Karnataka
-
భారతీయ సంస్కృతిలో మహిళకు ప్రత్యేక స్థానం
బళ్లారిటౌన్: భారతీయ సంస్కృతిలో ఆది నుంచి మహిళలకు ప్రత్యేక స్థానం లభిస్తుందని డాక్టర్ జగ్జీవన్ రాం చర్మ పారిశ్రామిక అభివృద్ధి మండలి అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజ్ పేర్కొన్నారు. మంగళవారం వాల్మీకి భవనంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్ర పూర్వంలో పోర్చుగీస్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మహిళలు తమిళనాడు రాణి అబ్బక, కిత్తూరు రాణి చెన్నమ్మ, ఝాన్సీలక్ష్మీబాయి లాంటి ఎంతో మహిళలు ఉన్నారని గుర్తు చేశారు. డాక్టర్ అంబేడ్కర్ మహిళలకు సమాన హక్కులను కల్పించి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి బిల్లులు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వాలు కల్పిస్తున్న అనేక సదుపాయాలను సద్వినియోగ పరుచుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ సుమేరా, పాలికె మేయర్ పీ.గాదెప్ప, జిల్లా గ్యారెంటీ పథకాల అమలు అధ్యక్షుడు చిదానందప్ప, ఏడీసీ మహమ్మద్ ఝుబేర తదితరులు పాల్గొన్నారు. -
పొలంలో నీళ్లు తాగాడని రగడ
సాక్షి,బళ్లారి: తమ పొలంలో ఓ ఎస్సీ యువకుడు నీళ్లు తాగాడనే చిన్న కారణానికి రెండు కులాల మధ్య వాగ్వాదం చెలరేగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో 24 మందికి తీవ్ర గాయాలు కాగా ఇరు వర్గాల వారు ఆస్పత్రి పాలైన ఘటన గదగ్ జిల్లా ముండరిగి తాలూకా చిక్కవద్దట్టి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఎస్టీ సముదాయానికి చెందిన రైతు పొలంలో ఎస్సీ సముదాయానికి చెందిన ఓ యువకుడు నీళ్లు తాగడానికి వెళ్లాడు. దీంతో రెండు కులాలకు చెందిన యువకులు తాగునీటి విషయమై గొడవ పడ్డారు. అది చినికి చినికి గాలి వానగా మారి రెండు కులాల మధ్య రగడ పతాక స్థాయికి చేరింది. పొలంలో చోటు చేసుకున్న ఘర్షణతో గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో రెండు కులాలకు చెందిన వారు దాదాపు 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం పోలీసు స్టేషన్కు చేరింది. ఘటన స్థలానికి చేరుకున్న అక్కడి పోలీసు అధికారులు, సిబ్బంది రెండు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ ఘటన గదగ్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పొలంలో మంచినీరు తాగడానికి వెళ్లిన వ్యక్తిపై రగడకు దిగడమేంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గదగ్ జిల్లాలో కుల ఘర్షణ ఎస్సీ, ఎస్టీ వర్గాల మధ్య ఘర్షణ 24 మందికి తీవ్ర గాయాలు -
స్వచ్ఛతకు పెద్దపీట వేయాలి
రాయచూరు రూరల్: నగరంలో స్వచ్ఛతకు ప్రాధాన్యత కల్పించాలని మైసూరు సిటీ కార్పొరేషన్ ఇంజినీర్ నవీన్ కుమార్ సూచించారు. మంగళవారం నగరంలోని సిటీ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మైసూరు సిటీ కార్పొరేషన్ స్వచ్ఛతలో దేశ స్థాయిలో ప్రథమ స్థానం అలంకరించిందన్నారు. ఈ విషయంలో మైసూరు సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాయచూరు సిటీ కార్పొరేషన్తో ఒప్పందాలు కుదుర్చుకొందన్నారు. అధికారులు మహదేవమ్మ, జ్యోతి, యోగేష్, అశ్వఽథ్, శివ ప్రసాద్, నగరసభ అధికారులు భరత్ కుమార్, సంతోష్ రాణి, మల్లికార్జున రెడ్డిలున్నారు. -
పరిశ్రమలకు భూములను ఇవ్వొద్దు
సాక్షి,బళ్లారి: అనాది కాలంగా అన్నం పెట్టే భూములను అమ్ముకోవడం, లీజుకు ఇవ్వడం సరికాదని, పరిశ్రమల పేరుతో భూమాఫియాలు రైతులను మోసం చేసి తక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి రైతులను నాశనం చేస్తున్నారని సిరివార, చాగనూరు భూ పోరాట సమితి నాయకుడు, సీనియర్ న్యాయవాది మల్లికార్జునరెడ్డి, కర్ణాటక ప్రాంత రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఆర్.మాధవరెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాత్రి తాలూకాలోని చాగనూరు గ్రామంలో భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల 95వ వీరమరణ దినోత్సవం సందర్భంగా స్థానికంగా భూపోరాటం చేసిన రైతు అంజని మృతికి ఏర్పాటు చేసిన శ్రద్ధాంజలి సమావేశంలో వారు మాట్లాడారు. మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేటి రోజుల్లో వ్యవసాయానికి యువత దూరం అవుతుండటం సరి కాదన్నారు. రైతులు లేకపోతే ప్రపంచానికే అన్నం లేదు రైతులు లేకపోతే దేశానికే కాదు, ప్రపంచానికే అన్నం దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఎంత స్థాయికి ఎదిగినా పంటలు పండే భూములను కాపాడుకుని, భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల పేరుతో భూమాఫియా రైతులను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఇటీవల రైతుల నుంచి భూమిని కొనడం లేదన్నారు. లీజుకు ఇవ్వాలని సరికొత్తగా రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలకు భూములు అమ్మినా, లీజుకు ఇచ్చినా ఎలాంటి తేడా లేదన్నారు. లీజుకు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకున్న సందర్భాలు ఎక్కడా లేవన్నారు. మోసపూరితంగా అన్ని విధాలుగా రాయించుకుని, లీజు పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. భూపోరాటంలో అంజని ధైర్యం మరవలేనిది సిరివార, చాగనూరులో విమానాశ్రయానికి భూములు తీసుకునే సందర్భంలో అంజని అనే రైతు ఎంతో పోరాటం చేశారన్నారు. ఆయన్ను మనందరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికా విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. రైతులను కాపాడాల్సిన పాలకులు రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అని గుర్తు చేశారు. భగత్సింగ్, రాజ్గురు సిద్ధాంతాలు నేటికీ ఎందుకు ఆదర్శంగా ఉన్నాయో వివరించారు. దేశం కోసం ఆ మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారని కొనియాడారు. వారి అడుగు జాడల్లో మనందరం నడుస్తూ, దేశాభివృద్ధికి పాటు పడదామని పిలుపునిచ్చారు. పలువురు ప్రముఖులు, రైతు సంఘం నాయకులు నాగభూషణ, చంద్రకుమారి, సోమశేఖర్గౌడ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న రైతు సంఘం కార్యకర్తలు, హాజరైన జనంమాట్లాడుతున్న సీనియర్ న్యాయవాది మల్లికార్జునరెడ్డి భూములను పరిశ్రమలకు లీజుకు ఇచ్చినా.. అమ్మినా ఒకటే భగత్సింగ్, రాజ్గురు శ్రద్ధాంజలి సభలో వక్తలు -
నాణ్యమైన ఉత్పత్తులనే కొనండి
హొసపేటె: వినియోగదారులు ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు ఆ ఉత్పత్తి పరిమాణం, నాణ్యతను నిర్ధారించుకోవాలని అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయ హాలులో నిర్వహించిన ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రతి వినియోగదారుడు తాను కొనుగోలు చేసే వస్తువు నాణ్యత, బరువు గురించి తెలుసుకోవాలన్నారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. వినియోగదారులు వివిధ మాధ్యమాల్లో ప్రసారమయ్యే ఆకర్షణీయమైన ప్రకటనలకు మోసపోరాదన్నారు. అందుకు బదులుగా ఉత్పత్తి నాణ్యత, భద్రతను తనిఖీ చేసి కొనుగోలు చేయాలన్నారు. ఏదైనా వస్తువు లేదా ఉత్పత్తిని కొనుగోలు చేసేటప్పుడు వారు ఎల్లప్పుడూ అధికారిక బిల్లు లేదా రసీదును పొందాలన్నారు. ఉత్పత్తి, కొనుగోలులో లోపం ఉంటే ఫిర్యాదు చేయాలన్నారు. వ్యాపారులు తప్పనిసరిగా స్టాంప్ వేసిన ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాలను ఉపయోగించాలన్నారు. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ ఎన్.తిప్పేస్వామి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సీనియర్ న్యాయవాది కరుణానిధి, ఆహార పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రియాజ్, లీగల్ మెట్రాలజీ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ మనోజ్కుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుజ్జల నాగరాజ్, కార్యదర్శి కృష్ణదేవరాయలు, వివిధ శాఖల అధికారులు, వినియోగదారులు హాజరయ్యారు. -
మాజీ ఎమ్మెల్యే కుమారుడి అనుమానాస్పద మృతి
హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని రామపుర గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో బెళగావి జిల్లా బైలహొంగల మాజీ ఎమ్మెల్యే కుమారుడు తన సొంత కారులోనే పూర్తిగా కాలిపోయిన స్థితిలో శవంగా లభించారు. ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన ఇటు ధార్వాడ, అటు బెళగావి జిల్లాల్లో సంచలనం సృష్టించింది. బైలహొంగల మాజీ ఎమ్మెల్యే బాబూరావ్ బొళశెట్టి కుమారుడు రాజు బొళశెట్టి(53) మృతుడు. ధార్వాడ తాలూకా రామపుర గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పక్కన దట్టమైన అరణ్యంలో ఆయన సొంత వ్యాగనార్ కారులో కాలిపోయిన స్థితిలో ఆయన శవం లభ్యమైంది. దుండగులు రాజును ముందుగా హత్య చేశాక సాక్ష్యాలు నాశనం చేయాలన్న ఉద్దేశంతో నిర్మానుష్య ప్రాంతానికి తెచ్చి ఆయన సొంత కారులోనే నిప్పుపెట్టి కాల్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఆయన దేహంతో పాటు కారు కూడా పూర్తిగా కాలిపోయిన స్థితిలోనే కనిపించింది. కాగా ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య పరిశీలించారు. విధి విజ్ఞాన, డాగ్ స్క్వాడ్ ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సాక్ష్యాలను సేకరించారు. ధార్వాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. కాగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తిపై జరిగిన ఈ నిగూఢ హత్య ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. కాలిపోయిన స్థితిలో కారుతో పాటు మృతదేహం లభ్యం పథకం ప్రకారం చేసిన హత్యగా అనుమానాలు -
కేకేఆర్డీబీలో అవినీతిపై విచారణకు డిమాండ్
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి మండలి(కేకేఆర్డీబీ)లో రూ.కోట్లలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని హైదరాబాద్ కర్ణాటక జనాందోళన సమితి అధ్యక్షుడు రాఘవేంద్ర కుష్టిగి డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భనవంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 ఏళ్ల క్రితం జారీ చేసిన రాజ్యాంగంలోని ఆర్టికల్–371(జె) అమలు విషయంలో నిర్లక్ష్యం వహించారన్నారు. 2025–26లో రూ.5 వేల కోట్ల నిధులున్నా దానికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించకుండా కాలయాపన చేశారని దుయ్యబట్టారు. కేవలం రూ.862.93 కోట్ల పనులకు అనుమతి పొంది మిగిలిన రూ.4,137 కోట్ల నిధులకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని, నైతిక బాధ్యతగా కేకేఆర్డీబీ అధ్యక్షుడు అజయ్సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాసిరకంగా చేపట్టిన పనులపై థర్డ్ పార్టీ తనిఖీ చేయకుండా నిధులు గోల్మాల్ చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఒత్తిడి చేశారు. బసవరాజ్, భీమ రాయ, జాన్వెస్లీ, ఖాజా అస్లాం పాషాలున్నారు. -
ఉసురు తీసిన ఆన్లైన్ గేమ్
సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్: శాస్త్ర శాంతికేతిక రంగం అభివృద్ధి చెందుతూ యువతకు కొత్త అవకాశాలు తీసుకు వస్తున్నా, అదే సమయంలో అదే సాంకేతికతతో ప్రమాదం బారిన పడే పరిస్థితులను కూడా సృష్టిస్తోంది. అతను చదువు అన్నింటిలో ఫస్ట్ వచ్చేవాడు. 10వ తరగతి, పీయూసీ, అనంతరం ఎంబీబీఎస్ సీటు కూడా మంచి ర్యాంకుతో బీదర్ మెడికల్ కళాశాలలో సాధించాడు. నాలుగేళ్ల ఎంబీబీఎస్ పూర్తి చేసి, మరో ఏడాదిలో వైద్య విద్యార్థి నుంచి వైద్యుడుగా మారి ఉద్యోగం కూడా తెచ్చుకునే సమయం దగ్గరకు వస్తున్న శుభ తరుణంలో ఆ మంచి వైద్య విద్యార్థి స్నేహితుల మాయలో పడి ఆన్లైన్ గేమ్కు బానిస అయ్యాడు. గత కొన్ని నెలలుగా ఆన్లైన్ గేమ్తో పాటు నిత్యం సెల్మాయలో కూడా పడిపోవడంతో మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. గేమ్లో రూ.80 వేలు పోగొట్టుకున్న వైనం ఆన్లైన్ గేమ్లో రూ.80 వేల వరకు డబ్బులు కూడా పోగొట్టుకోవడంతో వైద్య విద్యార్థి చివరికి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కలబుర్గి జిల్లా చించోళి తాలూకా సలగర్ తాండాకు చెందిన అనిష్కార్ చౌహాన్(21) అనే విద్యార్థి బీదర్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకోవడంతో వసతి నిలయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ ప్రదీప్తో పాటు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వసతి నిలయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని గమనించి, మృతదేహాన్ని కిందకు దింపి పరిశీలించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శోకసంద్రంగా ఆస్పత్రి ప్రాంగణం తల్లిదండ్రులకు విషయం తెలియగానే బీదర్లోని ఆస్పత్రి వద్దకు చేరుకుని తమ కుమారుడు విగతజీవిగా పడి ఉన్న దృశ్యాన్ని చూసి భోరున విలపించారు. తమ బిడ్డ బాగా చదువుకునేవాడని, ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవని, మరో ఏడాదిలో వైద్య విద్యా కోర్సు ముగుస్తుందని, మంచి ఉద్యోగం వస్తుందని చెప్పేవాడని, అంతలోనే ఇలా తన జీవితాన్ని చాలించాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి రోదనలను ఆపడం ఎవరి తరం కాలేదు. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, తోటి వైద్య విద్యార్థులు అందరూ కంటతడి పెట్టారు. మంచి భవిష్యత్తు ఉన్న యువకుడు ఆన్లైన్ మాయా ప్రపంచపు వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనపై బీదర్ న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బీదర్ వసతి నిలయంలో వైద్య విద్యార్థి బలి మరో ఏడాదిలో ముగియనున్న ఎంబీబీఎస్ విద్యాభ్యాసం ఓటమి, నిరాశ, మానసిక ఒత్తిడితో బలవన్మరణం చేసుకున్న వైనం -
ఎట్టకేలకు ఎర్రితాత ఉత్సవానికి అనుమతి
బళ్లారిటౌన్: తాలూకాలోని కొళగల్ గ్రామంలో గత 25 ఏళ్లుగా నూతన రథోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే గత మూడేళ్లుగా ఈ రథోత్సవం స్తంభించి పోవడంతో గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాల భక్తుల్లో కూడా అసంతృప్తి నెలకొంది. ఎర్రితాత శిష్యుడు ఎరియప్ప తాత మృతి చెందడంతో ఆయన ఆ మఠంలోని సమాధి వద్ద విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటు చేసే విషయంలో గ్రామంలో ఇరువర్గాలకు మధ్య చెలరేగిన వివాదంతో గత మూడేళ్ల నుంచి రథోత్సవాన్ని జరుపుకోవడం రద్దు చేశారు. గ్రామంలో శాంతి భద్రతల రక్షణ కోసం జిల్లా యంత్రాంగం ఈ రథోత్సవాన్ని రద్దు చేసింది. అయితే మూడేళ్లుగా ఉత్సవాలు జరుపుకోవడం రద్దు చేయడంతో చాలా మంది గ్రామస్తులు జిల్లా యంత్రాంగానికి, పోలీస్ అధికారులకు కూడా ఉత్సవాలు జరపాలని విజ్ఞప్తి చేశారు. అయితే మరో వర్గం వారు ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఉత్సవాలు నిర్వహించడం సబబు కాదని అధికారులతో వాదించారు. చివరకు ఫలించిన చర్చలు దీంతో గత వారం రోజులుగా జిల్లా పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం మూడు నాలుగు రౌండ్ల పాటు చర్చలు జరిపారు. తహసీల్దార్ సమక్షంలో పోలీసు బలగాలతో పాటు గ్రామస్తుల సమక్షంలో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. చివరికి మంగళవారం సాయంత్రం రథోత్సవం జరపాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రథాన్ని షెడ్లో నుంచి పోలీసుల సమక్షంలో బయటకు తీశారు. కాగా 25 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ నూతన రథానికి గతంలో సుమారు 10 ఏళ్ల పాటు సామూహిక వివాహాలు జరిపి ఎంతో భక్తిని చాటారు. ఇతర జిల్లాల నుంచి కూడా వేలాది మంది భక్తులు కోరిన కోర్కెలను నెరవేర్చే ఎర్రితాతను దర్శించుకుని మొక్కులను తీర్చుకొనే వారు. అయితే మూడేళ్ల క్రితం విగ్రహ ప్రతిష్టాపన విషయంలో ఇరు వర్గాల్లో వివాదం చెలరేగడంతో ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉంది. దీంతో జిల్లా యంత్రాంగం కూడా గత మూడేళ్లుగా ఎంత ప్రయత్నించినా అప్పట్లో చర్చలు విఫలం అయ్యాయి. ఈసారి నాలుగు, ఐదు రౌండ్లు జరిపిన చర్చలు సఫలం కావడంతో గ్రామస్తుల్లో చాలా వరకు హర్షం వ్యక్తమైంది. భక్తుల్లో వెల్లివిరిసిన ఆనందం మూడేళ్లుగా స్తంభించిన వైనం -
శాంతియుతంగా శోభాయాత్ర చేపట్టండి
రాయచూరు రూరల్: నగరంలో శాంతియుతంగా శోభాయాత్ర చేయాలని హిందూ పర సంఘాల నేతలకు డీఎస్పీ శాంతవీర్ సూచించారు. మంగళవారం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 27న శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న శోభాయాత్రను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. సమావేశంలో పీఐ నాగరాజ్, ఉమేష్ కాంబ్లే, సాబయ్యలున్నారు. లంచగొండి ఎఫ్డీఏపై సస్పెన్షన్ వేటుహుబ్లీ: లావాదేవీల వ్యవహారానికి అనుమతి ఇవ్వడానికి లంచం తీసుకున్న ఆరోపణలకు సంబంధించి జిల్లా సహకార సంఘాల సహాయ రిజిస్ట్రార్ కార్యాలయం ఎఫ్డీఏ మధుసూధన్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆ సంఘాల రిజిస్ట్రార్ టీహెచ్ఎం కుమార్ ఆదేశాలు వెల్లడించారు. మధుసూధన్ వివిధ పనులకు వచ్చే ప్రజల నుంచి లంచం స్వీకరించడంతో పాటు నియమాలను ఉల్లంఘించినట్లుగా తెలవడంతో ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. వైభవంగా కాళికాదేవి రథోత్సవం హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి పట్టణానికి సమీపంలోని గొల్లరహళ్లి గ్రామంలో సోమవారం సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో కాళికాదేవి రథోత్సవం అత్యంత వైభవంగా, ఉత్సాహంగా జరిగింది. రథోత్సవంలో భాగంగా ఉదయం కాళికాదేవికి ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం దగ్గర గుమిగూడిన భక్తులు పండ్లు, కూరగాయలు సమర్పించారు. అనంతరం వారు ఆలయానికి వచ్చి గతసారి వేలంలో గెలుచుకున్న జెండాను అమ్మవారికి అప్పగించారు. దేవత ఉత్సవ విగ్రహాన్ని అన్ని వాయిద్య పరికరాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి, రకరకాల పూలమాలలతో అలంకరించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు గొల్లరహళ్లి, జీ.నాగలాపుర, గరగ, బైలకుండి, చిలకనహట్టి, డణాయకనకెరె, తిమ్మలాపుర, దేవలాపుర, మరియమ్మనహళ్లి, హొసపేటె, బళ్లారి, సండూరు పట్టణాలతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యథేచ్ఛగా టీసీల విక్రయం ● విద్యుత్ శాఖలో రూ.కోట్లాది మేర అవకతవకలు ● జెస్కాం ఉద్యోగి గురురాజ్ నాయక్పై భార్య ఫిర్యాదు రాయచూరు రూరల్: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న జెస్కాం ఉద్యోగులు విద్యుత్ శాఖలో ట్రాన్స్ఫార్మర్లు(టీసీలు), స్తంభాలను అక్రమంగా విక్రయించుకొని రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడ్డారని మాన్వి జెస్కాం ఉద్యోగి గురురాజ్ నాయక్పై భార్య అమృత నాయక్ ఆరోపించారు. మంగళవారం మాన్వి జెస్కాం కార్యాలయం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. మాన్వి తాలూకా మద్లాపూర్లో జేఈగా విధులు నిర్వహిస్తున్న నాయక్ తన ఇష్టమొచ్చినట్లు విద్యుత్ పరికరాలు, యంత్రాలను అక్రమంగా అమ్ముకుంటూ పైఅధికారులకు మామూళ్లు ముట్టచెప్పడంతో వారు మౌనం వహించారని అన్నారు. 1800కు పైగా టీసీలను అక్రమంగా విక్రయించి ప్రభుత్వానికి, జెస్కాం కంపెనీకి మోసం చేశారన్నారు. విద్యుత్ శాఖలో టీసీల విక్రయాలలో రూ.కోట్లలో అక్రమాలు జరిగాయని జెస్కాం మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు ఫిర్యాదులు చేసినా విచారణ జరపకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
హుబ్లీ: స్థానిక గోకుల్ రోడ్డులోని అర్బన్ ఒయాసిస్ మాల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆ రోడ్డుపై కేబుల్ వైర్లు తెగిపడిన ఫలితంగా సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతులను తాజ్నగర్ నివాసులు ఫయాజ్(25), మోహిద్(27)గా గుర్తించారు. రోడ్డుపై అడ్డదిడ్డంగా కేబుల్ వైర్లు పడటం వల్లే ఈ ప్రమాదం వాటిల్లింది. బైక్ చక్రానికి సదరు వైరు చిక్కుకోవడంతో బైక్ అదుపు తప్పి కింద పడి తీవ్రంగా గాయపడటమే కాకుండా ఘటనాస్థలంలోనే మరణించారు. ఘటనపై హుబ్లీ ఉత్తర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చిరుత సంచారంతో కలకలంహొసపేటె: విజయనగర జిల్లా కమలాపురం సమీపంలోని హెచ్ఎల్సీ కాలువ వద్ద మంగళవారం చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. అక్కడ చిరుత సంచారాన్ని చూసిన పలువురు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అటవీ, పలువురు రెవెన్యూ అధికారులు చిరుత పులి పాదముద్రలను గుర్తించి, వాటిని పరిశీలించారు. సమీప ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసర గ్రామాల ప్రజలు పులి సంచారంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు తీరుస్తాం రాయచూరు రూరల్ : జిల్లాలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న జెస్కాం ఉద్యోగులు, సిబ్బంది సమస్యలపై స్పందిస్తామని కర్ణాటక విద్యుత్ మండలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలరాం హామీ ఇచ్చారు. సోమవారం జెస్కాం కార్యాలయంలో జరిగిన ప్రతిభా పురస్కార సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన పింఛన్ పథకం, కేపీసీ ప్రకారం పని భారం తగ్గింపు, సీ, డీ గ్రూప్ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. క్యాష్లెస్ ఆరోగ్య భాగ్య కార్డుల ద్వారా జెస్కాం ఉద్యోగుల కుటుంబానికి అవకాశం కల్పించడానికి ప్రామాణిక ప్రయత్నం చేస్తామన్నారు. విద్యార్ధుల ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. ఇటీవల మరణించిన మరిదేవ్ కుటుంబానికి ప్రమాద బీమా పథకం కింద రూ.కోటి చెక్ను అందించారు. గోపి, కార్తీక్, గురురాజ్లన్నారు. గండి మరమ్మతులు సత్వరం పూర్తి చేయాలిరాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువకు గండి పడిన చోట మరమ్మతు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొప్పళ తాలూకా బసాపుర వద్ద కాలువకు గండి పడిన పది రోజుల తర్వాత మంత్రుల పర్యటనలతో పనుల వేగవంతానికి అధికారులు శ్రీకారం చుట్టడాన్ని తప్పుబట్టారు. రాయచూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు తుంగభద్ర డ్యాం నుంచి కాలువ ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా బసాపుర వద్ద కాలువకు గండి పడడంతో నీరంతా వృథా అయిందన్నారు. 60 అడుగుల మేర పడిన కాలువ గండి పూడ్చడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. జొన్న కొనుగోలు కేంద్రాల్లో గందరగోళం నివారించాలన్నారు. టెన్త్ పరీక్షలకు 160 మంది గైర్హాజరు హుబ్లీ: హుబ్లీ నగర, గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ పరీక్ష కేంద్రాల్లో 10వ తరగతి సైన్స్ పరీక్షల కు 160 మంది గైర్హాజరయ్యారు. హుబ్లీ టౌన్ పరిధిలో 8,148, అలాగే హుబ్లీ గ్రామీణ భాగంలో 3,872 విద్యార్థులు పరీక్షల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో హుబ్లీ టౌన్ పరిధిలో 120, అలాగే గ్రామీణ భాగంలో 40 మంది విద్యార్థులు సైన్స్ పరీక్షకు హాజరు కాలేదని పాఠశాల విద్యా శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రపంచ శాంతికై బాహుబలికి విశేష పూజలు
బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని ప్రఖ్యాత శ్రావణ బెళగోళలో వింధ్యగిరిలో బాహుబలి గోమటేశ్వరుని విగ్రహం ముందు విశేష పూజలు నిర్వహించారు. ప్రముఖ జైన గురువులు పాల్గొని అనేక నైవేద్యాలను సమర్పించి పూజించారు. మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య భక్తులు బాహుబలి పాదాలకు కొబ్బరి నీరు, పండ్లరసాలు, కల్కచూర్ణం, పసుపు పొడి, కషాయం, ఔషధాలతో అభిషేకం నిర్వహించారు. రక్త చందనం, అష్టగంధం, కేసరి, శ్రీగంధంతో అభిషేకం చేసి, ప్రపంచ శాంతి కోసం మహాశాంతిధారణ చేశారు. బసవేశ్వరస్వామి రథోత్సవం తుమకూరు: సోంపుర ఫిర్కాలో సుప్రసిద్ధ నిడవంద గ్రామంలో వెలసిన శ్రీబసవేశ్వర స్వామి ఆలయం బ్రహ్మరథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తిని 40 అడుగుల ఎత్తైన తేరులో ఉంచి ఊరేగించారు. తేరును లాగగానే భక్తులు అరటిపండ్లు, దవనాన్ని విసిరారు. ఆదివారం రాత్రి వందలాది భక్తులు అగ్నిగుండంలో నడిచారు. స్థానికులు భక్తులకు చల్లని పానీయాలు, అన్నదానం సంతర్పణ చేశారు. దాబస్పేటె పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కొత్త స్నేహాల వైపు చూపు● సిలికాన్ సిటీలో డేటింగ్ యాప్లకు గిరాకీ సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీలో కొత్త కొత్త స్నేహాల కోసం పురుషులు, మహిళలు డేటింగ్ యాప్లను ఆశ్రయిస్తున్నారు. ఈ మేరకు ఓ డేటింగ్ యాప్ గణాంకాలను విడుదల చేసింది. డేటింగ్ యాప్ల వినియోగదారుల్లో సుమారు 65 శాతం మంది పురుషులు, 35 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిసింది. బెంగళూరులో ఈ ట్రెండ్ అధికంగా ఉండడం గమనార్హం. బెంగళూరు తరువాత హైదరాబాద్ వాసులు ఉన్నారు. గత రెండేళ్లలో ఈ అప్లికేషన్లో చేరుతున్న మహిళల సంఖ్య 148 శాతం పెరిగినట్లు తెలిసింది. ఇందులో వైద్యులు, చార్టెడ్ అకౌంటెంట్ వంటి ప్రొఫెషనల్స్ కూడా జోడు కోసం వెతుకులాడడం విశేషం. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు ఆధునిక సంబంధాల వైపు చూస్తున్నట్లు సామాజిక నిపుణులు తెలిపారు. యాప్ వాడకందారులు రోజులో ఒక గంటకు పైగా చాటింగ్లో గడుపుతున్నట్లు తెలిపారు. -
బెళగావిలో కుండపోత
● కలెక్టరేటులోకి వాననీళ్లు సాక్షి, బళ్లారి: బెళగావిలో భారీ కురిసింది. మంగళవారం సాయంత్రం వడగండ్లు, ఈదురు గాలలులతో కుండపోత కురవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎండలు, వేడి మాయమై చల్లని వాతావరణం ఏర్పడింది. అనేక రోడ్లతో పాటు జిల్లాఽధికారి కార్యాలయంలోకి నీరు పెద్ద ఎత్తున చేరడంతో రికార్డులు, కంప్యూటర్లు తడిసిపోయాయి. దీంతో కంప్యూటర్లు పనిచేస్తాయో లేదోనని అధికారులు చెబుతున్నారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. కొన్ని చోట్ల చెట్లు నేలకూలినట్లు స్థానికులు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ అకాల వర్షం కురిసింది. -
బెంగళూరులో వాహనదారులూ.. జాగ్రత్త
బనశంకరి: బెంగళూరులో ఇకనుంచి రోడ్ల పక్కన బైక్లు, కార్లు వంటి సొంత వాహనాలను నిలిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిబంధనలను మీరితే పోలీసులు వాటిని టోయింగ్ వాహనాలకు బిగించి తీసుకెళ్తారు. బుధవారం నుంచి నగరంలో నో పార్కింగ్ ఏరియాలలో వాహనాలను పార్కింగ్ చేస్తే జరిమానా తప్పదు. టోయింగ్ వ్యవస్థ మళ్లీ అమల్లోకి వస్తోంది. జీబీఏ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నగర రోడ్లలో నో పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపే వాహనాలను టోయింగ్ చేసి జరిమానా విధిస్తారు. దీంతో పాటు టోయింగ్ చేసే సమయంలో వాహనదారులు, పోలీసుల మధ్య గొడవలు జరిగే బెడద ఉంది. ఇకపై టోయింగ్ వాహనాల్లో కెమెరాలను అమరుస్తారు. దీనివల్ల వాహనాల తరలింపులో వాహనాలు దెబ్బతినడం, లేదా వివాదాలు జరగడం వంటివి రికార్డు అవుతాయి. పారదర్శకత ఉంటుందని అధికారులు చెప్పారు. టోయింగ్ ఫీజు రూ.1000 , నో పార్కింగ్ జరిమానా రూ వెయ్యి కలిపి రూ.2 వేలు జరిమానా చెల్లించాలి. గతంలో రద్దయి... గతంలో టోయింగ్ గురించి ప్రజల నుంచి పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వాహనాలు దెబ్బతినడం, అనవసరంగా జరిమానా విధించి తరలించడం చేస్తున్నారని జనం దుయ్యబట్టారు. దీంతో ప్రభుత్వం టోయింగ్ను నిలిపివేసింది. నేటి నుంచి టోయింగ్ ప్రక్రియ షురూ -
గ్యాస్, పెట్రోలు కోసం రద్దీ
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో అనేక ప్రాంతాల్లో ఇంటి గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఏజెన్సీల ముందు జనం క్యూలు కట్టారు. మంగళవారంనాడు లింగరాజపురలోని వినయ్ గ్యాస్ ఏజెన్సీ ముందు జనం కిలోమీటరు వరకూ నిలబడ్డారు. వారం రోజులుగా సిలిండర్ల సరఫరా లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మంత్రి మునియప్ప రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని చెబుతుంటే వాస్తవం అలా ఉండడం లేదు. ఏజెన్సీల ముందు గంటల తరబడి నిలబడినా సిలిండర్లు ఇవ్వడం లేదని పలువురు వాపోయారు. చిక్కమగళూరులోనూ తీవ్రంగా కొరత ఉంది. ఇక పెట్రోలు దొరకదని వదంతులు రావడంతో అనేక పట్టణాలలో వాహనదారులు బంకులకు రావడంతో కిటకిటలాడాయి.హిందూ ర్యాలీలో యత్నాల్ ఫైర్ మండ్య: 2028 నాటికి హిందూ కార్యకర్తలు అధికారం చేపడితే, కర్ణాటక అంతటా విప్లవం వచ్చే అవకాశం ఉందని హిందూ నేత, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే బసవరాజ్ పాటిల్ యత్నాల్ అన్నారు. జిల్లాలోని మద్దూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద హిందూ సంస్థలు నిర్వహించిన బలిదాన్ దివస్లో యత్నాల్ పాల్గొన్నారు. తాజ్మహల్ను నిర్మించిన వారు మన హీరోలయ్యారు, ఒక దొంగ కొడుకును నాయకుడంటూ చరిత్రను మలిచారని విమర్శించారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్సింగ్, వీర రాణి కిత్తూరు చెన్నమ్మ, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, స్వతంత్ర వీర సర్వకర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటివారు దేశం కోసం పోరాడి అమలరులయ్యారన్నారు. దేశంలో గాంధీ, నెహ్రూల శకం ముగిసింది, గాంధీజీ దేశానికి ఏమీ చేయలేదు. ఆయన ఖైదీగా జైలులో ఉన్నారు. గాంధీలో నాకు మహాత్ముని లక్షణాలు ఏవీ కనిపించలేదని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చెప్పేవారని యత్నాల్ అన్నారు. దేశవ్యాప్తంగా హిందువులపై అఘాయిత్యాలు, అణచివేతలు, సజీవ దహనం వంటి దురాగతాలు జరుగుతున్నాయని యత్నాల్ ఆరోపించారు. మద్దూరు స్ఫూర్తితో బీదర్లో హిందువుల ఐక్యత కోసం, హిందూ ప్రభుత్వం కోసం లక్షలాది మందిని సమీకరిస్తాను, పోరాటం చేస్తాను అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కెంకేరి విశ్వ ఒక్కలిగర మఠం అధ్యక్షుడు నిశ్చలానందనాథ్ స్వామిజీ, మైసూరు ఎస్.బి. నిత్యానంద, మాజీ ఎంపీ అనంత్కుమార్ హెగ్డే సహా పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొక్కిసలాట మృతులకు మ్యాచ్ వేళ నివాళులుశివాజీనగర: ఈ నెలాఖరులో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ– హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కొన్ని నెలల కిందట ఆర్సీబీ విజయోత్సవాలలో ఇదే స్టేడియంలో తొక్కిసలాట జరిగి 11 మంది పౌరులు చనిపోవడం తెలిసిందే. మృతులకు ఈ టోర్నీలో గౌరవం సమర్పిస్తారు. మ్యాచ్కు ముందు 11 మంది పేర్లను తెరపై ప్రదర్శించి, ఆటగాళ్లు, ప్రేక్షకులు ఒక నిమిషం మౌనం పాటిస్తారు. స్టేడియంలో ప్రీమియం స్టాండ్లో 11 సీట్లను ఖాళీగా ఉంచుతారు. ఆ సీట్లకు ఏ మ్యాచ్లనూ టికెట్లు ఇవ్వరని స్టేడియం వర్గాలు తెలిపాయి. మృతుల జ్ఞాపకార్థం స్టేడియంలో ఓ స్మారక నిర్మాణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. టికెట్ల అమ్మకాల నుంచి మ్యాచ్ ముగిసేవరకు రద్దీ నియంత్రణకు గట్టి చర్యలు చేపడతామని క్రికెట్ సంఘం అధికారులు చెప్పారు. మైనర్ల లవ్ జిహాద్ చిచ్చు యశవంతపుర: మైనర్ల ప్రేమ గొడవ చిచ్చు రేపుతోంది. ఇంటర్ అబ్బాయి, టెన్త్ అమ్మాయి ప్రేమ వ్యవహారం లవ్ జిహాద్గా మారి పోలీసుస్టేషన్కు చేరిన ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక గ్రామానికి చెందిన విద్యార్థి, మూడిగెరె పట్టణ బాలికకు మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరిద్దరివీ వేర్వేరు మతాలు, ఇది లవ్ జిహాద్ అని హిందూ సంఘాల నాయకులు అరోపిస్తున్నారు. ఆ అబ్బాయిని వారు మందలించారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. దేవేగౌడకు సర్కారు ఖరీదైన కారుయశవంతపుర: రాజ్యసభ సభ్యుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ రాష్ట్రంలో పర్యటించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖరీదైన ఓల్వో కారును సమకూర్చింది. ఈ వాహనం ఖరీదు రూ.1.25 కోట్లు అని మంత్రి కృష్ణబైరేగౌడ తెలిపారు. దేవేగౌడ, ఆయన కుటుంబంతో కాంగ్రెస్ సర్కారుకు వైరం ఉండడం తెలిసిందే. తరచూ ఆరోపణలు చేసుకుంటారు. కానీ కారు విషయంలో ఉదారంగా వ్యవహరించింది. లంబోర్గిని కేసులో విచారణ యశవంతపుర: బెంగళూరు ఎంజీ రోడ్డులో లంబోర్గిని కారుతో డ్రిఫ్టింగ్ చేసిన కేసులో కారు నడిపిన రిక్కీ రై కబ్బన్ పార్క్ ఠాణాలో విచారణకు హాజరయ్యాడు. బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పినట్లు పోలీసులకు చెప్పాడు. ఆయన లాయరు నారాయణస్వామి సృజనాత్మకంగా డ్రైవింగ్ చేయడంతో అలా జరిగిందని చెప్పారు. అయితే సృజనశీలత ప్రదర్శనకు ట్రాఫిక్ సిగ్నల్ వేదిక కాదంటూ పోలీసులు ఓ పోస్టు పెట్టారు. -
రూ.3.80 కోట్ల డ్రగ్స్ సీజ్
కృష్ణరాజపురం: చాక్లెట్ల కవర్లలో డ్రగ్స్ను ఉంచి అమ్ముతున్న విక్రేతను బెంగళూరు కృష్ణరాజపురం పోలీసులు పట్టుకున్నారు. బీదర్కు చెందిన కిరణ్ కాంబ్లె (28) ఢిల్లీ నుంచి డ్రగ్స్ను తెప్పించి సిలికాన్ సిటీలో విక్రయిస్తుండేవాడు. ఉప్పారపేటె పోలీసు స్టేషన్ పరిధిలోని గాంధీనగర్లో ఓ వ్యక్తికి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పోలీసులు దాడి చేసి కిరణ్ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.3.80 కోట్ల విలువ చేసే 3.9 కేజీల ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనంబెంగళూరులో ఐదుమంది విక్రేతల అరెస్టు బనశంకరి: రాజధానిలో ఎండీఎంఏ, గంజాయి వంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ఐదుమంది డ్రగ్ పెడ్లర్లను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.7.4 కోట్ల విలువచేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. ఆయన డ్రగ్స్ను పరిశీలించి మాట్లాడారు. 343 కేజీల గంజాయి బస్తాలు, గూడ్స్ వ్యాన్ తదితరాలను సీజ్ చేశారు. మైసూరు రోడ్డులోని నాయండహళ్లి సిగ్నల్ వద్ద, ఉప్పారపేటే ఆర్కే.పురం లాడ్జీలో, చెన్నసంద్ర మెయిన్రోడ్డులో డ్రగ్స్ను అమ్ముతుండగా పట్టుకున్నారు. విదేశాలకు చెందిన గుర్తుతెలియని వ్యక్తి నుంచి మత్తు పదార్థాలను తెప్పించేవారు. తక్కువ ధరతో కొనుగోలుచేసి ప్రజలకు, కాలేజీ విద్యార్థులకు విక్రయించేవారు. -
27 కాదు.. 26నే అసెంబ్లీ ముగింపు
శివాజీనగర: అభివృద్ధి అంటూ ప్రకటించబడిన బ్రాండ్ బెంగళూరుకు విరుద్ధంగా నగరంలో ఈ–ఖాతా వ్యవస్థలో అవినీతి, అక్రమాలు అధికమయ్యాయి, పాలికె అధికారుల లంచం దందా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని విధానసభలో బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. మంగళవారం విధానసభలో బెంగళూరు సమస్యలపై ఆయన మాట్లాడారు. ‘మా ప్రభుత్వంలో లంచం తీసుకొన్న ఒక్కరినైనా చూపించండి అని డీసీఎం డీ.కే.శివకుమార్ సవాల్ చేసిన వీడియో ప్రచారమవుతోంది, హెచ్బీఆర్ లేఔట్లో ఓ భవన యజమాని ఖాతా కోసం వెళ్లగా, ఇది ఏ– ఖాతా కాలేదు, బీ–ఖాతా చేయాలని అధికారులు చెప్పారు, చివరకు రూ.30 వేల లంచం అడిగారు. అధికారికి ఫోన్ పేలో రూ.15,000 లంచం పంపించారు. అయితే దరఖాస్తును జిల్లాధికారి తిరస్కరించారు. మళ్లీ రెండోసారి రూ.20,000 లంచం ఇచ్చారు. పని జరగలేదు, లంచం డబ్బు వెనక్కి వ్వాలని కోరగా అధికారి ఇవ్వలేదు’ అని అశోక్ పలు ఉదాహరణలను వివరించారు. ఆఫీసులోనే వసూళ్ల దందా దేవనహళ్లిలో ఈ–ఖాతా చేయించేందుకు రూ.50 వేల లంచం తీసుకొంటున్నారు. నంజుండప్ప అనే రిటైర్డ్ అధికారి కార్యాలయంలో మకాం వేసి ఖాతా చేసేందుకు రూ, 30, 40 వేల లంచం వసూలు చేస్తున్నారు. ప్రతి వార్డులో ఇటువంటి దందా జరుగుతోందని అశోక్ ఆరోపించారు. ఇంటికి కుమారుడు సక్రమంగా పన్ను చెల్లిస్తున్నా కూడా తండ్రికి నోటీసులు పంపించారు, వేలం వేస్తామని బెదిరించారని ఆరోపించారు. ఇలా అన్నిచోట్లా ఖాతా మాఫియా ఉంది, నా ఆఫీసుకు ఎంతోమంది వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. కర్ణాటకలో 65 శాతం ఆదాయం బెంగళూరు నుంచి వస్తుంది, సౌలభ్యాలు లేవని అనేక కంపెనీలు నగరాన్ని వదులుతున్నాయి, చెత్త రాశులు, గుంతల రోడ్ల సమస్యలున్నాయి. ఉప ముఖ్యమంత్రి అనేకసార్లు నగర ప్రదక్షిణ చేసినా గుంతల రోడ్లు బాగుచేయలేదు, స్కూటర్ల నుంచి బస్సుల కిందపడి అనేక మంది మరణించారన్నారు. డంపింగ్ యార్డ్ లేదు చెత్త సమస్య నివారణకు డంపింగ్ యార్డ్ నిర్మిస్తామని మూడేళ్ల కింద చెప్పినా ఆ పని జగరలేదని అశోక్ ఆరోపించారు. నేడు నగరంలో వెయ్యి టన్నుల చెత్త డంపింగ్ యార్డ్కు వెళ్లకుండా నిలిచిపోయిందన్నారు. జీబీఏలో అన్ని విభాగాల్లో తీవ్రంగా అధికారుల కొరత ఉందని చెప్పారు. నగరంలో నీటి ట్యాంకర్ మాఫియా అధికమైందని అన్నారు. ఉద్యోగుల ప్రమోషన్కు షరతులు శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రమోషన్ను పొందాలంటే నిర్ధారించిన శిక్షణను పూర్తి చేయాలి. ఇది గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోలులకు వర్తిస్తుంది. పదోన్నతి పొందేందుకు నిర్ధారించిన ట్రైనింగ్ను పూర్తిచేయడం అదనపు అర్హత అయిఉంటుంది. రిటైర్మెంట్కు రెండేళ్లు ఉన్న ఉద్యోగులకు ఈ షరతును మినహాయించారు. వయనాడుకు సాయంపై ప్రతిపక్షాల భగ్గు శివాజీనగర: కేరళలోని వయనాడులో వరదలు, కొండచరియలు విరిగిన దుర్ఘటనలో బాధితులకు కర్ణాటక ప్రభుత్వం రూ.10 కోట్ల సాయం చేయడంపై ప్రతిపక్షాలు బీజేపీ, జేడీఎస్ భగ్గుమన్నాయి. రెండేళ్ల కిందట ప్రకృతి విపత్తు వల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరగడం తెలిసిందే. అప్పట్లో రూ.10 కోట్ల సాయాన్ని ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు మరో రూ.10 కోట్ల కేటాయించింది. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉపాధ్యాయులు, అంగన్వాడి కార్యకర్తలు, చిరుద్యోగులకు జీతాలు ఇవ్వలేని సర్కారు, కాంగ్రెస్ హైకమాండ్ను సంతోషపరిచేందుకు కేరళకు నిధులు ఇస్తోందని దుయ్యబట్టాయి. ఇది కన్నడిగులకు ద్రోహం చేయడమేనని ఆరోపించారు. పశ్చిమ ద్వారం ప్రారంభోత్సవంలో సీఎం, డీసీఎం, సభాపతులు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో విద్యార్థుల సంబరం ● ఉప ఎన్నికల వల్లనే: సభాపతి శివాజీనగర: ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 27న కాకుండా, 26నే ముగించనున్నట్లు స్పీకర్ యూ.టీ.ఖాదర్ మంగళవారం విధానసభలో ప్రకటించారు. బడ్జెట్పై చర్చ పూర్తయింది, బుధవారం సీఎం సిద్దరామయ్య బడ్జెట్పై చర్చకు సమాధానం ఇస్తారని తెలిపారు. సమావేశాలను ఒక రోజు తగ్గించాలని సలహా కమిటీ భేటీలో నిర్ణయించినట్లు చెప్పారు. దావణగెరె దక్షిణ, బాగల్కోటె అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు రావడంతో నాయకులు ప్రచారానికి వెళుతున్నందున అసెంబ్లీని ముందే ముగిస్తున్నట్లు సభాపతి తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యేలు కూడా ఆమోదం తెలిపారు. పశ్చిమ ద్వారం షురూ కాగా, మంగళవారం అసెంబ్లీలో పలు కార్యక్రమాలు జరిగాయి. కొత్త హంగులు అద్దిన విధానసౌధ భవనం పశ్చిమ ద్వారాన్ని సీఎం సిద్దరామయ్య, డీసీఎం శివకుమార్, సభాపతులు, మంత్రులు ప్రారంభించారు. పదవీ కాలం పూర్తవుతున్న ఎమ్మెల్సీలతో గ్రూప్ ఫోటో తీసుకున్నారు. బెంగళూరులో ఖాతాల అవినీతి విధానసభలో బీజేపీ నేత అశోక్ ఆరోపణ -
వెంటాడుతున్న లెప్టోస్పిరోసిస్
శివాజీనగర: రాష్ట్రంలో లెప్టో స్పిరోసిస్ జ్వరం కేసులు గత ఐదు సంవత్సరాల్లో ఆందోళనకర రీతిలో అధికమయ్యాయి. 16 వేలకు పైగా కేసులు నమోదు కాగా సుమారు 30 మంది దాని ప్రభావంతో మరణించారు. ఏటేటా వ్యాప్తి పెరుగుతోందే తప్ప తగ్గకపోవడం వైద్య ఆరోగ్య అధికారులను కలవరపరుస్తోంది. ఏ ఏడాది ఎంతమందికి? 2020లో 544 కేసులు నమోదు కాగా, 2021లో 906 మందికి సోకింది. 2022లో 3,174 మంది, 2023లో 5,404 మంది, 2024లో 5,088 మంది ఈ జబ్బు బారినపడ్డారు. 2025లో ఈ సంఖ్య 6,525కు పెరిగింది. గత ఏడాదిలో ఏకంగా 19 మంది దీని కాటుకు ప్రాణాలు వదిలారు. లెప్టో స్పిరోసిస్ అంటే ఏమిటి? లెప్టోస్పిరోసిస్ అనేది జంతువులు, ముఖ్యంగా ఎలుకల ద్వారా వ్యాపించే ప్రమాదకరమైన బ్యాక్టీరియా. వాటి మలమూత్రాల వల్ల మలినమైన నీరు, ప్రదేశం ద్వారా మనుషులకు సోకుతుంది. మొదట్లో మామూలు జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయి, దీనివల్ల డెంగీ, లేదా మలేరియా జ్వరమని వైద్యులు పొరబడే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. లక్షాలు ఇలా ఉంటాయి బ్యాక్టీరియా సోకిన తరువాత 2 నుంచి 14 రోజుల మధ్య లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, తీవ్ర తొలనొప్పి, ఒళ్లునొప్పులు, చలి లేదా వణుకు, వాంతులు, నీరసం, కళ్లు ఎర్రగా కావడం, కడుపు నొప్పి, విరేచనాలు వంటివి బాధిస్తాయి. చికిత్స లభించని పక్షంలో సమస్య తీవ్రమవుతుంది. కాలేయం, మూత్రపిండాల వైఫల్యం, శ్వాశకోస సమస్య, మెదడు లోపల రక్తస్రావం వంటివి కూడా సంభవిస్తాయని వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో ఏటేటా కేసుల పెరుగుదల గతేడాది 6 వేల మందికి పరిశుభ్రతతోనే పరిష్కారం ఎలా అరికట్టవచ్చు వాననీటిలో, కలుషిత నీటిలో చెప్పులు లేకుండా నడవరాదు. ఇంటిలో చెత్త, మట్టి పనులు చేశాక చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల శుభ్రతను కాపాడుకోవాలి, ఎలుకలను అరికట్టాలి, వాటిద్వారానే ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. పరిశుభ్రమైన నీటినే తాగాలి. లెప్టో స్పిరోసిస్ నిర్ధారణకు ల్యాబ్ పరీక్షలు అవసరం. జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులతో చికిత్స చేయించుకోవాలి. -
మోకాలిని చితక్కొట్టిన ఖాకీలు
కర్ణాటక: ఉగాది పండుగ రోజున ఇస్పేటు ఆడుతున్న వందలాది మందిపై పోలీసులు దాడి చేసి ఓ వ్యక్తి మోకాలు ముక్కలయ్యేలా కొట్టారు, దీంతో బాధితుని కుటుంబం, గ్రామస్తులు పోలీసులపై ఫిర్యాదు చేశారు. వివరాలు.. మండ్య తాలూకాలోని కాలెనహళ్లి గ్రామానికి చెందిన కేసీ గిరీష్ బాధితుడు, 19వ తేదీ సాయంత్రం మండ్య రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రసూల్సాబ్ గౌండి, సిబ్బంది ధనంజ, ప్రకాష్" కుమార్ దాడి చేసి లాఠీతో అతని మోకాలి చిప్పను పగలగొట్టారు. ఇస్పేటు ఆడుతున్న జనాలపైకి యూనిఫామ్లు ధరించకుండా ప్రైవేట్ వాహనంలో వచ్చిన పోలీసులు దాడిచేసి ఇష్టానుసారం చితకబాదారు. గిరీష్ మోకాలి చిప్ప పగిలిపోయిందని, మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి్పంచామని అతని కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపారు. ఎస్ఐ రసూల్, ఇతర పోలీసులను సస్పెండ్ చేసి కేసు పెట్టాలి, తమకు వైద్యఖర్చులను అందజేయాలని మండ్య రూరల్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
1 నుంచి టోల్ గేట్ చార్జీల పెంపు!
