Karnataka
-
రైలు పట్టాలపై సిలిండర్, స్టవ్
బెంగళూరు: రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్, స్టవ్ కనిపించడంతో పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. మద్దూరు–చెన్నపట్టణ రైల్వే మార్గంలో ఇది జరిగింది. సోమవారం ఉదయం ఖాళీ గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్, కొన్ని బట్టలు కలిగిన మూట ఒకటి రైలు పట్టాల ఉంది. మైసూరు నుంచి బెంగళూరు వస్తున్న మంగళ ఎక్స్ప్రెస్ రైలు లోకోపైలట్ వాటిని చూసి రైలును నిలిపివేశాడు. రైలులో ప్రయాణికులు తీసుకువెళ్తున్న ఈ వస్తువులు అనుకోకుండా జారిపడి ఉంటాయని అనుమానిస్తున్నారు. లేదా ఎవరైనా కావాలనే సిలిండర్ను పట్టాలపై ఉంచారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వల్ల కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. -
పోలిక లేదని సొంత కొడుకును చంపిన తండ్రి
సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లాలో ఘోర దురంతం చోటు చేసుకుంది. తన పోలిక లేదనే అనుమానంతో సొంత కొడుకును నదిలోకి తీసుకెళ్లి ఓ తండ్రి నీటిలో ముంచి దారుణంగా చంపిన ఘటన జిల్లాలోని నాగఠాణ గ్రామంలో చోటు చేసుకుంది. నాగఠాణకు చెందిన సిద్ధార్థ (6) హత్యకు గురైన చిన్నారి. బాలుడు తండ్రి మల్లికార్జున అరకేరిని పలువురు మీ కుమారుడు సిద్ధార్థ చూడటానికి నీలాగా లేడని ఎద్దేవా చేసేవారు. దీన్ని రోజు వింటున్న మల్లికార్జున అక్కసుతో సొంత బిడ్డను నదిలో ముంచి చంపాడు. మహారాష్ట్రలోని కరాడ్ జిల్లా వడోలి వద్ద కృష్ణా నదిలోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మార్చి 16న కుమారుడిని సదరు నదిలోకి తీసుకెళ్లి ముంచి చంపి తిరిగి ఊరికి వచ్చిన మల్లికార్జునను కొడుకు గురించి ఆరా తీయగా సింధగి వద్ద స్కూల్లో చేరి్పంచి హాస్టల్లో పెట్టానని నాటకమాడాడు. ఇక మే 1న సిద్ధార్థ్ పుట్టిన రోజు ఉంది. తీసుకొని రమ్మని తల్లి భాగ్యశ్రీ పట్టుబట్టింది. కొడుకు ఏడి? అని నిలదీయగా నిందితుడు మల్లికార్జున పరారయ్యాడు. దీంతో తల్లి భాగ్యశ్రీ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కుమారుడిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు తానే హత్య చేసినట్లు అంగీకరించాడని, దీంతో మల్లికార్జునను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
కన్న కూతురినే కడతేర్చిన తల్లి… ఆపై ఆత్మహత్య
బెంగళూరు: ఏం కష్టం వచ్చిందో గానీ కూతురిని చంపి, ఆపై తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఎంత ఆపద వచ్చినా పిల్లలను కాపాడుకోవాల్సిన అమ్మ గుండె రాతిగా మారింది. ఈ దుర్ఘటన సిలికాన్ సిటీలో వైట్ఫీల్డ్ ఠాణా పరిధిలోని ఇమ్మడిహళ్లిలో మంగళవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాలు.. సువర్ణ (40), ఆమె కుమార్తె కారుణ్య (14) మృతులు. ఓ ఇంటిలో సువర్ణ కుటుంబం నివసిస్తోంది. మొదట కుమార్తెను గొంతుపిసికి చంపింది, ఆపై ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నుంచి ఇంట్లో అలికిడి లేకపోవడంతో ఇరుగు పొరుగుకు అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఏదో జరిగినట్లు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి చూడగా తల్లీ కూతురు శవాలు కనిపించాయి. క్లూస్ టీంతో ఆధారాల కోసం గాలించారు. అక్కడ ఎలాంటి డెత్నోట్ దొరకలేదని సమాచారం. కారణాలపై సందిగ్ధం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారణాలపై బంధుమిత్రులను విచారిస్తున్నారు. కుటుంబ సమస్యలా, ఆర్థిక ఇబ్బందులా, లేక మరేమైనా ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది. ఈ దుర్ఘటనతో ఇమ్మడిహళ్లిలో విషాదం నెలకొంది. -
అన్నీ ఆలోచించే.. నజీర్ తొలగింపు
బనశంకరి: సీఎం సిద్దరామయ్య వివిధ మూలాల నుంచి సమాచారం సేకరించి పార్టీ హితం కోసం నజీర్ అహ్మద్ విషయంలో నిర్ణయం తీసుకున్నారని డీసీఎం డీకే.శివకుమార్ అన్నారు. కేపీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రాజకీయ కార్యదర్శి పదవి నుంచి నజీర్ అహ్మద్ను తొలగిస్తూ సీఎం ఆదేశాలిచ్చారని తెలిపారు. ‘నజీర్ అహ్మద్కు దావణగెరె దక్షిణకు వెళ్లి రెబెల్ అభ్యర్థిని తప్పించేలా చూడాలని పార్టీ సూచించింది. కానీ అతను బాధ్యత నిర్వర్తించలేకపోయారు. అక్కడ ఏం జరిగిందనేది నాకు నివేదిక అందాలి’ అని డీకే చెప్పారు. ఏ పార్టీలో అయినా క్రమశిక్షణ ముఖ్యం, అందరితో చర్చించే అక్కడ అభ్యర్థిని ఎంపిక చేసినట్లు తెలిపారు. అందరితో ఎన్నికల గురించి చర్చించడం పార్టీ అధ్యక్షునిగా నా కర్తవ్యమన్నారు. ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి మంత్రి పదవి అడగటం తప్పులేదని, కానీ జాగ్రత్తగాను, క్రమశిక్షణగా ఉండాలని సూచించారు. డీసీఎం శివకుమార్ -
జయహో అంబేడ్కర్
● రాష్ట్రమంతటా వైభవంగా జయంతి సంబరాలు శివాజీనగర: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ 135వ జయంతిని రాష్ట్రమంతటా వైభవంగా ఆచరించారు. అంబేడ్కర్ నిలువెత్తు రూపాలతో భారీ ఊరేగింపులు జరిగాయి. బెంగళూరులో విధానసౌధ ముందున్న అంబేద్కర్ విగ్రహానికి సీఎం సిద్దరామయ్య నివాళులర్పించారు. పెద్దసంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, దళిత మేధావులు పాల్గొన్నారు. కేపీసీసీ, బీజేపీ, జేడీఎస్ ఆఫీసుల్లోనూ జయంతి వేడుకలు జరిగాయి. -
హంతక హిప్పో మృత్యువాత
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని త్యావరెకొప్ప పులి–సింహాల అభయారణ్యంలో యువ పశు వైద్యురాలు సమీక్షారెడ్డి మృతికి కారణమైన హంసిని (12) అనే ఆడ నీటి ఏనుగు (హిప్పో పోటామస్) మంగళవారం అనారోగ్యంతో మరణించింది. గర్భంతో ఉన్న హిప్పో గడువు దాటినా ప్రసవం కాలేదు. దీంతో 10వ తేదీన పశువైద్యులు దానికి వైద్య పరీక్షలు చేశారు. హంసిని గర్భాశయంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది. గర్భాశయంలోనే పిండం చనిపోయి ఉందని తేలింది. అప్పటి నుంచి చికిత్స అందిస్తున్నా ఇన్పెక్షన్ ఇతర అవయవాలకు వ్యాపించి మధ్యాహ్నం 3:30 గంటలకు మరణించిందని అటవీ ఉన్నతాధికారులు తెలిపారు. కొన్నివారాల కిందట ఈ హిప్పోకు వైద్యం చేస్తున్న బెంగళూరు పశువైద్యురాలు సమీక్షారెడ్డిపై అది దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాలతో మరణించడం తీవ్ర సంచలనం కలిగించింది. బస్సులో రూ.4 లక్షల నగల చోరీ మైసూరు: ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ వ్యానిటీ బ్యాగ్ నుంచి ఇద్దరు గుర్తు తెలియని మహిళలు రూ.4 లక్షల విలువైన బంగారు నగలను దోచేశారు. వివరాలు.. నంజనగూడువాసి గౌరమ్మ మైసూరులో బంధువుల పెళ్లికి వచ్చింది. తరువాత జాకీ క్వార్టర్స్ వద్ద పుట్టేగౌడన హుండికి వెళ్లే ప్రైవేట్ బస్సు ఎక్కింది. ఆ సమయంలో ఆమె పక్కనే ఇద్దరు గుర్తు తెలియని మహిళలు కూర్చొన్నారు. కొంతసేపటికి దిగిపోయారు. మరో స్టాప్ వద్ద దిగిన గౌరమ్మ బ్యాగు చూసుకోగా బంగారం కనిపించలేదు. దీంతో వెంటనే ఓ ఆటోలోనే ఆ బస్సును అనుసరిస్తూ వెళ్లి టీ.నరసీపుర వద్ద బస్సును ఆపి పరిశీలించగా ఆ మహిళలు కనబడలేదు. కండక్టర్ను విచారించగా వారిద్దరూ మేగళాపుర వద్ద బస్సు దిగారని చెప్పాడు. బాధితురాలు వరుణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. టూర్కి వెళ్లగా, ఇల్లు గుల్ల తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు వార్డు రోబ్లో ఉన్న రూ.2.76 లక్షల విలువైన బంగారు నగలను ఎత్తుకెళ్లారు. మైసూరులోని హళె కెసరె వద్ద ఉన్న టీచర్ బడావణె నివాసి మహేష్రావ్, కుటుంబంతో కలిసి ధర్మస్థల, ఉడుపి ప్రాంతాల టూర్కి వెళ్లారు. మూడో రోజు మహేష్ సోదరుడు రాకేష్ ఇంటి వద్దకు వెళ్లి చూడగా తలుపులు పగలగొట్టి ఉండడంతో చోరీ బయటపడింది. నరసింహరాజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఊయలే ఉరితాడై.. బాలిక మృతి యశవంతపుర: ఇంటిలో సరదాగా ఊయల ఊగుతుండగా గొంతుకు బిగుసుకుని లేఖన (10) అనే చిన్నారి ఊరిపి తీసింది. చిక్కమగళూరు తాలూకా హెబ్బళ్లి గ్రామంలో జరిగింది. బాలిక ఇంటిలో తల్లిదండ్రులు లేని సమయంలో చీరతో ఊయల కట్టుకుని ఊగుతోంది. అయితే చీర కాలుకు చుట్టుకుని గొంతుకు బిగుసుకుంది. దీంతో ఉపిరాడక చిన్నారి మరణించింది. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు కూతురిని అలా చూసి కన్నీరుమున్నీరయ్యారు. చిక్కమగళూరు గ్రామాంతర పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లి రాతి హృదయం ● కుమార్తెను చంపి, ఆపై ఆత్మహత్య ● బెంగళూరు వైట్ఫీల్డ్లో విషాదం బనశంకరి: ఏం కష్టం వచ్చిందో గానీ కూతురిని చంపి, ఆపై తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఎంత ఆపద వచ్చినా పిల్లలను కాపాడుకోవాల్సిన అమ్మ గుండె రాతిగా మారింది. ఈ దుర్ఘటన సిలికాన్ సిటీలో వైట్ఫీల్డ్ ఠాణా పరిధిలోని ఇమ్మడిహళ్లిలో మంగళవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాలు.. సువర్ణ (40), ఆమె కుమార్తె కారుణ్య (14) మృతులు. ఓ ఇంటిలో సువర్ణ కుటుంబం నివసిస్తోంది. మొదట కుమార్తెను గొంతుపిసికి చంపింది, ఆపై ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నుంచి ఇంట్లో అలికిడి లేకపోవడంతో ఇరుగు పొరుగుకు అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఏదో జరిగినట్లు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి చూడగా తల్లీ కూతురు శవాలు కనిపించాయి. క్లూస్ టీంతో ఆధారాల కోసం గాలించారు. అక్కడ ఎలాంటి డెత్నోట్ దొరకలేదని సమాచారం. కారణాలపై సందిగ్ధం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారణాలపై బంధుమిత్రులను విచారిస్తున్నారు. కుటుంబ సమస్యలా, ఆర్థిక ఇబ్బందులా, లేక మరేమైనా ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది. ఈ దుర్ఘటనతో ఇమ్మడిహళ్లిలో విషాదం నెలకొంది. -
సొగసుల వర్ణచిత్రాలు
● చిత్రకళా పరిషత్లో ముగ్ధుల్ని చేసే పెయింటింగ్స్ బనశంకరి: బెంగళూరు చిత్రకళా పరిషత్లో బృంద చిత్రలేఖన ప్రదర్శన కళాప్రియులను అబ్బురపరుస్తోంది. పరిషత్లో గ్యాలరీ–2లో ఏ మెసర్ ఆఫ్ మెనీ పేరుతో బ్లిందా ఫెర్నాండేజ్ నేతృత్వంలో 20 మంది వర్ధమాన చిత్రకారుల పెయింటింగ్స్తో ప్రదర్శన ఏర్పాటైంది. కళాకారులు ప్రకృతి, పర్యావరణం, పల్లె జీవనం, పువ్వులు, పక్షులు, మహిళలను ఇతివృత్తంగా చేసుకుని కళాకారులు తమ మనసులోని భావాలను కుంచె ద్వారా నవ్యమైన చిత్రాలకు జీవం పోశారు. పల్లె జీవనంలో మహిళలు, జలాశయాల్లో విదేశీ పక్షులు, తామరపువ్వులు, ఆంగ్ల మహిళల చిత్రలేఖనాలు ఔరా అనిపిస్తాయి. చిత్రకారిణులు దివ్య మురళి, హెన్నా బజాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన 19వ తేదీ వరకు జరుగుతుంది. -
మే నెలాఖరులోపు అన్ని గేట్లను ఏర్పాటు చేస్తాం
సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు తాగు, సాగునీరు అందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాంకు మే నెలాఖరులోపు అన్ని కొత్త గేట్లను ఏర్పాటు చేస్తామని తుంగభద్ర బోర్డు ఎస్ఈ నారాయణ నాయక్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్, నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రధానంగా గేట్లు ఏర్పాటు, మరమ్మతులు చేయడంలో దిట్టగా ఖ్యాతి పొందిన కన్నయ్యనాయుడుతో కలిసి తుంగభద్ర గేట్ల ఏర్పాటు పనులను పరిశీలించారు. గేట్లు ఏర్పాటుకు సంబంధించి ఆయన సలహాలు, సూచనలను చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్యాంకు ఉన్న 33 గేట్లలో అన్ని గేట్లను మారుస్తున్నామన్నారు. ప్రస్తుతం 23 గేట్లు అమర్చే కార్యక్రమం పూర్తియిందన్నారు. మరో మూడు గేట్ల పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. మొత్తం మీద మే నెలాఖరులోపు కచ్చితంగా అన్ని గేట్లను అమర్చేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి రోజు గేట్లు అమర్చే ప్రక్రియను ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పనులు వేగవంతంగా చేయడంతో 23 గేట్ల పనులు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మరో 10 గేట్లను అమర్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో డ్యాం నుంచి కాలువలకు నీరు విడుదల చేసే లోపు పనులు పూర్తి చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. బోర్డు కార్యదర్శి ఓఆర్కే రెడ్డి, డ్యాం ఇంజనీర్లు, ఎస్డీఓలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్లో ఆయకట్టు కాలువలకు నీటి విడుదలకు ఢోకా లేదు తుంగభద్ర బోర్డు ఎస్ఈ నారాయణ నాయక్ వెల్లడి -
బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్
బళ్లారిలో అంబేడ్కర్ ప్రతిమకు మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్రెడ్డి పుష్పాంజలి బళ్లారిలో అంబేడ్కర్ ప్రతిమకు గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర పుష్పాంజలిబళ్లారిలో అంబేడ్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే భరత్రెడ్డి నమస్సుమాంజలి సాక్షి,బళ్లారి: బడుగుల ఆశాజ్యోతి డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ జయంతి కేవలం ఒక వేడుక కాదు, సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణకు గుర్తు అని పలువురు వక్తలు కొనియాడారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా వేడుకగా నిర్వహించారు. హొసపేటె రోడ్డులోని అంబేడ్కర్ భవన్ వద్ద డాక్టర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర, జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, ఎస్పీ సుమన పన్నేకర్, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, మాజీ మేయర్ వెంకటరమణ, మేయర్ గాదెప్ప, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజు తదితర ప్రముఖులు, దళిత సమాజ ప్రముఖుడు హనుమంతప్ప, పలువురు కార్పొరేటర్లు, దళిత సమాజ నాయకులు, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అంతకు ముందు బైక్ ర్యాలీతో పాటు అంబేడ్కర్ చిత్రపటాన్ని భారీ ఊరేగింపు చేపట్టి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, జానపద నృత్యాలు చేస్తూ సంబరాల్లో మునిగితేలారు. అంబేడ్కర్ అడుగు జాడల్లో నడుద్దాం హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె నగరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అంబేడ్కర్ సర్కిల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి నిర్వహించారు. మంగళవారం అంబేడ్కర్ ప్రతిమకు జిల్లాధికారి కవిత ఎస్.మన్నికేరి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాల్యం నుంచి సమాజంలో వివక్షత కారణంగా ఎన్నో సవాళ్లను అంబేడ్కర్ ఎదుర్కొన్నారన్నారు. అయినా తన కలలను, ఆశయాలను ఎన్నడూ వీడలేదన్నారు. విజయానికి విద్య కీలకం అని బలంగా విశ్వసించారన్నారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ అక్రమ్ నోంగ్జాయ్ షా, ఎస్పీ జాహ్నవి, అసిస్టెంట్ కమిషనర్ వివేక్, అధికారులు మనోహర్, ఎర్రగుడి శివకుమార్, తహసీల్దార్ శృతి, అంబేడ్కర్ సంఘం నేతలు వీరస్వామి, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తుకు అంబేడ్కర్ ఆలోచనలు కీలకం ఆధునిక భారత దేశ పునర్ నిర్మాణానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలు కీలకం అని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డీవీ పరమ శివమూర్తి తెలిపారు. హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయం క్రియాశక్తి భవనంలోని సిండికేట్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడారు. దేశ ఆర్థిక, సామాజిక, మతపరమైన వ్యవస్థలపై ఆయన సూత్రాలు గణనీయమైన ప్రభావాన్ని చూపాయన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విరుపాక్షి పూజారహళ్లి, ఉపకులపతి గురుబసప్ప, విద్యార్థులు పాల్గొన్నారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని ఘనంగా ఆచరించారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద అంబేడ్కర్ ప్రతిమకు ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, మాన్విలో శాసన సభ్యుడు హంపయ్య నాయక్, దేవదుర్గలో శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ అరుణాంగ్శు గిరి పూలమాలలు వేసి బుద్ధం శరణం గచ్ఛామి పంచాంగాన్ని పఠించారు. పార్టీ కార్యాలయంలో.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పార్టీ నేతలు సరళంగా జరిపారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగి, బీజేపీ కార్యాలయంలో అధ్యక్షుడు వీరనగౌడ, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పూలమాలలు వేశారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రతిమకు ఎస్డీపీఐ సభ్యులు సయ్యద్ ఇషాఖ్ హుసేనీ పూలమాల వేసి నివాళి అర్పించారు. బడుగు వర్గాల ఆశాకిరణం సమాజంలో బడుగు, దళిత వర్గాల ఆశాకిరణం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ అభిప్రాయపడ్డారు. మంగళవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో 135వ అంబేడ్కర్ జయంతిని ప్రారంభించి మాట్లాడారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం జీవితాంతం పోరాటం చేసిన మహా యోధుడన్నారు. ప్రపంచ మేధావుల్లో ఒకరని, అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామన్నారు. ఎస్పీ అరుణాంగ్శు గిరి, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఏసీ హంపణ్ణ, తహసీల్దార్ సురేష్ వర్మ, ఏడీసీ శివానంద, కృష్ణలున్నారు. వివక్షతపై గళమెత్తి విజయం సాధించిన మహోన్నతుడు సమానత్వం కోసం పోరాడిన మహానుభావుడు అంబేడ్కర్ 135వ జయంతిలో పలువురు వక్తల ప్రశంసలు -
నేడు సిటీలో ఐపీఎల్ మ్యాచ్
బనశంకరి: నేడు బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ – లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ వసతుల మార్పు చేశారు. కబ్బన్ పార్కు లోపల కింగ్ రోడ్డు, ప్రెస్క్లబ్ ముందు, బాలభవన్ ముందు, ఫౌంటెన్ రోడ్లలో వాహనాల పార్కింగ్ను నిషేధించారు. అంధ విద్యార్థి నిజాయతీ● సొంతదారుకు క్యాష్ బ్యాగ్ అప్పగింత హొససేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలో ప్రయాణ సమయంలో తన వద్దకు వచ్చిన రూ.లక్ష నగదు కలిగిన ఓ బ్యాగ్ను ఒక అంధ విద్యార్థి పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసులు ఆ బ్యాగ్ను సొంత దారుకు అప్పగించారు. వివరాలు.. దావణగెరె జిల్లా హరపనహళ్లికి వెళుతున్న మార్గంలో లెక్చరర్ ధనుంజయకు చెందిన రూ.లక్షల నగదు కలిగిన ఓ బ్యాగ్ను తెలగి గ్రామానికి చెందిన అంధ విద్యార్థి హాలేష్ బ్యాగ్తో పొరపాటున మారిపోయింది. హాలేష్ రూ.లక్ష ఉన్న నగదున్న ఆ బ్యాగ్ను హరపనహళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు ధనుంజయను గుర్తించి అతడి డబ్బును, బ్యాగ్ను తిరిగి అందజేశారు. హాలేష్ పీయూసీ చదువుతున్నాడు. అతడు చూపించిన నిజాయితీని అందరూ అభినందించారు. -
ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన
సాక్షి,బళ్లారి: ఆర్టీసీ బస్సును బ్రేకులు లేకుండా నడపడంతో ఒక యువకుడు మృతి చెందడంతో పాటు మరొక యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులతో పాటు పలువురు స్థానిక ప్రముఖ నాయకులు హాజరై ఆందోళన చేపట్టారు. సోమవారం ఆర్టీసీ బస్సు ఢీకొని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని ఉంతకల్లు గ్రామానికి చెందిన రవికిరణ్(18) మృతి చెందగా, ఆకాష్ అనే మరొక విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే పాలకులు గాని, అధికారులు గాని మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించక పోగా, తీవ్రంగా గాయపడిన ఆకాష్ వైద్యం గురించి పట్టించుకోకపోవడంతో మాజీ మేయర్ వెంకటరమణ, బీజేపీ నాయకుడు గాదిలింగప్ప తదితరులు పెద్ద ఎత్తున జనంతో చేరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. బ్రేకులు లేకుండా బస్సు నడపడంపై ఆగ్రహం బ్రేకులు లేకుండా బస్సును ఎందుకు నడిపారని మండిపడ్డారు. అమాయకుడైన విద్యార్థి ప్రాణాలు పోయాయని, ఇందుకు ఎవరు బాధ్యులని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించిన వారు లేరన్నారు. గాయపడిన విద్యార్థి వైద్యానికి ఖర్చులు ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. బస్టాండు వద్ద బస్సుల రాకపోకలను ఆపేశారు. రెండు గంటల పాటు బస్సుల రాకపోకలను నిలిపివేసి ఆందోళన చేశారు. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆందోళనకారులతో చర్చించారు. బాధిత కుటుంబానికి పరిహారం అందిస్తామని, గాయపడిన ఆకాష్కు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రామాంజినేయులు, ఉమెన్ రైట్స్ యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు. రెండు గంటల పాటు ధర్నా బస్సుల రాకపోకలను అడ్డుకొని నిలిపేసిన వైనం బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఒత్తిడి ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు -
భక్తిశ్రద్ధలతో కుంటి మారెమ్మవ్వకు పూజలు
సాక్షి,బళ్లారి: గుగ్గరహట్టిలో వెలసిన కుంటి మారెమ్మవ్వకు మంగళవారం విశేష పూజలతో పాటు సుమారు 8 వేల మంది భక్తులకు అన్నదానం నెరవేర్చారు. స్థానిక ప్రముఖులు కమల్ సూరి కుటుంబ సభ్యుల సారథ్యంలో కుంటి మారెమ్మవ్వకు తెల్లవారు జాము నుంచి ప్రత్యేక పూజ విశేష కార్యక్రమాలు నెరవేర్చారు. ఈ పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పాల్గొన్నారు. మొత్తం మీద ఉదయం నుంచి మంగళవారం అంతా మారెమ్మ అవ్వ గుడి ప్రాంగణం భక్తులతో కోలాహలంగా, సందడిగా కనిపించింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు సుమారు 8 వేల మందికి అన్నదానం -
ఆగి ఉన్న లారీని బస్సు ఢీ
