breaking news
Karnataka
-
తెరపైకి కర్ణాటక ‘ఓట్ చోరీ’ స్టింగ్ ఆపరేషన్!
లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేసిందని, ఈవీఎంలపైనా అనుమానాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలే చేశారాయన. ఈ క్రమంలో.. 2024 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఒక్క మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే లక్షకుపైగా ఫేక్ ఓట్లు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అయితే.. రెండేళ్ల కిందట.. ఓ మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్లోనూ ఈ అవకతవకలే బయటపడడం గమనార్హం. రాహుల్ గాంధీ ప్రెస్మీట్ నేపథ్యంలో ఆ మీడియా సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ ధన్య రాజేంద్రన్ ఆ విషయాన్ని స్వయంగా తన ఎక్స్ ఖాతాలో గుర్తు చేశారు. అయితే ఆనాడు జరిగిన ఆ ఓట్ల చోరీ గురించి ఆమె మాటల్లోనే ఇలా.. ద న్యూస్ మినిట్ 2023లో నిర్వహించిన ఓ ఇన్వెస్టిగేషన్ను అందరికీ గుర్తు చేయాలని అనుకుంటున్నా. ఈ పరిశోధన కూడా బెంగళూరు సెంట్రల్లోని మహదేవపురతోపాటు ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) నియమించిన ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్నికల సంఘంతో కలిసి పనిచేస్తూ ఓటర్ల సమాచారం చోరీ చేసింది. ఆ ఎన్జీవో పేరు చిలుమే. ఇది ఎన్నికల నిర్వహణ సంస్థతోపాటు, డిజిటల్ సమీక్ష అనే మొబైల్ అప్లికేషన్ను కూడా నడిపేది. ఈ యాప్ ఓటర్ల సమాచారాన్ని క్రోడీకరించి రాజకీయ పార్టీలు, నేతలకు విక్రయించేది. ఒక బీజేపీ నేత కొనుగోళ్లను మేము సాక్ష్యంగా ఆనాడు చూపించాం కూడా. ఇందుకోసం బీజేపీ వార్డు కార్యాలయాల్లో చిలుమే తన కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేది. మా మనిషి ఒకరు ఆ శిక్షణ కేంద్రంలో చేరి అక్కడ ఫొటోలతో సహా ఆధారాలు కూడా సేకరించారు. ఇదెలా జరిగిందంటే.. ఈ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు.. బూత్ లెవల్ అధికారులుగా చెలామణి అవుతూ సమాచారం సేకరించారు. ఆ సేకరణ తర్వాత ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న శివాజీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపునకు ఒత్తిడి తీసుకొచ్చింది. ఇదెలా జరిగిందంటే.. బీజేపీ సానుభూతి పరులు ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో సుమారు 26,000 ఫేక్ ఓటర్లు ఉన్నట్లు ఆరోపించారు. అవసరమైన పత్రాలను నింపకుండానే వాటి తొలగింపునకు పట్టుపట్టారు. చివరకు ఒక కోర్టు కేసు తరువాత ఏడువేల ఓట్లు తొలగించారు. అయితే ద న్యూస్ మినిట్ క్షేత్రస్థాయి పరిశీలన జరిపినప్పుడు.. తొలగించిన ఓటర్లలో చాలామంది అదే అసెంబ్లీ సెగ్మెంట్లో, అవే చిరునామాల్లో నివసిస్తున్నట్లు స్పష్టమైంది.అంతేకాదు.. మా స్టింగ్ ఆపరేషన్లో.. చిలుమే వ్యవస్థాపకుడు కృష్ణప్ప రవికుమార్ సొంతూరులో కొంతమంది వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలో రూ.1.4 లక్షల నుంచి రూ.40 వేల వరకూ డబ్బులు పడ్డాయి. వీటిల్లో ఎక్కువ శాతం ‘సీఎస్సీ ఈ-గవర్నెన్స్’ నుంచి వచ్చినవే ఉండేవి. ఆ ఊరి ప్రజలు డబ్బు విత్డ్రా చేసుకుని కృష్ణప్ప రవికుమార్కు ఇచ్చేవారు. ఈ సీఎస్సీ ఈ-గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ అనేది కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ఏర్పాటు చేసిన సంస్థ కావడం గమనార్హం. మా స్టింగ్ ఆపరేషన్ తర్వాత.. చాలామంది అరెస్ట్ అయ్యారు. మరికొందరిపై సస్పెన్షన్ వేటు పడింది. చిలుమేతో బీబీఎంపీ సంబంధాలు లేవని ప్రకటించుకుంది. శివాజినగర, చిక్పేట్, మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది కూడా. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో గ్రామస్తుల అకౌంట్లలోకి డబ్బులెందుకు వచ్చాయి? చిలుమే సంస్థ సిద్ధం చేసిన ఓటర్ల జాబితాలు ఏమయ్యాయి? ఈ అంశంపై ప్రభుత్వ విచారణ సక్రమంగా జరగలేదు(కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ..)’’ అని ఆమె పోస్ట్ చేశారు.Just wanted to remind everyone of TNM's investigation in 2023- which also focused on assembly segments in Bangalore Central seat including Mahadevapura. We found that a Bengaluru NGO- recruited by the BBMP- working with the ECI- was stealing voter data. Chilume NGO also ran…— Dhanya Rajendran (@dhanyarajendran) August 7, 2025 -
ధర్మస్థలలో వివాహిత ఆత్మహత్య
యశవంతపుర: సంచలనాలు జరుగుతున్న ధర్మస్థలలో వినుత (26) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. బుధవారం రాత్రి తన నివాసంలో ఉరి వేసుకొది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. ముళిక్మారుకు చెందిన రమేశ్తో పెళ్లి కాగా ధర్మస్థళలో నివాసం ఉంటున్నారు. వినుత ఓ షాపులో పని చేస్తున్నట్లు ధర్మస్థల పోలీసులు తెలిపారు. ధర్మస్థలలో ఇటీవల అసహజ మరణాలు, శవాల తవ్వకాల సమయంలో ఈ ఆత్మహత్య జరగడం చర్చనీయాంశమైంది. మరో యువతి.. కడుపునొప్పి తట్టుకోలేక ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శివనసముద్ర వద్ద జరిగింది. రామనగర తాలూకా హంగరపాళ్య గ్రామానికి చెందిన నాగేష్ భార్య శకుంతల (23), అనారోగ్యం కారణంగా గత మూడు నెలలుగా శివనసముద్రలోని పుట్టింటిలో ఉంది. కడుపునొప్పి తీవ్రం కావడంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కార్మికుల పేరుతో రూ.కోట్లు స్వాహా: ఎమ్మెల్సీ యశవంతపుర: రాష్ట్రంలో వాల్మీకి అభివృద్ధి మండలి, ముడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఇబ్బంది ఎదురైంది. కార్మికుల కోసం ఆరోగ్య శిబిరాలను నిర్వహించిన్నట్లు తప్పుడు లెక్కలు చూపించి కోట్ల రూపాయిలను దండుకున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ కేఎస్ నవీన్ ఆరోపించారు. బెంగళూరులో పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. కార్మికశాఖ మంత్రి సంతోష్లాడ్పై ఆరోపణలు చేశారు. కట్టడ కార్మికులకు అరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు తప్పులు లెక్కలు చూపి కోట్ల రూపాయలను లూటీ చేశారని ఆరోపించారు. మంత్రి సంతోష్లాడ్ నేరుగా అవినీతికి పాల్పడినట్లు చెప్పారు. తాను సమాచార చట్టం ద్వారా వివరాలను అడిగితే ఇవ్వడం లేదన్నారు. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్ర ఖాతాల సీజ్ బనశంకరి: మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు కేసులో ప్రముఖ నిందితుడు సయ్యద్ యాసిన్.. బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ.29 వేల నగదును ఈడీ అధికారులు జప్తు చేశారు. కొందరు ఉగ్రవాదులు ధర్మస్థల దేవస్థానంలో బాంబుపెట్టి పేల్చివేయడానికి కుట్రపన్నారని ఈడీ తేల్చింది. గతంలో మహమ్మద్ షారిక్ బాంబును ధర్మస్థల మంజునాథస్వామి మందిరంలో పెట్టి పేల్చివేయడానికి కుట్ర చేశాడు. బాంబును ఆటోలో తీసుకెళ్తున్నాడు, బాంబుటైమర్ ను 90 నిమిషాలకు బదులు 9 సెకండ్లకు మార్చడంతో ఆటోలో పేలిపోయి గాయపడడం తెలిసిందే. అతనికి మద్దతుగా హజ్ మునీర్, కల్నల్ అనే కొందరు బ్యాంకు అకౌంట్లను నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. నగదు బదిలీ, బాంబుల తయారీలో మెళకువలు నేర్చుకున్నారు. అనధికార బ్యాంకు అకౌంట్లు, క్రిప్టో కరెన్సీ ద్వారా ఆర్థిక సాయం పొందారు. ఇలా రూ.2.86 లక్షలు నగదు అందింది. ఈ డబ్బుతో బాంబుల తయారీ, ఉగ్రవాద పనులు చేపట్టారు. నిందితులు జైల్లో ఉన్నారు. నేడు నగరంలో రాహుల్ సభశివాజీనగర: ఓటరు జాబితా అక్రమాలకు వ్యతిరేకంగా శుక్రవారం బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ జరుపనుంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ ధర్నా జరుగుతుంది. లక్ష మంది పాల్గొనేలా ఫ్రీడంపార్క్లో సభకు ఏర్పాట్లు చేశారు. రాహుల్ గాంధీ ఈ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కాంగ్రెస్ ఎమ్మల్యేలు, ఎంపీలు, మంత్రులు, నేతలకు జనాన్ని తరలించాలని ఆదేశించారు. పార్టీలోని అన్ని స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఎం సిద్దరామయ్య, డీసీఎం శివకుమార్ ఆదేశించారు. దీంతో ఫ్రీడంపార్క్తో సహా పరిసర ప్రాంతాలు జనంతో నిండిపోయే అవకాశముంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు పాల్గొంటారు. ఎన్నికల అక్రమాల ఆధారాలను విడుదల చేస్తానని రాహుల్గాంధీ ప్రకటించారు. -
మహిళను హత్య చేసి.. ముక్కలు ముక్కలు..
తుమకూరు: మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అక్కడక్కడా పడేశారు. అత్యంత హేయమైన ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని కొరటిగెరె తాలూకాలో దొడ్డసాగ్దెరె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చింపుగానహళ్ళిలో జరిగింది. ముత్యాలమ్మ దేవాలయం వద్ద మృతదేహం ముక్కలు కనిపించాయి. లింగాపుర వంతెన వద్ద కడుపు భాగం, చింపుగానహళ్ళి వంతెన వద్ద జుట్టు, చేతులు, ముత్యాలమ్మ గుడి ముందు చెయ్యి, గరుడాచల నది పక్కన మూడు శరీర భాగాలు కనిపించాయి. గురువారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు నల్లని కవర్ల నుంచి దుర్వాసన వస్తుండడంతో పరిశీలించగా మహిళ శరీర భాగాలు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. హంతకులు మహిళను చంపి నరికివేసి ముక్కలను విసురుతూ వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మొదట పురుషుడా, మహిళా అని సందేహం వచ్చింది. తల వెంట్రుకలు చూసి మహిళే అని నిర్ధారించారు. మిగతా అనేక శరీర భాగాల జాడ లేదు. కొంచెం దూరం గాలిస్తూ వెళ్లగా, తల, మొండెం, గుర్తుపట్టకుండా నుజ్జు చేసిన ముఖం ఒక నల్ల కవరులో కట్టి పడేసి ఉన్నాయి. హతులు ఒక్కరు కాదు.. ఇద్దరా? రెండు చోట్ల దొరికిన చేతులను పరిశీలించగా వేరు వేరు రంగుల్లో ఉన్నాయని, దీనిని బట్టి ఒకరివి కాదు ఇద్దరివి అయి ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. దీనిని బట్టి హంతకులు ఇద్దరు సీ్త్రలను చంపి ముక్కలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుర్ఘటన గురించి తెలియగానే చుట్టుపక్కల గ్రామస్తులు రావడంతో రద్దీ ఏర్పడింది. జనం రాకుండా చుట్టూ కంచె వేసి పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం వరకు ఘటనాస్థలిలో అవశేషాల సేకరణ కొనసాగింది. జిల్లా ఎస్పీ అశోక్, తిపటూరు డీఎస్పీ కుమారశర్మ పరిశీలించారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల పల్లెల్లో భయాందోళన అలముకొంది. తుమకూరు జిల్లా కొరటగెరె వద్ద దారుణం -
వ్యవసాయ శాఖ జేడీపై చర్యలకు డిమాండ్
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో పండించే వరి ధాన్యం నుంచి వచ్చిన బియ్యంతో భోజనం చేస్తే మనిషికి క్యాన్సర్ వస్తుందని ప్రకటించిన కొప్పళ జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు(జేడీ)పై చర్యలు చేపట్టాలని కర్ణాటక అన్నదాత రైతు సంఘం రాష్ట్రాధ్యక్షుడు నాగనగౌడ డిమాండ్ చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరు, బళ్లారి, కొప్పళ, విజయ నగర జిల్లాల్లో అధిక శాతం వరి పండిస్తున్న రైతులకు ఆ అధికారి ప్రకటన వల్ల ఈ ఏడాది రైతుల నుంచి వరి ధాన్యం, బియ్యం కొనుగోలు చేయడం కష్టకరమవుతుందన్నారు. రసాయనిక పదార్థాలతో కూడిన ఎరువులు, క్రిమి సంహారక మందులు అధికంగా వినియోగించడం వల్ల క్యాన్సర్ వ్యాధి సోకుతుందని అసత్య ప్రచారం చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలని సర్కార్ను డిమాండ్ చేశారు. -
రాజధానిలో రాత్రంతా వర్షం
శివాజీనగర: బెంగళూరులో బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రదేశాలు జలమయం అయ్యాయి. గుంతల రోడ్లలో నీరు చేసి వాహనదారులు అవస్థలు పడ్డారు. అనేకచోట్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. రోడ్లలో నీరు నిలవడంతో వడ్డరపాళ్య నుంచి హెణ్ణూరు వైపు, గెద్దలహళ్లి వైపు వాహన సంచారం ఆలస్యంగా సాగుతోంది. రామమూర్తి నగర నుంచి కస్తూరి నగర వైపుకు సర్వీస్ రోడ్డులో వాననీరు నిలిచి వాహనాలకు ఇబ్బంది కలిగింది. పలు మార్గాలలో సంచార ఇబ్బందులు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు ఎక్స్లో తెలిపారు. వారం రోజులు వాన అలర్ట్ ఈ వారం రోజులు బెంగళూరులో అధిక వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బెంగళూరు గ్రామీణ, తుమకూరు, చిత్రదుర్గ, దావణగెర, కొప్పళ, బాగలకోట, బెళగావితో పాటుగా పలు ప్రాంతాలకు భారీ సూచన చేసింది. ఉత్తర కన్నడ, హావేరి, శివమొగ్గ, ఉడుపి, దక్షిణ కన్నడ, గదగ్, ధారవాడ, చిక్కమగళూరు, బెళగావి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు -
వ్యక్తిగత ద్వేషంతో పంటకు నష్టం
హొసపేటె: రైతు పండించిన పంటను దుండగులు వ్యక్తిగత ద్వేషంతో నాశనం చేసిన ఘటన విజయనగర జిల్లా హూవిన హడగలి తాలూకాలోని హొళగుందిలో జరిగింది. గ్రామానికి చెందిన మెళ్లి హాలప్ప పొలంలో పండించిన మొక్కజొన్న పంట నాశనమైనట్లు వెలుగులోకి వచ్చింది. హడగలి తాలూకాలో మంచి వర్షాలు కురవడంతో మొక్కజొన్న పంట బాగా పండింది. అయితే దుండగులు రాత్రి పూట మొక్కజొన్న కంకులను కోసి, మొక్కలను పెకలించి పారిపోయారు. ఎవరో దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కష్టపడి, అప్పులు చేసి పండించిన పంటను నాశనం చేశారని రైతులు కన్నీరు పెట్టారు. హూవినహడగలి స్టేషన్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ సంఘంలోని కొంత మంది సభ్యులు ద్వేషంతో ఇలా చేసి ఉండవచ్చు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసినట్లు హువిన హడగలి పోలీసులు తెలిపారు. -
ఎస్సీ వర్గీకరణ కోసం ధర్నా
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అమలుకు నిర్ణయం చేసుకోవాలని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి సంచాలకుడు మారెప్ప డిమాండ్ చేశారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ గత 30 ఏళ్లుగా ఆందోళనలు చేపడుతున్నామని గుర్తు చేశారు. వర్గీకరణకు కాంగ్రెస్ సర్కార్కు జిస్టిస్ నాగమోహన్దాస్ అందించిన నివేదికపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం ప్రకటించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సర్కార్ అంగీకరించాలన్నారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు లేని అడ్డంకి కర్ణాటకకు ఎందుకని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సర్కార్లే ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో అమలు చేసిన ఆర్డినెన్సును చూడాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో హేమరాజ్, ఆంజనేయ, శ్రీనివాస్, నరసింహులు, తాయప్ప, కృష్ణలున్నారు. -
ఎరువుల కోసం రైతన్న బారులు
రాయచూరు రూరల్: వ్యవసాయ రంగంలో ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల ఇబ్బంది కలగకుండా చూడాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ పేర్కొన్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కళ్యాణ కర్ణాటక జిల్లాల్లోని కలబుర్గి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, బీదర్, యాదగిరి, విజయ నగర, బాగల్కోట జిల్లాల్లో ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల కొరత అధికమైంది. సోమవారం కొప్పళలో రైతులు ఎరువుల దుకాణాల ముందు నిలబడినా ఫలితం లేకపోవడంతో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. యూరియా, డీఏపీ కోసం 44 సహకార సంఘాల్లో రైతులు ఎదురు చూస్తున్నారు. రాయచూరు ఏపీఎంసీకి 50 టన్నుల యూరియా వచ్చినట్లు వచ్చి రాగానే ఖాళీ అయింది. రాయచూరు జిల్లాకు 72 వేల మెట్రిక్ టన్నుల యారియా అవసరం కాగా కేవలం 900 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశారు. జిల్లాలో యూరియా లభించక పోవడంతో రైతులు వాటి కోసం వలస వెళుతున్నారు. క.క.భాగంలో తీవ్రమైన ఎరువుల కొరత రైతులకు ఇబ్బందులు కల్గిస్తున్న ఎరువులు -
సేంద్రియ సాగు.. ఆరోగ్యం బాగు
సాక్షి, బళ్లారి: గతంలో రైతులు సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేసి వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు సాగు చేసేవారు. ముఖ్యంగా వరినాట్లు వేసే ముందు కానుగ ఆకు, తంగేడు ఆకు తదితర ఆకులు, అలములు వరినాట్లలో వేసి ఆవు పేడ, పశువుల పేడను వేసి అద్భుతంగా వరి పంటను పండించే వారు. వాటిని ఆహారంగా తీసుకొన్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చేవి కాదు. అయితే ఏటేటా మారుతున్న కాలానుగుణంగా జనాభా పెరుగుదలతో పాటు నీటి పారుదల వసతి భూమి కూడా ఏటేటా పెరుగుతూ వచ్చింది. గతంలో గ్రామాల్లో ఎక్కువగా నీటిపారుదల సౌకర్యం కలిగిన భూములు ఉండగా ప్రస్తుతం బోరు బావులు పెరగడంతో పాటు తుంగభద్ర ఆయకట్టు భూముల సంఖ్య పెరగడంతో రైతులు రసాయనిక ఎరువుల వాడకంపై ఆసక్తి చూపుతూ పంటలను పండిస్తున్నారు. వివిధ రకాల క్రిమి సంహారక మందులు వాడుతూ తాము పండించిన పంటలు అనారోగ్యకరమైనవని తెలిసినప్పటికీ గత్యంతరం లేక పంట దిగుబడిని పెంచుకునేందుకు క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువులను వాడుతూ వారికి వారే అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య కోకొల్లలు. సేంద్రియ సాగుతో అధిక దిగుబడి ఇటీవల వారం రోజుల క్రితం రాయచూరు జిల్లాలో ఓ రైతు కూరగాయలకు క్రిమి సంహారక మందు పిచికారీ చేసి వాటిని తీసుకెళ్లి మరుసటి రోజు ఇంటిలో వంట చేసుకోవడంతో వాటిని ఆహారంగా తిన్న కుటుంబ సభ్యులు ముగ్గురు మృతి చెందడం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి దయనీయ పరిస్థితులు ఏర్పడుతుండగా రసాయనిక, క్రిమిసంహారక మందుల వాడకంపై రైతుల నుంచి ఏటేటా డిమాండ్ కూడా పెరుగుతుండటం బాధాకరం. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా యూరియా, రసాయనిక ఎరువులకు తీవ్ర డిమాండ్ కూడా ఏర్పడి రైతులు వాటిని తీసుకోవడానికి ధర్నాలు, ఆందోళనలు చేపడుతున్నారు. సులభమైన పద్ధతిలో పంటలు పండించుకోవాలన్న సంకల్పం ఉండటంతో సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు చాలా మంది రైతులు దూరమవుతూ వచ్చారు. ఈనేపథ్యంలో సహజంగానే రసాయనిక, క్రిమి సంహారక మందులకు డిమాండ్ ఏర్పడుతూ వచ్చింది. అయితే తుంగభద్ర ఆయకట్టు కింద పలువురు రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ మంచి దిగుబడిని సాధించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను కూడా పండిస్తూ మార్గదర్శకంగా నిలుస్తున్నారు. పాతికేళ్లుగా సేంద్రియ వ్యవసాయమే.. సిరుగుప్ప తాలూకా బైరాపుర గ్రామంలో బీఎం.ఈరప్పయ్య అనే రైతు గత 25 ఏళ్ల నుంచి సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన వరి పంటను పండిస్తూ పలువురు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. పంట పండించిన తర్వాత ముందుగా దుక్కి దున్ని మళ్లీ పంటను వేసే వరకు సేంద్రియ ఎరువులతో సమానంగా వివిధ రకాల గింజలను వేస్తూ నైసర్గికంగా భూమిని సిద్ధం చేసుకుంటారు. మన పూర్వీకులు ఏ విధంగా వరి పండించేటప్పుడు దుక్కిలోకి ఆకులు, అలుములు, పేడ తదితర సేంద్రియ పద్ధతులను అవలంభిస్తుండేవారో అదే తరహాలో పంటలను సాగు చేస్తూ అధిక లాభాలను గడిస్తున్నారు. వరికి రోగం వచ్చినప్పుడు క్రిమి సంహారక మందులకు బదులుగా గోమూత్రం తదితరాలను అనుసరిస్తున్నారు. సేంద్రియ ఎరువులతో సగం ఖర్చు ఆదా యూరియా, డీఏపీ తదితర రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులను వాడటం ద్వారా ఒక ఎకరాకు రూ.20 వేలు ఖర్చు అవుతుండగా సేంద్రియ ఎరువులతో వరి సాగుకు ముందుగా ప్రణాళికతో రూ.10 వేలు మాత్రమే ఖర్చవుతుందని రైతు పేర్కొంటున్నారు. సేంద్రియ(ఆర్గానిక్) పద్ధతిలో పంటలను సాగు చేయడం సులభతరంగా, ఖర్చు కూడా తక్కువగా ఉంటుందన్నారు. మార్కెట్లో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన వరి, కూరగాయలకు డిమాండ్ కూడా ఉందన్నారు. సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేస్తున్న ఈరప్పయ్య తరహాలో జిల్లా వ్యాప్తంగా పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇలానే కొనసాగితే ఈ ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల సాగు విప్లవం సృష్టించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా రైతులను కూడా మరింత చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్గానిక్ ఎరువుతో పండించిన ఆహార ఉత్పత్తులే మేలు పాత పద్ధతిలో సాగుతో అధిక లాభాలు గడిస్తున్న వైనం -
46 పీఓపీ గణేష్ విగ్రహాల జప్తు
హుబ్లీ: జిల్లాలోని అణ్ణిగేరి హాలదూటర వీధిలో అక్రమంగా తయారు చేస్తున్న ముత్తణ్ణ కుర్తకోటికి చెందిన 46 పీఓపీ(ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్) గణపతులను సంబంధిత అధికారులు స్వాధీన పరుచుకున్నారు. ఆ తాలూకా తహసీల్దార్ మంజునాథ దాసప్పనవర నేతృత్వంలో బుధవారం రాత్రి తనిఖీ చేసి విగ్రహాలను జప్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పర్యావరణ అధికారి జగదీశ్ గద్దిగౌడర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రెండు బైక్ల ఢీ.. ఒకరి మృతి హుబ్లీ: ధార్వాడ జిల్లా హుబ్లీ తాలూకా అంచటగేరి గ్రామ సమీపంలోని పంజాబీ ధాబా వద్ద రెండు బైక్లు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఓ బైక్ చోదకుడు మృతి చెందాడు. చెన్నపుర గ్రామానికి చెందిన కిరణ్ (24) మృతుడు. మరో బైక్ చోదకుడు అఖిల్ షిండేకర్ కలఘటిగి నుంచి హుబ్లీ వైపునకు వస్తుండగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కిరణ్ బైక్ను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం దక్కలేదు. ఘటనపై హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. మైక్రోఫైనాన్స్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య సాక్షి బళ్లారి: ఓ ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకున్న యువకుడు సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సిబ్బంది వేధింపులకు గురి చేయడంతో సదరు అప్పు తీసుకొన్న యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. వివరాలు.. దావణగెరె జిల్లాకు చెందిన యశ్వంత్ నాయక్(24) అనే యువకుడు శివమొగ్గ ఫైనాన్స్ కంపెనీలో రూ.5 లక్షలను అప్పు తీసుకొన్నాడు. అయితే సరిగా కంతులు చెల్లించలేక పోవడంతో తీసుకున్న అప్పు కట్టకపోతే ఇంటిని జప్తు చేస్తామని మైక్రో ఫైనాన్స్ సిబ్బంది బెదిరించారు. మరో వైపు బైక్ను తాకట్టు పెట్టి రూ.40 వేలు అప్పు తీసుకొన్న నేపథ్యంలో అది కూడా తిరిగి ఇవ్వకపోవడంతో వారు కూడా వేధించడంతో యశ్వంత్ నాయక్ తాను అప్పుల వారి వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను క్షమించాలని తండ్రికి రాసిన డెత్ నోటులో కన్నీటి గాథ వివరించాడు. ఆర్టీఐ దరఖాస్తు చేసిన న్యాయవాదిపై దాడి హుబ్లీ: ఆర్టీఐ(సమాచార హక్కు) చట్టం ద్వారా వీధి పశువుల టెండర్ ప్రక్రియ గురించి వివరాలు అడిగాడన్న కోపంతో ఇద్దరు వ్యక్తులు న్యాయవాది చంద్రకాంత్పై దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న అపరాధ కేసులను వాదించినందుకు, వీధి పశువుల టెండర్ ప్రక్రియ గురించి ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగిన కాశప్ప బిజవాడ, మంజుల బిజవాడ దాడి చేశారని బాధిత న్యాయవాది చంద్రకాంత్ బెండిగేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.250 చెల్లించనందుకు దాడి హుబ్లీ: కేవలం రూ.250 కోసం ఓ వ్యక్తి తన స్నేహితుడిని బాటిల్తో పొడిచి దాడి చేసిన దారుణ ఘటన ధార్వాడ తాలూకా హెబ్బళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రాయాసాబ్ నదాఫ్ తన స్నేహితుడు ప్రవీణ్ వద్ద రూ.250 అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులను వాపస్ ఇవ్వాలని రాయాసాబ్ను ప్రవీణ్ అడిగాడు. దీనికి ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని రాయాసాబ్ బదులిచ్చాడు. దీంతో కోపగించుకున్న ప్రవీణ్ ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమంటే డబ్బులు లేవని సాకు చెబుతావా? అంటూ గాజు బాటిల్ పగలగొట్టి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాయాసాబ్ను హుబ్లీ కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించినట్లు, నిందితుడు ప్రవీణ్ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టినట్లు ధార్వాడ గ్రామీణ పోలీసులు తెలిపారు. రైలు పట్టాలపై వృద్ధుడి ఆత్మహత్యాయత్నం ●● అర నిమిషంలో రక్షించిన వైనం హుబ్లీ: రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన వృద్ధుడిని ఓ వ్యక్తి రక్షించిన ఘటన దావణగెరెలోని దేవరాజ అరసు లే అవుట్ వద్ద చోటు చేసుకుంది. దావణగెరెలోని వినాయక నగర్కు చెందిన వృద్ధుడు కుటుంబ సభ్యులతో విసిగి జీవితంపై విరక్తి చెంది రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్ని గమనించిన స్థానికుడు విరుపాక్ష బెళగుత్తి ఆయన్ను రక్షించారు. కాగా వృద్ధుడిని రక్షించిన 30 సెకన్లలో ఆ మార్గంలో రైలు దూసుకెళ్లడం గమనార్హం. రోడ్లలో గుంతలు పూడ్చరూ రాయచూరు రూరల్: నగరంలో వివిధ రోడ్లలో పడ్డ గుంతలను పూడ్చాలని ఎస్యూసీఐ డిమాండ్ చేసింది. గురువారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు చంద్ర గిరీష్ మాట్లాడారు. నగరసభకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.కోట్లాది మేర నిధులు వచ్చినా రోడ్లలో పడిన గుంతలను పూడ్చడంలో అధికారులు, కౌన్సిలర్లు నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. నగరంలో వివిధ వార్డుల్లో పడిన పెద్ద గుంతల మరమ్మతులకు ముందుకు రావాలన్నారు. నగరంలో రక్షిత మంచి నీటి ఽశుద్ధీకరణ చేయాలన్నారు. వీధి కుక్కల బెడద నివారించాలని, మురుగు కాలువల్లో పేరుకున్న పూడికను తీయాలని కోరుతూ మహానగర పాలికె కమిషనర్ జుబిన్ మహాపాత్రోకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో చెన్నబసవ, వీరేష్, మహేష్, సోమశేఖర్లున్నారు. -
నటికి అశ్లీల సందేశం.. యువకుడి అరెస్టు
హొసపేటె: కొప్పళ జిల్లా కారటగి తాలూకా సిద్దాపుర ఫిర్కాలోని సింగనాళ గ్రామానికి చెందిన యువకుడిని బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం నటి రమ్యకు ఈ యువకుడు సోషల్ మీడియాలో అసభ్యకరమైన సందేశం పంపాడు. దీంతో విసిగిన నటి రమ్య బెంగళూరు పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేసి, అసభ్యకరమైన సందేశం పంపిన వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని ఒత్తిడి చేశారు. తరువాత కేసును సైబర్ పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసులో నిందితుడిని కనుగొనడానికి బెంగళూరు సైబర్ పోలీసులు వల పన్ని సింగనాళ గ్రామానికి చెందిన మంజునాథ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. -
నిండుకుండలా పెద్ద చెరువు
హొసపేటె: విజయనగర జిల్లాలోని కూడ్లిగితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కూడ్లిగి తాలూకాలోని పెద్ద చెరువు పొంగి మరువ పారింది. మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ పండించే రైతులకు అవసరమైన వర్షం కురిసింది. దీంతో రైతుల ముఖాల్లో హర్షం వ్యక్తమవుతోంది. చెరువు పొంగి ప్రవహించడాన్ని చూడటానికి పట్టణ ప్రజలు గుమికూడుతున్నారు. నీరు పారుతున్న చోట నిలబడి మొబైల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటూ యువత సంబరాలు చేసుకుంటున్నారు. ఆగస్టు నెలలో చెరువు పొంగి ప్రవహించడంతో రైతులు ఉత్సాహంగా ఉన్నారు. తహసీల్దార్ నేత్రావతి, ఏపీఎంసీ అధ్యక్షుడు కావలి శివప్పనాయక్, చీఫ్ ఆఫీసర్ హెచ్.దాదాపీర్, చిన్న నీటిపారుదల శాఖ ఏఈ కోటేశ్వరరావు, రెవెన్యూ అధికారి ప్రభు చెరువును సందర్శించారు. కలబుర్గి పాలికె కాంగ్రెస్ కై వసం ●● అధ్యక్షురాలిగా వర్శజాన్ ● ఉపాధ్యక్షురాలిగా తృప్తిలాఖ్ రాయచూరు రూరల్: కలబుర్గి సిటీ కార్పొరేషన్ 23వ అధ్యక్షురాలిగా వర్శజాన్, ఉపాధ్యక్షురాలిగా తృప్తిలాఖ్లను ఎన్నుకున్నారు. గురువారం కలబుర్గి సిటీ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీల మధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసి అధికారం చేజిక్కించుకుంది. ఇందిరాగాంధీ స్మారక భవన్లో జరిగిన ఎన్నికకు ప్రాంతీయ కమిషనర్ జహీరా నసీమా ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ తరపున అధ్యక్షురాలిగా వర్శజాన్, ఉపాధ్యక్షురాలిగా తృప్తిలాఖ్ నామినేషన్లు వేశారు. బీజేపీ తరఫున అధ్యక్ష పదవికి గంగమ్మ, ఉపాధ్యక్ష పదవికి పార్వతి, జేడీఎస్కు చెందిన విజయలక్ష్మిరెడ్డి పోటీ పడ్డారు. అధ్యక్షురాలు వర్శజాన్ 36 ఓట్లు, ఉపాధ్యక్షురాలు తృప్తిలాఖ్ 33 ఓట్లుతో విజయం సాధించారు. ఆశా కార్యకర్తల డిమాండ్లు తీర్చండి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10 వేల చొప్పున వేతనం చెల్లించాలని ఆశా కార్యకర్తల సంఘం రాష్ట్రాధ్యక్షుడు సోమశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరిలో జరిగిన ఆందోళనలో రూ.10 వేల వేతనంతో పాటు అదనపు ఇన్సెంటివ్ భత్యాలు చెల్లిస్తామని చెప్పి 8 నెలలు గడుస్తున్నా నేటికీ సర్కార్ స్పందించక పోవడాన్ని తప్పు బట్టారు. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.వెయ్యి చొప్పున పెంచి ఆశా కార్యకర్తలకు పెంచక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం ఇచ్చే ఇన్సెంటివ్ భత్యాలకు తోడు రాష్ట్ర సర్కార్ రూ.10 వేల వేతనం, పదవీ విరమణ చేసిన వారికి రూ.50 వేల డిపాజిట్ మొత్తం చెల్లించాలని కోరారు. బార్ అసోసియేషన్కు ఎన్నిక సాక్షి, బళ్లారి: జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శిగా అన్సార్ బాషా ఎన్నికయ్యారు. గురువారం నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయంలో జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శిగా అన్సార్ బాషాను ఎన్నుకొన్నారు. గత ఏడాది జరిగిన జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సెక్రటరీ స్థానానికి పోటీ చేసిన అన్సార్ బాషాకు, బసవరాజుకు సమాన ఓట్లు రావడంతో మొదటి ఏడాది బసవరాజు జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శిగా కొనసాగేందుకు ఆమోదముద్ర వేసుకొని రెండో ఏడాది అన్సార్ బాషాను సెక్రటరీగా కొనసాగించాలని తీర్మానం చేయడంతో ఆమేరకు జిల్లా బార్ అసోసియేషన్, ప్రముఖ న్యాయవాదులు అందరూ కలిసి నూతన సెక్రటరీని ఎన్నుకొన్నారు. నూతన సెక్రటరీ అన్సార్ బాషా మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈసందర్భంగా సీనియర్ న్యాయవాది పాటిల్ సిద్దారెడ్డి, యూ.బసవరాజు తదితరులు పాల్గొని అభినందించారు. -
గడియారం కోసం విద్యార్థుల గొడవ
సాక్షి బళ్లారి: నమ్మశక్యం కాని ఓ అమానుష ఘటన విజయపుర జిల్లాలో జరిగింది. ఈ దారుణం పలువురిని కలచివేసింది. గడియారం కోసం జరిగిన గొడవలో తొమ్మిదో తరగతి విద్యార్థులు ఐదో తరగతి విద్యార్థిపై దాడి చేసి హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. విజయపుర నగర శివార్లలోని యోగాపురలో బిహార్కు చెందిన సునీల్, శృతి దంపతుల కుమారుడు హన్స్ అనే ఐదో తరగతి విద్యార్థిపై తొమ్మిదో తరగతి విద్యార్థులు దాడి చేశారు. అక్కడి సత్యసాయిబాబా పాఠశాలలో చదువుతున్న హన్స్పై తోటి విద్యార్థులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ముగ్గురు విద్యార్థులు హన్స్పై దారుణంగా దాడి చేయడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా విజయపురలో తీవ్ర కలకలం రేపింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని పలువురు పాఠశాల గేటు ముందు విద్యార్థి మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఐదో తరగతి విద్యార్థి దారుణ హత్య విజయపుర జిల్లాలో పెను విషాదం -
దొంగతో స్నేహం, పోలీసు సస్పెండ్
దొడ్డబళ్లాపురం: ఓ దొంగ చేష్టలు కానిస్టేబుల్కు కష్టాలను తెచ్చిపెట్టాయి. దొంగతో కలిసి ఒకే రూంలో బస చేసిన కానిస్టేబుల్ సస్పెండ్ అయిన సంఘటన బెంగళూరులోని గోవిందరాజపుర ఠాణా పరిధిలో జరిగింది. అదే ఠాణాలో కానిస్టేబుల్ హెచ్ఆర్ సోనార్ బాధితుడు. మోస్ట్ వాంటెడ్ దొంగ బాంబే సలీంను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతని మొబైల్లో పోలీస్ డ్రెస్ ధరించిన ఫోటోలు, వీడియోలు లభించాయి. ఇదెలా సాధ్యమని విచారించగా అసలు సంగతి చెప్పాడు. కానిస్టేబుల్ సోనార్ అద్దెకు ఉంటున్న గదిలో తాను కొన్ని రోజులు ఉన్నట్టు తెలిపాడు. సోనార్ యూనిఫాంను తాను ధరించి భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడినట్టు చెప్పాడు. దీంతో దొంగకు ఆశ్రయం ఇచ్చి విధి నిర్వహణకు ద్రోహం చేశాడని సోనార్ను డీసీపీ దేవరాజ్ సస్పెండ్ చేశారు. కాగా సలీం దొంగతనాలలో ఈ పోలీసు పాత్ర కూడా ఉండొచ్చని అనుమానాలు ఉన్నాయి. వ్యాపారిని బెదిరించి రూ.10 లక్షలు దోపిడీ మైసూరు: రాగి, ఇత్తడి వస్తువుల గుజరీ వ్యాపారిని నలుగురు దుండగులు బెదిరించి రూ.10 లక్షల నగదు దోచేసిన ఘటన మైసూరులోని ఎన్ఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. బెంగళూరులోని జయనగర నివాసి అబ్దుల్ ఆసిఫ్ బాధితుడు. తరచుగా మైసూరుకు వచ్చిన గుజరీని కొంటూ ఉంటాడు. ఇటీవల అఫ్సర్ఖాన్ పరిచయమయ్యాడు. 800 కేజీల స్క్రాప్ ఉంది, తక్కువకే ఇస్తామని ప్రలోభ పెట్టాడు. దీనిని నమ్మిన అబ్దుల్ లతీఫ్ బంధువు ముక్తియార్ పాషాను వెంట తీసుకుని ఓమ్ని వ్యాన్లో రూ.10 లక్షలతో మైసూరుకు వచ్చాడు. అఫ్సర్ఖాన్, అని ముఠా అతనిని తీసుకెళ్లి డబ్బు దోచుకున్నారు. బాధితుడు ఎన్ఆర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.మగ్గంపై ఆపరేషన్ సింధూర్ చీర దొడ్డబళ్లాపురం: పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడికి గుర్తుగా గదగ్ జిల్లాలో ఒక చేనేత కార్మికుడు తన నైపుణ్యాన్ని మేళవించి ఆపరేషన్ సింధూర్ పేరుతో చీర నేశాడు. గజేంద్రగఢ పట్టణ నివాసి. చేనేత కళాకారుడు చిన్నూర్ తన మగ్గం మీద ఆపరేషన్ సింధూర్ పేరుతో పట్టు చీరను తయారు చేశాడు. ఈ చీర అందరినీ ఆకర్షిస్తోంది. చీరమీద త్రివర్ణ పతాకంలోని మూడు రంగులతో యుద్ధ విమానాలను కూడా మలిచాడు. విషయం తెలిసి అనేకమంది మహిళలు తమకూ చీరలు కావాలని ఇక్కడికి వస్తున్నారు. ఒక చీరను రూ.2 వేల నుంచి రూ.5వేల వరకూ విక్రయిస్తున్నాడు. -
పరిశ్రమల బకాయిల చెల్లింపునకు చర్యలు
రాయచూరు రూరల్: నగరంలోని కాటన్ జిన్నింగ్ పరిశ్రమల్లో పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని చిన్న పరిశ్రమల శాఖ మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్ హామీ ఇచ్చారు. గురువారం బెంగళూరు వికాససౌధలో రాయచూరు కాటన్ జిన్నింగ్ పరిశ్రమల సంఘం పదాధికారులు హరివి నాగనగౌడ ఆధ్వర్యంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజును కూడా కలిసి చర్చించారు. జిల్లాలో 11 కాటన్ జిన్నింగ్ పరిశ్రమలు 2021–22 నుంచి పెండింగ్లో ఉన్న బకాయి డబ్బులను త్వరితగతిన ఇవ్వాలని శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. 2020–2025 నూతన పారిశ్రామిక చట్టం ప్రకారం కూడా నిధులను విడుదల చేస్తామని తెలిపారు. -
● పూజా సామగ్రి కోసం రద్దీ
● నేడు వరమహాలక్ష్మి పండుగ తుమకూరు: మహిళలకు అష్టైశ్వరాలు ఇవ్వాలని పూజలు చేసే వర మహాలక్ష్మి పండుగ నేడు శుక్రవారమే. ఈ నేపథ్యంలో సామగ్రి కొనుగోళ్లతో అన్ని నగరాలు, పట్టణాలలో బజార్లు కిటకిటలాడాయి. పూలు పండ్ల ధరలు భగ్గుమంటున్నా వెనుకాడకుండా కొనుగోలు చేశారు. తుమకూరు అంతరసంతహళ్లిలో ఉన్న పూలు పండ్ల మార్కెట్ ఉదయం నుంచి రాత్రి వరకు కిక్కిరిసింది. మహిళలు, యువతులు పెద్దసంఖ్యలో వచ్చి పూజా సామగ్రిని కొనుగోలు చేశారు. అమ్మవారి విగ్రహాలను, కొత్త బట్టలను, మిఠాయిలను కొన్నారు. -
స్కూటీ నడిపి.. చిక్కుల్లో పడ్డ డీకే.. అసలేంటీ వివాదం?
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అసలేం జరిగిందంటే.. మంగళవారం ఆయన హెబ్బాళ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సమయంలో కొత్త వంతెనపై స్కూటీలో వెళ్లారు. అయితే ఆ స్కూటర్పై 34 చలానాలు, రూ.18,500 జరిమానా ఉందని తేలింది. ఆ స్కూటీని డీసీఎం ఉపయోగించడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్ష నేతలు సైతం ఆయన ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారంటూ దుమ్మెతిపోశారు...దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా.. ఈ వీడియో కొద్దిసేపటికే వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ఆ స్కూటిపై ఇప్పటికే 34 చలాన్లు ఉన్నట్లు తేల్చారు. డీసీఎం నడిపిన స్కూటీపై (నంబర్ KA 04 JZ 2087) పలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ స్కూటీపై ట్రాఫిక్ పోలీసులు 34కి పైగా జరిమానాలు విధించగా.. రూ.18,500 వరకూ చెల్లించాల్సి ఉంది.The Hebbal flyover loop is set to open, easing traffic congestion and ensuring smoother and faster commutes as part of our government's commitment to building a better Bengaluru.#HebbalFlyover pic.twitter.com/HotJ61mUpx— DK Shivakumar (@DKShivakumar) August 5, 2025డీకే శివకుమార్ వీడియోపై సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది. ప్రతిపక్షాలు.. డీకేపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోస్ట్లతో హోరెత్తిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పబ్లిసిటీ కోసం రీల్స్పై దృష్టి పెట్టకుండా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలంటూ ప్రతిపక్ష నేతలు హితవు పలుకుతున్నారు. -
‘ఓట్ చోరీ’ కామెంట్స్లో ట్విస్ట్.. తప్పని తేలితే రాహుల్ గాంధీకి శిక్ష
సాక్షి,బెంగళూరు: బీజేపీ కోసమే కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓట్ చోరీ పేరుతో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో చూపించిన ఆధారాలు తప్పని తేలితే శిక్ష పడే అవకాశం ఉందని తెలుపుతూ కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం రాహుల్ గాంధీకి లేఖ రాసింది.మహరాష్ట్ర,కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఓట్ చోర్ పేరుతో గురువారం ఢిల్లీ ఇందిరా భవన్లో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో అక్రమాలు జరిగిన ఓటర్ల జాబితాను బహిర్ఘతం చేశారు. అయితే రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’ ఆరోపణల్ని కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా ఖండించారు. రాహుల్ వ్యాఖ్యలు నిరాధారమైనవి తెలిపింది. ఎన్నికల సంబంధించిన అంశాలను న్యాయం స్థానాన్ని ఆశ్రయించాలని సూచించింది.అదే సమయంలో రాహుల్ ఆరోపణలకు సంబంధించి అధికారిక డిక్లరేషన్, నకిలీ ఓటర్ల వివరాలను సమర్పించాలని కోరింది. తప్పుడు ఆధారాలు సమర్పిస్తే, 1950 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం శిక్ష పడే అవకాశం ఉందని లేఖలో హెచ్చరించింది. The Chief Electoral Officer of Karnataka confirmed a meeting with the INC delegation on August 8. In response to Rahul Gandhi’s remarks on alleged irregularities in the voter rolls, the CEO stated that electoral rolls were transparently shared in Nov 2024 and Jan 2025. No… pic.twitter.com/gRfO8Eq3Nd— IANS (@ians_india) August 7, 2025 ఆ నియోజకవర్గంలో లక్ష నకిలీ ఓట్లు.. ఆధారాలివే ‘సార్వత్రిక ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇచ్చిన కొన్ని నెలలకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఫలితాలు తారుమారువడంపై మాకు అనుమానం వచ్చింది. గతేడాది 48 మహారాష్ట్ర లోక్సభ స్థానాల్లో సీట్లలో 30 సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి.. కేవలం ఐదు నెలల తర్వాత జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో 50 మార్కును ఎందుకు దాటలేకపోయింది.మహరాష్ట్ర,కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కోసమే ఈసీ పనిచేసింది. అందుకు మా వద్ద అణుబాంబులాంటి ఆధారాలున్నాయి. మేం అంతర్గతం చేపట్టిన సర్వేలో కర్ణాటకలో ఇండియా కూటమి 16 ఎంపీ స్థానాలు గెలుస్తుందని తేలింది. కానీ తొమ్మిది స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఆ తర్వాత ఊహించని విధంగా ఓడిపోయిన ఏడు స్థానాలపై దృష్టి సారించాం. అలా బెంగళూరు సెంట్రల్ లోక్సభ సెగ్మెంట్లోని అసెంబ్లీ స్థానమైన మహదేవపురలో ఓటమికి గల కారణాల్ని అన్వేషించాం. బెంగళూరు సెంట్రల్ లోక్సభలో పోలైన మొత్తం ఓట్లు 6.26 లక్షలు. బీజేపీకి 6,58,915 ఓట్లు పోలవ్వగా.. 32,707 ఓట్ల తేడాతో గెలిచింది. ఇదే బెంగళూరు సెంట్రల్ లోక్సభలో మహదేవపుర అసెంబ్లీ స్థానాన్ని పరిశీలిస్తే.. ఓట్ల చోరీ జరిగినట్లు గుర్తించాం. మహదేవపురలో కాంగ్రెస్కు 1,15,586 ఓట్లు పోలవ్వగా.. బీజేపీ 2,29,632 ఓట్లు పోలయ్యాయి. బెంగళూరు సెంట్రల్లో సర్వజ్ఞనగర్,సీవీ రామ్ నగర్,శివాజీ నగర్,శాంతీ నగర్,గాంధీ నగర్,రాజాజి నగర్,చామ్రాజ్పేట అన్నీ అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ఒక్క మహదేవపురలో ఓడిపోయాం.ఈ మహదేవపుర అసెంబ్లీ నియోజక వర్గంలో ఐదు రకాలుగా 1,00,250 నకిలీ ఓట్లు గుర్తించాం. నకిలీ ఓటర్లు, నకిలీ, చెల్లని చిరునామాలు, ఒకే ఇంటి అడ్రస్తో పదుల సంఖ్యలో ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇది నిజమా? కాదా? అని నిర్దారించేందుకు ఆ ఇంటి చిరునామాలకు వెళ్లాం. ఆ ఇంటి అడ్రస్లో ఉన్న ఓట్లను పరిశీలిస్తే.. అన్నీ నకిలీవేనని తేలింది’ అని ఆరోపించారు. -
ఘనంగా సీమంతం..అంతలోనే విషాదం!