బెంగళూరు: ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో టోల్ గేట్ చార్జీలు పెరగనుండటంతో వాహన యజమానులు, డ్రైవర్ల జేబుకు రంధ్రం పడనుంది. ప్రతి ఏడాది తరహాలో ఈసారి 3 నుంచి 5 శాతం మేర టోల్ రుసుము పెరగనుంది. రాష్ట్రంలోని 9 జాతీయ రహదారుల్లో టోల్ గేట్లలో ఇది వర్తిస్తుంది. మైసూరు–బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ప్రయాణం మరింత వ్యయం కానుంది. జాతీయ హైవే అథారిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత రెండేళ్లుగా ఏటా టోల్ పెంచుతూ ఉన్నారు. ఇప్పటికే ఎన్హెచ్ఐఏ ఏప్రిల్ 1 నుంచి వర్తించేలా ఫాస్ట్ట్యాగ్ పాస్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో హైవేలలో సొంత వాహనాలలో ప్రయాణ ఖర్చు పెరగనుంది. -
రెండు ఆటోలు పల్టీ.. యువతి మృతి
హొసపేటె: హిరేబెణకల్ సమీపంలోని వరి పొలంలో సోమవారం సాయంత్రం రెండు ఆటోలు అదుపు తప్పి బోల్తా పడటంతో ఓ మహిళ మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతురాలిని ఇక్కడి మహబూబ్ నగర్లోని జెండాకట్ట ప్రాంతానికి చెందిన రేష్మా(24)గా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ఇక్కడి సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అయేషా, మినియాజ్ అనే ఇద్దరితో సహా నలుగురిని తదుపరి చికిత్స కోసం బళ్లారి ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. 20 మందికి పైగా గాయాలు -
వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేయాలి
సాక్షి,బళ్లారి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి నగరంతో పాటు జిల్లాలోని అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం నగరంలోని తన నివాస గృహ కార్యాలయంలో బీజేపీ నూతన కార్యవర్గం ఎంపిక, నియామక పత్రాలను సంబంధితులకు అందజేసి మాట్లాడారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులు కట్టబెడతామన్నారు. పార్టీ కోసం ఎవరెంత పని చేశారన్నది ప్రతి ఒక్కరి చిట్టా పార్టీ పెద్దల వద్ద ఉంటుందన్నారు. సామాన్య వ్యక్తిని సైతం అందలం ఎక్కించే పార్టీ బీజేపీ అన్నారు. నూతనంగా పార్టీ బాధ్యతలు తీసుకున్న పదాధికారులు నగరంలో బూత్ స్థాయి నుంచి ప్రతి వార్డులో పార్టీని బలపరచాలన్నారు. సంక్షేమాన్ని ప్రజల దరిచేర్చాలి కేంద్రంలో బీజేపీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు. పార్టీలో పదవులు తీసుకున్న వారు ఆయా వార్డులు, బూత్ల్లో పార్టీ సభ్యత్వ నమోదును కూడా పెంచాలన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులను సమష్టిగా ముందుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాటుపడాలన్నారు. కాంగ్రెస్ పార్టీపై జనం విసిగిపోతున్నారన్నారు. మాజీ మేయర్, నగర బీజేపీ అధ్యక్షుడు గుర్రం వెంకటరమణ, పాలికె ప్రతిపక్ష నాయకుడు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీని మరింతగా బలోపేతం చేయాలి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పిలుపు -
సంఘ సంస్కర్త దేవర దాసిమయ్య
సాక్షి,బళ్లారి: నాడు సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న అసమానతలు, కులవివక్షపై పోరాటం చేయడంతో పాటు ఆధ్యాత్మిక, భక్తిమార్గంలో పయనిస్తూ, శివభక్తిని జనంలో పెంపొందించడానికి దేవర దాసిమయ్య ఎంతో కృషి చేశారని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోమవారం దేవర దాసిమయ్య జయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం రోడ్డులోని కల్చరల్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన దేవర దాసిమయ్య జయంతిని నగర మేయర్ గాదెప్ప, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు, జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అవ్వార మంజునాథ తదితరులు పాల్గొని ప్రారంభించి మాట్లాడారు. చేనేత సమాజంలో సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. జిల్లా నేకార సంఘం అధ్యక్షుడు దేవానంద, నేకార సమాజ ప్రముఖులు ఎల్ఐసీ రాజు, చంద్రశేఖర్, ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్ పన్నారాజ్, మాజీ కార్పొరేటర్ సుధాకర్ దేశాయి, డీసీసీ మహిళా అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు. విజయనగరలో.. హొసపేటె: నగరంలోని నీలకంఠ దేవస్థానంలో తాలూకా నేకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం దేవర దాసిమయ్య జయంతిని నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు హంపీ నుంచి జ్యోతిని తెచ్చారు. ఈ వేడుకల్లో దేవర దాసిమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ 12వ శతాబ్దపు సన్యాసి, వచన రచయిత, బసవేశ్వరుని సీనియర్ సమకాలీకుడైన దేవర దాసిమయ్య సమానత్వం, శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి రాసిన 176 వచనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సమాజ ప్రముఖులు కాశీ విశ్వనాథ్, విజయకుమార్, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: నగరంలో దేవర దాసిమయ్య జయంతిని ఆచరించారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన జయంతిని పురస్కరించుకుని దేవర దాసిమయ్య చిత్రపటానికి తహసీల్దార్ సురేష్ వర్మ పూలమాలలు వేశారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జ్యోతి వెలిగించి ఏడీసీ శివానంద, సమాజం అధ్యక్షులు, ఇతరులున్నారు. కులవివక్ష, అసమానతలపై పోరాటం వచనాలు, బోధనలతో జనానికి చైతన్యం జయంత్యుత్సవంలో పలువురు వక్తలు -
వైభవంగా రాచోటి శివాచార్య ఉత్సవాలు
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా అత్తనూరులో సోమవారం రాచోటి శివాచార్య 22వ వర్థంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సోమవార పేట హిరేమఠ బృహన్మఠాధిపతి అభినవ రాచోటి వీర శివాచార్యులు ఊరేగింపునకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. గ్రామంలో తాగునీటి కోసం బావి, చెరువులు తవ్వించి దాహార్తిని తీర్చారన్నారు. హిందూ సామ్రాజ్య స్థాపనకు నడుం బిగించిన మహా స్వామి రాచోటి శివాచార్య అన్నారు. సామూహిక వివాహాల్లో 25 నవ జంటలకు ఆశీస్సులు పలికారు. శాంతమల్ల శివాచార్య, వీర సంగమేశ్వర, నవలకల్ స్వామీజీ, మహంతేష్ పాటిల్, గిరిజా శంకర్, బుడ్డనగౌడ, చంద్రశేఖర్లున్నారు. ఆస్తుల కబ్జాపై కేసులు పెట్టాలిరాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా అరోలిలో ఉన్న మఠం ఆస్తులు కబళించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని దళిత సంఘాల జిల్లా సమితి సంచాలకుడు నరసింహులు డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అరోలిలో సర్వే నంబర్–175లో 16.5 ఎకరాల భూమికి నకిలీ రికార్డులు సృష్టించి భూములను ఆక్రమించారన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం జగద్గురు చెన్నబసవ రాజేంద్ర స్వామీజీకి చెందిన భూములను భీమణ్ణకు గుత్తాధిపత్యం ఇచ్చారన్నారు. సిద్దనగౌడ తండ్రి బసిరెడ్డి, అక్కలు, చెల్లెళ్ల పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారన్నారు. మఠం ఆస్తులను కబళించిన, ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. ఆంజనేయ, హనుమేష్, మంజునాథ్, భీమన్న, రామమూర్తి, జంబయ్య, నాగేంద్ర, సురేష్, శ్రీనివాస్లున్నారు. అంగన్వాడీ కార్యకర్తలను పర్మినెంట్ చేయాలిరాయచూరు రూరల్: అంగన్వాడీ కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను బంద్ చేిసి సోమవారం బెంగళూరు ఫ్రీడం పార్కులో ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీ్త్రశిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారిని పర్మినెంట్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు. ఎల్కేజీ, యూకేజీ పాఠశాలలను అంగన్వాడీలకు కేటాయించాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో వేతనాలు పెంచాలని ఒత్తిడి చేశారు. రిజర్వేషన్లకు మద్దతివ్వాలని హితవురాయచూరు రూరల్: రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్పను మాజీ మంత్రి శివనగౌడ నాయక్ అవమానించలేదని, రిజర్వేషన్లకు మద్దతు పలకాలని మంత్రికి హితవు పలికారని నాయక్ సమాజ సంచాలకుడు రంగనాథ్ పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల దావణగెరెలో జరిగిన ఎస్సీ, ఎస్టీ నాయకుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ రిజర్వేషన్ల అమలులో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారన్నారు. మంత్రి మహదేవప్ప మంత్రివర్గంలో ఉంటూ కాలయాపన చేయకుండా అందరికీ సమ న్యాయం చేయాలని చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. లాలెప్ప నాయక్, రవి కుమార్, రాజశేఖర్, అరుణ్, వెంకటేష్లున్నారు. రిజర్వేషన్ ఇచ్చేవరకు నియామకాలు వద్దు రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేసి, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ కొలువుల్లో నియామకాలకు అవకాశం కల్పించరాదని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహేంద్ర కుమార్ మిత్ర పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపులు జరుగుతాయని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 56 శాతం రిజర్వేషన్లు దాటితే ఉద్యోగాల్లో నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 1995లో కోర్టు ఆదేశాల జారీ చేసిన 50 శాతం మేరకే ఉద్యోగాలు ఇవ్వాలని, కుల ధ్రువీకరణ పత్రాలను అందించాలని కోరారు. -
సిలిండర్ల కొరత నివారించండి
బళ్లారిఅర్బన్: జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సమస్య తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో జిల్లా వాణిజ్య పారిశ్రామిక సంస్థ ఆధ్వర్యంలో హోటల్, బేకరీ యజమానుల సంఘం సోమవారం అదనపు జిల్లాధికారికి వినతిపత్రాన్ని అందించారు. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అవ్వారు మంజునాథ్, గౌరవ కార్యదర్శి కేసీ సురేష్బాబు సమక్షంలో హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు విక్రమ్ పోలా తదితరులు మాట్లాడారు. హోటళ్లు, బేకరీలకు అవసరమైన ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను పెంచాలని కోరారు. పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. దీని ప్రభావం హోటల్, బేకరీ తదితర వ్యాపారాలపై తీవ్రంగా పడిందన్నారు. ఆయా రంగాలపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల జీవనోపాధి దెబ్బ తింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంయుక్త కార్యదర్శి మర్చేడ్ మల్లికార్జునగౌడ్, సంఘం ప్రతినిధులు, హోటల్ యజమానులు పాల్గొన్నారు. -
అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్సీ మృతి
రాయచూరు రూరల్: మాజీ ఎమ్మెల్సీ, కొప్పళ జెడ్పీ మాజీ అధ్యక్షుడు కరియణ్ణ సంగటి(61) అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో మరణించారు. కొప్పళ తాలూకా యలమగేరిలో మంగళవారం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయి. కరియణ్ణ 1998లో కొప్పళ జిల్లా పంచాయతీ అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు ఆప్తుడిగా ఉండడంతో 2000లో ఆయనను ఎమ్మెల్సీగా నియమించారు. 2008లో కొప్పళ నుంచి ఇండిపెండెంట్గా, 2018లో గంగావతి నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2023 ఎన్నికల్లో జనార్దనరెడ్డి తరపున ప్రచారం చేసి ఆయన విజయానికి సహకరించారు. ఉమ్మడి రాయచూరు జిల్లాలో 1982 నుంచి సేవాదళ్ కార్యకర్తగా, 1985–89 వరకు కొప్పళ తాలూకా యువజన కాంగ్రెస్ నాయకుడిగా పని చేశారు. కాగా కరియణ్ణ సంగటి మృతదేహానికి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. దోపిడీ వ్యవస్థ మార్పే భగత్సింగ్ కల హొసపేటె: దోపిడీ వ్యవస్థను మార్చి భగత్సింగ్ దేశ ప్రజలకు నూతన సామ్యవాద వ్యవస్థను అందించారని ఏఐడీవైఓ నిర్వాహకుడు మరబ్బిహాళ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పట్టణంలోని శాంతినికేతన్ ఐటీఐ కళాశాల, గ్రంథాలయం సమీపంలో స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయ విప్లవకారులు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల అమరత్వ దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధులందరూ విప్లవకారులు కారు. పోరాట యోధుల లక్ష్యం భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని తొలగించడమేనని అన్నారు. ఏఐడీవైఓ ఆర్గనైజర్ జిల్లా సభ్యుడు ప్రకాష్ బసవనదుర్గ మాట్లాడుతూ నేటి యువత భగత్సింగ్ ఆదర్శాలను అనుసరించాలన్నారు. పోరాట సంఘం నేతలు పాల్గొన్నారు. రాయచూరు రూరల్: భగత్సింగ్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సంచాలకుడు శరణప్ప పేర్కొన్నారు. ఏఐడీవైఓ, ఏఐడీఎస్ఓ, ఏఐఎంఎస్ఎస్ల ఆధ్వర్యంలో సోమవారం భగత్సింగ్ సర్కిల్ వద్ద భగత్సింగ్ ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. భగత్సింగ్ ఆశలు, ఆశయాలు, ఆదర్శాలను పుణికి పుచ్చుకోవాలన్నారు. ఈ సఽందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. సరోజ, చెన్నబసవ తదితరులున్నారు. గర్భకోశ క్యాన్సర్ నివారణకు టీకాల పంపిణీహుబ్లీ: చిన్నారులు, మహిళలను గర్భకోశ క్యాన్సర్ రూపంలో కబళిస్తున్న సదరు మహ్మమారి కట్టడికి ప్రభుత్వం టీకాల రూపంలో తగిన చర్యలు తీసుకుంటోందని డీఎంహెచ్ఓ డాక్టర్ హొనకేరి తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఈ వ్యాధి రెండవ స్థానంలో ఉందని, అందువల్ల వ్యాధి కట్టడికి పరిణామాత్మక హెచ్పీవీ టీకా మార్కెట్లో ప్రియం అయినా కూడా ప్రభుత్వం పేద మహిళలందరికీ లభించాలన్న ఉద్దేశంతో తగిన చర్యలు చేపట్టిందన్నారు. 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలకు ఉచితంగా టీకాలు ఇస్తారన్నారు. ప్రతి బాలికకు సదరు టీకా ఒక్క డోస్ మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం సూచించిందన్నారు. జిల్లా కుటుంబ సంక్షేమ శాఖ ఆరోగ్య శాఖ ఈ మేరకు జిల్లా, తాలూకా, ప్రాథమిక, కమ్యూనిటీ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో టీకాలను అందుబాటులో ఉంచిందన్నారు. -
సర్కిల్లో అంబేడ్కర్ ప్రతిమ ఏర్పాటు చేయండి
బళ్లారి అర్బన్: నగరంలోని ప్రధాన సర్కిల్లో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళిత సంఘాల నాయకులు జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని కొత్త జిల్లాధికారి కార్యాలయంలో బాబు జగ్జీవన్ రాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ముందస్తు సన్నాహాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. వాల్మీకి సర్కిల్లో వాల్మీకి ప్రతిమను ఏర్పాటు చేసినట్లుగానే ప్రధాన సర్కిల్లో అంబేడ్కర్ ప్రతిమను కూడా ఏర్పాటు చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కొందరు మోతీ సర్కిల్ మధ్య భాగంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. తాళూరు రోడ్డు సర్కిల్లో పెట్టండి మరి కొందరు తాళూరు రోడ్డుకు అంబేడ్కర్ పేరు పెట్టి ఆ సర్కిల్లో అంబేడ్కర్ ప్రతిమను ప్రతిష్టించాలని కోరారు. దీనిపై ప్రతిపాదనలు అందజేస్తే ప్రభుత్వానికి పంపిస్తామని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 5న హరిత విప్లవ నేత బాబూ జగ్జీవన్ రాం జయంతిని కూడా డాక్టర్ జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో ఏడీసీ మహ్మద్ జుబేర్, మున్సిపల్ కమిషనర్ మంజునాథ్, జిల్లా అంబేడ్కర్ సంఘం ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కమర్షియల్ గ్యాస్ సరఫరాకు చర్యలు
బనశంకరి: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం వల్ల కమర్షియల్ సిలిండర్లకు కొరత ఏర్పడింది, కర్ణాటకకు నిత్యం 10 వేల సిలిండర్లు సరఫరా చేయడానికి రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుందని, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్.మునియప్ప తెలిపారు. గ్యాస్ సమస్యపై సోమవారం తమ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత వారం వెయ్యి సిలిండర్లను హోటల్స్ కు అందించామని ప్రస్తుతం హోటల్, డాబా, హాస్టళ్లు, ఇందిరా క్యాంటీన్, ఆసుపత్రులకు సరఫరా చేయడానికి ప్రతి నిత్యం 10 వేల కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేస్తామని తెలిపారు. నమోదు తప్పనిసరి కమర్షియల్ వినియోగదారులు వచ్చే శనివారంలోగా గ్యాస్ కంపెనీల వద్ద తప్పనిసరిగా వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకోకపోతే వాణిజ్యానికి వినియోగించే సిలిండర్లు లభించవని మంత్రి తెలిపారు. ఎవరు ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు అనే సమాచారం ఉండాలన్నారు. హోటల్ యజమానులకు కరెంటు బిల్లులను తగ్గించే విషయం తమ దృష్టికి రాలేదని, దీనిపై సీఎం సిద్దరామయ్యతో చర్చిస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిత్యం రాష్ట్రానికి 10 వేల సిలిండర్లు అందిస్తుందని మంత్రి తెలిపారు. అదనంగా 20 శాతం సిలిండర్లు ఇస్తామని తెలిపిందన్నారు. కేంద్రం నుంచి రోజూ 10 వేల సిలిండర్లు పౌరసరఫరాల మంత్రి మునియప్ప -
ప్రభుత్వానికి నా బలం చూపిస్తా: రేవణ్ణ
శివాజీనగర: అత్యధిక బడ్జెట్సార్లు బడ్జెట్ను సమర్పించి రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య అత్యధిక అప్పులు చేసిన సీఎం కూడా అయ్యారు అని బీజేపీ ఎమ్మెల్యే సునీల్కుమార్ విధానసభలో ఆరోపించారు. రెండురోజుల విరామం తరువాత సోమవారం అసెంబ్లీ సమావేశాలు ఆరంభమయ్యాయి. ఆర్థిక పరిస్థితి మీద ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. బడ్జెట్పై చర్చలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్, సిద్దరామయ్య ప్రభుత్వం వచ్చాక రూ. 1.32 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఇదో రికార్డు, అంతే కాకుండా అధిక సమస్యలను సృష్టించిన సీఎం కూడా ఆయనే అని ఆరోపించారు. బడ్జెట్లో 56 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. అయితే అందుకు నిఽధులను కేటాయించలేదు, దీనిని బట్టి ఉద్యోగాల భర్తీ అనేది అబద్ధమన్నారు. ధర్నాలు చేసిన నిరుద్యోగ యువతను బుజ్జగించేందుకు ఉద్యోగాల భర్తీ అన్నారు, నిధులు లేకుండా ఎలా సాధ్యమని విమర్శించారు. కులగణన ఏమైంది? వీబీజీ రామ్ జీని వ్యతిరేకిస్తున్న సిద్దరామయ్య నరేగా కింద పెండింగ్లో ఉన్న 5 లక్షల పనులకు నిధులు ఇవ్వలేదని సునీల్ ఆరోపించారు. గృహలక్ష్మీ పథకం పెండింగ్ కంతుల గురించి ఊసే లేదన్నారు. సిద్దరామయ్య బడ్జెట్లో కొత్త కొత్త శబ్దాలను వినియోగించారు, వచ్చే బడ్జెట్లో శబ్ధకోశం అవసరముంది. సభాపతి శబ్ధకోశాన్ని పంపిణీ చేయాలి అని వ్యాఖ్యానించారు. సీఎం హడావుడిగా కులగణన జరిపించారు, ఇది ముగిసి 7 నెలలు గడచినా కూడా ఆ నివేదిక ఏమైందనేది తెలియదని ఆయన మండిపడ్డారు. కులగణనకు రూ.500 కోట్లు ఖర్చు చేశారన్నారు. బడ్జెట్లో కులగణన గురించి ప్రస్తావనే లేదన్నారు. వెనుకబడిన 177 తాలూకాలకు ప్రత్యేక నిధులను కేటాయించలేదన్నారు. ఎస్సీ ఎస్టీల అంతర్గత రిజర్వేషన్ల వివాదాన్ని ఇంతవరకూ పరిష్కారం చేయలేదన్నారు. ఖాతాల్లో అవినీతి మాకు కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం వద్దు, రాష్ట్ర విద్యా విధానాన్ని అమలుపరుస్తామని చెప్పారు, బడ్జెట్లో ఆ విధానం ఏమిటో ప్రకటించలేదన్నారు. రెవెన్యూ శాఖలో కంప్యూటర్ సర్వర్ల సమస్య నెలకొంది, పల్లెలే కాదు, బెంగళూరులో ఖాతా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. ఈ ఖాతాల్లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. టాక్సీ డ్రైవర్లు ప్యానిక్ బటన్ అమర్చుకోవాలన్నారు, వాటి ధర చాలా ఎక్కువ, పేద డ్రైవర్లు ఎలా భరిస్తారని ఆయన ప్రశ్నించారు. సిద్దరామయ్య ఖరీదైన శాలువా వేసుకొని తిరుగుతూ రాష్ట్ర ప్రజలపై అప్పులు మోపుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి రూ.19వేల కోట్లు రావాలి దొడ్డబళ్లాపురం: జలజీవన్ మిషన్ కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.19,101 కోట్లు నిధులు రావాల్సి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ఎన్ నారాయణస్వామి అసెంబ్లీలో తెలిపారు. కేంద్రం ఇప్పటి వరకూ రూ.11,770 కోట్లు విడుదల చేసిందన్నారు. రూ.12 వేల కోట్లతో బెంగళూరులో మెట్రో రైలు మార్గాన్ని 96 కిలోమీటర్లు పెంచుతున్నామన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తగ్గించారని, దీంతో రాష్ట్రానికి రూ.15 వేల కోట్ల నష్టం కలిగిందన్నారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు మాట్లాడక పోవడం బాధాకరమన్నారు. సర్కారీ ఆస్పత్రుల్లో మందుల్లేవుదొడ్డబళ్లాపురం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మందుల సమస్య లేకుండా చేసేందుకు జూన్ నెలలోనే మందుల కొనుగోలుకు టెండర్లు పిలుస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు. విధాన పరిషత్లో జిల్లాస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉందని కొందరు సభ్యులు తెలిపారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతాల్లో జ్వరం, న్యుమోనియా, కుక్కకాటు మందులు దొరకడం లేదన్నారు. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందుకు మంత్రి పై సమాధానం ఇచ్చారు. ఆస్పత్రులకు 234 రకాల మందులను సరఫరా చేస్తున్నామన్నారు. సమస్యల ఊసులేని బడ్జెట్ విధానసభలో బీజేపీ ధ్వజం దొడ్డబళ్లాపురం: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని, 2028లో తన బలం ఏంటో కాంగ్రెస్కి తెలుస్తుందని మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ అన్నారు. సోమవారంనాడు అసెంబ్లీలో మాట్లాడిన ఆయన తనను సంబంధం లేని కేసుల్లో ఇరికించారని మండిపడ్డారు. హోంమంత్రి పరమేశ్వర్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. హాసన్ జిల్లాలో ప్రతిపక్షాల నేతలను,కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. తనపై ఇంకా 10 కేసులు పెట్టినా భయపడేది లేదని, తనను అణచివేయడం ఎవరివల్లా కాదన్నారు. హాసన్ జిల్లాలో రెవెన్యూ శాఖలో సుమారు రూ.3 వేల కోట్ల మేరకు అవినీతి జరిగిందని, తమ జిల్లాలో భూకబ్జాలు మితిమీరిపోయాయన్నారు. అధికారులు రియల్ ఎస్టేట్ మాఫియాతో కుమ్మక్కయ్యారన్నారు. -
మిన్నంటిన ఉప కోలాహలం
సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో వచ్చే నెల 9న జరగనున్న దావణగెరె, బాగల్కోటె అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఆయన సోమవారం దావణగెరెలో కాంగ్రెస్ అభ్యర్థి శ్యామనూరు సమర్థ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి మైనా ర్టీలు టికెట్ ఆశించిన మాట వాస్తవమేనన్నారు. అయితే పార్టీ అన్ని కోణాల్లో ఆలోచించి, సీనియర్ నాయకుడు శ్యామనూరు శివశంకరప్ప మృతితో ఖాళీ అయిన స్థానం నుంచి ఆయన కుటుంబానికి టికెట్ ఇచ్చిందన్నారు. మైనార్టీలు వేరే పార్టీకి మద్దతు ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. నూటికి నూరు శాతం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయం అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ఎలాంటి అవకాశాలు లేవని, కాబట్టి ఫలితాలు దిక్సూచి కాదని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బీజేపీ విజయం తథ్యం: యడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిచడంతో పాటు అభివృద్ధి పూర్తిగా లేకుండా పోయిందని బీజేపీ నేత, మాజీ సీఎం యడియూరప్ప విమర్శించారు. ఆయన దావణగెరెలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస దాసకరియప్ప నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దావణగెరెతో పాటు బాగల్కోటలో కూడా బీజేపీ అభ్యర్థి గెలవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని, ప్రజలకు సౌకర్యాలలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఈ ఉప ఎన్నికలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల అభ్యర్థుల ర్యాలీలు జనసాగరాన్ని తలపించాయి. రెండు నగరాల్లోనూ కోలాహలం నెలకొంది. దావణగెరె, బాగల్కోటెలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలు తమదే గెలుపన్న సీఎం సిద్దు -
డివైడర్కు ప్రైవేటు బస్సు ఢీ
● నలుగురు దుర్మరణం ● మైసూరు ఎక్స్ప్రెస్వేలో ప్రమాదం దొడ్డబళ్లాపురం: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు దుర్మరణం చెందిన సంఘటన బెంగళూరు–మైసూరు ఎక్స్ప్రెస్ వేపై చన్నపట్టణ తాలూకా పుట్టప్పనదొడ్డి వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. కేరళకు చెందిన మహ్మద్ ఫరాన్ (22), రఫీజ్ (45), బెంగళూరుకు చెందిన రశీద్ (45), షాకీర్ (27) అనేవారు మరణించారు. కేరళలోని పీకే ట్రావెల్స్కి చెందిన బస్సు కోజికోడ్ నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా వేగం కారణంగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ఈ నలుగురు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు. డ్రైవరు నిద్రమత్తులోకి జారుకోవడమే కారణమని అనుమానాలున్నాయి. చెన్నపట్టణ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. కాబోయే భార్య హత్య.. నిందితుడు అరెస్టు యశవంతపుర: కాబోయే భార్య (18)ని అనుమానంతో అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన నిందితున్ని బెంగళూరు డీజే హళ్లి పోలీసులు రాజస్థాన్లోని అజ్మీర్లో అరెస్ట్ చేశారు. నిందితుడు శబీల్ (20)ను బెంగళూరుకు తీసుకొచ్చారు. ఈ నెల 17న డీజే హళ్లిలోని చక్కెర మండీ వద్ద పాడుబడిన ఇంటిలోకి యువతిని తీసుకెళ్లిన నిందితుడు ఆమెను కత్తితో 20 సార్లకు పైగా పొడిచి చంపి పరారయ్యాడు. వారిద్దరికీ ఇదివరకే నిశ్చితార్థమైంది, బక్రీద్ పండుగ తరువాత పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. కానీ ఆమైపె అనుమానం పెంచుకున్న శబీల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్సాహంగా పికిల్బాల్ టోర్నీ బొమ్మనహళ్ళి: బెంగళూరు నగరం బొమ్మనహళ్ళి హెచ్ఎస్ఆర్ లేఔట్లో పికిల్బాల్ టోర్నీ సందడి నెలకొంది. దక్షిణ భారతదేశంలోని అగ్రశ్రేణి క్రియేటర్లను ఒకచోట చేర్చింది. ఇందులో యువతతోపాటు చిన్నరులు సైతం పాల్గొని పికిల్బాల్ ఆడారు. అలాగే లైఫ్ స్టైల్, ఫిట్నెస్, కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్, సిటీ గైడ్ రంగాలకు సంబంధించి కార్యక్రమాలు జరిగాయి. రోజంతా ఉత్సాహంగా కార్యకలాపాలు కొనసాగాయి. బంధువు దాష్టీకం, తల్లయిన బాలిక మైసూరు: రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకాలోని ఒక గ్రామంలో కడుపునొప్పితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్లోనే ఆడబిడ్డను ప్రసవించింది. ఆమెను గర్భవతిని చేశాడన్న ఆరోపణపై బంధువైన సురేష్ (46)పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేసి జైలుకు పంపారు. బాలిక కాన్పు గురించి గుండ్లపేట ఆసుపత్రి సిబ్బంది, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పోలీసులకు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రేమపేరుతో బాలికను లోబర్చుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడని, గర్భం దాల్చిన బాలిక తల్లిదండ్రులకు చెప్పకుండా మౌనంగా ఉందని తెలిసింది.రామదండు పాదయాత్ర చింతామణి: తాలూకాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమయిన కై వార యోగినారేయణస్వామి మఠంలో తాతయ్య 300 జయంతి సందర్భంగా కోలారు, చిక్కబళ్లాపుర భక్తుల ఆధ్వర్యంలో శ్రీరామ దండు సంకీర్తన పాదయాత్ర ఘనంగా జరిగింది. కోటకల్ శింగరె లక్ష్మీ వెంకటరమణస్వామి ఆలయంలో పాదయాత్రను ప్రారంభించి కై వారం వరకూ భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ నడిచి వచ్చారు. -
ఉద్యోగినుల ఆరోగ్య రక్షణే పాలనకు పునాది
హొసపేటె: మహిళా ఉద్యోగులు ఆఫీసు పని హడావిడిలో వారు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు. ఆరోగ్యంగా ఉన్న ఉద్యోగులు మాత్రమే ప్రజలకు మంచి సేవలు అందించగలరని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి అభిప్రాయపడ్డారు. నగరంలో సోమవారం రోటరీ ఆస్పత్రిలో నిర్వహించిన మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వైద్య పరీక్ష శిబిరాన్ని ప్రారంభిస్తూ ఆమె మాట్లాడారు. మహిళ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండటానికి కనీసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, శారీరక అనారోగ్యాల కంటే పని ఒత్తిడి మానసిక ఆరోగ్యానికి ఎక్కువ హానికరం అని సలహా ఇచ్చారు. అందువల్ల ప్రతి మహిళా ఉద్యోగి రోజుకు కనీసం అరగంట యోగా, ధ్యానం కోసం కేటాయించాలి. ఇది రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది. హొసపేటె ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు నైమిష, కార్యదర్శి డాక్టర్ ఆర్తి రాజ్పూత్, ఆయుష్ శాఖ వైద్య అధికారి డాక్టర్ మునివాసుదేవ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. -
అట్టహాసంగా నామినేషన్లు
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగే రెండు నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. దావణగెరె దక్షిణ, బాగల్కోటె రెండు నియోజకర్గాలకు ఉప ఎన్నిక వచ్చే నెల 9న జరగనున్న నేపథ్యంలో సోమవారం నామినేషన్లు సమర్పించేందుకు ఆఖరి రోజు కావడంతో దావణగెరె కాంగ్రెస్ అభ్యర్థి శ్యామనూరు సమర్థ్, బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ టీ.దాస్కరియప్ప అట్టహాసంగా నామినేషన్లు సమర్పించారు. ఇది వరకే వీరిద్దరూ గత శుక్రవారం మంచి రోజు కావడంతో ఒక సెట్టు సమర్పించిన సంగతి తెలిసిందే. దావణగెరె దక్షిణ నియోజకవర్గానికి మైనార్టీ అభ్యర్థి తీవ్రంగా పోటీ పడిన నేపథ్యంలో ఒక రోజు ముందుగా అభ్యర్థి పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ను నామినేషన్ల సమర్పణకు చివరి రోజున కాంగ్రెస్ అభ్యర్థి శ్యామనూరు సమర్థ్ భారీ జన సందోహం మధ్య ర్యాలీగా తరలిరావడంతో పాటు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్లతో పాటు పలువురు మంత్రులు హాజరై జిల్లాధికారి కార్యాలయంలో నామినేషన్లు సమర్పించారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ కూడా.. దావణగెరె దక్షిణ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ టీ.దాస్ కరియప్ప కూడా భారీ జన సందోహంతో తరలివచ్చి నామినేషన్లు సమర్పించారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, మాజీ కేంద్ర మంత్రులు తరలి రావడంతో బీజేపీ అభ్యర్థి కూడా ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. రెండు పార్టీల అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్లు సమర్పించిన నేపథ్యంలో దావణగెరె నగరంలో ఎటు చూసినా భారీ జనసందోహంతో వీధులన్నీ నిండిపోగా బీజేపీ, కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లు రెపరెపలాడాయి. కాంగ్రెస్ రెబల్గా సాధిక్ ఫైల్వాన్ రెండు పార్టీల్లో అసమ్మతి బెడద కనిపించడంతో కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మైనార్టీ నేత సాధిక్ పైల్వాన్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్లు వేశారు. సాధిక్ పైల్వాన్కు టికెట్ ఇవ్వాలని మంత్రి జమీర్ అహమ్మద్ కూడా తీవ్రంగా పట్టుబట్టారు. అయితే శ్యామనూరు కుటుంబానికే టికెట్ కేటాయించగా మంత్రి జమీర్ అహమ్మద్ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నామినేషన్లు వేసే కార్యక్రమంలో పాల్గొనకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మైనార్టీలకు కాంగ్రెస్ టికెట్ కేటాయించలేదనే ఆగ్రహంతో దావణగెరెలో 12వ వార్డుకు చెందిన పలువురు ముస్లిం సమాజానికి చెందిన యువకులు పెద్ద సంఖ్యలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ టీ.దాస్కరియప్ప సమక్షంలో బీజేపీలో చేరారు. ఉమేష్ మేటి నామినేషన్ బాగల్కోటె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న ఉమేష్ మేటి అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆర్.బీ.తిమ్మాపుర, డీసీసీ అధ్యక్షుడు ఎస్.జీ.నంజయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ ప్రముఖులు హాజరు కావడంతో పాటు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బాగల్కోటెలోని వీధులు ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలు, మద్దతుదారులతో కిటకిటలాడాయి. నామినేషన్ సమర్పిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సమర్థ్, చిత్రంలో సీఎం, డీసీఎం నామినేషన్ వేస్తున్న బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్, చిత్రంలో మాజీ సీఎం యడ్డి ముగిసిన ఆయా పార్టీ అభ్యర్థుల నామినేషన్ల ఘట్టం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా హాజరైన సీఎం, డీసీఎం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ సీఎం, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు భారీ ర్యాలీలతో అభ్యర్థుల శక్తి ప్రదర్శన, ప్రధాన పార్టీలకు వీడని అసమ్మతి దావణగెరెలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా సాధిక్ ఫైల్వాన్ నామినేషన్ దాఖలు -
ఉగాండా ఏజెంట్తో రన్యారావు డీల్
బెంగళూరు: కన్నడ నటి రన్యారావు, ఆమె అనుచరులు నిర్వహిస్తున్న బంగారం స్మగ్లింగ్ దందాలో ఈడీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు రూ.102 కోట్ల విలువచేసే బంగారాన్ని అక్రమంగా భారత్కు తరలించారని ఈడీ కోర్టులో చార్జిïÙట్ వేసింది. ఇందులో ఉగాండా దేశానికి చెందిన ఏజెంటుతో నటి రన్యకు లింకులు ఉన్నట్లు తెలిపింది. ఈడీ చార్జిషిటులో పేర్కొన్న ప్రకారం ఆమె దుబాయ్ నుంచే కాకుండా ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా బంగారాన్ని అక్రమంగా తరలించేది. దీనికోసం ఉగాండా ఏజెంట్తో సంప్రదించింది. దీనికోసం దుబైలో వీరా డైమండ్ ట్రేడింగ్ అనే పేరుతో కంపెనీని కూడా తెరిచింది. రన్యారావు స్నేహితుడు రాజు, సదరు ఏజెంట్కు అడ్వాన్స్గా రూ.33 లక్షలు చెల్లించారు. 2024, జనవరిలో రాజు బంగారం తేవడానికి ఉగాండాకు వెళ్లగా ఆ ఏజెంట్ తనకు మరింత ఎక్కువ డబ్బు.. అంటే రూ.1.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్ పెట్టినట్లు తెలిసింది. రాజు వట్టిచేతులతో వచ్చాడు. స్మగ్లింగ్ కేసుల్లో అరెస్టయిన రన్య బెంగళూరు పరప్పన జైల్లో గడుపుతోంది. -
రూ. 25 కోట్లు : జంట ఘరానా మోసం.. చివరికి
బెంగళూరులోకోర్టులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వందలాది మంది నిరుద్యోగులను మోసం చేసిన దంపతులను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీ బాధితుడి నుంచి దగ్గరినుంచి లక్షల్లో వసూలు చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులో కిచ్చింది. ఇలా కోట్ల రూపాయలు దండుకున్న వైనం దిగ్భ్రాంతి రేపింది.ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడిన జేసన్ డిసౌజా, లవీనా దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వందలాది మంది నిరుద్యోగులను మోసం చేసి సుమారు రూ.25 కోట్ల మేర దండుకున్నారు.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిరుద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులే లక్ష్యంగా వీరు వల విసిరారు. వివిధ కోర్టుల్లో 'డి-గ్రూప్' ఉద్యోగాలు ఇప్పిస్తామని వందలాదిమందిని నమ్మించారు. ఒక్కో బాధితుడి నుంచి రూ.10 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.అంతేకాదు బాధితులను నమ్మించేందుకు జడ్జీల సంతకాలను ఫోర్జరీ చేయడమే కాకుండా, నకిలీ నియామక పత్రాలను (Appointment Orders) కూడా తయారు చేశారు. తమ నెట్ వర్క్ను విస్తరించుకునేందుకు పలువురు ఏజెంట్లను నియమించుకున్నారు. వీరి దందా కోసం నియమించుకున్న ఏజెంట్లు బాధితులను వెతికి పట్టుకుని, వారిని ఒప్పించి డబ్బులు వసూలు చేసేవారు. ఇందులో ఏజెంట్లు తమ కమిషన్ ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని దంపతులకు ఇచ్చేవారు.డాక్యుమెంట్ వెరిఫికేషన్ పేరుతో బాధితులను ప్రైవేట్ హోటళ్లకు పిలిపించేవారు. అక్కడ నకిలీ ఆఫర్ లెటర్లను చూపించి ఇది అసలైన రిక్రూట్మెంట్ అని నమ్మించి డబ్బులు వసూలు మొత్తం గుంజేవారు. డబ్బులు తీసుకున్న తర్వాత బాధితులు ఉద్యోగం ఎప్పుడు వస్తుందని అడిగితే, రకరకాల సాకులు చెప్పి చివరకు ఫోన్ నంబర్లు మార్చేసేవారు. తాము నిండా మునిగిపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో షాకింగ్ నిజం బయటపడింది. అదేంటి అంటే ఈ దంపతులు ఇదే తరహా ఉద్యోగ మోసాల కేసులో 2024లో కూడా అరెస్ట్ అయ్యారు. జైలు నుండి విడుదలైన తర్వాత మళ్లీ అదే దందాను మొదలుపెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన CCB పోలీసులు వీరిని అరెస్ట్ చేసి. ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి భాగస్వామ్యం ఉందనే విషయంపై విచారణ జరుపుతున్నారు. -
టీబీ డ్యాంలో పూడికతీతపై పట్టించుకోరా?