తుమకూరు: జిల్లాలోని శిరా తాలూకాలో ద్వారలు వద్ద 48వ హైవేలో మంగళవారం ఉదయం కేఎస్ ఆర్టీసీ బస్సు నిలిచి ఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో బస్సు డ్రైవర్, మరో ప్రయాణికుడు చనిపోయారు. లారీ ఏదో సమస్య వచ్చి వంతెనపై నిలిచి ఉండగా, బస్సు వేగంగా వచ్చి ఢీకొనింది, దీంతో బస్సు ముందు భాగం తుక్కయింది, బస్సు డ్రైవర్ శ్రీకాంత్ (50), గుర్తుతెలియని ప్రయాణికుడు అక్కడే మరణించారు. బస్సులోని సుమారు 33 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 23 మందికి ఎక్కువ గాయాలు కావడంతో తుమకూరు జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. ముగ్గురికి చిత్రదుర్గ ఆసుపత్రిలో, ఒకరు శిర ఆసుపత్రిలో ఉన్నారు. తావరకెరె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రమాదం వల్ల రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. బస్సు డ్రైవర్, మరొకరు మృతి 33 మందికి గాయాలు తుమకూరు జిల్లాలో విషాదం -
అంగన్వాడీ కార్యకర్తలకు నెల రోజులు సెలవులివ్వాలి
రాయచూరు రూరల్: అంగన్వాడీ కార్యకర్తలకు వేసవి కాలంలో అధికంగా ఎండలుండడంతో నెల రోజులు సెలవులివ్వాలని రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సీ్త్ర శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న కార్యకర్తలకు సెలవులు కేటాయించి, బీఎల్ఓ విధుల నుంచి తొలగించాలన్నారు. జనాభా లెక్కల గణన నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి రాయచూరు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న జెడ్పీ, టీపీ, జీపీల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహేంద్రకుమార్ మిత్ర డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జెడ్పీ, టీపీ సభ్యుల పదవీ కాలం ముగిసి మూడేళ్లు కావస్తున్నా నేటికీ ఎన్నికలు జరుపకుండా వాయిదా వేయడం తగదన్నారు. జెడ్పీ, టీపీ సభ్యుల ఎన్నికలను పార్టీ పరంగా కాకుండా జీపీ ఎన్నికల మాదిరిగా పార్టీలతో నిమిత్తం లేకుండా ఎన్నికలు త్వరగా నిర్వహించాలని లేని తరుణంలో హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేస్తామన్నారు. అసంఘటిత కార్మికులకు వేతనాలు చెల్లించాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. మంగళవారం రాయచూరు తాలూకా పంచాయితీ కార్యాలయం వద్ద సంఘం అధ్యక్షుడు శరణ బసవ మాట్లాడారు. కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారిపై చేస్తున్న దౌర్జన్యాలు నశించాలన్నారు. నేడు అన్ని విధాలైన వస్తువుల ధరలు మార్కెట్లో అధికం కావడంతో వేతనాలను పెంచాలన్నారు. అసంఘటిత వలయాల్లో విధులు నిర్వహించే కార్మికులకు నెలకు రూ.37 వేల నుంచి రూ.42 వేల వరకు వేతనాలు చెల్లించేలా సర్కార్ ఆదేశించాలని కోరుతూ సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. తాగునీటి ఎద్దడి రానీయకండి రాయచూరు రూరల్: వేసవిలో మూడు నెలల పాటు ధార్వాడ జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ధార్వాడ జిల్లాధికారిణి ఆర్.స్నేహల్ అధిరులకు సూచించారు. జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 14 గ్రామాల్లో నీటి సరఫరాలో నెలకొన్న జాప్యాన్ని నివారించాలన్నారు. ధార్వాడ జిల్లాలో 90 గ్రామాలకు తాగునీటి ఎద్దడి ఉన్నట్లు గుర్తించామన్నారు. 185 బోరుబావులను తవ్వించి యజమానుల నుంచి గ్రామాలకు సంబంధిత నీటి సరఫరా చేపట్టాలని, విద్యుత్ కోత, మోటార్ల మరమ్మతు, ఇతరత్ర కారణాలు చెప్పకుండా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలను నింపాలని పీడీఓలకు ఆదేశాలు జారీ చేయాలని టీపీ అధికారులకు సూచించారు. ధార్వాడ తాలూకాలో 115 గ్రామాలకు గాను 30 గ్రామాలు, హుబ్లీ తాలూకాలో 46కు గాను 19 గ్రామాలు, కలఘటిగి తాలూకాలో 87 గ్రామాల్లో 16 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా పరిగణించామన్నారు. గంజాయి సేవిస్తున్న ఐదుగురి అరెస్ట్ రాయచూరు రూరల్: గంజాయిని సేవిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన ఘటన బెళగావి జిల్లాలో జరిగింది. బెళగావిలో సోమవారం సాయంత్రం హిరే బాగేవాడి పోలీసులు మెరుపు దాడి చేసి అభిషేక్ దౌలత్ పాటిల్, విలాస్ శంకర్ బాళేకుంద్రి, విజయ్ సంజయ్, హర్శ సునీల్ వర్మ, హుసేన్ ఓబన్సాబ్ అనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ బసవరాజ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
రెండు లారీలు ఢీ.. ఇద్దరు దుర్మరణం
సాక్షి,బళ్లారి: చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.మంగళవారం చిత్రదుర్గ జిల్లా భరమసాగర సమీపంలోని కల్కుంటి గ్రామ వద్ద జాతీయ రహదారిలో రెండు లారీలు ముఖాముఖీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. చిత్రదుర్గ జిల్లా నుంచి దావణగెరె వైపు వెళుతున్న లారీ డ్రైవర్ అదుపు తప్పి డివైడర్ను దాటి దావణగెరె నుంచి చిత్రదుర్గ వైపునకు వస్తున్న లారీని ఢీకొనడంతో రెండు లారీల్లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మహాంతేష్(35), ఇనాయత్ సింగ్(30)గా గుర్తించారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స చోసం చిత్రదుర్గ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే భరమసాగర పోలీసులు హుటాహుటిన చేరుకుని కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరించారు. పిడుగుపాటుకు ఎద్దు మృతి ●బొప్పాయి పంట ధ్వంసం హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగిలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పిడుగుపాటుకు ఒక ఎద్దుతో పాటు బొప్పాయి తోట దెబ్బ తింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో పాటు కూడ్లిగితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా అనేక చోట్ల రైతుల పంటలు దెబ్బతిన్నాయి. అమరదేవరగుడ్డ, గొల్లరహట్టి, బణవికల్లు ఆగ్రహార గ్రామంతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన, చేతికొచ్చిన దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. మొరబనహళ్లికి చెందిన ఈరణ్ణ అనే రైతుకు చెందిన ఎద్దుపై పిడుగుపడి స్థలంలోనే ఎద్దు మరణించింది. మంత్రి పదవి కోరడంలో తప్పు లేదుహుబ్లీ: గెలిచిన వారందరూ మంత్రి పదవి పొందడానికి అర్హులే. మంత్రి పదవి ఇవ్వమని కోరడంలో తప్పు లేదని, అయితే పార్టీ ప్రోటోకాల్కు స్వస్తి చెప్పి ఏమీ వా్య్ఖ్యానించరాదని జిల్లా ఇన్చార్జి మంత్రి సంతోష్లాడ్ సూచించారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలందరూ మంత్రి గిరీ పొందడానికి అర్హులు. వారు ఒకసారి గెలిచినా, రెండు సార్లు గెలిచినా ఎవరైనా కానీ ఎన్ని సార్లు గెలిచినా వారికి మంత్రి కావాలన్న ఆశ ఉంటుంది. అందుకే వారికి ప్రాధ్యానత ఇవ్వాలని హైకమాండ్ దగ్గరకు వెళ్లారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఇంతకు ముందు కాంగ్రెస్సే లోక్సభలో పాస్ చేయించింది. రాజ్యసభలో కూడా ప్రయత్నించాం. అయితే రాజ్యసభలో మెజార్టీ లేదు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం వచ్చి 12 ఏళ్లు గడిచింది. ఈ విషయమై గత 12 ఏళ్ల నుంచి ఎవరూ మాట్లాడలేదన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయినా బిల్లుకు మా మద్దతు ఉంది. బిల్లు గురించి గందరగోళం ఉంది. కొత్త జనగణను పరిగణిస్తారో లేదో స్పష్టత లేదు. ఈ విషయంలో సమగ్రంగా చర్చలు జరగాలన్నారు. పోలిక లేదని సొంత కొడుకును చంపిన తండ్రి ● నదిలోకి తీసుకెళ్లి నీటిలో ముంచిన వైనం ● విజయపుర జిల్లాలో వెలుగు చూసిన ఘోరం సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లాలో ఘోర దురంతం చోటు చేసుకుంది. తన పోలిక లేదనే అనుమానంతో సొంత కొడుకును నదిలోకి తీసుకెళ్లి ఓ తండ్రి నీటిలో ముంచి దారుణంగా చంపిన ఘటన జిల్లాలోని నాగఠాణ గ్రామంలో చోటు చేసుకుంది. నాగఠాణకు చెందిన సిద్ధార్థ (6) హత్యకు గురైన చిన్నారి. బాలుడు తండ్రి మల్లికార్జున అరకేరిని పలువురు మీ కుమారుడు సిద్ధార్థ చూడటానికి నీలాగా లేడని ఎద్దేవా చేసేవారు. దీన్ని రోజు వింటున్న మల్లికార్జున అక్కసుతో సొంత బిడ్డను నదిలో ముంచి చంపాడు. మహారాష్ట్రలోని కరాడ్ జిల్లా వడోలి వద్ద కృష్ణా నదిలోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మార్చి 16న కుమారుడిని సదరు నదిలోకి తీసుకెళ్లి ముంచి చంపి తిరిగి ఊరికి వచ్చిన మల్లికార్జునను కొడుకు గురించి ఆరా తీయగా సింధగి వద్ద స్కూల్లో చేర్పించి హాస్టల్లో పెట్టానని నాటకమాడాడు. ఇక మే 1న సిద్ధార్థ్ పుట్టిన రోజు ఉంది. తీసుకొని రమ్మని తల్లి భాగ్యశ్రీ పట్టుబట్టింది. కొడుకు ఏడి? అని నిలదీయగా నిందితుడు మల్లికార్జున పరారయ్యాడు. దీంతో తల్లి భాగ్యశ్రీ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కుమారుడిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు తానే హత్య చేసినట్లు అంగీకరించాడని, దీంతో మల్లికార్జునను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
కారు–టిప్పర్ ఢీ, తల్లీకూతురు బలి
మైసూరు: టిప్పర్– కారు ఢీకొనడంతో తల్లీకూతుళ్లు మరణించగా, మరో చిన్నారి, కుటుంబ పెద్ద గాయపడ్డారు. ఈ ప్రమాదం మంగళవారం చామరాజనగర జిల్లాలోని గుండ్లపేట పట్టణంలో, కేరళ–మైసూరు హైవేలో మల్లయనపుర గేట్ వద్ద జరిగింది. టిప్పర్ గుండ్లుపేట నుంచి కేరళకు ఇసుకను తీసుకువెళ్తుండగా, కేరళలోని కాలికట్ నుంచి వస్తున్న కారు ఢీకొన్నాయి. కారులోని నిషా నూరి (37), ఆమె కుమార్తె నోవా (18) గాయాలతో చనిపోగా, నిషా భర్త మహమ్మద్ అజీర్ (41), కుమారుడు నహ్యాన్ (9) తీవ్రంగా గాయపడటంతో వారిని మైసూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు టిప్పర్ డ్రైవర్ను అరెస్టు చేశారు. -
నిరుద్యోగుల పోరాటానికి పోలీసుల బ్రేక్
హుబ్లీ: గత నెలలో నిరుద్యోగుల పోరాటం యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన నేపథ్యంలో మంగళవారం ధార్వాడలో చేపట్టిన నిరుద్యోగుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ముగ్గురు విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిరుద్యోగులు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల నియామకాల కోసం గత రెండు నెలల నుంచి ఎడతెగకుండా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కూడా ధార్వాడ జూబ్లీ సర్కిల్ నుంచి డీసీ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి చురుకు ముట్టించాలన్న నేపథ్యంలో చేపట్టిన ఆందోళనలను పోలీసులు శాంతి భద్రతల కారణంగా అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర విద్యార్థి సంఘం నేతృత్వంలో 2.84 లక్షల ఖాళీల పోస్టుల భర్తీ కోసం చేపట్టిన ఆందోళలో ధార్వాడలోని శ్రీనగర, జయనగర, సప్తాపుర తదితర చోట్ల భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న వైనం -
ఐఏఎస్ రోహిణికి సుప్రీంకోర్టులో ఊరట
బనశంకరి: మైసూరు కలెక్టర్గా ఉన్న కాలంలో బట్ట బ్యాగుల కొనుగోలులో అక్రమాలు జరిగాయనే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆమెపై నమోదైన కేసులో విచారణకు అనుమతివ్వాలని రాష్ట్ర హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను ప్రశి్నస్తూ రోహిణి సింధూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే జారీ చేసింది. -
42 ఏళ్ల వివాహితతో సంబంధం.. బాడీబిల్డర్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో జిమ్ ట్రైనర్లు మహిళలను మోసం చేయడమో, లేదా వారి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకోవడమో పెరిగిపోయింది. ఇటీవలే ఓ యువతి ప్రేమించి, చివరకు తిరస్కరించడంతో ఓ జిమ్ శిక్షకుడు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఇంతలోనే హనీట్రాప్లో చిక్కుకున్న బాడీ బిల్డర్ మహిళ బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన నెలమంగల తాలూకా వాజరహళ్లిలో వెలుగుచూసింది. జిమ్ ట్రైనర్ దిలీప్ (28)కు, రోజూ జిమ్కు వస్తున్న వివాహిత (42)తో పరిచయమైంది. అతడు బాడీబిల్డర్గా రాష్ట్రంలో ఎన్నో పోటీల్లో రాణించాడు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారు, తరువాత ఆమె డబ్బు, అతని ఆస్తులు కావాలని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిందని దిలీప్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ముందు దిలీప్ ఆమెకు కాల్ చేసి చెప్పాడు. దీంతో ఆమె అతని తమ్మునికి ఇన్స్టాలో మెసేజ్ చేసింది. కానీ అంతలోనే దిలీప్ ప్రాణాలు పోయాయి. నెలమంగల టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మోసగత్తెను కఠినంగా శిక్షించాలని దిలీప్ కుటుంబీకులు డిమాండ్ చేశారు. -
వ్యక్తిగత ద్వేషంతోనే పఠాన్ హత్య
హుబ్లీ: కాంగ్రెస్ యువనేత ఫైరోజ్ పఠాన్ హత్యకు వ్యక్తిగత ద్వేషాలే కారణమని తేలడంతో ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశామని హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ నిందితులందరినీ జుడీషియల్ కస్టడీకి అప్పగించామని, అదనపు విచారణ కోసం పోలీస్ కస్టడీకి అనుమతి తీసుకున్నామన్నారు. హత్యకు వాడిన రెండు బైకులతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసులో మహమ్మద్ షా, సయ్యద్ గౌస్, పర్వేజ్, సమీర్, సద్దాం హుస్సేన్, కై ఫ్, అర్బాజ్, సోహిల్ ఖాన్, మక్తుంలను అరెస్ట్ చేశామన్నారు. వీరిలో మహమ్మద్ షా, ఫైరోజ్ పఠాన్ మధ్య వ్యక్తిగత కక్షలు, పగలు రగిలాయన్నారు. హత్యకు గురైన ఫైరోజ్ తనను చాలా వేధించేవాడని, ఎన్నో సార్లు వ్యక్తిగతంగా గొడవ పడి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడన్నారు. ఈ కారణంగానే పఠాన్ను హత్య చేసినట్లు మహమ్మద్ షా విచారణలో తెలిపాడన్నారు. నిందితుల్లో కొందరికి నేర నేపథ్యం ఉందన్నారు. పథకం ప్రకారమే చాలా రోజులుగా కాపు గాసి ఈ హత్యకు పథకం రూపొందించారన్నారు. ముఖ్యంగా ఆరోజు రాత్రి మగవాళ్లు లేని సమయం చూసి హత్య చేశారు. కాగా ఈ నెల 24న పఠాన్కు పెళ్లి జరగాల్సి ఉండిందన్నారు. ఎమ్మెల్సీ రాజీనామా చేయరాదని ధర్నాకేజీఎఫ్ : విధాన పరిషత్ సభ్యుడు నజీర్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేయరాదని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ మైనారిటీ నాయకులు సోమవారం నగరంలోని గాంధీ సర్కిల్ వద్ద ధర్నా చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్యం మాట్లాడుతూ ఎమ్మెల్సీ నజీర్ అహ్మద్ విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో సేవలు అందించారన్నారు. ఆయన ఎన్నడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు. అయితే దావణగెరె ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి రాలేదనే నెపంతో పార్టీ హైకమాండ్ రాజీనామా చేయాలని అడుగుతుండడం దురదృష్టకరమన్నారు. నజీర్ అహ్మద్ పార్టీకి ఎనలేని సేవలు అందించారన్నారు. దావణగెరె దక్షిణ కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఆయన ముమ్మరంగా ప్రచారం సాగించారన్నారు. పార్టీ హైకమాండ్ కొంతమంది చెప్పుడు మాటలు విని అకారణంగా ఆయనను రాజీనామా చేయాలని కోరుతుండడం సరికాదని అన్నారు. నజీర్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేస్తే తాము కేజీఎఫ్ను బంద్ చేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితిలోను నజీర్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేయకూడదన్నారు. ధర్నాలో నగరసభ స్థాయి సమితి అధ్యక్షుడు అమీర్, నగరాభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు జయపాల్, శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. చెరువులో మునిగి ఇద్దరు మహిళల మృతి కోలారు : చెరువులో మునిగి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన నగర సమీపంలోని అరహళ్లి చెరువులో ఆదివారం చోటు చేసుకుంది. నగరంలోని నిసార్ నగర్కు చెందిన మహ్మది(25), బెంగళూరుకు చెందిన సల్మా (26) చెరువులో మునిగి మృతి చెందిన మహిళలు. ఇంట్లో కార్యక్రమం కోసం బెంగళూరు నుంచి వచ్చిన సల్మా, మహ్మది బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లారు. నీటిలో పడిన తమ దుస్తులను తీసుకోడానికి ప్రయత్నించి తాము చెరువులో మునిగి మరణించారు. ఘటనా స్థలానికి కోలారు రూరల్ పోలీసులు వెళ్లి పరిశీలన జరిపారు. మృతదేహాలను పోస్టుమార్టం చేసిన తర్వాత సంబంధీకులకు అప్పగించారు. మహిళ కన్నుమూత మండ్య: మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని చినకుర్లి ప్రభుత్వ ప్రీ–యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్, నాల్వాడి లయన్స్ క్లబ్ సభ్యులు బి.లింగేగౌడ భార్య త్రిగుణ (48), అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఎమ్మెల్సీ మధు మాదేగౌడ, కె. వివేకానంద, మరితిబ్బెగౌడ, డా. హెచ్.ఎస్.ముద్దేగౌడ, విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సి. చెలువయ్య తదితరులు మృతదేహానికి నివాళులర్పించారు. మలవళ్లి తాలూకాలోని దాసనదొడ్డి గ్రామంలో అంత్యక్రియలు జరిపారు. -
ఇద్దరు దోపిడీ దొంగల అరెస్ట్
బొమ్మనహళ్లి: బెంగళూరు శివారులోని ఆనేకల్ సబ్–డివిజన్ జిగని పోలీసులు ఇద్దరు దోపిడీ దొంగలను అరెస్టు చేయడంలో సఫలమయ్యారు. వీరిద్దరి గతాన్ని తలచుకుంటేనే భయం వేస్తుంది. ఇందులో ఒకడు దోపిడీలకు పాల్పడే ఒంటి కాలు దొంగ.. మరొకడు ఏకంగా ఎమ్మెల్యే కారుకు నిప్పు పెట్టిన దొంగ. వీళ్లిద్దరూ అవకాశం దొరికిన ప్రతిచోటా దోపిడీలకు పాల్పడ్డారు. కృష్ణనాయక్ అలియాస్ కుంటి కృష్ణ. ఇతడిని హవళి కృష్ణ అని కూడా పిలుస్తారు. మరొకడు నవీన్ అలియాస్ కల్లప్ప. ఇంకో పేరు రాబరీ కాలా. కృష్ణ నాయక్ ఆటో నడిపేవాడు. చిన్న వయసులోనే దొంగతనాలు, దోపిడీలకు అలవాటు పడ్డాడు. ఆటోలో జనాలను కిడ్నాప్ చేసి దోచుకునే వాడు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఒకసారి ఇతడిపై కాల్పులు జరపడంతో ఒక కాలు కోల్పోయాడు. జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కూడా ఒకే కాలుతో ఆటో నడుపుతాడు. అనుచరులతో కలిసి అమాయకులను కిడ్నాప్ చేసి, డబ్బు దోచుకుంటాడు. వారిపై దాడి చేసి పారిపోతాడు. ఇప్పటి వరకు అతడిపై 20కి పైగా కేసులు ఉన్నాయి. బన్నేరుఘట్ట, సూర్యనగర్, హెబ్బగోడి, జిగణితో సహా అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే కారుకు నిప్పు పెట్టిన ఘనుడు 2021లో బొమ్మనహళ్లి ఎమ్మెల్యే ఎం.సతీష్ రెడ్డి కారుకు మరో దొంగ నవీన్ అలియాస్ రాబరీ కాలా నిప్పు పెట్టాడు. ఇంటి దగ్గర పార్క్ చేసిన రెండు కార్లు కాలిపోయాయి. ఆ కేసులో అతను ప్రధాన నిందితుడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత.. మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. బైక్లతో సహా ప్రజలను దోచుకునే వాడు. హవళీ కృష్ణతో చేరిన కల్లప్ప.. అవకాశం దొరికిన చోటల్లా ప్రజలను దోచుకున్నారు. చిత్రహింసలు పెట్టడంలో దిట్టలు.. ఈ ఇద్దరు పేరు మోసిన దొంగలు ఇటీవల యరందహళ్లి సమీపంలో దోపిడీకి పాల్పడ్డారు. సుందర్ రాజ్ను హవళీ కృష్ణ ఆటోలోకి బలవంతంగా ఎక్కించి డబ్బు, మొబైల్ ఫోన్ లాక్కున్నారు. ఆ తర్వాత అతడి ఏటీఎం కార్డు ఇవ్వమని డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో చెవి కోసి చిత్రహింసలు పెట్టారు. అనంతరం ఏటీఎం కార్డును లాక్కొని రూ.లక్ష విత్డ్రా చేశారు. అనంతరం సుందర్ రాజ్ను నిర్మానుష్య ప్రదేశంలో వదిలి పారిపోయారు. కేసు నమోదు చేసిన జిగణి పోలీసులు, ఇన్స్పెక్టర్ మంజునాథ్ నేతృత్వంలో ఒక బందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
హొసపేటె రైల్వేస్టేషన్కు రాయల పేరు
హొసపేటె: విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీకి ప్రవేశద్వారంగా ఉన్న హొసపేటె రైల్వేస్టేషన్కు శ్రీకృష్ణదేవరాయ రైల్వే స్టేషన్గా పేరు మార్చాలని నగరసభ నిర్ణయించింది. ఈ మేరకు ఉపాధ్యక్షులు జీవరత్నం ప్రభుత్వానికి ఒక ప్రతిపాదనను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయమై 2వ వార్డు సభ్యులు జీవరత్నం ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. హొసపేటె రైల్వే స్టేషన్కు ఇకపై శ్రీకృష్ణదేవరాయల పేరును పెట్టాలని డిమాండ్ చేస్తూ సభ్యులందరి మద్దతుతో ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదింపజేశారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి తద్వారా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయనున్నారు. దేశవ్యాప్తంగా కేవలం కొన్ని రైల్వే స్టేషన్ల విషయంలో మాత్రమే ఇటువంటి ప్రత్యేక ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ఏడాది ఆ జాబితాలో హొసపేటె చారిత్రక హంపీకి ముఖ్యద్వారం వంటిది. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ స్టేషన్కు తరలివస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్టేషన్ను ఆధునిక హంగులతో, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తోంది. ఇటువంటి కీలక తరుణంలో ఈ పేరు మార్పుకు సంబంధించి చాలా కాలంగా ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ ప్రతిపాదనను సరైన అధికారిక మార్గంలోనే సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు మున్సిపల్ కౌన్సిల్ ద్వారా అధికారిక ప్రక్రియను అనుసరించడం ద్వారా ఈ డిమాండ్ ప్రజల గళంగా మారింది. -
బస్సును ఢీకొన్న వ్యాన్.. ఇద్దరు కూలీల మృతి