నెలలు నిండాయి, ఇటీవలే ఘనంగా సీమంతం వేడుక చేశారు. కొడుకో, కూతురో పుడితే ఇల్లంతా సందడిగా ఉంటుందని కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ వైద్యుల నిర్లక్ష్యం వారి ఆశలను తుంచేసింది.దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణంలోని తల్లీ బిడ్డ హైటెక్ ఆస్పత్రిలో ఘోరం చోటుచేసుకుంది. కాన్పు కోసం వచ్చిన మహిళ, కడుపులో శిశువు మృత్యువాత పడ్డారు. దీంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి, బిడ్డ కాటికి పోయారని ధర్నా చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. దొడ్డ తాలూకా సింగేనహళ్లి నివాసి సుశి్మత (24) మొదటిసారి గర్భం దాల్చింది. దొడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి చూపించగా 7న కాన్పు తేదీ ఇచ్చారు. అయితే మంగళవారంనాడు సుస్మితకు ఊపిరి ఆడడం లేదని కుటుంబీకులు ఆస్పత్రికి తీసకువచ్చారు. ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్ లేకపోవడంతో నర్స్ మాత్రలు ఇచ్చి ఏమీ కాదని చెప్పింది. దీంతో వారు ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చారు. బుధవారం పొద్దున హఠాత్తుగా సుశి్మత ఆరోగ్యం క్షీణించి మరణించింది. త్వరలో కాన్పు అయి పండంటి బిడ్డను చూస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్న భర్త, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. వైద్యుల న్లిక్ష్యం, సమయానికి డాక్టర్ లేకపోవడం వల్లే గర్భిణి, కడుపులోని బిడ్డ చనిపోయారని దుయ్యబట్టారు. తరువాత పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.బెంగళూరులో బాలింత.. యశవంతపుర: రాష్ట్రంలో మాతా శిశు మరణాలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రసవమైన గంటలో బాలింత మరణించిన ఘటన బెంగళూరులో జరిగింది. బాలింత మృతికి వైద్యుల అలసత్వం కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నగరంలోని కోణనకుంట క్రాస్లోని అస్ట్రాం ఆస్పత్రిలో మంగళవారం మండ్యకు చెందిన తను (23) అనే గర్భిణి ప్రసవం కోసం చేరింది. వైద్యులు తనుకు సిజేరియన్ కాన్పు చేశారు. గంట తరువాత తను పరిస్థితి విషమించి కన్నుమూసింది. పుట్టిన గంటకే శిశువు అనాథ అయ్యింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు. -
దర్శన్, పవిత్ర బెయిలు బంతి.. సుప్రీంకోర్టులో
యశవంతపుర: రేణుకాస్వామి హత్య కేసులో నిందితులు నటీనటులు దర్శన్, పవిత్రాగౌడ బెయిల్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది. బెయిలు రద్దు చేయరాదని ఇరువురి తరఫు వకీళ్లు లిఖితపూర్వకంగా వాదనలను సమర్పించారు. హైకోర్టు ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడం తెలిసిందే. ఇరువైపులా న్యాయవాదుల బలమైన కారణాలను పేర్కొన్నారు. అసలు రేణుకాస్వామిని అపహరించినట్లు, హత్య చేసినట్లు దర్శన్పై ఎలాంటి ఆధారాలు లేవని ఆయన లాయర్లు పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ వాదనలు ఇలా ప్రభుత్వ న్యాయవాదుల వాదనల్లో.. మృతుడు రేణుకాస్వామి దర్శన్ అభిమాని. దర్శన్ పవిత్రాగౌడతో సహజీవనం చేస్తున్నాడని కోపగించి అవహేళన సందేశం పంపాడని రేణుకాస్వామిని అపహరించి బెంగళూరులో పట్టణగెరె వద్ద ఒక షెడ్డులో హత్య చేశారు. నిందితులందరూ హత్య చేసిన స్థలంలో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్కడి మట్టి నమూనాలు అందరి పాదరక్షలలోను ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది అంటూ పలు కారణాలను పేర్కొన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. -
అంజన్న సన్నిధిలో గవర్నర్
సాక్షి,బళ్లారి: కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అంజనాద్రిలో వెలసిన శ్రీఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. బుధవారం ఆయన కుటుంబ సమేతంగా శ్రీఆంజనేయ స్వామి జన్మస్థలమైన అంజనాద్రిలో శ్రీఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. అంజనాద్రి కొండలో 575 మెట్లను గవర్నర్ 30 నిమిషాల్లో ఉల్లాసంగా పైకెక్కి, శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాధికారి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అంజనాద్రి కొండ పైనుంచి 30 నిమిషాల్లోనే ఉల్లాసంగా కిందికు దిగారు. కాగా గవర్నర్ రాకతో అంజనాద్రి పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హంపీ, టీబీడ్యాంల సందర్శన హొసపేటె: కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్, తమ కుటుంబ సభ్యులతో కలిసి విజయనగర జిల్లాలోని హంపీతో పాటు పరిసరాల్లో ఉన్న చారిత్రాత్మక ఆలయాలు, స్మారకాలను, తుంగభద్ర డ్యాంను బుధవారం సందర్శించారు. హంపీలో ఉన్న రాయల కాలం నాటి హంపీ విరుపాక్షేశ్వర ఆలయం, ఉగ్ర నరసింహ, ఏకశిలా రాతి రథం, విఠల దేవాలయం, లోటస్ మహల్, మహానవమి దిబ్బ, హజారరామ దేవస్థానం తదితర సుందర స్మారకాలు, కట్టడాలను వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాధికారి ఎంఎస్ దివాకర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 30 నిమిషాల్లో అంజనాద్రి కొండను ఎక్కిన గెహ్లాట్ ఆలయ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు -
ఘనంగా శ్రీనివాసరెడ్డి కుమారుడి వివాహం
సాక్షి,బళ్లారి: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) డైరెక్టర్ బీ.వీ.శ్రీనివాసరెడ్డి కుమారుడు నాగార్జునరెడ్డి వివాహం జాహ్నవితో ఘనంగా జరిగింది. బుధవారం నగరంలోని సిరుగుప్ప రోడ్డులోని శ్రీనగర్ కాలనీలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన పెళ్లి పందిరిలో వేదమంత్రోచ్ఛాటనల మధ్య సంప్రదాయబద్ధంగా పెళ్లిని ఘనంగా నిర్వహించారు. వివాహ వేడుకకు కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, ఆయన సతీమణి గాలి లక్ష్మీఅరుణ, బళ్లారి నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యేలు మెట్టు గోవిందరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి కాపు భారతీ, మాజీ మంత్రి బీ.శ్రీరాములు, సీనియర్ న్యాయవాది పాటిల్ సిద్ధారెడ్డి, తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వేడుకకు హాజరైన పలువురు ప్రముఖులు అనంతపురం, కర్నూలు జిల్లాల వైఎస్సార్సీపీ నేతలు -
మార్కెట్లకు వరమహాలక్ష్మి పండుగ కళ
దసరా గజరాజులకు రూ.2 కోట్ల బీమా మైసూరు: ఈసారి విజృంభణగా జరుగనున్న నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవంలో పాల్గొనేందుకు అడవి నుంచి రాచనగరి మైసూరుకు విచ్చేసిన కెప్టెన్ అభిమన్యు నేతృత్వంలోని ఏనుగులు, మావటీలు, కాపలాదారులు, అటవీ సిబ్బందికి రూ.2.04 కోట్ల బీమాను చేయించారు. దసరా మహోత్సవంలో పాల్గొననున్న 14 ఏనుగులు, మొత్తం 43 మందికి బీమా సౌకర్యం కల్పించారు. గజపయనతో జంబూసవారీని పూర్తి చేసి మళ్లీ అడవికి వెళ్లేవరకు బీమా సౌకర్యం అమలులో ఉంటుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి రూ.67 వేల ప్రీమియంని చెల్లించింది. కెప్టెన్ అభిమన్యుతో పాటు అన్ని మగ ఏనుగులకు మొత్తం రూ.50 లక్షల బీమా చేయించారు. ఆడ ఏనుగులకు రూ.18 లక్షలు బీమా చేయించారు. మావటీలు అటవీ సిబ్బంది, పశువైద్యాధికారులకు కలిపి రూ.86 లక్షల బీమా చేయించారు. ఇంకా దసరా ఏనుగులతో ప్రజలకు ఇబ్బందులు కలిగితే, ఆస్తిపాస్తులకు నష్టం వాటిల్లితే బాధితులకు రూ.50 లక్షల బీమా పరిహారం లభిస్తుంది. బనశంకరి: శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినాలలో ఒకటైన వర మహాలక్ష్మీ పండుగకు బెంగళూరు, మైసూరు తదితర నగరాలలో సందడి నెలకొంది. అమ్మవారి విగ్రహాలు, అలంకార సామగ్రి, పూలు పండ్లు, వస్త్రాలు తదితరలకు గిరాకీ ఏర్పడింది. షాపులు, మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. బుధవారం బెంగళూరు నగర బజార్లు సందడిగా మారాయి. వరమహాలక్ష్మీ పండుగ సందర్బంగా ఇళ్లలో లక్ష్మీ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయడం ఆనవాయితీ. మార్కెట్లు కిటకిట ధరలు భగ్గుమంటున్నా పూజా సామగ్రి కొనుగోళ్ల కోసం బుధవారం బెంగళూరు నగరంలోని వివిధ మార్కెట్లకు నగరవాసులు తరలివచ్చారు. కేఆర్ మార్కెట్ జనసంద్రమైంది. మల్లేశ్వరం, గాంధీబజార్, యశవంతపుర, మడివాళ, బనశంకరి, సారక్కి, మాగడి రోడ్డు, కృష్ణరాజపురం మార్కెట్లు జనంతో నిండిపోయాయి. పూలు, పండ్లు, అరటి పిలకలు, పూజా సామాగ్రి, అలంకరణ వస్తువులకు గిరాకీ ఉంది. కనకాంబరాలు కేజీ రూ.2 వేలు సేమంతి పూలు మూర రూ.100 నుంచి 180, యాపిల్ పండ్లు కిలో రూ.120 నుంచి 160, ద్రాక్ష రూ.200, సీతాఫలం రూ.120, దానిమ్మ రూ.120, అరటి పిలకలు జత రూ.20 , యాలక్కీ అరటిపండ్లు కిలో రూ.120–140 వద్ద ఉన్నాయి. కనకాంబరాలు కిలో రూ. 2 వేలు, మల్లెలు రూ.500 నుంచి 800, కాకడాలు రూ.700, తామరలు రూ.100, సునామి రోజ్ రూ.150, సుగంధరాజ రూ.250 వరకూ పలుకుతున్నట్లు కేఆర్.మార్కెట్ వ్యాపారులు తెలిపారు. రమ్య పోస్టుల కేసులో కొప్పళవాసి అరెస్టు యశవంతపుర: శాండల్వుడ్ నటి, మాజీ ఎంపీ రమ్యకు అశ్లీల సందేశాలు పంపిన కేసులో కొప్పళకు చెందిన మంజునాథ్ను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఇదివరకే రాజేశ్, ఓబణ్ణ, గంగాధర్, భువన్ అనేవారిని అరెస్ట్ చేశారు. 43 మందిపై ఆమె ఫిర్యాదు చేయగా, 15 అకౌంట్లను గుర్తించి ఐదు మందిని అరెస్ట్ చేశారు. చిక్కమగళూరు, కోలారు జిల్లా నుంచి ఎక్కువ మంది అశ్లీల సందేశాలను పంపినట్లు తేలింది. కొందరు నిందితులు ఐపీ అడ్రస్లను బ్లాక్ చేసి ఇళ్లు వదిలి పరారయ్యారు. అసభ్య పోస్టులకు మద్దతుగా కామెంట్లు చేసినవారందరూ రమ్యకు క్షమాపణలు చెప్పారు. నలుగురికి వీధికుక్కల కాట్లు మైసూరు: ఎక్కడ చూసినా వీధికుక్కల గోల ఎక్కువైంది. ఒకే రోజులో నలుగురిని కరిచిన ఘటన చామరాజనగర జిల్లా హనూరు తాలూకా చెన్నాలింగనహళ్లి గ్రామంలో జరిగింది. గ్రామ నివాసులు మహేష్ (44), వెంకటయ్య (70), సిద్దయ్య (50), బాలుడు చందన్ (12)లు వీధికుక్కల కాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు. గ్రామంలో వీధికుక్కల బెడద అధికం కావడంతో పిల్లలు, వృద్ధులు భయం భయంగా తిరగాల్సి వస్తోంది. వాటి బెడదను నివారించాలని గ్రామస్తులు కోరారు. మావటీలు, అటవీ సిబ్బందికి సైతం డీసీఎం నడిపిన స్కూటర్ చలానాల పుట్టశివాజీనగర: డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ మంగళవారం హెబ్బాళ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సమయంలో కొత్త వంతెనపై స్కూటీలో వెళ్లారు. అయితే ఆ స్కూటర్పై 34 చలానాలు, రూ.18,500 జరిమానా ఉందని తెలిసింది. అలాంటి స్కూటర్ను డీసీఎం ఉపయోగించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి స్కూటర్ని డీసీఎం పర్యటనలో ఎవరు ఉంచారనేది తేలాల్సి ఉంది. అమ్మవారి ప్రతిమలకు, పూలు పండ్లకు గిరాకీ -
మరుగుదొడ్డిలో చిరుత ప్రత్యక్షం
సాక్షి,బళ్లారి: హావేరి జిల్లాలోని రాణిబెన్నూరులో ఓ వ్యక్తి ఇంట్లోని మరుగుదొడ్డిలో చిరుత ప్రత్యక్షం కావడంతో ఇంటివాసులు ఒక్కసారిగా భయాందోళన చెంది ఉరుకులు, పరుగులు తీశారు. బుధవారం ఉదయం హావేరి జిల్లా రాణిబెన్నూరు పట్టణంలోని పి.టీకాకి అనే వ్యక్తి ఇంట్లో మరుగుదొడ్డిలో చిరుత కూర్చొని ఉండటంతో కుటుంబానికి చెందిన వారు తీవ్ర భయాందోళన చెందారు. అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే రంగంలోకి దిగి 8 గంటల పాటు కార్యాచరణ చేపట్టి చివరకు చిరుతను బోనులో బంధించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. భయాందోళనతో ఇంటివాసులు ఉరుకులు పరుగులు 8 గంటల కార్యాచరణ తర్వాత చిరుతను బంధించిన వైనం -
కలబుర్గిలో లవ్జిహాద్?
● వారం నుంచి బీఎస్సీ విద్యార్థిని మిస్సింగ్ దొడ్డబళ్లాపురం: కలబుర్గిలో బీఎస్సీ చదివే యువతి అదృశ్యం కాగా, లవ్ జిహాద్ కారణమని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కలబుర్గి తాలూకా గొబ్బుర గ్రామ నివాసి, జైన్ మతానికి చెందిన యువతి గత నెల 30 నుంచి కనబడకుండాపోయింది. ఈమె కలబుర్గి నగరంలో ఒక కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. కళాశాలకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఆ యువతి అదే గ్రామానికి చెందిన మషాక్ అనే యువకునితో చనువుగా ఉండేదని, అతనితో మొబైల్ఫోన్లో చాటింగ్ చేసేదని తెలిసింది. విషయం తెలుసుకున్న హిందూ సంఘాల కార్యకర్తలు ఇది కచ్చితంగా లవ్ జిహాద్ అని, కుట్రలో భాగంగానే యువతిని ట్రాప్ చేసి తీసికెళ్లాడని ఆరోపిస్తున్నారు. గుల్బర్గ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నాశనం చేశారు: తండ్రి బాలిక తండ్రి మహావీర్ జైన్ మాట్లాడుతూ తమ కూతురు అదృశ్యమై 8 రోజులు గడిచినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని, ఆమె ఎక్కడ ఉందోనని ఆవేదన చెందాడు. పోలీసులు సక్రమంగా గాలించడం లేదు, ఇది లవ్జిహాద్ కుట్రగా అనుమానం ఉంది, నా కూతురు జీవితం నాశనమైపోయింది అని విలపించాడు. హిందూ సంఘాల నేతలు మాట్లాడుతూ మషాక్తో పాటు మరికొందరు మరో వర్గం అమ్మాయిలను ప్రేమపేరుతో అదృశ్యం చేస్తున్నారని, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మిత్రుని భార్యను చంపి, ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: మహిళను గొంతుకోసి హత్య చేసిన హంతకుడు, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన బెంగళూరు హెబ్బగోడి సమీంలోని తిరుపాళ్యలో జరిగింది. మందిర మండల్ (27) అనే మహిళను సుమన్ మండల్ (28)అనే వ్యక్తి గొంతుకోసి హత్య చేసి , ఉరివేసుకున్నాడు. వివరాలు.. వీరిద్దరూ పశ్చిమ బెంగాల్కు చెందినవారని తెలిసింది. 8 ఏళ్ల క్రితం మందిర మండల్కు బిజోస్ మండల్ అనే వ్యక్తితో పెళ్లయి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఆమె భర్తను వదిలేసి ఆనేకల్ వద్ద తిరుపాళ్యలో నివసించేది. నిందితుడు సుమన్ మండల్ మందిర భర్తకు స్నేహితుడు. ఇద్దరి మధ్య అనైతిక సంబంధం ఉన్నట్లు అనుమానాలున్నాయి. 15 రోజుల నుంచి ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. మంగళవారం ఏదో విషయమై గొడవ చెలరేగింది. దీంతో కత్తితో గొంతు కోసి చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. హెబ్బగోడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పంచాయతీ ఉద్యోగి గల్లంతు యశవంతపుర: రోడ్డుకు అడ్డంగా ప్రవహిస్తున్న వాగును దాటడానికి ప్రయత్నించిన బైకిస్టు కొట్టుకుపోయిన ఘటన బెళగావి సమీపంలోని తారిహళ వద్ద జరిగింది. తారిహళ పంచాయతి ఉద్యోగి సురేశ్ నిజగుణి గుండన్నవర్ (50) నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పంచాయతీలో పని ముగించుకొని మంగళవారం రాత్రి బైకుపై ఇంటికి వెళుతుండగా వర్షం వల్ల రోడ్డు మీద వాగు ప్రవహిస్తోంది. దాటబోతూ ఉధృతికి కొట్టుకుపోయాడు. సురేశ్ కోసం గ్రామస్థులు వెతికినా జాడ లేదు. బుధవారం ఫైర్ సిబ్బంది వెతకడం ప్రారంభించారు. -
ఆక్రమణల చెరలో మావినకెరె
రాయచూరు రూరల్: నగరంలోని మావినకెరె చెరువు ఆక్రమణల పాలవుతోంది. చారిత్రక ప్రసిద్ధి చెందిన చెరువును ఇష్టమొచ్చినట్లు కబ్జాదారులు ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నారు. మరోవైపు వాటిని ప్లాట్లుగా మార్చుకొని విక్రయాలు జరిగాయి. ఈ విషయంలో నగరసభ, జిల్లా పాలక మండలి, నగర అభివృద్ధి ప్రాధికార అధికారులు మౌనం వహించారు. 107 ఎకరాల్లో ఉన్న మావినకెరె చెరువు కేవలం ఐదు ఎకరాలకు పరిమితమైంది. మాజీ నగరసభ సభ్యులు, కాంట్రాక్టర్లు, బడా నాయకులు ఏకమై మావినకెరె చెరువును కబ్జా చేసుకొని దాని రూపు రేఖలను మార్చివేస్తున్నారు. బలమున్న వాడిదే అధికారం అన్నట్లు ఇష్టమొచ్చినట్లు ఆక్రమణలకు గురవుతున్నా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువు పరిధిలో ఉన్న చెత్త చెదారం, మట్టి, రాళ్లు వేసి వాటిని కప్పి దానిని ఆక్రమించి ఇతరులకు విక్రయాలు చేస్తున్నారు. చెరువు అభివృద్ధికి ఆర్డీఏ నుంచి రూ.12 కోట్ల నిధులు విడుదల చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇందిరా నగర్, ఐడీఎస్ఎంటీ కాలనీల నుంచి మురుగు కాలువల ద్వారా మురుగు నీరు చెరువులోకి కలుస్తున్నాయి. -
వృద్ధుడు డిజిటల్ అరెస్టు రూ.1.77 కోట్ల వసూలు
బనశంకరి: బెంగళూరుతో సహా పలు నగరాలలో మళ్లీ డిజిటల్ అరెస్టుల స్కాములు ఊపందుకున్నాయి. డబ్బున్న వృద్ధులనే లక్ష్యం చేసుకుంటున్నారు. మైసూరులో ఓ వృద్ధురాలిని బెదిరించి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. అంతలోనే ముంబై పోలీసుల పేరుతో వృద్ధున్ని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్చేసి రూ.1.77 కోట్లు దోచేశారు. జెట్ ఎయిర్వేస్ పేరుతో.. బెంగళూరు నగరంలోని సదానందనగర ఎన్జీఈఎఫ్ లేఔట్ నివాసి జీ.వసంత్కుమార్ (81) బాధితుడు. వివరాలు.. గత నెల 5 తేదీన సైబర్వంచకుడు సందీప్జాదవ్ అనే వ్యక్తి ముంబై కోలాబా పోలీసుల పేరుతో వసంత్కుమార్ కి ఫోన్ చేసి మీ ఆధార్ నెంబరు నుంచి జెట్ ఎయిర్వేస్ సంస్థ యజమాని నరేశ్ గోయల్ అక్రమంగా కోట్లాది రూపాయల నగదు బదిలీ చేశారని బెదిరించాడు. విచారణ పూర్తయ్యేవరకూ బయటకు వెళ్లరాదని, ఎవరికీ చెప్పరాదని జూలై 9 తేదీ నుంచి 15 తేదీ వరకు ఇంట్లోనే డిజిటల్ అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వీడియోల్ కాల్లో ఉన్నారు. వాట్సాప్లో నకిలీ అరెస్ట్ వారెంట్ను చూపించి భయపెట్టారు. దుండగుల డిమాండు మేరకు తన ఐదు బ్యాంకు అకౌంట్ల వివరాలు తెలిపాడు. మీ అకౌంట్లలో ఉన్న నగదును వేరే ఖాతాకు బదిలీ చేస్తున్నట్లు చెప్పి రూ.1.77 కోట్లను తమ ఖాతాల్లోకి పంపించారు. విచారణ పూర్తి కాగానే నగదును మీ అకౌంట్లోకి వేస్తామని చెప్పి కాల్ను కట్ చేశారు. కొన్నిరోజుల తరువాత తన అకౌంట్లోకి నగదు బదిలీ అయ్యిందా అని చూడగా లేదు, దీంతో దుండగులకు కాల్ చేయగా కనెక్ట్ కాలేదు. మోసపోయినట్లు గుర్తించిన వసంత్కుమార్ తూర్పు విభాగం సైబర్ క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సైబర్ నేరగాళ్ల ఫోన్ నంబర్లు, ఖాతాల సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బెంగళూరులో బడా సైబర్ నేరం -
ఆరాధనోత్సవాలకు ముస్తాబు
రాయచూరు రూరల్ : మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వాముల మఠంలో రాఘవేంద్ర స్వాముల 354వ ఆరాధనోత్సవాలు ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు జరుగనున్నాయి. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం ముస్తాబైంది. మంత్రాలయంలో రాఘ వేంద్రస్వామి ఆరాధనోత్సవాలు, సప్తరథోత్సవాలు జరుగుతాయి. 10న పూర్వారాధన, 11న మధ్యారాధన, 12న ఉత్తరాధన జరగనున్నాయి. పూర్వారాధనలో రాఘవేంద్ర స్వామి అనుగ్రహ అవార్డులను ఉత్తర్ప్రదేష్లోని కాశీ పీఠం విద్వాంసుడు రాజారామ్ శుక్లాకు, తమిళనాడుకు చెందిన విఠల్లకు అందిస్తారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించారు. పుష్కరిణిలో రాయల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపేలా మఠాన్ని అలంకరించారు. ఆరాధనోత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. రేపటి నుంచి మంత్రాలయంలో శ్రీకారం 14వ తేదీ వరకు పలు ప్రత్యేక పూజలు -
ఈ ఏడాదిలోనే జెడ్పీ, టీపీ ఎన్నికలు
హుబ్లీ: జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలను ఈ ఏడాదిలో గ్యారెంటీగా నిర్వహిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే హామీ ఇచ్చారు. స్థానిక విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సదరు ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ జరుగుతోంది. రెండు, మూడు నెలల్లో నోటిఫికేషన్ వెల్లడిస్తామని ఆయన తెలిపారు. రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు చేసిన ప్రతిపాదనను అంగీకరించాం. అయితే అంతర్గత ప్రక్రియ సాగుతోంది. ఈ ఏడాదిలోనే తాలూకా పంచాయతీ, జిల్లా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. సవదత్తి పాఠశాలలో నీటి ట్యాంకర్లో విషం కలిపిన ఘటనపై ఆయన మాట్లాడుతూ యూజీపీ, ఆర్ఎస్ఎస్ విష బీజాలు నాటే పనిని చేస్తున్నాయి. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి బదిలీ కోసం విషం కలిపారన్నారు. విషం కలిపింది ఎవరో తెలుసు. ఈ విషయంలో బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు. వారు ఎక్కడ దాక్కున్నారు? మత విష బీజాలు నాటిన ఫలితంగా పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చిన్నారులను బలి తీసుకుంటున్నారు. అసలు వీరు మనుష్యులేనా? ఈ విషయంలో బీజేపీ నేత ఆర్.అశోక్, బసవరాజ్ బొమ్మై, అరవింద బెల్లదలనే ప్రశ్నించండి అంటూ ఆయన మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నులు వేసినా కాంగ్రెస్ సమాధానం ఇవ్వాలి. సుప్రీంకోర్టు ప్రకటనపై కూడా కాంగ్రెస్ సమాధానం ఇవ్వాలి. శ్రీరామ సేన, ఆర్ఎస్ఎస్ ఏమి చేసినా కాంగ్రెస్ సమాధానం ఇవ్వాలంటే బీజేపీ నేతలు నోటికి తాళం వేసుకున్నారా? అని బీజేపీ నేత తీరుపై ఖర్గే నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు మండిపడిన విషయమై మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీలే చెబుతున్నారు. చైనా 50, 60 కిలోమీటర్ల మేర మనదేశంలోకి ఆక్రమించింది. సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా ఇదే చెబుతున్నారు. అయినా కూడా నమ్మడం లేదన్నారు. దేశద్రోహులు ఎవరు అన్న సర్టిఫికెట్ తీసుకోవాలా? అని నిలదీశారు. బాగలకోటె జిల్లాలో ఓ విద్యార్థిపై ఉపాధ్యాయిని చేసిన కులదూషణ కేసులో ప్రభుత్వ ఉద్యోగులే అయినా వేరే ఎవరైనా కానీ కులదూషణకు పాల్పడే హక్కు ఎవరికీ లేదన్నారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే భరోసా -
విశ్రాంత సైనికుడికి ఘన స్వాగతం
హుబ్లీ: భారతీయ నౌకా సేనలో గత 15 ఏళ్లుగా సేవలు అందించి పదవీ విరమణ పొంది స్వగ్రామానికి విచ్చేసిన వీరయోధుడికి హావేరి జిల్లా మాజీ సైనికుల సంఘం ఘనంగా స్వాగతం పలికింది. హళేరిత్తి గ్రామానికి చెందిన బసవరాజ నింగప్ప వాలికార్ నౌకాసేనలో 15 ఏళ్లు విధులు నిర్వహించి మంగళవారం హావేరీకి వచ్చారు. ఈయనను మాజీ సైనికుల కార్యాలయం నుంచి హొసమనె సిద్దప్ప సర్కిల్ వరకు ఓపెన్ జీప్లో ఊరేగించి ఘనంగా స్వాగతం పలికారు. సదరు జీపు నిండా పూల అలంకరణ స్థానికులను ఆకట్టుకుంది. దేశభక్తి గీతాలను దారి పొడవున ఆలపించారు. చివరిగా యోధుడికి స్థానికులు ఘనంగా సెల్యూట్ చేసి గౌరవ వందనం సమర్పించారు. మరికొందరు పూలదండలు, కరచాలనాలతో ఆత్మీయంగా సైనికుడికి స్వాగతం పలికారు. కాగా ఆ సైనికుడు వివిధ విభాగాల్లో సేవలను అందించారని అందరూ గుర్తు చేసుకొన్నారు. కాగా సదరు సైనికుడు మాట్లాడుతూ ప్రతి భారతీయుడు కొంత కాలం తప్పనిసరిగా సైన్యంలో పని చేయాలన్నారు. నేటి యువకులు దేశభక్తిని కేవలం సోషల్ మీడియాకే పరిమితం చేశారన్నారు. నిజమైన దేశభక్తిని చూపించేందుకు సైన్యంలో చేరాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. -
బుద్ధి మాటలు చెప్పినందుకు వ్యక్తికి కత్తిపోట్లు
హుబ్లీ: బుద్ధి మాటలు చెప్పినందుకు ఓ వ్యక్తిపై ఇద్దరు కలిసి జమాతె సభ్యుడిపై దాడి చేయడమే కాకుండా చాకుతో పొడిచిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. పాత హుబ్లీ తిమ్మసాగర రోడ్డు బేపారి ఫ్లాట్లో జమాతె సభ్యుడు మహమ్మద్ సాధిక్ కత్తిపోట్లకు గురైన వ్యక్తి. కేఎంసీ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మహమ్మద్ సాధిక్ మొహర్రం కిచడీ కార్యక్రమంలో అల్తాఫ్, అఫ్తాబ్లకు బుద్ధి మాటలు చెప్పినందుకుగాను సదరు యువకులు అక్కసుతో అందరూ కలిసి చర్చిస్తుండగా ఈ ఇద్దరు నిందితులు ఉన్నఫళంగా మహమ్మద్ సాధిక్పై దాడి చేసి కత్తితో పొడిచినట్లు పాత హుబ్లీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఎయిమ్స్ ఏర్పాటు కోసం ధర్నా రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఎయిమ్స్ పోరాట సమితి అధ్యక్షుడు బసవరాజ కళస డిమాండ్ చేశారు. బుధవారం మహాత్మగాంధీ క్రీడా మైదానంలో 1189వ రోజుకు చేరిన ఆందోళన సభలో ఆయన మాట్లాడారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, లోక్సభ సభ్యులు ప్రధానమంత్రితో చర్చించి రాయచూరుకు ఎయిమ్స్ను కేటాయించేలా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో మౌనం వహించకుండా కేంద్ర, రాష్ట్ర సర్కార్లపై ఒత్తిడి తెచ్చి గళం విప్పాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య హుబ్లీ: కుందగోళ–సంశి రైల్వే స్టేషన్ల మధ్య రైలు మార్గంలో వంతెన ఇనుప కమ్మీకి వైరుతో ఉరి వేసుకొని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 55 ఏళ్ల వయస్సు ఉన్న 5.1 అడుగుల ఎత్తు, గోధుమ రంగు శరీరఛాయ, బక్క పలచని శరీరం కలిగి, కోల ముఖంతో ఉన్న ఈ మృత వ్యక్తి వారసులు ఎవరైనా ఉంటే లేదా ఇతడి గురించి ఎవరికై నా సమాచారం తెలిసి ఉంటే రైల్వే పోలీసులను సంప్రదించాలని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో కోరారు. ఎత్తిపోతల పథకం పరిశీలన రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా గుంజళ్లి వద్ద రూ.146 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకంతో 9 చెరువులకు తుంగభద్ర నది నీటిని వినియోగించుకోవచ్చని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ పేర్కొన్నారు. బుధవారం చిక్కమంచాలి, బుళ్లాపుర గ్రామాల వద్ద నిర్మాణం చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. బంగారప్ప చెరువుకు తుంగభద్ర నది నీటిని, గుంజళ్లి బసవప్ప చెరువుకు కృష్ణా నది నుంచి నీటిని నింపి వ్యవసాయ భూములకు సాగునీరు అందించడానికి వీలు కల్పించామన్నారు. ఫిట్ ఇండియా సైకిల్ జాతా రాయచూరు రూరల్: రాయచూరులో బుధవారం ఫిట్ ఇండియా సైకిల్ జాతాను నిర్వహించారు. ప్రధాన తపాలా శాఖాధికారి కార్యాలయం వద్ద తపాల శాఖ అదనపు సూపరింటెండెంట్ ఆనంద్ పచ్చజెండా ఊపి జాతాకు శ్రీకారం చుట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గుండా సంచరించిన ఫిట్ ఇండియా జాతాలో తపాల శాఖ ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నీట్లో మెరిసిన విద్యార్థులు రాయచూరు రూరల్: రాయచూరులోని ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం విద్యార్థులు నీట్లో అద్వితీయ సాధన చేశారు. యూజీసీ నిర్వహించిన నీట్ పరీక్షలో ఆర్థిక శాస్త్రంలో వీరేష్ పద్మరాజ నాయక్, ప్రకాష్ రెండో ఏడాది కాగా జీఆర్ఎఫ్లో కన్నడ విభాగంలో ప్రథమ ఏడాది శ్రీదేవి, బసవలింగప్ప, పీహెచ్డీ విభాగంలో మంజుల, రాజనీతి శాస్త్ర విభాగంలో వెంకటేష్ ఉత్తీర్ణులైనట్లు వైస్ చాన్సలర్ శివానంద కెళగినమని తెలిపారు. భవిష్యత్తులో అధ్యాపకులు కావడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని రిజిస్ట్రార్ చెన్నప్ప తెలిపారు. -
ధర్మస్థల 14వ పాయింటులో మలుపు
బనశంకరి: ప్రసిద్ధ పుణ్యస్థలి ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలు, పూడ్చివేతలపై సిట్ అధికారులు, పోలీసులు బుధవారం 14 వ పాయింట్లో గాలించారు. బంగ్లా గుడ్డలో నల్లముసుగు ఫిర్యాదిదారు గతంలో చూపించిన స్థలాన్ని కాదని మరో స్థలానికి సిట్ అధికారులను తీసుకెళ్లాడు. అక్కడ నేల మీద అనేక అస్థి పంజరాలు కనిపించగా స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సామూహికంగా ఆత్మహత్య చేసుకుని ఉంటారని, అందుకే నేల మీదనే అస్థిపంజరాలు పడిఉన్నాయని అనుమానాలు వ్యక్తంచేశారు. దీని గురించి దర్యాప్తు చేపట్టాలా వద్దా అని గందరగోళంలో సిట్ అధికారులు ఉన్నారు. సస్పెన్స్గా ఉన్న 13 వ పాయింట్ ఖాళీగా కనిపించింది. ఇప్పటివరకు పరిశీలించిన 13 స్థలాలతో పాటు 14 వ పాయింట్ లో కూడా తవ్వకాలు చేస్తున్నారు. నల్లముసుగు వ్యక్తి 17 స్థలాల్లో మృతదేహాలను పాతిపెట్టినట్లు సిట్కు తెలిపాడు. అటవీ మంత్రి స్పందన దొడ్డబళ్లాపురం: ధర్మస్థలలోని రిజర్వ్ ఫారెస్ట్లో శవాలను పూడ్చిపెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె తెలిపారు. సిట్ దర్యాప్తు, శవాల వెలికితీత పనులు పూర్తయ్యాక ఈ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. రిజర్వ్ ఫారెస్ట్లో మృతదేహాలను పూడ్చిపెట్టడం నేరమన్నారు. ఇందులో నిర్లక్ష్యం చూపిన అటవీశాఖ అధికారులపైనా చర్యలు తప్పవన్నారు. నేల మీదనే కొన్ని అస్థిపంజరాలు లభ్యం -
బెంగళూరులో బాలింత..
యశవంతపుర: రాష్ట్రంలో మాతా శిశు మరణాలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రసవమైన గంటలో బాలింత మరణించిన ఘటన బెంగళూరులో జరిగింది. బాలింత మృతికి వైద్యుల అలసత్వం కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నగరంలోని కోణనకుంట క్రాస్లోని అస్ట్రాం ఆస్పత్రిలో మంగళవారం మండ్యకు చెందిన తను (23) అనే గర్భిణి ప్రసవం కోసం చేరింది. వైద్యులు తనుకు సిజేరియన్ కాన్పు చేశారు. గంట తరువాత తను పరిస్థితి విషమించి కన్నుమూసింది. పుట్టిన గంటకే శిశువు అనాథ అయ్యింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు. -
ఎస్ఐ తల నరికి చంపేశారు!
సాక్షి, చెన్నై: విధి నిర్వహణలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను ఓ ముఠా నరికి చంపేసింది. 100కు వచ్చిన కాల్ మేరకు విచారణకు వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్ దారుణ హత్య సమాచారం పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. నిందితుల కోసం ఆరు బృందాలు తీవ్ర వేటలో నిమగ్నమయ్యాయి. బాధిత కుటుంబానికి సీఎం స్టాలిన్ రూ. కోటి ఎక్స్గ్రేషియో ప్రకటించారు. వివరాలు.. తిరుప్పూర్ జిల్లా తారాపురం సమీపంలోని అలంగియం పట్టికి చెందిన షణ్ముగ వేల్ కుడిమంగళం పోలీసు స్టేషన్లో స్పెషల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఆయన విధులలో ఉండగా 100కు వచ్చిన కాల్తో విచారణ నిమిత్తం అదేగ్రామంలోని ఓ ఎస్టేట్ తోటకు వెళ్లారు. విచారణకు వెళ్లిన షణ్ముగ వేల్ దారుణ హత్యకు గురైన సమాచారం బుధవారం ఉదయాన్నే పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. తిరుప్పూర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అందరూ రంగంలోకి దిగారు. ఆరు ప్రత్యేక బృందాలను విచారణకు నియమించారు. విచారణలో సంబంధిత ఎస్టేట్ మడత్తుకుళం అన్నాడీఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్కు చెందినదిగా తేలింది. భద్రత కోసం వచ్చి హతమయ్యాడు.. ఈ ఎస్టేట్లో దిండిగల్కు చెందిన మూర్తి (65), ఆయన కుమారులు తంగపాండి, మణిగండన్ పనిచేస్తుండడం, వారు అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలు నెలకొన్నాయి. విచారణలో ఈ తండ్రి కొడుకులు మద్యం మత్తులో తరచూ గొడవ పడుతున్నట్టు, మంగళవారం రాత్రి కూడా ఘర్షణకు దిగినట్టు వెలుగు చూసింది. ఒకర్ని మరొకరు కర్రలతో కొట్టుకుంటుండటంతో 100కు ఫోన్ వెళ్లింది. దీంతో షణ్ముగ వేల్ భద్రత నిమిత్తం అక్కడకు వచ్చి వారిని అడ్డుకున్నట్టు తేలింది. ఈ సమయంలో మణి గండన్ కొడవలితో షణ్ముగ వేల్పై దాడి చేసి నరికి పడేశాడు. తప్పించుకునేందుకు షణ్ముగ వేల్ యతి్నంచినా వదలకుండా హత్యకు పాల్పడ్డాడు. దీనిని షణ్ముగ వేల్తో పాటూ వాహనంలో వెళ్లిన డ్రైవర్ గజరాజు చూడడంతో అతడి మీద కూడా దాడికి యతి్నంచారు. అక్కడి నుంచి తప్పించుకుని పోలీసు స్టేషన్లో డ్రైవర్ సమాచారం ఇచ్చాడు. అర్ధరాత్రి వేళ పోలీసులు ఆ ఎస్టేట్లోకి పరుగులుతీశారు. షణ్ముగవేల్ మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేకబృందాలు రంగంలోకి దిగాయి. దర్యాప్తును పోలీసు ఉన్నతాధికారులు వేగవంతం చేయించారు. ఈ సమాచారంతో ఎమ్మెల్యే మహేంద్రన్ ఎస్ఐ కుటుంబాన్ని పరామర్శించి తన సానుభూతి తెలియజేశారు. ఇక సీఎం స్టాలిన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేíÙయో ప్రకటించారు. బుధవారం సాయంత్రం పోస్టుమార్టం అనంతరం షణ్ముగ వేల్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆయన భౌతిక కాయం వద్ద డీజీపీ శంకర్జివాల్తో పాటూ ఉన్నతాధికారులు నివాళులరి్పంచారు. కాగా, పోలీసులకే రాష్ట్రంలో భద్రత కరువైందంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో పాటూ ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డారు. -
ధర్మస్థలలో కొనసాగుతున్న తవ్వకాలు
కర్ణాటక : కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల పుణ్యక్షేత్రం పరిసరాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ వందలాది మందిని హత్య చేసి, మృతదేహాలను ఖననం చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పారిశుధ్య కార్మికుడు చెప్పిన 13 పాయింట్లకుగాను 10 ప్రదేశాల్లో తవ్వకాలు జరిగాయి. మంగళవారం 11వ పాయింట్లో సిట్ అధికారులు, పోలీసులు కూలీలతో తవ్వించారు. అక్కడ అస్థిపంజరాలేవీ లభించలేదని సమాచారం. సోమవారం 10వ పాయింట్ వద్ద కొన్ని అస్థిపంజరాల అవశేషాలు దొరికాయి. దీంతో మంగళవారం ఇంకా ఎక్కువ ఆధారాలేమైనా దొరుకుతాయా? అనే ఉత్కంఠ ఏర్పడింది. 11వ పాయింట్లో రెండున్నర గంటల పాటు ఆరు అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారు. ఎలాంటి కళేబరాలు లభించలేదు. తరువాత ఆ గుంతను పూడ్చివేశారు. మధ్యాహ్నం తర్వాత 12వ పాయింట్లో తవ్వకాలు చేపట్టగా, భారీ వర్షం కురవడంతో ఆటంకం ఏర్పడింది. కార్మికులు మట్టిని తోడే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటిదాకా ఆరు పాయింట్లలో మానవ అస్థిపంజరాల అవశేషాలు లభించాయి. 13వ పాయింట్లో తవ్వాల్సి ఉంది. -
ప్రభుత్వ కళాశాలలో క్యాంపస్ సెలెక్షన్స్.!
హుబ్లీ: క్యాంపస్ సెలెక్షన్స్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు మాత్రమే పరిమితం అన్న మాటలు వినిపిస్తుంటాయి. అయితే బెళగావి జిల్లాలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గత నాలుగేళ్ల నుంచి క్యాంపస్ సెలెక్షన్లు జరుగుతున్నాయి. ఆ మేరకు 1000 మందికి పైగా విద్యార్థులు ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. అందులోను డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ ఫలితాలు రావడంతోటే ఉద్యోగాలు దొరకడం ఆ విద్యార్థుల్లో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అవును.. క్యాంపస్ టు కార్పొరేట్ కంపెనీ. బెళగావి ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ మహిళా కళాశాల ప్రొఫెసర్ల వినూత్న కార్యక్రమం విద్యార్థుల వృత్తి జీవితానికి దిక్సూచి కానుంది. ప్రైవేట్ కళాశాలల్లో సాధ్యం అయ్యే క్యాంపస్ సెలెక్షన్లు ఇక్కడి ప్రభుత్వ కళాశాలలో చేపట్టడం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులకు డిగ్రీ ముగిసిన వెంటనే ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. ఇందులో 90 శాతం మంది విద్యార్థినులే కావడం విశేషం. అక్కడి అధ్యాపక సిబ్బంది కృషి ఫలితంగానే ఇది సాధ్యం అయింది. ఎందుకై నా బీఏ, బీకాం, డిగ్రీ చదివామా? అని బాధపడే విద్యార్థులకు అలాంటి చింత వేధించరాదన్న సదుద్దేశంతోనే సదరు కళాశాల ప్లేస్మెంట్ అధికారి ప్రొఫెసర్ షంషుద్దీన్ నదాఫ్ తోటి ప్రొఫెసర్ల అండదండలతో గత మూడేళ్ల నుంచి క్యాంపస్ సెలెక్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 730 మందికి పైగా విద్యార్థినులు టాటా ఎలక్ట్రానిక్, టాటా మోటర్స్ హోండా, ఫాక్స్కాన్, క్వేస్ తదితర ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ప్రత్యక్ష ఇంటర్వ్యూల్లో విద్యార్థులు ఈ ఘనత సాధించారని అధికారి ఎంతో గర్వంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. -
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో బస్టాండ్ వెలవెల
రాయచూరు రూరల్: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగుల, కార్మికుల సంఘం అధ్యక్షుడు ముద్దుకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్టీసీ బస్టాండ్లో చేపట్టిన ఆందోళననుద్దేశించి ఆయన మాట్లాడారు. గత 38 నెలల నుంచి సక్రమంగా వేతనాలు చెల్లించక పోవడాన్ని తప్పుబట్టారు. మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం బస్సులను నిలిపివేసి సమ్మెలో పాల్గొన్నారు. అనంతరం యథావిధిగా బస్సుల సంచారానికి అవకాశం కల్పించారు. ప్రయాణికులు లేక బస్టాండ్ బోసిపోయింది. సమ్మెతో సగం మేర బస్సులు సంచారానికి రాలేదు. రాయచూరు జిల్లాలో మిశ్రమ ప్రతిక్రియ -
కులాసాగా గజదళం
మైసూరు: ఈ సంవత్సరం అట్టహాసంగా జరగబోయే విశ్వవిఖ్యాత నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవాలలో పాల్గొనేందుకు అడవి నుంచి మైసూరుకు విచ్చేసిన గజ దళం సేదదీరుతోంది. హుణసూరు తాలూకా వీరనహొసహళ్లి హాడి నుంచి గజపయన ద్వారా సోమవారం సాయంత్రం మైసూరులోని అశోకపురంలోని అరణ్య భవన్ ఆవరణకు చేరుకున్నాయి. అక్కడే కెప్టెన్ అభిమన్యు నేతృత్వంలో 9 దసరా గజాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ప్రయాణ బడలికతో ఉన్నందున మంగళవారం అధికారులు పూర్తి విశ్రాంతి కల్పించారు. ఏనుగులకు మావటీలు, కాపలాదారులు స్నానాలు చేయించారు. వరిగడ్డి, పచ్చ గడ్డిని మేతగా అందజేశారు. అంబారీ అభిమన్యుకే పశువైద్యులు ఆరోగ్య పరీక్షలను చేశారు. ఏనుగులను దూరం నుంచే వీక్షించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. అటవీ అధికారి డాక్టర్ ప్రభుగౌడ విలేకరులతో మాట్లాడుతూ ఈసారి కూడా అభిమన్యునే బంగారు అంబారీని మోస్తుందని తెలిపారు. మరో మూడు ఏనుగులకు కూడా అంబారీతో తాలీము చేయిస్తామన్నారు. అన్ని ఏనుగులు ఆరోగ్యంగా ఉన్నాయన్నారు. ఈసారి సాయంత్రం స్వాగతం 10వ తేదీన సాయంత్రం 6.40 నుంచి 7.20 గంటల మధ్య మకర గోధూళి లగ్నంలో అంబావిలాస్ ప్యాలెస్లోని జయ మార్తాండ ద్వారం ద్వారా ఏనుగులను తోడ్కొని వెళ్తారు. ఇక నుంచి దసరా ముగిసేవరకు ప్యాలెస్ ఆవరణలోనే బస చేస్తాయి. ఆదివారం సాయంత్రం నుంచి రాజప్రసాదాన్ని విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. దీంతో పర్యాటకుల సందడి మరింత పెరగనుంది. సాయంత్రం వేళ విద్యుద్దీప వెలుగుల్లో గజరాజుల స్వాగతోత్సవం జరుగుతుంది. తద్వారా కొత్త రీతిలో ప్రచారం లభిస్తుందని అధికారులు తెలిపారు. అడవుల నుంచి మైసూరుకు చేరిక ఆదివారం వైభవంగా ప్యాలెస్ ప్రవేశం -
మధ్యాహ్న భోజనం శుచిగా ఉండాలి
కోలారు : విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం రుచిగా, శుచిగా ఉండాలని డిప్యూటీ కలెక్టర్ మంగళ ఉపాధ్యాయులకు సూచించారు. తాలూకాలోని అరాభికొత్తనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆమె సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. సాంబారులో ఆకుకూరలు అధికండా ఉండేలా చూడాలన్నారు. శ్రావణ మాసం సందర్భంగా కొంతమంది పిల్లలు కోడిగుడ్లను తినడం లేదని గుర్తించిన డిప్యూటీ కలెక్టర్.. రోజుకో గుడ్డును తినడం వల్ల ఉత్తమ ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఆర్ఐ రాజేంద్రకుమార్, గ్రామ లెక్కాధికారి అనిత, గ్రామ పంచాయతీ స్థాయీ సమితి అధ్యక్షుడు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నేడు హట్టికి సీఎం సిద్దూ రాక
●వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా హట్టికి బుధవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య వస్తారని హట్టి బంగారు గనుల కంపెనీ అధ్యక్షుడు జీ.టీ.పాటిల్ తెలిపారు. బుధవారం హట్టి బంగారు గనుల కంపెనీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హట్టి బంగారు గనుల కంపెనీ సిబ్బందికి, కార్మికులకు రూ.998 కోట్లతో నూతన వసతిగృహాల నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారన్నారు. సమావేశానికి 15 వేల మంది హాజరవుతారని, ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ముఖ్యమంత్రి ప్రజలు, కార్మికులు, రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్సీలు శరణే గౌడ బయ్యాపూర్, వసంత్ కుమార్, శాసన సభ్యులు వజ్జల్ మానప్ప, మాజీ ఎమ్మెల్యే హొలిగేరి, జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, ఏసీ బసవణ్ణప్ప, ఎండీ శిల్పా తదితరులు పాల్గొన్నారు. ఎడమ కాలువలో గేజ్ కాపాడండిరాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ కింద 47, 69వ మైలు వద్ద భూములకు సక్రమంగా నీరందాంలంటే నీటి గేజ్ను కాపాడాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లాలోని మాన్వి తాలూకాలో పర్యటించి మాట్లాడారు. 69వ మైల్ వద్ద నీటి నిర్వహణ గేజ్ సామర్థ్యాన్ని కాపాడి ఆయకట్టు చివరి భూములకు నీరందించాలన్నారు. 47వ మైల్ వద్ద ఏడు అడుగుల మేర నీరు ఉండడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదన్నారు. అక్షరాస్యతా శాతాన్ని పెంచండిరాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో అక్షరాస్యతా ప్రమాణాన్ని పెంచాలని విద్యా శాఖ సాక్షరతా విభాగం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రశ్మి అధికారులకు సూచించారు. మంగళవారం యాదగిరి తాలూకాలోని అల్లీపురలో అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాల, కళాశాలలను పరిశీలించి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు బోధన, మౌలిక సౌకర్యాల గురించి విద్యార్థులతో చర్చించారు. ఈసందర్భంగా కేకేఆర్డీ కార్యదర్శి నళిన్ అతుల్, విద్యా శాఖ కమిషనర్ రాహుల్ తుకారాం పాండేలున్నారు. కార్మిక నేతలకు స్మృత్యంజలిబళ్లారి టౌన్: నగరంలో ఎస్యూసీఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్మిక నేత ఫ్రెడరిక్ ఎగ్గెల్స్, ఎస్యూసీఐ పార్టీ సంస్థాపకుడు కామ్రెడ్ శివదాస్ ఘోష్ స్మరణ దినోత్సవాలను జరిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ ఉపాధ్య మాట్లాడుతూ వారు చేసిన సేవలు శ్లాఘనీయం అని కొనియాడారు. జిల్లా సమితి నేతలు సోమశేఖర్ గౌడ, ఎంఎస్ మంజుల, డీ.నాగలక్ష్మి, ప్రమోద్, నాగరత్న, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. మెరుగైన సదుపాయాలు కల్పించండి కోలారు: కోలారు నగరంలోని అంతరగంగ బుద్ధి మాంద్య విద్యా సంస్థను మంగళవారం జెడ్పీ సీఈఓ ప్రవీణ్ పి బాగేవాడి సందర్శించారు. వంటగది, విద్యార్థుల వసతి, వయోవృద్ధుల వసతి గదులను పరిశీలించారు. సీఎస్ఆర్ నిధులను ఉపయోగించుకుని మరింత అభివృద్ధి చేయాలని విద్యా సంస్థ నిర్వాహకులకు సూచించారు. ఆ విద్యాసంస్థ సంస్థాపక కార్యదర్శి డాక్టర్ శంకర్ మాట్లాడుతూ మరిన్ని వసతి గదుల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు ప్రజ్ఞా మాట్లాడుతూ అంబా సంస్థ ద్వారా పిల్లలకు కంప్యూటర్ శిక్షణ నిస్తున్నామని తెలిపారు. ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో డాటా ఎంట్రీ ఉద్యోగానికి సంస్థ నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయ్యారన్నారు. జిల్లా వికలాంగ సంక్షేమ శాఖ అధికారి మంజుల పాల్గొన్నారు. -
బస్సు కదలక.. గమ్యం చేరక..
