ధం ● 2,995 మంది విద్యార్థుల పేర్లు నమోదు బళ్లారి రూరల్: ఏప్రిల్ 30న జరగబోయే ద్వితీయ పీయూసీ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధమైనట్లు దావణగెరె జిల్లాధికారి జీ.ఎం.గంగాధర స్వామి తెలిపారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన ముందస్తు సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 30 నుంచి మే 13 వరకు జరిగే పీయూసీ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 2,995 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. దావణగెరెలో 1,629, జగళూరులో 391, చెన్నగిరిలో 401, హరిహరలో 321, హొన్నాళిలో 250 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు బాధించాయిచళ్లకెరె రూరల్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి డీ.సుధాకర్పై కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని మంత్రి కుమారుడు సుహాస్ సుధాకర్ పేర్కొన్నారు. తన తండ్రి ఆరోగ్య విషయాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. తన తండ్రి చికిత్సకు స్పందిస్తున్నారని, త్వరలో కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పటికే ఆస్పత్రికి వచ్చి తన తండ్రి ఆరోగ్యంపై వాకబు చేశారని అన్నారు. 30న ఉచిత ధ్యాన శిబిరంబళ్లారిటౌన్: నగరంలోని నెహ్రు కాలనీలోని గురుశాంతప్ప లేఅవుట్లోని రామచంద్ర యోగాశ్రమంలో ఈ నెల 30న ఉచిత ధ్యాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన రామచంద్రజీ బ్రాహ్మణుల పేరుతో రామచంద్ర మిషన్ ఆధ్యాత్మిక సంస్థను స్థాపించి చాలా యోగాశ్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేటి జీవనశైలిలో మానసిక ఒత్తిళ్లను తగ్గించేందుకు యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక శిక్షణ పద్ధతిని తెలియజేస్తారన్నారు. ఆ రోజు సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు సార్వజనిక సభను ఏర్పాటు చేసి ఆసక్తి గల వారికి ఉచిత ధ్యాన శిబిరాన్ని నిర్వహిస్తున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించండిరాయచూరు రూరల్: నగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆస్పత్రిలో రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని హరిజనవాడ, ఎల్బీఎస్ నగర్, మావినకెరె చెరువు వద్ద ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది, ఇతర శాఖాధికారులు హాజరు పుస్తకంలో అటెండెన్స్ వేసి బయటికి పోవడంపై ఆక్రోశం వ్యక్తం చేస్తూ జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబుతో ఫోన్లో సంభాషించి ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు. వేశ్యా వాటికపై దాడి.. 11 మంది అరెస్ట్రాయచూరు రూరల్: మహిళలకు ఉద్యోగాలిప్పిస్తామంటూ ఆశ చూపి వేశ్యా వాటికలో దింపుతున్న ప్రధాన వ్యక్తితో పాటు 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన జిల్లాలోని మాన్వి తాలూకాలో చోటు చేసుకుంది. మాన్వి తాలూకా హిరే కొట్నేకల్–బ్యాగవాట్ కెనాల్ రహదారి పొలంలో వేశ్యా వాటిక నిర్వహిస్తున్న విషయం మాన్వి సీఐ సోమశేఖర్ కెంచరెడ్డికి తెలియగానే డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ ఆదేశాల మేరకు దాడి చేసి ప్రధాన నిందితుడు మాన్వి ఇందిరా నగర్ నివాసి తాయప్పను అరెస్ట్ చేిసినట్లు పోలీసులు తెలిపారు. పిడుగుపాటుకు 60 గొర్రెల మృతిసాక్షి బళ్లారి: యాదగిరి జిల్లాలో పిడుగుపాటుకు 60 గొర్రెలు మృతి చెందాయి. మంగళవారం ఆ జిల్లాలోని గురుమటకల్ తాలూకా బూదురులో పిడుగులతో కూడిన గాలి, వాన కురవడంతో మల్లప్ప, జల్లప్పల గొర్రెలు మృతి చెందాయి. అయితే తృటిలో గొర్రెల కాపరులు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. -
గంజాయి ఘర్షణలో గుడిసెలకు నిప్పు
బొమ్మనహళ్లి: గంజాయి మత్తులో బంగ్లాదేశ్కు చెందిన వలస కూలీలు రాత్రివేళ కిష్కింధకాండకు పాల్పడ్డారు. గొడవలు పడి గుడిసెలకు నిప్పు పెట్టుకుని విధ్వంసానికి దిగారు. దీంతో 10కిపైగా గుడిసెలు మంటల్లో చిక్కుకుని ఆందులో ఉన్న గ్యాస్సిలిండర్లు పెద్ద శబ్ధంతో పేలిపోవడంతో స్థానిక ప్రజలు ఏం జరిగిందోనని తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. బెంగళూరు నగరంలోని బొమ్మనహళ్ళి నియోజకవర్గంలోని హొసపాళ్య వార్డు పరిధిలో ఉన్న సామసంద్రపాళ్యలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. ఏం జరిగిందంటే.. గుడిసెలలో బంగ్లా వలస కూలీలు నివసిస్తూ చిత్తు కాగితాలు ఏరుకుని జీవిస్తున్నారు. ఎప్పుడూ గంజాయి సేవిస్తూ, స్థానికులకు ఇబ్బందులు కలిగించేవారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉండటంతో చాలామంది ఓటు వేయడానికి వెళ్లారు. ఈ సమయంలో వారిలో వారు గంజాయి మత్తులో దాడులకు దిగి గుడిసెలకు నిప్పు పెట్టుకోవడంతో రభస చెలరేగింది. సిలిండర్లు పేలి అగ్ని గోళాలు ఎగసిపడ్డాయి. స్థానిక యువకులు మంటలు అర్పే ప్రయత్నం చేసి, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఉదయం బొమ్మనహళ్ళి ఎమ్మెల్యే ఎం.సతీష్రెడ్డి పరిశీలించి, డీసీపీ ఎం.నారాయణ, పోలీసుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. అక్కడ పడి ఉన్న కొన్ని కార్డులను పరిశీలించగా బంగ్లాదేశ్కు చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు విచారణ చేపట్టారు. బెంగళూరులో బంగ్లాదేశీల రచ్చ -
ఎరువులు, విత్తనాల కొరత అరికట్టండి
హొసపేటె: దేశవ్యాప్త వ్యవసాయ పరికరాలు, విక్రయదారుల సంఘం బంద్ పాటిస్తున్న నేపథ్యంలో విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలో తమ వివిధ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కూడ్లిగి ఎరువులు, పురుగుమందులు, విత్తన విక్రయదారుల సంఘం ఆధ్వర్యంలో కూడ్లిగి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. యూరియా సంఘం అధ్యక్షుడు కేటర్ నాగరాజు మాట్లాడుతూ డీఏపీ, ఇతర ఉత్పత్తులను తప్పనిసరిగా అనుసంధానించాలి. అన్ని రకాలపై ఎరువులపై ఎంఆర్ఓలో 8 శాతం డీలర్ లాభం మార్జిన్ ఉండాలన్నారు. అన్ని ఎరువులకు ఓటీఎల్ అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కూడ్లిగి ఎరువులు, పురుగుమందులు, విత్తన అమ్మకందారుల సంఘం ఉపాధ్యక్షుడు ఎంఎం తిప్పేస్వామి, కార్యదర్శి ఏఎస్.మల్లికార్జున బండ్రి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అధ్యక్ష స్థానం ఎన్నికపై విప్ జారీ
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా బీజేపీ విప్ జారీ చేసింది. పట్టణ మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఈనెల 30న జరగనున్నాయి. ఈ పదవికి బీజేపీ నుంచి సురేష్ బానకర్ పోటీ చేస్తారని మండల అధ్యక్షుడు బెణకల్లు ప్రకాష్ తెలిపారు. బీజేపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అధ్యక్ష ఎన్నికల్లో నమ్మకంతో అందరిపై విప్లు జారీ చేయలేదని అన్నారు. అయితే తమ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇందులో మా నిర్లక్ష్యం కూడా ఉంది. ఈ సారి పార్టీ ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించే సభ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఇబ్బందిని నివారించడానికి విప్ జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు జోగి హనుమంతప్ప, నవీన్కుమార్, దీపక్ కఠారి, నాగరాజ్ పాల్గొన్నారు. -
రైతుల అరెస్టుపై డీవైఎఫ్ఐ నిరసన
బళ్లారిటౌన్: జిల్లాలోని కుడితిని వద్ద సోమవారం ఆందోళన చేపడుతున్న వందలాది మంది రైతులను అరెస్టు చేయడంపై మంగళవారం డీవైఎఫ్ఐ జిల్లా సమితి నిరసన ర్యాలీ నిర్వహించింది. సమితి జిల్లాధ్యక్షుడు యూ.ఎర్రిస్వామి మాట్లాడుతూ కుడితిని చుట్టు పక్కల 7 గ్రామాల్లో 900 ఎకరాల రైతుల భూములను జిందాల్ కంపెనీకి అప్పగించడాన్ని ఖండిస్తు భూమి కోల్పోయిన రైతులు శాంతియుతంగా పోరాటాలు చేస్తుంటే దాదాపు 300 మంది పైగా రైతులను అరెస్ట్ చేయడం తీవ్ర ఖండనీయం అన్నారు. 2010లో రైతుల నుంచి 5,367 ఎకరాల భూములను బలవంతంగా లాక్కొని 16 ఏళ్లవుతున్నా పరిశ్రమలు స్థాపించలేదన్నారు. అనంతరం జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. డీవైఎఫ్ఐ నేతలు నవీన్, ఎన్.ఎర్రిస్వామి, కే.తిప్పేరుద్ర, మస్తాన్సాబ్, శివనందన్, నాసీర్, రామాంజి, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. తాగునీటి ఎద్దడి నివారించండి రాయచూరు రూరల్: వేసవిలో మూడు నెలల పాటు జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు చేపట్టాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర, కృష్ణా నదీ ప్రాంత గ్రామాలకు నీటి సరఫరాలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలన్నారు. విద్యుత్ కోతలు, మోటర్లు చెడిపోవడం, ఇతరత్ర కారణాలు చెప్పకుండా నీటి సరఫరాకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలను నింపాలని పీడీఓలను ఆదేశించాలని టీపీ అధికారులకు సూచనలు చేశారు. సమావేశంలో ఏసీ హంపన్న, టీపీ ఈఓ చంద్రశేఖర్ పవార్లున్నారు. వడ దెబ్బకు కూలీ కార్మికుడు బలిరాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలో ఎండలు మండుతుండడంతో వడ దెబ్బకు కూలీ కార్మికుడు దుర్మరణం పాలైన ఘటన రాయచూరు జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడిని రాయచూరు తాలూకా యాపలదిన్నికి చెందిన వ్యవసాయ కూలీ కార్మికుడు హుసేనప్ప(45)గా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్న సమయంలో నరేగ పనులు ముగించుకొని ఇంటికొస్తుండగా ఎండలు అధికంగా ఉండడంతో వడదెబ్బ సోకి మరణించాడు. లో బీపీ రావడంతో వడ దెబ్బకు గురై కుప్పకూలి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజుల్లోనే ముగ్గురు వడ దెబ్బకు అసువులు బాసారు. ఆర్టీసీ బస్సు బోల్తా.. 44 మందికి గాయాలు●తృటిలో తప్పిన పెను ప్రమాదం ●చిత్రదుర్గ జిల్లా చళ్లకెరె వద్ద ఘటన సాక్షి బళ్లారి: కేఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం బళ్లారి నుంచి బెంగళూరుకు వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు చళ్లకెరె సమీపంలో ప్రమాదానికి గురైంది. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా 44 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. చిత్రదుర్గ జిల్లా చళ్లకెరె తాలూకా హెగ్గెరె గ్రామ సమీపంలో డ్రైవర్ అదుపు కోల్పోవడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొన్నారు. చళ్లకెరె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బకాయి వేతనాలు చెల్లించరూ రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అతిథి ఉపాధ్యాయులకు బకాయి వేతనాలు చెల్లించాలని ఏఐడీవైఓ డిమాండ్ చేసింది. మంగళవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చెన్నబసవ మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో అక్షర ఆవిష్కార పథకం కింద నియమించుకున్న అతిథి ఉపాధ్యాయులకు బకాయి ఉన్న 10 నెలల గౌరవ వేతనాలను చెల్లించాలన్నారు. అతిథి ఉపాధ్యాయులకు రూ.12,500, సహాయకులకు రూ.6,550 చొప్పున వేతనాలు పెండింగ్లో ఉంచారన్నారు. విద్యా సంవత్సరం ముగిిసి ఏడాది కావస్తున్నా 10 నెలల వేతనాలను చెల్లించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు జిల్లా విద్యాశాఖాధికారి బడిగేర్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. -
ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరు మృతి
హొసపేటె: వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొనడంతో స్థలంలోనే ఇద్దరు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా తిప్పనాయకహళ్లి వద్ద జరిగింది. ఈ ఘటనలో తిప్పనాయకనహళ్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ప్రజ్వల్, బైక్ చోదకుడు గోణి బసప్ప(54) మృతి చెందారు. విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా హొంబలగట్టి క్రాస్ నుంచి తిప్పనాయకనహళ్లి మీదుగా హరపనహళ్లి వైపునకు వేగంగా వెళుతున్న ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో హరపనహళ్లి నుంచి తిప్పనాయకనహళ్లి గ్రామం వైపునకు ఎదురుగా వస్తున్న బైక్ను ట్రాక్టర్ బలంగా ఢీకొంది. బైక్పై స్వంత పని మీద వెళుతున్న భర్త గోణి బసప్ప తలకు బలమైన దెబ్బ తగలడంతో తీవ్ర రక్తస్రావంతో స్థలంలోనే మృతి చెందాడు. బైక్పై వెనుక కూర్చొన్న భార్య ఉమాకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో ఉమా దావణగెరె ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. హరపనహళ్లి డీఎస్పీ డాక్టర్ సంతోష్ చౌహాన్, సీఐ మహంతేష్ సజ్జన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై అరసీకెరె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మృతుడు గోణిబసప్ప గాయపడిన ఉమా -
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఆందోళన
సాక్షి బళ్లారి: దేశ ప్రధానిపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు(ఏఐసీసీ) మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బళ్లారిలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. మంగళవారం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను ఖండిస్తూ ర్యాలీ చేసి డీసీసీ కార్యాలయం ముట్టడించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉగ్రవాది(టెర్రరిస్టు) అని సంబోధించిన ఖర్గే తన వక్రబుద్ధిని ప్రదర్శించారని మండిపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేకపోతే కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లిస్తుందని హెచ్చరించారు. గాంధీ కుటుంబం మెప్పు కోసమే.. ఒక కుటుంబం మెప్పు కోసం ఖర్గే ప్రధాని మోదీపై దురహంకార వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలు ప్రజాసామ్య విలువలకు విరుద్ధమన్నారు. దేశంలోనే ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కీలక భూమిక పోషించిన ప్రధాని మోదీని ఉగ్రవాదిగా పేర్కొనడంలో అర్థం లేదన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది ఎవరి హయాంలోనో అందరికీ తెలుసన్నారు. ప్రధాని మోదీ దేశంలోనే అప్రతిమ దేశభక్తుడన్నారు. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానాయకుడని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం, దేశభక్తిని వ్యతిరేకించే వారి మెప్పు పొందాలనుకుంటే ఆ పార్టీ మరింత పతనానికి దారి తీస్తుందన్నారు. ఎమ్మెల్సీ వైఎం.సతీష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ నాయుడు, నగర బీజేపీ అధ్యక్షుడు వెంకటరమణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ డీసీసీ కార్యాలయం ముట్టడి -
సీఎం మార్పు నిర్ణయం హైకమాండ్దే
హుబ్లీ: సీఎం మార్పు విషయం హైకమాండ్ చూసుకుంటుందని, ఈ విషయం గురించి ఎన్ని సార్లు అడిగినా తన వద్ద సమాధానం లేదని జిల్లా ఇన్చార్జి మంత్రి సంతోష్లాడ్ తెలిపారు. మంగళవారం స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణపై కూడా హైకమాండే నిర్ణయిస్తుందన్నారు. సీఎం, డీసీఎం కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ఆయన మాట్లాడుతూ అమిత్ షా, ఇతర బీజేపీ నేతలకు నమ్మకం ఉండేది జ్ఞానేశ్వర్కుమార్పైనే అని అన్నారు. మొన్న లోక్సభలో డీలిమినేషన్ బిల్లు వచ్చింది. జ్ఞానేశ్కుమార్ లోక్సభలో ఉండి ఉంటే అది కూడా పాస్ అయ్యేది. ఇప్పుడేమో 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుస్తారని అంటే ఆ క్రెడిట్ అంతా జ్ఞానేష్కుమార్కే దక్కుతుందన్నారు. మాకే గెలుపు అవకాశాలు మేం డీఎంకేతో కలిసి తమిళనాడులో గెలుస్తాం. కేరళలో యూడీఎఫ్తో కలిసి విజయం సాధిస్తాం. పశ్చిమ బెంగాల్ టీఎంసీ గెలుస్తుంది. కాంగ్రెస్ అస్సాంలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫలితాలు ఏం అవుతాయో వేచి చూడాలన్నారు. ఆప్ ఎంపీల బీజేపీలో చేరికపై ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ కమల కాదది, వాషింగ్ పౌడర్ నిర్మ అని ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీకి వాషింగ్ మిషన్ ఉంది. గతంలో వాషింగ్ పౌడర్ నిర్మ నిమప్ప మాడిద కర్మ అని తమాషా చేసేవారం. ఏవైనా ఎత్తులు జిత్తులు వేసి బీజేపీలో చేరితే చాలు వాళ్లు 24 క్యారెట్ల బంగారం అయిపోతారు. ఇది బీజేపీ తంత్రం అని ఎద్దేవా చేశారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను తీసుకొని ఏం చేస్తారు? పంజాబ్ సర్కారు కూల్చివేతకు ప్రయత్నిస్తారని ఆరోపించారు. మంత్రి సంతోష్లాడ్ -
ఆస్పత్రిలో నవజాత శిశువు మృతి
రాయచూరు రూరల్: తల్లీబిడ్డల ఆస్పత్రిలో నవజాత శిశువు మరణంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేిపట్టిన ఉదంతం జిల్లాలోని సింధనూరులో చోటు చేసుకుంది. సింధనూరులోని తల్లీ బిడ్డల ఆస్పత్రిలో ఈనెల 22న కవితాళ మండలం జంగమర హళ్లికి చెందిన పారమ్మ కాన్పు కోసం వచ్చి చేరింది. వారం రోజుల నుంచి మామూలు కాన్పులు అవుతాయంటూ కాలం గడిపారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రిలో రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. ఉన్నఫళంగా శిశువుకు ఊపిరాడటం ఇబ్బందిగా ఉందని ఈనెల 27న ఆపరేషన్ ద్వారా శిశువును వెలికి తీయగా తనువు చాలించింది. కుటుంబ సభ్యులు మృతి చెందిన శిశువుతో ఆస్పత్రిలోనే ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా కడుపులోనే బిడ్డకు ఊపిరాడక చనిపోయిందని, తమ ప్రయత్నాలు తాము చేసినా ఫలితం లేకపోయిందని ఆస్పత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ కావేరి తెలిపారు. సేవల్లో వైద్యులు విఫలమంటూ ఆందోళన రాయచూరు జిల్లా సింధనూరులో ఘటన -
ఖరీఫ్కు ముందే ధరలు జిగేల్
రాయచూరు రూరల్: జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాక మునుపే విత్తనాలు, ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయి. రైతులు కూడా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై రాయితీ పెంచినా కాంప్లెక్స్ ఎరువుల ధరలకు రెక్కలొచ్చాయి. కంపెనీలు ఒక్కొక్క బస్తాకు రూ.75 నుంచి రూ.300 వరకు ధరలు పెంచాయి. గతంలో రూ.50 నుంచి రూ.100 వరకు పెంచారు. యూరియా, డీఏపీ మినహా ఇతర రకాల ఎరువుల ధరలు పొటాష్పై రూ.125 పెంచారు. మెట్ట భూముల్లో పత్తి, జొన్న, వేరుశనగ, కంది వేస్తుంటారు. రైతులు నత్రజని, భాస్వరం వంటి వాటి ధరలు అధికంగా విక్రయిస్తున్నారు. గత ఏడాది 1000 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయం కాగా ఈ ఏడాది 4000 మెట్రిక్ టన్నులను విక్రయించారు. మార్కెట్ ధరలు రూ.265 కాగా, నల్ల బజార్లో రూ.500 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. 3.44 లక్షల హెక్టార్లలో విత్తన లక్ష్యం ఈ ఏడాది 3.44 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయడానికి ప్రణాళిక సిద్ధమైంది. 84 వేల హెక్టార్లు నీటిపారుదల భూములు కాగా మిగిలిన హెక్టార్లలో ఏకదళ, ద్విదళ ధాన్యాలు, వాణిజ్య పంటలు పండించడానికి అవకాశం ఉంది. జిల్లాలో 1.71 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉంది. కేఎస్ఎంఎఫ్లో 7393 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ దుకాణాల్లో 738.10 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉంది. 90 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉంది. ఖరీఫ్కు సరిపడా ఎరువులు నిల్వ ఉన్నాయని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ వెల్లడించారు. జిల్లాలోని 35 రైతు కేంద్రాల్లో రైతులకు ఎరువులు, క్రిమి సంహారక మందులు నిల్వ ఉన్నాయని తెలిపారు. రాయచూరు తాలూకాలోని ఓ రైతు కేంద్రం వద్ద సమాలోచనలో రైతులు ఖరీఫ్ కోసం ఓ గోదాములో నిల్వ ఉన్న వివిధ రకాల ఎరువుల బస్తాలు విత్తనాలు, ఎరువుల కొరత ప్రారంభం కాంప్లెక్స్ రకం ఎరువుల ధరలకు రెక్కలు -
గంజాయి కేసుకు భయపడి విద్యార్థి ఆత్మహత్య
