breaking news
Karnataka
-
'రూ.2 కోట్లిస్తావా? ప్రైవేట్ వీడియోలు బయటపెట్టమంటావా?' బుల్లితెర నటి
యశవంతపుర (కర్ణాటక): టీవీ సీరియళ్ల కథల గురించి అందరికీ తెలిసిందే. అందులో పాత్రధారులు నిరంతరం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. అదేమాదిరి ఓ నటి నిజ జీవితంలోనూ ప్రవర్తించింది. కన్నడ టీవీ సీరియల్స్లో నటించి పేరుపొందిన నటీమణి ఆశా జోయిస్ (Asha Jois) నేరారోపణల్లో చిక్కుకుంది. ఓ మహిళ ప్రైవేట్ వీడియో, ఫోటోలను దొంగతనం చేసి రూ.2 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్లు బెంగళూరు నగర తిలక్ నగర ఠాణాలో ఫిర్యాదు దాఖలైంది. పార్వతి (61) అనే మహిళ ఈ మేరకు ఫిర్యాదు చేసింది. డబ్బు ఇవ్వకపోవడంతో.. ఆశా జోయిస్.. 2016లో మిస్ ఇండియా ప్లానెట్ పోటీలలో విజేతగా నిలిచింది. టీవీ సీరియల్స్లోనూ నటించింది. తర్వాత బాధిత మహిళ పార్వతితో స్నేహం పెంచుకుంది. తాను టీవీ నటి అని చెప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆశా.. బాధితురాలి వీడియోలను సేకరించి ఆమె భర్తను డబ్బు కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఇందుకు వారు తిరస్కరించడంతో వీడియోలు, ఫోటోలు, వాయిస్ రికార్డ్లను బాధితురాలికి తెలిసినవారికి పంపించింది. దీనివల్ల అందరి ముందు అభాసుపాలయ్యాని, ఘోర అవమానం జరిగిందంటూ బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.చదవండి: నారా రోహిత్-శిరీష పెళ్లి సందడి: హల్దీ వీడియో చూశారా? -
గీజర్ మృత్యువాయువు
మైసూరు: వేడినీళ్ల కోసం అమర్చుకున్న గ్యాస్ గీజర్ మృత్యుపాశాలుగా మారుతున్నాయి. తరచూ ఎక్కడో ఓ చోట ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గీజర్ నుంచి గ్యాస్ లీకై అక్కాచెల్లెళిద్దరూ ఊపిరాడక మరణించిన దారుణ ఘటన జిల్లాలోని పిరియాపట్టణ తాలూకాలో జరిగింది. మృతులను పిరియాపట్టణలోని బెట్టదపుర నివాసులైన అల్తాఫ్ పాషా రెండో కుమార్తె గుల్బమ్ తాజ్ (23), నాలుగో కుమార్తె సిమ్రాన్ (21)గా గుర్తించారు. వివరాలు.. పిరియాపట్టణలోని జోనిగేరి వీధిలో అల్తాఫ్ పాషా కుటుంబం కొత్తగా బాడుగ ఇంటిలోకి చేరి ప్రార్థనలు చేసి పిండివంటలు చేసుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికి.. రాత్రి సుమారు 7 గంటల సమయంలో అక్కాచెల్లెళ్లిద్దరూ స్నానానికి వెళ్లారు. ఈ సమయంలో స్నానాల గదిలోని గ్యాస్ గీజర్ను ఆన్ చేయగానే దాని నుంచి విషపూరిత గ్యాస్ లీకైంది. కొంతసేపటికి ఊపిరాడక ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో గది తలుపులు తెరిచి చూడగా కుప్పకూలిపోయి ఉన్నారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల నిశ్చితార్థం కాగా అల్తాఫ్ పాషాకు నలుగురు కుమార్తెలు సంతానం ఉండగా, వారిలో ఇద్దరికి వివాహాలయ్యాయి. గుల్బమ్ తాజ్కు ఇటీవల నిశి్చతార్థమైంది. ఘటన సమయంలో కాబోయే భర్త కుటుంబం వారి ఇంటిలోనే ఉంది. ఈ ఘోరంతో కుటుంబీకులు తీవ్రంగా విలపించారు. -
గీజర్ మృత్యువాయువు
జానపదంమైసూరు: వేడినీళ్ల కోసం అమర్చుకున్న గ్యాస్ గీజర్ మృత్యుపాశాలుగా మారుతున్నాయి. తరచూ ఎక్కడో ఓ చోట ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గీజర్ నుంచి గ్యాస్ లీకై అక్కాచెల్లెళిద్దరూ ఊపిరాడక మరణించిన దారుణ ఘటన జిల్లాలోని పిరియాపట్టణ తాలూకాలో జరిగింది. మృతులను పిరియాపట్టణలోని బెట్టదపుర నివాసులైన అల్తాఫ్ పాషా రెండో కుమార్తె గుల్బమ్ తాజ్ (23), నాలుగో కుమార్తె సిమ్రాన్ (21)గా గుర్తించారు. వివరాలు.. పిరియాపట్టణలోని జోనిగేరి వీధిలో అల్తాఫ్ పాషా కుటుంబం కొత్తగా బాడుగ ఇంటిలోకి చేరి ప్రార్థనలు చేసి పిండివంటలు చేసుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికి.. రాత్రి సుమారు 7 గంటల సమయంలో అక్కాచెల్లెళ్లిద్దరూ స్నానానికి వెళ్లారు. ఈ సమయంలో స్నానాల గదిలోని గ్యాస్ గీజర్ను ఆన్ చేయగానే దాని నుంచి విషపూరిత గ్యాస్ లీకై ంది. కొంతసేపటికి ఊపిరాడక ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో గది తలుపులు తెరిచి చూడగా కుప్పకూలిపోయి ఉన్నారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల నిశ్చితార్థం కాగా అల్తాఫ్ పాషాకు నలుగురు కుమార్తెలు సంతానం ఉండగా, వారిలో ఇద్దరికి వివాహాలయ్యాయి. గుల్బమ్ తాజ్కు ఇటీవల నిశ్చితార్థమైంది. ఘటన సమయంలో కాబోయే భర్త కుటుంబం వారి ఇంటిలోనే ఉంది. ఈ ఘోరంతో కుటుంబీకులు తీవ్రంగా విలపించారు. అక్కాచెల్లి బలి మైసూరు జిల్లాలో దుర్ఘటన -
పలు జిల్లాల్లో తుపాను వర్షాలు
● అన్నదాతలకు కష్టం యశవంతపుర: బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో కన్నడనాట పలుజిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఉత్తరకన్నడ జిల్లా కరావళిలో కుండపోత కురుస్తోంది. గాలివానతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంకోలా తాలూకా హరవాడలో 24 గంటల్లో 80 మిల్లీమీటర్ల వర్షం దంచికొట్టింది. బెళెకెరిలో 76 మి.మీ, కుమలా–73 మి.మీ వర్షపాతం నమోదైంది. కారవారలో శనివారం ఉదయం రైల్వేస్టేషన్ మార్గం నీటమునిగింది. రాయచూరు, దక్షిణ కన్నడ, విజయపుర, గదగ్లోనూ భారీ వానలు పడ్డాయి. వరి, జొన్న, ఉల్లి తదితర పంటలకు తీవ్ర నష్టం కలుగుతోంది. డ్యాములు ఫుల్ మైసూరు: కేరళలోని వైనాడు, పశ్చిమ కనుమల్లోని అటవీ ప్రాంతంలో నిరంతరంగా వర్షాలు కురుస్తున్నందున కావేరి, ఉప నదులకు వరద పోటెత్తింది. జిల్లాలోని హెచ్డీ కోటె తాలూకా బీచనహళ్లి గ్రామంలోని కబిని జలాశయం ఈ ఏడాదిలో ఐదోసారి పూర్తిగా నిండి కొత్త రికార్డును లిఖించింది. ఈ డ్యాం 50 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారిగా మే నెలలోనే నిండింది. తరువాత జూన్, జూలై, ఆగస్టు, తాజాగా అక్టోబర్ నెలాఖరులో డ్యాం నిండింది.ఇంకా రెండు మూడు నెలల పాటు జలాశయ నిండుగా ఉంటుందని అధికారులు తెలిపారు. కావేరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మండ్య జిల్లాలోని కేఆర్ఎస్ డ్యాంలో పలు గేట్లను ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. -
లవ్ జిహాద్ కేసులో అరెస్టు
దొడ్డబళ్లాపురం: యువతిని ఇన్స్టాలో పరిచయం చేసుకుని ప్రేమ, పెళ్లి పేరుతో ఆమెను శారీరకంగా వాడుకుని తరువాత మతం మారలేదంటూ ముఖం చాటేసిన మోసగాన్ని బెంగళూరు అమృతహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. మహమ్మద్ బిన్ ఇషాక్ అరైస్టెన నిందితుడు. ఈ సంఘటనను లవ్ జిహాద్గా భావిస్తున్నారు. 2024లో ఇన్స్టా ద్వారా యువతితో పరిచయం పెంచుకున్న ఇషాక్ ఆమెను ప్రేమించినట్టు నటించాడు. తరువాత షికార్లు చేశారు, వివాహం చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని యువతి అడిగితే తమ మతంలోకి మారాలని లేదంటే ఇంట్లో ఒప్పుకోరని, పైగా ప్రైవేటు ఫోటోలు, వీడియోలను లీక్ చేస్తానని బెదిరించాడు. ఈ సెప్టెంబరు 14న ఇంట్లో చూసిన ఓ యువతిని నిశ్చితార్థం చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలించి నిందితున్ని అరెస్టు చేశారు. సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం ● వృద్ధురాలు మృతి కృష్ణరాజపురం: వంట గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై పేలుడు సంభవించి ఇల్లు నేలమట్టమైన ఘటన శనివారం ఉదయం బెంగళూరులోని కృష్ణరాజపురం త్రివేణినగరలో జరిగింది. ఇంటి శిథిలాల కింద ముగ్గురు చిక్కుకోగా, ఒక వృద్ధురాలు మరణించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతురాలిని అక్కయమ్మ (80)గా గుర్తించారు. శేఖర్ (52), కిరణ్ (22) చందన్ (25)లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విస్ఫోటం వల్ల చుట్టుపక్కల ఇళ్లకు కూడా నష్టం వాటిల్లింది. పోలీసులు విచారణ చేపట్టారు. టీవీ నటి బ్లాక్మెయిలింగ్ ● మహిళ ఫోటోలు సేకరించి డబ్బు కోసం డిమాండ్ యశవంతపుర: టీవీ సీరియళ్ల కథల గురించి అందరికీ తెలిసిందే. అందులో పాత్రధారులు నిరంతరం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. అదేమాదిరి ఓ నటి నిజ జీవితంలోనూ ప్రవర్తించింది. కన్నడ టీవీ సీరియల్స్లో నటించి పేరుపొందిన నటీమణి ఆశా జోయిస్ నేరారోపణల్లో చిక్కుకుంది. ఓ మహిళ ప్రైవేట్ వీడియో, ఫోటోలను దొంగతనం చేసి రూ.2 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్లు బెంగళూరు నగర తిలక్ నగర ఠాణాలో ఫిర్యాదు దాఖలైంది. డబ్బు ఇవ్వకపోవడంతో.. శృంగేరి శారదా పీఠం జోయిస్ కుటుంబ సభ్యురాలు, బుల్లితెర నటి ఆశా జోయిస్ పై పార్వతి (61) అనే మహిళ ఈ మేరకు ఫిర్యాదు చేసింది. ఆశా 2016లో మిస్ ఇండియా ప్లానెట్లో పోటీలలో విజేతగా నిలిచారు, తరువాత టీవీ సీరియళ్లలో నటించింది. ఆశాకు బాధితురాలు స్నేహితురాలు అయ్యింది. ఆమె కూడా టీవీ నటి అని చెప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆశా.. బాధితురాలి వీడియోలను సేకరించి ఆమె భర్తను డబ్బు కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఇందుకు వారు తిరస్కరించడంతో వీడియోలు, ఫోటోలు, వాయిస్ రికార్డ్లను బాధితురాలికి తెలిసినవారికి పంపించింది. దీనివల్ల తనకు తీవ్ర అవమానం అయ్యిందని బాధిత మహిళ ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. బీజేపీ నేత ఖూబాకు రూ.25 కోట్ల జరిమానా దొడ్డబళ్లాపురం: అక్రమ మైనింగ్ కేసులో బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి భగవంత్ ఖూబాకు భారీ జరిమానా విధిస్తూ నోటీసులు వెళ్లాయి. కలబుర్గి జిల్లా కాళగి తహసీల్దార్ రూ.25.30 కోట్లు చెల్లించాలని ఖూబాకు నోటీసులు పంపించారు. కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకా వచ్చా గ్రామం పరిధిలో 2014 జూన్ నుంచి 2019 జూన్ వరకూ 2 ఎకరాలకు అనుమతి తీసుకుని 8 ఎకరాలలో గనుల తవ్వకాలు జరిపారని నోటీసుల్లో పేర్కొన్నారు. సంజీవ్కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గనుల శాఖ, కాళగి తహసీల్దార్ జంటగా దర్యాప్తు చేసి ఆరోపణలు నిజమని తేల్చారు. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చి రూ.25.30 కోట్లు చెల్లించాలని ఆదేశించగా, దీనిని ఆయన కోర్టులో సవాల్ చేశారు. -
ఓటీపీ, మోసపూరిత లింక్లతో జాగ్రత్త
● ఓ టెక్కీ సంపాదన చాలక పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్నాడు. ఇంటర్నెట్లో గాలించగా ఓ లింక్ దొరికింది. దానిని క్లిక్ చేయగానే ఫోన్ ఖరాబైంది. ఖాతాలోని రూ.లక్షకు పైగా నగదు దుండగుల ఖాతాకు బదిలీ అయ్యింది. ● మ్యాట్రిమొని వెబ్సైట్లో రెండో పెళ్లి కోసం ఓ మహిళ వివరాలను నమోదు చేసుకుంది. అమెరికాలో ఇంజనీరునంటూ ఓ మోసగాడు ఆమెకు వలవేశాడు. తీయని మాటలు చెప్పి మూడేళ్లలో రూ.2 కోట్లకు పైగా వసూలు చేశాడు. ఇదంతా ఆన్లైన్లోనే జరిగింది.ఇలా చెప్పుకుంటూ పోతే సిలికాన్ రాజధానిలో జరుగుతున్న ఆన్లైన్ నేరాలకు అంతం లేదు. నగరవాసులకు బతిమాలి, బెదిరించి సైబర్ వంచకులు నిండా ముంచుతున్నారు. ఏటా వందల కోట్ల రూపాయలను ఇలా దోచేస్తున్నారు. పోలీసులు ఛేదిస్తున్నవి చాలా తక్కువ కేసులే.దేశంలో అత్యధిక సైబర్ నేరాలు జరుగుతున్న నగరాల్లో బెంగళూరు ఒకటిదొడ్డబళ్లాపురం: సైబర్ క్రైం కేసుల్లో బెంగళూరు రూరల్ జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచింది. విచిత్రం ఏమిటంటే సైబర్ ౖక్రైం బాధితుల్లో చాలామంది విద్యావంతులే కావడం. బెంగళూరు తరువాత బెంగళూరు రూరల్ జిల్లా ప్రజలను ఎక్కువగా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. ఆన్లైన్ నేరాల్లో కూడా రాజధాని అగ్రస్థానంలో కొనసాగడం ఓ రకంగా పోలీసు శాఖకే అప్రతిష్టగా మారిందనే విమర్శలున్నాయి. ఎలాంటి నేరాలు అంటే ఉద్యోగాలు, పార్ట్ టైం ఉద్యోగాలు, తక్కువ సమయంలో డబ్బులు రెట్టింపు చేస్తామని, షేర్లలో పెట్టుబడి, ప్రభుత్వ పథకాల మంజూరు, పెళ్లి సంబంధాలు, డిజిటల్ అరెస్టు పేరుతో ఎక్కువగా సైబర్ నేరాలు, మోసాలు జరుగుతున్నాయి. అమాయకుల నుంచి లక్షల రూపాయలను తమ అక్కౌంట్లలోకి బదిలీ చేయించుకుంటున్నారు సైబర్ నేరస్తులు. సిటీ, సౌత్లో అత్యధికం ● బెంగళూరు సిటీ, దక్షిణ బెంగళూరు ప్రాంతాల్లో అత్యధింగా సైబర్ క్రైం కేసులు నమోదవుతున్నాయని పోలీసులు తెలిపారు. నెల నెలా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ● బెంగళూరు గ్రామీణ జిల్లాలో నెలకు సరాసరి 35 కేసులు వస్తుంటే, 6 నెలలకు 210 కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులను దర్యాప్తు చేసే సైబర్ క్రైం స్టేషన్ బెంగళూరులోనే ఉంది. ● ముఖ్యంగా ఇన్స్టా, వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మోసగాళ్లు వల వేస్తున్నారు. ● నష్టపోతున్న వారిలో ఉపాధ్యాయులు, వైద్యులు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, టెక్కీలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. ● ఆన్లైన్ షాపింగ్, బ్యాంకింగ్, నగదు లావాదేవీలు చేసేవారు సులభంగా బలైతున్నారు. పేరుకుపోతున్న కేసులు బెంగళూరు గ్రామీణ జిల్లాలో సైబర్ క్రైం స్టేషన్ లేకపోవడంతో జిల్లాలో నమోదయ్యే కేసులను బెంగళూరుకు బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే వేలాది కేసులు పెండింగ్లో ఉంటున్నాయి, కొత్తగా వచ్చేవాటిని దర్యాప్తు చేయడం, నేరగాళ్లను పట్టుకోవడం ఆలస్యమవుతోంది. సులభంగా మోసపోతున్న నగరవాసులు బెంగళూరులోని ఓ సైబర్ ఠాణాలో రద్దీ కొల్లగొడుతున్న ఆన్లైన్ వంచకులు బెంగళూరు, బెంగళూరు రూరల్కు తొలి, రెండవ స్థానాలు ఖాకీలకు పెను సవాల్ సైబర్ క్రైం నేరాలపై మాట్లాడిన బెంగళూరు రూరల్ జిల్లా ఏఎస్పీ నాగరాజు ఓటీపీ షేర్ చేయడం వల్ల, ఆన్లైన్లో వచ్చే లింక్లు క్లిక్ చేయడం వల్ల మోసాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా నేరస్తులు బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎయిర్పోర్టు, జిల్లాలో అన్ని తాలూకాల్లో పారిశ్రామిక వాడలు ఎక్కువగా ఉండడం వల్ల ఆన్లైన్ నేరాలూ ఎక్కువైనట్లు చెప్పారు. సైబర్ క్రైం నివారణ కోసం పోలీసుశాఖ ప్రజల్లో జాగృతిని కలిగించేందుకు కృషి చేస్తోందన్నారు. సైబర్ క్రైం బాధితులు నేరుగా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలోని కేసుల పరిష్కారానికి బెంగళూరు మిల్లర్స్ రోడ్డులో ప్రత్యేక సైబర్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
కంది పంట వెలవెల.. రైతన్న విలవిల
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలో అధికంగా పండించే కంది(ఎర్రబంగారం) పంట విస్తీర్ణం ఈసారి తగ్గింది. కంది పంటకు పేరొందిన కలబుర్గి డివిజన్లో సున్నపు రాళ్లతో కూడిన భూమిలో కంది ఏపుగా పెరుగుతుంది. ఈ పంటను క్యాల్షియం, పొటాషియంతో కూడిన మట్టిలో పండిస్తారు. కలబుర్గి జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో కంది పంట సాగవుతుంది. ఖరీఫ్ సీజన్లో అతివృష్టితో అధికంగా ఈదురు గాలులు వీయడంతో కందికి రోగం సోకింది. కంది పంట ఆరు నెలల్లో చేతికి వస్తుంది. కోతకు బిహార్ నుంచి యంత్రాలు వస్తాయి. కల్యాణ కర్ణాటకలోని కలబుర్గి, బీదర్, విజయపుర, యాదగిరి, రాయచూరు, కొప్పళ, గదగ్, బాగల్కోటె, బెళగావి, హావేరి, బళ్లారి జిల్లాలో అధికంగా పండిస్తారు. ఇక్కడ పండిన పంటలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రకు తరలిస్తారు. ఏడాదికి కలబుర్గి జిల్లాలో ఎనిమిది లక్షల హెక్టార్లలో పండిస్తుండగా ఈ ఏడాది రెండు లక్షల హెక్టార్ల మేర విస్తీర్ణం తగ్గింది. జీఐఎల్ గుర్తింపు కలిగిన కంది పప్పును ఆస్ట్రేలియా, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ ఏడాది మార్కెట్లో కందిపప్పు ధర క్వింటాల్కు రూ.12,700 పలికింది. వినియోగదారుడికి కిలో ధర రూ.160–200ల వరకు లభిస్తుంది. ఏడాదికి రూ.5,500 కోట్ల లావాదేవీలు కల్యాణ కర్ణాటకలోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, బళ్లారి, కొప్పళ, గదగ్, హావేరి, బాగల్కోటె, విజయపుర, బెళగావి జిల్లాల్లో పండిన పంట ద్వారా ఏడాదికి రూ.5,500 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం రూ.7,550 మద్దతు ధర ప్రకటించింది. 55 లక్షల క్వింటాళ్ల మేర కొనుగోలు చేయాలని కంది మండలి నిర్ణయం తీసు కుంది. కంది మండలి ఏర్పాటై దశాబ్దం గడిచినా నేటికి సర్కార్ నయా పైసా నిధులు కూడా కేటాయించలేదు. రోగం బారిన పడిన ఎర్రబంగారం ఈ సంవత్సరం తగ్గిన సాగు విస్తీర్ణం -
డిసెంబర్ 13న లోక్ అదాలత్
కేజీఎఫ్ : డిసెంబర్ 13న చివరి లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి శివకుమార్ తెలిపారు. శనివారం నగరంలోని న్యాయవాదుల సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది అక్టోబర్ 13నాటికి 1,99,93,873 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకుంటే డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు. కుటుంబ కలహాలు, చెక్బౌన్స్ తదితర ఎన్నో కేసులను లోక్అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందన్నారు. సమావేశంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రాజగోపాలగౌడ, న్యాయమూర్తి నాగలక్ష్మి, ముజాఫర్ మాంజరి, వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నగల షాపులో మస్కా
● 6 బంగారు గొలుసుల చోరీ మైసూరు: బంగారం బహుప్రియం కావడంతో దొంగలు తెగబడుతున్నారు. కొనుగోలుదారులా వచ్చి ఓ నగల షాపులో పెద్దమొత్తంలో చైన్లను తస్కరించాడో దొంగ. మైసూరు అశోక రోడ్డులోని దీప్ జువెలర్స్లో ఈ ఘటన జరిగింది. వివరాలు... అంగడికి సుమారు 55 ఏళ్ల వ్యక్తి వచ్చి బంగారు, వెండి నాణేలను చూపించాలని అడిగాడు. దీంతో యజమాని రతన్లాల్ 20 నాణేలను అతని ముందు ఉంచాడు. వాటిని చూసి పక్కన పెట్టిన ఆ వ్యక్తి 2 గ్రాముల బంగారు నాణేలుంటే చూపించండి, దేవస్థానానికి ఇవ్వాలి, లోపల ఉంటే తీసుకురండి అని చెప్పాడు. రతన్లాల్ తమ వద్ద బంగారు నాణేలు లేవు, కావాలంటే తెప్పించి ఇస్తామని చెప్పి బాబు అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు. అంతలో ఆ వ్యక్తి బంగారు గొలుసులను చూపించండి అనడంతో కొన్ని గొలుసులను తీశాడు. జైన దేవాలయం స్వామీజీకి ఇవ్వాలని, అందువల్ల మహిళలు తాకని కవర్లో ఉంచిన చైన్లను చూపించాలని అడిగాడు. దీంతో రతన్లాల్ ఫోల్డింగ్ లెదర్ బ్యాగ్లో వివిధ డిజైన్లు ఉన్న 5–6 గొలుసుల ను చూపించారు. ఆ వ్యక్తి ఆ గొలుసులను ఒక్కొక్కటే ప్లాస్టిక్ కవర్లో వేసి అంగడిలో పూజా పీఠంలో ఉంచి పండ్ల బ్యాగ్లో పెట్టాడు. వీటిని ఇలానే బ్యాగ్లో పెట్టి ఉంచండి, మా పిల్లాడు వచ్చి ఒక గొలుసును కొనుగోలు చేస్తాడని చెప్పి రూ.5 వేల నగదు ఇచ్చి వెళ్లాడు. అతను వెళ్లిన తర్వాత రతన్లాల్ కవర్ను పరిశీలించగా, అందులో 6 గొలుసులు లేవు. లబోదిబోమంటూ లష్కర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.సవతి తండ్రి చేతిలో బాలిక హత్యబనశంకరి: మారుతండ్రి చేతిలో చిన్నారి పాప బలైంది. తమ సంతోషానికి అడ్డుగా ఉందని పాపను కిరాతకుడు గొంతు పిసికి చంపివేశాడు, ఈ సంఘటన బెంగళూరు పరిధిలోని కుంభళగూడు పోలీస్స్టేషన్ పరిదిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు... స్థానిక రామసముద్ర కన్నికా లేఔట్లో శిల్పా, కూతురు సిరి (7)తో నివసిస్తోంది. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న శిల్పా భర్త నుంచి విడిగా ఉంటోంది. ఈ మధ్య ఆనేకల్లో మార్కెటింగ్ ఉద్యోగం చేసే దర్శన్ అనే వ్యక్తితో శిల్పా కు పరిచయం ఏర్పడి తరువాత పెళ్లి చేసుకున్నారు. సవతి కూతురు సిరి అంటే దర్శన్కు నచ్చేది కాదు. మన సంసారంలో సిరి అడ్డుగా ఉందని శిల్పా తో గొడవపడ్డాడు. శుక్రవారం ఉదయం శిల్పా విధులకు వెళ్లింది. సాయంత్రం 5.30 సమయంలో దర్శన్ ఇంటికి వచ్చాడు, సిరి ముఖంపై కొట్టి గొంతు పిసికి చంపి పారిపోయాడు. శిల్పా ఇంటికి వచ్చి చూడగా కుమార్తె శవం కనిపించడంతో తల్లిడిల్లింది. స్థానిక పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్శన్ కోసం గాలిస్తున్నారు.అవినీతి పెరిగింది: మోహన్దాస్ శివాజీనగర: తరచూ విమర్శలతో రాష్ట్ర కాంగ్రెస్ సర్కారును ఇరుకున పెడుతున్న ఐటీ పారిశ్రామికవేత్త మోహన్దాస్ పాయ్.. మరోసారి ఎక్స్లో ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి గారూ.. మీ శాఖల్లో అవినీతి చాలా అధికమైంది. ఒక్కొక్క శాఖ ఒక్కొక్క వసూలు రేటును పెట్టుకొందని ఆరోపించారు. పరిశ్రమలకు తక్షణ అనుమతులకు మీరు సింగిల్ విండోకు ప్లాన్ చేశారు, ఇది మంచిదే అన్నారు. మీ ఆలోచనకు ధన్యవాదాలు. అయితే అధికారులు ఆ తరువాత అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది, సింగిల్ విండో ఇక్కడ సాధ్యపడదు. ఎందుకంటే శాఖలలో అవినీతి చాలా ఎక్కువైంది అని పేర్కొన్నారు. -
మాతా శిశు మరణాలను అరికట్టాలి
హొసపేటె: జిల్లాలోని అన్ని ఆస్పత్రులలో మాతా, శిశు మరణాల కేసులు పెరగకుండా వైద్య అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, జాగ్రత్తగా విధులు నిర్వహించాలని జిల్లాధికారిణి కవిత ఎస్. మన్నికేరి సూచించారు. శుక్రవారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో జిల్లా యంత్రాంగం, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన మాతా, శిశు మరణాలపై ఆడిట్ సమావేశానికి అధ్యక్షత వహించి ఆమె మాట్లాడారు. అన్ని ఆస్పత్రుల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి, వైద్యులు సకాలంలో ఆరోగ్య కేంద్రాల్లో ఉండాలన్నారు. రోగులను తనిఖీ చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మాతా శిశు, మరణాల పెరుగుదలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోడానికి, జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆస్పత్రిలో వైద్యాధికారులంతా ప్రతి శనివారం జిల్లా, తాలూకా స్థాయి సమావేశాలను నిర్వహించి లోపాలకు పరిష్కారాలను కనుగొనాలని ఆదేశించారు. ఈ విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణులకు అత్యవసర సేవలు అవసరమైతే తాలూకా వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి చికిత్స అందించాలన్నారు. అందుబాటులో ఉన్న నిధులను నాణ్యమైన సేవలను అందించడానికి ఉపయోగించాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు ఆరోగ్య సలహాలు, నివారణ చర్యల గురించి వివరించాలన్నారు. గర్భిణులు, బాలింతల స్క్రీనింగ్, సురక్షితమైన డెలివరీ, పౌష్టికాహారంపై ఆయుష్ విభాగంతో సంప్రదింపులు జరపాలన్నారు. సాధారణంగా మాతృ మరణాల్లో ముఖ్యమైన రక్తహీనత, రక్తస్రావం అంశాలకు ఆరోగ్య శాఖ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అన్నారు. జెడ్పీ డిప్యూటీ సెక్రటరీ కే.తిమ్మప్ప, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ఎల్ఆర్.శంకర్నాయక్, జిల్లా ఆర్సీహెచ్ అధికారి జంబయ్య, జిల్లా సర్వే అధికారి డాక్టర్ షణ్ముఖ నాయక్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ భాస్కర్, డాక్టర్ రాధిక, తాలూకా వైద్యాధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
కంది రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఈ ఏడాది కంది పంటకు రోగం సోకడంతో పాటు అతివృష్టి, ఈదురు గాలులతో నష్టపోయిన రైతులకు సర్కార్ మద్దతు ధరలు ప్రకటించి, ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలి. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు పరిచి మద్దతు ధర కల్పించాలి. ముఖ్యమంత్రి కార్పస్ ఫండ్ నుంచి పరిహారం అందించాలి. – శరణ బసప్ప, కర్ణాటక ప్రాంత రైతు సంఘం జిల్లాధ్యక్షుడు పంటకు శాసీ్త్రయ ధరలు ప్రకటించాలి కళ్యాణ కర్ణాటకలో కంది పంటకు రోగం సోకి నష్టాల బారిన పడి అప్పుల ఊబిలో చిక్కిన రైతులకు శాసీ్త్రయ ధరలు ప్రకటించాలి. ప్రకృతి వైపరీత్యాలకు అనుగుణంగా పంటల రక్షణకు సలహా, సూచనలివ్వడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారు. వానలు అధికంగా కురవడం, ఈదురు గాలులు వీయడంతో పూత రాలిపోయింది. – భీమా శంకర్, కిసాన్ సభ సంచాలకుడు -
వణికించిన భారీ వర్షం
రాయచూరు రూరల్: జిల్లాలో శుక్ర, శనివారాల్లో తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. ఎక్కడ చూసినా రోడ్లు బురద గుంటలుగా మారాయి. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారు జామున 2 గంటల వరకు వర్షం పడింది. లోతట్టు ప్రాంతంలోని జలాల్ నగర్, మున్నూరు వాడి, లాల్ పహాడ్, మహావీర చౌక్, దేవినగర్, మడ్డిపేట ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చొరబడ్డాయి. నగరసభ మాజీ సభ్యులు తిమ్మారెడ్డి, శాలం కాలనీలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. వాన నీటిని మళ్లించడానికి చర్యలు తీసుకోవాలని నగరసభ అధికారులకు సూచనలు జారీ చేశారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వానలకు వాగులు, వంతెనలు పొంగి ప్రవహిస్తుండటంతో పంట పొలాల్లోకి నీరు చేరాయి. ఇడపనూరు, పుచ్చలదిన్ని, మిడగలదిన్ని, గదార, యరగేర, బిచ్చాలి, యడ్లాపుర మధ్య రహదారి కోతకు గురైంది. మరో వైపు వర్షాలు కురవడంతో వరి పైరు నేలకొరిగి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొప్పళ తాలూకా బసాపుర రైతు లక్ష్మణ్ రాజారాం పేట పొలంలో క్రిమి సంహారక మందును తాగడానికి ప్రయత్నించాడు. నెల రోజుల క్రితం అతివృష్టి కురవడం, శుక్రవారం సాయంత్రం అకాల వర్షాలకు వరిపైరు నేలకొరిగింది. నేలవాలిన పంటను చూడలేక రైతు ఆత్మహత్యాయ త్నానికి పూనుకున్నారు. లోతట్టు కాలనీలు జలమయం వర్షం దెబ్బకు నేలకొరిగిన వరి పైరు కొప్పళ జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం -
విద్యార్థులు వృత్తిశీల నైపుణ్యత సాధించాలి
బళ్లారి రూరల్: ఇంజినీరింగ్లో ఐఈఈఈ విద్యార్థులు అత్యాధునిక అవకాశాలతో వృత్తిశీల నైపుణ్యాన్ని సాధించాలని బెంగళూరు దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్, అకడమిక్ అండ్ హెచ్ఓడీ డాక్టర్ అన్నపూర్ణ పి.పాటీల్ తెలిపారు. శుక్రవారం ఆర్వైఎంఈసీలో జాతీయ స్థాయి ఐఈఈఈ దినోత్సవ ఆచరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఐఈఈఈ విద్యార్థులు నెట్వర్కింగ్, అత్యాధునిక పరిశోధనలు వృత్తిశీల అభివృద్ధికి ఎంతో సహకరిస్తాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రగతిని సాధించాలన్నారు. కార్యక్రమంలో వీరశైవ విద్యావర్ధక సంఘం అధ్యక్షుడు డాక్టర్ కణేకల్ మహంతేశ్, పాలక మండలి అధ్యక్షుడు జానెకుంటె బసవరాజు, కార్యదర్శి డాక్టర్ అరవింద్ పాటిల్, సహకార్యదర్శి యాళ్పి మేటి పంపనగౌడ, కోశాధికారి బైలువద్దిగేరి ఎర్రిస్వామి, ప్రిన్సిపాల్ డాక్టర్ హనుమంతరెడ్డి, వైస్ప్రిన్సిపాల్ డాక్టర్ సబితా సోనాలి తదితరులు పాల్గొన్నారు. దంత పరీక్ష శిబిరంరాయచూరు రూరల్: నగరంలో ఉచిత దంత ఆరోగ్య చికిత్స శిబిరాన్ని ప్రముఖ దంత వైద్యురాలు జయశ్రీరెడ్డి చేపట్టారు. శనివారం నగరంలోని జైన్ మందిర్ రహదారిలోని ఆస్పత్రిలో దంత వ్యాధులపై ఉచిత పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో మొదటి రోజున 25 మందికి ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు చేశారు. బళ్లారిలో జువెల్స్లో సోదాలుసాక్షి బళ్లారి: కేరళ శబరిమలలో అయ్యప్పస్వామి ఆలయానికి చెందిన బంగారాన్ని అక్రమంగా బళ్లారిలోని రొద్దం జువెల్స్లో అమ్మకం జరిగినట్లు సిట్ అధికారులకు తెలియడంతో సదరు అంగడిలో సోదాలు చేశారు. బళ్లారి నగరంలోని రొద్దం జువెల్స్లో 475 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు అంగడి యజమాని గోవర్ధన్ సిట్ అధికారుల ముందు ఒప్పుకొన్నారు. తనకు అయ్యప్పస్వామి ఆలయానికి చెందిన బంగారమని తెలియదని చెప్పాడు. సిట్ అధికారులు విచారణ జరిపి, మళ్లీ పిలిస్తే తప్పకుండా రావాలని సూచించారు. రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలుబళ్లారి రూరల్ : బళ్లారి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని పోలీస్ జింఖానాలో రాష్ట్ర స్థాయి వెటరన్ టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను జిందాల్ ఫౌండేషన్ సీఎస్ఆర్ హెడ్ బి.పెద్దన్న ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం, ఆరోగ్యం చేకూరుతుందన్నారు. ఈ పోటీల విజేతలకు జిందాల్ ఫౌండేషన్ ట్రోఫీలను, ఆరు టేబుల్ టెన్నిస్ బోర్డులను, ఇతర పరికరాలను అందజేసింది. పోటీల్లో బళ్లారి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రముఖులు, టెన్నిస్ క్రీడాకారులు పాల్గొన్నారు. నదిలో యువకుడు జలసమాధి గుమ్మఘట్ట: సరదాగా నదిలో స్నానానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో బైరవానితిప్ప ప్రాజెక్టు ఎగువ భాగాన ఉన్న సరిహద్దు కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఆంధ్ర, కర్ణాకట నుంచి నిత్యం సందర్శకులు వస్తుంటారు. యువకులు నీటిని చూసి ఊరుకోలేక ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. అయినా సంబంధిత శాఖల అధికారుల్లో మచ్చుకై నా చలనం కనిపించడం లేదని బాధిత తల్లిదండ్రులు, ప్రజలు విమర్శిస్తున్నారు. రాయదుర్గం పట్టణానికి చెందిన ఫయాజ్, హమాన్, నోమిన్ అనే యువకులు శనివారం బైక్లో ప్రాజెక్టు వద్దకు వచ్చారు, వేదావతి హగరికి వెళుతున్న నీటిలోకి దిగారు, వీరిలో ఫయాజ్ (20) ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోవడంతో చనిపోయాడు. సనావుల్లా, ఫాతిమా దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు కావడంతో వారు గుండెలవిసేలా రోదించారు. -
అభివృద్ధి పథంలో బళ్లారి
సాక్షి బళ్లారి: తనపై ఎంతో విశ్వాసం, నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పేర్కొన్నారు. శనివారం తన 36వ జన్మదినం పురస్కరించుకొని నగరంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, కనక దుర్గమ్మ ఆలయంతో పాటు పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదిన కార్యక్రమాల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బళ్లారి సర్వతోముఖాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు. సువర్ణ బళ్లారిగా మార్చేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఎన్నో నూతన పథకాలు అమలు చేశామన్నారు. ప్రతి రోడ్డును అభివృద్ది చేయడానికి ముందుకు వెళ్తున్నామన్నారు. నగరంలో పారదర్శక పాలనను అందిస్తున్నామన్నారు. నగరంలో నిరంతరం మంచినీటిని అందించేందుకు తుంగభద్ర డ్యాం నుంచి బళ్లారి నగరానికి నేరుగా నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. నగరంలో రోడ్ల వెడల్పు, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.200 కోట్లతో పనులు చేపడుతున్నామన్నారు. ఇలా నగరంలో పలు రోడ్లు, స్వచ్ఛత కోసం చేపడుతున్న పనులకు నిధుల కొరత లేదన్నారు. జన్మదినం నేపథ్యంలో ముందుగా తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకొన్నారు. నగరంలో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసి ఆయా వార్డుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల రుణం తీర్చుకుంటా ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి -
రెండో పంటకు నీరందించండి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు కింద రెండో పంటకు నీరందించాలని రైతు సంఘం గౌరవాధ్యక్షుడు చామరస మాలి పాటిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ పంటకు నీరు అందించడానికి డీసీఎం అంగీకరించక పోవడాన్ని తప్పు బట్టారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్గేట్ల అమరిక విషయంలో డ్యాంలో 50 టీఎంసీల నీరున్నా గేట్ల ఏర్పాటుకు ఎలాంటి నష్టం లేదన్నారు. రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయ నగర జిల్లాల్లోని ఇంచార్జి మంత్రులు, శాసన సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు కలిసి ముఖ్యమంత్రిని కలిసి తుంగభద్ర ఎడమ కాలువ కింద రబీ సీజన్కు నీరు వదలాలని కోరాలన్నారు. 70 ఏళ్ల నాటి అక్విడక్ట్లు, రహదారులు, డిస్ట్రిబ్యూటర్ల మరమ్మతులు చేపడతామంటే రైతులు రెండవ పంటను వదులుకోడానికి సిద్ధమన్నారు. డ్యాం క్రస్ట్గేట్ల అమరిక కోసం రైతులు రబీ పంటను వదులుకోవడం సాధ్యం కాదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలన్నారు. మాజీ శాసన సభ్యుడు గంగాధర నాయక్, రైతు నేతలు బూదయ్య స్వామి, ప్రభాకర్ పాటిల్, జాన్ వెస్తీలున్నారు. -
రైలు ప్రయాణం.. నరకప్రాయం
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలో రైలు ప్రయాణికులకు తిప్పలు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి యాదగిరి, రాయచూరు రైల్వే స్టేషన్ల పరిధిలో రైలు బోగీలు ప్రయాణికులతో పూర్తిగా నిండిపోవడంతో కింద పడుకొని పిల్లా పాపలతో ప్రయాణం చేశారు. లాతూర్ నుంచి బెంగళూరు వరకు వెళ్లే రైలులో ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల నుంచి జీవనోపాధి కోసం వెళ్లే వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. పండుగ సమయంలో అదనపు రైళ్లను నడపకుండా రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనీసం అదనపు బోగీలను కూడా అమర్చకుండా ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలున్నాయి. -
తుంగభద్ర పరవళ్లు
హొసపేటె: కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన నదీ పరివాహకంలోని తీర్ధహళ్లి, శివమొగ్గ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శనివారం 24 వేలకు పైగా క్యూసెక్కుల వరద చేరింది. దీంతో 5 గేట్లను రెండున్నర అడుగుల మేరకు పైకెత్తి దిగువకు 18 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసినట్లు మండలి అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో నదికి ఇరువైపుల లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1626.06 అడుగులు, నీటినిల్వ 80.003 టీఎంసీలు, ఇన్ఫ్లో 24,500 క్యూసెక్కులుగా ఉందని మండలి వర్గాలు తెలిపాయి. తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో పర్యాటకులతో డ్యాం పరిసరాలు కిటకిటలాడాయి. శనివారం డ్యాం వద్ద పర్యాటకుల సందడి కనిపించింది. గేట్ల నుంచి దిగువకు పారుతున్న నీటిని వీక్షించి పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు. -
గురుమఠకల్లో కవాతుకు బ్రేక్
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా చిత్తాపూర్లో ఆర్ఎస్ఎస్ కవాతు నిర్వహణకు కలబుర్గి హైకోర్టు డివిజన్ బెంచ్లో మరో పిటిషన్ వేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో యాదగిరి జిల్లాధికారి హర్షల్ బోయర్ గురుమఠకల్లో ఆర్ఎస్ఎస్ కవాతుకు బ్రేక్ వేశారు. వారం రోజుల క్రితం చిత్తాపూర్లో ఆర్ఎస్ఎస్, భీమ్ ఆర్మీ కవాతును ఒకే రోజున రెండింటికీ అవకాశం ఇవ్వడం కుదరదని తహసీల్దార్ నాగయ్య హిరేమఠ్ రెండు అర్జీలను తిరస్కరించిన సంగతి విదితమే. దీనిని ఆధారంగా చేసుకొని ఆర్ఎస్ఎస్ కలబుర్గి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆర్ఎస్ఎస్కు కొన్ని సలహాలు, సూచనలు జారీ చేస్తూ ఏరోజున ఆర్ఎస్ఎస్ కవాతు చేస్తారు? అనే అంశాన్ని ఉల్లేఖిస్తూ కొత్తగా పిటిషన్ వేయాలని ఆదేశించింది. ఈ విషయంపై కోర్టులో జరిగిన వాదనల అనంతరం విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. మూడు రోజుల క్రితం చేసిన దరఖాస్తును రద్దు చేయడంపై ఆర్ఎ్స్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యాదగిరి జిల్లా సురపుర, హుణసగి, శహాపుర, వడగేర, యాదగిరిల్లో కవాతు నిర్వహించారు. త్రిచక్రవాహనాల పంపిణీరాయచూరు రూరల్ : నగరంలో పురాతన పాఠశాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడించారు. శనివారం రూ.కోటితో చేపట్టిన నేతాజీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరగతి గదులను ప్రారంభించి మాట్లాడారు. పెద్దలు పిల్లలను పాఠశాలకు పంపి విద్యాబుద్దులు నేర్పించాలన్నారు. నగరంలోని చంద్ర మౌళేశ్వర సర్కిల్ నుంచి గంజ్ సర్కిల్ వరకు రహదారి అభివృద్ధికి రూ.30 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. నగరంలోని అంబిగర చౌడయ్య నూతన విగ్రహాన్ని పరిశీలించారు. తన కార్యాలయంలో మంత్రి 34 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందించారు. కార్యక్రమంలో అభినవ రాచోటి శివాచార్యులు, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఉపాధ్యక్షుడు సాజిద్, రుద్రప్ప, శాంతప్ప, అమరేగౌడ, జయన్న, రాజు, సుభాష్, నరసింహులు, శాలం, అధికారులున్నారు. కన్నడ భాష పరిరక్షణకు ఉద్యమం రావాలి కోలారు: అన్య భాషలు మాట్లాడే వారిని కన్నడం వైపు ఆకర్షించే ప్రయత్నం చేయాలని రాష్ట్ర కన్నడ అభివృద్ధి ప్రాధికార కార్యదర్శి సంతోష్ హానగల్ సూచించారు. కన్నడ భాషాభివృద్ధి– సవాళ్లు అనే అంశంపై నగరంలోని ప్రభుత్వ కళాశాలలో కన్నడ అభివృద్ధి ప్రాధికార, ఆదిమ సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన విచార సంకీర్ణంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఉన్నంత కన్నడ భాషాభిమానం మనలో లేకపోవడం విచారకరమన్నారు. కన్నడ అభివృద్ధికి గోకాక్ విప్లవం తరహాలో కన్నడ భాషా ఉద్యమం ప్రారంభించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కన్నడ పర సంఘటనల జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, కరవే జిల్లా అధ్యక్షుడు మేడిహాళ రాఘవేంద్ర, జయ కర్నాటక సంఘం జిల్లా అధ్యక్షుడు త్యాగరాజ్ పాల్గొన్నారు. పెళ్లి కాలేదని వ్యాన్ డ్రైవర్ ఆత్మహత్య క్రిష్ణగిరి: ఇరవై ఎనిమిది ఏళ్ల వయస్సు వచ్చినా పెళ్లి కాలేదనే బాధతో తాగుడుకు బానిస అయిన వ్యాన్ డ్రైవర్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన కురుబరపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు క్రిష్ణగిరి సమీపంలోని గంగోజి కొత్తూరు గ్రామానికి చెందిన బాలాజీకి పలు సంబంధాలు చూసినా పెళ్లి కుదరలేదు. దీంతో తాగుడుకు అలవాటుపడ్డాడు. ఇక పెళ్లి జరగదేమో అని మనస్థాపానికి గురైన బాలాజీ.. శుక్రవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కురుబరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. పోలియో నిర్మూలనకు సైకిల్ యాత్ర కోలారు: పోలియో నిర్మూలనకు శ్రమిస్తున్న రోటరీ సంస్థ సీనియర్ సభ్యులు శనివారం కోలారు నగరం నుంచి తిరుపతికి సైకిల్ యాత్ర చేపట్టారు. రోటరీ సెంట్రల్ మాజీ అధ్యక్షుడు సిఎంఆర్ శ్రీనాథ్ మాట్లాడుతూ దేశంలో పోలియేను సమూలంగా నిర్మూలించాలంటే ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ఇందుకోసం సైకిల్ యాత్రను ప్రారంభించామన్నారు. అనంతరం సైకిల్ యాత్రికులకు పుష్పగుచ్ఛం అందించి శక్తి వర్ధక పానీయాలను అందించారు. రోటరి అధ్యక్షుడు నాగరాజ్, వలయ కార్యదర్శి ఎస్ సుధాకర్, వలయ అధ్యక్షుడు రవీంద్రనాథ్ పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యేను కుమ్మేసిన ఎద్దు.. పోటీల్లో అపశృతి
బెంగళూరు: కర్ణాటకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎద్దుల పందెం పోటీల ఉత్సవం సందర్భంగా ఓ ఎద్దు.. మాజీ ఎమ్మెల్యేను ఎత్తి పాడేసింది. దీంతో, ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కర్ణాటకలోని శివమొగ్గలోని బల్లిగావిలో హోరీ హబ్బా అనే సాంప్రదాయ ఎద్దుల పందేల ఉత్సవం జరిగింది. ఈ సందర్బంగా శికారిపుర పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మహాలింగప్ప, స్థానికులు ఈ కార్యక్రమం చూసేందుకు వచ్చారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా.. ఒక ఎద్దు అక్కడున్న వారిపైకి దూసుకొచ్చింది. ఇంతలో ఒక ఇంటి ముందే నిలుచున్న మాజీ ఎమ్మెల్యే మహాలింగప్పపైకి ఎద్దు దూసుకెళ్లింది. తన కొమ్ములతో అతడిని ఎత్తి పడేసింది. దీంతో, మహాలింగప్ప తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయాడు. అనంతరం, స్థానికుల.. ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహాలింగప్ప చికిత్స పొందుతున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కర్ణాటకలో హోరీ అనేది ఒక సాంప్రదాయ గ్రామీణ క్రీడ. ఈ సందర్బంగా అలంకరించబడిన ఎద్దులను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులపైకి పరుగెత్తిస్తారు. ఇందులో పాల్గొనే కొంతమంది వాటిని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని రోజుల క్రితం హోరీ పోటీల సమయంలో హవేరి జిల్లాలో నలుగురు మరణించారు. హవేరి, తిలవల్లి తాలూకాలతో సహా వివిధ ప్రాంతాలలో ప్రాణనష్టం జరిగినట్టు అధికారులు నిర్ధారించారు.Video: Karnataka Ex-MLA Gored During Bull Race Festival https://t.co/4HGPlNhBap pic.twitter.com/NAFHOLB2Lb— NDTV (@ndtv) October 25, 2025 -
కర్ణాటక ‘ఎత్తు’పొడుపు.. నోరుమెదపని ఆంధ్ర!