మండ్య: తాలూకాలోని కాచేనహళ్లి సమీపంలో ఆదివారం రాత్రి చామరాజనగర– జీవర్గి హైవేలో కేఎస్ ఆర్టీసీ బస్సును గూడ్స్ వ్యాన్ ఢీకొట్టింది. గూడ్స్ వ్యాన్లోని పశ్చిమ బెంగాల్కు చెందిన వలస కూలీలు సుజమ్రామ్ (27), సుజన్ బర్బన్ (32) మరణించగా, డ్రైవర్ రమేష్ గాయపడ్డాడు. చన్నరాయపట్న తాలూకాలోని నుగ్గేహళ్లిలో ఒక శుద్ధ జల ప్లాంటులో మృతులు కూలీలుగా పనిచేసేవారు. నీటి బాటిళ్లను తీసుకుని వ్యాన్లో నాగమంగళ పట్టణానికి వస్తుండగా బస్సును ఢీకొన్నారు. బస్సులోని కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. నాగమంగళ సీఐ శివకుమార్ నేతృత్వంలోని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఎస్పీ వి.జె.శోభరాణి, ఏఎస్పీ తిమ్మయ్య ఘటనాస్థలిని పరిశీలించారు. అబ్బే.. నన్ను వేధించలేదు దొడ్డబళ్లాపురం: బాగలకోటలోని జయమృత్యుంజయ స్వామిపై నమోదైన లైంగిక వేధింపుల కేసు పెట్టిన బాధిత మహిళ మాట మార్చింది. తనపై ఎలాంటి లైంగికదాడి జరగలేదని వీడియో ప్రకటనను విడుదల చేసింది. తాను స్వామిజీపై ఫిర్యాదు చేయలేదని, తనపేరు వాడుకుని కొందరు కేసు పెట్టారని పేర్కొంది. తాను స్వామిజీ వద్ద డబ్బులు డిమాండు చేయలేదంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, కోలుకున్నాక మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు చెబుతానని తెలిపింది. మూడో పెళ్లికి కేటుగాని యత్నంబొమ్మనహళ్లి: ఒకరు కాదు, ఇద్దరు భార్యలు ఉన్నారు, అయినా మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమైన పోకిరీ ఉదంతమిది. యువతుల జీవితాలతో ఆడుకుంటున్న కేటుగాడు రవిపై జిగణి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రవి పెద్ద ఉద్యోగం చేస్తానని ఆడంబరంగా కనిపించేవాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని అబద్ధాలు చెబుతూ యువతులకు వల వేసేవాడు. మొదటి భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లినప్పుడు, మరో యువతిని కొన్ని నెలల కిందటే పెళ్లి చేసుకున్నాడు. ఇంతలో మరో యువతిని నిశ్చితార్థం చేసుకున్నాడు. చివరకు విషయం తెలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది తెలిసి నిందితుడు రవి పరారీలో ఉన్నాడు. ఎంతో జీవితం.. క్షణాల్లో అంతం ● యువ టెక్కీ దుర్మరణం యశవంతపుర: రోడ్డు ప్రమాదంలో యువ టెక్కీ దుర్మరణం చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా సుళ్యకు చెందిన టెక్కీ క్షిప్రా (27) మృతి చెందింది. మంగళూరుకు చెందిన శశి కళాభట్కు ఏకై క కూతురు క్షిప్రా. బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో టెక్కీగా పని చేస్తోంది. రాయచూరు జిల్లాలో స్నేహితురాలి పెళ్లి ఉండడంతో సహ ఉద్యోగులతో కలిసి ఆనందంగా కారులో కర్నూలు పర్యటనకు వెళ్లారు. ఆదోని పట్టణం వద్ద కారు డ్రైవర్కు నిద్ర మత్తు వచ్చి చెట్టును ఢీన్నాడు. ఈ ప్రమాదంలో క్షిప్రాకు బలమైన గాయాలై అక్కడే చనిపోయింది. మరో యువకుడు, ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. క్షిప్రా ఎంటెక్ చేసింది, కొన్నేళ్ల కిందట తండ్రి చనిపోగా, ఆమెను తల్లి కంటికి రెప్పలా చూసుకుంటోంది. తల్లీ కూతురు బెంగళూరులోనే నివసిస్తున్నారు. ఇంతలో ఏకై క ఆధారంగా ఉన్న కూతురు కూడా మరణించడంతో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఇద్దరు ఆర్టీఓ అధికారుల అరెస్టు దొడ్డబళ్లాపురం: వాహనాల డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు ఆర్టీఓ అధికారులను లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు. నెలమంగల ఆర్టీఓ ఇన్స్పెక్టర్లు దినేశ్, కిరణ్ పట్టుబడ్డారు. ఇద్దరూ నిత్యం తనిఖీలు చేసే సాకుతో వాహనాలు నిలిపి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో బెంగళూరు గ్రామీణ జిల్లా లోకాయుక్త ఎస్పీ కోన వంశీకృష్ణ ఆధ్వర్యంలో దాడులు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని విచారణకు తరలించారు. -
హనీట్రాప్లో చిక్కి.. బాడీబిల్డర్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో జిమ్ ట్రైనర్లు మహిళలను మోసం చేయడమో, లేదా వారి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకోవడమో పెరిగిపోయింది. ఇటీవలే ఓ యువతి ప్రేమించి, చివరకు తిరస్కరించడంతో ఓ జిమ్ శిక్షకుడు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఇంతలోనే హనీట్రాప్లో చిక్కుకున్న బాడీ బిల్డర్ మహిళ బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన నెలమంగల తాలూకా వాజరహళ్లిలో వెలుగుచూసింది. జిమ్ ట్రైనర్ దిలీప్ (28)కు, రోజూ జిమ్కు వస్తున్న వివాహిత (42)తో పరిచయమైంది. అతడు బాడీబిల్డర్గా రాష్ట్రంలో ఎన్నో పోటీల్లో రాణించాడు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారు, తరువాత ఆమె డబ్బు, అతని ఆస్తులు కావాలని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిందని దిలీప్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ముందు దిలీప్ ఆమెకు కాల్ చేసి చెప్పాడు. దీంతో ఆమె అతని తమ్మునికి ఇన్స్టాలో మెసేజ్ చేసింది. కానీ అంతలోనే దిలీప్ ప్రాణాలు పోయాయి. నెలమంగల టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మోసగత్తెను కఠినంగా శిక్షించాలని దిలీప్ కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఐఏఎస్ రోహిణికి సుప్రీంలో ఊరట బనశంకరి: మైసూరు కలెక్టర్గా ఉన్న కాలంలో బట్ట బ్యాగుల కొనుగోలులో అక్రమాలు జరిగాయనే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆమైపె నమోదైన కేసులో విచారణకు అనుమతివ్వాలని రాష్ట్ర హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను ప్రశ్నిస్తూ రోహిణి సింధూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే జారీ చేసింది. -
వైభవం.. రంగనాథ తేరు సంబరం
నాగేశ్వరస్వామి రథోత్సవంబొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని హెన్నాగరలో సోమవారం శ్రీనాగేశ్వర స్వామి రథోత్సవం, శ్రీయల్లమ్మ దేవి జగద పాలక్కి ఉత్సవం భక్తిశ్రద్ధలతో జరిగాయి. మధ్యాహ్నం శ్రీనాగలింగేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి తేరులో ఆసీనుల్ని చేశారు. పూజలు చేసి తేరును లాగారు. వీరగాసె, డొల్లుకుణిత, పూజా కుణిత తదితర కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. వేలాదిగా భక్తులు, ఆనేకల్ టీఏపీసీఎంఎస్ అధ్యక్షుడు ఎం.బాబురెడ్డి, హెచ్.జే.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. బొమ్మనహళ్లి: చిక్కమగళూరు జిల్లాలోని కడూరు తాలూకాలోని బిరూర్ సమీపంలోని హోగరేహళ్లి గ్రామంలో సోమవారం శ్రీలక్ష్మీ రంగనాథస్వామి బ్రహ్మ రథోత్సవం వైభవంగా సాగింది. శ్రీరంగనాథస్వామి, శ్రీదేవి, భూదేవిల విగ్రహాలను అలంకరించి రథంలో ప్రతిష్టించారు. రథ పతాకాన్ని వేలం వేయగా ఎమ్మెల్యే కె.ఎస్.ఆనంద్ రూ. 5.05 లక్షలకు గెలుచుకున్నారు. పూజల తరువాత భక్తులు ఆనందోత్సాహాలతో తేరును లాగారు. వివిధ పూజా వేడుకలు, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను రంజింపజేశాయి. పలు జిల్లాల నుంచి జనం తరలివచ్చారు. -
చెలువరాయునికి కొడై తిరునాల్ శోభ
మండ్య: మండ్య జిల్లాలోని ప్రఖ్యాత మేలుకోటలోని శ్రీ చెలువ నారాయణస్వామి దేవస్థానంలో కొడై తిరునాల్ ఉత్సవం శోభాయమానంగా సాగుతోంది. అలంకార ప్రియుడైన మహావిష్ణు చెలువనారాయణస్వామి కోసం ప్రతి రాత్రి ప్రత్యేక అలంకరణలతో ఒక వేడుక జరుగుతోంది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి మొదలైన కొడై తిరునాల్లో భాగంగా ఏకాదశి సందర్భంగా సోమవారం నాడు ప్రత్యేకంగా అలంకరించారు. కొడై తిరునాల్ ప్రత్యేకత వైరముడి బ్రహ్మోత్సవం ముగియగానే ప్రారంభమయ్యేదే కొడై తిరునాల్ సంబరం. ఏప్రిల్ 17వ తేదీ అంటే శుక్రవారం అమావాస్య రాత్రి వరకు కొనసాగుతుంది. కొడై తిరునాల్ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ అమ్మవారి సమక్షంలో, అర్చకులుమంత్రాలు, రామాయణం, సంస్కృత పద్యాలతో మంగళ వాయిద్యాల మధ్య చెలువనారాయణ స్వామిని పూజిస్తారు. తరువాత పానక ప్రసాదాన్ని సమర్పిస్తారు. బంగారు ఆభరణాలను ధరించి, పద్మాసనంలో కూర్చున్న స్వామిని చూడడానికి భక్తులు వేచి చూస్తారు. మేలుకోటె పుణ్యక్షేత్రంలో 17 వరకు విశేష ఉత్సవాలు -
లంచాల కోసం పోలీసులపై ఎస్ఐ ఒత్తిడి
సాక్షి,బళ్లారి: ఆయనో పోలీసు సబ్ ఇన్స్పెక్టర్. ఆయన గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున లంచం తీసుకోవడమే కాకుండా, కింది స్థాయి సిబ్బంది, పోలీసులను నగరంలో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున లంచాలు తేవాలని ఒత్తిడి చేయడం కలకలం సృష్టించింది. నిత్యం ఎస్ఐ వేధింపులు తాళలేక పోలీసులు ఏకంగా ముఖ్యమంత్రికి, హోంమంత్రికి లేఖలు రాశారు. వివరాల్లోకి వెళితే.. విజయపుర నగరంలోని ఆదర్శ నగర్ పోలీసు స్టేషన్లో సబ్ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న లమాణి అనే వ్యక్తి అవినీతి పేట్రేగిపోవడంతో పోలీసులు భరించలేక పోయారు. పోలీసు స్టేషన్కు వచ్చి కేసులు పెట్టే వారి నుంచే కాకుండా ఇతరుల నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భారీగా లంచాల వసూలుకు సూచన నగరంలో మట్కా, గ్యాంబ్లింగ్, పేకాట, వేశ్యావాటికలు, బార్లు, స్పాలు తదితర అసాంఘీక కార్యకలాపాలు నడిపే వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి తేవాలని సూచించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నెల నెలా లంచం తేవాలని, లేకపోతే కేసులు పెట్టాలని సూచించడంతో ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక సీఎంకు, హోంమంత్రికి లేఖ రాశారు. ఎస్ఐ ఆదేశాలను తాము పాటించలేమని, పని చేయడం చాలా కష్టంగా ఉందని, తమ గౌరవం, నిజాయితీ కాపాడుకోడానికి వేరే మార్గం లేక సామూహికంగా విధులను సైతం వదిలిపెట్టేందుకు వెనుకాడబోమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన విజయపుర జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తక్షణం ఎస్ఐని సస్పెండ్ చేయాలని లేదా వేరే చోటకు బదిలీ చేయాలని స్థానికులు కోరారు. వేధింపులు తాళలేక సీఎంకు, హోంమంత్రికి లేఖ -
వరుస ప్రమాదాలు.. నెత్తురోడిన రోడు్ల
సాక్షి,బళ్లారి: నగరంలో వేర్వేరు రోడ్లలో ప్రమాదాలు జరిగి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. సోమవారం నగరంలోని జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరం సమీపంలో బ్రేకులు లేని ఎన్ఈకేఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు మృతి చెందారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు గ్రామానికి చెందిన వెంకటేశులు, శ్రీదేవి దంపతుల కుమారుడు రవికిరణ్ (18) బళ్లారిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం తన స్నేహితుడిని కలిసేందుకు ఉంతకల్లు నుంచి ఏథర్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం(కే.ఎ.34 ఈడబ్ల్యూ– 6076)లో బళ్లారికి వెళ్లాడు. అనంతరం స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై రంగమందిరం నుంచి బస్టాండు వైపునకు వెళుతుండగా మోతీ సర్కిల్ వద్దకు చేరుకోగానే బళ్లారి నుంచి కూరిగనూరుకు వెళుతున్న కేఏ–34 ఎఫ్–1211 నంబరుగల ఆర్టీసీ బస్సు బ్రేక్లు పడకపోవడంతో అదుపు తప్పి ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లి వెనుక నుంచి ఢీకొంది. ఘటనలో రవికిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన స్నేహితుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రమాదంతో ట్రాఫిక్కు అంతరాయం ప్రధాన కూడలిలో రోడ్డు ప్రమాదం జరగడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి పూర్తిగా స్తంభించింది. యువకుడిని ఆంధ్రప్రదేశ్కు చెందినవాడుగా గుర్తించారు. బస్సుకు బ్రేకులు సరిగా పడటం లేదని బస్సు డ్రైవర్ వీరనగౌడ పేర్కొనడం గమనార్హం. ఇదే విషయంపై అధికారులకు కూడా తెలిపామన్నారు. బ్రేకులు లేకుండా బస్సును పంపడం వల్లే ప్రమాదం జరిగిందనే విషయం కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. మృతుడి కుటుంబానికి ఎన్ఈకేఆర్టీసీ సంస్థ పెద్ద ఎత్తున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సంగం సర్కిల్లో మరో ప్రమాదం కాగా నగరంలో సంగం సర్కిల్ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. సండూరు తాలూకా కుడితినికి చెందిన పరుశురాం(32) అనే వ్యక్తి బళ్లారికి వచ్చి రోడ్డు మీద పక్కన నడుచుకుంటూ వెళుతుండగా, ఎదురుగా వస్తున్న మినీ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవాడని, ఇద్దరు సంతానం ఉన్నారని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో మృతి చెందాడా? లేక వ్యక్తి అజాగ్రత్తగా నడుచుకుంటూ వస్తూ లారీ కింద పడ్డారా అనే కోణంలో ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే రోజు నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందడంపై నగర వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో వేర్వేరు రోడ్లలో ప్రమాదాలు, ఇద్దరు దుర్మరణం బ్రేకు ఫెయిలై ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు బలి మిని లారీ ఢీకొని కుడితినికి చెందిన వ్యక్తి కూడా మృతి ప్రమాదాలతో రక్తసిక్తంగా మారిన బళ్లారి నగర రోడ్లు -
ప్రియుడి స్వార్థానికి యువతి
హుబ్లీ/రాయచూరు రూరల్: తాను ప్రేమించిన యువతికి వేరొకరితో పెళ్లి ఖాయం అయిన విషయం జీర్ణించుకోలేని స్వార్థ ప్రేమికుడు ఆ యువతితో తాను తీసుకున్న ఫోటోలను నిశ్చితార్థం జరిగిన యువకుడి కుటుంబ సభ్యులకు పంపాడు. ఫలితంగా పెళ్లి రద్దు కావడంతో మనోవేదనకు గురై ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయపుర జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన వివరాలు.. విజయపుర జిల్లా సింధగి తాలూకా బంధాల గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి జయశ్రీ బిరాదార్కు పెళ్లి చేయడానికి వరుడిని నిశ్చయించి సంబంధిత కార్యాన్ని నెరవేర్చారు. అయితే జయశ్రీ ఇంతకు ముందు శ్రీశైల బడనూరును ప్రేమించింది. తనను కాదని వేరే వ్యక్తితో వివాహం ఖరారు చేసుకోవడాన్ని శ్రీశైల జీర్ణించుకోలేక పోయాడు. తనతో ఆమె ఉన్న ఫొటోలు షేర్ ఆ యువతి తనతో ఉన్న ఫోటోలను వరుడి కుటుంబ సభ్యులకు షేర్ చేశాడు. వాటిని చూసిన వరుడి కుటుంబ సభ్యులు గత నెల 27న నిశ్చయించుకున్న పెళ్లిని రద్దు చేసుకున్నారు. పెళ్లి రద్దు కావడంతో తీవ్ర మనోవేదనకు గురై జయశ్రీ జీవితంపై విరక్తి చెంది బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ గ్రామంలోని మదీనా మసీదు పక్కన ఉన్న బావిలోకి దూకిన జయశ్రీ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. సింధగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విరిసీ విరియని ప్రేమ త్యాగానికి బదులుగా ప్రాణాలను బలి కోరుకోవడం నేటి విచిత్రం. ముక్కుపచ్చలారని తమ కుమార్తె పిచ్చి ప్రేమికుడు శ్రీశైల స్వార్థానికి బలి కావడంపై యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నిందితుడిపై కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
భారీ వంతెన ప్రారంభం
శివాజీనగర: చిక్కమగళూరు జిల్లా ఎన్.ఆర్.పురం తాలూకాలో నిర్మాణమైన వంతెనను సీఎం సిద్దరామయ్య సోమవారం ప్రారంభించారు. హందూరు, హొన్నకుడిగ గ్రామాల నుంచి నరసింహరాజపురకు భద్రా నది బ్యాక్ వాటర్పై ఈ వంతెన నిర్మాణమైంది. సీఎం, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి వంతెనను వీక్షించారు. భద్రా నది సౌందర్యాన్ని వీక్షించారు. 504 మీటర్ల పొడవు... 504 మీటర్ల పొడవు కలిగిన ఈ వంతెనకు సిద్దరామయ్య వంతెన అని పేరు పెట్టడం గమనార్హం. సుమారు రూ.38 కోట్ల ఖర్చుతో నిర్మాణం పూర్తయింది. 2017లో సీఎం సిద్దరామయ్య దీనికి శంకుస్థాపన చేశారు. అనేక గ్రామాల ప్రజలకు రాకపోకలకు అనుకూలమవుతుంది. ఉదయం, సాయంత్రం వేళలో ఇక్కడ సుందరమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. జిల్లాలోనే ఇది పొడవైన సేతువుగా నిలిచింది. చిక్కమగళూరులో సేవలకు అంకితం -
డాక్టర్ రాజ్కుమార్ వర్ధంతి
రాయచూరు రూరల్: సినీ నటుడు దివంగత డాక్టర్ రాజ్కుమార్ 19వ వర్ధంతిని సోమవారం నగరంలో నిర్వహించారు. డాక్టర్ పునీత్ రాజ్కుమార్ ట్రస్టు కార్యాలయంలో డాక్టర్ రాజ్కుమార్ చిత్రపటానికి ట్రస్టు అధ్యక్షుడు సాదిక్ ఖాన్ పూలమాల వేసి నివాళి అర్పించారు. సభ్యులు బసవరాజ్, సంతోష్, చేతన సంస్థ సంచాలకుడు సబ్జలీ, నాసిర్లున్నారు. సహాయవాణిలో 772 కేసులకు పరిష్కారం రాయచూరు రూరల్ : జిల్లాలో ఈ ఏడాది సహాయవాణి ద్వారా 790 కేసులు నమోదు కాగా 772 కేసుల సమస్యలను పరిష్కరించినట్లు జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ వెల్లడించారు. సోమవారం కార్యాలయంలో తనను కలిసిన పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 28 శాఖలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతంలో నీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలని పంచాయతీ అభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 14 రోజుల్లో 20 కేసులు రావడంతో నీటి ఎద్దడి పరిస్థితిపై నిఘా ఉంచి పరిష్కరించామని, ప్రజలు 08532– 230 539 సహాయవాణి ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. రిజర్వేషన్లు అమలు చేయాలి రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అదనపు రిజర్వేషన్లు అమలు చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. సోమవారం లోక్సభ సభ్యుడి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. 17 శాతం రిజర్వేషన్లను అమలు చేసే ముందు జనాభాకు అనుగుణంగా కేటాయించిన రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరిచిన అంశాలను గమనించి ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 7 శాతం అదనపు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో పద్మ, నరసన్న నాయక్, శరణ బసవ, వరలక్ష్మి, దేవేంద్ర గౌడ, గిరియప్పలున్నారు. భూ సర్వేకు ఆటంకం.. 12 మంది అరెస్ట్రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా బిచ్చాలి గ్రామంలో వెలసిన మంత్రాలయం జపకట్టి ప్రాంతంలోని భూ సర్వేకు అడ్డు పడిన 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంత మంది రైతులు ఏళ్ల తరబడి భూములను సాగు చేసుకుంటున్న అంశంపై కోర్టు మెట్లెక్కారు. అసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ, తహసీల్దార్ సురేష్వర్మ ఆదేశాల మేరకు అధికారులు సోమవారం పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేస్తుండగా అడ్డుకోవడంతో వారిని యరగేర పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలకు వైదిక ధర్మ సందేశాలు నేర్పాలి రాయచూరు రూరల్: దేశంలో హిందూ వైదిక ధర్మ సందేశాలను పిల్లలకు బోధించడం మనందరి కర్తవ్యమని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందరింలో కర్ణాటక కళా మండలి, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నుపుర సంభ్రమ–22వ వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు సనాతన సంప్రదాయాలు ఆచార, విచారాలు, భారతీయ సంస్కృతిపై అవగాహన కల్పించి భరతనాట్యంపై ఆసక్తిని పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో జయలక్ష్మి మంగళ మూర్తి, ముకుందాచారి జోషి, ప్రదీప్ భట్, రమాదేవి, సంజయ్ కుమార్, సీతాబాయి, రంగనాథ్, కర్ణాటక కళా మండలి సభ్యులు లక్ష్మి, నాగేంద్ర, కన్నడ సంస్కృతి శాఖ అధికారి ఉత్తరాదేవి మఠపతిలున్నారు. -
భైరవ సన్నిధికి ప్రధాని మోదీ
మండ్య: జిల్లాలోని నాగమంగళ వద్దనున్న ఆది చుంచనగిరి మఠంలో నిర్మించిన శ్రీ గురు భైరవైక్య ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 15వ తేదీన ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘ఇది ఒక సజీవ ఆధ్యాత్మిక నిలయం. ద్రావిడ వాస్తుశైలిలో నిర్మాణమైంది’ అని మఠాధిపతి నిర్మలానందనాధ స్వామి సోమవారం తెలిపారు. ఒడిశాలోని సూర్య దేవాలయం కళను మేళవించి, రూ.100 కోట్లకు పైగా వ్యయంతో ఈ ఆలయాన్ని సుందరంగా నిర్మించినట్లు తెలిపారు. ఇందులో హొయసళ, చోళ, చాళుక్య, గంగా వాస్తుశైలుల సమ్మేళనం కనిపిస్తుందని చెప్పారు. ద్రావిడ వాస్తుశైలి ఆకాశాన్ని తాకే గోపురాలు, అద్భుతమైన శిల్పాలు, విశ్వ నియమాలకు అనుగుణంగా ఉండే రూపకల్పన అని పేర్కొన్నారు. 3 రకాల శిలలతో నిర్మాణం భైరవైక్య ఆలయ నిర్మాణంలో మూడు రకాల రాళ్లను ఉపయోగించారు. క్లియోరా అనే రాయికి పెద్దపీట వేశారు. ఆలయానికి ఇలకల్ రకం రాయిని, కింది భాగానికి సంతేకల్ రకం రాయిని ఉపయోగించారు. లోపల మొత్తం క్లియోరా శిలలతో తీర్చిదిద్దారు. ప్రధానికి నెమలి ప్రతిమను అందజేస్తామని స్వామీజీ చెప్పారు. తమిళనాడుకు చెందిన శంకర్ స్థపతి ఈ ఆలయాన్ని నిర్మించారు. బెంగళూరులోని వికాససౌధ, ఉద్యోగ సౌధ, బెళగావిలోని సువర్ణ సౌధలను నిర్మించింది కూడా శంకరేనని స్వామీజీ తెలిపారు. ప్రధాని పర్యటన ఇలా.. ప్రధాని మోదీ బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో దిగి, హెలికాప్టర్లో ఆది చుంచనగిరి క్షేత్రానికి చేరుకుంటారు. కాలభైరవేశ్వర ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. తరువాత భైరవైక్య ఆలయాన్ని అంకితం చేస్తారు. ఆదిచుంచనగిరి క్షేత్ర స్టేడియంలో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రేపు ఆది చుంచనగిరి మఠంలో భైరవైక్య ఆలయం ప్రారంభం కాల భైరవుని ఆలయంలో విశేష పూజలు -
కిడ్నాప్ చేసి.. హిజ్రాగా మార్చే యత్నం
మైసూరు(కర్ణాటక): యువకున్ని కిడ్నాప్ చేసి బలవంతంగా మంగళముఖిగా వేషం వేసి డబ్బులు వసూలు చేయించడం, రీల్స్ చేయించుకుని డబ్బు సంపాదిస్తూ, అతన్ని కూడా బలవంతంగా హిజ్రాగా మార్చాలని ప్రయత్నించారు. దీంతో బాధిత యువకుడు న్యాయం కోసం మైసూరు లష్కర్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నంజనగూడులోని త్యాగరాజ కాలనీకి చెందిన యువకుడు అనిల్కుమార్ దివ్యాంగుడు కూడా. అతడు 4 నెలల క్రితం మైసూరు రూరల్ బస్టాండులో బస్సు కోసం వేచిఉన్న సమయంలో మంగళముఖి అనిత ముసుగువేసి.. కిడ్నాప్ చేసి, మంగళూరుకు తీసుకు వెళ్లింది. అక్షతగా పేరు మార్చి తరువాత అతనికి చీర , నైటీ, చెవి కమ్మలు వేసి అక్షత అని పేరు మార్చింది. బలంవంతంగా వీధులలో , దుకాణాల వద్ద భిక్షాటన చేయించింది. ప్రతినిత్యం 2 నుంచి 3 వేల రూపాయలు కలెక్షన్ తీసుకు రావాలని బెదిరించింది. రీల్స్ చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మంగళూరు, కేరళ ప్రాంతాలలో వ్యభిచారానికి పంపింది. అతని ఆధార్ కార్డులో కూడా ట్రాన్స్ జెండర్గా మార్పించింది. వచ్చే నెల ముంబైకి తీసుకు వెళ్లి, సర్జరీ చేయించి పూర్తిగా మంగళముఖిగా మార్చడానికి ప్రణాళిక రూపొందించింది. దీనిని గుర్తించిన అనిల్కుమార్ ఇంటికి వెళ్తానని చెప్పగా, అనిత బెదిరించి చోరీ కేసు పెట్టించింది. ఎలాగోలా మంగళూరు నుంచి తప్పించుకుని వచ్చిన అనిల్.. మైసూరు లష్కర్ స్టేషన్లో అనితపై ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తన ఫిర్యాదుకు స్పందించడం లేదని అనిల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
టీచర్.. మీ స్టూడెంట్ని నా చివరి కోరిక తీరుస్తారా..!