హుబ్లీ: పరువు పోతుందని గంజాయి కేసుకు భయపడి ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ధార్వాడ జిల్లాలో చోటు చేసుకుంది. గిరినగరలోని ఓ ఇంట్లో ఆదిత్య మ్యాగేరి(27) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిత్య కిటిల్ కళాశాలలో బీఎస్సీ చదివేవాడు. గత శనివారం విద్యాగిరి పోలీసులు ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సేవించాడని, పరీక్ష చేయించగా నెగిటివ్ నివేదిక వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులు సుమారు 40 మందికి పైగా యువకులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి కేసులో నెగిటివ్ నివేదిక వచ్చినా ఆదిత్య నుంచి రూ.2,000 పోలీసులు లంచంగా తీసుకున్నారు. అసలు రూ.10,000 డిమాండ్ చేయగా అనంతరం రూ.2,000లతో సరి పెట్టుకున్నారు. దీంతో గంజాయి కేసులో తన పరువు పోయిందన్న బాధతో ఆదిత్య మ్యాగేరి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నా బిడ్డ చావుకు పోలీసులే కారణం కుమారుడి చావు తల్లి మనసును కలిచి వేసింది. తన కుమారుడి చావుకు పోలీసులే కారణమని ఆమె ఆరోపించారు. కుమారుడి శవం వద్ద మార్చురీ ఎదుట ఆ తల్లి కన్నీటి తడి అందరి గుండెలను పిండేసింది. మరో వైపు గంజాయి పరీక్ష వేళ పాజిటివ్ వచ్చిన వారి నుంచి పోలీసులు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు ఫోన్పే ద్వారా సొమ్ములు రాబట్టినట్లు సమాచారం. ఆ అవకాశం లేని వారి నుంచి మూడో వ్యక్తి ద్వారా కూడా డబ్బులు వేయించుకున్నట్లు, లంచం ఇవ్వక పోతే వేరే కేసులో పెట్టి లోపలికి వేస్తామని బెదిరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు లంచగొండి కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బుడా బృందం ముంబై అధ్యయన పర్యటన
బళ్లారిఅర్బన్: నగరాభివృద్ధికి కొత్త దిశను అన్వేషించే ఉద్దేశంతో బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (బుడా) అధ్యక్షుడు జేఎస్ ఆంజనేయులు ఆధ్వర్యంలో మేయర్ పీ.గాదెప్పతో పాటు సభ్యుల బృందం ముంబై నగరానికి ప్రగతి పరిశీలన అధ్యయన పర్యటన చేపట్టింది. బృందం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంఎంఆర్డీఏ) కార్యాలయాన్ని సందర్శించి, ప్రాధికార సంస్థ కమిషనర్ సంజయ్ ముఖర్జీ, చీఫ్ అర్బన్ ప్లానర్ శంకర్ దేశ్పాండే, సాంకేతిక అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో మహానగరాల సమగ్ర మాస్టర్ ప్లాన్, స్థిరమైన నగరాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ, నివాస వసతుల మెరుగుదల వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం మహానగరాలు ఎదుర్కొంటున్న జనాభా పెరుగుదల, గృహాల కొరత, ట్రాఫిక్ రద్దీ, నీటి సరఫరా, మలినాల నిర్వహణ సమస్యలను విశ్లేషిస్తూ, వాటికి దీర్ఘకాలిక పరిష్కార మార్గాలపై అధికారులు అభిప్రాయాలు పంచుకున్నారు. బళ్లారిలో అమలుపై చర్చ ముంబైలో అమలు చేస్తున్న ఆధునిక ప్రాజెక్టులు, సాంకేతిక ఆధారిత నగర నిర్వహణ విధానాలను బళ్లారిలో అమలు చేసే అవకాశాలపై కూడా చర్చించారు. ఈ అధ్యయన పర్యటనలో బుడా సభ్యులు కే.రంజిత్ కుమార్, కేఎస్.భరత్కుమార్, నగర ప్రణాళిక సభ్యుడు ఎన్టీ శంకర్రెడ్డి తదితర బుడా సిబ్బంది పాల్గొన్నారు. ముంబై నమూనాను అధ్యయనం చేయడం ద్వారా బళ్లారి నగర సమగ్ర అభివృద్ధికి కొత్త ప్రణాళిక రూపొందించడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని సభ్యులు పేర్కొన్నారు. ఈ అధ్యయనంపై ఆధారపడి త్వరలోనే బళ్లారిలో ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన రహదారుల నెట్వర్క్, సమగ్ర నగర ప్రణాళిక, పర్యావరణ అనుకూల అభివృద్ధి కార్యక్రమాల అమలుకు తగిన చర్యలు తీసుకుంటామని బుడా అధికారులు తెలిపారు. మహానగర అభివృద్ధి నమూనాపై విస్తృత చర్చ -
సామాన్యుడి పెళ్లికి ప్రధాని శుభాశీస్సులు
రాయచూరు రూరల్(కర్ణాటక): పల్లెటూరులో పెళ్లి చేసుకుంటున్నానని ఓ సామాన్య యువకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పెళ్లి పత్రికను పంపగా అక్కడి నుంచి వరుడికి ప్రత్యుత్తరం లభించిన ఘటన రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా కానిహాళలో జరిగింది. తాను ఈనెల 13న సవితతో వివాహం నిశ్చితార్థం చేసుకున్నానని, తమరు వివాహానికి హాజరు కావాలంటూ గ్రామానికి చెందిన రాజేష్ నాయక్ అనే సామాన్యుడు పంపిన శుభలేఖకు ప్రధాని కార్యాలయం నుంచి నూతన వధూవరులకు శుభాశీస్సులు పలుకుతూ జవాబు ఇవ్వడం వైరల్గా మారింది. భవిష్యత్తులో నూతన దంపతుల వైవాహిక జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా గడపాలని ఆ లేఖలో ఆకాంక్షించారు. -
87కు బదులు 47 మార్కులు
బెంగళూరు: పగలూ రాత్రీ కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్న ఒక పేద విద్యార్థిని కలలపై మూల్యాంకనం పొరపాటు నీళ్లు చల్లింది. చిక్కనాయకనహళ్లి తాలూకా, మేలనహళ్లిలోని కిత్తూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని కె.అంకిత మూల్యాంకనంలో మాస్టార్ల పొరపాటు వల్ల అన్యాయానికి గురైంది. అంకిత తండ్రి గతంలో మరణించాడు, తల్లి గార్మెంట్స్లో పనిచేస్తూ చదివిస్తోంది. ఇటీవల విడుదలైన ఎస్ఎస్ఎల్సీ ఫలితాలలో అంకితకు కన్నడలో 47 మార్కులు వచ్చాయి. అనుమానంతో తనిఖీ చేయగా ఆమె కన్నడలో ఎంతో ప్రావీణ్యం ఉన్న విద్యార్థిని, పరీక్ష కూడా బాగా రాసింది. దీంతో అనుమానం వచ్చి ఆమె పాఠశాల ఉపాధ్యాయులు, మార్కుల షీటును పరిశీలించారు. అందులో తేడా కనిపించింది. అన్ని సమాధానాలకు వచ్చిన మార్కులను కలిపితే, మొత్తం 87 మార్కులు ఉన్నాయి, కానీ మూల్యాంకనం చేసిన మాస్టారు ఎవరో కానీ 47 అని నమోదు చేశారు. ఈ పొరపాటు వల్ల తన కూతురికి అన్యాయం జరిగిందని, సరిచేయాలని తల్లి లలితమ్మ కోరింది. తప్పు చేసినవారికి శిక్ష పడాలని డిమాండ్ చేసింది. -
పోలీసులారా.. ఇదేం పని?
బెంగళూరు: పోలీసులు ఏమైనా చేయగలరు. నిజమైన నేరాలపై విచారణ చేయకుండా ప్రజలను తిప్పించుకుంటారు అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న అసంతృప్తి వ్యక్తంచేశారు. ఓ కేసులో పోలీసుల తీరును తప్పబట్టారు. రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా ఎంకె దొడ్డి పోలీసుస్టేషన్ పరిధిలో 2024లో రెండు పశువులు అదృశ్యమయ్యాయి. రెండేళ్ల తరువాత పశువుల సొంతదారు పక్కింటి వ్యక్తి సహా నలుగురిపై కేసు పెట్టాడు. తమకు సంబంధమే లేదని, ఈ కేసును కొట్టేయాలని మంగళమ్మ అనే నిందితురాలు హైకోర్టులో అర్జీ దాఖలు చేసింది. రెండేళ్ల తరువాత పొరుగింటివారిపై ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని పోలీసులను జడ్జి ప్రశ్నించారు. కనీస విచారణ జరపలేదని, ఇది చట్ట ఉల్లంఘన అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పశువులను వెతకటం మానేసి, సమాజంలో జరుగుతున్న తీవ్రమైన, నిజమైన నేరాల వెంటపడాలి. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఇలాంటి కేసులు మళ్లీ తమ దృష్టికి వస్తే పోలీసులపై కఠినంగా వ్యవహరిస్తానని తెలిపారు. -
అందుకే కిరణ్కు నిప్పంటించా!
ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకుని వెస్ట్రన్ స్టయిల్లో ప్రపోజ్ చేస్తానంటూ కుర్చీకి కట్టేసి మరీ తగలబెట్టి చంపేసింది ఓ ప్రియురాలు. ఈ కేసు దేశవ్యాప్తంగా.. అందునా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. ఈ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనతో వివాహానికి కిరణ్ ఒప్పుకున్నాడని నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ చెబుతోంది.బెంగళూరులో ప్రియున్ని తన ఇంట్లో కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ నెమ్మదిగా నిజాలు బయటపెడుతోంది. కిరణ్ను తాను చాలా ప్రేమించేదాన్నని, అయితే అతడు మాత్రం శారీరక అవసరాలు తీర్చే వస్తువుగా తనను భావించేవాడని అంటోంది.వారం కిందట(21 ఏప్రిల్) బెంగళూరు శివారులోని బైదరహళ్లి పీఎస్ పరిధిలోని అంజనానగర్లో ఈ దారుణం జరిగింది. తుమకూరుకు చెందిన కిరణ్.. నగరంలోని ఓ మొబైల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ప్రేమ(ప్రేరణ)తో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత.. కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాంట్, షర్ట్ ఊడదీసి కళ్లకు గంతలు కట్టింది. అనంతరం కాళ్లు, చేతులూ కట్టేసింది.ఆ సమయంలో కిరణ్ కంగారుపడ్డాడు. అయితే.. పాశ్చాత్య దేశాల్లో ఇలాగే చేస్తారని, తానూ అలా వినూత్నంగా ప్రేమను వ్యక్తం చేస్తానని (Love Proposal) నమ్మించింది. ఆ వెంటనే కిరోసిన్ పోసి నిప్పటించి తన మొబైల్లో రికార్డు చేసింది. స్థానికులు వచ్చేలోపే హాహాకారాలు చేస్తూ కుర్చీలోనే కిరణ్ సజీవదహనమయ్యాడు. ఘటన జరిగినప్పుడు తాను బాత్రూమ్లో ఉన్నానని, పొగ రావడంతో గమనించి బయటకు వచ్చేసరికి కిరణ్ కుర్చీలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు చెప్పింది. అయితే, ఆమె తీరుపై అనుమానంతో పోలీసులు గట్టిగా విచారించారు. దీంతో పథకం ప్రకారమే ప్రేమ అతడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.నార్త్వెస్ట్ డీసీపీ డీఎల్ నగేష్ నేతృత్వంలోని టీం నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించింది. తొలుత దూరం పెడుతున్నాడనే అతన్ని హత్య చేసిందని అంతా భావించారు. అయితే.. ‘‘కిరణ్ను తాను ఎంతో ప్రేమించానని.. కానీ, అతను తనను ఎంతో అవమానించేవాడని ప్రేమ పోలీసుల వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. ‘కిరణ్ నన్ను శారీరక అవసరాల కోసం వాడుకుంటున్నాడన్న విషయం నాకు ఆలస్యంగా అర్థమైంది. పెళ్లి చేసుకుందామని అడిగా. ‘నువ్వు కులం తక్కువదానివి.. మా ఇంట్లో ఒప్పుకోరు’ అనేవాడు. ఈ విషయం ప్రేమించినప్పుడు.. కలిసి తిరిగినప్పుడు తెలియదా? అని గట్టిగా నిలదీశా. దీంతో పెద్దల్ని ఒప్పించి ఎలాగోలా వివాహం చేసుకుంటానన్నాడు. అయితే.. పెళ్లి తర్వాత కూడా కేవలం శారీరక అవసరం కోసమే తనతో ఉంటానని చెప్పేవాడు. ఆ మాట నాతోనే కాదు.. అతని స్నేహితుల వద్ద చెబుతూ నన్ను బూతులు తిట్టేవాడు. ఆ విషయం అతని స్నేహితులు రికార్డ్ చేసి పంపారు. నన్ను వాడుకుంటూ నన్నే తిట్టడం, అవమానించడం ఎంతో బాధించింది. భరించలేకపోయా.. అందుకే నిప్పు పెట్టి చంపేశా’’ అని పోలీసుల ముందు ప్రేరణ కన్నీళ్లతో నిజం ఒప్పుకుంది. -
మహిళల్ని ముందు, వెనుక వీడియోలు తీసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారా?