సాక్షి, అమరావతి: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుపై కర్ణాటక సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోంది. గత నెల 16న ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు కర్ణాటక కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురయ్యే 75,563 ఎకరాల భూసేకరణ.. 20 గ్రామాలతోపాటు బాగల్కోట మున్సిపాల్టీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పనకు 6,467 ఎకరాలు.. 5.94 లక్షల హెక్టార్లకు నీళ్లందించడానికి వీలుగా కాలువల తవ్వకానికి 51,837 ఎకరాలు వెరసి 1,33,867 ఎకరాల సేకరణకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటుచేస్తూ ఈనెల 9న కర్ణాటక జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరం మగాణి భూమికి రూ.40 లక్షలు, మెట్ట భూమికి రూ.30 లక్షలు పరిహారంగా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఏటా రూ.18 వేల కోట్ల చొప్పున వ్యయం చేసి నాలుగేళ్లలోగా భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా ఆల్మట్టి డ్యాం గరిష్ఠ నీటి మట్టాన్ని 519.6 మీటర్లు(129.72 టీఎంసీలు) నుంచి 524.256 మీటర్లు(279.72 టీఎంసీల)కు పెంచే ప్రక్రిను పూర్తి చేస్తామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్న 1996–2003 మధ్య ఆల్మట్టి డ్యాం ఎత్తును 509.016 మీటర్ల నుంచి 519.6 మీటర్లకు కర్ణాటక సర్కార్ పెంచేసింది. 2003–04 ముందు వరకూ శ్రీశైలం ప్రాజెక్టుకు జూన్ నాలుగో వారంలోనే ఎగువ నుంచి కృష్ణా వరద వచ్చేది. కానీ.. ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్లకు పెంచడంతో శ్రీశైలానికి వరద జూలై నాలుగో వారం లేదా ఆగస్టు మొదటి వారంలో వస్తోంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు.. ఉదాహరణకు 2015–16లో కృష్ణా నుంచి శ్రీశైలానికి కేవలం 24.97 టీఎంసీలే వచ్చాయి. ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్లకు పెంచితే.. నీటి నిల్వ మరో వంద టీఎంసీలు పెరుగుతుంది. అదనంగా 5.94 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించే వ్యవస్థ కర్ణాటకకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఆల్మట్టిలోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా కర్ణాటక సర్కార్ ఆయకట్టుకు తరలిస్తుంది. అప్పుడు శ్రీశైలానికి ఎగువ నుంచి కృష్ణా వరద వచ్చే అవకాశమే ఉండదని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్పై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారిగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు. అయినా సరే చంద్రబాబు సర్కార్ 1996–2003 తరహాలోనే ఇప్పుడు మొద్దునిద్ర పోతోందని సాగునీటిరంగ నిపుణులు మండిపడుతున్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు వల్ల బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తమ రాష్ట్రంలో సంగ్లి, కొల్హాపూర్ జిల్లాలు ముంపునకు గురవుతాయని.. దీనిపై సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ(స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే స్పష్టం చేసినా సీఎం చంద్రబాబు నోరుమెదపకపోవడంపై నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బిగ్బాస్ ఫేమ్ దివ్యపై హిట్ అండ్ రన్ కేసు.. ఏం జరిగిందంటే?
సాక్షి, యశవంతపుర: బిగ్బాస్ అనగానే వివాదాలు, గొడవలు గుర్తుకువస్తాయి. అదే మాదిరిగా బుల్లితెర నటి, గతంలో బిగ్బాస్–8 పోటీదారు దివ్య సురేశ్ హిట్ అండ్ రన్ కేసులో చిక్కుకుంది. బైక్ను ఢీకొనడంతో ఓ యువతి కాలు విరిగినట్లు తెలిసింది. దీంతో, ఆమెను విచారించి కారును సీజ్ చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈనెల నాలుగో తేదీ అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో బెంగళూరు బ్యాటరాయనపుర ఎంఎం రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. కిరణ్, అనుషా, అనిత కలిసి బైకులో ఆస్పత్రికి వెళుతున్నారు. కుక్కలు అడ్డురావటంతో భయంతో కిరణ్ బైకును కొద్దిగా కుడివైపు తిప్పాడు. అదే సమయంలో వెనుక వేగంగా వస్తున్న దివ్య సురేశ్ కారు.. వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు కింద పడ్డారు. అనిత కాలికు దెబ్బ తగిలింది. అయినా కూడా దివ్య కారు ఆపి ఏమైందో తెలుసుకోకుండా అలాగే ఉడాయించింది. రూ.2 లక్షలు ఖర్చయింది ఈ క్రమంలో కిరణ్ ఏడో తేదీన కారు హిట్ అండ్ రన్పై బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం, పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా అది దివ్య సురేశ్ కారుగా గుర్తించారు. దీంతో, ఆమెను విచారించి కారును సీజ్ చేశారు. అనిత కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆస్పత్రిలో చేరింది. చికిత్సగానూ రూ. 2లక్షలు ఖర్చయినట్లు, తమకు న్యాయం చేయాలని కిరణ్ ఫిర్యాదులో కోరాడు. Weeks after a late-night hit-and-run accident in Bengaluru, the city traffic police on Friday identified ex Bigg Boss Kannada contestant Divya Suresh as the alleged driver of the car involved in the accident that left three people injured. The accident took place near Nithya… pic.twitter.com/ucoigQ6FWn— Karnataka Portfolio (@karnatakaportf) October 24, 2025 -
హెచ్టీటీ–40 టెస్టు సక్సెస్
న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా రక్షణ తయారీ రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో అడుగు ముందుకేసింది. బెంగళూరులోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తయారుచేసిన మొట్టమొదటి దేశీయ శిక్షణ విమానం హిందూస్తాన్ టర్బో ట్రైనర్–40(హెచ్టీటీ–40) ఆకాశంలో విజయవంతంగా దూసుకెళ్లింది. ఎలాంటి లోపాలు లేకుండా విమా నం అద్భుతమైన స్థిరత్వాన్ని, పనితీరును కనబర్చినట్లు హెచ్ఏఎల్ అధికారులు ధ్రువీకరించారు. శుక్రవారం బెంగళూరులో ఈ విమానాన్ని పరీక్షించారు. హెచ్టీటీ–40 అనేది బేసిక్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పైలట్లకు ఇందులో శిక్షణ ఇవ్వబోతున్నారు. దీనిద్వారా వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించవచ్చు. సైనిక విన్యాసాలు చేపట్టవచ్చు. రాత్రిపూట కూడా పనిచేస్తుంది. హెచ్టీటీ–40ని పూర్తిగా హెచ్ఏఎల్ అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేసింది. ఇందులో అత్యాధునిక వసతులున్నాయి. ఈ విమానంతో తక్కువ ఖర్చుతోనే పైలట్లకు శిక్షణ ఇవ్వొ చ్చు. దేశీయంగానే రక్షణ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోందని హెచ్ఏఎల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వైమానిక దళంలో పాత కాలం నాటికి విమానాలతోనే శిక్షణ ఇస్తున్నారు. వీటి స్థానంలో ఇకపై హెచ్టీటీ–40 విమానాలను ప్రవేశపెట్టబోతున్నారు. -
ఓటుకు రూ.80 వసూలు.. ఓట్ చోరులను గుర్తించిన కర్నాటక సిట్
బెంగళూరు: 2023 కర్నాటక అసెంబ్లీ ఎన్నిక ల్లో అలంద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా లో అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోప లు నిజమేనని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తెలిపింది. ఓటర్ల పేర్లను తొలగించే కుంభకోణంతో కనీసం ఆరుగురికి సంబంధమున్నట్లు గుర్తించింది.ఇక, వీరికి ఓ డేటా సెంటర్తో సంబంధాలున్నాయని, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ ద్వారా ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించారని సిట్కు సారథ్యం వహించిన సీఐడీ అద నపు డీజీ బీకే సింగ్ చెప్పారు. పేర్లను తొలగించాలంటూ అందిన మొత్తం 6,994 అభ్యర్థన ల్లో ఏవో కొన్ని మినహా చాలామటుకు బోగస్ వేనని గుర్తించామన్నారు. అలంద్లో ఓటర్ల తొలగింపునకు కుట్ర జరిగింది వాస్తవమని చెప్పారు. మొత్తం 30 మంది వరకు ప్రశ్నించి, అనుమానితులుగా ఆరుగురిని నిర్ధారించామని, వీరిని త్వరలో అరెస్ట్ చేస్తామని వివరించారు. విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిపామన్నారు.ఇందులో అప్పట్లో అలంద్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన సుభాష్ గుత్తేదార్, ఆయన ఇద్దరు కుమారుల ఇళ్లు కూడా ఉన్నాయన్నారు. సోదాల సమయంలో సుభాష్ ఇంటికి సమీపంలో కాలిపోయిన ఓటరు జాబితాలు బయటపడినట్లు ఆయన వెల్లడించారు. అయితే, దీపావళి సందర్భంగా తమ సిబ్బంది వృథా వస్తువులను తొలగించే క్రమంలో పనికి రాని ఓటరు జాబితాలను సైతం కాల్చేశారని సుభాష్ గుత్తేదార్ వివరించారు. ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదన్నా రు.ఇలా ఉండగా, అలంద్ నియోజకవర్గం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సొంత జిల్లా కలబురిగి పరిధిలోనిదే కావడం గమనార్హం. అలంద్లో ఓట్ చోరీ జరిగినట్లు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ ఇటీవల చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై దర్యాప్తు కోసం కర్నా టకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ను నియమించింది. కాగా, అలంద్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అవకతవకలు జరిగాయని మంత్రి ప్రియాంక్ ఖర్గే గురువారం ఆరోపించారు. వాటిపైనా సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. ఈ ముఠా ఓటుకు రూ.80 చొప్పున వసూలు చేసిందన్నారు. ఇదంతా బీజేపీ నేతలు పాల్పడిన కుంభకోణమేనన్నారు. బాధ్యులను కటకటా ల్లోకి నెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, అప్పట్లో చీఫ్ ఎలక్టోరల్ అధికారి అడ్డుకోవడం వల్లే ఓట్ల తొలగింపు కుంభకోణానికి బ్రేకులు పడ్డాయని అలంద్లో 10వేల ఓట్ల తేడాతో గెలుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేత బీఆర్ పాటిల్ తెలిపారు. -
మానవ జన్మ ఎంతో ఉత్తమం
సాక్షి, బళ్లారి: ఈ చరాచర జీవరాశుల్లో మానవ జన్మ ఎంతో ఉత్తమమైనదని, మనిషిగా పుట్టిన వారు ప్రేమ, విశ్వాసం, నమ్మకంతో జీవించి దైవ నామస్మరణ చేసి ముందుకు వెళ్లాలని అడవిలింగ స్వామి పేర్కొన్నారు. గురువారం నగరంలోని అఖండ కర్ణాటక వాల్మీకి ఐక్య కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేవుడికి పూజ చేయడం, టెంకాయ కొట్టడం, నైవేద్యం సమర్పించడంతోనే సరికాదని, మనసు శుద్ధంగా ఉంచుకొని భగవంతుడిని ఎవరు పూజిస్తారో అలాంటి వారికి ఎల్లప్పుడు దేవుడి ఆశీస్సులు ఉంటాయన్నారు. అఖండ కర్ణాటక వాల్మీకి ఐక్య కూటమి రాష్ట్ర అధ్యక్షుడు జోళదరాశి తిమ్మప్ప మాట్లాడుతూ వాల్మీకి సమాజంలో జన్మించిన మహర్షి వాల్మీకి భక్తిశ్రద్ధలతో, నియమనిష్టతో జీవితాన్ని సాగించి వాల్మీకి రామాయణాన్ని రచించి భూమి, ఆకాశం ఉన్నంత వరకు వాల్మీకి పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఇలాంటి సమాజంలో జన్మించిన మనమందరం మంచి నడతతో ముందుకెళ్లి సమాజంలో అందరి దృష్టిని ఆకర్షించాలన్నారు. కలిసి కట్టుగా ఉంటేనే ముందుకు వెళ్లడానికి సాధ్యపడుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు. వాల్మీకి సమాజ ప్రముఖులు లక్ష్మణ్ తుమటి, ముద్ద మల్లయ్య, జయరాం, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అడవిలింగ స్వామి -
పేకాట కేంద్రాలపై మెరుపు దాడి
సాక్షి, బళ్లారి: దీపావళి పండుగ నేపథ్యంలో పేకాటరాయుళ్లు జిల్లాలో పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు మెరుపుదాడి చేసి దాదాపు రూ.17,31,140లను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ శోభారాణి గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. గత మూడేళ్లుగా దీపావళి పండుగ సందర్భంగా పేకాట నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు ఎంతెంత నగదు స్వాధీనం చేసుకొన్నారో పేర్కొన్నారు. 2023లో 101 కేసులు నమోదు కాగా రూ.10,83,800లను స్వాధీనం చేసుకొన్నామన్నారు. 2024లో 137 కేసులు నమోదు కాగా రూ.16,44,665లను స్వాధీనం చేసుకొన్నామన్నారు. పండుగల నేపథ్యంలో పేకాట నిర్వహించే వారిపై జిల్లా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. టపాసుల పేలుళ్లలో ఇద్దరికి గాయాలు హొసపేటె: దీపాల పండుగ దీపావళి సందర్భంగా బుధవారం రాత్రి ఓ ఇంటి సమీపంలో టపాసులు పేలుస్తుండటంతో ఇద్దరు పిల్లల ముఖాలపై తీవ్ర గాయాలయ్యాయి. విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా గుడేకోటె గ్రామానికి చెందిన రుద్రేష్ సుజాత దంపతుల కుమారుడు కుమార్(9), తిప్పేస్వామి కుమార్తె రేణుక (10) అనే ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర వదిలి పెట్టిన బాణసంచా కాగితపు ముక్కలను పోగు చేసి వెలిగించబోగా బాణసంచా పేలి, నిప్పురవ్వలు వీరిద్దరి కళ్లు, ముఖంపై పడటంతో గాయాలయ్యాయి. బాలుడిని వెంటనే బళ్లారిలోని బిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక రేణుక గుడేకోటె ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని బాలిక తండ్రి తిప్పేస్వామి తెలిపారు. కవాతుకు సంఘాల పోటీ రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా చిత్తాపురలో ఆర్ఎస్ఎస్ కవాతుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆర్ఎస్ఎస్తో పాటు చిత్తాపురలో మూడు సంఘాల నుంచి కలబుర్గి జిల్లాధికారికి దరఖాస్తులు అందాయి. చిత్తాపురలో ఆర్ఎస్ఎస్, భీమ్ ఆర్మీ, కురుబ సమాజం, దళిత ప్యాంథర్లు నవంబర్ 2న ఒకే రోజు కవాతుకు మూడింటికి అవకాశం ఇవ్వాలంటూ అర్జీలను జిల్లాధికారిణి ఫౌజియ తరన్నంకు విన్నవించారు. ఈ విషయంపై ఇప్పటికే ఆర్ఎస్ఎస్ కలబుర్గి హైకోర్టు డివిజన్ బెంచ్లో పిటిషన్ వేసిన సంగతి విదితమే. పేదల చదువుకు అడ్డంకి వద్దురాయచూరు రూరల్: సమాజంలో పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి అడ్డంకి రాకూడదని ఈడీఆర్టీ సంస్థ సంచాలకురాలు రత్న పేర్కొన్నారు. గురువారం తాలూకాలోని పంచముఖి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 250 బ్యాగులు, 1080 నోటు పుస్తకాలు, వంద ప్లేట్లు, వంద గ్లాసులు పంపిణీ చేసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రాధాన్యత కల్పించి వారిని భావిభారత పౌరులుగా తీర్చిద్దాలన్నారు. మహిళా ఎస్ఐపై లైన్మెన్ దాడి.. అరెస్ట్ హుబ్లీ: విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై రైల్వే లైన్మెన్ దాడి చేసి పోలీసు వాహనానికి హాని కలిగించిన ఘటన నవలగుంద బస్టాండ్ దగ్గర హుబ్లీ– విజయపుర హైవేలో వెలుగు చూసింది. బాధ్యుడిని అరెస్ట్ చేశారు. ఆర్ఎస్ఎస్ కవాతు వేళ భద్రత కోసం విచ్చేసిన అణ్ణిగేరి ఎస్ఐ ఉమాదేవిపై నవలగుంద తాలూకా గుడిసాగర నివాసి ద్యామనగౌడ కులకర్ణి బైక్లో వచ్చి పోలీస్ వాహనాన్ని ఢీకొన్నాడు. అంతేగాక ఆమె ఎస్ఐను అసభ్యంగా దుర్భాషలాడి నిందించాడు. కాలిపై కొరికి గాయపరిచాడని ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనపై నవలగుంద పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. సీఐపై అవినీతి కేసు నమోదు రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో నిధి తవ్వే విషయంలో నలుగురు నిందితులను పట్టించిన వారి వద్ద నుంచి లంచం తీసుకున్న ఆరోపణలపై సురపుర సీఐపై కేసు నమోదైన ఘటన చోటు చేసుకుంది. సురపుర తాలూకా నాగరాళలో గుప్త నిధులున్నాయని, వాటిని తీసి ఇస్తామని మోసం చేసిన వ్యక్తులు, డబ్బులను రెండింతలు చేసి ఇస్తామని చెబుతూ నమ్మించిన రామణ్ణ గౌడ, నాగయ్య స్వామి, వగ్గ నింగయ్య, భీమణ్ణ ఇతరుల నుంచి డబ్బులు వసూలు చేసి స్వామిని పిలిపించి పనులు చేయిస్తామంటూ పట్టించిన నిందితులను సీఐ ఉమేష్ నాయక్ రూ.10 లక్షలు లంచం తీసుకొని వదిలిపెట్టినట్లు ఎస్సీ, ఎస్టీ సమితి అధ్యక్షుడు మల్లికార్జున నాయక్ ఎస్పీ పృథ్వీశంకర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో సీఐపై ఎస్పీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆస్పత్రి ఆవరణం వర్షార్పణం హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా గుడేకోటె ఆస్పత్రి ఆవరణం గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి వాన నీటితో నిండింది. ఆస్పత్రికి వచ్చే రోగులు వాన నీటిలోనే నడవాల్సిన పరిస్థితి వచ్చింది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో ఇక్కడ నీరు నిలిచిపోవడంతో రోగులకు నరకయాతనగా మారింది. ఈ ప్రాంతంలో ఈ ఏకై క ఆస్పత్రి ఉండటంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి నిత్యం వందలాది రోగులు ఆస్పత్రికి వస్తారు. వర్షం పడినప్పుడు తాము ఆస్పత్రికి వెళ్లాలంటే వర్షం నీటిలో అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉందని, ఈ విషయంపై ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
అకాల వర్ష బీభత్సం.. వరి పైరుకు నష్టం
రాయచూరు రూరల్: అకాల వర్ష బీభత్సంతో కోతకొచ్చిన వరి పైరు నష్టం అంచు కోంది. దేవదుర్గ, సింధనూరు తాలూకాలో వేలాది ఎకరాల్లో పంట ఒరిగింది. శుక్రవారం సాయంత్రం రెండు తాలూకాల్లో వర్షాలు కురవడంతో రైతుల నోటిలో మట్టి పడినట్లయింది. సింధనూరు తాలూకా రౌడకుంద, జవళగేర, రాగలపర్వి, బూదిహాళ క్యాంప్, హుడా, గొరేబాళ్, సోమలాపుర వంటి ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. దేవదుర్గ తాలూకా జాలహళ్లి, చప్పళికి ఇతర ప్రాంతాల్లో రైతులు వేసుకున్న వరి పంటలు చేతికొచ్చే సమయంలో వరుణ దేవుడు కరుణించక కాటు వేశాడని రైతులు చింతిస్తున్నారు. గురువారం విధాన పరిషత్ సభ్యుడు బసనగౌడ బాదర్లి అకాల వర్షంతో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. -
రోగుల గోస పట్టేదెవరికి?
సాక్షి, బళ్లారి: నగరంలో పేరు గాంచిన జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు ఓపీ రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జిల్లా ఆస్పత్రిలో కొత్త హంగులతో ప్రైవేటు ఆస్పత్రికి దీటుగా వైద్యం అందిస్తుండటంతో పాటు ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ఎక్స్రే, తదితరాలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నగరంలో ఓపీడీ ఆస్పత్రి తర్వాత అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రిగా గుర్తింపు పొందిన గోస ఆస్పత్రి(జిల్లా ఆస్పత్రి) ప్రముఖంగా కాన్పుల ఆస్పత్రిగా పేరుగాంచింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు స్థానికంగా ఓటర్ ఐడీ, ఇతర గుర్తింపు కార్డుతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి ముందుగా ఇక్కడ పేరు నమోదు చేసి ఓపీ చీటీ తీసుకున్న తర్వాతే ఆస్పత్రిలో చికిత్స చేయించుకొనే అవకాశం కల్పించిన నేపథ్యంలో ప్రతి నిత్యం ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య పెరిగిపోయి ఓపీ చీటీల సంఖ్య నమోదు చేసేందుకు సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. కంప్యూటర్లలో కూడా పేరు నమోదు చేయడానికి ఒక్కొక్కసారి సాంకేతిక సమస్య కూడా తలెత్తుతోంది. రోగుల బాధలు వర్ణనాతీతం ఈ నేపథ్యంలో జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు ఓపీ చీటీ తీసుకోవడానికి రోగులు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఆస్పత్రిలో అన్ని రకాల చికిత్సలకు వైద్యులు మెరుగైన చికిత్సలను అందిస్తున్నా ముందుగా ఓపీ చీటీ తీసుకోడానికి గంటల తరబడి వరుస(క్యూ)లో నిలబడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో అత్యవసర చికిత్స పొందే రోగుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ తరుణంలో గురువారం ఏఐకేకేఎంస్ జిల్లా కార్యదర్శి గురళ్లి రాజా తదితరులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు రోగులు పడుతున్న ఇబ్బందులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిని సందర్శించి సులభంగా ఓపీ చీటీలు ఇచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రోగులు రెండు సార్లు పేర్లు నమోదు చేసుకొనే చర్యలు చేపట్టడం సరికాదని, ఇందుకు ప్రత్యామ్నాయంగా రోగులకు ఇబ్బంది కలగకుండా జిల్లా ఆస్పత్రి పాలక మండలి తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. జిల్లా ఆస్పత్రి కౌంటర్లో పేరు నమోదుకు రోగులకు ఇక్కట్లు గంటల తరబడి క్యూలో నిలిచి ఇబ్బందులు పడుతున్న వైనం -
సతీష్ జార్కిహోళి సీఎం అయితే సంతోషమే
సాక్షి బళ్లారి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మారుస్తారనే వదంతులు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడే సిద్ధూ తర్వాత జార్కిహోళి సమర్ధవంతమైన నాయకుడని పేర్కొన్న నేపథ్యంలో వాల్మీకి సముదాయానికి చెందిన సతీష్ జార్కిహోళి ముఖ్యమంత్రి అయితే తమకు సంతోషమేనని వ్యక్తిగతంగా తన మద్దతు కూడా ఉంటుందని మాజీ మంత్రి బీ.శ్రీరాములు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన అస్తవ్యస్తంగా మారిందని, కుర్చీ కోసం రాజకీయం చేస్తున్నారే కాని జనం సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ(అత్యవసర) పాలన ఏ విధంగా కొనసాగిందో అదే తరహాలో రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే ఉపముఖ్యమంత్రిని చేయడానికి చేస్తున్న రాజకీయాలు జనం గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్వి కక్షసాధింపు రాజకీయాలు ఆర్ఎస్ఎస్కు మద్దతు ఇచ్చేవారిపై కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు రాజకీయాలు చేస్తుందన్నారు. నవంబర్లో రాష్ట్రంలో రాజకీయ మార్పులు ఉంటాయని తుమకూరు ఎమ్మెల్యే రాజన్న పేర్కొన్న నేపథ్యంలో ఆయనతో రాజీనామా చేయించారన్నారు. ప్రియాంక్ ఖర్గేని డీసీఎం చేయడానికి చర్చ కూడా జరిగినట్లు తెలుస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్కి మద్దతు ఇచ్చిన వారిని, భారత్ మాతాకీ జై అన్నవారిని జైలుకు పంపుతున్నారని అదే పాకిస్థాన్ కో జై అన్నవారిని రాజ్యసభకు పంపుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్సీల అధికారావధి ముగిసిందని, బీజేపీ తరఫున నియమించేందుకు పార్టీ అధ్యక్షుడు సమావేశం నిర్వహించి కేంద్ర నాయకులకు పేరు పంపుతారన్నారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన పార్టీ కోసం ఎంతో శ్రమించారు రాష్ట్రంలో అస్తవ్యస్తంగా సర్కారు పరిపాలన 1975లో ఇందిరాగాంధీ పాలనను తలపిస్తోంది ప్రియాంక్ ఖర్గేని డీసీఎం చేయడానికి యత్నం విలేకరులతో మాజీ మంత్రి శ్రీరాములు -
చెన్నమ్మ ధైర్య సాహసాలు ఆదర్శప్రాయం
హొసపేటె: బ్రిటిష్ వారికి ఎదురొడ్డి ధైర్యంగా పోరాడి దేశ స్వాతంత్య్రం కోసం వీర సైనికులను పెంచిన తొలి మహిళా పోరాట యోధురాలు కిత్తూరు రాణి చెన్నమ్మ ధైర్యసాహసాలు నేటి మహిళలకు ఆదర్శప్రాయమని జిల్లాధికారిణి కవితా ఎస్.మన్నికేరి అన్నారు. గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన కిత్తూరు రాణి చెన్నమ్మ జయంతిని చెన్నమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించిన తర్వాత ఆమె మాట్లాడారు. వీర వనిత కిత్తూరు రాణి చెన్నమ్మ ఇప్పటికీ మహిళా సమాజానికి గొప్ప ప్రేరణ అన్నారు. ఆమె దృఢ సంకల్పం, పోరాట స్పూర్తి, ప్రతి సీ్త్ర అన్యాయానికి వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచడానికి ప్రేరేపిస్తుందన్నారు. పురుషాధిక్య సమాజంలో కూడా ఆమె సమర్ధవంతంగా పాలించారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలను కాపాడిందన్నారు. పరిపాలన, రాజకీయాలు సహా ఏ రంగంలోనైనా మహిళలు విజయవంతమైన నాయకులుగా ఎదగగలరని ఆమె నిరూపించారన్నారు. చిన్నతనంలోనే ఆమె గుర్రపు స్వారీ, కత్తిసాము, విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించారన్నారు. నేటి మహిళలు కూడా ఆత్మరక్షణ కోసం కొన్ని నైపుణ్యాలను నేర్చుకోవాలన్నారు. అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణప్ప, జిల్లా పంచాయతీ ఉప కార్యదర్శి కే.తిమ్మప్ప, కన్నడ, సంస్కృతి శాఖ సహాయ సంచాలకులు సిద్దలింగేష్ రంగన్నవర్, వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షుడు గొగ్గ చెన్నబసవరాజ్, ప్రధాన కార్యదర్శి నీలకంఠగౌడ, ప్రముఖ కిచిడి కొట్రేష్, మధుర చెన్నశాస్త్రి, సోమ బసవరాజ్, రవిశంకర్, శరణ బసవరాజ్ ఎల్.కోతంబరి, శివపుత్రప్ప, కాశీనాథయ్య, చిత్తప్ప, మల్లికార్జున్ మేస్త్రి, విశ్వనాథ్, గౌళి రుద్రప్ప, మల్లేశప్ప, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: నగరంలో కిత్తూరు రాణి చెన్నమ్మ జయంతిని గురువారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో నిర్వహించారు. ముందుగా కిత్తూరు రాణి చెన్నమ్మ చిత్రపటానికి రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పూజలు చేశారు. అనంతరం రంగమందిరంలో జరిగిన సమావేశంలో అదనపు ఎస్పీ కుమారస్వామి మాట్లాడారు. బాల్యం నుంచి గుర్రపు స్వారీ చేస్తూ కత్తి పట్టుకొని యుద్ధం చేయడానికి తర్ఫీదు పొందిన ఆమె బ్రిటిష్ సైనికులతో యుద్ధ విజయాలలో ఓటమి ఎరుగని ధీరురాలిగా పేరొందారన్నారు. కార్యక్రమంలో పంచ గ్యారెంటీల సమితి అధ్యక్షుడు పవన్ పాటిల్, పరమేశ్వర సాలిమట్్, ఉదయ్ కుమార్, తహసీల్దార్ పరశురాం, చంద్రశేఖర్, విజయలక్ష్మి, నిర్మల బెణ్ణి, సులోచన, జ్యోతి, సరోజ, ఈరమ్మ, నాగనగౌడ, మహంతేష్ పాటిల్, దండెప్పలున్నారు. -
గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు అరికట్టండి
హొసపేటె: జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల వాడకంలో తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాల గురించి ప్రజలకు తెలియజేయడం ద్వారా గ్యాస్ సిలిండర్ ప్రమాదాలను అరికట్టాలని జిల్లాధికారిణి కవిత అధికారులకు సూచించారు. వంట గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసే, రవాణా చేసే, నిల్వ చేసే గ్యాస్ ఏజెన్సీల నిర్వహణపై నగరంలోని జిల్లాధికారి సభాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. అత్యవసర సమయాల్లో గృహ వంట సిలిండర్ల వినియోగదారులు 1906 టోల్ ఫ్రీ నెంబర్ను ఉపయోగించుకోవాలన్నారు. గృహ గ్యాస్ వినియోదారుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. వినియోగదారుల నుంచి ఏవైనా ఫిర్యాదులు వచ్చిన వెంటనే సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు నిర్లక్ష్యం వహిస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటాం. బుకింగ్ చేసిన 48 గంటల్లోపు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలి. జిల్లాలో గృహ సిలిండర్ల సరఫరా తగినంతగా ఉండేలా చూసుకోవాలి. గృహ సిలిండర్ల కొరత లేకుండా చూసుకోవడానికి స్టాక్ను సక్రమంగా నిర్వహించాలి. ఉజ్వల పథకం లబ్ధిదారుల ఈ–కేవైసీ తప్పనిసరి చేయాలి. సిలిండర్ గృహ వినియోగదారుల కోసం భద్రతా నియమాలు (ఎస్ఓపీ) ముద్రించి, ప్రతి సిలిండర్తో పాటు వారి ఇళ్లకు పంపిణీ చేయాలి. గృహిణులకు వంట గ్యాస్ సిలిండర్ల వాడకం గురించి సమాచారం అందించాలి. ప్రతి గ్యాస్ ఏజెన్సీ తమ పరిధిలోని గ్రామాలు, వార్డులలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. గాదిగనూరు గ్రామంలో ఇటీవల జరిగిన సిలిండర్ పేలుడు సంఘటనపై మనం మేల్కోనాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా మనం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి ఆహార, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రియాజ్ మాట్లాడుతూ గృహ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు గ్యాస్ స్టౌ పైపును అగ్ని నిరోధక పైపుతో భర్తీ చేయాలని అన్నారు. అధికారిక గ్యాస్ సరఫరాదారుల నుంచి మాత్రమే గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయాలి. సిలిండర్పై సంబంధిత కంపెనీ సీల్, క్యాప్ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. ఇళ్లలో సిలిండర్లను వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచాలి. రాత్రి నిద్రపోతున్నప్పుడు గ్యాస్ స్టౌ ఆపివేశారా లేదా అని తనిఖీ చేయాలి. సిలిండర్లను వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. గ్యాస్ ఏజెన్సీ యజమానులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం
రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రధాన రహదారులు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులు గోతులమయంగా మారాయి. ఈ విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్లూరు, నీరమాన్వి, మాన్వి, సింధనూరు, సిరవార, కవితాళ, లింగసూగూరు, రాయచూరు, శక్తినగర్, గిల్లేసూగూరులకు వెళ్లే రహదారులు గుంతలు పడ్డాయి. గత శాసనసభ ఎన్నికల్లో గెలిచిన శాసన సభ్యులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని ప్రజలు ఖండిస్తున్నారు. శాసన సభ్యులు, మంత్రులు రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించక కాలహరణం చేయడంతోనే సరిపోయిందని ప్రజలు వాపోయారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు హరీ వారం రోజుల్లోనే ఆరు మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2002లో అప్పటి ప్రజాపనుల శాఖ మంత్రి ధరం సింగ్ హయాంలో రాయచూరు–మాన్వి–సింధనూరు రోడ్డు పనులు చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు మరమ్మతు పనులు చేపట్టలేకపోయారు. సెప్టెంబర్లో నీరమాన్వి–కప్పగల్ వద్ద పాఠశాల బస్సు ప్రమాదంలో ఇద్దరు బాలురు మరణించగా, 25 మంది విద్యార్థులు గాయాల పాలయ్యారు. వారం రోజుల క్రితం కల్లూరు వద్ద ముగ్గురు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. జాతీయ రహదారి– 167 బెళగావి నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రాంతంలో 2025లో 616 ప్రమాదాలు జరగగా 280 మంది దుర్మరణం పాలయ్యారు. అధ్వాన స్థితిలో ప్రధాన రహదారులు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఏళ్ల తరబడి మరమ్మతుకు నోచుకోని వైనం 2025లో 616 ప్రమాదాల్లో 280 మంది మృతి -
కన్నడలో నామఫలకాలు ఏర్పాటు చేయాలి
రాయచూరు రూరల్: నగరంలో వ్యాపారస్తులు దుకాణాలు, హోటళ్లపై కన్నడ భాషలో నామఫలకాలు ఏర్పాటు చేయాలని నమ్మ కర్ణాటక సేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు కొండప్ప మాట్లాడారు. నవంబర్ నుంచి కన్నడ రాష్ట్రావతరణ సందర్భంగా ఖచ్చితంగా కన్నడ భాషలోనే నామఫలకాలను వేసేలా చూడాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆయకట్టులో రెండో పంటకు నీరివ్వండిరాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో రెండో పంటకు నీరందించాలని ఎమ్మెల్సీ బసనగౌడ బాదర్లి, రైతు సంఘం గౌరవాధ్యక్షుడు చామరస మాలి పాటిల్ డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం మంత్రాలయంలోని పద్మనాభ అతిథిగృహంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్తో చర్చించారు. రబీ పంటకు నీరు అందించడానికి డీసీఎం అంగీకరించారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్గేట్ల అమరికకు రెండు రాష్ట్రాల మంత్రులతో చర్చిస్తామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం అందించాలని విన్నవించినట్లు తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయరూ రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో పండించిన పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. గురువారం దేవదుర్గ తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మల్లేష్ నాయక్ మాట్లాడారు. కల్యాణ కర్ణాటకలోని కొప్పళ, బళ్లారి, రాయచూరు, యాదగిరి, కలబుర్గి, బీదర్, విజయ నగర జిల్లాల్లో వరదల వల్ల నష్ట పోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు. వాణిజ్య పంటలకు మద్దతు ధర ప్రకటించి వారిని ఆదుకోవాలన్నారు. మొక్కజొన్నలకు క్వింటాల్కు రూ.4500 మద్దతు ధర కేటాయించి 35 క్వింటాళ్లను కొనుగోలు చేయాలని, పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి క్వింటాల్కు రూ.9100 మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. టీబీ డ్యాంకు పెరిగిన వరదహొసపేటె: తుంగభద్ర జలాశయానికి తిరిగి వరద కొనసాగుతుండటంతో ఏ క్షణమైనా నదికి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. గత మూడు రోజుల నుంచి డ్యాంకు ఎగువన పరివాహక ప్రాంతాల్లో వర్షాలు ఊపందుకోవడంతో డ్యాంకు వస్తున్న వరద భారీగా పెరిగింది. గురువారం డ్యాంకు 21 వేల క్యూసెక్కుల వరకు నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం వర్షం కురుస్తుండటం కొనసాగుతుండటంతో భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని, ఏ సమయంలోనైనా దిగువకు భారీగా వరద నీరు విడుదల చేసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందు జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేశారు. పంటలకు మద్దతు ధర ప్రకటించండి రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో పండించిన పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించాలని జన సేవ ఫౌండేషన్ డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జావిద్ ఖాన్ మాట్లాడారు. రాయచూరు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం, వాణిజ్య పంటలకు మద్దతు ధర ప్రకటించి రైతులు ఆదుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
కడుపులోనూ బతకనివ్వరు
గర్భిణులకు వ్యథ మైసూరు: అవాంఛిత గర్భం, కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తేలితే నిర్దాక్షిణ్యంగా అబార్షన్లు చేసే ముఠా బాగోతమిది. మైసూరు తాలూకా హునగనహళ్లిలో అక్రమ అబార్షన్ల ముఠా పట్టుబడింది. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. హునగనహళ్లిలోని తోటలో ఉన్న ఇంటిలో చట్టవ్యతిరేకంగా స్కానింగ్ సెంటర్ను తెరిచారు. ముఠా సభ్యులు.. వైద్యులు, తెలిసినవారిని కలిసి లింగ నిర్ధారణ చేస్తామని చెప్పేవారు. వేలాది రూపాయలను తీసుకుని స్కానింగ్ చేసేవారు. గర్భిణి కడుపులో ఉన్న శిశువు ఆడ, మగో చెప్పేవారు. ఇందుకు రూ.25 వేలు వసూలు చేస్తారు. ఇక ఆడ బిడ్డ ఉంది, అబార్షన్ చేయాలంటే మరింత డబ్బు ఇవ్వాలి. అక్కడే గర్భవిచ్ఛిత్తికి పాల్పడేవారు. అలా వందలాది అబార్షన్లు చేసినట్లు అనుమానాలున్నాయి. గర్భిణులు వద్దు వద్దంటున్నా వారి భర్తల ఒత్తిడితో అబార్షన్లు చేసేవారు. ఆకస్మిక దాడి.. పట్టివేత బన్నూరు రోడ్డు చుట్టుపక్కల గ్రామాల్లో కొంతకాలంగా గర్భస్థ లింగ నిర్ధారణ, అబార్షన్లు జరుగుతున్నాయని జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో గత రెండు నెలలుగా నిఘా పెట్టారు. హునగనహళ్లిలోని ఆ ఇంటి గురించి తెలియడంతో బుధవారం ఉదయమే అధికారులు, పోలీసులు సంయుక్త దాడులు జరిపి ముఠాను పట్టుకున్నారు. లాకర్లో ఉన్న రూ.3 లక్షలకు పైగా నగదును, స్కానింగ్ యంత్రాలు, గర్భస్థ నిర్ధారణ కిట్లు, ఔషధాలను స్వాధీనపరచుకున్నారు. స్కానింగ్కు వచ్చిన ఇద్దరు మహిళలను కూడా రక్షించారు. నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీహెచ్ఓ డాక్టర్ పీసీ కుమారస్వామి తెలిపారు. ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ మైసూరు వద్ద లింగనిర్ధారణ దందా ఏడుమంది ముఠా అరెస్టు -