బనశంకరి: బకాయి ఉన్న 34 నెలల వేతనంతో పాటు వివిధ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కేఎస్ ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం సమ్మె చేయడంతో బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అర్జంటు పని ఉండి గమ్యానికి చేరలేక అయోమయానికి గురయ్యారు. బెంగళూరుతో సహా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలకు ఉదయం నుంచి బస్సు సంచారం నిలిచిపోయింది. సోమవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య , ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. బస్ సౌలభ్యం లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీఎంటీసీ బస్సులు కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. ఒక్కో జిల్లాలో ఒక్కోలా ● మైసూరులో నగరంలో బస్సంచారం స్తంభించిపోయింది. కొడగు జిల్లాలో పెద్ద ఇబ్బంది కనిపించలేదు. హాసన్– మైసూరు బస్సులు కుశాలనగరలో నిలిచిపోయాయి. ● రాయచూరులో 50 శాతం బస్సులు మాత్రమే సంచరించాయి. హుబ్లీ–ధార్వాడ జంట నగరాల్లో బస్సులు బంద్ అయ్యాయి. ● సరిహద్దు జిల్లాల్లో ఆంధ్ర, తెలంగాణ బస్సులు మామూలుగా తిరిగాయి. చిక్కబళ్లాపుర జిల్లాలో బంద్ ప్రభావం కనబడలేదు. కానీ ప్రయాణికులు బంద్ అని బస్టాండ్లు రాలేదు. మంగళూరులోనూ బంద్ కనిపించలేదు. ● చిక్కమగళూరులో బస్సులు సంచారం నిలిచిపోవడంతో దీంతో ప్రజలు ప్రైవేటు బస్సులను ఆశ్రయించారు. ● అనేక జిల్లాల్లో దూరపు ప్రయాణానికి బస్టాండ్ల వద్దకు చేరుకున్న మహిళలు, ప్రయాణికులు ఉస్సూరుమన్నారు. బస్టాండ్లు ఖాళీగా కనిపించాయి. ● అత్యవసర కార్యక్రమాల కోసం వెళ్లే అనేకమంది ప్రైవేటు వాహనాల్లో అధిక డబ్బులు ఇచ్చి ప్రయాణించారు. ప్రయాణ వసతి లేక పాఠశాలల్లో హాజరు తగ్గింది. పలు కాలేజీలు, వర్సిటీలలో పరీక్షలను వాయిదా వేశారు. బలవంతంగా డ్రైవింగ్ శిక్షణలో ఉన్న డ్రైవర్లతో ఆర్టీసీ అధికారులు బలవంతంగా కొన్ని బస్సులను నడిపించారు. సమ్మెకు మద్దతు తెలిపిన డ్రైవర్లు, కండక్టర్లను అధికారులు బెదిరిస్తున్నారని ఉద్యోగ నేతలు చెప్పారు. విధులకు వెళ్లేవారిని ఇబ్బంది పెట్టబోమని, తమది శాంతియుత సమ్మె అని తెలిపారు. అయితే కోలారు, కొప్పళ యలబుర్గా వద్ద ఆర్టీసీ బస్సులపై అల్లరిమూకలు రాళ్లు విసిరారు. కిటికీల అద్దాలు పగిలాయి. రాష్ట్రమంతటా ఆర్టీసీ సమ్మె అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు మధ్యాహ్నం 4 వరకు అవస్థలు హైకోర్టు ఆదేశాలతో సమ్మె సమాప్తం బెంగళూరులో ఎఫెక్ట్ ఆర్టీసీ, బీఎంటీసీ బంద్ ఎఫెక్టు బెంగళూరు నగరంపై ఓ మోస్తరుగా పడింది. విద్యార్థులు, ఉద్యోగులు దిక్కులు చూశారు. మెజెస్టిక్ కెంపేగౌడ బస్టాండు, శాంతినగర, కేఆర్.మార్కెట్, ఎలక్ట్రానిక్సిటీ, టిన్ ఫ్యాక్టరీ తదితర అనేక బస్టాండ్లకు ఉదయం నుంచి వచ్చినవారు తెల్లమొహం వేశారు. దూర ప్రాంతాలకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. బుకింగ్ డబ్బులు వెనక్కి తీసుకోవడానికి రద్దీ ఏర్పడింది. మరో పక్క బెంగళూరులో ఎలక్ట్రిక్ బస్సులు సంచరించాయి. కేఆర్.మార్కెట్లో ప్రైవేటు బస్సులకు గిరాకీ ఏర్పడింది. ఉదయం 9, 10 తరువాత బీఎంటీసీ బస్సులు రోడ్లపైకి వచ్చాయి. సమ్మైపె హైకోర్టు స్టే శివాజీనగర: ఆర్టీసీ సమ్మైపె దాఖలైన పిటిషన్లను హైకోర్టు మంగళవారం విచారించింది. సమ్మైపె ఇచ్చిన స్టేను 2 రోజులు పొడిగించింది. సమ్మెతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిందని ఏజీ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం, ఉద్యోగుల చర్చల సమాచారాన్ని తెలిపారు. కోర్టు ధిక్కారానికి పాల్పడవద్దని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల న్యాయవాదికి జడ్జిలు హెచ్చరించారు. సమ్మెను నిలిపేశారా? అని అడిగారు. హైకోర్టు ఆదేశాలతో మధ్యాహ్నం 4 గంటల నుంచి బంద్ను విరమించారు. రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ సమ్మెను ముగిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల జాయింట్ క్రియా సమితి అధ్యక్షుడు అనంత్ సుబ్బారావ్ తెలిపారు. -
పథకాలు కార్మికుల దరి చేరాలి
శ్రీనివాసపురం : ప్రభుత్వ పథకాలు, సౌలభ్యాలను అర్హులైన కార్మికులకు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే జీకే వెంకటశివారెడ్డి సూచించారు. పట్టణంలోని పురసభ వాణిజ్య సముదాయ ప్రాంగణంలో కార్మిక శాఖ, కార్మిక సంక్షేమ శాఖ మండలి ఆధ్వర్యంలో మంగళవారం ఆయన కార్మికులకు కిట్లు పంపిణీ చేసి మాట్లాడారు. సంఘటిత, అసంఘటిత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌలభ్యాలను కల్పిస్తోందని, వాటిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్మిక సంఘం నాయకుడు ఆనంద్, నవీన్కుమార్, మల్లప్ప, సిబ్బంది పాల్గొన్నారు. -
సెంట్రల్ జైల్లో ప్రజ్వల్ పుట్టినరోజు
యశవంతపుర: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ 35వ పుట్టిన రోజును జైల్లో చేసుకున్నారు. ఇంటి పనిమనిషి మీద అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్ష పడిన ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు పరప్పన అగ్రహర జైల్లో ఖైదు అనుభవిస్తున్నారు. ఆదివారం ఆయనకు ఖైదీలు ధరించే యూనిఫారాన్ని అందజేశారు. సోమవారం నుంచి ఏమేం పనులు చేయాలో జైలు సిబ్బంది వివరించారు. వారానికి ఆరు రోజులు నిబంధనల ప్రకారం పనులు చేయాలని తెలిపారు. రోజువారి కూలీ రూ.540 ఇస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం ప్ర జ్వల్ వైభవంగా నిర్వహించిన జన్మదినం వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. మరోవైపు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించాలని ఆయన న్యాయవాదులు సిద్ధమయ్యారు. శృంగేరిలో తండ్రి పూజలు తనయుడు ప్రజ్వల్ జన్మదినం సందర్భంగా తండ్రి హెచ్డీ రేవణ్ణ శృంగేరి శారదాంబ దేవస్థానంలో విశేష పూజలు చేశారు. సోమవారం రాత్రి శృంగేరికి వెళ్లి గురుపీఠం మరాధిపతిని కలిశారు. మంగళవారం ఉదయం శారదా మాతను దర్శించుకుని పూజలు చేశారు. రోజువారీ కూలీ పనుల అప్పగింత -
వర్గీకరణపై అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించండి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అమలుకు నిర్ణయం తీసుకోవాలని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి సంచాలకుడు మారెప్ప డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు వర్గీకరణకు అనుకూలంగా జిస్టిస్ నాగమోహనదాస్ నివేదికను కూడా అందించారన్నారు. ఆ నివేదికపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం ప్రకటించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయాలను వివరించారు. తెలంగాణలో లేని ఎస్సీ వర్గీకరణకు అడ్డంకులు కర్ణాటకలో ఎందుకు అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సర్కారులే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో అమలు చేసిన ఆర్డినెన్సులను చూడాలన్నారు. విలేఖర్ల సమావేశంలో హేమరాజ్, ఆంజనేయ, శ్రీనివాస్, నరసింహులు, తాయప్ప, కృష్ణలున్నారు. 8 నుంచి అగ్నిపథ్ సేనా ర్యాలీకి ఏర్పాట్లు రాయచూరు రూరల్: నగరంలో అగ్ని పథ్ సేనా ర్యాలీకి మౌలిక సౌకర్యాలను కల్పించినట్లు ఆహార పౌర సరఫరాల శాఖ ఇంచార్జి అధికారి కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 8వ తేదీ నుంచి రెండు రోజులపాటు రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రాంగణంలో జరగనున్న సేనా ర్యాలీలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే యువతకు బంజార సేవా సంఘం భవన్, వాల్మీకి భవన్, సంతోష్ హబ్, కేఈబీ కళాశాలలో మౌలిక సౌకర్యాలను కల్పించామన్నారు. ఉచిత వసతి, భోజనం, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలోని సంఘ సంస్థలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నట్లు వివరించారు. ర్యాలీలో 20 వేల మంది పాల్గొంటారని అన్నారు. విలేఖర్ల సమావేశంలో తహసీల్దార్ సురేష్ వర్మ, చంద్రశేఖర్, మల్లనగౌడ, పురుషోత్తంలున్నారు. 23 కోట్ల మంది రైతులకు పంటల బీమా లబ్ధి ● రూ.1.75 లక్షల కోట్ల మేర ఖాతాలకు సొమ్ము జమ హుబ్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాలను అందించి వారిలో ఆత్మవిశ్వాసం, జీవనోత్సాహం కల్గిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ధార్వాడ తాలూకా హెబ్బళ్లిలో ఏర్పాటు చేసిన జాతీయ వయోశ్రీ యోజన ద్వారా 136 మంది వృద్ధులకు, అడిప్ యోజన ద్వారా 22 మంది దివ్యాంగులకు రూ.14.60 లక్షల వ్యయంతో బ్యాటరీ సైకిళ్లు, ఇతర పరికరాలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. రైతులకు పంటల బీమా యోజన అమలు చేశామన్నారు. గత ఏడాది దేశంలో 12 వేల కోట్ల ప్రీమియం సొమ్మును ప్రభుత్వం చెల్లించిందన్నారు. 23 కోట్ల మంది రైతులకు 1.75 లక్షల కోట్ల బీమా సొమ్ము జమ అయిందన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుకు 4 శాతం వడ్డీ ధరతో అందించే రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అమృత్ దేశాయి మాట్లాడుతూ ప్రహ్లాద్ జోషి ఎంపీగా, కేంద్ర మంత్రిగా యావత్ దేశ బాధ్యతలు ఉన్నా గ్రామ గ్రామానికి వెళ్లి అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. అంతేగాక ప్రభుత్వ నిధులు కాకుండా సీఎస్ఆర్ నిధుల ద్వారా కూడా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి పాటు పడుతున్నారన్నారు. సదరు గ్రామంలో చెత్త నిర్వహణ యూనిట్తో పాటు ఆ ఊరిలో పాఠశాల గదులను జోషి ప్రారంభించారు. బీజేపీ నేతలు, సంబంధిత అధికారులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. నేహా హత్య కేసు నిందితుడికి షాక్ ●బెయిల్ అర్జీని తిరస్కరించిన కోర్టు హుబ్లీ: విద్యార్థిని నేహా హత్య కేసు నిందితుడు సమర్పించిన బెయిలు దరఖాస్తుపై విచారణ చేపట్టిన హుబ్లీ 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సదరు అర్జీని తిరస్కరించింది. విచారణ ప్రక్రియను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేస్తు నిందితుడిని స్వయంగా హాజరు పరచాలని కోర్టు సూచించింది. సదరు కోర్టు న్యాయమూర్తి బీఆర్ పల్లవి సుదీర్ఘ వాద ప్రతివాదనలను ఆలకించి బెయిలు దరఖాస్తును తిరస్కరించారు. పోలీసులు అరెస్ట్ ప్రక్రియ సక్రమంగా చేపట్టలేదు. తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఆధారంగా నిందితుడు ఫయాజ్కు బెయిలు ఇవ్వాలని అతని తరఫున న్యాయవాది విజ్ఞప్తి చేశారు. సీఐడీ ప్రత్యేక న్యాయవాది మహేష్ వైద్య ప్రభుత్వం తరఫున వాదించారు. నేహా హిరేమఠ తల్లి తరఫున రాఘవేంద్ర ముతర్గికర్ వాదించారు. నిందితుడు ఫయాజ్ తరపున జెడ్ఎం అత్తరికి వాదించారు. ఫయాజ్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి బెయిలు తిరస్కరించడంపై విధి తాత్కాలిక జయం సాధించిందని శ్రీరామ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ అభిప్రాయ పడ్డారు. బెయిలు అర్జీ తిరస్కరణ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసును తర్వగా పరిష్కరించాలని నేహా తండ్రి నిరంజనయ్య హిరేమఠ విజ్ఞప్తి చేశారు. నిందితుడికి బెయిలు ఇవ్వరాదు, ఉరిశిక్ష వేయాలి. ఇలాంటి వారికి బెయిలు ఇస్తే సమాజానికి తప్పుడు సందేశం వెళుతుందని ఆయన ఆరోపించారు. కాగా బెయిలు నిరాకరణతో శ్రీరామ సేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసి సంబంధిత న్యాయవాదిని సన్మానించి తాత్కాలిక విజయం లభించిందని నినాదాలు చేశారు. -
కర్ణాటక సాగు నీటి పథకాలకు ఏపీ మోకాలడ్డు
రాయచూరు రూరల్: కర్ణాటకలో సాగు నీటి పథకాలకు ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం మోకాలడ్డుతోందని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు్ ఆరోపించారు. మంగళవారం తమ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర డ్యాంలో పేరుకున్న పూడికతో నష్టపోతున్న నీటి వాటాను భర్తీ చేసుకునేందుకు, వరద జలాలను నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రత్యామ్నాయంగా నవలి వద్ద రూ.20 వేల కోట్లతో మినీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సమావేశాలు నిర్వహించాలని విన్నవించినా నేటికీ స్పందించక పోవడాన్ని తప్పుబట్టారు. బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణానికి సమీక్ష రాయచూరు జిల్లాలో మాన్వి తాలూకా చీకలపర్వి వద్ద బ్రిడ్జి కం బ్యారేజీ, రాయచూరు తాలూకా చిక్కమంచాలి వద్ద బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణం చేపట్టడానికి అవకాశం కల్పించాలని కర్నూలులో సమావేశం నిర్వహించామన్నారు. ఈ విషయం కేసీ కెనాల్ పరిధిలో ఉన్నందున కర్నూలు, నంద్యాల లోక్సభ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి నిరభ్యంతర లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం అడ్డు పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ పరివాహక ప్రాంత పరిధిలో బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణం చేపట్టడానికి గతంలో అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. జిల్లాలో యూరియా ఎరువుల కొరత లేదు రాయచూరు జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు. ఆగస్టు నెలలో 8,146 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు విషయంపై కేంద్రం వివక్షత చూపుతోందన్నారు. తుంగభద్ర డ్యాంలో 32 గేట్లను మార్పు చేయడానికి తుంగభద్ర బోర్డు అధ్యక్షుడి అనుమతి అవసరం అన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఒకరు గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, వారి ఆదేశాల మేరకు బోర్డు నిర్ణయం తీసుకోవడం వల్ల కర్ణాటక కేవలం పాత్రధారి మాత్రమే అన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచరాదని కేంద్ర జలవనరుల మంత్రికి మహారాష్ట్ర ప్రతినిధులు వినతిపత్రం ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ నిరసన తెలపడం సహజమన్నారు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు -
సందిగ్ధంలో కన్నడ పాఠశాలల ఉనికి
రాయచూరు రూరల్: కర్ణాటక రాష్ట్రానికి ఆనుకొని ఉన్న పొరుగు రాష్ట్రాల్లోని గడినాడు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలల మూసివేతకు సర్కార్ సిద్ధమైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గడినాడు ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఆదోని, ఆలూరు, మంత్రాలయం, హాలహర్వి, హొళగుంద, కౌతాళం, హెబ్బటం, రారావి, గూళ్యం, ఎమ్మిగనూరు, నందవరం, చింతకుంట, రాయదుర్గం, కల్యాణదుర్గం కర్ణాటకలోని కోలారు, బాగేపల్లి, చింతామణి, చిత్రదుర్గ, తుమకూరు, రాయచూరు, బీదర్, యాదగిరి, కలబుర్గి జిల్లాల్లో కన్నడ భాషలో విద్యనభ్యసించే 20 వేల మంది విద్యార్థులు నష్టపోవడమే కాకుండా ఉన్నత విద్యను పొందడానికి అర్హతను సాధించలేక పోతున్నారు. గడినాడు కన్నడ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదవడానికి అవకాశం ఉంది. దీంతో ఇంటర్లో చేరడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోనూ.. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర జిల్లాలో కృష్ణ, కుసుమూర్తి, హిందూపుర, మక్తల్, నారాయణపేట, మరికల్, గుడేబల్లూరు వంటి ప్రాంతాల్లో విద్యార్థులు ఉన్నత విద్యకు తిలోదకాలు పలికేందుకు కర్ణాటక సర్కార్ గడినాడులో ఉన్న కన్నడ పాఠశాలలను మూసివేతకు పావులు కదపడమే కారణంగా తెలుస్తోంది. నాటి కన్నడ భాషాభివృద్ధి మండలి అధ్యక్షుడు, గడినాడు కన్నడ భాషా ప్రాధికార అధ్యక్షుడు కుంబార వీరభద్రప్ప సర్కార్కు నివేదిక అందించి దశాబ్దం గడిచినా ఆ నివేదికపై ఏనాడూ కూడా ప్రభుత్వాలు స్పందించక పోగా నేడు గడినాడు కన్నడ పాఠశాలల మూసివేతకు సర్కార్ సిద్ధం కావడంతో విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా లభించడం లేదు. తమకు పూర్తి స్థాయిలో తెలుగు భాషలో చదవడానికి అవకాశం కల్పించాలని మొర పెట్టుకున్న సమయంలో స్పందించని సర్కార్లు రాత్రికి రాత్రే గడినాడు కన్నడ పాఠశాలల మూసివేతకు నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల పరిస్థితులు తారుమారయ్యాయి. సర్కార్ నుంచి మూసివేత సంకేతాలు? విద్యార్థుల భవిష్యత్తుపై నీలిమేఘాలు -
60 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 60 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని హైదరాబాద్ కర్ణాటక జనాందోళన సమితి జిల్లా సంచాలకుడు రాఘవేంద్ర కుష్టిగి డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్యాణ కర్ణాటకలోని ఆరు జిల్లాల్లో 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయక పోవడంతో 2024–25వ సంవత్సరంలో పదో తరగతిలో తక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆరు వేల కన్నడ భాష ప్రాథమిక పాఠశాలలను మూసి వేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రాయచూరు జిల్లాలో 500 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయన్నారు. కళ్యాణ కర్ణాటకలో 9 వేల మంది సైన్సు, గణితం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో పాస్ కాలేక పోయారన్నారు. విద్యా శాఖా మంత్రి మధు బంగారప్పను మంత్రి పదవి నుంచి తప్పించి అనుభవమున్న వారికి ఆ పదవిని కేటాయించాలన్నారు. బసవరాజ్, శారద, ఈరణ్ణ, జాన్ వెస్లిలున్నారు. -
మహిమల స్వామి పేరుతో మస్కా
మైసూరు: రాజభవనాల నగరంలో ఆర్థిక మోసాలు అధికమవుతున్నాయి. సైబర్ మోసగాళ్ల చేతిలో నిత్యం కొందరు వంచనకు గురవుతున్నారు. ఓ బాధితుడు మరో రకమైన మోసానికి గురై రూ. 2.19 కోట్లకు పైగా నగదు, నగలు పోగొట్టుకొని కన్నీరు పెట్టుకొంటున్నాడు. మైసూరులోని జేఎస్ఎస్ లేఔట్ నివాసి అరుణ్కుమార్ (54) బాధితుడు. మూఢ నమ్మకాలతో నిండా మునిగిపోయాడు. దేవుడు నా ఒంట్లోకి వస్తాడు, ఇతరుల కష్టాల్లో ఉంటే సహాయం చేయకపోతే మీ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది అని చెప్పి భయాన్ని సృష్టించి అరుణ్కుమార్ దంపతుల నుంచి రూ. 2.19 కోట్ల నగదు, 202 గ్రాముల బంగారు ఆభరణాలను కొట్టేశారు. దక్షిణ కన్నడకు చెందిన రూపశ్రీ, ఆమె భర్త సందేష్ దంపతులు ఈ కపటడానికి పాల్పడ్డారు. త్వరలో జర్మనీకి వెళ్తారని 2017లో వాట్సప్ ద్వారా రూపశ్రీ.. అరుణ్కుమార్తో మాట్లాడింది. అప్పాజీ అనే స్వామీజీ మహిమ కలవాడు, హిమాలయాలలో, కేరళలో తపస్సు చేశాడు. ఆయన మా అమ్మమ్మ క్యాన్సర్ను నయం చేశాడు అని తెలిపింది. మీరు పనికి వెళ్లేటప్పుడు ప్రమాదాలు జరుగుతాయని, దీనిని నివారించడానికి పరిష్కారం సూచిస్తారు అని చెప్పి దఫదఫాలుగా డబ్బులు వసూలు చేసింది. మహిమలు జరిగినట్లు చూపే కొన్ని నకిలీ వీడియోలను అరుణ్కుమార్ కుమార్కు పంపింది. అప్పాజీ జోస్యం మేరకు మీరు జర్మనీ యాత్ర చేయబోతున్నారు అని చెప్పింది. ఆ విధంగా అరుణ్కుమార్ భార్య జర్మనీకి వెళ్లింది. తరువాత అతని కుమారుడు కూడా జర్మనీకి వెళ్లారు. దీంతో అరుణ్కుమార్కు మరింత నమ్మకం కుదిరింది. ఆ రీతిలో రూ.2.19 కోట్ల నగదు, 202 గ్రాముల బంగారాన్ని రూపశ్రీ తీసుకుంది. అప్పాజీ స్వామిని చూడాలని అరుణ్కుమార్ కోరగా, కుదరదని చెప్పింది. దీంతో అనుమానం వచ్చి ఆరా తీయగా మోసమని తేలింది. మోసగాళ్లను అరెస్టు చేయాలని, తన డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితుడు మైసూరు సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. రూ. 2.19 కోట్లు స్వాహా మైసూరులో ఘరానా మోసం -
బాడీబిల్డర్ హఠాన్మరణం
● హాసన్లో విషాదం యశవంతపుర: ఇనుప కండరాలు, ఉక్కు లాంటి నరాలతో బాడీబిల్డర్గా యువతకు ఆదర్శంగా నిలిచాడు. కానీ ఆకస్మిక మృతి నుంచి తప్పించుకోలేకపోయాడు. శ్వాసకోస వ్యాధితో బాడీ బిల్డర్ చనిపోయిన ఘటన హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా బెళగోడు గ్రామంలో జరిగింది. సోమశేఖర్ (30) జిమ్ సోమగా పేరుగాంచాడు. సోమ వర్కౌట్లు, దేహధారుడ్య పోటీల పోటోలు, వీడియోలు వైరల్ అయ్యేవి. సోమశేఖర్ ఆరున్నర అడుగులు, 110 కేజీల బరువుతో పెద్ద వస్తాదులా కనిపించేవాడు. బాడీ బిల్డింగ్నే వృత్తిగా ఎంచుకుని ఆ రంగంలో అనేక టైటిళ్లను గెలుపొందాడు. సోమశేఖర్ జాతీయస్థాయి బాడీ బిల్డర్ పోటీలను నిర్వహించాలని నిర్ణయించాడు. కానీ వారం రోజుల నుంచి శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స ఫలించక సోమవారం రాత్రి మరణించాడు. సోమ మృతితో కుటుంబం, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. హాసన్ జిల్లాలో ఆకస్మిక గుండెపోట్లతో ఎంతోమంది చనిపోతుండడం తెలిసిందే. డ్రగ్స్ ఫ్యాక్టరీ కేసులో పోలీసు సస్పెండ్ మైసూరు: నగరంలో డ్రగ్స్ ఫ్యాక్టరీని కనుకొన్న కేసులో నగర పోలీస్ కమిషనర్ ఒక కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఏసీపీ దేవరాజ్ డివిజన్ కార్యాలయంలో పనిచేసే పోలీసు ప్రదీప్ సస్పెండయ్యాడు. ముంబై పోలీసులు మైసూరులో దాడిచేసి ఓ మత్తు పదార్థాల ఫ్యాక్టరీని కనుగొన్నారు. రూ. 390 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొన్నారు. అక్కడ ఫ్యాక్టరీ ఉందని తెలిసినప్పటికీ ఉన్నతాధికారులకు తెలియజేయలేదని, ముడుపులు తీసుకుంటూ ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ వ్యాపారులతో కుమక్కయ్యారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో ముగ్గురు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. అలాగే నగర వీధుల్లో గంజాయి, డ్రగ్స్ సేవించేవారిని వెతికి పట్టుకుని కేసులు పెడుతున్నారు. ఇప్పటికి వంద మందికి పైగా వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. బస్సు– క్యాంటర్ ఢీ, ఇద్దరు మృతియశవంతపుర: చిక్కమగళూరు జిల్లా తరీకెరె తాలూకా శివపుర వద్ద మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నిద్రమంపురంలో క్యాంటర్ కేఎస్ ఆర్టీసీ బస్సు ఓ క్యాంటర్ను వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో క్యాంటర్ డ్రైవర్, క్లీనర్ అక్కడే దుర్మరణం చెందారు. హుబ్లీ నుంచి క్యాంటర్ మైసూరు వైపు వెళుతుండగా, కడూరు నుంచి ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనింది. మృతులిద్దరూ హుబ్లీకి చెందినవారుగా పోలీసులు తెలిపారు. బీరూరు పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. యువ నటుడు అకాల మరణం యశవంతపుర: శాండల్వుడ్ యువ నటుడు సంతోష్ బాలరాజ్ (34) అనారోగ్యంతో మరణించారు. కరియ–2, గణప తో పాటు అనేక సినిమాలలో నటించి మంచి నటునిగా పేరు సంపాదించారు. సంతోష్ కొన్నిరోజుల నుంచి కాలేయ జబ్బుతో బాధపడుతున్నారు. బనశంకరిలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస వదిలారు. -
వ్యక్తిపై పోక్సో కేసు నమోదు
● భర్తను నదిలోకి తోసిన కేసులో మలుపు ● భర్త తాతప్పను అరెస్ట్ చేసిన పోలీసులు రాయచూరు రూరల్: వంతెన పైనుంచి భర్తను ఓ భార్య నదిలోకి తోసిన కేసు కొత్త మలుపు తిరిగింది. రాయచూరు తాలూకాలోని గూర్జాపూర్ వంతెన వద్ద తన భార్యే తనను నదిలోకి తోసిందని శక్తినగర్కు చెందిన తాతప్ప ఆరోపించాడు. మూడు నెలల క్రితం యాదగిరి జిల్లా వడగేరకు చెందిన గెద్దెమ్మతో తాతప్పకు వివాహమైంది. అయితే విడాకుల కోసం కోర్టు మెట్లడానికి సిద్ధమైన తాతప్పపై బాల్య వివాహ చట్టం కింద పోక్సో కేసు నమోదు కావడంతో ఆదివారం శక్తినగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంతలో ఇరుక్కున్న ఆర్టీసీ బస్సుహుబ్లీ: ముదగల్ సమీపంలోని హొనూరు గ్రామం వద్ద రోడ్డులోని గుంతలో అంకలిమఠ మంగళూరు మార్గంలో వెళుతున్న బస్సు ముందు చక్రాలు ఇరుక్కొని కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాక్టర్ సాయంతో స్థానికులు ఇరుక్కున్న బస్సును ముందుకు లాగించారు. పొరుగుల జిల్లాలను కలిపే ఈ రోడ్డు డ్రైనేజీ నీరు, వాన నీరు కలిసి మట్టి రోడ్డు బురదమయమై గుంతలు పడ్డాయి. తక్షణమే ప్రజాపనుల శాఖ అధికారులు సీసీ రోడ్డును నిర్మించి ప్రయాణికుల రాకపోకలకు అనుకూలం కల్పించాలని హొనూరు గ్రామస్తులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. హాస్టల్ భవనం ప్రారంభమెన్నడో?హొసపేటె: తాలూకాలోని జంబునాధ రోడ్డులో నాలుగు నెలల క్రితం కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఏపీజే అబ్దుల్ కలాం మొరార్జీ దేశాయి వసతి కళాశాల, బాలికల హాస్టల్ భవనం ఇంకా ప్రారంభానికి నోచుకోక పోవడం శోచనీయం. భవనాన్ని బాగా నిర్మించినా అశాసీ్త్రయంగా నిర్మాణం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. హాస్టల్, కళాశాలను కర్ణాటక హౌసింగ్ బోర్డు రూ.8.5 కోట్ల ఖర్చుతో నిర్మించింది. కానీ ప్రారంభం కాకపోవడంతో భవనం నిరుపయోగంగా ఉంది. ఈనేపథ్యంలో సంబంధిత అధికారులు, పాలకులు హాస్టల్ భవనాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజహుబ్లీ: వివిధ జిల్లాల పాలిట ఆరోగ్య కామధేను కల్పవృక్షంగా వర్ధిల్లుతున్న కర్ణాటక మెడికల్ కళాశాల పరిశోధన కేంద్రం ఆవరణలో 50 పడకల అత్యవసర విభాగానికి సంబంధించిన ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి హుబ్లీ ధార్వాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి సదరు ఆవరణలో సోమవారం భూమిపూజ చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ధార్వాడ ఎంపీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరుల సహాయ సహకారాలతో కేఎంసీ ఆస్పత్రిలో రోగులకు అన్ని వసతులు కల్పించేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినన్ని నిధులు కేటాయించి ఈ ఆస్పత్రిని అత్యాధునిక సేవలతో అలరాలేలా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. ఇళ్లలో చోరీలు.. నిందితుని అరెస్టు కోలారు: 2018లో కోలారు నగరంలోని 8 ఇళ్లలో జరిగిన దొంగతనం కేసులకు సంబంధించి నిందితుడిని కోలారు నగర పోలీసులు అరెస్టు చేశారు. హాసన జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన సంతోష్ అలియాస్ ఐపీఎల్ సంతోష్(38) పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు. ఇతనిపై మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. నిందితుడి ఆచూకీ కోసం డీఎస్పీ నాగ్తె నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రచించారు. నిందితుడిని హాసన జిల్లా సకలేశపుర– బెంగళూరు బైపాస్ వద్ద అరెస్టు చేసి కోలారుకు తీసుకొచ్చి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఆరోగ్య శిబిరం లబ్ధి పొందాలి కోలారు: ప్రజలు ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నగరసభ సభ్యుడు సమీవుల్లా తెలిపారు. సోమవారం నగరంలోని చిక్కబళ్లాపురం రోడ్డులో ట్రూకేర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. తాము ఇప్పటికే గత 6 ఏళ్లుగా అనేక ఉచిత ఆరోగ్య శిబిరాలను, పలు జనపర కార్యక్రమాలను నగరంలో నిర్వహించినట్లు తెలిపారు. ట్రూకేర్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సకై ్లన్ మహమ్మద్ మాట్లాడుతూ తమ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలతో పేద రోగులకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. కాగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఎస్డీపీఐ కార్యకర్తలు ఆరోగ్య శిబిరంపై ఇంటింటా ప్రచారం చేశారు. -
8 నుంచి రాఘవేంద్ర స్వామి సప్త రథోత్సవాలు
రాయచూరు రూరల్: మంత్రాలయంలో ఈనెల 8 నుంచి 14 వరకు రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధనోత్సవాలు, సప్తరథోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగల్ పేర్కొన్నారు. సోమవారం మంత్రాలయం మఠంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరాధనోత్సవాల్లో భాగంగా 10న పూర్వారాధన, 11న మధ్యారాధన, 12న ఉత్తరాధన జరుగుతుందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, కేరళ, పాండిచ్చేరి నుంచి వచ్చే భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించామన్నారు. మఠం అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. మంత్రాలయంలో జరిగే ఆరాధనోత్సవాలకు అన్ని విధాలుగా వసతులు సమకూర్చామన్నారు. కాగా ఇదే సందర్భంగా రాఘవేంద్ర స్వామి అనుగ్రహ అవార్డును ప్రదానం చేస్తామని ఆయన వెల్లడించారు. 10న జరగనున్న పూర్వారాధనలో ఉత్తరప్రదేష్ కాశీ పీఠం విద్వాంసుడు రాజారాం శుక్లా, తమిళనాడు విఠల్లకు ప్రదానం చేస్తామని తెలిపారు. -
ప్రేమ వ్యవహారానికి యువకుడు బలి
హొసపేటె: ముస్లిం అమ్మాయిని ప్రేమించిన హిందూ యువకుడు గవిసిద్దప్ప నాయక్ను కొప్పళ నగరంలోని 3వ వార్డులోని మసీదు ముందు ముస్లిం యువకుడు సాదిక్ కోల్కర్ హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. గవిసిద్దప్పను హత్య చేసిన సాదిక్ ఆదివారం రాత్రి నేరుగా రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. గవిసిద్దప్ప గత రెండేళ్లుగా గౌరీ అంగళ ప్రాంతానికి చెందిన మైనర్ ముస్లిం బాలికను ప్రేమించి ఆమెతో ఇంటి నుంచి పరారయ్యాడు. వీరి ప్రేమ విషయంపై నాలుగైదు సార్లు పంచాయతీలు జరిగాయి. అయితే గవిసిద్దప్ప, ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమ కొనసాగింది. గవిసిద్దప్ప ప్రేమించిన యువతిని సాదిక్ కూడా ప్రేమించాడు. సాదిక్తో ప్రేమ బంధాన్ని తెంచుకున్న యువతి గవిసిద్దప్పను ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న సాదిక్ గవిసిద్దప్పతో చాలా సార్లు గొడవపడ్డాడు. ఈ విషయం తీవ్రస్థాయికి చేరుకుంది. పక్కా ప్రణాళికతో హత్య ఈ క్రమంలో గవిసిద్దప్పను హత్య చేయాలని సాదిక్ పథకం వేశాడు. బహదూర్బండి నుంచి బైక్పై వస్తున్న వస్తున్న గవిసిద్దప్పను మసీదు సమీపంలో గొంతు కోసి, మెడపై కొడవలితో నరికి చంపారు. ఎస్పీ డాక్టర్ రామ్ అరసిద్ది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముగ్గురు ముస్లిం యువకులు గవిసిద్దప్పను హత్య చేశారని చెబుతున్నారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదివారం హత్యకు ముందు సాదిక్ ఒక కత్తిని తీసుకొని దాన్ని రీల్ చేసి బిల్డప్ ఇచ్చాడు. అతను తన ఇన్స్ట్రాగామ్లో ఒక స్టేటస్ పెట్టాడు. రాత్రి 7.30 గంటలకు గవిసిద్దప్పను హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. మృతుడు గవిసిద్దప్ప నాయక్ తండ్రి నింగజప్ప టణకనల్ ఫిర్యాదు మేరకు నిందితుడు సాదిక్తో పాటు మరో నలుగురిపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సాదిక్ అరెస్టు కాగా మిగతా నలుగురి పట్టివేతకు కొప్పళ రూరల్ పోలీసులు గాలింపు చేపట్టారు. గవిసిద్దప్పకు రాఖీలు కట్టి వీడ్కోలుకాగా హత్యకు గురైన గవిసిద్దప్ప నాయక్పై పుట్టెడు దుఃఖంలోనూ సోదరీమణులు తమ సోదర ప్రేమను చూపారు. అవును... రక్షా బంధన్ సందర్భంగా వారు మరణించిన గవిసిద్దప్ప చేతికి రాఖీలు కట్టారు. పీకల్లోతు దుఃఖంలోనూ వారు తమ సోదరుడికి రాఖీ కట్టి కన్నీటి వీడ్కోలు పలికారు. ముస్లిం యువతిని ప్రేమించిన హిందూ యువకుడి హత్య కొప్పళ నగరంలో ఘటన, పరారీలో నలుగురు నిందితులు -
యువత రక్తదానం చేయాలి
రాయచూరు రూరల్ : ఆపత్కాలం, అత్యవసర సమయంలో రక్తదానానికి యువత ముందుకు రావాలని నగరసభ ఇంచార్జి అధ్యక్షుడు సాజిద్ సమీర్ సూచించారు. నగరంలోని లా కళాశాలలో ిసిటీ ఎలెవన్ క్లబ్, రెడ్ క్రాస్, వీర్ సావర్కర్ ఆధ్వర్యంలో మాజీ క్రికెట్ దిగ్గజం విజయ్ రెడ్డి స్మరణార్థం జరిగిన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్తం పుడుతుందన్నారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, శరణ రెడ్డి పాటిల్, మృత్యుంజయ, విజయ్ కుమార్, భరత్ రెడ్డి, వెంకటరెడ్డి, పద్మ, అరుణ, రవిరాజ్, వసుంధర పాటిల్లున్నారు. హత్య ఆరోపణలతో వ్యక్తిపై దాడిరాయచూరు రూరల్: ఒకరిని హత్య చేశారనే ఆరోపణలపై దాడి చేసి గాయాలు పాల్జేసిన ఘటన జిల్లాలోని సింధనూరు తాలూకాలో చోటు చేసుకుంది. హత్యకు గురైన కుటుంబీకులు దాడికి పాల్పడ్డారని డీఎస్పీ తళవార్ తెలిపారు. సింధనూరు తాలూకా బంగాలీ క్యాంప్ నివాసి దీపాంకర్పై మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు దాడి చేసి గాయపరిచారన్నారు. బంగాలీ క్యాంప్ నివాసి అంగోర్ను దీపాంకర్ మహారాష్ట్రకు పంపాడని తెలిపారు. అంగోర్ మరణించడంతో దీపాంకర్ హత్య చేయించాడని భావించి ఆదివారం రాత్రి దీపాంకర్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. గాయపడ్డ దీపాంకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. సమాజ సేవకులకు సన్మానం రాయచూరు రూరల్: విజ్ఞాన రంగంలో దేశానికి వన్నె తెచ్చిన వ్యక్తి అబ్దుల్ కలాం అని మటమారి జ్ఞానానంద స్వామీజీ పేర్కొన్నారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందరింలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సంస్థ ఆధ్వర్యంలో కలాం 10వ పుణ్యారాధన సందర్భంగా సమాజంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన సేవకులకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డులను అందించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ కలాం ఆదర్శాలను, ఆశయాలను నెరవేర్చేందుకు ప్రయత్నించాలన్నారు. సంస్థ అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, బ్రహ్మకుమారి వర్సిటీ సంచాలకురాలు శారద, రమాకాంత్, ఉమేష్ కాంబ్లే, రవికుమార్, రాజశేఖర్, మహంతేష్ బిరాదార్లున్నారు. అర్చకులను తొలగించాలిరాయచూరు రూరల్: రాయచూరు తాలూకా గాణదాళ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో అన్య అర్చకులను తొలగించాలని టీయూసీఐ సంచాలకుడు అమరేష్ డిమాండ్ చేశారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్లో ఆందోళన చేపట్టి మాట్లాడారు. మూల అర్చకులను కాకుండా ఆంజనేయ స్వామి, ఎరుకలమ్మ ఆలయంలో దేవుడి సొమ్మును స్వాహా చేస్తున్న లక్ష్మణస్వామిని తొలగించాలన్నారు. ఆలయ ప్రాంగణంలో వేసుకున్న అంగళ్లు, హోటళ్ల యజమానుల నుంచి మామూళ్లు వసూలు చేయడాన్ని ఖండించారు. ఆందోళనలో నరసింహ, నల్లన్న, భీమణ్ణ, శివరాజ్, రవి, నాగరాజ్, యల్లప్ప, అయ్యప్ప, మల్లే్ష్, ధూళయ్యలున్నారు. ఎరువుల దుకాణంలో అగ్నిప్రమాదం కోలారు: బంగారుపేట తాలూకా హుణసనహళ్లి గ్రామ రైల్వే బ్రిడ్జి సమీపంలో ఉన్న ఎరువుల దుకాణంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుని దుకాణంలో నిల్వ చేసిన ఎరువుల బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రి దుకాణం మూసివేసిన తరువాత కొద్దిసేపటికి దుకాణం నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. గమనించిన స్థానికులు వెంటనే దుకాణం యజమానికి సమాచారం అందించారు. అతడు తిరిగి దుకాణం వద్దకు వచ్చి తలుపులు తెరిచి చూడగా దుకాణంలో మంటలు కనిపించాయి. పలు బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ఘటనలో లక్షలాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం. -
సరుకు రవాణాలో నైరుతి రైల్వే జోరు
హుబ్లీ: 2025–26వ ఆర్థిక సంవత్సరానికి గాను తొలి నాలుగు నెలల్లో నైరుతి రైల్వే జోన్ సరుకు రవాణా, ప్రయాణికుల రవాణాతో కలిపి మొత్తం మీద ఆదాయార్జనలో రెండింటిలోను అద్వితీయమైన రికార్డు సాధించింది. ఇది కార్యాచరణ శ్రేష్టత, వినియోగదారుల ఆధారిత సాంకేతిక అంశాలపై నిరంతరం దృష్టి ప్రతిబింబిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. గత ఏప్రిల్ నుంచి జూలై 2025 వరకు జోన్ మొత్తం మీద 16.27 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇదే అవధిలో 14.05 మిలియన్ టన్నుల కన్నా 15.08 శాతం ఎక్కువ. ఈ 2.22 మిలియన్ టన్నుల పెరుగుదల నైరుతి రైల్వే తన సేవలను మరింత పెరుగుపరుచుకోవడంతో పాటు ప్రముఖ పరిశ్రమలతో ఉత్తమ సంబంధాలను సాధించడానికి నిదర్శనం. రవాణా చేసిన ప్రముఖ సరుకుల్లో ముడి ఇనుము 6.41 మిలియన్ టన్నుల లోడింగ్తో తొలి స్థానంలో ఉంది. ఇది గత ఏడాది 5.54 మిలియన్ టన్నుల కన్నా 15.08 కన్నా ఎక్కువ. ఉక్కు లోడింగ్ అత్యంత వేగంగా వృద్ధి చెందగా 3.54 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 2.49 మిలియన్ టన్నుల నుంచి 42.10 టన్నులకు పెరిగింది. బొగ్గుల రవాణా కూడా 13.4 శాతం ఎక్కువగా 3.32 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఉక్కు యూనిట్లకు భారీగా సరుకు రవాణా ఉక్కు ఉత్పత్తి యూనిట్లకు ముడి సరుకులను 0.47 మిలియన్ టన్నుల నుంచి 51.4 టన్నులకు పెరిగి 0.71 మిలియన్ టన్నులు అయింది. ఇలా పెరుగుదలలో తొలి స్థానం అక్రమించింది. రసాయనిక ఎరువుల లోడింగ్ కూడా 0.37 మిలియన్ టన్నుల నుంచి 12.6 శాతానికి పెరిగి 0.42 మిలియన్ టన్నులకు చేరింది. కంటైనర్ రవాణా ద్వారా 0.25 మిలియన్ టన్నుల నుంచి 29.4 శాతం పెరిగి 0.32 మిలియన్ టన్నులకు చేరింది. ఆదాయార్జన విషయంలో నైరుతి రైల్వే అన్ని ప్రముఖ ఆదాయ శ్రేణుల్లో మెరుగైన పెరుగుదలను నమోదు చేసింది. ప్రయాణికుల ఆదాయం రూ.1.64 కోట్లు కాగా గత ఏడాది గడువులో ప్రయాణించిన 55 మిలియన్ల ప్రయాణికులతో పోలిస్తే ఈ ఏడాది 59 మిలియన్ల మంది ప్రయాణించారు. కోచింగ్ సేవల నుంచి పార్శిల్, అలాగే ఇతర ప్రయాణికుల సేవలు కలిపి రూ.113 కోట్లను గడించింది. ఇది గత ఏడాది 107 కోట్లుగా ఉండగా ప్రస్తుత ఏడాది మంచి ప్రగతి సాధించిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఆదాయార్జనలో సరికొత్త రికార్డు ముడి ఇనుము లోడింగ్లో తొలి స్థానం -
బాదామి గుహాలయం
నయన మోహనం..సాక్షి, బళ్లారి: శిలలపై శిల్పాలు చెక్కినారు మన వారు సృష్టికే అందాలు తెచ్చినారు అని ఓ మహాకవి తెలుగులో అద్భుతమైన పాటను రాశారు. అంటే అందుకు కారణం దేశంలో పలు ప్రాంతాల్లో శిల్పులు శిలలపై అద్భుతమైన కళాసంపదను సృష్టించడమే. కర్ణాటకలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీలో ఏ విధంగా శిల్పులు తమ కళా ప్రతిభను చూపారో కర్ణాటకలో బాదామి, పట్టదకల్ తదితర ప్రాంతాల్లో కూడా అద్భుతమైన శిల్పకళా సంపద ఉట్టిపడుతోంది. ముఖ్యంగా బాదామి ప్రాంతంలో చారిత్రాత్మకమైన అరళి తీర్థలో సుందరమైన పర్యాటక ప్రదేశాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ప్రశాంత వాతావరణంలో అద్భుతమైన శిల్ప కళా సంపదను చూడవచ్చు. అక్కడ సందర్శించిన ప్రతి సారి కొత్తకొత్త రీతిలో పర్యాటకులకు అగుపించడం విశేషం. బాదామి చాళుక్యుల కాలంలో నిర్మించిన స్మారకాలు, శిల్పాలు కళాప్రతిభకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సౌందర్యమైన కళాసంపదను దూరదృష్టితో నిర్మించారు. వస్తు సంగ్రహాలయం, ఎత్తైన కొండలో శివాలయం, రెండంతస్తుల మంటపం, అగస్థ్య తీర్థం, పరిసరాల్లో తూర్పున ఉన్న కొండలో కనిపించే భూతనాథ ఆలయాల సమూహం తదితర ప్రాంతాలు ఎన్ని సార్లు చూసినా తనివితీరని అద్భుతమైన కళా సంపదగా కీర్తి చెందింది. గుహల్లో ప్రాచీన మూర్తుల విగ్రహాలు ఆశ్చర్యం కలిగించేలా అక్కడ చిన్న గుహలో చెక్కిన ప్రాచీన మూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి. వీటిని చూస్తేనే అపారమైన అనుభూతి కలుగుతుంది. గుట్టపై ఉన్న చిన్నపాటి కొలనే ఈ అరళి తీర్థం. అంతగా లోతు కనిపించని ఈ నీటిలో ఏర్పడిన కొలను అక్కడక్కడ పాచీ, చిన్నా చితకా మొక్కలతో నయనమనోహరంగా కనిపిస్తాయి. ఎర్రమట్టి శిలలతో ఏర్పడిన అరళి తీర్థం గుట్టప్రాంతం ప్రకృతి గుహలతో రూపొందింది. ప్రకృతి పరంగా గొడుగుల మాదిరిగా నిర్మితమైన ఈ చిన్న చిన్న గుహల్లో సుమారు 25 అడుగుల మేర విశాలమైన తెరచిన గుహ, లోపలి అంచుపై వినాయకుడు, అనంతశయన, మహిషాసుర మర్థిని, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సూర్యదేవుల మూర్తులున్నాయి. రెండున్నర అడుగుల ఎత్తున వెడల్పుతో లోపల, బయటకు తీర్చిదిద్దిన శిల్పాలు ఒకే వరుసలో కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న శిల్పాల్లో సూర్యదేవుడి శిల్పం అత్యంత మనోహరంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి ఎనిమిది చేతులున్న సూర్యదేవుడి ఖడ్గం, డాలు, విల్లు, బాణం, త్రిశూలాలు కాకుండా కమలం పువ్వును పట్టుకొన్న సారథితో సప్తహస్తాల రథంలో కమలం పీఠంపై నిలబడ్డాడు. ఆయన పక్కన చామర శిల్పాలున్నాయి. ప్రతి రాయిలో ఉట్టిపడిన అద్భుత శిల్పకళా సౌందర్యం పర్యాటకులతో పాటు భక్తులకు కనువిందు కల్గిస్తున్న వైనం -
ఎరువుల సరఫరాలో సర్కారు విఫలం
బళ్లారి టౌన్: రాష్ట్రంలో రైతులకు అవసరమైన ఎరువులను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ పేర్కొన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆ పార్టీ కార్యాలయం నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు నిరసన ర్యాలీని నిర్వహించి ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించిన అనంతరం తాయణ్ణ తదితరులు మాట్లాడారు. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. ఈసారి ఖరీఫ్ సీజన్లో వర్షాలు సక్రమంగా కురిశాయన్నారు. రైతులు వ్యవసాయ కార్యకలాపాలను ప్రారంభించారన్నారు. అయితే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సరైన సమయంలో అందించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 6.8 లక్షల టన్నుల ఎరువులు కేటాయించగా, కేంద్రం నుంచి ఎరువులను తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సర్కారు వైఫల్యాలపై రాష్ట్ర గవర్నర్ తగిన మార్గదర్శనం చేసి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ నేతలు లక్ష్మికాంత్రెడ్డి, అశోక్, ప్రభాకర్రెడ్డి, కిరణ్, జావేద్, ప్రదీప్, దివాకర్, మహిళా నేతలు పుష్ప, రేష్మ, రాజేశ్వరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సక్రమంగా ఎరువుల పంపిణీకి డిమాండ్ రాయచూరు రూరల్: రైతులకు సక్రమంగా ఎరువులు పంపిణీ చేయాలని గురుమఠకల్ శాసన సభ్యుడు శరణే గౌడ కందకూరు డిమాండ్ చేశారు. సోమవారం జేడీఎస్ ఆధ్వర్యంలో యాదగిరి జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. రైతులకు డీఏపీ, ఎరువులు, క్రిమి సంహారక మందులు పంపిణీ చేయకుండా దొంగతనంగా నల్ల బజారులో విక్రయిస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలిగించారన్నారు. రైతులకు ఎరువులు పంపిణీ చేయాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
నేటి నుంచి ఆర్టీసీ బంద్!
కర్ణాటక: ప్రజా రవాణాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న కేఎస్ ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులు మంగళవారం బంద్ అయ్యే అవకాశముంది. పలు డిమాండ్లపై సర్కారుతో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు ఫలించలేదు. ఆర్టీసీ, బీఎంటీసీ ఉద్యోగులు 38 నెలల వేతన బకాయిల చెల్లింపుతో పాటు అనేక డిమాండ్ల పరిష్కారం కోసం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. రవాణాశాఖ ఒక్కోట నాయకులు సీఎం సిద్దరామయ్య సోమవారం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. మంగళవారం నుంచి బస్సులు రోడ్ల పైకి వెళ్లవు. ఉదయం 6 నుంచి సమ్మె చేస్తామని రవాణా మండలి కార్మిక సంఘాల జాయింట్ క్రియా సమితి అధ్యక్షుడు అనంత సుబ్బారావ్ తెలిపారు. 14 నెలల బకాయిలిస్తాం: మంత్రి ఉద్యోగులకు 14 నెలల వేతన బకాయిలను ఇవ్వడానికి సీఎం సమ్మతించారని రవాణాశాఖమంత్రి రామలింగారెడ్డి తెలిపారు. విధానసౌధ వద్ద విలేకరులతో రామలింగారెడ్డి మాట్లాడుతూ బకాయిల కింద రూ.718 కోట్లు చెల్లిస్తామని అన్నారు. వాయిదాకు హైకోర్టు సూచన రవాణా సమ్మెను ఒకరోజు వాయిదా వేయాలని హైకోర్టు న్యాయమూర్తులు కేఎస్.ముదగల్, ఎంజీఎస్.కమల్ ధర్మాసనం ఉద్యోగులకు సూచించింది. సమ్మె వల్ల జనజీవనం అస్తవ్యస్తమౌతుందని బెంగళూరువాసి జే.సునీల్ తదితరులు పిల్ వేశారు. విచారించిన జడ్జిలు ఒకరోజు వాయిదా వేయాలని సూచించారు. రవాణా ఉద్యోగులు సెలవులు రద్దు ఈ నేపథ్యంలో ప్రభుత్వం రవాణా శాఖ ఉద్యోగులు సెలవుల రద్దుచేసింది. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనకుండా కట్టడి చేసింది. ఎవరికీ సెలవులు ఇవ్వరాదని, వీలైతే వారం సెలవు కూడా రద్దుచేయాలని అధికారులను ఆదేశించింది. గైర్హాజరయ్యే ఉద్యోగులు వేతనాల్లో కోత విధించాలని ఆదేశించింది. సమ్మె విరమించండి: సిద్దరామయ్య ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాల నేతలతో సీఎం సిద్దరామయ్య విధానసౌధలో సుదీర్ఘంగా చర్చించారు. డిమాండ్లను తీర్చడానికి గడువు ఇవ్వాలని, సమ్మె యోచనను విరమించాలని కోరారు. కానీ ఉద్యోగులు మాత్రం డిమాండ్లు నెరవేర్చాలని పట్టుబట్టారు. సమ్మె వల్ల జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగే అవకాశముంది. -
కేఆర్ఎస్ను టిప్పు నిర్మించారా?