దొడ్డబళ్లాపుర(కర్ణాటక): ఇన్స్టాలో పరిచయమైన యువకుడు, మహిళ (40) చేత బలవంతంగా న్యూడ్ కాల్ చేయించి, ఆపై బ్లాక్మెయిల్ చేయసాగాడు. ఈ సంఘటన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగింది. వివరాలు.. ఎల్రక్టానిక్ సిటీల టీచర్గా పని చేస్తున్న ఆమెకి, ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తికి చెందిన యువకుడు అర్షద్ (37) ఇన్స్టాలో పరిచయమయ్యాడు. మీ పూర్వ విద్యార్థిని అని చెప్పుకుని కొంతకాలం మంచివాడిగా చాటింగ్ చేశాడు. తరువాత ఫోన్లలో తరచూ మాట్లాడుకునేవారు. తిరుమలలో దర్శనం చేయిస్తానంటూ డబ్బులు తీసుకున్నాడు. ఒకరోజు హఠాత్తుగా తనకు క్యాన్సర్ వచ్చిందని, చివరి కోరికగా నీతో గడపాలని ఆశగా ఉందన్నాడు. ఆమె తిరస్కరించగా, కనీసం న్యూడ్గా వీడియో కాల్ అయినా చేయాలని కోరాడు. వీడియో సేవ్ చేసుకుని.. అతని మాటలు నమ్మిన మహిళ సరేనని కాల్ చేసింది. అయితే కాల్ను రికార్డు చేసుకున్న దుండగుడు.. నీ న్యూడ్ వీడియో నా వద్ద ఉందని, డబ్బులు ఇవ్వాలని, తనతో కలవాలని, లేదంటే వీడియో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధిరాలు తరచుగా అతనికి డబ్బు పంపిస్తూ ఉంది. అయితే కొన్నిరోజులుగా వేధింపులు పతాకస్థాయికి చేరడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సూచనల మేరకు ఆమె అతన్ని బెంగళూరుకు రప్పించింది, వెంటనే పోలీసులు పట్టుకుని ఠాణాకు తరలించారు. తన అవయవాలను కోసుకుంటానని పోకిరీ కొంతసేపు హల్చల్ చేశాడు. -
ఉడుపి జిల్లాలో కిడ్నాప్.. తెలంగాణలో పట్టివేత
బనశంకరి: మార్చి 31న ఉడుపి జిల్లా కుందాపురలో కిడ్నాపైన వ్యక్తి తెలంగాణలో దొరికాడు. వివరాలు.. కుందాపుర నివాసులు రాజేష్, రామ మడివాళ, సోదరుడు లక్ష్మణకు అనారోగ్యంగా ఉండటంతో మణిపాల్లోని కేఎంసీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సమయంలో క్యాంటీన్ టీ తాగుతుండగా నంబరు ప్లేట్ లేని నలుపు రంగుకారులో వచ్చిన 8 మంది రాజేష్ను బలవంతంగా లాక్కుని కారులో బంధించి తీసుకెళ్లారు. సోదరుల ఫిర్యాదుమేరకు కుందాపుర పోలీసులు తీవ్రంగా గాలింపు జరిపారు. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల, గోవిందపల్లి వద్ద గల సిల్వర్ స్కై లాడ్జ్లో దాచి ఉంచినట్లు తెలుసుకుని దాడి చేశారు. బాధితున్ని కాపాడి 8 మంది కిడ్నాపర్లను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ హరిరాం శంకర్ తెలిపారు. మల్లారెడ్డి, తుళజా, నరసింగ, హుసేన్, శంకర, నాగేశ్, పరమేశ్వర్, విజయ్ అనే 8మంది పట్టుబడ్డారు. ఆర్థిక గొడవలే కిడ్నాప్కు కారణమని సమాచారం. సౌకర్యాల కోసం ఆదివాసీల ధర్నా మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలేమహదేశ్వర గ్రామ పంచాయతీ పరిధిలోని మేదగనాణే హాడిగేలో తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు కావాలని జిల్లా ఆదివాసీల హితరక్షణ సమితి, ప్రగతిపర సంఘాల భాగస్వామ్యంలో ఆదివాసీలు ఉపవాస సత్యాగ్రహం చేపట్టారు. ప్రభుత్వం, అటవీ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ గ్రామానికి విద్యుత్ సరఫరాకు ఏడాది క్రితమే అన్ని ఏర్పాట్లు చేసినా అటవీశాఖ అధికారులు అడ్డు చెప్పడం వల్ల తాము చీకట్లో మగ్గుతున్నట్లు చెప్పారు. వెంటనే తమకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. రాత్రి అంతా ఆందోళన జరగ్గా, మలేమహదేశ్వర బెట్ట పోలీసులు బందోబస్తు సాగించారు. ఏనుగు దాడిలో కాఫీ రైతు మృతి యశవంతపుర: అడవి ఏనుగు దాడిలో రైతు బలైన ఘటన ఆదివారం ఉదయం హాసన్ జిల్లా బేలూరు తాలూకా అరెహళ్లి హొబళి కణగుప్పె గ్రామంలో జరిగింది. రైతు రాజశేఖర్ ఉదయమే ఇంటి నుంచి కాఫీతోటకు వెళ్లాడు. తోటలో పనిలో ఉండగా, ఓ ఏనుగు నుంచి వేగంగా వచ్చి అతనిని కాళ్లతో తొక్కి చంపేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, అటవీ సిబ్బంది, పోలీసులు వెళ్లి మృతదేహాన్ని తీసుకువచ్చారు. 6 నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన రైతు ద్యావమ్మ కూడా ఓ ఏనుగు ఇలాగే హతమార్చింది. దీంతో రైతులు పొలాలకు, తోటలకు వెళ్లాలంటే భయపడుతున్నారని రైతు నేత కెజి కుమార్ చెప్పారు. వెంటనే ఏనుగులను బంధించాలని డిమాండ్ చేశారు. కారు– బస్సు మధ్య నలిగి.. దొడ్డబళ్లాపురం: బెంగళూరులో మైసూరు శాటిలైట్ బస్టాండ్లో ఘోరం జరిగింది. కారు– బస్సు మధ్య ఇరుక్కుని వ్యక్తి దుర్మరణం చెందాడు. బెంగళూరు సుంకదకట్టె నివాసి శ్యామ్ దొరె (45) మృతుడు. భార్యతో కలిసి తమిళనాడులో బంధువు చనిపోతే వెళ్లి చూసి వచ్చారు. మైసూరు రోడ్డులోని శాటిలైట్ బస్టాండులో దిగి పార్కింగ్ లాట్లో బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఒక కారు రివర్స్ చేస్తుండగా శ్యామ్ కాస్త వెనక్కు జరిగి అక్కడే నిలిపి ఉన్న బ్లడ్ బ్యాంక్ బస్సుకి ఆనుకుని నిల్చున్నాడు. అయితే కారు అలాగే రావడంతో కారు– బస్సు మధ్య ఇరుక్కుని శ్యామ్ అక్కడే చనిపోయాడు. బ్యాటరాయనపుర పోలీసులు కేసు నమోదు చేశారు. -
పశుగ్రాసం కొరత.. రైతన్న వెత
రాయచూరు రూరల్: కర్ణాటకలో పశుగ్రాసం కొరత వేధిస్తోంది. పాడిపోషణ రైతులు పుశుగ్రాసం సమస్యతో అల్లాడిపోతున్నారు. అధిక ధరలు చెల్లించి ఇతర ప్రాంతాల నుంచి పశుగ్రాసం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ ప్రారంభంలోనే ఇలా ఉంటే మూగ జీవాలను ఎలా కాపాడుకోవాలి అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్యాణ కర్నాటకలోని ఆరు జిల్లాలో కరువు సంభవించినా కేంద్ర, రాష్ట్ర సర్కార్లు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. సమయానికి వర్షాలు కురవక పోవడంతో చెరువులు, కుంటలు, బావులు, వాగులు నీరు లేక వెలవెలబోతున్నాయి. పంటలు పండక పోవడంతో పశువులకు పశుగ్రాసం అందని దుస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో పఽశువులకు పశుగ్రాసం లభించకపోవడంతో ప్లాస్టిక్ పేపర్లు, సంచులు తింటూ మృత్యువాత పడుతున్నాయి. హైదరాబాద్ కర్ణాటకలోని రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆలకించే దండనాయకులు (తహసీల్దార్) మాయం అవుతున్నారు. రైతన్నల గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. పంటలు నష్టపోయి రైతన్నలు ఇబ్బందులు పడుతున్నా.. పంట నష్ట పరిహారం అందించేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగినా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశుగ్రాసం కొరతతో రైతులు చేసేది ఏమీ లేక దిక్కుతోచని పరిస్థితిలో పశువులను కబేళాకు తరలిస్తున్నారు. జిల్లాలో 1.55 లక్షలకు పైగా పశువులను విక్రయించినట్లు సమాచారం. జిల్లాలో 4.67 లక్షల క్వింటాళ్ల పశుగ్రాసం అవసరముందని పశు సంవర్దక శాఖ అధికారులు జిల్లా అధికారికి రెండు నెలల క్రితం ప్రతిపాదనలను పంపినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 12 వేల మంది రైతులకు మినీకిట్లను పంపిణీ చేస్తామన్న అధికారులు.. కేవలం 3,262 మంది రైతులకు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. వర్షాభావంతో పండని పంటలు వేధిస్తున్న పశుగ్రాసం సమస్య కబేళాకు తరలుతున్న పశువులు పట్టణాల్లో పశువులకు మేతగా మారిన ప్లాస్టిక్ -
టీచర్.. మీ స్టూడెంట్నే అంటూ వేధింపులు
దొడ్డబళ్లాపురం: ఇన్స్టాలో పరిచయమైన యువకుడు, మహిళ (40) చేత బలవంతంగా న్యూడ్ కాల్ చేయించి, ఆపై బ్లాక్మెయిల్ చేయసాగాడు. ఈ సంఘటన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగింది. వివరాలు.. ఎలక్ట్రానిక్ సిటీల టీచర్గా పని చేస్తున్న ఆమెకి, ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తికి చెందిన యువకుడు అర్షద్ (37) ఇన్స్టాలో పరిచయమయ్యాడు. మీ పూర్వ విద్యార్థిని అని చెప్పుకుని కొంతకాలం మంచివాడిగా చాటింగ్ చేశాడు. తరువాత ఫోన్లలో తరచూ మాట్లాడుకునేవారు. తిరుమలలో దర్శనం చేయిస్తానంటూ డబ్బులు తీసుకున్నాడు. ఒకరోజు హఠాత్తుగా తనకు క్యాన్సర్ వచ్చిందని, చివరి కోరికగా నీతో గడపాలని ఆశగా ఉందన్నాడు. ఆమె తిరస్కరించగా, కనీసం న్యూడ్గా వీడియో కాల్ అయినా చేయాలని కోరాడు. వీడియో సేవ్ చేసుకుని.. అతని మాటలు నమ్మిన మహిళ సరేనని కాల్ చేసింది. అయితే కాల్ను రికార్డు చేసుకున్న దుండగుడు.. నీ న్యూడ్ వీడియో నా వద్ద ఉందని, డబ్బులు ఇవ్వాలని, తనతో కలవాలని, లేదంటే వీడియో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధిరాలు తరచుగా అతనికి డబ్బు పంపిస్తూ ఉంది. అయితే కొన్నిరోజులుగా వేధింపులు పతాకస్థాయికి చేరడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సూచనల మేరకు ఆమె అతన్ని బెంగళూరుకు రప్పించింది, వెంటనే పోలీసులు పట్టుకుని ఠాణాకు తరలించారు. తన అవయవాలను కోసుకుంటానని పోకిరీ కొంతసేపు హల్చల్ చేశాడు. తరచూ డబ్బు వసూళ్లు, బెదిరింపులు నిందితునికి కటకటాలు -
వాడిన నూనె స్వీకరణ
● ఆహార, ఔషధ శాఖల తనిఖీలుమనం నిత్యం ఆరగించే ఆహారం రుచిగా ఉండడమే కాదు శుచిగా కూడా ఉండాలి. అప్పుడే ఆకలి తీరడంతో పాటు ఆరోగ్యానికీ మంచిది. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవనంలో రోడ్ల పక్కన హోటళ్లలో కడుపు నింపుకొనేవారే ఎక్కువ. అలాంటి హోటళ్లలో ఆహారాన్ని ఎంత శుభ్రంగా వండి వారుస్తున్నారనేది పెద్ద ప్రశ్న. నిజంగా శుభ్రతా, నాణ్యత నిబంధనలను పాటిస్తున్నారా? అనేది అడిగినా చెప్పరు. ఈ నేపథ్యంలో హోటళ్లు, క్యాంటీన్లలో ఆహార భద్రతా విభాగం తనిఖీలను ముమ్మరం చేసింది.శివాజీనగర: ఇటీవల రోజుల్లో హోటళ్లలో భోజనం, అల్పాహారం ఆరగించేవారు పెరిగిపోయారు. బెంగళూరులో ఏ హోటల్కు వెళ్లినా కిటకిటలాడుతూ ఉంటుంది. డిమాండ్ ఉండడంతో వేడి వేడి అల్పాహారం, చిరుతిండ్లను వడ్డించే క్యాంటీన్లు, హోటల్లు, కెఫెలు అధికమయ్యాయి, ఆహార ప్రియులు ఇటువంటి హోటల్లకు వెళ్లి తమకు ఇష్టమైన ఆహారాన్ని సేవిస్తారు. అయితే హోటల్ ఆహారం ఎంతవరకు సురక్షితమనేది వారికి తెలియదు. అంత ముఖ్యమైనది కూడా అనుకోరు. కృత్రిమ రంగుల సమస్య నిషేధించిన రంగులను ఆహారం తయారీలో వాడుతున్నారు. ముఖ్యంగా కేక్లు, లడ్డూ మిఠాయిల వాడకంలో ఇది సమస్యగా తయారైంది. కృత్రిమమైన రంగుల మిఠాయిలను తినడం వల్ల పిల్లల్లో బుద్ధి మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు గతంలో పలు నివేదికలు హెచ్చరించాయి. పదే పదే అదే నూనె ఇక ఉపయోగించిన వంటనూనెనే పదే పదే వాడడం జరుగుతోందని ఆరోపణలున్నాయి. వంట నూనెల ధరలు పెరగడంతో ఆహార తయారీదారులు ఈ పద్ధతికి అలవాటుపడ్డారు. ఇది ప్రజల ఆరోగ్యానికి వినాశకారిగా మారుతోంది. వాడిన నూనెనే మళ్లీ వాడడం వల్ల క్యాన్సర్లు, కాలేయ జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు గతంలోనే హెచ్చరించారు. టేస్టింగ్ సాల్ట్ వినియోగం ఆహారంలో ఎక్కువగా రుచిగా ఉండాలని అధిక మొత్తంలో టేస్టింగ్ సాల్ట్లు, పౌడర్లను వాడుతారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. చాలా రోజులుగా నిల్వ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి ఇవ్వడం, నాణ్యత లేని పదార్థాలను ఉపయోగించడం ఇలా అనేక ఆరోపణలు ఆహార తయారీదారులపై ముసురుకొన్నాయి. దీంతో ఆరోగ్య శాఖ, ఆహార సురక్షిత, ఔషధ పరిపాలనా శాఖలు హోటళ్లలో తనిఖీలను ముమ్మరం చేశాయి. వ్యాపారులకు అవగాహణ ఆహార భద్రతా అధికారులు రాష్ట్రంలో గత రెండేళ్లలో హోటళ్లలో నాణ్యత తనిఖీలు చేపట్టి 3,505 శాంపిళ్లను సేకరించి విశ్లేషించారు. ఆహార సురక్షిత, నాణ్యత, శుభ్రత గురించి 33,453 హోటళ్లు, క్యాటరింగ్ వ్యాపారులకు శిక్షణనిచ్చారు. ఆహార సురక్షత, నాణ్యత స్థాయి చట్టం– 2006ను ఉల్లంఘించిన 75 ఆహార వ్యాపారులకు భారీమొత్తాల్లో జరిమానాలు విధించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. వంట నూనెను పదే పదే వేడి చేసి ఉపయోగించరాదని 2024 మార్చిలో హోటళ్లకు, ప్రజలకు సూచన చేసినట్లు ఆహార సురక్షత విభాగం తెలిసింది. వాడిన నూనెను మళ్లీ ఉపయోగించకుండా అడ్డుకోవడానికి రాష్ట్రంలో 2022 నుంచి ఇప్పటివరకు హోటళ్ల నుంచి 62 లక్షల లీటర్ల వాడిన వంట నూనెను సేకరించారు. టేస్టింగ్ సాల్ట్ను చాలా తక్కువ మోతాదులోనే వాడాలని నిబంధనలను విధించారు. -
రైతుల కష్టం.. హోటళ్లకు లాభం
సాక్షి బళ్లారి: మధ్య ప్రాచ్య దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావంతో కొన్ని నెలలుగా కూరగాయల ధరలు పడిపోయాయి. అప్పులు చేసి ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసిన అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. పండించిన కూరగాయలకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. నగరంలోని ఏపీఎంసీకి రోజూ బళ్లారి చుట్టుపక్కలతో పాటు పొరుగున ఆంధ్రప్రదేశ్ నుంచి రైతులు టమాటా, ఉల్లిగడ్డలు, వంకాయ, క్యారెట్, బీరకాయ, తదితర కూరగాయలను వాహనాల్లో తీసుకొచ్చి హోల్సెల్గా విక్రయిస్తుంటారు. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి కూరగాయల ధరలు నేలచూపు చూస్తున్నాయి. టమాటా రూ.5, ఉల్లిగడ్డలు రూ.5, బీట్రూట్ రూ.10 లోపే, క్యారెట్ రూ.10, చిక్కుడు, దోసకాయ, క్యాబేజీ, తదితర కూరగాయలలను రైతుల నుంచి రూ.8 నుంచి రూ.10 లోపే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇక కమీషన్, జీఎస్టీ తదితరాలను పట్టుకుంటున్నారు. పెట్టుబడుల మాట అటు ఉంచితే కార్మిక వ్యయం, రవాణా ఖర్చులు కూడా దక్కడం లేదు. గ్యాస్ ధర పెరిగిందని చెబుతూ.. రిటైల్గా బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు భారీగా పడిపోవడంతో వినియోగదారులు కూడా రైతుల కష్టాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు భారీగా పడిపోయినప్పటికీ హోటళ్లలో మాత్రం రోజు రోజుకు ధరలు పెంచేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదనే సాకు చెబుతున్నారు. ఇడ్లీ, దోసె, వడ, పూరీ, భోజనాలు తదితర ఆహార పదార్ధాల ధరలను రెట్టింపు చేసుకుని లాభాలు ఆర్జిస్తున్నారు. కూరగాయల ధరలు చౌకగా లభిస్తున్నప్పటికీ ఇష్టానుసారంగా హోటళ్లలో ధరలు పెంచి దోచుకుంటున్నారు. ఓ వైపు కూరగాయల ధరలు కుప్పకూలి రైతులు నష్టాల్లో కుదేలవుతున్నారు. విత్తనాలు, ఎరువులు, మందులు, కార్మిక ఖర్చులు, రవాణా ఖర్చులు పెరుగుతుండటంతో ఆదుకోవాల్సిన పాలకులు, చోద్యం చూస్తున్నారు. పడిపోయిన కూరగాయల ధరలు కుదేలవుతున్న అన్నదాతలు గ్యాస్ ధర పెరిగిందని చెబుతూ హోటళ్లలో భారీగా ఆహారం ధరల పెంపు దోపిడీకి తెరలేపిన హోటళ్ల యజమానులు -
వైభవం.. గుడికట్ల ఉత్సవం
విడపనకల్లు: విడపనకల్లులో కురుబల ఆరాధ్య దైవమైన విడపనకల్లప్ప గుడికట్ల ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిపారు. ఉత్సవానికి ముఖ్య అతిథిగా ఉరవకొండ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కురుబలంతా పాల్గొని విడపనకల్లప్ప, గుడికట్ల పట్టాదేవరలను మేళతాళాలతోను, డప్పులతో ఘనంగా ఊరేగించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని పూజలు చేశారు. పార్టీ నేతలు భరత్రెడ్డి, సీపీ వీరన్న, యోగేంద్రరెడ్డి, హోతూరు సురేష్, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు. బళ్లారి తదితర ప్రాంతాల నుంచి జాతరకు బంధువులు తరలి రావడంతో ఇంటింటా సందడి నెలకొంది. మునియప్పకు అంబేడ్కర్ అవార్డు కోలారు: అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ శాఖ అందించే డాక్టర్ అంబేడ్కర్ అవార్డుకు జిల్లాకు చెందిన సీనియర్ దళిత నాయకుడు, పాత్రికేయుడు సీఎం మునియప్పను ఎంపిక చేశారు. ఈనెల 14వ తేదీన విధాన సౌధ బాంక్వెట్ హాల్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య అవార్డుతో పాటు రూ.5 లక్షల నగదు, 20 గ్రాముల బంగారు ప్రశస్తిని అందించనున్నారు. అవార్డుపై స్పందించిన సీఎం మునియప్ప మాట్లాడుతూ.. అవార్డు రావడం సంతోషం కలిగించిందన్నారు. సముదాయం ఎదుగుదల కోసం పోరాటాలు సాగించానని తెలిపారు. చైన్ దొంగిలించిన వ్యక్తి అరెస్ట్ శ్రీనివాసపురం: తాలూకాలోని దొడమలదొడ్డి గ్రామంలో మహిళ మెడలోని మాంగల్యం చైన్ను దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.5 లక్షలు విలువ చేసే 36 గ్రాముల చైను, కాసు, రెండు గుండ్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసపురం తాలూకా మొగిలహళ్లి గ్రామానికి చెందిన ఎం.ప్రేమ కుమార్ (21) పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు. దొడమలదొడ్డి గ్రామానికి చెందిన శ్రావణి సాయంత్రం పొలం నుంచి ఇంటి వెళుతున్న సమయంలో మాటు వేసిన ప్రేమకుమార్.. శ్రావణి మెడలోని మాంగల్యం గొలుసు లాక్కొని పారిపోయాడు. శ్రావణి శ్రీనివాసపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 36 ఏళ్ల తర్వాత పట్టుబడిన హత్య కేసు నిందితుడు కోలారు: హత్య కేసులో నిందితుడిగా ఉన్న శీనప్ప అనే వ్యక్తిని 36 ఏళ్ల తరువాత నంగలి పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ముళబాగిలు తాలూకాలోని హుళికుప్ప గ్రామంలో జనవరి 30, 1990వ తేదీన తన కుమారుడు నారాయణప్ప కనిపించడం లేదని తల్లి వెంకటమ్మ నంగలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఒకరోజు తరువాత వంకలో పూడ్చిన స్థితిలో నారాయణప్ప శవం కనిపించింది. హత్య జరిగినట్లుగా భావించిన నంగలి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హత్య కేసులో నిందితుడు అయిన శీనప్పకు అప్పుడు 29 సంవత్సరాలు. 36 సంవత్సరాలు గడిచినా నిందితుడి ఆచూకీ తెలియలేదు. నూతన ఎస్పీ కన్నికా సిక్రివాల్ పాత కేసులను తిగదోడి మళ్లీ రీ ఓపెన్ చేయించారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని రచించారు. నిందితుడు శీనప్ప కుప్పంలోని ఓ హోటల్లో పని చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు అరెస్టు చేసి తీసుకొచ్చి జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. కేజీఎఫ్లో అవినీతి అక్రమాలుకేజీఎఫ్: నియోజకవర్గ ఎమ్మెల్యే రూపా పిల్లల మనసులలో జాతి విషబీజాలను నాటుతున్నారని బీజేపీ నాయకుడు వళ్లల్ మునిస్వామి ఆరోపించారు. ఆదివారం ఇంటర్ పరీక్షలో అత్యున్నత మార్కులు సాధించిన అహింద వర్గం పిల్లలను సన్మానించి మాట్లాడారు. కెజీఎఫ్ తాలూకాలో 80 శాతం మంది అహింద వర్గం వారు ఉన్నారు. ఎంతో మంది ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించారు. అయితే ఎమ్మెల్యే తనకు కావలసిన వారి పిల్లలను మాత్రమే పిలిచి ఇంట్లో సన్మానం చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే అన్ని సముదాయాల వారిని సమానంగా చూడాలన్నారు. కేజీఎఫ్లో అధికారులు ఓ వ్యక్తి సహకారంతో అవినీతి అక్రమాలు నిర్వహిస్తున్నారని ఇందుకు తన వద్ద దాఖలాలు ఉన్నాయన్నారు. తాగునీటి సమస్య ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
పుష్ప యాగం
● హలసూరులో నేత్రపర్వంగా పల్లకీ ఉత్సవం బెంగళూరు నడిబొడ్డున హలసూరులో ఆదివారం పూల పల్లకీ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. వైవిధ్య దేవీ దేవతల రూపాలలో మల్లెలు, ఇతర పుష్పాలతో పల్లకీలను అలంకరించి వాహనాలలో పురవీధుల్లో ఊరేగించారు. సోమేశ్వర ఆలయం, కామాక్షమ్మ ఆలయాల నుంచి బయల్దేరిన పదుల సంఖ్యలోని పూల పల్లకీల వైభవాన్ని చూడడానికి ప్రజలు రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. స్థానిక సంఘాలు, భక్తులు వారం రోజుల నుంచి పూల పల్లకీల తయారీలో నిమగ్నమయ్యారు. టన్నుల కొద్దీ పుష్పాలను ఇందుకు ఉపయోగించారు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ పల్లకీ జాతర కనువిందు చేసింది. ప్రతి ఏటా ఏప్రిల్లో ఈ వేడుకను జరపడం సంప్రదాయంగా వస్తోంది. – బనశంకరి: -
ఉద్యోగ మేళాకు స్పందన
రాయచూరు రూరల్: నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పిలుపునిచ్చారు. ఆదివారం కన్నడ భవనంలో జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఉద్యోగ ఉపాధి కేంద్రం ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు తమకు ఇష్టమైన ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. స్వయం ఉపాధికి ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారి ని్తీష్, జిల్లా పంచాయతీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ, ఎస్పీ అరుణాంగ్శు గిరి తదితరులు పాల్గొన్నారు. అంబులెన్స్ ప్రారంభం రాయచూరు రూరల్: ప్రజలు అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఉప్పార వాడిలో విస్తార పైనాన్ష్ సేవా ట్రస్ట్, బాలంకు ఆస్పత్రి ఆద్వర్యంలో నూతన అంబులెన్సును ప్రారంభించారు. ఆదివారం జరగనున్న మెగా ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు బసనగౌడ, నాగరాజ, బి.వి. నాయక్, బండేష్ తదితరులు పాల్గొన్నారు. -
కనులవిందుగా రథోత్సవం
శ్రీనివాసపురం: తాలూకాలోని రోణూరు వైకుంఠపురంలో అర్జున ప్రతిష్టిత శ్రీనివాస శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవం ఆదివారం కనుల పండువగా జరిగింది. అర్చకులు ఉదయం నుంచి స్వామివారి మూలవిరాట్టుకు, ఉత్సవ విగ్రహాలకు పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయం ముందున్న రథ వీధిలో తేరును లాగారు. భక్తులు తేరు మీదకు దవనం, అరటి పండ్లు విసిరారు. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులకు పానకం, పెసర బేడలు, మజ్జిగ పంచారు. హంతక హిప్పో పిల్ల మృత్యువాత శివమొగ్గ: గత మార్చి 19న శివమొగ్గ జిల్లా త్యావరకొప్ప జూ పార్క్లో ట్రైనీ వెటర్నరీ డాక్టర్ సమీక్షా రెడ్డిపై గర్భంతో ఉన్న నీటి ఏనుగు (హిప్పో పోటామస్) దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సమీక్షా రెడ్డి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మరణించారు. తాజాగా ఈ నీటి ఏనుగుకు జన్మించిన పిల్ల నీటి ఏనుగు మరణించింది. హంసిని అనే పేరు ఉన్న తల్లి హిప్పో గతంలో రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అవి కూడా కొన్నిరోజుల్లోనే అనారోగ్యంతో మృతి చెందాయి. మూడో పిల్ల అయినా బతికి బట్టకడుతుందని జూ అధికారులు ఆశపడ్డారు. అయితే అది కూడా చనిపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి. యువతి మరణించి.. వెలుగులు పంచి.. యశవంతపుర: ప్రమాదంతో బ్రెయిన్డెడ్ అయిన యువతి అవయవాలను తల్లిదండ్రులు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన హాసన్ జిల్లాలో జరిగింది. అరసికెరె తాలూకా కారేహళ్లికి చెందిన మోనిక (18) ద్వితీయ పీయూసీ పరీక్షలు రాసింది. 5న సాయంత్రం బీహెచ్ రోడ్డు ఎపిఎంసి మార్కెట్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఆమెకు తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం బ్రెయిన్డెడ్ అయిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల వినతి మేరకు మోనిక తల్లిదండ్రులు అవయదానానికి అంగీకరించారు. గుండె, కళ్లు, కిడ్నీలు వంటి ముఖ్యమైన అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు పంపించారు. ఆమె వల్ల పలువురికి కొత్త జీవితాలు దక్కాయి. రోడ్డుపై నుంచి కారు పల్టీ ● కుటుంబానికి గాయాలు తుమకూరు: నగరం నడిబొడ్డున నిర్మాణంలో ఉన్న వంతెన పై నుంచి గుంతలో కారు పడిపోయింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలు, వారి ఇద్దరు కూతుళ్లు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారు బాగా ధ్వంసమైంది. నగరంలోని హనుమంతపురలో జాతీయ రహదారి– 48 పై నిర్మాణంలో ఉన్న వంతెన మీద ఆదివారం ఉదయం 11 గంటలప్పుడు వెళ్తుండగా అదుపుతప్పి కింద పడిపోవడంతో జనం వెంటనే పరుగులు తీసి బాధితులను బయటకు తీసి రక్షించారు. క్షతగాత్రులను సిద్ధగంగా ఆస్పత్రికి తరలించారు. రెండేళ్ల నుంచి ఈ వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు కూడా లేవు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ కర్ణాటకకు మేలు దొడ్డబళ్లాపురం: ఆర్టికల్ 371జే సవరణ వల్ల కళ్యాణ కర్ణాటక ఎంతో అభివృద్ధి చెందుతోందని అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె తెలిపారు. బీదర్లో రాష్ట్ర 40వ పాత్రికేయుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆర్టికల్ 371జే వల్ల ఈ ప్రాంతానికి ప్రత్యేక నిధులు, అవకాశాలు, స్థానికులకు ఉద్యోగాలు అన్నీ లభిస్తున్నాయన్నారు. పాత్రికేయులు సమాజంలో అసమానతలు తొలగేలా, అందరికీ న్యాయం జరిగేలా వార్తలు రాయాలని, నిజాన్ని నిర్భయంగా తెలియజేయాలని సూచించారు. -
పుట్టుకతో వచ్చే వ్యాధి ‘పెదవి చీలిక’
బళ్లారి రూరల్: ప్రతి 2 వేల మంది పిల్లల్లో ఒక్కరికి పెదవి చీలిక వచ్చే అవకాశం ఉందని బళ్లారి లయన్స్ క్లబ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ లయన్ ఎస్.కె.అజయ్ తెలిపారు. బళ్లారి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత పెదవి చీలిక పరీక్షలు, శస్త్రచికిత్సల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెదవి చీలిక వంశపారంపర్యంగా పిల్లలకు పుట్టుకతోనే వచ్చే ఒక వ్యాధి అని పేర్కొన్నారు. ఇందువల్ల చిన్నారులు తల్లిపాలు తాగడానికి ఇబ్బంది పడతారన్నారు. పోతపాలు వల్ల పిల్లలు వివిధ వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. పెదవి చీలిక వల్ల దంత సమస్యలు, ఇన్ఫెక్షన్స్ తరచూ వచ్చే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే పెదవి చీలికకు శస్త్రచికిత్స చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవని తెలిపారు. బళ్లారి లయన్స్క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశలోని గుంతకల్లు ,రాయదుర్గం, నేమకల్లు, బొమ్మనహాళ్, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 35 మంది పెదవి చీలిక పిల్లలను వైద్యం వారి తల్లిదండ్రులు తీసుకొచ్చారన్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం 15 మందిని శస్త్రచికిత్సల నిమిత్తం ఈనెల 15వ తేదీన బెల్గాంకు పంపుతామని వెల్లడించారు. శస్త్రచికిత్సలు, రవాణా, వసతి సౌకర్యం ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్క్లబ్ సభ్యులు డాక్టర్ గడ్డి దివాకర్, బెల్గాంకు చెందిన డాక్టర్ అపూర్వ, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు క్రమశిక్షణ ముఖ్యం
సాక్షి బళ్లారి: ప్రతి విద్యార్థికి చదువుకునే రోజులు, విద్యార్థి దశ మరుపురానివి. సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని మాజీ ఎమ్మెల్యే గాలిసోమశేఖర్ రెడ్డి సూచించారు. నగరంలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, కర్ణాటక జిల్లా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలబుర్గి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ పీజీఆర్ సింధ్యను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింధ్య విద్యా ప్రస్తానం, సమాజ సేవ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాల్లొ పాల్గొనడం హర్షణీయమన్నారు. విద్యా రంగంలో అనేక విజయాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. నేటి విద్యార్థులు, యువత సెల్ఫోన్లు వాడుతూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తమ లక్ష్యానికి చేరుకోకుండా సమస్యల్లో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికత, సెల్ఫోన్లను సరైనా మార్గంలో ఉపయోగించుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాక్షించారు. సంఘాన్ని బలోపేతం చేయాలి రాయచూరు రూరల్: వ్యాయామ ఉపాధ్యాయలు ఐకమత్యంగా ఉంటూ సంఘాన్ని బలోపేతం చేయాలని తాలుకా విద్యాశాఖ అధికారి ఈరన్న పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్జీఓ కార్యాలయంలో వ్యాయామ ఉపాధ్యాయుల జిల్లా, తాలుకా స్థాయి పదాధికారుల పద గ్రహణం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు యంకప్ప, రంగస్వామి, రాజశ్రీ , బాలప్ప, రవీంద్ర, రాజు, కృష్ణ, రమేష్, సుచిత్, హనుమంతరాయ, ప్రకాష్, జయలక్ష్మి, రవి, కవిత, వెంకటేష్, శకుంతల, పరిమళ, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు. మహిళా రచయితలను గుర్తించాలి హొసపేటె: సమాజం మహిళలను మాతృ ప్రేమతో గౌరవిస్తుంది. ఇది కేవలం మాతృత్వానికే పరిమితం అయితే మహిళలు అంతకుమించి ఎంతో కృషి చేశారు. మనం దానిని కూడా గుర్తించాలని కర్ణాటక మహిళ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.సునందమ్మ తెలిపారు. హంపీ కన్నడ విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ టి.మీనాక్షి రచించిన అభినందన పుస్తకాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనేక సందర్భాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ విజయాలు సాధించారన్నారు. అయినప్పటికీ వారిని ఒక పరిమితం అయిన విధానంలో గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషాదిక్య వ్యవస్థలో మహిళ విజయాలు మరుగున పడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వీరేష్ బడిగేర్, రచయిత ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిహొసపేటె: ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అని ఎస్పీ జాహ్నవి తెలిపారు. శనివారం హొసపేటె నగరంలోని వివిధ కూడళ్లలో వాహనాల తనిఖీ చేపట్టారు. హెల్మెట్లు ధరించని వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వారితో అక్కడికక్కడే హెల్మెట్ కొనుగోలు చేయించి, రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. హెల్మెట్ విషయంపై పోలీస్ శాఖ అవగాహన కల్పించిన తర్వాత జరిమానా విధించాలి. ఇది తెలియకుండా ఏకంగా వాహనాలను అడ్డుకోవడంపై వాహనదారులు శాపనార్థాలు పెడుతున్నారు. ఈ విషయంపై ఎస్పీ జాహ్నవి స్పందిస్తూ.. రోడ్డు భద్రతకు హెల్మెట్ల వాడకం అత్యవసరమన్నారు. ప్రమాదాల్లో ప్రాణ నష్టం నివారించడానికి ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలని పేర్కొన్నారు. -