వర్షాలకు ఇల్లు ధ్వంసం
మండ్య: తాలూకాలోని కారిగానహళ్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన ఇల్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కూలిపోయింది. సన్నకారు రైతు కాంతరాజు పెంకుటిల్లు మంగళవారం నుంచి కురిసిన వర్షానికి మట్టిగోడలు పూర్తిగా నానిపోయి కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ హాని జరగలేదు. ఇంటిలోని ధాన్యం, వంటపాత్రలు పాడయ్యాయి. రైతుకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. శిశువు చోరీ, మహిళ అరెస్టు మైసూరు: ఆరు నెలల మగ శిశువును అపహరించిన ఓ మహిళను రైల్వే పోలీసులు బంధించి శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు.. హాసన్కు చెందిన నందిని (50) నిందితురాలు. బుధవారం రాత్రి శిశువుతో తల్లిదండ్రులు మైసూరు రైల్వేస్టేషన్లో ప్లాట్ఫాంపై నిద్రించారు. ఈ సమయంలో నందిని, ఆ శిశువును ఎత్తుకెళ్లింది. మేల్కొన్న తల్లిదండ్రులు బిడ్డ కనిపించలేదని రోదించసాగారు. రైల్వే పోలీసులు విచారించి వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ మహిళ ఆచూకీ లభ్యమైంది. గాలింపు చేపట్టి నందినిని అరెస్టు చేసి శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. ఎందుకు ఎత్తుకెళ్లిందో నిందితురాలిని తీవ్ర విచారణ చేస్తున్నారు. సొంతూళ్ల నుంచి సిటీకి.. భారీ రద్దీ శివాజీనగర: వీకెండ్, దీపావళి వరుస సెలవులతో సొంతూళ్లకు, టూర్లకు వెళ్లిన ప్రజలు పండుగ ముగించుకొని బెంగళూరుకు తిరుగుముఖం పట్టారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. దీపావళి వరుస సెలవుల నేపథ్యంలో గత శుక్రవారం నుంచి ప్రజలు తమ తమ స్వస్థలాలకు వెళ్లారు. పండుగ ముగించుకొని తిరిగి రావడంతో బుధ, గురువారాల్లో నగరంలో రద్దీ తీవ్రతరమైంది. మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు బారులుతీరారు. మెట్రో స్టేషన్ లోపల భాగంలో కూడా జనసందడి నెలకొంది. ఆ రైళ్లలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. వర్షాలతో ట్రాక్కు దెబ్బ, రైలుకు ఆటంకం యశవంతపుర: చిక్కమగళూరు తాలూకా కణివె గ్రామం వద్ద రైలు పట్టాలకు వేసిన కంకర భారీ వర్షాల వల్ల కొట్టుకుపోయింది. బుధవారం రాత్రి మల్నాడులో కుండపోత వానలు కురిశాయి, కణివె గ్రామం వద్ద వాననీటి ధాటికి రైలు పట్టాల కిందనున్న మట్టి, కంకర పూర్తిగా కొట్టుకుపోయింది. పట్టాలు వేలాడుతూ ఉన్నాయి. గురువారం ఉదయం చిక్కమగళూరు నుంచి శివమొగ్గకు వెళ్లతున్న ప్యాసిజర్ రైలు కణివె వద్దకు వెళ్లగానే సిబ్బంది రైలును ఆపాలని సిగ్నల్ ఇచ్చారు. రైలు డ్రైవరు వెంటనే ఆపేశారు. సిబ్బంది రైలు పట్టాలను సరి చేసి రైలును పంపించారు. దీనివల్ల 45 నిమిషాలపాటు రైలు సంచారం నిలిచిపోయింది. ఎద్దుల రేసుల్లో ప్రాణనష్టం ● ముగ్గురి మృత్యువాత దొడ్డబళ్లాపురం: దీపావళి ఉత్సవాల సందర్భంగా హావేరి నగరం పరిసరాల్లో బుధవారంనాడు భారీఎత్తున జల్లికట్టు తరహా ఎద్దుల రేసులు జరగడం తెలిసిందే. యువత, జనం పరుగులు తీసే ఎద్దులను పట్టుకోవడానికి పోటీలు పడ్డారు. అయితే ఇందులో విషాదాలు కూడా సంభవించాయి. మూడు వేర్వేరు ఘటనల్లో ఎద్దులు పొడిచి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దానేశ్వరి నగరలో ఎద్దుల రేసులో చంద్రశేఖర్ కోడిహళ్లి (75) అనే వృద్ధుడు వేడుకలను చూస్తూ ఉండగా ఎద్దు దాడి చేయడంతో చనిపోయాడు. దేవిహొసూరు గ్రామంలో జరిగిన వేడుకలో ఎద్దు పొడిచి ఘనిసాబ్ (75) అనే వృద్ధుడు మరణించాడు. పోటీలో పాల్గొన్న ఓ ఎద్దు ఇంట్లోకి జొరబడి ఈయనను పొడిచింది. హానగల్ తాలూకా తిళవళ్లిలో ఎద్దు దాడిలో భరత్ (24) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. వీరంతా జల్లికట్టులో పాల్గొనకపోయినప్పటికీ ఎద్దుల దాడుల్లో చనిపోయారు. స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. -
మళ్లీ గణేశ చతుర్థి వచ్చిందోచ్
తుమకూరు: వినాయక చవితి ముగిసిన నెలల తరువాత మళ్లీ ఆ పండుగను ఆచరించడం ఆ గ్రామ విశిష్టత. ఇది ఆశ్చర్యంగా ఉన్నా నిజం. జిల్లాలోని చారిత్రక ప్రసిద్ధ గూళూరులో గణేశ మండపంలో మహా గణపతి విగ్రహాన్ని దీపావళి తరువాత బలిపాడ్యమి రోజున 18 కులాల ప్రజలు కలిసి ప్రతిష్టించి సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. ఇంకా నెల రోజుల పాటు భక్తులకు గణేష్ విగ్రహ దర్శనభాగ్యం లభిస్తుంది. గూళూరు మహా గణపతిని కార్తీక మాసంలో నెల రోజుల పాటు ప్రతిష్టించి ప్రతినిత్యం ప్రత్యేక పూజా కై ంకర్యాలు నిర్వర్తించడం ఆచారంగా వస్తోంది. స్వామివారికి ప్రతి కుటుంబం నిత్యం ప్రత్యేక అర్చనలు చేస్తారు. రోజూ రాత్రి 9 గంటలకు మహామంగళ హారతి ఇస్తారు. నవంబర్ 23వ తేదీ వరకు భక్తులకు దర్శనానికి ఏర్పాట్లు చేసినట్లు మహాగణపతి భక్తమండలి అధ్యక్షుడు జీఎస్ శివకుమార్ తెలిపారు. గూళూరులో మహా గణపతి ఉత్సవాలకు శ్రీకారం -
నగరం.. జన సాగరం
సాక్షి, బెంగళూరు: ఐటీ సిటీ, మెట్రో సిటీ.. ఇలా ఎన్ని పేర్లతో పిలుచుకున్నా, ఎంత మంది వచ్చినా అక్కున చేర్చుకునేది బెంగళూరు నగరం. ఇదే బెంగళూరు పాలిట సమస్యగా మారింది. విపరీతమైన జన రద్దీతో సతమతమవుతోంది. సదుపాయాల కోసం ఒత్తిడి అధికమైంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనవుతుంది అనే సామెత నగరానికి వర్తిస్తుంది. బెంగళూరులో జనసంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఎక్కడెక్కడి నుంచో ఉపాధి, ఉద్యోగాలు, చదువుల కోసం తరలివచ్చేవారితో నిండిపోతోంది. 2031 నాటికి నగర జనాభా సుమారు కోటిన్నర దాటుతుందని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (డీఈఎస్) చెబుతోంది. అంత దూరం అవసరం లేదు, రెండు మూడేళ్లు చాలని మరికొందరు చెబుతున్నారు. బెంగళూరు జనాభా 1.40 కోట్లకు పెరిగిందని ఇటీవల డిప్యూటీ సీఎం శివకుమార్ చెప్పడం తెలిసిందే. ఈ ఏడాది అత్యధిక వలసలు డీఈఎస్ ప్రకారం 2021లో నగర జనాభా సుమారు 1.22 కోట్లు. ఇది 2031 నాటికి 1.47 కోట్లకు పెరగనున్నట్లు అంచనా వేసింది. 2025–2026 ఏడాదిలో అత్యధిక మంది బెంగళూరుకు వచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది 1.93 శాతం మేర జనాభా అధికమైంది. గత 15 ఏళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది. కర్ణాటక జనాభాలో ప్రతి ఐదుగురిలో ఒకరు బెంగళూరు వాసి ఉండేంతలా నగర జనసంఖ్య విస్తరిస్తోంది. 2021 ఏడాదిలో కర్ణాటక మొత్తం జనాభాలో ఒక్క బెంగళూరు నగర వాటానే 18.2 శాతంగా ఉంది. 2031 నాటికి ఈ ప్రమాణం 20.7 శాతానికి పెరగనుందని డీఈఎస్ వెల్లడించింది. రాష్ట్రంలోని ఇతర నగరాలను అభివృద్ధి చేసి, బెంగళూరుపై ఒత్తిడిని తగ్గించాలని హెచ్చరించింది. 2021లో కర్ణాటక జనాభాలో నగరాల వాటా 43.9 శాతంగా ఉంది. 2031 నాటికి 47.8 శాతానికి పెరగవచ్చని అంచనా. బెంగళూరు కేఆర్ మార్కెట్లో జనం.. జనం జనాలతో కిక్కిరిసిపోతున్న బెంగళూరు ఉద్యోగ, ఉపాధి కోసం తరలివస్తున్న ప్రజలు సౌకర్యాల కోసం తీవ్ర పోటాపోటీ మరింతగా జనాభా వృద్ధి: డీఈఎస్ సర్వేఇక్కడే ఎందుకు బెంగళూరులో తామరతంపరగా ఐటీ బీటీ కంపెనీలు పెరిగాయి. నిర్మాణ, ఆతిథ్య రంగం విస్తరిస్తోంది. రాష్ట్రంలోని ఇతర నగరాలన్నింటి కంటే అధికంగా, విద్య, ఆర్థిక, ఉద్యోగ అవకాశాలు బెంగళూరులో ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిగా తరలి వస్తున్నారు. దీనివల్ల ఏ మూల చూసినా జనంతో నిండిపోతోంది. -
రూ.5.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత
బనశంకరి: బెంగళూరులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను గురువారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.5.5 కోట్ల విలువచేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. హెబ్బగోడిలో డ్రగ్స్ను పరిశీలించి వివరాలను వెల్లడించారు. నైజీరియా కు చెందిన డురో మిషెల్, ఇబు సామ్యేల్ అనే ఇద్దరు బిజినెస్ వీసాతో భారత్కు వచ్చారు. 2017 నుంచి బెంగళూరు హెబ్బగోడి ఠాణా పరిధిలో మకాం వేశారు. తమిళనాడు నుంచి బట్టలు కొనుగోలుచేసి నైజీరియా కు ఎగుమతి చేసేవారు. మరోవైపు ఢిల్లీ నుంచి లగేజీ ద్వారా డ్రగ్స్ను దిగుమతి చేసుకుని నగరంలోని కాలేజీల ముందు అమ్మి సొమ్ము చేసుకునేవారు. విదేశీ పోస్టల్ ఆఫీసుకు అనుమానాస్పద పార్శిల్స్ వచ్చినట్లు తెలిసి నిఘా పెట్టారు. థాయ్లాండ్ నుంచి బిస్కెట్, చాక్లెట్ పార్శిళ్ల పేరుతో హైడ్రో గంజాయిని తెప్పించారు. ఈ నేపథ్యంలో దాడులు జరిపి ఇద్దరినీ అరెస్టు చేశారు. గంజాయితో పాటు రూ.2.50 కోట్ల విలువచేసే 1.47 కిలోల ఎండీఎంఏ క్రిస్టల్ను, రూ. 42 వేల నగదును పట్టుకున్నారు. గతంలోనూ కేసు కాగా వీరు గతంలో హెణ్ణూరు ఠాణా పరిధిలో డ్రగ్స్ అమ్ముతూ దొరికారు. విడుదలయ్యాక మళ్లీ పాత దందానే కొనసాగించడం గమనార్హం. పట్టుబడిన రూ.5.5 కోట్ల డ్రగ్స్ గురించి విచారిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. డ్రగ్స్ పార్శిళ్లు వచ్చిన కేజీ నగరలోని విదేశీ తపాలా ఆఫీసులోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బెంగళూరులో ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్ -
పొలంలో చిరుత కూనలు
మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా కెంపేగౌడనదొడ్డి గ్రామంలో కే.టి.ప్రతాప్ అనే రైతు పొలంలో మూడు చిరుత కూనలు కనిపించాయి. మద్దూరు అటవీ సిబ్బంది వచ్చి వాటిని తీసుకుని అడవిలోకి తరలించారు. తల్లి చిరుత కోసం గాలింపు చేపట్టారు. బావిలో చిరుత కెంపెయ్యనదొడ్డి గ్రామంలోనే మరో చిరుత ఘటన జరిగింది. ఉన్న కెంచేగౌడ అనె రైతు పొలంలోని పాడుబడిన బావిలో బుధవారం రాత్రి ఓ చిరుతపులి పడిపోయింది. దగ్గరిలోని బసవన కొండ అడవిలో నుంచి ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చినట్లు భావిస్తున్నారు. గురువారం ఉదయం దాని గాండ్రింపులు విని జనం వచ్చి చూసి అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వచ్చి దానిని బంధించి తరలించారు. చిరుతను చూడడానికి వందలాది మంది పోగయ్యారు. -
ప్రత్యామ్నాయం చూపాలి
ఇలా వేగంగా పెరుగుతున్న జనాభా కారణంగా బెంగళూరులో మౌలిక వసతులు, ఇతరత్రా సౌకర్యాల కోసం తీవ్ర కొరత ఏర్పడుతోంది. ఇళ్లు, స్థలాలు, రోడ్లు, నీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, ట్రాఫిక్ వంటి సమస్యలు ఇప్పటికే బెంగళూరును తీవ్రంగా బాధిస్తున్నాయి. జనాభా మరింత అధికమైతే ఈ సమస్యలు పరిష్కరించలేనంత స్థాయికి చేరుకుంటాయి. బెంగళూరు సరిహద్దులు వేగంగా విస్తరించాయి. కానీ సౌకర్యాలు ఆ స్థాయిలో లేవనేది అందరికీ తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో ప్రముఖులు, ప్రజలు తరచూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జనాభాకు తగినట్లు వసతులు అనేది సవాల్గా మారింది. -
చీకట్లు నింపిన టపాసులు
శివాజీనగర: సిలికాన్ సిటీలో వెలుగుల దీపావళి సంబరాల్లో ప్రమాదాలలో పెద్దసంఖ్యలో జనం గాయపడ్డారు. బాధితుల సంఖ్య గురువారం నాటికి 250 మందికి చేరింది. పటాకులను కాల్చేవారు, చూసేవారు విధివశాత్తు గాయాలపాలు కాగా, వీరిలో కొందరికి కళ్లే పోయాయి. ఒక్క నారాయణ నేత్రాలయంలో 100 మంది బాధితులు చేరారు, అందులో 50 మందికి పైగా పిల్లలున్నారు. 10 మందికి శస్త్రచికిత్స అవసరమైంది. కొందరు అడ్మిట్ కాగా, మరికొందరికి చికిత్స చేసి పంపారు. బాధితుల్లో సగం మంది టపాసులను కాల్చేవారు, మిగతా సగం మంది దారిన వెళ్లేవారు, చూసేవారు ఉన్నారు. మింటో కంటి ఆసుపత్రిలో 30 మంది చికిత్స పొందారు. శంకర కంటి ఆసుపత్రిలో 20 కేసులు నమోదుకాగా, ప్రభా కంటి ఆసుపత్రిలో గాయపడిన 10మందికి చికిత్స కల్పించడమైనది. అగర్వాల్ కంటి ఆసుపత్రిలో 10 మంది చికిత్స పొందారు. పాపం.. వలస కూలీ ● బిహార్కు చెందిన వలస కూలీ యువకుడు శాశ్వత అంధత్వాన్ని పొందాడు, నగరంలోని అక్కిపేటలో ఉండేవాడు. ఫ్లవర్ పాట్ పేల్చేటపుడు ప్రమాదం సంభవించడమైనది. కంటి గుడ్డు చీలింది. ఫ్లవర్ పాట్ చేతిలో పట్టుకుని పోజు ఇస్తుండగా అది పేలిపోవడంతో ఓ కన్ను పూర్తిగా పోయింది, మరో కంటికి తీవ్ర గాయాలు తగిలాయి. మింటో ఆసుపత్రిలో యువకుడికి చికిత్స పొందుతున్నాడు. ● మరో ఘటనలో రోడ్డు మీద నడచుకొంటూ వెళుతున్న 67 సంవత్సరాల విదేశీ వృద్ధునికి టపాసు పేలి ఓ కంటికి బాగా గాయమైంది. ● 10 ఏళ్ల బాలునికి కంటి గుడ్డు కు తీవ్ర గాయమైంది. మరో 13 ఏళ్ల బాలునికి ఇదే సమస్య నెలకొంది. ● ఎక్కువమంది బాధితులకు ముఖం, కాళ్లు, చేతులకు కాలిన గాయాలయ్యాయి. విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొంది వెళ్లిపోయారు. మూడు ముక్కలు.. మింట్లో ఆసుపత్రిలో కంటికి అపాయమైన 37 మందిలో కొందరికి అడ్మిట్ చేసి వైద్యం అందిస్తున్నారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరికి దృష్టి లోపం ఎదురైందని మింట్లో ఆసుపత్రి అదనపు డైరెక్టర్ డాక్టర్ శశిధర్ తెలిపారు. ఓ బాలునికి కంటి ముందు టపాసు పేలడంతో కన్ను మూడు ముక్కలైంది. కొడుకు దుస్థితిని చూసి అతని తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. బెంగళూరులో 250 మందికి పైగా గాయాలు అనేకమందికి కళ్లకు దెబ్బలు దృష్టిదోషం ఏర్పడే ముప్పు కంటి వైద్యశాలలకు తాకిడి -
ఆ ఎస్ఐ నమ్మించి.. మోసగించాడు
బనశంకరి: ఈ చిత్రంలో కనిపిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ పేరు సునీల్. మంచి ఉద్యోగం, ఆదాయంతో జీవితం సాగుతోంది, కానీ తనను ప్రలోభపెట్టి మోసం చేశాడని ఓ మహిళ మీడియా ముందు గోడు వెళ్లబోసుకోవడంతో చిక్కుల్లో పడ్డాడు. ఈ మేరకు ఎస్ఐ హెచ్బీ సునీల్ పై బెంగళూరు డీజే.హళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆయన పనిచేసేది కూడా అదే ఠాణాలో కావడం విశేషం. ఇంటికి, హోటల్కు పిలిపించి వివరాలు ఇలా ఉన్నాయి... పెళ్లి చేసుకుంటాను, ఇల్లు కొనిస్తాను, బ్యూటీపార్లర్ పెట్టిస్తా, నీ జీవితాన్ని సెటిల్ చేస్తా అని తీయని మాటలతో మభ్యపెట్టాడు, లైంగికంగా వాడుకున్నాడని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది. డీజే హళ్లి 8వ మైల్లో ఇల్లు, హోటల్కు పిలిపించుకుని రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఎవరికై నా చెబితే హత్యచేస్తానని బెదిరించాడని పేర్కొంది. అంతేగాక తన ప్రైవేటు ఫోటోలు, వీడియో పెట్టుకుని బెదిరిస్తున్నాడంది. తాను బ్యూటిషియన్గా పనిచేస్తానని, ఏడాదిన్నర కిందట ఓ సారి పనిమీద ఎస్ఐని కలిశానని, అప్పటినుంచి లోబర్చుకున్నాడని చెప్పింది. తమ వాట్సాప్ చాటింగ్లను చూపింది. పెళ్లి చేసుకోవాలని కోరగా తిరస్కరించాడని, తనకు న్యాయం చేయాలని కోరింది. ఫిర్యాదు మేరకు ఆ ఎస్ఐపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐపై ఆమె డీజీపీ సలీంకు కూడా ఫిర్యాదు చేసింది. బెంగళూరు డీజే హళ్లి ఎస్ఐపై అదే ఠాణాలో మహిళ ఫిర్యాదు -
రియల్టర్కు కత్తిపోట్లు
మైసూరు: రియల్టర్ని రౌడీ ముఠా చాకుతో పొడిచిన ఘటన మైసూరులోని విజయనగర పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గురుప్రసాద్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. వివరాలు.. రియల్టర్ గురుప్రసాద్ ఒక బార్కు వెళ్లారు. అక్కడే రౌడీషీటర్ కౌశిక్ కూడా ఉన్నాడు. గురుప్రసాద్ బిల్లు కట్టే సమయంలో, కౌశిక్ వెళ్లి తన బిల్లును కూడా నువ్వే కట్టాలని అతనిని ఒత్తిడి చేశాడు. బిల్లు కట్టకపోతే, నీ అంతు చూస్తా అని గదమాయించాడు. గురుప్రసాద్ బార్ నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ సాయంత్రం తన సోదరుడు కరుణాకర్తో కలిసి అదే బార్లోకి వెళ్లగా కౌశిక్ ఎదురు పడ్డాడు. మధ్యాహ్నం నా బిల్లు కట్టకుండా పారిపోయింది వీడే అంటూ ఎగతాళి చేస్తూ గొడవకు దిగాడు. భయపడిన వారిద్దరూ బయటకు పరుగులు తీయగా కౌశిక్, అతని అనుచరులు వెంటాడి గురుప్రసాద్ను ఇష్టానుసారం చాకుతో పొడిచారు. కాగా, కౌశిక్, దేవరాజ్, మరో ముగ్గురిపై విజయనగర పోలీసులు కేసు నమోదు చేశారు. కనువిందుగా పండుగ పావగడ: తాలూకాలోని తండాల్లో దీపావళిని ఉత్సాహంగా జరిపారు. మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేసి అలరించారు. బుధవారం పెద్దల పండుగను జరుపుకున్నారు. ఐదలమ్మ గుడి వద్ద ముగ్గులు వేసి తంగేడు పూలతో పూజలు చేశారు. సేవాలాల్ దేవాలయంలో దీపాలు వెలిగించి పూజలు చేశారు. పాఠశాలలో దండన.. ఆస్పత్రిపాలైన బాలుడు శివాజీనగర: 2 రోజులు పాఠశాలకు రానందుకు ఓ విద్యార్థిపై ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు దాడి చేశారు. వివరాలు.. బెంగళూరులోని సుంకదకట్టె, పైప్లైన్ రోడ్డులో ఉన్న సెయింట్ మేరీస్ పబ్లిక్ పాఠశాలలో 5వ తరగతి బాలుడు గైర్హాజరు కావడంతో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అతనిని తీవ్ర స్థాయిలో దండించారు. దీంతో భయాందోళనకు గురైన బాధిత బాలుడు ఇంటిలో విచిత్రంగా ప్రవర్తిస్తుండగా, తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రులు కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్లో స్కూలు నిర్వాహకులపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో, తమకు న్యాయం చేయాలని రోడ్డుకెక్కారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బాలల హక్కుల భద్రతా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. వారం రోజుల్లో పాఠశాలకు వెళ్లి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖను ఆదేశించింది. -
కాలు లేకున్నా.. కలత లేదన్నా..
చెళ్లకెరె రూరల్ : వృద్ధులైన తల్లిదండ్రులను పోషించడం కోసం దివ్యాంగుడైన వీరణ్ణ కొరియర్ బాయ్గా విధులు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తల్లిదండ్రులు భారమయ్యారని వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్న నేటి యువకులు వీరణ్ణను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాలు పోయి కృత్రిమ కాలు పెట్టుకున్న యువకుడు వీరణ్ణ ప్రభుత్వం అందించిన త్రిచక్రవాహనాన్ని సద్వినియోగం చేసుకుని కొరియర్ బాయ్గా పని చేస్తూ నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నాడు. చెళ్లకెరె నగర నివాసి వీరణ్ణకు ప్రమాదంలో కాలు విరిగి పోయింది. చికిత్స అనంతరం కృత్రిమ కాలు పెట్టారు. ఎమ్మెల్యే టి.రఘుమూర్తి ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలతో వీరణ్ణకు త్రిచక్రవాహనం అందేలా చూశారు. కాలు లేకున్నా ఆత్మ స్థైర్యం కోల్పోని వీరణ్ణ ఫ్లిప్కార్టు కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ప్రతి నిత్యం ఉదయం 7 గంటలకు విధులకు హాజరయ్యే వీరణ్ణ తన త్రిచక్రవాహనంలో ఇంటింటికి వెళ్లి కొరియర్ పార్శిల్ ఇచ్చి వస్తుంటారు. కదలకుండా కూర్చొంటే జీవించడం ఎలా? కాలు లేదని పని చేయకుండా చింతిస్తూ కదలకుండా కూర్చొంటే జీవించడం కష్టం. ఇంట్లో తల్లిదండ్రులను పోషించాలి. ప్రభుత్వం నుంచి నాకు త్రిచక్రవాహనాన్ని ఇప్పించిన ఎమ్మెల్యే రుణం తీర్చలేనిది. –దివ్యాంగుడు వీరణ్ణ వృద్ధ తల్లిదండ్రుల పోషణే ధ్యేయం కొరియర్ బాయ్గా దివ్యాంగుడు వీరణ్ణ -
చెరువులోకి పడిన చిన్నారులు..
తుమకూరు: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి పొంగి ప్రవహిస్తున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణనష్టం తప్పదు. చిక్కనాయకనహళ్లి తాలూకా యరేకట్టె గ్రామ చెరువులో ప్రమాదవశాత్తు పడి తండ్రి, కుమార్తె, మరో బాలిక చనిపోయారు. వివరాలు.. వెంకటేశ్ (43) కూతురు శ్రావ్య (12), స్నేహితురాలు పుణ్య (11) మంగళవారం సాయంత్రం 6 గంటలకు గ్రామం వద్ద ఉన్న చెరువుకు వెళ్లారు. అయితే నీటిలోకి జారిపడిపోయారు. వారి వెంట ఉన్న మరో బాలిక ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి చెప్పింది. దీంతో వెంకటేశ్ బాలికలను కాపాడాలని పరిగెత్తుకుని వచ్చి చెరువులోకి దూకాడు. పుణ్యను బటయకు తీసుకువచ్చి మళ్లీ చెరువులోకి వెళ్లాడు, కానీ అలసిపోయి మునిగిపోయాడు. స్థానికులు గాలించగా వెంకటేశ్, కూతురు శ్రావ్య మృతదేహాలు బయటపడ్డాయి. పుణ్యను ఆస్పత్రిలో చేర్పించగా ఆమె కూడా చనిపోయింది. ఎమ్మెల్యే సీబీ సురేశ్ బాబు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. హందనకెరె పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. కాపాడాలని తండ్రి ప్రయత్నం.. ముగ్గురూ మృతి -
ఎయిమ్స్ మంజూరు కోసం ధర్నా
రాయచూరు రూరల్: రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు కోసం చర్యలు చేపట్టాలని మంగళవారం మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో 1259వ రోజు ఆందోళన కొనసాగింది. సమితి అధ్యక్షుడు బసవరాజ కళస మాట్లాడారు. రాయచూరుకు ఎయిమ్స్ను కేటాయించాలన్నారు. ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో మౌనం వహించకుండా గళం విప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలంటూ ధర్నాకు మద్దతు పలికారు. జిల్లాను ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులు పాలించినంత వరకు అభివృద్ధి జరగడం అసాధ్యమన్నారు. రాజకీయ నాయకుల కుట్రలకు జిల్లాను పట్టించు కొనేవారు ఎవరనే ప్రశ్న ఉదయిస్తోందన్నారు. భారీ వర్షాలకు నేలకొరిగిన వరిరాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, కొప్పళ, కలబుర్గి, బీదర్, యాదగిరి జిల్లాల్లో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు వరి పైరు నేలకొరిగింది. కలబుర్గి జిల్లా చించోళి తాలూకా నాగరహాళ, కనకపుర, రాయచూరు జిల్లాలోని సింధనూరు, మాన్వి, మస్కి, కవితాళ, కొప్పళ జిల్లా అంజనాద్రిలో అరగంట సేపు వానలు పడ్డాయి. ఇటీవల కురిసిన అతివృష్టితో వేలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించగా కురిసిన వానలతో వరి దుబ్బులు నేలకొరగడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అట్రాసిటీ కేసు నమోదు చేయండి హొసపేటె: బెళగావి జిల్లా బాగేవాడి తాలూకా హుక్కేరిలో ఇటీవల విశ్వనాథ్ కత్తి వాల్మీకి సమాజంపై అవహేళనగా మాట్లాడటం సరి కాదని, వెంటనే ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మానవ సంబంధాల వేదిక విజయనగర జిల్లా సమన్వయకర్త ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేదిక నేత సోమశేఖర్ మాట్లాడుతూ హుక్కేరి మోడల్ హైస్కూల్ మైదానంలో డీసీసీ బ్యాంక్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో బ్యాంక్ మాజీ అధ్యక్షుడు విశ్వనాథ్ కత్తి వాల్మీకి సమాజాన్ని అసభ్యకరమైన పదజాలంతో అవమానించారన్నారు. తద్వారా వాల్మీకి సమాజ ప్రజల మనోభావాలను దెబ్బ తీశారన్నారు. రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలురాయచూరు రూరల్: మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల మఠంలో దీపావళి ఉత్సవాలను మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ప్రారంభించారు. బుధవారం మఠంలో రాఘవేంద్రస్వామి మూల విరాట్కు ప్రత్యేక పూజలు జరిపారు. బలి పాడ్యమి సందర్భంగా భక్తుల సమక్షంలో విశేష పూజలు, అభిషేకాలు చేశారు. -
ఆస్పత్రిలో యంత్ర పరికరాల చోరీ
రాయచూరు రూరల్: దేవదుర్గ ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ రకాల యంత్రపరికరాలు చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.లక్షలాది విలువ చేసే యంత్రాలను, పరికరాలను సిబ్బంది వాటి గదికి తాళం వేయకుండా అలాగే వదిలి వేశారు. ఈ నెల 12న చోరీ జరిగినట్లు తాలూకా ఆరోగ్యాధికారి శివానంద ఈనెల 16వ తేదీన దేవదుర్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ిహిమోగ్లోబిన్ యంత్రం, ఆక్సిజన్ యంత్రం, ఎలక్ట్రోలైట్ పరీక్షలు నిర్వహించే పరికరాలు చోరీ కావడంతో పోలీసులు విచారణకు శ్రీకారం చుట్టారు. వైభవంగా సిద్దరామేశ్వర జోడు రథోత్సవంరాయచూరు రూరల్: తాలూకాలోని చిక్కసూగూరులో సిద్దరామేశ్వర జాతర, రథోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం చౌకి మఠం నుంచి దేవాలయం వరకు మహిళలు కుంభ కలశాలతో ఊరేగింపు జరిపారు. వీరగాసె నృత్యం చేస్తూ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సిద్దరామేశ్వర జోడు రథోత్సవాన్ని వందలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవం ముందు సిద్దలింగ మహాస్వామి, అభినవ రాచోటి శివాచార్యులు, మహాలింగ స్వామి, శిఖామణి అవధూత, వీర సిద్దస్వామి, విరుపాక్ష స్వామి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇన్నోవా, స్విఫ్ట్ కారు ఢీ ● త్రుటిలో తప్పిన ప్రమాదం సాక్షి బళ్లారి: విజయపుర జిల్లా సింధిగి ఎమ్మెల్యే అశోక్ మనగూళి ఇన్నోవా, స్విఫ్ట్ కారు ఢీకొనడంతో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. బుధవారం సింధిగి బైపాస్ సమీపంలో ఎమ్మెల్యే ఇన్నోవా ఐక్రాస్ (కేఏ03–ఎన్టీ–2827 అనే నెంబర్ గల) కారుకు ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే కారులో ఆయన కుమార్తె, సోదరుడి కుమారుడితో పాటు డ్రైవర్ ప్రయాణిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే రెండు కార్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో ఎమ్మెల్యే అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 1 నుంచి బెంగళూరు– హంపీ డైలీ విమాన సర్వీసు హొసపేటె: బళ్లారి, విజయనగర జిల్లాల్లో పర్యాటకం, వ్యాపార రంగానికి పెద్ద ప్రోత్సాహాన్నిస్తూ, ప్రాంతీయ విమానయాన సంస్థ స్టార్ ఎయిర్ బెంగళూరు–హంపీని అనుసంధానిస్తూ కొత్త విమాన సర్వీసును ప్రారంభించాలని ప్రణాళిక ప్రకటించింది. చారిత్రాత్మక హంపీకి సమీపంలోని జిందాల్ విద్యానగర్ విమానాశ్రయం గుండా ఈ విమానాలు ప్రయాణిస్తాయి. కొత్త విమాన సర్వీసు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన హంపీకి కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. నవంబర్ 1న విమాన సర్వీసు ప్రారంభం కానుండటంతో బళ్లారికి కూడా ప్రయోజనం చేకూరుతుందని సమాచారం. స్టార్ ఎయిర్ ప్రకటన పర్యాటకులకు, స్థానిక వ్యాపారవేత్తలకు ఆనందాన్ని కలిగించింది. గతంలో అలయన్స్ ఎయిర్ హంపీ నుంచి బెంగళూరుకు రోజువారీ విమానాలను నడిపింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ సేవలు నిలిపివేశారు. కార్తీకమాస పూజలు ప్రారంభం అమరాపురం: మండలంలోని హేమావతి గ్రామంలో వెలసిన శైవక్షేత్రం శ్రీసిద్దేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాస పూజలను బుధవారం ఆలయ అర్చకులు ప్రారంబించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామి వారికి సుప్రభాభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు చేశారు. అనంతరం భక్తులు తెచ్చిన వివిధ పూలతో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు ప్రసాద వినియోగం చేశారు. -
రాఘవేంద్రుని సన్నిధిలో డీసీఎం
రాయచూరు రూరల్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠాన్ని కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయంలో రాఘవేంద్ర స్వాముల వారి దివ్య దర్శనం చేసుకున్న ఆయన వెంట రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. ఆయనకు మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం రాయచూరు తాలూకా పంచముఖి గాణదాళ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి, ప్రత్యేక దర్శనం పొందారు. బ్రిడ్జి కం బ్యారేజీలు నిర్మించండి రాయచూరు జిల్లా మాన్వి తాలూకా చీకలపర్వి, రాయచూరు తాలూకా చిక్కమంచాల వద్ద తుంగభద్రా నదిపై బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ సూచించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయంలో పద్మనాభ అతిథి గృహంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, గ్రామీణ శాసన సభ్యుఢు బసనగౌడ దద్దల్లతో సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చించి సాంకేతిక నివేదికల ఆధారంగా నిర్మాణం చేపట్టాలన్నారు. తాగు, సాగు నీటి విషయంలో గత ఏడాది రెండు ప్రాంతాల్లో బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణం చేపడితే కర్నూలు జిల్లా సుంకేసుల వద్ద బ్రిడ్జి కం బ్యారేజీలో నీటి నిల్వ తగ్గుముఖం పడుతుందనే విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని సరిదిద్దాలని సూచించారు. టీబీడ్యాం క్రస్ట్గేట్ల అమరికకు చర్యలు తుంగభద్ర డ్యాం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, తుంగభద్ర డ్యాం క్రస్ట్గేట్ల అమరికకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ వెల్లడించారు. బుధవారం పంచముఖి గాణదాళలో ఆలయాన్ని దర్శించుకొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది క్రస్ట్గేట్ తొలగిపోవడంతో ఇంజినీర్ల ఆదేశాల మేరకు నూతనంగా 37 గేట్ల అమరికకు చర్యలు చేపట్టామన్నారు. నవలి వద్ద నూతనంగా చేపట్టనున్న సమాంతర జలాశయం విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ససేమిరా అంగీకరించడం లేదన్నారు. ఈ విషయంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు మూడు సార్లు సమావేశాలు నిర్వహించినా అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. రాష్ట్రంలో తుంగభద్ర, కృష్ణ, మహదాయి, మేకెదాటు వంటి నీటి వనరులకు కేంద్రం నుంచి గెజెట్ విడుదలపై బీజేపీ శాసన సభ్యులు, లోక్సభ సభ్యులు స్పందించాలన్నారు. రైతుల సంక్షేమం కోరుతూ రూ.20 వేల కోట్లతో పంప్సెట్ల కొనుగోలు, ఐదు గ్యారెంటీలకు రూ.53 వేల కోట్లు, పేదల సంక్షేమం కోసం రూ.లక్ష కోట్లు, కళ్యాణ కర్ణాటకలోని జిల్లాల అభివృద్ధికి రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించామన్నారు. సమాజ సేవకు సిద్ధంగా ఉండాలిసమాజ సేవకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ పిలుపునిచ్చారు. బుధవారం రాయచూరు తాలూకాలోని పంచముఖి గాణదాళలో గ్రామీణ కాంగ్రెస్ పార్టీ నూతన పదాధికారుల పదగ్రహణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. సమాజ సేవ చేసే పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పార్టీకి సేవలు అందించాలన్నారు. తమ ఉన్న భేదాభిప్రాయాలను మరిచి పార్టీకి పటిష్టతకు పాటు పడాలన్నారు. నాయకులు కావాలంటే కార్యకర్తల కష్టాన్ని మరిచి పోరాదన్నారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలన్నారు. పంచ గ్యారెంటీల వల్ల పేద ప్రజల కడుపు నిండుతోందన్నారు. పంచ గ్యారెంటీలను కాపీ కొట్టి బీజేపీ మహిళలకు రూ.10 వేలను బ్యాంక్ ఖాతాలోకి వేసిందన్నారు. సమావేశంలో రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, లోక్సభ సభ్యుడు కుమార నాయక్, గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ, శాసన సభ్యులు హంపయ్య నాయక్, బసన గౌడ తుర్విహాళ్, ఎమ్మెల్సీలు బసనగౌడ బాదర్లి, వసంత కుమార్, జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగి తదితరులున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం దర్శనం -
భర్త వేధింపులు.. బావిలోకి దూకి..
రాయచూరు రూరల్: జీవితాంతం తోడునీడగా ఉంటానని కట్టుకున్న భర్త వ్యసనాలకు బానిసై చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె భరించలేక తీవ్ర నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పసికందుతో సహా బావిలోకి దూకి అత్మ హత్య చేసుకున్న ఘటన బాగల్కోట జిల్లా బాదామి తాలూకా కెరూరు చెన్నమదేవి గుడి వద్ద జరిగింది. భర్త మస్తాన్సాబ్ (25), భార్య ఫాతిమా (21), కొడుకు అబ్దుల్ (3)తో కూలి పని చేసుకుంటూ జీవించేవాడు. అతనికి అదివరకే పెళ్లయినా ఫాతిమాను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఫాతిమాను చీటికిమాటికీ వేధించేవాడు, భరించలేక మూడురోజల క్రితం పుట్టింటికొచ్చింది. మంగళవారం సాయంత్రం కొడుకుతో సహా బావిలోకి దూకింది. స్థానికులు గాలించి మృతదేహాలను వెలికితీశారు. ఆమె తల్లిదండ్రులు అల్లునిపై ఫిర్యాదు చేశారు. -
చిచ్చు రేపిన టపాసులు
● బెంగళూరు పరిసరాల్లో 150 మందికి గాయాలు ● ఎక్కువమందికి కళ్లకు దెబ్బలుబెంగళూరులో ఓ ఆస్పత్రిలో బాలునికి పరీక్షలు శివాజీనగర: దీపావళి టపాసులు పేలుతుంటే చూడడం నేత్రానందాన్ని కలిగిస్తుంది కానీ, ప్రమాదం జరిగితే సంకటం తప్పదు. దీపావళి సంబరాలలో విషాదాలూ జరిగాయి. బెంగళూరులో గత మూడు రోజుల నుంచి బాణసంచా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. టపాసులు వల్ల గాయపడినవారి సంఖ్య అధికమైంది. బెంగళూరు, చుట్టుపక్కల ప్రాంతాల్లో 150 మందికి పైగా కంటి హాని కేసులు నమోదయ్యాయి. 60 శాతం కేసులు టపాసుల పేలుళ్లను చూస్తూ నిలబడినవారేనని నిర్ధారణ అయ్యింది. బాధితుల్లో 8 మందికి పైగా శాశ్వతంగా దృష్టిని కోల్పోవడం విషాదకరం. బెంగళూరు, చిక్కబళ్లాపురంలో ముగ్గురు బాలురు పూర్తిగా దృష్టి దోషానికి గురైన దుర్ఘటనలు జరిగినట్లు తెలిసింది. ఆ బాలునికి రెండు కళ్లు చిద్రం బెంగళూరులోని కత్రిగుప్పలో 11 సంవత్సరాల బాలుడు టపాకులు పేల్చుతూ ఉండగా ప్రమాదం సంభవించింది. టపాసులు పేలి రెండు కళ్లకు తగిలాయి, మందుగుండు రవ్వలు ఎంత తీవ్రంగా తగిలాయి అంటే.. బాలుడు ధరించిన కళ్లజోడు పగిలిపోయి రెండు కనుగుడ్లు చిట్టిపోయాయి. ఓ కార్పొరేట్ కంటి ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స జరిపినా కూడా కంటి చూపును కాపాడేందుకు సాధ్యపడలేదని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు ముందే జాగ్రత్త తీసుకుని ఉండాల్సిందని అన్నారు. అయ్యో పాపం.. చిన్నారి బాలిక చిక్కబళ్లాపురకు చెందిన 5 సంవత్సరాల బాలిక ఇతరులు టపాసులు పేలుస్తుండగా చూస్తూ ఉంది. ఆ సమయంలో పటాకీ వచ్చి కళ్ల ముందు పేలింది, దీంతో తీవ్రంగా గాయపడిన బాలిక చూపును కోల్పోయింది. ప్రస్తుతం బెంగళూరు మింటో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వైద్యులు శస్త్రచికిత్స జరిపేందుకు ఏర్పాట్లు చేసుకొన్నారు. భవిష్యత్లో చూపు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలిపారు. మరో అబ్బాయికి ఇబ్బంది బెంగళూరు సిద్ధాపురలో పీయూసీ విద్యార్థి ఒకరు రోడ్డు పక్కన నడచుకొంటూ వెళుతున్నపుడు పటాసు పేలి కంటికి తీవ్ర గాయమైంది. కొందరు యువకులు రాతిపై టపాసును ఉంచి పేల్చినపుడు టపాసు ఎగిరి అతని కంటిని తాకడంతో గాయం తీవ్రత ఎక్కువగా ఉంది. తల్లిదండ్రులు టపాసులు పేల్చిన యువకుల మీద మండిపడ్డారు. గాయపడిన అబ్బాయి మింటో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. ఇదేమాదిరిగా కళ్లకు తీవ్రగాయాలై ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇతరుల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరిగి జీవితాన్ని చీకటిగా మార్చాయని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.బెంగళూరులోని ఆసుపత్రుల్లో నమోదైన కేసులు నారాయణ నేత్రాలయ –75 కేసులు మింటో ఆసుపత్రి –28 శంకర కంటి ఆసుపత్రి –27 ప్రభా కంటి ఆసుపత్రి –11 మోదీ ఆసుపత్రి –3 అగర్వాల్ కంటి ఆసుపత్రి – 3 -
కారు పోయిందే!