● మంత్రిపై విజయేంద్ర ధ్వజం దొడ్డబళ్లాపురం: మైసూరు చరిత్ర తెలిసి కూడా మంత్రి మహదేవప్ప చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. బెంగళూరు బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన టిప్పు సుల్తాన్ కన్నంబాడి కట్ట (కృష్ణరాజ సాగర డ్యాం)కు శంకుస్థాపన చేశారని చెప్పి మైసూరు మహారాజులను మంత్రి అవమానించారన్నారు. గతంలో కూడా సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేతలు మైసూరు మహారాజులను కించపరిచారన్నారు. 1799లో టిప్పు సుల్తాన్ యుద్ధంలో చనిపోయాడని, 1902 తరువాత కేఆర్ఎస్ డ్యాం నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. డ్యాం కట్టడానికి డబ్బులు లేక మైసూరు మహారాజు భార్య బంగారు నగలు ముంబైకి తీసికెళ్లి కుదువ పెట్టి డబ్బులు తీసుకొచ్చిన చరిత్ర అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ నాయకులు ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఇలా మాట్లాడడం తగదన్నారు. మఠ సారథ్యానికి మత భేదంమైసూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా చౌడహళ్లి గ్రామంలో కొత్తగా నిర్మాణం అయిన గురుమల్లేశ్వర విరక్త మఠానికి యాదగిరి జిల్లా సహపుర గ్రామానికి చెందిన నిజలింగ స్వామిని మఠాధిపతిగా నియమించారు. అయితే ఆయన డాక్యుమెంట్లను పరిశీలించి చూడగా అందరూ అవాక్కయ్యారు. ఆధార్కార్డు, మార్కుల జాబితాలు, పాన్ కార్డులను పరిశీలిస్తే అందులో అతని పేరు మహ్మద్ నిసార్గా ఉంది. స్వామిని ప్రశ్నించగా తాను ముస్లింగానే జన్మించానని, అయితే లింగదీక్ష చేసుకున్నానని తెలిపాడు. కానీ గ్రామస్తులు , మఠ నిర్వాహకులు ఆయనను అంగీకరించక వెనక్కి పంపించారు. కాగా, నిస్సార్ చిన్ననాటి నుంచే బసవణ్ణ తత్వ చింతనలకు ప్రభావితుడై జంగమ దీక్ష తీసుకుని బసవతత్వ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ జీవిస్తున్నట్లు తెలిసింది. -
వసతి పాఠశాలకు చిరుత ముప్పు
తుమకూరు: నగర శివార్లలోని భారతీయ రెడ్క్రాస్ సంస్థ ఆధ్వర్యంలోని మూగ బధిర దివ్యాంగ విద్యార్థుల వసతి పాఠశాలలో సోమవారం ఉదయం చిరుతపులి ప్రత్యక్షమైంది. దీంతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. బెళగుంబ రోడ్డులో ఈ పాఠశాల ఉంది. ఈ పాఠశాల సమీపంలోనే కొండలు, అడవులు కూడా ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి చిరుత పాఠశాల ఆవరణలోకి వస్తోంది. సోమవారం ఉదయం 9 గంటలకు పాఠశాల కార్యాలయం తాళాలు తెరుస్తున్న సమయంలో కాంపౌండ్లో అటుగ నడుచుకుంటూ వెళుతుండడం చూసిన పిల్లలు, టీచర్లు వెంటనే భయంతో లోపలికి పరుగులు తీసి తలుపులు వేసుకున్నారు. అధికారుల తనిఖీ కొండలో ఈ చిరుత, కూనలతో నివసిస్తున్నట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గడిచిన మూడేళ్లలో ఐదారు సార్లు చిరుతను చూసినట్లు తెలిపారు. కొన్నిసార్లు కుక్కలను ఎత్తుకెళ్లి భక్షించింది. రెడ్క్రాస్ డైరెక్టర్ ఎస్.నాగణ్ణ, క్యాత్సంద్ర పోలీసులు, అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుత సంచరించిన గుర్తులను పరిశీలించారు. చిరుతను పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేస్తామన్నారు. చిరుత వల్ల పిల్లలు, టీచర్లు తీవ్రంగా భయపడుతున్నారు. ఇళ్లకు వెళ్లిపోతామని పిల్లలు చెబుతున్నారు. విద్యార్థులు, టీచర్లకు భయం -
ఘన పయనం
గజ సార్వభౌములఏ ఏనుగులు వచ్చాయంటే గజపయన కోలాహలంమైసూరు: ప్రతి ఏటా వైభవోపేతంగా నిర్వహించే విశ్వ విఖ్యాత దసరా ఉత్సవాలకు తొలి అడుగు పడింది. అటవీ శిబిరం నుంచి గజరాజు అభిమన్యు నేతృత్వంలో ఏనుగులు సోమవారం నగరానికి బయలుదేరాయి. హుణసూరు తాలూకా వీరనహొసహళ్లిలో అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు గజరాజులకు ఘనంగా పూజలు నిర్వహించి గజ పయనానికి శ్రీకారం చుట్టారు. మైసూరు రాజ ప్రసాదం అర్చకుడు ప్రహ్లాద్ రావ్ నేతృత్వంలో అర్చకులు 9 ఏనుగులకు పాదాలు కడిగి , పసుపు కుంకుమ రాసి పూలతో అలంకరించి, చెరుకు, బెల్లం, అరటిపండ్లు, వివిధ రకాల తినుబండారాలు నైవేద్యంగా సమర్పించారు. మధ్యాహ్నం 12.30 నుంచి 12.59 మధ్య గంటల మధ్య శుభ తులా లగ్నంలో ఏనుగులను పూజలు చేసి, దిష్టి తీసి గజ పయనాన్ని ప్రారంభించారు. ఊరేగింపులో వీరగాసె, జానపద కళాకారుల ప్రదర్శనల కోలాహలం మిన్నంటింది. పరిసర గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. విశేష ప్రతిభ కనపర్చిన మావటీలకు అర్జున పేరుతో అవార్డులు అందించారు. సఫారీలో వన్యజీవులు, దసరా జంబూ సవారీలో అలంకృత ఏనుగులను చూసి ఆనందించయే మనం వాటి సంరక్షణకు కూడా ముందుకు రావాలని మంత్రి ఈశ్వర ఖండ్రే ఈ సందర్భంగా కోరారు. ప్రకృతి సమతౌల్యానికి వన్యజీవులు ఎంతో అవసరం, వాటి రక్షణకు మనమందరం కట్టుబడాలన్నారు. అక్రమంగా విద్యుత్ తీగలను పొలాల వద్ద వేయడం వల్ల కరెంటు షాక్తో ఏనుగులు మరణిస్తున్నాయి. వలల్లో చిక్కి పులులు, చిరుతలు చనిపోతున్నాయి. మలె మహదేశ్వర కొండ అడవిలో ఐదుపులులు విషాహారం వల్ల చనిపోయాయి అని వాపోయారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవికి జీవించే హక్కుందన్నారు. వన్య జీవుల స్థలాలను ఆక్రమించిన మనం వాటిని చంపకుండా సంరక్షణ చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో పశువులను తెచ్చి మన రాష్ట్ర అటవీ ప్రాంతంలో మేపుతుండడం వల్ల వన్య జీవులకు అడవులలో ఆహారం కరువైందని చెప్పారు. అందువల్ల పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పశువులను నిషేధిస్తామని తెలిపారు. ఏనుగుల సంరక్షణ కోసం రైలు పట్టాల వెంబడి బారికేడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అటవీ సంపదను రక్షిస్తున్న ఆదివాసీలు, అరణ్యవాసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. మంత్రి కె వెంక టేష్, ఎమ్మెల్యేలు హరీష్గౌడ, తన్వీర్ సేట్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. గజ పయనం ఆరంభం 9 ఏనుగుల రాక మైసూరు దసరా ఉత్సవాలకు సన్నాహాలు వన్యజీవులను కాపాడుకోవాలి 7న ప్యాలెస్కు రాక కాళ్లు కడిగి.. కెప్టెన్ అభిమన్యు (59 ఏళ్లు), భీమ (25), కంజన్ (24), ధనంజయ (44), ప్రశాంత్ (53), మహేంద్ర (42), ఏకలవ్య (40), కావేరి (45), లక్ష్మీ (53) గజరాజులు వచ్చాయి. కొంతదూరం ఊరేగింపులో నడిచాక, ప్రత్యేక లారీలలో ఏనుగులను మైసూరులోని అటవీ భవనానికి తరలించారు. ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం 12.06 నుంచి 12.30 మధ్యన శుభ తులా లగ్నంలో రాజప్రసాదం జయమార్తాండ ద్వారం నుంచి ఏనుగులు రాజ ప్రసాదంలోనికి ప్రవేశిస్తాయి. మైసూరు అరమనె మండలి, జిల్లా అధికారులు సంప్రదాయ స్వాగతం పలుకుతారు. రాజప్రపాదంలో ఆవరణలోని షెడ్లలో ఏనుగులు, మావటీల కుటుంబాలు బస చేస్తాయి. మరో 5 ఏనుగులు త్వరలోనే చేరుకుంటాయి. -
శివమొగ్గలో ప్రదర్శనకు యుద్ధ విమానం
శివమొగ్గ: భారత వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానాన్ని శివమొగ్గ నగరానికి తీసుకొచ్చారు. ఫ్రీడంపార్కు ఆవరణలో దీనిని ఉంచారు. ఇటీవలే ఈ పార్కులో యుద్ధ ట్యాంకును కూడా ఉంచారు. లోక్సభ ఎంపీ బీవై రాఘవేంద్ర యుద్ధ విమానాన్ని వీక్షించారు. 1960లో దీనిని తయారు చేసినట్లు, 2023లో ఈ విమానం రిటైరైందని, దీనిని ప్రజల సందర్శనార్థం ఉంచుతారని చెప్పారు. ముక్కలుగా ఉన్న విమానాన్ని పూర్తిగా అతికించి సిద్ధం చేయనున్నారు. గంధం కాయలు తిని బాలలకు అస్వస్థత మైసూరు: శ్రీగంధం కాయలు తిని 12 మంది పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటన చామరాజనగర జిల్లా యళందూరు తాలూకా యరియూరు గ్రామంలో జరిగింది. కూలీ పనుల కోసం మహారాష్ట్రకు చెందిన కార్మికులు యళందూరు తాలూకా వివిధ గ్రామాలకు వచ్చారు. యళందూరులో టెంట్ వేసుకుని జీవిస్తున్నారు. వారి పిల్లలు రోడ్డుపక్కన పడి ఉన్న గంధం కాయలను పండ్లుగా భావించి తినగానే వాంతులు కనిపించాయి. వెంటనే తల్లిదండ్రులు యళందూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం చామరాజనగర జిల్లాస్పత్రికి తరలించారు. పురిట్లో తల్లీ బిడ్డ మృతిమైసూరు: చామరాజనగర జిల్లాస్పత్రిలో ప్రసవం కోసం వచ్చి బాలింత, పసిగుడ్డు మరణించారు. ఈ విషాదంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. వివరాలు.. బసప్పనపాళ్య గ్రామానికి చెందిన భాగ్య (30)కు నెలలు నిండడంతో కాన్పు కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆదివారం ప్రసవం చేస్తామని వైద్యులు తెలిపారు. రాత్రి ప్రసవ సమయంలో తల్లి, కడుపులోని బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఘోరం జరిగిపోయిందని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రసవం సమయంలో తీవ్ర రక్తస్రావం వల్ల తల్లీబిడ్డా మరణించారని వైద్యులు తెలిపారు. జ్వరానికి ఇద్దరు బాలల బలియశవంతపుర: చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హెస్టల్ గ్రామంలో తీవ్రమైన జ్వరంతో ఇద్దరు బాలలు మరణించారు. మూడిగెరె వ్యవసాయ శాఖలో డ్రైవర్గా పని చేస్తున్న రవి–పల్లవి దంపతుల కూతురు ప్రేరణ (11), కూలీ కార్మికుడు బసవరాజ్–మంజుళ కూతురు సారా (9) మృతులు. ప్రేరణ 6, సారా 4వ తరగతి చదివేవారు. వారంరోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు చేయించారు. వైద్యుల సూచనల మేరకు చిక్కమగళూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించక చనిపోయారు. వైద్యాధికారులు గ్రామానికి వైద్యులను పంపి జ్వర బాధితులకు వైద్య చికిత్సలు నిర్వహించారు. జ్వరం వస్తే భయపడవద్దని తెలిపారు. గ్రామంలో విషజ్వరాలను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
ధర్మస్థళ కేసు: అదే సస్పెన్స్.. తెరపైకి జీపీఆర్ టెక్నాలజీ!
కర్ణాటక దైవక్షేత్రం ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మొత్తం 13 పాయింట్లలో.. మిగిలిన పాయింట్లలో ఆరో రోజు సిట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ మూడు పాయింట్లు హైవేను ఆనుకుని ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడి(Whistleblower)ని వెంటపెట్టుకుని అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు.ధర్మస్థళలో ఇవాళ 11, 12వ ప్రాంతాల్లో మానవ అవశేషాల కోసం తవ్వకాలు జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం 8, 9, 10వ పాయింట్ల వద్ద 8 ఫీట్ల లోతులో తవ్వకాలు జరిపినా ఏం లభించలేదు. ఆదివారం రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులకు సెలవు కావడంతో తవ్వకాలు జరపలేదు. అదే సమయంలో.. ఆయా పాయింట్లలో యాంటీ నక్సల్ ఫోర్స్ (ANF)ను కాపలాగా ఉంచారు.1998 నుంచి 2004 మధ్య ప్రముఖ దైవక్షేత్రం ధర్మస్థళంలో వందలాది మృతదేహాల ఖననం జరిగిందని, బలవంతంగా తనతో ఆ మృతదేహాలను పూడ్చి పెట్టించారని ఓ వ్యక్తి ముందుకు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అతను చూపించిన చోట్లలో అధికారులు తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీ చిన్న విషయం కేసుకు కీలకంగానే మారింది.నేత్రావతి నది ఒడ్డున ఉన్న ఆరో పాయింట్లో మనిషి ఎముకలు బయటపడ్డాయి. కానీ పుర్రె మాత్రం లభించలేదు. ఫోరెన్సిక్ పరీక్షలు ద్వారా వయస్సు, లింగం, మరణ కారణం నిర్ధారణ కావాల్సి ఉంది. అదే సమయంలో.. కొన్ని స్థావరాల్లో PAN కార్డు, ATM కార్డు లభించాయి. PAN కార్డు నెలమంగళ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. అతను జాండిస్తో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. అయితే.. ఏటీఎం కార్డు వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.జీపీఆర్ టెక్నాలజీతో..2003 సమయంలో కోల్కతాకు చెందిన అనన్య భట్ అనే మెడికో ధర్మస్థళంలో అనూహ్య రీతిలో అదృశ్యమైంది. అయితే అనన్య హత్యాచారానికి గురైందని, ప్రస్తుత తవ్వకాల్లో అవశేషాలు బయటపడే అవకాశం ఉందని ఆమె తల్లి సుజాత భట్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె దక్షిణ కన్నడ జిల్లా బెత్తంగడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉంటే.. వర్షాలు, మట్టి తడిగా ఉండటం వల్ల తవ్వకాల్లో ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ కేసులో సుజాత భట్ తరఫున ఆమె న్యాయవాది మంజునాథ్ ‘జీపీఆర్(Ground Penetrating Radar)’ టెక్నాలజీ వాడే అవకాశాన్ని పరిశీలించమని సిట్ను కోరుతున్నారు.జీపీఆర్ టెక్నాలజీ.. బాంబ్ డిటెక్టర్ తరహాలో ఉండే పరికరం. ఇది ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలను భూమిలోకి పంపుతుంది. అది భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి.. ఎముకలు, కేవిటీస్, తదితర మార్పులను గుర్తిస్తుంది. తద్వారా అనవసర తవ్వకాలను నియంత్రిస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు, ఆర్కియాలజీవాళ్లు ఈ సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ధర్మస్థళ కేసుకు ఇది ఎందుకు అవసరం అనే వాదనలోకి వెళ్తే.. ఈ కేసులో కీలకంగా ఉన్న పారిశుద్ధ్య మాజీ కార్మికుడు 13 పాయింట్లు చూపించాడు. అవి 2014 కంటే ముందు ప్రాంతాలని చెబుతున్నాడు. అయితే ఈ పదేళ్ల కాలంలో అక్కడ చాలా మార్పులు సంభవించాయి. భారీ వర్షం, మట్టి కొట్టుకుపోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎక్కడ మానవ దేహాలను ఖననం చేశారో గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి ధర్మస్థళం కేసులో జీపీఆర్ వినియోగం ఇప్పుడు కీలకంగా మారందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ డిమాండ్పై సిట్ ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టే ఆధారపడి ఉంటుంది. పైగా.. జీపీఆర్ ఉపయోగం కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రాథమికంగానే.. రూ.10-15 లక్షలు అవుతుంది. అదే అడ్వాన్స్డ్ వ్యవస్థలు రూ.30-50 లక్షల మధ్య ఉండొచ్చు. అద్దె బేస్డ్గా కూడా వీటి సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే వీటి వినియోగానికి శిక్షణ తప్పనిసరి. తప్పుకున్న జడ్జిజులై 18వ తేదీన సిటీ సివిల్ కోర్టు అదనపు జడ్జి విజయ్ కుమార్ రాయ్.. ధర్మస్థళంపై వచ్చిన కథనాలకు సంబంధించిన 8,842 వెబ్ లింకులను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు నిలుపుదల చేసింది. ఈలోపు.. ఈ కేసులో 332 మంది డిఫెండెంట్స్లో 25వ వ్యక్తి నవీన్ సూరింజే ఆసక్తికరమైన వాదన తెర మీదకు తెచ్చాడు.విజయ్ కుమార్ రాయ్ గతంలో(25 ఏళ్ల కిందట) మంగుళూరులోని ఎస్డీఎం(శ్రీ ధర్మస్థళ మంజునాథేశ్వర లా కాలేజీ)లో చదివారని, ఇక్కడ పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఈ కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసుతో వ్యక్తిగతంగా సంబంధం లేకున్నా తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జడ్జి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘న్యాయం జరగాలి మాత్రమే కాదు, అది జరుగుతున్నట్లు కనిపించాలి కూడా’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.ఐటీఆర్తో గుట్టురట్టుధర్మస్థళ, చుట్టుపక్కల ఊర్లకు సంబంధించి 2000–2015 మధ్య అసహజ మరణాల రిజిస్టర్ (UDR), పోస్టుమార్టం నివేదికలు, ఫోటోలు ఏవీ లేకపోవడం ఇప్పుడు అక్కడ ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు.. చట్టవిరుద్ధంగా కొందరు పోలీస్ అధికారులే ఓ బాలిక మృతదేహాన్ని ఖననం చేయడం తాను కళ్లారా చూశానని అంటున్నారాయన. అయితే ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. -
పులి జాడ.. చివరి మజిలీ ఎక్కడ?
మైసూరు: జాతీయ జంతువు పులి, వర్సెస్ అటవీ గ్రామాల ప్రజలుగా పరిస్థితి తయారైంది. పులి నిబంధనల పేరుతో తమ దైనందిన జీవితాలను కట్టుదిట్టం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. చామరాజనగర జిల్లాలో మలేమహదేశ్వర బెట్ట పరిధిలోకి వచ్చే అటవీ ప్రాంతంలో విషం పెట్టడం వల్ల ఐదు పులులు మరణించిన ఘటన కొన్ని గ్రామాలకు ఇబ్బందులను కలిగిస్తోంది. జనం అడవిలోకి అనవసరంగా ప్రవేశించకుండా అటవీశాఖ నిర్బంధం విధించారు. ముఖ్యంగా గ్రామాల్లో అనారోగ్యాలతో , తదితర కారణాల వల్ల మరణించిన వారి అంత్యక్రియలకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. నంజనగూడు తాలూకా మహదేవనగర గ్రామం ప్రజలకు ప్రస్తుతం ఈ సమస్య ఎక్కువగా ఉంది. చనిపోతే అంత్యక్రియలు ఎక్కడ అని తలబాదుకోవాల్సి వస్తోందంటున్నారు. అడవిలోకి రావద్దు బండీపుర జాతీయ ఉద్యానవనం అడవిని ఆనుకుని ఉండే మహదేవనగరలో ఎవరు మరణించినా అటవీ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించే వారు. తాజాగా పులుల మరణం కారణంగా అటవీ ప్రాంతంలోకి ప్రవేశం నిర్బంధించడంతో వీరికి ఇబ్బంది ఏర్పడింది. మృతదేహాల అంత్యక్రియలకు అడవిలోకి వెళ్లనివ్వడం లేదని వాపోయారు. తమ వారి అంత్యక్రియలకు స్థలం కేటాయించాలని రెవెన్యూ, అటవీ అధికారులను కోరుతున్నారు. నానా యాతన తాజాగా గ్రామంలో ఒక మరణం జరిగింది. మృతదేహాన్ని ఖననం చేసేందుకు స్థలం లేదు. తాలూకా పాలన అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. చివరకు ఇంటి ముందే గొయ్యి తవ్వి శవాన్ని పూడ్చాలని తొలుత భావించినా, ఆ తర్వాత మహదేవనగర నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న హోసవీడు గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. పొరుగు గ్రామాన్ని ఆశ్రయించాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. పులుల మరణాలను సాకుగా చూపి తమ జీవితాలను కట్టడి చేయవద్దని, తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు.చామరాజనగర జిల్లా అడవుల్లో పులులు ఇటీవల 5 పులులు మృతి.. అడవిలోకి పల్లెవాసులు వెళ్లకుండా కట్టడి అంత్యక్రియలకు నానా అవస్థలు శ్మశానికి స్థలం ఇవ్వాలని మొర -
అంగన్వాడీలో చిన్నారులు బందీ
రాయచూరు రూరల్ : అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన ముక్కుపచ్చలారని చిన్నారులు గంటలకొద్దీ బందీలుగా మారారు. ఆహారం, నీళ్లు లేకుండా ఆకలి దప్పులతో గడిపారు. అంగన్వాడీ సహయకురాలు పిల్లలను గదిలో ఉంచి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లింది. దీంతో పిల్లలు గంటలకొద్దీ గదిలోనే బందీగా ఉండిపోవాల్సి వచ్చింది. ఈఘటన యాదగరి జిల్లా గురుమిటకల్ తాలూకాలో జరిగింది. బందూర్ గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రం కార్యకర్త నెలవారీ సమావేశం కోసం శనివారం గురుమిటకల్ వెళ్లారు. ఆ సయయంలో సహాయకురాలు సావిత్రి విధుల్లో ఉన్నారు. ఉదయం 9 గంటలకు పిల్లలు కేంద్రానికి వచ్చారు పిల్లల యెగ క్షేమాలు చూసుకోవాల్సిన సావిత్రి వారిని గదిలో ఉంచి తాళం వేసి పొలం పనులకు వెళ్లింది. దీంతో పిల్లలు ఏడుస్తుండగా స్థానికులు గమనించి కార్యకర్తకు సమాచారం ఇచ్చారు. ఆమె 12గంటలకు కేంద్రానికి చేరుకొని పిల్లలను గది నుంచి బయటకు తీసుకువచ్చారు. సహాయకురాలు తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో నమ్మకంతో పిల్లలను కేంద్రానికి పంపితే వారిని గదుల్లో బంధించి వేరే పనులకు వెళ్తారా అని మండిపడ్డారు. పిల్లలను గదిలో ఉంచి పొలానికి వెళ్లిన అంగన్వాడీ సహాయకురాలు గంటలపాటు అన్నం నీళ్లు లేకుండా గడిపిన చిన్నారులు -
అధిక జనాభాతో అనర్థాలు
రాయచూరు రూరల్: జనాభా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఉడమ్ గల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దండెప్ప బిరదార్ పిలుపునిచ్చారు. ఆ పాఠశాలో శనివారం ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ అధిక జనాభాతో అనర్థాలు చోటు చేసుకుంటాయన్నారు. ప్రజలందరికీ సదుపాయాలు కల్పించడ కష్టసాధ్యమవుతుందన్నారు. పరిమిత కుటుంబంతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. చెస్ పోటీల్లో విజయపుర, రాయచూరు గెలుపు రాయచూరు రూరల్ : రాజీవ్ గాంధీ అరోగ్య వర్సిటీ ఆధ్వర్యంలో నవోదయ కళాశాల క్రీడాంగణంలో నిర్వహిస్తున్న కలబుర్గి డివిజన్ స్థాయి చెస్ పోటీల్లో విజయపుర, రాయచూరు జిల్లాలు ప్రథమ స్థానాల్లో నిలిచాయి. ఆదివారం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో నవోదయ కళాశాల రిజిస్ట్రార్ శ్రీనివాస్ హాజరై విజేతలకు బహుమతులు అందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. చెస్ క్రీడలు మేథస్సును పెంపొందిస్తాయన్నారు. గురుచార్, దొడ్డయ్య, సుధా కుమారి, గిరస్ కట్టి, కౌశిక్ రెడ్డి, చంద్రకాంత్, సావిత్రి, నేతానియల్ పాల్గొన్నారు. కారు బోల్తా .. ఒకరి మృతి రాయచూరు రూరల్: కారు బోల్తా పడి ఒకరు మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. ఈఘటన రాయచూరు తాలుకా మన్సలాపూర్ వద్ద జరిగింది. కొందరు ఉడుపి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా మన్సలాపూర్ వద్దకు రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఉడుపి జిల్లా కుందాపూర్ తాలూకా కోట్రేశ్వర హజీర(65) అనే మహిళ మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. రూరల్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను, హజీరా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. విద్యా సంస్థల్లో మానసిక వైద్యులను నియమించాలిరాయచూరురూరల్: రాష్ట్రంలోని ప్రభుత్వ హైస్కూలు, జూనియర్ కళాశాలల్లో మానసిక వైద్యులను నియమించాలని సామాజిక కార్యకర్త సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు అదివారం ప్రభుత్వానికి పోస్టు ద్వారా కార్డులు పంపారు. అనంతరం ఆయన మాట్డాడుతూ విద్యార్థులు నిత్యం మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అలాంటివారికి విద్యా సంస్థల్లోనే కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వారిని సరైన మార్గంలో నడిపించవచ్చన్నారు. ఇందు కోసం బియస్డబ్ల్యూ, యంయస్డబ్ల్యూ కోర్సులు చేసిన వారిని విద్యాసంస్థల్లో నియమించాలన్నారు. డిమాండ్ల సాధనకు 5 నుంచి సమ్మె రాయచూరు రూరల్: కేఎస్ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఉద్యోగుల, కార్మికుల సంఘం అధ్యక్షుడు ముద్దుకృష్ణ డిమాండ్ చేశారు. నగరంలోని పాత్రికేయల భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల స మావేశంలో ఆయన మాట్లాడారు. 38 నెలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీంతో ఈనెల 5 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. వర్క్ ఫ్రం హోం అంటూ వంచన హుబ్లీ: ఇంటి వద్దనుంచే పని అంటూ సైబర్ వంచకులు ఓ వ్యక్తి నుంచి రూ. 5లక్షలు దోచుకున్నారు. ఈఘటన హుబ్లీలో చోటు చేసుకుంది. రక్షిత అనే మహిళకు వంచకులు వ్యాట్సాప్ ద్వారా పరిచయం చేసుకున్నారు. ఇంట్లోనే కూర్చొని డబ్బు సంపాదించవచ్చని మభ్య పెట్టారు. ఆమె స్నేహితురాలు డీ సోహెప్ప ఖాతా నుంచి రూ.5.99 లక్షలు తమ ఖాతాకు జమ చేయించుకున్నారు. అనంతరం ఎలాంటి ఉద్యోగమూ ఇవ్వలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఎవరికీ పట్టని కార్మికుల కాలనీ
రాయచూరు రూరల్: బడాబాబులు నివాసం ఉంటున్న కాలనీల్లో సిమెంటు రోడ్లు, మంచినీరు తదితర సదుపాయాలు ఉంటాయి. అదే పేదలు, కార్మికులు నివాసం ఉంటున్న కాలనీల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండవు. అధికారులు ఆ కాలనీల వైపు కన్నెత్తి చూడరు. ఇలాంటి పరిస్థితే నగరంలో కనిపిస్తుంది. ఇక్కడి ఏపీఎంసీ హమాలీ కాలనీలో సమస్యలు తిష్టవేశాయి. 2011లో ముఖ్య మంత్రి ఎస్ఎం కృష్ణ హయాంలో ఏపీఎంసీ హమాలీల, కార్మికులకు కాలనీ నిర్మించారు. వారికి పక్కా గృహాలు కల్పించి ఇంటి హక్కు పత్రాలందించారు. అయితే నగర సభలో రిజిస్ట్రేషన్ చేయలేదు. కాలనీలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. రోడ్లు అధ్వాన స్థితికి చేరాయి. అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలంలో నీరు చేరడంతో గుంతలు కనిపించక వాహనదారులు కింద పడి గాయాల పాలవుతున్నారు. ఇక మురుగు కాలువలు పూడికతో నిండిపోయి వాటి స్వరూపానే కోల్పోయాయి. దీంతో మురుగునీరంతా రోడ్లపైకి చేరుతోంది. కాలనీవాసులు దుర్వాసన మధ్య జీవనం చేయాల్సి వస్తోంది. కాలనీలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు దుస్థితికి చేరాయి. భవనాల కప్పులు పెచ్చులూడుతున్నాయి. దీంతో విద్యార్థులు భయాందోళన మధ్య పాఠాలు వింటున్నారు. కాలనీలో ఇన్ని సమస్యలున్నా పాలకులు, అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని పేదలు కోరుతున్నారు. అధ్వానంగా రహదారులు పూడిక నిండిన మురుగు కాలువలు దుస్థితిలో పాఠశాల, అంగన్వాడీ భవనాలు సమస్యల మధ్య సహజీవనం చేస్తున్న పేదలు -
నేడు 11, 12, 13 పాయింట్లలో తవ్వకాలు
శివాజీనగర: ధర్మస్థలలో వందలాది మంది మృతదేహాల కోసం గాలింపులో పెద్ద మలుపులేవీ కానరాలేదు. 6వ పాయింట్లో లభించిన అస్థిపంజరం 40–50 సంవత్సరాల పాతబడినదని సమాచారం. ధర్మస్థల నేత్రావతి ఒడ్డులో 13 పాయింట్లలో గాలింపు జరుగుతోంది. ఇప్పటివరకు 6వ పాయింట్ మాత్రం ఓ అస్థిపంజరం లభించింది. అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. 40 సంవత్సరాల క్రితం శవం పూడ్చిపెట్టి ఉంటారని నిపుణులు చెప్పినట్లు తెలిసింది. ఇది పురుషుని అస్థిపంజరం. మరో వారంలో దీనిపై అఽధికారిక సమాచారం వెల్లడి కానున్నది. కాగా, సిట్ సిబ్బంది, పోలీసులు, కూలీలు విశ్రాంతి కోసం ఆదివారం తవ్వకాలకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పటివరకు 10 పాయింట్లలో తవ్విచూశారు. 6వ పాయింట్లో మినహాయిస్తే మిగతాచోట్ల పెద్దగా ఏమీ దొరకలేదు. సోమవారం 11, 12, 13 పాయింట్లలో తవ్వుతారు. అన్ని పాయింట్ల వద్ద సాయుధ పోలీసు భద్రత ఏర్పాటైంది. సోమవారం ఏమైనా జరగవచ్చా అని కుతూహలం నెలకొంది. 13 పాయింట్ల తవ్వకాలు పూర్తయిన తరువాత సిట్ తదుపరి కార్యాచరణపై యోచించనుంది. అందరి చూపు వాటి మీదే -
రెడ్డి సముదాయం ఐక్యతగా ఉండాలి
రాయచూరు రూరల్ : రెడ్డి సమాజం ఐక్యమత్యం ప్రదర్శించాలని హేమరెడ్డి మల్లమ్మ వేమానంద హోసల్లి మఠాధిపతి వేమానంద మహా స్వామీజీ పిలుపునిచ్చారు. రాయచూరులోని ప్రైవేటు కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన సభలో స్వామీజీ పాల్గొని మాట్లాడారు. కులగణనలో హిందూ రెడ్డిగా రాయించాలన్నారు. సముదాయంలోని ఉప కులాలన్నీ ఏకమై హక్కులను పొందాలన్నారు. సభలో గోపాల్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, అచ్యుత రెడ్డి, శ్రీనివాస రెడ్డి, సుధాకర రెడ్డి, బసన గౌడ, కేశవ రెడ్డి, బుడ్డనగౌడ, రామనగౌడ, విరుపన గౌడ, సత్యనారాయణ, లక్ష్మికాంత రెడ్డి పాల్గొన్నారు. -
మైసూరు ఉత్సవాలకు తొలి అడుగు
మైసూరు: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా మహోత్సవాల కోసం సన్నాహాలు ఊపందుకున్నాయి. దసరా ఉత్సవాలలో ప్రధాన పాత్ర పోషించేవి గజరాజులే. ఆ ఏనుగుల మొదటి బృందం సోమవారం కదలిరానుంది. 9 ఏనుగులు వస్తున్నట్లు సమాచారం. హుణసూరు తాలూకా వీరనహోసహళ్లిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. భారీ స్వాగతోత్సవం వీరనహోసహళ్లికి సోమవారం మధ్యాహ్నం 12:34 నుంచి 12:59 శుభలగ్నంలో అడవిలోని శిబిరం నుంచి గజబృందం చేరుకోనుంది. వీటికి ప్యాలెస్ పురోహితులు వేద మంత్రాల తో స్వాగతిస్తారు. జిల్లా మంత్రి హెచ్సీ మహదేవప్ప పుష్పార్చన చేసి గజపయనాన్ని ప్రారంభిస్తారు. పూజల తర్వాత కార్యక్రమంలో హాసన్, సకలేశపుర, కొడగు తదితర ప్రాంతాల్లో రౌడీ ఏనుగులు, వన్యజీవులను పట్టుకోవడంలో నిపుణుడైన భీమా ఏనుగు మావటీ గుండ, అలాగే కాపలాదారు నంజుండస్వామికి అవార్డులను అందజేస్తారు. మావటీలు, కాపలాదారులకు కిట్లను ఇస్తారు. తొలి దశలో 9 ఏనుగులు మైసూరు ప్యాలెస్కు వస్తున్నాయి. డీసీఎఫ్ ప్రభుగౌడ మాట్లాడుతూ దసరా మహోత్సవంలో పాల్గొనే అన్ని ఏనుగులు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. నేడే ఆర్భాటంగా గజ పయనం -
మాఫియా కవిరాజ్కు కటకటాలు
కోలారు: హత్య, దోపిడీతో పాటు వివిధ ప్రాంతాలలో సుమారు 14 అపరాధ కేసులలో నిందితునిగా ఉండి పరారీలో ఉన్న మాఫియా నేరగాడు కవిరాజ్ అలియాజ్ రాజ్ను కోలారు సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణ (సెన్) పోలీసులు అరెస్టు చేశారు. ఇతను ఉత్తరాఖండ్ లోని నేపాల్ సరిహద్దు ప్రాంతానికి చెందిన వాడు. తల్లిదండ్రులతో కలిసి బెంగుళూరుకు నివాసం మార్చాడు. అండర్వరల్డ్ డాన్లు అయిన రవి పూజారి, ముత్తప్ప రై సహచరునిగా ఉండేవాడని తెలిసింది. చాలా కేసుల్లో నిందితుడు కవిరాజ్ 2020లో జరిగిన మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కిడ్నాప్ కేసుతో పాటు దేశవ్యాప్తంగా 14కు పైగా వివిధ కేసులలో కోర్టు విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలో ఉన్నాడు. బెంగళూరులో కామాక్షిపాళ్య, తిలక్నగర్, కెంగేరి, ఆడుగోడి లలో సర్జాపుర, కాడుగోడి, ఇందిరానగర, బయ్యప్పనహళ్లి , తళి, కోలారు రూరల్ పోలీస్ స్టేషన్లలో ఇతనిపై కేసులు ఉన్నాయి. ఎస్పీ నిఖిల్ నేతృత్వంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఢిల్లీ వద్ద నోయిడాలో ఉన్నట్లు కనుగొన్నారు. జూలై 31వ తేదీన అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఆచూకీ తెలియరాదని కవిరాజ్ మొబైల్ఫోన్ను ఉపయోగించే వాడు కాదు. నోయిడాలో పట్టుకున్న కోలారు పోలీసులు -
యూరియా సరఫరాలో కాంగ్రెస్ సర్కార్ విఫలం
హొసపేటె: నైరుతి రుతుపవనాలు రాకమునుపే విస్తారంగా వర్షాలు కురిసిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన మొత్తంలో యూరియా, ఎరువులను సరఫరా చేయలేక పోయిందని బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు సంజీవ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందన్నారు. యూరియా కోసం రైతులు క్యూలో గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 8.73 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయగా 6.30 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి చెలువరాయ స్వామి వ్యాఖ్యలు చేశారని, మిగిలిన 2.43 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్లో విక్రయించిందా అని ప్రశ్నించారు. బీజేపీ రైతు మోర్ఛా జిల్లా అధ్యక్షుడు హోంబలే రేవన్న మాట్లాడుతూ బీజేపీ హయాంలో రైతుల పిల్లలకుచ్చే రైతు విద్యానిధి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే నానోయూరియాను అందిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని పై అవగాహన కల్పించడం మర్చిపోయిందన్నారు. -
ఆందోళనకర స్థాయిలో మృత శిశువుల జననాలు
బనశంకరి: ఎన్నో ఆశలతో గర్భం దాలిస్తే, పుట్టింది మృతశిశువు అని తెలిసిన తల్లి గుండె మంట, కడుపు కోతకు పరిహారం ఏమిటి? రాష్ట్రంలో నిర్జీవ శిశువుల జననం అధికమవుతోంది. ఆధునిక వైద్యరంగం ఎంతో ప్రగతి సాధించినప్పటికీ శిశువుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. గర్భంలో, లేదా కాన్పు సమయంలో శిశువు కన్నుమూయడం (స్టిల్ బర్త్) సమస్య అనేక జిల్లాల్లో పెద్ద సమస్యగా ఉంది. 12 జిల్లాల్లో అధికంగా ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. విచిత్రం ఏమిటంటే.. గ్రామీణ ప్రదేశాల కంటే నగరాలు, పట్టణాల్లో మృత శిశువుల జననం ఎక్కువగా ఉండడం. వెయ్యి మందిలో 3.41 కేసులు.. రాష్ట్రంలో జన్మిస్తున్న ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 3.41 శాతం మంది నిర్జీవులు. కొన్ని జిల్లాల్లో ఇది 9.30 శాతం ఉండడంతో ఆరోగ్యశాఖ కు సవాల్గా మారింది. 2024 ప్రభుత్వ గణాంకాల హవేరి జిల్లాలో అధిక కేసులు నమోదు కాగా తదుపరి స్థానాల్లో ధారవాడ, చామరాజనగర, గదగ, మైసూరు, బళ్లారి జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల్లో పెరుగుదల తల్లీ బిడ్డల మరణాలు పెరగడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. వైద్యసేవల ప్రామాణికతకు దీనిని మైలురాయిగా తీసుకుంటారు. 2020లో మంచి ర్యాంకులో ఉన్న మైసూరు, చిక్కమగళూరు, బెంగళూరు గ్రామాంతర, బళ్లారి, దావణగెరె జిల్లాల్లో 2–3 ఏళ్ల నుంచి నిర్జీవ శిశువులు జనన రేటు పెరగడం గమనార్హం. 2020లో 9,88,143 జననాల్లో 3,326 మంది నిర్జీవ శిశువులు ఉన్నారు. ఇందులో 221 మంది (2.11 శాతం) గ్రామీణ, 3,105 (5.24 శాతం) నగర ప్రదేశాల్లో ఉన్నారు. ఈ జిల్లాలు మేలు స్టిల్ బర్త్ నియంత్రణలో హాసన్, కొడగు, యాదగిరి జిల్లాలు ఆదర్శంగా ఉన్నాయి. 2023లో యాదగిరి జిల్లాలో ఒక్క మృత శిశు జననం కూడా నమోదు కాలేదు. గత రెండేళ్లలో నిర్జీవ జనన రేటు 1.5 శాతానికి దాటలేదు. బెంగళూరు నగరం, కొప్పళ, రామనగర జిల్లాల్లో 2 శాతం, మండ్య, బెళగావి, రాయచూరు, బీదర్, కలబుర్గి, కోలారు, తుమకూరు జిల్లాల్లో 3 శాతంలోగా ఉంది. నివేదిక రావాలి: మంత్రి నిర్జీవ శిశు మరణాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు. హావేరి, గదగ్, ధార్వాడ జిల్లాల్లో ఎందుకు శిశు మరణాలు పెరుగుతుయో అధికారులు నివేదిక వచ్చాక నివారణ చర్యలను చేపతామని చెప్పారు. ఇందుకు కారణాలపై వైద్యశాఖ పరిశీలన చేస్తోంది. ప్రసూతి సమయంలో తలెత్తిన శ్వాసకోశ ఇబ్బంది, గర్భిణిలు జాగ్రత్తలు పాటించకపోవడం, అసురక్షిత పరిస్థితుల్లో ప్రసవం, గర్భస్రావం, కాన్పు సమయాల్లో తీవ్ర జ్వరం వంటి అనారోగ్యాలు తదితర కారణాలు వెలుగుచూశాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తల్లికి మధుమేహం, బీపీ, థైరాయిడ్, అధిక బరువు, వరుసగా గర్భధారణలు, గతంలో ప్రసూతిలో నిర్జీవ శిశువు జననం, అవధికి ముందుగా జననం, తల్లికి ధూమ, మద్యపానం అలవాట్లు, మేనరికాలు, కొన్ని రకాల ఔషధాలను వాడడం వల్ల సమస్య వస్తోందని ప్రసూతి నిపుణురాలు డాక్టర్ ఉమా సుల్తానపురి తెలిపారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో అధికం పల్లెల కంటే పట్టణాల్లో తీవ్రం -
అభివృద్ధి పనులకు భూమిపూజ
రాయచూరు రూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని రూరల్ ఎమ్మెల్యే బసవన గౌడ సూచించారు. తాలూకాలోని మన్సలాపూర్లో గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం, చిక్కసూగురులో పలు అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన భూమి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ భవిష్యత్తులో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడానికి పాటు పడుతామన్నారు. ఎలుగుబంటి, అడవి పంది దాడిలో పంటలు ధ్వంసం హొసపేటె: ఎలుగుబంటి, పందుల దాడిలో పంటలు ధ్వంసమయ్యాయి. ఈఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని కనమడుగు గ్రామంలో జరిగింది. రాత్రి సమయంలో ఎలుగుబంట్లు, పందులు మొక్కజొన్న పంటలోకి చొరబడి మొక్కజొన్నను తినడమే కాకుండా వాటిని తొక్కి విరిచి నాశనం చేశాయి. గ్రామం పొరుగున ఉన్న దావణగెరె జిల్లాలోని జగలూరు తాలూకాలోని అనబురు అటవీ ప్రాంతంలో నుంచి నిత్యం వన్యజీవులు పొలాల్లోకి చొరబడి పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లు, పందుల బెడదనుంచి పంటలను కాపాడాలని, ధ్వంసమైన పంటలకు పరిహారం చెల్లించాలని రైతులు కామయ్యవర బొమ్మప్ప, తిప్పేస్వామి, మంజమ్మ, తిండమ్మ, నాగరాజు, దుగ్గప్ప కోరారు. కళాశాల విద్యార్థిపై క్రికెట్ బ్యాట్లతో దాడి సాక్షి,బళ్లారి: ఓ కాలేజీ విద్యార్థిపై సినిమా రీతిలో 10 మంది కాలేజీ గ్యాంగ్ దాడి చేయడం నగరంలో కలకలం సృష్టించింది. నగరంలోని రెడియో పార్క్లో ఉన్న ఐటీఐ కాలేజీ మైదానంలో జరిగిన దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చి దాడి దృశ్యాలు సోషియల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ బాలిక ఫొటో వ్యాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాడని కాలేజీ విద్యార్థి దొడ్డబసవ (19)పై శశికుమార్, సాయికుమార్ తదితరులు 10 మంది దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. కాళ్లు పట్టుకున్నా వదలకుండా దాడి చేశారు. తల, నడుము భాగంలో క్రికెట్ బ్యాట్తో దాడి చేశారు. బాలిక సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌల్బజార్ పోలీసులు 10 మందిపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. దాడి చేసిన వారు కూడా కాలేజీ విద్యార్థులే అని తెలిసింది. తీవ్రంగా గాయపడిన దొడ్డబసవ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వెళ్లారు. నేహా హత్యకేసు నిందితుడి బెయిల్పై నేడు విచారణ హుబ్లీ: నగరంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహ హిరేమఠ హత్య కేసును నిందితుడి బెయిల్ పిటిషన్ అదనపు జిల్లా సెషన్ కోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో నేహ తండ్రి, కార్పొరేటర్ నిరంజనయ్య హిరేమఠ కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి నివాసానికి ఆదివారం వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం నిరంజనయ్య మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె హత్య విషయంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు తన కుమార్తె విషయంలో పోరాటం చేశాయన్నారు. నిందితుడు ఫయాజ్కు బెయిల్ లభిస్తే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. నటుడు దర్శన్కు ఇచ్చినట్లుగానే బెయిల్ ఇవ్వాలని నిందితుడి తరపున న్యాయవాది వాదిస్తున్నారన్నారు. 2024 ఏప్రిల్ 18న హుబ్లీ బీవీబీ కళాశాల ఆవరణలో 24 ఏళ్ల ఎంసీఏ విద్యార్థి నేహ హిరేమఠ దారుణ హత్య జరిగిన సంగతి తెలిసిందే 10కి పైగా కత్తిపోట్లతో విద్యార్థిని బలైంది. ఈ కేసులో నిందితుడు బెళగావి జిల్లాకు చెందిన ఫయాజ్ కొండ నాయక్(24) అరెస్ట్ అయ్యాడు. ఆకట్టుకున్న స్టీల్ సిటీరన్సాక్షి,బళ్లారి: దైనంది జీవితంలో ప్రతి ఒక్కరు యోగా, వాకింగ్, రన్నింగ్ తదితర ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అన్నారు. బళ్లారి సైక్లిస్ట్, రన్నర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బళ్లారిలో ఆదివారం స్టీల్ సిటీ రన్ నిర్వహించారు. స్థానికులతోపాటు వివిధ రాష్ట్రాల యువతీ యువకులు పాల్గొన్నారు. విజిడం ల్యాడ్ స్కూల్ నుంచి యువతీ యువకులు పరుగును ప్రారంభించారు. 10 కిలో మీటర్లు, అనంతరం 5 కిలో మీటర్లు, అనంతరం 3 కిలో మీటర్లు రన్నింగ్ రస్ నిర్వహించారు. జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో డాక్టర్లు.బీకే.సుందర్, సోమనాథ, తదితరులు పాల్గొన్నారు. -
రాజహంసకు ప్రమాదం
కోలారు: కేఎస్ ఆర్టీసీ లగ్జరీ రాజహంస బస్సుకు స్వల్ప ప్రమాదం జరిగింది. డివైడర్ మీదకు దూసుకెళ్లి నిలిచిపోయింది. తాలూకాలోని చుంచదేనహళ్లి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బెంగుళూరు నుంచి కోలారు మీదుగా కేజీఎఫ్కు వెళుతున్న బస్సు ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు మధ్యలోని ఖాళీ స్థలంలోకి వెళ్లి నిలిచిపోయింది. బస్సు డ్రైవర్, ప్రయాణికులకు చిన్న గాయాలు అయ్యాయి. బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయాలైన వారికి నగరంలోని ఆస్పత్రిలో చికిత్స చేయించారు. 10న ప్రధానిచే మెట్రో ఎల్లో లైన్కు నాంది శివాజీనగర: బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ రైలు సేవలను ప్రధాని మోదీ ఈ నెల 10వ తేదీన ప్రారంభిస్తారని తెలిసింది. ఆర్.వీ.రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు మెట్రో ఎల్లో రైలు సంచరిస్తుంది. ఇది సిల్క్బోర్డు మార్గంలో ట్రాఫిక్ రద్దీని చాలా తగ్గించనుంది. ఈ మార్గం పొడవు 19.15 కి.మీ. ఇప్పటికే మూడు రైళ్లు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ టిటాగడ్ రైల్ కార్మాగారం నుండి నాలుగో రైలును పంపించారు. 10వ తేదీలోగా బెంగళూరుకు చేరుకొంటుంది. ప్రధాని మోదీ ఈ మార్గానికి రిబ్బన్ కట్ చేస్తారని కేంద్ర వసతి, నగర వ్యవహారాల మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ సోషల్ మీడియాలో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 6 నుంచి వర్షసూచన యశవంతపుర: రాష్ట్రంలో కొన్నిరోజులుగా వానలు తగ్గాయి, రైతులు వర్షం కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు మళ్లీ భారీగా వానలు పడే అవకాశం ఉందని బెంగళూరు వాతావారణశాఖ అధికారులు తెలిపారు. బెంగళూరు, రూరల్, చిక్కబళ్లాపుర, హాసన్, కొడగు, కోలారు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు. ఇంకా అనేక జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. ఆదివారం కార్వార, చిక్కమగళూరు జిల్లాల్లో వానలు పడ్డాయి. బెంగళూరు చుట్టుపక్కల మేఘావృతమై ఉంది. నీటి ట్యాంకులో విషం.. ముగ్గురు అరెస్టు దొడ్డబళ్లాపురం: బెళగావి జిల్లా సవదత్తి తాలూకా హూలికట్టి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల సమీపంలోని నీటి ట్యాంక్లో పురుగుల మందును కలిపిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రెండువారాల కిందట ఆ నీటిని తాగి పలువురు విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు. పాఠశాల హెచ్ఎంను బదిలీ చేయించాలనే దురుద్దేశంతో శ్రీరామసేన తాలూకా నాయకుడు సాగర్ పాటిల్, మరో ఇద్దరు ఈ పన్నాగం పన్నినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ అంశాన్ని సీఎం సిద్ధరామయ్య ఎక్స్లో పోస్టు చేయడం గమనార్హం. మతోన్మాదంతో కొందరు చిన్న పిల్లల ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వాటర్ ట్యాంక్లో విషం కలపడం కలవరపెడుతోందన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టేవారిపై నిఘా పెట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. -
కళామతల్లి ముద్దుబిడ్డ బళ్లారి రాఘవ
బళ్లారిఅర్బన్: విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని 60, 70 ఏళ్ల క్రితం కూడా బళ్లారి రాఘవ తన అద్భుతమైన వాగ్దాటితో కళావాచ్చస్పతిగా ఖండాంతర ఖ్యాతిని గడించారని తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలిదండ నిత్యానందరావ్ అన్నారు. బళ్లారి రాఘవ జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం స్థానిక రాఘవ కళా మందిరంలో రాఘవ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధాన కార్యక్రమం, నాటకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలుగు, కన్నడ, ముఖ్యంగా ఇంగ్లిష్ నాటకాలలో బళ్లారి రాఘవ తనదైన శైలిలో ప్రతిభ చాటి విదేశాలలో కూడా తన అద్భుతమైన నటన ద్వారా ప్రేక్షకుల మనసు చూరగొన్నారన్నారు. బళ్లారి గడ్డపై పుట్టి విదేశాలలో కూడా తన అద్భుతమైన అభినయంతో సరికొత్త చరిత్ర సృష్టించారని, నాటక రంగానికి రాఘవ చేసిన సేవలు అనన్యమని కొనియాడారు. నాటక రంగానికి ఆయన వన్నెలు అద్దిన మహానటుడని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మేడూరు గ్రామానికి గుమ్మడి గోపాలకృష్ణకు బళ్లారి రాఘవ రాష్ట్ర ప్రశస్తిని అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన బళ్లారి రాఘవ సేవలను కొనియాడి ఆయన స్వరంతో పద్యాలను కూడా ఆలపించారు. బళ్లారి రాఘవ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు కే.చెన్నప్ప, పదాధికారులు రమేష్ గౌడ పాటిల్, విష్ణువర్ధన్రెడ్డి, ఎన్.ప్రకాష్, ధనుంజయ, రామాంజినేయలు, ప్రముఖులు స్థానిక, ఆంధ్ర కళాభిమానులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో అన్నదాత మృతి
హొసపేటె: రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా కిత్తూరు తాలూకాలోని హనుమానహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు రంగప్ప తలవార్ (34) ఆదివారం ఉదయం పొలంలో పనులు చేస్తుండగా కుప్పకూలిపోయాడు. అతన్ని తోలహళ్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కొట్టూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. జిల్లాస్పత్రిలో అన్నీ అక్రమాలే కోలారు: నగరంలోని ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రిలో దళారుల బెడద అధికంగా ఉంది, వారికి అడ్డుకట్ట వేయాలని, అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న అంబులెన్స్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆదివారం రైతు సంఘం నాయకులు ఆస్పత్రి ముందు నిరసన తెలిపారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నారాయణగౌడ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న పేద రోగులకు ఆస్పత్రిలో కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించకుండా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇస్తున్నారని ఆరోపించారు. సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్లను గంటలో చేసిస్తామని పలువురు దళారులు రోగుల వద్ద నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. -
‘ధర్మస్థల’ దారుణాలపై సాక్ష్యాధారాలు ధ్వంసం