సాక్షి, బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలకు తాగు, సాగు నీరందించే ఉమ్మడి ప్రధాన జలాశమైన తుంగభద్ర డ్యాంలో పూడికతీతపై మూడు రాష్ట్రాలకు చెందిన పాలకులు పట్టించుకోవడం లేదు. సవతి తల్లి ధోరణి అవలంభిస్తున్నారని తుంగభద్ర ఆయకట్టు రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని పత్రికా భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తుంగభద్ర డ్యాం నుంచి ఏటా దాదాపు 300 టీఎంసీలకు పైగా నీరు వృథాగా కిందకు పోతోందన్నారు. శ్రీశైలం డ్యాంలోకి వెళ్లి అక్కడ నుంచి సముద్రంలోని నీరు చేరుతోందని తెలిపారు. వృథాగా వెళ్తున్న నీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. డ్యాం కట్టించి 76 సంవత్సరాలు దాటగా.. ఏటేటా డ్యాంలో పూడిక పెరిగిపోయిందన్నారు. ప్రారంభంలో డ్యాం గరిష్ట నీటి నిల్వ 133 టీఎంసీలు ఉండగా.. పూడిక చేరడంతో 101 టీఎంసీలకు చేరిందన్నారు. డ్యాంలో 30 టీఎంసీల మేర నీరు చేరడానికి వీలు లేకుండా పూడిక చేరిందని పేర్కొన్నారు. ఈసారి మళ్లీ మే నెలలో తుంగభద్ర డ్యాంలో నీటిని ఉపయోగిస్తున్న పరిశ్రమల యజమానులతో కలిసి పూడికతీత పనులు చేపడుతామన్నారు. పెద్ద ఎత్తున రైతులు పూడికతీత చేసేందుకు తరలివస్తారన్నారు. డ్యాంలో పూడిక తీసిన మట్టిన చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు ఉచితంగా తీసుకెళ్లవచ్చని తెలిపారు. తుంగభద్ర డ్యాం గేట్లకు అమర్చిన చైన్లను కూడా మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతుల సంఘం నాయకులు జాళిహాల్ శ్రీధర్, వీరనగౌడ, వీరభద్ర నాయక్, దరూరు వీరేష్ తదితరులు పాల్గొన్నారు. -
శికారిపురలో చిరుతల హల్చల్
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని శికారిపుర తాలూకాలోని తడసనహళ్లి, అడగంటి, ముత్తగి గ్రామాల్లో శనివారం ఒక్కరోజే ముగ్గురిపై చిరుతపులి దాడి చేయగా, వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ● అడగంటి గ్రామానికి చెందిన సుదీప్ సాయంత్రం ముత్తగి గ్రామం సమీపంలోని మొక్కజొన్న పొలానికి వెళ్లగా చిరుత అతనిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతను శివమొగ్గలోని మెగ్గన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ● శనివారం ఉదయం తన వరి పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన తడసనహళ్లి గ్రామ రైతు ముత్తన్నపై చిరుత దాడి చేసింది. కొరికి, గోళ్లతో రక్కడంతో తీవ్రంగా గాయపడిన అతడిని కూడా తదుపరి చికిత్స కోసం మెగ్గన్ ఆసుపత్రిలో చేర్చారు. ● సాయంత్రం, తడసనహళ్లి, అడగంటి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై బైక్పై వెళ్తున్న హూవ్య నాయకపై కూడా చిరుత దాడి చేయగా, స్వల్ప గాయాలు అయ్యాయి. బోనులు ఏర్పాటు దాడులతో మేలుకున్న అటవీ సిబ్బంది చిరుతను పట్టుకోవడానికి తాడసనహళ్లిలో పొలాలు, తోటల్లో 3 చోట్ల బోనులను ఏర్పాటు చేశారు. చిరుతలు అరుదుగా మనుషులపై దాడి చేస్తాయి, దానికి ఏదైనా వ్యాధి సోకి ఉండవచ్చు లేదా ఆందోళనకు గురై మనుషులపై దాడి చేసి ఉండవచ్చు అని జోనల్ ఫారెస్ట్ ఆఫీసర్ జావిద్ అంగడి చెప్పారు. అయితే రైతులు పొలాలకు వెళ్లడానికి భయపడుతున్నారు. వేర్వేరుచోట్ల ముగ్గురిపై దాడులు -
వార్డుల్లో కనీస వసతులు కల్పించాలి
సాక్షి, బళ్లారి: తమ వార్డు పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే నారా భరత్రెడ్డికి మహిళలు విన్నవించారు. ఆదివారం నగరంలోని 18వ వార్డు పరిధిలో ఉన్న వివిధ కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా కాలనీలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యే వద్దకు వచ్చి సమస్యలు విన్నవించుకున్నారు. వార్డులో డ్రైనేజీ, రోడ్లు, రాజాకాలువ అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి నీటి సమస్య తాండవిస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వార్డుల్లో సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేసవిలో మంచి నీటి సమస్య తలెత్తకుండా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. నీటి సమస్య తలెత్తితే తమ దృషికి తీసుకురావాలని సూచించారు. ప్రతి కాలనీల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ వసతి, మంచినీటి సమస్య తీర్చేందుకు తగిన చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నందీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవింద్, గుంతకల్లు సురేష్, కట్టమనే నాగేంద్ర, బసిలహళ్లి మంజు తదితరులు పాల్గొన్నారు. వైభవం.. పుష్ప పల్లకీ ఉత్సవం శ్రీనివాసపురం: పట్టణంలోని కాళికా కమటేశ్వరి అమ్మవారి పుష్ప పల్లకీ ఉత్సవాన్ని శనివారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం అమ్మవారికి విశేష పూజలు చేశారు. రాత్రికి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఉంచి పట్టణంలోని వీధుల్లో ఊరేగించారు. దేవాలయ ప్రధాన అర్చకులు మోహనాచారి, రవీంద్రాచారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. -
యాదగిరి జిల్లాలో కుల వివక్ష
● దేవాలయం మెట్లపై కూర్చున్నందుకు దళిత యువకులపై దాడి సాక్షి, బళ్లారి: సమాజం ఆధునికత వైపు అడుగులు వేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కుల వివక్ష కొనసాగుతోంది. తాజాగా యాదగిరి జిల్లాలో దేవాలయం మెట్లపై కూర్చున్న ఇద్దరు దళిత యువకులపై దాడి జరిగింది. యాదగిరి జిల్లా గురమిటకల్ తాలూకా యంపాడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యంపాడ గ్రామంలో శుభకార్యం నిమిత్తం విచ్చేసిన అనిల్ కుమార్, సిద్ధలింగప్ప అనే ఇద్దరు దళిత యువకులు ఎండవేడిమి తట్టుకోలేక సమీపంలో దేవాలయం మెట్లపై కూర్చొన్నారు. అదే సమయంలో దేవాలయ పూజారి అక్కడ ఎందుకు కూర్చొన్నారని వాదించాడు. అనంతరం పక్కనే ఉన్న కొందరు యువకులు కలగచేసుకుని పూజారితో కలిసి దళిత యువకులపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన దళిత యువకులను చికిత్స నిమిత్తం యాదగిరి ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాహిత్యంపై ఆసక్తి పెంచుకోండి హొసపేటె: ఆధునిక పరిజ్ఞాన యుగంలో నేటి యువత సాహిత్య రంగాలపై ఆసక్తి చూపించాలి. సాహిత్య రంగాలను మరింత అభివృద్ధి చేసేందుకు నడుం బిగించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత జోగతి మంజమ్మ తెలిపారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం, నూర్ జహాన్ షష్టి పూర్తి కార్యక్రమం సందర్భంగా సండూర్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో ఆశా ప్రకాశన్–సిద్ధలింగప్ప చౌకి ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ, కవి సమ్మేళనం నిర్వహించారు. పాఠకులను ఆకట్టుకునే పుస్తకాలకు సమాజంలో మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఉత్తమ పుస్తకాలు నిరంతరం వెలుగులోకి రావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో జిల్లా సాహిత్య పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ నిష్టి రుద్రప్ప, రచయితలు డాక్టర్ ముంతాజ్బేగం, సుధా, చిదానంద గౌడ వెంకమ్మ చంద్రశేఖరయ్య రొనద మఠ్, షేక్షావలి మణిగర్, యత్నల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఉల్లాసంగా క్రీడా పోటీలు బళ్లారి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బళ్లారి జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు సంఘం జిల్లా అధ్యక్షుడు నెలకుంద్రి సదానంద మాట్లాడుతూ.. ఉద్యోగ నిర్వహణలో ఉద్యోగులు వివిధ రకాల ఒత్తిళ్లు, సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటారన్నారు. నేపథ్యంలో ఆడ విడుపుగా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటు ఉద్యోగ నిర్వహణ, అటు కుటుంబ బాధ్యతలు రెండింటిలోనూ మహిళలు రాణిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. పలువురు మహిళలు పోటీల్లో ఉల్లాసంగా పాల్గొని అందరికి స్ఫూర్తినిచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రముఖులు తిప్పారెడ్డి, హనుమంతరాయ సురేష్ కుమార్, ఎంటి మల్లేశ్, రాజశేఖర గాణిగెర, రామకృష్ణ, విజయ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఏడు శాతం రిజర్వేషన్ కల్పించాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నాయక్లకు ఏడు శాతం రిజర్వేషన్ కల్పించిన అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని కర్ణాటక వాల్మీకి మహర్శి నాయక్ పోరాట ఐక్యవేదిక మహాసభ సంచాలకుడు వి.ఎస్.ఉగ్రప్ప పేర్కొన్నారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నాయక్లకు 7 శాతం రిజర్వేషన్ కేటాయింపు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపకుండా కాలయాపన చేయడం తగదన్నారు. రాజకీయాలకు అతీతంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివ కుమార్ వెంటనే అఖిలపక్ష నాయకులతో, ప్రధానమంత్రితో చర్చించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర సర్కార్లు నాయక్ సమాజంపై మౌనం వహిహించడం తగదన్నారు. సమావేశంలో వరదానేశ్వర స్వామి, సంజయ్ కుమార, రాజశేఖర్ నాయక్, రఘవీర్ నాయక్, వెంకటేష్ నాయక్, రాజప్ప, హనుమంతరాయ, రాజణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
చురుకుగా గండి పూడ్చివేత పనులు
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువకు గండి పడిన ప్రాంతంతో మరమ్మతులు చురుకుగా కొనసాగుతున్నాయి. రాయచూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు తుంగభద్ర డ్యాం నుంచి ఈనె 11 తేదీన కాలువ ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కొప్పళ తాలుకా బసాపూర్ వద్ద కాలువకు గండి పడటంతో నీరు వృథాగా ప్రవహించిన విషయం తెలిసిందే. మంత్రుల ఆదేశాలతో 60 అడుగుల మేర కాలువ కోతను పూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. టిప్పర్లతో మట్టిని తీసుకెళ్లిని గండిని పూడుస్తున్నారు. గండి పూడ్చివేత పనులను త్వరగా పూర్తి చేస్తామని సంబంధిత శాఖ ఇంజనీర్లు తెలిపారు. -
వాటి మధ్యనే తనువు చాలించి..
మూగజీవులను ప్రేమించి.. బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలోని ఆనేకల్కు చెందిన పశు వైద్యురాలు డా.సమీక్షా రెడ్డి (27)కి కన్నీటితో వీడ్కోలు పలికారు. శుక్రవారం శివమొగ్గలోని త్యావరెకొప్ప పులి–సింహాల జూ పార్క్లో జంతువులకు చికిత్స చేస్తుండగా నీటి ఏనుగు (హిప్పో) దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాలతో కన్నుమూయడం తెలిసిందే. ఆనేకల్ తాలూకాలోని బన్నేర్ఘట్ట సమీపంలోని సకలవారలో శనివారం సాయంత్రం అంతిమ సంస్కారాలు జరిగాయి. సమీక్షారెడ్డి మృతదేహం గ్రామానికి చేరుకోగానే తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు పెట్టుకున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం ఆవరించింది. గ్రామస్తులు, అటవీ సిబ్బంది ఆమె భౌతికాకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. తమ ఏకైక కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు ధృవకుమార్, శైలజను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మూగజీవులంటే అమిత ప్రేమ సమీక్షారెడ్డికి చిన్నప్పటి నుంచే జంతువులు, పక్షులంటే అమితాసక్తి. ఆమె పట్టుదలతో చదివి పశు వైద్యురాలు అయ్యింది. ఆమె ఎంతో ఉత్సాహంతో పశువైద్య కోర్సును పూర్తి చేసి, పశుపక్ష్యాదుల సేవకు అంకితమైందని బంధువులు తెలిపారు. కానీ వాటి సేవలోనే అకాల మరణం చెందడం బాధాకరంగా ఉందని వాపోయారు. డా.సమీక్షారెడ్డికి కన్నీటి వీడ్కోలు -
లకామాపురలో విషాదం
హుబ్లీ: రంజాన్ పండుగ రోజు లకామాపురంలో విషాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కెలగెరి వంతెన వద్ద జరిగిన ఈ ప్రమాదంలో లకామాపుర నివాసి ఇమామసాబ్ హెబ్బళి (21) అతడి స్నేహితుడు, మోహ నివాసి యునుస్ ముల్లానవర (17) మృతి చెందారు. ఈ ఘటనతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఇమామ్ సాబ్ అన్న పెళ్లి నిశ్చయం అయిన కబ్బార గణవిలోని ఇంటికి పండుగ సందర్భంగా ప్రార్థనల కోసం స్నేహితులతో కలిసి వెళ్లారు. పని ముగించుకుని బైక్లో వస్తుండగా కెలగెరి వంతెన వద్ద గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇమామ్ సామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడి యూనుస్ను నగరంలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ను ఢీకొట్టిన అనంతరం సదరు గుర్తు తెలియని వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. సదరు వాహన డ్రైవర్ కోసం ధార్వాడ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా పండుగ రోజే ఇద్దరు యువకులు మృత్యువాత పడటంతో లకామాపురలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం -
ఆరోగ్య సాధనకు యోగాభ్యాసం
మైసూరు: నేటి వేగవంతమైన జీవితం వల్ల కలిగే ఒత్తిడిని నివారించడానికి యోగా సహాయపడుతుందని, నెమ్మదైన జీవనశైలిని పాటించడం ద్వారా మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వక్తలు పేర్కొన్నారు. జిల్లాలోని నంజనగూడులో దక్షిణ కాశీగా పేరుపొందిన శ్రీకంఠేశ్వర ఆలయం ముందు ఆదివారం గరళ్పురి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా వందలాది మందితో సామూహిక యోగాభ్యాసం జరిగింది. జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు గొప్ప ఓర్పును యోగా ఇస్తుందని, నిత్యం యోగా సాధన చేయాలని గురువులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధృవ నారాయణ పాల్గొన్నారు. నంజనగూడును యోగా నగరంగా తీర్చిదిద్దడమే తమ ఆశయమన్నారు. మహాశివుడు విషాన్ని తన కంఠంలో దాచుకుని గరళకంఠుడు అయ్యాడని, అందుకు గుర్తుకు శ్రీకంఠేశ్వరుని సన్నిధిలో గరళ్పురి ఉత్సవాలను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. పలువురు స్వామీజీలు, ప్రముఖులు పాల్గొన్నారు. నంజనగూడులో గరళ్పురి ఉత్సవాలు -
కొబ్బరి కాయల ధర పతనం
● పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ఆగిన ఎగుమతులు ● పడిపోయిన డిమాండ్ ● లబోదిబోమంటున్న రైతులు హొసపేటె: ఏ రుచికరమైన వంట చేయాలన్నా కొబ్బరి వాడకం తప్పనిసరి. ఇక పూజల్లో టెంకాయలను విరివిరిగా వాడుతుంటాం. అలాంటి కొబ్బరి కాయల ధరలు అకస్మాత్తుగా పడిపోయాయి. దీనికి కారణం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రధానం కారణం అని చెప్పుకోవచ్చు. యుద్ధం ప్రభావం సామాన్య రైతులపై కూడా పడింది. కొబ్బరి కాయలను మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసేవారు. యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ఎగుమతులు ఆగిపోవడంతో కొబ్బరి కాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎగుమతి కావాల్సిన కొబ్బరి అంతా స్థానిక మార్కెట్లకు చేరుతోంది. దీనివల్ల మార్కెట్లో సరుకు ఎక్కువై డిమాండ్ పడిపోయింది. ఉత్తర కర్ణాటకలో గత రెండు వారాలుగా ధరలు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి క్వింటాల్కు రూ.2,000 మేర ధర తగ్గింది. క్వింటాల్కు రూ.7,000 నుంచి రూ.4,500లకు పడిపోయింది. కొబ్బరి కాయ సైజ్ను బట్టి రూ.30 నుంచి రూ.20 వరకూ విక్రయిస్తున్నారు. గత ఏడాది తమ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు పొందుతున్న రైతులు, ప్రస్తుత మార్కెట్ పరిణామాలతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోతుల బెడదతో కొబ్బరి పంట ఇప్పటికే తీవ్రంగా దెబ్బతింటోంది. ఎంత తగ్గుదల? విజయనగర జిల్లాలో హొసపేట, అగిరి బొమ్మనహళ్లి, కూడ్లిగి, అడగళి, కొట్టూరులో కొబ్బరి మార్కెట్లు ఉన్నాయి. గత సంవత్సరం జనవరిలో, లేత కొబ్బరి మార్కెట్లో క్వింటాల్ కొబ్బరి ధర సుమారు రూ.5,500 నుంచి రూ.6,000 మధ్య ఉండేది. అది క్రమంగా పెరిగి, కొన్ని నెలల పాటు ధర రూ.7 వేలు కూడా దాటింది. ఆ తర్వాత అది కొద్దిగా తగ్గి, సుమారు రూ.6,500 నుంచి రూ.7,000 చేరుకుంది. ఎగుమతులు లేకపోవడం, దిగుబడుల్లో హెచ్చుతగ్గులు, పండుగల నేపథ్యంలో ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం సగటు ధర క్వింటాల్కు రూ.5,000 కంటే తక్కువకు పడిపోయింది. కనిష్ట ధర రూ.4,500గా నమోదైంది. కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతికి అంతరాయం కలగడంతో కొనుగోలుదారులు వెనుకాడుతున్నారని రైతులు చెబుతున్నారు. -
క్రీడల్లో గెలుపోటములు సమానం
కోలారు: క్రీడలతో ఆరోగ్యంగా ఉండవచ్చు. క్రీడలు మానసిక, దైహిక ఆరోగ్యానికి, నాయకత్వ లక్షణాలు పెంపొందడానికి ఎంతో సహకారి అవుతాయని జేడీఎస్ నాయకుడు సీఎంఆర్ శ్రీనాథ్ తెలిపారు. ఆదివారం తాలూకాలోని దొద్దహసాళ గ్రామంలో గంగోత్రి క్రికెటర్స్ యువకర బళగ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొరత లేదన్నారు. వారిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. క్రీడల్లో గెలుపోటములు సమానం అని తెలిపారు. -
సాహిత్య సేవలు అనన్యం
రాయచూరు రూరల్: సన్మానాలు ముఖ్యం కాదు.. సాహ్యిత సేవలు అనన్యమని కవయిత్రి హెచ్.జి.లక్ష్మి తెలిపారు. ఆదివారం కన్నడ భవనంలో జిల్లా, తాలుకా కన్నడ సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో బరగూరు రామచంద్రప్ప దత్తి అవార్డు అందుకుని ప్రసంగించారు. సాహిత్యం రాసే ముందు భావితరాల వారికి ఉపయెగపడే విధంగా చూడాలన్నారు. కవులకు హెచ్.జి.రాధా దేవి మార్గదర్శి అని.. కవితలు సమాజానికి పనికొచ్చేలా ఉండాలని తెలిపారు. యువకుల మనస్సులను దోచే విధంగా పుస్తకాలు రాయాలని సూచించారు. కార్యక్రమంలో రంగణ్ణ పాటిల్, బాబు బండారీ గల్, భీమన గౌడ, లక్ష్మీదేవి శాస్త్రి, విజయ రాజేంద్ర, దానమ్మ, వీర హనుమాన్, రావుత్ రావు, దండెప్ప బిరదార్ పాల్గొన్నారు. బేగం తలాబ్ వాటర్ పార్కు ప్రారంభం రాయచూరు రూరల్: వేసవి కాలంలో పిల్లలు, యువత సేద తీరేందుకు విజయపుర (బీజాపూర్)లోని బేగం తలాబ్ చెరువు సమీపంలో కొత్తగా ఒక వాటర్ పార్క్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ వెల్లడించారు. శనివారం సాయంత్రం విజయపుర బేగం తలాబ్ చెరువు వాటర్ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి తోడు మూడు నెలల పాటు వేసవిలో కాలక్షేపం కోసం బేగం తలాబ్ వాటర్ పార్కును ప్రారంభించడం జరిగిందన్నారు. వివిధ రకాలైన జల క్రీడలు ఆడేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. 31న మహిళా దినోత్సవం రాయచూరు రూరల్: ఈనెల 31న ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ శావంత గేర పేర్కొన్నారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 31న పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, మహిళా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సావిత్రి బాయి పూలే సంఘం ఆద్వర్యంలో జరిగే కార్యక్రమంలో మహిళలను సన్మానించడం జరుగుతుందన్నారు. వారం రోజుల పాటు మహిళలకు క్రీడలు, సాంస్క్రతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో రత్న, చాయదేవి, జయశ్రీ, యంకప్ప, సంతోష్, నీలమ్మ, రాజ శేఖర్, సరసుబాయి పాల్గొన్నారు. జై భజరంగ భళిరాయచూరు రూరల్: నగరంలోని జవహర్ నగరలో భజరంగి యువసేన ఆధ్వర్యంలో శనివారం రాత్రి సీతారామ కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా భారీ భజరంగ బళి (ఆంజనేయుడు) విగ్రహాన్ని ఊరేగించారు. వివిధ కూడళ్లలో ఆంజనేయుడిని దర్శించుకున్న భక్తులు పూజలు చేశారు. శ్రీరామ నవమి ఉత్సవాలకు అందరు సిద్ధం కావాలని భజరంగి బళి యువసేన నాయకులు పిలుపునిచ్చారు. పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రాధాన్యత రాయచూరు రూరల్: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోని పవిత్ర ధర్మ స్థలాలు, దేవాలయాల, యాత్రికుల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించిందని కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు లక్ష్మీకాంత రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం, వారణాసి, తుళజా భవాని యాత్రికుల భవన నిర్మాణాలు, మంత్రాలయంలో నూతన కర్ణాటక భవన నిర్మాణాలకు రాష్ట్ర ముుఖ్యమంత్రి సిద్దరామయ్య, దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి రామలింగా రెడ్డి సహకారంతో పనులకు నిధులు విడదుల చేశారన్నారు. మహ వైష్ణవి దేవి ఆలయ దర్శనం కోసం వెళ్లే భక్తులకు ప్రభుత్వం రూ.5 వేల ప్రోత్సాహక ధనం ఇస్తుందని వివరించారు. -
బంగారం ఇస్తామని మోసగించిన నిందితుల అరెస్ట్
హొసపేటె: బంగారం ఇస్తామని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ.30 లక్షలు దోచుకుని పరారైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంలో హోసహళ్లి పోలీసులు విజయం సాధించారు. నిందితుల నుంచి రూ.29,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చైన్నెలోని అయ్యప్పాక్కం నివాసి అయిన జి.కుమార్కు లింగనహళ్లిలోని కొరచరహట్టికి చెందిన సురేష్ అలియాస్ రమేష్, సోమన్నతో పరిచయం ఉంది. తమకు ఇంటి కూల్చివేత సమయంలో సుమారు కిలో బంగారు ఆభరణాలు దొరికాయని రమేష్, సోమన్న నమ్మబలికారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు బంగారం ఇస్తామని కుమార్కు చెప్పారు. జనవరి 28న కాయసనకెరె గ్రామం సమీపంలోని ఒక అటవీ ప్రాంతానికి వస్తే బంగారు ఆభరణాలు ఇస్తామని తెలిపారు. అక్కడికి చేరుకున్న కుమార్ నుంచి నిందితులు బలవంతంగా రూ.30 లక్షలు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మార్చి 14న హోసహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. విజయనగర జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్.జాహ్నవి, అదనపు పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ మంజునాథ్ మార్గదర్శకత్వంలో ఈ కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నిందితులు సురేష్ అలియాస్ రమేష్, సోమన్నను అరెస్ట్ చేశారు. కూడ్లిగి డీవైఎస్పీ మల్లేష్ దొడ్డమణి నేతృత్వంలో కొట్టూరు సీపీఐ దురుగప్ప, పీఎస్ఐ సిద్ధరామ బిదరాని, సిబ్బంది సభ్యులు అంజన మూర్తి, మంజునాథ్, సురేష్ సహా పలువురు ఆపరేషన్లో పాల్గొన్నారు. రూ.29.50 లక్షల నగదు స్వాధీనం -
దంపతులను కబళించిన మృత్యువు
పూతలపట్టు (యాదమరి): తిరుమల యాత్ర ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వెంకన్న దర్శనం కోసం ఇంటి నుంచి ఉత్సాహంగా కారులో బయలుదేరగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మరో రెండు గంటల్లో తిరుమలకు చేరుకోనుండగా నిద్ర మత్తులోకి జారుకోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెలుతున్న లారీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు సహా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా పి. కొత్తకోటలో చోటు చేసుకుంది. ఎలా జరిగిందంటే.. పూతలపట్టు పోలీసుల వివరాలు మేరకు.. కర్ణాటకలోని మండ్య ప్రాంతానికి చెందిన సతీష్ (50) తన కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి దర్శనార్థం కారులో బయలుదేరారు. తెల్లవారుజామున పూతలపట్టు మండల పరిధి పి.కొత్తకోట సమీపంలో కారు నడుపుతున్న సతీష్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ముందు వెలుతున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగంలో కూర్చున్న సతీష్, ఆయన భార్య భాగ్యలక్ష్మి (45) అక్కడే మరణించారు. శశాంక్, పావని, మహాలక్ష్మి, తుషారకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో సమీప పి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంబులెన్సులో క్షతగాత్రుల తరలింపు తిరుమలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం ఇద్దరి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దుర్ఘటన -
తీర్థయాత్రకు వెళ్తూ పరలోకాలకు
దొడ్డబళ్లాపురం: బెంగళూరు పరిధిలో యాక్సిడెంట్లతో రహదారులు నెత్తురోడాయి...మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 7 మంది దుర్మరణం చెందారు. యూ టర్న్లో విషాదం శనివారం అర్ధరాత్రి బెంగళూరు సమీపంలో దేవనహళ్లి సమీపంలోని రాణి క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు చనిపోగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులను తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలూకాకు చెందిన జయమ్మ(60), యశోదమ్మ (60), గంగ (38)గా గుర్తించారు. 12 మంది మహిళలు సీ్త్ర శక్తి సంఘంలో రుణం తీసుకుని కాశీతో పాటు ఉత్తర భారతదేశ యాత్ర చేయాలని నిర్ణయించారు. కెంపేగౌడ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం 6 గంటలకు విమానంలో బయలుదేరాల్సి ఉంది. ఇందుకోసం శనివారం రాత్రి 10గంటల సమయంలో బాడుగ టెంపో వాహనంలో ఎయిర్పోర్టుకు బయలుదేరారు. వాహనం డ్రైవర్కి ఈ దారి కొత్త కావడంతో మొబైల్లో గూగుల్ మ్యాప్ చూసుకుంటూ బయలుదేరాడు. దేవనహళ్లి రాణి క్రాస్ యూటర్న్లో గందరగోళానికి గురయ్యాడు. కాస్త ముందుకు వెళ్లి టర్న్ తీసుకోవడంతో వెనుక వేగంగా వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. క్యాంటర్ పల్టీలు కొట్టగా అందులోని ముగ్గురు తీవ్ర గాయాలతో చనిపోయారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వంతెన మీద.. ముగ్గురు మృతి బెంగళూరు కేఆర్ పురం మేడళ్లి వద్ద శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. కేఆర్ పురం సమీపంలోని మేడళ్లి బ్రిడ్జ్పైన కోలారు నుండి ఉర్లగడ్డల లోడ్తో బెంగళూరుకు వస్తున్న ఈచర్ వాహనం పంక్చర్ కావడంతో రోడ్డుపక్కన నిలిపారు. అదే సమయంలో హొసకోట నుంచి కేఆర్ పురం వస్తున్న టాటా ఇంట్రా వాహనం ఈచర్ను వెనుక నుంచి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వైట్ ఫీల్డ్కి చెందిన మణికంఠ, సురేశ్, శ్రీనివాస్ అనే ముగ్గురు చనిపోయారు. ● బెంగళూరు ఇస్కాన్ వద్ద కమలమ్మనగుండి సమీపంలో 24 ఏళ్ల యువకుడు బైక్ పై వస్తూ డివైడర్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడే మరణించాడు. ఈ ప్రమాదాలపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. మహిళలతో విమానాశ్రయానికి వస్తున్న టెంపోను లారీ ఢీ ముగ్గురు మహిళలు దుర్మరణం 8 మందికి తీవ్ర గాయాలు దేవనహళ్లి వద్ద ప్రమాదం -
ఉగాండా ఏజెంట్తో రన్యారావు డీల్
● ఈడీ చార్జిషీటులో వెల్లడి బనశంకరి: కన్నడ నటి రన్యారావు, ఆమె అనుచరులు నిర్వహిస్తున్న బంగారం స్మగ్లింగ్ దందాలో ఈడీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు రూ.102 కోట్ల విలువచేసే బంగారాన్ని అక్రమంగా భారత్కు తరలించారని ఈడీ కోర్టులో చార్జిషీట్ వేసింది. ఇందులో ఉగాండా దేశానికి చెందిన ఏజెంటుతో నటి రన్యకు లింకులు ఉన్నట్లు తెలిపింది. ఈడీ చార్జిషీటులో పేర్కొన్న ప్రకారం ఆమె దుబాయ్ నుంచే కాకుండా ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా బంగారాన్ని అక్రమంగా తరలించేది. దీనికోసం ఉగాండా ఏజెంట్తో సంప్రదించింది. దీనికోసం దుబైలో వీరా డైమండ్ ట్రేడింగ్ అనే పేరుతో కంపెనీని కూడా తెరిచింది. రన్యారావు స్నేహితుడు రాజు, సదరు ఏజెంట్కు అడ్వాన్స్గా రూ.33 లక్షలు చెల్లించారు. 2024, జనవరిలో రాజు బంగారం తేవడానికి ఉగాండాకు వెళ్లగా ఆ ఏజెంట్ తనకు మరింత ఎక్కువ డబ్బు.. అంటే రూ.1.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్ పెట్టినట్లు తెలిసింది. రాజు వట్టిచేతులతో వచ్చాడు. స్మగ్లింగ్ కేసుల్లో అరెస్టయిన రన్య బెంగళూరు పరప్పన జైల్లో గడుపుతోంది. పీడబ్ల్యూడీ ఇంజినీర్ మిస్సింగ్ దొడ్డబళ్లాపురం: పీడబ్ల్యూడీ ఇంజినీర్ గత 8 రోజుల నుంచి కనిపించడం లేదు. కలబుర్గిలోని పీడబ్ల్యూడీ కార్యాలయంలో జేఈ గా పనిచేసే సునీల్ హక్కి మిస్సయ్యాడు. 5వ తేదీన మధ్యాహ్నం సునీల్ మొబైల్ఫోన్ని ఇంట్లోనే వదిలి తల్లి వద్ద రూ.15వేలు తీసుకుని బయటకు వెళ్లినవాడు తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినా జాడ లేకపోవడంతో కుటుంబీకుల్లో దిగులు నెలకొంది. ఎంబీ నగర్ పోలీసులు గాలింపు చేపట్టారు. ఠాణాకు చేరిన లంబోర్గిని● డ్రిఫ్టింగ్ కేసులో సీజ్ యశవంతపుర: బెంగళూరు ఎంజీ రోడ్డులో లంబోర్గిని కారుతో అర్ధరాత్రి డ్రిఫ్టింగ్ విన్యాసాలు చేసిన కేసులో కబ్బన్ పార్క్ పోలీసులు ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. మాఫియా డాన్ ముత్తప్ప రై కుమారుడు రిక్కీ రై కారును డ్రిఫ్టింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రిక్కీ రై కి నోటీసులు పంపి విచారణకు రావాలని సూచించారు. కారు ఎవరి పేరున ఉందో తెలుసుకోవడానికి ఆర్టీఓ అధికారులకు లేఖ రాశారు. ఈ కారుతో ఎంజీ రోడ్డులో గతంలోనూ డ్రిఫ్టింగ్ విన్యాసాలు చేసినట్లు అనుమానాలున్నాయి. కారును పోలీసు స్టేషన్కు తీసుకువచ్చిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. నాపై మూడేళ్లుగా సీఐ అత్యాచారం ● సందేశ్పై మహిళ ఫిర్యాదు, కేసు నమోదు యశవంతపుర: మహిళలను వేధించిన వ్యవహారంలో దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె సీఐ పీజీ సందేశ్ వివాదం కొనసాగుతూనే ఉంది. వేధింపుల కేసులో ఆయనను సస్పెండ్ చేస్తే సరిపోదు, కేసు కూడా పెట్టాలి అని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దక్షిణకన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా వేణూరు పోలీసులు సందేశ్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 2020 నుంచి 2023 మధ్య మూడేళ్లపాటు తన ఇంటికి సందేశ్ తరచూ వస్తూ లైంగిక దాడి చేసేవాడని మహిళ ఫిర్యాదులో ఆరోపించడం సంచలనం కలిగిస్తోంది. ఇది జిల్లా పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది. 2020లో సందేశ్ బెళ్తంగడి సర్కిల్లోని వేణూరు పోలీసుస్టేషన్ సీఐగా పని చేసేవారు. ఘటన అక్కడే జరగడంతో కేసును అక్కడే నమోదు చేసుకున్నారు. సందేశ్పై ఇద్దరు మహిళలు చేసిన లైంగిక వేధింపుల అరోపణలు అవాస్తవమని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ అంతలోనే రేప్ కేసు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రానురాను ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న కుతూహలం వ్యక్తమవుతోంది. అలాగే సీఐని అరెస్టు చేస్తారా అనేది మిస్టరీగా మారింది. -
గ్యాస్ దొరకదు.. స్టవ్ వెలగదు
బనశంకరి: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన గ్యాస్ కొరత హోటళ్లను ముప్పుతిప్పలు పెడుతోంది. కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడింది. అనేక చిన్నా చితకా హోటళ్లు మూతపడ్డాయి. ప్రత్యేకించి మాంసాహార హోటల్స్, రెస్టారెంట్లు మూసివేసే పరిస్థితి తలెత్తింది. బెంగళూరులో ప్రముఖ ఎంపైర్ హోటల్తో పాటు అనేక రెస్టారెంట్లలో వంటకాలను బాగా తగ్గించారు. గ్యాస్ ఎక్కువగా వాడే గ్రిల్డ్ చికెన్, మటన్ వంటకాలు , షేర్వాను బంద్ చేశారు. మెజస్టిక్ తో పాటు నగరంలో ప్రముఖ ప్రాంతాల్లో ఉండే మాంసాహార హోటల్స్ మూతపడడంతో కస్టమర్లు ఇబ్బందులు పడ్డారు. అన్నం సాంబార్ వంటి తేలికపాటి వంటకాలే హోటళ్లలో లభిస్తున్నాయి. అవి కూడా ధరలు పెరిగాయి. ఉత్తర భారత వంటకాలు, చైనీస్ రుచులకు బ్రేక్పడింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా గ్యాస్ కొరతతో ధార్వాడతో పాటు అనేక జిల్లాల్లో హోటల్ యజమానులు కట్టెలు పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. కానీ ఫాస్ట్ఫుడ్కు కట్టెల పొయ్యిలు సరిపోవు, దీంతో ఆ సెంటర్లు చాలావరకు మూసేశారు. బెంగళూరు హోటల్స్ అసిసోయేషన్ అద్యక్షుడు పీసీ.రావ్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బాయలర్లు, ఇండక్షన్ స్టౌలను వినియోగించాలని సలహా ఇచ్చారు. బెంగళూరు హోటళ్లకు సిలిండర్ల కొరత అనేక ఆహారశాలల బంద్ బ్లాక్లో భారీ రేట్లు స్టాక్ లేని కారణంగా బ్లాక్ మార్కెట్లో వాణిజ్య సిలిండర్లకు ఎక్కడ లేని గిరాకీ నెలకొంది. కొందరు అక్రమార్కులు, సిలిండర్ ఫిల్లింగ్ వ్యాపారులు ఒక్కో సిలిండర్ను రూ.3 వేల నుంచి రూ.5 వేల మధ్య అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొడగు, చిక్కమగళూరు లాంటి పర్యాటక ప్రాంతాల్లో హోటల్స్ బంద్ కావడంతో పర్యాటకులు ఆకలితో ఇబ్బందిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరగా గ్యాస్ను పంపిణీ చేయాలని హోటళ్ల యజమానులు కోరుతున్నారు. -
నాపై మూడేళ్లుగా సీఐ అత్యాచారం
యశవంతపుర(కర్ణాటక): మహిళలను వేధించిన వ్యవహారంలో దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె సీఐ పీజీ సందేశ్ వివాదం కొనసాగుతూనే ఉంది. వేధింపుల కేసులో ఆయనను సస్పెండ్ చేస్తే సరిపోదు, కేసు కూడా పెట్టాలి అని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దక్షిణకన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా వేణూరు పోలీసులు సందేశ్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 2020 నుంచి 2023 మధ్య మూడేళ్లపాటు తన ఇంటికి సందేశ్ తరచూ వస్తూ లైంగిక దాడి చేసేవాడని మహిళ ఫిర్యాదులో ఆరోపించడం సంచలనం కలిగిస్తోంది. ఇది జిల్లా పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది. 2020లో సందేశ్ బెళ్తంగడి సర్కిల్లోని వేణూరు పోలీసుస్టేషన్ సీఐగా పని చేసేవారు. ఘటన అక్కడే జరగడంతో కేసును అక్కడే నమోదు చేసుకున్నారు. సందేశ్పై ఇద్దరు మహిళలు చేసిన లైంగిక వేధింపుల అరోపణలు అవాస్తవమని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ అంతలోనే రేప్ కేసు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రానురాను ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న కుతూహలం వ్యక్తమవుతోంది. అలాగే సీఐని అరెస్టు చేస్తారా అనేది మిస్టరీగా మారింది. -
జేఆర్సీతో పెండింగ్ కేసుల పరిష్కారం
బెంగళూరు: దేశవ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న చెప్పారు. కేసుల కొండ కరగాలంటే న్యాయ సంస్కరణల కమిషన్ (జేఆర్సీ) ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవస్థాగతపరమైన కొన్ని లోపాలు కక్షిదారులకు న్యాయం చేకూర్చడంలో జాప్యానికి కారణమవుతున్నాయని అభిప్రాయ పడ్డారు. శనివారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో ‘పెండింగ్ నుండి సత్వర న్యాయం వరకు: భార తీయ న్యాయస్థానాల్లో న్యాయ పంపిణీపై పునరాలోచన’ అనే అంశంపై జస్టిస్ నాగరత్న మాట్లాడారు. న్యాయ సంస్కరణల కమిషన్లో కేవలం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులకే కాకుండా జిల్లా కోర్టుల న్యాయమూర్తులు, న్యాయ వాదులకు సభ్యత్వం కల్పించాలని సూచించారు. జాతీయ స్థాయి బార్ అసోసియేషన్ సభ్యులకు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్కు, ప్రభుత్వ ప్రతినిధులకు ఇందులో భాగస్వామ్యం ఉండాలన్నారు. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేసే బాధ్యతను ఈ కమిషన్కు కట్టబెట్టాలని జస్టిస్ నాగరత్న సూచించారు. వాయిదాలకే ప్రాధాన్యం కేసులో యథాతథ స్థితిని విధించడం, విచారణను సుదీర్ఘకాలం వాయిదా వేయడం వంటి కారణాలతో పెండింగ్ కేసులు పెరుగుతున్నాయని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ‘స్టేటస్ కో’తో ప్రయోజనం పొందే కక్షిదారులు కేసు విచారణ వాయిదాపడడానికి మొగ్గు చూపుతున్నారని చెప్పారు. లాయర్లు వాయిదాలను ఇష్టపడుతున్నారని, దానివల్ల వారికి లాభం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రతిసారి విచారణ జరిగినప్పుడల్లా వారికి ఎంతోకొంత ఆదాయం వస్తోందన్నారు. ప్రభుత్వ విభాగాలు ఏదైనా కేసులో ప్రతికూలంగా తీర్పు వస్తే మళ్లీ అప్పీల్కు వెళ్తున్నాయని గుర్తుచేశారు. చివరకు కేసులు ఎటూ తేలకుండా పెండింగ్లో కొనసాగుతున్నాయని స్పష్టంచేశారు. న్యాయమూర్తులు సత్వర తీర్పు కంటే కేసుల వాయిదాకే ప్రాధాన్యం ఇస్తున్నారని జస్టిస్ నాగరత్నం వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే న్యాయ సంస్కరణల కమిషన్ ద్వారా సంస్థాగతమైన మార్పులు తీసుకురావాలని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వమే అతిపెద్ద కక్షిదారుగా మారుతోందని ఆక్షేపించారు. ప్రభుత్వ అధికారులు సూక్ష్మపరిశీనలను తప్పించుకోవడానికి అప్పీళ్లు దాఖలు చేస్తూ కాలం గడిపేస్తున్నారని తెలిపారు. దీనివల్ల త్వరగా పరిష్కారమయ్యే వివాదాలు ఎక్కువ కాలం పెండింగ్లో ఉంటున్నాయని పేర్కొన్నారు. లాయర్లు వృత్తిపరమైన, నైతిక ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని జస్టిస్ నాగరత్న పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆచరణీయమైన లిటిగేషన్ పాలసీ తీసుకురావాలన్నారు. నిధులు సకాలంలో ఇవ్వాలని, న్యాయమూర్తుల పోస్టులు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని వెల్లడించారు. -
భువనేశ్వర.. అపర భగీరథ
● నదిలోకి బోరుబావి నీరు వదిలిన అన్నదాత రాయచూరు రూరల్: రాష్ట్రంలో కరువు నెలకొన్న సమయంలో వానలు కురువక నదులు, బావులు, చెరువులు ఎండి పోయాయి. వేసవి కాలంలో ప్రజలు, పశువులకు నీరు లభించని సమయంలో ఓ రైతు ఏకంగా నదికి బోరుబావి నీరు వదిలిన ఘటన ఉత్తర కర్ణాటకలో చోటు చేసుకుంది. హావేరి జిల్లాలో వరదా నది ప్రవహిస్తుంది. ఎండ వేడిమికి ఇటీవల నది ఒట్టిపోయింది. హావేరి జిల్లా సంగూరు రైతు భువనేశ్వర శిడ్లాపూర్ తన పొలంలోని బోరుబావి నీటిని నదిలోకి వదిలి మానవత్వాన్ని చాటుకున్నారు. తాను నది నుంచి పొందిన నీటిని తిరిగి నదిలోకి వదలి పశువులు, పక్షులకు దాహం తీర్చడానికి అపర భగీరధుడు అయ్యాడు. బోరుబావి నీటిని నదిలో చిన్న చిన్న గుంతలు తవ్వి నీటి నిల్వకు చర్యలు చేపట్టారు. ఆయన చేసిన పనిని గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు. -
బళ్లారి రైల్వే అభివృద్ధికి కృషి చేయండి
సాక్షి,బళ్లారి: బళ్లారి ప్రాంత రైల్వే సమస్యల పరిష్కారం కోసం శ్రమించాలని రైల్వే కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో లోక్సభ సభ్యుడు తుకారాంకు విజ్ఞప్తి చేశారు. శనివారం సమితి అధ్యక్షుడు మహేశ్వరస్వామి నేతృత్వంలో పలువురు సభ్యులు లోక్సభ సభ్యుడిని కలిసి బళ్లారి ప్రాంత రైల్వే సమస్యలను వివరించారు. ప్రాంతీయ రైల్వే అభివృద్ధి, కొత్త మార్గాలు, నిలిచిపోయిన రైళ్లను పునరుద్ధరించాలని తదితర అంశాలతో కూడిన డిమాండ్లను వివరించారు. ముఖ్యంగా ఆగిపోయిన కొల్హాపూర్– మణుగూరు రైలు సేవలు త్వరలో తిరిగి ప్రారంభించాలని, శివమొగ్గ–చైన్నె రైలు సేవలను పునరుద్ధరించాలన్నారు. బళ్లారి మీదుగా వందే భారత్ లేదా ఇంటర్ సిటీ రైలును నడపాలన్నారు. దీనివల్ల బళ్లారితో పాటు చట్టుపక్కల జిల్లాలకు చెందిన వారికి మెరుగైన సేవలు అందుతాయన్నారు. బళ్లారి మీదుగానే అజ్మీర్ రైలు నడపాలి మైసూరు– అజ్మీర్ రైలును బళ్లారి, హొసపేటె మార్గంలోనే నడపాలన్నారు. ఈ మార్గం ద్వారా ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న బళ్లారి– సిరుగుప్ప– సింధనూరు మధ్య రైలు మార్గాన్ని నిర్మించాలని, హగరి– ఆదోని రైలు మార్గాన్ని త్వరితగతిన ప్రారంభించాలని, ఈ ప్రాజెక్టులను అమలు చేసేందుకు సంబంధిత కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ విషయాలపై అవసరమైతే పార్లమెంటులో కూడా గళం విప్పాలని మనవి చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రాంత రైల్వే సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. సమితి సభ్యులు పల్లెద ప్రభులింగ, బండేగౌడ, ఉమాపతి, బీ.ఎం.ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ తుకారాంకు రైల్వే కార్యాచరణ సమితి సభ్యుల వినతి -
యథేచ్ఛగా భ్రూణ హత్యలు.!