తుమకూరు: భారీ వర్షాలకు జిల్లాలో చెరువులు, కాలువలుపొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వర్షపు నీటిలో కారు కొట్టుకుపోయిన ఘటన గుబ్బి తాలూకా తోటసాగర వద్ద జరిగింది. వివరాలు.. తోటసాగర గ్రామవాసి మంజునాథ్ కారు డ్రైవర్గా జీవిస్తున్నాడు. గ్రామం నుంచి వెళ్తుండగా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కారు పక్క నుంచి వేగంగా టెంపో వెళ్లడంతో మంజునాథ్ అదుపుతప్పడంతో కారు వాగులోకి పడి కొట్టుకుపోసాగింది. మంజునాథ్ వెంటనే కారు నుంచి బయటకు వచ్చి ఈత కొట్టుకుంటూ బయటపడ్డాడు. అయితే కారు మాత్రం నీటిలో సుమారు ఒక కిలోమీటర్ వరకు కొట్టుకుని పోయింది. సుమారు రెండు గంటల పాటు శ్రమించి కారును స్థానికులు బయటకు తీశారు. -
ఇంటింటా దీపావళి కాంతులు
బళ్లారి రూరల్: భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనందోత్సాహాలతో కుల, మత, వర్గ, ధనిక, పేద అనే భేదాలు లేకుండా సమైక్యంగా జరుపుకొనే పండుగ దీపావళి. పండుగ నేపథ్యంలో దావణగెరెలో మంత్రి శామనూరు మల్లికార్జున, ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జునలు కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా పేల్చారు. ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున ముగ్గుపై మట్టిదీపాలు వెలిగించారు. ఘనంగా దీపావళి వేడుకలు హొసపేటె: నగర ప్రజలు దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. బుధవారం రాత్రి ప్రజలు తమ ఇంటిలో లక్ష్మీ దేవిని కూర్చొండబెట్టి పూల మాలలతో విశేషంగా అలంకరించి పూజలు చేశారు. ఇంటి ముంగిళ్లలో దీపాలు వెలిగించడంతో పాటు ఇంటికి విద్యుత్ దీపాలంకరణ చేశారు. టపాసుల శబ్దాలతో నగరం మారు మ్రోగిపోయింది. -
మాదప్ప సన్నిధిలో దీపావళి పూజలు
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ప్రసిద్ధ మలెమహదేశ్వర బెట్టలోని మాదప్ప సన్నిధిలో దీపావళి మహోత్సవం సంబరంగా జరిగింది. మాదప్పకు తైలమజ్జన సేవలు గావించారు. లింగమూర్తికి నువ్వుల నూనె, కొబ్బరినీళ్లు, తేనె, పెరుగు, చక్కెర, కర్జూరం, ద్రాక్షలతో పాటు పాలాభిషేకం, సహస్ర బిల్వార్చన నెరవేర్చారు. అనంతరం మాదప్ప మూర్తిని వివిధ రకాల పూలతో అలంకరించారు. ధూప, దీప హారతి, మహామంగళ హారతి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బెట్టపై విడిది చేసిన లక్షలాది మంది భక్తులు తమ కోర్కెలతో వివిధ రకాల సేవలను చేసి పునీతులయ్యారు. బెట్ట విద్యుద్దీపాలంకరణతో మెరిసిపోయింది. నేను కన్నడిగురాలినే = కిరణ్ మజుందార్ షా శివాజీనగర: బెంగళూరులో రోడ్లు, సౌకర్యాలు సరిగా లేవని విమర్శలు చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా ఆ తరువాత సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసి వివరణ ఇచ్చారు. బెంగళూరుని ఆమె విమర్శించడంపై కొందరు నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. నేను గుజరాతీ కాదు, కన్నడిగురాలు అని జనం కోపాన్ని చల్లార్చే యత్నం చేశారు. నేను బెంగళూరులో పుట్టాను, బెంగళూరు, కన్నడ సంస్కృతిని ప్రేమిస్తూ ఏడు దశబ్దాలను ఇక్కడే గడిపాను. కన్నడ అద్భుతమైన భాష, రాయడం, మాట్లాడడం వస్తుంది. నా మమకారాన్ని ప్రశ్నించేవారికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. నేను గర్వంగా చెప్పుకునే కన్నడిగురాలు అని పోస్టులో పేర్కొన్నారు. -
అందరి నోటా మోదీ బిల్డింగ్
హుబ్లీ: కర్ణాటక మెడికల్ కాలేజీ(కేఎంసీ) ఆస్పత్రికి వచ్చే అత్యధిక రోగుల నోటి నుంచి వచ్చే తొలి మాట వమోదీ బిల్డింగ్. 5 అంగశాస్త్ర ప్రత్యేక విభాగాలు కలిగిన ఈ 5 అంతస్తుల అత్యాధునిక భవనంలో శరీరంలోని కీలక అవయవాలకు సంబంధించిన ప్రత్యేక విభాగాలతో అత్యంత అనుభవజ్ఞులైన ఎండీ, ఎంబీబీఎస్, ఆపై ఉన్నత వైద్య విద్యా కోర్సులు చేసిన నిపుణులైన వైద్యులు 24 గంటలూ ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు ఆ మోదీ బిల్డింగ్లో వేలాది మంది పునర్జన్మ పొందారు. కన్నీటిమయంగా మారిన క్యాన్సర్ రోగులు, వారి సహాయకులు ఆ విభాగంలోని వార్డులలో రేడియేషన్, కిమోథెరపీ తదితర అత్యాధునిక చికిత్సలతో పాటు మిగతా మూడు వేర్వేరు అవయవాలకు సంబంధించిన విభాగాల్లో కూడా నిపుణులైన వైద్య బృందం నిరంతరం విధుల్లో ఉంటారు. ముఖ్యంగా ఎండీ పూర్తి చేసి వచ్చిన యువ వైద్యులు, మొదటి, రెండవ, మూడవ ఏడాది చదివే సంబంధిత ఎండీ విద్యార్థులు ఇక ఎంతో కష్టపడి 5 ఏళ్ల ఎంబీబీఎస్ పూర్తి చేసిన మెరిట్ విద్యార్థులు ఒక ఏడాది పాటు వీరికి ఇంటర్న్షిప్ లేదా హౌస్సర్జన్లుగా కేవలం నెలకు రూ.30 వేల స్టైఫండ్ తీసుకొని క్యాంపస్ ఆవరణలో 24 గంటలూ ఉంటూ వైద్యంపై అధ్యయనం చేస్తూ రోగులకు ఎంతో సేవలు అందిస్తారు. ముఖ్యంగా పేషెంట్ల సహాయకులు ఏ మాత్రం అజాగ్రత్తతో ఉన్నా వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు. కేఎంసీలో తీవ్ర అనారోగ్య బాధితుల పాలిట పునర్జన్మ కేంద్రం 5 కీలకాంగ శాస్త్ర విభాగాలతో రోగుల పాలిట ఆరోగ్య పెన్నిధి -
మిర్చికి తెగులు.. రైతన్నకు దిగులు
సాక్షి బళ్లారి: వరుసగా గత నాలుగేళ్ల నుంచి మిర్చి సాగు చేసిన రైతులు ఏదో రకంగా కష్టాలు, నష్టాలను చవిచూస్తూనే ఉన్నారు. మూడేళ్లుగా మిర్చి సాగు చేసిన రైతులకు పెట్టుబడి రాక, గిట్టుబాటు ధర దక్కక పోవడంతో ఎండు మిర్చిని కోల్ట్ స్టోరేజ్లోనే ఉంచి రేట్లు పెరుగుతాయనే ఆశతో రైతులు ఎదురు చూస్తూ కష్టాలను అనుభవిస్తున్నారు. మరో వైపు ఈ ఏడాది మిర్చిని సాగు చేసిన రైతులకు ప్రారంభం నుంచే సమస్యలు వెంటాడుతున్నాయి. తుంగభద్ర ఆయకట్టు పరిధిలో బళ్లారి, సిరుగుప్ప, కంప్లి, హొసపేటె తదితర ప్రాంతాల్లో విస్తారంగా మిరప పంటను సాగు చేశారు. గత మూడేళ్లుగా మిర్చి సాగు చేసిన రైతులు అప్పులు పాలు కావడంతో ఈ ఏడాదైనా పంట చేతికి అందిన తర్వాత గిట్టుబాటు ధర వస్తుందేమోనని ఆశించిన మిర్చి రైతులకు పంట కోత దశ మాట పక్కన పెడితే మిర్చిని సాగు చేసినప్పటి నుంచి ఏదో ఒక తెగుళ్లతో మిర్చి పంటకు రైతులు మందులు పిచికారీ చేయాల్సిన దయనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి రైతులు వివిధ మందులను పిచికారీ చేస్తున్నారు. నాలుగు రోజులకు ఒకసారి పిచికారీ ప్రస్తుతం దోమ పోటు, నల్ల తామర పురుగు తదితరాలు మిర్చి పంటను వెంటాడుతున్న నేపథ్యంలో రైతులు వివిధ రకాల మందులను వాడుతున్నారు. ప్రతి రోజు మిర్చి పొలాల్లో రైతులు భుజాన మందు ట్యాంక్ను వేసుకొని పిచికారీ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మిర్చి పంట పొలాల్లో మిరపకాయలు కాసి కళకళలాడుతున్నప్పటికీ దోమ పోటు, నల్లతామర పురుగు వెంటాడుతుండటంతో ఆకు ముడత బారిన పడి పంట పూర్తిగా చేతికి అందే పరిస్థితులు వస్తాయో లేవోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మిర్చి సాగు చేసిన శంకరబండె, మంగమ్మ క్యాంపు తదితర గ్రామాలకు చెందిన ఎర్రిస్వామి, రుద్రగౌడ, గంగిరెడ్డి సాక్షితో మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే మిర్చి పంట సాగు సగానికి సగం తగ్గించామన్నారు. ఒక ఎకరానికి రూ.1.5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టామన్నారు. ప్రస్తుతం దోమపోటు, ఆకుముడత తెగులు రావడం వల్ల ప్రతి నాలుగు రోజులకు ఒకసారి మందు పిచికారీ చేస్తున్నామన్నారు. ఎన్నిసార్లు పిచికారీ చేసిన ఆకుముడత తెగులు పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పొలంలో ఏపుగా కాసిన మిర్చి పంట తెగుళ్ల నివారణకు సూచనలిస్తున్న నిపుణుడు ఏపుగా పెరిగిన పంటను వెంటాడుతున్న తెగుళ్లు మొక్కలు నాటినప్పటి నుంచి తెగులుతో ఇబ్బంది మిర్చి రైతుకు మిగిలింది కన్నీళ్లే మిర్చి ధర మూడేళ్లుగా పతనం కావడంతో తాము మూడేళ్లుగా పండించిన మిర్చి పంటను కోల్డ్ స్టోరేజ్లో ఉంచామన్నారు. ప్రస్తుతం ఈ ఏడాది కూడా గత్యంతరం లేక మిర్చినే సాగు చేశామన్నారు. తెగుళ్లు వెంటాడుతుండటంతో మరింత ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. తెగుళ్ల నివారణకు, దోమ పోటుకు, ఆకు ముడతను తగ్గించేందుకు బ్యారిక్స్ స్టికర్స్ ఎంతో మేలు చేస్తాయన్నారు. ఈ స్టికర్స్ను ప్రతి ఒక్క రైతు వినియోగించాల్సిందిగా సంబంధిత వ్యవసాయ నిపుణుడు టీ.హంపయ్య పేర్కొన్నారు. మ్యాజిక్ స్టికర్స్ ఎల్లో, బ్లూ వైట్ ఈ మూడు స్టికర్లను ఒక్కో ఎకరానికి 30 నుంచి 50 వరకు ఉపయోగించి మిర్చి పొలాల్లో ఉంచితే దోమలు వచ్చి స్టికర్స్పై వాలతాయన్నారు. దోమలు ఆ స్టికర్స్పై వాలడంతో వాటి ఉత్పత్తిని అరికట్టడానికి వీలవుతుందన్నారు. దీంతో మందులు ఉపయోగించాల్సిన అవసరం లేకపోగా పంట దిగుబడి కూడా బాగా వస్తుందన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఆయకట్టు పరిధిలో విస్తారంగా సాగు చేసిన మిర్చి పంట చేతికి అందేలోపు బ్యారిక్స్ స్టికర్లను పెట్టవలసిందిగా రైతులకు ఆయా వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి మిర్చి పంటలో తెగుళ్ల నివారణకు తగిన సలహా సూచనలు అందజేయాలని మిర్చి రైతులు కోరారు. -
‘పార్టీ మారే ప్రసక్తే లేదు.. సీఎం పదవి ఏనాడు ఆశించలేదు’
కర్నూలు: పార్టీ మారే ఆలోచన తనకు ఎప్పుడూ లేదన్నారు కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అదే సమయంలో సీఎం పదవి కూడా తాను ఏనాడు ఆశించలేదన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటానని, పార్టీ కోసం కష్టపడతానన్నారు. ఈరోజు(బుధవారం, అక్టోబర్ 22వ తేదీ) మంత్రాలయం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామిజీ ఆహ్వానం మేరకు తాను మంత్రాలయం వెళ్లినట్లు డీకే శివకుమార్ తెలిపారు. ఇందులో ఎటుంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. జోడో భారత్ యాత్రలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నానని, తమ పార్టీ అధికారం చేపట్టడంతో మళ్లీ రావడం జరిగిందన్నారు. రాజకీయాలకు అతీతంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ಓಂ ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರಾಯ ನಮಃಇಂದು ಮಂತ್ರಾಲಯ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಕ್ಕೆ ನನ್ನ ಧರ್ಮಪತ್ನಿ ಅವರ ಜೊತೆ ಭೇಟಿ ನೀಡಿ, ಶ್ರೀ ಗುರುರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ದಿವ್ಯ ದರ್ಶನ ಪಡೆದು, ವಿಶೇಷ ಪೂಜೆ ಹಾಗೂ ತುಲಾಭಾರ ಸೇವೆಯನ್ನು ನೆರವೇರಿಸಲಾಯಿತು.ಇದೇ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ಮಂತ್ರಾಲಯ ಮಠಾಧೀಶರಾದ ಶ್ರೀ ಸುಬುಧೇಂದ್ರ ತೀರ್ಥ ಸ್ವಾಮೀಜಿ ಅವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ,… pic.twitter.com/wf7yXISAxl— DK Shivakumar (@DKShivakumar) October 22, 2025 ‘ఇదీ చదవండి: మా నాన్న తర్వాతి సీఎం ఆయనే’.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య కుమారుడు -
‘మా నాన్న తర్వాతి సీఎం ఆయనే’.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య కుమారుడు
సాక్షి,బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య బాంబు పేల్చారు. మా నాన్న కెరీర్ ముగిసింది. ఇక కర్ణాటక కాంగ్రెస్ను ముందుండి నడిపించే శక్తిసామర్ధ్యాలు, ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఆ రాష్ట్ర ప్రజా పనుల వ్యవహారాల శాఖ మంత్రి (పీడబ్ల్యూడీ) సతీష్ జార్కిహోళికే ఉన్నాయని వ్యాఖ్యానించారు.బెళగావి జిల్లాలోని రాయ్బాగ్ తాలూకా కప్పలగుడ్డి గ్రామంలో మహాకవి కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో యతీంద్ర సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా యతీంద్ర తన తండ్రి, సీఎం సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.‘నా తండ్రి తన రాజకీయ జీవితంలో చివరి దశలో ఉన్నారు. ఈ దశలో, ఆయనకు బలమైన భావజాలం, ప్రగతిశీల మనస్తత్వం కలిగిన నాయకుడు అవసరం. అలాంటి నాయకుడికి సిద్ధరామయ్య మార్గదర్శకుడిగా ఉంటారు. ఆ నాయకుడే మంత్రి సతీష్ జార్కిహోళి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నిలబెట్టి, పార్టీని సమర్థవంతంగా నడిపించగల వ్యక్తి. అటువంటి సైద్ధాంతిక విశ్వాసం ఉన్న నాయకుడిని గుర్తించడం చాలా అరుదు’ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సతీష్ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్లో వర్గపోరు బయటకొచ్చిన వేళ..సిద్ధారామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్లో వర్గపోరు బహిర్గతమైంది. పీడబ్యూటీ మంత్రిగా పని చేస్తున్న సతీష్ జార్కిహోళిని తదుపరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అంటూ యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో డీకే శివకుమార్తో ఉన్న విభేదాల్ని బహిర్గతం చేసింది. కర్ణాటకలో సిద్ధారామయ్య వారసుడిగా డీకే శివకుమార్ పేరే ప్రధానంగా వినిపిస్తున్న తరుణంలో యతీంద్ర చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో హీట్ పుట్టించాయి. యతీంద్ర తన మనసులోని మాటను ఒక ప్రజావేదికపై బయటపెట్టడంతో డీకేతో ఉన్న విభేదాలు ఉన్నాయనే దానికి మరింత బలం చేకూర్చింది. గతంలో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎన్నుకునే క్రమంలో డీకే శివకుమార్తో ఒప్పందం కూడా జరిగింది. తలో రెండున్నర ఏళ్లు చేయడానికి ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం సిద్ధరామయ్య రెండున్నరేళ్ల కాలం పూర్తి కావడానికి సమయం దగ్గర పడుతున్న సమయంలో తదుపరి డీకేకే రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలి. ఈ విషయంపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వద్ద పంచాయతీ కూడా జరిగింది. మరి అటువంటిది ఇప్పుడు డీకేను కాదని, మంత్రి సతీష్ను తెరపైకి తీసుకురావడంతో కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు బయటకొచ్చాయి. VIDEO | Mysuru: “My father, (Siddaramaiah), is in the final stages of his political career. Satish Jarkiholi must take the Congress forward,” says Karnataka CM Siddaramaiah’s son, Yathindra Siddaramaiah.(Source: Third Party)#Karnataka (Full video available on PTI Videos -… pic.twitter.com/pCkXLEjqz7— Press Trust of India (@PTI_News) October 22, 2025 -
వివాదం వేళ ట్విస్ట్.. డీకేతో కిరణ్ మజుందార్ షా భేటీ
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో బయోకాన్(Biocon) ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా(Kiran Mazumdar-Shaw) భేటీ అయ్యారు. బెంగళూరు రోడ్ల దుస్థితి, చెత్త సమస్యలపై ఇటీవల బయోకాన్ ఛైర్మన్ పోస్టులు పెట్టారు. దీనిపై డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. కిరణ్ మజుందార్కు మద్దతుగా నిలిచిన పారిశ్రామిక వేత్త హర్ష్ గొయెంకా.. సమస్యకు పరిష్కారం వెతకకుండా.. రాజకీయాలా? అంటూ నేతలపై మండిపడ్డారు.ఈ రోడ్లపై వివాదం నేపథ్యంలో డీకేతో బయోకాన్ ఛైర్మన్ భేటీ కావడం విశేషం. సమావేశంలో నగర మౌలిక సదుపాయాలపై ఆమె చేసిన విమర్శలపై చర్చ జరిగినట్లు సమాచారం. శివకుమార్ ఆమెకు సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ‘‘ఈ రోజు తన నివాసంలో బయోకాన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్ మజుందార్-షాను కలవడం ఆనందంగా ఉందంటూ డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. బెంగళూరులో అభివృద్ధి, ఆవిష్కరణలు, రాష్ట్ర ప్రగతి దిశలో ముందుకు సాగే మార్గం గురించి తాము చర్చ జరిపాం’’ అంటూ ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.#WATCH | Bengaluru | Biocon Chairman, Kiran Mazumdar Shah met Karnataka Deputy Chief Minister DK Shivakumar. Visuals from outside Dy CM DK Shivakumar's residence. https://t.co/ktBNzwI3AO pic.twitter.com/qLF9l3zo2M— ANI (@ANI) October 21, 2025ఇటీవలి కాలంలో బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ఓ విదేశీ విజిటర్.. బెంగళూరు నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానంటూ ఆమె ఓ పోస్టులో వెల్లడించారు. దీంతో ఆ పోస్టుపై బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా విమర్శలు చేశారు. డీకే శివకుమార్ రోడ్లపై పెడుతున్న పోస్టులపై కౌంటరిస్తూ.. కాస్త ఘాటుగా బదులిచ్చారు. మజుందార్ షా రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయవచ్చంటూ పేర్కొన్నారు. ఆమె వచ్చి అడిగితే.. ఆ గుంతలు పూడ్చేందుకు రోడ్లను కేటాయిస్తామన్నారు. It was a pleasure to meet Ms. @kiranshaw, entrepreneur and Founder of Biocon, at my residence today. We had an engaging discussion on Bengaluru’s growth, innovation, and the path ahead for Karnataka’s growth story. pic.twitter.com/NsEkos6tFS— DK Shivakumar (@DKShivakumar) October 21, 2025 -
‘నడుములు విరుగుతున్నాయ్!’.. ఇక్కడ 90శాతం గుంతలు..2శాతమే రోడ్లు
సాక్షి,బెంగళూరు: భారత్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు నగర రోడ్ల గురించి చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ 90శాతం గుంతలు,రెండు శాతం రోడ్లంటూ నగర వాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. గుంతలమయమైన రోడ్లను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.తాజాగా,నగరంలోని వర్తుర్-గుంజూర్ ప్రాంతంలో గుంతల మయమైన రోడ్ల గురించి స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టుకు నగర వాసులతో పాటు నెటిజన్లు సైతం విమర్శలు,ఆవేదనతో కూడిన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆ ఫొటోను పోస్టు చేసిన సదరు ప్రాంత నివాసి.. సాధారణంగా..రోడ్డు పరిమాణం 98 శాతం..గుంతల పరిమాణం 2 శాతం ఉంటుంది. అక్టోబర్ 17న బెంగళూరులో తీసిన ఈ ఫోటోలో రోడ్డు కేవలం 2 శాతం మాత్రమే.. గుంతల రోడ్లు 98 శాతం ఉంది.మనం వర్తూర్-గుంజూర్ను గుంతలు లేనిదిగా చేయగలమా? అంటూ గ్రేటర్ బెంగళూరు అథారిటీ కమిషనర్కు ట్యాగ్ చేశారు. ఆ పోస్టుకు స్పందిస్తున్న నెటిజన్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు మా వెన్నెముకలు విరుగుతున్నాయి. పన్ను చెల్లించే ప్రజల పట్ల ఈ నిర్లక్ష్యం ఎందుకు?’అంటూ ఓ నివాసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నెటిజన్ ‘నేషనల్ అక్వాటిక్ హైవే’ కార్లు బోట్లుగా మారుతున్నాయి.హెల్మెట్లు లైఫ్ జాకెట్లుగా... గూగుల్ మ్యాప్స్ చెబుతోంది‘500 మీటర్లు ఈదుతూ ముందుకు సాగండి’ అని. ఇలా రోడ్లు లేక్లుగా మారితే..కార్లు కాదు... బోట్లే అవసరం!’అంటూ చమత్కరిస్తున్నారు.Normally the Road size will be 98% and the Pothole size would be 2%.In this photo shot on 17th October 2025 in Bengaluru, Road is only 2% and LakeHole is 98% 🙏@GBAChiefComm ji, can we make Varthur-Gunjur Pothole Free?#FI pic.twitter.com/pYYLKpG63O— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) October 18, 2025 -
చిత్తాపురలో ఆర్ఎస్ఎస్కు బ్రేక్
శివాజీనగర: కల్బుర్గి జిల్లా చిత్తాపురలో ఆదివారం ఆర్ఎస్ఎస్ పథసంచలనం జరగరాదని అక్కడి ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ప్రియాంక్ ఖర్గే, జరిపి తీరాలని సంఘ్ నాయకులు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుంది కాబట్టి ఆర్ఎస్ఎస్ జాతాకు అనుమతి ఇవ్వలేదని చిత్తాపుర తహసీల్దారు ప్రకటించడంపై సంఘ్ పెద్దలు భగ్గుమన్నారు. ఆదేశాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసును దాఖలు చేశారు. ఆదివారం అయినప్పటికీ హైకోర్టు అత్యవసరంగా విచారణ జరిపింది. తహసీల్దారు నిరాకరణ చిత్తాపురలో ఆర్ఎస్ఎస్ పథసంచలనం జరిపేందుకు తీర్మానించింది. ఇదే సమయంలో భీమ్ ఆర్మీ అనే దళిత సంఘం కూడా కవాతు జరపాలని నిర్ణయించింది. ఇలా ఒకే సమయంలో రెండు సంఘాలు ర్యాలీల వల్ల శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని చిత్తాపుర తహశీల్దార్ నాగయ్య ఆర్ఎస్ఎస్కు అనుమతిని నిరాకరించారు. దీనిని అశోక్ పాటిల్ అనే సంఘ్ నేత హైకోర్టు కల్బుర్గి ధర్మాసనంలో పిటిషన్ వేశారు. ఆర్ఎస్ఎస్కు సూచనలు పిటిషన్దారుల విన్నపాన్ని తిరస్కరించేందుకు తగిన చట్టం లేదని జడ్జి పేర్కొన్నారు. ఈసారి దరఖాస్తులో పథసంచలనం మార్గం, స్థలం, సమయం వివరాలు ఉండాలని, అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని తెలిపారు. అనుమతికి సంబంధించిన నివేదికను 24న తమకు సమర్పించాలని జడ్జి ప్రభుత్వ న్యాయవాదికి సూచించారు. చిత్తాపుర ర్యాలీకి అనుమతి ఇవ్వాలనగా మొదట్లోనే జడ్జి నిరాకరించారు. తేదీ మార్పు కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. చిత్తాపురలో ఓ రకంగా ఆర్ఎస్ఎస్కు నిరాశే మిగిలింది. ర్యాలీకి తహసీల్దారు తిరస్కృతి హైకోర్టులో ఆర్ఎస్ఎస్ పిటిషన్ తక్షణ అనుమతికి జడ్జి నిరాకరణ అనుమతి ఉంటే నవంబరు 2న జరపవచ్చని ఆదేశం 24కు కేసు వాయిదాముఖభంగం కాదు: మంత్రి ఖర్గే ఈ కేసులో తనకు ఎలాంటి ముఖభంగం కాలేదని మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. బెంగళూరులో నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ర్యాలీ జరపాలనుకుంటే ఆర్ఎస్ఎ జిల్లా యంత్రాంగానికి పిటిషన్ను సమర్పించాలని జడ్జి ఆదేశించారని తెలిపారు. బీజేపీ నేతలు సొంత తెలివితో విమర్శలు చేస్తున్నారని హేళన చేశారు. కోర్టు ఏకాఎకిన అనుమతి ఇచ్చి ఉంటే కదా? అన్నారు. ఎవరి వాదనలు ఏమిటి? ఆర్ఎస్ఎస్ నుంచి సీనియర్ న్యాయవాది అరుణ్శ్యామ్, ప్రభుత్వం తరఫున న్యాయవాది శశికిరణ్ శెట్టి వాదించారు. ఇరువైపులా వాదనలను ఆలకించిన న్యాయమూర్తి ఏ.జీ.ఎస్ కమల్.. నవంబర్ 2న ఆర్ఎస్ఎస్ పథసంచలనానికి అనుమతి కల్పించారు. రాష్ట్రంలో వందలాది పథ సంచలనాలను నిర్వహించాము, ఎక్కడా సమస్య రాలేదు, కాబట్టి ఆదివారమే జరుపుతామన్న సంఘ్ వకీలు వాదనను ఆమోదించలేదు. నవంబర్ 2న ఆర్ఎస్ఎస్ పథసంచలనం జరుపుకోవచ్చని, శాంతిభద్రతలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగరాదని ఆదేశించారు, ర్యాలీ కోసం కొత్తగా జిల్లాధికారులకు అనుమతికి పిటిషన్ సమర్పించాలని సూచించారు. తదుపరి విచారణను జడ్జి 24వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అయితే ఈదఫా కూడా జిల్లా యంత్రాంగం అనుమతిస్తుందా? అనే అనుమానం సంఘ్ నేతల్లో తలెత్తింది. -
బళ్లారి– కుమటా బస్సు పల్టీ
యశవంతపుర: కేఎస్ ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో 49 మంది ప్రయాణికులు గాయపడిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా కార్వార వద్ద జరిగింది. శనివారం రాత్రి అంకోలా తాలూకా వడ్డి ఘాట్లో బస్సు పల్టీ పడింది. కుమటా – శిరసి మార్గంలో రోడ్డు పనులు జరుగుతున్న కారణంగా సంచారాన్ని బంద్ చేశారు. శిరసికి వెళ్లే వాహనాలను వడ్డి ఘాట్ రోడ్డు వైపు మళ్లించారు. ఇరుకై న మలుపుల్లో బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల పల్టీ కొట్టింది. ఈ బస్సు బళ్లారి సిటీ నుంచి కుమటాకు వెళ్తోంది. డ్రైవరుతో సహా 49 మంది గాయాల పాలయ్యారు. అంకోలా, కుమటా కు బాధితులను తరలించారు. మరోవైపు శివమొగ్గ, మండ్య వద్ద ప్రమాదాలు జరిగాయి. 49 మందికి గాయాలు -
బెంగళూరు మేలును మరచి తిడతారా?
● పారిశ్రామికవేత్తలపై డిప్యూటీ సీఎం గుర్రు బనశంకరి: బెంగళూరులో సౌకర్యాలను వాడుకుని కంపెనీలను ప్రారంభించి పెద్దస్థాయిలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగినవారు నేడు బెంగళూరును విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ధ్వజమెత్తారు. అనేకమంది ఐటీ, బీటీ పారిశ్రామికవేత్తలు ఇటీవల రోడ్లు, ట్రాఫిక్ సమస్యలపై వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం తెలిసిందే. ఆదివారం కోరమంగల వీరయోధ ఉద్యానవనంలో బెంగళూరు నడిగే అభియానలో డీకే.శివకుమార్ పాల్గొని ప్రజలతో మాట్లాడారు. బెంగళూరుకు వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు గతంలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనే దానిని మరచిపోయి ట్వీట్లు చేస్తున్నారు, మనం మూలాలను మరిచిపోరాదు అని కోరారు. గుంతల రోడ్ల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత రెండేళ్లలో తాము చేసిన సంక్షేమం, అభివృద్ధి ఎవరూ చేయలేదన్నారు. ఢిల్లీ, ముంబై తో పాటు ఎక్కడికి తీసుకెళ్లినా రోడ్ల సమస్యలను చూపిస్తానని సవాల్ చేశారు. బెంగళూరు నగరంలో నిత్యం 3 వేల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి, జనాభా 1.40 కోట్ల కు చేరుకుంది. 70 లక్షల మంది ప్రతి రోజు బయటి జిల్లాల నుంచి వచ్చి వెళుతున్నారు, ఉద్యోగం విద్య, పరిశ్రమలు, వ్యాపారం తదితర అనేక రంగాల కోసం బెంగళూరుపై ఆధారపడ్డారని తెలిపారు. బెంగళూరు పాలికెలకు నిధులను పెంచామన్నారు. టన్నెల్ రోడ్డు మార్గం, ఎలివేటెడ్ కారిడార్, డబుల్ డెక్కర్ వంతెనలు, బఫర్ రోడ్లు, సిటీ లైటింగ్ తదితరాల కోసం రూ.1.04 లక్షల కోట్లతో పనులు చేపడతామని చెప్పారు. మహిళలకు కుంకుమ– పసుపుమైసూరు: మైసూరు నగరంలోని శ్రీదుర్గా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటె ఆంజనేయ స్వామి దేవాలయం ముందు అర్చక సిబ్బందికి, పౌరకార్మికులకు, మహిళలకు పసుపు కుంకుమ, పూలను బహూకరించారు. సమాజ సేవకుడు కే.రఘురామ్ వాజపాయ్ మాట్లాడుతూ దీపావళికి నిజమైన అర్థం అంటే సంతోషాన్ని పంచడమే అన్నారు. ఒక దీపం వెయ్యి దీపాలు వెలిగేలా చేస్తుందని, ఒకరి వల్ల మిగతావారికి వెలుగు రావాలని చెప్పారు. మరో వారం భారీ వర్షసూచన యశవంతపుర: రాష్ట్రవ్యాప్తంగా మరో వారం పాటు వానలు కొనసాగే అవకాశం ఉంది. మూడు రోజుల నుంచి కరావళి, మలెనాడు, దక్షిణ ఒళనాడు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరు చుట్టుపక్కల ఓ మాదిరి వానలు పడ్డాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన మార్పులతో ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ నెల 25 వరకు వానలు పడే అవకాశం ఉంది. ముంగారు వానల కంటే హింగారు వానలు ఎక్కువ పడవచ్చని వాతావారణశాఖ అధికారులు తెలిపారు. శివమొగ్గలో కుండపోత శివమొగ్గ: దీపావళి పండుగ వేళలో శివమొగ్గ నగరంతో పాటు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం ఆదివారమంతా కొనసాగింది. శివమొగ్గ నగరమంతటా వర్షం పడింది. జన జీవితానికి అంతరాయం ఏర్పడింది. -
దీపావళి కోలాహలం
విభిన్న రీతుల్లో ఆకట్టుకుంటున్న మట్టి దీపాలుసొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ కిటకిట రోడ్డు పక్కన అరటి పిలకల అమ్మకాలు బళ్లారి, హొసపేటెలో ఆదివారం దీపావళి కోలాహలం నెలకొంది. దీపావళి, లక్ష్మీపూజను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. బళ్లారిలో పారిశ్రామిక వాడగా పేరొందిన తోరణగల్లు, తోరణగల్లు ఆర్ఎస్లో పూజా సామగ్రి కొనుగోళ్లతో సందడి వాతావరణం కనిపించింది. ఉత్తరాది, దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు చెందిన జిందాల్ కార్మికులు, అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు, కూలీలు పూలు, పండ్లు, కొత్త దుస్తులు, అరటి పిలకలు, మట్టి దీపాలు కొనుగోలు చేశారు. మరోవైపు పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు కిక్కిరిశాయి. పండుగ సందర్భంగా పూలు పండ్లు, టెంకాయలు, కాయకూరలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. మట్టి ప్రమీదలను నగరంలో ప్రముఖ రహదారుల్లో అమ్మకానికి ఉంచారు. – బళ్లారి రూరల్/హొసపేటె: -
దీపాలు వెలిగిస్తుండగా ప్రమాదం
● మూడు బైక్లు దగ్ధం, ఏడుగురికి గాయాలు సాక్షి బళ్లారి: బాగలకోట నగరంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఇంటి ముందు దీపాలు వెలిగించే క్రమంలో అగ్ని ప్రమాదం జరగడంతో మూడు ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. 7 మందికి గాయాలు అయ్యాయి. బాగలకోట నగరంలో రాజేంద్ర అనే వ్యక్తి ఇంటి ఎదురుగా దీపాలు వెలిగించాడు. ప్రమాదవశాత్తూ మంటలు వ్యాపించడంతో పాటు గ్యాస్ సిలిండర్ లీకేజీ కావడంతో మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన ఇంట్లో వారు పరుగులు తీయడంతో ప్రాణాలను దక్కించుకున్నారు. అయితే 7 మందికి గాయాలు అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. రాజేంద్ర బోర్వెల్ పనుల కోసం తెచ్చిన ఆయిల్ దీపాలకు తగలడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై బాగలకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నకలీ ఓటర్ల జాబితా దగ్ధంపై విచారణ రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా అళందలో మాజీ శాసన సభ్యుడు సుభాష్ గుత్తేదార్ నివాసంపై ఎస్ఐటీ అధికారులు శుక్రవారం రాత్రి దాడులు చేశారు. నకలీ ఓటరు జాబితా తెచ్చి కాల్చిన అంశంపై విచారణ చేపట్టారు. ఓటరు రికార్డులు తెచ్చిన గూడ్స్ వాహనాన్ని అళంద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అక్రమ మద్యంతో ప్రాణనష్టం హొసపేటె: ఆంధ్ర సరిహద్దు నుంచి తీసుకొచ్చిన సీహెచ్ పౌడర్తో మద్యం తయారు చేసి అక్రమంగా అమ్ముతున్నారు. దీని వల్ల జిల్లాలో యువకులు మరణిస్తున్నారని ఎంపీ ఈ.తుకారాం అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం కూడ్లిగి పట్టణంలోని శ్రీమతి అంగడి వీరమ్మ తిరుకప్ప ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో జిల్లా స్థాయి దిశ (అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ) సమావేశం జరిగింది. ఎంపీ మాట్లాడుతూ.. పోలీసులు శాఖ సరిహద్దులో చెక్ పోస్ట్ ప్రారంభించి సీహెచ్ పౌడర్ రవాణాను అరికట్టాలని ఎస్పీ జాహ్నవిని ఆదేశించారు. ఎకై ్సజ్, పోలీసులు శాఖలు దీనిపై నిర్లక్ష్యం వహించొద్దన్నారు. కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ ఎన్టి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎకై ్సజ్ శాఖ వెంటనే మేల్కోని అక్రమ మద్యం అమ్మకాలపై చర్యలు తీసుకోవాలన్నారు. లంపీ వ్యాధి నివారణకు మందుల కొరత ఉంటే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల దృష్టికి తీసుకెళ్లాలని పశుసంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లతా మల్లికార్జున, జిల్లాధికారి కవితా ఎస్ మన్నికేరి, జిల్లా పంచాయతీ అధికారి మొహమ్మద్ నోయంగ్జాయ్ అక్రమ్ అలీషా, ఎస్పీ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. రెండు ద్విచక్ర వాహనాల ఢీ హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా బనవికల్లు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన బనవికల్లు సమీపంలోని జాతీయ రహదారి–50పై శనివారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో మోహన్ (27) తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడిని చికిత్స నిమిత్తం కూడ్లిగి తాలూకా ఆస్పత్రిలో చేర్చారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించారు. కానహోసల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. డీసీసీ బ్యాంక్ ఎన్నికల్లో వర్గపోరు సాక్షిబళ్లారి: బెళగావి డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య గొడవ జరిగింది. ముందు నుంచి బెళగావి అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో అంతర్గత విభేదాలు ఉండటంతో ఈ ఎన్నికల్లో పతక స్థాయికి చేరుకున్నాయి. జార్కిహొళి సోదరులు లక్ష్మణ సవధి, ఉమేష్ కత్తి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జార్కిహొళి వర్గానికి చెందిన అప్పాసాహెబ్ వ్యతిరేకంగా ఓటు లేని వారు ప్రవేశించడంతో గొడవ మొదలైంది. రాయబాగ్ తాలూకా డైరెక్టర్ స్థానానికి బసగౌడ రంగంలోకి దిగడంతో ఈయన సౌది, కత్తి వర్గం తరఫున పోటీ చేయడంతో బసగౌడ వర్గీయులు ఘర్షణకు దిగారు. హోటల్ ముందు లక్ష్మణ సౌది–జారికెహొళి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను కట్టడి చేశారు. -
కొండ కోనలు దాటుకుని..
యశవంతపుర: దీపావళి పర్వదినాల సందర్భంగా కాఫీనాడు చిక్కమగళూరు శక్తిదేవతగా పేరుగాంటిన దేవీరమ్మ దర్శనం కోసం భక్త కోటి తరలివచ్చింది. దట్టమైన అడవుల్లో ముళ్లయ్యనగిరి ప్రాంతంలో సముద్ర మట్టానికి 3800 అడుగుల ఎత్తులో కొండపై వెలసిన అమ్మవారి ఆలయానికి ఆదివారం ఉదయం నుంచి భక్తుల రాక మొదలైంది. వేలాది మంది ఎన్నో ప్రయాసలకోర్చి కొండను ఎక్కి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్య మధ్యలో జోరువాన వచ్చినా తడుస్తూనే భక్తులు కొండను ఎక్కారు. ఆది, సోమవారం రెండు రోజుల పాటు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. మట్టిచరియలు విరిగే అవకాశం ఉన్నందున భక్తులు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు తెలిపారు. ముళ్లయ్యనగిరిలో దేవీరమ్మ జాతర -
టపాసుల వ్యాపారం.. గత వైభవం
బొమ్మనహళ్లి: ఒకప్పుడు నగరవాసులు పెద్దమొత్తంలో టపాసుల్ని కొనాలి అంటే తమిళనాడులోని హోసూరుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా బొమ్మనహళ్లి పరిధిలోని చందాపుర నుంచి మొదలుకొని, అత్తిబెలిలో తమిళనాడు సరిహద్దుల వరకు వందలాది దుకాణాలు వెలిసేవి. కానీ అదంతా గత వైభవంగా మారింది. 2023లో దీపావళి సమయంలో టపాసుల గోదాము– షాపులో అగ్నిప్రమాదం జరిగి సుమారు 16 మంది వరకూ మరణించారు. ఆ దుర్ఘటన తరువాత ఇక్కడ దుకాణాల ఏర్పాటు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు అక్కడక్కడ ఒకటి తప్ప పెద్ద షాపులు లేవు. వ్యాపారం తుడిచేసినట్లు పడిపోయింది. 90 శాతం డిస్కౌంట్ అట గిరాకీ లేకపోవడంతో 90 శాతం డిస్కౌంటు ఇస్తామని పిల్లలు అంగళ్ల ముందు ప్లకార్డులు పట్టుకుని జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి నెరళూరులో టపాసుల వ్యాపారం చేస్తున్నాం, ఇప్పుడు ఆన్లైన్లో కూడా బాణాసంచా లభిస్తోంది. అంగడి వద్దకు వచ్చి కొనేవారు తక్కువయ్యారు, అని రామస్వామి అనే వ్యాపారి తెలిపారు. అనుమతుల భారం ● గతంలో ఘోర ప్రమాదం తరువాత టపాసుల దుకాణాలకు బెంగళూరు అధికారులు నిబంధనలను కఠినతరం చేశారు. ● పోలీసు, కాలుష్య నియంత్రణ, మున్సిపల్, రెవెన్యూ, ఫైర్ వంటి శాఖల అనుమతులు తీసుకున్నవారికే షాపులు ఏర్పాటు చేయనిచ్చారు. ● చాలామంది ఈ అనుమతులను పొందలేక, అందుకోసం పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చు చేయలేక టపాసుల వ్యాపారాన్నే వదులుకున్నారు. ●అత్తిబెలి పోలీసు స్టేషన్ పరిధిలో 12 షాపులు, నెరళూరులో 9 అంగళ్లు మాత్రమే ఉన్నాయి. గతంలో ఇక్కడ కనీసం 50 షాపులతో భారీగా టపాసుల వ్యాపారం జరిగేది. ●బొమ్మసంద్ర పురభ, హెబ్బగోడి నగరసభలో ఒక్క అంగడికీ అనుమతి లేదు. ఆనేకల్ తాలూకాలోని హెబ్బగోడి, బొమ్మసంద్ర, చందాపుర, తిరుమగొండనహళ్ళి గేట్, నెరళూరు, యారండహళ్ళి, అత్తిబెలి వరకు వందలాది టపాసుల షాపులతో కళకళలాడేది. ఇప్పుడు 20 కి దాటకపోవడం విశేషం. బెంగళూరు– తమిళనాడు సరిహద్దుల్లో సవాలక్ష ఆటంకాలు వందల నుంచి పదుల సంఖ్యకు తగ్గిన దుకాణాలు రెండేళ్ల కిందటి దుర్ఘటనే కారణం -
నిందితులపై చర్యలు తీసుకోండి
రాయచూరు రూరల్: విజయపుర జిల్లా ముద్దే బిహళ్ తాలుకా బనోశిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితులపై చర్యలు చేపట్టాలని చలువాది మహిళా మహాసభ డిమాండ్ చేసింది. ఆదివారం జిల్లా అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చలువాది మహిళా మహాసభ అధ్యక్షురాలు అర్చన మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని సూచించారు. ఉద్యోగం ఇచ్చి, ఇల్లు, భూమి మంజూరు చేయాలన్నారు. స్థానిక అధికారికి వినతిపత్రం అందజేశారు. రహదారి నిర్మించాలి రాయచూరు రూరల్: దేవదుర్గ తాలుకా గబ్బూరు–గూగల్ వంతెన వరకూ రోడ్డు అధ్వానంగా మారింది. వెంటనే రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కర్ణాటక రైతు, వ్యవసాయ సంరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఇంజనీరింగ్ విభాగం అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కర్ణాటక రైతు, వ్యవసాయ సంరక్షణ సమితి అధ్యక్షుడు మస్తాన్ నాయక్ మాట్లాడుతూ.. రహదారి మరమ్మతులు చేపడితే యాదగిరికి 50 కి.మీ దూరం తగ్గుతుందన్నారు. వెంటనే రహదారి పనులు చేపట్టి, సమస్య పరిష్కరించాలని కోరారు. అనంతరం ఇంజనీర్ వెంకటేష్ గలగకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంగమేష్ నాయక్, శామిల్, మూసా, శివరాజ్, తిమ్మప్ప నాయక్, విరుపాక్షి తదితరులు పాల్గొన్నారు. యేహోవా మందిరంలో ప్రార్థనలు హుబ్లీ: స్థానిక శాంతి నగర్లోని యేహోవా ప్రార్థన మందిరంలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. బ్రదర్ రాబిన్, మంజునాథ్ మాట్లాడుతూ.. వివిధ అధ్యాయాల్లోని సంబంధిత వచనాలను చక్కగా వివరించారు. ప్రత్యేక ప్రార్థన కూటముల్లో పాల్గొనాలని సూచించారు. అందరి మేలు కోసం నిత్యము ప్రార్థనలు చేయాలన్నారు. -
పంట నష్ట పరిహారం చెల్లించాలి
రాయచూరు రూరల్: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం మంజూరు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేవారు. ఆదివారం బీదర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఈశ్వర్ ఖండ్రే నివాసం ముందు శాసన సభ్యుడు ప్రభు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అతివృష్టితో కలబుర్గి, బీదర్, యాదగిరి, రాయచూరు జిల్లాలో పంట నష్టం సంభవించిందన్నారు. పత్తికి క్వింటాల్కు రూ.10 వేలు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సౌకర్యార్థం పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. రైతులు తీసుకున్న రుణాలను పూర్తిస్థాయిలో రద్దు చేయాలని తెలిపారు. అనంతరం జిల్లాధికారికి వినతిపత్రం అందజేశారు. -
టూరిస్టు బస్సు బోల్తా.. 18 మందికి గాయాలు
శివమొగ్గ: ప్రైవేటు టూరిస్టు బస్సు వేగంగా వెళ్తూ పల్టీలు కొట్టిన ప్రమాదంలో 18 మంది గాయపడిన సంఘటన శివమొగ్గ జిల్లాలోని సాగర్ తాలూకా ఆడుకట్టె వద్ద ఆదివారం జరిగింది. చిక్కబళ్లాపురం జిల్లాలోని గౌరిబిదనూరుకు చెందిన 45 మంది సిగందూరు చౌడేశ్వరి దేవస్థానం దర్శనానికి వెళ్లి, అక్కడి నుంచి వడనబైలులో ఉన్న పద్మావతి ఆలయానికి బయల్దేరారు. ఈ సమయంలో ప్రమాదం జరిగింది. పురుషులు, మహిళలు సహా బాలలు గాయాలపాలయ్యారు. స్థానిక ప్రజలు వారిని సాగర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు బ్రేక్ విఫలం కావడమే కారణమని డ్రైవర్ చెప్పాడు. -
టైరు పేలి.. రెండు బస్సులు ఢీ
● మండ్య వద్ద ఇద్దరు మృతి మండ్య: రెండు కేఎస్ ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోగా, 70 మంది గాయపడిన సంఘటన మండ్య జిల్లాలోని మళవళ్ళి తాలూకాలోని బాచనహళ్ళి వద్ద జాతీయ రహదారిలో ఆదివారం సాయంత్రం జరిగింది. కొళ్ళెగాల వైపు నుంచి బెంగళూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు టైరు పేలిపోయింది, దీంతో అదుపుతప్పి ఎదురుగా అవతలి లేన్లో మళవళ్ళి నుంచి కొళ్ళెగాలకు వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. రెండు బస్సుల్లోను ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఇద్దరు మహిళలు మరణించగా, 70 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా ఉన్న కొందరిని మండ్య మిమ్స్కు తరలించారు. మండ్య గ్రామీణ పోలీసులు, ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. -
మా బిడ్డను అల్లుడే చంపాడు
యశవంతపుర: బెంగళూరు మారతహళ్లి ఠాణా పరిధిలో సంచలనాత్మక డాక్టర్ కృతికారెడ్డి హత్య కేసులో ఆమె భర్త డాక్టర్ మహేంద్రరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. తాను మత్తు మందు ఇవ్వలేదని, చంపలేదని చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో మృతురాలి తల్లి అల్లునిపై మండిపడ్డారు. నా కూతురిని 2024 అక్టోబర్లోనే హత్య చేయాలని అల్లుడు డాక్టర్ మహేంద్రరెడ్డి పథకం వేశాడని మృతురాలు డాక్టర్ కృతికారెడ్డి తల్లి, న్యాయవాది సౌజన్య ఆరోపించారు. ఆమె ఆదివారం బెంగళూరులో విలేకర్లుతో మాట్లాడారు. పెళ్లి నాటి నుంచి మహేంద్రరెడ్డి అనుమానం రాకుండా నడుచుకున్నాడు. పెళ్లయ్యాక కృతిక అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. రోజు మార్చి రోజు నైట్ డ్యూటీ అని చెబుతూ నాకు తెలియకుండా కూతురి ప్రాణం తీశాడు అని ఆమె విలపించారు. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఆమెకు ఇంటిలోనే వైద్యం చేస్తున్నట్లు చెప్పాడు, 22న కృతికను మా ఇంటికి తీసుకెళ్లాం. ఐవీ డ్రిప్ వేసుకొని వచ్చింది. 23న కృతిక మాతో కలిసి భోజనం చేసింది. రాత్రి 9:30 గంటలకు రూంకు వెళ్లారు. మరుసటి రోజున ఉదయం 7:30 గంటలకు అల్లుడు రూం నుంచి కేకలు వేశాడు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు అని సౌజన్య వివరించారు. అల్లుడు మహేంద్రరెడ్డి కృతిక కు మత్తుమందు ఇచ్చి హత్య చేశాడని ఆరోపించారు. ఎన్నో ఆశలు పెట్టుకుంది ఎన్నో ఆశలు పెట్టుకొని కృతికారెడ్డి నాలుగు మెడిసిన్ కోర్సులు చేసింది. డాక్టర్ చదివి సమాజ సేవ చేయాలని ఎన్నో కలలుగంది, కృతిక కు ఎలాంటి అనారోగ్యంలేదు. అల్లుడు మహేంద్రరెడ్డి మత్తు మందులిచ్చి ప్రాణాలు తీశాడు అని ఆమె చెప్పారు. డా.కృతికారెడ్డి తల్లి సౌజన్య ఆరోపణలు -
పీఎస్ఐ తిమ్మప్ప జోగి మృతి
హొసపేటె: విజయనగర జిల్లా హువినహడగలి తాలూకా హిరేహడగలి పోలీస్ స్టేషన్ క్రైమ్ బ్రాంచ్ పీఎస్ఐ తిమ్మప్ప జోగి (59) శనివారం రాత్రి కన్ను మూశారు. ఈయన కొన్ని రోజులుగా హార్ట్స్ట్రోక్తో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. హరపనహళ్లి పట్టణానికి చెందిన తిమ్మప్ప గత 32 సంవత్సరాలుగా పోలీసు శాఖలో సేవలందించారు. అంత్యక్రియలు విజయనగర జిల్లాలోని హరపనహళ్లి పట్టణంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. తిమ్మప్ప జోగి మృతిపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎస్.జాహ్నవి, అదనపు ఎస్పీ జి.మంజునాథ్, హరపనహళ్లి డీవైఎస్పీ వెంకటప్ప నాయక్, హోస్పేట డీవైఎస్పీ డాక్టర్.టి.మంజునాథ్, కూడ్లిగి డీవైఎస్పీ మల్లేష్ దొడ్డాని, ఇతర పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది సంతాపం తెలిపారు. ‘బతికుండగానే చంపేశారు’ ● రేషన్ కార్డులో విద్యార్థిని చనిపోయినట్లు నమోదు చేసిన అధికారులు హుబ్లీ: హావేరిలో విద్యార్థిని బతికి ఉండగానే రేషన్ కార్డులో చనిపోయినట్లు అధికారులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆటో డ్రైవర్ మహబూబ్ సాబ్ తన పెద్ద కుమార్తె సుహానకు రేషన్ ఇవ్వక పోవడంతో విచారించడానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే తన పెద్ద కుమార్తె మూడున్నర ఏళ్ల క్రితమే మృతి చెందినట్లుగా రేషన్ కార్డు రికార్డుల్లో నమోదు కావడం గుర్తించాడు. వెంటనే సమస్యను ఫుడ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. సుహాన పేరు రేషన్కార్డులో లేకపోవడంతో స్కాలర్షిప్, ఇతర పథకాలు అందడం లేదని మహబూబ్ సాబ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు స్పందించి వెంటనే రేషన్కార్డులోకి పేరు చేర్చాలని కోరుతున్నాడు. -
ఎయిడ్స్పై అవగాహన అవసరం