యశవంతపుర: బెంగళూరులో నమ్మ మెట్రో రైళ్లలో ప్రయాణించే యువతులు, మహిళ ఫోటోలను రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వికృతానందం పొందే నిందితునికి హైకోర్టులో మందలింపు దక్కింది. తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని వేసిన ఫిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు బీకే దిగంత్.. బెంగళూరు మెట్రో చిక్స్ అనే ఇన్స్టా ఖాతాలో ఈ ఫోటోలు, వీడియోలను పోస్టు చేసేవాడు. గత ఏడాది మేలో బనశంకరి పోలీసులు విచారణ జరిపి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తనపై కేసు చెల్లుబాటు కాదని, కొట్టేయాలని నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ అర్జీని విచారించిన న్యాయమూర్తి.. నిందితునిపై భగ్గుమన్నారు. మహిళలను ఎక్కడా సురక్షితంగా ఉండనివ్వరా? అని దిగంత్ను నేరుగా ప్రశ్నించారు. ఇలా చేయడం చూస్తే నీకు మానవత్వం ఉందా? అంటూ అర్జీని కొట్టివేశారు. మహిళలను ముందు, వెనుక నుంచి వీడియో తీసి ఎడిట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారా?, మీరు ఎలాంటి మనుషులు అని జడ్జి ఆగ్రహించారు. నిందితుని న్యాయవాది వాదిస్తూ, మహిళలు ఎవరూ ఫిర్యాదు చేయలేదు, పోలీసులు సుమోటో కేసుగా నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి నేరానికి పాల్పడలేదని అన్నారు. అయితే సాంకేతిక అంశాలను చూపించి తప్పించుకోలేదని న్యాయమూర్తి చురకలు ముట్టించారు. కొన్ని విషయాలలో నైతికత, భద్రత ముఖ్యమన్నారు. మహిళల అనుమతి లేకుండా అశ్లీలంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమే పెద్దనేరమని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
87కు బదులు 47 మార్కులు
తుమకూరు: పగలూ రాత్రీ కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్న ఒక పేద విద్యార్థిని కలలపై మూల్యాంకనం పొరపాటు నీళ్లు చల్లింది. చిక్కనాయకనహళ్లి తాలూకా, మేలనహళ్లిలోని కిత్తూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని కె.అంకిత మూల్యాంకనంలో మాస్టార్ల పొరపాటు వల్ల అన్యాయానికి గురైంది. అంకిత తండ్రి గతంలో మరణించాడు, తల్లి గార్మెంట్స్లో పనిచేస్తూ చదివిస్తోంది. ఇటీవల విడుదలైన ఎస్ఎస్ఎల్సీ ఫలితాలలో అంకితకు కన్నడలో 47 మార్కులు వచ్చాయి. అనుమానంతో తనిఖీ చేయగా ఆమె కన్నడలో ఎంతో ప్రావీణ్యం ఉన్న విద్యార్థిని, పరీక్ష కూడా బాగా రాసింది. దీంతో అనుమానం వచ్చి ఆమె పాఠశాల ఉపాధ్యాయులు, మార్కుల షీటును పరిశీలించారు. అందులో తేడా కనిపించింది. అన్ని సమాధానాలకు వచ్చిన మార్కులను కలిపితే, మొత్తం 87 మార్కులు ఉన్నాయి, కానీ మూల్యాంకనం చేసిన మాస్టారు ఎవరో కానీ 47 అని నమోదు చేశారు. ఈ పొరపాటు వల్ల తన కూతురికి అన్యాయం జరిగిందని, సరిచేయాలని తల్లి లలితమ్మ కోరింది. తప్పు చేసినవారికి శిక్ష పడాలని డిమాండ్ చేసింది. టెన్త్ విద్యార్థినికి అన్యాయం మూల్యాంకనంలో పొరపాటు -
ఏసీ కార్యాలయ పరికరాల జప్తు
హుబ్లీ: శ్మశానానికి సంబంధించిన భూమిని స్వాధీనం చేసుకొని సదరు భూమికి పరిహారం చెల్లించని నేపథ్యంలో ధార్వాడ రెండవ అదనపు సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు కోర్టు సిబ్బంది ధార్వాడ సహాయక కమిషనర్ కార్యాలయంలోని పరికరాలను జప్తు చేశారు. జిల్లాలోని నవలగుంద తాలూకా కొండికొప్ప గ్రామానికి చెందిన నాగనగౌడ పాటిల్ అనే వ్యక్తికి చెందిన రెండు ఎకరాల భూమిని 2010 ఏప్రిల్ 8న స్వాధీనం చేసుకున్నారు. రూ.35 లక్షల పరిహారం చెల్లించాల్సింది గ్రామంలో ప్రైవేట్ పొలంలో అంత్యక్రియలు చేస్తున్నందు వల్ల శ్మశాన స్థలం కోసం స్వాఽధీనం చేసుకున్న ఈ భూమిలో ప్రతి గుంటకు రూ.10,500 చొప్పున మొత్తం రూ.35 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది. జిల్లా యంత్రాంగం రూ.20 లక్షలు ఇవ్వగా ఇంకా రూ.15 లక్షలు బకాయి ఉన్న నేపథ్యంలో సదరు రైతు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు కార్యాలయ పరికరాల జప్తునకు ఆదేశాలు ఇచ్చింది. తహసీల్దార్ అభ్యర్థనతోనే భూమి ఇచ్చాం ఈ విషయమై రైతు సోదరుడు భీమన గౌడ మాట్లాడుతూ గ్రామంలో శ్మశానానికి స్థలం లేదు. ప్రైవేట్ స్థలంలో అంత్యక్రియలు జరిపే వారు. దీంతో తహసీల్దార్ తమను భూమిని ఇవ్వమని అడిగారు. దీంతో మేం పొలాన్ని ప్రభుత్వానికి ఇచ్చాం. ఆ ప్రకారం భూ స్వాధీనం అయింది. అయితే డబ్బులు చెల్లించలేదు. దీంతో కోర్టుకు వెళ్లాం. జిల్లా యంత్రాంగం నుంచి రూ.15 లక్షల బకాయి ఉన్నందు వల్ల మరోసారి కోర్టు వెళ్లి స్టే తెచ్చాం. అయినా తమకు డబ్బులు చెల్లించలేదు. పరిహారం చెల్లింపునకు చాలా వేధించారు. బకాయి చెల్లించనందుకే జప్తు రూ.15 లక్షలు బకాయిలు చెల్లించని కారణంగా కోర్టు నుంచి వారెంట్ జారీ కావడంతో జప్తు చేశారన్నారు. న్యాయవాది శివాని పాటిల్ వివరిస్తూ భూస్వాధీనం చేసుకున్న పొలానికి పరిహారంగా రూ.35 లక్షలు చెల్లించాలి. అందులో రూ.20 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.15 లక్షలు ఇంకా బకాయి ఉంది. ఈ విషయంలో ఎన్నో సార్లు ఆఫీసుకు వెళ్లి అడిగాం. అయినా ఇవ్వలేదు. మేం నాలుగు చెయిర్లు, ఓ కంప్యూటర్ను జప్తు చేశామని న్యాయవాది వివరించారు. రైతుకు భూ పరిహారం చెల్లించనందుకు కోర్టు ఆదేశం -
డాక్టర్ కుటుంబానికి పోకిరీ వేధింపులు
మైసూరు: వైద్యుని కుమార్తె చిత్రాలను గ్రాఫిక్స్తో అశ్లీలంగా మార్చి అందరికీ పంపిస్తున్న దుండగుని ఉదంతమిది. ఈ మేరకు బాధిత తండ్రి సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. నిందితుడు గత డిసెంబరులో తాను, తన కుమార్తె, అల్లుడు తదితరులకు ఆ అశ్లీల చిత్రాలను ఈమెయిల్ చేశాడని తెలిపారు. ఆ తర్వాత ఏప్రిల్ 3న, అవే ఫోటోలు మైసూరులోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి కూడా వెళ్లాయి. ఫోటోలను అందరికీ పంపుతూ ఇబ్బందులు సృష్టిస్తున్నాడని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.కలబుర్గిలో కామాంధ వార్డెన్దొడ్డబళ్లాపురం: అర్ధరాత్రి విద్యార్థినులకు వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ నగ్న ఫోటోలు పంపించాలని సతాయిస్తున్న హాస్టల్ వార్డెన్ ఘనకార్యమిది. కలబుర్గి జిల్లా అఫ్జల్పురలోని బీసీఎం హాస్టల్లో వార్డెన్ హనుమంత బిరాదారపై ఈ మేరకు కేసు నమోదైంది. అర్ధరాత్రి వేళ నగ్న ఫోటోలు, స్నానం చేసే దృశ్యాలు పంపించాలని, అలా చేస్తే విహారయాత్రలకు తీసుకువెళ్తానని ఫోన్లకు మెసేజ్లు పంపిస్తున్నాడని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు మొరపెట్టుకున్నారు. అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు
సాక్షి,బళ్లారి: దేశంలో గ్రామ స్థాయి నుంచి మహిళలకు రిజర్వేషన్ తెచ్చిన ఘనత, చట్టసభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న సంకల్పం కూడా కాంగ్రెస్ పార్టీదేనని, అలాంటి కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎందుకు అడ్డుకుంటుందని, కేవలం బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరతీసి, డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలు అడ్డుకున్నాయని సండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ, ఎమ్మెల్సీ నాగమణి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కమలా మరిస్వామి ధ్వజమెత్తారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీజేపీపై వారు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 2023లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను అమలు చేసేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అందుకు అన్ని పార్టీలు కూడా సమ్మతి తెలిపాయన్నారు. అలాంటిది మళ్లీ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్ అమలు చేస్తే దక్షిణ భారత దేశానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని సూచించారు. జనాభా నియంత్రణను దక్షిణ భారత దేశ ప్రజలు పాటిస్తే, ఉత్తర భారత దేశ ప్రజలు జనాభా నియంత్రణ పాటించకపోవడంతో అక్కడ విపరీతంగా జనాభా పెరిగి సీట్లు పెంచితే దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే తమిళనాడులోని డీఎంకే, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు తీవ్రంగా ఖండించారని గుర్తు చేశారు. బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎత్తుగడ వేసి, మహిళలను మభ్య పెట్టాలని చూస్తున్నారన్నారు. అసలు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న ఆలోచన బీజేపీకి లేదన్నారు. ఉండి ఉంటే ప్రస్తుతం ఉన్న సీట్ల ఆధారంగా వెంటనే అమలు చేసి మాట్లాడాలన్నారు. మహిళలను ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారన్నారు. 2014 నుంచి వరుసగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అప్పుడే ఈ బిల్లును ఎందుకు అమలు చేయలేదు? అని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ అమలు చేయకపోగా కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతూ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎవరు తప్పు చేస్తున్నారో మహిళలకు బాగా తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లోగా అమలు చేయకపోతే బీజేపీ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. మాజీ మేయర్ మోదుపల్లి రాజేశ్వరి, ఆశాలత, మంజుల తదితరులు పాల్గొన్నారు. మహిళల రిజర్వేషన్కు పునాది వేసిందే కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీజేపీ కుట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రజాప్రతినిధుల ధ్వజం -
ఎస్సీ వర్గీకరణ ఖరారు
బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కులాల జాబితాలోని సముదాయాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ వర్గీకరణ ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జస్టిస్ హెచ్ఎన్ నాగమోహన్దాస్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఎస్టీలలో మొత్తం 101 జాతులను ప్రధానంగా మూడు వర్గాలుగా విభజన చేసి ప్రస్తుతం 17 శాతం ఉన్న రిజర్వేషన్ను కేటాయించారు. జనసంఖ్యను బట్టి మిగతా సముదాయాలకు 6, 5 శాతం చొప్పున కల్పించారు. వర్గీకరణ ప్రక్రియ వల్ల నిలిపివేసిన ఉద్యోగ నియామకాలను తక్షణం ప్రారంభించాలని ఆదేశించింది. నిరుద్యోగుల వయో పరిమితిని సడలించాలని తీర్మానించింది. ఈనేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ బెంగళూరులోని కేఏఎస్ల సంఘం ఆఫీసులో సమావేశంలో పాల్గొన్నారు. -
వైభవంగా వాసవీ జయంతి
రాయచూరు రూరల్: నగరంలో వాసవీ జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు జరిగిన ఉత్సవాలకు ఆదివారం రాత్రి తెరదించారు. నగరేశ్వర దేవస్థానంలో ఆర్యవైశ్య సభ్యుల ఆధ్వర్యంలో దేవికి పూజలు, రథోత్సవం జరిగాయి. వాసవీ జయంతి సందర్భంగా వెండి, స్వర్ణ రథోత్సవాలను నెరవేర్చారు. నగరేశ్వర దేవస్థానం నుంచి వివిధ కూడళ్లలో దేవి విగ్రహాన్ని ఊరేగించారు. రథోత్సవాల్లో మంత్రి బోసురాజు, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, ఆర్య వైశ్య సమాజం అధ్యక్షుడు పురుషోత్తం, పద్మరాజ్, జగదీష్, వీరేష్, వెంకణ్ణ, గోవిందు, పలుగుల నాగరాజ్, దత్తాత్రేయ, శ్రీనివాస్లున్నారు. -