హుబ్లీ: మగబిడ్డే కావాలన్న ఆశతో అత్యంత వెనుకబడిన యాదగిరి జిల్లాలో ఆడశిశువుల భ్రూణహత్యలు యథేచ్ఛగా జరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. పుట్టేది ఆడపిల్ల అని తేలడంతో 7 నెలల్లో 30 మంది గర్భస్రావం చేయించుకున్నారని నివేదిక వెల్లడించింది. ఆ జిల్లా జెడ్పీ సీఈఓ లబిష్ వరడియా సూచన మేరకు ఆడ శిశువుల భ్రూణ హత్యల దర్యాప్తుపై ఏర్పాటైన ఆరోగ్య శాఖ కమిటీ ఈ నివేదిక ఇచ్చింది. ఈ మేరకు 2025 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జిల్లాలో 35 అబార్షన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటిలో 5 కేసులను వైద్యుల నివేదిక ఆధారంగా సహజం అని గుర్తించినా కూడా మిగిలిన 30 కేసుల్లో ఆడపిల్ల అన్న కారణంగానే అబార్షన్లు చేయించుకున్నారని తేలింది. తెర వెనుక మరెన్నో కేసులు శాఖా పరమైన దర్యాప్తులో ఈ 30 కేసులు వెలుగు చూసినా ఇలాంటివి ఎన్నో కేసులు తెరవెనుకే ఉండి పోతున్నాయి. చడీచప్పుడు లేకుండా ఆడ శిశువులను గర్భంలోనే చిదిమేస్తున్న ఘటనలు మానవాళికి మచ్చ తెస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 19న ఆ జిల్లా క్షయరోగ అధికారి డాక్టర్ సంజీవ్కుమార్ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేసి ఉద్దేశపూర్వకంగా అబార్షన్ చేయించిన కేసుల నిగ్గు తేల్చాలని సూచించడంతో ఈ దారుణ వివరాలు వెల్లడయ్యాయి. మూడు, నాలుగు, ఐదు, అలాగే ఆరో సారి జననం తర్వాత మగబిడ్డ కావాలన్న ఆశతో గర్భవతులైన కొందరు మహిళలు పరీక్షల్లో ఆడపిల్ల అని నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి తదితర కారణాలతో అబార్షన్ చేయించుకున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అబార్షన్లు 7 నెలల్లో 30 మంది గర్భస్రావాలు ఆరోగ్య శాఖ కమిటీ నివేదికలో వెల్లడి సదరు మహిళలు వైద్యుల సలహా లేకున్నా కూడా ప్రైవేట్ నర్సింగ్ హోంలలో అబార్షన్లు చేయించుకున్నారని దర్యాప్తులో తెలిసింది. జిల్లాలో కొందరు మహిళలు రాయచూరు జిల్లా ముదగల్, విజయపుర జిల్లా తాళికోటలో వైద్య పరీక్షలకు వెళ్లి అక్కడే అబార్షన్లు చేయించుకున్నారు. మరి కొందరు గర్భవతులు మహారాష్ట్రలో అబార్షన్లు చేయించుకున్నట్లు ఆ నివేదికలో తెలిపారు. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కిట్ల అశాసీ్త్రయమైన విక్రయాలకు కళ్లెం వేయడం ద్వారా ఇలాంటివి అరికట్టవచ్చునని ఆ నివేదికలో సలహా ఇచ్చారు. -
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దుర్మరణం
రాయచూరు రూరల్: నారాయణ పుర కుడి కాలువలోకి జారి పడి ఓ యువకుడు నీటి పాలైన ఘటన రాయచూరు జిల్లా బుద్దిన్నిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఉగాది కరి పండుగ సందర్భంగా రంగులు చల్లుకొని అరకెర తాలూకా బుద్దిన్ని నివాసి స్నానం కోసం కాలువ వద్దకు వెళ్లిన గంగాధర(20) ఈత రాక పోవడంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. నాగోలి వద్ద శవం లభించినట్లు పోలీసులు తెలిపారు. గబ్బూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా చెరువులో పడి ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని మాన్వి తాలూకాలో జరిగింది. గోవినదొడ్డి గోవిందరాజ్(22) అనే యువకుడు ఈత రాక పోవడంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. కాలువలోకి జారి పడి ఓ యువకుడు చెరువులో పడి మరో యువకుడు మృతి -
రైతు సంక్షేమానికి పెద్దపీట
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తానని గురుమఠకల్ శాసన సభ్యుడు శరణేగౌడ పేర్కొన్నారు. శనివారం శాసన సభ్యుడి కార్యాలయంలో వ్యవసాయ రైతులకు వరి రాశులు చేసే యంత్ర పరికరాలను అందించి మాట్లాడారు. భవిష్యత్తులో రైతులు ఉత్తమ పంటలు పండించడానికి వ్యవసాయ శాఖాధికారులు సలహా సూచనలు, సహాయ సహకారాలు అందించాలన్నారు. వ్యవసాయ శాఖ నుంచి వచ్చే పథకాలను రైతులు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. రైతులకు సకాలంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన సలహా, సూచనలివ్వాలని అధికారులను ఆదేశించారు. బాలికపై లైంగిక వేధింపులు ● పాఠశాల హెడ్మాస్టర్ అరెస్ట్ హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని నవలగుంద తాలూకాలోని ఓ గ్రామంలోని పాఠశాలలో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఫిర్యాదుకు సంబంధించి నిందితుడైన ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు పాఠశాల గదిలో ఆ హెచ్ఎం పదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు దర్యాప్తు చేసి లైంగిక వేధింపులు పాల్పడిన హెచ్ఎంపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అరెస్ట్ చేశారు. ఆల్మట్టి–గదగ్ రైల్వే లైన్ పరిశీలన రాయచూరు రూరల్: ఆల్మట్టి–గదగ్ రైల్వే లైన్లో విండో ట్రేలింగ్ పనులను హుబ్లీ డివిజనల్ రైల్వే మేనేజర్ బేలా మీనా పరిశీలించారు. పనుల తీరుపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఆల్మట్టి– వండాల మధ్య డబ్లింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రయాణికులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రాయచూరు– గిణిగేరా రైల్వే లైన్ పనులపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వాలి ● ఈ విషయంపై సీఎం, డీసీఎంలను కోరతాం ● యువతకు కేబినెట్లో చోటివ్వాలని ఢిల్లీకి వెళతాం ● నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి వెల్లడి సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వాలని పార్టీ హైకమాండ్ను కోరుతామని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. బెంగళూరులో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలుపొందిన 48 మంది యువ ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించామన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా యువకులకు అవకాశం ఇవ్వాలని చర్చించామన్నారు. సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లను కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామన్నారు. యువకులకు మంత్రి పదవి ఇస్తే పార్టీ మరింతగా బలోపేతం కావడానికి వీలవుతుందన్నారు. యువకులైన ఎమ్మెల్యేల్లో పార్టీ ఎవరిని ఎంపిక చేసినా ఫర్వాలేదన్నారు. మొదటి, రెండోసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారికి మంత్రి పదవి ఇస్తే పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళతారో తాము వివరిస్తామన్నారు. యువకులకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతామన్నారు. ఈ విషయాన్ని అవసరమైతే ఢిల్లీలో పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళతామన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నగరాన్ని సువర్ణ బళ్లారి కావాలని దేవున్ని ప్రార్థించినట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, పార్టీ ప్రముఖులు హుమయూన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.ముస్లింలకు ఇఫ్తార్ విందు రాయచూరు రూరల్: జిల్లాలో ప్రజలు హిందూ, ముస్లిం అనే భేద భావాలను మరిచి సోదరులుగా మెలుగుతున్నారని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, లోక్సభ సభ్యుడు కుమార నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మహిళా సమాజ్లో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వారు పాల్గొని మాట్లాడారు. ఇదే సందర్భంగా పలు మసీదుల్లో కూడా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును అందించారు. -
కలుషితాహారంతో పది మంది భక్తులకు అస్వస్థత
గుంతకల్లు రూరల్: కలుషితాహారం తినడం వల్ల పది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల కథనం మేరకు.. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా అశోక్ సిద్ధాపుర గ్రామానికి చెందిన దాదాపు 45 మంది భక్తులు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉగాది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈనెల 19న అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో వసతి గదులు దొరక్క పోవడం, బయట అద్దె గదుల ధర భారీగా ఉండటంతో దిక్కుతోచని భక్తులు ఆలయం వెలుపలే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గడిచిన రెండు రోజులుగా వారు ఆలయ కేసరి సదనం ముందు భాగంలో సొంతంగా వంట వండుకొని తింటూ, రాత్రి ఆరు బయటే బస చేస్తున్నారు. శుక్రవారం పాయసంతో పాటు అన్నం, సాంబారు, వంకాయ కూర వండుకున్నారు. రాత్రికి అన్నం మాత్రమే వండుకొని ఉదయం చేసిన కూరలతో తిన్నారు. అయితే అర్ధరాత్రి ఒకరి తరువాత మరొకరికి కడుపునొప్పితో కూడిన వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. కొద్దిసేపటిలోనే అస్వస్థతకు గురికావడంతో దాదాపు 10 మందిని వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు కూడా ఆస్పత్రికి చేరుకొని చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. -
ఘనంగా రంజాన్ ప్రార్థనలు
సాక్షి,బళ్లారి: నెల రోజులు కఠిన నియమాలతో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లిం సోదరులు రంజాన్ పండుగ వేళ ఉపవాస దీక్షలను భక్తిశ్రద్ధలతో విరమించారు. శనివారం పరమ పవిత్రమైన రంజాన్ పండుగను ముస్లిం సమాజ బాంధవులు భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుపుకున్నారు. కొత్త బట్టలు ధరించి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఈద్ ముబారక్ అంటూ సంతోషంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద దానాలు చేస్తూ దానం గుణం చాటారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదులు, ఈద్గాల వద్ద పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు చేరి సామూహిక ప్రార్థనలు చేసి, ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు ముఖ్యంగా నగరంలోని బెంగళూరు రోడ్డుకు వెళ్లే ప్రాంతంలో వెలసిన అతి పెద్ద ఈద్గా మైదానంలో వేలాది మంది ముస్లిం సోదరులు చేరి సామూహిక ప్రార్థనలు చేశారు. నగరంలోని ముస్లిం సోదరులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా జనం తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొనడంతో ఈద్గా మైదానం వద్ద ఇసుక వేస్తే నేలరాలంతగా జనం సందడి కనిపించింది. మత గురువు సంప్రదాయబద్దంగా సామూహిక ప్రార్థనలు చేయించారు. అందరూ కూర్చొని నిశ్శబ్దంగా అల్లాను ప్రార్థిస్తూ ధ్యానంలో నిమగ్నమయ్యారు. రంజాన్ పండుగకు గొప్ప విశిష్టత రంజాన్ పండుగ గొప్ప విశిష్టత కలిగినదని, సహనం, నియమం, దయ, దానం, ఆధ్యాత్మికత మేళవింపుతో పండుగను ఆచరించడమే రంజాన్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా లోక్సభ సభ్యుడు తుకారాం, నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ నగరంలో ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు, వారిని కలిసి సామూహిక ప్రార్థనలు చేశారు. పెద్ద సంఖ్యలో సామూహిక ప్రార్థనలు చేయడంతో ఈద్గా వద్ద గట్టి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. విజయనగరలో.. హొసపేటె: రంజాన్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. శనివారం విజయనగర జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం ఆయా ఈద్గా మైదానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మసీదులు, ఈద్గాల వద్దకు భారీగా తరలివచ్చి ఒకరికొకరు ఈద్ముబారక్ తెలుపుకుంటూ సోదర భావం చాటారు. ఉపవాస దీక్షల అనంతరం ఎంతో ఆసక్తిగా రంజాన్ను ఆచరించారు. మసీదులు, ఈద్గాలు ముస్లింలతో కిటకిటలాడాయి. నగరంలో ఐఎస్ఆర్ రోడ్డులోని ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయచూరులో .. రాయచూరు రూరల్: ముస్లిం సోదరులు శనివారం ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు జరిపారు. అత్యంత భక్తిశ్రద్ధలతో నమాజ్ చేశారు. చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజు మాట్లాడుతూ జిల్లాలో హిందువులు, ముస్లింలు అన్నదమ్ములుగా ఉన్నారన్నారు. మనమంతా ఒక్కటే అనే భావాన్ని చాటడానికి రంజాన్ పండుగ చేసుకోవడం నిదర్శనమన్నారు. జిల్లాధికారి నితీష్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, లోక్సభ సభ్యుడు కుమార నాయక్, మాన్విలో శాసన సభ్యుడు హంపయ్య నాయక్, యరగేరలో గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ ప్రార్థనల్లో పాల్గొన్నారు.బళ్లారిలో ఈద్గా వద్ద ముస్లింలకు ఎమ్మెల్యే భరత్రెడ్డి శుభాకాంక్షలురాయచూరులో ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనల్లో ముస్లింలు ఈద్గాలు, మసీదుల్లో కిక్కిరిసిన ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలతో పండుగను ఆచరించిన వైనం ఈద్గాల వద్ద నేతల సందడి, ముస్లింలతో కలిసి ప్రార్థనలు -
సామూహిక ప్రార్థనల్లో అపశ్రుతి
సాక్షి,బళ్లారి: పవిత్రమైన రంజాన్ పర్వదినం రోజున అపశ్రుతి దొర్లింది. సామూహిక ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులపై తేనెటీగలు దూసుకొచ్చి మూకుమ్మడిగా దాడి చేశాయి. శనివారం రంజాన్ సందర్భంగా దావణగెరె జిల్లాలోని అనగోడు గ్రామంలో ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగల గుంపు దూసుకొచ్చింది. పక్కనే పెద్ద ఎత్తున ఉన్న తేనెటీగల గూళ్లను ఆకతాయిలు కదిలించడంతో తేనెటీగలు ప్రవాహంలా ప్రార్థనలు చేస్తున్న వారిపైకి దూసుకొచ్చాయి. తేనెటీగలు పెద్ద సంఖ్యలో రావడంతో సామూహిక ప్రార్థనలు చేస్తున్న వారంతా లేచి పరుగులు తీశారు. ఆ క్రమంలో కొందరు కాలు జారి కిందకు పడిపోవడంతో కాళ్లు కూడా విరిగాయి. తేనెటీగల దాడిలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడిలో 25 మందికి పైగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఈద్గా మైదానం భీతావహం సామూహిక ప్రార్థనలు చేసే ప్రాంతమంతా ఆందోళనకర వాతావరణంలా మారిపోయింది. వెంటనే స్థానిక పోలీసులకు, అధికారులకు తెలియడంతో హుటాహుటిన చేరుకుని గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తొక్కిసలాటలో కింద పడి కొందరు గాయపడి, తేనెటీగల దాడిలో కొందరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. తేనెటీగలు తీవ్రంగా కుట్టిన ఐదు మందికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. తేనెటీగల దాడి వల్ల శరీరంలో వాపులు, నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రి వద్ద గాయపడిన వారి రోదనలు మిన్నంటాయి. పవిత్ర ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆందోళన కలిగించగా, భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంజాన్ నమాజ్ చేస్తుండగా తేనెటీగల మూకుమ్మడి దాడి 25 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం దావణగెరెలో మసీదు వద్ద కలకలం రేపిన ఘటన -
చెరువులు.. మృత్యుహేతువులు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో చెరువులకు రక్షణ గోడలు, కంచెలు కరువు కావడంతో అమాయకులైన యువకులు నీటిలో మునిగి బలి అవుతున్నారు. నెల రోజుల్లో సుమారు 60 మందికి పైగా చెరువుల్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు. గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు, కార్యదర్శులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాయచూరు జిల్లాలో 568 చెరువులు, కలబుర్గిలో 985 చెరువులు, యాదగిరి జిల్లాలో 358 చెరువులు, కొప్పళ జిల్లాలో 589 చెరువులు, బీదర్ జిల్లాలో 989 చెరువులున్నాయి. ప్రవాసాంధ్రులు నివసించే క్యాంపుల్లో కూడా చెరువులు నిర్మించుకున్నారు. అధికారికంగా చెరువులకు రక్షణ గోడలు, కంచెలు, తంతులు వేయకుండా అలాగే వదిలేశారు. వేసవిలోనే ఎక్కువ మరణాలు వేసవి కాలంలో అధిక శాతం పల్లె ప్రాంతాల్లో ఎండవేడిమి నుంచి ఉపశమనానికి స్నానం చేయడానికి, ఈత కొట్టడానికి వెళతారు. చెరువులో అధిక ప్రమాణంలో పూడిక పేరుకొని ఉంటుంది. సింధనూరు తాలూకా అలబనూరు చెరువు, రాయచూరు తాలూకా మర్చటాళ్ చెరువు, యాదగిరి జిల్లా వడగేర తాలూకా జోళదడగి చెరువులో యువకులు ఈత కొట్టడానికి వెళ్లి పూడికలో కూరుకొని పోవడంతో ఊపిరాడక మృతి చెందిన ఉదాహరణలున్నాయి. గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు, కార్యదర్శులు ఈ విషయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెరువులకు రక్షణ గోడల నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కళ్యాణ కర్ణాటకలో చెరువుల వద్ద రక్షణ ఏదీ? నీటిలో కలిసి పోతున్న యువత ప్రాణాలు నెల రోజుల్లో 60 మందికి పైగా మరణం -
నదిలో పడి యువకుడు మృతి
సాక్షి,బళ్లారి: దావణగెరె జిల్లా న్యామతి తాలూకా గోవినకవి గ్రామ సమీపంలో తుంగభద్ర నదిలోకి కడదహట్టి గ్రామానికి చెందిన కార్తీక్(23) అనే యువకుడు ప్రమాదశాత్తు కాలుజారి పడి మృతి చెందాడు. ఈ ఘటనతో నదీ తీరంలో బంధు మిత్రుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన నది వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భారీ వర్షాలకు 32 మేకల మృతి హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని నవలగుంద పట్టణంతో పాటు ఆ తాలూకాలోని వివిధ గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు తిర్లాపురలో రెండు ఇళ్లు నేలమట్టం కావడంతో పాటు ఆ గ్రామానికి చెందిన నింగప్ప కరిగారకు చెందిన 21 మేకలు, సోమప్పకు చెందిన ఆరు మేకలు, నాగేష్కు చెందిన ఐదు మేకలు భారీ వర్షాల తీవ్రతకు మృతి చెందాయి. అంతేకాకుండా ఆ తాలూకాలో నాలుగు ఇళ్లకు నష్టం జరిగినట్లు అక్కడి అధికారులు పరిశీలనలో తేల్చారు. ఆరోగ్యం ఎలా ఉంది? కేజీఎఫ్: కేజీఎఫ్కు చెందిన విద్యార్థిని ప్రమాదంలో కాలు కోల్పోయి స్ట్రెచర్పైనే పదో తరగతి పరీక్ష రాసింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు సురేష్ కుమార్ శనివారం కేజీఎఫ్కు వెళ్లి విద్యార్థిని కుసుమను కలిశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థిని కుసుమ ఆత్మవిశ్వాసం మెచ్చుకోదగినదన్నారు. ప్రమాదంలో కాలు కోల్పోవడం దురదృష్టకరమని తెలిపారు. విద్యార్థిని కుసుమను చూసి గర్వపడుతున్నానన్నారు. ఇలాంటి విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. అంతర్రాష్ట దొంగల అరెస్టు మాలూరు: ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన మాస్తి పోలీసులు వారి నుంచి రూ.13.50 లక్షలు విలువ చేసే 100 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన ఎస్.లల్లూ ప్రశాంత్ (34), తమిళునాడు నేకారపట్టికి చెందిన వి.జనార్దన్ (31) అరెస్టు అయిన నిందితులు. వీరిపై తమిళనాడు, ఆంధ్రలో 31కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇంటి దొంగతనం కేసుకు సంభందించి గతంలో మాస్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకుని కార్యాచరణ జరిపిన పోలీసులు చాకచక్యంగా అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేయడంలో సఫలమయ్యారు. పోలీసుల కార్యాచరణను ఎస్పీ కన్నికా సిక్రివాల్ కొనియాడారు. -
ఎంజీ రోడ్డులో లంబోర్గిని డ్రిఫ్టింగ్
బనశంకరి: బెంగళూరు ఎంజీ రోడ్డులో శనివారం వేకువజామున విలాసవంతమైన తెల్ల రంగు లంబోర్గిని కారులో పోకిరీలు విపరీతమైన వేగంతో డ్రిఫ్టింగ్ విన్యాసాలు చేశారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో లంబోర్గిని కారులో దూసుకొచ్చి వేగంగా మలుపులు తిప్పారు, పెద్ద శబ్ధంతో పాటు పొగలు రేగాయి. కొందరు దీనిని మొబైల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ సమాచారం ఆధారంగా కబ్బన్ పార్కు ట్రాఫిక్ సీసీ కెమెరాలను పరిశీలించి కేఏ–05 ఎన్ఆర్ 0009 నంబరు లంబోర్గిని కారుగా గుర్తించారు. కారు యజమాని మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కారు ఆర్సీని రద్దుచేయాలని ఆర్టీఓకు లేఖ రాశారు. -
చిన్నారిని చిదిమిన లారీ
దొడ్డబళ్లాపురం: తల్లితో కలిసి దేవాలయానికి వెళ్తున్న నాలుగేళ్ల పాపను లారీ చిదిమేసిన దుర్ఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హనుమంతేగౌడన పాళ్యలో జరిగింది. నిశిక (4) మృతురాలు. తల్లితో కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ నిశికను ఢీకొంది. తీవ్రగాయాలైన పాప అక్కడే మరణించింది. కళ్లముందే బిడ్డ దూరం కావడంతో తల్లి కన్నీరుమున్నీరుగా రోదించింది. లారీ డ్రైవర్పై మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్సాహంగా చేపల వేట యశవంతపుర: ఉత్తర కన్నడ జిల్లా శిరసి తాలూకా బీళూరు గ్రామంలో చెరువులో చేపల వేట జరిగింది. ఏటా చేపలు పట్టే పోటీలు జరుగుతాయి. వలలు వాడకుండా చేతులతోనే పట్టాలి. వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. ఒక్కొక్కరు రూ.800 రుసుము చెల్లించాలి, ఈ డబ్బును కల్లేశ్వర దేవస్థానం జీర్ణోద్ధరణకు ఉపయోగిస్తామని గ్రామపెద్దలు తెలిపారు. కొందరికి మాత్రమే చేపలు దొరికాయి. -
హోంమంత్రి జిల్లాలో లాకప్ డెత్!
తుమకూరు: ఇస్పేట్ ఆడుతుండగా పోలీసులు పట్టుకున్న ఓ వ్యక్తి ఠాణాలో చనిపోయిన ఘటన జిల్లాలోని హుళియారు పోలీసు స్టేషన్లో శుక్రవారం రాత్రి జరిగింది. మృతుడిని యళనాడు గ్రామానికి చెందిన గుడిగౌడ కాంతరాజు (50)గా గుర్తించారు. అతని మృతికి పోలీసుల దౌర్జన్యమే కారణమని ఆరోపిస్తూ మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పోలీసు స్టేషన్ ఎదుట శవాన్ని పెట్టి ధర్నా చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇస్పేటు ఆడుతుండగా ఆరుగురిని పట్టుకుని స్టేషన్కు తరలించారు. రాత్రి 8 గంటలైనా పోలీసులు వారిని వదిలి పెట్టలేదు. అడిగేందుకు వెళ్లిన గ్రామస్తులను, కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్లోకి అనుమతించకుండా వాపసు పంపించారు. పోలీసుల లాఠీ దెబ్బలను తట్టుకోలేక కాంతరాజు చనిపోయాడని బంధువులు తెలిపారు. హడావుడిగా పోలీసులు అతనిని ఆస్పత్రికి తరలించగా మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. గ్రామస్తుల ఆగ్రహం ఇస్పేట్ ఆడితే ప్రాణం తీయాలా? అని గ్రామస్తులు పోలీసులపై మండిపడ్డారు. తమకు పరిహారం అందించాలని, సిబ్బందిని సస్పెండ్ చేయాలని కుటుంబీకులు పట్టుబట్టారు. మాజీ మంత్రి జేసీ మాధుస్వామి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ కిరణ్ జిల్లా ఎస్పీ కేవీ అశోక్ వచ్చి బాధిత కుటుంబంతో మాట్లాడారు. హోంమంత్రి పరమేశ్వర్ సొంత జిల్లాలోనే ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశమైంది. పోలీసు స్టేషన్ ముందు ప్రజల ధర్నా -
బస్సులో బంగారం మరచిపోయి..
దొడ్డబళ్లాపురం: బీఎంటీసీ బస్సులో ప్రయాణికురాలు మర్చిపోయిన రూ.10 లక్షల విలువైన బంగారు నగలను సిబ్బంది తిరిగి ఆమెకు అప్పగించారు. శుక్రవారం రాత్రి బెంగళూరులో బీఎంటీసీ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ తన బ్యాగ్ను బస్సులో మర్చిపోయింది. కండక్టర్ నాగేంద్ర, డ్రైవర్ సిద్ధరాజు బ్యాగ్ తీసుకుని చూడగా బంగారు నగలు కనిపించాయి. డిపో మేనేజర్కి తెలిపారు. బ్యాగ్లో ప్రయాణికురాలి వివరాలు ఉండడంతో ఆమెను సంప్రదించి డిపోకి పిలిపించి బ్యాగ్ను అందజేశారు. నగలు పోయాయని తీవ్ర బాధలో ఉన్న ఆమెకు ఉపశమనం కలిగింది. డ్రైవర్, కండక్టర్ నిజాయితీని మహిళతో పాటు తోటి ఉద్యోగులు అభినందించారు.అవి పాత వీడియోలు● సీఐ కేసులో కమిషనర్ వివరణ శివాజీనగర: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె సీఐ సందేశ్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి బెదిరించిన కేసు గురించి మంగళూరు నగర పోలీస్ కమిషనర్ సుధీర్కుమార్ రెడ్డి స్పష్టీకరణను ఇచ్చారు. ఇన్స్పెక్టర్ ప్రవర్తనలో లోపాలు ఉన్నది వాస్తమే అయినా, ఆయన విరుద్ధంగా కొన్ని ఫిర్యాదులు ముందుగానే ప్లాన్ చేసుకొన్నవి, అవాస్తవమైనవని కమిషనర్ పేర్కొన్నారు. వైరల్ అయిన ఆడియో, వీడియోలో ఇన్స్పెక్టర్ సందేశ్ మాటలు, ప్రవర్తన సరికాదనేది రుజువైందని చెప్పారు. అయితే ఆడియో, వీడియోలో ఉన్న మహిళలు తాము ఫిర్యాదు చేయలేదని తెలిపారు. మంగళూరులో సంవత్సరం నుంచి జరుగుతున్న బ్లాక్మెయిల్ కుట్రలను ఇక్కడ కూడా ఉపయోగించారన్నారు. ఏదేమైనా సీఐపై చర్యలు తీసుకున్నాం, పోలీస్ స్టేషన్కు వచ్చే మహిళలతో గౌరవంగా ప్రవర్తించాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఊరికెళ్లేందుకు ఆర్టీసీ బస్సు అపహరణ ● కేకే ఆర్టీసీ డ్రైవరు ఘనకార్యం సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్: అతను కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ(కేకే ఆర్టీసీ)లో యాదగిరి జిల్లా సైదాపుర బస్సు డిపోలో డ్రైవర్ కమ్ కండక్టర్. ప్రతి రోజు మాదిరిగానే విధులకు వచ్చి రోజంతా ఆర్టీసీ బస్సును నడిపారు. రాత్రి డ్యూటీ దిగిన తరువాత సొంత ఊరికి ఇంటికి వెళ్లడానికి బస్సు లేకపోవడంతో ఏకంగా కేకే ఆర్టీసీ బస్సును వేసుకుని వెళ్లిపోయాడు. సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో అతని నిర్వాకం బయటపడింది. ఈనెల 19న రాత్రి యాదగిరి జిల్లాలోని రాచనహళ్లి గ్రామానికి చెందిన మహిపాల్రెడ్డి అనే కేకే ఆర్టీసీ బస్సు డ్రైవర్ విధులు ముగిసిన తర్వాత ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. డిపో అధికారుల ఫిర్యాదు మేరకు సైదాపుర పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే డ్రైవర్ను సస్పెండ్ చేశారు. గజ దాడి.. ఆటో, బైక్ల ధ్వంసం యశవంతపుర: ఇంటి ముందు నిలిపిన ఆటోను తుంటరి ఏనుగు ధ్వంసం చేసిన ఘటన కొడగు జిల్లా కుశాలనగర హుదికేరి గ్రామంలో జరిగింది. బెట్టదకాడుకు చెందిన హెచ్టీ సునీల్ తన ఆటోను శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిలపగా అడవి నుంచి వచ్చిన ఏనుగు దాడి చేసి ధ్వసం చేసింది. దీంతో ఉపాధి పోయిందని బాధితుడు వాపోయాడు. హుదికేరి గ్రామంలోని సత్యనారాయణ గుడి, ఎంజీ కాలనీ చుట్టు పక్కల తిరిగిన ఆ ఏనుగు కొన్ని బైక్లను కూడా పడదోసి పాడు చేసింది. ఏనుగును చూసిన గ్రామస్థులు భయంతో గ్రామం నుంచి పారిపోయ్యారు. ఏనుగు కాఫీతోటలోకి వెళ్లిపోయింది. అటవీ సిబ్బంది రౌడీ ఏనుగు బంధించడానికి ప్రయత్నాలను ప్రారంభించారు. దుర్గమ్మకు విశేష పూజలుబొమ్మనహళ్లి: బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్ అగరలో శ్రీదుర్గా పరమేశ్వరి దేవి అమ్మవారి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి మహామంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. -
వృద్ధుని డిజిటల్ అరెస్టు, రూ.8.50 లక్షల మోసం
మైసూరు: మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని బెదిరించిన ఆన్లైన్ నేరగాళ్లు వృద్ధున్ని డిజిటల్ అరెస్టు చేసి రూ.8.50 లక్షలను వసూలు చేసిన ఘటన మైసూరులో జరిగింది. ఇక్కడి నేతాజీనగర నివాసులు బాధితుడు. ఓ దుండగుడు ఆయనకు ఫోన్ చేసి ట్రాయ్ నుంచి అభిషేక్ మిశ్రాను మాట్లాడుతున్నానని చెప్పాడు. మహిళలకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారు, దీంతో మీపై ముంబై క్రైం బ్రాంచ్లో కేసు నమోదైందని బెదిరించాడు. తర్వాత వాట్సాప్ వీడియో కాల్ చేసి మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని తెలిపాడు. తర్వాత హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని పైమొత్తాన్ని బదలాయించుకుని వంచించాడు. బాధితుడు సైబర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రూ.1.20 కోట్లు టోకరా, ఒకరి అరెస్టు ● బాగల్కోటలో భారీ స్కాం దొడ్డబళ్లాపురం: షేర్ మార్కెట్లో ట్రేడింగ్ పే రుతో బాగల్కోటలో రూ.1.20 కోట్లు కాజేసిన సంఘటన వెలుగు చూసింది. ఈ కేసులో జమఖండి నివాసి ప్రజ్వల్ (25) అనే నిందితున్ని బాగల్కోట సైబర్క్రైం ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ నుంచి ఇతడు రూ.1.20 కోట్లు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో 1,296 నకిలీ బ్యాంకు ఖాతాలకు ఆ డబ్బు వెళ్లింది. విచారణ కొనసాగుతోంది. నకిలీ బంగారాన్ని చూపి.. రూ.21 లక్షల బురిడీ మైసూరు: మైసూరుకు చెందిన రాజ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి నకిలీ బంగారాన్ని ఫైనాన్స్ కంపెనీలో కుదువపెట్టి డబ్బులు కొట్టేశాడు. కంపెనీ ప్రతినిధి నజర్బాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సిద్ధార్ధనగరలోని ఫైనాన్స్ కంపెనీలో నిందితుడు చంద్రశేఖర్ తాను సీఎస్బీ బ్యాంకులో బంగారాన్ని రూ.20.60 లక్షలకు తాకట్టు పెట్టానని చెప్పాడు. మీరు ఆ బంగారాన్ని విడిపిస్తే మీకే కుదువ పెడతానని నమ్మించాడు. అతని మాటలను నమ్మిన ఫైనాన్స్ కంపెనీ వారు అతనికి రూ.1 లక్ష ఇచ్చి, బ్యాంకు కు రూ.20.60 లక్షలను చెల్లించి అతని బంగారాన్ని విడిపించి తెచ్చారు. తర్వాత బంగారాన్ని పరిశీలించగా అది పాక్షికంగా నకిలీదిగా తేలింది. దీంతో మోసపోయామంటూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. షేర్ల పేరుతో రూ.5.22 లక్షల మస్కా హుబ్లీ: షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ స్థానిక బిడనాల్ నివాసి వినాయక మాగేరి నుంచి సైబర్ దొంగలు రూ.5.22 లక్షలను బదలాయించుకుని టోపీ వేశారు. సదరు వ్యక్తులు వినాయక్కు కాల్ చేసి తమ ద్వారా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెట్టాలని, బాగా లాభాలు వస్తాయని తెలిపారు. వారి బుట్టలో పడిన వినాయక దశలవారీగా రూ.14.81 లక్షలను కేటుగాళ్లు ఖాతాల్లోకి జమచేశారు.ఆ తర్వాత రూ.9.58 లక్షలు తిరిగి చెల్లించగా, మిగిలిన సొమ్ము పత్తా లేదు. నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాష్ట్రంలో పలుచోట్ల సైబర్ నేరాలు -
మాకు గ్యాస్ కావాలి
బొమ్మనహళ్లి: ఇది మానవాళి వినాశనానికి నాందిలా కనిపిస్తోంది, మాకు యుద్ధం వద్దు. బతకడానికి మాకు గ్యాస్ కావాలి, అని కన్నడ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వాటాల్ నాగరాజ్ అన్నారు. శనివారం బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ తాలూకాలోని అత్తిబెలెలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మాకు గ్యాస్ కావాలి అంటూ హైవే– 44 మీద ఖాళీ సిలిండర్లు, చెక్క డబ్బాలు ఉంచి నిరసన తెలిపారు. మూడో ప్రపంచ యుద్ధం జరగకూడదన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోలు వంటి ఇంధన కొరతను నివారించాలని నినాదాలు చేశారు. కన్నడ సంఘాల నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పరీక్షలను ఇంగ్లిష్, హిందీలో నిర్వహిస్తూ కన్నడిగుల హక్కులను హరించివేస్తోందని ఆరోపించారు. కట్టెల ధరలు భగ్గు యశవంతపుర: పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. బెంగళూరులో హోటల్స్, క్యాంటీన్ తదితరాలు గ్యాస్ సిలిండర్లు లేక కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. బసవేశ్వరనగరంలోని ఉత్తర కర్ణాటక హోటల్లో కలబురగి నుంచి కట్టెలను తెప్పించి వంటలు చేస్తున్నట్లు యజమాని తెలిపారు, కానీ గ్యాస్ సమస్యతో కట్టెల ధరలు కూడ విపరీతంగా పెరిగాయి. గతంలో వంద కేజీల కట్టెలు రూ.2వేలు ఉండగా, ఇప్పుడు 4 వేలకు పెరిగాయని వాపోయారు. బెంగళూరు ఆర్ఆర్ నగరలో విష్ణుభవన్ హోటల్లో పూర్తిగా కట్టెలతోనే వండుతున్నారు. గ్యాస్ స్టవ్వుతో రెండు గంటలు అయ్యే వంట, కట్టెలపై నాలుగైదు గంటలు పడుతుందని చెప్పారు. అత్తిబెలెలో ఆందోళన -
వృద్ధుడిని బలిగొన్న వివాహేతర సంబంధం
● కోడలితో మామ అక్రమ సంబంధం ● రూ.2 లక్షల సుపారీ ఇచ్చి తండ్రిని హత్య చేయించిన కుమారుడు సాక్షి, బళ్లారి: యాదగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఒక దారుణమైన ఘటన కుటుంబ సంబంధాలపై మాయని మచ్చగా మారింది. కుమారుడి భార్యను కూతురిలా చూసుకోవాల్సిన మామ కామాంధుడిగా మారాడు. కుమారుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. చివరికి హత్యకు గురయ్యాడు. మార్చి 12వ తేదీన యాదగిరి జిల్లా గోనాళ గ్రామానికి చెందిన హంపన్న సజ్జన (74) అనే వృద్ధుడు తన పొలంలో దారుణ హత్యకు గురయ్యాడు. తండ్రి హత్యపై కుమారుడు నరసారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనను సాధారణ హత్యగా భావించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు హంపన్న మొబైల్లో లభించిన ఫొటోలు, కాల్ డేటా వివరాలు సేకరించిన పోలీసులకు కుమారుడు నరసారెడ్డిపై అనుమానం వచ్చింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు ఒప్పుకున్నాడు. కుంగిపోయిన కుమారుడు.. పోలీసులు దర్యాప్తులో హంపన్న చాలా మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు వెల్లడైంది. తన భార్యతో తండ్రి అక్రమ సంబంధం పెట్టుకున్న విషయాన్ని తెలుసుకుని కుమారుడు నరసారెడ్డి మనోవేదనకు గురయ్యాడు. కుటుంబ గౌరవం దెబ్బతింటుందనే భావనతో ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. ఎలాగైనా తండ్రి హంపన్నను హత్య చేయించాలని నిర్ణయించుకున్నాడు. నలుగురు వ్యక్తులకు రూ.2 లక్షల సుపారీ ఇచ్చి తండ్రిని హత్య చేయాలని ప్లాన్ వేశాడు. మార్చి 12వ తేదీన పొలంలో హంపన్నను దారుణంగా హత్య చేసి పారిపోయారు. సుపారీ ఇచ్చిన కుమారుడు నరసారెడ్డితో పాటు హత్య చేసిన తిరుపతి ప్రాంతానికి చెందిన వీరేష్, కృష్ణ, రమేష్, ఎం.వీరేష్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. తోటలోనే మకాం.. హంపన్న తోటలో షెడ్డు వేసుకుని అక్కడే ఉండేవాడు. నాలుగు సంవత్సరాల క్రితం భార్య మృతి చెందింది. పొలానికి వచ్చే మహిళలతో పాటు, చివరికి కోడలిని కూడా బెదిరించి లొంగదీసుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ అక్రమ సంబంధం వెలుగులోకి రావడంతో కుమారుడు తట్టుకోలేక ఎలాగైనా తండ్రిన కడతేర్చాలని సుఫారీ ఇచ్చి హత్య చేయించాడని పోలీసులు వెల్లడించారు. -
ఉగాది కొత్త సంవత్సరానికి నాంది
సాక్షి, బళ్లారి: ఉగాది పండుగకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది కొత్త సంవత్సరానికి నాంది పలికే పవిత్రమైన సందర్భంగా భావించాలని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బ్యాంకర్స్ కాలనీలో జిల్లా కళాకారుల సంఘం, సంస్కార్ భారతి తదితర సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు జరుపుకున్నారు. ఉగాది పచ్చడిలో చేదు ,తీపి తదితర షడ్రుచులు ఉన్నట్లుగానే ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు ఉంటాయని గుర్తు చేశారు. పరాభవ నామ సంవత్సరం అంటే అపజయం కాదని.. కష్టపడి పని చేసే వారికి, మంచి మార్గంలో నడిచే వారికి అన్ని శుభాలు కలుగుతాయని జ్యోతిషులు చెబుతున్నారన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు యల్లనగౌడ, రాజశేఖర పాల్గొన్నారు. -
మే నెలాఖరులోపు టీబీ డ్యాం గేట్ల ఏర్పాటు పూర్తి
హొసపేటె: మే నెలాఖరులోపు టీబీ డ్యాం గేట్ల ఏర్పాటు పూర్తవుతాయని చిన్న నీటిపారుదల, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి ఎన్.ఎస్.బోసురాజు స్పష్టం చేశారు. శుక్రవారం తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాలను సందర్శించారు. సాంకేతిక బృందం చేపడుతున్న క్రస్ట్ గేట్ ఏర్పాటు పనులను స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తుంగభద్ర జలాశయానికి చెందిన 18 కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. మరో 5 క్రస్ట్ గేట్ల ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 23 గేట్ల పనులు మార్చి నెలాఖరు నాటికి పూర్తి అవుతాయని అంచనా వేశారు. నిపుణుల బృందం, చీఫ్ ఇంజనీర్ చెప్పిన ప్రకారం గేట్లు మార్చే సమయంలో పాత డ్యామ్ నిర్మాణంలో ఎలాంటి సమస్య తలెత్తలేదన్నారు. మిగిలిన 10 గేట్లను ఏప్రిల్లో ఏర్పాటు చేస్తారని.. మొత్తం 33 కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు మే నెలాఖరు నాటికి పూర్తవుతుందని పేర్కొన్నారు. జూన్లో ప్రారంభమయ్యే వర్షాకాలం నాటికి జలాశయం పూర్తిగా సిద్ధం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తుంగభద్ర జలాశయంలో పూడిక సమస్యకు పరిష్కారంగా నావళి ప్రాజెక్టు ప్రతిపాదనకు బోర్డుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు పంపడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సంబంధిత అధికారులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే వివిధ సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతోందని వెల్లడించారు. ఈ సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యాక పూర్తి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై మన రాష్ట్రానికి చెందిన వివిధ ఎన్నికై న ప్రతినిధుల బృందం న్యూఢిల్లీలో జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులు, వివిధ రాష్ట్రాల ఎంపీలతో చర్చలు జరిపిందన్నారు. కర్ణాటక నీటి పారుదల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి, అధికారులు సానుకూలంగా స్పందించారని.. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రక్రియలు ముగిశాక మరో విడత సమావేశాలు నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర ఖాదీ, గ్రామ పరిశ్రమల బోర్డు చైర్మన్, మాస్కి ఎమ్మెల్యే బసవన గౌడ తురువిహాల్, కొప్పల్ సబ్ డివిజనల్ ఆఫీసర్ కెప్టెన్ మహేష్ మలగిట్టి, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మంజునాథ్, కొప్పల్ అదనపు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్.హేమంత్ కుమార్, టీబీ బోర్డు, కేఎన్ఎన్ఎల్ అధికారులు చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ మల్లిగివాడ, ఏఈఈ ధర్మరాజ్, జ్ఞానేశ్వర్, సెక్షన్ ఆఫీసర్లు జి.కిరణ, పంపపాటి డీకే.హులిరాజ్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఎన్.ఎస్.బోసురాజు -
బాలుడిపై తల్లి దాడి
హుబ్లీ: పదేళ్ల బాలుడిపై సొంత తల్లి దాడి చేసి గాయపరిచిన ఘటన ధార్వాడ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రామ నగర నివాసి లక్ష్మిపై బాలల సహయవాణి నిర్వహకులు కేసు నమోదు చేశారు. లక్ష్మీ సదరు బాలుడిని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లిన క్రమంలో బాలుడి శరీరంపై తీవ్రమైన గాయాలు కనిపించడంతో సఖి వన్ స్టాప్ సెంటర్కు ఫిర్యాదు చేశారు. ఆ కేంద్రం బాలల సహాయవాణికి సమాచారం ఇచ్చింది. మెరుగైన చికిత్స కోసం బాలుడిని హుబ్లీ కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు జిల్లా బాలల రక్షణ అధికారిణి దీపా జావురు మీడియాకు తెలిపారు. కాగా భార్యాభర్తల మధ్య కలహాలతో తల్లి తన బిడ్డపై దాడి చేసిందని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. రంజాన్కు పటిష్ట బందోబస్తు హొసపేటె: రంజాన్ పండుగ నేపథ్యంలో శనివారం విజయనగర జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ జాహ్నవి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. విజయనగర జిల్లాలోని 60 ఈద్గా మైదానాల్లో సామూహిక ప్రార్థనలు జరగనున్నాయన్నారు. ఒక ఎస్పీ, 3 మంది డీవైఎస్పీలు, 14 మంది పీఐలు, 30 మంది పీఎస్లు, 600 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 300 మంది హోంగార్డు సిబ్బందితో కూడిన పోలీసు బలగాలను మోహరించామన్నారు. అదనంగా 112 వాహనాల ద్వారా గస్తీ చేపడుతామని వెల్లడించారు. వ్యూహాత్మక ప్రదేశాల్లో డీఏఆర్, కేఎస్ఆర్పీ బృందాలను కూడా మోహరించామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుండా నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గంగమ్మదేవి విగ్రహం అందజేత శ్రీనివాసపురం: తాలూకాలోని బల్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గంగమ్మ దేవాలయానికి కృష్ణశిలతో తయారు చేసిన గంగమ్మ దేవి విగ్రహాన్ని డాక్టర్ దేవిశ్రీ గురూజీ ప్రదానం చేశారు. త్వరగా దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేయాలని గ్రామస్తులకు సూచించారు. ప్రతి గ్రామంలోను గ్రామ దేవతల పూజలు నిత్యం జరుగుతూ ఉంటే గ్రామం ప్రశాంతంగా సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. ముస్లింలకు కిట్లు అందజేతకేజీఎఫ్: నియోజకవర్గంలో ఎమ్మెల్యే రూపా శశిధర్ ముస్లిం సముదాయానికి చేసింది శూన్యమని ఆర్కే ఫౌండేషన్ అధ్యక్షుడు మోహనకృష్ణ ఆరోపించారు. రంజాన్ను పురస్కరించుకొని శుక్రవారం ఆయన నగరంలో 400 మంది ముస్లిం కుటుంబాలకు నిత్యావసర పదార్థాల కిట్లను అందించి మాట్లాడారు. ముస్లిం మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటోందన్నారు. ఆలయాల్లో పంచాంగ శ్రవణం శ్రీనివాసపురం: ఉగాది సందర్భంగా ముళబాగిలు నగరంలోని పురణా ప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో పరాభవ నామ పంచాంగ పఠన కార్యక్రమాన్ని శ్రీ కాశి నాథశాస్త్రి నేతృత్వంలో ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణమాచార్ నిర్వహించారు. వివిధ రాశుల వారికి కలుగుతున్న యోగాలను వివరించి తెలిపారు. నగరంలోని వేంకటేశ్వర స్వామి, గోవిందరాజస్వామి, వరదరాజ స్వామి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భూ మాఫియాపై ఫిర్యాదు కోలారు: ముళబాగిలు తాలూకా దేవరాయ సముద్ర సర్వేనెంబర్ 117లో 2 ఎకరాల 17 గుంట్ల భూమిని సకిలీ దాఖలాలు సృష్టించి కబ్జా చేశారని రైతు సంఘం పదాధికారులు ఆర్ఐ సుబ్రమణికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. అధకారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి నకిలీ దాఖలాలు సృష్టించి ప్రభుత్వ ఆస్తులను భూ మాఫియా చేతిలో పెడుతున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
రాయచూరు రూరల్: కురవకల దత్తాత్రేయ స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసన గౌడ అధికారులకు సూచించారు. శుక్రవారం రాయచూరు తాలుకా కురవకల గ్రామంలోని దత్తాత్రేయ దేవాలయాన్ని సందర్శించారు. భక్తుల సౌకర్యార్థం చిన్న వంతెన నిర్మాణం, మూడు ఎకరాల్లో బస్టాండ్, పార్కింగ్ సౌలభ్యం, స్నానపు గదులు, శౌచాలయాలు, 50 గదులు, అన్న దాసోహ మంటపం, యాత్రికుల నివాసం నిర్మించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారి నితీష్, అసిస్టెంట్ కమిషనర్ హుంపన్న, శ్రీనివాస రెడ్డి, సూగప్ప తదితరులు పాల్గొన్నారు. బంగారు ఆభరణాల చోరీహుబ్లీ: స్థానిక ల్యామింగ్టన్ రోడ్డులోని కనిష్క జువెలరీ షాప్లో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ షాపులో పని చేస్తున్న సేల్స్ గర్ల్ మేరీ కట్టారి రూ.5.60 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు హుబ్లీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాదాపు 12 ఏళ్ల నుంచి పని చేస్తున్న మేరీ.. షాపులో 49.11 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసింది. వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు పెట్టి పరారీ అయినట్లు చెబుతున్నారు. శ్రీశైలం భక్తులకు ఉచిత భోజనంరాయచూరు రూరల్: శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనార్థం వచ్చిన కళ్యాణ, ఉత్తర కర్ణాటక భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం బైపాస్ రహదారిలోని ముగుల్ కోడ్ ముక్తి మందిర్ మైదానంలో వీరశైవ సమాజం, బసవ సమితి ఆధ్వర్యంలో శాంతమల్ల శివాచార్యులు, లోక్సభ సభ్యుడు కుమార నాయక్ తదితరులు భక్తులకు భోజనం పెట్టారు. కార్యక్రమంలో వీరశైవ సమాజం అధ్యక్షుడు చంద్రశేఖర్ పాటిల్, జయంతిరావ్ పతంగి తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు ఖైదీల విడుదల రాయచూరు రూరల్: సత్ప్రవర్తన కనబరిచినందుకు కలబుర్గి (గుల్బర్గా) సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు జీవిత ఖైదీలను (ఒక మహిళతో సహా) ముందస్తుగా విడుదల చేశారు. కర్ణాటక వ్యాప్తంగా వివిధ జైళ్లలో సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేయాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. శుక్రవారం కలబుర్గి జైలు నుంచి సత్ప్రవర్తన కలిగిన పద్మ, సుబ్బణ్ణను జిల్లా కేంద్రౖ జెళ్ల సుదారణ సేవ పోలీస్ ఐజీపీ ఆదేశాల మేరకు విడుల చేశారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర జైళ్ల సుదారణ సేవ జైలర్ రాకేష్, ఉప జైలర్ సురేష్, చెన్నప్ప, సాగర్ పాటిల్, శ్రీ మంతగౌడ తదితరులు పాల్గొన్నారు. ప్యాసింజర్ రైలు నడపాలిరాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రజల సౌకర్యార్థం బెంగళూరు–కలబుర్గి పాస్ట్ ప్యాసింజర్ రైలు నడపాలని ప్రవాసాంధ్రులు డిమాండ్ చేశారు. శుక్రవారం లోకసభ సభ్యుడు కుమార నాయక్ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాయచూరు మక్తల్ నుంచి కాచిగూడ వరకు నడపడానికి చర్యలు తీసుకోవాలని సూర్యదేవర నాగేశ్వరావు కోరారు. రాయచూరు రైల్వేస్టేషన్లో కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాయచూరు–గిణిగెర రైల్వే పనులు చేపట్టాలని సూచించారు. మమదాపూర్న్ గ్రేటర్ రైల్వేగా మార్చి గూడ్స్ షెడ్ను స్థాపించాలన్నారు. కుర్డిని రైల్వే క్రాసింగ్ స్టేషన్గా గుర్తించాలని విన్నవించారు. అనంతరం ఎంపీ కుమార నాయక్ను సన్మానించారు. కార్యక్రమంలో రమేష్ బోస్, ప్రసాద్, కొండయ్య, అనంద్ తదితరులు పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
సాక్షి, బళ్లారి: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. రెండు రోజులుగా జిల్లాలో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురవడంతో సిరుగుప్ప తాలూకాలోని వివిధ గ్రామాల్లో వరి పంట నేలవాలింది. వరి కోతలు ప్రారంభమయ్యే క్రమంలో గింజలు నేలరాలడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. వడగండ్లతో దెబ్బతిన్న పంటలను శుక్రవారం జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్ రైతులు, అధికారులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రైతులు తమ బాధలను అధికారులకు చెప్పుకున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల వానతో పూర్తిగా నష్టపోయామని తెలిపారు. ఒక ఎకరానికి రూ.50 వేలకు పైగా పెట్టుబడి పెట్టగా.. వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అధికారి మాట్లాడుతూ.. వర్షాలకు దెబ్బతిన్న పంటలను అధికారుల బృందం సందర్శిస్తుందన్నారు. పూర్తిగా వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని పేర్కొన్నారు. రైతులను ఆదుకునే దిశగా ప్రయత్నం చేస్తామని.. ధైర్యంగా ఉండాలని సూచించారు. -
రథోత్సవం.. పులకించిన జనం
హొసపేటె: నగరంలోని నెహ్రూ కాలనీలో శుక్రవారం సన్నక్కి వీరభద్రేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో హొసపేటె నగరం కిటకిటలాడింది. తొలుత సన్నక్కి వీరభద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం రథంపై కొలువుదీర్చారు. భక్తుల సమూహం రథంపై పూలు చల్లుతూ భక్తిని చాటుకున్నారు. పూజ అనంతరం సన్నక్కి వీరభద్రేశ్వరుడి ఆలయానికి కుడివైపున పూలు పడిన తర్వాత రథాన్ని లాగడం ప్రారంభించారు. డాక్టర్ బసవలింగ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి పూజలు చేశారు. కుడి వైపున పుష్పాన్ని ఉంచిన తర్వాత భక్తులతో కలసి రథాన్ని లాగారు. భక్తులు రథంపైకి పూలు, పండ్లు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు విచ్చేయడంతో హొసపేటె జనసంద్రంగా మారింది. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయనగర జిల్లా అదనపు ఎస్పీ మంజునాథ్, టీబీ డ్యాం సీపీఐ మహమ్మద్ గౌస్ నేతృత్వంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. భక్తిశ్రద్ధలతో సన్నిక్కి వీరభద్రేశ్వరుడి రథోత్సవం వేలాదిగా తరలివచ్చిన భక్తులు మార్మోగిన వీరభద్రేశ్వరుడి నామస్మరణ -
త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలి
రాయచూరు రూరల్: కొప్పళ తాలుకా బసాపూర్ వద్ద తుంగభద్ర ఎడమ కాలువకు గండి పడి నీరు వృథా అయిన విషయం తెలిసిందే. మూడు రోజుల అనంతరం మంత్రులు పర్యటించారు. శుక్రవారం రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్, కొప్పళ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, కన్నడ సంస్క్రతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి అధికారులతో కలసి గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గండి పడిన ప్రాంతం వద్ద త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. 90 ఎకరాల్లో వరి పంట నష్ట పోయిన రైతులకు పరిహరం అందేలా చూడాలని ఆదేశించారు. సంబంధిత శాఖ ఇంజనీర్లను పిలిచి పనులపై ఆరా తీశారు. కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేపట్టి చేతులు దులుపుకోవడం తగదన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యులు బసన గౌడ తుర్విహళ్, రాఘవేంద్ర హిట్నాల్, జిల్లా అధికారి రాజశేఖర్ హిట్నాల్, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
నామినేషన్ల దాఖలు షురూ
శివాజీనగర/సాక్షి,బళ్లారి: దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి బీజేపీకి అభ్యర్థి శ్రీనివాస్ టీ.దాస్ కరియప్ప శుక్రవారం తమ నామినేషన్ దాఖలు చేశారు. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి అనూహ్య పరిణామాల మధ్య టికెట్ దక్కించుకున్న శ్రీనివాస్ తన మద్దతుదారులతో కలిసి దావణగెరెలో అట్టహాసంగా నామినేషన్ వేశారు. నామినేషన్ అనంతరం ఆయన మాట్లాడుతూ టికెట్కు తనతో పాటు అజయ్ కుమార్, వినయ్కుమార్ పోటీ పడినా పార్టీ అధినాయకత్వం తనకే టికెట్ కేటాయించిందన్నారు. టికెట్ దక్కని వారు కూడా అందరూ కలిసికట్టుగా ఎన్నికల్లో తన గెలుపునకు సహకరిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ కేటాయించినా గెలుపు మాత్రం తనదేనని అన్నారు. ఈ నియోజకవర్గంలో బీ.ఫాం లేకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత ఎమ్మెల్యే శ్యామనూరు శివశంకరప్ప మనవడు, మంత్రి ఎస్.ఎస్.మల్లికార్జున్, లోక్సభ సభ్యురాలు ప్రభా మల్లికార్జున్ కుమారుడు సమర్థ్ మల్లికార్జున్ కూడా బీ.ఫాం లేకుండా మంచి రోజైన శుక్రవారం తన తల్లిదండ్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున, పార్టీ ఇతర నాయకులు, మద్దతుదారులతో కలిసి వచ్చి తన నామినేషన్ సమర్పించారు. అనంతరం సమర్థ్ మాట్లాడుతూ తన తాత శ్యామనూరు శివశంకరప్ప మృతితో ఖాళీ అయిన స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకు కచ్చితంగా లభిస్తుందనే విశ్వాసంతో నామినేషన్ వేశానన్నారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి శ్రీనివాస్ దాస్ కరియప్ప, బాగల్కోటె నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వీరణ్ణ చరంతిమఠను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. కాగా బాగలకోటె నియోజకవర్గం నుంచి శుక్రవారం బీజేపీ అభ్యర్థి వీరణ్ణ చరంతిమఠ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ టికెట్ ఆశించిన గోవింద బళ్లారి కూడా బీ ఫాం లేకుండానే నామినేషన్ సమర్పించారు. దావణగెరెలో రెండు బాగల్కోటెలో రెండు -
పిడుగుపాటుకు బాలుడి మృతి
చింతామణి: పిడుగు శబ్దానికి యువకుడు మృతి చెందిన ఘటన తాలూకాలలోని దిగువగొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి గ్రామంలో వర్షం కురుస్తుండగా వినయ్(15) అనే బాలుడు గొడుగు సహాయంతో బయటకు వెళ్లాడు. ఆ సమయంలో పెద్ద శబ్దంతో ఉరుములు, మెరుపులు రావడంతో వినయ్ తీవ్ర భయాందోళనకు గురై అక్కడికక్కడే మరణించాడు. ఇంటికి రావకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. బదిలీల్లో సీఎం కార్యాలయ జోక్యం ● ప్రశ్నించిన హైకోర్టు శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవటాన్ని హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. సీఎం కార్యాలయం నుంచి బదిలీ విషయమై బెస్కాం అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) చేతన్ ఎస్ సమర్పించిన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తులు డీకే సింగ్, టీఎం నదాఫ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గ్రూప్ బీ, సీ ఉద్యోగుల బదిలీ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం సిద్ధరామయ్యకు ఉద్యోగుల బదిలీ కంటే చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ విషయం ఆయా శాఖలకు వదిలిపెట్టాలి, ముఖ్యమంత్రి కార్యాలయం బదిలీ విన్నపాన్ని స్వీకరించరాదని సూచించింది. ఈ ఆదేశాల కాపీని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలని హైకోర్టు సూచించింది. సీఎం కార్యాలయం చేసే బదిలీ సిఫార్సులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కూడా వివరణ కోరింది. దీనిపై స్పందించిన ప్రధాన కార్యదర్శి..సీఎం కార్యాలయం నుంచి ఇచ్చే నోటీసులు కేవలం సిఫార్సులు కాగా.. తుది ఆదేశాన్ని సదరు శాఖ ఇస్తుందని పేర్కొన్నారు. సీఎంను నిలదీసిన మంత్రి ఇంధన శాఖలో కొంతమంది అధికారులను బదిలీ చేసేందుకు సీఎం కార్యాలయం సిద్ధమైంది. సీఎం కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య ఇంధన శాఖ పాలనా వ్యవహారాల్లో తీవ్రంగా జోక్యం చేసుకుంటున్నారు. దీంతో అసంతృప్తికి గురైన మంత్రి కేజే జార్జ్ సీఎం ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. అంతేకాకుండా రాజీనామా విషయంపైనా ప్రతిపాదించారు. అయితే సీఎం సిద్ధరామయ్య మంత్రికి నచ్చజెప్పారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి కారణమైంది. సీఎం కుమారుడు ఇలా అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపించాయి. మరొక వైపు ఇంధన శాఖ అధికారుల బదిలీ విషయంలోనూ సీఎం కార్యాలయం పాత్రపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ పరిణామాలన్నింటి మధ్య హైకోర్టు చేసిన ఈ తీవ్ర సూచన రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు కారణమైంది. నందిని ఉత్పత్తులకూ గ్యాస్ సెగ శివాజీనగర: కన్నడిగుల గర్వకారణ బ్రాండ్ కేఎంఎఫ్ ప్రస్తుతం తీవ్ర గ్యాస్ ఇబ్బందిని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా నెలకొన్న ఇంధన కొరత ప్రస్తుతం నందిని ఉత్పత్తులపై నేరుగా పరిణామం చూపుతోంది. నందిని ఉత్పత్తులు మరో రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత కొరత ఎదురయ్యే అవకాశముంది. ఇందుకు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల తీవ్ర కొరత ప్రధాన కారణం. ప్రతి నెల సుమారు 450 కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడిన కేఎంఎఫ్కు గత కొన్ని రోజుల నుంచి ఏ ఒక్క సిలిండర్ కూడా సరఫరా కాకపోవడంతో ఇబ్బందులకు గురైంది. ప్రస్తుతం ఉన్న స్టాక్ కేవలం రెండు రోజులకు మాత్రం సరిపోతుందని అఽధికారులు తెలిపారు. సిలిండర్లు సరఫరా కాకుంటే ముప్పే శనివారంలోగా ఎల్పీజీ సిలిండర్లు సరఫరా కాకపోతే నందిని స్వీట్స్, కార ఆహార ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ముప్పు పొంచి ఉంది. కేఎంఎఫ్ ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అత్యవసర చర్యలు తీసుకోవాలని విన్నవించింది. సిలిండర్ల కొరతతో ఇప్పటికే రాజధానిలో హోటళ్లు కూడా బంద్ అవుతున్న నేపథ్యంలో కేఎంఎఫ్పై ఒత్తిడి మరింత అధికమైంది. -
నేత్రపర్వం.. చౌడేశ్వరీ దేవి జ్యోతుల ఉత్సవం
బొమ్మనహళ్లి: ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో నివాసం ఉండే బెంగళూరు నగరంలోని యలహంకలో శ్రీ తొగటవీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో శ్రీచౌడేశ్వరీ దేవి జ్యోతుల ఉత్సవం గురువారం నేత్రపర్వంగా సాగింది. ఉదయం 8 గంటలకు కలశ పూజ నిర్వహించిన అనంతరం యలహంక పురవీధుల్లో పొద్దుటూరు బ్యాండ్ సెట్ మధ్య కలశాలను ఊరేగించారు. సాయంత్రం 7గంటలకు ఆలయంలో జ్యోతులు వెలిగించగా అగ్నిగుండం ప్రవేశం చేసి చౌడేశ్వరి దేవి ఉత్సవ మూర్తిని పూల పల్లకిలో ప్రతిష్టాపన చేశారు. యలహంక ప్రముఖ వీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. కుల గురువు శ్రీశ్రీ దివ్వ జ్ఞానానందగిరి స్వామీజీ, యలహంక ఎమ్మెల్యే ఎస్.ఆర్.విశ్వనాథ్ దంపతులు, చిక్కబళ్లాపుర ఎంపీ డాక్టర్ సుధాకర్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
పోలీసు అధికారినని చెప్పి..