భక్తిశ్రద్ధలతో కాళికా మాత జయంతి
రాయచూరు రూరల్: నగరంలో కాళికా మాత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆదివారం విశ్వకర్మ సమాజం ట్రస్ట్, వందలాది మంది భక్తుల సముక్షంలో అమ్మవారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాళికా దేవిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి విగ్రహాన్ని పల్లకీలో కొలువుదీర్చి ఊరేగించారు. దేవికి పూలు పండ్లు, దవనం, ధాన్యాలతో పూజలు చేశారు. అంతకుముందు ముత్తయిదువులు కలశాలతో ఊరేగింపు చేపట్టారు. కార్యక్రమంలో ఈశ్వర్, నారాయణ, జయంతాచారి, నాగరాజ్, రవీంద్ర, లక్ష్మీపతి, హరినాథ్, మల్లేష్, మౌనేష్, ఆనంద శ్రీకాంత్, గిరిబాబు, వినోద, ఆకాష్, హరహరన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
తాగునీరు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
హొసపేటె: గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తాగునీరు, పరిశుభ్రతను కమిటీ సభ్యులు ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని పీడీఓ నారాయణప్ప తెలిపారు. తాలూకాలోని పూజారహళ్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామీణ తాగునీరు, పారిశుధ్య హొసేపేట విభాగం ఆధ్వర్యంలో గ్రామ నీరు, పారిశుధ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నీటి వనరుల పరిరక్షణ, నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, నీటి గంట (నీటి పంపిణీదారు) వివిధ సంఘాల, సంస్థల ప్రతినిధులతో కలిపి 10 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని గ్రామాల్లో ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ నీరు, పారిశుధ్య శాఖ జిల్లా స్థాయి అధికారి మహంతేష్ మాట్లాడుతూ.. తుంగభద్ర నది నుంచి నీటిని సరాఫరా చేసే బహుళ– గ్రామ తాగునీరు పథకం కూడా ఇందులో భాగంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ జీవన్ మిషన్ సరఫరా పథకం కింద ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరుగుతోందన్నారు. గ్రామ నీరు, పారిశుధ్య కమిటీ తమ గ్రామంలోని తాగునీరు, పరిశుభ్రతపై మరింత దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటిని వినియోగించని వారితో మాట్లాడాలన్నారు. మరుగుదొడ్లను తప్పక ఉపయోగించుకునేలా సూచించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిల్ కలెక్టర్ పాలయ్య, కంప్యూటర ఆపరేటర్ అర్పిత, భవాని, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ సమితి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చిక్కలో కరగ కోలాహలం
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరంలో గంగమ్మ ఆలయంలో శనివారం రాత్రి శ్రీ ధర్మరాయస్వామి, ద్రౌపదీదేవి పూల కరగ సంబరం ఆద్యంతం భక్తులను పరవశుల్ని చేసింది. పూజారి ధర్మేంద్ర కరగనెత్తుకుని నాట్యమాడారు. ఆలయం నుంచి ప్రారంభమైన కరగ నగర వీధుల గుండా భారీ సందోహం మధ్య సాగింది. ప్రధాన సర్కిళ్లలో కరగధారి నృత్యం చేయగా భక్తులు హర్షధ్వానాలు చేశారు. జూనియర్ కాలేజీ ఆవరణలో వేదికపై నృత్య ప్రదర్శన సాగింది. ప్రజలు ప్రతి వీధిలో కరగకు పూజలు చేసి ఘన స్వాగతం పలికారు. నగరంలోని 31 వార్డులలో కరగ సంచరించింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఊరేగింపు సాగింది. ఎస్పీ కుశాల్ చౌక్సె కరగ ఉత్సవంలో పాల్గొని పోలీస్ బందోబస్తు నిర్వహించారు. -
పోలీసులకు యోగా శిక్షణ ఉపయుక్తం
హొసపేటె: సమాజంతో శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసులు నిత్యం శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలి. త్వరలో డీఎంఐ యంత్రం ద్వారా స్థూలకాయ పరీక్షను తప్పనిసరి చేయనున్నట్లు ఎస్పీ ఎస్.జాహ్నవి తెలిపారు. ఆదివారం నగరంలో డీఏఆర్ పోలీస్ పరేడ్ మైదానంలో హొసపేటె ఉప విభాగం పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం పతాంజలి యోగా సమితి జిల్లా విభాగం ఆధ్వర్యంలో 15 రోజుల ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యోగా అనేది ఒక జీవన విధానంగా మారాలని సూచించారు. ఈ శిక్షణ కేవలం జిల్లా కేంద్రంలోనే కాకుండా మిగిలిన రెండు ఉప విభాగాల్లో కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మంజునాథ్ తెలిపారు. -
గుండెపోటుతో న్యాయవాది మృతి
రాయచూరు రూరల్: గుండెపోటుతో న్యాయవాది మృతి చెందిన ఘటన కొప్పళ జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం కొప్పళ జిల్లా కుష్టగి సివిల్ సీనియర్ కోర్టులో కేసు వాదిస్తున్న సమయంలో న్యాయవాది నింగప్ప (48) గుండెపోటుకు గురై మృతి చెందారు. తావరగెరకు చెందిన నింగప్ప.. కోర్టు కార్యకలాపాల్లో నిమగ్నులు కావడంతో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్లు సమాచారం. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి కోలారు: జిల్లాలోని బంగారుపేటలో ఉన్న ఎస్డీసీ విద్యార్థులు శనివారం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జనజాగృతి జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా కెజీఎఫ్ ఎస్పీ శివాంశు రాజపూత్ మాట్లాడుతూ.. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలను సేవించాలని బలవంతం చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మాదక ద్రవ్యాలు విద్యార్థుల అమూల్య జీవితాన్ని నాశనం చేస్తాయని తెలిపారు. జాతాలో 600 మందికి పైగా విద్యార్థులు పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు. -
పట్టణ సహకార బ్యాంకులో కుంభకోణం
● రూ.7.50 కోట్ల దోపిడీ ● బ్యాంక్ ఉద్యోగిపై కేసు నమోదు సాక్షి, బళ్లారి: నగరంలోని మాన్వి పట్టణ సహకార బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో పని చేసే ఉద్యోగి రూ.కోట్లాది రూపాయలను తమ బంధువులు, ఇతర వ్యక్తుల ఖాతాల్లోకి బదిలీ చేసుకుని అవినీతికి పాల్పడ్డారు. ఉద్యోగి రమేష్ 2023 సంవత్సరం నుంచి దశల వారీగా గుట్టుచప్పుడు కాకుండా తల్లిదండ్రులు, భార్య పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచాడు. వారి ఖాతాల్లోకి ఏకంగా రూ.7.50 కోట్లు నగదును బదిలీ చేశాడు. ఆరుగురి ఖాతాల్లోను నగదును ఎవరికి అనుమానం కలగకుండా నకిలీ సంతకాలు చేసి కోట్లాది రూపాయల నగదును బదిలీ చేసుకున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఏపీఎంసీ పోలీసులకు ఫిర్యాదు అందింది. బ్యాంకులో పనిచేసి కోట్లాది రూపాయలను తమ బంధువులు ఖాతాల్లోకి జమ చేసుకున్న రమేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తల పార్టీ రాయచూరు రూరల్: బీజేపీ కుటుంబ పార్టీ కాదని.. కార్యకర్తల పార్టీ అని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ప్రశిక్షణ శిబిరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి సేవలు చేయలేని, కుటుంబ రాజకీయాలు చేసేవి రాజకీయ పార్టీలు కాదన్నారు. బీజేపీకి అజాత శత్రువుగా పేరు పొందిన అటల్ బిహరీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్ తదితరులు పార్టీకి చేసిన సేవలు మరువరానివని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీరన గౌడ, శంకరప్ప, అమర్నాథ్ పాటిల్, సుశీల్ నమోషి, రాజ్ కుమార్, రాఘవేంద్ర, రమానంద యాదవ్, రవీంద్ర, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాహం తీరుస్తున్న చలివేంద్రాలురాయచూరు రూరల్: వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం అమృత నెరళు పేరుతో రాయచూరు నగర సభ అధికారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాలు దాహార్తి తీరుస్తున్నాయి. ప్రజలు సేద తీరేందుకు వెదురుతో గుడిసెలు నిర్మించి, అందులో నీటి కుండలను పెట్టి నీటి వసతి కల్పించారు. నగరంలోని ఆర్టీఓ సర్కిల్, కేఈబీ పాఠశాల, జహిరాబాద్ సర్కిల్, తీన కందిల్, బస్టాండ్, గంజ్ సర్కిల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలు అమృత నెరళును సద్వినియోగం చేసుకోవాలని నగర సభ కమిషనర్ జుబీన్ మోహపాత్రో సూచించారు. ఆత్మ విశ్వాసంతో విధులు నిర్వర్తించాలిరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మ విశ్వాసంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ అరుణాంగ్శు గిరి సూచించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ముఖ్యమంత్రి పతకం అందుకున్న డీఎస్పీ శాంత వీరకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధ్యతగా విధులు నిర్వహించినప్పుడే జీవితంలో ౖఏదెనా సాధించేందుకు అవకాశాలు ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కుమార స్వామి, హరీష్, డీఎస్పీ వెంకటేష్, ఏసీ హంపణ్ణ, జిల్లా జైలర్ అనిత, సీపీఐలు నాగారాజ్, ఉమేష్ కాంబ్లే, ఎస్ఐలు మంజునాథ్, బసవరాజ్, పరమానంద, డి.ప్రకాష్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పీయూసీలో మార్కులు తక్కువ వచ్చాయని ఆత్యహత్యహుబ్లీ: పీయూసీలో తక్కువ మార్కులు వచ్చాయనే బాధతో విద్యార్థిని ఆత్యహత్య చేసుకున్న ఘటన స్థానిక ఉనకల్ సిద్ద కళ్యాణ నగర్లో చోటు చేసుకుంది. విద్యా నగర్ కనకదాస కళాశాల విద్యార్థిని శ్రావణి (18). ఇటీవల విడుదలైన ద్వితీయ పీయూసీ ఫలితాల్లో కామర్స్ విభాగంలో 77 శాతం మార్కులు సాధించింది. శ్రావణి తండ్రి మారుతి ఆటో గ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇంట్లో చదవడానికి అవకాశం లేకపోవడంతో ఉనకల్లోని అవ్వతాత ఇంట్లో పెట్టారు. చురుకై న విద్యార్థిని శ్రావణి పరీక్షల్లో 95 శాతం మార్కులు తెస్తానని చాలా ఆశ పెట్టుకుంది. ఎక్కువ మార్కులు సాధించలేక పోయానన్న మనోవేదనకు గురైన శ్రావణి.. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆశించిన మేర మార్కులు సాధించక పోవడంతో ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. మార్కులే జీవితం కాదని తొందర పాటుతో విద్యార్థులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోరాదని మానసిక వైద్యులు పేర్కొన్నారు. -
కొప్పళలో మరో లవ్ జిహాద్ కేసు
హుబ్లీ: హుబ్లీ–ధార్వాడ తర్వాత కొప్పళలో మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. కొప్పళ తాలూకా కంప్లి గ్రామానికి చెందిన ముస్తఫా.. నర్సింగ్ చదువుతున్న విద్యార్థినితో ప్రేమాయణం సాగించాడు. యువతిని మభ్యపెట్టి పార్కులకు తీసుకెళ్లాడు. అంతేగాక లవ్ జిహాద్కు ప్రేరణ ఇచ్చారని బాధిత యువతి బంధువులు ఆరోపించారు. ఇటీవల వీరిద్దరు జిల్లా ఆస్పత్రి వద్ద ఉండగా హిందూ జాగరణ వేదిక కార్యకర్తలకు చిక్కారు. ఈ క్రమంలో ముస్తఫా మొబైల్ పరిశీలించగా.. హిందూ యువతుల ఫొటోలు, నగ్న వీడియోలు దర్శనమిచ్చాయి. హిందూ యువతులకు బీర్ తాపించి, మాంసం తినిపించినట్లు సమాచారం. అంతేగాక గంజాయి, ఉక్కాతో ఉన్న వీడియోలు కూడా ఉన్నట్లు తేలింది. ముస్తఫా మట్కా బుక్కి అని చెబుతున్నారు. హిందూ జాగరణ వేదిక, విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు కార్యకర్తలు జిల్లా ఎస్పీ డాక్టర్ అరసిద్దిని కలిశారు. హిందూ యువతులను లవ్ జిహాద్కు ముస్తఫా ప్రేరేపిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. తక్షణమే కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. -
కార్యకలాప–ఆధారిత విద్యను అందించాలి
హొసపేటె: ఉపాధ్యాయులు గణిత కిట్లను వినియోగించుకుని తమ బోధనలో పరిపూర్ణత సాధించాలి. తద్వారా పిల్లలకు కార్యకలాప–ఆధారిత విద్యను అందించాలని విషయ తనిఖీ అధికారి, ఎస్ఎస్ఎల్సీ నోడల్ అధికారి హులిబండి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక చిత్తవాడిగి ప్రభుత్వ ప్రీ–యూనివర్సిటీ కళాశాలలో పాఠశాల విద్యాశాఖ, అక్షర ఫౌండేషన్ సహకారంతో గణిత అభ్యాస ఉద్యమం కార్యక్రమం కింద జిల్లా స్థాయి గణిత సదస్సు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు ఉత్తమ విద్యను అందించే లక్ష్యంతో పాఠశాలలో మంచి వాతావరణాన్ని కల్పించేందుకు ఎస్డీఎంసీ అధ్యక్షులు, సభ్యులు ఉపాధ్యాయులతో కలిసి పని చేయాలని సూచించారు. డైట్ అధ్యాపకులు, నోడల్ అధికారి గర్హ్ ప్రభురాజ్ పాటిల్ మాట్లాడుతూ.. గణిత ఉపాధ్యాయుల కోసం రూపొందించిన గణిత అభ్యాస ఉద్యయం 2.0 ఆఫ్లైన్ శిక్షణపై వివరించారు. గణిత కిట్లు అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు చేరాయని.. ఉపాధ్యాయులందరూ ఈ శిక్షణ వనరులను వినియోగించుకుని పిల్లలకు కార్యకలాప–ఆధారిత విద్యను అందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిత్తవాడిగి పీయూ కాలేజీ ప్రిన్సిపల్ నాగరాజ్, ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు శివానంద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర గొప్పది
సాక్షి, బళ్లారి: ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకం. సత్యం, న్యాయం వైపు పత్రికలు పనిచేయాలని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. శనివారం బీదర్లో కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, బీదర్ జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 40వ రాష్ట్ర పత్రికా సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పత్రికలు నిజాయితీగా పని చేసినప్పుడే ప్రజాస్వామ్యం పరఢవిల్లుతుందని తెలిపారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఒత్తిడికి గురికాకుండా నిజాయితీగా పనిచేయాలని సూచించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తీసుకుని రావాలన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తే ప్రభుత్వం స్పందించేందుకు దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఈశ్వర్ ఖండ్రే, రహీంఖాన్, శరుణు ప్రకాష్ పాటిల్, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన విలేకరులు పాల్గొన్నారు. -
ఫుట్పాత్ పరిశీలన
సాక్షి, బళ్లారి: నగరంలో కనక దుర్గమ్మ ఆలయ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద పాదచారులు వెళ్లేందుకు నిధులు వెచ్చించి ఫుట్పాత్ పొడవునా ఇనుప రాడ్డు, చైన్లు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా పని చేయడంతో ఇనుప రాడ్డు, చైన్లు అప్పుడే ఊడిపోయాయి. వాటికి మరమ్మతులు చేయించేందుకు అధికారులు చొరవ చూపకపోవడంతో శనివారం సాక్షి దినపత్రికలో ‘నాణ్యతకు తిలోదకాలు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. శనివారం సంబంధిత అధికారులు స్పందించారు. ఊడిపోయిన ఇనుప రాడ్లు, చైన్లకు మరమ్మతులు చేయించారు. పాదచారుల రాకపోకలు సాగించేందుకు చర్యలు తీసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ధర్మ మార్గంలో నడవాలి సాక్షి బళ్లారి: ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. ధర్మ మార్గంలో నడుస్తూ ధ్యానం, దైవ నామస్మరణ చేస్తూ జీవితాన్ని కొనసాగించాలని కొప్పళ గవిమఠం అవినవ గవి సిద్దేశ్వర స్వామి పేర్కొన్నారు. శనివారం తాలూకాలోని హంద్యాళ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అహంకారం, గర్వం నేను అనే భావన వీడి పరోపకారం కోసం పరితపించాలన్నారు. దేవుడిని మనసులో ఉంచుకుని పని చేయాలని సూచించారు. అహంకారం విడిచి పెడితేనే జీవితం సాఫీగా సాగుతుందన్నారు. కాలం మారిందని చెప్పే ముందు మనుషులు తమ మనస్సు, భావోద్వేగాలు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. జీవితంలో మనుషులకు బాధలు వస్తాయంటే ఉన్న పరిస్థితులను అంగీకరించే మనోభావం లేకపోవడమే ప్రధాన కారణమని వివరించారు. కార్యక్రమంలో శ్రీధరగడ్డ శాఖ విరక్తిమఠ కొట్టూరు స్వామి, స్థానిక ఎమ్మెల్యే గణేష్ తదితరులు పాల్గొన్నారు. ధర్మచింతనతో ప్రశాంతతసాక్షి, బళ్లారి: ప్రేమ, సహనం, ఐక్యత, ధర్మచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని వక్తలు పేర్కొన్నారు. రాజస్తాన్లో మౌంటు అబూలో విశ్వ ఏకతా దినోత్సవం సందర్భంగా బళ్లారి నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పాల్గొని, ఆధ్యాత్మిక గురువుల నుంచి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో జీవిస్తున్నారన్నారు. బ్రహ్మకుమారి ఓం శాంతి సంస్థ సమాజంలో శాంతి నెలకొల్పేందుకు విశేష కృషి చేస్తోందని కొనియాడారు. ఆధ్యాత్మిక చింతన, ధ్యానం తదితర మంచి అలవాట్లు నేర్చుకుని ఉత్తమ జీవితాన్ని కొనసాగించాలన్నారు. అబార్షన్ చేయడం చట్టరీత్యా నేరంసాక్షి, బళ్లారి: చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరలో 16 సంవత్సరాల బాలికపై ఉపాధ్యాయుడు హెచ్.ఓ.రాజణ్ణ లైంగిక దాడి చేయడంతో గర్భం దాల్చింది. చెళ్లకెరెలోని లక్ష్మీ శ్రీనివాస నర్సింగ్ హోమ్కు చెందిన డాక్టర్ శంకర లక్ష్మితో మాట్లాడి బాలికకు గర్భస్రావం చేయించిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్దంగా ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు అబార్షన్ చేసిన విషయం వెలుగులోకి రావడంతో శనివారం లక్ష్మీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ను వైద్యాధికారులు తనిఖీ చేశారు. అబార్షన్ చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినా డబ్బుకు ఆశపడి బాలికకు అబార్షన్ చేసిన వైద్యురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రికి అధికారులు చర్యలు తీసుకుంటారో లేదా వేచి చూడాలి మరి. -
సాంకేతికతను ఉపయోగించుకోండి
హొసపేటె: మీ మేథస్సుకు తోడ్పడే సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని వైస్ చాన్సలర్ డాక్టర్ డీవీ.పరమ శివమూర్తి అన్నారు. హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలోని భువన విజయ ఆడిటోరియంలో యూజీసీ పీహెచ్డీ 4వ దశ ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీతో సమయం ఆదా అవుతుందని తెలిపారు. పాత, కొత్తలను సమన్వయం చేసుకుంటూ పరిశోధనను ఒక కొత్త కోణంలో రూపొందించాలన్నారు. నేటి కంప్యూటర్ టెక్నాలజీ మానవుల ఉనికినే ప్రశ్నిస్తోందని కొందరు భయపడుతున్నారని తెలిపారు. కానీ అలాంటి భయం అవసరం లేదని భరోసా ఇచ్చారు. మనుషుల ఏ సమస్యకై నా పరిష్కారాలు కనుక్కొంటారన్నారు. వేలాది పుస్తకాలు మన చేతివేళ్ల కొనల్లోనే అందుబాటులో ఉన్న ఈ యుగంలో వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సాంస్కృతిక మేధావి డాక్టర్ జి.వి.ఆనందమూర్తి, మైసూరుకు చెందిన సీనియర్ సైన్స్ రచయిత కొల్లేగల్ శర్మ విద్యా వ్యవహారాలు డైరెక్టర్ డాక్టర్ అమరేష్ యటగల్ తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో 10 మందికి యావజ్జీవ శిక్ష
రాయచూరు రూరల్: హత్య కేసులో 10 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ రాయచూరు 3వ అదనపు జిల్లా జడ్జి శుక్రవారం తీర్పు వెలువరించారు. లింగసూగురు తాలుకా గుడదనాళలో పంచాయతీ కార్యాలయం విషయంలో ఫిబ్రవరి 10, 2021వ తేదీన హన్మంతమ్మ, శరణ బసవ, అమరేష్పై దాడి జరిగింది. శరణ బసవకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్సల నిమిత్తం బాగల్కోట అస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శరణ బసవ మృతి చెందాడు. హన్మంతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన జగదీష్, మయనూర్, మహంకాళప్ప, బసవరాజ్ డొడ్డముని, హనుమంతి, దురుగప్ప, కెంచమ్మ, యల్లప్ప, యల్లమ్మ, నింగప్పకు యావజ్జీవ శిక్ష విధిస్తూ రాయచూరు 3వ అదనపు జిల్లా జడ్జి, లింగసూగురు న్యాయమూర్తి జి.బి.జకాతి తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాది మంజునాథ్ వాదనలు వినిపించారు. -
ప్రేమ పేరుతో వంచించాడు
రాయచూరు రూరల్: ఎనిమిది ఏళ్లు ప్రేమించి పెళ్లికి నిరాకరించిన యువకుడిపై యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దేవదుర్గ తాలూకా అంజళ గ్రామానికి చెందిన హనుమంతి, మల్లికార్జున బెంగళూరులో చదువుకుంటున్న సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. హనుమంతితో కలసి మల్లికార్జున వివిధ ప్రాంతాలకు తిరిగాడు. వీరిద్దరి మధ్య ఏడు సంవత్సరాల పాటు ప్రేమాయణం నడిచింది. పెళ్లి చేసుకోవాలంటూ హనుమంతి పలుమార్లు కోరినా.. అప్పుడు చేసుకుంటా, ఇప్పుడు చేసుకుంటా అని చెప్పి మల్లికార్జున కాలం వెల్లదీశాడు. ఇటీవల హనుమంతి మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకుని రాగా.. పెళ్లి చేసుకునేందుకు మల్లికార్జున నిరాకరించాడు. ‘నీ కులం వేరు. ఇంట్లో కుటుంబ సభ్యులు వివాహానికి అభ్యంతరాలు చెబుతున్నారు. నీవు మరొకరిని వివాహం చేసుకోవాలని’ చెప్పాడు. దీంతో యువతి హనుమంతి దేవదుర్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దేవదుర్గ పోలీసులు కేసును రాయచూరు సదర్ బజార్ పోలీస్ స్టేషన్కు బదలాయించారు. బాధితురాలు హనుమంతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అతిథి ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తుండగా.. దేవదుర్గలో మల్లికార్జున నీటి పారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. సదర్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతితో ఎనిమిది ఏళ్లుగా ప్రేమాయణం కులం వేరు అని చెప్పి పెళ్లికి నిరాకరణ యువకుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు -
అర్హులకే ఉద్యోగ అవకాశాలు
హొసపేటె: ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేటప్పుడు స్థానికులైన అర్హులైన అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎటువంటి అవినీతికి తావు లేకుండా అభ్యర్థుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని నూతన డీహెచ్ఓ డాక్టర్ వినయ్కు స్లమ్ ఆర్గనైజేషన్ సభ్యులు కోరారు. డీహెచ్ఓ డాక్టర్ వినయ్ మాట్లాడుతూ.. తమ శాఖలో అవినీతికి ఎటువంటి అస్కారం లేదన్నారు. కేవలం అర్హులైన, తగిన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. స్థానికులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్య శాఖ సేవలను సమర్థవంతంగా అందించేందుకు తమవంతు కృషి చేస్తామని వెల్లడించారు. పరిపాలన సంస్కరణల కోసం ప్రజలు, వివిధ సంస్థల నుంచి వచ్చే సూచనలు కూడా ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు జంబయ్య నాయక్, దర్శన్ గౌడ్, రాజీవ్, స్లమ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు హెచ్.శేషు, ఉపాధ్యక్షుడు తన్వీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటేష్, రామచంద్ర బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుత్తి కై లాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఎన్.హులిగెమ్మ, ఉపాధ్యక్షురాలు నూర్ జహాన్, ప్రధాన కార్యదర్శి బినరూపలత, జాఫ్రీన్, ఫేక్ మెహబూబ్ బాషా, ఎల్.పాండు నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్తో భర్తపై దాడి.. ప్రియుడితో కలిసి కుట్ర
కర్ణాటక: తప్పటడుగులతో భార్యాభర్తల సంబంధాలు అవహేళనకు గురవుతున్నాయి. ఎవరో ఒకరు పరుల వ్యామోహంలో చిక్కుకుని రక్తపాతానికీ వెనుకాడడం లేదు. ఇదే మాదిరిగా తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆగ్రహించిన భార్య తన ప్రియునితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన బెళగావి నగరంలో తిళకవాడి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఆయుర్వేద వైద్యుడు అవినాశ్ సుప్పన్న (40) హత్యకు గురైన వ్యక్తి. ఈ కేసులో ఇతని భార్య లక్ష్మి (29), ఆమె ప్రియుడు కైలాస బాలక్రిష్ణ (43) అరెస్టయ్యారు. గ్యాస్ సిలిండర్తో బాది.. వివరాలు.. అవినాశ్ 5న తన ఆయుర్వేదిక్ కేర్ సెంటర్లో తలకు తీవ్ర గాయమై చనిపోయాడు. మృతిపై అనుమానాలున్నాయని అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య మాత్రం అధిక బీపీ వల్ల కిందపడి చనిపోయి ఉంటాడని నమ్మబలికింది. కేసు నమోదు చేసుకున్న తిళకవాడి పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలు, ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేసి కనిపెట్టారు. లక్షి్మ, బాలక్రిష్ణ మధ్య అక్రమ సంబంధం ఉండగా, ఇది తెలిసి అవినాశ్ భార్యను మందలించాడు. బాలక్రిష్ణ వీరి ఇంటికి దగ్గరిలోనే ఓ మొబైల్ఫోన్ల షాప్ నడిపేవాడు. తమ సంతోషానికి అడ్డుగా ఉన్న అతన్ని తొలగించుకోవాలని భార్య, ప్రియుడు నిర్ణయించారు. అవినాశ్ తన క్లినిక్లో ఉండగా, పథకం ప్రకారం బాలక్రిష్ణ చొరబడి అక్కడి గ్యాస్ సిలిండర్తో తలపై, గుండెల మీద బలంగా కొట్టి హత్య చేసి వెళ్లిపోయాడని పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సే తెలిపారు. లక్ష్మి తనకు ఏం తెలీదని బుకాయించినా పొంతనలేని సమాధానాలు ఇస్తుండడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నిజం బయటకు వచ్చింది. నిందితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన బెళగావిలో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. -
శ్రీనందకు కన్నీటి వీడ్కోలు
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లాలో మాణిక్య ధార జలపాతం వీక్షణకు వచ్చిన కేరళ బాలిక శ్రీనంద (15) అంత్యక్రియలు శుక్రవారం సొంతూరు పాలక్కాడ్ సమీపంలోని కాడంబపుర గ్రామంలో జరిగాయి. నాలుగు రోజుల కిందట మాణిక్యధార ప్రాంతంలో ఆమె అదృశ్యం కావడం, లోయలో శవం దొరకడం తెలిసిందే. అనుకోకుండా జారి పడిందా, కావాలనే దూకిందా అనేదానిపై అనుమానాలున్నాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీటి ధారలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. 10వ తరగతి చదువుతున్న శ్రీనంద ప్రతిభావంత విద్యార్థిని అని మిత్రులు తెలిపారు. చదువులు, ఆటల్లో చురుగ్గా పాల్గొనేది. కాగా, పోస్టుమార్టం నివేదిక వస్తే ఘటనపై స్పష్టత వస్తుందని పోలీసులు చెప్పారు. ఏఈఈ ఇంట్లో 6 కేజీల బంగారం● రూ.14 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు దొడ్డబళ్లాపురం: బెళగావి నగర అభివృద్ధి విభాగంలో ఏఈఈ గా పని చేస్తున్న అజయ్సింగ్ ఇల్లు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు దాడులు జరిపి రూ.14 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. అతని మీద అవినీతి కేసులు నమోదు కావడంతో 9న బెళగావిలోని ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. బ్యాంక్ ఖాతాలు, లాకర్ల గుట్టు లాగారు. భారీ మొత్తంలో డబ్బు, బంగారు నగలతో పాటు ఆస్తుల పత్రాలు బయటపడ్డాయి. వివరాలను బెళగావి లోకాయుక్త ఎస్పీ శనివారం వెల్లడించారు. అతని వద్ద 6 కేజీల బంగారం, 5 కేజీల వెండి వస్తువులు, బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.3.12 కోట్ల నగదు, బెళగావిలో 3 ఇళ్లు, సవదత్తి, హుక్కేరి, హుబ్బళ్లిలో 5 సంపన్న ప్రాంతాల్లో స్థలాలు ఉన్నట్టు తెలిపారు. ఇంట్లో ఉన్న బైక్లు, కార్లు కలిపి మొత్తం రూ.14కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. ఇవి అజయ్సింగ్ ఆదాయం కంటే ఎక్కువ ఆస్తులు అని పేర్కొన్నారు. -
బెంగళూరు– ముంబై మధ్య వందేభారత్ స్లీపర్ రైలు?