రాయచూరు రూరల్: దేశాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్పై ప్రచారం చేపట్టాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుగుణ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా ఆరోగ్యశాఖ, రెడ్రిబ్బన్, రిమ్స్, పాఠశాలలు, స్వచ్ఛంధ సంస్థల ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిపై వీధి నాటకాల జాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఎయిడ్స్ అంటువ్యాధి కాదన్నారు. సమాజంలో ఈ వ్యాధికి గురైన వారిపై వివక్ష చూపొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధిపై గ్రామస్థాయి నుంచి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సంతోష్ కుమార్, మఠపతి, మల్లయ్య, శాంత కుమార్, దేవమ్మ, మహాలింగమ్మ, శారద, అన్నపూర్ణ, సువర్ణ, జమున తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు రాయచూరు రూరల్: జిల్లా యువకులు క్రీడల్లో రాణించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని తారానాథ్ విద్యా సంస్థల ఉపాధ్యక్షుడు పవన్ పేర్కొన్నారు ఆదివారం మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో రాయచూరు, కొప్పళ జిల్లాల సిటీ ఎలెవన్ అండర్–14 క్రికెట్ శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. సుమాదు 110 జట్లు శిక్షణ శిబిరానికి వచ్చాయి. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. క్రీడాకారులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు. క్రీడల్లో రాణించి, పాఠశాల తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సిటీ ఎలెవన్ క్లబ్ అధ్యక్షుడు శరణ రెడ్డి, రాజశేఖర్, రాజేష్, వెంకట రెడ్డి, సంజీవ నాయక్, భరత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి యువజనోత్సవాలు ప్రారంభం రాయచూరు రూరల్: విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని మానవీయ మౌల్యాలను పెంచుకోవాలని అదనపు జిల్లా అధికారి శివానంద పిలుపునిచ్చారు. ఆదివారం వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జిల్లా పాలనా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, యువజన క్రీడల సేవా శాఖ ఆధ్వర్యంలో 2025–26 జిల్లా స్థాయి యువజనోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి ఆధునిక యుగంలో విద్యార్థులకు ఉత్సవాలపై ఆసక్తి తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్స్కు బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. యువకులు భారతీయ సంస్కృతిని కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో 180 మంది యువకులు పాల్గొనడం అభినందనీయమన్నారు. ఉత్సవాల్లో యువజన క్రీడల సేవా శాఖ అదికారి వీరేష్ నాయక్ పాల్గొన్నారు. రాష్ట్రావతరణ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి రాయచూరు రూరల్: జిల్లాలో నవంబర్ 1న జరగనున్న రాష్ట్రావతరణ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు జిల్లా అధికారి శివానంద పేర్కొన్నారు. ఆదివారం జిల్లా అధికారి కార్యాలయంలో రాష్ట్రావరణ వేడుకలపై సమావేశం నిర్వహించారు. నగరంలోని కర్ణాటక సంఘం ఆధ్వర్యంలో తల్లి భువనేశ్వరి చిత్రపటానికి పూలమాల వేసి ఊరేగించడం జరుగుతుందన్నారు. మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల పాటు కన్నడ సినిమాలను ప్రదర్శించాలని ఆదేశించడం జరిగిందన్నారు. దుకాణాలు, హోటళ్లకు కన్నడ భాషలో నామఫలాకాలు రాయించాలని సూచించారు. కార్యక్రమంలో సమితి సభ్యులు శాంతప్ప, కొండప్ప, చంద్రశేఖర్ పాటిల్, మురళీధర్ కులకర్ణి, శ్రీనివా్స్, గురునాథ్, వినోద్ రెడ్డి, అధికారులు విజయ రాణి, వీరేష్ నాయక్, రమేష్ గౌడ తదితరులు పాల్గొన్నారు. కేఎంసీ పరిశోధన ఆస్పత్రి వైద్యుల ఘనత ● మగబిడ్డ కడుపులో బ్రూణం తొలగింపు ● చిన్నారి ఆరోగ్యం ఉండటంతో డిశ్చార్జ్ హుబ్లీ: అప్పుడే పుట్టిన మగబిడ్డ కడపులో 8 సెంటీమీటర్ల పొడవు ఉన్న బ్రూణాన్ని ఈనెల 8వ తేదీన హుబ్లీ కేఎంసీ పరిశోధన ఆస్పత్రి వైద్యులు తొలగించిన విషయం తెలిసిందే. చిన్నారి పూర్తిగా కోలుకోవడంతో ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వివరాలు.. సెప్టెంబర్ 23న ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకాకు చెందిన మహిళ రెండో బిడ్డకు జన్మనిచ్చింది. మగబిడ్డ పొట్టలో బ్రూణం ఉన్నట్లు వైద్య బృందం గుర్తించింది. కిమ్స్ ఆస్పత్రిలో అనుభవం గల వైద్య నిపుణుడు, బాలల ఆపరేషన్ విభాగం డాక్టర్ రాజ శంకర్, డాక్టర్ రుపాలి నేతృత్వంలో చిన్నారికి ల్యాబోస్కోపీ చేసి కడుపులోని ఏ భాగంలో బ్రూణం ఉందో నిర్ధారించారు. అనంతరం చిన్నారికి మత్తు మందు ఇచ్చి పొట్ట భాగంలో చిన్న రంద్రం చేసి ఆపరేషన్ చేశారు. కడుపులో ఉన్న 8 సెంటిమీటర్ల ఉన్న బ్రూణాన్ని విజయవంతంగా బయటకు తీశారు. బ్రూణానికి మొదడు, హృదయం లేవు. వెన్నెముక అలాగే చిన్న కాళ్లు, చేతులు ఉన్నట్లు గుర్తించారు. ఎఫ్ఈటీయూఎస్ఐఎన్ఎఫ్ఈటీయూగా పిలిచే ఈ కేసు ప్రపంచంలోనే అరుదైనది కావడంతో బ్రూణం గడ్డను వ్యాధుల నిర్ధారణ వైద్య శాస్త్ర విభాగంలో నిల్వ చేశారు. వైద్యులకు బోధన నిమిత్తం దాచి పెట్టారు. -
కర్నాటకలో ఆర్ఎస్ఎస్ మార్చ్కి నో
కలబురిగి: కర్నాటకలో రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) తలపెట్టిన ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత నియోజకవర్గం చిట్టాపూర్లో ఆదివారం ఆర్ఎస్ఎస్ ‘రూట్ మార్చ్’నిర్వహించాలని భావించింది. ఈ మేరకు తహశీల్దార్కు దరఖాస్తు చేసుకుంది. అయితే, శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశముందంటూ తహశీల్దార్ అనుమతి నిరాకరించారు. ఆ దరఖాస్తును తిరస్కరించారు. కలబురిగి జిల్లా చిట్టాపూర్ పట్టణంలో అక్టోబర్ 19వ తేదీన ఆర్ఎస్ మార్చ్ నిర్వహణకు అనుమతి కోరిందని తహశీల్దార్ చెప్పారు. భీమ్ ఆర్మీ, ఇండియన్ దళిత్ పాంథర్స్ కూడా అదే రోజు ర్యాలీలు జరుపుతామని దరఖాస్తు చేసుకున్నాయన్నారు. వీటితో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నాయంటూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి నో చెప్పామన్నారు. అదేవిధంగా, ర్యాలీకి అనుమతివ్వక మునుపే ఏర్పాటు చేశారంటూ పట్టణ ప్రధాన రహదారిపైని ఆర్ఎస్ఎస్ కటౌట్లు, బ్యానర్లను శనివారం భారీ పోలీసు బందోబస్తు నడుమ మున్సిపల్ సిబ్బంది తొలగించి వేశారు. ప్రభుత్వ ప్రాంగణాలు, భవనాల్లో అనుమతి లేకుండా ఏ సంస్థలు గానీ వ్యక్తులు గానీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదంటూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. -
సీనియర్ వేధింపులు.. రాలిన విద్యా కుసుమం
సాక్షి, బెంగళూరు: భార్యను చంపిన భర్త, యువతిని చంపిన దుండగుడు.. ఇంతలోనే బెంగళూరులో మరో దుర్ఘటన జరిగింది. సీనియర్ వేధింపులను తాళలేక బాగలూరులో ఓ పీజీ హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని సనా పర్వీన్ (19)గా గుర్తించారు. సనా మరణానికి కాలేజీలో సీనియర్ రిఫాన్ వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. సనా చదివే కాలేజీలోనే రిఫాన్ చదువు పూర్తి చేసుకుని కాలేజీ వదిలి వెళ్లిపోయాడు. అయినప్పటికీ సనాకు వేధింపులు ఆపలేదు. కేరళకు చెందిన రిఫాన్ గత పది నెలల నుంచి తరచుగా కాలేజీకి వచ్చి వెళ్లేవాడు. పీజీ వద్దకు కూడా వచ్చి సనాను ప్రేమ పేరుతో ఒత్తిడి చేసేవాడు. పలుమార్లు కాలేజీలో గొడవలు కూడా జరిగినట్లు ఆమె స్నేహితులు తెలిపారు. ఇది తట్టుకోలేక ఆమె పీజీలోని గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పై బాగలూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. మహిళా సంఘాల నిరసన మరోవైపు మహిళలకు, యువతులకు భద్రత కల్పించాలని, దౌర్జన్యాలను అరికట్టాలని ఏఐడీఎస్ఓ సహా పలు స్త్రీవాద, వామపక్ష సంఘాల కార్యకర్తలు బెంగళూరు ఫ్రీడంపార్క్లో ధర్నా చేశారు. మహిళలు సమాజంలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని, దాడులు అధికమైనట్లు వాపోయారు. ప్రభుత్వం దుండగులకు ముకుతాడు వేయాలని నినాదాలు చేశారు. -
చామరాజనగర బంద్
మైసూరు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి మీదకు రాకేష్ కిషోర్ అనే లాయరు బూటు విసరడాన్ని ఖండిస్తూ దళిత సంఘాలు శనివారం చామరాజనగర బంద్ను నిర్వహించాయి. బంద్ విజయవంతమైంది. థియేటర్లు, హోటళ్లు, షాపులు, ఆఫీసులు మూతపడ్డాయి. ఉదయం నుంచి దళిత సంఘాల నాయకులు ర్యాలీలు నిర్వహించారు. బస్టాండు ముందు బైఠాయించారు. దాంతో మధ్యాహ్నం వరకు బస్సులు కదలలేదు. అనేక జిల్లాలలో దళిత సంఘాల ఆందోళనలు జరిగాయి. ఏబీసీ వర్గీకరణలో చుక్కెదురు శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలను మూడు గ్రూపులుగా ఉప వర్గీకరణ చేసి విడుదల చేసిన నోటిఫికేషన్ కింద ఎలాంటి ఉద్యోగ నియామకాలను చేయరాదని హైకోర్టు ఆదేశించింది. ఇదివరకే ఆరంభమైన నియమాకాలను కొనసాగించవచ్చని సూచించింది. ఆగస్టు ఆఖరులో చేసిన ఏబీసీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ అస్పృశ్య సంచార సముదాయాల ఒక్కూట, సంచార సంఘం దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి సూరజ్ గోవిందరాజ్ విచారించారు. వర్గీకరణను నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు. అశాసీ్త్రయంగా ఉందని, ప్రభుత్వం సక్రమంగా చేయలేదని ఆరోపించారు. వాదనలను ఆలకించిన జడ్జి సర్కారు ఉత్తర్వులపై స్టే జారీచేశారు. ఖాకీ చేతిలో మాజీ భార్య హత్య ● బెళగావి జిల్లా సవదత్తిలో ఘటన రాయచూరు రూరల్: బెంగళూరులో డాక్టరు చేతిలో భార్య హత్య జరిగిన విషయం మరిచిపోకముందే, ప్రేమించి, పెళ్లి చేసుకొని, ఆపై విడాకులు పొందిన మాజీ భార్యను పోలీస్ కానిస్టేబుల్ హత్య చేసిన ఘటన బెళగావి జిల్లా సవదత్తిలో చోటు చేసుకుంది. బైలహొంగల తాలూకా బెళవడికి చెందిన కాశమ్మ (34) ని, బనజవాడకు చెందిన సంతోష్ కాంబ్లే హత్య చేశాడని పోలీసులు తెలిపారు. వివరాలు.. సవదత్తి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పని చేస్తున్న కాశమ్మ, కానిస్టేబుల్ సంతోష్ 13 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఇద్దరు కులాలు వేరైనా పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. కొన్నాళ్లకే అనుమానంతో భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. అతని పోరు పడలేక ఆమె సవదత్తిలో ఇంటిని అద్దెకు తీసుకొని వేరుగా ఉండేది. ఐదు నెలల క్రితం మంజూరయ్యాయి. ఇదంతా అతడు తట్టుకోలేకపోయాడు. ఈ నెల 13న రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చింది. సంతోష్ ఇంటికొచ్చి ఆమెను హత్య చేసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. కుళ్లిన శరీరం నుంచి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల ప్రజలు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న హంతకున్ని అరెస్టు చేశారు. హనీట్రాప్కు యువకుడు బలి ● యువతి, ముఠా సభ్యుల బెదిరింపులు ● ఉడుపి జిల్లాలో సంఘటన యశవంతపుర: ఉడుపి జిల్లా కార్కళ తాలూకా నిట్టె గ్రామానికి చెందిన అభిషేక్ (25) అనే యువకుడు స్థానిక లాడ్జిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెనుక హనీ ట్రాప్ జరిగినట్లు డెత్నోటు ద్వారా బయటపడింది. అభిషేక్ ప్రభుత్వ గోషా ఆస్పత్రిలో ల్యాబ్లో ఉద్యోగి అని తెలిసింది. అభిషేక్, నిరీక్ష అనే యువతి ప్రేమించుకుంటున్నారు. అయితే ఆమె మరో యువకునితోనూ ప్రేమాయణం నడుపుతోందని సమాచారం. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను చూపి డబ్బులు ఇవ్వాలని ఆమె అభిషేక్ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. భయపడిన అభిషేక్ డబ్బులను ఇచ్చాడు. మళ్లీ రూ. 4 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తానని, కేసు పెడతానని బెదిరించింది. కొన్నిసార్లు దాడి కూడా చేసింది. ఈ వేధింపులతో భయపడిన బాధితుడు లాడ్జిలో డెత్నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నిరీక్ష మంగళూరుకు చెందిన రాకేశ్, రాహుల్, తస్లీమ్లతో కలిసి అభిషేక్ను హనీట్రాప్ చేసిందని పోలీసుల విచారణలో బయట పడింది. యువతి ఫోటోలు వైరల్ అయ్యాయి. -
బెంగళూరులో భారీ వర్షం
బెంగళూరులో.. వర్షంలో వెళ్తున్న ఆటో.. బన్నేరుఘట్ట రోడ్డులో వాననీరు బనశంకరి: బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి బెంగళూరు నగరంలో పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురిసి రోడ్లు జలమయం కాగా ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. దీంతో జనం వీకెండ్ సంతోషానికి ఆటంకం ఏర్పడింది. మెజస్టిక్, కార్పొరేషన్, మల్లేశ్వరం, యశవంతపుర, యలహంక, హెబ్బాల, శాంతినగర, కోరమంగల, బొమ్మనహళ్లి, జయనగర, మైసూరురోడ్డు, నాయండహళ్లి, కెంగేరి, బన్నేరుఘట్టరోడ్డు, కృష్ణరాజపురం, మారతహళ్లి, మహదేవపుర, హెచ్ఎస్ఆర్ లేఔట్, మడివాళ, విజయనగర, బసవనగుడి, జేపీ.నగర, ఉత్తరహళ్లి, బనశంకరి , బీటీఎం లేఔట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పండుగకు ఊళ్లకు వెళ్లేవారు కార్లు, సొంత వాహనాల్లో ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. బెంగళూరు– రూరల్తో పాటు పలు జిల్లాల్లో బారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. -
రౌడీ పులి పట్టివేత
మైసూరు: రైతుపై దాడి చేసిన పులిని అటవీ సిబ్బంది పట్టుకున్నారు. జిల్లాలోని సరగూరు తాలూకా బండీపుర అభయారణ్యం పరిధిలోని బడగలపుర గ్రామంలో పత్తి చేనులో ఉన్న రైతు మహదేవగౌడపై దాడి చేసి కళ్లు పీకేసి, తీవ్రంగా గాయపరచిన పెద్ద పులి ఉదంతం తెలిసిందే. గురువారంనాడు ఈ దాడి జరిగింది. క్షతగాత్రున్ని మైసూరు అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సమీప యడియాళ వలయంలో పెంపుడు ఏనుగుల సహాయంతో కార్యాచరణ జరిపి పులిని గుర్తించారు. దానికి మత్తు సూది కొట్టి బంధించారు. దీంతో గ్రామస్తులు హమ్మయ్య అనుకున్నారు. రౌడీ పులిని బోనులో బంధించి తరలించారు. పులిని చూసేందుకు జనం భారీగా గుమికూడారు. -
సొంతూర్లో దీపావళి
టపాసుల బాక్సుతో బాలుడు దీపావళి పండుగ సందర్బంగా విబిన్నరకాలు టపాసులు చిన్నారులను ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్సీ టపాసులు ఈసారి అదికంగా మార్కెట్లో లభిస్తున్నాయి. ఏటా మాదిరిగానే బెంగళూరు– తమిళనాడు సరిహద్దులోని హొసూరు రోడ్డులో అత్తిబెలె, సూర్యనగర మార్గంలో రోడ్డుపక్కన వందలాది టపాసుల దుకాణాలు వెలిశాయి. చిత్ర విచిత్రమైన ఆకారాల్లోని టపాసులు ఇక్కడ అమ్మకానికి ఉంచారు. తమిళనాడు నుంచి టోకుగా తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు, ఎక్కువ రకాలు దొరుకుతాయని పలు జిల్లాల నుంచి వచ్చి టపాసులు కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు తెలిపారు. రాష్ట్రంలో వివిధ నగరాల్లో దీపావళి ప్రమిదలు, లాంతర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.బెంగళూరు మెజెస్టిక్ బస్టాండులో రద్దీ దృశ్యాలు పండుగకు ఎలాగైనా ఊరికి చేరాలి బనశంకరి: దీపావళి పండుగ, అది కూడా వీకెండ్తో పాటు కలిసి రావడంతో బెంగళూరువాసులు సొంతూళ్లకు క్యూ కట్టారు. బంధుమిత్రుల మధ్య టపాసులతో సందడిగా గడపాలని ప్రయాణమయ్యారు. దీంతో సిలికాన్ సిటీ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఉద్యోగం, చదువు, వ్యాపారాలతో నగరంలో ఉంటున్న లక్షలాది మంది సొంత ఊర్ల బాటపట్టారు. నగరం నుంచి శివార్ల వరకూ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. శని, ఆదివారం సెలవు, సోమవారం దీపావళి కావడంతో మూడురోజులు స్వగ్రామంలో గడపాలని నిర్ణయించుకున్నారు. అన్ని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో శుక్రవారం రాత్రి నుంచి మెజెస్టిక్ బస్టాండు, రైల్వేస్టేషన్ వద్ద కిటకిటలాడింది. శాంతినగర బస్టాండు, యశవంతపుర రైల్వేస్టేషన్తో పాటు వివిధ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోనూ విపరీతంగా రద్దీ నెలకొంది. కేఎస్ ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో చోటు దొరకలేదు. ప్రైవేటు ట్రావెల్స్లో టికెట్ రేట్లను రెండు మూడు రెట్లు పెంచేసి దోచుకుంటున్నారని ఆరోపణలొచ్చాయి. హోసూరు రోడ్డు, మైసూరు రోడ్డు, తుమకూరు రోడ్డు, బళ్లారి రోడ్లలో కిలోమీటర్ల కొద్దీ కార్లు, బస్సులు బారులు తీరాయి. లక్షలాది మంది కార్లు, ద్విచక్ర వాహనాల్లో బయలుదేరడంతో మధ్యలో వర్షం వచ్చి గంటల కొద్దీ ట్రాఫిక్లో చిక్కుకున్నారు. సజావుగా వాహనాలు సంచారానికి ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించారు. రైల్వే స్టేషన్, బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీ బస్టాండ్లలో పోలీసు భద్రత పెరిగింది. బెంగళూరు నుంచి లక్షలాది మంది పయనం రహదారులన్నీ కిటకిట రాష్ట్రంలో పండుగ సందడి బిహార్ కూలీలు సైతం దీపావళి పండుగకు బెంగళూరులోని లక్షలాది మంది బిహారీ వలస కార్మికులు కుటుంబాలతో సహా బయలుదేరారు. దీంతో మెజెస్టిక్ కేఎస్ఆర్, యశవంతపుర రైల్వేస్టేషన్లలో తీవ్ర రద్దీ ఏర్పడింది. నవంబరు 6 నుంచి 11 వరకు బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఓటు వేయడానికి కూడా ఎక్కువమంది పయనమయ్యారు. -
ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కవాతు
చెళ్లకెరె రూరల్: దేశంలోనే అతి పెద్ద స్వయం సేవా సంఘం అని పేరొందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాల నిమిత్తం నగరంలో ఏర్పాటు చేసిన భవ్య కవాతు అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గణవేషంతో పాటు 250 మందికి పైగా స్వయం సేవకులు పాల్గొన్నారు. నగరంలోని గాంధీ నగర్, బసవేశ్వర సర్కిల్, నెహ్రు సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్, త్యాగరాజ్ నగర్ వంటి ప్రముఖ రహదారుల్లో కవాతు సాగింది. ఈ సందర్భంగా ప్రజలు, ఆర్ఎస్ఎస్ అభిమానులు పూలవర్షం కురిపించారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు ప్రసాద్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సదృఢ, ఆరోగ్యకర సమాజ నిర్మాణం కోసం పని చేస్తుందన్నారు. హిందూ పరంపర, సనాతన సంస్కృతి రక్షణే ధ్యేయంగా దేశ ప్రేమికుల శక్తిసాలి సంఘంగా పేరు పొందిందన్నారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు రాందాస్, చెళ్లకెరె బీజేపీ మండల అధ్యక్షుడు బీఎల్ సురేష్, జయపాలయ్య, డాక్టర్ మంజునాథ్, శ్రీనివాస్, దయానంద్, ప్రహ్లాద్, మారుతీ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ నోట్లు.. అసలుకు మూడు రెట్లు
కృష్ణరాజపురం: రూ.10 లక్షల అసలైన నోట్లు ఇస్తే రూ.30 లక్షల నకిలీ నోట్లు ఇస్తామని ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసగిస్తున్న తమిళనాడు తిరునైల్వేలి ముఠాను బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. వివరాలు.. మీరు అసలు నోట్లను ఇస్తే, అంతకు మూడు రెట్లు అధికంగా నకిలీ డబ్బులను ఇస్తామని చెప్పి ఈ ముఠా మోసం చేసేది. తమిళనాడులో చురుకుగా ఉన్న ఈ ముఠా బెంగళూరులో కూడా సంచరిస్తున్నట్లు తెలిసి జయనగర పోలీసులు రంగంలోకి దిగారు. ఓ చోట ఇలాగే మోసం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా రాహేశ్వరన్, మిరాయ్ ముయిద్దీన్, షేక్ మహ్మద్ అనే ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సూట్కేసును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.500 నోట్ల కట్టలు లభించాయి. కట్ట పైన, కింద కొన్ని అసలు నోట్లను ఉంచి మధ్యలో తెల్లకాగితాలను సర్దారు. మిగతా వారు తప్పించుకొని పారిపోగా గాలింపు చేపట్టారు.పట్టుబడిన నిందితులు వీరే బెంగళూరులో మోసకారి ముఠా అరెస్టు -
వీధి కుక్కల దాడి.. 25 మందికి గాయాలు
రాయచూరు రూరల్: నగరంలో వీధి కుక్కలు దాడి చేయడంతో 25 మంది గాయాల పాలైన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నగరంలోని బైరూన్ కిల్లా, తిమ్మాపూర్పేట, ఖూనీ మసీదు, ఇతర ప్రాంతాల్లో వీధి కుక్కలు పిల్లలు, మహిళలపై దాడి చేసి గాయపరచడంతో రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పీడీఓకు ఎంపీ అండ సాక్షి బళ్లారి: ఆర్ఎస్ఎస్ కవాతు కార్యక్రమంలో పాల్గొన్నాడని రాయచూరు జిల్లా లింగసుగూరు తాలూకాకు చెందిన పీడీఓ ప్రవీణ్కుమార్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం బీజేపీ లోక్సభ సభ్యుడు తేజస్వీసూర్య సదరు పీడీఓకు అండగా నిలిచారు. ధైర్యంగా ఉండాలని, చట్టపరంగా పోరాటం చేసి తిరిగి ఉద్యోగం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని ఎక్స్లో పేర్కొన్నారు. బాపనయ్యదొడ్డిలో మరుగుదొడ్లు నిర్మించరూ రాయచూరు రూరల్: నగరంలోని 147వ వార్డులోని బాపనయ్యదొడ్డిలో మరుగుదొడ్లను నిర్మించాలని నవరత్న యువక సంఘం డిమాండ్ చేసింది. శనివారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శరణప్ప మాట్లాడారు. నగరసభ నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ పథకం నుంచి నిర్మిస్తున్న పనులను కొనసాగించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. సేవలకు సన్మానం సాక్షి బళ్లారి: ఈ నెల 17న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో రోటరీ ఇండియా కార్యక్రమంలో విద్యా, జల నిర్వహణ రంగాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తుగా జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ ముఖ్యులను సన్మానించారు. సంస్థ ప్రతినిధులు పెద్దన్న బిడార, రాజశేఖర్రాజు అవార్డును స్వీకరించారు. గ్రామాల్లో చదువులు, జల సంరక్షణ కోసం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మైనర్ బాలికతో పెళ్లి కేసులో ఆరుగురికి జైలు శిక్ష హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని గద్వాల్ క్యాంప్ గ్రామంలో 14 ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకున్న కేసులో గంగావతి ప్రిన్సిపల్ సివిల్, జేఎంఎఫ్సీ కోర్టు న్యాయమూర్తి నాగేష్ పాటిల్ ఆరుగురు నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు. 2020 మే 22న ఉదయం 11.30 గంటలకు గద్వాల్ క్యాంప్ గ్రామంలోని ఒక చర్చిలో బాల్య వివాహం జరిగింది. బాలిక తల్లిదండ్రులు, వరుడి కుటుంబం, చర్చి ఫాదర్ ఈ వివాహాన్ని నిర్వహించారు. ఈ కేసులో నిందితులు కూరపన్న, అతని తండ్రి యేసు, తల్లి శాంతమ్మ, చర్చి ఫాదర్ డి.అబ్రహం అందరూ బాల్య వివాహ నిషేధ చట్టం–2006లోని సెక్షన్లు 9, 10, 11 కింద దోషులుగా ఖరారయ్యారు. అప్పటి దర్యాప్తు అధికారి, పీఎస్ఐ జే.దొడ్డప్ప దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా కోర్టు విచారణ నిర్వహించింది. అక్టోబర్ 14న ప్రచురించిన తీర్పులో, నిందితులందరికీ ప్రతి సెక్షన్కు రెండేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. కార్యాలయాల్లో పరిశుభ్రత కాపాడండిరాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలోని కార్యాలయాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. ఆయన శనివారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మాట్లాడారు. తాలూకా, గ్రామ స్థాయిలో ప్రతి శనివారం స్వచ్ఛతకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ముందుకు రావాలన్నారు. పాత తాలూకా, జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయాలను తనీఖీ చేసి నూతన భవన నిర్మాణానికి సంబంధించి అధికారులు, కాంట్రాక్టర్లతో చర్చించారు. పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచెళ్లకెరె రూరల్: పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ అహర్నిశలు కృషి చేస్తుందని ఎమ్మెల్యే టి.రఘుమూర్తి తెలిపారు. ఆయన తాలూకాలోని సిద్దాపుర గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన బీఎంసీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తాలూకాలో పశువులను సంరక్షించే పాడి ఉత్పత్తిదారులను గుర్తించి రూ.25 వేల ప్రోత్సాహధనం ఇస్తారన్నారు. కార్యక్రమంలో సిద్దాపుర పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు గద్దిగె తిప్పేస్వామి, చిత్రదుర్గ పాల ఉత్పత్తిదారుల సంఘం నిర్దేశకులు బీసీ సంజీవమూర్తి, సిద్దాపుర మాజీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు పాత లింగప్ప, శివమొగ్గ, దావణగెర, చిత్రదుర్గ జిల్లా పాల ఉత్పత్తిదారుల అధ్యక్షుడు హెచ్ఎం.విద్యాధర్ తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతున్న మహిళ, వ్యక్తి, చిన్నారి -
విదేశీ వద్దు.. స్వదేశీ ముద్దు
హొసపేటె: సదృఢ భారతదేశాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ విదేశీ ఉత్పత్తులను బహిష్కరించాలి, స్వదేశీ ఉత్పత్తులనే ఉపయోగించాలని బీజేపీ రాష్ట్ర శాఖ కన్వీనర్ జీఎస్.ప్రశాంత్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని జ్ఞానభారతి కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన స్వావలంబిత భారతదేశం, మోదీ ప్రభుత్వ నుంచి జీఎస్టీ తగ్గింపు బహుమతి అనే సంభాషణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాలకు మద్దతు ఇవ్వడంతో పాటు భారతదేశంతో సహా అనేక దేశాల ఉత్పత్తులపై అత్యధిక సుంకాలను విధించడం ద్వారా ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి ప్రతిస్పందిస్తూ మనం ఒక గుణపాఠం నేర్పాలి, స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడాలి. దసరా కానుకగా మోదీ ప్రభుత్వం ధరలను తగ్గించి మధ్య తరగతికి ప్రయోజనం చేకూర్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశీయ ఉత్పత్తులను ఉపయోగించండి బీజేపీ రాష్ట్ర శాఖ కన్వీనర్ ప్రశాంత్ పిలుపు -
పేదలకు భూములు పంచండి
రాయచూరు రూరల్: పేదలకు భూములు కేటాయించాలని కుర్డి గ్రామస్తులు డిమాండ్ చేశారు. శనివారం మాన్వి తాలూకా కుర్డిలో ఎమ్మెల్సీ వసంత్ కుమార్ను కలిసిన గ్రామ ప్రజలు మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఆధీనంలోని భూములను సాగు చేస్తున్న సన్నకారు రైతులపై అధికారులు కేసు నమోదు చేస్తుండడాన్ని తప్పుబట్టారు. అక్రమార్కులపై చర్యలేవీ? కోలారు : బాల్య వివాహాలు, పోక్సో, చిన్నారులను దత్తత ఇచ్చే ప్రక్రియలో డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత రైతు సేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం జిల్లా ఎస్పీకి సంఘటన అధ్యక్షుడు హుణసనహళ్లి వెంకటేష్ వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ మిషన్ వాత్సల్య పథకం కింద వస్తున్న నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. -
రక్తదానంపై జాగృతి జాతా
రాయచూరు రూరల్ : అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఇంచార్జి జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారి గణేష్ పేర్కొన్నారు. శనివారం తమ కార్యాలయం వద్ద జెడ్పీ, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, రోటరీ క్లబ్, రిమ్స్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన జాగృతి జాతాను ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్తం పుట్టుకు వస్తుందన్నారు. రక్తదానం చేయడంతో ఇతరులకు ఉపయోగపడుతుందన్నారు. రక్తం ఇవ్వడం వల్ల మనిషి దేహంలో కొత్త రక్తం పుట్టి శుద్ధీకరణ అవుతుందన్నారు. జాతాలో వైద్యాధికారులు మనోహర్ పత్తార్, శాకీర్, సరోజ, లేపాక్షయ్యలున్నారు. సీపీఐ(ఎంఎల్) అభ్యర్థి అరెస్ట్ తగదు రాయచూరు రూరల్: బిహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థి అరెస్ట్ తగదని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆరోపించింది. శనివారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనను ఉద్దేశించి అధ్యక్షుడు మహ్మద్ హనీఫ్ మాట్లాడారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థులు జితేంద్ర పాస్వాన్, సత్యదేవ్ రామ్లను పాలక పార్టీ బలవంతంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అరెస్ట్ చేయడం సమంజసం కాదన్నారు. ప్రజా ప్రభుత్వంలో పోటీకి అందరు అర్హులే అయినా పోటీ నుంచి విరమించుకోడానికి ఇలాంటి కుట్రలు పన్నడం తగదన్నారు. నామినేషన్లు సమర్పించిన వెంటనే వారిని అరెస్ట్ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి 75 లక్షల మంది మహిళల ఖాతాలకు రూ.10 వేలను జమ చేయడం జరిగిందన్నారు. అరెస్ట్ చేసిన నేతలను విడిచి పెట్టాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్కు జిల్లాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. సంబంధాల క్షీణతతో మానసిక ఒత్తిడిరాయచూరు రూరల్: నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగంలో కుటుంబాల్లో సంబంధాలు తెగడం వల్లే ఒత్తిడి అధికమై మానసిక ప్రశాంతతను కోల్పోతున్నట్లు జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి స్వాతిక్ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఆరోగ్య శాఖ కృష్ణ భవనంలో జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మానసిక ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. దైనందిన కార్యక్రమాలు, పని ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో సతమతమైన మానవుడు మానసికంగా మారిపోతాడన్నారు. మానసిక ఆరోగ్య శాఖ అధికారి మనోహర్ పత్తార్, ఇంచార్జి జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారి గణేష్, శాకీర్, నందిత, సరోజ, ఈశ్వర్, అరవింద్ సంగావి, చంద్రశేఖరయ్యస్వామి, దాసప్పలున్నారు. అనుచిత వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలిరాయచూరు రూరల్: బసవ మఠాధీశులను అవమానించిన స్వామీజీపై చర్యలు చేపట్టాలని జాగతిక లింగాయత మహాసభ డిమాండ్ చేసింది. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నాగనగౌడ మాట్లాడారు. మహారాష్ట్రలోని కోల్హాపూర్ అదృశ్య కాడసిద్దేశ్వర స్వామీజీ బసవ సంస్కృతి అభియాన్పై దుష్ప్రచారం చేసి బసవ పంథాను ఆచరించే మఠాధీశులను అగౌరవ పరిచే విధంగా సమావేశంలో ప్రసంగించారని, అలాంటి వారిని సరిహద్దు బహిష్కరణ చేయాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానంద్కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో శాంతప్ప, ఆంజనేయులు, విరుపాక్షి, గిరిజా శంకర్, చుక్కి సూగప్ప, ఉదయ్ కుమార్లున్నారు. -
ఆటో, క్యాంటర్ ఢీ.. మహిళ మృతి
శ్రీనివాసపురం: రెండు వాహనాలు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన తాలూకాలోని ముళబాగిలు రహదారిలో మీసగానహళ్లి గేట్ వద్ద శనివారం చోటు చేసుకుంది. శ్రీనివాసపురం నుంచి ఎనిమిది మంది ప్రయాణికులతో ముళబాగిలు వైపు వెళుతున్న ఆటో మీసగానహళ్లి గేట్ వద్దకు చేరుకోగానే ముళబాగిలు నుంచి శ్రీనివాసపురం వైపు వస్తున్న క్యాంటర్ ఢీకొంది. ఆటోలో ఉన్న 8 మంది తీవ్రంగా గాయపడ్డారు .క్షతగాత్రులను కోలారులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా యశోదమ్మ (50) అనే మహిళ చికిత్స పొందుతూ మరణించింది. డీఎస్పీ మోనిషా, ఎస్ఐ జయరాం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
హులిగమ్మ దేవి ఆలయంలో హుండీ లెక్కింపు
హొసపేటె: హులిగిలో వెలసిన హులిగమ్మ ఆలయంలో శుక్రవారం అర్థరాత్రి వరకు జరిగిన హుండీ కానుకల లెక్కింపులో భక్తుల నుంచి దాదాపు కోటి రూపాయలకు పైగా సొమ్ము లభించింది. కళ్యాణ కర్ణాటకలో ప్రధాన శక్తిదేవత, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి రోజుల్లో హులిగమ్మ దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం పౌర్ణమి రోజున సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులతో నిండిపోతుంది. భక్తుల సంఖ్య పెరగడంతో కానుకల మొత్తం కూడా పెరిగింది. ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా, అర్థరాత్రి వరకు ఆలయం హుండీ లెక్కింపు జరిగింది. 43 రోజుల వ్యవధిలో మొత్తం రూ.95.02 లక్షల నగదు, భక్తుల నుంచి 160 గ్రాముల బంగారం, 7 కిలో గ్రాముల వెండిని భక్తులు విరాళంగా ఇచ్చారు. హుండీ లెక్కింపును పోలీసు భద్రత, సీసీ టీవీ కెమెరాల నిఘాలో నిర్వహించారు. గత 50 రోజుల వ్యవధిలో రూ.కోటి 45 వేల నగదు, 80 గ్రాముల బంగారం, 8 కిలో గ్రాముల వెండి లభించాయి. భక్తుల నుంచి కానుకల రూపంలో కోట్లాది రూపాయలు వసూలవుతున్నప్పటికీ హులిగి గ్రామంలో ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం, హుండీ లెక్కింపు కంటే అభివృద్ధి పనులపై శ్రద్ధ చూపకపోవడంపై భక్తుల్లో అసంతృప్తి నెలకొంది. దాదాపు రూ.కోటికి పైగా కానుకల సేకరణ -
మార్కెట్లకు దీపావళి శోభ
సాక్షి బళ్లారి: ప్రతి ఏటా కార్తీక మాస అమావాస్య రోజున వచ్చే దీపావళి పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సోమవారం దీపావళి పండుగను పురస్కరించుకొని ముందుగానే ప్రమిదలు(మట్టి దీపాలు) కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. దీపావళి పండుగ అంటేనే టపాసులు పేల్చడంతో పాటు ఇంటింటా మట్టి దీపాలు వెలిగించి సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా మట్టి దీపాలను నగరంలోని సంగం సర్కిల్, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో, బెంగళూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో మట్టి దీపాలను అమ్మకానికి ఉంచడంతో కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లో మట్టి దీపాలు వెలిగిస్తే మేలు దీపావళి రోజున మట్టి దీపాలు ఇంట్లో వెలిగిస్తే మంచి జరుగుతుందని నమ్మకం ఉండటంతో మట్టి ప్రమిదలను జోరుగా కొనుగోలు చేస్తున్నారు. అలాగే వాహనాలకు, ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తున్న నేపథ్యంలో పూలు, పండ్లు కొనుగోలు చేయడంతో బెంగళూరు రోడ్డు, చిన్న మార్కెట్, పెద్ద మార్కెట్ జనంతో కిటకిటలాడింది. దీపావళి అంటేనే చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆనందంగా జరుపుకునే పండుగ కావడంతో సంప్రదాయ బద్ధంగా ఆచరించుకునేందుకు సర్వ సిద్ధం చేసుకుంటున్నారు. జోరుగా బాణసంచా కొనుగోళ్లు హొసపేటె: లక్షలాది మంది భారతీయులు దీపావళిని జరుపుకుంటున్నారు. దేశంలోని అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటైన హిందువుల దీపాల పండుగ దీపావళి సందర్భంగా శనివారం నగరవాసులు బళ్లారి రోడ్డులో కారిగనూరు వద్ద ఏర్పాటు చేసిన శ్రీనివాస క్రాకర్స్ దుకాణంలో తమకు కావాల్సిన టపాసులను జోరుగా కొనుగోలు చేశారు. ఈ దుకాణాల్లో టపాసులను కిలోల ప్రకారంగా అమ్ముతుండడంతో పండుగ ముందే నగర ప్రజలు టపాసులు కొనుగోలు చేసేందుకు క్యూ కట్టారు. మట్టి ప్రమిదలకు భలే డిమాండ్ జోరుగా పూజ సామగ్రి విక్రయాలు -
యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
బళ్లారిటౌన్: నేటి యువత ఉద్యోగాల కోసం వేచి చూడకుండా 10 మందికి ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలను స్థాపించే దిశగా నైపుణ్యం పెంపొందించుకోవాలని జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యశ్వంత్రాజ్ నాగిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా వాణిజ్య పరిశ్రమల శాఖ, ఇండస్ట్రియల్ తదితర శాఖల ఆధ్వర్యంలో జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభాంగణంలో ఏర్పాటు చేసిన లింక్డ్ పథకం జెడ్ఈడీలపై వర్క్షాప్లో పాల్గొని మాట్లాడారు. రైతులు, కళాశాల విద్యార్థులు తమ కార్యకలాపాలతో పాటు పరిశ్రమలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి చిన్నకారు పరిశ్రమల స్థాపనకు సబ్సిడీ, రుణ సౌకర్యాలు లభిస్తున్నాయన్నారు. వీటిని సద్వినియోగ పరుచుకోవాలన్నారు. జిల్లా పరిశ్రమల సంఘం అధ్యక్షుడు వీ.రామచంద్ర మాట్లాడుతూ మన దేశంలో చిన్న పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటితో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు ముందడుగు వేయాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జేడీ సోమశేఖర్, పారిశ్రామిక వేత్తలు జి.తిప్పయ్య, కాశియ, నింగణ్ణ, సురేష్బాబు, కేశవమూర్తి, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
బెంగుళూరులో దారుణం.. సీసీ కెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు
బెంగుళూరు: ప్రమాదం ఏ రూపంలో ఎదురవుతుందో చెప్పలేం.. బెంగుళూరులో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపింది. గత నెల సెప్టెంబర్ 13న గణేష్ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాకు హాజరై తిరిగి వస్తుండగా.. ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి.. నగలు దోచుకున్నారు. నిందితులను ప్రవీణ్, యోగనందగా పోలీసులు గుర్తించారు. బైక్పై ఆ మహిళల వద్దకు వచ్చి వారి బంగారు గొలుసులను లాక్కోవడానికి ప్రయత్నించారు.భయపడిన ఉష తన గొలుసును వారికి ఇచ్చేసింది. కానీ మరొక మహిళ వరలక్ష్మి, ప్రతిఘటించింది. దీంతో యోగానంద ఆమెపై కత్తితో క్రూరంగా దాడి చేసి.. రెండు వేళ్లను నరికాడు. ఆ తర్వాత నిందితులు 55 గ్రాముల బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి పారిపోయారు. సెప్టెంబర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది.ఈ ఘటనపై పోలీసులు వారాల తరబడి దర్యాప్తు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితులను అరెస్టు చేసింది. వారు దొంగిలించిన బంగారాన్ని, దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన జరిగిన తర్వాత యోగనంద పుదుచ్చేరి, ముంబై, గోవా వంటి నగరాలకు పారిపోయి.. ఆ తర్వాత కర్ణాటకలోని తన సొంత గ్రామానికి తిరిగి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. అతనికి గతంలో నేర చరిత్ర ఉందని, ఒక హత్య కేసులో కూడా ప్రమేయం ఉందని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు వరలక్ష్మి ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు.On camera: Two men on a bike wielding machetes rob women in Bengaluru, chop off two fingers and snatch their gold chain. Arrested after a month, police have now recovered 74g of gold and the weapons.https://t.co/ymRnB0fF5t pic.twitter.com/ElKFdlFKH2— Deepak Bopanna (@dpkBopanna) October 18, 2025 -
వీధికుక్కపై సామూహిక అత్యాచారం
కర్ణాటక రాష్ట్రం: తాగిన మైకంలో వీధికుక్కపై నలుగురు అత్యాచారానికి పాల్పడిన పైశాచిక ఘటన బెంగళూరు సమీపంలోని కోడతి గ్రామంలో జరిగింది. ఈ నెల 13న రాత్రి నలుగురు వ్యక్తులు తాగిన మైకంలో వీధికుక్కపై అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ ఒకరు కుక్కను పట్టుకుని వాకింగ్ చేస్తుండగా.. మరో కుక్క అరుపులు వినిపించాయి. అక్కడికి వెళ్లి చూడగా నలుగురు కుక్కపై పైశాచికంగా ప్రవర్తించటం కనిపించింది. ఈ ఘటనపై గ్రామస్తులు వర్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం మధ్యాహ్నం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్లపై కిరణ్ మజుందార్ షా విమర్శలు.. డీకే స్ట్రాంగ్ కౌంటర్
బెంగళూరు: ఇటీవలి కాలంలో బెంగళూరు రోడ్ల (Bengaluru Roads) పరిస్థితిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, చర్చ నడుస్తోంది. ఓ విదేశీ విజిటర్.. బెంగళూరు నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని ఆమె ఓ పోస్టులో వెల్లడించారు. దీంతో, ఆమె పోస్టుపై బయోకాన్ (Biocon) లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా(Kiran Mazumdar-Shaw) విమర్శలు చేయడం తీవ్ర చర్యనీయాంశమైంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) స్పందించారు.తాజాగా డీకే శివకుమార్ రోడ్లపై పెడుతున్న పోస్టులపై కౌంటరిచ్చారు. ఘాటుగా బదులిస్తూ... మజుందార్ షా రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయవచ్చు అని డీకే పేర్కొన్నారు. ఆమె వచ్చి అడిగితే.. ఆ గుంతలు పూడ్చేందుకు రోడ్లను కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా బెంగళూరు నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందన్నారు. బెంగళూరులో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. మౌలిక సదుపాయాలకు అవసరమైనవన్నీ చేస్తున్నామన్నారు.అంతకుముందు, కర్ణాటక రాజధాని బెంగళూరులో అస్తవ్యస్త పరిస్థితులను బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ట్విట్టర్ వేదికగా..‘చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని ఏ మున్సిపాల్టీ కూడా దీనిని పరిష్కరించడం లేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ చెత్త సమస్య చాలా చాలా దయనీయంగా ఉంది’ అని పేర్కొన్నారు.Kiran Mazumdar Shaw has not spoken to me. But I will invite her for discussion & whatever the complaints, let her give it in writing. If she wants to develop roads, ready to hand over them for development: K’taka DyCM DK Shivakumar responding to Shaw’s recent tweets. pic.twitter.com/Pr8B0Qk7bt— TOI Bengaluru (@TOIBengaluru) October 18, 2025అయితే, బెంగళూరులో పరిస్థితుల్లో గతంలో కూడా ‘బ్లాక్బక్’ అనే కంపెనీ సీఈఓ రాజేశ్ యాబాజీ కూడా గతంలో ఓ పోస్టు పెట్టారు. రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తాజాగా బయోకాన్ పార్క్కు వచ్చిన ఓ విదేశీ విజిటర్.. నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని పోస్టులో వెల్లడించారు. దీంతో, ఆమె పోస్టు వైరల్ అయ్యింది. Garbage is a serious malaise countrywide n no municipality of big cities has managed to solve it. Indore n Surat seemed to have cracked it but mumbai delhi Bengaluru etc haven’t. Very very pathetic which shows citizens lack of civic sense n huge apathy by both citizens n… https://t.co/rpBf0rZlaL— Kiran Mazumdar-Shaw (@kiranshaw) October 16, 2025 -
ఆకట్టుకున్న విజ్ఞాన ప్రదర్శన
రాయచూరు రూరల్: విద్యార్థులు విజ్ఞాన శాస్త్రంపై అవగాహన పెంచుకోవాలని కలబుర్గి డివిజన్ విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రైవేట్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరం డివిజన్ స్థాయి విజ్ఞాన ప్రదర్శన పోటీలను ప్రారంభించారు. రామాయణం, మహభారత్లో దాగి ఉన్న అంశాలను క్షుణ్ణంగా అవలోకనం చేయాలన్నారు. కార్యక్రమంలో సిరాజ్, చంద్రశేఖర్ భండారి, గోవింద రెడ్డి, వీరేంద్ర పాటిల్, సంగమేష్, సుజాత, బసప్ప తదితరులు పాల్గొన్నారు. కాడసిద్దేశ్వర స్వామికి నో ఎంట్రీ హుబ్లీ: లింగాయత మఠాధిపతుల గురించి ఓ బహిరంగ కార్యక్రమంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కనేరి మఠం కాడుసిద్దేశ్వర స్వామికి విజయపుర జిల్లా ప్రవేశాన్ని నిర్బంధిస్తూ జిల్లాధికారి డాక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 16 నుంచి డిసెంబర్ 16 వరకు విజయపుర జిల్లాలో ప్రవేశించకుండా నిర్భంధం విధించారు. బసవ సంస్కృతి అభియాన్ను విమర్శించే దిశలో మాట్లాడిన కనేరి మఠం కాడుసిద్దేశ్వర స్వామి.. లింగాయత మఠాధీశుల ఒక్యూటను ముఖ్యమంత్రి కృపాపోషిత నాటక బృందం అనడమే కాకుండా, అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలపై విధాన సభ విపక్ష నేత అశోక్, ఎంపీ జగదీశ్ శెట్టర్, ప్రతాప్ సింహ తదితరుల ఫిర్యాదు మేరకు జిల్లాధికారి చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. -
నీటి కుంటలో పడి చిన్నారులు మృతి
రాయచూరు రూరల్: వ్యవసాయ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలైన ఘటన విజయపురలో చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం విజయపుర తాలుకా మించినాళ తాండాకు చెందిన స్వప్న రాజు రాథోడ్ (10), శివం రాజు రాథోడ్ (8), కార్తిక్ విశ్వ రాథోడ్ (8) నీటి కుంట వద్దకు వెళ్లారు. ఆడుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తూ కుంటలో పడటంతో ముగ్గురూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రశాంత్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బొలెరోను ఢీకొన్న కారు
● ముగ్గురు మృతి సాక్షి బళ్లారి: హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా కాకోలా సమీపంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న బొలెరోను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. దావణగెరె జిల్లా మలెరాణి బెన్నూరు గ్రామానికి చెందిన చమన్ సాబ్, మహబూబ్ సాబ్, లింగమ్మ కారులో వివాహానికి వెళ్లారు. కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా రాణిబెన్నూరు సమీపంలో బొలెరో వాహనాన్ని కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై రాణిబెన్నూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రూ.39 లక్షలతో పైప్లైన్ పనులురాయచూరు రూరల్: నగరంలో రూ.39 లక్షలతో పైప్లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ వెల్లడించారు. శుక్రవారం గంగా నివాస్ వద్ద పైప్లైన్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాకర్లు, శాఖ అధికారులను ఆదేశించారు. పాత కాలం నాటి పైపులు కావడంతో తరచుగా పగిలిపోతున్నాయన్నారు. ప్రజలకు నీటి సరఫరా చేయడం కష్ట సాధ్యం కావడంతో నూతన పైప్లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సభ్యులు జయన్న, అబ్దుల్ వాహిద్, అల్లా ఉద్దీన్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మానసిక ఆరోగ్య కార్యాలయం ప్రారంభం హుబ్లీ: ఉత్తర కన్నడ జిల్లా మానసిక ఆరోగ్య పరిశీలన మండలి కార్యాలయాన్ని క్రిమ్స్ బోధన ఆస్పత్రి మనోవైద్య విభాగం గది సంఖ్య 111లో అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా సెక్షన్ న్యాయమూర్తి కిరణ్ కిన్ని, దివ్య శ్రీ, సీఎం జిల్లా న్యాయసేవ ప్రాధికార డాక్టర్లు విజయరాజ మనోవైద్య విభాగం డాక్టర్ అక్షయ పాఠక అసోసియేషన్ ప్రొఫెసర్ బసవరాజ్, మనోసామాజిక నిపుణులు మనోవైద్య విభాగం కార్వార క్రిమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైభవంగా సుమీతీంద్ర తీర్థుల ఉత్సవాలు రాయచూరు రూరల్: మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వాముల మఠంలో సుమీతీంద్ర తీర్థుల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గురువారం రాత్రి 300వ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా త్రిష్ట మనోత్సవాలు, రాఘవేంద్ర స్వామి మూల విరాట్కు ఊంజల సేవలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. మహ పంచామృతాభిషేకం, గజ, రజత, స్వర్ణ రథోత్సవాలు జరిపారు. -
ట్రాక్టర్ బోల్తా