సాక్షి బెంగళూరు: రాష్ట్రంలో రోజురోజుకు డిజిటల్ అరెస్టు కేసులు పెరుగుతున్నాయి. గత రెండేళ్లలో ప్రజలు సుమారు రూ.468 కోట్లను ఈ సైబర్ కేటుగాళ్ల డిజిటల్ అరెస్టులకు భయపడి కోల్పోయారు. రాష్ట్రంలో డిజిటల్ అరెస్టులు అనేవే లేవు. ప్రభుత్వం ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మాత్రం కోట్లాది రూపాయలను పోగొట్టుకుంటున్నారు. ప్రతి ఏటా ఈ డిజిటల్ అరెస్టు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. గడిచిన మూడేళ్లలో మొత్తం 1,695 కేసులు నమోదు కాగా, రూ. 468 కోట్ల మేర నష్టపోయినట్లు హోం శాఖ అధికారికంగా వెల్లడించింది. అలాగే ఇప్పటివరకు 500 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు, వీరు తెరిచిన 40 వేల నకిలీ బ్యాంకు ఖాతాలను పోలీసులు గుర్తించి వాటిని నిలిపివేసినట్లు తెలిపింది. తాజాగా బెంగళూరులో సైబర్ మోసగాళ్లు కొత్త దారిని ఎన్నుకున్నారు. సిటీ పోలీసుల పేరుతోనే డిజిటల్ అరెస్టు మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసు కమిషనర్ నకిలీ సంతకం, సీల్ ఉపయోగించి ఒక మహిళను మోసం చేసేందుకు యత్నించారు. బెంగళూరు సిటీ పోలీసుల పేరిట కూడా.. ఇప్పటివరకు సీబీఐ అధికారులు, ముంబై పోలీసులు లేదా కస్టమ్స్ అధికారుల పేరిట జరుగుతున్న డిజిటల్ అరెస్టు మోసాలు తాజాగా బెంగళూరు సిటీ పోలీసుల పేరిట జరిగే వరకు వచ్చాయి. పోలీసులు కూడా తరచూ ప్రజలకు డిజిటల్ అరెస్టులపై అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ ప్రజల్లో అవగాహన చాలా ఆలస్యంగా కలుగుతోంది. పోలీసులు ఎప్పటికీ వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్టు చేయరని అధికారులు తెలిపారు. డబ్బుల కోసం ఎవరినీ డిమాండ్ చేయరని చెప్పారు. ఇలాంటి డిజిటల్ అరెస్టు కాల్స్ వస్తే అసలు భయపడాల్సిన పని లేదని హెచ్చరించారు. ఏదైనా అనుమానాస్పద లింక్స్ వస్తే వాటిని క్లిక్ చేయవద్దని, ఇంటి లొకేషన్ కూడా ఎవరికీ షేర్ చేయొద్దని సూచించారు. అలాంటి కాల్స్ వస్తే సహాయవాణి–1930 అనే నంబరుకి తెలియజేయాలని పోలీసులు కోరారు. ప్రజలు అప్రమత్తమైనప్పుడే ఈ సైబర్ నేరాలను అరికట్టవచ్చని వారంటున్నారు. గత మూడేళ్లలో రూ.468 కోట్లు గల్లంతు డిజిటల్ అరెస్టులతో ప్రజల జేబులకు చిల్లు రాష్ట్రంలో పెరుగుతున్న ఇలాంటి ఘటనలుబెంగళూరుకు చెందిన ఓ మహిళకు గుర్తు తెలియని నంబర్ నుంచి ఒక ప్రైవేటు టెలీకాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను ఒక పోలీసు అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మీ తల్లి ఒక అక్రమ కేసులో పాల్గొన్నారని, ఆమైపె క్రిమినల్ కేసు నమోదైందని బెదిరించడం ప్రారంభించాడు. ఆ మహిళను నమ్మించేందుకు సైబర్ నేరగాడు ఏకంగా సుప్రీంకోర్టు ప్రతిని, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ అధికారిక ఆదేశాల ప్రతితో పాటు పలు డాక్యుమెంట్లను వాట్సాప్ ద్వారా పంపించాడు. ఈ డాక్యుమెంట్లలో ఏకంగా కమిషనర్ నకిలీ సీలు, సంతకాన్ని కూడా ఉపయోగించాడు. అయితే ఈ డాక్యుమెంట్లలో అక్షరదోషాలు, లోగోలో తప్పిదాలు ఉండడంతో అనుమానం వచ్చిన సదరు మహిళ ఈ వీడియో కాల్ కట్ చేసి నేరుగా బెంగళూరు పోలీసు అధికారిక సహాయవాణికి కాల్ చేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సైబర్ క్రైమ్ పోర్టల్లో కూడా ఫిర్యాదు చేసింది. -
డిజిటల్ అరెస్ట్ పేరుతో..
డిజిటల్ అరెస్టు పేరిట ఒక వృద్ధుడిని మోసం చేసి లక్షలాది రూపాయలను సైబర్ కేటుగాళ్లు దండుకున్నారు. ఈ ఘటనపై వైట్ఫీల్డ్ సైబర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. వైట్ఫీల్డ్ ఈసీసీ లక్ష్మి ఎన్క్లేవ్ అపార్టుమెంట్లో ఉండే 64 ఏళ్ల వృద్ధుడు రూ.16.60 లక్షలను పోగొట్టుకున్నాడు. ముంబై పోలీసుల పేరిట తనను తాను పరిచయం చేసుకున్న నిందితుడు, మీ బ్యాంకు ఖాతా నుంచి ఉగ్రవాద సంస్థలకు డబ్బులు తరలించారని, మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని, కేసు నుంచి బయట పడాలంటే డబ్బులు బదిలీ చేయాలని బెదిరించి ఏకంగా రూ.16.60 లక్షలను దోచుకున్నాడు. -
కెంపేగౌడ ఎయిర్పోర్టుకు మరో అవార్డు
దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్పోర్టుకు వరుసగా మూడవసారి స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డు లభించింది. 2026 సంవత్సరానికి బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్టు అవార్డు లభించింది. చెక్ ఇన్, బదిలీ, అరైవల్, చిల్లర వ్యాపారం, భద్రత,వలస, డిపార్చర్, ప్రయాణికుల అభిప్రాయాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డు ప్రకటిస్తారు.మెట్రో రైల్లో యువకుల హల్చల్ దొడ్డబళ్లాపురం: బెంగళూరులో మెట్రో రైల్లో యువకులు గొడవ చేసిన కారణంగా రైలు ఆలస్యంగా నడిచింది. ఈనెల 15న రాత్రి 10.57 గంటల సమయంలో యువకులు కొందరు మాదావర మెట్రో స్టేషన్లో రైలు ఎక్కారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా గట్టిగా అరుస్తూ, గొడవ చేస్తుండడంతో బీఎంఆర్సీఎల్ సెక్యూరిటీ సిబ్బందికి కొందరు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది యువకులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించింది. యువకుల గొడవ వల్ల కారణంగా మెట్రో రైలు కొన్ని నిమిషాల పాటు ఆలస్యంగా నడిచింది. ఇందుకు సంబంధించి స్పందించిన బీఎంఆర్సీఎల్ తమ ప్రయాణికుల రక్షణ, వారి గౌరవం తమకు ఎంతో ముఖ్యమని ప్రకటించింది.దూరం పెట్టిందని కత్తితో పొడిచి హత్య దొడ్డబళ్లాపురం: ఓ వివాహిత ప్రియుడి చేతిలో హత్యకు గురైన ఘటన బెంగళూరు గంగొండనహళ్లిలో చోటుచేసుకుంది. స్థానికుడు హఫీజ్కి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్తకు దూరంగా ఉంటున్న ఇద్దరు పిల్లలు ఉన్న ఫిర్దోస్ భాను అనే వివాహితతో కొంతకాలంగా సంబంధం కొనసాగిస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఫిర్దోస్ భాను హఫీజ్ని దూరం పెట్టింది. హఫీజ్ గొడవ చేయడంతో గతనెల 28న పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు హఫీజ్ని హెచ్చరించి వదిలేశారు. గురువారం ఫిర్దోస్ భాను ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా హఫీజ్ అడ్డుకొని కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. భార్యపై భర్త యాసిడ్ దాడి ● అడ్డువచ్చిన కుమార్తె, మరో ఇద్దరిపైకూడా సాక్షి,బళ్లారి: కుటుంబ కలహాల నేపథ్యంలో తనను వదిలి వెళ్లిన భార్యపై భర్త యాసిడ్తో దాడి చేశాడు. అడ్డొచ్చిన కుమార్తె, మరో ఇద్దరిపై కూడా యాసిడ్ పోసి మచ్చుకత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన చిత్రదుర్గలో గురువారం రాత్రి కలకలం రేపింది. వివరాలు.. నగరంలోని నెహ్రు కాలనీలో ఆటో డ్రైవర్ మహమ్మద్ సోహైల్, తహసీన్భాను దంపతులు నివాసం ఉండేవారు. కుటుంబ గొడవలతో 8 నెలల క్రితం భార్యాభర్తలు వేర్వేరుగా జీవిస్తున్నారు. తహసీన్భాను బెంగళూరు వెళ్లిపోయింది. ఇటీవల చిత్రదుర్గలోని తన అక్కకుమారుడికి ఇంటికి పిల్లలతో కలిసి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సోహైల్ యాసిడ్ తీసుకుని వెళ్లి భార్యపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన కుమార్తె, మరో ఇద్దరిపై కూడా యాసిడ్తో దాడి చేసి మచ్చుకత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని నలుగురు బాధితులను చిత్రదుర్గ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని ఎస్పీ రంజిత్ కుమార్, డీఎస్పీ, సీఐలు పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ యాసిడ్తో దాడి చేసిన మహమ్మద్ సోహైల్ను అరెస్ట్ చేశామన్నారు. ప్రముఖ రచయిత్రి చంపా శివన్న కన్నుమూత మైసూరు: కన్నడ సాహిత్య పరిషత్ ఎండోమెంట్ అవార్డు గ్రహీత, కవయిత్రి చంపా శివన్న (71) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. ఆమెకు కుమార్తె, కవయిత్రి శివరంజని, అల్లుడు ప్రహ్లాద రావు, మనవడు ప్రథమ్ ఉన్నారు. శనివారం ఆమె అంత్యక్రియలు జరుగుతాయి. మైసూరు మిత్ర, స్టార్ ఆఫ్ మైసూరు పత్రికలకు సంపాదకుడిగా పని చేసిన దివంగత ఎం.ఆర్.శివన్న భార్య చంపా శివన్న మృతి కన్నడ కవిత్వ రంగానికి తీరని లోటని మైసూరు వర్సిటీ సిండికేట్ మాజీ సభ్యుడు నింగరాజేగౌడ సంతాపం తెలిపారు. -
పొలాలకు జీవం, తోటలకు నష్టం
మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలో పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఉరుములు, వడగళ్ల వాన విరుచుకుపడి, రైతుల పొలాలు, తోటలు ధ్వంసమయ్యాయి. అనేక చెట్లు కూడా వేళ్లతో సహా కూలిపోయాయి. అయితే ఏడాది తొలి వర్షం కావడంతో గ్రామాల్లో సంతోషం నెలకొంది. తాలూకాలోని కొప్ప, బెసగారహళ్లి, కెస్తురు, కె. హొన్నలగెరె, కొక్కరె బెల్లూరు, భీమనకెరె, ఇతర పట్టణాల్లో అర్ధరాత్రి 1 గంటకు ప్రారంభమైన ఈ వడగళ్ల వాన అర్ధగంటకు పైగా కొనసాగింది. వర్షాధార ప్రాంతాల్లో వరి, జొన్న, చెరకు, కొబ్బరి వంటి పంటలకు జీవం పోసింది. అయితే అరటి, కొబ్బరి తోటలకు నష్టం కూడా కలిగింది. హగలహళ్లిలో 1.20 ఎకరాలలో వెయ్యికి పైగా అరటి చెట్లు పడిపోయాయి. హొన్నలగెరెలో 12 కొబ్బరి చెట్లు, 200 అరటి చెట్లు కూలాయి. వ్యవసాయాధికారులు పరిశీలించి పరిహారానికి హామీ ఇచ్చారు. పట్టణ ప్రాంతంలో కొన్నిచోట్ల చెట్లు, కొమ్మలు, కరెంటు స్తంభాలు నేలకూలి జనజీవనానికి ఇబ్బంది కలిగింది. -
అకాల వర్షం.. రైతులకు నష్టం
● ఉరుములు, వడగండ్లతో కూడిన భారీ వర్షం ● నేలవాలిన వరి పంట సాక్షి, బళ్లారి: మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షం కురిసింది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో సాగు చేసిన వరి నేలకూలింది. వరి గింజలు నేల రాలడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో చానాళ్కు చెందిన విరుపాక్షి, గణేష్ స్వామి, ముద్దటనూరు సూరిబాబు, బెళగల్లుకు చెందిన శివప్రకాష్ తదితర రైతులు విలేకరులతో మాట్లాడారు. రబీలో ఎకరాకు రూ.40 వేల చొప్పున అప్పు చేసి వరి సాగు చేశామన్నారు. పంట చేతికందే తరుణంలో వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. రైతులకు ఒక ఎకరానికి కనీసం రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయచూరు రూరల్: రాయచూరు, యాదగిరి జిల్లాలో కురిసిన వర్షాలకు వరి దెబ్బతింది. మాన్వి, సురుపుర, శహపుర, హుణిసిగి, దేవదుర్గ, సింధనూరు తాలుకాలో వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. మద్దతు ధరకు పంట కోనుగోలు చేయాలన్నారు. పంట నష్టం అంచనాలు తయారు చేసి సర్కార్కు నివేదికలు పంపాలని తహసీల్దార్ను కోరారు. మామిడి రైతుల కష్టాలు హుబ్లీ: రెవెన్యూ శాఖ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జిల్లా యంత్రాంగానికి సూచనలు చేశారు. వడగండ్ల వాన జిల్లాతో పాటు ఉత్తర కర్ణాటక వ్యాప్తంగా మామిడి సాగు చేసిన రైతులకు నష్టం మిగిల్చిందన్నారు. జిల్లా యంత్రాంగం, ఉద్యానవన శాఖ అధికారులు సదరు రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గాలీవాన బీభత్సం హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా తంబ్రహళ్లి గ్రామంలో బుధవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది. రైతు ప్రభురెడ్డి రెండు ఎకరాల్లో సాగు చేసిన అరటి పంట పూర్తిగా నాశనమైంది. పంట కోతకు వస్తున్న క్రమంలో వర్షాలకు పంట దెబ్బతింది. సుమారు రూ.8 లక్షల నష్టం వాటిల్లిందని ప్రభురెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
హోరాహోరీగా ఎద్దుల బండి పోటీలు
విడపనకల్లు: ఉగాది సందర్భంగా విడపనకల్లు మండలం హంచన్హాళ్ గ్రామంలో గురువారం నిర్వహించిన ఎద్దుల బండి పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల్లో దాదాపు 10 జతల ఎద్దులు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో ముస్తూరు లింగన్నకు చెందిన ఎద్దులు, ద్వితీయ స్థానంలో నాగేపల్లి రామచంద్రకు చెందిన ఎద్దులు, తృతీయ స్థానంలో నాగేపల్లి ఆంజనేయులు, నాల్గో స్థానంలో కె.సురేష్, ఐదో స్థానంలో నాగేపల్లి శ్రీకాంత్ ఎద్దులు నిలిచాయి. విజేత ఎద్దుల యజమానులను అభినందిస్తూ నగదు పురస్కారాలతో సర్పంచ్ నాగేపల్లి కేశన్న, రాకెట్ల రమేష్, రాకెట్ల వన్నూరు స్వామి, గ్రామస్తులు సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు భీంరావు, వన్నూరుస్వామి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
‘మనీ డబ్లింగ్’ నేరస్తుల అరెస్ట్
రాయచూరు రూరల్: రసాయనాలు, నల్ల రంగు ఉపయోగించి సాదా తెల్ల కాగితాలను అసలైన కరెన్సీ నోట్లుగా మార్చి ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలపై కర్ణాటకలోని బెళగావి జిల్లా పోలీసులు మహారాష్ట్రకు చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. గోకాక్ నగరం హనుమాన్ ఆలయం సమీపంలో ఉన్న ఒక ఇంటిపై మంగళవారం గోకాక్ నగర పోలీసులు దాడి చేసి ఈ ముఠాను పట్టుకున్నారు. వీరిలో ఒక వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నాడు. పోలీస్ సూపరింటెండెంట్ కె.రామరాజన్ మాట్లాడుతూ.. బెళగావి జిల్లా గోకాక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ’మనీ డబ్లింగ్’ నేరస్తులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. గోకాక్కు చెందిన ముగ్గురు నిందితులు, నకిలీ పత్రాలతో ప్రజలను మోసం చేసే మహారాష్ట్రకు చెందిన జయశ్రీ బాబు అనే వ్యక్తితో సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపారు. అసలైన కరెన్సీ నోట్లను తీసుకుని వాటిపై నల్ల రసాయన సిరాను పూసే సాధారణ పద్ధతిని అనుసరించారని పేర్కొన్నారు. వారు దానిని మామూలు నల్ల కాగితంలా కనిపించేలా ఆరబెట్టి.. ఆ నల్ల కాగితం అద్భుతంగా కరెన్సీగా మారిపోతుందని సామాన్య ప్రజలను నమ్మిస్తారని తెలిపారు. వాస్తవానికి అది మొదటి నుంచీ అసలు నోటే.. ఆ తర్వాత నేరగాళ్లు అసలు నల్ల కాగితం కట్టలను (అవి కరెన్సీ కావు) 1:4 నిష్పత్తిలో అమ్ముతారన్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు థానేకు చెందిన ఆనంద్ ప్రకాష్ నర్వాడే, పాల్ఘర్కు చెందిన దిలాదర్ అబనీషేక్కు ఇందులో భాగస్వామం ఉందని వెల్లడించారు. పరశురామ్ భీమ్సీ బడకారి (గోకాక్), జయశ్రీ బాబు కాంబ్లే (ముంబై), మనీషా రాజు గైక్వాడ్ (అహ్మద్ నగర్), ఉజ్వల్ తులసిరామ్ బిలానే (జల్గావ్) నిందితులుగా గుర్తించడం జరిగిందన్నారు. మొత్తం ఎనిమిది మంది నేరస్తుల్లో ఏడుగురిని అరెస్టు చేయగా.. ఒక స్థానిక నేరస్థుడు ఇంకా పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. హీటింగ్ మెషీన్, ద్రావణం, నల్ల కాగితాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్థానిక సబ్–ఇన్స్పెక్టర్ కిరణ్ మోహిత్కు సమాచారం అందిన వెంటనే దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారన్నారు. నిందితుల్లో ఒకడైన పరశురామ్కు గతంలో జరిగిన మూడు దోపిడీ కేసులతో సంబంధం ఉందని వెల్లడించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. -
కాలువలో జారిపడి బాలుడు మృతి
రాయచూరు రూరల్: ముఖం కడుక్కునేందుకు నారాయణపుర కుడి కాలువలోకి దిగిన ఓ బాలుడు ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు. ఈ ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. సింధనూరు తాలుకా జవుళిగెరకు చెందిన దశరథ్ (9) అమ్మ పుట్టినిల్లు అయిన జావుర్కు వచ్చాడు. బుధవారం సాయంత్రం లింగసూగురు తాలుకా రోడల బండి వద్ద ఉన్న నారాయణపుర కుడి కాలువలోకి దిగాడు. చేతులు, కాళ్లు కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తూ కాలువలోకి జారిపడిపోయాడు. దశరథ్కు ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి కోసం అన్నదమ్ముల ఘర్షణ● తమ్ముడిని హతమార్చిన అన్న రాయచూరు రూరల్: పెళ్లి వయస్సుకు వచ్చిన అన్నదమ్ములు యువతి కోసం గొడవపడ్డారు. కోపంతో ఊగిపోయిన అన్న.. తమ్ముడిని దారుణంగా హతమార్చిన జరిగిన ఘటన గదగ్ జిల్లాలో చోటు చేసుకుంది. చిక్క మూలంగికి చెందిన పక్కీరప్ప (19), అశోక్ (21) అన్నదమ్ములు. నరగుంద తాలుకా హిరేకోప్పలో వీరు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పక్కీరప్పకు అదే గ్రామంలో ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఇదే విషయంలో ఇద్దరి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘సదరు యువతిని ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకుంటా అని’ అశోక్ తెలిపాడు. ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. అనంతరం దొడ్డిలో నిద్రిస్తున్న పక్కీరప్ప తలౖపైపె అశోక్ పెద్ద బండరాయితో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన పక్కీరప్ప అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. దుకాణాల దగ్ధంహొసపేటె: విద్యుత్ సర్క్యూట్తో కిరాణా దుకాణం, పంక్చర్ షాపు కాలి బూడిదయ్యాయి. గంగావతిలోని ఆనెగొంది రోడ్డులో బసవేశ్వర సర్కిల్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగిందనే దానిపై ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే అర్ధరాత్రి కిరాణా దుకాణం, పంక్చర్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. కిరాణా దుకాణంలోని వస్తువులు కాలిపోయాయి. పంక్చర్ షాపులో విలువైన టైర్లు, ట్యూబులు, ఇతర పరికరాలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో రూ.2 లక్షల వరకూ నష్టం వాటిల్లింది. విపత్తులపై అప్రమత్తత అవసరం రాయచూరు రూరల్: జిల్లాలో ఎండల తీవ్రత పెరగడంతో మనుషులు అధిక ప్రమాణంలో నీటిని సేవించాలని జిల్లా పంచాయతీ అదనపు కార్యదర్శి హల సిద్దప్ప పూజారి సూచించారు. జిల్లా పంచాయతీ సభా భవనంలో జిల్లా వైపరీత్యాల ప్రాధికార, మిత్ర గ్రామీణ వికాస్ సంస్థ, జిల్లా పంచాయతీ, జిల్లా అధికారి పాలన యంత్రాగం ఆధ్వర్యంలో ప్రక్కతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. విపత్తులను ఎదుర్కొనేందుకు మానవులు జాగ్రత్తలు పాటించాలన్నారు. చల్లని వాతావారణంలో ఉండేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఎండలు అధికంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఈరమ్మ, శ్రీదేవి, శ్రీనివాస, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కోసం వచ్చి పరలోకాలకు..
హుబ్లీ: స్థానిక దేశ్పాండే నగర్లో ఓ అంగడి ఇంటీరియల్ డెకరేషన్ కోసం వచ్చిన కార్మికుడు చనిపోయాడు. వివరాలు.. రామనగర్ జిల్లా మాగడి తాలూకా జమాల్ సాబ్ పాల్య నివాసులైన అంజాద్ పాషా, హైదర్, జబి, జాఫర్ అనే కార్మికులు దుకాణాల్లో ఎల్ఈడీ వాల్ తదితర పని చేయడంలో నేర్పరులు. స్థానిక దేశ్పాండే నగర్లో డ్రైఫ్రూట్ అంగడి ప్రారంభించే క్రమంలో ఇంటీరియల్ వర్క్ కోసం లారీ డ్రైవర్ అలీన్తో పాటు ఐదుగురు వచ్చారు. ఈనెల 16న రజాన్ ఉపవాస దీక్షలో ఉన్న ఈ నలుగురు రాత్రి భోజనం చేసి అదే కట్టడంలో పడుకున్నారు. ఓ రాత్రి వేళ విద్యుత్ సరఫరా ఆగి పోవడంతో ఆ గదిలో ఉన్న రసాయనాల ప్రభావంతో సరైన ఆక్సిజన్ అందక వీరు అస్వస్థతకు గురయ్యారు. 17న ఉదయం ఎంత సేపటికి వీరు బయటకు రాక పోవడంతో బయట లారీలో పడుకున్న డ్రైవర్ షెట్టర్ తెరచి చూశాడు. నలుగురు మతి స్థిమితం కోల్పోయి కనిపించారు. తక్షణమే అంగడి యజమానికి సమాచారం ఇచ్చాడు. చికిత్స నిమిత్తం అంబులెన్స్లో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల పాటు చావు బతుకుల మధ్య పోరాడిన అంజాద్ పాషా (26) గురువారం కన్నుమూశాడు. మిగిలిన వారు జాఫర్, జబి, హైదర్ చికిత్స పొందుతున్నారు. -
మంచి మార్గంలో నడిచే వారికి శుభాలే..
● పంచాంగ శ్రవణ కర్త మఠం గురుప్రసాద్ సాక్షి, బళ్లారి: తెలుగు, కన్నడిగులు నూతన సంవత్సంగా భావించే ఉగాది పండుగ నుంచే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ ఏడాదికి పరాభవ సంవత్సరం అని పేరు రావడంతో ఎలాంటి భయాందోళన అవసరం లేదని ప్రముఖ జ్యోతిష్య పండితుడు మఠం గురు ప్రసాద్ తెలిపారు. గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా నగరంలోని అనంతపురం రోడ్డులోని వెలసిన అయ్యప్ప స్వామి ఆలయం, శ్రీకనక దుర్గమ్మ ఆలయం వద్ద పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది పాటు జరగబోయే ముఖ్యమైన ఘటనలను వివరించారు. పరాభవనామ సంవత్సరంలో రాజు అంటే గురువు, మంత్రి కుజుడు ఉన్నారన్నారు. గురువు రాజు అయినందున దేశభక్తి పెరుగుతుందన్నారు. భారత్ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా తయారవుతుందని తెలిపారు. దేవాయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. నాయకులు, అధికారులు కూడా మంచి మార్గంలో నడుస్తారని జోస్యం చెప్పారు. యుద్ధాల వల్ల దేశాలకు నష్టం జరుగుతుందన్నారు. పాకిస్థాన్ తాను తీసుకున్న గుంతలో తానే అంతర కలహాలతో కొట్టుమిట్టాడుతుందన్నారు. రైతులకు మంచి జరుగుతుందని.. పంటలు బాగా పండుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో కమ్మరచేడు కళ్యాణస్వామి, మేయర్ గాదెప్ప, శబరిమలై అయ్యప్ప ట్రస్టు, జిల్లా ఆర్యవైశ్య సంఽఘం ప్రముఖులు జయప్రకాష్ గుప్తా, బళ్లారి కల్చరల్ అక్టివిటిస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు శీలాబ్రహ్మయ్య, జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ, మాజీ బుడా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
ఆచూకీ లేని సైకో
శివాజీనగర: నిశ్చితార్థమై, త్వరలో పెళ్లి చేసుకోబోయే యువతి (18)ని బెంగళూరు డీజే హళ్లిలోని పాడుబడిన ఇంటిలో యువకుడు 3 రోజుల కిందట హత్య చేయడం తెలిసిందే. పోస్టుమార్టం తరువాత నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. దుండగుడు షబీల్ (20), ఆమెను మాటలకందని రీతిలో కిరాతకంగా హత్య చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి. మొదట యువతిని గొంతు కోసి హతమార్చాడు, ఆపై ఆమె రొమ్ములను కత్తితో కోసివేశాడు, తరువాత మర్మాంగంపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడని పోస్టుమార్టం నివేదికలో తెలిపారు. ఇంత ఉన్మాదిగా ఎందుకు మారాడు అనేది తేలాల్సి ఉంది. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కోలార్కు చెందిన యువతి డీజే హళ్లిలోని తన అవ్వ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ఈ సమయంలో ఇతడు పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో మభ్యపెట్టాడు, వారి కుటుంబీకులతో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. గతేడాది జూన్లో నిశ్చితార్థం చేశారు. కొన్నిరోజులుగా అతడు యువతి మీద అనుమానం పెంచుకున్నాడు. ఆ రోజు మాట్లాడాలని పిలించి తమ పాడుబడిన ఇంటికి తీసుకెళ్లి ప్రాణాలు తీసి పరారయ్యాడు. అత్యంత దారుణంగా యువతి హత్య -
కాలువ గండి పూడ్చటంలో నిర్లక్ష్యమేల?