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థలలో సామూహిక ఖననాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి, మృతదేహాలను సామూహికంగా ఖననం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ధర్మస్థలలో వందకు పైగా మహిళల మృతదేహాలను స్వయంగా ఖననం చేశానని ఓ పారిశుధ్య కార్మీకుడు ప్రకటించడంతో సంచలనం రేగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ధర్మస్థలలో 2000 సంవత్సరం నుంచి 2015 వరకు.. 15 ఏళ్లలో అసహజ మరణాల రికార్డులు కనిపించకుండాపోయాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి పోలీసులు వాటిని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లు తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కార్యకర్త జయంత్ ఈ విషయం బహిర్గతం చేశారు. 2000 నుంచి 2015 దాకా అసహజ మరణాల రిజిస్టర్(యూడీఆర్)లో నమోదైన అన్ని ఎంట్రీలను పోలీసులు ఒక పద్ధతి ప్రకారం డిలీట్ చేసినట్లు వెల్లడయ్యింది. ధర్మస్థలలో అదే సమయంలో పెద్ద సంఖ్యలో అనుమానాస్పద, నమోదు కాని మరణాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారుల సమక్షంలోనే ఖననం ఒక యువతి మృతదేహాన్ని చట్టవిరుద్ధంగా, రహస్యంగా ఖననం చేస్తుండగా అనుకోకుండా తాను చూశానని ఆర్టీఐ కార్యకర్త జయంత్ చెప్పారు. దీనిపై ఈ నెల 2వ తేదీన సిట్కు ఫిర్యాదు చేశారనని వివరించారు. ఆ ఖననం జరుగుతున్న సమయంలో పలువురు అధికారులు అక్కడే ఉన్నారని, చట్టబద్ధమైన ప్రక్రియ పాటించలేదని చెప్పారు. జయంత్ ఫిర్యాదుపై సిట్ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. పోలీసుల పనితీరును తెలుసుకోవడానికి జయంత్ చాలాకాలంగా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. ధర్మస్థలలో అదృశ్యమైన మహిళలు, యువతుల పూర్తి వివరాలు, ఫోటోలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద బెళ్తంగడి పోలీసులను కోరగా, వారు అందుకు నిరాకరించారని జయంత్ చెప్పా రు. సంబంధిత డాక్యుమెంట్లు, పోస్ట్మార్టం రిపోర్టులు, వాల్ పోస్టర్లు, నోటీసులు, ఫోటోలను నాశనం చేసినట్లు వారు బదులిచ్చారని పేర్కొన్నారు. గుర్తించని మృతదేహాలకు సంబంధించిన ఆధారాలేవీ లేవని, రొటీన్ ప్రక్రియలో భాగంగానే వాటిని నాశనం చేశామంటూ చెప్పారని స్పష్టంచేశారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది అధికారుల సమక్షంలోనే యువతి మృతదేహాన్ని చనిపోయిన శునకాన్ని ఖననం చేసినట్టుగా చేశారని, ఆ సంఘటన చాలాకాలం తనను వెంటాడిందని జయంత్ తెలియజేశారు. ఆ అధికారుల పేర్లు కూడా చెప్పగలనని అన్నారు. ధర్మస్థలలో మరణాలపై దర్యాప్తు బాధ్యతను నిజాయతీ గల అధికారులకు అప్పగించకపోతే తనకు నిజాలు బయటపెడతానని రెండేళ్ల క్రితం హెచ్చరించానని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందన్నారు. అందుకే సిట్కు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తన వెనుక ఎవరూ లేరని, తనను ఎవరూ ప్రభావితం చేయడం లేదని తేల్చిచెప్పారు. నేటి టెక్నాలజీ యుగంలో సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తవ్వకాల్లో అస్తిపంజరం బయటపడితే అది ఎవరిదో ఎలా గుర్తిస్తారని అన్నారు. సంబంధిత డాక్యుమెంట్లు, ఆధారాలు లేకపోతే అది ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. ధర్మస్థలలో జరిగిన దారుణాల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరన్నది బయటపడాలని స్పష్టంచేశారు. దర్యాప్తును ప్రభావితం చేస్తున్న వ్యక్తులెవరో ప్రభుత్వం తేల్చాలని అన్నారు. సాక్ష్యాధారాల ధ్వంసం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని చెప్పారు. -
వ్యసన రహిత సమాజాన్ని నిర్మిద్దాం
హొసపేటె: డాక్టర్ మహంత శివయోగి తన సంచిలో ప్రజల దుర్గుణాలను భిక్ష రూపంలో సేకరించి వ్యవస రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషి చేశారని అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణప్ప అన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ మహంత శివయోగి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన మాట్లాడారు. వ్యసన రహిత సమాజం గురించి కలలు కన్న డాక్టర్ మహంత శివయోగ స్వామీజీ 1975 నుంచి సామాజిక విప్లవానికి నాంది పలికారన్నారు. మహంత జోళిగె కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది. మద్యపానంతో సహా వ్యసనాలు ఒక వ్యక్తిని శ్మశాన వాటికకు ఆహ్వానించడం లాంటివని ఆయన ప్రజల్లో అవగాహన కల్పించారు. మహంత శివయోగి దేశంలోనే కాకుండా ఇంగ్లండ్తో సహా వివిధ విదేశాల్లో కూడా జోళిగె నిర్వహించి వ్యసనాల విముక్తి కోసం ప్రజలను వేడుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తుల జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1న రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస రహిత దినోత్సవంగా జరుపుతోందన్నారు. కార్యక్రమంలో మనోజ్, ప్రియదర్శిని, సమాచార శాఖ సిబ్బంది రామాంజనేయ, అశోక్ ఉప్పార, పీ.కృష్ణస్వామి, తాహేష్, కిషోర్, తిప్పేష్, దేవరాజ్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయ సిబ్బందితో సహా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
వ్యక్తి అదృశ్యం
హొసపేటె: గదగ్ తాలూకాలోని లక్కుండి గ్రామానికి చెందిన మైలారప్ప అనే 54 ఏళ్ల వయస్సుగల వ్యక్తి మైలార కార్ణిక దర్శనానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో అదృశ్యమైన ఘటనపై హిరేహడగలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 5.6 అడుగుల ఎత్తు, గుండ్రని ముఖం, జిడ్డు చర్మం కలిగి మాట్లాడలేడు, వినలేడు( మూగ, చెవిటి) అని తెలిపారు. మాట్లాడనప్పుడు చేయి, నోటితో సైగ చేస్తాడు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తెల్లటి ధోతి, తెల్లటి నిండు చేతుల చొక్కా ధరించాడు. తప్పిపోయిన వ్యక్తి గురించి ఏదైన సమాచారం ఉంటే హిరేహడగలి పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్ లేదా 08394–200202, 9480805700కు సమాచారం అందించాలని ఆ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ భరత్ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయంహొసపేటె: నగరంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హొసపేటె అర్బన్ డివిజన్లోని 33/11 కేవీ విద్యుత్ సరఫరా కేంద్రంలో మరమ్మతు పనులు చేపడుతున్నందున విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జెస్కాం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (అర్బన్ డివిజన్) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కే.సతీష్ తెలిపారు. విద్యుత్ ఉప కేంద్రం పరిధిలోని బసవేశ్వర బడావణె, డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సర్కిల్, డాక్టర్ పునీత్ రాజ్కుమార్ సర్కిల్, రాజీవ్నగర్, రైల్వేస్టేషన్, అమరావతి, చిత్తవాడిగి, షుగర్ ఫ్యాక్టరీ, హంపీ రోడ్డు, గణేష్గుడి, నౌకర్ కాలనీ, గాంధీ సర్కిల్, బస్టాండ్, మెయిన్ బజార్, కోర్టు, రాణిపేట, భట్రహళ్లి, బెనకపుర, బసవనదుర్గ, నాగేశహళ్లి, నరసాపుర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు, ప్రజలు సహకరించాలని జెస్కాం ఓ ప్రకటనలో కోరింది. విద్యుత్ పరికరాల చోరీ హుబ్లీ: బిన్నాళ విద్యుత్ ఉప కేంద్రంలో భద్రపరిచిన రూ.40 వేలు విలువ చేసే విద్యుత్ పరికరాలను దుండగులు చోరీ చేశారు. సదరు కేంద్రంలో రెండు ఐసోలేటర్లు, రెండు కాపర్ బ్లేడ్లు, మూడు అర్త్ స్విచ్ కాపర్ బ్లేడ్లు చోరీకి గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై బెండిగేరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం దోపిడీకి యత్నం.. నిందితుల అరెస్టు సాక్షి, బళ్లారి: నగరంలోని తాళూరు రోడ్డులోని రెడ్డి హోటల్ సమీపంలో రెండు రోజుల క్రితం ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో నగదును దొంగలించడానికి ప్రయత్నించిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ శోభారాణి తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బళ్లారి నగరానికి చెందిన అవినాష్(27), శివరాజ్(29) అనే ఇద్దరు ఏటీఎం మిషన్ను పగలగొట్టి నగదు తొంగతనానికి ప్రయత్నించారని తెలిపారు. ఈ ఘటనపై గ్రామీణ పోలీస్టేషన్లో కేసు నమోదు కావడంతో డీఎస్పీ నందారెడ్డి, సిరుగుప్ప డీఎస్పీ సంతోష్ చౌహాన్ నేతృత్వంలో పోలీసు బృందాలు తనిఖీ చేసి 30 గంటల్లో నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నగరంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా సీసీబీ, సైబర్ క్రైమ్ పోలీసులు పకడ్బందీగా పని చేయాలని సూచించారు. పార్టీలో అసమ్మతికి తెరదించండిరాయచూరు రూరల్ : రాయచూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న భిన్నాభిప్రాయాలకు తెరదించాలని కేపీసీసీ వెనుక బడిన వర్గాల విభాగం ఉపాధ్యక్షుడు టీ.మారెప్ప అధిష్టానాన్ని కోరారు. శనివారం ఆయన ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఇంచార్జి మంత్రి, రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ను పక్కకు తోసి అధికారులను, ఉద్యోగులను తమ చేతుల్లో పెట్టుకొని సర్వాధికార ధోరణిని అవలంబిస్తూ రాజకీయ పక్షపాతంతో అధికారం చెలాయిస్తూ తమదే పైచేయి కావాలంటు చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజు, ఆయన కుమారుడు రవి బోసురాజు ఏక చత్రాధిపత్యం చేస్తూ ఇతర కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా పార్టీలో ముసలం ముదిరి పోయిందన్నారు. ఇష్టారాజ్యం చలాయిస్తూ తామే చక్రం తిప్పాలంటూ మంత్రి పాటిల్ను దూరంగా ఉండాలని ఆదేశించడాన్ని తప్పుబట్టారు. పార్టీలో గుంపులుగా గుర్తింపు పొందిన వారికి బోసురాజు పదవులు కట్టబెడుతున్నారన్నారు. జిల్లాకు వచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు ససేమిరా రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఏళ్ల తరబడి ఆందోళన చేపట్టినా కేంద్ర ప్రభుత్వం ససేమిరా ఒప్పుకోలేదని కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి రజాక్ ఉస్తాద్ ఆరోపించారు. ఆయన ఈ మేరకు శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. లోక్సభ సభ్యులు కుమార నాయక్, తుకారాం లోక్సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జాధవ్ను ప్రశ్నించగా కర్ణాటకకు ఎయిమ్స్ మంజూరు చేయలేదని వారివురి ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో చేతులు దులుపుకుందని తెలిపారు. రాయచూరు మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో చేపట్టిన ఆందోళన గురించి ప్రస్తావించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్రానికి లేఖలు రాసి, కమిటీ సభ్యులు వెళ్లి మంత్రులను, ఎంపీలను కలిసి విన్నవించినా ఫలితం లేకపోయిందని, కేంద్రం కర్ణాటకపై సవతి తల్లి ప్రేమను ఒలకబోసిందని తెలిపారు. విమానాశ్రయం పనుల పరిశీలనరాయచూరు రూరల్: రాయచూరు విమానాశ్రయం వద్ద చేపట్టిన పనులను జిల్లాధికారి నితీష్ పరిశీలించారు. శుక్రవారం యరమరస్ వద్ద విమానాశ్రయ ప్రాంతాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. రక్షణ గోడ, ప్యాసింజర్ టర్మినల్ భవనం, రన్వే, సీఆర్పీఎఫ్, ఏటీసీ వసతి గృహాలు, మాస్టర్ ప్లాన్ గురించి కాంట్రాక్టర్తో సమీక్షించారు. త్వరితగతిన పనులను నాణ్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు. -
తల్లి పాలు శిశువుకు అమృతంతో సమానం
హొసపేటె: తల్లి పాలు బిడ్డ ఎదుగుదలకు అమృతం లాంటివని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ ఎల్ఆర్ శంకర్ నాయక్ పేర్కొన్నారు. నగరంలోని మాతా శిశు ఆస్పత్రిలో జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. తల్లి, బిడ్డ మధ్య సంబంధం గర్భంలోనే ప్రారంభమవుతుంది. పాలు ఇచ్చే తల్లి దైవంతో సమానం. మన దేశంలో తల్లులకు దైవిక హోదా ఉంది. పిల్లల ఆరోగ్యానికి తల్లి పాలు చాలా ముఖ్యం. మరే ఇతర ఆహారం సరిపోదు. జిల్లాలోని 5 తాలూకా ఆస్పత్రుల్లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ, పిల్లల యూనిట్లు, పోషక పునరావాస కేంద్రాల్లో కమ్యూనిటీ స్థాయిలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి జరుగుతోందని ఆయన అన్నారు. ఆరు నెలల వరకు తల్లి పాలే శరణ్యం జిల్లా ఆర్సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య మాట్లాడుతూ పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు శిశువుకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని అన్నారు. తల్లి పాలలో శిశువు ఆరోగ్యకరమైన పెరుగుదలకు అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయన్నారు. తల్లి పాల పూర్తి ప్రయోజనాలను పొందడానికి, న్యుమోనియా, విరేచనాలు, పోషకాహార లోపం, నవజాత శిశువుల మరణాలను నివారించడానికి శిశువు పూర్తి అభివృద్ధిలో తల్లిపాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. అంటువ్యాధులపై పోరాటంలో తల్లి పాలు ముఖ్యంగా ప్రభావవంతంగా ఉంటాయి. తల్లి నుంచి నేరుగా టీకాలు తీసుకోవడం ద్వారా పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని నిర్వహించాలన్నారు. జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ భాస్కర్, ప్రభుత్వ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, మాతా శిశు ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ నూర్బాషా, పిల్లల వైద్యురాలు డాక్టర్ ఉషా, ఇతర వైద్యాధికారులు, బాలింతలు పాల్గొన్నారు. తల్లి పాలే బిడ్డకు శ్రేష్టంరాయచూరు రూరల్: పిల్లలు అపౌష్టికత నుంచి పౌష్టికతను పొందాలంటే తల్లి పాలే బిడ్డకు శ్రేష్టమని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సురేంద్రబాబు పేర్కొన్నారు. నగరంలోని తల్లీబిడ్డల ఆస్పత్రి కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రపంచ స్తనపాన సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. తల్లి గర్భిణిగా ఉన్న సమయంలో పౌష్టికాహారాన్ని సేవించాలన్నారు. ప్రసవానంతరం ఆరు నెలల పాటు బిడ్డకు తల్లిపాలు అందించాలన్నారు. పిల్లల పెరుగుదలకు తల్లి పాలు ఎంతో మేలన్నారు. కార్యక్రమంలో తాలూకా వైద్యాధికారి ప్రజ్వల్, భువనేశ్వరి, బసమ్మ, పర్వేజ్, సరోజలున్నారు. -
బావ చేతిలో బామ్మర్ది హతం
సాక్షి,బళ్లారి: తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ భార్య తమ్ముడు, బామ్మర్దిని ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన బళ్లారి తాలూకా ఎత్తినబూదిహాల్ గ్రామంలో చోటు చేసుకుంది. బసయ్య అనే వ్యక్తి తన బామ్మర్దిని దారుణంగా హత్య చేశాడు. 16 ఏళ్ల క్రితం బసయ్య అదే గ్రామానికి చెందిన పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రం కావడంతో పాటు నిత్యం మద్యం తాగి వచ్చి, భార్యను వేధించడంతో పాటు, ఆమె శీలాన్ని నిత్యం శంకించడంతో భార్య విసిగిపోయింది. నిత్యం వేధించడం, హింస పెడుతున్న నేపథ్యంలో తమ్ముడితో కలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కోపోద్రీక్తుడైన బసయ్య శుక్రవారం రాత్రి బామ్మర్ది ఇంటికి వెళ్లి గొడవ పడి, బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఎత్తినబూదిహాల్ గ్రామంలో కలకలం సృష్టించింది. గ్రామానికి అధికారుల దండు ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ శోభారాణి, ఏఎస్పీ రవికుమార్తో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను వేధిస్తుండటంతో సోదరి తరపున పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు మహేష్ను హత్య చేయడంపై గ్రామస్తులు నిందితుడిపై మండిపడుతున్నారు. కుటుంబ గొడవలకు బామ్మర్ది బలై పోయాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా? అని హత్య ఘటనతో ఎత్తినబూదిహాళ్ గ్రామంలో కలకలం -
రేషన్ కష్టాలు తీరేదెన్నడో?
హుబ్లీ: ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొని రాష్ట్ర పాలన చేపట్టి రెండేళ్లు గడిచినా పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం సరుకులు ప్రతి నెల వాటిని పొందడానికి ప్రజలు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కాదు. ముఖ్యంగా హావేరి, ధార్వాడ జిల్లా అలాగే మిగతా చోట్ల ప్రతి నెల గడువులోగా అందాల్సిన రేషన్ బియ్యం ఇంకా అందలేదు. దీంతో చౌక డిపో డీలర్ జిల్లా కేంద్రం హావేరికి వచ్చి వీలైనంత త్వరలో బియ్యం, జొన్నలు పంపమని ఆహార పౌర సరఫరా అధికారులను వేడుకున్నారు. ప్రతి నెలా గడువులోగా అందాల్సిన రేషన్ బియ్యం, జొన్నలు ఈసారి హావేరి జిల్లా సంబంధిత శాఖకు రాలేదు. దీంతో రోజు వినియోగదారులు అడిగే ప్రశ్నలకు విసుగు కలుగుతుందని చౌకడిపో డీలర్లు వాపోతున్నారు. సదరు గోడౌన్కు 15 రోజుల నుంచి ప్రదక్షణలు చేసినా పూర్తి స్థాయి రేషన్ సరుకులు డీలర్లకు అందలేదు. కొన్ని చోట్ల అంగళ్లకు 75 శాతం బియ్యం, జొన్నలు మాత్రమే పంపిణీ చేయడంతో వాటిని వినియోగదారులకు పంచడానికి ఏమీ పాలుపోక డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. వేధిస్తున్న కొత్త తంబ్ ఇంప్రెషన్ సమస్య కొత్త తంబ్ ఇంప్రెషన్ సమస్యతో రేషన్ కార్డు ఉన్నా పంపిణీ సమస్య ఏర్పడుతోంది. అన్న భాగ్య యోజన ద్వారా కేంద్ర సర్కారు నుంచి రావాల్సిన 75 శాతం రేషన్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 25 శాతం రేషన్ బియ్యం రాలేదని ఆ జిల్లా ఆహార పౌర సరఫరా శాఖ డీడీ రమేష్ తెలిపారు. జిల్లాలో అన్నభాగ్య యోజన ద్వారా 64,150 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతుంది. అయితే గత నెల 48,112 క్వింటాళ్ల బియ్యం మాత్రమే సరఫరా అయింది. 16,037 క్వింటాళ్ల బియ్యం పెండింగ్లో ఉంది. దీనికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడమే కారణం. ప్రభుత్వం నిధుల విడుదలతోనే ఎస్సీఐసీఎం విడుదల చేస్తుంది. మరి కొన్ని రోజుల్లో వినియోగదారులకు రేషన్ అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు. తంబ్ ఇంప్రెషన్ విషయం సాంకేతిక సమస్య గతంలో బయోమెట్రిక్ తీసుకొనే వారు, ఈ సారి ఆన్లైన్లో అందరు కుటుంబ సభ్యులు ఉంటే మాత్రమే పంపిణీ చేయడానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. హావేరి జిల్లాలోనే కాదు, మొత్తం రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందన్నారు. సరుకుల కోసం ఎదురు చూపులు చౌక డిపోల్లో ప్రజలకు తప్పని పాట్లు -
బళ్లారి రాఘవ నటచాతుర్యం అమోఘం
బళ్లారి అర్బన్: జాతిపిత మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహానుభావులతో శభాష్ అనిపించుకున్న బళ్లారి రాఘవ నటచాతుర్యం అమోఘం అని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ నాగరాజు పేర్కొన్నారు. శనివారం రాఘవ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బళ్లారి రాఘవ 145వ జయంతి సందర్భంగా రాఘవ కళా మందిరం ముందు ఉన్న రాఘవ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడారు. కన్నడ, తెలుగు భాషల్లోనే కాకుండా ఇంగ్లిష్లో అపారమైన వాక్చాతుర్యంతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునే ఆజానుబాహుడని కొనియాడారు. ముఖ్యంగా రచయిత షేక్స్పియర్ రచించిన నాటకాల పాత్రలలో రంజింపజేయడం, ఇంగ్లిష్ సంభాషణను పలికే తీరు బళ్లారి రాఘవకు అఖండ ఖ్యాతి దక్కేలా చేసిందన్నారు. కన్నడిగుల గుండెల్లో చిరస్థాయిగా రాఘవ అనంతరం రంగభూమి అనుష్యా రత్న బళ్లారి రాఘవ పుస్తకాన్ని రచించిన సిద్దరామ కల్మఠ్ మాట్లాడుతూ బళ్లారి రాఘవ తెలుగు నాటకాల్లో నటించినా కన్నడిగుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. రిజిస్ట్రార్ నాగరాజ్ రాఘవ రంగ పుస్తకాన్ని రచించిన సిద్దరామ కల్మఠను సన్మానించారు. అనంతరం బెంగళూరుకు చెందిన కళాకారుడు డింగ్రి నాగరాజ్కు బళ్లారి రాఘవ ప్రశస్తిని అందించి ఘనంగా సత్కరించారు. కళా సంగమ సంస్థ ధార్వాడ బృందంచే వీరేష్ బాగలకోట రచించిన, దర్శకుడు ప్రభు హంచనాళ్ దర్శకత్వంలో సమరసింహ సంగొళ్లి రాయణ్ణ కన్నడ చారిత్రక నాటకం అందరినీ ఆలరించింది. బళ్లారి రాఘవ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు కే.కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు కే.చెన్నప్ప, పదాధికారులు రమేష్ గౌడ పాటిల్, విష్ణువర్ధన్రెడ్డి, ఎన్.ప్రకాష్, పీ.ధనుంజయ, ఎం.రామాంజినేయులు తదితర ప్రముఖులు, కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. వీఎస్కేయూ రిజిస్ట్రార్ నాగరాజు ఘనంగా 145వ జయంతి వేడుక -
ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ
హొసపేటె: నగరంలోని పలు ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై అధికారుల బృందం ఆకస్మికంగా దాడులు నిర్వహించి, ఎరువుల నిల్వలను భౌతికంగా తనిఖీ చేసింది. యూరియా కొరతను సద్వినియోగం చేసుకున్న కొంత మంది ఎరువులు, పురుగుమందుల దుకాణదారులు బ్లాక్ మార్కెట్లో ఎరువులు విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారుల బృందం నగరంలోని కొన్ని దుకాణాలను ఆకస్మికంగా సందర్శించింది. నోడల్ అధికారి కృష్ణ ఉక్కుంద, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఈ బృందానికి నాయకత్వం వహించారు. తహసీల్దార్ రవి అంగడి బృందానికి నాయకత్వం వహించగా టీపీ ఈఓ రామరెడ్డి పాటిల్, వ్యవసాయ శాఖ ఏడీ సంతోష్ పట్టదకల్ పాల్గొన్నారు. నగరంలోని కొన్ని దుకాణాలపై అధికారులు దాడులు చేసి, బోర్డులోని యూరియా, ఇతర ఎరువులు, విత్తనాల నిల్వలను తనిఖీ చేశారు. వారు స్టాక్ పుస్తకం, పంపిణీ పుస్తకాన్ని పరిశీలించారు. స్టాక్, భౌతిక స్టాక్ వివరాలను పీఓఎస్ యంత్రంలో నమోదు చేయాలని వారు ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతులకు యూరియా ఎరువులు అందించాలని, ఏవైనా లోపాలు కనిపిస్తే కఠిన చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోను రైతులకు అధిక ధరకు ఎరువులు అమ్మకూడదు. అమ్మిన ప్రతి ఎరువుల బస్తాకు అధికారిక రసీదు ఇవ్వాలని, ఏదైనా ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. -
అవినీతి అధికారి కుర్చీకి సత్కారం
గౌరిబిదనూరు: ఇటీవల లోకాయుక్త అధికారులు పట్టణంలో నీటిపారుదల, పారిశుధ్య ఇంజినీరుగా పనిచేస్తున్న ఆంజినేయమూర్తి ఆఫీసు, ఇళ్లల్లో సోదాలు చేసి సుమారు రూ.5 కోట్ల అక్రమ ఆస్తులను కనిపెట్టారు. ఈ నేపథ్యంలో ఆంజినేయమూర్తి అవినీతికి విరుద్దంగా కర్ణాటక రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నీటి పారుదల ఆఫీసు ముందు ధర్నా చేశారు. ఆయన ఫ్లెక్సీని తీసుకుని వచ్చి, కుర్చీలో ఉంచి, పూలదండలు వేసి వ్యంగ్య సత్కారం చేశారు. పార్టీ నేత జాణగెరె రవి ప్రసంగిస్తూ సిగ్గు, లజ్జా లేని అధికారులకు ఇటుంటి సన్మానాలు చేస్తే ఇతరులకు బుద్ధి వస్తుందని ఈ సన్మానోత్సవం చేశామన్నారు.కట్నపిశాచులకు జైలుశిక్షమైసూరు: భర్త కుటుంబం వేధింపులతో విసిగిపోయిన ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న కేసులో దోషులకు జైలుశిక్ష పడింది. వివరాలు.. మైసూరులోని శారదాదేవి నగరలో నివాసముంటున్న గౌతమ్ అతని తల్లి కుశలకుమారి, సోదరి స్వప్న దోషులు. నగరంలోనే నివసించే విశ్వేశరరావు కుమార్తె మహాలక్ష్మితో గౌతమ్కు 2011లో పెళ్లయింది. రూ. 10 వేలు, 12 గ్రాముల బంగారు గొలుసు, అర కిలో వెండి దీపాలు, కొన్ని వెండి వస్తువులును కట్నంగా తీసుకొన్నారు. మెట్టినింట్లో ఆమెను నిత్యం సతాయించేవారు, మరింత కట్నం తీసుకురావాలని కోరేవారు. మహాలక్ష్మికి తాత రాసిచ్చిన ఆస్తిని తీసుకువాలని ఒత్తిడి చేశారు. ఇది తట్టుకోలేక ఆమె 2013 ఆగస్టులో మెట్టినింట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. గౌతమ్, కుశలకుమారి, స్వప్నలపై సరస్వతిపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అప్పటి నుంచి కోర్టులో కేసు సాగుతూ వచ్చింది. 5వ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కే.ఎన్.రూప నేరం రుజువు కావడంతో ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. రమ్య పోస్టుల కేసులో ముగ్గురు అరెస్టు యశవంతపుర: శాండల్వుడ్ నటి, మాజీ ఎంపీ రమ్యపై అశ్లీల సందేశాలు పోస్టు చేసిన కేసుల్లో 13 మందిని గుర్తించారు. వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ సీమంత్కుమార్ సింగ్ తెలిపారు. సోషల్ మీడియాలో కించపరిచే పోస్టులపై నగర సైబర్ క్రైం స్టేషన్ సిబ్బంది సీరియస్గా పని చేస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. అసభ్య వ్యాఖ్యలు చేస్తూ సందేశాలు పంపే వ్యక్తులపై చట్టం ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. బళ్లారి, చిత్రదుర్గ, బెంగళూరు, కోలారు జిల్లాల పరిధిలో 50 అకౌంట్లపై నిఘా ఉంచిన్నట్లు తెలిపారు. బెంగళూరు చుట్టుపక్కల నుంచి అనేక మంది కామెంట్లు చేసినట్లు గుర్తించారు. బళ్లారికి చెందిన ఒకరు, చిత్రదుర్గకు చెందిన మరొకరితో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసి విచారిస్తునట్లు చెప్పారు. కాగా, తన ఫిర్యాదుపై స్పందించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులకు నటి రమ్య ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ నటుడు దర్శన్కు వ్యతిరేకంగా ఆమె ప్రకటనలు చేయడంతో అశ్లీల సందేశాల గొడవ మొదలైంది. మా హీరోనే విమర్శిస్తావా అని ఆమైపె కొందరు అసభ్య పోస్టులు పెట్టారు. -
టీవీ నటుడు ఆత్మహత్య
యశవంతపుర: కన్నడ కామెడీ కిలాడి షో ద్వారా ప్రజల మన్ననలను పొందిన ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర తాలూకా చిమ్మళ్లి గ్రామానికి చెందిన ఆఫ్రికన్ జాతీయుడు చంద్రశేఖర్ సిద్ది (31) ఆత్మహత్య చేసుకున్నాడు. యల్లాపుర తాలూకా కబ్బి గ్రామంలో భార్యతో కలిసి ఉన్నారు. టీవీలలో కామెడీ కిలాడి షోలో నవ్వించే మాటలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్రామంలో కూలీ పని చేసుకుంటూ జీవించేవాడు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు తన కొడుకును పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో మరుగుదొడ్డిలోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్లాడు అని అతని భార్య చుట్టూ వెతికింది. మరుగుదొడ్డిలో చూడగా శవమై ఉన్నాడు. రెండుమూడు నెలల నుంచి మానసికంగా ఇబ్బంది పడుతున్న సిద్ది కారవార క్రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు తెలిసింది. మృతుని తల్లి యల్లాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా టీవీ నటులు ఆత్మహత్యలు చేసుకోవడం అధికమైంది.కాంగ్రెస్ ఎస్సీ మంత్రుల భేటీ శివాజీనగర: సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీ.కే.శివకుమార్ ఢిల్లీ పర్యటనలో ఉండగా, ఇటు బెంగళూరులో ఎస్సీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశాన్ని జరపడం కుతూహలానికి కారణమైంది. శనివారం సాయంత్రం హోం మంత్రి జీ.పరమేశ్వర్ ఇంటిలో ఈ సమావేశం జరిగింది. ఎస్సీలలో ఏబీసీడీ అంతర్గత రిజర్వేషన్ గురించి చర్చించినట్లు చెబుతున్నారు. ఇందులో సుప్రీంకోర్టు తీర్పు తరువాత ప్రభుత్వం హెచ్.ఎన్.నాగమోహన్దాస్ కమిషన్ను నియమించింది. కమిషన్ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఎస్సీల జనగణన సాగించారు. నివేదికను సమర్పించడం మిగిలిఉంది. వర్గీకరణ అవశ్యకత, ఇబ్బందుల గురించి చర్చ సాగిందని చెబుతున్నా, తాజా రాజకీయాలు సైతం ప్రస్తావనకు వచ్చాయి. ఇది తిరుగుబాటు కానీ, అసమాధానం కానీ కాదని ఎమ్మెల్యేలు చెప్పారు. -
తుంగభద్ర తీరాన క్యాన్సర్ భూతం?
ఈ ప్రాంతంలో ముప్పుందిబనశంకరి: విపరీతంగా యూరియా ఎరువులు, అత్యంత విషపూరిత క్రిమిసంహారకాలను అన్నదాతలు వాడడం సాధారణ విషయమైంది. తెగుళ్ల నిరోధానికి, పంటల దిగుబడికి ఇవి తప్పదనే భావన నాటుకుపోయింది. అదే మనుషుల ఆరోగ్యానికి చేటు చేస్తోంది. అధిక ఎరువులు, పెస్టిసైడ్ల వల్ల ప్రత్యేకంగా తుంగభద్రా ఆయకట్టు జిల్లాలు అయిన బళ్లారి– విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. ఎంతోమందిలో క్యాన్సర్ బయటపడుతోంది. ఈ జిల్లాలు క్యాన్సర్ నిలయాలు అవుతాయా? అనే భయాందోళన నెలకొంది. జల వనరులు కలుషితం పంటల ఎదుగుదల కు వాడే యూరియా, పెస్టిసైడ్లు భూమిలోకి, నీటి వనరుల్లోకి చేరుతాయి. నీరు ప్రవహించి నదులు, చెరువుల్లోకి చేరుతుంది. ఈ నీటిని వాడినప్పుడు క్యాన్సర్ తలెత్తే ప్రమాదముందని డాక్టర్ రవి, జేడీ టీ.రుద్రేశప్ప తెలిపారు. గత ఏడాది హుబ్లీ క్యాన్సర్ పరిశోధనా కేంద్రం నిపుణులు కొప్పళలో క్యాన్సర్ పరీక్షా శిబిరం నిర్వహించారు. హాజరైన ప్రతి నలుగురిలో ఒకరికి క్యాన్సర్ ఉన్నట్లు తెలిసిందన్నారు. ఇక్కడే ఎందుకంటే తుంగభద్ర నది తీరంలో పంటపొలాలు ఎక్కువగా ఉన్నాయి. ఏడాదిలో రెండు మూడు పంటలు పండిస్తుంటారు. దీనివల్ల రాష్ట్రంలో ఇతర జిల్లాల కంటే ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఎరువులు, పెస్టిసైడ్లను ఉపయోగిస్తున్నారు. కలుపు నివారణకని అత్యంత విషపూరితమైన గడ్డి మందును వాడుతుంటారు. వీటితో తలెత్తే దుష్పరిణామాలు పట్ల అధ్యయనం చేయాలి. అలాగే పెరుగుతున్న క్యాన్సర్ రోగుల గురించి కూడా. ప్రభుత్వం ఈ దిశలో ప్రత్యేక అద్యయన బృందం ఏర్పాటు చేయాలని రవి, రుద్రేశప్ప డిమాండ్ చేశారు. అధిక ఎరువుల వాడకం క్యాన్సర్కు కారణమవుతోందని హెచ్చరిక బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో అధిక కేసులు విచ్చలవిడిగా యూరియా, పెస్టిసైడ్ల వాడకమే కారణం పిల్లల్లో రక్తహీనత బెడద నిపుణుల హెచ్చరిక గత 10 ఏళ్లలో ఆరంభం కొప్పల జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ టీ.రుద్రేశప్ప, రాయచూరు వ్యవసాయ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్. రవి ఈ చేదు నిజాలను తెలిపారు. కొప్పళ తో పాటు తుంగభద్రా నది ఆయకట్టు ప్రదేశాలలో గత పదేళ్లలో క్యాన్సర్ రోగుల సంఖ్య బాగా అధికమైంది. జన్మించే పిల్లల్లో రక్తహీనత కనబడుతోంది. వీటికి ప్రముఖ కారణం అధికంగా పంటపొలాల్లో ఎక్కువగా యూరియా, క్రిమిసంహారక మందులు చల్లడమేనని చెప్పారు. కానీ దీనిపై నికరంగా చెప్పే ఎలాంటి అధ్యయన నివేదికలు ఇప్పటివరకు రాలేదు. కానీ అనేక అధ్యయనాలు జరిగాయి, నివేదికలను బహిర్గతం చేయలేదు. నివేదికలను బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. -
ఆగని తవ్వకాలు.. తీరని సస్పెన్స్
శివాజీనగర: ధర్మస్థలలో గుర్తు తెలియని శవాల కేసులో వారంరోజులుగా నేత్రావతి నది, పరిసర ప్రాంతాలలో సిట్, పోలీసులచే తవ్వకాలు కొనసాగుతున్నాయి. 6, 7 పాయింట్లలో మానవుల అస్థికలు దొరకడం తెలిసిందే. శనివారం కూడా మిగతా ప్రదేశాలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య తవ్వకాలు చేపట్టారు. ఫిర్యాదిదారు కూడా అక్కడే ఉన్నాడు. మరో సంచలన ప్రకటన మాజీ పౌర కార్మికుడు, ఫిర్యాదిదారు మరికొన్ని సంచలన విషయాలు చెప్పాడు. దావణగెరె జిల్లా హరిహరకు చెందిన అమ్మాయి మృతదేహాన్ని చూశాను, ఆమె వయసు 12 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండేది, ఆ బాలిక పాఠశాల యూనిఫారంలో ఉంది, లో దుస్తులు లేవు. లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైన లక్షణాలు కనిపించాయి. ఆమె మెడను పిసికిన గుర్తులున్నాయి. ఆ శవాన్ని చూపించి గుంతను తవ్వాలని ఆదేశించారు. ఆమెను పాఠశాల బ్యాగ్తో సహా పూడ్చాలని ఆదేశించారు, ఆ దృశ్యాలను ఇప్పటికీ మరచిపోలేకున్నాను అని చెప్పాడు. ఈ సమాచారంతో సిట్ అధికారులు హరిహరలో అదృశ్యమైన బాలికల కోసం సమాచారం సేకరణ చేస్తున్నారు. 2010లో ఓ పాఠశాల బాలిక అదృశ్యమైంది.ఽ ధర్మస్థల, బెళ్తంగడి పాఠశాలల్లో బాలికల మిస్సింగులపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. హెల్ప్ లైన్కు కాల్స్ ప్రజలు ఫిర్యాదు చేయడానికి సిట్ రెండు రోజుల క్రితమే సహాయవాణిని ఆరంభించింది. ఆ సహాయవాణికి వందలాది ఫోన్లు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వందలాది మంది ఫోన్లు చేస్తున్నారు. విచారణ సంగతులను అడుగుతున్నారు. కొందరు సలహాలను కూడా ఇస్తున్నారని తెలిసింది. అయితే ఫిర్యాదులేవీ రాలేదని సిట్ వర్గాలు తెలిపాయి. నిరసనలు ధర్మస్థలలో హత్యలకు పాల్పడినవారిని చట్టం ముందు నిలిపి శిక్షించాలని శనివారం బెంగళూరులో పలు సంఘాలు ఆందోళనలు చేశాయి. హత్యకు గురైన సౌజన్యతో పాటు బాలికలు, యువతుల కుటుంబాలకు న్యాయం జరగాలని నినాదాలు చేశారు. ధర్మస్థలలో మృతదేహాల కేసు.. పాఠశాల బాలికను పూడ్చిపెట్టా: ఫిర్యాదిదారు -
కొలువై ఉన్నాడే దేవదేవుడు
మాలూరు: పురాణ ప్రసిద్ధి పొందిన తాలూకాలోని చిక్కతిరుపతి శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయానికి శ్రావణ రెండవ శనివారం కావడంతో భక్తజనం తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనం కోసం క్యూలైన్లో నిలుచున్నారు. తెల్లవారు జాము 4 గంటలకు ప్రధాన అర్చకులు రవి, గోపాలకృష్ణ్ణ భరధ్వాజ్, నేత్వత్వంలో స్వామి వారికి పూజలను ఆరంభించారు. అభిషేకం, వేదమంత్ర పారాయణం, గణపతి పూజ, తీర్థ ప్రసాద వినియోగం సాగాయి. రాత్రి 8 గంటల వరకూ ఏకధాటిగా భక్తులు దర్శనాలు చేసుకున్నారు. అగర ఆలయంలో బనశంకరి: బొమ్మనహళ్లిలోని అగర లక్ష్మీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో శ్రావణ సందడి నెలకొంది. వేకువజామున అర్చకులు అనంతపురం చంద్రమౌళి ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వరస్వామి మూలవిరాట్ కు అభిషేకం, అర్చనలు చేపట్టారు. వేలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. చిక్కబళ్లాపురలో చిక్కబళ్లాపురం: శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువైన శ్రీ లక్ష్మివెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. కందవారపేటలోని స్వామి ఆలయంలో తెల్లవారు నుంచి పూజలకు నాంది పలికారు. ఈసారి శ్రావణ మాసంలో 5 శనివారాలు వచ్చాయి, పౌర్ణమి, అమావాస్యలు కూడా వచ్చాయని, విశేష పూజల వల్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని పండితులు తెలిపారు. అమ్మవారిని గజలక్ష్మిగా అలంకరించారు. వైకుంఠవాసునికి ఘనంగా శ్రావణ శనివార పూజలు -
మెట్రోలో లివర్ రవాణా
బనశంకరి: మానవ అవయవాలను శనివారం మెట్రో రైలులో వైట్ఫీల్డ్లోని వైదేహి ఆసుపత్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని ఆర్ఆర్.నగర స్పర్శ్ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ సమస్యలు వస్తాయని రైలులో తరలించారు. బ్రెయిన్డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవదానం చేయగా, కాలేయాన్ని స్పర్శ్ ఆస్పత్రికి పంపించారు. మెట్రో అధికారులు, పోలీసులు ఇందులో పాల్గొన్నారు. సకాలంలో చేరుకున్నట్లు తెలిపారు. ఏపీ నుంచి గంజాయి రవాణా యశవంతపుర: మంగళూరు నగర సీసీబీ పోలీసులు గాలింపు జరిపి 123 కేజీల గంజాయిని, రవాణా చేస్తున్న రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ సుధీర్కుమార్రెడ్డి తెలిపారు. కేరళ కాసరగోడు తాలూకావాసులు మసూద్ ఎంకె (45), మొహమ్మద్ అషిక్ (24), సుబేర్ (30)లను అరెస్ట్ చేశారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని అక్రమంగా తరలించి అధిక ధరలకు అమ్మేవారు. రెండు కార్లలో 123 కేజీల గంజాయిని తీసుకెళ్తున్నట్లు తెలిసి దాడులు జరిపారు. మంగళూరులో ఎన్ఐఏ సోదాలు యశవంతపుర: మంగళూరులోని బజ్పెలో హిందూ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య కేసులో దక్షిణ కన్నడ జిల్లావ్యాప్తంగా ఎన్ఐఎ అధికారులు దాడులు చేశారు. బజ్పెలో 10 చోట్ల, సూరత్కల్లో 4 చోట్ల ఇళ్లు, ఆఫీసులలో పత్రాలను పరిశీలించి కొందరిని విచారించారు. మే 1న సుహాస్శెట్టిని కొందరు దుండగులు కత్తులతో నరికిచంపారు. ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు. మోసకారి ఇన్స్టా లవర్ ● యువతికి మాయమాటలు చెప్పి బంగారు నగలు కాజేత ● తమిళనాడులో అరెస్టు అన్నానగర్: సోషల్ మీడియా ప్రేమలు చివరకు మోసాలుగా మిగిలిపోతున్నాయి. ఆకర్షణ మోజులో ముక్కుమొహం తెలియనివారిని నమ్మి డబ్బు, నగలు అర్పించుకుని లబోదిబోమనడం మామూలైంది. అలాంటిదే ఈ వ్యవహారం కూడా. తమిళనాడులో బెంగళూరు ఇన్స్టా లవర్ యువతిని మోసపుచ్చి కటకటాల పాలయ్యాడు. వివరాలు.. విరుదునగర్ జిల్లా రాజపాళ్యం ఆవరంపట్టి ప్రాంతానికి చెందిన నాగసెంథిల్ పవర్ లూమ్ యజమాని. ఇతని కూతురు నాగ అక్షయ (19). ఆమె డిగ్రీ చదువుతోంది. ఆరు నెలల క్రితం ఆమెకు ఇన్స్టా ద్వారా బెంగళూరుకు చెందిన లివిన్ (22) అనే యువకునితో పరిచయం ఏర్పడింది. నాగ అక్షయను గాఢంగా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పగా ఆమె సరేనంది. నేను మీ ఊరికి వచ్చి వెంటనే మూడుముళ్లు కట్టేస్తానని, మనం ఉండటానికి ఇల్లు కొనడానికి డబ్బు ఇవ్వమని అడిగాడు. ఆమె ఒప్పుకోగా లివిన్ రాజపాళయం వచ్చాడు. అతనిని ఆమె తన ఇంటికి ఆహ్వానించి, 25 తులాల బంగారు నగలను ఇచ్చింది. దానిని అందుకున్న తర్వాత, లివిన్ కర్ణాటకకు తిరిగివెళ్లిపోయాడు. మళ్లీ రూ. 50 వేలు కావాలని అర్జంటుగా రూ. 50 వేల డబ్బు పంపాలని ఆమెను అడిగాడు. ప్రేమికుని మాటలపై అనుమానం వచ్చిన నాగ అక్షయ, డబ్బు ఇస్తా, రాజపాళయం రమ్మని కోరింది. మరోవైపు పోలీసులకు సమాచారం ఇచ్చింది. లివిన్ రాగానే పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
జైలు గోడల మధ్య ప్రజ్వల్..‘నేను హైకోర్టుకు వెళతా’అంటూ ఆవేదన..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ కీలక నేత హెచ్డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణకు జీవితఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో ప్రజ్వల్ బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. శిక్షలో భాగంగాప్రజ్వల్ తొలిరోజే.. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. తాను హైకోర్టును ఆశ్రయిస్తానని జైలు సిబ్బందితో అన్నట్లు తెలుస్తోంది.జైలు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..జీవిత ఖైదు శిక్షలో భాగంగా తొలిరోజు రాత్రంతా ఒత్తిడితో గురయ్యారు. వైద్య పరీక్షల సమయంలో తనకు జైలు శిక్ష పడడంపై కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. ఇక, ప్రజ్వల్ రేవణ్ణకు జైలు అధికారులు ఖైదీ నంబర్ 15528 కేటాయించారు. రోజువారీ వేతనం రూ. 524 చెల్లించనున్నారు. రోజుకు ఎనిమిది గంటల పాటు జైల్లో బేకరీ, తోటపని, హస్తకళలు వంటి విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది.ఇక జైలు నిబంధనల ప్రకారం ప్రజ్వల్కు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల సమయంలో ఆయన తీవ్ర వేదనకు గురైనా.. ఆరోగ్యం బాగుందని వైద్యులు వెల్లడించారు. మాజీ ఎంపీ కాబట్టి హై-సెక్యూరిటీ సెల్లో ఉంచారు. ప్రిజన్ యూనిఫాం ధరించారు.ప్రజ్వల్ రేవణ్ణ కేసు ఏంటంటే?కాగా ప్రజ్వల్ రేవణ్ణకు జీవితఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రజ్వల్పై రూ.11.50 లక్షల జరిమానా సైతం కోర్టు విధించింది. ఈ రూ.11.50 లక్షల్లో బాధిత మహిళకు రూ.11.25 లక్షలు చెల్లించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ఆదేశించారు.పలు ఐపీసీ సెక్షన్లతోపాటు ఐటీ చట్టం కింద నిందితుడిని ఈ శుక్రవారం దోషిగా నిర్ధారించిన కోర్టు శనివారం శిక్షను ప్రకటించింది. మైసూరు జిల్లా కేఆర్ నగర ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల మహిళపై 34 ఏళ్ల ప్రజ్వల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రించి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. హోలెనరసింహపుర జిల్లాలోని హాసన పట్టణంలోని గన్నికడ ఫామ్హౌస్లో ఈ దారుణం జరిగిందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదుచేసిన పోలీసులు దాదాపు 14 నెలల క్రితం ప్రజ్వల్ను అరెస్ట్చేయడం తెల్సిందే.కోర్టు ఏకంగా జీవితఖైదు విధించడంతో కోర్టు హాల్లోనే ఉన్న దోషి ప్రజ్వల్ ఒక్కసారిగా ఏడ్వడం మొదలెట్టాడు. ‘‘నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన మెరిట్ విద్యార్థిని. పార్లమెంట్ సభ్యునిగా మంచి పనులు చేశా. నాపై ఇంతవరకు నమోదైన రేప్ కేసుల్లో ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి నాపై కేసు వేయలేదు. వేగంగా రాజకీయాల్లో పైకి ఎదిగానన్న కక్షతో నాపై కేసులు మోపారు. నేనింతవరకు ఏ తప్పూ చేయలేదు. రాజకీయాల్లో ఎదగడమే నేను చేసిన తప్పు. గత ఏడాది లోక్సభ ఎన్నికలకు కేవలం ఆరు రోజుల ముందు దురుద్దేశంతో నాపై లైంగిక ఆరోపణలు మొదలయ్యాయి.బాధితురాలిగా చెబతున్న మహిళ తన భర్త, కుటుంబసభ్యులకు కూడా తనకు అన్యాయం జరిగిందని అసలు చెప్పనే లేదు. ఉద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఫిర్యాదుచేశారు. నాకూ కుటుంబం ఉంది. కనీసం ఆరు నెలల నుంచి కన్న తల్లిదండ్రులను చూడలేకపోయా. నాకు తక్కువ శిక్ష విధించండి’’అని ప్రజ్వల్ ఏడుస్తూ జడ్జీని వేడుకున్నాడు. కేసు నమోదువేళ జర్మనీకి పారిపోయిన ఆనాటి ఎంపీ ప్రజ్వల్ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పోలీసులు గత ఏడాది మే 31వ తేదీన బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్చేశారు. 113 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని బలమైన ఆధారాలు సంపాదించారు. 1,632 పేజీలతో చార్జ్షీట్ను గతంలో కోర్టుకు సమర్పించారు. ఐటీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద నమోదైన అన్ని అభియోగాలపై కోర్టు ఏకీభవించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్, అదనపు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీఎన్ జగదీశ చెప్పారు. -
ప్రజ్వల్కు జీవితఖైదు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ కీలక నేత హెచ్డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్కు జీవితఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రజ్వల్పై రూ.11.50 లక్షల జరిమానా సైతం కోర్టు విధించింది. ఈ రూ.11.50 లక్షల్లో బాధిత మహిళకు రూ.11.25 లక్షలు చెల్లించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ఆదేశించారు. పలు ఐపీసీ సెక్షన్లతోపాటు ఐటీ చట్టం కింద నిందితుడిని శుక్రవారం దోషిగా నిర్ధారించిన కోర్టు శనివారం శిక్షను ప్రకటించింది. మైసూరు జిల్లా కేఆర్ నగర ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల మహిళపై 34 ఏళ్ల ప్రజ్వల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రించి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. హోలెనరసింహపుర జిల్లాలోని హాసన పట్టణంలోని గన్నికడ ఫామ్హౌస్లో ఈ దారుణం జరిగిందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదుచేసిన పోలీసులు దాదాపు 14 నెలల క్రితం ప్రజ్వల్ను అరెస్ట్చేయడం తెల్సిందే. కోర్టు ఏకంగా జీవితఖైదు విధించడంతో కోర్టు హాల్లోనే ఉన్న దోషి ప్రజ్వల్ ఒక్కసారిగా ఏడ్వడం మొదలెట్టాడు. ‘‘నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన మెరిట్ విద్యారి్థని. పార్లమెంట్ సభ్యునిగా మంచి పనులు చేశా. నాపై ఇంతవరకు నమోదైన రేప్ కేసుల్లో ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి నాపై కేసు వేయలేదు. వేగంగా రాజకీయాల్లో పైకి ఎదిగానన్న కక్షతో నాపై కేసులు మోపారు. నేనింతవరకు ఏ తప్పూ చేయలేదు. రాజకీయాల్లో ఎదగడమే నేను చేసిన తప్పు. గత ఏడాది లోక్సభ ఎన్నికలకు కేవలం ఆరు రోజుల ముందు దురుద్దేశంతో నాపై లైంగిక ఆరోపణలు మొదలయ్యాయి. బాధితురాలిగా చెబతున్న మహిళ తన భర్త, కుటుంబసభ్యులకు కూడా తనకు అన్యాయం జరిగిందని అసలు చెప్పనే లేదు. ఉద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఫిర్యాదుచేశారు. నాకూ కుటుంబం ఉంది. కనీసం ఆరు నెలల నుంచి కన్న తల్లిదండ్రులను చూడలేకపోయా. నాకు తక్కువ శిక్ష విధించండి’’అని ప్రజ్వల్ ఏడుస్తూ జడ్జీని వేడుకున్నాడు. కేసు నమోదువేళ జర్మనీకి పారిపోయిన ఆనాటి ఎంపీ ప్రజ్వల్ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పోలీసులు గత ఏడాది మే 31వ తేదీన బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్చేశారు. 113 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని బలమైన ఆధారాలు సంపాదించారు. 1,632 పేజీలతో చార్జ్ïÙట్ను గతంలో కోర్టుకు సమర్పించారు. ఐటీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద నమోదైన అన్ని అభియోగాలపై కోర్టు ఏకీభవించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్, అదనపు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీఎన్ జగదీశ చెప్పారు. బాధితురాలికి హ్యాట్సాఫ్: సీఐడీ చీఫ్ వ్యాఖ్య బనశంకరి: ఈ కేసులో ఎన్ని బెదిరింపులు ఎదురైనా బాధితురాలు ధైర్యంగా ఎదుర్కొన్నారని సీఐడీ అదనపు డీజీపీ బిజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘కేసు నమోదైన 16 నెలల్లో తీర్పు రావడం నిజంగా ప్రత్యేకం. లైంగిక వేధింపుల వీడియోలో ఉన్నది ప్రజ్వల్ అని కోర్టుకు నిరూపించడానికి సిట్ ఎంతో శ్రమించింది. నేర నిరూపణకు బాధితురాలి ధైర్యమే కారణం. ఆమెకు ఈ విషయంలో సీఐడీ నిజంగా ధన్యవాదాలు తెలుపుతోంది. ఈమె నిరుపేద కావడంతో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రాబల్యం కలిగిన వ్యక్తి కుటుంబం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు’’అని బిజయ్ అన్నారు. ఎప్పుడేం జరిగిందంటే? → 2024 ఏప్రిల్ 22: ప్రజ్వల్ రేప్ వీడియోలు వైరల్ → ఏప్రిల్ 25 : అశ్లీల వీడియోలపై దర్యాప్తు జరపాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి లేఖ → ఏప్రిల్ 26–27: జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ → ఏప్రిల్ 28 : ప్రజ్వల్పై ఎఫ్ఐఆర్ నమోదు → ఏప్రిల్ 28 : అశ్లీల దృశ్యాలు కలిగిన పెన్డ్రైవ్ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం → ఏప్రిల్ 30: జేడీఎస్ పార్టీ నుంచి ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తూ జేడీఎస్ నిర్ణయం → మే 1 : ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు → మే 30: బెంగళూరు ఎయిర్పోర్ట్లో ప్రజ్వల్ అరెస్టు → సెప్టెంబర్ 9 : 113 సాక్షులతో కూడిన 1,632 పేజీల రెండో చార్జ్ïÙట్ దాఖలు → నవంబర్ 11 : ప్రజ్వల్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు → 2025 జూలై 18 : విచారణ పూర్తి చేసి జూలై 30న తీర్పు వెలువరిస్తామని చెప్పిన కోర్టు → జూలై 30: ఆగస్టు 1కి తీర్పు వాయిదా → ఆగస్టు 1: ప్రజ్వల్ను దోషిగా తేలి్చన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం → ఆగస్టు 2: ప్రజ్వల్కు జీవిత ఖైదు విధింపు -
ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు?
కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థళలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఆ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో వందకు పైగా మృతదేహాలను తాను ఖననం చేశానని (Mass Burial Case) ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చెప్పడం.. అతడు చూపించినట్లు 13 ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు చేపట్టారు. అయితే 6వ పాయింట్లో మానవ అస్థిపంజరాల అవశేషాలు బయటపడటంతో దర్యాప్తులో కీలక ముందడుగు పడిందని భావించారంతా. ధర్మస్థళ(Dharmasthala) కేసులో ఇవాళ ఐదో రోజు తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రావళి నది సమీపంలోని అటవీ ప్రాంతంలో.. 9వ పాయింట్ వద్ద అధికారులు మానవ అవశేషాలు గుర్తించే పనిలో ఉన్నారు. మిగిలిన ఈ ఐదు స్పాట్లను అధికారులు కీలకంగా భావిస్తున్నారు. మరోవైపు.. ఇవాళ ప్రత్యక్ష సాక్షిని అధికారులు విచారిస్తారని సమాచారం. ఇప్పటిదాకా జరిపిన తవ్వకాల్లో కేవలం గురువారం(జులై 31వ తేదీ) ఆరో పాయింట్లో ఓ చోట కొన్ని అవశేషాలను మాత్రమే అధికారులు గుర్తించారు. ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం. అవి ఇద్దరు మహిళలకు చెందినవి కావొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్కు పంపించారు. అయితే ల్యాబ్లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు అంటున్నారు. అయితే.. ఆరో పాయింట్ తప్ప.. ఇప్పటిదాకా అధికారులు తవ్వకాలు జరిపిన ప్రాంతాలు నదీ తీరాన్ని ఆనుకుని ఉన్నాయి. అవి వరదలతో ప్రభావితం అయ్యాయి. ఈ క్రమంలో మానవ కంకాళాలు(ఎముకలు) కొట్టుకుపోయే అవకాశాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో.. అటవీ ప్రాంతంలోని మిగతా పాయింట్ల మీద దృష్టి సారించారు. పైగా ఈ ప్రాంతాల్లోనే సామూహికంగా తాను శవాలను పాతిపెట్టానని అతను చెబుతున్నట్లు కర్ణాటకకు చెందిన కొన్ని వార్తా చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ కథనాలు ఇస్తుండడం విశేషం. దీంతో ఈ ఐదు ప్రాంతాలు ఈ కేసుకు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదీ చదవండి: ధర్మస్థళ.. ఉష్ గప్చుప్!జనాలు రాకుండా.. గత సోమవారం నుంచి సిట్ అధికారులు.. అతడిని(మాజీ పారిశుద్ధ్య కార్మికుడిని) వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతం కావడం, దానికితోడు భారీ వర్షాల వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సిట్కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ప్రణబ్ మొహంతి తెలిపారు. గుంతలు తవ్వేందుకు 20 మంది కార్మికులు, బుల్డోజర్ల సాయం తీసుకుంటున్నారు. ఐపీఎస్ అధికారులు అనుచేత్, జితేంద్ర కుమార్ దయామ, ఎస్పీ సైమన్, పుత్తూరు తహసీల్దారు స్టెల్లా వర్గీస్, బెళ్తంగడి తహసీల్దారు పృథ్వీ సానికం, మంగళూరు కేఎంసీ వైద్యులు, ఫోరెన్సిక్ ప్రయోగశాల నిపుణుల సమక్షంలో ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రవతీ నది ఒడ్డున సిట్ తవ్వకాలు జరుపుతుండడంతో జనం ఆ ప్రాంతాల్లో బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో తవ్వకాలకు అంతరాయం కలిగే అవకాశం ఉండడంతో పోలీసులు అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు. అయితే.. ఏంటీ మిస్టరీ కేసు..దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థళ ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక (Karnataka) ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీ ఇక్కడికి భారీగా వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు(62).. తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని.. వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్కు ఇటీవల ఒక లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశం క్లుప్తంగా.. ‘‘గతంలో ఇక్కడ మహిళలు, బాలికలపై ఎన్నో దారుణాలు జరిగాయి. నేనే ఎన్నో శవాలను పూడ్చిపెట్టా. 1998 నుంచి 2014 మధ్య వందకు పైగా మృతదేహాలను ఖననం చేశాను. ఆ వ్యక్తులే మా కుటుంబానికి చెందిన యువతిపై అనుచితంగా ప్రవర్తించడంతో మేం దూరంగా వెళ్లిపోయాం. నన్ను పాపభీతి వెంటాడుతోంది. నాకు రక్షణ కల్పిస్తే నాటి ఘటనలను బయటపెడతా’’2014 డిసెంబరులో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండడంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని ఆ వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు. అయితే మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు? వాటిని ఎవరి సహాయంతో తీసుకువెళ్లేవారు? తదితర ప్రశ్నలను సిట్ అధికారులు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద అతనికి రక్షణ కల్పించారు. మరోవైపు.. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థళ పరిసరాల్లో పలువురు మహిళలను దారుణంగా హింసించి, కడతేర్చారన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు ఆ వ్యక్తి లేఖలో పేర్కొనడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.వందల మంది మిస్సింగ్?దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థళ ఓ చిన్నగ్రామం. ఎన్నో ఏళ్ల కిందటే ఇక్కడ మంజునాథ స్వామి ఆలయం విస్తరించింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఐదు దశాబ్దాలుగా ఆలయానికి ధర్మాధికారిగా వ్యవహరిస్తున్నారు. గత ఐదు దశాబ్దాల్లో ధర్మస్థళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యాసంస్థలు వెలిశాయి. దీంతో భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటిచోట తాజా ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయి. గత పదేళ్లలో.. ధర్మస్థళ, బెళ్తంగడి, ఉజిరె పీఎస్ల పరిధిలో 450 మంది అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు. వీటిలో ఒక్క కేసునూ పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలు నోరు మెదపకుండా డబ్బుతో నోరు మూయించారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో కూడా ఒక కళాశాల విద్యార్థి(20)ని హత్యాచారానికి గురైంది. స్థానిక మోతుబరి కుటుంబానికి చెందినవారు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు పలు ప్రజా సంఘాలతో కలిసి అప్పట్లోనే ఆందోళనలు చేశారు. తమకు అనుమానం ఉన్న కొందరు వ్యక్తులను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయంటూ బాధితురాలి తల్లి సుజాత భట్ తాజాగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇదీ చదవండి: ధర్మస్థళ కేసు.. పురుషుల మృతదేహాలు కూడా?!మీడియాకు ఊరటధర్మస్థళలో ఏం జరుగుతోందంటూ.. గత కొన్నిరోజులుగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో కథనాలు మారుమోగుతున్నాయి. ఈ తరుణంలో కొందరు పెద్దలు ధర్మస్థళ పేరును చెడగొడుతున్నారంటూ బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సామూహిక ఖననాలకు సంబంధించిన వేలకొద్దీ కథనాల లింకులను తొలగించాలని, అసత్య ప్రచారం చేయవద్దని మీడియాకు సూచిస్తూ న్యాయస్థానం గాగ్ ఆర్డర్ను ఇచ్చింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధులు కర్ణాటక హైకోర్టుకు వెళ్లగా.. కోర్టు ఆ గాగ్ ఆర్డర్ను కొట్టేస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. -
బళ్లారి రాఘవ కీర్తి.. దశదిశలా వ్యాప్తి
బళ్లారిఅర్బన్: బళ్లారి జిల్లాకు ఎప్పటి నుంచో దేశ, విదేశాల్లో గుర్తింపు ఉందంటే అందుకు పలు రకాల కారణాలు ఉన్నాయి. ప్రముఖంగా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హంపీ ద్వారా బళ్లారి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు లభించాయి. అయితే చాలా సంవత్సరాల నుంచి హంపీతో పాటు బళ్లారి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే అందుకు బళ్లారి జిల్లాలో ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నేపథ్యం, ఇనుప ఖనిజ నిల్వలు తదితరాలతో బళ్లారి ఖ్యాతి దశ, దిశలా వ్యాపించిందనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1880 ఆగస్టు 2వ తేదీన జన్మించిన బసప్ప అనే వ్యక్తి తర్వాత బళ్లారిలో స్థిరపడి బళ్లారి రాఘవగా తన పేరును రూపాంతరం చేసుకుని బళ్లారి ఖ్యాతిని ఇనుమడింపజేశారు. అలాంటి గొప్ప వ్యక్తి 145వ జయంతి వేడుకలు శనివారం బళ్లారిలోని రాఘవ కళామందిరంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఆయన చరిత్రను ఒకసారి తిలకిస్తే.. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో 1880లో కన్నడాంధ్ర ముద్దుబిడ్డ బళ్లారి రాఘవ జన్మించారు. పుట్టింది తాడిపత్రిలో అయితే పెరిగింది, పేరు ప్రఖ్యాతులు గడించింది బళ్లారిలోనే. విద్యార్థి దశ నుంచి నాటక రంగంపై ఆసక్తి పెంచుకుని బళ్లారి రాఘవ దేశ, విదేశాల్లో వివిధ పాత్రల్లో తన నటనాశైలితో ప్రపంచంలోనే వివిధ దేశాల్లో గుర్తింపు తెచ్చుకుని బళ్లారికి పేరు తెచ్చిన మహానటుడిగా నిలిచారు. నాట్యకళాప్రపూర్ణగా, విశ్వవిఖ్యాత నటుడుగా, నాటక రంగం ద్వారానే తన అపూర్వ ప్రతిభను కనబరిచి నాటకాలకే వన్నే తెచ్చారు బళ్లారి రాఘవ. పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలన్నింటిలోనూ నటించిన ఘనత బళ్లారి రాఘవ స్వంతం. హరిశ్చంద్రుడు, హిరణ్య కశిపుడు, బాహుకుడు, యమధర్మరాజు, దుర్యోధనుడు, దశరథుడు, భరతుడు, రావణుడు, కీచకుడు, అర్జునుడు, చాణుక్యుడు, రాజరాజు, రామదాసు తదితర పాత్రలలో నాటకాల్లో తన అపార ప్రతిభను కనబరిచి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు రాఘవ. అపార ప్రతిభతో పాత్రలకు వన్నె ఆయన కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ తదితర భాషల్లో అపారమైన ప్రతిభతో నాటకాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. భక్త ప్రహ్లాద నాటకంలో హిరణ్యకశిపుడు పాత్ర పోషించి, సాక్షాత్తూ హిరణ్యకశిపుడే వచ్చారనే విధంగా ఆయన నటించేవారు. బళ్లారి రాఘవ వృత్తి రీత్యా లాయర్. ఆయన న్యాయవాద వత్తితో పాటు చిన్నప్పటి నుంచి పుణికి పుచ్చుకున్న నాటక రంగం ద్వారానే అపారమైన పేరు గడించారు. ఆయనకు పేరుతో పాటు ఆయన పుట్టి, పెరిగిన అటు తాడిపత్రికి, ఇటు బళ్లారికి పేరు వచ్చిందంటే అందులో బళ్లారి రాఘవ నటనా వైభవం కూడా దాగి ఉంది. బళ్లారి రాఘవ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. నాట్య కళాప్రపూర్ణగా బిరుదాంకితుడైన బళ్లారి రాఘవ రంగస్థల నటుడుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. నేడు బళ్లారి రాఘవ 145వ జయంతి బళ్లారి రాఘవ 145వ జయంతి సందర్భంగా రాఘవ కళా మందిరంలో ఈ నెల 2న బళ్లారి రాఘవ రాజ్య ప్రశస్తికి కన్నడ కళాకారుడు బెంగళూరుకు చెందిన డింగ్రి నాగరాజ్ ఎంపికయ్యారు. ధార్వాడకు చెందిన కళా సంఘం సంస్థ ఆధ్వర్యంలో వీరేష్ బళగాలపేట్ రచించిన సమరసింహ సంగొళ్లి రాయణ్ణ అనే కన్నడ ఐతిహాసిక నాటకాన్ని ప్రభు హంచనాళ్ దర్శకత్వంలో ప్రదర్శించనున్నారు. ఈ నెల 3న తెలుగు రాష్ట్ర ప్రశస్తి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన గుమ్మడి గోపాలకృష్ణ ఎంపికయ్యారు. శ్రీ రామన్ ఫౌండేషన్, శ్రీ సాయిబాబా నాట్య మండలి విజయవాడ బృందంచే విజయవాడ సంస్కార భారతి అధ్యక్షుడు డాక్టర్ పీవీఎస్.కృష్ణ రచించిన జయహో చత్రఫతి శివాజీ మహారాజ్ అనే చారిత్రక తెలుగు నాటకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఉత్తమ విద్యార్థులకు సత్కారం
రాయచూరు రూరల్ : విద్యార్థుల ప్రతిభకు ప్రదర్శనలు తార్కాణం కావాలని కేఈబీ పాఠఽశాల హెడ్మాస్టర్ హీరాలాల్ పేర్కొన్నారు. శుక్రవారం మాదర చెన్నయ్య సభా భవనంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించి మాట్లాడారు. సమాజ సేవ చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. స్వార్థం వదిలి నిస్వార్థంతో పని చేయాలన్నారు. విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసించి స్వశక్తితో ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో సంతోష్, రావుత్ రావ్, వీరేశ్, మారెప్ప, లోకేష్, మౌనేష్లున్నారు. -
బెంగళూరులో కిరాతకం.. బాలుడు కిడ్నాప్, హత్య
శాంతిభద్రతలు లేవు: విపక్ష నేత ఈ దుర్ఘటనపై బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేదానికి ఇదే నిదర్శనం అని ట్వీట్ చేశారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. హోంమంత్రి పరమేశ్వర్.. మీ శాఖ మేలుకోవడానికి ఇంకా ఎంతమంది బలి కావాలి, ఇలాంటి దుర్ఘటనలు ఇంకా ఎన్ని జరగాలి అని ఆయన దుయ్యబట్టారు. మైకు దొరికితే చాలు జాతీయ అంతర్జాతీయ , ప్రపంచంలోని అన్ని విషయాలపై ఉపదేశంచేసే మహామేధావి, కలబుర్గి జిల్లా ఇన్చార్జ్మంత్రి ప్రియాంక్ఖర్గేకు తమ జిల్లాల్లో సంభవిస్తున్న రైతుల ఆత్మహత్యలు కనబడటంలేదా అని ప్రశ్నించారు.బనశంకరి: సిలికాన్ సిటీలో ఘోరం సంభవించింది. బాలుడు ట్యూషన్ ముగించుకుని ఇంటికి వెళుతుండగా దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. దీంతో బాలుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘోరం రాజధాని అంతటా తీవ్ర సంచలనం కలిగించింది. బుధవారం రాత్రి కిడ్నాపైతే గురువారం రాత్రి మృతదేహం లభించింది. ఆ తర్వాత నేరస్తులపై కాల్పులు జరిగాయి. డ్రైవరే కుట్ర చేసి.. ● అరకెరె శాంతినికేతన్ లేఔట్లో బాలుడు నిశ్చిత్ (13) తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. క్రైస్ట్ స్కూల్లో 8 వ తరగతి చదువుతున్నాడు. ● నిశ్చిత్ తండ్రి అచ్యుత్ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అచ్యుత్ వద్ద గురుమూర్తి అదనపు డ్రైవర్గా ఉండేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతడు డబ్బు కోసం నిశ్చిత్ను కిడ్నాప్ చేయాలని కుట్ర పన్నాడు. ● బాలుడు జూలై 30న బుధవారం సాయంత్రం ట్యూషన్ ముగించుకుని 7:30 కు సైకిల్లో ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో గురుమూర్తి, గోపాలకృష్ణ తదితరులు బాలునికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. మీ నాన్న చెప్పాడు అని బాలున్ని దుండుగుడు బైక్పై ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తేలింది. ఆ సీసీ కెమెరా దృశ్యాలు లభించాయి. ● ట్యూషన్ ముగిసి ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పలుచోట్ల గాలించి రాత్రి 10 గంటలకు హుళిమావు ఠాణాలో ఫిర్యాదు చేశారు. రూ.5 లక్షలు ఇస్తే వదిలేస్తాం అంతలో బాలుని తండ్రికి కిడ్నాపర్లు ఫోన్ చేసి కుమారున్ని ప్రాణాలతో చూడాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తామని వారు ఒప్పుకున్నారు. హుళిమావు పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు తీవ్రం చేశారు. ఓ పార్కు వద్ద బాలుని సైకిల్ దొరికింది. మరోవైపు పోలీసులకు దొరికిపోతామనుకున్న కిడ్నాపర్లు బాలుడు నిశ్చిత్ని బన్నేరుఘట్ట రోడ్డులో చెట్ల మధ్యలో గొంతు కోసి చంపి, ముఖం గుర్తు పట్టకుండా పెట్రోల్పోసి నిప్పుపెట్టినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసింది. రూ. 5 లక్షలు డిమాండ్ ఇస్తామన్న తల్లిదండ్రులు అంతలోనే హత్య చేసి నిప్పు దుండగులపై పోలీసుల కాల్పులు, అరెస్టు24 గంటల తరువాత.. గురువారం రాత్రి బన్నేరుఘట్ట రోడ్డు సమీపంలో చెట్లలో బాలుని మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు తెలిపారు. అర్ధరాత్రి కగ్గలిపుర రోడ్డులో దుండగులు దాగిఉన్నట్లు తెలిసి హుళిమావు పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. దుండగులు మరణాయుధాలతో దాడికి దిగారు. దీంతో సీఐ కుమారస్వామి, ఎస్ఐ అరవింద్కుమార్ కాల్పులు జరపగా గురుమూర్తికి రెండుకాళ్లు, గోపాలకృష్ణ కు కాలికి బుల్లెట్ తగిలి కూప్పకూలిపోయారు. పోలీసులు వారిని పట్టుకుని విక్టోరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు ఈ హత్యోదంతంలో పాల్గొన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనాస్థలిని ఎలక్ట్రానిక్సిటీ డీసీపీ నారాయణ్, రూరల్ ఎస్పీ సీకే బాబా పరిశీలించారు. -
టీసీఎస్ లేఆఫ్లపై సర్కారు దృష్టి
శివాజీనగర: ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ పెద్ద స్థాయిలో ఐటీ ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. టీసీఎస్ 12 వేల మంది ఉద్యోగులను తీసేస్తోందనే వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆ సంస్థను కోరినట్లు కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ తెలిపారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, టీసీఎస్తో లేఆఫ్కు కారణాలపై సమాలోచన జరుపుతామన్నారు. గత ఐదేళ్లుగా సన్రైజ్ పేరిట అనేక సంస్థలకు కార్మిక చట్టాల నుంచి మినహాయింపులు ఇచ్చాం, కంపెనీలు ఎవరినైనా ఉద్యోగాల నుంచి తొలగిస్తే మాకు ఆ సమాచారం ఇవ్వాలి. ఎందుకు, ఏమిటి అనేది మాట్లాడుతామని మంత్రి తెలిపారు.నవంబరులో బీబీఎంపీ ఎన్నికలు! బనశంకరి: నవంబరులో బీబీఎంపీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ను దాఖలు చేసింది. బీబీఎంపీ ఎన్నికల పిటిషన్ సోమవారం విచారణకు రానుండడంతో అంతలోగా లిఖితపూర్వకంగా వివరాలు అందించాలని ధర్మాసనం సర్కారు తరఫు న్యాయవాదులకు ఆదేశించింది. బీబీఎంపీ వార్డుల విభజన, సరిహద్దులు, రిజర్వేషన్ ప్రక్రియ, ఓటర్ల జాబితా సిద్ధం చేయడం తదితర ప్రక్రియలు ఉన్నట్లు కోర్టుకు వివరించారు. నవంబరులోగా పూర్తి ప్రక్రియ పూర్తిచేస్తామని, ఇప్పటికే 50 శాతం పనులు పూర్తిచేశామని అఫిడవిట్లో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా బెంగళూరు పాలికెకు ఎన్నికలు జరగలేదు. ఆరడుగుల కోసం ఆక్రోశం చింతామణి: రంగేనహళ్లిలో ఆరడుగుల కోసం రగడ ఏర్పడింది. పూర్వం నుంచి గ్రామస్తులు చనిపోతే గ్రామ శివార్లలోని సర్వే నంబరు 8 స్థలంలోని స్మశానంలో పూడ్చేవారు. అయితే ఆ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని, మృతదేహాలను పూడ్చరాదని హెచ్చరించారు. శుక్రవారం తాలూకాలోని రంగేనహళ్లిలో చెందిన కొండప్ప (60) అనే వృద్దుడు అనారోగ్యంతో మరణించాడు. బంధువులు అంత్యక్రియల కోసం తీసుకెళ్లగా కొందరు అడ్డుకున్నారు. గత్యంతరం లేక న్యాయం చేయాలని శవాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళన చేశారు. తహశీల్దార్ సూచనతో సర్వే సిబ్బంది అక్కడ సర్వే చేపట్టారు. ఇంతలో మరోచోట అంత్యక్రియల్ని పూర్తిచేశారు. కంఠీరవ సహోదరి కన్నుమూత మైసూరు: కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్కుమార్ సహోదరి నాగమ్మ శుక్రవారం చామరాజనగర జిల్లా సరిహద్దులో ఉన్న తాళవాడి సమీపంలోని గాజనూరులోని నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 94 ఏళ్లు, వయోభారంతో బాధపడుతోంది. ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం అంత్యక్రియలు జరగనున్నాయి. వెంటనే రాజ్కుమార్ తనయుల కుటుంబాలు గాజనూరుకు బయలుదేరాయి. నాలుగేళ్ల కిందట రాజ్కుమార్ చిన్నకుమారుడు పునీత్ మరణించడం తెలిసిందే. ఆ విషయాన్ని ఇప్పటికీ నాగమ్మకు చెప్పలేదు. పునీత్ అంటే నాగమ్మకు ఎంతో ఇష్టం. పునీత్ తరచూ ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించేవాడు. పునీత్ లేడని తెలిస్తే నాగమ్మ భరించలేదని అప్పటినుంచి ఆమెకు తెలియకుండా ఉంచారు. చివరికి పునీత్ మరణ వార్త తెలియకుండానే నాగమ్మ మరణించడం గమనార్హం. -
ఘనంగా అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన
శ్రీనివాసపురం : పట్టణ సమీపంలోని పుంగనూరు క్రాస్లో నూతనంగా ఏర్పాటు చేసినఅభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. లోకకళ్యాణ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ వైఏ నారాయణస్వామి హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని రక్షించే ఉద్దేశంతో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను విరివిగా నిర్వహించాల్సి ఉందన్నారు. ఆలయాన్ని రూ.15 కోట్లతో నిర్మిస్తుండగా ఇప్పటికే రూ. 10 కోట్ల మేర పనులు ముగిశాయన్నారు. ప్రతిష్టాపనా పూజా కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్న సంతర్పణ జరిగింది. -
సకాల సేవల్లో విజయనగర జిల్లా ప్రథమం
హొసపేటె: జూలై– 2025లో సకాలలో పని తీరు పరంగా రాష్ట్రంలోనే విజయనగర జిల్లా మొదటి ర్యాంకు సాధించింది. ఈ విషయంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని జిల్లాధికారి దివాకర్ ప్రశంసించారు. ప్రస్తుతం విజయనగర జిల్లాలో ప్రజలకు సకాలలో సేవలను అందించడానికి ప్రజల నుంచి మొత్తం 85,978 దరఖాస్తులు అందగా, వాటిలో మొత్తం 84,904 దరఖాస్తులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించారు. 98.75 శాతం సకాలలో పరిష్కార రేటును కొనసాగించారు. నిర్ణీత వ్యవధిలో ప్రజా సేవలను పరిష్కరించిన అధికారుల సేవలను జిల్లాధికారి కొనియాడారు. భవిష్యత్తుల్లో కూడా అదే వ్యవధిలో అన్ని ప్రజా సేవలను ఎలాంటి ఆలస్యం లేకుండా అందించాలని ఆదేశించారు. కరియప్ప సేవలు స్ఫూర్తిదాయకం హుబ్లీ: శివాజీ అన్న జోళిగె ద్వారా లక్ష్మేదశ్వరలో ప్రతి రోజూ వందలాది మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేస్తున్న నీలప్ప కుడ్డప్ప శిరహట్టి సేవా సంస్థ నిర్వాహకులు కరియప్ప, సునంద దంపతుల సమాజ సేవ అందరికీ స్ఫూర్తిదాయకం అని హెస్కాం చైర్మన్ అజ్జంపీర్ ఖాద్రి అన్నారు. ఆయన సంబంధిత పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. జంట నగరాలలో ఫుట్పాత్ మీద ఉన్న నిరాశ్రయులకు పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీర్చిన ఈ పుణ్య దంపతులు ప్రస్తుతం లక్ష్మేదశ్వర కేంద్రంగా సంస్థను ప్రారంభించడం హర్షనీయం అన్నారు. నాగరాజు, హెచ్వీ బళెగార, రామన్న, విలేకరులు సోమన్న, గాళప్ప, అల్తాఫ్, కేఈబీ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. -
15 నుంచి ఎల్లో లైన్లో మెట్రో పరుగు?
దొడ్డబళ్లాపురం: రాజధానిలో నమ్మ మెట్రో త్వరలో ఎల్లో లైన్లో రైలు సంచారం ప్రారంభం కానుంది. ఎలక్ట్రానిక్ సిటీ ఐటీ కారిడార్ను అనుసంధానం చేసే 19.15 కిలోమీటర్ల ఆర్వీ రోడ్డు– బొమ్మసంద్ర ఎల్లో లైన్లో, ఆ రూట్లోని అన్ని మెట్రో స్టేషన్లలో జూలైలో ప్రయాణ భద్రతా తనిఖీలు పూర్తయ్యాయి. సక్రమంగా ఉన్నాయంటూ అనుమతులు లభించాయి. ఆగస్టు 15న రైలు సంచారం మొదలయ్యే అవకాశముంది. గత మూడేళ్లుగా సాగుతున్న నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ప్రతి 20 నిమిషాలకు ఒక మెట్రో రైలు సంచరిస్తుంది. సెప్టెంబరు నుంచి సర్వీసులు పెరుగుతాయి. ఆర్వీ రోడ్డు నుంచి బొమ్మసంద్రకు వయా సిల్క్ బోర్డు జంక్షన్, ఎలక్ట్రానిక్ సిటీ ద్వారా మెట్రో సర్వీసుల వల్ల దక్షిణ బెంగళూరులో ప్రయాణ వసతి మెరుగవుతుంది.అమ్మోనియా లీకై అస్వస్థత యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా బైకంపాడి పారిశ్రామికవాడలో చేపల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అమ్మోనియా వాయువు లీక్ అయింది. దీనితో 25 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం కార్మికులు పనిలో ఉండగా ట్యాంకు నుంచి వాయువు లీకై ంది. వాయువును పీల్చడంతో కళ్లు తిరిగి పడిపోయారు. ఏడు మంది కార్మికులు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు ఐసీయూలో ఉన్నారు. నలుగురికి వైద్యం చేసి పంపించారు.వ్యాపారులకు నోటీసులు శివాజీనగర: వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 వేల మంది రిజిస్టర్డ్ చిరు వ్యాపారులకు నోటీసులు జారీచేసింది. ఇందులో పాలు, కూరగాయలు, చిరుతిండ్లు, హోటళ్ల వ్యాపారులు ఉన్నారు. నోటీసుల్లో పన్ను డిమాండ్ లేదని, జీఎస్టీ ఖాతా రిజిస్ట్రేషన్ చేసువాలని కోరినట్లు అధికారులు చెబుతున్నారు. ను పొందేందుకు కోరడమైనది. వ్యాపారుల ఖాతాల్లో యూపీఐ లావాదేవీల మొత్తాలను పరిశీలించి నోటీసులు ఇవ్వడం గమనార్హం. మిమ్స్ కబ్జాలను తొలగించాలి మండ్య: మిమ్స్ ఆస్పత్రి స్థలంలోని తమిళ కాలనీతో పాటు 24 ఎకరాలకు పైగా ఉన్న స్థలంలో ఆక్రమణలను తొలగించడం లేదని, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వహించిందని కర్ణాటక రక్షణ వేదిక, కరునాడ సేవకర సంఘం కార్యకర్తలు ఆరోపించాయి. ఆస్పత్రికి చెందిన స్థలాన్ని తమిళ కాలనీవాసులతో పాటు పలువురు ప్రముఖులు కబ్జా చేశారని కరునాడ సేవకర సంఘం నేత ఎంబీ నాగణ్ణగౌడ అన్నారు. ఈ స్థలాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని గత నెల 1న కన్నడ సంఘాలు, రైతు సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. పోరాటానికి తలొగ్గిన జిల్లాధికారి, ఉప విభాగాధికారి, తహసీల్దార్, నగరసభ కమిషనర్ ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపడతామని ఒప్పుకున్నారన్నారు. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. వెంటనే ఆక్రమణలు తొలగించకుంటే ఈనెల 15 నుంచి రెండో దశ పోరాటం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో నిరసనకారులు బైఠాయించి నిరసన తెలిపారు. -
అనైతిక సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
హొసపేటె: నాగ పంచమి రోజున ఓ భార్య తన అనైతిక సంబంధాన్ని వ్యతిరేకించిన భర్తను తన ప్రియుడి ద్వారా చంపించిన ఘటన వెలుగు చూసింది. వివరాలు.. ద్యామన్న హత్యకు గురైన భర్త. నిందితుడు, లారీ డ్రైవర్ అయిన ప్రియుడు శ్యామన్న కొప్పళ తాలూకాలోని కామనూరు నివాసి. నేత్రావతి, శ్యామన్న ఒకే గ్రామానికి చెందినవారు. నేత్రావతికి బూదగుంప గ్రామానికి చెందిన ద్యామన్నతో వివాహమైంది. భర్త తమ అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించడంతో ఇద్దరూ కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఆ మేరకు గతనెల 25న బూదగుంప సమీపంలోని గ్యారేజ్ నుంచి ఇనుప రాడ్ని తెచ్చిన శ్యామన్న మాయమాటలతో అతనిని తన సొంత పొలానికి పిలుచుకెళ్లి అక్కడ ఇనుప రాడ్తో ద్యామన్నను కొట్టి చంపాడు. ఆపై మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. హత్య తర్వాత ఇనుప రాడ్ను తిరిగి ఇచ్చేశాడు. తన భర్త చనిపోగా నేత్రావతి ఇంట్లో నాగపంచమి పండుగ చేసుకుంది. హత్య తర్వాత తన భర్త ధర్మస్థలకు వెళ్లాడని ఆమె తమ కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పింది. ఆమె ఫోన్ స్విచాఫ్ చేసి 5 రోజులు ఇంట్లోనే ఉంది. ఇంతలో ద్యామన్న సోదరులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మునిరాబాద్ పోలీసులు తమదైన శైలిలో చేపట్టిన విచారణలో నేత్రావతి తన భర్తను ప్రియుడు శ్యామన్నతో కలిసి హత్య చేయించిన విషయంపై నోరు విప్పింది. హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు నిందితులు నేత్రావతి, శ్యామన్నలను అరెస్టు చేశారు. ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య -
ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ
రాయచూరు రూరల్: గత కొన్ని రోజులుగా పశ్చిమ కనుమలు, మహారాష్ట్రలోని నదీ పరివాహక ప్రాంతంలో అధికంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. కృష్ణా నదీ తీరంలోని విజయపుర, బాగల్కోటె జిల్లాల్లోని ఉప నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి డ్యాంలో 518.30 మీటర్ల మేర నీరు నిల్వ చేరాయి. 2 లక్ష క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉండగా, 1.60 లక్షల క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లో రూపంలో బయటకు వదులుతున్నారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిప్పాణి తాలూకా బోజ, కున్నూర వద్ద గల వేదగంగా నదిపై కడకోళ వద్ద నిర్మించిన వంతెన, లింగసూగూరు తాలూకా శీలహళ్లి వంతెనతో పాటు మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, కల్యాణ కర్ణాటక ప్రాంతాల్లో సుమారు 50 వంతెనలు నీట మునిగాయి. యాదగిరి జిల్లాలో భీమా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భీమా నది ప్రవాహంతో కడగోలు ఆంజనేయ ఆలయం వరద నీటిలో మునిగి పోయింది. ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్కోటె, విజయపుర, యాదగిరి, రాయచూరు జిల్లాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ధర్మస్థలలో తీవ్ర గాలింపు
శివాజీనగర: ధర్మస్థల పుణ్యక్షేత్రంలో నేత్రావతి నదీ తీరంలో వందలాది మృతదేహాలను పాతిపెట్టిన కేసులో సిట్ అధికారులు, స్థానిక పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. 8వ పాయింట్లో అన్వేషణను ముగించారు. కొత్తగా పురోగతి ఏమీ లేదని సమాచారం. 13వ స్థలంలో వందలాది శవాలను పాతిపెట్టినట్లు ఫిర్యాదుదారు చెబుతున్నాడు. 7 పాయింట్లలో పూర్తి చేయగా 6వ పాయింట్లో అస్థిపంజరం అవశేషాలు లభించాయి. శుక్రవారం 7వ పాయింట్లో శోధించగా కర్చీఫ్ దొరికినట్లు తెలిసింది. తరువాత 8వ పాయింట్లో కూలీలు, మినీ జేసీబీ ద్వారా తవ్వకాలు ప్రారంభించారు. మీడియాపై ఆంక్షలు రద్దు ధర్మస్థల నేర విచారణ గురించి హైకోర్టు అతి ప్రాముఖ్యమైన తీర్పునిచ్చింది. ఈ కేసులో మీడియాపై విధించిన ఆంక్షలను రద్దు చేసింది. ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే సోదరుడు హర్షేంద్ర కుమార్ పలు మీడియా సంస్థల విరుద్ధంగా గ్యాగ్ ఉత్తర్వులను తీసుకొచ్చారు. శుక్రవారం ఈ నిబంధనలను ప్రశ్నిస్తూ హైకోర్టుకు దక్షిణ కన్నడకు చెందిన కుడ్ల ర్యాంపేజ్ సంపాదకుడు అజయ్ సమర్పించిన పిటిషన్ను హైకోర్టు న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న విచారణ జరిపారు. మీడియాపై ఉన్న ప్రతిబంధకాదేశాన్ని రద్దుచేశారు. 8వ పాయింట్లో తవ్వకాలు -
ఎస్సీ వర్గీకరణ కోసం బృహత్ నిరసనలు
బళ్లారిటౌన్: ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ కల్పించాలని మాదిగ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం నగరంలో దళిత సంఘాల నేతలు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాయల్ సర్కిల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రాకు వినతిపత్రాన్ని సమర్పించారు. నేతలు మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పులో ఎస్సీ వర్గాలకు వర్గీకరణ, రిజర్వేషన్ కల్పించాలని చెప్పిన ఆదేశాలు చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే అమలైనా కర్ణాటకలో మాత్రం కాలయాపన జరుగుతోందన్నారు. తమ కోటా రిజర్వేషన్లు ఇతర వర్గాల పాలవుతున్నాయని, ముఖ్యంగా మాదిగ సంక్షేమం కోసమే నాడు ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. అయితే ఇందులో 101 ఇతర వర్గాలు చేరడంతో తమకు అన్యాయం జరుగుతోందన్నారు. సమాఖ్య నేతలు రాజేష్, దానప్ప, కెంచప్ప, మారెణ్ణ, మునిస్వామి, హనుమంతప్ప, కృష్ణ, నారాయణ స్వామి, కొండయ్య, హులుగప్ప, దేవ, మధు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. అంతర్గత రిజర్వేషన్ల కోసం ర్యాలీ హొసపేటె: ఆగస్టు 1న రాష్ట్ర వ్యాప్త నిరసనకు ఇచ్చిన పిలుపు నేపథ్యంతో శుక్రవారం మాదిగ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. సమాజ నేత వీరస్వామి మాట్లాడుతూ ఎస్సీ వర్గాల్లో అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి ఆగస్టు 1న రాష్ట్రంలోని అన్ని జిల్లాధికారుల కార్యాలయాల ముందు నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఏడాది అయినా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన విధానాన్ని అనుసరిస్తోందన్నారు. రాబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోక పోతే కర్ణాటక బంద్కు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్లలో అంతర్గత రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. అయితే కర్ణాటకలో అనవసర జాప్యం జరుగుతోందన్నారు. అంతర్గత రిజర్వేషన్లను సత్వరం అమలు చేయకుంటే పోరాటం అనివార్యమని ఆయన అన్నారు. సమాజ నేతలు భరత్కుమార్, ఉమాపతి పాల్గొన్నారు. మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంచాలకుడు రవీంద్ర జాలదార్ ఆరోపించారు. శుక్రవారం అంబేడ్కర్ సర్కిల్లో చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేసినా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ను వర్గీకరణకు పలువురు నేతలు అడ్డు పడుతున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణను అమలు చేసిందన్నారు. నాగమోహన్ దాస్ నివేదికలో లోపాలను సవరించాలన్నారు. అది ద్రావిడ, కర్ణాటక పేరుతో ఉన్న ఉపకులాలపై సమీక్ష జరపాలన్నారు. మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణకు ఏ పార్టీ నాయకులు మద్దతివ్వడం లేదన్నారు. దళితుల ఓట్ల కోసం వర్గీకరణపై ద్వంద్వ వైఖరిని వీడాలన్నారు. రాజు, యల్లప్ప, తిమ్మప్ప, శంశాలం, సతీష్, విరుపాక్షి, భీమయ్య, అంజినేయ్య, నాగరాజ్, రవికుమార్లున్నారు. -
యువత దురలవాట్లకు గురి కారాదు
రాయచూరు రూరల్ : యువత దురలవాట్లకు బానిస కారాదని తహసీల్దార్ సురేష్వర్మ పిలుపు ఇచ్చారు. శుక్రవారం ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో జిల్లా పంచాయతీ, కన్నడ సంస్కృతి శాఖ, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో మహంత స్వామి జన్మదినం సందర్భంగా ఇలకల్ మహంత శివయోగి చేపట్టిన మద్యపాన వ్యసనం నుంచి విముక్తి కోసం చేసిన పోరాటం గురించి వివరించారు. యువత సన్మార్గం వైపు నడవాలని, మన భారతీయ సంస్కృతి, ఆచార, విచారాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. వార్త శాఖాధికారి గవిసిద్దప్ప, డాక్టర్ మనోహర్ పత్తార్, బాబూరావ్ శేగుణశి, ప్రకాష్లున్నారు. దేవదుర్గలో టోల్గేట్లు తొలగించండి రాయచూరు రూరల్ : జిల్లాలోని లింగసూగూరు తాలూకా తింథిణి వంతెన నుంచి దేవదుర్గ తాలూకా కాకరగల్ మధ్య ఏర్పాటు చేసిన రెండు టోల్గేట్లను తొలగించాలని దేవదుర్గ శాసన సభ్యురాలు కరియమ్మ నాయక్ డిమాండ్ చేశారు. గురువారం బెంగళూరు వికాససౌధలో ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. కేషిప్ ఆధ్వర్యంలో రూ.46 కోట్లతో రహదారి పనులు నాసిరకంగా చేపట్టారన్నారు. వ్యవసాయ కూలీ కార్మికులు అధికంగా పనులకు వెళ్లే వారి నుంచి టోల్ వసూలు చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరినా మంత్రి అంగీకరించలేదు. దీంతో ఆమె కన్నీరు పెట్టారు. సమావేశంలో శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్లున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై రైల్వే క్లర్క్ సస్పెండ్ ● ఫోన్లో మాట్లాడుతూ రైలు టిక్కెట్ ఇవ్వడానికి సతాయించిన వైనం హుబ్లీ: ప్రభుత్వ విధి దైవ విధి అనే నానుడి ఉంది. ప్రభుత్వ పని దొరకడం అంత సులభం కాదు. అయినా ఇక్కడ ఓ రైల్వే క్లర్క్ ఫోన్లో బాతాఖానీ కొడుతూ ప్రయాణికులకు టిక్కెట్ ఇవ్వడానికి సతాయించాడు. సదరు వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ఉద్యోగి తీరుపై సర్వత్రా విమర్శలు తలెత్తాయి. యాదగిరి రైల్వే స్టేషన్లో టిక్కెట్ ఇష్యూయింగ్ క్లర్క్గా పని చేస్తున్న వ్యక్తి విధి నిర్వహణ వేళ ఫోన్లో మాట్లాడుతూ టిక్కెట్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తూ ప్రయాణికులను వేధించాడు. ఎంతో పొడవు ఉన్న క్యూలైన్లో నిలబడిన ప్రయాణికులకు టిక్కెట్ ఇవ్వకుండా ఫోన్లో మాట్లాడటంలో మునిగి పోయాడు. ఓ ప్రయాణికుడు ఈ విషయమై గొడవకు దిగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎట్టకేలకు స్పందించిన ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. నేడు కళస ఎగ్జిబిషన్ ప్రారంభం సాక్షి బళ్లారి: నగరంలోని రాయల్ఫోర్ట్ హోటల్లో కళస ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు శ్వేషాన్ తెలిపారు. ఈనెల 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు రాయల్ఫోర్టు హోటల్లో కళస ఫైన్ జ్యూవెలరీలో బంగారం, డైమండ్, జాడో ఎగ్జిబిషన్లో అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. ఇక్కడ ఎలాంటి తరుగు, మేకింగ్ చార్జీలు లేకుండా ఇతర బంగారం షాపుల్లో దొరికిన ధర కన్నా తక్కువ ధరకే నాణ్యమైన, నమ్మకమైన బంగారం అమ్మకాలు జరుగుతాయని, నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు బంగారు ఆభరణాలు ఎంతో ఇష్టంగా చూస్తారని, వారి ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా కళస ఫైన్ జ్యూవెలరీ నిర్వహిస్తున్నామన్నారు. నగర వాసులు బంగారం కొనే ఆసక్తి గలవారు ఎగ్జిబిషన్ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. -
5న ఆర్టీసీ ఉద్యోగుల నిరవధిక సమ్మె
హొసపేటె: ఆర్టీసీ ఉద్యోగుల వివిధ డిమాండ్లను తీర్చాలని ఒత్తిడి చేస్తూ హొసపేటె డివిజన్లోని ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఈనెల 5న నిరవధిక సమ్మె నిర్వహించనున్నట్లు కమిటీ కన్వీనర్ జీ.శ్రీనివాసులు తెలిపారు. నగరంలోని పత్రికా భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్ల ఆర్థిక బలాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వేతనాలను సవరించే వ్యవస్థ అమలులో ఉందన్నారు. కానీ ప్రభుత్వం 2024 నుంచి జీతాలను సవరించలేదు. అంతేకాకుండా 38 నెలల బకాయి డబ్బులను నిలిపేసింది. ఆర్టీసీ ఉద్యోగులు వీధుల్లోకి దిగి పోరాడాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి ఒత్తిడి లేదా బెదిరింపులకు మేం తలొగ్గం. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు మేం ఎట్టి పరిస్థితుల్లోను సమ్మెను విరమించబోమని ఆయన హెచ్చరించారు. ప్రైవేట్ వాహన డ్రైవర్లు సహా వివిధ సంస్థలు సమ్మెకు మద్దతు ఇచ్చాయి. ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగులు తమ విధులకు గైర్హాజరవుతారు. ఆ రోజు ఆర్టీసీ బస్సులేవీ రోడ్డుపై తిరగవు. అందువల్ల ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాయకులు వీకే.హిరేమట్, పీ.రాజశేఖర్, నిర్మల్కుమార్, అబ్దుల్ రెహమాన్ సాబ్, మహిద్ బాషా, హోలి బసప్ప, యూ.సోమశేఖర్, శేఖరప్ప గులాటి తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు తీర్పును గౌరవించాలి
మండ్య: న్యాయస్థానం ఆదేశాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ప్రజ్వల్ రేవణ్ణ కేసులో తీర్పు గురించి మాజీ ఎంపీ సుమలత స్పందించారు. శుక్రవారం మండ్యలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మాట్లాడేందుకు ఇంకేమీ లేదని, దోషి అని తేల్చడంతో అంతా ముగిసిందని అన్నారు. ఇక ఏ శిక్ష పడుతుందో చూడడమేనని అన్నారు. తనను కొందరు ఆన్లైన్ ట్రోల్, అసభ్యపదజాలంతో దూషించడం కొత్తేమీ కాదని, ఐదారేళ్ల నుంచి ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సామజిక మాధ్యమాల్లో జరిగిన ట్రోలింగ్పై కేఆర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు, ఇప్పటివరకు చర్యలు లేవని వాపోయారు. ఆరోపణలు చేయడం అందరికీ చాలా సులభమని, నిరూపితం చేయాలంటే చాలా కష్టమని అన్నారు. -
అధిక లాభాలంటూ రూ.30 లక్షలు మస్కా
మైసూరు: మైసూరు నగరంలో మరో రెండు సైబర్ మోసాలు బయటపడ్డాయి. షేరు మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక లాభాలు గడించవచ్చని ఆశపడిన ఓ వ్యక్తి రూ.30 లక్షలను కోల్పోయిన ఘటన మైసూరు నగరంలో జరిగింది. మైసూరులోని రాఘవేంద్రనగర నివాసికి ఓ యువతి ఫోన్ చేసి తన పేరు లావణ్య అని పరిచయం చేసుకుంది. షేర్ల వ్యాపారం చేస్తున్నామని, మీరు డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు గడించవచ్చని ఆశ పెట్టింది. ఆమె మాయమాటలను నమ్మిన బాధితుడు తన ఖాతా, తల్లి, స్నేహితుల ఖాతాల నుంచి దశల వారీగా రూ.30 లక్షలను పెట్టుబడి పెట్టాడు. అయితే ఎలాంటి లాభం అందక పోగా అసలు కూడా కోల్పోయినట్లు గ్రహించిన బాధితుడు సరస్వతీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. డిజిటల్ అరెస్టు చేసి రూ.7.25 లక్షలు.. ముంబై పోలీసులమని చెప్పి మైసూరుకు చెందిన ఓ వ్యక్తిని బెదిరించిన దుండగులు రూ.7.25 లక్షలను మోసగించారు. మైసూరులోని కువెంపునగర నివాసికి ముంబై పోలీసుల పేరిట ఫోన్ చేసిన దుండగులు మీరు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు, మీపై చర్యలు తీసుకుంటున్నామని డిజిటల్ అరెస్టు చేశారు. మీ ఖాతాలో ఉన్న డబ్బులను కొంతకాలం పాటు తాము చెప్పిన ఖాతాకు బదలాయిస్తే పరిశీలించి తరువాత వాపస్ చేస్తామని నమ్మబలికారు. దీంతో తన ఖాతాలో ఉన్న రూ.7.25 లక్షలను బదిలీ చేసి మోసపోయాడు. సైబర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.సింబాలిక్ పోటో మైసూరులో ఆన్లైన్ నేరాలు -
తీర్థయాత్ర విషాదమయం
హోసూరు: తిరువణ్ణామలై యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కారు ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలు చనిపోగా, ఐదు మందికి గాయాలేర్పడిన ఘటన గురువారం సాయంత్రం క్రిష్ణగిరి సమీపంలో జరిగింది. వివరాల మేరకు బెంగళూరుకు చెందిన వెంకటస్వామిరెడ్డి (56), భార్య మమత (55), కుమారుడు అనిల్ (28), బంధువులు రమేష్ (60) భార్య గిరిజ (50), కూతురు మౌల్యాతో కలిసి తిరువణ్ణామలైలోని ఆలయానికెళ్లి స్వామివారిని దర్శించుకొన్నారు. గురువారం సాయంత్రం బెంగళూరుకు బయల్దేరారు. క్రిష్ణగిరి– హోసూరు హైవేలో కురుబరపల్లి సమీపంలో కారు అదుపుతప్పి పల్లంలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మమత, గిరిజా తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మరణించారు. కారు డ్రైవర్ ఆనేకల్వాసి మంజునాథ్ (45)తో పాటు వెంకటస్వామిరెడ్డి, రమేష్, అనిల్, మౌల్య తీవ్ర గాయాలకు గురయ్యారు. గమనించిన స్థానికులు, కురుబరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను హోసూరు ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వారి వారి బంధువులు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కారు పల్టీ, ఇద్దరు మహిళల మృతి -
కందీలు చిత్రానికి జాతీయ అవార్డు
సాక్షి, బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించగా, కందీలు సినిమా అత్యుత్తమ ప్రాంతీయ కన్నడ చలనచిత్రంగా ఎంపికైంది. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అత్యుత్తమ కన్నడ సినిమా అవార్డును యశోధ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ‘కందీలు– ది రే ఆఫ్ హోప్’ గెలుచుకుంది. ఇది గ్రామీణ ఇతివృత్తం కలిగిన సినిమా. ఒక రైతు, ఆయన కుటుంబం చుట్టూ అల్లిన సున్నితమైన కథ. మడికెరికి చెందిన యశోద ప్రకాశ్ ఈ సినిమాకు దర్శకురాలు. ఈ సినిమా 29వ కోల్కతా చిత్రోత్సవాలలో ప్రదర్శితమైంది. యశోద కొడవ భాషలో మూడు, కన్నడలో ఐదు సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ స్క్రిప్టుగా మైసూరుకు చెందిన చిదానంద నాయక్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ‘సన్ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్స్ టు నో’ ఎంపికై ంది. గతంలో ఈ సినిమా ప్రతిష్టాత్మక కేన్స్ చిత్రోత్సవంలో అవార్డును అందుకుంది. -
15 వేల జీతంతో 30 కోట్ల ఆస్తులు?.. అవినీతికి అడ్రస్ చెప్పిన గుమస్తా!