● 18 మందికి గాయాలు హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా ఆలూర్ క్రాస్ సమీపంలో జాతీయ రహదారి–50పై ట్రాక్టర్ అదపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం జరిగింది. చిత్రదుర్గ జిల్లాలోని బోగలేరహట్టి నుంచి తాలూకాలోని హుడెం గ్రామంలో జరగనున్న నామకరణ కార్యక్రమానికి ట్రాక్టర్లో బయలుదేరారు. కూడ్లిగి తాలూకా ఆలూర్ క్రాస్ సమీపంలో జాతీయ రహదారి–50పైకి రాగానే ట్రాక్టర్ అదపుతప్పి బోల్తా పడింది. కనహోసహళ్లి పోలీస్స్టేషన్ పీఎస్ఐ సిద్రామ్ బిదరాణి, పోలీసులు, హైవే అసిస్టెంట్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని జగలూర్ తాలూకా ఆస్పత్రికి తరలించారు. తదుపరి చికిత్స కోసం దావణగెరె ఆస్పత్రిలో చేరారు. సంఘటన తర్వాత పారిపోయిన ట్రాక్టర్ డ్రైవర్ తిప్పేస్వామిని హోస్పేట్ సమీపంలో అరెస్టు చేశారు. కానహోసహళ్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీపావళికి సామగ్రి సిద్ధం హుబ్లీ: నగరంలో దీపావళి కోసం పూజా సామగ్రి విక్రయాలు జోరందుకున్నాయి. ధార్వాడ జిల్లా, అలాగే జంట నగరాలైన హుబ్లీ, ధార్వాడ, గదగ, హావేరి, బళ్లారి, హోస్పేట, సుమారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ పూలు, ఇతర సామగ్రి విక్రయిస్తున్నారు. బెంగళూరుకు చెందిన వ్యాపారులు వందల సంఖ్యలో ప్లాస్టిక్ పూలను వివిధ రకాల డిజైన్లలో రూపొందించారు. ధరలు కూడా అందుబాటులో ఉండటంతో స్థానికులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. -
నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవాలు
బళ్లారి టౌన్: నవంబర్ 1న జిల్లా పాలన విభాగం ఆధ్వర్యంలో కర్ణాటక రాజ్యోత్సవాలను వైభవంగా జరుపుకోవాలని ఏడీసీ మహమ్మద్ ఝుబేర అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో జరిగిన ముందస్తు సమావేశంలో మాట్లాడారు. నవంబర్ 1వ తేదీ ఉదయం 9 గంటలకు రాజ్కుమార్ రోడ్డులోని మున్సిపల్ కళాశాల మైదానంలో పౌర పాలన మంత్రి రహిమ్ఖాన్ ధ్వజారోహణ చేస్తారన్నారు. ఇందుకోసం వేదికల సిద్ధత, పూర్తి పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై ఆయా అధికారులతో చర్చించారు. తొలుత కన్నడ మాత భువనేశ్వరి దేవి చిత్రపటానికి పూజలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం వివిధ విభాగాల శద్ధ చిత్రాల వాహనాలను ఊరేగింపు చేపట్టాలని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని సన్మానించాలని పేర్కొన్నారు. నగరంలోని పరిశుభ్రత ప్రముఖ సర్కిల్లో దీపాలంకరణ ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. సమావేశంలో కన్నడ సంస్కృతిక శాఖ ఏడీ బీ.నాగరాజు, వివిధ శాఖల అధికారులు చిదానందప్ప, షషుమొదీన్ పాల్గొన్నారు. -
తేలిపోయిన తెల్ల బంగారం
రాయచూరు పత్తి మార్కెట్ పత్తి బేళ్లతో మార్కెట్కు వచ్చిన వాహనాలు రాయచూరు రూరల్: పత్తి రైతులకు కాలం కలసి రావడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టాలపాలవుతున్నారు. తెల్ల బంగారానికి మార్కెట్లో ధరలు లభించడం లేదు. గత ఏడాది క్వింటాల్ రూ.8,500 నుంచి రూ.9,000 వరకూ పత్తి ధరలు పలికాయి. అయితే నేడు క్వింటా రూ.6,800 నుంచి రూ.7,100 వరకూ ధరలు పరిమితం అయ్యాయి. నూతన పత్తి మర్కెట్లో ధరలు ప్రకటించిన మిల్లు యజమానులు క్వింటాకు రూ.300 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలోని క్రిష్ణ, మక్తల్, నారాయణ పేట, మద్దూరు, ఊట్కూరు, గద్వాల దరూరు, నందిని, బలిగేర, అయిజ, మాదవరం, ఇతర ప్రాంతాల నుంచి అధికంగా పత్తి బేళ్లు రాయచూరు మార్కెట్కు వస్తున్నాయి. నిత్యం హైదరాబాద్–రాయచూరు రహదారిలో పత్తి లారీలు, ట్రాక్టర్లు, మినీ లారీలు, జీపులు, క్యాబ్లతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాలు కరువు ప్రాంతాలుగా మారాయి. రాయచూరు, యాదగిరి, కలబుర్గి జిల్లాలో కృష్ణా నది ఉన్నా నీరందడం లేదు. రైతులు భూముల్లో సాగు చేసిన పంటల దిగుడులు అంతంత మాత్రమే. జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. భారతీయ పత్తి మండలి అధికారులు ఎక్కడా పత్తి కోనుగోలు చేస్తున్నట్లు సమాచారం రైతులకు అందడం లేదు. రాజకీయ నేతలు బూటకపు ప్రకటనలతో ప్రచారం చేయడాన్ని రైతులు ఖండిస్తున్నారు. మార్కెట్లో పడిపోయిన పత్తి ధరలు క్వింటా రూ.6,800 నుంచి రూ.7,100 వరకూ పలుకుతున్న వైనం నష్టాలపాలవుతున్న అన్నదాతలు -
నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మిస్తాం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా నరసింహగిరిలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం చిరతాగుండా గ్రామంలో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మా నాన్న గారి కలను నెరవేర్చబోతున్నానని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు శ్రమిస్తానని పేర్కొన్నారు. రేషన్ కార్డు, ఇళ్ల మంజూరు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చిరాతుగుండు గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు రత్నమ్మ బసన్న, ఈఓ నరసప్ప, తహసీల్దార్ వీకే.నేత్రావతి, డాక్టర్ ఎస్పీ ప్రదీప్, బీఈఓ మిలేష్ బేవూర్, శాన్ తమన్న, సీపీఐ ప్రహ్లాద్ ఎస్.చన్నగిరి పీఐ జి.సుబ్రమణ్య, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకటేష్, మాజీ ఈఓ బసన్న, తళ్వార్ శరణప్ప, ఫుడ్ సర్వీస్ డైరెక్టర్ జే.ఆంజనేయ, గూడెకోటె గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఎన్.కృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మురళీ కృష్ణ, ఓబన్న, సావిత్రిమ్మ, కమలమ్మ, జయమ్మ, సూరమ్మ, గౌడు బొమ్మయ్య, కేపీ పాలయ్య, ఏకై గొండి నాగరాజ్, ఎస్టీ ఎంసీ అధ్యక్షురాలు మల్లమ్మ పాల్గొన్నారు. -
తుంగభద్రలో పూడికతీత పనులు చేపట్టాలి
సాక్షి బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగు నీరు అందించే తుంగభద్ర జలాశయంలో పూడిక తీసేందుకు చర్యలు చేపట్టాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తమ్ గౌడ కోరారు. పలువురు రైతు సంఘం నాయకులతో కలసి ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో నగర మాజీ ఎమ్మెల్యే గాలిసోమశేఖర్ రెడ్డితో కలిసి తుంగభద్ర డ్యామ్ ఆయకట్టు రైతుల సమస్యలను వివరించారు. 1953లో తుంగభద్ర డ్యామ్ నిర్మాణాలు పూర్తి చేసి బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, తెలంగాణ పరిధిలోని గద్వాల్, మహబూబ్ నగర్ జిల్లాలకు తాగు, సాగు నీటిని అందిస్తున్నారన్నారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో వేలాది మంది రైతులకు సాగు నీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందుతోందని తెలిపారు. తుంగభద్ర డ్యామ్లో ప్రారంభంలో 133 టీఎంసీలు నీటి నిల్వ ఉండేదని.. ప్రస్తుతం పూడిక చేరడంతో 33 టీఎంసీలు నీరు తగ్గిపోయి 100 టీఎంసీలకు పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల ఆయకట్టు పరిధిలోని రైతులకు దామాషా ప్రకారం నీటిని తగ్గించారని తెలిపారు. తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బందిగా మారిందన్నారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర జలమండలి, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి తుంగభద్ర డ్యామ్లో పూడిక చేపట్టాలని కోరారు. అలాగే బళ్లారి నగరంలో చిరు వ్యాపారులకు సోలార్ వాహనాలు అందజేయాలని సూచించారు. అంజూర, దానిమ్మ రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సాధ్యసాధ్యాలను పరిశీలించి తుంగభద్ర డ్యాంలో పూడికతీతపై తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ కేపీసీసీ అధ్యక్షుడు అల్లం వీరభద్రప్ప, మాజీ ఎమ్మెల్యే గాలిసోమశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ జి.వెంకటరమణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేఎస్.దివాకర్ తదితరులు ప్రాంత సమస్యలను వివరించారు. జాతీయ బ్యాంకుల్లో రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్న నేపథ్యంలో కర్నాటక గ్రామీణ బ్యాంక్లో కూడా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా రైతు మోర్చా అధ్యక్షుడు ఐనాథ్ రెడ్డి విన్నవించారు. డిమాండ్ల జాబితా సమర్పణ భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) అనుబంధ కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అధికారుల సంఘం (కేఏజీబీఓఓ), కర్ణాటక గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం (కేఏజీబీడబ్ల్యూఓ) తరఫున కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అఽధికారులు, ఉద్యోగుల డిమాండ్ల జాబితాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేశారు. కార్యక్రమంలో కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.సతీష్ కుమార్ పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విన్నవించిన రైతు సంఘం నేతలు వివిధ సమస్యలపై చర్చించిన కాంగ్రెస్, బీజేపీ నేతలు -
తెగిపడిన చేతివేళ్లు
హుబ్లీ: హవేరి నగరంలో మంజునాథ్ అనే బాలుడు కొడవలితో జొన్న సొప్పదంటును చిన్న ముక్కలుగా కట్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ఎడమ బొటన వేలు, పక్కన ఉన్న చూపుడు వేలు కొంత భాగం తెగిపడింది. వెంటనే తెగి పడిన వేళ్లను ప్లాస్టిక్ కవర్లో చుట్టుకుని తన తండ్రి, అన్నతో కలిసి కేఎంసీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి వెళ్లాడు. అయితే తెగిపడిన వేళ్లను అమర్చడానికి కుదరదని సర్జన్ డాక్టర్లు స్పష్టం చేశారు. అలా అమరిస్తే ఇన్ఫెక్షన్ అవుతుందని తెలిపారు. బాలుడికి సర్జన్ డాక్టర్లు చికిత్స చేసి డిశార్జ్ చేశారు. -
తాగుబోతుల అడ్డాగా పాఠశాల ఆవరణ
హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి పట్టణ నడిబొడ్డున ఉన్న పాఠశాల మైదానం తాగుబోతులకు అడ్డాగా మారింది. సాయంత్రం కావడంతో మందుబాబులు పాఠశాల ఆవరణలోకి వచ్చేస్తున్నారు. మద్యం తాగి, సీసాలు, ప్లాస్టిక్ చెత్తను అక్కడే పారేస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ ప్రీ–డిగ్రీ కళాశాలల ప్రాంగణంలో కొంత మంది దుర్మార్గులు రోజూ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీని వలన ఉదయం వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది కలుగుతోంది. రాత్రి కాగానే గుంపులుగా.. పాఠశాల, ప్రభుత్వ ప్రీ–డిగ్రీ కళాశాల ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశిస్తున్నారు. గుంపులు గుంపులుగా మద్యం తాగి, ఖాళీ సీసాలు, మద్యం సీసాలు, గుట్కా స్లిప్లను విసిరేస్తున్నారు. మరి కొందరు సీసాలు పగలగొడుతున్నారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు, పాఠశాలకు వచ్చే పిల్లలు నిరంతరం ఖాళీ సీసా పెంకులతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సార్లు పగలిన గాజు ముక్కలు పిల్లల పాదాలకు గుచ్చుకున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రాత్రి పూట పాఠశాలలో గస్తీ నిర్వహించాలని కోరుతున్నారు. లైటింగ్ వ్యవస్థ కరువు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో లైటింగ్ వ్యవస్థ లేదు. దీనిని దుండగులు దుర్వినియోగం చేస్తున్నారు. పాఠశాల ఆవరణ దేవాలయంతో సమానం అనే సాధారణ జ్ఞానం లేకుండా దుర్మార్గులు పాఠశాల ఆవరణలో ఎటువంటి నిర్వహణ లేకుండా మద్యం సేవిస్తున్నారు. పాఠశాల ఆవరణలో మరమ్మతులు చేయని వీధి దీపాలను (హైమాస్) మరమ్మతు చేయడానికి పట్టణ పంచాయతీ చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. విద్యా సంస్థల సమీపంలోని చిన్న దుకాణాల నుంచి విద్యార్థులకు గుట్కా లాంటి వస్తువులు పుష్కలంగా విక్రయిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. తాగిన మందు సీసాలను అక్కడే పారేస్తున్న వైనం ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు -
బెదిరింపు ఫోన్ కాల్ చేశారు
దొడ్డబళ్లాపురం: మంత్రి ప్రియాంక్ ఖర్గే అనుచరుడు తనకు బెదిరింపు ఫోన్ కాల్ చేశాడని బీజేపీ నేత, మాజీ మంత్రి, ఎంపీ రేణుకాచార్య ఆరోపించారు. శుక్రవారం ఆయన దావణగెరెలో మీడియాతో మాట్లాడారు. బెళగావి నుంచి ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి ప్రియాంక్ ఖర్గే గురించి మాట్లాడితే హుషార్..అంటూ బెదిరించాడన్నారు. ఆ మొబైల్ నంబర్ తనవద్ద ఉందని, అయితే తాను పోలీసులకు ఫిర్యాదు చేయనన్నారు. తేనెటీగల దాడిలో విద్యార్థులకు అస్వస్థతశివమొగ్గ : తేనెటీగల దాడి చేయడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈఘటన శివమొగ్గ జిళ్లాలోని శికారిపుర తాలూకాలోని బగనకట్టె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. శుక్రవారం ఉదయం విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్తుండగా ఒక్కసారిగా చెట్టుపై నుంచి తేనెటీగలు దాడి చేశాయి. విద్యార్థులు వాటిబారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసినా వెంటాడి కుట్టాయి. ఘటనలో 13 మంది విద్యార్థులు, ఒక మహిళ అస్వస్థతకు గురవ్వగా ఆస్పత్రికి శికారిపురలోని తరలించారు. జీతం అందక వాటర్మెన్ ఆత్మహత్య మైసూరు : సంవత్సరాల తరబడి జీతం అందక ఆర్థిక ఇబ్బందులతో వాటర్మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన చామరాజ నగర తాలూకా హోంగనూరు గ్రామంలో జరిగింది. చిక్క సునాయక(65) అనే వ్యక్తి అరకొర జీతంతో వాటర్మెన్గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు సంతానం ఉన్నారు. 27 నెలలుగా వేతనం అందక కుటుంబ పోషణ కష్టమై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వేతనం మంజూరు చేయాలని గ్రామ పంచాయతీ అధ్యక్షురాలలు రూపా, పీడీఓ రామేగౌడను కోరగా తిట్టి పంపించారు. దీంతో మనో వేదనకు గురై శుక్రవారం సూసైడ్ నోట్ రాసి పంచాయతీ కార్యాలయం తలుపు వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చామరాజనగర పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. నటి సంగీతభట్కు అస్వస్థత ● చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిక యశవంతపుర: శాండిల్వుడ్ నటి సంగీతభట్ అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. హైస్టరోస్కోపిక్ పోలిఫెక్టమికి వైద్యులు శస్త్రచికిత్సలు చేశారు. గర్భాశయంలో 1.75 సెంటిమీటర్ల మేర పెరిగిన పాలిప్(గడ్డ)ను గుర్తించిన్నట్లు సంగీతభట్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వ్యాధితో రక్తస్రావంతో పాటు ప్రమాదకరమైన నొప్పులు రావటంతో తూకం తగ్గుతుంది. గడ్డ ఉన్న విషయాన్ని గుర్తించిన తరువాత నెల రోజుల తరువాత ఆమెకు అపరేషన్ చేశారు. అనియమిత రక్తస్రావంతో బహిష్టు సమయంలో హార్మోన్లలో వ్యత్యాసం అవుతుంది. మహిళలు ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని సంగీతభట్ వివరించారు. -
వ్యవసాయ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత
హొసపేటె: స్వయం సహాయక బృందాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కసాపుర గ్రామంలో నాబార్డ్, ఎంపీ నిధులతో నిర్మించిన వ్యవసాయ ప్రొసెసింగ్, వేరుశనగ, చింతపండు, ప్రొసెసింగ్ యూనిట్, రైతు శిక్షణ, జనరల్ ఫెసిలిటీ సెంటర్ను శుక్రవారం ప్రారంభించారు. వివిధ బ్యాంక్ పథకాల కింద రుణాలు పొందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కిసాన్ క్రెడిట్ కార్డుల జారీతో రైతులు, మత్య్సకారులు, చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ లీడ్ బ్యాంక్ ద్వారా అన్ని బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి అర్హులైన వారికి కిసాన్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేయాలని అధికారులు సూచించారు. విజయనగర జిల్లాలో 1,80,234 కేసీసీ కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కేసీసీ కార్డులు అందని లబ్ధిదారులందరూ డిసెంబర్ చివరి నాటికి మిషన్ మోడ్లో నమోదు చేసుకోవాలన్నారు. కార్డులను అందుకోలేని వారికి కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమాన్ యోజన కింద సంవత్సరానికి రూ.6 వేలు అందజేస్తోందన్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని 7 జిల్లాల్లో ఎఫ్పీఓలు, స్వయం సహాయక బృందాల ద్వారా రైతు ఉత్పత్తుల ఆధారంగా ప్రొసెసింగ్ యూనిట్లను స్థాపించామన్నారు. కార్యక్రమంలో ఎంపీ తుకారాం, ఎమ్మెల్యే, డాక్టర్ శ్రీనివాస్, లతా మలికార్జున, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కమిషనర్ ఉమా మహదేవన్, నాబార్డ్ అధ్యక్షుడు కాగి, జిల్లాధికారి ఎస్ కవితా ఎస్ మన్నికేరి, జిల్లా పంచాయతీ సీఈఓ నోంగ్జామ్ మహమ్మద్ అలీ అక్రమ్షా, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అనురుద్దన్ షావాన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ -
భారీ శబ్దపు టపాసులు నిషేధం
బనశంకరి: దీపావళి సందర్భంగా టపాసులు కాల్చి శబ్ద, వాయు కాలుష్యం ఏర్పడి పరిసరాలకు హాని కలుగుతుంది. అంతేగాక ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తుంది. ప్రాణులు, పక్షులకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగను పరిసర స్నేహిగా, నిరాడంబరంగా, కాలుష్యరహితంగా, భక్తిపూర్వకంగా ఆచరించాలని ప్రభుత్వం మనవి చేసింది. టపాసుల విక్రయాలు, ప్రజలు హసిరు టపాసులు గుర్తించడానికి చర్యలు టపాసుల బాక్సులపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్ఎల్), నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోగో, రిజిస్ట్రేషన్ నెంబరు ముద్రించాలి. అధికారికంగా టపాసుల విక్రయాలకు సంబంధించిన శాఖ ప్రాధికార నుంచి అందించిన లైసెన్సులో నిర్ణయించిన తేదీ, స్థలాల్లో మాత్రమే తాత్కాలికంగా టపాసుల దుకాణాలు తెరవాలి. నిషేధించిన టపాసులు కనబడితే అలాంటి టపాసులను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీపావళి పండుగను అపార్టుమెంట్ మైదానంలో పరిసర స్నేహిగా ఆచరించాలని అపార్టుమెంట్ వాసులకు సూచించింది. చెట్లు, ప్రాణులు, పక్షులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త వహించాలి. 125 డెసిబల్స్ శబ్దం కంటే అధిక ప్రమాణపు శబ్దం కలిగిన టపాసులను నిషేధించారు. విద్యాసంస్థలు, ఆసుపత్రి, వృద్ధాశ్రమాలు లాంటి సున్నిత ప్రదేశాల వద్ద టపాసులు కాల్చడం నిషేధం. టపాసులు కాల్చిన అనంతరం ఉత్పత్తి అయ్యే పొడిచెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయరాదు. స్థానిక సంస్థలు నిర్ణయించిన చెత్త తరలించే వాహనాల్లో అందించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం హసిరు టపాసులు మినహా ఎలాంటి టపాసులను రాత్రి 8నుంచి 10 గంటల వరకు కాల్చాలి. 125 డెసిబల్స్ కంటే ఎక్కువ ప్రమాణంలో శబ్దం ఉండరాదు దీపావళిని పరిసర స్నేహిగా ఆచరించాలని సర్కారు మనవి -
డ్రగ్స్ దందా ఎలా జరుగుతుందంటే...
బనశంకరి: ఐటీ బీటీ సిలికాన్సిటీగా ఖ్యాతి గడించిన బెంగళూరు నగరంలో డ్రగ్స్ మాఫియా వేళ్లూనుకుంది. పలు అక్రమ మార్గాల్లో డ్రగ్స్పెడ్లర్లు పోలీసుల కళ్లుగప్పి విదేశీ తపాలా, కొరియర్ ద్వారా డ్రగ్స్ దిగుమతి చేసుకుని డ్రగ్స్ దందాకు పాల్పడుతూ కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు. పోలీసుల దాడుల్లో కోట్లాది రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలు పట్టుబడటంతో బెంగళూరు నగరంలో డ్రగ్స్మాఫియా ఎంతమేర విస్తరించింది అనేందుకు నిదర్శనం. ఉడ్తా పంజాబ్ తరహాలో కర్ణాటకలో డ్రగ్స్ మాఫియా వేళ్లూనింది. పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ మాఫియా ప్రస్తుతం శునకాలు, పిల్లులు, చేపలతో పాటు ఇతర పెంపుడు జంతువుల ఆహారం ముసుగులో విదేశాల నుంచి కోట్లాది రూపాయలు విలువ చేసే డ్రగ్స్ను బెంగళూరుకు దిగుమతి చేసుకుంటుండడం దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. థాయ్లాండ్, దక్షిణాఫ్రికా, నైజీరియాతో పాటు వివిధ దేశాల ద్వారా బెంగళూరు నగరానికి డ్రగ్స్ దిగుమతి అవుతుంది. నలుగురు ఉద్యోగుల అరెస్టు 2019లో డ్రగ్స్ పెడ్లర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపణలతో తపాలా శాఖకు చెందిన నలుగురు ఉద్యోగులను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు విదేశాల నుంచి తపాలా ద్వారా వచ్చే డ్రగ్స్ను పెడ్లర్లకు అందించేవారు. విదేశాల నుంచి బెంగళూరుకు పార్శిల్ ద్వారా గత కొన్నేళ్లుగా సరఫరా కొనసాగుతోంది. నెదర్లాండ్స్ నుంచి 2020లో బెంగళూరు చామరాజపేటెకు పార్శిల్ ద్వారా వచ్చిన ఎంఎండీఏ, బ్రౌన్షుగర్ లాంటి సైకోట్రోఫిక్ డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన కస్టమ్స్ అధికారులు డార్క్వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసిన బెంగళూరు యువకులను అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్ విదేశీ తపాలా ద్వారా బెంగళూరుకు సరఫరా చేసుకుంటున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. చామరాజపేటె పార్శిల్స్లో 200 డ్రగ్స్ మాత్రలు, ఎండీఎంఏ, బ్రౌన్షుగర్ స్వాధీనం చేసుకున్నారు. 2024 అక్టోబరులో విదేశీ తపాలా కార్యాలయానికి రూ.21 కోట్ల విలువ చేసే 600కు పైగా డ్రగ్స్ పార్శిల్స్ సరఫరా కావడంతో సీసీబీ పోలీసులు దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అడ్రసులతో పార్శిల్స్ విదేశాల నుంచి పంపిన పార్శిల్స్కు నకిలీ అడ్రస్లు ఇచ్చారు. కొరియర్, తపాలా కార్యాలయాల్లో డ్రగ్స్ సరఫరా నియంత్రణకు నగర వ్యాప్తంగా దాడులు నిర్వహించి కొరియర్, తపాలా కార్యాలయాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 2024 డిసెంబరులో న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరు కొరియర్ ఏజెన్సీ, తపాలా కార్యాలయాలపై సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించారు. సంపంగి రామనగర కొరియర్ ఏజెన్సీలో సీసీబీ, డాగ్స్క్వాడ్ పార్శిల్స్ పరిశీలించి ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. 2025 జూలై నెలలో సీసీబీ పోలీసులు చామరాజపేటెలోని విదేశీ తపాలా కార్యాలయంపై దాడి చేసి కొకై న్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, గంజాయితో పాటు సుమారు రూ.6 లక్షల విలువ చేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని కొందరు విదేశీయులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ దందాలో విదేశీయులు అధికంగా ఉండటం విశేషం. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 35 మందిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేగాక కేరళ, తమిళనాడు, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన 1,013 మంది డ్రగ్స్పెడ్లర్లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. గత మూడు నెలల్లో బెంగళూరు నగరంలో డ్రగ్స్ దందాకు అధిక కేసులు నమోదయ్యాయి. జూలైలో 158 కేసులు నమోదు కాగా 196 మంది భారతీయులతో కలిపి 5 మంది విదేశీయులను అరెస్ట్ చేశారు. ఆగస్టులో 132 కేసులు నమోదు కాగా వీరిలో 2024 మంది భారతీయులు, 5 మంది విదేశీయులు, సెప్టెంబరు నెలలో 160 కేసులు నమోదు చేసిన పోలీసులు 237 మంది భారతీయులు, 6 మంది విదేశీ డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. తపాలా, కొరియర్ ద్వారా విదేశాల నుంచి దిగుమతి డగ్స్ దందాలో విదేశీయుల భాగస్వామ్యం అధికం బిజినెస్, మెడికల్ వీసాతో బెంగళూరు నగరానికి వచ్చే విదేశీయులు అంతర్జాతీయ తపాలా కార్యాలయాల ద్వారా డ్రగ్స్ తెప్పించుకుని విక్రయాలు డార్క్నెట్, డార్క్వెబ్ ద్వారా కొరియర్, ఆన్లైన్ సేల్ అద్దె ఇళ్ల యజమాని అడ్రస్ అందించి పోస్ట్ ద్వారా డ్రగ్స్ వస్తువుల రవాణా కొందరు స్థానిక డ్రగ్స్ పెడ్లర్లకు ఆధార్ అడ్రస్ అందించి వారి పేరుతో పార్శిల్స్ పెంపుడు జంతువులు ఆహారం బాక్సుల్లో డ్రగ్స్ పెట్టి సరఫరా హైడ్రోగంజాయి, అపీము, కొకై న్ అధికంగా విక్రయాలు ఇంటెలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డ్రగ్స్పెడ్లర్లపై పోలీసుల నిఘా సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్పెడ్లర్లపై ప్రత్యేక నిఘా సర్పేల్వెబ్, డార్క్నెట్, డార్క్వెబ్స్పై ప్రత్యేక పర్యవేక్షణ ఎఫ్ఆర్ఆర్ఓ, డీఆర్ఐ, ఎన్సీబీ సంస్థలతో కలిసి సమాచారం వినిమయం విదేశీ పౌరులు నివసించే అడ్రస్లు, ఉద్యోగ సమాచారం సేకరణ -
నేత్రపర్వం తీర్థోద్భవం
యశవంతపుర: కొడగు జిల్లా భాగమండల సమీపంలోని తలకావేరిలో శుక్రవారం కావేరి తీర్థోద్భవమైంది. కావేరి అమ్మవారు రోహిణిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి అశీర్వాదం తీసుకోవటానికి వేల సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి క్యూలైన్లలో నిలబడ్డారు. కొడగుకు చెందిన మహిళలు సంప్రదాయ దుస్తులను ధరించి గీతాలకు నృత్యాలు చేస్తూ అమ్మవారికి హారతినిచ్చి స్వాగతం పలికారు. కొడగు ప్రజల సంప్రదాయ నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం 1.44 గంటలకు మకర లగ్నంలో కావేరి తీర్థరూపిణిం అమ్మవారు దర్శనం ఇచ్చారు. సూర్యుడు కన్యారాశి నుంచి తులా రాశికి మారుతున్న కారణంగా మకర లగ్నంలో కావేరి అమ్మ తీర్థరూపిణిగా ఉద్భవించారు. కావేరి ఉద్భవి స్థానం నుంచి నీరు ఉత్పత్తి కావటం ఇక్కడ విస్మయంగా మారింది. కొడగుతో పాటు వేల మంది భక్తులు భక్తితో జీవ నదికి పూజలు చేశారు. తలకావేరిలో ప్రతి ఏటా కావేరి తీర్థ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వటం పురాతన కాలం నుంచి ఆనవాయితీ. తమిళనాడు నుంచి భక్తులు వచ్చి ఇక్కడి తీర్థాన్ని తీసుకెళ్లారు. మైసూరు మహారాజు, ఎంపీ యదువీర్ కృష్ణరాజ దత్త ఒడెయర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఉద్యోగాల పేరుతో రూ.కోటి వసూలు
● కొప్పళ నగరసభ మాజీ సభ్యురాలి అరెస్ట్ రాయచూరు రూరల్: నిరుద్యోగులకు ఉద్యోగాలిపిస్తామని చెప్పి రూ.కోటి వసూలు చేసినట్లు ఆరోపణలపై కొప్పళ నగరసభ మాజీ సభ్యురాలు విజయ హిరేమఠ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి12 మందితో రూ.కోటి వసూలు చేసింది. అయితే ఉద్యోగాలు రాకపోవడంతో తమ డబ్బు వెనక్కు ఇవ్వాలని బాధితులు కోరారు. దీంతో ఆమె బెదిరింపులకు పాల్పడింది. గత్యంతరం లేక బాధితులు బెంగళూరు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామదుర్గ పోలీసులు విచారణ చేపట్టి విజయ హిరేమఠ్ను అరెస్ట్ చేశారు. బహిరంగ స్థలాల్లో నమాజును నిషేధించాలి ● సీఎంకు ఎమ్మెల్యే బసనగౌడ పాటీల్ యత్నాళ్ లేఖ శివాజీనగర: బహిరంగ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో నమాజు చేసేందుకు అవకాశం కల్పించరాదని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటీల్ యత్నాళ్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు. ఆంగ్లంలో రాసిన లేఖను సామాజిక మాధ్యమంలో విడుదల చేశారు. ‘సర్వజన శాంతి తోట’ అనే ప్రభుత్వ ఆశయం అందరికీ అన్వయించాలి. బహిరంగ స్థలాల్లో, ప్రభుత్వ స్థలాల్లో నమోజు చేసేందుకు అవకాశం కల్పించరాదు. ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్ సంఘ సంస్థల కార్యకలాపాలను నిషేధించినట్లుగానే నమాజు చేయటాన్ని కూడా నిషేధించాలి. అప్పుడే మీరు నిజమైన లౌకికవాది అనిపించుకుంటారు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వంపై మళ్లీ కాంట్రాక్టర్ల వార్ ● నెలలోగా బకాయిలు విడుదల చేయకుంటే తీవ్ర పోరాటం శివాజీనగర: కాంట్రాక్టర్ల సంఘం మళ్లీ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. కాంట్రాక్టర్ల పెండింగ్ సొమ్ము చెల్లించాలని, వివిధ డిమాండ్లను పరిష్కరించాలని ఒత్తిడి చేస్తూ పోరాటం చేపడతామని హెచ్చరించింది. శుక్రవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు ఆర్.మంజునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్ వసూలు అధికమైందన్నారు. 60 నుంచి 80 శాతం పర్సెంటేజీ కమీషన్ అని తాము చెప్పలేదు. అయితే కాంట్రాక్టర్లకు పెండింగ్ సొమ్ము చెల్లించకుండానే కమీషన్ డిమాండ్ చేస్తున్నారన్నారు. రూ.52 వేల కోట్ల పెండింగ్ సొమ్ము విడుదల చేయాల్సి ఉంది. కొన్ని శాఖలు సొమ్ము విడుదల చేశాయి. రూ.33 వేల కోట్లు పెండింగ్లో ఉంది. మరో నెల రోజుల పాటు వేచి చూస్తాం. అంతలోగా సొమ్ము విడుదల చేయకుంటే తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో సిట్ తనిఖీలుదొడ్డబళ్లాపురం: కలబుర్గి జిల్లా ఆళంద నియోజకవర్గంలో ఓట్ల చోరీ ఆరోపణలకు సంబంధించి సీఐడీ, సిట్ అధికారులు శుక్రవారం రెండుచోట్ల దాడులు చేశారు. గుబ్బి కాలనీలో ఉన్న ఆళంద నియోజకవర్గం బీజేపీ మాజీ ఎమ్మెల్యే సుభాష్ గుత్తేదార్ ఇల్లు, వివేకానంద నగర్లో ఉన్న సీఏ మల్లికార్జున్ అనే వ్యక్తి ఇంట్లో ఈ దాడులు జరిగాయి. 50 మంది పోలీసులు 80 మందికి పైగా అధికారులు, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. గత నాలుగు రోజులుగా పట్టణంలో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆళంద నియోజకవర్గంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 వేలకుపైగా ఓటర్ల పేర్లను తొలగించడానికి ప్రయత్నించినట్టు ఆళంద ఎమ్మెల్యే బీఆర్ పాటీల్ ఆరోపించారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. -
లోకేశ్ పోస్టులపై భగ్గుమంటున్న కర్ణాటక వాసులు
సాక్షి, అమరావతి: ఏ రాష్ట్రమైనా పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి పునర్విభజితమైన కొత్త రాష్ట్రాలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ మంత్రి లోకేశ్ చేస్తున్న వరుస ట్వీట్లపై కర్ణాటకవాసులు భగ్గుమంటున్నారు. లోకేశ్ ట్వీట్లతో జాతీయస్థాయిలో ఏపీ పరువు పోతుండటంతో పాటు కర్ణాటకలో నివసిస్తున్న తెలుగువారిపై స్థానికుల ఆగ్రహావేశాలకు దారితీస్తున్నాయి. ఇదే విషయాన్ని చాలామంది ఎక్స్ వేదికగా పంచుకుంటున్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో చాలామంది ఏపీ ప్రజలు పని చేసుకుంటున్నారని, పోస్టు చేసేముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఎక్స్లో ట్వీట్ చేస్తున్నారు. తాజాగా లోకేశ్ పెట్టిన పోస్టుతో కూటమి సర్కారు ఆర్థిక నిర్వహణ తీరును కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఎక్స్ వేదికగా నిలదీశారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడాన్ని కర్ణాటక వాసులు తట్టుకోలేకపోతున్నారంటూ పరోక్షంగా లోకేశ్ ఎక్స్లో పెట్టిన పోస్టు ఇప్పుడు జాతీయస్థాయిలో ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది. ఏపీ ఆహారం చాలా స్పైసీగా ఉంటుందని, ఇప్పుడు ఇది పెట్టుబడులకు కూడా వ్యాప్తి చెందడంతో పొరుగువారి కడుపులో మంట మొదలైందంటూ లోకేశ్ గురువారం ఎక్స్లో చేసిన ఈ వ్యాఖ్యపై కర్ణాటక మంత్రి అంతే ఘాటుగా స్పందించారు.గతంలోనూ ఇదే తీరు బెంగళూరులో ట్రాఫిక్ సమస్య అనో.. లేక ఏదైనా కంపెనీ కర్ణాటకలో పెట్టుబడులపై ఆలోచిస్తున్నట్లు ఒక చిన్న వార్త వస్తే చాలు వెంటనే లోకేశ్ ఎక్స్లో పోస్టులు పెడుతుండటం కర్ణాటక వాసుల ఆగ్రహానికి ప్రధాన కారణంగా ఉంది. గతంలో ఇదేవిధంగా ఒకసారి లోకేశ్ పోస్టు చేస్తే ప్రియాంక్ ఖర్గే ఇదేవిధంగా ఘాటుగా స్పందించారు. బలహీనమైన ఎకో సిస్టమ్ ఉన్నవాళ్లు బలమైన వాళ్లపై ఆధారపడి జీవించడం సహజమంటూ పరాన్నజీవిగా అభివర్ణించారు. మీ ఘనత.. ఏడాదిలో రూ.1.61 లక్షల కోట్ల అప్పులు చేయడం ప్రియాంక్ ఖర్గే ఏం ట్వీట్ చేశారంటే.. ప్రతి ఒక్కరు ఆహారంలో కాస్తాకూస్తో స్పైసీని ఆస్వాదిస్తారని, కానీ ఇది పోషకాహార నిపుణులు సిఫార్సు చేసిన మేరకే పరిమితం చేస్తామన్నారు. ఆర్థికవేత్తలు కూడా బడ్జెట్ నిర్వహణలో సమతుల్యతను పాటిస్తారు. ఏపీ ఏడాదిలో రూ.1.61 లక్షల కోట్లు అప్పులు తీసుకుందని, రాష్ట్ర జీఎసీడీపీలో అప్పుల వాటా 2.61 శాతం నుంచి 3.61 శాతానికి పెరగడం ద్వారా ఏపీ ఆర్థికవ్యవస్థ దిగజారిపోయిందంటూ పోస్టు చేశారు. -
ఇన్ఫోసిస్ అంటే బృహస్పతినా?
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య సర్వేపై ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి చేసిన విమర్శలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిప్పికొట్టారు. ఈ సర్వే వెనుకబడిన తరగతులకు సంబంధించినది కాదని పదేపదే చెప్పినా నారాయణమూర్తి దంపతులకు అర్థంకాలేదని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇది (సర్వే) వెను కబడిన కులాలకు సంబంధించినదనే అపోహ కొందరిలో ఉంది. ఇది వెనుకబడిన కులాల సర్వే కాదు. దీని గురించి రాసేవాళ్లు ఏమై నా రాసుకోనీయండి. ఈ సర్వే ఎందుకోసమనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే చాలు. వాళ్లకు (నారాయణమూర్తి దంపతులకు) దీనిగురించి అర్థంకాకపోతే నేనేం చేయాలి?’అని ప్రశ్నించారు.వాళ్లు సర్వజ్ఞులా?ప్రభుత్వ సర్వేపై నారాయణమూర్తి దంపతులు గురువారం విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. వారి ఇంటికి సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లకు వారు సహకరించలేదని తెలిసింది. తాము వెనుకబడిన వర్గానికి చెందినవారము కాదని, అందువల్ల సర్వేలో పాల్గొనబోమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నారాయణమూర్తి దంపతుల తీరుపై సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. ‘ఇన్ఫోసిస్ అంటే ఏమైనా బృహస్పతినా (మేధావి)? ఇది వెనుకబడిన వర్గాల సర్వే కాదని, అందరి సర్వే అని మేం 20 సార్లు చెప్పాం. మా ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి శక్తి పథకాన్ని ప్రారంభించింది. గృహలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2,000 ఇస్తున్నాం. శక్తిపథకాన్ని వినియోగించుకుంటున్నవారిలో అగ్రకుల మహిళలు, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారు లేరా? గృహలక్ష్మి పథకంలో అగ్రకుల మహిళలు లేరా? కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేపడుతోంది. మూర్తి దంపతులు ఆ సర్వేలో ఏం చెప్తారు? బహుషా తప్పుడు సమాచారం ఇస్తారేమో! నేను మళ్లీమళ్లీ చెప్తున్న ఇది వెనుకబడిన వర్గాల సర్వే కాదు. ఏడు కోట్లమంది కన్నడిగులకు సంబంధించిన సర్వే’అని స్పష్టంచేశారు.మార్పు అనేది విప్లవం కాదురాష్ట్రంలో సీఎం మార్పుపై కూడా ఆయన స్పందించారు. ‘కొందరు నవంబర్ క్రాంతి అంటున్నారు. అది క్రాంతి కాదు. క్రాంతి అంటే విప్లవం. మార్పు అనేది విప్లవం కాదు’అని పేర్కొన్నారు. నాయకత్వ మార్పు అంశం సమయం సందర్భం లేకుండా చర్చకు వస్తోందని, దీనిని పెద్దగా పట్టించుకోవా ల్సిన అవసరం లేద ని అన్నారు. ప్రభుత్వ భూములు, స్కూళ్లు, కాలేజీల్లో ఆరెస్సెస్ కార్యకలాపాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. ‘ఇది ఒక్క ఆర్ఎస్ఎస్కు సంబంధించిన నిర్ణ యం కాదు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ సంస్థ కూడా కార్యకలాపాలు నిర్వహించటం కుదరదు. నిజా నికి ఈ నిర్ణయం గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగదీశ్ షెట్టర్ సర్కారు తీసుకుంది’అని పేర్కొన్నారు. -
‘వారిది ఇన్ఫోసిన్.. అలా అంటే మనం ఏం చేస్తాం?’
బెంగళూరు: కర్ణాటకలో చేపట్టిన సామాజిక, విద్యా సర్వేను వ్యతిరేకించిన కారణంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణమూర్తి, ఆయన భార్య సుధామూర్తిపై కర్ణాటక ప్రభుత్వ పెద్దలు విమర్శలు గుప్పిస్తున్నారు. వీరికి(నారాయణమూర్తి దంపతులకు) వెనుకబడిన వర్గాలన్నా, కుల గణన అన్నా చిత్తశుద్ధి లేదని మండిపడుతున్నారు. ఇదే వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం తన నోటికి పని చెప్పారు. వారికి అన్ని తెలుసంటూనే. వారికి మనం ఏం చెబుతామంటూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు.‘ ఇది కేవలం సామాజిక మరియు విద్యా సర్వే. అంతే కానీ వెనుకబడిన వర్గాల సర్వే కానే కాదు.. ఇది జనాభా గణాంకాల కోసం నిర్వహించే సర్వే మాత్రమే. ఈ విఫయాన్ని చాలాసార్లు చెప్పాం కూడా. ఇప్పటి వరకూ కనీసం 20 సార్లు అయినా ఇది జనాభా లెక్కల సర్వే అని చెప్పాం. అయినా వారు వెనుకబడిన వర్గాల గణాంకాల సర్వే అనుకుని అందులో పాల్గొనమని చెప్పారు. అది వారికే వదిలేద్దాం. ఈ విసయాన్ని వారు అర్థం చేసుకోలేకపోతే మనం చేస్తాం. వారిది ఇన్ఫోసిన్.. వారికంతా తెలుసు’ అంటూ సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాగా, కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (KSCBC) చేపట్టిన సామాజిక సర్వే, కులగణన అక్టోబర్ 19 వరకు కొనసాగుతుంది. రూ. 420 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ సర్వేలో 60 ప్రశ్నలు ఉన్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే నివేదిక అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇదీ చదవండి:మూర్తిగారూ.. ఇదేంటండీ? -
మూర్తిగారూ.. ఇదేంటండీ?
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి తాజా నిర్ణయంపై కర్ణాటక మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. వెనుకబడిన కులాల సంక్షేమంపై వారికి చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, విద్యా సర్వే, కులగణనలో పాల్గొనేందుకు మూర్తి దంపతులు నిరాకరించడంతో కన్నడ మంత్రులు ఫైర్ అవుతున్నారు. కాగా ప్రతిపక్ష బీజేపీ.. సుధామూర్తి దంపతులకు మద్దతుగా నిలిచింది. అసలేం జరిగింది?ప్రభుత్వ సామాజిక సర్వే, కులగణనలో తాము పాల్గొనబోమని అంటూ తమ ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లతో మూర్తి దంపతులు చెప్పారు. తాము అగ్రకులానికి చెందిన వారమని, వెనుకబడిన కులాలకు కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వే తమకు అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు. దీంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో (DK Shivakumar) పాటు పలువురు మంత్రులు స్పందించారు. ''సర్వేలో పాల్గొనమని మేము ఎవరినీ బలవంతం చేయడం లేదు. అది స్వచ్ఛందంగా జరగాల''ని డీకే కామెంట్ చేశారు. వెనుకబడిన కులాల సంక్షేమంపై మూర్తి దంపతులకు ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ ఎస్. తంగడగి వ్యాఖ్యానించారు.మాటకు కట్టుబడతారా?సర్వేలో పాల్గొనాలని తాము ఎవరినీ ఒత్తిడి చేయడం లేదని కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ (Santosh Lad) అన్నారు. "ఒక ప్రభుత్వంగా, మేము ఎవరినీ సర్వేలో పాల్గొనమని బలవంతం చేయడం లేదని" అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేపట్టనున్న జనాభా లెక్కల సందర్భంగా కులగణన చేయనుందని, అప్పుడు కూడా మూర్తి దంపతులు ఇదే వైఖరికి కట్టుబడతారా'' అని ప్రశ్నించారు. సర్వేలో పాల్గొనకూడదన్న వారి నిర్ణయం మిగతా వాళ్లపై ఎటువంటి ప్రభావం చూపబోదని మంత్రి సంతోష్ అభిప్రాయపడ్డారు.అలా చెప్పడం కరెక్ట్ కాదుప్రభుత్వం చేపట్టిన సర్వేలో పాల్గొనబోమని నారాయణ మూర్తి లాంటి వారు చెప్పడం సమంజసంగా లేదని ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే (priyank kharge) అన్నారు. మూర్తి దంపతుల నిర్ణయం చూస్తుంటే ఇతర బీజేపీ నాయకుల నుంచి ప్రేరణ పొందినట్టు స్పష్టంగా కనబడుతోంది. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన నారాయణమూర్తి లాంటి వారి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ప్రభుత్వ సర్వేలో పాల్గొనబోమని వారు చెప్పడం కరెక్ట్ కాదని ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యానించారు. గోప్యంగా ఉంచుతామని.. మూర్తి దంపతుల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారశైలిని బీజేపీ నాయకుడు సురేశ్ కుమార్ (Suresh Kumar) తప్పుబట్టారు. సర్వే వివరాలను గోప్యంగా ఉంచుతామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కానీ మూర్తి దంపతులు తమ అభిప్రాయాలతో రాసిన నోట్ను బహిర్గం చేయడం ద్వారా కాంగ్రెస్ సర్కారు మాట తప్పి ఉల్లంఘనకు పాల్పడిందని ఆయన విమర్శించారు. కాగా, రచయిత్రి, పరోపకారి అయిన సుధామూర్తిని గతేడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.అక్టోబర్ 19 వరకు సర్వేకాగా, కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (KSCBC) చేపట్టిన సెప్టెంబర్ 22న సామాజిక సర్వే, కులగణన అక్టోబర్ 19 వరకు కొనసాగుతుంది. ₹420 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ సర్వేలో 60 ప్రశ్నలు ఉన్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే నివేదిక అందుతుందని భావిస్తున్నారు. సంక్షేమ పథకాలను మెరుగ్గా అమలు చేయడానికి.. బలహీన వర్గాలకు మరింత సమర్థవంతంగా సాధికారత కల్పించడంలో ఈ డేటా సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. చదవండి: నన్ను కలవొద్దని ఆ కుటుంబాన్ని బెదిరించారు -
ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో విస్తుపోయే విషయాలు
ఆ ఇద్దరూ క్లాస్మేట్స్. అయితే బ్యాక్లాగ్స్తో అతగాడు ఆమెకు ఓ సెమిస్టర్ జూనియర్ అయిపోయాడు. అయినా వాళ్ల మధ్య స్నేహం కొనసాగింది. ఇదే అదనుగా.. అదీ కాలేజీ క్యాంపస్లో.. అందులోనూ మెన్స్ టాయ్లెట్లో ఆమెపై ఆ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సౌత్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అత్యాచార ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. నిందితుడిని జీవన్ గౌడ(21)గా నిర్ధారించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. గురువారం అతనితో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కీలక విషయాలు వెల్లడించారు. బాధితురాలు(20), జీవన్ ఒకేసారి కాలేజీలో చేరారు. ఈ క్రమంలో జీవన్ ఓ సెమిస్టర్ తప్పడంతో వెనకబడిపోయాడు. అక్టోబర్ 10వ తేదీ ఉదయం కాలేజీకి బాధితురాలికి ఓ పార్సిల్ వచ్చింది. దానిని జీవన్ రిసీవ్ చేసుకుని ఆ వంకతో యువతిని కలిసి అందించాడు. దానిని అందుకుని ఆమె అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయింది. అయితే.. మధ్యాహ్నాం లంచ్ సమయంలో ఆమెకు పదే పదే ఫోన్ చేసి మాట్లాడాలంటూ ఏడో ఫ్లోర్లో ఉన్న అర్కిటెక్ట్ బ్లాక్ దగ్గరకు రావాలంటూ పిలిచాడు. అక్కడికి వెళ్లిన ఆమెకు ఎవరూ లేనిది చూసి బలవంతంగా ముద్దు పెట్టాడు. ఈ పరిణామంతో భయానికి గురైన యువతి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. అయితే.. లిఫ్ట్లో ఆమెతో పాటే కిందకు వెళ్లి.. ఆమె నోరు మూసేసి ఆరో ఫ్లోర్లో ఉన్న మెన్స్ టాయ్లెట్లోకి లాక్కెల్లాడు. అక్కడ వాష్రూంలో తలుపు బిగించి 20 నిమిషాలపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన తరవాత ఆమె హాస్టల్కు పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితులకు విషయం చెప్పింది. ఆ సమయంలో మరోసారి కాల్ చేసిన నిందితుడు పిల్ కావాలా సీనియర్?( ఎమర్జెన్సీ గర్భనిరోధక మాత్ర) అంటూ వెటకారంగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. అయితే.. ఇదంతా మాములు విషయమని, పెద్దది చేయొద్దంటూ తోటి రూమ్స్మేట్స్కు ఆమెకు సలహా పడేశారు.అయితే.. జరిగిన విషయాన్ని రెండు రోజుల తర్వాత పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వాళలు బెంగళూరు వచ్చి.. అక్టోబర్ 15వ తేదీన హనుమంత నగర పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన క్యాంపస్ ఫ్లోర్లో సీసీకెమెరాలు లేకపోవడంతో.. ఫోరెన్సిక్, డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ జరిపారు. చివరకు జీవన్ నేరానికి పాల్పడింది నిర్ధారించుకుని.. అరెస్ట్ చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 64 ప్రకారం.. రేప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ఈ ఘటనతో రుజువైందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించగా.. ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. సదరు ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పటిదాకా ఘటనపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు.ఇదీ చదవండి: వెనక నుంచి వచ్చి.. యామిని మెడపై కత్తి పెట్టి! -
భార్య నరికివేత
కర్ణాటక: కుటుంబ కలహాలతో భార్యను భర్త నరికి చంపిన ఘటన చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. అజ్జంపుర తాలూకా చిక్కనావంగళ గ్రామానికి చెందిన తను (25) హతురాలు. వివరాలు ఇలా ఉన్నాయి.. తనుతో రమేశ్కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే భర్తతో తరచూ గొడవలు రావడంతో ఆమె రెండేళ్ల నుంచి వేరేగా ఓ వక్కతోటలోని ఇంటిలో నివసిస్తోంది. బుధవారం రాత్రి మద్యం మత్తులో రమేశ్ తను ఇంటికి వెళ్లాడు. ఆమెను కొడవలితో నరికి చంపాడు. తరువాతన తన చేతిని కోసుకొని.. భార్యే నన్ను చంపడానికి యత్నించినట్లు గ్రామస్థులకు చెప్పాడు. ఏమి జరిగిందో చూద్దామని ఆమె ఇంటికి గ్రామస్థులు వెళ్లగా రక్తపు మడుగులో మృతదేహం పడి ఉంది. రమేశ్ను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త, అతని అక్క, చెల్లెలు, అత్తమామలతో పాటు 9 మందిపై తను తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ 9 మందినీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
కనకదుర్గమ్మకే నమ్మకద్రోహం.!