నందీశ్వరుని ప్రతిష్టాపన
గౌరిబిదనూరు: తాలూకాలోని అలకాపురంలోని పురాతన చన్నసోమేశ్వరుని దేవాలయం ఆవరణంలో నందీశ్వరుని విగ్రహాన్ని సోమవారం ప్రతిష్టించారు. అయోధ్య రామ మందిరంలో బాల రాముని విగ్రహాన్ని చెక్కిన మైసూరు శిల్పి యోగిరాజ్ ఈ నంది విగ్రహాన్ని కూడా మలిచారు. సిద్దరబెట్ట వీరభద్ర శివాచార్య స్వామీజీ ఆధ్వర్యంలో వేద పండితులు, ప్రముఖుల సమక్షంలో ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఎమ్మెల్యే పుట్టస్వామిగౌడ, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తమ్ముని ఇంటిపై సోదరి దాడి బనశంకరి: ఆస్తి వివాదంలో తమ్ముని ఇంటికి నిప్పుపెట్టడానికి ప్రయత్నించిందో అక్క. ఈ ఘటన బెంగళూరులో సిద్దాపుర ఠాణా పరిధిలోని జయనగర బైరసంద్రలో సోమవారం జరిగింది. సోదరుడు ఉమేశ్ ఇంటిలోకి అక్క మీనాక్షి, భర్త, పిల్లలు చొరబడటానికి ప్రయత్నించారు. కొడవలి, కట్టెలతో ఇంటి కిటికీలు, తలుపులను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలను నాశనం చేశారు. పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు అంటించడానికి ప్రయత్నించారు. ఇంట్లో దాక్కున్న ఉమేశ్ భార్య అశ్విని, కుటుంబసభ్యులు ప్రాణభయంతో హడలిపోయారు. వారు డయల్ 112 కు ఫోన్ చేసి చెప్పగా కొంతసేపటికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అశ్విని సిద్దాపుర ఠాణాలో ఫిర్యాదు చేసింది. మహిళా టెక్కీ ఆకస్మిక మృతి యశవంతపుర: హాసన్ జిల్లాలో మహిళా టెక్కీ ఆకస్మికంగా మరణించింది. తల లోపల తీవ్రమైన రక్తస్రావం కావడంతో కోమాలోకి వెళ్లి, చికిత్స పొందుతూ బేలూరు తాలూకా బండిలక్కనకొప్పలు గ్రామానికి చెందిన శ్వేత (25) కన్నుమూసింది. ఆమె హాసన్లోని ఓ కంపెనీలో మూడేళ్ల నుంచి టెక్కీగా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోందని తల్లిదండ్రులు గంగాధర–సరోజ తెలిపారు. తలనొప్పిగా ఉందంటూ చెప్పి స్పృహ తప్పి పడిపోయిందని, ఆస్పత్రిలో చేర్చినా ఫలితం లేదని విలపించారు. మహిళ అనుమానాస్పద మృతి బనశంకరి: బెంగళూరు గౌడహళ్లిలో వాషింగ్ మెషిన్ నుంచి కరెంటు షాక్ కొట్టడంతో ఓ మహిళ మరణించినట్లు ఆమె భర్త చెబుతున్నాడు. ఆమె తల్లిదండ్రులు అల్లుడే ఏదో చేశాడని అనుమానం వెలిబుచ్చారు. వివరాలు.. తుమకూరు హెగ్గెరె నివాసులైన పాండురంగయ్య, భాగ్యమ్మ దంపతుల నాలుగో కుమార్తె సుజాత (30)కు పదేళ్ల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతన్తో వివాహమైంది. సోమవారం ఉదయం వాషింగ్మెషిన్లో బట్టలు వేయడానికి స్విచ్ ఆన్ చేయగా కరెంటు షాక్ కొట్టి చనిపోయిందని భర్త తెలిపాడు. ఇది అబద్ధమని, భర్త కుట్ర ఉందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. డీకేకు చాన్స్ వస్తుంది: ఎమ్మెల్యే దొడ్డబళ్లాపురం: సిద్ధరామయ్య తరువాత సీఎం రేస్లో ఉన్నది ఒక్క డీకే శివకుమార్ మాత్రమేనని, ఈ అవధిలోనే డీకేకి సీఎం చాన్స్ లభిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్సీ బాలక్రిష్ణ అన్నారు. రామనగరలో మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి డి.సుధాకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వేలిముద్ర వేయించుకోవడానికి సుధాకర్ వద్దకు ఎవరో వెళ్లారని కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి అనడం సిగ్గుచేటన్నారు. ఇలా మాట్లాడతారనుకోలేదన్నారు. డీకే శివకుమార్,డీ సుధాకర్ మంచి స్నేహితులని, ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి వెళ్లారన్నారు. హైకమాండ్ మంత్రిమండలి విస్తరణను ఎందుకు ఆలస్యం చేస్తోందో తెలీడం లేదన్నారు. రేసు కారు పల్టీలు దొడ్డబళ్లాపురం: చిక్కమగళూరు జిల్లా మూడిగెరెలో డర్ట్ ట్రాక్ రేస్లో ప్రమాదం చోటుచేసుకుంది. రేస్లో మట్టి రోడ్డులో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి మూడుసార్లు పల్టీలు కొట్టింది. ఈ సంఘటనతో నిర్వాహకులు, ప్రేక్షకులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
నీటికుంటలో తల్లీబిడ్డ శవాలు
దొడ్డబళ్లాపురం: పొలంలో నీటి కుంటలో పడి తల్లీ , బిడ్డ అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంఘటన బెంగళూరు శివార్లలో ఆనేకల్ తాలూకా లక్ష్మిసాగర్ గ్రామంలో జరిగింది. గ్రామవాసి సంపత్ భార్య లావణ్య (28), కుమార్తె లక్షిత (8) శివారులోని ఓ పొలంలోని ఫారంపాండులో శవాలై తేలారు. ఇది ప్రమాదమా, హత్యా, ఆత్మహత్యా అనేదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. లావణ్య తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త సంపత్ హత్య చేసి నీటికుంటలో పడేసి ఉంటాడని అతనిపై సూర్యనగర ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు విచారణ చేపట్టారు. చెరువులో పడి అక్కా తమ్ముడు.. తుమకూరు: మధుగిరి తాలూకాలోని మిడిగేశి చెరువులో కాసపుర గ్రామానికి చెందిన మంజునాథ పిల్లలు సుచిత్ర (11), రవీంద్ర (9) నీట మునిగి మరణించారు. ఎండగా ఉండడంతో నీటిలో ఆడుకుందామని పిల్లలు చెరువు వద్దకు వెళ్లారు, అలా నీట మునిగి చనిపోయి ఉంటారని అనుమానాలున్నాయి. పిల్లలు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు గాలించగా చెరువులో విగతజీవులగా కనిపించారు. మిడిగేశి పోలీసులు మృతదేహాలను వెలికితీసి మధుగిరి ఆసుపత్రికి తరలించారు. పిల్లలిద్దరూ కానరాని లోకాలకు చేరడంతో తల్లిదండ్రులు పెద్ద పెట్టున విలపించారు. వేసవి సెలవుల్లో పిల్లలను చెరువులు, కుంటల దగ్గరకు పంపకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని విద్యాధికారి హనుమంతరాయప్ప తెలిపారు. ఇలాంటి విషాదం జరగడం విచారకరమని, పిల్లలు దూరంగా వెళ్లకుండా తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని అన్నారు. ఆనేకల్ వద్ద విషాద ఘటన -
బసవణ్ణ ఆదర్శాలు అనుసరణీయం
రాయచూరు రూరల్: సమాజంలో సమానత్వం, న్యాయం, మానవత విలువల కోసం పోరాడిన వ్యక్తి బసవేశ్వరుడని, బసవ తత్వాలు, ఆదర్శాలను అలవర్చుకోవాలని అఖిల భారత వీరశైవ సమాజం జాతీయ అధ్యక్షుడు, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే అభిప్రాయ పడ్డారు. కలబుర్గి జిల్లా సేడంలోని మాతృఛాయ మైదానంలో బసవేశ్వరుడి 893వ జయంతి సంభ్రమాలను ప్రారంభించి మాట్లాడారు. బసవేశ్వరుడి అనుభవ మంటపాన్ని ఆధారంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులపై పార్లమెంట్ను ఏర్పాటు చేిసిన విషయాలను ప్రస్తావించారు. బసవేశ్వరుడి 893వ జయంతి సందర్భంగా 2,000 మందికి ఇష్టలింగ పూజలు చేశారు. 12వ కాలం నాటి బసవాది శరణుల వచనాలను భవిష్యత్ తరాల యువతీ యువకుల కోసం అనువదించాలన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం, రాజకీయంగా ముందుకు రావడానికి అవకాశాలను కల్పించిన మహోన్నత వ్యక్తిగా ప్రస్తావించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, స్వామీజీలు, మాజీ శాసన సభ్యులు పాల్గొన్నారు. మలేరియా నియంత్రణకు సహకరించండి రాయచూరు రూరల్: జిల్లాలో మలేరియా వ్యాధి నియంత్రణకు సహకరించాలని జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ, మలేరియా వ్యాధి అధికారి షాకీర్ పిలుపునిచ్చారు. సోమవారం నగరసభలో జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, తాలూకా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, నగరసభల ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవ జాతానుద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మలేరియా వ్యాధి గురించి వివరించాలన్నారు. ఇంటి పరిసరాల చుట్టు నీరు నిల్వ ఉండకుండా దాని నియంత్రణకు ముందుకు రావాలన్నారు. రక్త పరీక్షల ద్వారా వ్యాధిని కనుగొనడానికి వీలుంటుందన్నారు. సమావేశంలో అధికారులు చంద్రశేఖరయ్య, సంధ్య, జయపాల్ రెడ్డి, సరోజలున్నారు. నారీ శక్తి బిల్లుపై సమర భేరిరాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ లోక్సభలో ప్రవేశ పెట్టిన నారీ శక్తి వందన్ బిల్లును కాంగ్రెస్, ఇతర పార్టీలు తిరస్కరించడాన్ని ఖండిస్తూ బీజేపీ మహిళా మోర్చా నేతలు ఆందోళన చేశారు. సోమవారం కొప్పళలోని గడియారం సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షురాలు దివ్యా అగ్ని మాట్లాడారు. పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నారీ శక్తి వందన్ చట్టం పాస్ కాకుండా అడ్డుకోవడంతో ద్వారా మ హిళలను రాజకీయంగా అణగ దొక్కడమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యమని ఆరోపించారు. -
విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం
రాయచూరు రూరల్: నేటి సమాజంలో విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో పదో తరగతిలో ర్యాంక్లు సాధించిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడారు. క్రమశిక్షణకు ప్రతి రూపమన్నారు. విద్యార్థులు తమ ప్రతిభతో ప్రావీణ్యతను సంపాదించుకోవాలన్నారు. విద్యార్థులు నిరంతరం అధ్యయనశీలురు కావాలన్నారు. విద్యార్థులకు శత్రువులు టీవీ, మొబైళ్లు అని, వాటికి దూరంగా ఉండాలని కోరారు. ఉపాధ్యాయుల కృషి అమోఘం జిల్లాను 21వ స్థానంలో నిలబెట్టడానికి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు, నోడల్ అధికారులు చేసిన కృషిని శ్లాఘించారు. ఆరుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించి జిల్లాకు, తల్లిదండ్రులకు పేరు తెచ్చారన్నారు. ఉపాధ్యాయుల కొరత మధ్య కూడా ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఆరుగురు విద్యార్థులకు పారితోషికంగా రూ.10 వేల చెక్లను అందించారు. సమావేశంలో అదనపు జిల్లాధికారి శివానంద, జెడ్పీ సీఈఓ విజయ్ శంకర్, విద్యాశాఖాధికారి బడిగేర, సురేష్ వర్మ, చంద్రశేఖర్, ఈరణ్ణలున్నారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా
హొసపేటె: బెంగళూరు నుంచి కుష్టగికి ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని బణవికల్లు సమీపంలో హైవే–50 పక్కన ఉన్న గుంతలోకి బోల్తా పడిపోవడంతో 9 మంది ప్రయాణికులు గాయపడిన ఘటన సోమవారం తెల్లవారు జామున సుమారు 2.30 గంటలకు జరిగింది. ఘటనలో గాయపడిన శివయ్య, మంజునాథ్, అమృత, సురేష్, శకుంతలతో పాటు మొత్తం 9 మందిని కూడ్లిగి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం వైద్యులు కొప్పళ ఆస్పత్రికి తరలించారు. బెంగళూరు నుంచి కుష్టగికి సుమారు 61 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ కరిబసప్ప తెల్లవారు జామున జాతీయ రహదారి–50పై కూడ్లిగి వైపు వస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో బస్సు రోడ్డుకు ఎడమ వైపున ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి, గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనతో నిద్రలో ఉన్న ప్రయాణికులు లేచి బిగ్గరగా కేకలు వేశారు. విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు, టోల్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను కూడ్లిగి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. తొమ్మిది మంది గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కొప్పళ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులు, డ్రైవర్, ఆపరేటర్కు ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. ఈ ఘటన హొసహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరగగా, ఎస్ఐ సిద్దరామ బిదరాణి సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు. తొమ్మిది మందికి తీవ్ర గాయాలు విజయనగర జిల్లాలో ప్రమాదం -