శివాజీనగర: చాలాకాలంగా ఎదురు చూస్తున్న బెంగళూరు– ముంబై నగరాల మధ్య సూపర్ఫాస్ట్ వందే భారత్ స్లీపర్ రైలు సంచారానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ముంబైకి వందే భారత్ స్లీపర్ రైలు కావాలని బెంగళూరు ఎంపీలు కోరుతున్నారు. రెండు నగరాల మధ్య సుమారు 976 కిలోమీటర్ల దూరం ఉంది. రైలు ప్రయాణం 24 నుంచి 30 గంటలు పడుతుంది. బస్సులో అయితే 16 నుంచి 18 గంటల్లో అయిపోతుంది. వందే భారత్ స్లీపర్ రైలు ఎప్పటినుంచి మొదలయ్యేది త్వరలో ప్రకటిస్తారు. రాష్ట్రంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు కానుంది. కర్ణాటకలో సుమారు 22 వందే భారత్ రైళ్లు సంచరిస్తున్నాయి. బెంగళూరు నుంచి చైన్నె, హైదరాబాద్, మంగళూరుకు వెళ్తున్నాయి. తల్లీ, కూతురి అదృశ్యం మండ్య: బంధువుల ఇంటికి వెళుతున్నా అని చెప్పి వెళ్లిన తల్లీకూతురు తిరిగి రాలేదు. వివరాలు.. శ్రీరంగ పట్టణ వద్ద హెబ్బాడిహుండికి చెందిన ముజాహిద్ భార్య రూహిల (25), ఆమె కుమార్తె మన్నత్ (4)ను తీసుకుని 7న ఉదయం మైసూరులోని బంధువుల ఇంటికి వెళుతున్నట్లు చెప్పి వెళ్లింది. అయితే బంధువుల ఇంటికి చేరుకోలేదు, మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. భర్త పలుచోట్ల గాలించినా జాడ లేరు. ఫోన్ కూడా స్విచాఫ్ వస్తోంది, దీంతో శ్రీరంగపట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. చెరువులో నంది విగ్రహం లభ్యం దొడ్డబళ్లాపురం: చెరువులో పూడికతీత తవ్వకాలు జరుపుతుండగా పురాతన కాలం నాటి నంది విగ్రహం బయటడింది. హావేరి జిల్లా హిరేకెరూరు తాలూకా దూదిహళ్లిలో ఈ సంఘటన జరిగింది. కూలీలు మట్టిని తవ్వుతుండగా 3 అడుగుల ఎత్తుగల బసవన్న రాతి విగ్రహం బయటపడడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. నందిని చూడాలని చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తరలివచ్చారు. విగ్రహాన్ని గ్రామంలోని దేవాలయం వద్ద ప్రతిష్టించాలని గ్రామస్తులు తీర్మానించారు. -
హస్తినకు హస్తం సీనియర్ల యాత్ర
శివాజీనగర: మంత్రిమండలిలో మార్పులు చేయాలని కాంగ్రెస్కు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో హస్తిన వైపు దృష్టి సారించారు. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు ముగిసింది, 3, 4సార్లు గెలుపొందిన తమకు మంత్రి పదవులు ఇవ్వాలని సీనియర్ ఎమ్మెల్యేలు ఆదివారం లేదా సోమవారం ఢిల్లీలో హైకమాండ్ పెద్దలను కలిసే అవకాశముంది. సుమారు 35 మందికి పైగా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏఐసీసీ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, కే.సీ.వేణుగోపాల్, రణదీప్సింగ్ సుర్జేవాలా తదితరులను కలిసి తమ డిమాండ్లు తెలుపుతామని కొందరు ఎమ్మెల్యేలు చెప్పారు. రెండు అసెంబ్లీ క్షేత్రాల ఉప ఎన్నికలు కూడా అయిపోవడంతో తమ గొంతును గట్టిగా వినిపించాలని తీర్మానించారు. ఎమ్మెల్యే టీ.బీ.జయచంద్ర ఈ బందంలో ఉన్నారు, తాము ఢిల్లీకి వెళ్లి నేతలను కోరడం తథ్యమని చెప్పారు. ఎంతమందికి మంత్రిమండలిలో అవకాశం లభిస్తుందో తెలియదు, అనుభవజ్ఞులకు ఇవ్వాలని కోరుతామని, ఎవరినీ కేబినెట్ నుంచి తొలగించాలని చెప్పమని, హైకమాండే తీర్మానిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి మార్పు గురించి చర్చించబోమన్నారు. ఒకవేళ చర్చల్లో ప్రస్తావనకే వస్తే అది కూడా మాట్లాడతామని తెలిపారు. దావణగెరె చిచ్చు రేగింది అధికార కాంగ్రెస్లో దావణగెర దక్షిణ అసెంబ్లీ క్షేత్రం ఉప ఎన్నికల చిచ్చు రేగింది. ఇక్కడ జరిగిన గొడవలపై ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శి అభిషేక్ దత్ హైకమాండ్కు నివేదిక ఇవ్వగా, కేపీసీసీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అబ్దుల్ జబ్బార్ శనివారమే పార్టీ పదవికి రాజీనామా చేశారు. మైనారిటీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ఖాన్ ఒత్తిడి చేయడంతో దావణగెరెలో పార్టీకి ఇబ్బందిగా మారింది. దీంతో అభిషేక్ దత్ విచారణ జరిపారు. పార్టీ గెలుపుపై ప్రభావం ఉండొచ్చని ప్రచారమూ ఉంది. పార్టీ సస్పెండ్ చేస్తుందని తెలిసి జబ్బార్ ముందే తప్పుకున్నారు. సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నజీర్ అహమ్మద్ను కూడా సాగనంపే అవకాశముంది. వివాదానికి మూలబిందువైన మంత్రి జమీర్ అహమ్మద్ మీద వేటు పడవచ్చని ప్రచారం మొదలైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ పరిణాలేవీ తెలియదని దాటవేత ధోరణిని ప్రదర్శించారు. మంత్రి పదవుల కోసం పట్టు పార్టీలో దావణగెరె ఉప ఎన్నికల రచ్చ.. ఓ సీనియర్ నేత రాజీనామా -
రంజుగా కురుక్షేత్రం
తుమకూరు: ప్రస్తుత ఆధునిక మాధ్యమాల జోరులో రంగభూమి నాటకాల ప్రదర్శన కనుమరుగవుతోందని, అక్కడక్కడన్నా నాటకాలు సజీవంగా ఉన్నాయంటే గ్రామీణ కళాకారుల వల్లేనని ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప అన్నారు. తురువేకెరె తాలూకా దబ్బేఘట్ట హోబళి గోణి తుమకూరులో గద్దెకెంపమ్మ దేవీ , శ్రీ ఆదిశక్తి అరసమ్మదేవీ గ్రామ దేవత పండుగలో కురుక్షేత్ర నాటక ప్రదర్శన జరిగింది. ఆద్యంతం కళాకారులు నటనతో రక్తి కట్టించారు. ఎమ్మెల్యే వీక్షించి మాట్లాడుతూ నేటి యువతకు, చిన్నారులకు మన పురాణాలను పరిచయం చేయాలన్నారు. నాటకాల సారాంశాన్ని యువకులు అర్థం చేసుకుని మంచి సమాజ నిర్మాణానికి సహకరించాలని తెలిపారు. ఐపీఎల్లో బెట్టింగులు.. ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: ఐపీఎల్లో పెద్దమొత్తంలో బెట్టింగులు ఆడి పోగొట్టుకున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలబుర్గి జిల్లా కాళగి తాలూకా రుమ్మనగోడ్ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామవాసి చంద్రకాంత్ దేశాయి (40) స్థానిక బెణ్ణెతూరా డ్యాంలోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ప్రస్తుతం సాగుతున్న ఐపీఎల్ టోర్నీలో ఫలానా టీం గెలుస్తుందని, ఫలానా బౌలర్ వికెట్ తీస్తాడని అప్పులు చేసి మరీ ఆన్లైన్లో పందేలు ఆడాడు. అయితే పందేలన్నీ ఓడిపోయి డబ్బులు పోయాయి. దీంతో అప్పులు తీర్చలేక, విరక్తితో డ్యాంలోకి దూకాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జేడీఎస్ బృహత్ సమావేశం శివాజీనగర: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ)లో ఐదు నగర పాలికెల ఎన్నికలకు జేడీఎస్ సిద్ధమవుతోంది. కొమ్మఘట్టలో కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి, జేడీఎస్ యువ విభాగం రాష్ట్రాధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జ్యోతి వెలిగించటం ద్వారా మాజీ ప్రధాని హెచ్.డీ.దేవేగౌడ సమావేశాన్ని ప్రారంభించారు. నిఖిల్ కుమారస్వామి మాట్లాడుతూ బెంగళూరు అభివృద్ధికి మాజీ ప్రధాని హెచ్.డీ.దేవేగౌడ, కుమారస్వామి ప్రత్యేకంగా కృషి చేశారన్నారు. దేవేగౌడ ప్రసంగిస్తూ దేశంలోనే ప్రప్రథమంగా హెచ్.డీ.కుమారస్వామి గ్రామాలలో బస చేశారు, రైతుల సమస్యలు ఆలకించి, రైతులకు ఆర్థిక సహాయం అందించారని అన్నారు. కాఫీ తోటలో పసిగుడ్డు బనశంకరి: కిరాతక తల్లిదండ్రులు ఎవరో గానీ.. అప్పుడే పుట్టిన పసిగుడ్డును కాఫీ తోటలో వదిలివెళ్లారు. ఈ ఘటన కొడగు జిల్లా విరాజపేటే తాలూకా బేత్రి గ్రామంలో జరిగింది. ఆకులు పరిచి వాటి మీద పసికందును పెట్టి వెళ్లిపోయారు. శిశువు ఏడుపును విన్న స్థానికులు బిడ్డను చేరదీసి, శిశు సంక్షేమ అధికారులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. మడికెరి రూరల్ పోలీసులు తల్లిదండ్రులు ఎవరనేదానిపై విచారణ చేపట్టారు. చిరుతను చంపిన ముళ్లపందిమైసూరు: ముళ్లపందిని వేటాడేందుకు వెళ్లిన చిరుత దాని ముళ్లకు చిక్కుకుని మరణించింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా బొమ్మనహళ్లిలో జరిగింది. ఆకలితో ఉన్న చిరుత ఆహారం కోసం వెతుక్కుంటూ ఉండగా ముళ్ల పంది ఎదురైంది. దానిని భక్షించాలని చిరుత దాడి చేసింది. అయితే ముళ్ల పంది ప్రతిఘటించి పోరాడింది, దాని ముళ్లు చిరుత ఎదలో కుచ్చుకున్నాయి. దీంతో రక్తస్రావమైన చిరుత అక్కడే మరణించింది. అటవీ సిబ్బంది గస్తీ కాస్తుండగా చిరుత కళేబరం, దాని దేహంపైన ముళ్లు కనిపించాయి. పోస్టుమార్టం జరిపి పూడ్చివేశారు. -
మహిళా రిజర్వేషన్లకు మద్దతివ్వాలి
బనశంకరి: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అందించే మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్టీలకు అతీతంగా పార్లమెంటులో మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కోరారు. శనివారం బెంగళూరులో బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 15, 16 తేదీల్లో పార్లమెంటు ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రత్యేక సమావేశం జరుగుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలు లాభనష్టాలు ఆలోచించకుండా మద్దతు పలకాన్నారు. తద్వారా మహిళల దశాబ్దాల కల నెరవేరుతుందన్నారు. 15 ఏళ్ల క్రితం పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు కొందరు ఎంపీలు రభస చేశారన్నారు, ఈసారి అలాంటివాటికి అవకాశం ఉండదన్నారు. కాంగ్రెస్ నాయకులకు మహిళ అంటే ప్రియాంకాగాంధీ మాత్రమేనా, వేరే మహిళలు ఎన్నిక కాకూడదా? అని విమర్శించారు. పార్టీ నాయకురాళ్లు మాళవిక అవినాశ్, రూపాలి నాయక్, సురభి హొదిగెరె తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శోభ -
మత్తు చిత్తులో జీవచ్ఛవం
బెంగళూరులో మత్తు భూతంపై మరోసారి చర్చ సంచలనానికి కారణమైన జాంబీ రాజవీర్సింగ్సాక్షి, బెంగళూరు: యువకుడు నిశ్చలంగా సుమారు నిమిషాల పాటు స్తబ్దుగా అలా నిలబడిపోయాడు, డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇలా జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇది జాంబీ డ్రగ్స్ వల్ల కలిగిన పరిణామమని చాలామంది కామెంట్లు చేశారు. ఇది చాలా ఆందోళనకరం, ఏమిటో తేల్చాలని నటుడు దునియా విజయ్ కూడా కోరారు. హోం మంత్రి జి.పరమేశ్వర్ ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పుడు జాంబీ మత్తు రోగి చర్చకు కారణమయ్యాడు. జాంబీ డ్రగ్స్ ఉన్నాయా? జాంబీ డ్రగ్స్ అనేది మెదడు పనితీరును స్తంభింపజేసే మాదకద్రవ్యం. బతికున్న మనిషి జీవచ్ఛవంగా మారిపోతాడు, అమెరికాలో ఇటువంటి మత్తు పదార్థాలు వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో భారతదేశంలో కూడా ఈ జాంబీ డ్రగ్స్ ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం. అందులోనూ బిహార్ వంటి రాష్ట్రాల్లో ఇది లభ్యమైనట్లు తెలుస్తోంది. వెర్రెత్తే మూగజీవాలను శాంతపరించేందుకు ఇటువంటి శక్తిమంతమైన మత్తు పదార్థాలను వాడతారని తెలిసింది. అయితే ఇటీవల కాలంలో మనుషులు దీనిని ఎక్కువ మత్తు కోసం సేవిస్తున్నారు. ఈ డ్రగ్ సేవించిన మనుషులు గంటల కొద్దీ రోడ్డుపై, ఎక్కడుంటే అక్కడ జాంబీలా నిశ్చలంగా నిలబడి ఉండిపోతారు. ఇలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి. బెంగళూరులో మత్తు బెడద ఇటీవల కాలంలో బెంగళూరులో డ్రగ్స్ విక్రయాలు, వినియోగాలు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యార్థులను, యువకులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. తరచుగా పోలీసులు దాడులు జరిపి కేజీల కొద్దీ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కమిషనర్ ఏమన్నారంటే.. జాంబీ డ్రగ్ వీడియోపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అలాంటి డ్రగ్ అంటూ ఏదీ లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని, వీడియోను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ చెప్పారు. వీడియోలో ఉన్న వ్యక్తిని గుర్తించినట్లు, అతడు ఇక్కడి వాడు కాడని, మద్యం సేవించిన తర్వాత మెడిసిన్ తీసుకోవడం వల్ల ఈ విధంగా జరిగిందని తెలిపారు. ప్రస్తుతం అతనికి వైద్య చికిత్స అవసరమని, ఎలాంటి డ్రగ్స్ అతడు తీసుకోలేదని చెప్పారు. అతనొక లారీ డ్రైవర్ ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పంజాబ్కు చెందిన లారీ డ్రైవర్ రాజవీర్ సింగ్.. ఇతడు గతంలో హఫీం అనే మత్తుకు అలవాటు కావడంతో కుటుంబీకులు డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. బెంగళూరుకు వచ్చిన ఇతడు కొందరు డ్రైవర్లతో కలసి షెడ్లోనే నివసిస్తున్నాడు. ఇతనికి కీళ్లనొప్పులు, సైనసైటిస్ అనే వ్యాధులు ఉన్నాయి. మద్యం కూడా తాగుతాడు. అలా మద్యం తాగిన తరువాత రెండు మాత్రలు తీసుకున్నాడు. దీనివల్ల రియాక్షన్ జరిగి నడవలేక అలాగే నిలబడిపోయాడు. జాంబీ డ్రగ్స్ వాడాడని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారని తెలుస్తోంది. బెంగళూరు జాంబీ మ్యాన్ వ్యవహారం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం డ్రగ్స్ వల్లే అని ప్రచారం అదేం లేదన్న పోలీసులు వైరల్ చేశాడు.. అరెస్టయ్యాడు బనశంకరి: జాంబీ డ్రగ్స్ అంటూ వీడియో షేర్ చేసిన ప్రైవేటు కంపెనీ ఉద్యోగి, విద్యారణ్యపుర నివాసి హేమంత్ కుమార్కు నోటీసులు ఇచ్చిన బాగలూరు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇటువంటి తప్పుడు సమాచారం వైరల్చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సీమంత్ కుమార్సింగ్ అన్నారు. -
27ఏళ్ల యువకుడితో 57ఏళ్ల టీచర్ వివాహేతర సంబంధం
కర్ణాటక: ప్రభుత్వ టీచర్ని నమ్మించి హత్య చేసిన దుండగుని బాగోతమిది. వివరాలు.. బీదర్ జిల్లా బాల్కి తాలూకా వంజార్ ఖేడ్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతి కపాళె ’(57) అనే మహిళను అమర్ (27)అనే యువకుడు హత్య చేశాడు. బీదర్లో నివసిస్తున్న జ్యోతి వారానికి ఒకసారి కలబుర్గి జిల్లా కమలాపుర తాలూకా కల్మూడ గ్రామంలోని పుట్టింటికి వస్తుండేది. ఈ క్రమంలో నిందితుడు అమర్తో పరిచయమై సన్నిహితంగా మెలిగేవారు. అతనికి పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.రూ.20 లక్షలు తీసుకుని..6 రోజుల క్రితం కల్మూడ గ్రామం శివారులో నిర్జన ప్రదేశంలో జ్యోతి శవం కాలిన స్థితిలో లభించింది. జ్యోతి వివాహం చేసుకోలేదు. ఒంటరిగా జీవిస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేసేది. అమర్ ఆమె వద్ద సుమారు రూ.20 లక్షల వరకూ అప్పు తీసుకున్నాడు. డబ్బులు వెనక్కు ఇవ్వాలని జ్యోతి ఒత్తిడి చేయడంతో మాట్లాడదామని నమ్మించి 3వ తేదీన ఆమెను ఊరి బయటకు తీసుకెళ్లి హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీసులు కాల్ డిటైల్స్, ఇతర సాక్ష్యాధాల ఆధారంగా అమర్ ఈ హత్య చేశాడని గుర్తించి అరెస్టు చేశారు. -
కొండల్లో కేరళ బాలిక మిస్సింగ్.. నాలుగు రోజుల తర్వాత..