సాక్షి బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చే, భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతూ కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే కనక దుర్గమ్మ ఆలయంలో పని చేసే పూజారుల తీరు భక్తుల హృదయాలను కలిచివేస్తోంది. బళ్లారి కనకదుర్గమ్మ అంటే ఉమ్మడి బళ్లారి జిల్లాలోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజించి తమ కోర్కెలను తీర్చుకుని పునీతులవుతున్నారు. బళ్లారి కనకదుర్గమ్మ ఆలయానికి చారిత్రాత్మక, మహిమాన్విత ఆలయంగా గుర్తింపు ఉంది. ఇక్కడ అమ్మవారిని ఏ పూజారో లేదో భక్తులో ప్రతిష్టించిన విగ్రహం కాదు. సాక్షాత్తు అమ్మవారు స్వయంభువుగా వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం ఇది. కొన్ని వందల ఏళ్ల నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ తరిస్తున్నారు. ఇలాంటి గొప్ప, మహిమాన్విత, చారిత్రాత్మకమైన కనక దుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించే పూజారుల తీరు, అమ్మవారి ఆలయంలో కానుకలను అక్రమంగా తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం యావత్ భక్త కోటిని తీవ్రంగా కలిచివేస్తోంది. నెల నెలా రూ.10 లక్షల విలువైన కానుకల తరలింపు ఎంతో పవిత్రంగా, నమ్మకంగా అమ్మవారిపై ఉన్న భక్తితో ఆలయానికి వచ్చి కానుకలు సమర్పిస్తే వాటిలో కనీసం నెలకు దాదాపు రూ.10 లక్షలకు పైగా విలువ చేసే వివిధ రకాల కానుకలను తరలిస్తున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొనడం గమనార్హం. పూజారుల తీరు, అక్రమంగా తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కనక దుర్గమ్మ ఆలయ ఉన్నతాధికారులు ప్రమోద్, హనుమంతప్ప పూజారులకు నోటీసులు కూడా జారీ చేయడం గమనార్హం. కనక దుర్గమ్మ ఆలయంలో పని చేసే, పూజలు అందించే పూజారులకు అధికారికంగానే హారతిలో వేసే నగదు పూర్తిగా పూజారులకే చెందుతుంది. ఇది కాకుండా ఆకు పూజ చేసేందుకు రూ.2500లు భక్తులకు రసీదు చెల్లిస్తే ఇందులో పూజారులకు రూ.1250లు, అమ్మవారికి అభిషేకం రూ.1000లు, కుంభం రూ.1000లు, గండ దీప పూజ రూ.1000లు, కుంకుమార్చనకు రూ.100లు, వాహనాల పూజకు రూ.100ల నుంచి రూ.200లు ఇలా ఆలయంలో ప్రభుత్వం నియమించిన దేవదాయ శాఖ అధికారుల నుంచి భక్తులు రసీదు తీసుకొని పూజలు చేయిస్తారు. అధికారిక ఆదాయంతో పాటు భారీగా అక్రమ స్వాహా ఈ పూజల ద్వారా ప్రతి నెల కనీసం రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా ఆలయానికి ఆదాయం వస్తుంది. ఇందులో పూజారులకు సగం చెల్లించాలి. అంటే కనీసం అక్కడ పని చేసే పూజారులకు ప్రతి నెల రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు అధికారికంగానే దేవదాయ శాఖ అధికారులు చెల్లిస్తారు. ఇక హారతిలో వేసే నగదును లెక్కించరు. ఆరోజు ఏ పూజారి పూజ చేస్తారో వారికే ఆ నగదు చేరుతుంది. ఇలా అధికారికంగా నెలకు అమ్మవారి ఆలయం నుంచి లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నా అనధికారికంగా కూడా పెద్ద ఎత్తున పూజలు, కానుకలను స్వాహా చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అనధికారికంగా, అక్రమంగా పూజారులు తీసుకెళ్లే మచ్చుకు కొన్ని ఉదాహరణలుగా అధికారులు వెల్లడిస్తున్న ప్రకారం అమ్మవారికి చీరలు, ఒడి బియ్యం, బంగారు వెండి ఆభరణాల ద్వారా నెలకు రూ.10 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని వెల్లడించారు. ప్రతి నెల దాదాపు 8 క్వింటాళ్ల బియ్యం, ఒక క్వింటాల్ బెల్లం, ఒక క్వింటాల్ కొబ్బరి, వీటితో పాటు అమ్మవారికి సమర్పించే విలువైన చీరలు 1000 నుంచి 2000 దాకా వస్తాయని, ఒక్కొక్క చీర ఖరీదు రూ.500 నుంచి రూ.30 వేల దాకా ఉంటుందని అంచనా. ఇలా అమ్మవారికి సమర్పించిన బంగారు, వెండి, ధాన్యాలు, చీరలను ఆలయ అభివృద్ధికి అందించకుండా పూజారులే తరలిస్తున్నారని ఆలయ కమిటీ అధికారులు నోటీసులు జారీ చేయడం నగరంతో పాటు భక్తుల్లో చర్చనీయాంశంగా మారింది. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు భక్తుల కొంగుబంగారం కనక దుర్గమ్మ ఆలయం ఆలయంలో భక్తులిచ్చిన కానుకలను కాజేస్తున్న పూజారులు? గుడి నుంచి కానుకల తరలింపు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అమ్మవారి భక్తుల హృదయాలను కలిచివేస్తున్న పూజారుల వైఖరి -
నేడు కూడ్లిగిలో దిశ సమావేశం
హొసపేటె: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బళ్లారి లోక్సభ సభ్యుడు ఈ.తుకారాం అధ్యక్షతన పట్టణంలోని ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాల కొత్త సభాంగణంలో జరుగుతుంది. ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాల హాలును జెడ్పీ సీఈఓ నోంగ్జాయ్ మహమ్మద్ అక్రమ్ అలీషా, ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ పరిశీలించారు. తహసీల్దార్ నేత్రావతి, తాలూకా పంచాయతీ అధికారి నరసప్ప, హామీ పథకం అమలు కమిటీ తాలూకా అధ్యక్షుడు మహమ్మద్ జిలాన్, పీఏీసీ అధ్యక్షుడు కావళ్లి శివప్ప నాయక, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టండి
హొసపేటె: అన్నభాగ్య పథకం కింద పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రేషన్ పంపిణీ చేయాలని గ్యారెంటీ పథకాల అమలు కమిటీ జిల్లా చైర్మన్ కే.శివమూర్తి అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం నగరంలోని జెడ్పీ కార్యాలయ సభాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ ఐదు హామీ పథకాల అమలుపై జరిగిన జిల్లా స్థాయి ప్రగతి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. అన్నభాగ్య పథకం కింద పంపిణీ చేసే రేషన్ ధాన్యాలను విక్రయించరాదన్నారు. పంపిణీ చేసే ముందు ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేయాలన్నారు. రేషన్ పంపిణీ కేంద్రాల్లో అన్నభాగ్య పథకం నామ ఫలకాన్ని ఏర్పాటు చేయాలన్నారు. బ్లాక్ మార్కెట్లో కొంతమంది అక్రమంగా రేషన్ బియ్యాన్ని విక్రయిస్తున్నారని, అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదులు అందాయన్నారు. హొసపేటెలోని చిత్తవాడిగి ప్రాంతంలో రాత్రి పూట రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. అలాంటి వారిపైఅధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అక్రమ రవాణాపై 31 కేసుల నమోదు ఆహార, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రియాజ్ అహ్మద్ స్పందిస్తూ జిల్లాలో అక్రమ స్మగ్లర్లపై ఇప్పటికే 31 కేసులు నమోదు చేశామన్నారు. చిత్తవాడిగిలో జరుగుతున్న అక్రమాలపై త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. గృహజ్యోతి పథకం కింద నమోదు కాని దరఖాస్తులను తనిఖీ చేసి, సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని సరిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. పథకాల అమలులో జిల్లా మంచి పురోగతి సాధించింది. భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమాలను అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఐదు హామీ పథకాల లబ్దిదారులతో తాలూకాల వారీగా సమావేశాలు నిర్వహించాలి. అధికారులు చౌకడిపో దుకాణ యజమానులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రేషన్ పంపిణీ చేయాలని తెలిపారు. జెడ్పీ సీఈఓ మహ్మద్ నోంగ్జాయ్ అక్రమ్ షా, అధికారులు పాల్గొన్నారు. -
ఏడు జిల్లాల్లో కళ్యాణ సంపద మార్కెట్లు
బళ్లారిటౌన్: కళ్యాణ కర్ణాటక పరిధిలోని ఏడు జిల్లాల్లో రైతులకు ఉపయోగపడేలా కళ్యాణ సంపద మార్కెట్లను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గురువారం జిల్లాలోని బళ్లారి తాలూకా కొంచిగేరిలో మిర్చి రైతుల కోసం ఏర్పాటు చేసిన మిర్చి పౌడర్ విత్తనాల తయారీ యూనిట్ను ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి యూనిట్ల స్థాపనకు నాబార్డ్, ఐటీసీ లాంటి సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. వీటితో పాటు బళ్లారి జిల్లాలో సిద్దగంగాశ్రీ ఫుడ్ ఎఫ్డీఏ కూడా సహకారం అందించిందన్నారు. విజయనగరలో చింతపండు, కొప్పళలో చెరుకు, బీదర్లో పత్తి, కలబుర్గిలో జొన్నలు, యాదగిరిలో సోయాబీన్కు, రాయచూరులో వరి పంటకు అనుకూలంగా రైతుల పంటలకు గిట్టుబాటు ధర లభించేలా రైతులే వాటిని తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకొనేలా మార్కెట్లను ప్రారంభిస్తామన్నారు. ఇటీవల ప్రధానమంత్రి రైతుల కోసం 100 జిల్లాల్లో ప్రధానమంత్రి కృషి ధన్ ధాన్య పథకం ప్రవేశ పెట్టారన్నారు. ఈ పథకం ద్వారా వారే ధాన్యాన్ని పండించి దానికి తగ్గట్టు మిల్లులు ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకొనేలా ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు రసాయనిక ఎరువులు, మందులు వాడకుండా సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. సిరుగుప్ప ఎమ్మెల్యే నాగరాజ్, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీలు వైఎం సతీష్, రవికుమార్, నాబార్డ్ అధికారి షాదీ, ఏబీసీ చెర్మన్ సందీష్ పూరి, రాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఉమామహాదేవ, బ్యాంకింగ్ సర్వీసు అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ గ్రంథాలయం సందర్శన సిరుగుప్ప: నగరంలో గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సిరుగుప్ప తాలూకా బాగేవాడి గ్రామంలో రూ.24 లక్షలతో నిర్మించిన డిజిటల్ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, జిల్లా అధ్యక్షుడు అనిల్ నాయుడు, మండల అధ్యక్షులు మల్లికార్జునస్వామి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యే బీ.ఎం.నాగరాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాగును లాభదాయకంగా మార్చాలి రాయచూరు రూరల్: నేటి ఆధునిక సాంకేతిక రంగంలో వ్యవసాయ రంగాన్ని లాభదాయక పరిశ్రమగా మార్చుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గురువారం సింధనూరు తాలూకా జవళగేరలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార సంస్కరణలు, ఉద్యమ శీలత ప్రధానమంత్రి ధన్ ధాన్య వ్యవసాయ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాంకేతిక సహాయం అందించిందన్నారు. గ్రామాల్లో ఉద్యోగాలను కల్పించడానికి పీఎండీవైఓ పథకంలో 2025–26లో రూ.24 వేల కోట్ల నిధులు కేటాయించామన్నారు. కార్యక్రమంలో అధికారులు నాగరాజ్, కె.వి.శాజి, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ పుట్టమాదయ్య, నేతలు విరుపాక్షప్ప, వెంకట్రావ్ నాడ గౌడ, నాగలింగ తదితరులున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
పాత పద్ధతిలోనే డ్రైనేజీ మ్యాన్హోల్ శుద్ధి
హుబ్లీ: కేఎంసీ ఆస్పత్రి ఆవరణలో అప్పుడప్పుడు రోగుల అశ్రద్ధ తదితర కారణాల వల్ల కూడా డ్రైనేజీ మ్యాన్హోల్లు నిండి కింది ఫ్లోర్లలోని వార్డుల్లో రోగులకు, వారి సహాయకులకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఇటీవల మానసిక వార్డు నెంబర్– 15 జనరల్ పురుషుల విభాగంలో మరుగుదొడ్లు బ్లాక్ కావడంతో ఎంతో ఇబ్బంది ఏర్పడింది. ఫలితంగా రోగులు, వారి సహాయకులు రెండు రోజుల పాటు మరుగుదొడ్ల వినియోగం ఆగిపోవడంతో ఉన్న పైఅంతస్తులోని వమరుగుదొడ్లను వాడుకున్నారు. ఆ తర్వాత వాటి మరమ్మతులు చేపట్టారు. తాజాగా పేద రోగుల పాలిట సాక్షాత్తు ఆశ్రయ ఆరోగ్య పునర్ జీవ ప్రసాదిత ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేత్రి సుధామూర్తి నిధులతో నిర్మించిన ధర్మశాలలో బయట ఉన్న డ్రైనేజీ చాంబర్ బ్లాక్ కావడంతో సమస్య ఏర్పడింది. దీంతో సంబంధిత కార్మికులు మానవ పారిశుధ్య పద్ధతులకు ఏనాడో స్వస్తి చెప్పిన కారణంగా నాలుగు రోజులు ఉద్యోగులు దాదాపు గురువారం 4, 5 గంటల పాటు శ్రమించి పేరుకున్న చెత్తాచెదారం తొలగించి మరుగుదొడ్లలో నీరు సజావుగా పారేలా కృషి చేశారు. ఈ ఆవరణలో సుధామూర్తి కొత్త ధర్మశాలతో పాటు గత నాలుగు దశాబ్దాల నుంచి కూడా ఉన్న ధర్మశాల పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోంది. ముఖ్యంగా క్యాన్సర్ తదితర చివరి దశ లేదా వారం, నెల రోజుల పాటు కిమోథెరపీ, రేడియేషన్ తదితర చికిత్స తీసుకొనే పేద రోగులకు ఈ పాత కట్టడం ధర్మశాలగానే ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నారు. అభద్రతలో పారిశుధ్య కార్మికులు చాంబర్ బ్లాక్ కావడంతో సమస్య -
పాత్రికేయులు సమాజానికి వారథులు
రాయచూరు రూరల్: సమాజానికి పాత్రికేయులు వారథుల్లాంటి వారని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సుల్తాన్పుర శంబు సోమనాథ శివాచార్య పేర్కొన్నారు. గురువారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో రాయల వాణి కన్నడ దినపత్రిక పంచమ వార్షికోత్సవం, అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా సమాజానికి సేవలందించిన వారికి జీవమాన సాధక అవార్డులు అందించి మాట్లాడారు. నేడు యువత పత్రికా రంగంలో సేవలందించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. సమాజంలో పేరుకు పోయిన సమస్యలపై స్పందించాలన్నారు. సోషల్ మీడియా ప్రభావం అధికమైందన్నారు. సమావేశంలో జేడీఎస్ అధ్యక్షుడు విరుపాక్షి, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, ఉపాధ్యక్షుడు బషీర్, సిండేకేట్ సభ్యుడు చెన్నబసవ నాయక్, శివప్ప నాయక్, రంజిత సిద్దలింగ స్వామి, అమరేష్లున్నారు. పొగాకు ఉత్పత్తులను నిషేధించండిరాయచూరు రూరల్: రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులను నిషేధించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు భీమేష్ మాట్లాడారు. గంజాయి, హుక్కా, పొగాకు వంటి అంశాలతో కూడిన మత్తు పదార్థాల సేవనంతో యువకులు, విద్యార్థులు దారి తప్పుతున్నారని, అలాంటి వాటిని పూర్తిగా నిషేధించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా పాండు, ప్రమీత్, భాగ్యలక్ష్మి, రంగనాథ్లున్నారు. సమస్యలు పరిష్కరించరూ రాయచూరు రూరల్: రాష్ట్రంలో కార్మిక, రైతు, దళిత, పేద, బడుగు బలహీన వర్గాల వారి, వ్యవసాయ కూలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత వ్యవసాయ కూలీ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షుడు హనుమంతు మాట్లాడారు. ఏపీఎంసీ, విద్యుత్, రైల్వే ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల జారీకి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. నరేగపై జాగృతి జాతా రాయచూరు రూరల్: జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగ)పై రైతుల్లో ప్రచారం చేపట్టాలని జిల్లా సంయోజకుడు విశ్వనాథ్ పిలుపునిచ్చారు. గురువారం తాలూకాలోని బాపుర పంచాయతీ కార్యాలయం వద్ద ఖాత్రి పథకం కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. జిల్లాలో నరేగ పనులు చురుకుగా కొనసాగేలా చూడాలని పంచాయతీ అధికారులకు వివరించారు. వ్యవసాయ నీటి కుంటలు, గొర్రెల షెడ్, చెక్డ్యాం, తోటల పెంపకం, అటవీ శాఖ, వ్యవసాయం, పట్టు పంటలు వంటి వాటిపై ప్రజలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వ్యవసాయ కూలీలకు రోజు రూ.349 కూలీ, వంద రోజుల పనులు కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో ధనరాజ్, రెడ్డి, ఈరప్పలున్నారు. జేడీయూ అభ్యర్థి ప్రచారం చిక్కబళ్లాపురం : ఆగ్నేయ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో జేడీయూ తరఫున బరిలో ఉన్న డాక్టర్ నాగరాజ్ గురువారం నగరంలోని ఎంజీ రోడ్డులో ఉన్న డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థుల మద్దతు కోరారు. తనను గెలిపిస్తే పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ప్రిన్సిపాల్ వసుంధర, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ చంద్రయ్య, డాక్టర్ నరసింహమూర్తి, రఘు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటా స్వదేశీ వస్తువులనే వాడాలి
సాక్షి బళ్లారి: ప్రతి ఇంట్లో స్వదేశీ వస్తువులనే ఉపయోగించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం నేపథ్యంలో స్వదేశీ వస్తువులను ఉపయోగించాలన్న అభియాన్ను సెప్టెంబర్ 25న పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ జయంతి రోజున ప్రారంభించామని, డిసెంబర్ 25న భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి రోజున అభియాన్ను ముగిస్తామని ఎమ్మెల్సీ వైఎం సతీష్ అన్నారు. ఈ అభియాన్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించాలన్న చైతన్యాన్ని ప్రతి ఒక్కరిలో నింపాలన్నారు. హర్ఘర్ స్వదేశీ, ఘర్ ఘర్ స్వదేశీ అనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా వినిపించాలని, ఆ దిశగా కార్యక్రమాన్ని చేపడతామన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కార్యకర్తలు, మహిళా, యువ సమ్మేళనాలు, వ్యాస, రథయాత్ర, పాదయాత్ర, స్వదేశీ మేళా, వీధి నాటకాలు తదితర జనజాగృతి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. దీపావళి రోజున స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని కోరారు. ప్రతి ఒక్క భారతీయుడు చైతన్యం పొంది స్వదేశీ వస్తువుల కొనుగోలుపై దృష్టి సారించాలన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా, బీజేపీ ప్రముఖులు డాక్టర్ బీకే సుందర్, కేఎస్ దివాకర్, గురులింగనగౌడ, హనుమంతప్ప, రామచంద్రయ్య, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశాభివృద్ధికి తోడ్పడాలి ఎమ్మెల్సీ వైఎం సతీష్ -
అక్రమాలపై విచారణకు డిమాండ్
రాయచూరు రూరల్: రాయచూరు నగరసభలో విధులు నిర్వహించడానికి కాంట్రాక్ట్ పద్ధతిపై చేసుకున్న 344 ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని కర్ణాటక సమాచార హక్కుల వేదిక అధ్యక్షుడు రాజు పట్టి ఆరోపించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడు నెలల నుంచి కార్పొరేషన్గా ఏర్పాటైనప్పటి నుంచి ఇంత వరకు ఉద్యోగాల భర్తీ విషయంలో నల్ల జాబితాలో ఉన్న మైసూరు సంస్థకు అప్పగించారన్నారు. 344 ఉద్యోగాల్లో 136 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసుకోవడాన్ని తప్పుబట్టారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు చేపట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపి అలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. అధికారుల, అధ్యక్షుల, ఇతర పార్టీల నిర్ణయాలతో నిధులు వాడుకున్న అంశంపై చర్చించినట్లు తెలిపారు. యువకుడి ఆత్మహత్యహుబ్లీ: ధార్వాడ జిల్లాలోని కుందగోళ తాలూకా చిక్కనేర్తి గ్రామ నివాసి ఫక్కీరేశ హనుమంతప్ప తడసద(23) అనే యువకుడు ఇంటి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిరటగేరి శివనగౌడ(50), అన్నప్ప(46), బ్యాహట్టి బసప్ప(60), కల్లప్ప (80), హుల్లూర ముదకప్ప(50), శరణప్ప(40), మంటూరు రాయమ్మ (50) తదితరులపై కేసు దాఖలు చేశారు. తన కుమారుడి చావుకు ఆస్తి వివాదాలే కారణం అని మృతుడి తండ్రి ఆరోపించారు. ఆక్రమణల చెరలో చెరువులు రాయచూరు రూరల్: నగరాభివృద్ధికి రాష్ట్ర సర్కార్ నుంచి విడుదలైన కోట్లాది నిధులు రికార్డులకు పరిమితమై, చెరువులు ఆక్రమణలకు నిలయమైనట్లు జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు విరుపాక్షి ఆరోపించారు. గురువారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో చెరువులుగా ఉన్న కృష్ణగిరి కాలనీని లేఅవుట్గా చేశారన్నారు. 20 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడాన్ని ఖండించారు. చిన్న నీటిపారుదల శాఖాధికారులు మౌనం వహించడం తగదన్నారు. ఆ శాఖ మంత్రి బోసురాజు, పుత్రుడు రవి ఆధ్వర్యంలో చెరువుల ఆక్రమణకు గురవుతున్నాయన్నారు. 180 ఎకరాల్లో విస్తరించి ఉన్న మావినకెరె చెరువు భూమిని ఆక్రమించిన వారిపై, ప్రోత్సాహం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలిరాయచూరు రూరల్: నగరంలో ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని మురికి వాడల నివాసుల సంఘం అధ్యక్షుడు జనార్దన్ పేర్కొన్నారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. వివిధ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో ఉంటున్న పేదలను గుర్తించి సర్వే నంబర్–1403, 1365, 1408, 1257, 2930, 772, 928, 802, 809లో స్థలాలు ఖాళీగా ఉన్నాయని, అలాంటి వాటిని కేటాయించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ప్రజల నుంచి డబ్బు వసూలు తగదురాయచూరు రూరల్: రెవెన్యూ శాఖలో ప్రజల నుంచి అధికారులు డబ్బు వసూలు చేయడం తగదని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో తాలూకా అధ్యక్షుడు తిమ్మప్ప మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ప్రజల నుంచి వివిధ పథకాల కింద ఫించన్ల పంపిణీ కోసం రూ.200, రూ.500, రూ.1000 వసూలు చేస్తున్నారన్నారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. -
అయ్యో.. యామిని!
కర్ణాటక రాజధాని నగరంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది జరిగింది. ఓ యువతిని వెనక నుంచి వచ్చిన ఓ యువకుడు గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటనలో.. గిలగిలా కొట్టుకుంటూ ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం మధ్యాహ్నాం శ్రీరాంపుర ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హోస్కెరెహళ్లి ಹೊಸಕೆರೆಹಳ್ಳಿలో యామిని ప్రియ(20) కుటుంబం నివాసం ఉంటోంది. స్థానికంగా బీఫార్మసీ చదువుతున్న ఆమె గురువారం పరీక్ష కోసమని ఉదయం 7.గంకే ఇంటి నుంచి బయల్దేరింది. అయితే.. మధ్యాహ్నాం 3గం. సమయంలో మంత్రిమాల్ వద్ద శ్రీరాంపుర రైల్వే ట్రాక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆమెపై ఓ యువకుడు దాడి చేశాడు. వెనుక నుంచి వచ్చి గొంతు కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో యామిని ప్రియ కుప్పకూలిపోగా.. ఊహించని ఆ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలిసి పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. శ్రీరాంపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.ప్రియా యామిని ఆ నిందితుడి బైక్ మీదే వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ప్రేమ కోణం ఉందనే చర్చ నడుస్తోంది. పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.A 20 year old college student, Yamini Priya,was murdered by a known individual who slit her throat near the railway tracks in Srirampura,#Bengaluru.The victim was returning from college when she was attacked.Police have launched a manhunt to apprehend the accused..@DCPNorthBCP pic.twitter.com/3zMrcVEx1s— Yasir Mushtaq (@path2shah) October 16, 2025ఇదీ చూశారా?.. యువకుడి టైమింగ్తో తల్లీబిడ్డా సేఫ్! -
త్వరలో తుమకూరులో క్యాన్సర్ ఆస్పత్రి
తుమకూరు: తుమకూరు నగరంలోని జిల్లా ఆస్పత్రి ఆవరణలో నూతనంగా నిర్మించిన క్యాన్సర్ ఆస్పత్రి (ఫెరిఫెరల్ క్యాన్సర్ సెంటర్) భవనాన్ని వైద్య విద్యామంత్రి శరణ ప్రకాష్ ఆర్.పాటిల్ గురువారం పరిశీలించారు. విలేకరులతో మాట్లాడుతూ సుమారు రూ.67 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 100 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిని సీఎం సిద్దరామయ్య నవంబర్ 7న ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే తల్లీబిడ్డల ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ భవనాలను ప్రారంభిస్తారన్నారు. రోగులకు చికిత్స కోసం మొదటి దశలో రూ.41 కోట్ల వ్యయంతో వైద్య పరికరాలను సమకూరుస్తామన్నారు. కిద్వాయిపై తీవ్ర ఒత్తిడి ప్రతి రోజూ సుమారు 20–30 మంది క్యాన్సర్ రోగులు జిల్లాస్పత్రికి చికిత్స కోసం వస్తుండగా, వారిని బెంగళూరులోని కిద్వాయి ఆస్పత్రికి పంపుతున్నారన్నారు. కిద్వాయికి అన్ని జిల్లాలు, వేరే రాష్ట్రాల నుంచి క్యాన్సర్ రోగులు వస్తుండడంతో ఒత్తిడి పెరిగిపోయిందన్నారు. అందుకే క్యాన్సర్ బాధితుల కోసం అన్ని జిల్లాల్లో క్యాన్సర్ ఆస్పత్రులను ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో 24 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ప్రజలకు సత్వర సేవల కోసం ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించాలని యోచిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు జీబీ జ్యోతిగణేష్, సురేష్గౌడ, వైద్యవిద్యా శాఖ డైరెక్టర్ సుజాతా రాథోడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నాగేంద్ర పీఏపై ఈడీ దాడులు
సాక్షి బళ్లారి: మాజీ మంత్రి, బళ్లారి గ్రామీణ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర ఆప్త సహాయకుడు (పీఏ), వ్యాపారి కురుబ నాగరాజు ఇంటిపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం ఉదయమే ఈడీ అధికారులు మాజీ మంత్రి నాగేంద్రకు సన్నిహితునిగా గుర్తింపు పొందిన తాలూరు రోడ్డులోని నాగరాజు ఇల్లు, ఆఫీసు వచ్చారు. గది గదిలో క్షుణ్ణంగా గాలింపు జరిపారు. ఈ సమయంలో నాగరాజు బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది. అయితే ఇంట్లో ఉన్న రికార్డులు, ఇతరత్రా ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కార్వార బెళికెరె పోర్టులో ఇనుప ఖనిజం మాయమైన ఘటనలోనూ నాగరాజు ఇంటిలో ఈడీ సోదాలు చేసింది. కొంతకాలం పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. హొసపేటెలో.. అలాగే హొసపేటెలో ప్రముఖ వ్యాపారి శ్రీనివాస్రావు అలియాస్ శ్రీను బాబు ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హొసపేటెలోని వివేకానంద నగర్, బసవేశ్వరనగర్లో ఉన్న ఇళ్లు, ఆఫీసుల్లో ముమ్మరంగా గాలించారు. అతనికి ప్రముఖ హోటల్తో పాటు రియల్ఎస్టేట్, గనులు వ్యాపారాలున్నాయి. బళ్లారి, విజయనగర రెండు జిల్లాల్లో ఈడీ సోదాలు చేపట్టడం చర్చనీయాంశమైంది. బళ్లారి, హొసపేటెలో తనిఖీలు -
రూ.200 కోట్ల భూమి కబ్జా
బనశంకరి: బెంగళూరులో కొందరు అవినీతి అధికారులు రూ.200 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు బీజేపీ నేత ఎన్ఆర్.రమేశ్ ఆరోపించారు. లోకాయుక్తకు, అలాగే బెంగళూరు నగరజిల్లా కలెక్టర్ జగదీశ్ కు ఆధారాలతో సహా ఫిర్యాదుచేసి మాట్లాడారు.బెంగళూరు దక్షిణ తాలూకా ఉత్తరహళ్లి హొబళి మానవర్త కావల్ గ్రామ సర్వే నంబరు 18లో మొత్తం 353 ఎకరాలు 27 గుంటలు భూమిని వాజరహళ్లి, తలఘట్టపుర గ్రామస్తులు అనేక ఏళ్ల క్రితం పంచుకున్నారు. ఇందులో 35 ఎకరాల 11 గుంటలు భూమి పూర్తిగా ఏ, బీ ఖరాబు భూమి. అక్కడ మైనింగ్ జరిగేది, రూ.200 కోట్లకు పైగా మార్కెట్ విలువ చేస్తుంది. ఈ స్థలాన్ని తాలూకాఫీసు, కలెక్టరేటులోని కొందరు ఉద్యోగులు, ఉన్నతాధికారుల అండతో బడాబాబులు కబ్జా చేసుకున్నారని తెలిపారు. కబ్జాదారులు, అధికారుల పేర్లతో సహా లోకాయుక్తకు, కలెక్టరుకు ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. ఆ భూమిని కాపాడాలని కోరారు. -
విషాదంలోనూ దాతృత్వం
బనశంకరి: బెంగళూరు మారతహళ్లిలో వైద్యురాలైన భార్యకు అధికంగా మత్తు మందు ఇచ్చి హత్య చేసిన భర్త, జనరల్ సర్జన్ మహేంద్రరెడ్డి ఉదంతం నగరవాసులను కలవరపరుస్తోంది. అంత బాధలోనూ కూతురి సంస్మరణార్థం రూ.4 కోట్లకు పైగా విలువచేసే భవంతిని ఆమె తండ్రి మునిరెడ్డి ఇస్కాన్ కు దానం చేశారు. సంపన్నుడైన మునిరెడ్డి కూతురి కోసం మున్నకోళలు లో రూ.4 కోట్లతో భవనాన్ని నిర్మించి ఇచ్చాడు. కుమార్తె లేనప్పుడు ఆ ఇల్లు ఎందుకని సేవా కార్యక్రమాల కోసం ఇస్కాన్కు రాసిచ్చామని కృతిక సహోదరి డాక్టర్ నిఖితా తెలిపారు. బంధువుల ఆరోపణ మహేంద్రరెడ్డికి వేరే యువతితో అక్రమ సంబంధం ఉందని, ఆమె కోసం భార్యను హత్య చేసినట్లు కృతికారెడ్డి కుటుంబసభ్యులు ఆరోపించారు. అల్లుడు మహేంద్రరెడ్డి ఆస్పత్రి నిర్మిస్తామంటే మునిరెడ్డి సాయం చేశారు. కానీ పెళ్లయిన ఏడాదిన్నరలోపే ఘోరం జరిగిందని మీడియా ముందు ఏకధాటిగా విలపించారు. వైద్యురాలు కృతికారెడ్డి నివాస భవనం ఇస్కాన్కు వితరణ విలువ రూ. 4 కోట్ల పైనే ఆమె తండ్రి మునిరెడ్డి వెల్లడిభర్తకు 9 రోజుల కస్టడీ రెండురోజుల పాటు మత్తుమందును ఇచ్చి భార్యను హత్య చేసిన కేసులో మహేంద్రరెడ్డి ఉడుపిలో తలదాచుకొని ఉండగా మారతహళ్లి పోలీసులు బుధవారం అరెస్ట్చేసి నగరానికి తీసుకువచ్చారు. కోర్టులో హజరుపరిచి కస్టడీని కోరగా, 9 రోజుల పాటు విచారణకు జడ్జి అనుమతించినట్లు వైట్ఫీల్డ్ డీసీపీ పరశురామ్ తెలిపారు. విచారణలో పూర్తి నిజాలు వెల్లడవుతాయని ఆశిస్తున్నారు. -
ఆర్ఎస్ఎస్ కట్టడికి సర్కారు అడుగు
సాక్షి, బెంగళూరు: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఊరేగింపులు, కార్యక్రమాలను కట్టడి చేసేలా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రైవేటు సంస్థలు, సంఘాలు పబ్లిక్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగించేందుకు ముందస్తుగా అనుమతి తీసుకునేందుకు మార్గదర్శకాలను విడుదల చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, దేవాలయాలు, వాటి మైదానాలు, పార్కులు, పురాతత్వ శాఖ స్థలాల్లో ఆర్ఎస్ఎస్ తదితర ప్రైవేటు సంస్థలు కార్యకలాపాలు సాగించకుండా నిషేధించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో గురువారం విధానసౌధలో కేబినెట్ భేటీ జరిగింది. వివరాలను న్యాయ శాఖ మంత్రి హెచ్కే పాటిల్ మీడియాకు వివరించారు. పబ్లిక్ ప్రాంతాల్లో పలు ప్రైవేటు సంస్థలు, సంఘాలు ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు, కార్యకలాపాలను సాగిస్తున్నట్లు ఈ నెల 15న డీజీపీ లేఖ ద్వారా సర్కారుకు తెలిపారన్నారు. ఇలాంటి చర్యలు కచ్చితంగా చొరబాటు కిందికి వస్తాయని, ఈ కారణంతో ఇకపై ముందస్తు అనుమతి ఉండాలని కేబినెట్ భేటీలో చర్చించినట్లు మంత్రి తెలిపారు. అలాంటి కార్యక్రమాలకు నిర్ణీత పబ్లిక్ స్థలాలు, ప్రభుత్వ స్థలాలను గుర్తించి కేటాయించాల్సి ఉందని, త్వరలో కొన్ని మార్గదర్శకాలు, ఆదేశాలను విడుదల చేస్తామన్నారు. పంట నష్ట పరిహారం ● వర్షాల కారణంగా 12.82 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లడంతో ఇన్పుట్ సబ్సిడీ మంజూరుకు ఆమోదం. నష్ట పరిహారం కింద ప్రతి హెక్టార్కు సబ్సిడీ రూ. 8500 కలిపి మొత్తం రూ. 25,500 ఇచ్చేందుకు తీర్మానం. బహుళ వార్షిక పంటలకు రూ. 22 వేల పరిహారం. అంగన్వాడీలకు వస్త్రాలు ● మళవళ్లి వర్కింగ్ జర్నలిస్టు సంఘానికి స్థలం ఇచ్చేందుకు తీర్మానం. ● అంగన్వాడీ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ. సహాయకులకు చీరల పంపిణీకి ఆమోదం. ఇందుకోసం రూ. 13.98 కోట్ల మంజూరు ● అంగన్వాడీ కేంద్రాలకు ఔషధ కిట్ల కొనుగోలు కోసం రూ. 10 కోట్ల కేటాయింపులకు అనుమతి కులగణనను పూర్తిచేశా: సీఎం సాక్షి, బెంగళూరు: బెంగళూరుతో సహా రాష్ట్రంలో కులగణన జరుగుతుండడం తెలిసిందే. సీఎం సిద్దరామయ్య కావేరి నివాసానికి కులగణన సిబ్బంది రాగా, సీఎం వివరాలను అందజేశారు. 45 నిమిషాల పాటు కూర్చొని కోరిన సమాచారం అంతా అందించారు. ఈ విషయాన్ని ఎక్స్లో సీఎం పోస్టు చేశారు. అసమానతలు, పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం ఈ సమీక్షను చేపట్టిందని, ప్రతి ఒక్కరూ ఈ సమీక్షలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో సంస్థల కార్యక్రమాలకు... సర్కారు అనుమతి తప్పనిసరి త్వరలోనే మార్గదర్శకాల జారీ కేబినెట్ భేటీలో తీర్మానం ఆర్ఎస్ఎస్తో జతకలిసే ఉద్యోగులపై వేటు: మంత్రి ఖర్గే బనశంకరి: ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని ఐటీ బీటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే, సీఎం సిద్దరామయ్య కు మరో లేఖరాశారు. వారు ఎలాంటి రాజకీయ పార్టీలు లేదా, సంఘ సంస్థల కార్యకలాపాల్లో పాల్గొనరాదు, ఎలాంటి సహాయం అందించరాదని నియమాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఇటీవల సంఘ్ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు , ఉద్యోగులు పాల్గొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాంటివారిపై చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేయాలన్నారు. సంఘ్తో పాటు ఎలాంటి సంస్థల్లో ఉద్యోగులు పాల్గొనరాదన్నారు. తన శాఖలో కొందరు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారిపై నివేదిక అందించాలని కోరానని, నివేదిక అందిన వెంటనే వారిని సస్పెండ్ చేస్తానని తెలిపారు. బహిరంగ స్థలాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను నిషేధించాలని ఖర్గే ఇదివరకే లేఖ రాయడం తెలిసిందే. కేబినెట్ భేటీలో చేసిన ప్రధాన తీర్మానాలు.. విజయపురలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం మైసూరులో నిమ్హాన్స్ తరహాలో ఆస్పత్రి నిర్మాణం బెంగళూరు సంజయ్ గాంధీ ఆస్పత్రిలో రరూ. 26.9 కోట్ల ఖర్చుతో ఉపకరణాల కొనుగోలుకు గ్రీన్సిగ్నల్ వృషభావతి నది నీటి శుద్ధీకరణ పనులకు ఆమోదం బెంగళూరు గ్రామీణ జిల్లా, చిక్కబళ్లాపు రం జిల్లాల చెరువులకు రూ. 650 కోట్లతో నీటి సరఫరాకు అనుమతి. -
హెచ్డీ కోటెలో దొంగల లూటీ
మైసూరు: జిల్లాలోని హెచ్డీకోటె పట్టణంలో మూడు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. స్టేడియం బడావణె నివాసి, ఏఎస్ఐ కేకే మహదేవ, మొదటి రోడ్డు నివాసి పేపర్ శేషాద్రిల ఇళ్లలో బుధవారం రాత్రి జరిగింది. ఏఎస్ఐ మహదేవ ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి సుమారు రూ.30 లక్షల విలువ చేసే 250 గ్రాముల బంగారు నగలు, రూ.25 వేల నగదు, పేపర్ శేషాద్రి ఇంటిలో రూ.2.5 లక్షల విలువ చేసే 20 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదును దొంగలు దోచుకెళ్లారు. ఏఎస్ఐ మహదేవ హాసన్కు హాసనాంబ దేవస్థానం వద్ద బందోబస్తుకు వెళ్లారు. ఆయనతో పాటు భార్య, ఉపాధ్యాయిని లోలమ్మ కూడా హాసన్కు వెళ్లారు. ఈ సమయంలో దొంగలు పడి సీసీ కెమెరా వైర్లను కత్తిరించి, తలుపులు, బీరువాలను బద్దలు కొట్టి చోరీ చేశారు. ఇళ్లకు గొళ్లెం వేసి.. అలాగే పట్టణంలోని విశ్వనాథ కాలనీకి చెందిన కృష్ణ అనే వ్యక్తి ఇంటిలో రూ.1.20 లక్షల విలువ చేసే 10 గ్రాముల బంగారు ఆభరణాలు, 150 గ్రాముల వెండి, రూ.20 వేల నగదును దోచుకెళ్లారు. చోరీ చేసే సమయంలో దొంగలు చుట్టుపక్కల ఇళ్ల తలుపులకు గొళ్లాలు వేసి ఎవరూ బయటకు రాకుండా ఉండేలా చేయడం గమనార్హం. పోలీసులు చోరీలు జరిగిన ఇళ్లను పరిశీలించి విచారణ చేపట్టారు. ఇవి స్థానిక దొంగల పనా, లేక ఉత్తరాది చెడ్డీ ముఠాలు చేశాయా? అనేది సస్పెన్స్గా మారింది. ఇటీవల శివమొగ్గ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ దొంగలు చోరీకి యత్నించడం సీసీ కెమెరాలలో రికార్డయింది. నామకరణానికి వెళ్తే.. ఇల్లు ఖాళీ ● దొడ్డ రూరల్లో దోపిడీ దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకా హొసహుడ్య గ్రామంలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. సోమణ్ణ అనే వ్యక్తి ఇంటి తలుపుల తాళం పగలగొట్టి చొరబడిన దొంగలు బంగారు, వెండి నగలతోపాటు నగదును దోచుకున్నారు. సోమణ్ణ మనవని నామకరణం వేడుక కోసం కుటుంబంతో కలిసి ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లారు. దీంతో దొంగలు చొరబడి 250 గ్రాముల బంగారు నగలు, 2 కేజీల వెండి సొత్తు, రూ.50 వేల నగదు, ఏటీఎం కార్డుల్ని దోచుకున్నారు. నగలు ఉన్న బాక్సులు, బ్యాగులను ఊరిచివరకు తీసుకెళ్లి సొత్తును తీసుకుని బ్యాగులను అక్కడే పారవేశారు. గురువారం ఉదయం సోమణ్ణ ఇంటికి వచ్చి చూసి లబోదిబోమన్నాడు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసు సహా ముగ్గురి ఇళ్లలో చోరీ రూ.లక్షలాది బంగారం, నగదు అపహరణ -
గ్రామంలోకి పిల్ల చిరుత.. కాసేపటికి కన్నుమూత
మండ్య: జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని బోళెనహళ్ళి గ్రామంలోకి గురువారం ఉదయం సుమారు 7 నెలల వయసు ఉన్న ఆడ చిరుత పిల్ల వచ్చింది. అది అరుస్తూ ఉండడంతో జనం చుట్టూ పోగయ్యారు. అటవీ అధికారులు వచ్చి చిరుతను స్వాధీనం చేసుకుని తరలించారు. తల్లి చిరుత నుంచి విడిపోయిన పిల్ల నీరసంగా ఉందని తెలిపారు. అయితే కొంతసేపటికే అది చనిపోయింది. కాలువలోకి దూకిన దంపతులు యశవంతపుర: దంపతులు కాలువలోకి దూకిన ఘటన చిక్కమగళూరు సమీపంలోని లక్కవళ్లి భద్రా జలాశయం వద్ద జరిగింది. మృతులు శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా శంకరపుర గ్రామానికి చెందిన విఠల్ (48), భార్య గంగమ్మ (40). గురువారం దంపతులిద్దరూ లక్కవళ్లి సమీపంలోని జగదాంబ ఆలయానికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని పక్కనే పారుతున్న భద్రా కాలువలోకి దూకడంతో గల్లంతయ్యారు. స్థానికులు చూసి సమాచారం ఇవ్వగా పోలీసులు, ఫైర్ సిబ్బంది కొన్ని గంటలపాటు గాలించారు, గంగమ్మ మృతదేహాన్ని వెలికితీశారు. విఠల్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సమస్యల వల్లే ఆత్మహత్యాయత్నం చేసి ఉంటారని అనుమానాలున్నాయి. కలబుర్గిలో ఓట్ చోరీ దర్యాప్తు దొడ్డబళ్లాపురం: కలబుర్గిలో ఓట్ల చోరీ కేసులో సిట్ పోలీసులు 5 ఇళ్లలో సోదాలు చేసి వేల సంఖ్యలో ఓటర్ ఐడీలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని ఆళంద అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరిగిందని కేసు నమోదు చేసి దాడులు నిర్వహించారు. రోజా కాలనీలో అష్పాక్, జుంజుం కాలనీలో నదీం, అక్రం, రామనగర కాలనీలో మహమ్మద్ జునైద్ల ఇళ్లలో తనిఖీలు సాగాయి. అక్రం అనే వ్యక్తి ఇంట్లో వేల సంఖ్యలో నకిలీ ఓటర్ ఐడీ కార్డులు లభించాయి. 15 మొబైళ్లు, 7 ల్యాప్టాప్లను కూడా పట్టుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీనే ఓట్ చోరీ ఆరోపణలు చేయడంతో సిద్దరామయ్య ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకుంది. గత కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్న ఎస్ఐటీ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 50 గ్రాముల తాళి తస్కరణ మైసూరు: బస్సు ఎక్కుతుండగా మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగలు చోరీ చేసిన ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాల పట్టణంలోని బస్టాండ్లో జరిగింది. మండ్య జిల్లా మద్దూరువాసి ఇందిర అనే మహిళ మలెమహదేశ్వర బెట్టకు వెళ్లింది, తిరిగి వస్తూ కొళ్లెగాల బస్టాండ్లో బస్సు ఎక్కుతుండగా 50 గ్రాముల బరువైన బంగారు మంగళ సూత్రాన్ని ఎవరో దొంగలు తస్కరించారు. కొంతసేపటికి గమనించి వెంటనే స్థానిక పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బస్టాండ్లో పోలీసు ఔట్పోస్టు ఉన్నప్పటికీ సిబ్బందిని నియమించలేదు. అందువల్లే దొంగలు చెలరేగిపోతున్నారని, పోలీసులను నియమించి దొంగతనాలను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు. రాజధానిలో ఘోరం.. యువతి హత్య దొడ్డబళ్లాపురం: బెంగళూరులో రోజురోజుకీ హత్యా నేరాలు అధికమవుతున్నాయి. అందులోనూ యువత క్షణికావేశంలో చిన్న విషయానికి ఆవేశానికి లోనై దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా యువతిని గొంతుకోసి హతమార్చిన సంఘటన శ్రీరాంపురలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రైల్వే ట్రాక్ వద్ద ఒక యువతిని బైక్పై తీసకువచ్చిన దుండగులు ఆమె గొంతుకోసి హత్య చేశారు. అయితే హతురాలి వివరాలు తెలిసిరాలేదు. శ్రీరాంపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలిసి పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. పోలీసులు ఆధారాలను సేకరించి గాలింపు చేపట్టారు. -
దూసుకొచ్చిన మత్స్యం.. జాలరి మృత్యువాత
యశవంతపుర: సముద్రంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఊహించడం కష్టం. చేపల్ని పట్టడంలో నిపుణుడైన జాలరి... చేప గుద్ది చనిపోయాడు. ఈ ఘటన కారవార వద్ద అరేబియా సముద్రంలో జరిగింది. కార్వార తాలూకా మాజాళికి చెందిన యువ జాలరి అక్షయ (24) మంగళవారం చేపలు పట్టడానికి పడవలో సముద్రంలోకి వెళ్లాడు. ఈ సమయంలో ఓ అడుగు పొడవైన చేప నీటిలో ఎగిరి అక్షయ కడుపు మీద తగిలింది. అతనికి తీవ్ర రక్తగాయం కావడంతో నొప్పితో విలవిలలాడడంతో మిగతా జాలర్లు వెంటనే కార్వారలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గాయానికి కుట్లు వేసి ఇంటికి పంపారు. బుధవారం ఆరోగ్యం బాగాలేదంటూ ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యాడు, గురువారం తెల్లవారుజామున చనిపోయాడు. జాలర్ల నిరసన పేగులకు బలమైన గాయాలు కావడమే కారణమని వైద్యులు పేర్కొన్నారు. కాగా, వైద్యులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారని మత్యృకారులు ఆరోపిస్తున్నారు. ౖపైపెన కుట్లు వేసి ఇంటికి పంపారు. కనీసం ఎక్స్రే, స్కాన్ చేసి ఉంటే కడుపులో ఏమైందో తెలిసేది, చేప ముళ్లు గుచ్చుకొని తీవ్ర గాయమైనా సరిగా వైద్యం చేయలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి ముందు బైఠాయించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కార్వార వద్ద విషాద ఘటన -
కుల గణనలో పాల్గొనబోం
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, విద్యా సర్వే, కులగణనలో పాల్గొనబోమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి ప్రకటించారు. తాము వెనుకబడిన కులాలకు చెందిన వారం కాదన్నారు. ఇటీవల తమ నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్లతో వారు.. ‘మా ఇంట్లో సర్వే చేపట్టవద్దు’అని తెలిపినట్లు సమాచారం. అదేవిధంగా, ఎన్యుమరేటర్లకిచ్చిన ప్రొఫార్మాలో సుధామూర్తి..‘మేం వెనుకబడిన కులాలకు చెందిన వారము కాదు. అందుకే, ఆ గ్రూపుల కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మేం పాల్గొనడం లేదు’ అని పేర్కొన్నారు. దీనిపై మంత్రి తంగదాడి స్పందిస్తూ.. వెనుకబడిన కులాల సంక్షేమంపై వారికి ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి తెలుస్తోందని విమర్శించారు. ఈ పరిణామంపై సుధామూర్తి దంపతులు, ఇన్ఫోసిస్ అధికారులు స్పందించలేదు. -
షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య
బెంగళూరు: ఆ దంపతులు ఇద్దరూ వైద్యులు. అనారోగ్యం పాలైన భార్యకు వైద్యం చేయించడానికి బదులు ఏకంగా ఆమె ప్రాణమే తీశాడు ఆ భర్త. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి భార్యను హతమార్చి.. సహజ మరణంగా కుటుంబ సభ్యులను నమ్మించాడు. కానీ చివరకు నిజం బయట పడింది. బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్రరెడ్డి (32), డాక్టర్ కృతికారెడ్డి (28) 2024 మే 26న పెద్దలు వైభవంగా పెళ్లి చేశారు. ఇద్దరూ మారతహళ్లిలో నివాసం ఉన్నారు. డాక్టర్ కృతికారెడ్డి బెంగళూరు ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో చర్మ రోగ నిపుణురాలుగా పనిచేసే వారు. అదే ఆసుపత్రిలో భర్త జనరల్ సర్జన్. కాగా, కృతికారెడ్డి గ్యాస్ట్రిక్, షుగర్ వంటి సమస్యలతో బాధ పడుతోంది. పెళ్లి సమయంలో ఈ సమస్యలు ఉన్నట్లు భార్య కుటుంబం తనకు చెప్పలేదని మహేంద్రరెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు. రోజూ వాంతులు, ఇతరత్రా రుగ్మతలతో ఇబ్బందులు పడే భార్యను హత్య చేసి, అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఆరోగ్యం (Health) సరిగా లేదని కృతికారెడ్డి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, మహేంద్రరెడ్డి ఆమెకు ఎక్కువ మోతాదులో మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇలా రెండు రోజులు వరుసగా ఇవ్వడంతో ఆమె ఏప్రిల్ 23వ తేదీన మరణించింది. ఆపై తన భార్య అనారోగ్యంతో బాధ పడుతోందని దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు ఆసుపత్రి నుంచి సమాచారం అందడంతో మారతహళ్లి పోలీసులు వెళ్లి పరిశీలించారు. వారి ఇంట్లో నుంచి ఇంజెక్షన్, ఐవీ సెట్ వంటి ఉప కరణాలను సీజ్ చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె మృతదేహం నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులుఈ నెల 13వ తేదీన అందిన రిపోర్టులో కృతికారెడ్డి దేహంలో ఎక్కువ మొత్తంలో మత్తు మందు ఆనవాళ్లు కనిపించాయని ఉంది. దీంతో అల్లుడే కూతురిని హత్య చేశాడని మృతురాలి తండ్రి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు డాక్టర్ మహేంద్రరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆమె భర్త తప్పుడు ఉద్దేశంతో కావాలనే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు గుర్తించామని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. -
భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి..పార్టీ ఇచ్చాడు!