గోవధ నిషేధ చట్టం అమలుకు ర్యాలీ
సాక్షి,బళ్లారి: గోవుల్లో సకల దేవతలు నివసిస్తారని, గోవులను పూజిస్తే దేవతలకు పూజలు చేసినట్లు అవుతుందని, అలాంటి గోవులను రక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, ముఖ్యంగా గోవధ జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సోమవారం బీజేపీ, హిందూ సంఘాల వేదిక ఆధ్వర్యంలో నగరంలోని రాఘవ కళామందిరం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. గోవులను పలు ప్రాంతాల్లో దారుణంగా హింసించి వధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోవులను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గోవధ నిషేధ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, సవరణలు చేయడం సరికాదన్నారు. గోవధ ఖండనీయం మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ గోవులను వధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గోసంరక్షణ కేవలం ధార్మికంగానే కాకుండా, మన సంస్కృతి వారసత్వాలకు ప్రతీకగా కూడా కొనసాగించాలన్నారు. గోవధ జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. గోవులను కాపాడితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. దేవతలందరికీ పూజలు చేయడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా, బీజేపీ నాయకులు కే.ఎస్.దివాకర్, అశోక్ కుమార్, ఐనాథరెడ్డి, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు. గోవధ నిషేధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ర్యాలీ చేపట్టిన నాయకులుఆందోళనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి తదితరులు ఆ చట్టానికి సవరణలు వద్దు గోమాతలకు రక్షణ కల్పించాలి హిందూ సంఘాల డిమాండ్ -
ముగిసిన బీరలింగేశ్వర రథోత్సవం
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా దేవసూగూరులో వెలసిన బీరలింగేశ్వర రథోత్సవం వైభవంగా ముగిసింది. సోమవారం రాయచూరు గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. పసుపు భండారను చల్లుకోవడంతో పాటు స్వామి వారికి పల్లకీ సేవ చేపట్టారు. ఐజీపీ హర్షకు కువెంపు వర్సిటీ పీహెచ్డీబళ్లారిఅర్బన్: ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) పీఎస్ హర్షకు వన్యప్రాణుల నిర్వహణ విభాగంలో చేసిన పరిశోధనకుగాను కువెంపు విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) పట్టాను ప్రకటించింది. మే 6న జరుగనున్న స్నాతకోత్సవంలో ఈ పట్టాను ఆయనకు ప్రదానం చేయనున్నారు. విశ్వవిద్యాలయ వన్యప్రాణి నిర్వహణ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్కుమార్ మార్గదర్శకత్వంలో ఐజీపీ పీఎస్ హర్ష ఐదేళ్ల పాటు క్షేత్ర స్థాయిలో పరిశోధన చేశారు. నాగరహొళె, బండీపుర బీఆర్టీ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పులుల జనాభా స్థిరత్వం, మానవుడు, పులుల సంఘర్షణపై ప్రత్యేక దృష్టి అనే అంశంపై ఆయన సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. ఈ పరిశోధనలో విస్తృత స్థాయిలో కెమెరా ట్రాపింగ్, మానవుడు, పులి సంఘర్షణ ప్రాంతాలపై విశ్లేషణ వంటి అంశాలున్నాయి. వన్యప్రాణి సంరక్షణ రంగానికి ఈ గ్రంథం ముఖ్యమైన సహకారం అందించనుంది. వర్సిటీ సిండికేట్ ఈ పట్టాను అధికారికంగా ఆమోదించింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం● మరో ఇద్దరికి గాయాలు రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకాలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలు కాగా మరో ఇద్దరు గాయపడిన ఘటన జరిగింది. జాతరను ముగించుకొని శాఖాపురకు తిరిగి వెళుతుండగా టిప్పర్ అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఆంజనేయ నాయక్(26), అర్చన(23) మరణించగా, శ్వేత(20), లక్ష్మి(18)లకు గాయాలయ్యాయి. ఘటనపై సిరవార పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గోవుల సంరక్షణకు చర్యలు చేపట్టరూరాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ గోమాతల సంరక్షణకు చర్యలు చేపట్టాలని భజరంగ దళ్ డిమాండ్ చేసింది. సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు శరణ బసవ మాట్లాడారు. జాతీయ ఆరాధ్య దైవంగా భావించే గోమాతను వధించరాదన్నారు. నానాటికీ గో సంతతి నశించి పోతోందని, గోవుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించాలని కోరుతూ రాష్ట్రపతికి తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో సోనీ, దీక్షిత్, కృష్ణ, చంద్రశేఖర్లున్నారు. 1న జనాక్రోశ సమావేశం హుబ్లీ: పార్లమెంట్లో మహిళా బిల్లును విపక్షాలు వ్యతిరేకించడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. అరవింద నగర్లోని బీజేపీ కార్యాలయంలో మహిళా జనాక్రోశ సమావేశం సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 1న మహిళా జనాక్రోశ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఇది మహిళలపై కాంగ్రెస్ విధానాలను ఎడగట్టే కార్యక్రమం అన్నారు. తాము అమల్లోకి తేవాల్సిన బిల్లును కాంగ్రెస్ ఓడించిందన్నారు. సమావేశంలో మహిళా నాయకురాలు సీ.మంజుల మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును సహించలేక, మహిళలు రాజకీయంగా ఎదగరాదన్న కుట్రతో కాంగ్రెస్ బిల్లు వ్యతిరేకించడంతో ఓడిపోయిందన్నారు. దీనికి తగిన గుణపాఠం చెప్పడానికి మే 1న భారీ సంఖ్యలో మహిళలు సమావేశమై బిల్లు వ్యతిరేకులకు తగిన గుణపాఠం నేర్పాలన్నారు. -
అబ్బురపరిచిన ఛాయాచిత్రం
బనశంకరి: సిలికాన్ సిటీలో చిత్రకళా పరిషత్లో యూత్పొటోగ్రఫిక్ సొసైటీ సలాన్–2026 అంతర్జాతీయ ఛాయాచిత్ర ప్రదర్శన అట్టహాసంగా ముగిసింది. రెండురోజుల పాటు పరిషత్లో వందలాది ప్రతిభావంత ఛాయాచిత్ర గ్రాహకులు తీసిన ఉత్తమ చిత్రాల ప్రదర్శన కళాప్రియులకు కనువిందు చేసింది. దేశ విదేశాలలో అరుదైన, విభిన్న చాయాచిత్రాలు చూపరులను అబ్బురపరిచాయి. మానవ జీవితం, నగరాలు, పర్వతశ్రేణులు, ప్రకృతి అందాలు, అరుదైన వన్యజీవుల ఛాయాచిత్రాల ద్వారా వర్ధమాన ఫొటోగ్రాఫర్లు, ఆ రంగాల ఔత్సాహికులు అనేక మెళవకువలు తెలుసుకున్నట్లు చెప్పారు. పోలెండ్కు చెందిన గ్రెరోజ్ లీవండోవస్కీ, బెంగళూరుకు చెందిన సందీప్ దత్తరాజు, సింగపూర్ ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ దామోదరన్ ఉత్తమ ఫొటోగ్రాఫర్లుగా ఎంపికై నట్లు వైపీఎస్ ప్రతినిధులు అనిత మైసూరు, గిరీశ్అనంతమూర్తి, వీ.మంజువికాస్ శాస్త్రి తెలిపారు. ముఖ్య అతిథిగా టీవీ నటి పటాకి శృతి సందడి చేసింది. చిత్రకళా పరిషత్లో ముగిసిన సలాన్ ప్రదర్శన -
మహిళలను సురక్షితంగా ఉండనివ్వరా?
యశవంతపుర: బెంగళూరులో నమ్మ మెట్రో రైళ్లలో ప్రయాణించే యువతులు, మహిళ ఫోటోలను రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వికృతానందం పొందే నిందితునికి హైకోర్టులో మందలింపు దక్కింది. తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని వేసిన ఫిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు బీకే దిగంత్.. బెంగళూరు మెట్రో చిక్స్ అనే ఇన్స్టా ఖాతాలో ఈ ఫోటోలు, వీడియోలను పోస్టు చేసేవాడు. గత ఏడాది మేలో బనశంకరి పోలీసులు విచారణ జరిపి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తనపై కేసు చెల్లుబాటు కాదని, కొట్టేయాలని నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ అర్జీని విచారించిన న్యాయమూర్తి.. నిందితునిపై భగ్గుమన్నారు. మహిళలను ఎక్కడా సురక్షితంగా ఉండనివ్వరా? అని దిగంత్ను నేరుగా ప్రశ్నించారు. ఇలా చేయడం చూస్తే నీకు మానవత్వం ఉందా? అంటూ అర్జీని కొట్టివేశారు. మహిళలను ముందు, వెనుక నుంచి వీడియో తీసి ఎడిట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారా?, మీరు ఎలాంటి మనుషులు అని జడ్జి ఆగ్రహించారు. నిందితుని న్యాయవాది వాదిస్తూ, మహిళలు ఎవరూ ఫిర్యాదు చేయలేదు, పోలీసులు సుమోటో కేసుగా నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి నేరానికి పాల్పడలేదని అన్నారు. అయితే సాంకేతిక అంశాలను చూపించి తప్పించుకోలేదని న్యాయమూర్తి చురకలు ముట్టించారు. కొన్ని విషయాలలో నైతికత, భద్రత ముఖ్యమన్నారు. మహిళల అనుమతి లేకుండా అశ్లీలంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమే పెద్దనేరమని న్యాయమూర్తి పేర్కొన్నారు. పోలీసులారా.. ఇదేం పని? యశవంతపుర: పోలీసులు ఏమైనా చేయగలరు. నిజమైన నేరాలపై విచారణ చేయకుండా ప్రజలను తిప్పించుకుంటారు అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న అసంతృప్తి వ్యక్తంచేశారు. ఓ కేసులో పోలీసుల తీరును తప్పబట్టారు. రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా ఎంకె దొడ్డి పోలీసుస్టేషన్ పరిధిలో 2024లో రెండు పశువులు అదృశ్యమయ్యాయి. రెండేళ్ల తరువాత పశువుల సొంతదారు పక్కింటి వ్యక్తి సహా నలుగురిపై కేసు పెట్టాడు. తమకు సంబంధమే లేదని, ఈ కేసును కొట్టేయాలని మంగళమ్మ అనే నిందితురాలు హైకోర్టులో అర్జీ దాఖలు చేసింది. రెండేళ్ల తరువాత పొరుగింటివారిపై ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని పోలీసులను జడ్జి ప్రశ్నించారు. కనీస విచారణ జరపలేదని, ఇది చట్ట ఉల్లంఘన అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పశువులను వెతకటం మానేసి, సమాజంలో జరుగుతున్న తీవ్రమైన, నిజమైన నేరాల వెంటపడాలి. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఇలాంటి కేసులు మళ్లీ తమ దృష్టికి వస్తే పోలీసులపై కఠినంగా వ్యవహరిస్తానని తెలిపారు. మెట్రో రైళ్లలో రహస్య వీడియోల కేసులో హైకోర్టు ఆగ్రహం -
హెచ్టీ విద్యుత్ స్తంభానికి లారీ ఢీ
హొసపేటె: అతి వేగంగా వెళుతున్న లారీ అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన కొప్పళ జిల్లా మునిరాబాద్ వద్ద సోమవారం జరిగింది. బెంగళూరు నుంచి కొప్పళ వైపునకు వెళుతున్న లారీ మార్గమధ్యంలో హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొనడంతో లారీ బోల్తా పడింది. లారీ ఢీకొన్న తీవ్రతకు హై టెన్షన్ విద్యుత్ స్తంభం కూడా విరిగి రహదారి మీద పడటంతో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మునిరాబాద్ పోలీసులు చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఘటనపై మునిరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం
బళ్లారిఅర్బన్: జిల్లాలోని కంప్లి పట్టణంలోని 4వ వార్డులో ఆదివారం కాంగ్రెస్ కార్యకర్త యల్లప్పకు చెందిన ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలి ఇంటికి తీవ్ర నష్టం సంభవించింది. పేలుడు తీవ్రతకు ఇంట్లోని సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో క్షణాల్లోనే మంటలు ఇంటిని ఆవరించాయి. ఇంటి పైకప్పు పూర్తిగా కాలిపోగా, లోపల ఉన్న ఫర్నిచర్, గృహోపకరణ, ఇతర వస్తువులు భస్మమయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. కంప్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. -