రాయచూరు రూరల్: రెండు రోజుల క్రితం కొప్పళ జిల్లా బసపురం వద్ద తుంగభద్ర ఎడమ కాలువకు గండి పడింది. భారీగా నీరు వృథా అవుతోంది. కాలువకు గండి పడిన ప్రాంతంలో వరి పంట దెబ్బతింది. తుంగభద్ర ఎడమ కాలువ బసపురం వద్ద గండి పడిన ప్రాంతాన్ని రెండు రోజులైన పూడ్చక పోవడంతో ఆ ప్రాంతంలోని రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తు గండి పడిన ప్రాంతం నుంచి నీరు వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండి పడిన ప్రాంతాన్ని అధికారులు, ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు పరిశీలించ లేదని తెలిపారు. మునిరాబాద్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గండి పూడ్చే విషయంలో మౌనం వహించడాన్ని తప్పుబట్టారు. కొప్పళ జిల్లా ఇన్చార్జి మంత్రి శివరాజ్ తంగడిగి, విజయనగరం జిల్లా ఇన్చార్జ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, ఉప ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖ మంత్రి డీకే.శివకుమార్ కాలువను మరమ్మతులు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. -
ఇంటింటా ఉగాది కోలాహలం
బళ్లారిలో ఉగాది పచ్చడి రుచి చూస్తున్న మహిళలురాయచూరు రూరల్: పూజలు చేస్తున్న దృశ్యం సాక్షి, బళ్లారి: హిందువుల ప్రధాన పండుగల్లో ఒక్కటైన ఉగాది పండుగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే కోలాహలం మొదలైంది. ఆలయాలకు వెళ్లి పూజలు చేయించి మొక్కులు చెల్లించుకున్నారు. మామిడి తోరణాలు, వేప ఆకులను ఇళ్లకు కట్టి ఉగాదికి స్వాగతం పలికారు. వేపపువ్వు, బెల్లం, చింతపండు, మిరప, ఉప్పు, మామిడి కాయలతో షడ్రుచుల ఉగాది పచ్చడిని తయారు చేసుకుని ఇంటిల్లి పాది ఆరగించారు. ఉగాది పర్వదినం నేపథ్యంలో పూలు, పండ్లకు డిమాండ్ ఏర్పడింది. నగరంలో బెంగళూరు రోడ్డు కొనుగోలుదారులతో కిటకిటలాడింది. ఉగాది పండుగ రోజున గణపతి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తే మంచిదని పండితులు చెబుతున్న నేపథ్యంలో గణపతి ఆలయాల వద్ద భక్తులు సందడి నెలకొంది. పలువురు ఆలయాలు వద్ద కూడా ఉగాది పచ్చడి పంపిణీ చేసి మన సంప్రదాయాన్ని కాపాడటం విశేషం. రాయచూరు రూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలికారు. కొత్త దుస్తులు ధరించి ఉగాది పచ్చడిని పంచుతూ ఆనందాన్ని పంచుకున్నారు. హిందూ జన జాగృతి సంస్థ ఆధ్వర్యంలో రాజేంద్ర కుమార్ బ్రహ్మధ్వజ పూజలు చేపట్టారు. వీరభద్రేశ్వరుడి దేవాలయం, కిల్లే బృహన్మఠం, లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో అర్చకులు పంచాంగ శ్రవణం వినిపించారు. మంత్రాలయంలో సుబుదేంద్ర తీర్థు శ్రీ పాదంగల్ ప్రత్యేక పూజలు జరిపారు. చైత్రమాసం పాడ్యమి రోజు నాగలి పట్టి దున్నితే మంచి పంటలు చేతికొస్తాయని పూర్వీకుల నుంచి నమ్మకం ఉండటంతో పలువురు పొలాల్లో సేద్యం చేశారు. పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం ఆలయాల్లో పంచాంగ శ్రవణాలు -
ఇఫ్తార్ విందు
రాయచూ రురూరల్: రాయచూరులో హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా అందరూ కలసిమెలసి ఉంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా గురువారం నగరంలో ముస్లింలకు మసీదుల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ముస్లింలు విందు ఆరగించారు. కార్యక్రమంలో శంకర గౌడ ఐ.పాటిల్, రాము, కోరనాళ్ తదితరులు పాల్గొన్నారు. చెరువులో పడి వృద్ధుడు మృతి● డబ్బు కోసమే భర్తను చంపారని భార్య ఆరోపణ రాయచూరు రూరల్: ఈత రాకపోవడంతో వృద్ధుడు నీట మునిగి మృతి చెందిన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. డబ్బు కోసమే తన భర్తను నీటిలోకి తోసి చంపారని భార్య ఆరోపిస్తోంది. వివరాలు.. మంగళవారం సాయంత్రం మాన్వి నుంచి శబ్జాలి, బాబురావ్, చంద్రశేఖర్ కలసి ఆటోలో వృద్ధుడు నాగప్ప పూజార్ (58) తీసుకెళ్లినట్లు సమాచారం. నాగప్ప వద్ద రూ.50 వేలు నగదు ఉండటంతో వీరే నీటిలోకి తోసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాగప్ప పూజార్కి ఎంలాంటి చెడు అలవాట్లు లేవు అని.. బలవంతంగా నాగప్పతో మద్యం తాగించి డబ్బు లాక్కొన్నారని చెబుతున్నారు. విషయం తెలుసుకున్న తాలూకా యంత్రాంగం తెప్ప సహాయంతో గాలింపు చర్యలు చేపట్టింది. మాజీ కార్పొరేటర్ అరెస్ట్ హుబ్లీ: బెయిల్ తీసుకుని కోర్టులో హాజరుకాకుండా సుమారు 7 ఏళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న మాజీ కార్పొరేటర్ను ధార్వాడ ఉపనగర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని శ్రీకాంత జమనాళగా గుర్తించారు. ఇతడు ప్రధాన జిల్లా కోర్టు, జేఎంఎఫ్సీ కోర్టులో వివిధ సెక్షన్ల మేరకు 2019లో శిక్ష గురై బెయిల్ తీసుకున్నాడు. ఆ తర్వాత కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. శ్రీకాంత్పై ధార్వాడ ఉప నగర పోలీసులు ప్రస్తుతం వివిధ సెక్షన్ల కింద ఓ క్రిమినల్ కేసు దాఖలు చేశారు. అంతేగాక అదే పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉంది. ఇతడి ఆచూకీ కోసం ధార్వాడ ఉపనగర పోలీసులు తీవ్రంగా గాలించారు. ఈనెల 15న ధార్వాడ నగర శివారులో నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడిని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తు ఆదేశాలు ఇచ్చింది. తెగిన గట్టు పరిశీలనహొసపేటె: తుంగభద్ర ఎడమ కాలువ గట్టు తెగిపోయిన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే పరన్న మునవళ్లి పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గట్టు తెగిపోయిందని, దీనిని వెంటనే మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేశారు. నీట మునిగిన పొలాల రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరారు. హెచ్ఎం.సిద్దరామయ్య స్వామి, హనుమేష్ యాదవ్, కరుణాకర్ వడ్డరహట్టి, చంద్రశేఖర్ భట్టద పాల్గొన్నారు. ఆస్తి కోసం చెల్లెలు దారుణ హత్యహుబ్లీ: ధార్వాడలో పండగ రోజు విషాదం చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత చెల్లిని అన్న దారుణంగా హత్య చేసిన ఘటన ఉగాది పర్వదినం రోజున ధార్వాడ తాలూకా అమ్మినబావి గ్రామంలో వెలుగు చూసింది. హతురాలిని శివలీల సంగొళ్లి (35)గా గుర్తించారు. అమ్మినబావి హనుమంత యళవాళ సొంత చెల్లినే మట్టుబెట్టిన కసాయి అన్న. సదరు కుటుంబానికి గ్రామంలో మొత్తం 6 ఎకరాల సాగు పొలం ఉంది. దీనిలో తనకు వాటా కావాలని చెల్లెలు శివలీల కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తోంది. పండుగ రోజు అయిన గురువారం పొలంలో భూమి పూజ చేయడానికి అన్న, చెల్లెలు కలిసి వెళ్లారు. ఈ రోజు నా వాటా భూమిలో పూజ చేస్తానని శివలీల చెప్పడంతో అన్న హనుమంత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. హనుమంత తన వద్ద ఉన్న మరుణాయుధాలతో చెల్లెలుపై దారుణంగా దాడి చేసి హత్య చేశారు. ధార్వాడ గ్రామీణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుడు హనుమంత యళవాళ కోసం గాలిస్తున్నారు. దేవేంద్రప్ప స్వామి ఆత్మహత్య సాక్షి, బళ్లారి: సింధనూరులో ఓ మఠం అధిపతి దేవేంద్రప్ప స్వామి ఇకలేరు. గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో గమనించిన భక్తులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దేవేంద్రప్ప స్వామి వ్యక్తిగత, మఠం వ్యవహారాల ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సింధనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లంచం తీసుకుంటూ పరారీ.. ఛేజ్ చేసి అరెస్టు
కోలారు: ఎంత దర్జాగా లంచం తీసుకుంటారో, దొరికిపోతామని తెలిస్తే అంతే భయంతో పరుగులు తీస్తారు. అలాంటి ఘటన కోలారు జిల్లాలో జరిగింది. లంచం తీసుకుంటున్న కోలారు అసిస్టెంట్ డ్రగ్ కంట్రోల్ అధికారి జె.శ్యామల లోకాయుక్త పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కారులో పరారు అవుతుండగా సినిమాలో మాదిరిగా వెంబడించి అరెస్టు చేశారు. వివరాలు.. ఓ మెడికల్ షాపు యజమాని షాపును మరోచోటుకు మార్చాల్సి వచ్చింది. ఇందుకు చిరునామా మార్పు, ఇతరత్రా అనుమతుల కోసం అధికారి శ్యామలను కలిశాడు. అనుమతులు ఇవ్వడానికి రూ.35 వేలు లంచం ఇవ్వాలని ఆమె కోరారు. గురువారం లంచం తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త పోలీసులు దాడి జరిపారు. కారులో నుంచే లంచం స్వీకరిస్తున్న ఆమెను అరెస్టు చేయబోగా వెంటనే పరారయ్యారు. అయితే లోకాయుక్త పోలీసులు సుమారు 15 కిలోమీటర్లు కారును వెంబడించి శ్యామలతో పాటు కారు డ్రైవరును అరెస్టు చేశారు. -
కటకటాల్లో మత్తు పరీక్షలు ముమ్మరం
శివాజీనగర: మత్తు పదార్థాలు వాడుతున్నారని తరచూ ఆరోపణలు రావడంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల జైళ్లల్లో ఖైదీలకు డ్రగ్స్ పరీక్షలు ప్రారంభించారు. ఈ పరీక్షల్లో మహిళా ఖైదీలు కూడా ఎక్కువగా మత్తు పదార్థాలను తీసుకుంటున్నట్లు వెల్లడి అయ్యింది. రాష్ట్రంలో అన్ని కారాగాల్లో అధికారులు వైద్యుల ద్వారా డ్రగ్స్ టెస్టులు జరుపుతున్నారు. మహిళా ఖైదీల రభస రిమాండు ఖైదీలు ఎక్కువగా డ్రగ్స్ వాడుతున్నారని తేలింది. ఇక మహిళా ఖైదీలు శాంపిల్స్ ఇవ్వడానికి తిరస్కరించారు. తాము ఎందుకు ఇవ్వాలని దబాయించారు. కొంతరైతే సీసాల్లో నీరు పోసి ఇచ్చారు. దీంతో పరీక్షల్లో గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం 10 శాతం మంది ఖైదీలకే పరీక్షలు చేశారు. దశలవారీగా అందరికీ నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఎండీఎంఏ, గంజాయి, హెరాయిన్, కొకై న్ వంటి 5 డ్రగ్స్ను గుర్తించవచ్చు. బాధితులకు చికిత్స పాజిటివ్ వచ్చిన ఖైదీలకు ప్రత్యేకంగా ఉంచి చికిత్స ప్రారంభించారు. మత్తు వ్యసనం ఎప్పటి నుంచి, ఎంత స్థాయిలో ఉందనేది బట్టి నివారణ చికిత్స ఇస్తారు. శరీరంలో డ్రగ్స్ మోతాదు ఎంత ఉంది అనేది నిమ్హాన్స్ నుంచి రిపోర్ట్ వస్తుంది. మహిళా ఖైదీల్లోనూ డ్రగ్స్ సేవనం -
మాదప్పకు ఉగాది రథోత్సవం
మైసూరు: ఉగాది జాతర మహోత్సవంలో భాగంగా, రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చామరాజనగర జిల్లా, హనూరు తాలూకాలోని శ్రీ క్షేత్ర మలే మహాదేశ్వర బెట్టలో గురువారం లక్షలాది మంది భక్తుల సమక్షంలో మహారథోత్సవం జరిగింది. సాలూరు మఠాధిపతి కంథ మల్లికార్జున స్వామి నాయకత్వంలో, మూలవిరాట్ కు రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు చేశారు. తరువాత బ్రహ్మ రథానికి పూజ చేసి, వివిధ క్రతువులు నిర్వర్తించారు. దేవుని విగ్రహాన్ని తెల్లని గుర్రంపై ఉంచి, గొడుగు, చామరం, శుభ సాధనాలతో ఆలయం, తేరు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశారు. బెడగంపన్ సమాజానికి చెందిన పూజారులు, 108 మంది పిల్లలు ప్రత్యేకంగా పాల్గొన్నారు. వేలాది భక్తులు స్వామి నామాన్ని జపిస్తూ తేరును లాగారు. తరువాత గురు బ్రహ్మోత్సవం, ఆపై అన్న బ్రహ్మోత్సవం జరిగింది. అనంతరం శాంత మల్లికార్జున స్వామి భక్తులకు వేప, బెల్లాన్ని పంపిణీ చేశారు. హిల్ అథారిటీ కార్యదర్శి ఏఈ రఘు, ఏఎస్పీ శశిధర్, డీఎస్పీ ధర్మేంద్ర పాల్గొన్నారు. బెట్టపై భక్త సంద్రం -
జడిపించిన వడగండ్ల వానలు
మైసూరు: మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకాలోని హనగోడు పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. పలు గ్రామాలలో అరటి, కొబ్బరి, వక్క తోటలు దెబ్బతిన్నాయి. కరెంటు తీగలు తెగి పలు పల్లెల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హుణసూరు డివిజన్లో మొత్తం 46 ఇతర విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దాసనపురంలో పాఠశాలలు, ఇళ్లకు నష్టం ● హనగోడు సమీపంలోని దాసనపురంలో, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పైకప్పు పెంకులు ఆకస్మిక వర్షానికి ఎగిరిపోయాయి. ● గ్రామంలో సోమయ్య, శేఖర్, మాదేగౌడ, గణేష్, ప్రకాష్, సోమశేఖర్, కుమార్, మధు, మాలియ, రవి తదితరుల ఇళ్ల పైకప్పు పెంకులు ఎగిరిపోయి ఆస్తినష్టం సంభవించింది. వర్షంలో గూడు లేకుండా పోయిందని బాధితులు వాపోయారు. చెట్లు పడి ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ● కిరంగూర్లో స్వామిగౌడ ఇంటి పైకప్పు ఎగిరిపోగా, హైరిగేలోని ఇల్లు కూలిపోయింది.మరో ఇంటిపై కొబ్బరి చెట్టు కూలింది. అనేక గ్రామాల పరిధిలో వడగండ్ల వాన వల్ల పొగాకు పైరు మట్టి కరిచింది. ● తట్టెకెరె దర్శన్, శరత్ అనే రైతులు పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ఒక చెట్టు కొమ్మ విరిగి పడడంతో గాయపడ్డారు. ● నాగరహోళె అరణ్యంలో వీరన హోసహళ్లి, ఆనెచౌకూర్, కల్లాహాల్ ప్రాంతాలలో గంటల తరబడి పెద్ద వర్షం పడింది. నష్టపోయిన అన్నదాతలు లబోదిబోమన్నారు. అధికారులు బాధిత ప్రాంతాలలో పర్యటించి నష్టం అంచనా వేశారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి తెల్లవారుజామువరకు భారీ వర్షాలు కురిశాయి. కాలం కాని కాలంలో పడిన వానలతో ఎండల నుంచి ఉపశమనం లభించింది. కొన్నిచోట్ల పంట నష్టం వాటిల్లింది. మైసూరు జిల్లాలోని పలు గ్రామాల్లో వడగండ్ల ధాటికి అనేక ఇళ్లు దెబ్బతినగా, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. మైసూరు, మండ్య జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు పంటపొలాలు, ఇళ్లకు నష్టంమరో 2 రోజులు వానలే! శివాజీనగర: రాష్ట్రంలో పలుచోట్ల మరో రెండు రోజులు భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ గురువారం తెలిపింది. బీదర్, కల్బుర్గి, యాదగిరి, రాయచూరు, బెళగావి, ధార్వాడ, దావణగెరె, శివమొగ్గ, ఉడుపి, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు, హాసన్, మైసూరు, బెంగళూరు, తుమకూరు, మండ్య, చామరాజనగర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. బెంగళూరులో భారీ వర్షం రాష్ట్రంలో పలు చోట్ల బుధవారం భారీ వర్షం కురిసింది. బెంగళూరు ఎంజీ రోడ్డు, కళ్యాణ్ నగర, బళ్లారి రోడ్డు, జయనగర, బనశంకరి, మెజిస్టిక్, శాంతినగర, కోరమంగల లాంటి ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం అందరూ ఇళ్లకు వెళ్లే సమయంలో వాననీరు నిలిచి అవస్థలు పడ్డారు. ప్రధాన రహదారులు, పై వంతెనల మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
బెంగళూరులో బాడుగ ఇల్లు గగనమే
శివాజీనగర: సిలికాన్ సిటీకి ఇతర రాష్ట్రాల నుంచి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు తదితరాల కోసం దేశం నలుమూలల నుంచి జనం రాక ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో ఇళ్లకు, స్థలాలకు అంతులేని డిమాండు ఏర్పడింది. ఫలితంగా బాడుగలు సామాన్యలు భరించలేని స్థాయికి చేరాయి. చిన్న హాల్ ఉన్న ఇంటికి కూడా రూ.10 వేలు బాడుగు అడుగుతున్నారు. ఇళ్లను వెతికిచ్చే బ్రోకర్లకు కమీషన్ కూడా ఎక్కువే. ఈ బాధలను ఓ టెక్కీ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. చాలామంది నెటిజన్లు తమకూ ఇలాంటి సమస్యే ఉందని వాపోయారు. ఎంత తిరిగినా అంతే టెక్కీ తన బాధను బెంగళూరు హౌస్ రెంటల్ అనే ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఎంజీ రోడ్డు చుట్టుపక్కల ఇంటిని వెతికాను. గతంలో మూడేళ్లు ఎలక్ట్రానిక్ సిటీలో ఉండే కంపెనీలో పనిచేసి, ఇప్పుడు ఎంజీ రోడ్డు వద్ద ఉన్న సంస్థలో చేరాను. బెంగళూరులో చల్లని వాతావరణంలో హాయిగా ఉంది. ఇందిరానగర, దొమ్మలూరు, విక్టోరియా లేఔట్, ఫ్రేజర్టౌన్, రిచ్మండ్ టౌన్లో తిరిగాను. సాధారణ అద్దెకు ఒక్క గది కూడా దొరకలేదు. రూ.8 వేలు చెల్లించి బ్రోకర్ల సాయం కోరాను. కొన్ని చిన్న ఇళ్లు కాగా, మరికొన్ని ఇళ్ల వాతావరణం సరిగా ఉండేది కాదు. ఫిబ్రవరి ముగిసి మార్చి ఆరంభమైనా కూడా నాకు ఇల్లు లభించలేదు. ఒకసారి ఒక బ్రోకర్ దొమ్మలూరులో రూ.26 వేల ఇల్లును చూపించాడు. మరుసటి వెళ్లి చూడగా అప్పటికే ఫ్లాట్ను మరొకరు కొనుగోలు చేసినట్లు అక్కడి ప్రజలు తెలిపారు. నాలో ఓర్పు నశించింది. సమయం, సొమ్ము అన్ని వృథా అయ్యాయి. ఈ ఉద్యోగమూ వద్దు, ఇల్లూ వద్దు అనుకున్నా’ అని రాసుకున్నాడు. సలహాలు, స్పందనలు నెట్లో పలు రకాలుగా స్పందించారు. మల్లేశ్వరం, రాజాజీనగర, శేషాద్రిపురంలో వెతకాలని ఒకరు సలహానిచ్చారు. జనవరి నుంచి నేను కూడా ఇల్లు వెతుకుతున్నా, ఇప్పటికీ దొరకలేదని మరొకరు తెలిపారు. బెంగళూరులో బాడుగలను భరించలేమని ఎక్కువమంది చెప్పారు. ఇల్లు దొరక్క ఉద్యోగమే మానేయాలనుకున్నా సోషల్ మీడియాలో టెక్కీ ఆక్రోశం -
రెండో ఎయిర్పోర్టు, స్కైడెక్కు అనుమతులివ్వండి
శివాజీనగర: బెంగళూరు భవిష్యత్ అవసరాల దృష్ట్యా రెండో అంతర్జాతీయ విమానాశ్రయం, స్కైడెక్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో కేంద్రానికి విన్నవించారు. బుధవారం ఆయన ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. బెంగళూరులో రెండో విమానాశ్రయం కోసం ప్రభుత్వం నెలమంగల, కనకపుర రోడ్డు (సోమనహళ్ళి)తో పాటుగా పలు స్థలాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం కెంపేగౌడ విమానాశ్రయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో 2వ ఎయిర్పోర్టు అవసరమని నిశ్చయించింది. బెంగళూరు టూరిజానికి కొత్త కళనిచ్చేలా బహుళ అంతస్తుల భవనం, దానిపై స్కైడెక్ నిర్మాణానికి అనుమతుల కోసం చర్చలు జరిపారు. శీఘ్రమే అనుమతులు ఇవ్వాలని విన్నవించారు. రాష్ట్రంలో ముఖ్యమైన వసతుల ప్రాజెక్టులు, విమానయానం పథకాలపై చర్చించినట్లు డీసీఎం తెలిపారు. పథకాలు సాకారమయ్యేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, సత్వర అనుమతులు అవసరమని అన్నారు. డీసీఎంతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఢిల్లీ టూర్లో కేంద్రానికి డీసీఎం వినతి -
విద్యార్థులకు క్రమశిక్షణ అత్యవసరం
రాయచూరు రూరల్: విద్యార్థులకు క్రమశిక్షణ అత్యవసరమని గ్రీన్ రాయచూరు కార్యదర్శి రాజేంద్ర పేర్కొన్నారు. రాయచూరు తాలూకా దిన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాయచూరు మహర్షి వాల్మీకి విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఎన్ఎస్ఎస్ ముగింపు శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల్లో సంస్కృతి, సంస్కారం, ఆచార, విచార, సంప్రదాయాలపై అవగాహన కలిగి ఉండేందుకు క్రమశిక్షణ దోహదపడుతుందన్నారు. విద్యార్థులు తమ ప్రతిభతో కళలను పోషించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సుభాస్ చంద్ర, వీరేష్, చిదానందప్ప, హన్మంతు నాయక్, శరణప్ప, అనిత, అమరేష్, సతీష్, రంగస్వామి, రంగనాథ్, మహేష్, సునందలున్నారు. -
నత్తనడకన బైపాస్ రోడ్డు పనులు
బళ్లారిటౌన్: బళ్లారి నగర శివార్లలో అనంతపురం రోడ్డు నుంచి సిరుగుప్ప రోడ్డు వరకు చేపడుతున్న బైపాస్ రహదారి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్న ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయా? అని నగర వాసులు ఎదురు చూస్తున్నారు. ఈ పనులను ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ ఎమ్మెల్యేకి చెందిన కంపెనీ నిర్వహిస్తున్నందున ఈ పనులు కూడా సబ్ కాంట్రాక్ట్ ద్వారా నిర్వహిస్తుండటం వల్ల నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రశ్నార్థకంగా రోడ్డు నాణ్యత ముఖ్యంగా రోడ్డుకు వేసే గ్రావెల్ను పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వేస్తున్నారు. ఈ మట్టి బంక మట్టి కావడంతో మున్ముందు రోడ్డు ఎంత వరకు నాణ్యతగా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. అంతేగాక ఇటీవల ఈ మట్టిని కూడా నియమాలను ఉల్లంఘించి ఇక్కడికి తీసుకొస్తున్నందున స్థానిక అధికారులు కూడా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పలు సబ్ కాంట్రాక్టర్లు చేసిన పనులకు సరైన విధంగా నిధులు సమకూర్చక పోవడంతో పనులు నాసిరకంతో పాటు జాప్యం జరుగుతోందని పలువురు వాదిస్తున్నారు. ఇప్పటికే అనంతపురం రోడ్డు నుంచి రైల్వే ట్రాక్ వరకు కొంత వరకు పనులు చురుకుగా జరిగిన అక్కడి నుంచి సిరుగుప్ప రోడ్డు వరకు చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నరలోగా పనుల పూర్తికి ఆదేశం ఈ పనులు ఒకటిన్నర సంవత్సరంలోపు పూర్తి చేయాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ ఇప్పటికే పనులు ప్రారంభించి సంవత్సరం పైబడింది. ఇంకా చాలా చోట్ల ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. వీటికి ప్రస్తుతం ముందస్తు వర్షాలు కురుస్తున్నందున ఈ పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎండాకాలంలో పనులు పూర్తి చేస్తే వర్షాకాలంలో కొంత వరకు మేలు కలగవచ్చు. ఈ రోడ్డు పనుల వల్ల కొన్ని కాలనీలకు రాకపోకలు స్తంభించి పోవడంతో ఆయా కాలనీల వాసులు కూడా ఈ రోడ్డు ఎప్పుడు పూర్తవుతాయా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఇంత పెద్ద స్థాయి పనులు జరుగుతున్నా నేషనల్ హైవే అథారిటీ అధికారులు సరిగ్గా పర్యవేక్షణ చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పని చేయాలన్న నేషనల్ హైవే అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఏదో నామమాత్రంగా తనిఖీలు చేస్తుండటంతో పనుల్లో నాణ్యత లోపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు సక్రమంగా పర్యవేక్షించి పనులను చురుగ్గా సాగేలా చర్యలు చేపట్టాలని పలు సంఘ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోడ్డు పనులు త్వరగా పూర్తయితే భారీ వాహనాలు నగరంలోకి రాకుండా ఊరి బయట నుంచే వెళ్లేందుకు ఎంతో దోహదపడుతుందని వారు వాదిస్తున్నారు. పనులు ఎప్పుడు పూర్తవుతాయా? అని ఎదురు చూపులు నాసిరకంగా పనులు చేస్తున్నారని వెల్లువెత్తిన ఆరోపణలు -
పునీత్ సేవలు అభినందనీయం
రాయచూరు రూరల్: కర్ణాటక రత్న, కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ సామాజిక సేవలు అభినందనీయమని డాక్టర్ రాజ్కుమార్ అభిమానుల సంఘం జిల్లాధ్యక్షుడు గోవిందు పేర్కొన్నారు. నగరంలోని కర్ణాటక సంఘంలో సినీ నటుడు పునీత్ రాజ్కుమార్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కత్తిరించి పేదలకు అన్నదానం ప్రారంభించి ఆయన మాట్లాడారు. తాను బతికి ఉన్నంత వరకు పునీత్ రాజ్కుమార్ అనాథ పిల్లలకు గుప్తంగా ఎంతో సేవలు చేశారన్నారు. కొత్త డీసీపీగా శృతి నియామకంహుబ్లీ: హుబ్లీ ధార్వాడ కమిషన్రేట్ అపరాధ, న్యాయ భద్రత విభాగం నూతన డీసీపీగా శృతి ఎన్ఎస్ను ప్రభుత్వం నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర నిఘా విభాగం ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆమెను మంగళవారం డీసీపీ పోస్టుకు బదిలీ చేసింది. ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న మహానింగ నందగావి ఇటీవల బదిలీపై వెళ్లారు. 2019 ఐపీఎస్ ర్యాంక్ అధికారిణి అయిన శృతి ఇంతకు ముందు చిక్కమగళూరు, బెళగావి జిల్లాల్లో ఏఎస్పీగా విధులు నిర్వహించారు. కాగా ఈమె త్వరలో సదరు బాధ్యతలను చేపట్టనున్నారు. ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృత్యువాత సాక్షి బళ్లారి: ఇటుకలతో నిండిన ట్రాక్టర్ను తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి చెందాడు. హావేరి జిల్లా మరోళు గ్రామంలో గుప్తలతాండా నివాసి దేవరాజ్(26) అనే వ్యక్తి ట్రాక్టర్ ట్రాలీలో నిండుగా ఇటుకలను తీసుకెళ్తున్న సమయంలో ఉన్నఫళంగా ట్రాలీ పైకిలేవడంతో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎయిడ్స్పై ముమ్మర ప్రచారం చేపట్టాలి రాయచూరు రూరల్: దేశాన్ని పట్టిపీడిస్తున్న ఎయిడ్స్పై ముమ్మర ప్రచారం చేపట్టాలని ప్రభుత్వ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు దండెప్ప పేర్కొన్నారు. బుధవారం ఉడుంగల్ ఖానాపూర్ ప్రభుత్వ హైస్కూలులో ఆరోగ్య శాఖ, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఎయిడ్స్ జాగృతి జాతానుద్దేశించి మాట్లాడారు. సమాజంలో ఈ వ్యాధికి గురైన వారిపై వివక్ష తగదని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఎయిడ్స్ వ్యాధిపై గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో నలుగురితో సమానంగా జీవించాలన్నారు. మంత్రిని అవమానించడం తగదు రాయచూరు రూరల్: రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి హెచ్సీ మహదేవప్పను మాజీ మంత్రి శివన గౌడ నాయక్ అవమానించడం తగదని కర్ణాటక చలువాది జిల్లా మహాసభ సంచాలకుడు విశ్వనాథ్ పట్టి ఆరోపించారు. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళననుద్దేశించి ఆయన మాట్లాడారు. ఇటీవల దావణగెరెలో ఎస్సీ, ఎస్టీ నాయకుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారని, అలాంటి నాయకులను చెంప పగలగొట్టాలని వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. మాజీ మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్నా పనికిమాలిన మాటలు మాట్లాడటం తగదన్నారు. మంత్రిని నిందించిన మాజీ మంత్రిని అరెస్ట్ చేయాలని కోరుతూ అదనపు ఎస్పీ కుమారస్వామికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులు స్వయంకృషితో ఎదగాలి రాయచూరు రూరల్ : సమాజంలో విద్యార్థులు స్వయంకృషితో ముందుకు రావాలని డయట్ అధ్యాపకుడు సుఖదేవ్ అన్నారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో సాంఘీక సంక్షేమ ఽశాఖ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల గ్రామీణాభివృద్ధి స్వయం శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు మానసికంగా, ఆర్థికంగా, సాంఘీకంగా అభివృద్ధి చెందడానికి వీలు ఉంటుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. -
వడగళ్ల వాన.. అన్నదాతల్లో ఆవేదన
హుబ్లీ: ఉత్తర కర్ణాటకలో వివిధ జిల్లాల్లో మంగళవారం వడగళ్ల వాన కురవడంతో కొన్ని పంటలను నష్టపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా మామిడి, దానిమ్మ తదితర పంటలకు హాని వాటిల్లిందని రైతులు వాపోయారు. జిల్లాలోని నవలగుంద తాలూకాలో వడగళ్ల వాన ఫలితంగా అంతోఇంతో మిగిలిన జొన్న, గోధుమ పంటలకు హాని వాటిల్లింది. దాసనాళలో భారీ వర్షాలకు పిడుగు పడి గేదె మృతి చెందింది. బోగనూరులో ఓ వృక్షం ఇంటిపై కూలగా ఎటువంటి ప్రాణహాని జరగలేదు. గాలి మరలు కూలిపడటంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. కొందరు రైతుల కుసుమ పంట ఇంకా పొలంలో ఉన్నందు వల్ల చేతికొచ్చిన పంట నోటిదాకా వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. గదగ్ జిల్లా రోణలో వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. పశుగ్రాసానికి దెబ్బ ముఖ్యంగా పశుగ్రాసం, వేరుశెనగ పొట్టు నీటి పాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయపుర జిల్లా ముద్దేబిహాళ, నిడగుంది, బసవన బాగేవాడి, కోల్హార, ముళవాడల్లో తీవ్ర వర్షాలతో ద్రాక్ష, దానిమ్మ తదితర పంటలకు హాని వాటిల్లింది. మామిడి సాగుపై కూడా ఈ వాన తీవ్ర ప్రభావం చూపింది. మామిడికి తెగులు బాధలు తప్పవని, ఫలితంగా దిగుబడి తగ్గవచ్చని సంబంధిత వ్యవసాయ, వాతావరణ శాఖ అధికారి రవి పాటిల్ తెలిపారు. మొత్తానికి జిల్లాలో ఈ వాన ఎండల నుంచి కాసింత ఉపశమనం కలిగించినా ఎన్నడూ లేని విధంగా కలఘటిగి, కుందగోళ తదితర చోట్ల పలు పంటలకు వివిధ రకాలుగా హాని కల్గించింది. రాయచూరు జిల్లాలో.. రాయచూరు రూరల్: జిల్లాలో మంగళఽవారం సాయంత్రం వడగళ్ల వానలు కురిశాయి. దేవదుర్గ తాలూకా గలగ, మస్కి, మాన్వి తాలూకా కవితాళ, లింగసూగూరు తాలూకా గురుగుంట, హట్టి, పామన కల్లూరుల్లో భారీ వానలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో వరి, పత్తి పంటలు దెబ్బ తిన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు వడగళ్లను ప్లాస్టిక్ గంపల్లో పట్టుకొని ఆడుకున్నారు. మెదికినాళలో వరి పంట దెబ్బతింది. -
ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు షురూ
సాక్షి, బళ్లారి: ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమైంది. 1 నుంచి 10వ తరగతి వరకు చదివిన ప్రతి విద్యార్థి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు అంటేనే ఉత్కంఠత, టెన్షన్ టెన్షన్గా ఉంటుంది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 10 తరగతి పరీక్షలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా 65 పరీక్ష కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. జిల్లాలో 23 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి రోజు ఉత్కంఠగా పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా పరీక్ష కేంద్రాల వద్దకు వచ్చి ఆయా పరీక్ష కేంద్రాల వద్ద తమ పిల్లలకు ధైర్యం చెప్పి బాగా రాయాలని ఆశీర్వదించారు. విద్యార్థులకు ధైర్యం నూరిపోత ఎలాంటి టెన్షన్కు లోనుకాకుండా పరీక్షలు రాయాలని ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రాల లోపలకు పంపించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆయా సెంటర్లలో విద్యార్థులకు ఏయే తరగతి గదిలో నెంబర్లను కేటాయించారన్న దానిపై నెంబర్ల బోర్డు ఉంచడంతో తమకు ఏ గదికి కేటాయించారో విద్యార్థులు ఆత్రుతగా నెంబర్లను సరిచూసుకుని తమకు కేటాయించిన తరగతి గదిలోకి వెళ్లారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో అన్ని కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తును నిర్వహించారు. మొదటి రోజు పరీక్షలు ముగిసిన తర్వాత పరీక్ష కేంద్రాల వద్దకు ఆయా స్కూళ్లకు సంబంధించి యాజమాన్యాలు, బంధువులు, విద్యార్థుల వద్దకు వచ్చి పరీక్షకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొన్నారు. పది పరీక్ష కేంద్రాల తనిఖీ రాయచూరు రూరల్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రఽశాంతంగా జరిగాయి. టాగూర్ స్మారక ఉన్నత పాఠశాలలో మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్, జిల్లాధికారి నితీష్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, విద్యాశాఖాధికారి బడిగేర్, తాలూకా విద్యాశాఖాధికారులు ఈరణ్ణ, చంద్రశేఖర్, సుఖదేవ్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో 110 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 32,086 మంది విద్యార్థులకు గాను 814 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యా శాఖాధికారి బడిగేర్ తెలిపారు. విజయనగరలో... హొసపేటె: విజయనగర జిల్లా వ్యాప్తంగా 73 కేంద్రాల్లో 22,041 మంది విద్యార్థులు బుధవారం మొదటి రోజు ప్రథమ భాష పరీక్షకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల చుట్టు నిషేధాజ్ఞలు అమలు చేశారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులను జిల్లా యంత్రాంగం సమకూర్చింది. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. టెన్షన్ టెన్షన్గా పరీక్ష కేంద్రాలకు చేరిక 23 వేల మందికి పైగా విద్యార్థుల హాజరు -
మత్తుతో జీవితాల చిత్తు వద్దు
సాక్షి,బళ్లారి: మాదక ద్రవ్యాలు వాడటం కేవలం వ్యక్తిగత సమస్య కాదని, కుటుంబాలను దెబ్బతీయడమే కాకుండా, సమాజంలో అశాంతి, నేరాలను పెంచుతాయని, వాటి నిర్మూలన ఒక జాతీయ సవాల్ అని, దుర్మార్గమైన వ్యసనమని, అలాంటి వాటికి నేటి యువత దూరంగా ఉండాలని గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. ఆయన బుధవారం నగరంలోని జిల్లా క్రీడా మైదానంలో రాజీవ్గాంధీ విశ్వవిద్యాలయం, దిశాబోధి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నషాముక్త భారత్–యువశుద్ధి అభియాన్ వాకథాన్ను ప్రారంభించి మాట్లాడారు. కర్ణాటక విశ్వగురు బసవణ్ణ వంటి మహానుభావులు జన్మించిన పుణ్యభూమి. సమృద్ధమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలను కలిగి ఉందన్నారు. కర్ణాటక శాంతి, సౌహార్ధతకు, విద్యానిలయాలకు మారుపేరుగా నిలిచిందన్నారు. మాదక ద్రవ్యాల వాడకం ఆందోళనకరం అలాంటి పుణ్యభూమిలో ఏటా యువత కాకుండా అన్ని వర్గాలకు చెందిన వారు మాదక ద్రవ్యాలు వాడటం పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. యువ శక్తి దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్గా తీర్చిదిద్దగలదన్నారు. కమ్మరచేడు కళ్యాణస్వామి మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి రోజుల్లో విజ్ఞానం పెరిగే కొద్దీ మనుషుల్లో అహంకారం పెరిగిపోవడమే కాకుండా, చెడు అలవాట్లకు కూడా రోజు రోజుకు దగ్గర అవుతారన్నారు. ఈ మహమ్మారిని దూరం చేయాలని సూచించారు. రాజీవ్గాంధీ ఆరోగ్య వర్సిటీ వీసీ బీ.సీ.భగవాన్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు లోనుకాకుండా, ఆరోగ్యవంతమైన భారత్కు నాంది పలకాలన్నారు. చిన్న వయస్సులోనే గుండెపోటు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. లక్ష్యసాధనే ముఖ్యం: బిషప్ హెన్రీ డిసౌజా బళ్లారి ధర్మగురువు బిషప్ హెన్రీ డిసౌజా మాట్లాడుతూ మనం ఎక్కడ జన్మించామన్నది కాదు అని, మన జీవితంలో ఏ లక్ష్యాన్ని చేరుకున్నామనేది ముఖ్యం అన్నారు. యువత వ్యవసనాలకు దూరంగా ఉంటూ, మంచి లక్ష్యాలను సాధించినప్పుడే దేశం పురోభివృద్ధి చెందుతుందన్నారు. దిశాబోధి ఫౌండేషన్ డైరెక్టర్ కే.శివనాగిరెడ్డి, మేయర్ గాదెప్ప, ప్రముఖులు చిదానంద, జానెకుంటె బసవరాజు, కర్ణాటక క్రిస్టియన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ జీజే.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నషాముక్త భారత్ అభియాన్ ర్యాలీ నగరంలోని సుధా సర్కిల్, ఇన్ఫ్యాంట్రీ రోడ్డు, ఎస్పీ సర్కిల్, కిత్తూరు రాణిచెన్నమ్మ స్కూల్ రోడ్డు తదితర ప్రముఖ రోడ్లలో సాగుతూ చూపరులను ఆకట్టుకుంది. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ -
రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్
హొసపేటె: జిల్లాలో హొసపేటె, హరపనహళ్లి ఉపవిభాగాల్లో రౌడీషీటర్ల పరేడ్ను బుధవారం జిల్లా డీఏఆర్ పోలీసు మైదానంలో నిర్వహించారు. రౌడీల గత కార్యకలాపాల నేపథ్యం ఆధారంగా సుదీర్ఘ విచారణ జరిపారు. కొన్ని సందర్భాల్లో వారు తమ నేర కార్యకలాపాలను విరమించుకున్నా వారిపై ఉన్న పాత కేసుల దృష్ట్యా వారిపై నిఘా ఉంచామని ఎస్పీ జాహ్నవి తెలిపారు. ప్రస్తుతం తీవ్రమైన నేరాల్లో పాల్గొంటున్న వారిని తాము విచారించి, తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాము వారి ప్రస్తుత కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. తాము వారిపై నిశిత నిఘా ఉంచడంతో పాటు వారి ఆర్థిక లావాదేవీలను కూడా పర్యవేక్షిస్తామన్నారు. పోలీసు శాఖ రౌడీల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు. తమ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకుండా నేర కార్యకలాపాల్లో పాల్గొంటున్న 15 మందికి పైగా రౌడీలను జిల్లా నుంచి బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా పరేడ్లో అదనపు ఎస్పీ మంజునాథ్, సుమారు 220 మంది రౌడీలు పాల్గొన్నారు. -
ప్రేమపెళ్లి జంటల భద్రతకు భరోసా
శివాజీనగర: రాష్ట్రంలో కులాంతర, మతాంతర ప్రేమపెళ్లి చేసుకునే జంటలపై తల్లిదండ్రులు, బంధువులు దాడులకు పాల్పడడం పెరిగింది. ఇలాంటి పరువు హత్యలు, దాడులు, బెదరింపులకు పాల్పడేవారికి జైలు శిక్ష, జరిమానా విధించేలా ఇవ నమ్మవ, ఇవ నమ్మవ అనే బిల్లును బుధవారం విధానసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ మంత్రి ప్రియాంక్ ఖర్గే బిల్లు గురించి వివరించారు. దాడులకు పాల్పడేవారికి కనీసం ఐదేళ్లు జైలు శిక్ష పడేలా నిబంధనలు ఉంటాయన్నారు. దంపతుల్లో ఎవరినైనా తీవ్ర గాయపరిస్తే వారికి 3 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష, రూ.3 లక్షల వరకు జరిమానాను విధించవచ్చన్నారు. చిన్న గాయమైనా 2 సంవత్సరాలకు తక్కువ కాకుండా జైలు, రూ.2 లక్షల జరిమానా తప్పదని తెలిపారు. దంపతులను బెదిరించినవారికి 3 నుంచి ఐదేళ్ల లోపు జైలుశిక్ష, రూ.2 లక్షలు జరిమానా విధించేలా చట్టం ఉంటుందన్నారు. కులం పేరుతో అధికారం చలాయించేవారిని అదుపు చేయడమే చట్టం లక్ష్యమన్నారు. డీజేలపై నిషేధం యోచన యశవంతపుర: వేడుకలు, జాతరలు, పెళ్లి ఊరేగింపులు.. ఇలా ఏ సంబరమైనా ఇప్పుడు డీజేల వాడకం పెరిగింది. భారీ స్పీకర్లతో గుండెలదిరేలా మ్యూజిక్ను పెట్టి చిందులేస్తారు. ఈ డీజేలను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. శివమొగ్గ జిల్లా జీజేపీ ఎమ్మెల్యే ఎస్ఎన్ చన్నబసప్ప సహ్యాద్రి ఉత్సవాల నిర్వహణకు అనుమతివ్వాలని విధానసభలో ప్రస్తావించారు. గంగావతి బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి కొప్పళ ఆనెగుంది ఉత్సవాలను పునః ప్రారంభించాలని కోరారు. ఈ సమయంలో కార్మికశాఖ మంత్రి సంతోష్లాడ్ ఏ ఉత్సవం జరిగినా డీజేలతో పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. త్వరలో డీజేలను నిషేధించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం సభ్యులకు ఒక ప్రకటనను విడుదల చేసింది. పరువు పేరుతో దాడులు చేస్తే కఠిన శిక్షలు అసెంబ్లీలో సర్కారు బిల్లు -
ఆస్పత్రి నుంచి అంబులెన్సులో రాక
కెజీఎఫ్: రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయి, ఇంకా గాయాలతో బాధపడుతున్న టెన్త్ విద్యార్థినిని అంబులెన్స్లోనే పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చారు. అతి కష్టమ్మీద పరీక్షను రాసి ధైర్యాన్ని చాటుకుంది. వివరాలు.. కేజీఎఫ్ పట్టణంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో చదువుతున్న చిన్నాగనహళ్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కుసుమ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ కాలును కోల్పోయింది. త్వరలో మరో సర్జరీ కూడా చేయాల్సి ఉంది. ఇంతలో పరీక్షలు వచ్చాయి. ఆమె కూర్చోరాదని, స్ట్రెచర్పైన పడుకునే పరీక్ష రాయవచ్చని వైద్యులు సూచించారు. బుధవారం తొలి పరీక్షకు సెయింట్ జోసెఫ్లోని పరీక్షా కేంద్రానికి అంబులెన్స్లో వచ్చింది. బీఈఓ నారాయణస్వామి కుసుమ పరీక్ష రాయడానికి ప్రత్యేక ఏర్పాటు చేయించారు. పరీక్షలకు బాగా సిద్ధమైనట్లు ఆమె తెలిపింది. కుసుమ కష్టాన్ని చూసి చాలామంది కంటతడి పెట్టారు. -
పెళ్లికి ఒప్పుకోలేదని.. యువతి కుటుంబంపై దాడి
దొడ్డబళ్లాపురం: పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదనే కోపంతో ఓ దుండగుడు యువతి కళ్లల్లో కారం చల్లి దాడి చేసిన సంఘటన బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా జోడకురుళి గ్రామంలో జరిగింది. భీరప్ప రామప్ప అనే వ్యక్తి విద్యాశ్రీ అనే యువతితో పాటు ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు. విద్యాశ్రీతో వివాహం జరిపించాలని ఆమె తల్లిదండ్రులను చాలాకాలంగా కోరుతున్నాడు. అయితే మంచివాడు కాదనే కారణంతో విద్యాశ్రీ, ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కక్ష పెంచుకున్న దుండగుడు మంగళవారం రాత్రి విద్యాశ్రీ ఇంట్లోకి జొరబడి వాళ్ల కళ్లల్లో కారం చల్లి కట్టెలతో చితకబాది పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురినీ గ్రామస్తులు చిక్కోడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాగల్ ప్రేమి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బెళగావి మేయర్గా కన్నడిగ దొడ్డబళ్లాపురం: మరాఠాల ఆధిపత్యం ఉండే బెళగావి నగర పాలికె మొట్టమొదటిసారి కన్నడిగులు మేయర్, ఉప మేయర్లుగా ఎన్నికయ్యారు. బుధవారంనాడు జరిగిన ఈ ఎన్నికలో మేయర్గా ప్రీతి కామకర, ఉప మేయర్గా హనుమంత కొంగాలి ఎన్నికయ్యారు. 65 మంది కార్పొరేటర్లు ఉండగా ఎన్నిక సమయంలో 59 మంది హాజరయ్యారు. ప్రీతికి 39 మంది మద్దతు తెలుపగా 18 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ప్రీతి కామకర 21వ వార్డు బీజేపీ కార్పొరేటర్ కాగా, హనుమంత 46వ వార్డు బీజేపీ కార్పొరేటర్. హనుమంతకి మద్దతుగా 39 మంది ఓటేశారు. కన్నడ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. -
బళ్లారి, విజయనగరలకు కొత్త బస్సులు ఇవ్వండి
సాక్షి బళ్లారి: బళ్లారి, విజయనగర జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 100 ఎర్ర బస్సులు, 20 ఏసీ బస్సులు కేటాయించాలని ఎమ్మెల్సీ వైఎం.సతీష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విధాన పరిషత్లో ఆయన ఉమ్మడి బళ్లారి జిల్లా సమస్యలపై గళం విప్పారు. పాత బస్సులను నడపడం వల్ల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. అందువల్ల నూతన బస్సులను మంజూరు చేయాలని ఒత్తిడి చేశారు. ఎమ్మెల్సీ ప్రశ్నకు మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ కళ్యాణ కర్ణాటక ప్రాంతానికి 2026వ సంవత్సరానికి సంబంధించి నూతన బస్సుల కొనుగోలుకు టెండర్ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకు 400 బస్సులు కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకొన్నామన్నారు. విద్యార్థులు కూడా బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా పాత బస్సులను పక్కన పెట్టి సత్వరం కొత్త బస్సులను మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వానికి ఎమ్మెల్సీ వైఎం.సతీష్ వినతి -
మరో వారం గ్యాస్ ట్రబులే
ఏయే రంగానికి ఎంత మేర గ్యాస్ సిలిండర్లు ఇస్తారు? శివాజీనగర: ఇరాన్– ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసే సూచనలు లేవు. పైగా గ్యాస్, ఇంధన ఉత్పత్తి కేంద్రాలపై బాంబు దాడులు జరుగుతున్నాయి. దీంతో గ్యాస్ సరఫరాపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో గృహోపయోగ వంటగ్యాస్ సిలిండర్ సరఫరాకు ఇబ్బంది లేదు, అయితే మరో వారం పాటు కమర్షియల్ సిలిండర్ల పంపిణీ కష్టమని పౌర సరఫరాల మంత్రి కే.హెచ్.మునియప్ప చెప్పారు. బుధవారం అసెంబ్లీలో ఆయన ఈ విషయం తెలిపారు. ఒక కుటుంబానికి నెలకు ఒక సిలిండర్ ఇవ్వడానికి సమస్య లేదు, ప్రస్తుతం 10 రోజులకు సరిపడే నిల్వ ఉంది, ప్రజలు కంగారుతో ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోరాదు అని తెలిపారు. కమర్షియల్ సిలిండర్ల స్టాకు తక్కువగా ఉందని, హోటల్ యజమానులు సహకరించాలని మంత్రి కోరారు. కనీసం 10 రోజుల వరకు హోటళ్లలో కరెంటు స్టవ్లు వాడుకోవడం మంచిదని సూచించారు. ఉన్న కొద్ది సిలిండర్లను ముందుగా ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లకు సరఫరా చేస్తామన్నారు. హోటళ్ల యజమానులు ఇబ్బందులను తట్టుకోవాలని కోరారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీకి కేంద్ర ప్రభుత్వానికి సీఎం లేఖ రాశారని తెలిపారు. మార్గదర్శకాలు జారీ కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీకి (ఎల్పీజీ) రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆసుపత్రి, విద్యా సంస్థలకు ప్రాధాన్యతనిస్తూ 100 శాతం పంపిణీకి ఆదేశించింది. అయితే హోటల్లకు 10 శాతం పంపిణీతో సరిపెట్టడం గమనార్హం. గురువారం నుంచి గ్యాస్ పంపిణీ చేపట్టాలని తెలిపింది. హోటల్లు బుధవారం నుంచి కమర్షియల్ గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. బెంగళూరులో ఇళ్లకూ ఇబ్బంది యశవంతపుర: బెంగళూరులో గ్యాస్ కొరత రోజురోజుకు అధికమవుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు లేక హోటల్స్, రెస్టారెంట్లు, క్యాంటీన్లు, మెస్సులు, పీజీ హాస్టళ్లు తదితరాలు అవస్థలు పడుతున్నాయి. ఇప్పుడు ఇళ్లలోనూ గ్యాస్ సమస్య అధికమైనట్లు తెలుస్తోంది. ఏజెన్సీల వద్ద జనం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిలిండర్ల కోసం వేచిచూస్తున్నారు. గతంలో గ్యాస్ను ఫోన్లో బుక్ చేస్తే ఇంటికే సరఫరా చేసేవారు. కానీ పరిస్థితి మారిపోయింది. బుక్ చేసినా సిలిండర్ రావడం లేదని, వెంటనే ఇవ్వాలని ఏజెన్సీల వద్ద గొడవకు దిగుతున్నారు. కొన్న ఏజెన్సీల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. ప్రాధాన్యత పరంగా కమర్షియల్ సిలిండర్ల పంపిణీ అసెంబ్లీలో మంత్రి మునియప్ప వెల్లడి కరెంటు స్టవ్లు ఉపయోగించాలని సూచన ఆసుపత్రులు, విద్యాసంస్థలకు – 100 శాతం నూనెలు, సీడ్ ప్రాసెసింగ్ – 70 శాతం ఎయిర్లైన్స్, రైల్వేస్కు – 70 శాతం హోటళ్లు, పరిశ్రమల క్యాంటీన్లు – 10 శాతం వృద్ధాశ్రమాలకు – 70 శాతం -
దశ తిరిగేలా.. విజయోస్తు
శివాజీనగర: విద్యార్థి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) వార్షిక పరీక్షలు బుధవారం రాష్ట్రమంతటా ప్రారంభమయ్యాయి. 8,65,988 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు పరీక్ష జరిగింది. 2,870 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పరీక్షల్లో అక్రమాలు జరగకుండా అన్ని విధాలా భద్రతా చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడి నెలకొంది. కేంద్రాలకు పిల్లలతో పాటు తల్లిదండ్రులూ తరలివచ్చారు. గాభరా పడవద్దని, పరీక్షలు బాగా రాయాలని తల్లులు పిల్లలకు ధైర్యం నూరిపోశారు. కొందరు దిష్టి తీసి విజయోస్తు అని దీవించారు. మంత్రి మధు బంగారప్ప తనిఖీ మల్లేశ్వరం ఎస్ఎస్ఎల్సీ పరీక్షా కేంద్రాన్ని విద్యా మంత్రి మధు బంగారప్ప సందర్శించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సక్రమంగా పరీక్షలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు షురూ పరీక్షా కేంద్రాల్లో సందడి -
చెరకు తోటలో చిరుత కూనలు
మండ్య: మండ్య తాలూకా భూతన హోసూరు గ్రామంలోని చెరకు తోటలో మూడు చిరుత పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. తోటలో నుంచి శబ్దాలు వినిపించడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా మూడు చిరుత పిల్లలు కనిపించాయి. అటవీ అధికారులకు తెలియజేయగా వచ్చి వాటిని స్వాధీనం చేసుకున్నారు. తల్లి చిరుతను బంధించడానికి బోనును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ధర్మస్థల కేసుపై హైకోర్టులో విచారణ ధర్మస్థల పరిసరాలలో చోటుచేసుకున్న అత్యాచారాలు, హత్యలు, అసహజ మరణాలపై హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. దర్యాప్తులో లోపాల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి ప్రభుత్వానికి గట్టి ఆదేశాలు జారీచేసింది. పిటిషన్దారు కుసుమావతి తరఫు న్యాయవాది ఎస్.బాలన్ వాదించారు. ఈ కేసు తీవ్రమైనదని, దర్యాప్తు మధ్యలో వదిలిపెట్టరాదనని, 74 కేసుల్లో దర్యాప్తు నివేదిక తక్షణం అందించాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశించింది. మృతదేహం లభించినప్పుడు పోస్ట్మార్టం చేశారా, అదృశ్యమైనవారి ఆచూకీ కనిపెట్టారా అని పలు ప్రశ్నలు సంధించింది. సిట్ దర్యాప్తు నివేదికను అందించాలని తెలిపింది. సొంతూళ్లకు పద పద ● వరుసగా పండుగలతో బెంగళూరు నుంచి పయనం యశవంతపుర: ఉగాది, రంజాన్ పండుగలు రావడంతో బెంగళూరులోని ఇతర ప్రాంతాల వాసులు వేలాదిగా తమ సొంతూళ్లకు బయలు దేశారు. యథా ప్రకారం బస్సులకు డిమాండు పెరగడంతో ప్రైవేటు ట్రావెల్స్ చార్జీల మోత మోగిస్తున్నాయి. గురువారం ఉగాది పండుగ, శుక్రవారం పార్ణ పండుగ, శనివారం రంజాన్, ఆదివారం సెలవు కావడంతో 4 రోజులు సొంతూరిలో బంధుమిత్రులతో సంతోషంగా గడపాలని బయల్దేరారు. ప్రైవేటు బస్సుల చార్జీలు ప్రయాణికులకు భారంగా మారాయి. బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కేఎస్ ఆర్టీసీ 2,325 బస్సులను నడుపుతున్నా రద్దీకి చాలడం లేదు. బుధవారం మధ్యాహ్నం నుంచి బెంగళూరు నుంచి అనేక మంది కార్లు, బైకుల్లో స్వస్థలాలకు వెళ్లారు. బెంగళూరు మెజిస్టిక్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరేసి పోయింది. సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు. షేర్ల పేరుతో మహిళకు రూ.27 లక్షల మస్కా మైసూరు: మైసూరువాసులను ఆన్లైన్ నేరగాళ్లు వెంటాడుతున్నారు. షేర్ మార్కెట్లో అధిక లాభాలు గడించవచ్చని అత్యాశకు పోయిన ఓ మహిళ రూ.27 లక్షలను కోల్పోయిన ఘటన మైసూరులో జరిగింది. మైసూరులోని రాఘవేంద్రనగరకు చెందిన మహిళకు గోబ్రిడ్జ్ అనే సంస్థ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. లింక్ నొక్కడంతో ఒకరు కాల్ చేసి, తమ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అనతికాలంలోనే అధిక లాభాలు గడించవచ్చని ఆశ పెట్టారు. ఆ మాటలను నమ్మిన ఆమె దశల వారీగా దుండగులు చెప్పిన ఖాతాకు రూ.27 లక్షలను జమ చేసింది. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
కాంగ్రెస్తో బలవంతపు పెళ్లి
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీని బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచి్చందని మాజీ ప్రధానమంత్రి, జేడీ (ఎస్) అధినేత హెచ్.డి.దేవెగౌడ అన్నారు. ఆ బంధం సరిగ్గా సాగకపోవడంతో నచ్చక విడాకులు తీసుకున్నానని చెప్పారు. దేవెగౌడ్ కాంగ్రెస్తో ప్రేమాయణం సాగించి, మోదీని పెళ్లి చేసుకున్నారంటూ బుధవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఖర్గే చేసిన వ్యాఖ్యపై దేవెగౌడ ‘ఎక్స్’లో స్పందించారు. ఖర్గే మాట్లాడినప్పుడు సభలో లేనని పేర్కొన్నారు. 2018లో కాంగ్రెస్ నాయకత్వం గులాం నబీ ఆజాద్ను తన వద్దకు రాయబారానికి పంపించిందని గుర్తు చేసుకున్నారు. తన తనయుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినప్పటికీ తాను అంగీకరించలేదని వెల్లడించారు. మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రిని చేయాలంటూ సూచించానని స్పష్టం చేశారు. కుమారస్వామి విషయంలో ఆజాద్ పట్టుబట్టారని అన్నారు. కానీ, 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను పక్కనపెట్టి బీజేపీలో చేరిపోయారని చెప్పారు. వారిని బీజేపీలోకి ఎవరు పంపించారో అందరికీ తెలుసని ఉద్ఘాటించారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన వ్యక్తిని కాంగ్రెస్ పెద్దలు ఆనాడు అడ్డుకోలేదన్నారు. కాంగ్రెస్ కూటమిని తాను వదిలేయలేదని, వారే వెళ్లిపోయారని స్పష్టంచేశారు. విడాకులు ఇవ్వడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితిని వారే సృష్టించారని దేవెగౌడ తేలి్చచెప్పారు. -
సమాధి తవ్వి మృతదేహం బయటకు.. చివరికి పోలీసుల ఎంట్రీ!