కర్ణాటక కొండల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి అదృశ్యమైన 14 ఏళ్ల కేరళ బాలిక నాలుగు రోజుల తర్వాత శవమై కనిపించింది. పోలీసులు ముమ్మరంగా గాలించిన తర్వాత ఆమె మృతదేహం లభ్యం కాగా.. తమ బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని పాలక్కాడ్కు చెందిన 10వ తరగతి విద్యార్థిని శ్రీనంద తన బంధువులతో సుమారు 40 మందితో కలిసి కర్ణాటక పర్యటనకు వచ్చింది. వీరు మొదట ఉత్తర కర్ణాటకలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హంపిని సందర్శించారు. ఏప్రిల్ 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు చిక్కమగళూరు చేరుకున్నారు. అక్కడ ప్రైవేట్ జీపుల్లో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లి.. ఆ తర్వాత చంద్రద్రోణ కొండల్లో ట్రెక్కింగ్కు వెళ్లారు.ట్రెక్కింగ్ రోజున ఒక కుటుంబ సభ్యుడితో కలిసి ఉన్న వీడియోలో బాలిక చివరిసారిగా కనిపించింది. అయితే, ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చీకటి పడుతున్న సమయంలో ఆమె అదృశ్యమైంది. కొండల్లోని మాణిక్యధార ప్రాంతంలో ఆమెను చివరిగా చూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. లోతైన ఘాట్ ప్రదేశాలు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. లోతైన ప్రాంతాలకు వెళ్లేందుకు తాళ్లను కూడా ఉపయోగించారు. రాత్రి సమయాల్లో డ్రోన్ సర్వైలెన్స్, థర్మల్ కెమెరాలను వినియోగించారు. నాలుగు రోజులు పాటు గాలింపు అనంతరం మాణిక్యధార వ్యూ పాయింట్కు సుమారు 1,500 అడుగుల దిగువన ఉన్న లోయలో శ్రీనంద మృతదేహం లభ్యమైంది.అయితే, బాలిక మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి స్పందిస్తూ.. బాలిక కిడ్నాప్ అయి ఉండవచ్చని ఒక వాదన ఉందని.. ఎవరితోనైనా వెళ్లి ఉండవచ్చని మరో వాదన వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఆచూకీ లభించిన నేపథ్యంలో వాస్తవాలు విచారణలో తేలుతాయని పేర్కొన్నారు. పోలీసులు పలు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ప్రమాదవశాత్తూ కొండపై నుండి జారిపడిందా? ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తేల్చాల్సి ఉంది. దర్యాప్తులో భాగంగా బాలిక తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
చాముండి కొండపై పనులు వెంటనే ఆపేయండి
● రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు శివాజీనగర: న్యాయస్థానానికి చేసిన వాగ్దానాన్ని ధిక్కరించి మైసూరులోని చాముండి కొండపై దేవాలయ ఆవరణలో పనులు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన హైకోర్టు, వివాదిత స్థలంలో జరుగుతున్న అన్ని రకాల నిర్మాణ పనులను వెంటనే నిలిపేయాలని మధ్యంతర ఆదేశాలిచ్చింది. చాముండి కొండ మూల స్వరూపానికి భంగం కలిగించేలా పనులు జరుగుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ మైసూరు రాజవంశీకురాలు ప్రమోదా దేవి ఒడెయర్ సమర్పించిన పిటిషన్ను విచారణ జరిపిన న్యాయమూర్తి మంత్రి శంకర్ మగ్దూంతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర అఫిడవిట్ సమర్పించండి: దేవాలయ ఆవరణలో జరుగుతున్న పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.47 కోట్లను ఏయే పనులకు ఎంత సొమ్ము ఖర్చు చేశారు? అనే విషయాలపై రెండు వారాల్లో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. న్యాయస్థానం ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి శాశ్వత పనులు చేపట్టబోమని గతంలో రాష్ట్ర ప్రభుత్వం భరోసానిచ్చింది. అయితే న్యాయస్థానానికి సమర్పించిన ఫోటోలను గమనిస్తే ఆలయ ఆవరణలో భారీ స్థాయిలో శాశ్వత నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోందని ధర్మాసనం వెల్లడించింది. పీయూసీ విద్యార్థిని ఆత్మహత్య యశవంతపుర: ద్వితీయ పీయూసీ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు హెబ్బాళ పోలీసుస్టేషన్ పరిధిలోని మనోరాయనపాళ్యలో జరిగింది. ఇక్కడ నివాసం ఉంటున్న ఆంథోని కుమార్తె తనూశ్రీ అదే ప్రాంతంలోని కళాశాలలో పీయూసీ చదివింది. గురువారం ఫలితాలు విడుదల కాగానే తనూశ్రీ తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా లెక్కలు, రసాయనశాస్త్రంలో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు బయట పడింది. తన మొబైల్ స్టేటస్లో 3 గంటలకు చనిపోతున్నట్లు పెట్టింది. దీనిని గమనించిన స్నేహితురాలు మా ఇంటికి రావాలని మేసేజ్ పెట్టింది. తనూశ్రీ కూడా సరే అంది. మరో స్నేహితురాలు ఆమె సందేశాన్ని చూసి తక్షణం ఆమె ఇంటి వద్దకు వెళ్లగా అప్పటికే ఉరికి వేలాడుతూ కనిపించింది. ప్రముఖ సాహితీవేత్త కన్నుమూతదొడ్డబళ్లాపురం: ప్రముఖ సాహితీవేత్త, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రామస్వామి(89) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆయన సేవలకుగాను నాడోజతో సహా ఎన్నో అవార్డులు వరించాయి. ఆయన రచనలు సాహిత్యాభిమానులను అలరించాయి. పర్యావరణ సంరక్షకుడిగా, సామాజిక కార్యకర్తగా ఎన్నో సేవలందించారు. -
శ్రీనందా ఉదంతం విషాదాంతం
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా చంద్రద్రోణ పర్వత శ్రేణిలో మాణిక్యధార జలపాతం వద్ద మూడు రోజుల క్రితం అదృశ్యమైన కేరళకు చెందిన విద్యార్థిని శ్రీనందా(14) శుక్రవారం మధ్యాహ్నం శవమై తేలింది. 2 వేల అడుగుల లోతులోని లోయలో శ్రీనందా మృతదేహాన్ని పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. కేరళ నుంచి 40 మందితో కలిసి తల్లి రోహిణితో కలిసి శ్రీనందా మాణిక్యధార జలపాతం వద్దకు వెళ్లి వీక్షిస్తుండగా పొరపాటున కాలుజారి లోయలో పడినట్లు అనుమానిస్తున్నారు. ఇనాము దత్తాత్రేయ పీఠం, మాణిక్యధారలను వీక్షిస్తున్న సమయంలో బాలిక ఆకస్మికంగా అదృశ్యమైంది. ఘటన తరువాత పోలీసులు బాలిక ఆచూకీ కోసం వెతకటం ప్రారంభించారు. బాలిక ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళం, పోలీసులు, ఏఎన్ఎఫ్ బృందాలు గాలించాయి. అటవీ ప్రాంతంతో పాటు దట్టమైన కొండల మధ్య డ్రోన్ల సాయంతో పరిశీలించారు. మూడు రోజుల పాటు తీవ్రమైన గాలింపు మధ్య శుక్రవారం అత్యంత లోయ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. అరిశినగుప్పె ప్రాంతంలో మృతదేహం మాణిక్యధార మార్గంలోని అరిశినగుప్పె వద్ద శ్రీనందా మృతదేహం ఒక బృందానికి కనిపించింది. తక్షణం మృతదేహాన్ని అటవీశాఖ సిబ్బంది అతికష్టం మీద లోయలో నుంచి పైకి తెచ్చారు. అనంతరం చిక్కమగళూరు జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని పోలీసులు తరలించారు. ఆమె అదృశ్యం కావటానికి ముందు తండ్రి వద్దనున్న మొబైల్లో అనేక రీల్స్, ఫోటోలు తీసుకున్నారు. వెంట వచ్చిన పర్యాటకులందరూ కిందకు దిగినా శ్రీనందా మాత్రం మాణిక్యధార కొండ పైభాగంలోనే ఉన్నారు. 10 నిమిషాల్లో అందరూ కిందకు దిగిన తర్వాత శ్రీనందా అదృశ్యమయ్యారు. పర్యాటకులు చుట్టు పక్కల తిరిగి వెదికినా కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు బాలిక కాలు జారి పడిందా? లేక ప్రమాదం ఎలా జరిగిందా? అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహం లభించగానే కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీనందా మృతిపై స్థానికంగాను అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జారి పడిందా? లేక ఎవరైనా కిడ్నాప్ చేసి పైనుంచి తోసేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. జారి పడిన ఆమె ఒంటిపై గాయాలైన గుర్తులున్నాయి. అదృశ్యమైన రోజు ఆమె ఏ దుస్తులను ధరించిందో అవే దుస్తులు మృతదేహంపై ఉన్నాయి. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే ఆమె ఎలా మరణించిందో తెలియనున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అనుమానం ఉన్న అన్ని కోణాల నుంచి శ్రీనందా మృతి కేసును విచారించనున్నట్లు శాంతిభద్రతల విభాగం అడిషనల్ పోలీసు డైరెక్టర్ జనరల్ హితేంద్ర తెలిపారు. ఆమె మృతిపై ఇప్పటికే తల్లిదండ్రులు కూడా అనుమానం వ్యక్తం చేయటంతో అన్ని కోణాల్లో విచారణ చేస్తామని అయన హామీనిచ్చారు.బాలిక మృతదేహాన్ని వెలికి తీసుకొస్తున్న రెస్క్యూ టీంజలపాతం వద్దలోయలో బాలిక మృతదేహాన్ని కనుగొన్న రెస్క్యూ టీం మూడు రోజుల తర్వాత దొరికిన మృతదేహం -
కామాంధుడిగా మారిన ఉపాధ్యాయుడు
సాక్షి, బళ్లారి: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. 16 సంవత్సరాల బాలికపై లైంగిక దాడి చేయడంతో.. గర్భం దాల్చింది. చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరెలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. చెళ్లకెరెలోని ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాలలో హెచ్.ఓ.రాజణ్ణ గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పాఠశాల గది లోపలే ఆ విద్యార్థినిపై నిరంతరం లైంగిక వేధింపులకు పాల్పడటం వల్ల బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే సమస్య అవుతుందని భావించిన ఉపాధ్యాయుడు రాజణ్ణ.. బాలికకు అబార్షన్ (గర్భస్రావం) చేయించాలని ప్లాన్ వేశాడు. వెంటనే చెళ్లకెరెలోని లక్ష్మీ శ్రీనివాస నర్సింగ్ హోంకు చెందిన డాక్టర్ శంకర లక్ష్మితో మాట్లాడారు. బాలికను అక్కడికి తీసుకెళ్లి మాత్రలు ఇచ్చి గర్భస్రావం చేయించాడు. ఇటీవల బాలిక శరీరంలో వస్తున్న మార్పులను గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అబార్షన్ విషయం బయటపడింది. పోక్సో కేసు నమోదు ఈ విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారిణి రేఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చెళ్లకెరె తాలూకా పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా కామ ఉపాధ్యాయుడు రాజణ్ణ, అతడికి సహకరించిన డాక్టర్ శంకర లక్ష్మిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక దాడి చేయడంతో బాలికకు గర్భం పోక్సో కేసు నమోదు -
మట్టి చరియలు కూలి ముగ్గురు కార్మికుల మృతి
శివమొగ్గ: మట్టిగోడ కూలి ముగ్గురు కార్మికులు మరణించిన ఘటన హులికల్ ఘాట్ చండికాంబ ఆలయ మలుపు వద్ద చోటు చేసుకుంది. ఇక్కడ నిరంతరంగా మట్టి కూలుతుండడం వల్ల మరమ్మతు చర్యలు చేపట్టారు. గురువారం పనులు జరుగుతున్న సమయంలో మట్టి కూలడంతో రాఘవేంద్ర, రాజు, శబ్బీర్ అనే కార్మికులు శిథిలాల కింద కూరుకుపోయి మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, తాలూకా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. మృతుల కుటుంబాలకు పరిహారం యశవంతపుర: హుళికల్ ఘాట్లో మట్టిచరియలు విరిగి పడి అసువులుబాసిన ముగ్గురు కార్మికుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఈమేరకు ఎక్స్లో పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు దుఃఖాన్ని భరించే శక్తి భగవంతుడు ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిపై చర్యకు వినతి ● హైకమాండ్కి లేఖ రాసిన రాష్ట్ర ఇన్చార్జ్ సుర్జేవాలా దొడ్డబళ్లాపురం: ఇటీవల దావణగెరెలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయని మంత్రి జమీర్ అహ్మద్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్సింగ్ సుర్జేవాలా హైకమాండ్కి లేఖ రాశారు. మంత్రి జమీర్, ఎమ్మెల్సీలు అబ్దుల్ జబ్బార్, నజీర్ అహ్మద్లపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సమర్థ్ శామనూరుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయాలని పార్టీ ఆదేశాలు ఇవ్వగా మైనార్టీలకు టికెట్ ఇవ్వలేదనే అక్కసుతో ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని లేఖలో వివరించారు. చివరి క్షణంలో మాత్రం అభ్యర్థి ఇంటికి వచ్చి మద్దతు ఇస్తున్నానని చెప్పి తాను కేరళ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా ఉన్నందున ఎన్నికల ప్రచారానికి రాలేదని మీడియా సమావేశంలో చెప్పి వెళ్లిపోయారని తెలిపారు.ఒత్తిడితోనే రాయ్ ఆత్మహత్య యశవంతపుర: కాన్పిడెంట్ గ్రూప్ సంస్థ ముఖ్యుడు సీజే రాయ్ మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పోలీసులు తేల్చింది. ఈ ఏడాది జనవరి 30న బెంగళూరులోని రిచమండ్ రోడ్డులోని ఆయనకు చెందిన కార్యాలయంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చేయగా అక్కడే ఉన్న రాయ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆదాయ పన్ను శాఖ అధికారుల ఒత్తిడి కారణంగా రాయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణల కారణంగా ప్రభుత్వం ఈ కేసును సిట్తో విచారణ చేయించింది. మానసిక ఒత్తిడి కారణంగా రాయ్ అందుకు మందులను వాడేవారు. అయితే ఆత్మహత్యకు నెల రోజుల ముందు నుంచి మందులను వాడటాన్ని పూర్తిగా నిలిపేశారు. మానసిక ఒత్తిడికి నికరమైన కారణాలు తెలియటం లేదని సిట్ విచారణలో బయట పడింది. తల్లీ కూతురు పీయూసీ పాస్ యశవంతపుర: ద్వితీయ పీయూసీ ఫలితాలు గురువారం వెలువడ్డాయి. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళకు చెందిన తల్లీ, కూతురు ఉత్తీర్ణత సాధించారు. బీసీ రోడ్డు కై కంబకు చెందిన గృహిణి వీఆర్ నేత్రావతి, ఆమె కుమార్తె ఆర్.హేమశ్రీ పీయూసీ పాసై ఆనంద పడుతున్నారు. హేమశ్రీ బి మూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆర్ట్స్ విభాగంలో 562 మార్కులను సాధించి టాపర్గా నిలిచారు. నందావర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ముఖ్యోపాధ్యాయుడు రవికుమార్ భార్య నేత్రావతి పీయూసీ ఫెయిల్ కావటంతో పలు సార్లు పరీక్ష రాశారు. ఈసారి కుమార్తె బీ మూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతుండగానే తను కుమార్తెతో కలిసి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన పీయూసీ పరీక్షలను రాసి ఉత్తమ మార్కులతో పాసయ్యారు. -
లోకాయుక్తకు చిక్కిన అవినీతి అధికారి
రాయచూరు రూరల్: పట్టణ ప్రాంతంలో నివాసానికి పేరు (మ్యుటేషన్) మార్చేందుకు లంచం తీసుకుంటూ సిరవార పట్టణ పంచాయతీ ముఖ్య అధికారి సురేష్ శెట్టి లోకాయుక్త అధికారులకు పట్టుబడ్డారు. వివరాలు.. సిరవార పట్టణానికి చెందిన రాఘవేంద్ర రెడ్డి తన ఇంటి పేరు మార్చాలని పంచాయతీ ముఖ్య అధికారి సురేష్ శెట్టిని కలిశారు. పేరు మార్చాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని సురేష్ శెట్టి డిమాండ్ చేయడంతో రాఘవేంద్ర రెడ్డి రూ.లక్ష ఇచ్చాడు. అయితే పని పూర్తి చేయకుండా కాలయాపన చేశాడు. మిగతా రూ.లక్ష ఇస్తేనే పని పూర్తి చేస్తానని సురేష్ శెట్టి తెలిపారు. అంత డబ్బు తన వద్ద లేదని రాఘవేంద్ర రెడ్డి చెప్పినా వినిపించుకోలేదు. మనస్తాపానికి గురైన రాఘవేంద్ర రెడ్డి.. ఈ విషయాన్ని లోకాయుక్త అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. శుక్రవారం సురేష్ శెట్టి డబ్బు తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు దాడి చేశారు. లోకాయుక్త అధికారులను గమనించిన ముఖ్య అధికారి సురేష్ శెట్టి కారులో కవితాళ వైపు పరారీ అయ్యారు. మైబెల్ లొకేషన్ ఆధారంగా సురేష్ శెట్టి జాడను పోలీసులు గుర్తించారు. కవితాళ ప్రభుత్వ అతిథి భవనంలో తల దాచుకున్నట్లు తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన సిరవార పట్టణ పంచాయతీ ముఖ్య అధికారి -
ఇంకా చాలా మందే అక్కడ ఉన్నారు.!
కాంబోడియా, వియత్నాంలో చైనీస్ హ్యాకింగ్ ముఠాల చేతుల్లో చిక్కుకుని రాష్ట్రంలోని కొప్ప, బాళెహొన్నూరు, చిక్మగళూరు, కోలారుకు చెందిన 10–15 మంది యువకులను కాపాడి రాష్ట్రానికి తరలించామని, ఇతర రాష్ట్రాలకు చెందిన యువకులు ఇంకా చాలా మంది అక్కడ ఉన్నట్లు సమాచారం అందిందని ఎమ్మెల్సీ డాక్టర్ ఆరతి కృష్ణ తెలిపారు. విదేశాల్లో సులభంగా ఉద్యోగం లభిస్తుందనే ఆశతో యువకులు అక్కడికి వెళ్లి చీకటి గదుల్లో మగ్గిపోయే పరిస్దితి తెచ్చుకుంటున్నారని ఆయన తెలిపారు. ఉద్యోగాల ఆశ చూపించి విదేశాలకు తీసుకెళ్లి వంచనకు పాల్పడే నకిలీ ఏజెంట్లు, సంస్థల ఆచూకీ కనిపెట్టే కేంద్రప్రభుత్వం, ఈ–మైగ్రేట్ పోర్టల్లో అప్డేట్ చేసింది. 2025 డిసెంబరు వరకు 3,505 నమోదు కానీ నకిలీ సంస్థల జాబితాను పోర్టల్లో ప్రకటించింది. ఆ జాబితాను పరిశీలించుకుని నకిలీ ఏజెన్సీల పట్ల జాగ్రత్త వహించాలని ఎమ్మెల్సీ నిరుద్యోగ అభ్యర్థులకు సలహా ఇచ్చారు. -
విదేశీ ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్న నిరుద్యోగులు సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు
బనశంకరి: ఉద్యోగ అవకాశాల పేరిట సోషల్ మీడియాలో వెలువడిన ప్రకటనలను గమనించి విదేశాలకు వెళుతున్న భారతీయ యువకులు సైబర్ ముఠాల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకు పెరగడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 2025 డిసెంబరు వరకు అంటే ఏడాదిలో విదేశాల్లో సైబర్ ముఠాల చేతుల్లో చిక్కుకున్న 4,300 మందికి పైగా యువకులను కాపాడి భారత్కు తీసుకువచ్చారు. ఇదే సమయంలో సైబర్ ముఠా చేతుల్లో చిక్కుకునేవారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం మయన్మార్, కాంబోడియా, లావోస్ తదితర దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లి అక్కడ సైబర్ నేరగాళ్ల ముఠాల చేతుల్లో చిక్కుకున్న యువకుల సంఖ్య 2022లో 456 మంది, 2023లో ఈ సంఖ్య 540 మంది, 2024లో 1,687 మందికి చేరుకుంది. ఏడాదిలో 4,300 మంది యువకుల రక్షణ 2025 డిసెంబరు నాటికి 4,300 మందికి చేరుకోగా సైబర్ ముఠా వలలో పడిన చాలా మంది యువకులను రక్షించి సురక్షితంగా భారత్కు తరలించారు. కానీ భారత్ నుంచి వెళ్లిన వేలాది మంది యువత అక్కడ జీతగాళ్లుగా పని చేస్తున్నట్లు సమాచారం అందింది. నకిలీ నియామక సంస్థలు లేదా ఏజెంట్లు ప్రలోభాలకు గురైన యువత అక్రమ మార్గంలో విదేశాలకు వెళ్లి అక్కడ ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. అక్కడికి వెళ్లిన అనంతరం వంచకులు పాస్పోర్ట్సుతో పాటు అన్ని రికార్డులను లాక్కుని సైబర్ నేరాల్లోకి మళ్లిస్తున్నారు. ఎలా వంచనకు పాల్పడాలి అనే దాని గురించి శిక్షణ అందించి సైబర్ నేరాలకు పాల్పడటానికి వినియోగిస్తున్నారని సైబర్ క్రైం అధికారులు తెలిపారు. నకిలీ కాల్సెంటర్ను కనుగొన్న పోలీసులు బెంగళూరు నగరంలోనే కాల్సెంటర్ను తెరిచి పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ వంచకుల ముఠాను సైబర్ కమాండ్ కేంద్రం అధికారులు ఇటీవల కనిపెట్టారు. జయనగర 9వ బ్లాక్లో నకిలీ కాల్ సెంటర్ను తెరిచిన ఇద్దరు సైబర్ వంచకులను అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 15 మంది కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్లను విధులకు నియమించి కాల్ సెంటర్ ముసుగులో ప్రజలకు, సాఫ్ట్వేర్, విశ్రాంత ఉద్యోగులకు, పారిశ్రామికవేత్తలకు ఫోన్లు చేసి ఆన్లైన్ పెట్టుబడి, స్టాక్ మార్కెట్ పేరుతో డబ్బు పెట్టుబడి పెట్టించుకుని వంచనకు పాల్పడుతున్నారు. తలా ఒక ఎగ్జిక్యూటివ్కు రూ.25 వేల వేతనం అందిస్తున్నట్లు సైబర్క్రైం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. నకిలీ దందా నియంత్రణకు చర్యలు ● నకిలీ ఉద్యోగాల దందాపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం హెచ్చరిక ● సోషల్ మీడియాలో ప్రకటనలు అసలైనవా? కాదా? అనేది పరిశీలించాలి ● ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఉద్యోగ ఆఫర్ల స్వీకరణకు ముందు జాగ్రత్త పడాలి ● నియామక ఏజెంట్లు, కంపెనీల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. కాంబోడియా, మయన్మార్, ఆగ్నేయ ఆసియాలో ఉద్యోగాల పేరుతో ఆశ చూపించడం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాలో ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడం భారీ మొత్తంలో వేతనం అందిస్తామని ఆశ పెట్టడం ప్రయాణ ఖర్చు మేమే భరిస్తామని యువకులకు హామీ విదేశాలకు వెళ్లిన అనంతరం పాస్పోర్ట్స్, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకోవడం సైబర్ నేరాల గురించి శిక్షణ ఇచ్చిన అనంతరం విధుల్లో నియమించడం ఆయా రాష్ట్రాల వారిని వంచనకు ఆయా భాషల యువకుల నియామకం విదేశీ ఉద్యోగాల మోజుతో చిక్కుల్లో యువత కేటుగాళ్ల కబంధ హస్తాల్లో చిక్కుకుని నరకయాతన బాధితుల సంఖ్య ఏటేటా పెరుగుతుండడం ఆందోళనకరంసైబర్ వంచకులు ఎలా గాలం వేస్తారంటే..? -
నాణ్యతకు తిలోదకాలు
సాక్షి, బళ్లారి: బళ్లారి నగర నడిబొడ్డున నిత్యం వేలాది మంది జనం, వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా రూ.కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు. కనక దుర్గమ్మ ఆలయ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద వేసిన రోడ్డుకు ఇరువైపులా పాదచారులు వెళ్లేందుకు ఐరన్ పైపులు, చైనులు వేసి కట్టుదిట్టం చేశారు. ఈ పనులు చేపట్టేందుకు ఏడాదికి పైగా సమయం తీసుకున్నారు. నగర అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తున్నప్పటికి, ఆ పనుల్లో నాణ్యత లోపిస్తోంది. పని పూర్తి చేసిన తర్వాత కనీసం రెండు, మూడు సంవత్సరాలు గడవక ముందే అధ్వానంగా మారుతున్నాయి. ఇనుప కడ్డీలు, చైనులు రోడ్డుపై పడిపోవడంతో పాదచారులతో పాటు, వాహనాల్లో వెళ్లే వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. సంబంధిత కాంట్రాక్టర్, అధికారులు నాణ్యతగా పనులు చేయకపోవడంతో పనులు ప్రారంభించిన ఆరు నెలలకే ఊడిపోతున్నట్లు సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి మండిపడ్డారు. సంబంధిత అధికారులు, పాలకులు చొరవ తీసుకుని పడిపోయిన పైపులను, చైనుకు మరమ్మతులు చేయాలని ప్రజలు సూచిస్తున్నారు. అండర్ బ్రిడ్జి కింద వేసిన రోడ్డులో పాదచారులు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీలు, చైన్ ఊడిపోయిన దృశ్యం -
నేత్రపర్వంగా కారంజి కట్ట కరగ ఉత్సవం
కోలారు: నగరంలోని కారంజి కట్టలో ద్రౌపతమ్మ దేవి, ధర్మరాయస్వామి కరగ ఉత్సవాన్ని గురువారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవాలయం ముందు భాగంలో వేసిన వేదికపై కరగ పూజారి బేతమంగల మునిరాజు నిర్వహించిన కరగ నృత్యం అందరిని విశేషంగా ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. గోవింద నామ స్మరణతో వేదిక ప్రాంగణం మార్మోగింది. ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మెల్సీ ఎం ఎల్ అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్ తదితర ప్రముఖులు కరగ ఉత్సవంలో పాల్గొన్నారు. వీధి కుక్కలకు ఫీడింగ్ జోన్కోలారు: వీధి కుక్కల ఆకలితీర్చడం కోసం తాలూకాలోని వేమగల్ – కురుగల్ పట్టణ పంచాయతీలో బస్టాండు, కోలారు రోడ్డు, సీతి రోడ్డు, కల్వమంజలి రోడ్డు, లలో ఫీడింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. జోన్లలో ఎవరైనా ఆహారం వేయవచ్చు. స్థానిక హోటల్ యజమానులు మిగిలిన రుచికరమైన ఆహారాన్ని తెచ్చి ఫీడింగ్ జోన్లలో వేయవచ్చునని పట్టణ పంచాయతీ అధికారులు తెలిపారు. పట్టణ పంచాయతీలో 1726 కుక్కలను గుర్తించగా వాటిలో 976 కుక్కలకు సంతానహరణ చికిత్సలు చేయించినట్లు తెలిపారు. రేబిస్ వ్యాప్తి చెందకుండా టీకాలు వేయించినట్లు అధికారులు తెలిపారు. -
బస్సు సర్వీస్ ప్రారంభం
కోలారు: ముళబాగిలు నుంచి తాలూకాలోని ఆవణి గ్రామానికి ఏర్పాటు చేసిన నూతన బస్సు సర్వీస్ను ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ మార్గంలో కొత్త సర్వీసును ప్రారంభించాలని ప్రజలు కోరారన్నారు. దీంతో అధికారులతో మాట్లాడి బస్సు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. తాలూకాలో గంజాయి, క్రికెట్ బెట్టింగ్ను పూర్తిగా అరికట్టాలని పోలీసులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆవణి గ్రామస్తులు రఘుపతి రెడ్డి, సత్యణ్ణ, గొల్లహళ్లి జగదీష్, అన్వర్ పాషా పాల్గొన్నారు. కమనీయం.. సీతారామ కల్యాణం శ్రీనివాసపురం: తాలూకాలోని రాయల్పాడు ఫిర్కా పెద్దూరు గ్రామంలో శుక్రవారం శ్రీ సీతారామ కల్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత స్వామి వారికి అభిషేకాలు, అలంకరణలు, విశేష పూజలు, హోమ, హవనాలనునిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదమంత్రోచ్ఛరణ మధ్య సీతారాముల ఉత్సవమూర్తులకు కల్యాణం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను గ్రామంలో ఘనంగా ఊరేగించారు. హాజరైన భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరిగింది. చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. -
మల్లికార్జున ఖర్గేను అరెస్ట్ చేయాలి
హొసపేటె: రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తక్షణమే అరెస్టు చేయాలని బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొట్రేష్ మాట్లాడుతూ.. అస్సాం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. ‘నమాజ్ చేసేటప్పుడు విష సర్పం కనిపిస్తే దానిని చంపాలని ఖురాన్లో రాసి ఉంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ కూడా అలాంటి విష సర్పాలే. మీరు దానిని చంపక పోతే అది బ్రతకదు. ఆర్ఎస్ఎస్ సభ్యులను చంపాలని ముస్లింలను రెచ్చగొట్టారు’ అని ఆరోపించారు. మల్లికార్జున ఖర్గే ఎల్లప్పుడూ మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారని మండిపడ్డారు. అటువంటి వ్యక్తి చేసిన బాధ్యతారహితమైన రెచ్చగొట్టే ప్రసంగం దేశంలోని లక్షలాది బీజేపీ, ఆర్ఎస్ఎస్ సభ్యుల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శంకర్మేటి, మండల ప్రధాన కార్యదర్శి మధురచెన్న శాస్త్రి హిరేమఠ్్, యువ మోర్చా మండల అఽధ్యక్షుడు హెచ్.రాఘవేంద్ర, కే.మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల అమలులో జాప్యం వద్దు
హొసపేటె: జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు, నీటి సరఫరా ప్రాజెక్టులను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేసి ప్రజలకు లబ్ధి చేకూర్చాలని జిల్లా ఇన్చార్జి కార్యదర్శి డాక్టర్.కేజీ.జగదీష్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం నగరంలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన వివిధ శాఖల పురోగతి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. హోస్పేట్తో సహా జిల్లాలోని వివిధ తాలూకాల్లో అమలులో ఉన్న నీటి సరఫరా ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తూ, ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు లాభాపేక్షతో పని చేస్తాయని తెలిపారు. పనుల్లో జాప్యం జరిగినా లేదా నాణ్యత విషయంలో రాజీపడినా అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులు పరస్పర సమన్వయంతో జాగ్రత్తగా పని చేయాలన్నారు. వేసవి కాలం సమీపిస్తున్నందున, ప్రజలు నీటి కొరతను ఎదుర్కొకుండా చూడటమే మన ప్రథమ ప్రాధాన్యత అన్నారు. అధికారులు ముందు చూపుతో వ్యవహరించాలని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం వివిధ శాఖలు విడుదల చేసిన నిధులను దుర్వినియోగం చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా పంచాయతీ సీఈఓ అక్రమ్ షా మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలోని హరపనహళ్లి తాలూకాలో తీవ్ర నీటి సమస్య ఉందని, ప్రైవేట్ ట్యూబ్వెల్స్, ట్యాంకర్ల ద్వారా తగినంతగా నీటిని సరఫరా చేస్తున్నారని తెలియజేశారు. నమూనా అంగన్వాడీ భవనం నిర్మించండి జిల్లా ఇన్చార్జి కార్యదర్శి, జిల్లాలోని ఎంపిక చేసిన ఐదు ప్రదేశాలలో పిల్లల ఆటలకు మద్దతుగా క్రీడా పరికరాలను ఏర్పాటు చేసి, ఒక మంచి నమూనా అంగన్వాడి భవనాన్ని నిర్మించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖను ఆదేశించారు. దీనికి సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ సీఈఓ నోంగ్జోయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా, జిల్లా పంచాయతీ డిప్యూటి సెక్రటరీ కే.తిమ్మప్ప, ప్రాజెక్ట్ డైరెక్టర్ అన్నదాన స్వామి, గ్రామీణ తాగునీటి, పారిశుధ్య శాఖ ఇంజనీర్ ఎస్.దీప, డీడీపీఐ వెంకటేష్ రామచంద్రప్ప, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. -