పరిహారం కోసం రైతుల రాస్తారోకో
బళ్లారిటౌన్: తాలూకాలోని కుడితిని వద్ద రోడ్డుపై ధర్నా చేస్తున్న వందలాది మంది రైతులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కుడితిని వద్ద పరిశ్రమల నిర్మాణం కోసం కేఐఏడీబీ స్వాధీనం చేసుకున్న భూములకు న్యాయపరమైన ధరలు ఇవ్వాలి. పరిశ్రమలను ప్రారంభించి భూమి కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేదా భూములనైనా వాపసు ఇవ్వాలనే డిమాండ్తో రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. దాదాపు 900 ఎకరాల భూములను జిందాల్, మిత్తల్ కంపెనీ, జేఎఫ్ కంపెనీల కోసం కేఐఏడీబీ స్వాధీనం చేసుకుంది. దీంతో రైతులు పోరాటాలకు దిగినందున తమ పైకోర్టులో తప్పుడు కేసులను దాఖలు చేసిందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. 144 సెక్షన్ విధింపు ఖండనీయం తాము న్యాయసమ్మతంగా పోరాటాలు చేస్తున్నా కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి 144 సెక్షన్ విధించడం ఖండనీయం అన్నారు. రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచి తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు. గత 1227 రోజుల నుంచి ఈ పోరాటాలు చేస్తున్న రైతులపై అధికారులు కనికరం చూపడం లేదని పేర్కొన్నారు. రైతు సంఘాల నేతలు యూ.బసవరాజ్, జే.సత్తిబాబు, ఎం.తిప్పేస్వామి, జంగ్లి సాబ్, శ్రీధర్, నరసింహ రాజు, తిమ్మప్ప, మహారుద్ర గౌడ, సురేష్గౌడ తదితరులు పాల్గొన్నారు. కుడితిని వద్ద పోరాటం ఆందోళనకారుల అరెస్టు -
ఏం జరగాలో అది జరుగుతోంది
బెంగళూరు: ఎప్పుడు ఏమి జరగాలో అది జరుగుతోంది, ఇకపై రాజకీయాల గురించి మీడియాతో మాట్లాడను, సమయం వచ్చినపుడు అదే తెలుస్తుంది అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆయన ఆదివారం బెంగళూరులో సదాశివనగరలో నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘మాలో ఎలాంటి సమస్య లేదు. ఏ రాజకీయం కూడా లేదు. ఏమేమి తీర్మానం అయ్యాయో అవి అమల్లోకి వస్తాయి. ఎప్పుడు ఏమి చేయాలో దానిని పార్టీ చేస్తుంది. పార్టీపై విశ్వాసముంది’ అని అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో చెరి సగం కాలం ఉండాలని సిద్దరామయ్య, తన మధ్య ఒప్పందం కుదిరిందని, దానిని అమలు చేయాలని డీకే డిమాండ్ చేస్తుండడం తెలిసిందే. డీకే మాటలను బట్టి సీఎం కురీ్చని మార్చడానికి హైకమాండ్ సిద్ధమైనట్లు సమాచారం. హైకమాండ్ మాట పాటిస్తాం ముఖ్యమంత్రి కుర్చీ మార్పుపై స్పందించిన ఆయన, మీకు ఈ విషయంలో గందరగోళంగా ఉండవచ్చు. హైకమాండ్ చెప్పినదానిని పాటిస్తామని నేను, సీఎం చెప్పాం. అదే ప్రకారంగా నడచుకొంటామని తెలిపారు. మే 15న తన పుట్టిన రోజుకు ఎవరూ కూడా ఫ్లెక్స్, బ్యానర్లను వేయరాదని కోరారు. రోడ్ల సౌందర్యాన్ని నాశనం చేయరాదని, అలాంటివారిపై జరిమానా విధించాలని కమిషనర్కు సూచించానని తెలిపారు. అంతర్గత రిజర్వేషన్లకు పరిష్కారం ఎస్సీ అంతర్గత రిజర్వేషన్లను తాము చెప్పినట్లు చేశామని బీజేపీ విమర్శల గురించి డీకే పేర్కొన్నారు. మాల, మాదిగ సముదాయాల్లో ముందు ఎవరికి, ఆ తరువాత ఎవరికి అనే ప్రశ్న గతంలో ఉండేది. దానిని పరిష్కారానికి దారిని కనిపెట్టామన్నారు. మాదిగ, మాల, లంబాణి, భోవి వర్గాలందరికీ న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు. 30, 40 ఏళ్ల నుంచి ఉన్న సమస్యను పరిష్కరించామని చెప్పారు. -
తుపాకీతో కాల్చుకుని టీచర్ ఆత్మహత్య
బెంగళూరు: కొడగు జిల్లా మడికెరి తాలూకా చేరంబాణె గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఒకరు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామవాసి రోహిణి (51) ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆదివారం ఇంట్లో ఉన్న బ్యారెల్ తుపాకీతో కాల్చుకోవడంతో అక్కడే మరణించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియటంలేదు. మడికెరి గ్రామాంతర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాంబారు చేయలేదని... తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా మూడగెరె తాలూకా దేవవృంద గ్రామంలో జరిగింది. సౌజన్య పూజారి (22) మృతురాలు. శనివారం ఉదయం తండ్రి కాయగూరలు తెచ్చి మధ్యాహ్నం భోజనానికి సాంబారు వండాలని చెప్పి వెళ్లాడు. కానీ ఆమె చేయలేదు, భోజనవేళకు వచ్చిన తండ్రి.. ఎందుకు చేయలేదని దండించి, హోటల్ నుంచి సాంబారు తెచ్చుకుందామని బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి సౌజన్య ఉరికి వేలాడుతూ ఉంది. గోణిబీడు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అగ్ని ప్రమాదంలో మేకలు, గడ్డివాము దగ్ధం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని మీనాకెరె గ్రామ శివారులోని పొలంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగలడంతో గడ్డివాము, మేకలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. మొలకాల్మూరు తాలూకా చిక్కుంతి గ్రామానికి చెందిన రైతు భాస్కర్.. కూడ్లిగి తాలూకా సరిహద్దులోని ఒక వ్యవసాయ క్షేత్రంలో నివసిస్తున్నాడు. 30కి పైగా ఉన్న మేకల కోసం షెడ్డు, పక్కనే గడ్డివాము వేసుకున్నాడు. గడ్డివాము మీదుగా విద్యుత్ స్తంభానికి అమర్చిన విద్యుత్ తీగ తగలడంతో మంటలు చెలరేగాయి. ఒక గడ్డివాము, 10 మేకలు కాలి బూడిదయ్యాయి. మొలకల్మూరు తాలూకాకు చెందిన అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. -
చెరువులో మునిగి బాలుడు మృతి
కెలమంగలం: బాబాయితో కలిసి చెరువులో చేపలు పట్టేందుకెళ్లిన పదేళ్ల బాలుడు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన కెలమంగలం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాల మేరకు.. కెలమంగలం సమీపంలోని చిన్నట్టి గ్రామానికి చెందిన బాల కుమారుడు కిషోర్ (10). శనివారం సాయంత్రం బాబాయి గోవిందరాజ్తో కలిసి జెక్కేరి సమీపంలోని దూల్శెట్టి చెరువులో చేపలు పట్టేందుకెళ్లాడు. ఈ సమయంలో బాలుడు లోతైన ప్రదేశానికి వెళ్లడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కెలమంగలం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. తామర పువ్వు కోసేందుకు వెళ్లి మహిళ.. కెలమంగలం: తామర పువ్వు తీసేందుకు చెరువులోకి దిగిన మృతి చెందింది. ఈ ఘటన డెంకణీకోట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. డెంకణీకోట సమీపంలోని మారేగౌనిపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ మురుగేష్ భార్య కవిత (21). వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. శనివారం ఉదయం కవిత పశువులను మేత కోసం చెరువు వద్దకు తీసుకెళ్లింది. ఈ సమయంలో చెరువులో అందంగా కనిపిస్తున్న తామర పువ్వును తీసేందుకు నీటిలో దిగింది. లోతైన ప్రదేశానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందింది. గమనించిన స్థానికులు చెరువులో గాలించి కవిత మృతదేహాన్ని బయటకు తీశారు. డెంకణీకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
జగమునేలు జగజ్జనని పాహిమాం
● ఘనంగా వాసవీ మాత జయంతిరాయచూరు రూరల్: నగరంలో ఆదివారం వాసవీ మాత జయంతి ఘనంగా నిర్వహించారు. నగరేశ్వర దేవస్థానంలో ఆర్యవైశ్య సభ్యుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం చేపట్టారు. శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ ఆర్యవైశ్యులతో కలసి వాసవీ మాతను పల్లకీలో ఊరేగించారు. వాసవీ జయంతి సందర్భంగా వెండి, స్వర్ణ రథోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సమాజం అధ్యక్షుడు పురుషోత్తం, పద్మరాజ్, జగదీష్, వీరేష్, వెంకణ్ణ, గోవిందు, దత్తాత్రేయ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న శోభాయాత్ర సాక్షి, బళ్లారి: నగరంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం వాసవీ మాత జయంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం శోభాయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. త్యాగమూర్తిగా, ధర్మరక్షకురాలిగా వాసవీ మాత చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. వాసవీ మాత బోధనలు నేటికి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, మాజీ బుడా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్, ఆర్యవైశ్య సమాజ ప్రమఖులు పాల్గొన్నారు. వాసవీ సర్కిల్కు శంకుస్థాపన హొసపేటె: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో వాసవీ మాత జయంతి వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. హంపీలో రోడ్డులోని మల్లిగె హోటల్ కూడలి వద్ద వాసవీ సర్కిల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆర్యవైశ్య సంఘం, రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 38 మంది రక్తదానం చేశారు. ఉదయం మెయిన్ బజార్లోని నాగేశ్వర ఆలయం నుంచి వాసవీ అమ్మవారిని పూర్ణకుంభంతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సర్కిల్కు వాసవీ పేరు పెట్టడంలో కీలక పాత్ర పోషించిన రమేష్ గుప్తాను సన్మాంచారు. ముత్తయిదువుల ఆధ్వర్యంలో వాసవీ మాతకు మడిలక్కి సమర్పణ, తులాభార సేవ, కన్యకా పూజ, ఒక ధార్మిక సభ నిర్వహించారు. దాతలను, వివిధ రకాలుగా సేవలు అందించిన వారిని సన్మానించారు. సాయంత్రం వాసవీ దేవిని నగరంలో ఊరేగించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ప్రహ్లాద్ భూపాల్, సంఘం కోశాధికారి కాకుబాల్ శ్రీనివాస్, సేవా సమితి అధ్యక్షుడు నరసింహ మూర్తి, వాసవీ మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. ఊరేగింపులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి పల్లకీ సేవలో పాల్గొన్న ఆర్యవైశ్యులుకలశాలతో ఊరేగింపుగా వస్తున్న మహిళలు -
తుది దశకు డ్యాం గేట్ల ఏర్పాటు
● మే నెలఖరు నాటికి పూర్తయ్యే అవకాశం హొసపేటె: తుంగభద్ర డ్యాంలో కొద్ది నెలలుగా చేపడుతున్న నూతన 33 క్రస్ట్ గేట్ల ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయి. కేవలం చిన్నపాటి సాంకేతిక, తుది దశ పనులు, కొత్త గొలుసుల ఏర్పాటు మాత్రమే మిగిలాయి. కేవలం ట్రయల్ అండ్ రన్, విద్యుత్ పరీక్షలు, తుది భద్రతా తనిఖీ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వర్గాలు తెలిపాయి. ఇప్పటికే గేట్లను పైకి లేపుతూ, కిందకు దించే, నీటి పీడనాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని పరీక్షించడం జరిగింది. ముఖ్యంగా, 18వ నంబర్ గేటు యొక్క ట్రయల్ అండ్ రన్ విజయవంతంగా పూర్తయింది. మిగిలిన గేట్ల విద్యుత్ పనులు కూడా పూర్తయ్యాయి. తుంగభద్ర జలాశయం మూడు రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల్లో సుమారు 14 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందించే ఒక ప్రధాన నీటి వనరు. వ్యవసాయం, తాగునీరు పరిశ్రమలకు ఈ జలాశయం నుంచి వచ్చే నీరు అత్యవసరం కాబట్టి, క్రస్ట్ గేట్ పనులు నాణ్యతతో పూర్తి చేయబడుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ పని పర్యవేక్షణ, పరిపాలన బాధ్యతను తుంగభద్ర బోర్డులోని వివిధ స్థాయిల అధికారులు నిర్వహిస్తున్నారు. కార్యదర్శి ఓఆర్కే రెడ్డి, ఎస్ఈ నారాయణ నాయక్ మాట్లాడుతూ.. తుంగభద్ర జలాశయం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కేవలం చైన్ లింకుల ఏర్పాటు మాత్రమే మిగిలి ఉంది. కొత్త చైన్ లింకులు మే 1వ తేదీ నాటికి వచ్చే అవకాశం ఉంది. అవి వచ్చిన వెంటనే, పాత చైన్లను పూర్తిగా తొలగించి, కొత్త చైన్లను అమర్చడం జరుగుతుంది. జలాశయం భద్రత, నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