కర్ణాటక: భార్యను హత్య చేసి బోరు బావిలో పాతిపెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా అలఘట్ట గ్రామంలో నెలన్నర క్రితం విజయ్ తన భార్య భారతిని హత్య చేశాడు. ఎవరికీ తెలియకుండా తోటలోని బోరు బావిలో శవాన్ని పాతి పెట్టాడు. భార్య పీడ తప్పిందని మూడు జంతువులను బలిచ్చి బంధువులకు విందు భోజనం పెట్టాడు. రేకుపై భార్య పేరు రాసి దెయ్యం, పీడ, పిశాచి పట్టకూడదని రాసి పూజలు చేయించాడు. అనంతరం తన భార్య మానసిక అస్వస్థతతో ఇల్లు వదలి వెళ్లినట్లు బంధువులు, గ్రామస్తులను నమ్మించాడు. అదృశ్యమైన తన భార్య ఆచూకీ కనిపెట్టాలంటూ కడూరు పోలీసులకు విజయ్ ఫిర్యాదు చేశాడు. భారతి తల్లిదండ్రులు కూడా కుమార్తె అదృశ్యంపై పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. భర్త విజయ్పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఘటనకు సంబంధించి భర్త విజయ్తో పాటు అత్తమామలు తాయమ్మ, గోవిందప్పను అరెస్ట్ చేశారు. మృతురాలు భారతి తన అవ్వను చూడటానికి శివమొగ్గకు వెళ్లారు. తిరిగి వాపస్ రాలేదని సెపె్టంబర్ 5న భర్త విజయ్.. కడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెలన్నర తరువాత భారతి తల్లి, ఎమ్మెదొడ్డి పరదేశీహాళ్కు చెందిన లలితమ్మ కడూరు పోలీసులకు మళ్లీ అక్టోబర్ 13న ఫిర్యాదు చేశారు. ‘6 ఏళ్ల క్రితం భారతిని విజయ్కి ఇచ్చి వివాహం చేశాం. అనేక సార్లు కట్నం కావాలని విజయ్ వేధించేవాడని భారతి తల్లిదండ్రులు ఫిర్యాదులో వివరించారు. దీంతో పోలీసులు విజయ్ను విచారించగా అసలు విషయం బయట పడింది. లలితమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అల్లుడు విజయ్, అతడి తలి తాయమ్మ, తండ్రి గోవిందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రభుత్వం కీలక నిర్ణయం.. 35 మార్కులు రాకున్నా పాస్..
పదో తరగతి.. లేదా ఎస్ఎస్ఎల్సీ.. విద్యార్థి జీవితంలో ఉన్నత చదువులకు ఇది మొదటి మెట్టు. టెన్త్ పాసైతే పీయూసీ, ఆపై చదువులకు తలుపులు తెరుచుకుంటాయి. లేదా చిన్నా చితకా ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. ఇందుకోసం ప్రతి సబ్జెక్టులో 35 శాతం మార్కులను తెచ్చుకోవాలి. కానీ చాలామంది విద్యార్థులు, పేదరికం, చదువు అర్థం కాక తదితర సమస్యలతో ఒకటీ అరా మార్కులతో పరీక్షలు తప్పి శాశ్వతంగా చదువుల తల్లికి దూరం కావడం అన్నిచోట్లా జరుగుతోంది. టెన్త్ ఫెయిల్ అనేది ఒక శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గుణాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్తీర్ణతకు 33 శాతం మార్కులు చాలని కుదించింది. శివాజీనగర: రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షల్లో 33 శాతం మార్కులు వస్తే చాలు పాసైపోయినట్లే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. 35 శాతం మార్కులు పొందేందుకు అవస్థలుపడే అనేకమంది విద్యార్థులకు ఇది చాలా అనుకూలం కానుంది. ఈ సంవత్సరం నుంచే అమలు చేస్తామని, ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. 206 మార్కులు చాలు బుధవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి మధు.. ఈ విద్యా సంవత్సరం నుంచి 33 శాతం మార్కులు పొందితే ఎస్ఎస్ఎల్సీ పాస్ అయినట్లేనని తెలిపారు. మొత్తం మార్కులు 625 కాగా, 206 మార్కులు వస్తే చాలు విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని చెప్పారు. అంతర్గత మార్కులు, బాహ్య మార్కులు రెండు కలిపి 33 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. ఒక మార్కు, రెండు మార్కుల్లో పరీక్షలు తప్పిపోయే వేలాది మంది విద్యార్థులకు ఈ నిర్ణయం వల్ల లబ్ధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. పారదర్శకంగా పరీక్షలు రాష్ట్రంలో ఎస్ఎస్ఎల్సీలో పరీక్షల వ్యవస్థ మెరుగుపరిచేందుకు మూడంచెల విధానాన్ని అమలు చేస్తామని మంత్రి చెప్పారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తామని, ఉత్తమ రీతిలో పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు. ఉత్తీర్ణత వృద్ధి కోసం 33 శాతం పాసింగ్ మార్కులను నిర్ధారించామన్నారు. ఆయా సబ్జెక్టుల మార్కుల్లో 30 మార్కులు పొంది, అంతర్గత, బాహ్య మార్కులు కలిపి మొత్తం 33 శాతం మార్కులు వచ్చినా ఉత్తీర్ణులవుతారని తెలిపారు. రెగ్యులర్, ప్రైవేటు, రిపీటర్స్కు ఇది వర్తిస్తుందని చెప్పారు. -
సిస్టోబాల్ క్రీడా ప్రతిభకు పేదరికం అడ్డు
రాయచూరు రూరల్: గుమ్మట నగరి విజయపుర జిల్లాలో ప్రతిభావంతులకు కొదవ లేదు. క్రీడలు, సాహిత్యం, టెక్నాలజీ, వ్యవసాయం, రాజకీయం వంటి క్షేత్రాలకు పేరొందిన జిల్లా విజయపుర. అలాంటి కోవకు చెందిన వారిలో ఒక్కరు క్రీడాకారిణి అక్షతా తారాపుర. సిస్టోబాల్ క్రీడా పోటీల్లో మహిళ క్రీడా ప్రతిభ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. థాయిలాండ్లో జరిగే పోటీల్లో పాల్గొనడానికి అర్థిక స్థోమత లేక భారతదేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో పేరును నిలబెట్టడానికి చేస్తున్న పోరాటం చెప్పనలవి కాదు. క్రీడాకారిణి అక్షతా తారాపుర విజయపుర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. తల్లి యశోద ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఆయాగా విధులు నిర్వహిస్తోంది. తండ్రి వినాయక్కు చెవి వినబడదు, కళ్లు కనబడవు. ఆర్ధిక స్థోమత లేక ఎదగలేక పోతున్న క్రీడాకారిణి అక్షతా తారాపుర దాతలు ఆదుకుంటే అంతర్జాతీయ స్థాయి పోటీలకు సంసిద్ధం భారంగా కుటుంబ పోషణ తల్లి యశోద జీతంతో తండ్రి ఆరోగ్యం, కుటుంబ పోషణ భారంగా మారిన తరుణంలో రెండేళ్ల క్రితం జాతీయ స్థాయి సిస్టోబాల్ క్రీడా పోటీల్లో విజయం సాధించానన్నారు. థాయిలాండ్లో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆడటానికి రూ.లక్ష మేర ఖర్చవుతుందని, ఆ ఖర్చు భరించే శక్తి లేక దేశం తరపున క్రీడల్లో పాల్గొనలేక పోతున్నానని విచారం వ్యక్తం చేశారు. తనకు థాయిలాండ్ వెళ్లడానికి ఆర్ధిక సహాయం చేయాలని అర్థిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి థాయిలాండ్లో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆడటానికి వెళ్లలేక పోతున్నానన్నారు. తన కర్ణాటక గ్రామీణ బ్యాంక్ పొదుపు ఖాతా సంఖ్య– 89079374049కు దాతలు ఆర్థిక సహాయం చేయాలని అక్షతా అభ్యర్థించారు. -
డిసెంబర్లో సూపర్ స్పెషాలిటీ ప్రారంభం
బళ్లారిటౌన్: రానున్న డిసెంబర్ నెలలో బళ్లారిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తామని వైద్యవిద్య, కౌశల్య అభివృద్ధి మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ ఆర్.పాటిల్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని టీబీ శానిటోరియం వద్ద గల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. 450 బెడ్లు కలిగిన ఈ ఆస్పత్రి 2008లో మంజూరు అయిందన్నారు. వివిధ కారణాల వల్ల ఆలస్యం జరిగి 2018లో తిరిగి టెండర్ పిలిచారన్నారు. ప్రస్తుతం నిర్మాణం దాదాపు పూర్తి అయిందని, డిసెంబర్ నెలలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కార్డియాలజిస్టు, ప్లాస్టిక్ సర్జరీ, డయాలజిస్ట్ యంత్రాలు, ఆర్ఓ ప్లాంట్, బెడ్ల సదుపాయాలు వంటివి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. న్యూరాలజీతో పాటు ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల వైద్యులు గ్రూప్ డీ, సీ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ను ఆదేశించారు. 26 ఎకరాల్లో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో గుర్తించిన 26 ఎకరాల్లో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదం లభించిందని, త్వరలోనే టెండర్ పిలిచి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య విద్యా శాఖ కార్యదర్శి మహమ్మద్ హుసేన్, బెంగళూరు వైద్య విద్యా శాఖ డైరెక్టర్ సుజాత రాథోడ్, జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సండూరులో రూ.300 కోట్ల వ్యయంతో సిల్క్ పార్క్ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యతో పాటు నైపుణ్యత అవసరం విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యత కూడా అవసరమని వైద్య విద్యా, కౌశల్య శిక్షణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ ఆర్.పాటీల్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ నూతనంగా ప్రారంభించిన ఇంకుబేషన్ జాబ్ పోర్టల్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేటి పోటీ యుగంలో విద్యార్థులకు డిగ్రీ పుచ్చుకుంటే చాలదన్నారు. చదువుతో పాటు నైపుణ్యత(స్కిల్), పరిజ్ఞానం అత్యవసరమన్నారు. కార్యక్రమంలో ఎఫ్కేసీసీఐ అధ్యక్షుడు ఉమారెడ్డి మాట్లాడుతూ బీడీసీసీఐ విద్యార్థుల కోసం కొత్త కొత్త అవకాశాలు కల్పిస్తుందన్నారు. వాటిని సద్వినియోగ పరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ అధ్యక్షుడు యశ్వంత్రాజ్ నాగిరెడ్డి, మేయర్ ముల్లంగి నందీష్, నేతలు మహారుద్ర గౌడ, శ్రీనివాసరావు, అవ్వారు మంజునాథ్, పాలన్న తదితరులు పాల్గొన్నారు. వైద్య సిబ్బంది ఖాళీల భర్తీకి అధికారులకు ఆదేశం వైద్యవిద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ పాటీల్ -
అభివృద్ధికి అందరూ పట్టం
రాయచూరు రూరల్: రాయచూరు నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రోలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, సభ్యుల నిర్ణయంతో పనులు చేపట్టామని ఆర్డీఏ సభ్యుడు నరసింహులు తెలిపారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడు నెలల నుంచి కార్పొరేషన్గా ఏర్పాటైనప్పటి నుంచి ఇంతవరకు సామాన్య సమావేశాలు నిర్వహించి అభివృద్ధి పనులకు అధికారుల సలహా, సూచనలు పాటించాలన్నారు. కార్పొరేషన్గా ఏర్పాటైనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.200 కోట్ల నిధులను అన్ని 35 వార్డులకు సమానంగా కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అధికారులు, అధ్యక్షులు, ఇతర పార్టీల నిర్ణయాలతో నిధులు వాడుకున్న అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఈ–ఖాతాలు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నామన్నారు. సమావేశంలో నగరసభ సభ్యులు బసవరాజ్, శ్రీనివాసరెడ్డి, జిందప్ప తదితరులు పాల్గొన్నారు. -
మద్దతు ధర కోసం రక్త లేఖ
హొసపేటె: ఉల్లిపాయలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చెరుకు పెంపకందారుల సంఘం అధ్యక్షుడు ఎన్ఎం.సిద్దేష్ ఉత్తంగి బుధవారం ప్రధానమంత్రికి రక్తంతో రాసిన లేఖను పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి పంటకు వెంటనే క్వింటాల్కు రూ.2000–2500ల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతుల సమస్యలపై స్పందించక పోతే కూడ్లిగిలో జరగనున్న ముఖ్యమంత్రి కార్యక్రమంలో రైతులు నల్ల బ్యాడ్జీలను కట్టుకుని నిరసన ప్రదర్శిస్తామని హెచ్చరించారు. ఉల్లి పెంపకందారుల సంఘం నాయకులు సోమన్న, మైనళ్లి కొట్రేష్ పాల్గొన్నారు. కార్మికుడు మృతిక్రిష్ణగిరి: మూడంతస్తుల భవనంపై పని చేస్తున్న కార్మికుడు అకస్మాత్తుగా కింద పడటంతో మృతి చెందిన ఘటన సూళగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేరళలోని కొచ్చిన్కు చెందిన జోసెఫ్(56) సూళగిరిలో నివాసముంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం సూళగిరి సమీపంలో భవన నిర్మాణ పని చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో మూడంతస్తుల భవనం పైనుంచి అకస్మాత్తుగా జారి కింద పడటంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
నిధుల మంజూరులో తారతమ్యం తగదు
సాక్షి,బళ్లారి: ఎమ్మెల్యేలకు నిధుల మంజూరు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తారతమ్యం చేస్తున్నారని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం కొప్పళ జిల్లా గంగావతి తాలూకా మెటగల్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కొత్త సంప్రదాయానికి తెర తీశారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తే, ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలకు కేవలం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ప్రకటించడం ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేయడంలో సీఎం పక్షపాతం వహించడంతో జేడీఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. కొప్పళలో ఇటీవల జరిగిన సీఎం పర్యటన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం తరహాలో లేకపోవడంతో తాను కాని బీజేపీ ప్రజాప్రతినిధులు కాని హాజరు కాలేదన్నారు. కుకనూరు పీఎస్ఐని సస్పెండ్ చేయడంతో రాష్ట్రంలో ప్రజలకే కాదు, పోలీసులకు కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. సామాన్యులకు జీవించడానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. రైతుల పంటనష్టంపై కూడా ప్రభుత్వం సరైన విధంగా రైతులకు న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తన కుర్చీని కాపాడుకునేందుకే సమయం వెచ్చిస్తున్నారన్నారు. పాలన వైపు దృష్టి పెట్టటం లేదని మండిపడ్డారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు విపక్షాల ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లేనా? గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి -
విరుపాక్షుని సన్నిధిలో నిర్మలమ్మ
సాక్షి,బళ్లారి: ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతూ, దక్షిణ కాశీగా పేరుగాంచిన హంపీలోని శ్రీ విరుపాక్షేశ్వర స్వామిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. ఆమె బుధవారం ఉదయం హంపీకి విచ్చేయడంతో ఆలయ గజరాజు ఘనస్వాగతం పలికింది. ఏనుగుతో స్థానిక అధికారులు పూలమాల వేయించి స్వాగతం పలికిన అనంతరం శ్రీవిరుపాక్షేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక్సభ సభ్యుడు తుకారాం, హంపీ విద్యారణ్య భారతీ తీర్థ స్వామి కూడా ఆమెను కలిసి మాట్లాడారు. హంపీ శిల్ప కళా అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఇక్కడ ఉన్న కట్టడాలు ప్రపంచంలోనే గుర్తింపు పొందాయన్నారు. హంపీ అందాలను ఎంత చూసినా తనివి తీరదన్నారు. శ్రీకృష్ణదేవరాయల పాలనను స్మరించారు. నిర్మలా సీతారామన్ ఆప్త కార్యదర్శి అనిరుధ్ శ్రవణ్, జిల్లాధికారిణి కవిత, ఆనెగుంది సంస్థానం రాజవంశస్థులు తదితరులు పాల్గొన్నారు. హంపీలో స్వామివారిని దర్శించుకున్న వైనం శిల్పకళ అందాలు అదుర్స్ అన్న కేంద్ర మంత్రి -
హుణసిగి ఎస్ఐ సస్పెండ్
రాయచూరు రూరల్: క్రమశిక్షణ చర్యల్లో భాగంగా యాదగిరి జిల్లా హుణసిగి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రాథోడ్ సస్పెండ్ అయ్యారు. ఈమేరకు యాదగిరి జిల్లా ఎస్పీ పృథ్విశంకర్ ఆదేశాలు జారీ చేసినట్లు మంగళవారం ఓ పత్రికా ప్రకటనలో పేర్కోన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ ఉల్లంఘించిన ఆరోపణలపై హుణసిగి తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ రాథోడ్ను సస్పెండ్ చేశారు. ఇటీవల రౌడీషీటర్ నాగరాజుతో కలిసి ఎస్ఐ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. రోడ్డు పనులకు భూమి పూజ బళ్లారిటౌన్: నగరంలోని వశిష్ట కళాశాల సమీపంలోని శ్రీశృంగేరి శారదాంబ కాలనీ వాసులు చాలా కాలంగా రోడ్డు సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో బుధవారం రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర అభివృద్ధి నిధులతో స్థానిక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు దేవానంద చేతుల మీదుగా రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ ప్రాంతంలో దాదాపు 500 దాకా ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా సుమారు 2500 మంది జనాభా నివాసం ఉంటున్నారు. అయితే గత 6 ఏళ్లుగా రోడ్డు కోసం పోరాడి చివరికి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర చొరవతో ఆయన నిధులు మంజూరు చేయగా భూమి పూజ జరిపారు. కాగా ఈ ప్రాంతంలో మరి కొన్ని లింక్ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు వంటి అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. వాటిపై కూడా ఎమ్మెల్యే చొరవ చూపాలని స్థానికులు ఆశిస్తున్నారు. స్థానిక ప్రముఖులు మల్లప్ప, అశోక్, మోహన్రెడ్డి, సత్యనారాయణ, లక్ష్మిరెడ్డి, వెంకటేష్, లక్కప్ప, మంజుల తదితరులు పాల్గొన్నారు. వ్యాపార మహిళకు సత్కార దండ రాయచూరు రూరల్: మద్యపానం, ధూమపానం, గుట్కా నియంత్రణకు తోడు గత 20 ఏళ్ల నుంచి దుకాణంలో విక్రయించకుండా వ్యాపారం చేసిన మహిళకు ధర్మస్థల క్షేత్ర సంస్థ, కర్ణాటక మద్యపాన నియంత్రణ మండలిని అభినందించారు. బుధవారం విజయలక్ష్మిని రాయచూరు తాలూకా సుల్తాన్పుర గ్రామానికి వెళ్లిన కర్ణాటక మద్యపాన నియంత్రణ మండలి అధ్యక్షుడు శరణప్ప ఘనంగా సత్కరించారు. దుకాణంలో ఎలాంటి మత్తు పదార్థాలు, మద్యం, ధూమ పానం, గుట్కా వంటి వాటిని విక్రయించకుండా గట్టి నిర్ణయంతో గ్రామంలో కొంత మేర మద్యపానానికి యువతను దూరంగా ఉంచడంతో ఆమెను అభినందించారు. ఆయకట్టుకు సక్రమంగా నీరందించండి రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, తుంగభద్ర ఆయకట్టుకు సక్రమంగా నీరు వదలాలని రైతులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో రైతులు మాట్లాడారు. ఆయకట్టు చివరి భూములకు సక్రమంగా నీరందించాలన్నారు. వర్షాలు లేక పంటలు వాడుముఖం పట్టాయని, పశువులకు తా గునీరు లేదని, తాగునీటి కోసం చెరువుల్లోకి నీటిని నింపాలన్నారు. కాలువ కింద రైతులు వరి, పత్తి పంటలు వేశారని సరైన సమయంలో నీటిని విడుదల చేసి ఆదుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. పచ్చని చెట్టు.. ఆరోగ్యానికి ఆయువు పట్టు రాయచూరు రూరల్: చెట్లు మానవుడి ఆరోగ్యానికి ప్రాణవాయువులాంటివని ప్ర భుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుగుణ పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ మనవరాలి నామకరణం సందర్భంగా శివిక పేరుతో మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అధిక శాతం చెట్ల కింద కూర్చొని సేద తీరుతారన్నారు. అంటే చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చుతుంటారన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శివాని, సిద్దన గౌడ తదితరులు పాల్గొన్నారు. -
అభాగ్యుల పెన్నిధి.. ఆ దంపతులు
హుబ్లీ: వీధుల్లో అందరికీ దూరమై వివిధ అనారోగ్య సమస్యలతో అలమటించే వారి పాలిట కరియప్ప, సునందమ్మ దంపతులు ఆత్మీయులుగా ఆదరణ చూపి ఆ అభాగ్యులకు పట్టెడన్నం పెట్టి గత 15 ఏళ్లుగా నగరంలో సేవలు అందిస్తున్నారు. గదగ్ జిల్లా లక్ష్మేశ్వరకు చెందిన ఈ దంపతులు తమ సంపాదనలోనే హుబ్లీ ఆనంద్నగర్లో అద్దె ఇంట్లో ఉంటూ ఆహారం తయారు చేసి నిరాశ్రయులకు తమ సొంత డబ్బులతో భోజనం, రొట్టెలు, చపాతీలు సమకూరుస్తారు. అంతమాత్రానికే వీరేమీ ఆర్థికంగా సంపన్నులు కాదు. అయినా దిక్కులేని వారికి పట్టెడన్నం పెట్టి మానవత్వం చాటుకోవాలన్నదే ఈ దంపతుల తాపత్రయం. ఇంట్లోనే రొట్టెల తయారీ కరియప్ప గతంలో కారు డ్రైవర్గా పని చేసేవాడు. అనంతరం టెంకాయల వ్యాపారంతో పాటు చిన్న సైజ్ కిరాణ అంగడి పెట్టుకున్నారు. ఆయన భార్య సునందమ్మ ఇంట్లోనే రొట్టెలు తయారు చేసి నిరాశ్రయులకు పంచుతారు. ఈ మేరకు వీరు తమ తండ్రి కరియప్ప శిరహట్టి పేరిట సేవా సంస్థ ద్వారా ఈ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. తమకు ఓ వాహనాన్ని దాతలు అందించాలని ఆయన కోరారు. మాకు సంతానం లేదు. నిరాశ్రయులే మా పిల్లలని భావించి రోజూ తమ నీలప్ప గుడ్డప్ప శిరహట్టి సేవా సంస్థ ద్వారా ఈ సేవలు అందిస్తున్నామని ఆ దంపతులు తమ సేవా వివరాలను వెల్లడించారు. సొంత డబ్బుతో భోజనం పంపిణీ గత 15 ఏళ్లుగా నగరంలో సేవలు -
బీజేపీకే నవంబర్ విప్లవం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విప్లవం లేదని, అది కేవలం బీజేపీ నేతల భ్రమ అని, బీజేపీలో నవంబర్లో విప్లవం రానుందని, దేశానికి నూతన ప్రధానమంత్రి పీఠం ఎక్కుతారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ జోస్యం చెప్పారు. బుధవారం కలబుర్గి, యాదగిరి, రాయచూరులో కార్మికులకు స్మార్ట్కార్డులు పంపిణీ చేసి విలేకరులతో మాట్లాడారు. నితిన్ గడ్కరీ దేశ ప్రధానమంత్రి అవుతారని వెల్లడించారు. భారతీయులకు దేశభక్తి ఉందన్నారు. ఆర్ఎస్ఎస్కు ఏమీ లేదన్నారు. తనకు బీజేపీలో ఆప్త మిత్రులున్నారన్నారు. వారి నుంచి సమాచారం అందిందన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కేబినెట్లో మార్పులు చేర్పులు జరుగుతాయన్నారు. కేంద్ర సర్కార్ వద్ద నిధులున్నాయని, ఎన్నికల్లో విజయం సాధిస్తారని, ప్రామాణిక ఓట్లతో గెలవడం బీజేపీకి కష్ట సాధ్యమని అన్నారు. యాదగిరి జిల్లాధికారిపై మండిపాటు బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ యాదగిరి జిల్లాధికారిపై మండిపడిన ఘటన చోటు చేసుకుంది. మంత్రి ప్రభుత్వ అతిథి భవనంలో 9 గంటలకు అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి జిల్లాధికారి హర్షల్ బోయర్ 40 నిమిషాల పాటు ఆలస్యంగా రావడంతో అధికారిపై చిందులు తొక్కారు. మంత్రి వెంట మరో మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్, శాసన సభ్యులు శరణే గౌడ కందకూరు, చెన్నారెడ్డి పాటిల్ తన్నూరులున్నారు. దేశానికి కొత్త ప్రధానమంత్రి మంత్రి సంతోష్ లాడ్ జోస్యం -
డీడీపీఐ కార్యాలయంలో మందు పార్టీ.!
సాక్షి,బళ్లారి: భావి తరాలకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకే ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న జిల్లా విద్యా శాఖాధికారి(డీడీపీఐ) కార్యాలయంలో మందు పార్టీ చేసుకోవడంతో పాటు అక్కడ 20 లీటర్ల క్యానులోకి మందును పోసుకుని తరలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల చిత్రదుర్గలోని డీడీపీఐ కార్యాలయంలో అక్కడ పని చేసే సిబ్బంది కొందరు 20 కొన్న మందు బాటిళ్లను తీసుకుని 20 లీటర్ల క్యానులోకి మందును పోశారు. అక్కడే నీళ్లు కలిపి, డీడీపీఐ కార్యాలయంలోనే మందు రుచి చూశారు. వీడియో వైరల్తో సిబ్బంది సస్పెండ్ కొందరు అక్కడ సేవించడంతో పాటు ఇతర ప్రాంతాలకు కారులో మందు క్యాను తరలించిన వీడియో వైరల్ కావడంతో చిత్రదుర్గం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యాలయంలోకి యథేచ్ఛగా మందు బాటిళ్లు తీసుకుని రావడంతో పాటు అక్కడే ఓ క్యానులోకి మందు పోసి, నీళ్లు పోసి మందు, నీళ్లు మిక్స్ చేసుకుని ఒకకొకరు తాగి భలే బాగుందని మాట్లాడుకున్నారు. ఎంతో దర్జాగా కారులో తరలించడంతో అక్కడ పని చేసే సిబ్బంది అవాక్కయ్యారు. ఉపాధ్యాయుల మండిపాటు ఉపాధ్యాయులకే ప్రధాన కార్యాలయమైన డీడీపీఐ కార్యాలయంలో ఇలాంటి కృత్యానికి ఒడిగట్టడంపై యావత్ ఉపాధ్యాయులతో పాటు ప్రతి ఒక్కరూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో చిత్రదుర్గ డీడీపీఐ వెంటనే మేల్కొని అక్కడ మందు క్యానులోకి పోసి, తాగిన సిబ్బంది అయిన రవికుమార్, గణేష్, తిప్పేస్వామి, సునీల్కుమార్ అనే నలుగురిని సస్పెండ్ చేశారు. అయితే డీడీపీఐ కార్యాలయంలో మందు పార్టీ చేసుకున్న సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదని, వారిని డిస్మిస్ చేసి కేసులు నమోదు చేస్తే, మళ్లీ ఇతరులకు భయం పుడుతుందని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 20 లీటర్ల క్యానులోకి మందు పోసి పార్టీ చేసుకున్న సిబ్బంది ప్రభుత్వ ఆఫీసులను మందు పార్టీకి వేదిక చేసుకుంటున్న వైనం కార్యాలయంలోకి 20 లీటర్ల మందును సిద్ధం చేసుకుని తరలింపు -
మార్కులు వస్తే పాస్
ఎస్ఎస్ఎల్సీ విద్యార్థులకు శుభవార్తశివాజీనగర: రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షల్లో 33 శాతం మార్కులు వస్తే చాలు పాసైపోయినట్లే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. 35 శాతం మార్కులు పొందేందుకు అవస్థలుపడే అనేకమంది విద్యార్థులకు ఇది చాలా అనుకూలం కానుంది. ఈ సంవత్సరం నుంచే అమలు చేస్తామని, ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. 206 మార్కులు చాలు బుధవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి మధు.. ఈ విద్యా సంవత్సరం నుంచి 33 శాతం మార్కులు పొందితే ఎస్ఎస్ఎల్సీ పాస్ అయినట్లేనని తెలిపారు. మొత్తం మార్కులు 625 కాగా, 206 మార్కులు వస్తే చాలు విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని చెప్పారు. అంతర్గత మార్కులు, బాహ్య మార్కులు రెండు కలిపి 33 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. ఒక మార్కు, రెండు మార్కుల్లో పరీక్షలు తప్పిపోయే వేలాది మంది విద్యార్థులకు ఈ నిర్ణయం వల్ల లబ్ధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. పారదర్శకంగా పరీక్షలు రాష్ట్రంలో ఎస్ఎస్ఎల్సీలో పరీక్షల వ్యవస్థ మెరుగుపరిచేందుకు మూడంచెల విధానాన్ని అమలు చేస్తామని మంత్రి చెప్పారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తామని, ఉత్తమ రీతిలో పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు. ఉత్తీర్ణత వృద్ధి కోసం 33 శాతం పాసింగ్ మార్కులను నిర్ధారించామన్నారు. ఆయా సబ్జెక్టుల మార్కుల్లో 30 మార్కులు పొంది, అంతర్గత, బాహ్య మార్కులు కలిపి మొత్తం 33 శాతం మార్కులు వచ్చినా ఉత్తీర్ణులవుతారని తెలిపారు. రెగ్యులర్, ప్రైవేటు, రిపీటర్స్కు ఇది వర్తిస్తుందని చెప్పారు. ఈ ఏడాది నుంచే అమలులోకి ప్రభుత్వ నిర్ణయంపదో తరగతి.. లేదా ఎస్ఎస్ఎల్సీ.. విద్యార్థి జీవితంలో ఉన్నత చదువులకు ఇది మొదటి మెట్టు. టెన్త్ పాసైతే పీయూసీ, ఆపై చదువులకు తలుపులు తెరుచుకుంటాయి. లేదా చిన్నా చితకా ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. ఇందుకోసం ప్రతి సబ్జెక్టులో 35 శాతం మార్కులను తెచ్చుకోవాలి. కానీ చాలామంది విద్యార్థులు, పేదరికం, చదువు అర్థం కాక తదితర సమస్యలతో ఒకటీ అరా మార్కులతో పరీక్షలు తప్పి శాశ్వతంగా చదువుల తల్లికి దూరం కావడం అన్నిచోట్లా జరుగుతోంది. టెన్త్ ఫెయిల్ అనేది ఒక శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గుణాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్తీర్ణతకు 33 శాతం మార్కులు చాలని కుదించింది. -
540 ఎకరాల అటవీ భూమి స్వాధీనం
శ్రీనివాసపురం: తాలూకాలోని కొట్లవారిపల్లి అటవీ ప్రాంతంలో ఆక్రమణలకు గురైన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సర్వే న బర్ 90లో సుమారు 500 నుంచి 540 ఎకరాల అటవీ భూమిని డిఎఫ్ఓ సరీనా సిక్కలిగర్ నేతృత్వంలో 20 జేసీబీలతో తొలగింపు పనులను చేపట్టారు. ఈ భూమిలో కొందరు రైతులు 20 సంవత్సరాల నుంచి పాగా వేశారు. మామిడి, టమాటా తోటలు, పూలు, ఇతరత్రా పంటలను పండిస్తున్నారు. బోర్లు కూడా వేశారు. కబ్జాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి రైతులకు నోటీసులు జారీచేసినట్లు సరీనా తెలిపారు. ఈ నేపథ్యంలో పంటలను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది అటవీకరణ కోసం మొక్కలను నాటుతున్నారు. ఇక్కడికి రైతులు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. సిఎఫ్, కె మహేష్, ఆర్ఎఫ్ ఓ రవికీర్తి, సీఐ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ భూముల్లో తోటల తొలగింపు -
దీపావళి పండుగ.. కొనుగోళ్లు తోడుగా
సాక్షి, బెంగళూరు: దీపావళి అంటేనే అందరికీ ఉత్సాహం. పండుగకు ఇక నాలుగైదు రోజులే మిగిలి ఉండగా ఐటీ సిటీలో షాపింగ్ సందడి జోరందుకుంది. పలు రకాల దుకాణాలు, మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. దుస్తులు, బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు తదితర షాపింగ్ ఊపందుకుంది. ఇప్పటికే చిక్పేట, కేఆర్ మార్కెట్, ఎస్పీ రోడ్డు, జేసీ రోడ్డు , కమర్షియల్ మార్కెట్, శివాజీనగర, జయనగర ఫోర్త్ బ్లాక్, మల్లేశ్వరం వంటి షాపింగ్ కేంద్రాలు, మార్కెట్లు వ్యాపారాలతో, కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. వస్త్ర దుకాణాల్లో రద్దీ ముఖ్యంగా దుస్తుల కొనుగోలు కోసం నగరంలోని ప్రధాన చిక్పేటకు జనాలు తరలివస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వివిధ రకాల సంప్రదాయ, ట్రెండీ దుస్తులకు గిరాకీ ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. పసిడి కొనుగోళ్లు మహిళలు ఎంతో మెచ్చే బంగారు, వజ్రాభరణాలకు గిరాకీ ఉంటోంది. బంగారం ధరలు భగ్గుమంటున్నా కూడా కొనుగోలుకు వెనుకాడడం లేదు. జ్యువెలరీ షోరూమ్లు కళగా మారాయి. దంతెరాస్ కూడా రావడంతో నగల షాపులకు మరింత రద్దీ నెలకొంది. నగల షోరూంలు ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. ఇంటి సింగారానికి దీపావళికి ఇంటిని సుందరంగా ముస్తాబుకు నగరవాసులు ఆసక్తి కనపరుస్తున్నారు. మాల్స్, షాపుల్లో వివిధ రకాల బ్రాండ్ల హోమ్ డెకరేషన్ ఐటంలకు గిరాకీ ఏర్పడింది. వాల్ హ్యాంగింగ్, కర్టెన్లు, కృత్రిమ పూలు, అలంకార సామగ్రి మార్కెట్లను ముంచెత్తింది. మిఠాయి దుకాణాలు, గిఫ్ట్ ప్యాక్లకు డిమాండు నెలకొంది. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తు అమ్మకాలపై వ్యాపారులు డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఇక టపాసుల విక్రయాలు సరేసరి. నియమ నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ పటాకులను పేలిస్తేనే దీపావళి అనే భావన ఉంది. మధ్యతరగతి కుటుంబాలు కూడా టపాసుల కోసం వేలాది రూపాయలు వెచ్చిస్తాయి. బాలిక అనుశ్రీ (ఫైల్) ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ బెంగళూరు మార్కెట్లు కిటకిట దుస్తులు, నగలు, గృహోపకరణాల షాపుల్లో రద్దీ -
రాష్ట్రానికి గజ బలం
యశవంతపుర: దేశంలో ఏనుగులపై నిర్వహించిన సర్వేలో కర్ణాటకలో అగ్రస్థానంలో నిలిచింది. కన్నడనాట రికార్డుస్థాయిలో 6,013 ఏనుగులున్నట్లు గుర్తించారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో కలిపి 22,446 గజరాజులు ఉన్నట్లు గుర్తించారు. అయితే దేశంలో 2017తో పోల్చితే ఇప్పుడు 18 శాతం అంటే 5 వేల ఏనుగుల సంఖ్య క్షీణించినట్లు బయటపడింది. దేశంలో కర్ణాటకతో కలిపి పశ్చిమ ఘాట్లలో 11,934 ఏనుగులు నివసిస్తున్నాయి. రెండవ అసోం– 4159, తమిళనాడు–3136, కేరళ–2785, ఉత్తరాఖండ్–1792, ఒడిశా–912, చత్తీస్ఘడ్, జార్ఖండ్–650, మధ్యప్రదేశ్–97, మహారాష్ట్ర– 63 ఏనుగులు ఉన్నాయి. ఏయే జిల్లాల్లో.. ఇప్పటికే కర్ణాటక పులుల సంఖ్యలోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో బెంగళూరుతో కలిపి దక్షిణాది జిల్లాల్లోని అడవులు ఏనుగులకు ఆవాసంగా ఉంటున్నాయి. చామరాజనగర జిల్లా అడవుల్లో అత్యధికంగా ఉంటున్నాయి. తరువాత ఉత్తర కన్నడ, కొడగు, మైసూరు, మండ్య, హాసన్, బెంగళూరు రూరల్, తుమకూరు, కోలారు జిల్లాల్లో జీవిస్తున్నాయి, అప్పుడప్పుడూ ఉత్తర కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లోనూ గజరాజులు కనిపిస్తాయి. దేశంలో అత్యధిక ఏనుగులు ఇక్కడే -
కులగణనకు వెళ్లి చెరువులో శవమై...
కోలారు: సామాజిక విద్యా సమీక్ష (కుల గణన) కోసం వెళ్లిన ఉపాధ్యాయురాలు చెరువులో శవమై తేలింది. వివరాలు.. కోలారు నగరానికి చెందిన అక్తర్ బేగం (50) మంగళవారం సమీక్ష కోసం నరసాపురానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబీకులు నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం కేజీఎఫ్ తాలూకా అయ్యప్పల్లి చెరువులో ఆమె మృతదేహం కనిపించింది. అక్తర్ బేగం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బేతమంగల పోలీసులు మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీసి ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఆమె బస్సులో వెళ్లినట్లు టికెట్ లభ్యమైంది. -
‘చెత్త రోడ్లు..మేమెందుకు కట్టాలి ట్యాక్స్’.. భీష్మిస్తున్న నగర వాసులు
సాక్షి,బెంగళూరు: భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరం మరోసారి మౌలిక సదుపాయాల సమస్యలతో చర్చకు దారితీసింది. నగరంలోని అధ్వాన్న రోడ్ల పరిస్థితిపై ఇప్పటికే పలు మార్లు ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తాజాగా, మౌలిక సదుపాయాలు లేకపోతే తాము ఆస్తిపన్ను ఎందుకు చెల్లించాలి అంటూ పౌరులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.నగరంలో గుంతలు పడిన రోడ్ల విషయంలో ప్రభుత్వ చర్యలు వేగవంతం చేసింది. రోడ్లను గుర్తించి మరమత్తులు కూడా చేపట్టింది. అయినా నగర వాసులు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోతే ఆస్తిపన్ను కట్టబోమని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. అలా ఇప్పటి వరకు 13వేల గుంతలు పూడ్చినట్లు తెలిపారు. అలాగే, 550 కిలోమీటర్ల ప్రధాన రహదారుల అభివృద్ధికి వెయ్యి కోట్ల యాక్షన్ ప్లాన్ను రూపొందించమని అధికారులను ఆదేశించారు.బెంగళూరులోని రోడ్ల దుస్థితిపై వ్యక్తిగత పన్ను చెల్లింపు దారుల ఫోరం సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసింది. లేఖలో, గ్రేటర్ బెంగళూరు మునిసిపల్ సంస్థలు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే, ఆస్తిపన్ను వసూలు చేయకుండా ఉండాలని సూచించారు.వర్తూర్-బలగేరె-పనతూర్ ప్రాంతాల్లో అసంపూర్ణ, శాస్త్రీయతలేని రోడ్ల పనులు, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షాకాలంలో వరదలు, డ్రైనేజ్ పూర్తికాకముందే రోడ్ల పనులు ప్రారంభించడం, కొత్త రోడ్లు త్వరగా దెబ్బతినే ప్రమాదం, వైట్ టాపింగ్, స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ పనులు ప్రజల జీవితాలను ప్రభావితం చేయడం వంటి అంశాలను హైలెట్ చేశారు. మౌలిక సదుపాయాలు లేకుండా ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయడం అన్యాయం. బెంగళూరు ఐటీ హబ్గా గుర్తింపు పొందినప్పటికీ ‘గుంతలరోడ్లు, ట్రాఫిక్ జామ్, గార్బేజ్ సిటీ’ వంటి పేర్లు నగర గౌరవాన్ని తగ్గిస్తున్నాయని వాపోయారు.