బెంగళూరు: ఆయనో గుమస్తా(క్లర్క్). ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్లను నిర్వహించడం, డాక్యుమెంట్లను తయారు చేయడం, డేటా ఎంట్రీ, కార్యాలయ పరిపాలనకు సహాయం చేయడమే పని.నెలకు జీతం అక్షరాల రూ.15,000. ప్రభుత్వ ఉద్యోగి. అనుభవం ఉంది కాబట్టి ఆస్తులు మహా అయితే ఎంతుండొచ్చు. ఓ సొంతిల్లు. ఓ పదిపదిహేను లక్షల డబ్బు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ క్లర్క్ ఆస్తులు రూ.30కోట్లు,బంగారం,పదుల సంఖ్యలో భవానాలు,ఎకరాలకొద్దీ పొలాలు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా? బెంగళూరులో శుక్రవారం లోకాయిక్తా అధికారులు ప్రభుత్వ కర్ణాటక రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ (కేఆర్ఐడీఎల్) కార్యాలయంలో మాజీ క్లర్క్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం, కొప్పల్ జిల్లాలోని కొప్పల్ పట్టణంలో ప్రభుత్వ ఆఫీస్లో కలకప్ప నిడగుండి క్లర్క్గా విధులు నిర్వహించేవారు జీతం రూ.15000. కానీ లోకాయిక్తా అధికారులు జరిపిన దాడుల్లో భయటపడ్డ కలకప్ప నిండగుండి ఆస్తుల్ని చూసి కంగుతిన్నారు.కలకప్ప నిండగుండితో పాటు అతని ఇతర కుటుంబ సభ్యుల పేర్లమీద 24 ఇళ్లు,నాలుగు ఫ్లాట్లు, 40 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు,నాలుగు వాహనాలు 350 గ్రాముల బంగారం,1.5కేజీ వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు.నిడగుండి, మాజీ కేఆర్ఐడీఎల్ ఇంజనీర్, జెడ్ఎం చిన్చోల్కర్, పూర్తి కాని 96 అసంపూర్ణ ప్రాజెక్టులకు నకిలీ పత్రాలను సృష్టించి రూ. 72 కోట్లకు పైగా స్వాహా చేశారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో లోకాయుక్తా అధికారులు మాజీ గుమస్తా నిడగుండి నివాసంలో తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్
బెంగళూరు: కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(35)కు భారీ షాక్ తగిలింది. పని మనిషిపై లైంగిక దాడి కేసులో జేడీఎస్ మాజీ నేతను దోషిగా నిర్ధారిస్తూ శుక్రవారం బెంగళూరు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. శనివారం శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది.హాసన్లోని గన్నికాడ ఫామ్హౌజ్లో 2021 COVID లాక్డౌన్ సమయంలో ప్రజ్వల్ తనపై మూడుసార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ ఘటనను ప్రజ్వల్ తన మొబైల్లో వీడియో తీసి విషయం బయటకు చెప్పనీయకుండా బెదిరించినట్లు ఆమె ఆరోపించింది. అదే సమయంలో..ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని కూడా ఆమె ఆరోపణలు గుప్పించారు. అయితే.. ఈ ఆరోపణలను ప్రజ్వల్ పేరెంట్స్ ఖండించారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగగా.. బెయిల్ కోసం ప్రజ్వల్ చేసిన విజ్ఞప్తులను కోర్టు తోసిపుచ్చుతూ వచ్చింది. ఇదీ చదవండి: ఏ గదిలో ఏం జరిగింది?.. వీడియో కెమెరా ఎక్కడ??ఫోరెన్సిక్ నివేదికలు లీకైన వీడియోలను ధృవీకరించాయి. కిందటి ఏడాది మే 31వ తేదీన జర్మనీ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన ప్రజ్వల్ను ఎయిర్పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. గత 14 నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలోనే ప్రజ్వల్ ఉన్నాడు. CID-SIT దర్యాప్తులో DNA, ఫోరెన్సిక్, 26 మంది సాక్షుల వాంగ్మూలాలు, 2,000 పేజీల చార్జ్షీట్ సమర్పించారు. ఈ కేసులో 26 మంది సాక్షులను కోర్టు విచారించి.. దోషిగా ప్రకటించింది.#BreakingA Special court in Bengaluru has convicted Janata Dal (Secular) leader and former MP Prajwal Revanna, in the first rape case registered against him at the Holenarasipura Rural Police Station of Hassan District. #PrajwalRevanna #Rape pic.twitter.com/fnzxJUp2Sc— Live Law (@LiveLawIndia) August 1, 2025ఎవరీ ప్రజ్వల్ రేవణ్ణ?ప్రజ్వల్ రేవణ్ణ.. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు. మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ తనయుడు. 2015లో జేడీఎస్లో చేరి.. 2019 ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యాడు. ఆ దఫా పార్లమెంట్లో.. మూడో అత్యంత పిన్నవయసున్న ఎంపీగా ఘనత సాధించాడు. అయితే 2023లో అఫిడవిట్లో లోపాల కారణంగా(రూ.24 కోట్ల లెక్కను చూపించకపోవడం) కర్ణాటక హైకోర్టు ఆయన ఎంపీ ఎన్నికల చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. లైంగిక దాడి కేసు నేపథ్యంలో జేడీఎస్ ఆయన్ని సస్పెండ్ చేసింది.ఇదీ చదవండి: ప్రజ్వల్కు చీర చిక్కుఅశ్లీల వీడియోల కలకలంపని మనిషిపై అత్యాచారం ఘటన మాత్రమే కాదు.. ప్రజ్వల్పై అశ్లీల వీడియోల కేసులు నమోదు అయ్యాయి. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఆ వీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. హసన్లోని ఫామ్హౌజ్ నుంచి 2,900 వీడియోలు ఉన్న పెన్డ్రైవ్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తీవ్రకలకలం రేపింది. ఇందుకుగానూ ప్రజ్వల్పై మూడు కేసులు నమోదు కాగా.. వాటిని సీఐడీ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరుపుతోంది. ఇందులో స్వయంగా ప్రజ్వల్ చాలావరకు వీడియోలను చిత్రీకరించినట్లు అభియోగాల్లో దర్యాప్తు అధికారులు పేర్కొనడం గమనార్హం.ఇదీ చదవండి: అసహజ లైంగిక దాడి కేసులో పటుత్వ పరీక్షలు -
బాలికా హంతకునికి జీవితఖైదు
మైసూరు: బాలికను అపహరించి హత్య చేసిన కిరాతకునికి చామరాజనగర జిల్లా సెషన్స్ ఎఫ్టీఎస్సీ 1వ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. వివరాలు.. చామరాజనగర జిల్లా హనూరు తాలూకా వడ్డరదొడ్డి సమీపంలోని గోడెన్స్ నగర నివాసి తంగరాజు దోషి. ఇతను భార్యను వదిలేశాడు. 2018లో ఓ బాలికను ప్రేమ, పెళ్లి అని మోసపుచ్చి కిడ్నాప్ చేశాడు. తర్వాత ఇనుప రాడ్డుతో కొట్టి బాలికను చంపి మృతదేహాన్ని ఇంట్లో వదిలి పరారయ్యాడు. ఈ ఘటనపై రామాపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి తంగరాజును బంధించి, కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. కోర్టు జడ్జి ఎస్జే కృష్ణ తుది విచారణలో నేరారోపణలు రుజువు కావడంతో తంగరాజుకు జీవితఖైదు, రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. న్యాయ సేవా ప్రాధికారం నుంచి రూ.5 లక్షల పరిహారాన్ని బాలిక కుటుంబానికి అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ వకీలు కే.యోగేష్ వాదనలు వినిపించారు. మంత్రిపై హనీట్రాప్ ఉత్తిదే● సీఐడీ నివేదిక దొడ్డబళ్లాపురం: గత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి రాజన్న తనపై హనీట్రాప్ కుట్ర జరుగుతోందని చేసిన ఆరోపణల్లో నిజం లేదని సీఐడీ ప్రకటించింది. దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు ఐజీపీకి నివేదిక ఇచ్చారు. మంత్రి ఆరోపణల మీద ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదని పేర్కొన్నారు. ఓ యువతి, కొందరు తన ఇంటికి వచ్చేవారు, కుమారునికి ఫోన్ చేసేవారు, హనీట్రాప్లోకి లాగడానికి ప్రయత్నించారు అని రాజన్న అప్పట్లో ఆరోపించడం తెలిసిందే. ఇది రాజకీయ దుమారం లేపింది. చివరకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఏం జరిగిందని ఆరా తీసింది. మంత్రుల మధ్య గొడవలే హనీట్రాప్ రచ్చకు దారితీసిందని ప్రచారం సాగింది. క్వాంటమ్ రాజధానిగా కర్ణాటక: సీఎం బనశంకరి: రాష్ట్రంలో క్వాంటమ్ విధానం రూపొందించామని, ఈ రంగంలో భారీగా ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. గురువారం నగరంలోని ఓ హోటల్లో క్వాంటమ్ ఇండియా బెంగళూరు– 2025 సమ్మేళనాన్ని ప్రారంభించి మాట్లాడారు. కర్ణాటకలో క్వాంటమ్ ద్వారా 2035 లోగా లక్ష అధిక నైపుణ్య ఉద్యోగాలను సృష్టించి క్వాంటమ్ రాజధానిగా చేయాలనేది ఆశయమన్నారు. 20 బిలియన్ డాలర్ల క్వాంటమ్ ఆర్థిక వ్యవస్థను సృష్టించాలన్నదే లక్ష్యమని, ఇందుకోసం కర్ణాటక క్వాంటమ్ మిషన్ ప్రారంభించామని తెలిపారు. పరిశోధన, అభివృద్ధి కోసం రూ. వెయ్యి కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి బోసరాజు, ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. టిక్టాకర్ నిర్బంధం యశవంతపుర: జర్మనీకీ చెందిన ప్రముఖ టిక్టాక్ స్టార్ నోయెల్ రాబిన్సన్ను బెంగళూరు పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని చర్చి స్ట్రీట్లో భారతీయ సాంస్కృతిక పండుగలో నృత్యం చేస్తుండగా చూడటానికి వందల మంది జనం గుమిగూడారు. ప్రజలు, వాహనాల సంచారానికి ఇబ్బంది కలిగించారని రాబిన్సన్ను బలవంతంగా అదుపులోకి తీసుకొని విచారించి వదిలేశారు. గతంలో కూడా ఓ ప్రముఖ పాప్ స్టార్ ప్రదర్శన ఇస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ప్లాట్ఫారంపై ప్రసవం యశవంతపుర: బెంగళూరు రైల్వే స్టేషన్లో అమృత అనే గర్భిణి ప్లాట్ఫారంపై ప్రసవించింది. సహ ప్రయాణికులు, ఆర్పీఎఫ్ సిబ్బంది సహకారంతో కాన్పు జరిగింది. నెలలు నిండిన గర్భిణి ఊరికి వెళ్లడానికి రైల్వేస్టేషన్కు రాగా ప్రసవవేదన ఆరంభమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేదు. ఆమెకు కొడుకు జన్మించాడు. తరువాత స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. -
కాంట్రాక్టు ఉద్యోగి.. కోటీశ్వరుడు
రాయచూరు రూరల్: కర్ణాటక గ్రామీణ మౌళిక సౌకర్యాల అభివృద్ధి మండలి (కెఆర్డిఎల్)లో కాంట్రాక్ట్ ఉద్యోగి అగర్భ శ్రీమంతుడయ్యాడు. లంచాలు, అవినీతి దీనికి కారణం. కొప్పళ జిల్లా కేంద్రంలో నెలకు రూ.15 వేల వేతనంతో పనిచేసే కాంట్రాక్ట్ పని ఉద్యోగి కళకప్ప నిడగుంది వ్యవహారం తెలిసి లోకాయుక్త అధికారులు దాడులు జరిపారు. కొప్పళ భాగ్య నగరలో 24 ఇళ్లు, భవనాలు, 6 స్థలాలు, తమ్ముడు, అతని భార్య పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆఫీసులో కళకప్ప దూకుడును తట్టుకోలేక కొందరు అధికారులు లోకాయుక్తకు సమాచారం ఇచ్చారు. దీంతో బుధ, గురువారాల్లో సోదాలు చేపట్టారు. అతని ఇంటిలో లభించిన భారీ బంగారు నగలు, స్థిరాస్తులను చూసి అందరూ నోరెళ్లబెట్టారు. కొప్పళ జిల్లా యలబుర్గ తాలూకా బండిహాళ్కు చెందిన అతడు 20 ఏళ్ల కిందట ఈ ఉద్యోగంలో చేరాడు. ఆనాటి నుంచి అవినీతి అక్రమాలను ఆలంబనగా చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ మండలిలో రూ.72 కోట్ల నిధుల దు ర్వినియోగంలో ఇతని పాత్ర ఉన్నట్లు గుసగుసలున్నాయి. అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కొప్పళలో లోకాయుక్త దాడులు 24 ఇళ్లు, భారీగా బంగారం గుర్తింపు -
తవ్వకాలలో అస్థికలు
బనశంకరి: పవిత్ర పుణ్యక్షేత్రంలో నేర పరిశోధన సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తోంది. అడవులు, నది తీరాలు, చిత్తడి ప్రదేశాలలో పోలీసులు, జాగిలాలతో గాలింపు కొనసాగుతోంది. రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ధర్మస్థలలో మహిళల శవాల పూడ్చివేతల కేసులో సిట్ అధికారులు, స్థానిక పోలీసులు గురువారం కూడా గాలింపు చేపట్టారు. పాక్షికంగా లభ్యం ఫిర్యాదిదారు సూచించిన 6వ పాయింట్లో రెండు అస్తిపంజరాలు లభించాయి. వాటిలో కొన్నిభాగాలు మాత్రమే ఉన్నాయి. గత మూడు రోజుల నుంచి కళేబరాల కోసం కూలీ కార్మికులు జేసీబీ యంత్రాలతో తవ్వుతున్నారు. బుధవారం సాయంత్రం వరకు ఎలాంటి ఎముకలు లభించలేదు. ఇంక ఏమీ లేదు అనుకుంటున్న సమయంలో గురువారం పరిస్థితి మారింది. 6వ పాయింట్లో 15 మంది కార్మికులతో తవ్వుతుండగా రెండు అస్థిపంజరాలు కనిపించాయి. పురుషుల ఎముకలుగా గుర్తించారు. అవి కూడా కొన్ని భాగాలే లభించాయి. తరువాత 7, 8 పాయింట్లలో గాలించగా అదే మాదిరి పురుషుని పుర్రె, ఎముకలు బయటపడ్డాయి. 13వ పాయింట్పై చూపు బుధవారం సాయంత్రం వరకు పాయింట్ 1 నుంచి 5 వరకు నాలుగైదు అడుగుల లోతున తవ్వగా ఎలాంటి కళేబరాల జాడ లేదు. ఇప్పుడు 13వ పాయింటుపై అందరి దృష్టి నెలకొంది. ఇక్కడ అనేక శవాలను పూడ్చిపెట్టినట్లు ఫిర్యాదిదారు చెబుతున్నాడు. ఈ పాయింట్ నేత్రావతి స్నానఘట్టం సమీపంలో ఉండగా, శుక్రవారం తవ్వకాలు జరిపే అవకాశం ఉంది. ఏమిటీ కేసు? నేత్రావతి ఘాట్ వద్ద అటవీ ప్రదేశంలో 1998 నుంచి 2014 వరకు వందలాది మహిళలు, పిల్లలు శవాలను పూడ్చిపెట్టానని ఫిర్యాదిదారు చెబుతున్నాడు. తాను అప్పుడు పారిశుధ్య కార్మికునిగా పనిచేశానని తెలిపాడు. అత్యాచారం చేసి హత్య చేశారని పేర్కొన్నాడు. ఈ ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి. అన్ని పాయింట్లలో 24 గంటలూ పోలీసు భద్రతను కల్పించారు. ఎటుచూసినా పోలీసు వాహనాలే కనిపిస్తున్నాయి. 6, 7, 8 పాయింట్లలో పురుషుల ఎముకలు లభ్యం ధర్మస్థలలో కళేబరాల కేసు.. ముమ్మరంగా సాగుతున్న తవ్వకాలు ఎవరివి అనేదానిపై ఉత్కంఠసత్యం బయటపడాలి: హోంమంత్రి యశవంతపుర: ధర్మస్థలలో విచారణ సాగిస్తున్న సిట్ చీఫ్, ఐపీఎస్ అధికారి ప్రణవ్ మొహంతిని కేంద్ర సర్వీసుకు పంపడం గురించి ఇంకా పరిశీలించలేదని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొందరూ ఐపీఎస్లను డిప్యుటేషన్ చేయగా ఆ జాబితాలో మొహంతి పేరు ఉంది. కేంద్ర సర్వీసుకు పండంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ధర్మస్థలలో ఏం జరిగిందనే సత్యాన్ని బహిరంగం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు. ల్యాబ్ పరీక్షలకు తరలింపు 6, 7, 8 పాయింట్లలో సాయంత్రం వరకు లోతుగా తవ్వి అవశేషాల కోసం మట్టిని బయటికి తీశారు. ఫోరెన్సిక్ నిపుణులు ప్రతి ఎముకను పరిశీలించి నంబరు రాసి బ్యాగులో వేశారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపిస్తారు. ఎవరివి, ఎలా చనిపోయారు అనే వివరాలు సేకరిస్తారు. ఘటనా స్థలానికి సిట్ చీఫ్ ప్రణవ్ మొహంతి చేరుకుని సమాచారం సేకరించారు. సిట్కు మరో 9 మంది పోలీసులను డీజీపీ ఎంఏ.సలీం నియమించారు. దక్షిణ జిల్లాలో వివిధ ఠాణాలకు చెందిన ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు ఇందులో ఉన్నారు. -
కూలిన పాత కట్టడం
బనశంకరి: బెంగళూరు లో సంపంగి రామనగరలో జియో హోటల్ వద్ద పాత కట్టడం గురువారం ఆకస్మాత్తుగా కూలిపోయింది. 80 ఏళ్ల క్రితం నాటి రెండంతస్తుల కట్టడం మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా ధ్వంసమైంది. ఆ సమయంలో కట్టడంలో యజమాని అశ్విన్ ఉండగా తీవ్రంగా గాయపడ్డాడు. సంపును తవ్వుతుండగా వివరాలు.. నెల కిందట వరకు ఈ భవనంలో ఓ కుటుంబం బాడుగకు ఉండేది. వారు ఖాళీ చేయడంతో వంటశాలగా ఉపయోగిస్తున్నారు. అలాగే సంపు కోసం ముగ్గురు కార్మికులతో తవ్వకం చేపట్టారు. కూలిపోవడానికి 10 నిమిషాల ముందు ముగ్గురు కార్మికులు భోజనానికి బయటకు వచ్చారు. అశ్విన్ ఒక్కడే అందులో ఉన్నాడు. ఇంతలో పెద్దశబ్ధంతో భవనం కుప్పకూలిపోయింది. వెంటనే స్థానికులు అతి కష్టమ్మీద అశ్విన్ను బయటకు తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన అతనిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని లోపల ఇంకా ఎవరైనా చిక్కుబడ్డారా అని తనిఖీలు చేశారు. పాత భవనం కావడం, సంపు గుంతను తవ్వడం వల్ల ప్రకంపనలకు కూలిపోయిందని భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నగరంలో పాత భవనాల మనుగడ మరోసారి చర్చకు వచ్చింది. బీబీఎంపీ సిబ్బంది తమ వలయాల్లోని పాత భవనాలను ఖాళీ చేయాలని గతంలో కార్యాచరణ చేపట్టారు. కానీ కొన్నిరోజులకే అది అటకెక్కింది. యజమానికి తీవ్ర గాయాలు తృటిలో తప్పించుకున్న కూలీలు బెంగళూరులో ఘటన -
కూతురికి విషమిచ్చి.. తల్లి ఆత్మహత్యాయత్నం
దొడ్డబళ్లాపురం: కుటుంబ కలహాలతో విరక్తి చెందిన ఓ తల్లి కఠినాత్మురాలిగా మారింది. చిన్నారి బిడ్డకు విషం పెట్టి చంపి తానూ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన బెంగళూరు బ్యాడరహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. తిగళరపాళ్య నివాసి చంద్రిక (26), భర్త యోగేష్, కూతురు (20 నెలలు) తో జీవిస్తున్నారు. యోగేష్ గార్మెంట్స్ కార్మికుడు. కొన్నిరోజులుగా తీవ్ర కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలతో విసిగిపోయిన ఆమె టీ లోకి ఎలుకల మందును కలిపి బిడ్డకు తాగించి తరువాత తానూ తాగింది. ఇద్దరూ బాధతో ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా చిన్నారి మృతిచెందగా చంద్రిక చికిత్స పొందుతోంది. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రూ.70 లక్షల హషిష్ ఆయిల్ సీజ్ దొడ్డబళ్లాపురం: బెంగళూరు రైల్వేస్టేషన్ పోలీసులు రూ.70 లక్షల విలువైన హషిష్ అనే గంజాయి ఆయిల్ని పట్టుకున్నారు. దీనిని తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన అప్పలరాజు (34) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లో భరత్ అనే వ్యక్తి నుంచి ఆయిల్ కొనుగోలు చేసి తీసుకువచ్చి యలహంకలో డ్రగ్స్ వ్యసనపరులకు విక్రయించేవాడు. సమాచారం అందడంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి ఆయిల్ని సీజ్ చేశారు. మద్యం మత్తులో తల్లికి నిప్పు శివాజీనగర: మద్యం మత్తులో కుమారుడే తన తల్లికి నిప్పుపెట్టి, ఏమీ తెలియనట్టు పక్కనే నిద్రపోయాడు. ఈ దారుణ సంఘటన ఘటన చిక్కమగళూరు జిల్లా అరెనూరు సమీపంలోని అక్కిమక్కి గ్రామంలో జరిగింది. మహిళ భవాని (51) కూలి పని చేసుకొంటూ జీవించేది. కొడుకు పవన్ (27) తల్లితో కలసి నివాసమున్నాడు. బుధవారం రాత్రి బాగా తాగి వచ్చాడు, మద్యం తాగవద్దని, బుద్ధిగా పనిచేసుకోవాలని తల్లి మందలించింది. దీంతో కోపోద్రిక్తుడై గొడవపడ్డాడు. ఆమె మీద పెట్రోలు చల్లి నిప్పు పెట్టడంతో మంటల్లో కాలిపోసాగింది. కానీ దుండగుడు నిద్రపోసాగాడు. మహిళ కేకలు విన్న ఇరుగుపొరుగువారు చేరుకొని చూసేలోగానే పూర్తిగా కాలిపోయి చనిపోయింది. అల్దూరు పోలీసులు చేరుకొని కుమారున్ని అరెస్ట్ చేశారు. ఇతని తండ్రి కూడా తాగుబోతే. అతడు ఇంట్లో లేనప్పుడు ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే కొడుక్కి దక్కని ఊరట యశవంతపుర: కాబోయే భార్యపై అత్యాచారం, చీటింగ్ కేసులో బీజేపీ ఔరాద్ ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ కొడుకు ప్రతీక్ బెయిలు అర్జీని బీదర్ సెషన్స్కోర్టు తిరస్కరించింది. బాధితురాలు అతనిపై స్థానికంగా, మహారాష్ట్రలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు ప్రతీక్పై అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు అర్జీ దాఖలు చేయగా గురువారం విచారించారు. నిశ్చితార్థం చేసుకుని, షికార్లు చేసి పెళ్లి చేసుకోలేదని బాధితురాలు ఆరోపించింది. -
పాలికె భేటీలో తోపులాట
హుబ్లీ: ముఖ్యమంత్రి వివేచన నిధి ద్వారా ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి నియోజకవర్గానికి మంజూరు అయిన రూ.10 కోట్ల నిధుల కార్యచరణ పథకం ఆమోదం గురించి గురువారం హుబ్లీ–ధార్వార నగర పాలికె సమావేశంలో భారీ రగడ జరిగింది. నిధుల కార్యచరణ వివరాలు లేవంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు చర్చను అడ్డుకున్నారు. మేయర్ పీఠం ముందుకు వచ్చి రభస చేశారు. బీజేపీ కార్పొరేటర్లు కూడా గొడవకు దిగారు. మేయర్ జ్యోతి పాటిల్ రెండు సార్లు సమావేశాన్ని వాయిదా వేసినప్పటికీ ఉద్రిక్తత చల్లారలేదు. 3 గంటలకుపైగా అరుపులు కేకలతో రణరంగాన్ని తలపించింది. దీంతో కాంగ్రెస్ సభ్యులందరిని బలవంతంగా బయటకు పంపించారు. ఈ సమయంలో సభ్యుడు శివన్న కల్లుకుంట్ల బయటకు వెళ్తుండగా గుండెనొప్పి అని పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఒక్క కొళాయి చాలా? తరువాత ప్రజలకు తాగునీరు సరఫరా కావడం లేదని, ఒక భవనానికి ఒకటే కొళాయి అనే విధానం సబబు కాదని సభ్యులు గొంతెత్తారు. ఒకే భవనంలో మూడు నాలుగు కుటుంబాలు ఉంటే ఒక్క కొళాయి నీళ్లు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. మేయర్ జ్యోతి స్పందిస్తూ తాగునీటి సమస్యను తీర్చాలని అధికారులను ఆదేశించారు. హుబ్లీ– ధార్వాడ కార్పొరేషన్ సమావేశం రసాభాస -
కాంగ్రెస్ సర్కారుపై రైతన్న కదం
సాక్షిబళ్లారి: కేంద్ర ప్రభుత్వం రైతులకు కావాల్సినంత రసాయనిక ఎరువులు, యూరియాను రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని అయితే కేంద్రం ఇచ్చిన యూరియాను రైతులకు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ రైతు మోర్ఛా నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం కదం తొక్కారు. నగరంలో ర్యాలీ నిర్వహించి రాయల్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి బైఠాయించారు. రాష్ట్రంలో రైతులకు కావాల్సినంత యూరియా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. తుంగభద్ర ఆయకట్టు కింద విస్తారంగా వరినాట్లు వేస్తున్న సమయంలో యూరియా లేకపోతే రైతులు పంటలు సాగు చేయడానికి కష్టంగా ఉంటుందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడే దిశలో పని చేయడం లేదన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. బీజేపీ హయాం సంక్షేమ పరం బీజేపీ హయాంలో రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. అయితే వాటిని నిలుపుదల చేశారన్నారు. పంటలు వేయడానికి ఎరువులు కూడా సరఫరా చేయడం లేదన్నారు. పంట పండించిన తర్వాత కూడా గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదన్నారు. యూరియా కోసం రైతులు రోడ్లపైకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతు మోర్ఛా నాయకులు గురులింగనగౌడ, ఐనాథ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. విత్తనాలు, ఎరువుల కొరతతో సతమతం అవుతున్నారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కొన్ని జిల్లాలకే పరిమితం అయ్యారని వాపోయారు. మండ్య జిల్లా, బెంగళూరులను మాత్రమే ఆయన పట్టించుకుంటున్నారని, ఈ ప్రాంత రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అవినీతి కాంగ్రెస్ సర్కార్ అంటూ నినదించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్నాయుడు, నాయకులు కేఎస్ దివాకర్, హనుమంతప్ప, రైతు మోర్ఛా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎరువుల సరఫరాలో వైఫల్యంపై గరం నగరంలో పార్టీ కార్యకర్తల భారీ ర్యాలీ -
ఎరువుల పిచికారీ డ్రోన్ ప్రారంభం
హొసపేటె: నగరంలోని చిత్తవాడిగి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో వరి పొలంలో డ్రోన్ ద్వారా నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను పిచికారీ చేసే యంత్రాన్ని గురువారం జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నానో యూరియా ఎరువులను అందించే ప్రత్యేకమైన ద్రవ నత్రజని విజయనగర జిల్లాలోని చాలా నేలల్లో నత్రజని లోపం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. రైతులు 30 రోజుల పంటకు, 45 రోజుల పంటకు విత్తే సమయంలో పంటలకు 2–3 భాగాలుగా నత్రజని ఎరువులను వేస్తారు. కానీ పంట వేసిన నత్రజని ఎరువుల్లో 50–60 శాతం మాత్రమే ఉపయోగిస్తుంది. మిగిలిన ఎరువులు బాష్పీభవనం లేదా లీకేజీ కారణంగా పోతాయని తెలిపారు. దీని వల్ల నేల, నీరు, గాలి కాలుష్యం ఏర్పడుతుంది. సిఫార్సు చేసిన దాని కంటే ఎక్కువగా యూరియా ఎరువులను ఉపయోగించడం వల్ల పంటల్లో వ్యాధి, తెగుళ్ల ఉధృతి పెరుగుతుందన్నారు. పంట విస్తరణ, పోషక లోపం, ఇతర సమస్యలు కూడా తలెత్తవచ్చు. నత్రజని లక్ష్యం, కచ్చితమైన ఉపయోగం కోసం నానో యూరియా ప్లస్ మంచి ఎరువుగా ఉద్భవించిందని తెలిపారు. దాని నిల్వ, రవాణా సులభం, ఇది ఎలాంటి పర్యావరణ కాలుష్యానికి కారణం కాదు. నానో ఎరువులు కణాలు కలిగి ఉండటం వలన, అవి పంటకు 80 శాతం ఉపయోగకరంగా ఉంటాయి. ఇది మొక్కకు అవసరమైన నత్రజని, భాస్వరం సరైన మొత్తాన్ని అందిస్తుంది. ఇది మొక్కల పెరుగుదల, వేర్ల అభివృద్ధిని మెరుగుపరుస్తుందని తెలిపారు. వీటిని ఉపయోగించడం ద్వారా పంట ఉత్పాదకత పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. రైతుల ఆదాయం పెరుగుతుంది. జిల్లాలోని రైతులందరూ నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను ఉపయోగించాలని కోరారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
స.హ.చట్టంతో పారదర్శకతకు పట్టం
హొసపేటె: పౌరులకు సమాచార హక్కు చట్టాన్ని అందించడం ద్వారా ప్రభుత్వ విధుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం అని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ ఎల్ఆర్ శంకర్నాయక్ అన్నారు. నగరంలోని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలోని విజయ్ విఠల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమాచార హక్కు సదస్సును ఆయన మొక్కకు నీరు పోసి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ సౌకర్యాలు, ప్రజా సేవలను సక్రమంగా పొందేందుకు సమాచార హక్కును సక్రమంగా ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టం పరిచయం, పద్ధతులను తెలుసుకోవడానికి ఈ సదస్సు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సదస్సులో సమాచార హక్కు రిసోర్స్ పర్సన్ హొళగుంద ఏఎంపీ వాగేష్, ఆర్సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య, జిల్లా క్షయ నిర్మూలన అధికారి డాక్టర్ భాస్కర్, జిల్లా సర్వేయర్ డాక్టర్ షణ్ముఖగౌడ, ఆరోగ్య శాఖ అమలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
భారీ వర్షాలతో రోడ్లకు కోతలు
రాయచూరు రూరల్: రహదారులు నాగరికతకు ఆనవాళ్లు. అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు రహదారుల సొగసు చూడతరము కాదు. నాణ్యత లేని నిర్మాణాల కారణంగా ప్రధాన రహదారులు ధ్వంసం అయ్యాయి. ఇటీవల జిల్లాలో భారీ వర్షాలు కురువడంతో రాయచూరు–మటమారి, లింగసూగూరు, మాన్వి, మంత్రాలయం రోడ్ల పరిస్థితి ఘోరంగా మారింది. గ్రామీణ రహదారులు మరింత జటిలంగా మారాయి. రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత గురించి అధికారులు పట్టించుకోక పోవడంతో వాటి జీవిత కాలం తగ్గిపోతోంది. రోడ్లు భవనాల శాఖ, ప్రజా పనుల శాఖ, జిల్లా పంచాయతీ అధికారులు తమకొచ్చే లంచాల వాటాలతో సంతృప్తి చెందుతుండగా కాంట్రాక్టర్లు వివిధ మార్గాల్లో లాభాలు పొందుతున్నారు. మెయింటెనన్స్ పేరుతో పలు శాఖల అధికారులు రూ.వేలాదిగా వ్యయం చేసి చేపడుతున్న పనులు మూన్నాళ్లకే మట్టి కొట్టుకొని పోతున్నాయిు. సాధారణంగా కొత్త రోడ్లు వేసు ముందు మట్టి రోడ్లు వేస్తారు. మట్టి అణగడానికి కొంత కాలం పడుతుంది. నాసిరకం పనులతో నాణ్యత లేమి రోడ్డు కుంగిపోతే, ఆ ప్రాంతంలో రాతిగుండ్లు వేిసి కుంగకుండా చేస్తారు. దీనిని సోలింగ్ అరెంజ్మెంట్ అని పిలుస్తారు. రోడుపై వాటర్ బెండ్, మొరంతో రోడ్డు వేస్తారు. 60 ఎంఎం పొర గల క్రషింగ్ కంకర వాడాలి. కాంట్రాక్టర్లే 100 ఎంఎం రాళ్లు, ఎర్ర మట్టితో కప్పి చేతులు దులుపుకుంటున్నారు. రోడ్లు అధిక కాలం మన్నాలంటే రోలర్ తిప్పాలి. కాంట్రాక్టర్ తాత్కాలికంగా రోలర్ తిప్పడంతో కంకర త్వరగా లేచి పోతోంది. తారు రోడ్లు వేయడంలో కాంట్రాక్టర్లు అనేక అవకతకవలకు పాల్పడుతున్నారు. నేడు తారు రోడ్డు వేయడానికి హాట్ మిక్స్ విధానం అవలంభిస్తున్నారు. ఆశాపూర్ రహదారిని ఏడాది క్రితం వేశారు. ఇడపనూరు, పుచ్చలదిన్ని, మిడగలదిన్ని, గదార, యరగేర, మాన్వి, దేవదుర్గ గామీణ ప్రాంతాల్లోని వల్కందిన్ని, ముస్టూరు, ఉప్పరాళ, సంకనూరు, బిచ్చాలి, యద్లాపూర్ మధ్య రహదారులు కోతకు గురయ్యాయి. -
మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
హొసపేటె: సమాజంలో మానవ అక్రమ రవాణా పెను సమస్యగా మారిందని ప్రధాన సివిల్ జడ్జి ప్రశాంత్ నాగలాపూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన గురువారం నగరంలోని చిత్తవాడగి ప్రభుత్వ పీయూ కళాశాలలో నిర్వహించిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళలు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పేదరికం, నిరుద్యోగం, తల్లిదండ్రులకు విద్య లేకపోవడం, ఇవన్ని మానవ అక్రమ రవాణాకు కారణాలన్నారు. మహిళలను ప్రలోభాల బారిన పడకుండా, మోసపోకుండా నిరోధించాలన్నారు. చట్టం, శిక్షల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మానవ అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం, సంస్థల మధ్య సహకారం చాలా అవసరం అన్నారు. అదనపు సివిల్ జడ్జి జే.చైత్ర, రెండవ అదనపు సివిల్ జడ్జి శృతి తేలి, ప్రభుత్వ పీయూ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజ్ హవాల్దార్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పీ.శ్రీనివాస మూర్తి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రణాళిక అధికారిణి సింధు అంగడి, పీఎస్ఐ సోమ్లానాయక్, కార్మిక శాఖ కార్మిక ఇన్స్పెక్టర్ జేబీ.ధూపద్, అంగన్వాడీ కార్యకర్తలు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అజ్ఞాత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి హొసపేటె: గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా సంచరిస్తూ కనిపిస్తే, వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని డీఎస్పీ మల్లేష్ దొడ్డమని తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. మానవ అక్రమ రవాణా ఒక పెద్ద సామాజిక ఉపద్రవం. ఈ దుర్మార్గానికి పిల్లలు పెద్ద సంఖ్యలో బలైపోతున్నారని అన్నారు. అపహరణకు గురైన పిల్లలు నేర కార్యకలాపాలు, భిక్షాటనలో పాల్గొంటున్నారు. ఇలాంటి దారుణమైన చర్యలను నిరోధించడం పౌర సమాజం బాధ్యత అన్నారు. దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళపై లైంగిక దాడి జరుగుతుండటం చాలా ఆందోళనకరమైన విషయం అన్నారు. సీఐ ప్రహ్లాద్, లాయర్స్ అసోసియేషన్ చెన్నగిరి, జి.హొన్నూరప్ప, కార్యదర్శి సీ.విరుపాక్షప్ప, కార్యదర్శి డీహెచ్.దురుగేష్, స్నేహ సంస్థ డైరెక్టర్ టి.రామాంజనేయులు, న్యాయవాది రవి అంగడి, ప్రిన్సిపాల్ టి.కొడ్లమ్మ, సీడీపీఓ సూపర్వైజర్ విజయలక్ష్మి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం బసంతి, స్నేహ సంస్థ సరోజ, గీత, ఇతర విద్యార్థులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో 22 మందికి గాయాలు
రాయచూరు రూరల్ : జిల్లాలోని మాన్వి, కుర్డిల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో 22 మంది గాయపడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. టాటా ఏస్ వాహనంలో కొరివి గ్రామానికి వెళుతుండగా టైర్ పేలి అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఉరుకుందమ్మ, మంగమ్మ, హనుమేష్, అంజమ్మ, మారెమ్మ, రాఘమ్మ, భీమప్ప, హుసేనమ్మతో పాటు మరి కొంత మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై మాన్వి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ఢీకొని ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు హొసపేటె: అతివేగంగా వస్తున్న బైక్ చోదకుడు ఆటోను ఢీకొనడంతో అదుపు తప్పి ఆటో బోల్తా పడగా ఆటోలో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలైన ఘటన జరిగింది. ఆటోలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు తమ పని మీద కొండనాయకనహళ్లికి వెళ్లి తిరిగి నగరం వైపు వస్తుండగా నగరంలోని బళ్లారి సర్కిల్ సమీపంలో వేగంగా ఎదురుగా వస్తున్న బైక్ ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు యోగాలక్ష్మి, అనిత, నాగరత్న, గంగమ్మతో పాటు ఆటో డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారు నగర ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఇస్రో సందర్శనలో రాయచూరు విద్యార్థులు
రాయచూరు రూరల్: శ్రీహరికోట ఇస్రోలో బుధవారం సాయంత్రం జరిగిన నైసార్ శాటిలైట్ ప్రయోగ కార్యక్రమంలో రాయచూరు నవోదయ కేంద్రీయ విద్యార్థులు పాలు పంచుకున్నారు. నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ, నారాయణపేట మాజీ శాసన సభ్యుడు రాజేంద్రరెడ్డి దంపతుల సహకారంతో శాటిలైట్ ప్రయోగ కార్యక్రమంలో 8, 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొని ఉపగ్రహ ప్రయోగాన్ని చాలా దగ్గర నుంచి వీక్షించడంతో కర్ణాటకలోని మొదటి పాఠశాలగా పేరు గాంచింది. సామూహిక ఖననాలపై విచారణకు వినతి రాయచూరు రూరల్: పవిత్ర పుణ్య క్షేత్రమైన ధర్మస్థలలో సామూహిక కిడ్నాప్, అత్యాచా రాలు, హత్యలు, ఖననాలపై విచారణ జరిపి ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలని మహిళా సంఘం డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షురాలు విద్యా పాటిల్ మాట్లాడారు. దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా ధర్మస్థల మంజునాథ్ స్థలంలో జరిగిన సామూహిక ఖననాలపై న్యాయాంగ విచారణ చేపట్టాలన్నారు. రాజకీయ ప్రభావంతో సిట్ దర్యాప్తులో కేసు దారి తప్పుతోందని ఆరోపించారు. 1976 నుంచి నేటికి 400 మందికి పైగా విద్యార్థులు, మహిళల కిడ్నాప్, అత్యాచారాల వంటి నరమేధాలను బహిరంగ పరిచిన వ్యక్తి కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. సౌజన్య హత్య కేసును మూసివేసి నిందితుల పరంగా నిలవడాన్ని తప్పుబట్టారు. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ రాయచూరు రూరల్ : పేద విద్యార్థులను ఆదుకోవడం మానవ ధర్మమని విద్యానిధి కళాశాల అధ్యాపకుడు శంకర్ పేర్కొన్నారు. నగరంలోని మాదిగ సముదాయంలోనూ పేద పిల్లలున్నారని, వారిని ఆదుకోవడం అభినందనీయం అన్నారు. ఉచితంగా వారికి ప్రైవేట్ చెప్పడంతో పాటు విద్యాభివృద్ధిని సాధించడానికి మాదిగ సమాజం పెద్దలు అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో మంజునాథ్, కల్లప్ప, శివరాజ్, వీరేష్, రవిరాజ్, ప్రవీణ్, గోవిందు, రఘునాథ్, రామణ్ణ, సత్యరాజ్లున్నారు. అప్పుల బాధతో రైతు బలవన్మరణం హొసపేటె: మొక్కజొన్న పంట దిగుబడి రాకపోవడంతో కొప్పళ జిల్లా కుకనూరు తాలూకాలోని అరకేరి గ్రామానికి చెందిన రైతు తన తోటలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అరకేరి గ్రామానికి చెందిన దేవప్ప నీరల్లి(51) ఆత్మహత్య చేసుకున్న రైతు. సమీపంలోని శిరూరు కెనరా బ్యాంకు నుంచి రూ.2.5 లక్షలు, ఇతర ప్రాంతాల నుంచి గ్రూప్ లోన్గా సుమారు రూ.లక్ష అప్పు తీసుకున్నట్లు చెబుతున్నారు. తాను పండించిన మొక్కజొన్న పంట దెబ్బతినడంతో అతను మానసికంగా కుంగిపోయి గురువారం తన తోటలో పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కుకనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. క్రీడల్లో గెలుపోటములు సమానం రాయచూరు రూరల్ : క్రీడా పోటీల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని తాలూకా విద్యా శాఖాధికారి ఈరన్న పేర్కొన్నారు. గురువారం మహాత్మా గాంధీ క్రీడాంగణంలో పోలీస్ కాలనీ క్రీడలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు క్రీడా మనోభావాన్ని పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా పీఈటీ రంగస్వామి, పరశురాం, రాజా శ్రీనివాస్, రవి కుమార్, మల్లేష్, వెంకటేష్, చంద్రశేఖర్రెడ్డి, యంకప్పలున్నారు. -
రిక్షాపై విరిగిపడిన చెట్టు కొమ్మ
హుబ్లీ: నడుస్తున్న ఆటో రిక్షాపై భారీ వృక్షం కొమ్మ విరిగిపడిన ఘటన సుభాష్ రోడ్డులో గురువారం చోటు చేసుకుంది. గాంధీ చౌక్ మార్గం నుంచి సుభాష్ రోడ్డు మీదుగా బస్టాండ్ వైపునకు ఆటో వెళుతుండగా సదరు కొమ్మ ఉన్నఫళంగా విరిగి పడింది. ఆ సమయంలో రిక్షాలో ఉన్న డ్రైవర్, వృద్ధురాలు అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విషయం తెలిసిన తక్షణమే ఘటన స్థలానికి ధార్వాడ ట్రాఫిక్ పోలీసులు వచ్చి సదరు కొమ్మును తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు. తాగునీటి పథకాలకు పెద్దపీట రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో తాగునీటి రంగం అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. రాయచూరు తాలూకా యరగేర పంచాయతీ జలజీవన్ మిషన్ పథఽకం పనులను ఆయన తనిఖీ చేశారు. వారం రోజుల్లో 200 ఇళ్లకు నీటి పైప్లైన్ కనెక్షన్లను జోడించాలన్నారు. నీటి పథకాలను పూర్తి చేయడానికి ఏడాది కాలం పట్టిందా? అంటూ అధికారులపై మండిపడ్డారు. సిరవార తాలూకా కల్లూరులో జలధార, జీవన్ పథకాలను చూసి ఆగస్ట్ 15లోగా పూర్తి చేయాలన్నారు. తాలూకాలో 14 పంచాయతీల్లో పెండింగ్లో ఉన్న ఇంటి, ఆస్తి, నీటి పన్నులను వసూలు చేయాలని ఉద్యోగులను ఆదేశించారు. తాలూకాలో వివిధ తాగునీటి పథకాలను పరిశీలించారు. బకాయి వేతనాలు చెల్లించండి రాయచూరు రూరల్: పరీక్షల ప్రశ్న పత్రాల మౌల్య మాపనం చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు బకాయి వేతనాలు చెల్లించాలని జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు నరసప్ప భండారి తెలిపారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025లో జరిగిన పరీక్షలు రాిసిన విద్యార్థుల జవాబు పత్రాలకు సంబంధించి మార్చి, ఏప్రిల్, జూన్ నెలల్లో చేసిన మౌల్యమాపనం పనులకు ఇంతవరకు వేతనాలు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో 65 వేల మంది అధ్యాపకులకు రూ.75 కోట్ల వేతనాలు అందజేయాల్సి ఉందన్నారు. యరగేర తాలూకా ప్రకటనకు సమ్మతి రాయచూరు రూరల్: యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించిందని యరగేర తాలూకా పోరాట సమితి అధ్యక్షుడు నిజాముద్దీన్ వెల్లడించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అనుకూలమయ్యే విధంగా తాలూకాను ఏర్పాటు చేయడానికి సౌకర్యాలు ఉన్నాయన్నారు. యరగేర వద్ద 256 ఎకరాల్లో ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం, జాతీయ రహదారి–167 ఉందన్నారు. యరగేర పరిధిలో 19 గ్రామ పంచాయతీలు, 78 గ్రామాలు ఉన్నాయన్నారు. 2020 నుంచి యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించామన్నారు. బెంగళూరు ఫ్రీడం పార్క్లో ఆందోళనకు మద్దతు ఇచ్చిన నేతలు తాలూకా కేంద్రంగా ప్రకటించడానికి సీఎం సమ్మతించారన్నారు. బసవరాజ్, మెహబూబ్ పటేల్, మహ్మద్ రఫీ తదితరులున్నారు. నలుగురికి జీవిత ఖైదు కోలారు : హత్య కేసుకు సంబంధించి నలుగురు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఇంటి స్థలం వివాదం నేపథ్యంలో ఏపీలోని పుంగనూరుకు చెందిన ఆగస్థ్య రెడ్డి (84)అనే వ్యక్తి 2017లో శ్రీనివాసపురం తాలూకా పుంగనూరు క్రాస్ వద్ద హత్యకు గురయ్యాడు. అగస్థ్య రెడ్డి భార్య లక్ష్మమ్మ, కుమారుడు మాధవ రెడ్డి ఫిర్యాదు మేరకు రజనికుమార్, కృష్ణారెడ్డి, సుబ్రమణ్యం, జ్యోతిషవర్ అనే నిందితులను శ్రీనివాసపురం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జ్షీట్ సమర్పించారు. ఈకేసులో 38 మంది సాక్షులను విచారణ చేశారు. ఈకేసు గురువారం విచారణకు వచ్చింది. నిందితుల నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
రేయ్.. ఎవరురా మీరంతా?
ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న నగరం.. బెంగళూరు(కర్ణాటక). వర్షాలు.. వరదలు, ట్రాఫిక్ రద్దీ, లైంగిక వేధింపులు, భాష ప్రతిపాదికన దాడుల ఘటనలు ఏవో ఒకటి నగరాన్ని నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తున్నాయి. ఈ తరుణంలో.. మరో తరహా ఘటనలు ప్రపంచవ్యాప్తంగానూ చర్చకు దారి తీస్తున్నాయ్.. నోయెల్ రాబిన్సన్, యూనెస్ జారో.. ఈ ఇద్దరూ ఆషామాషీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కాదు. కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు వీళ్లకి. అయితే తాజాగా ఈ ఇద్దరికీ బెంగళూరులోనే చేదు అనుభవం ఎదురైంది. వేర్వేరు ఘటనలో వీళ్లిద్దరు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సి వచ్చింది.జర్మన్ టిక్టాకర్ నోయెల్ రాబిన్సన్.. గుబురు జుట్టేసుకుని జనం మధ్య డ్యాన్సులు వేస్తూ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ముంబై, ఢిల్లీ, కోల్కతా సహా పలు నగరాల్లో ఇప్పటికే వీడియోలతో భారతీయులకూ దగ్గరయ్యాడు. అయితే.. బెంగళూరు వీధుల్లో సంప్రదాయ పంచెకట్టులో డాన్స్ చేస్తూ వీడియో చేయబోయాడు. దీంతో జనం భారీగా గుమిగూడారు. కాసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు పబ్లిక్ న్యూసెన్స్ పేరుతో అతన్ని స్టేషన్కు లాక్కెళ్లారు. ఆ సమయంలో అతనితో కాస్త దురుసుగా ప్రవర్తించారు. తీరా పీఎస్కు తీసుకెళ్లాక ఓ పావు గంట తర్వాత అతని నుంచి వివరణ తీసుకుని.. జరిమానా విధించి వదిలేశారు. దీనిని అంతే తేలికగా తీసుకున్న నోయెల్.. దానిని ఓ ఫన్నీ వీడియోగా ప్రమోట్ చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Noel Robinson (@noel)మరో ఘటనలో.. పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ యూనస్ జారో నగరంలోని చర్చి స్ట్రీట్ వద్దకు రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే అతని రాకతో అక్కడ జనం గుమిగూడారు. ఇంతలో సడన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అతన్ని పీఎస్కు తరలించి.. ఫైన్ విధించి పంపించారు. ఆ సమయంలోనూ అతను వాళ్లతో షేక్ హ్యాండ్ ఇస్తూ మరో ఫొటో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Younes Zarou (@youneszarou)ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 9వ తేదీన బ్రిటిష్ మ్యూజీషియన్ ఇద్ షరీన్ రోడ్డు మీద ప్రదర్శన ఇస్తుండగా.. కుబ్బన్ పోలీసులు అంతరాయం కలిగించి అక్కడి నుంచి వెళ్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. అటు ఫ్యాన్స్తో పాటు అతిథి దేవోభవకు బెంగళూరు పోలీసులు తూట్లు పొడిచారంటూ ఇటు నెటిజన్లు నగర పోలీసుల తీరుపై మండిపడ్డారు.International artist @edsheeran was stopped playing in #Bangalore at church street. Even though, he had the permission. Literally! The cops pulled the plug. Damn sad! #Karnataka pic.twitter.com/C0F9tdm26g— Imran Khan (@KeypadGuerilla) February 9, 2025 అయితే.. పోలీసులు మాత్రం తమ అనుమతులు లేకుండా రోడ్లపై అలాంటి షోలను అనుమతించమని.. జనం గుమిగూడి జరగరానిది ఏదైనా జరిగితే ఎలాగ? అని ప్రశ్నిస్తున్నారు. జూన్ 4వ తేదీన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో జరిగిన తొక్కిసలాట ఘటన.. దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో.. కర్ణాటక ప్రభుత్వం క్రౌడ్ కంట్రోల్ బిల్ - 2025 తెర మీదకు తెచ్చింది. ఈ రకమైన ఈవెంట్లు గనుక అనుమతులు లేకుండా నిర్వహిస్తే.. గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 వేలజరిమానా విధించాలని ఈ చట్టం తేబోతోంది. -
టిక్టాక్ స్టార్కు షాక్ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్
యశవంతపుర: జర్మనీకీ చెందిన ప్రముఖ టిక్టాక్ స్టార్ నోయెల్ రాబిన్సన్ను బెంగళూరు పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని చర్చి స్ట్రీట్లో భారతీయ సాంస్కృతిక పండుగలో నృత్యం చేస్తుండగా చూడటానికి వందల మంది జనం గుమిగూడారు. ప్రజలు, వాహనాల సంచారానికి ఇబ్బంది కలిగించారని రాబిన్సన్ను బలవంతంగా అదుపులోకి తీసుకొని విచారించి వదిలేశారు. గతంలో కూడా ఓ ప్రముఖ పాప్ స్టార్ ప్రదర్శన ఇస్తుండగా పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.రాబిన్సన్ను 15 నిమిషాల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచిన పోలీసులు.. అనుమతి లేకుండా చిత్రీకరించినందుకు జరిమానా విధించారు. అరెస్ట్పై ఇన్స్టాగ్రామ్లో నోయెల్ స్పందిస్తూ.. తాను సురక్షితంగా ఉన్నానని తెలిపాడు.పోలీస్ స్టేషన్కు వెళ్లడం నాకు ఇదే మొదటిసారి అని.. వారు నన్ను జైలుకు పంపుతారేమోనని భయపడ్డానన్న.. రాబిన్సన్ అదృష్టవశాత్తూ, బయటపడ్డానన్నారు. తనకు భారత్ అంటే ఇష్టమంటూ ఆయన పేర్కొన్నారు. భారత్పై తనకున్న ప్రేమను వ్యక్తం చేసిన రాబిన్సన్.. ‘‘క్షమించకండి, స్నేహితులారా! ఇది ప్రతి దేశంలోనూ జరగొచ్చు.. ఈ ఘటన ఒక చిన్న అనుభవం లాంటింది. ఇది భారత్ పట్ల తనకున్న ప్రేమను దూరం చేయదు" అంటూ ఆయన వ్యాఖ్యానించారు.German TikToker Noel Robinson, known for his street dance videos, was briefly detained by Bengaluru police while filming a dance on the streets. The incident occurred while he was filming a street dance video in traditional Indian attire, which drew a large crowd, raising public… pic.twitter.com/26sqQk0RSn— Waahiid Ali Khan (@waahiidalikhan) July 31, 2025 -
ఆమె బ్లడ్ గ్రూపు ఎక్కడాలేదు!