పేలిన డీజిల్ ట్యాంక్
● నలుగురికి తీవ్ర గాయాలు హొసపేటె: మరమ్మతుల కోసం లారీని గ్యారేజీకి తీసుకెళ్లిన సమయంలో డీజిల్ ట్యాంక్ పేలింది. ఈ ఘటన ఆదివారం సండూరు తాలూకా చెన్నభసప్ప క్యాంపు వద్ద చోటుచేసుకుంది. లారీ డ్రైవర్, లారీ యజమాని, గ్యారేజ్ మెకానిక్కు కాలిన గాయాలయ్యాయి. లారీకి మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తూ డీజిల్ ట్యాంక్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం సండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బళ్లారి విమ్స్ ఆసుపత్రికి పంపించారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లుపై తప్పడు ప్రచారం వద్దు
రాయచూరు రూరల్: మహిళా రిజర్వేషన్ బిల్లుపై తప్పడు ప్రచారం చేయవద్దని కొప్పళ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమరే గౌడ బయ్యపూర్ సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కాంగ్రెస్, ఇతర పార్టీలపై బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. ఆదివారం కొప్పళ్లో అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అందోళనలో మాట్లాడారు. పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రవేశపెట్టిన నారీ శక్తి వందన్స్ బిల్లు ఆమోదం పొందలేదు. మహిళలను రాజకీయంగా అణగదొక్కడమే కాంగ్రెస్ పార్టి ఉద్దేశమని చెప్పడాన్ని ఖండించారు. పేరుకు మాత్రమే మహిళల రిజర్వేషన్ బిల్లు అంటూ నియోజకవర్గాల విభజన బిల్లు ప్రవేశపెట్టడంతో తిరస్కరించడం జరిగిందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. సారూ.. బిల్లు చెల్లించండి హుబ్లీ: హుబ్లీ తాలూకా బ్యాహట్టి మద్దతు ధర కేంద్రంలో 8 రోజులు పడిగాపులు కాసి పెసలు విక్రయించాం. నాలుగున్నర నెలలు అవుతున్న బిల్లులు చెల్లించ లేదు. సారూ.. బిల్లులు చెల్లించండి అని కోరితే మీరు విక్రయించిన పెసలు తీసుకెళ్లండి అంటూ అధికారులు నోటీసులు ఇచ్చారని 74 మంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విక్రయించిన పెసలను తిరిగి తీసుకెళ్లమంటున్న అధికారుల తీరుతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రైతులే ఒత్తిడి చేసి పెసలు విక్రయించారని సంబంధిత అధికారులు చెబుతుండటం విడ్డూరం. మేము అలాగే చేసి ఉంటే వారెందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అని రైతులు నిలదీశారు. ఏదో గందరగోళం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోనరెడ్డి ఈ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిసింది. ఇక ఈ సమస్య జిల్లా యంత్రాంగానికి పెను సవాల్గా మారింది. మరో రెండు రోజుల్లో డబ్బు చెల్లించని పక్షంలో తీవ్రంగా పోరాటం చేస్తామని అన్నదాతలు హెచ్చరించారు. ఆదర్శప్రాయుడు అంబేడ్కర్ రాయచూరు రూరల్: సమాజంలో సమానత్వం, నాయ్యం, మానవీయ మౌల్యాల కోసం పోరాడిన వ్యక్తి అంబేడ్కర్ అని మాజీ మంత్రి శివన గౌడ నాయక్ అభిప్రాయపడ్డారు. శనివారం రాత్రి అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేడ్కర్, బీమా జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ రచనకు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు, మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, విరుపాక్షి, రాజు, సన్నీ, స్మిత, రవీంద్ర జాలదార్, హేమ తదితరులు పాల్గొన్నారు. భోవి వడ్డెర సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక బళ్లారి అర్బన్: నగరంలోని అంబేడ్కర్ భవన్లో బళ్లారి జిల్లా భోవి వడ్డెర సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. భోవి వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడిగా రామాంజనేయులు మళ్లీ ఎన్నికయ్యారు. దొడ్డా రామన్న, ఎంటీ.మల్లేష్, మితిలేష్, బండిమోట్ గాదిలింగ, టివి.వెంకటేశులు, బండిహట్టి మహేష్, సిరుగుప్ప జే.ఈశ్వరప్ప రిటైర్డ్ ప్రిన్సిపల్ శేషన్న, డ్రగ్స్ శాఖకు చెందిన నాగరాజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. కుబేర, మించు శ్రీనివాస్, జలాల్ కుమార్, కువెంపు నగర్ రమేష్, కాటేగుడ్డ పవర్లైన్ వెంకట్ రామారెడ్డి, అల్లుకృష్ణ తమ్మి రామారెడ్డి, అల్లుకృష్ణ తమ్మి రామారెడ్డి కార్పొరేషన్ సభ్యులుగా ఎంపిక చేశారు. వి.రవి, విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రకాష్, ఇబ్రహీంపుర్ శ్రీనివాస్, బొబ్బకుంట గాదిలింగ, సోమసముద్రం రఘుతో పాటు సంగనకల్లు వెంకటేష్ సంఘం డైరెక్టర్లుగా ఎంపికై నట్లు అధ్యక్షుడు రామాంజనేయులు వెల్లడించారు. వేణుగోపాల రథోత్సవం శ్రీనివాసపురం: తాలూకాలోని కోడి చెరువు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం బ్రహ్మ రథోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. జాతర సందర్భంగా గత 8 రోజులుగా దేవాలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం స్వామివారి దేవాలయంలో మూల విగ్రహానికి పూజలు జరిపి తేరు ఉత్సవాన్ని ప్రారంభించారు. తేరు కదులుతుండగా భక్తులు దవనం, అరటిపండ్లు విసిరారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పాల్గొన్నారు. -
నీటితో కళకళలాడుతున్న పుష్కరిణులు
రాయచూరు రూరల్: నీటి కొరతతో ఉత్తర కర్ణాటకలో పుష్కరిణులు ఎండిన దాఖాలాలు లేవు. నిత్యం జలంతో కళకళాలాడుతుంటాయి. చాళుక్య రాజులు నిర్మించిన చారిత్రక పుణ్య ధార్మిక క్షేత్రాల్లో ఒక్కటైన మహకోటీశ్వర పుణ్యతీర్థం ప్రసిద్ధి చెందింది. మహకోటీశ్వర దేవాలయంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు రెండు తీర్థాలు ఉన్నాయి. తీవ్ర వర్షాభావంతో తాలుకాలోని చెరువులు, బావులు ఎండిపోయాయి. అయితే బాదామి బనశంకరిలోని రెండు పుష్కరిణుల్లో నీరు పుష్కలంగా ఉంది. 8 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు ఉన్న విష్ణు పుష్కరిణిలో భూగర్బ జలం నిరంతరం పారుతుంది. ఉత్తర దిక్కున చతుర్మఖ బహ్మ దేవాలయం, వాయవ్య దిక్కున ఈశ్వరుడి విగ్రహాలను దర్శించుకోవాలంటే ఈత కొట్టుక్కుంటూ వెళ్లాల్సిందే. చిన్న పుష్కరిణిని కాశీ హోండా అంటారు. చిన్న పుష్కరిణిలో పుణ్య స్నానం చేసిన అనంతరం విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి మహకోటేశ్వర, మల్లికార్జున దేవాలయాలను దర్శించుకుంటారు. -
తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దు
రాయచూరు రూరల్: మాన్విలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖా మంత్రి బోసురాజ్ అధికారులకు సూచించారు. మాన్వి పట్టణంలో శాసన సభ్యుడు హంపయ్య నాయక్తో కలసి తాగునీటి పనులు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తుంగభద్ర నీటి సౌలభ్యంపై ఆధారపడిన గ్రామాలకు నీటి సరఫరాలో జాప్యం కాకుండా చూసుకోవాలన్నారు. గ్రామాలకు నిత్యం తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. వేసవిలో విద్యుత్ కోత, మోటార్ల మరమ్మతులు, ఇతరత్ర కారణాలు చెప్పొదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలను నీటితో నింపేలా తాలుకా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. యడ్డి సభకు సన్నాహాలు సాక్షి, బళ్లారి: కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడానికి మాజీ సీఎం యడియూరప్ప చాలా కృషి చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించిన మహా నాయకుడు యడియూరప్ప అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర పేర్కొన్నారు. మే 9వ తేదీన చిత్రదుర్గంలో యడియూరప్ప 50 సంవత్సరాలు రాజకీయ అరంగ్రేటం సంబంధించి విజయోత్సవ, అభినందన కార్యక్రమం జరగనుంది. ఆదివారం ఈ కార్యక్రమానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేయడానికి మాజీ మంత్రులు, పలువురు స్వామీజీల సమక్షంలో భూమిపూజ చేశారు. అనంతరం విజయేంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి దాదాపు 10 లక్షల మందిని చేర్చి పెద్ద ఎత్తున అభినందన సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. యడియూరప్ప అభిమానులు ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. తాగునీటి కోసం నిరసన రాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినా స్పందించరా అని సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాపలదిన్ని పంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. 15 రోజలకు ఒకసారి నీరు వదిలితే ఎలా అని మండిపడ్డారు. సమయానికి తాగునీరు సరఫరా చేయకపోవడంతో ఆందోళనకు దిగారు. సకాలంలో నీరు సరఫరా చేయాలని కోరుతూ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఉద్యాన వనాల అభివృద్ధికి ప్రాధాన్యత రాయచూరు రూరల్: నగరంలో ఉద్యాన వనాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తామని విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని బిల్వ మందిర్ గార్డెన్ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేకేఆర్డీబీ నుంచి విడుదలైన రూ.30 లక్షలతో అభివృద్ధి పనుల చేపడుతామన్నారు. నగరంలో పలు గార్డెన్లు ఉండగా.. వీటిలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం బాయిదొడ్డిలో సీసీ రహదారి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో నాగరాజ్, సత్యనాథ్, వెంకటేష్, దీపక్ రెడ్డి, అంజన్ కుమార్, రజాక్, ఖరీమ్, ఉస్మాన్, రఫీ, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
బళ్లారి అర్బన్: సండూర్ తాలూకా తాలూరు గ్రామంలో కార్మిక శాఖ మంత్రి సంతోష్లాడ్ ఆధ్వర్యంలో అంకిత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు స్మార్ట్ కార్డులు, హక్కుల ధృవపత్రాలు పంపిణీ చేశారు. రోడ్డు, మురుగునీటి పారుదల, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులను ఎంపీ తుకారాం, ఎమ్మెల్యే అన్నపూర్ణ సాథ్ ప్రారంభించారు. మంత్రి సంతోష్లాడ్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గిగ్ వర్కర్లు, సినిమా, గృహ కార్మికులకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కార్మికులకు కనీస వేతన బిల్లును మరో వారంలో ఖరారు చేస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ అంశాలపై మాట్లాడుతూ.. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. దేశంలో నిరుద్యోగం, అప్పులు పెరిగాయని ఆరోపించారు. ఎంపీ తుకారాం మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. తుంగభద్ర జలాశయం నీటిని తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు.