పావగడ( కర్ణాటక): మహిళ మృతదేహానికి అంత్యక్రియల విషయంలో తాలూకాలోని భూపూరు తండాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాలూకాలోని భూపూరు తండా గ్రామానికి చెందిన రాజునాయక సరోజబాయి దంపతుల కుమార్తె శృతి (20)కి ఏడాది క్రితం తన సమీప బంధువు పవన్ కళ్యాణ్తో వివాహం జరిగింది. పవన్ కళ్యాణ్ బెంగుళూరులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తుండటంతో యలహంకలో కాపురం పెట్టారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని గత శనివారం మధ్యాహ్నం శృతి తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు భర్త కారణమని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఈక్రమంలో మంగళవారం శృతి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అయితే ఆమె మృతదేహాన్ని భర్త నూతనంగా నిర్మించిన ఇంటి ఎదుట ఖననం చేశారు. విషయం తెలుసుకున్న తిరుమణి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి మరో చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను తిరుమణి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. -
5 ఏళ్లగా అక్రమ సంబంధం చివరికి..!
బనశంకరి( బెంగళూరు): నిశ్చితార్థం అయి, త్వరలో పెళ్లాడబోయే యువతిని యువకుడు దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన బెంగళూరు డీజే హళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. స్థానికులు యువతి జోయా (19), షబీల్ (20)కు నిశ్చితార్థమైంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో చక్కెరమండీ ఏరియాలోని తన కుటుంబానికి చెందిన పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ షబీల్ చాకుతో జోయా గొంతుకోసి హత్యచేసి ఉడాయించాడు. కొన్ని గంటలకు షబీల్ కుటుంబసభ్యులు అక్కడికి రాగా యువతి శవం కనబడింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా చేరుకుని పరిశీలించి, శవాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తూర్పు డీసీపీ విక్రమ్ అమటి మాట్లాడుతూ మాకు 11 గంటలకు 112 కు ఫోన్కాల్ వచ్చిందని తెలిపారు. పరారీలో ఉన్న యువకుడు అరెస్టయితే హత్యకు కారణం తెలుస్తుందన్నారు. ఆస్తి కోసం ప్రియురాలి హత్య దొడ్డబళ్లాపురం: ప్రియురాలిని హత్య చేసి పరారైన ప్రియున్ని బెళగావి జిల్లా అథణి పోలీసులు ఏపీలో శ్రీశైలంలో అరెస్టు చేశారు. వివరాలు.. అథణి నివాసి కుమార్ కల్లప్ప (34), సుజాత (34) అనే మహిళను చెరుకు తోటలో గొంతు పిసికి చంపి శ్రీశైలానికి పారిపోయాడని జిల్లా ఎస్పీ రామరాజన్ తెలిపారు. 12వ తేదీన కుళ్లిన స్థితిలో మహిళ శవం బయటపడింది. సుజాత భర్తకు దూరంగా ఉంటోంది. కొన్నాళ్లకు కుమార్తో సంబంధం ఏర్పడింది. ఇద్దరూ 5 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. సుజాతకు ఉన్న ఆస్తిని తన పేరుమీద రాయాలని నిందితుడు ఒత్తిడి చేయగా ఆమె తిరస్కరించింది. కక్ష పెంచుకుని ఈ నెల 7న ఆమెను తన చెరుకు తోటకు తీసికెళ్లి హతమార్చాడు. -
లోకాయుక్త దాడి.. కత్తితో పీడీఓ హైడ్రామా
మైసూరు: నీరుగంటి ఉద్యోగికి బకాయి వేతనం చెల్లించేందుకు రూ.25 వేల లంచం తీసుకుంటున్న పీడీఓ లోకాయుక్తకు చిక్కారు, జిల్లాలోని హుణసూరు తాలూకాలో జరిగింది. వివరాలు.. హుణసూరు తాలూకాలోని ముళ్లూరు గ్రామ పీడీఓ మంజుల కాగా, నీరుగంటిగా పని చేస్తున్న స్వామి ఇటీవల మరణించారు. సానుభూతి ఆధారంగా స్వామి కుమారుడు మహదేవకు ఆ ఉద్యోగం లభించింది. తండ్రికి బకాయి ఉన్న రెండేళ్ల జీతం సుమారు రూ.4 లక్షలను మంజూరు చేయాలని పీడీఓ మంజులను కోరాడు. ఆమె రూ.50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కార్యాలయంలో మంజుల రూ.25 వేల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు దాడి అరెస్టు చేశారు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మంజుల చేతిని కత్తితో కోసుకుని గాయపడింది. ఆమెను మైసూరులోని కేఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. లంచంతో పాటు కత్తితో దాడి కేసులను నమోదు చేశారు. గ్యాస్ ఓడ రాక యశవంతపుర: పశ్చియాసియా యుద్ధంతో గ్యాస్కు కటకట ఏర్పడింది. ఈ సమయంలో హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ గ్యాస్ ఓడలు క్రమంగా దేశానికి చేరుకుంటున్నాయి. 26వేల టన్నుల ఎల్పీజీతో కూడిన ఓడ శివాలిక్ మంగళవారం మంగళూరు తీరానికి చేరింది. దానిని అధికారులు అన్లోడ్ చేశారు. దీంతో కొంచెం ఇబ్బంది తీరనుంది. మూడబిదిరె సీఐ సందేశ్పై వేటు ● మహిళను వేధించాడని కేసు నమోదు బొమ్మనహళ్ళి, యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె ఠాణా సీఐ సందేశ్ లైంగిక వేధింపులపై ఓ మహిళ ఆరోపణలు చేశాక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. న్యాయం కోసం ఠాణాకు వెళ్లిన అనేక మంది మహిళలను ఇతడు అధికార బలంతో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. నీ భర్తను విడిచిపెట్టాలంటూ పడక గదికై నా రావాలి, లేదా రూ.25 లక్షలు ఇవ్వు అని బెదిరించాడని ఓ మహిళ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. ఈ సీఐ మీద విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఉమానాథ కోట్యాన్ హోంమంత్రి పరమేశ్వర్కు లేఖ రాశారు. మహిళలను వేధించడం, లంచాలు డిమాండ్ చేయడాన్ని ప్రస్తావించారు. కాగా, బాధిత మహిళ సోదరి సీఐని వెనకేసుకు రావడం గమనార్హం. సీఐ సందేశ్ నిరాపరాధి అని, కుటుంబ కలహాల నేపథ్యంలో సీఐపై మా అక్క ఆరోపణలు చేసినట్లు చెప్పింది. సీఐ సస్పెండ్ సీఐ సందేశ్ని మంగళూరు నగర పోలీస్ కమిషనర్ సుధీర్కుమార్ రెడ్డి సస్పెండ్ చేశారు. పలు ఆడియోలు, వీడియోలు విడుదల కావడంతో చర్య తీసుకున్నారు. అతనిపై కేసును దర్యాప్తు చేసి నివేదిక అందజేయాలని ఏసీపీ శ్రీకాంత్ను ఆదేశించారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాలతో మూడబిద్రిలో సందేశ్పై సుమోటోగా కేసు నమోదైంది. బాధితురాలి కుమారునిపై కూడా దాడి చేశాడని ఫిర్యాదు నమోదైంది. నిన్ను రేప్ చేస్తా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అని బెదిరించాడని బాధిత మహిళ తాజాగా ఆరోపించింది. -
వృద్ధురాలి డిజిటల్ అరెస్టు
బనశంకరి: వృద్ధురాలిని భయపెట్టి డిజిటల్ అరెస్ట్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.38 లక్షలు దోచుకున్నారు. వివరాలు.. బెంగళూరు తూర్పు సైబర్ ఠాణా పరిధిలో ఇది జరిగింది. ఈ నెల 11వ తేదీన వృద్ధురాలు గీతకు ఓ ఫోన్ వచ్చింది, ముంబై బ్యాంకులో మీ పేరుతో అకౌంట్ తెరిచి ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశారని వృద్ధురాలిని బెదిరించారు. రిజర్వు బ్యాంకు మీ ఖాతాలను పరిశీలిస్తుంది, వెంటనే రూ.38 లక్షల నగదు జమచేయాలి, గంట తరువాత మీ డబ్బులు మళ్లీ అకౌంట్కు జమ చేస్తాం అని నేరగాళ్లు నమ్మించారు. గీతా నిజమేననుకుని తన వద్ద ఉన్న రూ.38 లక్షలను వంచకులు తెలిపిన అకౌంట్కు జమచేసింది. 3 రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడరాదని బెదిరించారు. డబ్బు పంపిన 2 రోజుల తరువాత కూడా ఖాతాకు జమ కాకపోవడంతో సైబర్ నేరగాళ్ల మోసమని ఆమె తెలుసుకుంది. సైబర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. దంత విద్యార్థికి రూ.4.44 లక్షలు.. మైసూరు: ప్రముఖ కంపెనీల డిస్ట్రిబ్యూటరీ ఏజెన్సీని ఇప్పిస్తామని ఓ విద్యార్థిని నమ్మించిన దుండగుడు రూ.4.44 లక్షలను టోపీ వేశాడు, మైసూరులోని నిమిషాంబ బడావణె నివాసి, దంత వైద్య విద్యార్థి రోహిత్ బాధితుడు. అతనికి ఓ ఈ–మెయిల్ వచ్చింది, లాభాలు పంచే వ్యాపారం ప్రారంభించేందుకు పేరు మోసిన కంపెనీ ఉత్పత్తుల డిస్ట్రిబ్యూటరీ ఏజెన్సీని ఇప్పిస్తామని తెలిపారు. అందులో ఉన్న మొబైల్ నంబరుకు రోహిత్ సంప్రదించాడు. నీకు ఏజెన్సీ ఇప్పిస్తామని, ముందు కొంత రుసుము కట్టాలని పలు విడతల్లో రూ.4.44 లక్షలను తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. మళ్లీ మళ్లీ డబ్బులు కట్టాలని మోసగాడు ఒత్తిడి చేయడంతో వంచనకు గురైనట్లు గ్రహించిన రోహిత్ కువెంపునగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఉగ్రవాదులకు సహకరించావని... రూ.38 లక్షల వసూలు బెంగళూరులో ఘటన -
మంచు తుపాను?
బనశంకరి: వేసవి ఎండల మధ్య మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హఠాత్తుగా వడగండ్ల వర్షం విరుచుకుపడింది. కలఘటగి పట్టణం, పరిసరాల్లో నిమ్మకాయ సైజంత మంచుగడ్డలు ఆకాశం నుంచి పడడంతో జనం ఆశ్చర్యానికి లోనయ్యారు. దెబ్బలు తగలకుండా సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టారు. ఎక్కడ చూసినా నాలుగైదు ఇంచుల ఎత్తున మంచుముక్కలు పరచుకున్నాయి. తామెప్పుడూ ఇలాంటిది చూడలేదని స్థానిక ప్రజలు సంభ్రమానికి లోనయ్యారు. యువత సెల్ఫీలు, వీడియోలలో బంధించారు. వడగండ్ల ధాటికి పంటపొలాలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల గుడిసెలు, పెంకుటిళ్లు సైతం ధ్వంసమయ్యాయి. బెంగళూరులో జోరువాన మరోవైపు బెంగళూరు నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎండాకాలంలో వర్షం పడటంతో చల్లదనం ఏర్పడింది. బెంగళూరులో మరో రెండు మూడు రోజులు వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉగాది కి మొదటి వర్షం రావడం శుభ సూచికగా భావిస్తారు. యలహంకలో అర్ధగంటకు పైగా వర్షం కురిసింది. చిక్కమగళూరు, బెళగావి, హుబ్లీ– ధార్వాడ, బళ్లారి, విజయనగర తదితర ప్రాంతాల్లోనూ వడగండ్లు, పిడుగులతో కూడిన వానలు పడ్డాయి.ఎటుచూసినా మంచు ముక్కలు. రోడ్లు, ఇళ్ల ముందు, పొలాలు, మైదానాలు తెల్లని మంచు దుప్పటిని కప్పుకున్నాయి.. కశ్మీరు గురించి ఎవరైనా ఇలా చెబుతారు. కానీ వాతావరణం చేసిన మాయకు ధార్వాడ జిల్లాలోని కలఘటగి పట్టణం వడగండ్లతో నిండిపోయింది. అలాగే చిక్కమగళూరు జిల్లాలోనూ వడగండ్ల వాన ముంచెత్తింది. ధార్వాడ జిల్లా కలఘటగిని ముంచెత్తిన వడగండ్లు పలు జిల్లాల్లో ఆకస్మిక వానలు -
ఎస్ఎస్ఎల్సీ పరీక్షలకు వేళాయె
శివాజీనగర: విద్యార్థి జీవితంలో ఉన్నత చదువులకు ముఖద్వారం వంటి ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి. ఈసారి 9,02,889 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. రాష్ట్రంలో 15,941 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షా కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పకడ్బందీ భద్రత అక్రమాలు జరగకుండా కర్ణాటక పాఠశాల పరీక్ష, మూల్యాంక నియంత్రణ మండలి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, లోపలకు ఎవరూ మొబైల్ ఫోన్లను తీసుకురాకుండా నిషేధం, కేంద్రాల పరిసరాలలో నెట్, జిరాక్స్ సెంటర్ల మూసివేత వంటి చర్యలను చేపట్టింది. పోలీసు బందోబస్తుతో పాటు పరీక్షా కేంద్రం చుట్టుపక్కల 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు ఉంటాయి. పరీక్షార్థులు ఆర్టీసీ, సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు -
లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఐ సందేశ్ సస్పెండ్
బొమ్మనహళ్ళి, యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె ఠాణా సీఐ సందేశ్ లైంగిక వేధింపులపై ఓ మహిళ ఆరోపణలు చేశాక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. న్యాయం కోసం ఠాణాకు వెళ్లిన అనేక మంది మహిళలను ఇతడు అధికార బలంతో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. నీ భర్తను విడిచిపెట్టాలంటూ పడక గదికైనా రావాలి, లేదా రూ.25 లక్షలు ఇవ్వు అని బెదిరించాడని ఓ మహిళ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. ఈ సీఐ మీద విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఉమానాథ కోట్యాన్ హోంమంత్రి పరమేశ్వర్కు లేఖ రాశారు. మహిళలను వేధించడం, లంచాలు డిమాండ్ చేయడాన్ని ప్రస్తావించారు. కాగా, బాధిత మహిళ సోదరి సీఐని వెనకేసుకు రావడం గమనార్హం. సీఐ సందేశ్ నిరాపరాధి అని, కుటుంబ కలహాల నేపథ్యంలో సీఐపై మా అక్క ఆరోపణలు చేసినట్లు చెప్పింది.సీఐ సస్పెండ్ సీఐ సందేశ్ని మంగళూరు నగర పోలీస్ కమిషనర్ సుదీర్కుమార్ రెడ్డి సస్పెండ్ చేశారు. పలు ఆడియోలు, వీడియోలు విడుదల కావడంతో చర్య తీసుకున్నారు. అతనిపై కేసును దర్యాప్తు చేసి నివేదిక అందజేయాలని ఏసీపీ శ్రీకాంత్ను ఆదేశించారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాలతో మూడబిద్రిలో సందేశ్పై సుమోటోగా కేసు నమోదైంది. బాధితురాలి కుమారునిపై కూడా దాడి చేశాడని ఫిర్యాదు నమోదైంది. నిన్ను రేప్ చేస్తా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అని బెదిరించాడని బాధిత మహిళ తాజాగా ఆరోపించింది. రూ.25 లక్షలైనా ఇవ్వు, ఈ రాత్రికి ఇంటికైనా రా -
రీల్స్ పిచ్చి.. ఇంటి యజమానిని పార్శిల్ చేసిన కుటుంబం?!
బెంగళూరులోని వ్యాలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం చేసిన విచిత్ర ప్రయత్నం స్థానికులను, పోలీసులను షాక్కు గురి చేసింది. ఒక మహిళ, ఆమె భర్త, అత్త, మరిది కలిసి పెద్ద ప్యాకేజీని కొరియర్ సర్వీస్ ఆఫీసుకు తీసుకెళ్లారు.పార్శిల్ తరలించే ముందు దాని బరువు ఎంత ఉంది? అందులో ఏమున్నాయి? అని అడగడం సర్వసాధారణం. ఈ ఘటనలో కూడా పార్శిల్ సర్వీస్ కార్యాలయం ప్రతినిధులు ఇదే విధంగా ఆరా తీశారు. సిబ్బంది పార్శిల్ లోపల ఏముందో చెప్పాలని అడగ్గా కుటుంబ సభ్యులు సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు. ‘మేము కష్టపడి ఇంత దూరం వచ్చాం. ఈ పార్శిల్ను తాము చెప్పిన అడ్రస్కు పంపాలి’ అని పట్టుబడుతూ వాగ్వాదానికి దిగారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన సిబ్బంది ప్యాకేజీని తెరిచి చూడగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఇంటి యజమాని బయటకు వచ్చాడు.కంగుతిన్న సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.విచారణలో కుటుంబం చెప్పిన వివరణ మరింత ఆశ్చర్యకరంగా మారింది. ఉగాది, రంజాన్ మాసంలో బస్సు, ట్రైన్ టికెట్లు దొరకకపోతే గమ్యస్థానానికి ఎలా వెళ్లాలో చూపించేందుకు ఇంటి యజమానిని తెల్లబస్తాలో పెట్టి పార్శిల్ కేంద్రానికి తీసుకువచ్చామని, ఇదంతా సోషల్ మీడియా రీల్స్ కోసం చేశామని తెలిపారు. తరువాత పోలీసులు కుటుంబ సభ్యులను స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరికి వారు క్షమాపణలు చెబుతూ, తాము చేసిన పని బాధ్యతారహితమని అంగీకరిస్తూ వీడియోను రికార్డు చేశారు.పోలీసులు కుటుంబానికి కఠిన హెచ్చరిక జారీ చేసి, ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు మళ్లీ చేయవద్దని సూచించారు. చివరికి వారిని విడిచిపెట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. వినోదం కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి. Daughter & family stuff father in gunny bag, take him to courier office to "send parcel" out of Bengaluru all for a reel showing it's easier to courier a man than book bus/train tickets this festive season. Now in police station. Weird world. 😭pic.twitter.com/gGEpKeeYjM— Ghar Ke Kalesh (@gharkekalesh) March 17, 2026 -
మరో మహిళతో భర్త సంబంధాన్ని పెళ్లి అనలేం: హైకోర్టు
శివాజీనగర(బెంగళూరు): ఓ మహిళ (66) తన భర్త (77) అక్రమంగా రెండవ పెళ్లి చేసుకున్నాడని దాఖలు చేసిన కేసును హెకోర్టు కొట్టివేసింది. భర్త పర స్త్రీతో సంబంధం కలిగి ఉండడం వివాహానికి సమానం కాదు, కాబట్టి కేసు చెల్లదని స్పష్టంచేసింది. న్యాయమూర్తి నటరాజ్ కేసును విచారించారు. వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే కేసు వర్తిస్తుందన్నారు. తన భర్త మరో మహిళ (51)ను వివాహం చేసుకొన్నారు, ఆయన కుమారులు మద్దతుగా నిలిచారు అని మహిళ ఆరోపించారు. ఆ తరువాత మహిళ భర్త, కుమారులు, ఆ మహిళ కేసును రద్దు చేయాలని పిటిషన్ వేశారు. చివరకు కేసు వీగిపోయింది. -
రూ.25 లక్షలైనా ఇవ్వు, ఇంటికై నా రా
యశవంతపుర: నీ భర్తను వదిలిపెట్టాలంటే నువ్వు నా ఇంటికి రావాలి, లేదా రూ.25 లక్షలను ఇచ్చుకో అని ఓ సీఐ మహిళను వేధించిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె ఠాణాలో జరిగింది. నేను హోంమంత్రికి రూ.50 లక్షలిచ్చి ఇక్కడికి పోస్టింగ్ తీసుకున్నట్లు సీఐ సందేశ్ చెప్పాడని ఆ మహిళ పేర్కొన్నారు. నాపై ఫిర్యాదు చేసిన నీ భర్తను అరెస్ట్ చేశా, విడిపించుకోవాలంటే రూ.25 లక్షలు డబ్బులివ్వాలంటూ సీఐ సందేశ్ తనను ఒత్తిడి చేశారని సదరు మహిళ మంగళూరు పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. గత ఆగస్ట్లో తన భర్తను అరెస్ట్ చేశారని, విడుదల చేయాలని సీఐ వద్దకు వెళ్లగా అతడు చెప్పిన మాటలు విని షాక్కు గురైనట్లు మహిళ వాపోయింది. ఈ రాత్రికి పడక గదికి రావాలని అసభ్యకరంగా డిమాండ్ చేశాడని మహిళ ఆరోపించింది. నేను హోంమంత్రికి రూ.50 లక్షలిచ్చి ఇక్కడి వచ్చా, నేను అడిగినంత డబ్బులిస్తేనే విడుదల చేస్తా, లేదంటే నీ భర్తపై రౌడీషీట్ను తెరుస్తానంటూ బెదిరించాడని మహిళ ఆరోపించారు. కాగా, ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. మహిళకు సీఐ వేధింపులు -
ఉద్యోగాల భర్తీకి నేడు ఆందోళన
హుబ్లీ: రాష్ట్ర విద్యార్థులు, నిరుద్యోగులు, యువత వివిధ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర ఉత్తర ప్రాంత కార్యదర్శి దర్శన్ హెగ్డే తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 43 శాఖల్లో సుమారు 2,84,881 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిలో విద్యాశాఖలో సుమారు 93 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని తదితర సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నామని, సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. దంపతుల గొడవ.. ఆపబోయి వ్యక్తి మృతి● నిందితుని అరెస్టు సాక్షి బళ్లారి: ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిందన్న సామెత చందంగా దంపతుల మధ్య గొడవను ఆపపోయిన వ్యక్తి మరణించిన ఘటన చిత్రదుర్గలోని బుద్ధసర్కిల్ ప్రాంతంలో జరిగింది. సాదిక్ఉల్లా అనే వ్యక్తి తన భార్యతో రోడ్డుపై గొడవకు దిగాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న తాజ్పీర్(42) అనే వ్యక్తి భార్యాభర్తల మధ్య గొడవను ఆపబోయాడు. అయితే ఆగ్రహానికి లోనైన సాదిక్ఉల్లా మచ్చుకత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తాజ్పీర్ను వెంటనే చిత్రదుర్గ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో మృతుని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్యాభర్తల గొడవ చక్కదిద్దేందుకు ప్రయత్నించిన వ్యక్తి ప్రాణాలను కోల్పోవడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు జప్తు హుబ్లీ: అక్రమంగా నిల్వ చేసిన వాణిజ్య వినియోగ గ్యాస్ సిలిండర్లను ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన సిద్దేశ్వర పార్కు శివసాగర్ హోటల్లో జరిగింది. సదరు అధికారులు పోలీసుల సహకారంతో ఆదివారం రాత్రి దాడి చేసి గ్యాస్తో నిండిన 25 ఫుల్ సిలిండర్లను కనుగొని స్వాధీనం చేసుకున్నారు. సదరు హోటల్ యజమాని సతీష్ బండిపై విద్యానగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గోగ్యాస్ కంపెనీ ద్వారా సరఫరా అయ్యే ఆ సిలిండర్లను హోటల్లో అక్రమంగా నిల్వ చేశారు. ఇవి ఎక్కడ నుంచి సరఫరా అయ్యాయో ఆరా తీస్తున్నామని ఆహార పౌర సరఫరాల శాఖ అధికారి విజయ్కుమార్ తెలిపారు. వినియోగదారుల రక్షణకు పిలుపు రాయచూరు రూరల్: జిల్లాలో వినియోగదారుల రక్షణకు నడుం బిగించాలని జిల్లా కోర్టు అదనపు ప్రధాన న్యాయమూర్తి స్వాతిక్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. అధికారులు ప్రస్తుతం వినియోగదారులకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సిలిండర్ల కొరత లేకుండా చూడాలన్నారు. కక్షిదారులు ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చన్నారు. రూ.1603 కోట్ల బడ్జెట్హుబ్లీ: జంట నగరాల పాలికె 2026–27వ సంవత్సరానికి గాను బడ్జెట్ను పన్నుల నిర్వహణ, అప్పీల్ స్థాయి సమితి చైర్ పర్సన్ మీనాక్షి వంటమూరి సోమవారం ప్రతిపాదించారు. ఈ మేరకు పాలికె సమావేశంలో ఆమె బడ్జెట్ వివరాలు వెల్లడించారు. మొత్తం రూ.1603.26 కోట్ల మేర ఈ బడ్జెట్లో జంట నగరాల సర్వతోముఖాభివృద్ధి, ప్రజాసంక్షేమ పథకాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. పాలికె వార్డుల అభివృద్ధి కోసం సభ్యుల నిధి ద్వారా రూ.120 కోట్లు, నగర నడిబొడ్డులోని చెన్నమ్మ సర్కిల్, ప్రతిమ ఆధునీకరణకు రూ.5 కోట్లను కేటాయించామన్నారు. పాలికె సభా భవనంలో జరిగిన ఈ బడ్జెట్ సమావేశంలో మేయర్ జ్యోతి పాటిల్, డిప్యూటీ మేయర్ సంతోష్ చవాన్, సభా నాయకుడు వీరేష్ అంచటగేరి, విపక్ష నేత ఇమ్రాన్ ఎలెగార, కమిషనర్ రుద్రేశ్ గాలి, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నదిలో స్నానానికెళ్లి యువకుడు గల్లంతు రాయచూరు రూరల్ : నదిలో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతైన ఘటన విజయపుర జిల్లాలోని ఇండి తాలూకా పడనూరులో జరిగింది. ఉదయం స్నానం కోసం నది వద్దకు వెళ్లిన అనిల్ పూజారి(23) నీటిలోకి దిగాడు. అయితే అక్కడ లోతుగా ఉండటంతో నీటిలో మునిగి ఈత రాక మరణించాడు. మృతుని ఆచూకీ కోసం నదిలో గాలించామని, ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇండి పోలీసులు తెలిపారు. -
రైతులకు నిరంతర విద్యుత్ ఇవ్వాలి
సాక్షి బళ్లారి: రైతుల పంపుసెట్లకు ప్రతి రోజు నిరంతరాయంగా 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. సోమవారం జిల్లాలోని కురుగోడు పట్టణంలో ఏఐకేకేఎంఎస్, రైతు సంఘం ఆధ్వర్యంలో కర్ణాటక విద్యుత్ ప్రసార మండలి కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఏఐకేకేఎంఎస్ జిల్లా కార్యదర్శి గురళ్లి రాజు మాట్లాడుతూ రైతులకు విద్యుత్ కోతను విధించకూడదన్నారు. వేసవి ఎండలతో పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో విద్యుత్ కోతను విధించడం వల్ల రైతులు పంటలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రాత్రి పూట కాకుండా పగటి పూటే నిరంతరాయంగా 7 గంటలు విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఈఏడాది తుంగభద్ర జలాశయం గేట్ల మరమ్మతు పనులు చేస్తున్నందున రెండో పంటకు నీటి సరఫరా నిలిపేశారన్నారు. రైతుల జీవితాలు దుర్భరం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులు తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా ఉందన్నారు. పంపుసెట్ల ద్వారా లభించే నీటితో రెండో పంటకు నీరు సక్రమంగా అందించేందుకు 7 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ముష్టిగట్టి, గెణికెహాళు తదితర గ్రామాల రైతులు పంపుసెట్ల ద్వారా పంటలకు నీటిని అందించడానికి విద్యుత్ కోత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. విద్యుత్ సరఫరా తరచూ నిలిచిపోవడం, తక్కువ ఓల్టేజ్ ఉండటం వల్ల రైతులు రాత్రంతా బోరుబావుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిరంతరాయంగా 7 గంటలు విద్యుత్ సరఫరా చేయడంతో పాటు మరో 2 గంటలు అదనంగా సరఫరా చేస్తే రైతులకు మేలు చేకూరుతుందన్నారు. రైతు సంఘం నాయకులు బసవనగౌడ, గాదిలింగ, దేవణ్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కదం తొక్కిన రైతు సంఘం నేతలు కేపీటీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా -
పునీత్ ప్రతిమకు అభిషేకం
బళ్లారిఅర్బన్: నగరంలోని జిల్లా స్టేడియం సమీపంలో ఉన్న దివంగత కన్నడ సినీ నటుడు, కర్ణాటక రత్న డాక్టర్ పునీత్ రాజ్కుమార్ ప్రతిమను సోమవారం మహానగర పాలికె సిబ్బంది నీటితో అభిషేకించి శుభ్రపరిచారు. నిర్మితి కేంద్ర సమీపంలో రూ.కోట్లాది వ్యయంతో భారీ చెరువు నిర్మించి అదే ప్రాంగణంలో సుమారు 20 అడుగుల ఎత్తైన డాక్టర్ పునీత్ రాజ్కుమార్ ప్రతిమను ఏర్పాటు చేశారు. అయితే క్రమంగా నిర్వహణ కరువవడంతో ప్రతిమపై దుమ్ము, ధూళి పేరుకోవడంపై స్థానికుల ఫిర్యాదు మేరకు మేయర్ గాదెప్ప అక్కడికి చేరుకొని పరిశీలించారు. వెంటనే ప్రతిమను నీటితో అభిషేకించి శుభ్రం చేయించారు. అదే విధంగా చుట్టుపక్కల పరిసరాలను కూడా శుభ్రం చేయాలని ఆదేశించారు. -
చింత.. రైతుకు నిశ్చింత
హొసపేటె: చింత పండు సాగులో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రస్తుతం చింతపండు రైతులకు బంపర్ లాభాలను తెచ్చిపెడుతోంది. భారతీయ వంటల్లో చింతపండుకు ప్రత్యేక స్థానం ఉంది. ఉప్పు తర్వాత ప్రత్యేక స్థానం ఉన్న పదార్థం చింతపండు అని చెప్పవచ్చు. ఇప్పుడు గత రెండేళ్లుగా చింతపండు ధర బాగా పెరిగింది. గత సంవత్సరం కిలో చింతపండు ధర రూ.100–రూ.120 మధ్య ఉండేది. అదే ధర ఇప్పుడు ఏపీఎంసీ మార్కెట్లో కిలోకు రూ.200 నుంచి రూ.220కి పెరిగింది. దేశంలో చింతపండు చెట్ల సంఖ్య తగ్గడం, ఉత్పత్తి క్షీణించడం, కూలీల కొరత, అధిక డిమాండ్ వంటి అనేక కారణాల వల్ల చింతపండు ధర ఆకాశాన్నంటింది. చింతపండు పంటను ప్రధానంగా కర్ణాటకలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో పండిస్తారు. చింతపండు ధర పెరుగుదల, సాగులో రెండు ప్రధాన సవాళ్లు పెంపకందారులను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ప్రధానంగా పండించే జిల్లాలు ఇవే.. చింతపండును ప్రధానంగా కోలారు, తుమకూరు, బళ్లారి, విజయపుర, బెళగావి, రాయచూరు, విజయనగర, ధార్వాడ జిల్లాల్లో పండిస్తారు. చింతపండు సాగు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. చింతపండు చెట్లు ఎక్కి కోసే వారి సంఖ్య తగ్గింది. అలాగే చింతపండు ప్రాసెసింగ్ కోసం కొత్త సాంకేతికత, యంత్రాలను అభివృద్ధి చేయలేదు. చింతపండు సేకరణ పరంగా చాలా సవాళ్లు ఉన్నాయి. ఈ కారణాలన్నింటి వల్ల చింతపండు పెంపకం ఇబ్బందుల్లో ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ చింతపండుకు డిమాండ్ ఏటేటా పెరుగుతోంది. చింతపండు ధర కూడా పెరిగింది. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం చింతపండుకు అసాధారణ డిమాండ్ ఉంది. తక్కువ సరఫరా కూడా ధర పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. కర్ణాటకలో చింతపండు ప్రధాన పంటకోత కాలం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. ఎండాకాలం పండ్లను కోయడానికి, ప్రాసెస్ చేయడానికి, ఎండబెట్టడానికి ఉత్తమ సమయం. సరఫరా పెరిగితే ఏప్రిల్ వరకు పంట కొనసాగే అవకాశం ఉన్నందున ధరలు తగ్గవచ్చని అంచనా. కోల్డ్ స్టోరేజీలు అవసరం చింతపండు సేకరణలో ప్రధాన సమస్య కోల్డ్ స్టోరేజీలు, వర్షం పడినప్పుడు ఈ పంట రంగుపోతుంది. చింతపండు పండించే రైతులకు సురక్షితమైన నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీలు అవసరమని రైతులు డిమాండ్ చేశారు. తుమకూరు హోల్సేల్ మార్కెట్లో మంచి నాణ్యత గల చింతపండు క్వింటాలుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల ధర వరకు అమ్ముడవుతోంది. కానీ నాణ్యత లేని ఉత్పత్తులతో ధర తగ్గుముఖం పట్టింది. మార్కెట్లో చింతపండు ధరకు రెక్కలు ధరల పెరుగుదలతో రైతులకు లాభాలుచింతపండు సాగుకు ప్రాధాన్యత మెండు కరువు కాలంలో కూడా పేదలకు ఉగాది పండుగను అందించే పంట చింతపండు అని గ్రామీణ ప్రాంతాల్లో ఒక నానుడి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చింతపండు సాగుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చింతపండు సాగు వేలాది మంది రైతుల జీవితాలను తీర్చిదిద్దింది. మారుతున్న కాలంలో, చింతపండు పండించే రైతులకు సహాయ సహకారాలు, మార్గదర్శనం అవసరం. వర్షధార పంటల్లో చింతపండు ఒక ముఖ్యమైన వాణిజ్య పంటగా కూడా ఉద్భవించింది. వ్యవసాయ కూలీలు, యంత్రాల కొరత చింతపండు పంట సాగులో ప్రధాన సమస్యగా ఉంది. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. -
కాన్పు తర్వాత కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వాలి
సాక్షి బళ్లారి: మాతృత్వ సెలవుల తర్వాత మహిళా ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ విధుల్లో చేరడానికి, వారి పిల్లల సంరక్షణకు అనుకూలంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విధాన పరిషత్ సభ్యుడు వైఎం. సతీష్ పేర్కొన్నారు. సోమవారం విధాన పరిషత్ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గర్భధారణ సమయంలో ముందుగా 6 నెలలు పుట్టిన శిశువును చూసుకోవాల్సిన బాధ్యత తల్లిపై ఉంటుందన్నారు. మానవతా దృక్పథంతో ఆరు నెలలకే పరిమితం చేయకుండా, ఆమె కోరుకున్న స్థలంలో ఐదేళ్ల పాటు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఎమ్మెల్సీ ప్రశ్నపై స్పందించిన మంత్రి ఎస్.మధు బంగారప్ప మాట్లాడుతూ శిశు సంరక్షణ సెలవులు మంజూరుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. జీవో ప్రకారం చర్యలు ప్రభుత్వ జీవో ప్రకారం శిశు సంరక్షణ సెలవుల కోసం వచ్చిన దరఖాస్తులు 15 రోజుల్లోపు ఆమోదించేందుకు సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. ఆమె సెలవు రోజుల్లో ఆ స్థానంలో పని చేసేందుకు అతిథి ఉపాధ్యాయులను కూడా నియమించుకునేందుకు వెసులుబాటు కల్పించామన్నారు. విధాన పరిషత్లో ఎమ్మెల్సీ సతీష్ విజ్ఞప్తి -
మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత
రాయచూరు రూరల్ : నగరంలో 20 చోట్ల కొత్తగా రూ.2.50 కోట్లతో మరుగుదొడ్లను నిర్మిస్తున్నట్లు సిటీ కార్పొరేషన్ కమిషనర్ జుబిన్ మహాపాత్రో వెల్లడించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో 2026–27వ బడ్జెట్ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మహాత్మాగాంధీ మిషన్ కింద రూ.200 కోట్లతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిందన్నారు. కార్పొరేటర్లు మహావీర్, వెంకటేష్, భాస్కర్, కార్పొరేషన్ అధికారులు శరణప్ప, సంతోష్, భరత్, సంతోష్రాణి, కృష్ణ శావంతగేరలున్నారు. పాత్రికేయులకు నిధులు కేటాయించాలి నగర పరిధిలో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులకు సిటీ కార్పొరేషన్ నుంచి 2026–27వ బడ్జెట్లో నిధులు కేటాయించాలని రాయచూరు రిపోర్టర్స్ గిల్డ్ అధ్యక్షుడు విజయ్ జాగటగల్ డిమాండ్ చేశారు. సోమవారం సిటీ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ జుబిన్ మహాపాత్రోకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. రేపు వాక్థాన్బళ్లారిఅర్బన్: మానవ అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 18న వాక్థాన్ నిర్వహిస్తున్నట్లు తారనాథ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశేఖర్ గాణిగేర్ తెలిపారు. సోమవారం పత్రికా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోజు ఉదయం 7.30 గంటలకు బళ్లారి మెడికల్ కళాశాల మైదానంలో కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ వాక్థాన్ను జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వైద్య కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొంటారన్నారు. గ్రంథాలయం ప్రారంభించరూ రాయచూరు రూరల్: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో తిరిగి గ్రంథాలయం ప్రారంభించాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు నాగరాజ్ మాట్లాడారు. అనంతరంఏడీసీ శివానందకు వినతిపత్రం సమర్పించారు. -
కార్యవర్గం నియామకం
బళ్లారిఅర్బన్: కౌల్బజార్ ఫిర్కాలో బీజేపీ బలోపేతానికి మండల కమిటీతో పాటు 7 మోర్చాలకు కొత్త కార్యవర్గాలను నియమించారు. మండల అధ్యక్షుడు ఏ.నాగరాజరెడ్డి సంతకంతో సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. మహిళా మోర్ఛా అధ్యక్షురాలిగా లత, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా సుంకన్న, ఎస్టీ మోర్ఛా అధ్యక్షుడిగా రాజశేఖర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఆర్.శేఖన్న, రైతు మోర్చా అధ్యక్షుడిగా వెంకటేష్, యువమోర్ఛా అధ్యక్షుడిగా బట్టి గాదిలింగ, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా మహమ్మద్ గౌస్ నియమితులయ్యారు. ఇదే సమయంలో మండల కమిటీకి కూడా కార్యవర్గాన్ని నియమించారు. మండల అధ్యక్షుడిగా ఏ.నాగరాజరెడ్డి కొనసాగుతుండగా, కొండి మల్లికార్జున, వెంకటేష్ గురురాజ్, రామచంద్ర, హనుమంతరావు, మహమ్మద్ ఖదీర్లను ఉపాధ్యక్షులుగా నియమించారు. ఎంపీ రాజేష్, జీ.అవినాష్ నాయుడు ప్రధాన కార్యదర్శులుగా, ఈ.మూర్తి, వి.శ్రీధర్, యేసు, నీలకంఠ ఆచార్య, మల్లేష్, అన్నక్లర్ కార్యదర్శులుగా నియమితులయ్యారు. అలాగే జీ.అభిలాష్ నాయుడు కోశాధికారిగా, వీజే జోసెఫ్ కార్యాలయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఉద్యోగాలను భర్తీ చేయండి రాయచూరు రూరల్: జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని కన్నడ సేనె డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు బసవరాజ్ మాట్లాడారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో నిరక్ష్యం వహించకుండా వెంటనే భర్తీలకు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. జిల్లాలో 1,454 ప్రాథమిక, 239 హైస్కూళ్లున్నాయని, వాటిని త్వరితగతిన భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కన్నడ నామఫలకాలు, నేమ్ బోర్డులు అలవరించేలా చూడాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో గోవిందప్ప, నాగప్ప, అమరేష్, మంజునాథ్, శివరాజ్, వీరనగౌడ, రామప్ప, పరశురామ్లున్నారు. నాయకత్వ లక్షణాలు పెంచాలి చెళ్లకెరె రూరల్: వ్యాయామ ఉపాధ్యాయులు కేవలం క్రీడలకు మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని తాలూకా విద్యా శాఖ అధికారి కేఎస్.సురేష్ తెలిపారు. ఆయన మొరార్జీ దేశాయి వసతి పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన ప్రగతి పరిశీలన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులదేనన్నారు. -
సామాజిక బహిష్కారానికి మహిళ బలి
రాయచూరు రూరల్ : సామాజిక బహిష్కారం మనస్తాపానికి గురైన ఓ మహిళ నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదగిరి జిల్లా వడగేర తాలూకా జోళదడిగిలో చోటు చేసుకుంది. ఓ మహిళతో తన కుమారుడు ఎర్రిస్వామి అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ సమాజం నుంచి బహిష్కార నిర్ణయం ప్రకటించడంతో మనస్తాపం చెందిన యాదగిరి నివాసి కమలమ్మ(42) తన కుమార్తె ఉన్న జోళదడిగికి వెళ్లింది. అక్కడ భీమా నది బ్రిడ్జి కం బ్యారేజీ వద్ద మంగళ సూత్రాన్ని పెట్టి పైనుంచి దూకడంతో మరణించింది. ఘటనపై వడగేర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉసురు తీసిన అక్రమ సంబంధం