కోలారు: కర్ణాటకలోని కోలారు జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ రక్తం గ్రూపు చాలా ప్రత్యేకమైనదిగా తేలింది. ఏ గ్రూపుతోనూ ఆమె రక్తం సరిపోలలేదని స్థానిక జిల్లా ఆస్పత్రి వైద్యనిపుణులు డాక్టర్ డీవీఎల్ఎన్ ప్రసాద్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఓ మహిళ గుండె శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని.. ఆమె బ్లడ్ గ్రూపును గుర్తించేందుకు పరీక్ష చేయగా బ్లడ్బ్యాంకులోని ఏ రక్తం గ్రూపుతోనూ ఆమె రక్తం సరిపోలేదన్నారు. ఆమె రక్త నమూనాలను బెంగళూరులోని మెడికల్ సర్వీసెస్ ట్రస్టుకు, ఇంగ్లండ్లోని బ్రిస్టల్ నగరంలోని అంతర్జాతీయ ల్యాబొరేటరీకి పంపించి ఏ గ్రూపు రక్తమో కనుక్కోవాలని కోరామని.. ఇంతవరకూ ఇలాంటి గ్రూపు రక్తం ఏదీలేదని నివేదిక వచ్చిందని డాక్టర్ ప్రసాద్ వెల్లడించారు. చివరకు.. ఈ రక్తం గ్రూపునకు స్థానిక పేరు వచ్చేలా క్రోమర్ ఇండియా బెంగళూరు (సీఆర్ఐబీ)గా వారే పేరు పెట్టారని, బెంగళూరుకు బదులు కోలారు అని పెడితే సమంజసంగా ఉంటుందని చెప్పారు. సమావేశంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ కె.ప్రభాకర్, వైస్ ప్రిన్సిపాల్ వినుతా శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ మోసాల జోరు
సైబర్ వంచకులు బ్యాంకు ఖాతాలకు కన్నాలు వేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో బాధితులు సహాయవాణికి ఫోన్ చేసి లబోదిబోమంటున్నారు.బనశంకరి: సైబర్వంచకుల హవా రాష్ట్రంలో ఏడాది నుంచి ఏడాదికి పెచ్చుమీరుతూనే ఉంది. దీంతో రాష్ట్ర కేంద్ర సైబర్క్రైం పోలీస్ విభాగం వంచకులపై ప్రత్యేక నిఘా పెట్టింది. 80 శాతం వంచన బెంగళూరు నగరంలోనే జరుగుతోంది. సైబర్ వంచన బారిన పడిన వారిలో చాలామంది విద్యావంతులు, విశ్రాంత అధికారులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఆన్లైన్, వివిధ ప్రైవేట్ యాప్లను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడం, సోషల్ మీడియాలో ప్రకటనలు, డిజిటల్ అరెస్ట్తో ఎక్కువ డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఫిర్యాదులకు సహాయవాణి సైబర్ కేటుగాళ్ల చేతిలో ప్రజలు వంచనకు గురౌతున్న నేపథ్యంలో ఫిర్యాదు చేయడానికి 1930 నంబర్తో సైబర్ నేరాల సహాయవాణి, వెబ్చాట్ యాప్ను రూపొందించగా ఫిర్యాదుదారులు ఫోన్కాల్స్ చేసే వారి సంఖ్య పెరిగింది. మోసం జరిగిన గంటల వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులు పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీనినే గోల్డెన్ అవర్ అంటారు. ఫోన్కాల్స్ వెల్లువ రాష్ట్రంలో సైబర్ సహాయవాణి– 1930కు గత ఏడాదిన్నరలో ప్రజల నుంచి 17.50 లక్షల ఫోన్కాల్స్ అందగా వంచనకు గురైన మొత్తం రూ.3,334 కోట్లను దాటినట్లు వెల్లడైంది. 2024లో సైబర్ సహాయవాణి కేంద్రానికి 10,79,458 ఫోన్కాల్స్ చేయగా ప్రస్తుత ఏడాది మే చివరి నాటికి సుమారు 6,71,365 ఫోన్కాల్స్తో మొత్తం 17,50,823 ఫోన్కాల్స్ చేశారు. వంచన మొత్తం 2024లో రూ.2,396 కోట్లు కాగా ఈ ఏడాది 2025లో 5 నెలల్లో రూ.938 కోట్లు సైబర్ వంచకుల పాలైనట్లు హోంశాఖ నివేదికలో వెల్లడైంది. సైబర్ హెల్ప్లైన్–1930కు 17 లక్షల ఫోన్కాల్స్ రూ.3,334 కోట్ల వంచన, వెబ్చాట్ లింక్లో ఫిర్యాదు -
ధర్మస్థలలో కొనసాగిన గాలింపు
యశవంతపుర: ధర్మస్థలలో వందల సంఖ్యలో శవాలను పూడ్చినట్లు వచ్చిన అరోపణలకు సంబంధించి ఎస్ఐటీ బృందం మృతదేహాల కోసం గాలింపు చేపట్టింది. బుధవారం ఉదయం 11 గంటలకు సాక్షిదారుడైన వ్యక్తి చూపించిన రెండు చోట్ల గాలింపు చేపట్టారు. నేత్రావతి నది పక్కలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మధ్యాహ్నం 12:30 గంటల వరకు పూడ్చీన శవాల కోసం గాలించారు. ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు. అటవీ ప్రదేశం ప్రారంభమైన రెండు జాగాలలో పంచాయతీకి చెందిన 20 మంది కార్మికులు రెండో రోజు ఆరు అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పున తోడారు. ఎలాంటి కబేళాలు లభించలేదు. అటవీ ప్రాంతంలో యంత్రాలను ఉపయోగించటం నిషేధం కారణంగా కార్మికులతోనే తోడిస్తున్నారు. పుత్తూరు అటవీశాఖ అధికారి సైల్లావర్గీస్, ఎస్ఐటీ ఎస్పీ జితేంద్రకుమార్ దయామ అక్కడే మకాం వేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం తరువాత ఫిర్యాదుదారుడు చూపించిన మూడో జాగాలో కూడా మట్టిని తవ్వారు. నివృత్త అధికారి పేరు తను శవాలను పూడ్చటానికి ఒక పోలీసు అధికారి సహకరించినట్లు ఫిర్యాదుదారుడు చెప్పినట్లు తెలిసింది. ఎస్ఐటీ అధికారులు అతడిని విచారించగా తనకు ఒక నివృత్త పోలీసు అధికారి సహకరించినట్లు వెల్లడించారు. శవాలను పూడ్చిన సమయంలో ఆ అధికారి తనకు సహకరించినట్లు అతడి పేరును ఎస్ఐటీకి తెలియజేశారు. అ అధికారి 1995లో ధర్మస్థల అవుట్పోస్ట్ పోలీసు స్టేషన్లో పని చేశారని వెల్లడించారు. దీనితో ఎస్ఐటీ అధికారులు అక్కడ పని చేసిన పోలీసు అధికారుల జాబితా ఇవ్వాలంటూ దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. సోమవారం 13 జాగాలను గుర్తించి 12 మంది కార్మికులు ఫిర్యాదుదారుడు చెప్పిన జాగాలలో 7 గంటల పాటు శ్రమించినా ఒక ఆధారం కూడా దొరకలేదు. పాన్కార్డు, డెబిట్కార్డు, రవిక లభ్యం మృతదేహాల కోసం మట్టిని తోడుతుండగా పాన్కార్డ్, డెబిట్కార్డ్, ఒక రవిక(జాకెట్) లభించినట్లు ఫిర్యాదుదారుడి తరపున న్యాయవాది మంజునాథ్ తెలిపారు. ఎస్ఐటీ అధికారుల ద్వారా సైట్ సంఖ్య–1లో ఎర్ర రవిక, పాన్కార్ట్, ఏటీఎం డెబిట్ కార్డ్ లభించాయి. ఒక కార్డులో పురుషుడి పేరు ఉంది. మరో కార్డ్లో లక్ష్మీ అనే మహిళ పేరుంది. ఇలాంటి సాక్ష్యాలు లభించటం వల్ల అనేక సాక్ష్యాలు బయట పడే అవకాశం ఉందని మంజునాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
2023 నుంచి పెచ్చుమీరిన వంచనలు
గత నాలుగేళ్ల వంచన వివరాలు గమనిస్తే 2023లో సైబర్ వంచన ముఠా పెచ్చుమీరింది. 2022లో సైబర్ సహాయవాణికి 1.30 లక్షల ఫోన్కాల్స్ అందగా వీటిలో రూ.113 కోట్లు దోచేశారు. సైబర్ పోలీస్ స్టేషన్కు అందిన ఫిర్యాదుల మేరకు రూ.8 కోట్లు ఫ్రీజ్ చేశారు. 2023లో 4,67,258 ఫోన్కాల్స్ చేయగా వంచనకు గురైన మొత్తం రూ.562 కోట్లు(11.7 శాతం) పెరిగింది. అనంతర సంవత్సరాల్లో రాష్ట్రంతో పాటు దేశంలో పెచ్చుమీరిన సైబర్ వంచనల కేసులు సైబర్ పోలీసుల్లో కలకలం రేపుతోంది. 2024లో సుమారు 10,79,458 ఫోన్కాల్స్ సైబర్ సహాయవాణికి అందాయి. వంచన మొత్తం రూ.2,396 కోట్లకు చేరింది. ఇందులో కేవలం రూ.226 కోట్లు మాత్రమే పోలీసులు రికవరీ చేశారు. ప్రస్తుతం 5 నెలల్లో 6.71 లక్షల ఫోన్కాల్స్ రావడంతో రూ.938 కోట్లు వంచనకు గురికాగా రూ.135 కోట్లు ఫ్రీజ్ చేశారు. -
హంతక ఏనుగు బందీ
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్పుర తాలూకాలో ఇద్దరిని బలి తీసుకున్న అడవి ఏనుగును ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు బంధించారు. బన్నూరు గ్రామ సమీపంలో గత బుధవారం రాత్రి అడవి ఏనుగు సంచరించింది. అనితా అనే కార్మికురాలిని తొండంతో కొట్టి చంపేసింది. ఐదు రోజుల తర్వాత అదే ఏనుగు సుబ్బేగౌడ అనే వ్యక్తిని ఏనుగు కాళ్లతో తొక్కి చంపేసింది. దీంతో హంతక ఏనుగును బంధించాలని గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో అటవీశాఖ అధికారులు శివమొగ్గ జిల్లా సక్రేబైలు నుంచి నాలుగు ఏనుగులను తెప్పించి వాటి సహాయంతో హంతక ఏనుగును బంధించడంలో సఫలమయ్యారు. ఏనుగును క్రేన్ సాయంతో లారీలోకి ఎక్కించి అటవీ ప్రాంతానికి తరలించారు. దీంతో గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
నాటు పడవ బోల్తా.. మత్స్యకారుల గల్లంతు
బనశంకరి: ఉత్తర కన్నడ జిల్లా భట్కళ తాలూకా అళ్వకూడి వద్ద అరేబియా సముద్రంలో బుధవారం నాటు పడవ బోల్తాపడి నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మనోహర అనే వ్యక్తికి చెందిన మహసతి అనే బోటులో ఆరుగురు సంప్రదాయక చేపల వేటకు వెళ్లారు. భారీ ఎత్తున అలలు రావడంతో బోల్తా పడింది. రక్షణా సిబ్బంది రంగంలోకి దిగి మనోహర మోగీర, రామాఖార్వి అనే మత్స్యకారులను రక్షించారు. రామకృష్ణ మోగీర, సతీశ్మోగీర, గణేశ్మోగీర, నిశ్చిత్ మోగీర అనే నలుగురు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలింపుచర్యలు చేపట్టారు. బోల్తా పడిన పడవ అళ్వేకోడి బ్రేక్వాటర్ వద్ద లభించింది. భట్కళ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరిని కాపాడిన రక్షణ సిబ్బంది -
బలహీనపడ్డ రుతుపవనాలు
దొడ్డబళ్లాపురం: రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయి. బుధవారం పలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ధారవాడ, హావేరి, కొప్పళ, విజయపుర, బీదర్, కలబుర్గి, రాయచూరు, యాదగిరి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. శృంగేరి, బాళెహొన్నూరు, భాగమంగల సిద్ధాపుర, జోయ్డా, కుందాపుర, ధర్మస్థళ, ఉప్పినంగడి, క్యాసల్ రాక్, బెళ్తంగడి, కమ్మరడి, ఆగుంబె, జయపుర, కద్ర, మూడు బిదరె, ఖానాపుర, కోటా, గేరుసొప్ప, సుళ్య, కార్కళ, మాణి, హొన్నావర, సోమవారపేటె, కుశాలనగర,కళస, నాపోక్లు,అజ్జంపుర, కొట్టిగెహార, బండీపురలో మోస్తరు వర్షాలు కురిసాయి. ఖర్గే రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం దొడ్డబళ్లాపురం: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామని,హైకమాండ్ ఇచ్చే ఆదేశాలను తాము గౌరవిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ సింగ్ అన్నారు. ఖర్గే రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారనే వార్తలపై స్పందించిన ఆయన.. ఖర్గేకి సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. ఇప్పుడు ఖర్గే ముఖ్యమంత్రిని ఎన్నిక చేసే స్థానంలో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. హైకమాండ్ ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా తాము మద్దతు ఇస్తామన్నారు. 5 నుంచి సమ్మెలోకి రవాణా సంస్థ ఉద్యోగులు శివాజీనగర: డిమాండ్ల సాధనకు రాష్ట్ర రవాణా సంస్థల ఉద్యోగులు ఆగస్టు 5 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు. వేతన బకాయిల చెల్లింపు, సమాన వేతనం, కార్మిక సంఘాల ఎన్నికలు, సస్పెండ్ అయిన ఉద్యోగుల పునర్ నియామకం చేయాలనే డిమాండ్లపై బెంగళూరులోని ఫ్రీడం పార్కులో రవాణా కార్పొరేషన్ల సమాఖ్య, రాష్ట్ర రోడ్డు రవాణా ఉద్యోగుల సమాఖ్యలు ఇప్పటికే ధర్నా చేపట్టాయి.నాలుగు కార్పొరేషన్ల ఉద్యోగులు బుధవారం నుంచి ధర్నాలో పాల్గొన్నాయి. 2020 జనవరి 1 నుంచి అన్వయించే విధంగా వేతన పరిష్కరణ, 38 నెలల పెండింగ్ బకాయి చెల్లింపు, 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే విధంగా వేతన పరిష్కరణకు సంబంధించి సీఎం అధ్యక్షతన గతంలో జరిగిన సభలో నిర్ణయం తీసుకున్నారని, అయితే ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించలేదని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి స్పందన కొరవడటంతో ఆగస్టు 5 నుంచి నిరవధిక సమ్మె చేపట్టేందుకు నిర్ధారించినట్లు నేతలు తెలిపారు. రమ్యకు మళ్లీ అశ్లీల సందేశాలు యశవంతపుర: నటి రమ్యకు మళ్లీ అశ్లీల సందేశాలు అందాయి. గతంలో అశ్లీల సందేశాలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సీసీబీకీ అప్పగించారు. అయినా అశ్లీల సందేశాలు వస్తూనే ఉన్నాయి. వందల కొద్ది సందేశాలు వచ్చాయని, ఇవన్నీ దర్శన్ అభిమానుల నుంచి వచ్చినట్లు నటి రమ్య మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్లాక్లో ఎరువుల విక్రయాలు ● లోక్సభలో గళం విప్పిన ఎంపీ డాక్టర్ సుధాకర్ దొడ్డబళ్లాపురం: కర్ణాటకలో ఎరువులు బ్లాక్ మ్కాట్లో విక్రయిస్తున్నారని, ఈ విక్రయాలను అరికట్టేలా రాష్ట్ర సీఎస్కి ఆదేశాలు ఇవ్వాలని చిక్కబళ్లాపురం ఎంపీ డా.కే సుధాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లిమెంటులో జీరో అవర్లో కన్నడలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎరువులు సకాలంలో అందించడంలో ఘోరంగా విఫలమవుతోందన్నారు. దీంతో బ్లాక్ మార్కెట్లో ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని, రైతులు దగా పడుతున్నారన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 8.13 లక్షల టన్నుల యూరియా పంపించిందని, అయితే అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేంద్రంపై నిందలు మోపుతూ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. కర్ణాటకలో సబ్సిడీ కింద యూరియా రూ.258కు లభించాల్సి ఉండగా బ్లాక్ మార్కెట్లో రూ.500కు విక్రయిస్తున్నారన్నారు. రూ.1200 ఉన్న డీఏపీ రూ.2000ల ధరకు విక్రయిస్తున్నారన్నారు. -
ఎమ్మెల్యేలూ.. బాగున్నారా? ఈ రూ.50 కోట్లు తీసుకోండి..!
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం నుంచి నాలుగు రోజులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలకు శ్రీకారం చుట్టారు. పార్టీ బలోపేతం, నియామకాలు, నిధుల పంపిణీ, అభివృద్ధి పనులు తదితరాలే ఈ చర్చల అజెండా. తొలిరోజు మైసూరు, చామరాజనగర, తుమకూరు, కొడగు, హాసన్, దక్షిణ కన్నడ జిల్లాల ఎమ్మెల్యేలతో విధానసౌధలో భేటీ అయ్యారు. ఒక్కొక్కరితో 10 నిమిషాల పాటు మాట్లాడినట్లు సమాచారం. ఇటీవలికాలంలో ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేయడంతో హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం బుజ్జగింపులకు దిగారు. ఇప్పటికే ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నియోజకవర్గ పనులకు రూ.50 కోట్ల నిధులను కేటాయిస్తున్నారు. సుర్జేవాలా ఎఫెక్టు రాష్ట్ర ఇన్చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఇటీవల బెంగళూరులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో ఆంతరంగిక భేటీలు జరపడం తెలిసిందే. అభివృద్ధి పనులకు డబ్బు లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. సీఎం తమకు దొరకడం లేదని ఫిర్యాదు చేశారు. దీనివల్ల పారీ్టలో అగాథం ఏర్పడుతోందని భావించి వన్ టు వన్ భేటీలకు పెద్దపీట వేశారు. -
ఎనిమిదేళ్లకు గర్భం దాల్చిన భార్య.. షాకైన భర్త!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఏదో ఒక కారణంతో కట్టుకున్న భర్తను హతమార్చడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. అదే మాదిరిగా ప్రియునితో కలిసి భర్తను కడతేర్చిన భార్య, మరో ఇద్దరిని దావణగెరె జిల్లా చన్నగిరి పోలీసులు అరెస్టు చేశారు. దంపతులు వేర్వేరుగా మిస్సింగ్.. జిల్లా ఎస్పీ ఉమాప్రశాంత్ కేసు వివరాలను వెల్లడించారు. లింగప్ప తల్లి యల్లమ్మ 2024 జనవరి 22న తన కుమారుడు ఇంటి నుంచి వెళ్లినవాడు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 10 రోజుల తరువాత లింగప్ప భార్య లక్ష్మి మిస్సయిందని ఆమె తల్లి మాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు కేసుల్లోనూ దర్యాప్తు చేపట్టారు. లింగప్ప, లక్ష్మికి పెళ్లయి 8 ఏళ్లు గడిచినా పిల్లలు కలగలేదు. లక్ష్మి వక్కతోటలో పనికి వెళ్తూ తిప్పేశ్ నాయక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడి గర్భం దాల్చింది. ఇది తెలిసిన లింగప్ప కడుపులో ఉన్నది తన బిడ్డ కాదని ఆగ్రహంతో కడుపు మీద కొట్టడంతో అబార్షన్ అయ్యింది. దీంతో లక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. తరువాత తిప్పేనాయక్ను కలిసి భర్తను హతమార్చాలని కుట్ర చేసింది. ఇద్దరూ సంతోష్ అనే మరో వ్యక్తి సహకారంతో లింగప్పను హతమార్చి భద్రా కాలువలో పడేసి కేరళకు పరారయ్యారు. సుమారు ఏడాదిన్నర నుంచి అక్కడే సంసారం కొనసాగిస్తున్నారు. పోలీసులు జాడ పసిగట్టి అరెస్టు చేశారు. -
సోషల్ వేధింపులపై రమ్య ఫిర్యాదు
యశవంతపుర: సోషల్ మీడియాలో తన గురించి అశ్లీల కామెంట్లు చేసిన 43 ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్లపై నటి రమ్య బెంగళూరు పోలీసు కమిషనర్ సీమంత్కుమార్ సింగ్కు ఫిర్యాదు చేశారు. హత్య చేస్తామని కూడా బెదిరించారని తెలిపారు. నాలుగు పేజీల ఫిర్యాదును కమిషనర్కు అందజేశారు. ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు కేసును అప్పగించారు. కేసు విచారణకు ఓ ఏసీపీని నియమించారు. చిత్రదుర్గం రేణుకాస్వామి హత్యను ఖండిస్తూ, ఆయన కుటుంబానికి మద్దతుగా రమ్య మాట్లాడుతున్నారు. దీంతో నటుడు దర్శన్ అభిమానులు తనను బెదిరిస్తున్నారని రమ్య ఆరోపించారు. రమ్యకు శివణ్ణ మద్దతు రమ్యపై అవహేళన పోస్టులను ప్రముఖ నటుడు శివరాజ్కుమార్ ఖండించారు. రమ్యకు ఆయన మద్దతు ప్రకటించారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం సరికాదన్నారు. మహిళలను అందరూ గౌరవించాలని మనవి చేశారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించాలని కోరారు. చంపుతామంటున్నారు: ప్రథమ్ బనశంకరి: దర్శన్తో పాటు జైలులో ఉన్న వ్యక్తి నన్ను బెదిరించారు అని కన్నడ బిగ్బాస్ నటుడు ప్రథమ్ బెంగళూరు రూరల్ ఎస్పీ సీకే.బాబాకు ఫిర్యాదు చేశారు. దర్శన్ ను హేళన చేస్తావా అంటూ అతడు డ్రాగర్తో దాడికి యత్నించాడని తెలిపారు. 500 కు పైగా ఇన్ స్టా ఖాతాలలో తనను దూషించారని, ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. -
ఎమ్మెల్యేలూ.. బాగున్నారా?
● సీఎం సిద్దు ప్రత్యేక భేటీలు శివాజీనగర: ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం నుంచి నాలుగు రోజులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలకు శ్రీకారం చుట్టారు. పార్టీ బలోపేతం, నియామకాలు, నిధుల పంపిణీ, అభివృద్ధి పనులు తదితరాలే ఈ చర్చల అజెండా. తొలిరోజు మైసూరు, చామరాజనగర, తుమకూరు, కొడగు, హాసన్, దక్షిణ కన్నడ జిల్లాల ఎమ్మెల్యేలతో విధానసౌధలో భేటీ అయ్యారు. ఒక్కొక్కరితో 10 నిమిషాల పాటు మాట్లాడినట్లు సమాచారం. ఇటీవలికాలంలో ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేయడంతో హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం బుజ్జగింపులకు దిగారు. ఇప్పటికే ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నియోజకవర్గ పనులకు రూ.50 కోట్ల నిధులను కేటాయిస్తున్నారు. సుర్జేవాలా ఎఫెక్టు రాష్ట్ర ఇన్చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఇటీవల బెంగళూరులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో ఆంతరంగిక భేటీలు జరపడం తెలిసిందే. అభివృద్ధి పనులకు డబ్బు లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. సీఎం తమకు దొరకడం లేదని ఫిర్యాదు చేశారు. దీనివల్ల పార్టీలో అగాథం ఏర్పడుతోందని భావించి వన్ టు వన్ భేటీలకు పెద్దపీట వేశారు. ఆస్పత్రిలో బాలికపై ఘోరం దొడ్డబళ్లాపురం: కలబుర్గిలోని ప్రముఖ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆస్పత్రి కార్మికుడు ఒకరు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రికి ఆపరేషన్ జరగాల్సి ఉండడంతో బాలిక తండ్రితో కలిసి వచ్చింది. ఈ క్రమంలో బాలికపై కన్నేసిన ఆస్పత్రిలోని పారిశుధ్య కార్మికుడు సంపత్.. బాలికను బెదిరించి ఓ గదిలోకి తీసికెళ్లి అత్యాచారం జరిపాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఫిర్యాదు చేశారు. కలబుర్గి యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బ్రోకర్ల చేతిలో ఎరువులు ● బీజేపీ నేత విజయేంద్ర తుమకూరు: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించే ఎరువులను రైతులకు పంపిణీ చేయకపోగా దళారుల ద్వారా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఎరువుల కోసం రైతులు రోజూ క్యూలలో నిలబడుతున్నారు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందుల్లో పడేసిందన్నారు. నగరంలోని బీజిఎస్ సర్కిల్లోని బీజేపీ రైతు మోర్చా ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈసారి వానలు బాగా వస్తాయని వాతావరణ శాఖ మూడు నెలల ముందుగానే దీనిని అంచనా వేసింది. పంటల లెక్కలు తీయకపోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రానికి సంవత్సరానికి 6.30 లక్షల టన్నుల యూరియా అవసరం అయితే, కేంద్ర ప్రభుత్వం 8.73 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేసింది. ఈ ఎరువులను రైతులకు ఇవ్వరు కానీ బ్రోకర్లు బ్లాక్మార్కెట్లో విక్రయిస్తారు అని విమర్శించారు. భారీగా సాగిన ర్యాలీలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
హిమవద్ బెట్టపై కుంగిన భూమి
మైసూరు: చామరాజనగర జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న కుండపోత వర్షానికి హిమవద్ గోపాలస్వామి బెట్టలో రోడ్డు మధ్య భూమి కుంగిపోయింది. హిమవద్ గోపాలస్వామి బెట్ట రోడ్డు పెద్ద మలుపు లేదా రాక్షసబండగా పిలిచే చోట భూమి కుంచించుకు పోయింది. గుండ్లుపేటె అధికారులు చేరుకుని పరిశీలించారు. ఆదివారం కూడా గోపాలస్వామి బెట్ట రోడ్డులో ప్రహరీ కూలింది. అటవీ శాఖ సిబ్బంది జేసీబీ ద్వారా రాళ్లు, మట్టిని తొలగించారు. మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్నందున రెండు రోజుల పాటు రాకపోకలను నిషేధించారు. ఈ నేపథ్యంలో 29, 30 తేదీల్లో బెట్టపై ఉన్న ఆలయాన్ని మూసివేస్తారని జిల్లాధికారిణి శిల్పానాగ్ తెలిపారు. పేలుడు వస్తువుల కేసులో ముగ్గురు అరెస్టు బనశంకరి: కలాసీపాళ్య బస్టాండులో పేలుడు వస్తువులు బ్యాగ్ దొరికిన కేసులో ముగ్గురు వ్యక్తులను కలాసీపాళ్య పోలీసులు అరెస్ట్చేశారు. కోలారు జిల్లా బంగారుపేటేకు చెందిన మాదమంగల గణేశ్, మునిరాజ్, శివకుమార్ పట్టుబడినట్లు నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ మంగళవారం తెలిపారు. వీరు గనులలో కార్మికులుగా పనిచేస్తారు. ఆరోజు పేలుడు వస్తువులు ఉన్న బ్యాగును తీసుకుని బస్టాండులోని టాయ్లెట్కు వెళ్లారు. తిరిగి బస్సు కోసం వెళ్తుండగా హోంగార్డు ఉండటాన్ని గమనించి భయపడి అక్కడే బ్యాగును వదిలిపెట్టి వెళ్లిపోయారు. కొళ్లేగాలలో బోర్వెల్ తవ్వకాల కోసం తీసుకెళుతున్నట్లు నిందితులు తెలిపారు. వారి నుంచి మరికొన్ని పేలుడు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇంజినీరుపై లోకాయుక్త దాడి గౌరిబిదనూరు: అక్రమ ఆస్తులను కలిగి ఉన్నాడనే ఆరోపణపై నగరంలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ జూనియర్ ఇంజనీర్ ఎం ఆంజనేయమూర్తి కార్యాలయం, యలహంక, తుమకూరు, మధుగిరి జక్కూరులలోని ఇళ్లు, వాణిజ్య భవనాలలో లోకాయుక్త దాడులు జరిపింది. ఆఫీసులో సిబ్బంది గాలింపు జరిపి ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. చిక్కబళ్ళాపురం లోకాయుక్త ఎస్పీ ఆంటోనీ, సిబ్బంది పాల్గొన్నారు. -
ధర్మస్థలలో ముమ్మర శోధన
శివాజీనగర: పచ్చని అడవి ప్రాంతాలు, నేత్రావతి నది తీరంలో పోలీసుల కూంబింగ్ జరుగుతోంది. ఎక్కడ మానవ అవశేషాలు దొరుకుతాయా? అని వెయ్యి కళ్లతో శోధిస్తున్నారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ధర్మస్థఽలలో అనేకమంది మృతదేహాలను పూడ్చిపెట్టిన కేసులో సిట్ అధికారులు, పోలీసులు అనుమానిత ప్రాంతాలలో గాలింపు కొనసాగిస్తున్నారు. 13 ప్రదేశాలలో వెలికితీసే కార్యాన్ని చేపట్టారు. అపరిచిత పారిశుధ్య కార్మికుడు ఈ స్థలాలను చూపించాడు, తొలి స్థలం నుంచే తవ్వకాలను ఆరంభించారు. రెవెన్యూ అధికారులు కూడా ఈ పనుల్లో పాల్గొంటున్నారు. ఆధారాల సేకరణ పూడ్చిన స్థలాలు మాత్రమే కాకుండా, కొన్ని సమాధులను కూడా ఫిర్యాదిదారు చూపించాడు. ప్రతి అనుమానిత స్థలంలో మార్కింగ్ చేశారు. ఆధారాలు చెరిగిపోకుండా సాయుధ పోలీసులను కాపలాగా ఉంచారు. ఫోరెన్సిక్ సిబ్బంది, మెడికో– లీగల్ నిపుణులు ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆయా ప్రదేశాల్లో మట్టి నమూనాలను సేకరించారు. డిజిటల్ ఆధారాల కోసం ఫోటోగ్రఫీ, వీడియోలు తీస్తున్నారు. ఫిర్యాదిదారు చెప్పినచోట నిజంగా కళేబరాలను పూడ్చిపెట్టారా, అవి లభ్యమవుతాయా అనేది ఉత్కంఠ అందరిలోను నెలకొంది. 13 ప్రదేశాలలో తవ్వకాలు -
వృద్ధురాలి డిజిటల్ అరెస్టు
మైసూరు: వారసత్వ నగరి సైబర్ మోసాలకు స్థావరంగా మారింది. మీ ఖాతా ద్వారా మనీ లాండరింగ్ జరిగింది, మీకు రూ.2.5 కోట్లు జమ అయ్యాయని బెదిరించిన దుండగులు మైసూరులో ఓ వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు చేసి రూ.37.82 లక్షలను స్వాహా చేశారు. జేపీ నగర నివాసి అయిన మహిళ (73) బాధితురాలు. ఆమెకు ఓ వాట్సాప్ సందేశం వచ్చింది. కొంతసేపటికి వీడియో కాల్ చేసిన వంచకులు ముంబైలోని ఎన్ఐఏ యూనిట్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పారు. మీ ఖాతా నుంచి మనీ లాండరింగ్ జరిగింది, మీ ఆధార్ నంబరు, బ్యాంకు వివరాలు ఫోటోలను పంపమని సూచించారు. భయపడిపోయిన ఆ మహిళ వారు అడిగిన దాఖలాలను ఫొటోలు పంపారు. మీ ఖాతాకు పీఎఫ్ఐ సంస్థ నుంచి రూ.2.50 కోట్లు జమ అయినట్లు చెప్పారు. ఇది చాలా పెద్ద కేసు అని భయపెట్టడంతో ఆమె బెదిరిపోయి, దీని గురించి తనకేమీ తెలియదని వేడుకుంది. మీ మీద కేసు నమోదైందని, అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని ఒత్తిడి చేశారు. మీ ఖాతాలో ఉన్న నగదును వేరే ఖాతాలకు బదిలీ చేస్తే, పరిశీలించి మళ్లీ వాపసు చేస్తామని నమ్మించారు. భయాందోళనలో ఉన్న ఆ మహిళ వారు చెప్పిన ఖాతాకు దశల వారీగా మొత్తం రూ.37.82 లక్షల నగదును బదిలీ చేసేసింది. మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించి సైబర్క్రైం ఠాణాలో ఫిర్యాదు చేసింది. భద్రావతివాసికి రూ.6.83 లక్షలు శివమొగ్గ: ఫేస్బుక్లో షేర్ల ప్రకటనను చూసి ఓ వ్యక్తి రూ. 6 లక్షలకు పైగా సమర్పించుకున్నాడు. జిల్లాలోని భద్రావతిలోని హొసమనె బడావణె నివాసి రవీంద్రనాథ్ బాధితుడు. ఫేస్బుక్ను చూస్తుండగా షేరు మార్కెట్ ప్రకటన వచ్చింది. ఓ యాప్ ద్వారా షేర్లను కొనుగోలు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని ఉంది. సరేనంటూ దశల వారీగా రూ.6,83,127లను ఆన్లైన్ ద్వారా పెట్టుబడి పెట్టాడు. అనంతరం నగదు విత్డ్రా చేసేందుకు ప్రయత్నించగా యాప్ లాక్ అయింది. మోసాన్ని గ్రహించి శివమొగ్గ సైబర్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టాడు. రూ.37.82 లక్షల వసూలు మైసూరులో సైబర్ నేరం -
యూరియా.. కటకట తీరేదెలా?
సాక్షి,బళ్లారి: ఈసారి వరుణుడి కృపా కటాక్షాలతో తుంగభద్రమ్మ కళకళలాడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డ్యాం జూన్ నెలాఖరులోపే నిండిపోయి, హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, ఎల్బీఎంసీ కాలువలకు సకాలంలో నీరు విడుదల చేయడంతో పాటు డ్యాం నుంచి లక్ష క్యూసెక్కుల దాకా నీరు నదికి వదులుతున్నారు. దీంతో రైతులు ఉత్సాహంగా వరినాట్లు వేసే ప్రక్రియ జోరందుకుంటోంది. తుంగభద్ర ఆయకట్టు పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర నాలుగు జిల్లాల్లో 10 లక్షలకు పైగా ఎకరాల్లో, నాన్ ఆయకట్టు పరిధిలో 5 లక్షల ఎకరాలు సాగులో ఉంటే అందులో 10 లక్షలకు పైగా ఎకరాల్లో వరినే ప్రధాన పంటగా రైతులు సాగు చేస్తారు. వరిసాగు చేయడానికి రైతులు బురదమళ్లు దుక్కులు దున్ని, వరినాట్లు వేయడానికి వరినారు సిద్ధం చేసుకుని ఉత్సాహంగా కదుతులున్న తరుణంలో రైతులకు కొత్త సమస్య వచ్చి పడింది. ఎరువు వేస్తే ఏపుగా పంట పెరుగుదల వరినాట్లలో ప్రధానంగా డీఏపీతో పాటు యూరియా వేస్తే వరినాట్లు బాగా నిలబడి, వరి పైరు ఏపుగా పెరిగేందుకు, పచ్చగా ఉండేందుకు అన్ని విధాలుగా పోషకాలు అందించేందుకు వీలవుతుందన్న ఉద్దేశ్యంతో రైతులు వరినాట్లు వేసే రోజునే యూరియా, డీఏపీ రెండూ కలిపి వేయడం ఆనవాయితీగా వస్తోంది. తుంగభద్ర ఆయకట్టు పరిధిలో లక్షలాది ఎకరాల్లో వరిసాగు చేస్తారని తెలిసినా కూడా ఆయకట్టు పరిధిలోని రైతులకు రసాయనిక ఎరువులను సిద్దం చేయడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు కింద నాలుగు జిల్లాల పరిధిలో ఆయా వ్యవసాయ శాఖ అధికారులు యూరియా కొరత లేదని పైకి చెబుతున్నారే కాని వాస్తవంగా రైతులకు తగినంత దొరకడం లేదని రైతు సంఘం నేతలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రూ.100లకు పైగా అధికంగా అందించిన వారికి అక్కడక్కడ కొంత మేరకు లభ్యం అవుతోందని తెలుస్తోంది. యథేచ్ఛగా యూరియా అమ్మకాలు బ్లాక్మార్కెట్లో యూరియా అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోకపోవడంతో యధేచ్ఛగా యూరియాను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత ఏర్పడుతుందని అధికారులకు, పాలకులకు ముందుగా తెలిసినా నిర్లక్ష్యంగా ఉండటంతోనే రైతులకు సమస్య ఏర్పడిందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో యూరియా కొరతపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారే కాని రైతులకు యూరియా సమస్య తీర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు గట్టి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. జూలై మొదటి వారం నుంచే తుంగభద్ర ఆయకట్టు పరిధిలో వరినాట్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఆయకట్టు పరిధిలో లక్షలాది ఎకరాల్లో ఎక్కడ చూసినా వరినాట్లు వేయడంలో రైతులు బిజీబిజీగా ఉన్నారు. ఈ సందర్భంలో రైతులకు అవసరమైన ఎరువులు అందించడంపై పాలకులు దృష్టి పెట్టకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల బాధలు వర్ణనాతీతం ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు మాధవరెడ్డి సాక్షితో మాట్లాడుతూ వరినాట్లలో యూరియా వేసేందుకు రైతులు పడుతున్న బాధలు వర్ణించలేని విధంగా ఉన్నాయన్నారు. యూరియా కొరత ఏర్పడుతుందని తాము ముందుగానే హెచ్చరించామన్నారు. అఽయితే అధికారులు సిద్ధం చేశామని చెబుతున్నారే కాని ఎక్కడ సిద్ధం చేశారని ప్రశ్నించారు. సిద్ధం చేసిన యూరియా బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు తగినంత యూరియా అందించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రైతు సమస్యలపై నైతిక బాధ్యత వహించాలన్నారు. తక్షణం సంబంధిత అఽధికారులు, పాలకులు చొరవ తీసుకుని రైతులను యూరియా సమస్య నుంచి గట్టెక్కించాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లాలో యూరియా డీలర్లు, రైతులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు. ఎరువుల కోసం అన్నదాతల అగచాట్లు బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్న వైనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కర్షకుల మండిపాటు సమస్యను పట్టించుకోని పాలకులు, అఽధికారులు -
భూ యజమానులపై దాడి తగదు
రాయచూరు రూరల్: భూ యజమానులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహంతేష్ కుమార్ మిత్ర ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరు తాలూకా గారలదిన్నిలో సుభద్రాదేవికి చెందిన సర్వే నంబర్ 308, 311, 312లలో 623 ఎకరాల భూమిని కొంత మంది లీజ్కు తీసుకొని వ్యవసాయం చేసేవారన్నారు. నేడు వారికి లీజుకు ఇవ్వక పోవడంతో భూముల్లోకి ఇతర యజమానులను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంలో గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ వారికి మద్దతు ఇస్తూ యరగేర సీఐ నింగప్ప, ఎస్ఐలకు కేసు నమోదు చేయరాదని ఆదేశించడాన్ని తప్పుబట్టారు. భూముల్లోకి వెళితే తమపై దాడులు చేస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని వారు ఎస్పీని కోరారు. -
భర్త పరలోకానికి, ఆమె కేరళకు
దొడ్డబళ్లాపురం: ఏదో ఒక కారణంతో కట్టుకున్న భర్తను హతమార్చడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. అదే మాదిరిగా ప్రియునితో కలిసి భర్తను కడతేర్చిన భార్య, మరో ఇద్దరిని దావణగెరె జిల్లా చన్నగిరి పోలీసులు అరెస్టు చేశారు. దంపతులు వేర్వేరుగా మిస్సింగ్.. జిల్లా ఎస్పీ ఉమాప్రశాంత్ కేసు వివరాలను వెల్లడించారు. లింగప్ప తల్లి యల్లమ్మ 2024 జనవరి 22న తన కుమారుడు ఇంటి నుంచి వెళ్లినవాడు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 10 రోజుల తరువాత లింగప్ప భార్య లక్ష్మి మిస్సయిందని ఆమె తల్లి మాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు కేసుల్లోనూ దర్యాప్తు చేపట్టారు. లింగప్ప, లక్ష్మికి పెళ్లయి 8 ఏళ్లు గడిచినా పిల్లలు కలగలేదు. లక్ష్మి వక్కతోటలో పనికి వెళ్తూ తిప్పేశ్ నాయక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడి గర్భం దాల్చింది. ఇది తెలిసిన లింగప్ప కడుపులో ఉన్నది తన బిడ్డ కాదని ఆగ్రహంతో కడుపు మీద కొట్టడంతో అబార్షన్ అయ్యింది. దీంతో లక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. తరువాత తిప్పేనాయక్ను కలిసి భర్తను హతమార్చాలని కుట్ర చేసింది. ఇద్దరూ సంతోష్ అనే మరో వ్యక్తి సహకారంతో లింగప్పను హతమార్చి భద్రా కాలువలో పడేసి కేరళకు పరారయ్యారు. సుమారు ఏడాదిన్నర నుంచి అక్కడే సంసారం కొనసాగిస్తున్నారు. పోలీసులు జాడ పసిగట్టి అరెస్టు చేశారు. ప్రియునితో కలిసి కాపురం ఏడాదిన్నర తరువాత అరెస్టు -
నాగదేవా.. పూజలందుకోవా
● భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి తుమకూరు: శ్రావణమాసంలో పరమ పవిత్రమైన నాగుల చవితి పర్వదినాన్ని అంతటా భక్తిశ్రద్ధలతో ఆచరించారు. మహిళలు మంగళవారం ఉదయం నుంచి నాగులకట్టలకు వెళ్లి పాలు పోసి నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. నాగుల కట్టలను, విగ్రహాలను పుష్పహారాలతో అలంకరించారు. తుమకూరు కోడిబసవన్న ఆలయం వెనుక అమానికెరెలోని నాగుల రాళ్లు, పుట్టలకు విశేష పూజలు చేశారు. నాగదోషాల నుంచి విముక్తిని ప్రసాదించాలని ప్రార్థించారు. బెంగళూరులోని రామేశ్వర ఆలయంలో నాగుల విగ్రహాలను పూజించారు. -
అద్దం తగలడంపై లారీ డ్రైవర్ ఆగ్రహం
హొసపేటె: ప్రైవేట్ బస్సు మినీ లారీ సైడ్ మిర్రర్ను తాకడంతో ఆగ్రహించిన లారీ డ్రైవర్ బస్సు డ్రైవర్పై పొడవైన కర్రతో దాడికి యత్నించిన ఘటన విజయనగర జిల్లా హొసపేటె తాలూకా చిలకనహట్టి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి– 50లో మంగళవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో జరిగింది. బెంగళూరు నుంచి రాయచూరుకు ఒక ప్రైవేట్ బస్సు వెళుతోంది. ఆ సమయంలో బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేస్తూండగా బస్సు లారీ అద్దాన్ని తాకింది. దీంతో కోపోద్రీక్తుడైన లారీ డ్రైవర్ బస్సు డ్రైవర్ను అడ్డుకుని కొడవలితో నరికివేస్తానని బెదిరించాడు. మినీ లారీ డ్రైవర్ అవాజ్ పొడవైన కర్ర పట్టుకుని బస్సు డ్రైవర్పై దాడి చేయడాన్ని స్థానికులు మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. తరువాత ఈ సంఘటన గురించి ఎస్పీ జాహ్నవికి సమాచారం ఇచ్చారు. నిందితుడు యమనప్పను మరియమ్మనహళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ౖ ప్రైవేట్ బస్సు డ్రైవర్పై దాడికి యత్నం -
మరోసారి లోకాయుక్త దాడులు
బనశంకరి: లంచాలు, అక్రమ సంపాదన రుచి మరిగిన ప్రభుత్వ అధికారులపై లోకాయుక్త ఆకస్మిక దాడులు జరిపింది. బెంగళూరు, హాసన్, చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేపట్టింది. కోట్లాది రూపాయల ఆస్తులు, నగదు, కిలోలకొద్ది బంగారు, వెండి ఆభరణాలు, విలాసవంతమైన భవనాలను గుర్తించింది. ఎవరెవరిపై దాడులు ● బెంగళూరు నగర రెవెన్యూ శాఖ అధికారి వెంకటేశ్, ● బీడీఏ కార్యాలయ సీనియర్ హార్టికల్చర్ డైరెక్టర్ ఓంప్రకాష్, ● జాతీయ రహదారులు (ఎన్హెచ్ఏఐ) హాసన్ విభాగం ఇంజినీర్ జయణ్ణ, ●చిక్కబళ్లాపుర జూనియర్ ఇంజనీర్ ఆంజనేయమూర్తి, ● చిత్రదుర్గ తాలూకా ఆరోగ్యాధికారి వెంకటేశ్ల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. చిత్రదుర్గలో టీహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్కు హిరియూరు పట్టణంలోని ఇల్లు, మరో గ్రామంలోని నివాసం, క్లినిక్లో తనిఖీలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే హైవే ఇంజినీర్ జయణ్ణ నివాసంపై లోకాయుక్త ఎస్పీ స్నేహ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. హాసన్ నగరంలో చెన్నపట్టణ హౌసింగ్ బోర్డులో జయణ్ణ నివాసం, భార్య ఇల్లు, హార్డ్వేర్ దుకాణం, మరో రెండు చోట్ల సోదాలు సాగించారు. అధికారుల ఇళ్లలో భారీ మొత్తాల్లో భూములు, స్థలాల పత్రాలు లభించాయి. వారం కిందటే 8 మంది అధికారుల ఇళ్లలో లోకాయుక్త ఆకస్మిక దాడులను జరపడం తెలిసిందే. అంతలోపే మరోసారి పంజా విసరడంతో అక్రమార్కుల్లో గుబులు నెలకొంది. 5 మంది అధికారుల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు అక్రమ సంపాదన ఫిర్యాదులే కారణం -
పంచ గ్యారెంటీలతో మహిళా సబలీకరణ
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంచ గ్యారెంటీల అమలుతో మహిళలు సబలీకరణ చెందారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సర్కార్ అమలు చేసిన పంచ గ్యారెంటీల అమలుపై ఉపన్యసించారు. త్వరలో జరగనున్న జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల విజయానికి కార్యకర్తలు కలిసికట్టుగా సైనికుల్లా పని చేయాలన్నారు. సమావేశంలో మహిళా జిల్లాధ్యక్షురాలు నిర్మల, శశికళ, జ్యోతి, శ్రీదేవి, నాగవేణి, ప్రతిభారెడ్డి, మంజుల, సురేఖ, చంద్రకళ, ఇందిర, మాల భజంత్రి తదితరులున్నారు. -
పులుల నేల
బనశంకరి: భారతదేశంలో అడవి రారాజుగా పేరుపొందిన పెద్ద పులుల సంతతి కన్నడనాట అలరాలుతోంది. విశాలమైన అడవులు, జీవ వైవిధ్యం పులుల సంరక్షణకు తోడ్పడుతోంది. పులి శాకాహార జంతువులను వేటాడి ఆహారం సమకూర్చుకుంటుంది. పులులు లేకపోతే శాకాహార జంతువుల సంఖ్య అధికమై అడవిలో సమతుల్యం లోపిస్తుందని నిపుణులు చెబుతారు. జూలై 29ని అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకొంటారు. 5 రక్షిత అరణ్యాలు రాష్ట్రంలో చామరాజనగర జిల్లాలో బండీపుర, బీఆర్టీ అడవులు, మైసూరు, కొడగు జిల్లాల్లో నాగరహోళె అడవులు, చిక్కమగళూరు వద్ద భద్ర అరణ్యం, ఉత్తర కన్నడ జిల్లాలో కాళీ అడవి పులుల రక్షిత ప్రదేశాలుగా ఉన్నాయి. 2022 లెక్కల ప్రకారం బండీపులో 150, నాగరహొళేలో 140, బీఆర్టీలో 37, భద్రలో 28, కాళీలో 17 పులులు ఉన్నట్లు అంచనా. శరీరం పై ఉండే పసుపు, నలుపు చారలను బట్టి పులిని ప్రత్యేకంగా గుర్తిస్తారు. పులులు సంరక్షణ సమయంలో అటవీ సిబ్బంది గాయాల పాలైనా సహించి విధుల్లో పాల్గొంటారు. రెండవ స్థానంలో కన్నడనాట ప్రపంచంలోనే అత్యధిక పులులు కలిగిన దేశం భారత్. సుమారు 600 పులులతో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో, 563 పులులతో రెండోస్థానంలో కర్ణాటక ఉండడం గమనార్హం. పెద్ద పులి వారానికి కనీసం 200 కిలోలు మాంసం భుజిస్తుంది. పుట్టిన 3–4 ఏళ్ల కు పరిపక్వతకి వస్తుంది. ఆడ పులి గర్భధారణ సమయం 110 రోజులు. 2 నుంచి 5 కూనలకు జన్మనిస్తుంది. అవి రెండేళ్ల వరకు తల్లి పులి వెంట తిరుగుతూ జీవన మెళకువలను పెంచుకుంటాయి. మరణాలూ అధికమే అయితే పులుల మరణాలుకూడా గణనీయంగా ఉంది. ఇటీవల చామరాజనగర జిల్లాలో పురుగుల మందు పెట్టి 5 పులులను చంపడం తెలిసిందే. జాతీయ పులి సంరక్షణా ప్రాధికార (ఎన్టీసీఏ) వివరాల ప్రకారం రాష్ట్రంలో 2021లో 15 పులులు, 2022లో 19, 2023లో 12, 2024లో 13, 2025లో 7 నెలల్లో 10 పులులు మృత్యవాత పడ్డాయి. బండీపుర అడవిలో పులి సఫారీ రాష్ట్రంలో 563 పెద్దపులులు దేశంలో రెండవ స్థానం 4 జిల్లాల్లో 5 అరణ్యాల్లో ఆవాసం మాకు దైవ సమానం పులిని దేవునిలా పూజిస్తామని, కీర్తిస్తూ జానపద పాటలు పాడతామని, పులితో అవినాభావ సంబంధం ఉందని, తమ ద్వారా పులుల గురించి జ్ఞానాన్ని అటవీశాఖ పరిశోధకులు తెలుసుకోవాలని బిళిగిరి రంగనబెట్ట బుడకట్టు గిరిజన అభివృద్ధి సంఘం కార్యదర్శి డాక్టర్ సీ.మాదేగౌడ తెలిపారు.