● యువకుడు దారుణ హత్య రాయచూరు రూరల్ : మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్న ఓ యువకుడు హత్యకు గురైన ఘటన రాయచూరు తాలూకాలోని బుళ్లాపురలో జరిగింది. గ్రామానికి చెందిన ప్రాణేష్(23) అనే యువకుడిని దిన్ని గ్రామానికి చెందిన ప్రసాద్, మల్లికార్జున, మల్లేష్ హత్య చేశారని ఇడపనూరు పోలీసులు తెలిపారు. గత మూడు నెలలుగా ప్రసాద్ భార్యతో ప్రాణేష్ అక్రమ సంబంధం నెరుపుతున్నాడు. ఈ విషయం గ్రహించిన ప్రసాద్ తన సహచరులతో కలిసి ప్రాణేష్ హత్యకు ప్రణాళిక రచించాడు. ఆదివారం ప్రాణేష్ బుళ్లాపురలో ఉన్నట్లు తెలుసుకున్న నిందితులు అక్కడికి వెళ్లి ప్రాణేష్ను గొడ్డళ్లతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కల్తీ కల్లు విక్రేత అరెస్ట్ రాయచూరు రూరల్ : నగరంలో కల్తీ కల్లు, సీహెచ్ పౌడర్ విక్రయించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పడమటి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మంజునాథ్ వెల్లడించారు. సోమవారం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉద్యానవనంలో వంశీ, మహ్మద్ హాజీలను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి 63 లీటర్ల కల్తీ కల్లు, సీహెచ్ పౌడర్ను స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పక్షులకు నీటి తొట్టెల ఏర్పాటు హొసపేటె: ఎండ తీవ్రత నుంచి పక్షులు, ప్రాణుల దాహార్తి తీర్చేందుకు నగరంలోని జంబునాథ్ నగర నివాసులు నడుం బిగించారు. వేసవిలో ఎండల తీవ్రతకు దాహంతో అలమటించే పక్షులు, ప్రాణుల కోసం నీటిని, ఆహారాన్ని అందించడం మానవత్వానికి, పర్యావరణ పరిరక్షణకు నిదర్శనంగా చెప్పవచ్చు. సోమవారం జంబునాథ్ నగర నివాసులు తమ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో, ఇళ్ల మేడ మీద, చెట్ల పొదల్లో ప్లాస్టిక్, మట్టి పాత్రలలో నీరు నింపి పెట్టి, వాటిని ప్రతి రోజూ శుభ్రం చేసి మారుస్తూ పక్షులకు, జంతువులకు దాహార్తిని తీర్చుతున్నారు. పక్షి ప్రేమికులు తమ చిన్నపాటి సహాయంతో వందలాది పక్షుల దాహాన్ని, ఆకలిని కూడా తీరుస్తూ మానవత్వాన్ని చాటారు. పంచాంగం పంపిణీ చెళ్లకెరె రూరల్: మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల సూచన ప్రకారం ఉగాది సందర్భంగా నగరంలోని పేద బ్రాహ్మణులకు పరాభవ నామ సంవత్సర సూర్య సిద్ధాంత పంచాంగాన్ని ఉచితంగా అందజేశారు. దివాన్ డాక్టర్ మాధవాచార్, బాలాజీ రావు, రమాదేవి, సుజాత, రక్షిత్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపార మేళాతో వ్యవహార జ్ఞానం వృద్ధి హొసపేటె: తాలూకాలోని కడ్డిరాంపుర గ్రామంలోని పీఎంశ్రీ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో యాంకర్– మెట్రిక్యులేషన్, బిజినెస్ ఫెయిర్ అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. పాఠశాల ఎస్డీఎంసీ సభ్యులు ప్రశాంత్ మాట్లాడుతూ పిల్లలకు వ్యాపారం, వాణిజ్య వ్యవహారాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పిల్లలకు వ్యాపార జ్ఞానం పెరుగుతుందన్నారు. పిల్లలు వివిధ రకాల వాణిజ్యం, వ్యాపారాల గురించి జ్ఞానాన్ని పొందారు. జీపీ సభ్యుడు షణ్ముఖప్ప, శివనాయక్, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ వదంతులను నమ్మొద్దు
హొసపేటె: పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో ప్రస్తుతం గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వదంతులు, తప్పుడు వార్తల వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. వీటిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎల్పీజీ ఉత్పత్తి, బాట్లింగ్ ప్రక్రియ సక్రమంగా సాగుతోంది. అలాగే తగినంత నిల్వ కూడా అందుబాటులో ఉంది. అయితే చాలా మంది వినియోగదారులు ఒకేసారి గ్యాస్ బుక్ చేసుకోవడం వల్ల సర్వర్పై ఒత్తిడి పెరిగి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి సిలిండర్ బుకింగ్కు గడువు ప్రతి సిలిండర్ అందిన తర్వాత పట్టణ, నగర ప్రాంత వినియోగదారులు తదుపరి సిలిండర్ను బుక్ చేసుకోడానికి 25 రోజుల గడువు, గ్రామీణ ప్రాంతాల వారికి ఈ గడువు 45 రోజుల వరకు ఉంటుందని తెలిపారు. ఐవీఆర్ఎస్ మిస్డ్ కాల్ పద్ధతే కాకుండా వాట్సాప్ మొబైల్ యాప్, పేమెంట్ అప్లికేషన్ల(ఫోన్ పే/పేటీఎం) ద్వారా కూడా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ఏదైనా ఫిర్యాదు లేదా సాంకేతిక సమస్య ఉంటే ప్రజలు ఆహార తనిఖీ అధికారులను సంప్రదించాలని కోరారు. గృహావసరాల కోసం ఉద్దేశించిన సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం లేదా వాటిని అక్రమంగా నిల్వ చేయడం శిక్షార్హమైన నేరం. ఇలాంటి కేసులు ఏవైనా తమ దృష్టికి వస్తే సమాచారం అందించాలని సూచించారు. తగినంత సిలిండర్ల నిల్వ ఉంది జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి -
దుబాయ్ ఫ్లైట్ వెనక్కి
యశవంతపుర: బెంగళూరు కెంపేగౌడ విమానశ్రయం నుంచి దుబాయ్కి బయలుదేరిన ఎమిరేట్స్ విమానం అక్కడ ల్యాండింగ్కు అనుమతించని కారణంగా మళ్లీ బెంగళూరుకు వచ్చేసింది. సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు బెంగళూరు నుంచి దుబాయ్కి బయల్దేరింది. కానీ అక్కడ యుద్ధ పరిణామాల వల్ల విమానం దిగడానికి దుబాయ్ అధికారులు అనుమతించలేదు, దీంతో విమానం మళ్లీ బెంగళూరుకు వాపస్ వచ్చింది. వందలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కట్టెలతో బడి భోజనం యశవంతపుర: గ్యాస్ సమస్య కుటుంబాలకే కాకుండా ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలకు కూడా కష్టాలు తెచ్చింది. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా కొట్టిగేహర సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో గ్యాస్ సిలిండర్లను లేనందున కట్టెలపై మధ్యాహ్న భోజనాన్ని వండారు. గ్యాస్ను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ అదేశించినా గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది పట్టించుకోలేదని వంట సిబ్బంది ఆరోపించారు. చిక్కమగళూరు జిల్లా వ్యాప్తంగా వంట గ్యాస్తో పాటు వాహనాలకు గ్యాస్ దొరకడం లేదు. వందలాది మంది డ్రైవర్లు ఆటోలతో బంకుల ముందు క్యూ కట్టారు. చిక్కమగళూరు– మూడిగెరె మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పాత బంగ్లాలో బాలుడు దుర్మరణం● ఫొటో షూట్లో ప్రమాదం బనశంకరి: ఫొటో షూట్ మోజు ప్రాణాల మీదకు వస్తోంది. ప్రమాదకర ప్రాంతాల్లో ఛాయాచిత్రాలు తీసుకుంటూ ప్రమాదంలోకి పడిపోతున్నారు. ఇదే మాదిరిగా బెంగళూరు అన్నపూర్ణేశ్వరినగర ఠాణా పరిధిలో పాత కట్టడం మీద నుంచి పడి నిశాంత్ (15) అనే బాలుడు చనిపోయాడు. వివరాలు.. శనివారం సాయంత్రం ఉళ్లాలవాసి నిశాంత్, అతని ఇద్దరు స్నేహితులు పాత బంగ్లా ఉందని తెలిసి ఫొటో షూట్కు వెళ్లారు. ఇటీవలే వీరు సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రాశారు. సరదాగా ఫొటోలు తీసుకుంటూ రెండో అంతస్తు వరకు వెళ్లారు. ఈ సమయంలో గోపురం వంటి కట్టడం మీదకు ఎక్కిన నిశాంత్ ఫొటోలు తీయాలని స్నేహితులకు చెప్పాడు. కొంతసేపటికి పట్టుతప్పి 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. స్నేహితులు అతనిని ఓ అంబులెన్సును పిలిపించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి మరణించాడని తెలిపారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. విమానాశ్రయంలో గంజాయి సీజ్ యశవంతపుర: బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.39.37 లక్షల విలువగల 1.12 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. థాయ్లాండ్ నుంచి వచ్చిన ప్రయాణికుల లగేజీని తనిఖీలు చేయగా, ఫోటో ప్రేమ్లో గంజాయిని పెట్టుకొని వచ్చినట్లు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్లు శివాజీనగర: అందరూ ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త టోర్నీ ఆరంభానికి క్షణగణన ఆరంభమైంది. బెంగళూరు ఎం.చిన్నస్వామి మైదానంలో మ్యాచ్లకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంస్థ (కేఎస్సీఏ), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 28వ తేదీన ఆర్సీబీ– హైదరాబాద్ సన్రైజర్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ చిన్నస్వామి మైదానంలో జరగనుందని తెలిసింది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక్కడే మరికొన్ని మ్యాచ్లు కూడా జరిగే అవకాశముంది. గ్యాస్ ట్యాంకర్ పల్టీ యశవంతపుర: హైవేలో ఎల్పిజీ గ్యాస్ ట్యాంకర్ రోడ్డుపై పల్టీ పడింది. అతి వేగంగా వస్తూ అదుపుతప్పి పల్టీ పడడంతో గ్యాస్ లీక్ మొదలై స్థానికుల్లో అందోళన నెలకొంది. పైర్ సిబ్బంది పరిశీలించి అపాయం లేదని తేల్చారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో వేడెక్కకుండా ట్యాంకర్పై నీళ్లు చల్లారు. ఉడుపి సమీపంలోని కటపాడి వద్ద మంగళూరు–ఉడుపి మార్గంలో ఈ ఘటన జరిగింది. సోమవారం ఉదయం మంగళూరులో గ్యాస్ను నింపుకొని ఉడుపి వైపు వెళుతుండగా పల్టీ పడింది. రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
దుర్గమ్మ, ఉడాలమ్మ రథోత్సవం
బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని హోలెనరసిపుర తాలూకా హాళేకోటె హోబలి హరిహరపురలో వెలిసిన శ్రీ దుర్గా పరమేశ్వరి, ఉడాలమ్మ జాతర సోమవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఉదయం నుంచే అమ్మవార్లకు విశేష పూజలు, నైవేద్యాలు సమర్పించారు. శ్రీదేవి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి తేరును లాగారు. చుట్టూ ఏడు గ్రామాల నుంచి భక్తులు రథం, పూల బండ్లను అలంకరించి జాతరకు తీసుకువచ్చారు. ఆలయం ముందు తవ్విన గుంతలో నుంచి నడిచారు. మైసూరు సిటీ బస్సుల్లో దొంగల గోల మైసూరు: రాచనగరి సిటీ బస్సుల్లో మహిళలు ప్రశాంతంగా ప్రయాణించలేకపోతున్నారు. దీనికి కారణం దొంగలే. రెండు వేర్వేరు సంఘటనల్లో, బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల వ్యానిటీ బ్యాగుల నుంచి దొంగలు బంగారు ఆభరణాలను దొంగిలించారు. కె.ఎన్.పుర నివాసి మానస, సిటీ బస్టాండ్కు వెళ్లడానికి మైసూరులో అక్షయ భండార్ బస్టాండ్ నుండి సిటీ బస్సు ఎక్కారు. ఆ సమయంలో బస్సులో రద్దీగా ఉంది. ఆమె వ్యానిటీ బ్యాగ్ నుంచి దాదాపు రూ.1.32 లక్షల విలువైన బంగారు నగలను దొంగలు కాజేశారు. మరో ఘటనలో హెబ్బాళ నివాసి మహాదేవమ్మ సిటీ బస్టాండు నుంచి తమ ప్రాంతానికి వెళ్లే బస్సు ఎక్కారు. ఆమె బ్యాగులో నుంచి రూ. 2 లక్షల విలువైన నగలను ఎవరో దొంగిలించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అడుగుకో టెంకాయ ఫట్ గౌరిబిదనూరు: సుమారు 48 సంవత్సరాల తరువాత మంచేనహళ్ళి తాలూకా మావినకాయిహళ్ళిలో ఆదివారం రాత్రి దాకా కొబ్బరికాయ శాంతి ఉత్సవం జరిగింది. సుమారు 12 గంటల పాటు నిరవధికంగా బాలరెడ్డిపల్లి నరసింహ స్వామి పూజారి మావినకాయిహళ్ళి నుంచి అరసాలబండ వరకు నడిచి వెళ్లారు. ప్రతి అడుగుకు మావినకాయిహళ్ళిలోని ప్రతి కుటుంబం టెంకాయలు కొట్టారు. ఇలా వేలాది టెంకాయలు బద్ధలయ్యాయి. గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, బాగా వర్షాలు పడి పంటలు పండాలని ఈ శాంతి ఉత్సవం జరుపుతారు. ఇంటింటికీ బంధువులు రావడంతో సందడి నెలకొంది. కన్నడ రచయితకు సాహిత్య అకాడమీ అవార్డుశివాజీనగర: కన్నడ ప్రముఖ సాహితీవేత్త అమరేశ నుగడోణికి 2025వ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించింది. ఆయన రచించిన ‘దడ సేరిసు తందె’ అనే కన్నడ కావ్యానికి ఈ గౌరవం లభించింది. అవార్డు కింద రూ.1 లక్ష నగదు, అవార్డు పత్రం, జ్ఞాపిక అందజేస్తారు. కన్నడ గ్రామీణ జీవితాలను తన కథల ద్వారా తెలియజేసే నుగడోణికి ఈ అవార్డు లభించడం పట్ల సాహితీవేత్తలు సంతోషం వ్యక్తంచేశారు.ఉద్యోగినులకు ఆటల పోటీలు చిక్కబళ్లాపురం: మహిళా దినోత్సవాల సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలోని సర్ ఎం.విశ్వేశ్వరయ్య క్రీడా మైదానంలో మహిళా ఉద్యోగుల ఆటల పోటీలను కలెక్టర్ జి.ప్రభు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు కుటుంబంలో అనేక ముఖ్య పాత్రలను పోషిస్తున్నారని, మానవ జాతికి గొప్ప సేవలందిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా మహిళలు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జడ్పీ సీఈఓ నవీన్భట్, మహిళా శిశు అభివృద్ధి శాఖ డీడీ ఆర్.వెంకటేశ్రెడ్డి, జయలక్ష్మి బాయి, నౌతాజ్ తదితరులు పాల్గొన్నారు. -
హోటళ్లకు గ్యాస్ గండం
శివాజీనగర: పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం వల్ల ఏర్పడిన వంట గ్యాస్ సిలిండర్ల కొరత బెంగళూరుతో పాటు పలు జిల్లాల్లో 7వ రోజుకు చేరింది. కమర్షియల్, గృహ అవసరాల సిలిండర్ల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో రాష్ట్రంలోని హోటల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే హోటళ్ల యజమానులు గ్యాస్ కరువై వారే ఆకలితో ఖాళీ కడుపుతో ఉంటున్నారు. గత ఐదు రోజుల్లో రూ.100 కోట్లకు పైగా నష్టం జరిగిందని హోటల్ యజమానుల సంఘం సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 40 వేలకు పైగా హోటల్లు పనిచేస్తున్నాయి. గ్యాస్ లభించక వ్యాపారం తగ్గి ఆదాయం పడిపోయంది. కాబట్టి హోటల్ పరిశ్రమకు ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరారు. 20 శాతం గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా హోటళ్లు పూర్తిగా దారిలో పడడానికి చాలా సమయం పడుతుందన్నారు. అనేక హోటళ్లు, క్యాంటీన్లలో కట్టెల పొయ్యిలు వెలిశాయి. శీతల పానీయంపై గ్యాస్ పన్ను గ్యాస్ కొరత వల్ల బెంగళూరులో అనేక హోటళ్లు మూతపడగా, ఉన్న హోటళ్లలో గ్యాస్ ఫీజును కస్టమర్లపై బాదుతున్నారని ఆరోపణలున్నాయి. శీతల పానీయంపై కూడా గ్యాస్ పన్ను వేయడం వివాదాస్పదమైంది. పుదీన– నిమ్మరసం పానీయంపై 5 శాతం గ్యాస్ క్రైసిస్ చార్జ్ అని డబ్బులు వసూలు చేశారు. ఆ కస్టమర్ ఈ బిల్లును ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఒక్కొక్కరికి రూ.179 ధరతో రెండు పుదీన నిమ్మ పానీయాలను ఇచ్చారు. ఇందులో గ్యాస్ చార్జీ కూడా ఉండడంతో ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఆ పానీయం తయారీకి గ్యాస్ మంటతో పని లేదని, చార్జీ ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఇప్పటికీ సరఫరా అంతంతే రూ.100 కోట్లు నష్టమంటున్న యజమానులు గృహ సిలిండర్లకూ రద్దీ -
స్పీకర్ గుస్సా.. వాకౌట్
శివాజీనగర: విధానసభలో ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పడం లేదని సాధారణంగా ప్రతిపక్షాలు ఆరోపించి వాకౌట్ చేస్తాయి. కానీ స్పీకర్ యూటీ ఖాదర్ సోమవారం ఇలా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ విసుగుతో సభను వాయిదా వేసి వెళ్లిపోయిన అరుదైన సంఘటన జరిగింది. రెండురోజుల విరామం తరువాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమయ్యాయి. మధ్యాహ్నం విధానసభలో చర్చ జరుగుతుండగా, స్పీకర్ ఖాదర్ స్పందిస్తూ ‘సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం రావడం లేదు. నేను ప్రభుత్వానికి ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా మంత్రులు జవాబు ఇవ్వడం లేదు. నా హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. ఇలాగైతే సభను ఎలా నిర్వహించాలి’ అని ఆవేదన చెందారు. సభ్యుల ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదనేది మంత్రులు వచ్చి చెప్పేవరకు నేను సభ జరపను అని సభను వాయిదా వేసి ఆయన నిష్క్రమించారు. ఈ పరిణామంతో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలవరపాటుకు లోనయ్యారు. స్పీకర్ హెచ్చరికతో అందరూ విస్మయానికి గురయ్యారు. ఇలా మొదలైంది.. ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత రాతపూర్వకంగా సమాధానం చెప్పే ప్రశ్నోత్తరాలను చేపట్టాలని స్పీకర్ ఖాదర్ ఆదేశించారు. హోం మంత్రి జీ.పరమేశ్వర్ మాట్లాడుతూ 283 ప్రశ్నల్లో 84 ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలిపారు. బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ లేచి నిలబడి, ప్రతి రోజూ ఇదే తంతు సాగుతోంది, మా ప్రశ్నలకు సమాధానమే ఇవ్వడం లేదు, మీరు నాలుగుసార్లు హెచ్చరించారు. ప్రభుత్వం ఉన్నా లేనట్లే ఉంది. ప్రభుత్వానికి తిథి ఖర్మలు చేయాలి అని మండిపడ్డారు. మంత్రులు దేవుళ్ల మాదిరిగా వచ్చి వెళ్తుంటారని విమర్శించారు. ఈ మాటల తరువాత సభాపతి మంత్రుల మీద సీరియస్ అయ్యారు. సభ జరుగుతున్నది మంత్రుల కోసం కాదు, ఎమ్మెల్యేల కోసం. వారు నియోజకవర్గాల సమస్యల మీద చర్చించేందుకు సమావేశాలు జరుపుతాం. వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే అసెంబ్లీకి ఎందుకు వస్తారు? అని ఆగ్రహంగా అన్నారు. సభకు మంత్రులు రావడమే లేదని వాపోయారు. ఎన్నిసార్లు మంత్రులకు హెచ్చరించాను, అయినా కూడా సరిదిద్దుకోరు అని అన్నారు. సీఎం సిద్దరామయ్య, మంత్రులు స్పీకర్తో మాట్లాడి నచ్చజెప్పారు. దీంతో సభ మళ్లీ ఆరంభమైంది. ప్రశ్నలకు మంత్రులు జవాబు చెప్పడం లేదని ఖాదర్ ఆగ్రహం విధానసభలో అరుదైన సన్నివేశం తుపాకీతో బెదిరించి దోపిడీ మండ్య: ఫాంహౌస్లో పనిచేస్తున్న భార్యాభర్తలను దొంగలు తుపాకీతో బెదిరించి బంగారు నగలు దోచుకున్నారు. ఈ సంఘటన మండ్య జిల్లాలోని మలవళ్లి తాలూకాలోని జుగనహళ్లి పరిధిలోని తోట ఇంటిలో జరిగింది. బెంగళూరుకు చెందిన మహిళ ఫాంహౌస్లో చంద్రు, కవిత దంపతులు పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఇద్దరు దుండగులు చొరబడి తుపాకులతో బెదిరించారు. దంపతుల వద్ద ఏమీ లేకపోవడంతో చివరికి 3 గ్రాముల బంగారు నగను లాక్కొని పారిపోయారు. పోలీసులు పరిశీలించి విచారించారు. -
రూ.25 లక్షలైనా ఇవ్వు, ఈ రాత్రికి ఇంటికైనా రా
యశవంతపుర(బెంగళూరు): నీ భర్తను వదిలిపెట్టాలంటే నువ్వు నా ఇంటికి రావాలి, లేదా రూ.25 లక్షలను ఇచ్చుకో అని ఓ సీఐ మహిళను వేధించిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె ఠాణాలో జరిగింది. నేను హోంమంత్రికి రూ.50 లక్షలిచ్చి ఇక్కడికి పోస్టింగ్ తీసుకున్నట్లు సీఐ సందేశ్ చెప్పాడని ఆ మహిళ పేర్కొన్నారు. నాపై ఫిర్యాదు చేసిన నీ భర్తను అరెస్ట్ చేశా, విడిపించుకోవాలంటే రూ.25 లక్షలు డబ్బులివ్వాలంటూ సీఐ సందేశ్ తనను ఒత్తిడి చేశారని సదరు మహిళ మంగళూరు పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. గత ఆగస్ట్లో తన భర్తను అరెస్ట్ చేశారని, విడుదల చేయాలని సీఐ వద్దకు వెళ్లగా అతడు చెప్పిన మాటలు విని షాక్కు గురైనట్లు మహిళ వాపోయింది. ఈ రాత్రికి పడక గదికి రావాలని అసభ్యకరంగా డిమాండ్ చేశాడని మహిళ ఆరోపించింది. నేను హోంమంత్రికి రూ.50 లక్షలిచ్చి ఇక్కడి వచ్చా, నేను అడిగినంత డబ్బులిస్తేనే విడుదల చేస్తా, లేదంటే నీ భర్తపై రౌడీషిట్ను తెరుస్తానంటూ బెదిరించాడని మహిళ ఆరోపించారు. కాగా, ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. -
యువ ఖాకీలను కాటేసిన యాక్సిడెంటు
సాక్షి, బళ్లారి: చిత్రదుర్గం జిల్లాలో యాక్సిడెంటు పోలీసు శాఖకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ముగ్గురు యువ ఎస్ఐలు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. బెంగళూరు సాయుధ పోలీసు (సీఏఆర్) విభాగంలో ఎస్ఐలు పనిచేసే మంజునాథ్ దారిమని (31), అమరేష్ (25), సచిన్ (30), ఎల్.ఈశ్వర్ (28), మహదేశ్వర బొమ్మన్నవర్ (26) స్నేహితులు. కొంతకాలం కిందటే ఉద్యోగాలలో చేరి బెంగళూరులో విధులు నిర్వర్తిస్తున్నారు. ముగ్గురు అక్కడికక్కడే తమ బ్యాచ్మేట్ పెళ్లి బళ్లారిలో జరుగుతోంది. దీంతో మారుతి సియాజ్ కారులో బెంగళూరు నుంచి 5 మంది బయల్దేరారు. వారిలో ఒకరు కారు నడుపుతున్నారు. ఉదయం 10:30 సమయంలో ఘటనాస్థలి వద్దకు వచ్చేటప్పటికి అతివేగంగా కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొని దానిలోకి చొచ్చుకుపోయింది. కారులోని వారిలో మంజునాథ్, అమరీష్, సచిన్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈశ్వర్, మహదేశ్వర తీవ్ర గాయాల పాలయ్యారు. కారు ముందు భాగం మొత్తం నుజ్జయింది. ఇతర వాహనదారులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారును బయటకు తీసి మృతదేహాలను చెళ్లకెరె ప్రభుత్వాస్పత్రికి, గాయపడినవారిని దావణగెరె ఆస్పత్రికి తరలించారు. మృతులందరూ అవివాహితులే అని పోలీసు అధికారులు పేర్కొన్నారు. లారీ డ్రైవరును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తల్లిదండ్రుల రోదనలు తమ కుమారులు మరణించారని తెలియగాని తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన చెళ్లకెరెకు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ రంజిత్కుమార్ బండారు, అడిషనల్ ఎస్పీ శివకుమార్, పోలీసులు వచ్చారు. చెళ్లకెరె ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గది వద్ద మృతులు తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అందరూ స్నేహితులు. కష్టపడి చదువుకుని, ఎస్ఐ పరీక్షల్లో పాసై ఉద్యోగం చేస్తున్నారు. సహచర ఎస్ఐ పెళ్లి జరుగుతుంటే కారులో ఉత్సాహంగా బయల్దేరారు. కానీ విధి కర్కశంగా కాటేసింది, లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు దర్మరణం చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర విషాదం చిత్రదుర్గం జిల్లా చెళ్లెకెరె తాలూకాలో హెగ్గెరె గ్రామం వద్ద బెంగళూరు– హైవేలో సంభవించింది. ఉజ్వలమైన జీవితం రక్తసిక్తమైంది. చిత్రదుర్గం జిల్లాలో ముందు వెళ్తున్న లారీని కారు ఢీ నుజ్జునుజ్జయిన కారు ముగ్గురు రిజర్వు ఎస్ఐలు మృతి మరో ఇద్దరికి తీవ్రగాయాలు బెంగళూరు నుంచి బళ్లారికి వస్తుండగా ఘోరం -
రథంలో గోపాలుని విహారం
మైసూరు: రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట తాలూకాలోని శ్రీ హిమవద్ గోపాలస్వామి పర్వతంపై ఆదివారం వేలాది మంది భక్తుల సమక్షంలో గోపాలస్వామి బ్రహ్మరథోత్సవం వైభవంగా జరిగింది. స్వామి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించిన తేరులో ఉంచి పూజలు చేశారు. ఏటా మాదిరిగానే, వేలాది మంది భక్తులు అడవి నుంచి తీసుకువచ్చిన హంబిని రథాన్ని జై గోపాలస్వామి అంటూ నినాదాలు చేస్తూ లాగారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఎండల మాటున చల్లని వర్షం ● పలు జిల్లాల్లో జల్లువానలు బనశంకరి: రాష్ట్రంలో ఎండల మధ్య వర్షాలు చల్లగా ఉపశమనం కలిగించాయి. ఆదివారం కొడగు, చిక్కమగళూరు, బెళగావి జిల్లాలో వర్షం కురిసింది. బెళగావిలో అర్ధ గంటకు పైగా వర్షం కురిసింది. కొడగులో వర్షాలకు కాఫీ తోటల రైతులు హర్షం వ్యక్తం చేశారు. చిక్కమగళూరు జిల్లాలో పలుచోట్ల గాలీవానతో పాటు వడగండ్లు పడ్డాయి. చిక్కమగళూరు తాలూకా కణతి గ్రామం వద్ద వర్షానికి చెట్టు విరిగిపోవడంతో శృంగేరి రాష్ట్ర రహదారిలో వందలాది వాహనాలు చిక్కుకుపోయాయి. రాష్ట్రంలో బళ్లారి, ఉడుపి, దక్షిణకన్నడ, కొడగు, మైసూరు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముంది. ఇక యాదగిరి, రాయచూరు, కలబురిగితో పాటు చాలా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలను దాటింది. కబ్జాల తొలగింపు పేరుతో వక్క తోట నేలమట్టం శివమొగ్గ: శివమొగ్గ తాలూకాలోని మండెనకొప్పలో రెవెన్యూ శాఖ అధికారులు ఆక్రమణల తొలగింపును చేపట్టి వక్క తోటను నేలమట్టం చేశారు. పంట ఇస్తున్న చెట్లను ఆకస్మాత్తుగా కూల్చివేస్తారా? అని తోటల పెంపకందారులు ఆగ్రహించారు. మంత్రి మధు బంగారప్ప ఆదేశాలతో మండెన కొప్పలోని సర్వే నంబర్ 241–1లో చెరువును ఆక్రమించి తోటలు వేశారని అధికారులు జేసీబీలతో తొలగింపు చేపట్టారు. ఆ తోట యజమాని రుద్రేష్ 2000లో వక్క మొక్కలు నాటి సాగు చేస్తున్నాడు. ఇది వివాదం కావడంతో అధికారులు సర్వే నిర్వహించారు. 300కు పైగా వక్క చెట్లను జేసీబీతో పెకలించి తోటను రూపుమాపారు. బలమైన రాజకీయ నాయకుల వల్లనే రైతు రుద్రేష్కు అన్యాయం చేశారని స్థానిక రైతు నేతలు ఆరోపించారు. వివాహిత అనుమానాస్పద మృతి యశవంతపుర: వివాహిత యువతి అనుమానాస్పదంగా ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయిన ఘటన యలహంకలో జరిగింది. శృతి (22) మృతురాలు కాగా, భర్త పవన్ కళ్యాణ్పై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. అదనపు కట్నం గురించి భర్త వేధిస్తుండడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గతంలో రాజీ ప్రయత్నాలు జరిగాయి. అయితే అత్తింటిలో వేధింపులు తట్టుకోలేక శృతి చనిపోయిందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆమెను హత్య చేసి ఆమె ఉరి నాటకం ఆడుతున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. యలహంక న్యూటౌన్ పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
అయ్యో శిశువా అమ్మకు బరువా?
● రోడ్డు పాలైన పసికందు కోలారు: సంతానం లేదని అంగలార్చేవారు కొందరైతే, పుట్టిన పిల్లలను నిర్దయగా పడేసేవారు మరికొందరు. తల్లిదండ్రులు ఎవరో గానీ, అప్పుడే పుట్టిన మగ శిశువును రోడ్డుపై పడేసిపోయారు. ఈ హృదయ విదారక సంఘటన బంగారుపేట తాలూకా లక్కేనహళ్లి గ్రామం వద్ద జరిగింది. శిశువు గుక్కపెట్టి ఏడుస్తుండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే దగ్గరకు తీసుకుని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తరువాత కామసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెళ్లి చేర్పించారు. అక్కడి నుంచి శిశు పాలనా కేంద్రంలో అప్పజెప్పారు. పసికందు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
కోర్టులో మళ్లీ పెళ్లి
తుమకూరు: విడాకులు కావాలంటూ కోర్టు చుట్టూ తిరుగుతున్న జంటకు లోక్ అదాలత్లో మళ్లీ పెళ్లి చేశారు. చిక్కనాయకనహళ్లి కోర్టు కాంప్లెక్స్లో శనివారం తాలూక్ లీగల్ సర్వీసెస్ కమిటీ నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్లో సీనియర్ సివిల్ జడ్జి సతీష్ ఎస్.టి. సమక్షంలో ఏకం చేశారు. దంపతులు శైల, శ్రీరాఘవేంద్ర గొడవలు పడి విడాకుల కేసు వేసుకున్నారు. అయితే జడ్జి సతీష్, న్యాయవాదులు వారికి నచ్చజెప్పి పూలదండలు తెప్పించి రాజీ చేశారు. న్యాయవాదులు టి.రవీంద్రకుమార్ ఎం.బి. నాగరాజు, రమేష్ బాబుపాల్గొన్నారు. -
క్రీడా సముదాయం షురూ
తుమకూరు: తుమకూరు నగరంలో కొత్తగా నిర్మించిన షూటింగ్ రేంజ్, టెన్నిస్, బాస్కెట్బాల్ మైదానాలు, బోటింగ్ వాటర్ స్పోర్ట్స్ సెంటర్లను ఆదివారం హోం మంత్రి జి.పరమేశ్వర్ ప్రారంభించారు. తుమకూరు యువత, క్రీడా ఔత్సాహికులకు మంచి సౌకర్యాలతో కూడిన స్టేడియంల అవసరం ఉందని అన్నారు. ఇందుకోసమే ఈ క్రీడా వసతులను నిర్మించామని చెప్పారు. జిల్లా కేంద్రం మధ్యలో ఇంత విశాలమైన చెరువు ఎక్కడా లేదన్నారు. చెరువులో కయాకింగ్ పడవ విహారం, అలాగే క్రీడా మైదానాలను నగరవాసులు, పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టరు శుభ కళ్యాణ్, ఎమ్మెల్యే జి.బి.జ్యోతిగణేష్, ఎస్పీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ ఇవ్వరేమి?
శివాజీనగర: కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో సవతి తల్లి ప్రేమను చూపుతోందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి దేశంలో సిలిండర్ల సరఫరాకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. అదే ప్రకారంగా తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యపై అసెంబ్లీలో కూడా చర్చించామని, తాము సమాధానం చెప్పామన్నారు. దేశంలో ఎక్కడా లేనట్లు కర్ణాటకలోనే సిలిండర్ల సమస్య ఎందుకుందని బీజేపీ నాయకులు బీ.వై.విజయేంద్ర, ఆర్.అశోక్ ప్రశ్నించడంపై మండిపడ్డారు. కేంద్రం సవతి తల్లి ధోరణి వల్లేనన్నారు. కేంద్ర ప్రభుత్వం సక్రమంగా సిలిండర్లను సరఫరా చేయాలన్నారు. ఇతర దేశాల నుంచి సహజవాయువును దిగుమతి చేసుకోవాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్ల రంగానికి సమస్య అయ్యింది, ఈ రంగంలో వేల మంది పనిచేస్తున్నారు, వారి గతేమిటని అన్నారు. ఆగని కష్టాలు యశవంతపుర: బెంగళూరులో గ్యాస్ సిలిండర్ల కొరత ఉండగా, కొందరు ఎక్కువ రేట్లకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. అక్రమంగా నిల్వ చేసిన గోదాములపై పోలీసులు దాడులు చేశారు. పీణ్యా, ఆర్ఎంసి యార్డ్, కెంగేరి, చిక్కజాల పరిధిలో జరిగాయి. సిలిండర్లను సీజ్ చేసి నిందితులపై కేసులు నమోదు చేశారు. గ్యాస్ లేక బెంగళూరులో అనేక హోటళ్లు ఆదివారం కూడా మూతపడ్డాయి. కొన్ని హోటల్స్లో మెను ను పూర్తిగా మార్చివేశారు. ఎక్కువ గ్యాస్ ఖర్చయ్యే వంటలను తీసేశారు. ప్రజలు సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కట్టారు. కేంద్రంపై సీఎం సిద్దరామయ్య గుర్రు పరిష్కారానికి చర్చిస్తున్నాం శివాజీనగర: బెంగళూరులో వాణిజ్య సిలిండర్లు, వాహనాలకు ఎల్పీజీ కొరత కొనసాగుతుండగా, కొంతమేరకు హోటళ్లకు గ్యాస్ ఇవ్వడంపై చర్చిస్తున్నామని ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి కే.హెచ్.మునియప్ప తెలిపారు. సోమవారం సాయంత్రం గ్యాస్ కంపెనీల అధికారులతో భేటీ ఉంది, సమస్య పరిష్కారం ఆలస్యమవుతోంది, ఇప్పటి వరకు యుద్ధం ఆగలేదు. ప్రజలు గ్యాస్ను పొదుపుగా వాడుకోవాలి, బెంగళూరులో అనేక హోటల్లు మూతబడ్డాయి. మరికొన్ని హోటల్లు వంటకాలను మార్చాయి. ఇండక్షన్, కట్టెలపొయ్యిను ఉపయోగిస్తున్నారు అని మంత్రి తెలిపారు. హోటళ్లకు గ్యాస్ కొరత వారంలోగా తీరిపోతుందనుకుంటే మరింత అధికమైందన్నారు. -
కేబినెట్ మార్పుల కోసం ఢిల్లీ యాత్ర!
శివాజీనగర: శాసనసభ సమావేశాల తరువాత సీఎం సిద్దరామయ్య ఢిల్లీకి వెళ్లి, మంత్రిమండలి పునర్విభజన కోసం హైకమాండ్ నాయకులతో చర్చించే అవకాశముంది. సాధారణంగా బడ్జెట్ను సమర్పించాక ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రిని, పార్టీ అగ్రనేతలను కలిసి సమాచారమివ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఆ దిశగా ఈ అసెంబ్లీ సమావేశాల తరువాత సిద్దరామయ్య ఢిల్లీకి వెళ్తారని తెలిసింది. 12 మందిని తప్పిస్తారా? సుమారు 12 మందికి పైగా మంత్రులను తప్పించి, కొత్త వారికి చాన్సు ఇవ్వాలనుకుంటున్నారు, ఇందుకు డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ ఒప్పుకోలేదని తెలిసింది. సీఎం మార్పిడిని తేల్చేవరకు మంత్రివర్గ పునర్విభజన చేయరాదని డీకే పట్టుబట్టారు. దీంతో సీఎం సన్నిహిత వర్గం ఎమ్మెల్యేలు ప్రత్యేక భేటీ జరిపి మంత్రిమండలి మార్పులకు గొంతెత్తారు. 3 సార్ల కంటే ఎక్కువగా గెలుపొందిన ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటివ్వాలని కోరుతున్నారు. మంగళవారం డీకే టూర్ కానీ ఈసారి సారి మంత్రిమండలి మార్పులు జరిగితే ఇకముందు సీఎం మార్పిడి మరుగున పడుతుందని డీకే భావిస్తున్నారు. అలా జరగకుండా డీకే ప్రయత్నాల్లో భాగంగా మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. హైకమాండ్పై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశముంది. ఇటు డీ.కే.శివకుమార్ తరపున జూనియర్ ఎమ్మెల్యేలు బ్యాటింగ్ చేస్తుండగా, సీఎం సిద్దుకు అండగా సీనియర్ ఎమ్మెల్యేలు వచ్చారు. సిద్దరామయ్య ఢిల్లీ యాత్ర ఏ ఫలితమిస్తాయనేది ఉత్కంఠ కలిగిస్తోంది. త్వరలో హస్తినకు సీఎం సిద్దు -
మాదన్న దర్శనమే మహాభాగ్యం
మైసూరు: రాష్ట్రంలోని ప్రసిద్ధ ఫుణ్యక్షేత్రం చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని శ్రీ క్షేత్ర మలే మహాదేశ్వర బెట్టపై పరమేశ్వరుని దేవస్థానంలో జరిగే ఉగాది జాతర మహోత్సవానికి వేలాది మంది భక్తులు మండుతున్న ఎండలను కూడా లెక్కచేయకుండా కాలినడకన వస్తున్నారు. పొరుగున ఉన్న తమిళనాడు నుంచి కూడా విశేషంగా యాత్రికులు మాదప్ప దర్శనం చేసుకోవడానికి శ్రమను లెక్కచేయకుండా బయలుదేరారు. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ పరిధిలోని 200కి పైగా గ్రామాల నుంచి భక్తులు పాదయాత్ర చేపట్టారు. అలుపు రాకుండా స్వామి నామాన్ని, భక్తి గీతాలను పాడుతూ గుంపులు గుంపులుగా వస్తారు. మొక్కు తీరినవారు, లేదా మొక్కుకున్నవారు వందల కిలోమీటర్ల దూరం నుంచి చెప్పులు లేకుండా నడవడం వారి అచంచల భక్తికి నిదర్శనం. ఈసారి విశేష ఉగాది బెట్టపై ఉగాది జాతర మహోత్సవం 16 నుంచి ప్రారంభమవుతుంది. 17న సాయంత్రం ఎన్నేమజ్జన సేవ జరుగుతుంది. 18, 19 తేదీలలో ఫాల్గుణ మాసం చివరి రోజు, అమావాస్య రోజున ప్రత్యేక పూజలు , ఉత్సవాలు జరుగుతాయి. ఉగాది అయిన 19వ రోజున తెల్లవారుజాము నుంచి పూజలు, ఉదయం 9:45 నుంచి 11 గంటల మధ్య మహారోత్సవం జాతర తదితరులు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఉగాది పండుగకు మరో ప్రత్యేకత ఏమిటంటే, ఫాల్గుణ అమావాస్య, చైత్ర పాడ్యమి దగ్గరగా ఉంటాయి. మరింత శుభప్రదమైనదని పండితులు తెలిపారు. చిరుతల బెడద ఉగాది వేడుకలకు కొండపై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రంగస్వామి ఒడ్డు, శని మహాత్మ ఆలయం దగ్గర తరచుగా చిరుతపులి తిరగడం వల్ల భక్తులు భయపడుతున్నారు. ఉగాది జాతరకు భక్తజనం కాలినడకన రాక -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు: వ్యక్తి మృతి
శ్రీనివాసపురం: విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మరణించిన ఘటన తాలూకాలోని బద్దిపల్లి క్రాస్ వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. శ్రీనివాసపురం తాలూకా గుడిపల్లి గ్రామానికి చెందిన లోకేష్ (45) ప్రమాదంలో మరణించిన వ్యక్తి. వృత్తిరీత్యా పురోహితుడు అయిన లోకేష్ పూజా కార్యక్రమాలను ముగించుకుని తిరిగి స్వగ్రామం గుడిపల్లికి బయలుదేరాడు. బద్దిపల్లి క్రాస్ వద్ద కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఘటనలో లోకేష్ అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న గౌనిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు
హొసపేటె: మద్యానికి బాసినిసైన ఓ యువకుడు ఆస్తి కోసం సొంత అన్ననే చంపేశాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అన్నను హతమార్చి పరారయ్యాడు. విజయనగర జిల్లా హగరిశిరిహళ్లి గ్రామంలో ఆదివారం ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హగరిశిరహళ్లి గ్రామంలో అన్నతమ్ముళ్లు మరుళసిద్దేశ్, పత్రెగౌడ జీవనం సాగిస్తున్నారు. భూమిలో తనకు వాటా ఇవ్వలేదని తమ్ముడు పత్రిగౌడ రోజూ అమ్మతో గొడవ పడేవాడు. మద్యానికి బానిస కావడంతో డబ్బు కోసం తల్లిని వేధించేవాడు. దీంతో విసిగిపోయిన తల్లి మల్లమ్మ ఆస్తి మొత్తాన్ని పెద్ద కొడుకు అప్పగించింది. దీంతో తన వాటా ఇవ్వాలని పత్రెగౌడ.. అన్న మరుళసిద్దేశ్తో గొడవ పడేవాడు. మద్యానికి బానిస అయిన నీకు ఆస్తి ఇచ్చేది లేదని అన్న తేల్చి చెప్పాడు. అన్న ఉన్నంత వరకు తనకు ఆస్తి రాదని పత్రిగౌడ నిర్ణయించుకున్నాడు. తాను బెంగళూరుకు పనికి వెళ్తున్నా అని తల్లితో చెప్పిన పత్రెగౌడ.. ఆదివారం ఆస్తి విషయమై అన్న మరుళసిద్దేశ్తో గొడవ పడ్డాడు. బంధువు నారప్పతో కలసి మరుళసిద్దేశ్ ముఖానికి టవల్ చుట్టి కొట్టాడు. అనంతరం తలపై బండరాయితో మోది హతమర్చారు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్న తల్లి మల్లమ్మ అరసికెరె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాలింపు చేపట్టిన పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు వెల్లడించారు.