రూ.3 కోట్ల విలువైన మొబైల్స్ స్వాధీనం
సాక్షి, బళ్లారి: ఇటీవల మొబైల్స్ దొంగతనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొబైల్స్ దొంగలించారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. నూటికి 90 శాతం దొంగిలించిన మొబైల్స్ను తిరిగి స్వాధీనం చేసుకోవడం పోలీసులకు సవాల్గా మారుతోంది. అయితే గడిచిన ఆరు నెలల్లో విజయపుర పోలీసులు ఘనమైన విజయం సాధించారు. విజయపుర జిల్లా పరిధిలో పలు ప్రాంతాల్లో దొంగలించిన మొబైల్స్ను సీఈఐఆర్ సాఫ్ట్వేర్ సాయంతో కనుక్కున్నారు. 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు నెలల్లో దాదాపు రూ.3 కోట్ల విలువైన మొబైల్స్ను జిల్లా ఎస్పీ లక్ష్మణ్ నింబరిగి ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లను సంబంధిత యజమానులకు అప్పగించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లు ఎక్కడైనా ఎవరైనా దొంగలిస్తే తక్షణం ఫిర్యాదు చేయాలని సూచించారు. పూర్తి వివరాలు కూడా అందజేయాలన్నారు. -
బీజేపీ ఎన్నికల కార్యాలయం ప్రారంభం
కెలమంగలం: తళి నియోజకవర్గంలో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పార్టీ శుక్రవారం తాలూకా కేంద్రం డెంకణీకోటలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించింది. బీజేపీ క్రిష్ణగిరి పశ్చిమ జిల్లా అధ్యక్షుడు నారాయణన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అన్నాడీఎంకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వేపనపల్లి సిటింగ్ ఎమ్మెల్యే కే.పి.మునిస్వామి ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. నాగేష్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంిపీ నరసింహన్, బీజేపీ క్రిష్ణగిరి పశ్చిమ జిల్లా మాజీ అధ్యక్షులు నాగరాజ్, మండల అధ్యక్షులు బాలక్రిష్ణన్, నరేంద్రన్, రవీంధ్రన్, అన్నాడీఎంకే నాయకులు జేపి జయప్రకాష్, రాము, యూనియన్ కార్యదర్శి రమేష్ రెడ్డి, వెంకటా చలపతిశెట్టి పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
20 రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం
హుబ్లీ: బాడుగ కోసం వరసగా ఆటోలను నిలిపే క్రమంలో జరిగిన గొడవ పర్యవసానం ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన బెళగావి జిల్లా కాగవాడ తాలూకా మంగసూలి గ్రామంలో చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ అశోక్ వడ్డర్ హత్యకు గురైన వ్యక్తి. రెండు రోజుల క్రితం ఊరిలో జాతర నేపథ్యంలో భక్తుల సందడి ఎక్కువగా ఉంది. రోజూ మాదిరిగా వరుసలో నిలబెడుతున్న ఆటోలు ఆ రోజు మాత్రం ఈ నియమాన్ని ఉల్లంఘించి ఇష్ట వచ్చినట్లు ప్రయాణికులను బస్టాండ్ నుంచి ఆలయానికి తీసుకెళ్లడం తిరిగి తీసుకుని రావడం చేశారు. అశోక్ తన ఆటో వెనుక ఉన్నప్పటికీ ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లాడు. దీన్ని గమనించిన మరో ఆటో డ్రైవర్ శివ.. అశోక్ బాడుగ దింపి వచ్చిన వెంటనే గొడవకు దిగాడు. అంతేగాక మరో ఇద్దరు స్నేహితులతో కలసి అశోక్పై దాడి చేసి హతమార్చారు. అతడి వద్ద ఉన్న నగదు తీసుకుని, ఆటో వెనుక సీట్లో అశోక్ను పడుకోబెట్టి అక్కడి నుంచి పరారీ అయ్యారు. కాగవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలించారు. నిందితులు శివ, సాగర్, వినోద్ను అరెస్ట్ చేశారు. 20 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన అశోక్ దారుణ హత్యకు గురి కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటో డ్రైవర్ దారుణ హత్య -
బతికుండగానే చనిపోయినట్లు నమోదు
రాయచూరు రూరల్: బతికున్న మహిళను మరణించిందంటూ రికార్డుల్లో నమోదు చేసిన ఘటన రాయచూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయచూరులోని లాల్ బహదూర్ శాస్త్రి నగర్లో నివసిస్తున్న ఖాజాబీ చౌకధరల దుకాణం నుంచి ఆహార పదార్థాలు తీసుకుంటోంది. ఏడాది క్రితం జీవనోపాధి కోసం ముంబాయి వెళ్లింది. అప్పటి నుంచి చౌక ధరల దుకాణంలో వేలిముద్రలు వేయలేదు. రేషన్ సరుకులు తీసుకోక పోవడంతో ఆమె మరణించినట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో ఖాజాబీకి సర్కార్ నుంచి రావాల్సిన గృహలక్ష్మి, పింఛన్ అందకుండా పోయాయి. ఫలితంగా రేషన్కార్డు కూడా రద్దు అయ్యింది. పౌరసరఫరా శాఖ అధికారులు స్పందించి రేషన్కార్డు మంజూరు చేయాలని బాధితురాలు కోరుతోంది. పేదలకు సేవ చేయడం హర్షణీయంరాయచూరు రూరల్: పేదలకు ఉచిత సేవలందించడం హర్షణీయమని నవోదయ వైద్య కళాశాల అధికారి రామమోహన గుప్తా అన్నారు. నగరంలోని నవోదయ వైద్య కళాశాలలో ఔషధ విధానం, ఉత్పాదన, విశ్లేషణ, క్లినికల్ ఫార్మసీ, రీసెర్చ్, ఫార్మోకోమో అంశాలపై మూడు రోజల పాటు జరగనున్న సెమినార్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రామమోహన గుప్తా మాట్లాడుతూ.. కళ్యాణ కర్నాటకలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య పరీక్షలు చేయడానికి వీలు కల్పించినట్లు అవుతుందన్నారు. నవోదయ వైద్యకీయ కళాశాల చేస్తున్న వైద్య సేవలు అనన్యమన్నారు. కార్యక్రమంలో నవోదయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ దొడ్డయ్య, అమృత రెడ్డి, పునీత్, శివరాజ్ గౌడ, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఐడీపీఎస్ ఇండిపెండెంట్ కాలేజీ విద్యార్థుల ప్రతిభ సాక్షి, బళ్లారి: 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ద్వితీయ పీయూసీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. నగర శివారులోని కప్పగల్ రోడ్డులో ఉన్న ఐడీపీఎస్ ఇండిపెండెంట్ పీయూ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎం.సుప్రియ 591, ఏ.ఆదిశేష్ 579, హర్షిల్ జైన్ 579, హరిణి 578, భూమిక 576, కిరణ్ 576, మేఘన 576, దీపిక 575, మనోజ్ 575, ప్రకృతి 574, త్రిష 571, అక్షయ 571, మధుబాయి 571, యువరాణి 570 మార్కులు సాధించారు. కళాశాలలో 98 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ఎండీ జయ చంద్రారెడ్డి తెలిపారు. మురిక వాడల్లో సౌకర్యాలు శూన్యం రాయచూరు రూరల్: పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో నివాసం ఉంటున్న ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని స్లం క్రియా వేదిక రాష్ట్ర సంచాలకుడు నరిసింహమూర్తి పేర్కొన్నారు. శఽుక్రవారం స్లం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మురికివాడల్లో నివసిస్తున్న వారికి ఆరోగ్యం, విద్య, ఆహరం, భూమి, ఇల్లు, ఉద్యోగాలను సర్కార్ అందించాలన్నారు. రాష్ట్రంలో వసతి పథకం నీరుగారి పోయిందని తెలిపారు. పేదలు అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరోపించారు. మురికి వాడల అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితమైందని మండిపడ్డారు. కార్యక్రమంలో అనిల్ కుమార్, జనార్దన, బసవరాజ్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. తాగునీరు సరఫరా చేయాలని ఆందోళన రాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తాగునీరు సరఫరా చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. శుక్రవారం లింగసూగురు తాలుకా గురుగుంట గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి అధికారి పరారీ కావడంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు, మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా స్పందించి తాగునీరు సరఫరా చేయాలని కోరారు. -
మహిళలతో అసభ్యకరంగా ప్రవరిస్తే చర్యలు
హుబ్లీ: జంట నగరాల్లోని జిమ్ కేంద్రాలు, లవ్ జిహాద్ కేసులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకునేందుకు నగరంలోని బీవీబీ కళాశాల క్యాంపస్ మీటింగ్ హాల్లో శుక్రవారం జిమ్ యజమానులు, ట్రైనర్లతో సమావేశం నిర్వహించారు. జంట నగరాల పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ.. కోచ్ల పూర్వపరాల నేపథ్యం పరిశీలన, సభ్యుల మొబైల్ కనెక్షన్ నిషేధం, తదితర కట్టుదిట్టమైన నియమాలను తప్పని సరిగా పాటించాలని ఆదేశించారు. ఒక వేళ ఆ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిమ్ సురక్షతపై ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిమ్లకు వచ్చే యువతులు, మహిళలపౌ అసభ్యకరంగా ప్రవర్తించే కోచ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జంట నగరాల్లోని కొన్ని జిమ్లు లవ్ జిహాద్కు అడ్డాలుగా మారుతున్నాయని హిందు సంఘాల నేతలు, ప్రముఖులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. సమావేశంలో 200 మందికి పైగా జిమ్ ట్రైనర్లు, జిమ్ యజమానులు పాల్గొన్నారు. పీయూసీ ఫలితాల్లో రాయచూరుకు 31వ స్థానం రాయచూరు రూరల్: ద్వితీయ పీయూసీ ఫలితాల్లో రాయచూరు జిల్లా 31వ స్థానంలో నిలిచిందని ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరప్ప వెల్లడించారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో 21,383 మంది ద్వితీయ పరీక్షలు రాయడం జరిగిందన్నారు. వీరిలో 13,881 మంది విద్యార్థులు ఉతీర్ణులైనట్లు తెలిపారు. 74.72 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు పేర్కొన్నారు. పీయూసీ ఫలితాల్లో రాయచూరు జిల్లా గత ఏడాది 30వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 31వ స్థానానికి పడిపోయినట్లు చెప్పారు. దేవదుర్గ రేఖ 591, అనుషా పాటిల్ 583, సంతు 562, భాగ్య 558, కవిత 588 మార్కులతో సత్తా చాటారు. టిప్పర్ ఢీకొని బైక్ చోదకుడికి గాయాలు హొసపేటె: బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఒక యువకుడిని వేగంగా వచ్చిన ఓ టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. నగరంలోని పడుగుత్తి కళ్యాణ మండపం సమీపంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్ రైడర్ను కొప్పళలోని సర్దార్ గల్లీకి చెందిన కాసిం అలీ రాజా సభాగా గుర్తించారు. తీవ్ర గాయపడిన ఇతడికి ఉప విభాగ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం కొప్పళ జిల్లా ఆస్పత్రికి తరలించారు. టిప్పర్, బైక్ రెండూ సీబీఎస్ సర్కిల్ నుంచి కొప్పళ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇంటర్ ప్రతిభావంతులకు సత్కారం చిక్కబళ్లాపురం: ద్వితీయ పీయూ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన నగరంలోని బెస్ట్ కళాశాల విద్యార్థులు పదిమందిని యాజమాన్యం ఘనంగా సత్కరించింది. 401 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 391 మంది ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ రఘునాథ్ తెలిపారు. వృద్ధులకు అన్నదానం శివాజీనగర: కాగినెల కనక గురుపీఠం డాక్టర్ నిరంజనానందపురి స్వామీజీ 50వ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం కొట్టూరు ఆనాథాశ్రమంలో వృద్ధులకు బొబ్బట్లతో కూడిన భోజనం ఏర్పాటు చేశారు. హగరిబొమ్మనహళ్లి పురసభ మాజీ అధ్యక్షుడు ఎం.మరి రామప్ప మాట్లాడుతూ నిరంజనానందపురి స్వామీజీ సమాజానికి అందిస్తున్న సేవలు అనన్యమన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోరి గోణిబసప్ప, పురసభ నామినేటెడ్ సభ్యుడు యు.బాళప్ప తదితర నాయకులు పాల్గొన్నారు. యంత్రంలో చిక్కుకుని బాలుడు మృతి హోసూరు: లేత్ యంత్రంలో చిక్కుకుని బాలుడు మృతి చెందిన ఘటన సిఫ్కాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. తిరుపత్తూరు జిల్లాకు చెందిన రమేష్ కొడుకు మోహన్ రాజ్ (16). పాఠశాలకు సెలవులు వదలడంతో హోసూరులో నివాసముంటున్న బంధువుల ఇంటికి వెళ్లాడు. పారిశ్రామిక వాడలో అతడి మామ నిర్వహిస్తున్న పరిశ్రమలో లేత్ యంత్రాన్ని ఆపరేట్ చేస్తుండగా అకస్మాత్తుగా యంత్రంలో చిక్కుకుని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సిఫ్కాట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జై వీరభద్రేశ్వర
తుమకూరు: చారిత్రక హరళూరు శ్రీ వీరభద్ర స్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది. చోళుల కాలపు ఈ ఆలయానికి వందలాది సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతి ఏటా ఉగాది పండుగ తరువాత వీరభద్ర స్వామి జాతర జరపడం సంప్రదాయంగా వస్తోంది. గురువారం మధ్యాహ్నం 1 గంటలకు హరళూరు గ్రామస్తులు, భక్తుల సమక్షంలో తేరు ఊరేగింపు సాగింది. స్వామి ఉత్సవమూర్తిని తేరులో కూర్చోబెట్టి జయజయధ్వానాల రథాన్ని లాగారు. రాత్రి భక్తి గాన కచేరీ, కురుక్షేత్ర నాటకం ఆకట్టుకున్నాయి. కుమార– ఐపీఎస్ కేసులో మధ్యవర్తిత్వం! శివాజీనగర: రాష్ట్ర లోకాయుక్త ఏడీజీపీ ఎం.చంద్రశేఖర్, కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి మధ్య గొడవల కేసులో మధ్యవర్తిత్వానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా పేరును హైకోర్టు సూచించింది. ఓ కేసులో విచారణ జరుపుతున్న తనను బెదిరించారంటూ చంద్రశేఖర్ బెంగళూరు సంజయ్నగర ఠాణాలో కేసు పెట్టగా, ఆ కేసును కొట్టివేయాలని కుమారస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. కొంతకాలంగా దీనిపై విచారణ జరుగుతోంది. న్యాయమూర్తి ఎస్.సునీల్దత్ యాదవ్ విచారిస్తూ, జస్టిస్ ఓకా మధ్యవర్తిత్వానికి సిఫార్సు చేసి వాయిదా వేశారు. గర్భిణిపై దాడి.. కవలల మృత్యువాత దొడ్డబళ్లాపురం: గర్భిణిపై కొందరు దాడి చేయడంతో ఆమె కడుపులో ఉన్న కవల పిల్లలు ప్రాణాలు వదిలిన విషాద సంఘటన హావేరి జిల్లా సవణూరు తాలూకా అల్లిపురలో ఆలస్యంగా వెలుగు చూసింది. మార్చి 28న పవిత్ర లమాణి అనే గర్భిణి అప్పు చెల్లించలేదని ఇంటికి వచ్చిన కొందరు ఆమెను కొట్టారు. కడుపు మీద తన్నడంతో అస్వస్థతకు గురైంది. పవిత్రకు ఈ నెల 7న కాన్పు కాగా కవల పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన కాసేపటికే కన్నుమూశారు. దుండగుల దాడి వల్ల శిశువులు దక్కకుండా పోయారని పవిత్ర కుటుంబ సభ్యులు విలపించారు. వారి ఫిర్యాదు మేరకు సురేశ్ హాలప్ప లమాణి, పరశురామ్ హాలప్ప లమాణి, మహేశ్ లమాణి, సక్కుబాయి అనేవారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోడౌన్లో మంటలు.. భారీగా ఆస్తినష్టం దొడ్డబళ్లాపుర: ఆహార పదార్థాలు నిల్వ చేసే ఓ మాల్ కంపెనీ గోడౌన్లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్లో వంట నూనె, ఇతర ఆహార పదార్థాల నిల్వలు కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది రాత్రి 12 గంటల నుంచి గురువారం ఉదయం వరకూ 10 ఫైరింజన్లతో శ్రమించి మంటలను అదుపు చేశారు. గోడౌన్లో కరెంటు తీగల షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వెలువడినట్లు తెలుస్తోంది. 18ఏళ్ల క్రితం పద్మరాజ్ అనే వ్యకి ఈ గోడౌన్ రూ.20 కోట్ల ఖర్చుతో నిర్మించి ఓ మాల్కు బాడుగకు ఇచ్చాడు. కోట్ల రూపాయల సరుకులు బూడిదైనట్లు సమాచారం. మైసూరులో బస్సు ఢీకొని మహిళ మృతి మైసూరు: ప్రైవేట్ బస్సు ఢీకొని ఓ మహిళ దుర్మరణం పాలైన ఘటన మైసూరులోని కేఆర్ సర్కిల్లో జరిగింది. మైసూరులోని ఇలవాల సమీపంలోని బాలగంగాధరనాథ స్వామి లేఔట్ నివాసి ఎం.మహాలక్ష్మి (38) మృతురాలు. ఆమె తల్లి గీతతో కలిసి పని మీద సిటీ బస్సులో నగర బస్టాండ్కు వచ్చారు. హోటల్లో టిఫిన్ తినాలని బస్టాండ్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో కేఆర్ సర్కిల్ వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకు వచ్చిన ప్రైవేట్ బస్సు మహాలక్ష్మిని ఢీకొంది. డ్రైవర్ బస్సును వదిలేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని స్థానికులు కేఆర్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. ప్రమాదంలో తల్లి గీత క్షేమంగా బయటపడింది. దేవరాజ ట్రాఫిక్ స్టేషన్ పోలీసులు బస్సును ఠాణాకు తరలించారు. -
ఇంటర్ ఫలితాల్లో కొత్త చరిత్ర
బనశంకరి: కర్ణాటక ద్వితీయ పీయూసీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 5,46,698 మంది విద్యార్థులు పాస్ కాగా, రాష్ట్ర చరిత్రలో తొలిసారి 86.48 శాతం ఉత్తీర్ణత నమోదైంది, ఇది చారిత్రక రోజు అని ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది పీయూసీ ఫలితాలు గతేడాది కంటే 13 శాతం పెరిగాయని చెప్పారు. గురువారం బెంగళూరులో ఆయన మీడియా సమావేశంలో ఇంటర్ ఫలితాలను ప్రకటించారు. 6.32 లక్షల మందిలో 5.46 లక్షలు పాస్ ● 6,32,200 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5,46,698 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,32,928 మంది బాలురు, 3,13,770 మంది బాలికలు. ఈసారి అమ్మాయిలే పైచేయి సాధించారు. ● ఆర్ట్స్ విభాగంలో 98,310 (72.86 శాతం) ఉత్తీర్ణులయ్యారు. కామర్స్ విభాగంలో 1,82,317 (88.04శాతం), సైన్స్లో 2,66,071 (86.48 శాతం) మంది పాసయ్యారు. ● నగర ప్రాంతంలో 3,71,853 (85.95 శాతం), గ్రామీణ ప్రాంతంలో 1,74,845(87.62 శాతం) మంది పాసయ్యారు. ● డిస్టింక్షన్లో 1,70,529 మంది, ప్రథమ శ్రేణిలో 2,95,385 మంది, ద్వితీయశ్రేణిలో 63,957 మంది ఉత్తీర్ణత సాధించారు. 16,827 మంది జస్ట్ పాస్ అనిపించుకున్నారు. ఫలితాల్లో పురోగతి: మంత్రి వెబ్సైట్లో ఫలితాలు, మార్కులు కూడా అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. గత ఏడాది కళ్యాణ కర్ణాటకలో 61 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఈసారి 79 శాతానికి పెరిగారని తెలిపారు. ప్రభుత్వ కాలేజీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులు ఏటేటా ప్రగతి సాధిస్తున్నారని చెప్పారు. ఫలితాల్లో గతేడాది మాదిరిగానే ఈసారీ 96.39 శాతంతో ఉడుపి ప్రథమ స్థానం పొందితే, యాదగిరి జిల్లాది చివరి స్థానం. బెంగళూరు 5 ప్లేసులో నిలిచింది. ఇక సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 30న మొదలై మే 13 వరకు జరుగుతాయి. ఫీజు వివరాలకు పీయూసీ బోర్డు వెబ్సైట్ లేదా కాలేజీలో సంప్రదించాలని తెలిపారు. రాష్ట్రంలో తొలిసారి 86 శాతం ఉత్తీర్ణత 5.46 లక్షల మంది పాస్ బాలికలదే పైచేయి ఉడుపి జిల్లా ప్రథమం, యాదగిరికి చివరి స్థానం ఏ జిల్లా.. ఎంత ఉత్తీర్ణత ఉడుపి 96.39 శాతం ఉత్తర కన్నడ 96.35 కొడగు 92.34 విజయపుర 92 బెంగళూరు గ్రామాంతర 91 చిక్కమగళూరు 90.80 బెంగళూరుదక్షిణ 90.55 చిక్కబళ్లాపుర 90.24 బెంగళూరు ఉత్తర 90.05 హాసన్ 89.71 మండ్య 88.85 రామనగర 87.90 కోలారు 87.38 శివమొగ్గ 87.62 తుమకూరు 86.89 కొప్పళ 86.80 చామరాజనగర 84.68 మైసూరు 84.80 బీదర్ 84.61 బాగల్కోటే 84.12 హావేరి 84.11 ధారవాడ 83.31 చిక్కోడి 83.10 దావణగెరె 81.99 బెళగావి 80.32 చిత్రదుర్గ 79.12 బళ్లారి 78.69 కలబుర్గి 76.97 గదగ్ 76.65 రాయచూరు 74.09 యాదగిరి 71.21 -
తోక జాడించారో జాగ్రత్త.!
● రౌడీలకు పోలీసు కమిషనర్ వార్నింగ్ హుబ్లీ: హుబ్లీలో గురువారం రౌడీలకు నిర్వహించిన పరేడ్లో పోకిరీలు, ఆకతాయిలకు నగర పోలీస్ కమిషనర్ శశికుమార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తోక జాడిస్తే ఖబడ్దార్.. జిల్లా సరిహద్దుల నుంచి బహిష్కరిస్తానని హెచ్చరించారు. అంతేగాక మంచి నడవడిక చూపిన 816 మంది రౌడీలను రౌడీ జాబితా నుంచి విముక్తిని కల్గిస్తూ పాత అలవాట్లకు కొనసాగించే రౌడీలపై కొరడా ఝళిపించారు. స్థానిక సీఏఆర్ మైదానంలో జరిగిన రౌడీ పరేడ్లో 450 మందికి పైగా రౌడీలు పాల్గొన్నారు. అతి వెకిలి చేష్టలు, అతి వేషాలు వేస్తే పాత చరిత్ర వెలికితీసి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు. కాగా ఇప్పటికే 30 మందికి పైగా రౌడీలను సరిహద్దుల నుంచి బహిష్కరించే ప్రక్రియ మొదలైందన్నారు. అలాగే మంచి నడవడిక అలవాటు చేసుకొని బతుకుతున్న మాజీ రౌడీలకు శుభవార్త చెప్పారు. 2026 ప్రారంభంలో జంట నగరాల్లో 1320 మంది రౌడీషీటర్లు ఉండేవారు. వీరిలో మంచి మార్గంలో నడుస్తున్న 816 మందిని రౌడీ షీటర్ జాబితా నుంచి తొలగించారు. ప్రస్తుతం నగరంలో 510 మంది యాక్టివ్ రౌడీ షీటర్లు ఉండగా, ఈ ఏడాది కొత్తగా 100 మందిపై నిఘా పెట్టి వారిని రౌడీషీట్ జాబితాలో చేర్చే ప్రక్రియ జరుగుతోంది. మొత్తానికి నగర పోలీసులు జంట నగరాల్లో శాంతి భద్రతలను కాపాడటానికి కఠిన చర్యలు తీసుకుంటుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం హొసపేటె: కమలాపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్పీసీ ఫోర్ బే కాలువలో సుమారు 40– 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు సుమారు 5.6 అడుగుల ఎత్తు, తెల్లని ఛాయ కలిగి తెల్లని, సగం చేతుల, చారల చొక్కా, నలుపు తెలుపు చారల లుంగీ, ఎరుపు, పసుపు రంగు తలపాగా ధరించాడు. మృతుని వారసులు ఎవరైనా ఉంటే కమలాపుర పోలీస్ స్టేషన్ ఎస్ఐని లేదా 9480805762 నంబరును సంప్రదించాలని ఓ ప్రకటనలో తెలిపారు. ద్వితీయ పీయూసీలో సత్తా సాక్షి బళ్లారి: 2025–26వ విద్యాసంవత్సరపు ద్వితీయ పీయూసీ పరీక్షల్లో శ్రీచైతన్య పీయూ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. కళాశాల విద్యార్థులు ఇషాంత్ రాయ్ 593, కె.త్రిషా 592, శ్రీహిత 591, ఐశ్వర్య 589, హెచ్.లిఖిత్ 588, కే.మల్లేశ్వరి 588, జే.వైష్ణవి 586, పీ.నందుశ్రీ 586, సుజాత 585, ఎం.రేఖారెడ్డి 585, సాత్విక 585, వీ.లక్ష్మీభవాని 584 మార్కులతో ఉత్తమ ఫలితాలను సాధించారు. వీరిలో డిస్టింక్షన్లో 440, ఫస్ట్క్లాస్లో 525, సెకండ్ క్లాస్లో 51 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు కళాశాల కరస్పాండెంట్ తెలిపారు. ద్వితీయ పీయూసీలో మెరుగైన ఫలితాలు● జిల్లాలో 78.69 శాతం ఉత్తీర్ణత సాక్షి,బళ్లారి: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ద్వితీయ పీయూసీలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. గురువారం సాయంత్రం ద్వితీయ పీయూసీ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 78.69 శాతం ఫలితాలు సాధించినట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. గత ఏడాది మెరుగైన ఫలితాలు రాకపోవడంతో రాష్ట్రంలో బళ్లారి జిల్లా 24వ స్థానానికి పడిపోయిన సంగతి విదితమే. ఈ ఏడాది విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాలు, చర్యలకు తోడు విద్యార్థులు కూడా కష్టపడి చదవడంతో ఫలితాలు కాస్త మెరుగుపడినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రజా సేవకు పదవులు ముఖ్యం కాదు రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రజా సేవ చేయడానికి పదవులు ముఖ్యం కాదని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు రాజేంద్ర కుమార్ పేర్కొన్నారు. దేవదుర్గ భవనంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల ఆశయ సాధనకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. తనను ఎన్నుకున్న వారికి రుణపడి ఉంటానన్నారు. ఉద్యోగులు కట్టబెట్టిన పదవికి న్యాయం చేస్తానన్నారు. విద్యారత్న, సేవా భూషణ్ అవార్డులను అందించారు. నాగేష్ గౌడ, ప్రేమలతా రెడ్డి, చంద్రశేఖర్ పాటిల్, సురేష్, బోరేగౌడ, చరణ్రాజ్, విశ్వనాథ్, బసవరాజ్లున్నారు. శాంతరస సాహిత్య సేవలు అనన్యం రాయచూరు రూరల్: కన్నడ సాహిత్య రంగానికి ప్రముఖ రచయిత శాంతరస అందించిన సేవలు అనన్యమని రాయచూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ శివానంద అభిప్రాయ పడ్డారు. ఆదివారం ఎస్ఆర్కే విద్యాలయంలో శాంతరస సంస్మరణ దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. శాంతరస త్రిభాషా సాహిత్యంతో ప్రపంచానికి చాటిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కసాప అధ్యక్షుడు విజయ రాజేంద్ర, లక్ష్మీదేవి, బసవప్రభు, వెంకటేష్, రెహమాన్, వీరహనుమాన్, బసవరాజ్ కళస, రంగణ్ణ పాటిల్, విరుపాక్షి, భీమనగౌడ, రావుత్రావ్లున్నారు. ఇంటర్ పరీక్షల్లో జిల్లాకు 14వ స్థానం కోలారు: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో కోలారు జిల్లా 14వ స్థానంలో నిలిచింది. వాణిజ్య విభాగంలో నగరంలోని మహిళా సమాజ కళాశాల విద్యార్థిని చిరంతన, విజ్ఞాన విభాగంలో బేతమంగల మదన్ బంగారుపేట ఎస్డీసీ కళాశాల అర్చన, కళా విభాగంలో నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని నయన ప్రథమ స్థానంలో నిలిచారు. విజ్ఞాన విభాగంలో నగరంలోని సహ్యాద్రి కళాశాల విద్యార్థిని లయ సత్తా చాటింది. -
చివరి ఆయకట్టుకు సాగునీరు ఏదీ?
రాయచూరు రూరల్: నారాయణపుర కాలువ చివరి ఆయకట్టు భూములకు నీరందించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కాలువకు మార్చి 31 వరకు నీరు అందించడంతో చేతికొచ్చిన పంట నోటికి రాకుండా పోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి గేజ్ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు కాలువలకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు పాటించడం లేదు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘిస్తున్నారని రైతులు వాపోతున్నారు. కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాలకు నీరు అందించే దిశలో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావడం లేదు. డ్యాంలో ప్రస్తుతం 56.132 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఔట్ ఫ్లో 11,396 క్యూసెక్కుల నీటికి బదులు కాలువలకు రోజు 3,800 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలవుతున్నాయి. జనవరి మొదటి వారంలో రెండవ పంటను సాగు చేశారు. ఏప్రిల్ నెలలో లక్ష హెక్టార్లలో వరి కోతకు వస్తోంది. వరి పంటకు ఏప్రిల్ 15 వరకు నీటిని విడుదల చేస్తే పంట చేతికి దక్కుతుందని రైతులు పేర్కొంటున్నారు. శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టని వైనం సర్కార్ ఆదేశాలు ఉల్లంఘిస్తున్న అధికారులు -
ఉప పోరు ప్రశాంతం
బాగలకోటెలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటరుకార్డులతో వేచి ఉన్న పురుష ఓటర్లుదావణగెరెలో ఓ పోలింగ్ కేంద్ర ం వద్ద ఓటు వేసేందుకు క్యూలో నిలబడిన మహిళా ఓటర్లు సాక్షి,బళ్లారి: దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే శ్యామనూరు శివశంకరప్ప, బాగల్కోటె అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే హెచ్.వై.మేటి మృతితో జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. మండుటెండలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని పోలీంగ్ కేంద్రాల వద్ద ఉదయం కాస్త మందకొడిగా పోలింగ్ సాగినా సాయంత్రం కల్లా పోలింగ్ సరళి బాగా పుంజుకుంది. పోలింగ్ ముగిసే సమయానికి దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ 68.43 శాతం, బాగల్కోటె అసెంబ్లీ నియోజకవర్గంలో 68.74 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిసింది. ఉత్సాహంగా ఓటెత్తారు కాగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువకులు, వృద్ధులు, మహిళలు ఉత్సాహంగా బారులు తీరారు. దీంతో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గుడికూడిన ఓటర్లతో సందడి వాతావరణం నెలకొంది. దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్యామనూరు శివశంకరప్ప మనవడు శ్యామనూరు సమర్ధ్ పోటీ చేయగా, బీజేపీ తరుపున శ్రీనివాస దాస కరియప్ప, బాగల్కోటె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉమేష్ మేటి, బీజేపీ తరఫున వీరణ్ణ చరంతిమఠ బరిలో నిలిచారు. ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్న నేపథ్యంలో అప్పటి వరకు అభ్యర్థులకు టెన్షన్ తప్పని పరిస్థితి నెలకొంది. ఉప ఎన్నిక ముగిసిన తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు 25 రోజుల గడువు ఉండటంతో అప్పటి వరకు స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తును కొనసాగించనున్నారు. బాగలకోటెలో ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థి దావణగెరెలో ఓటు వేసేందుకు బారులు తీరిన మహిళా ఓటర్లు ఉప ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఈవీఎంల్లో ఓటరు దేవుళ్ల తీర్పు నిక్షిప్తం మే 4వ తేదీన వెలువడనున్న ఫలితాలు -
ఇసుక అక్రమ తవ్వకం.. ఇద్దరిపై కేసు నమోదు
హొసపేటె: కొప్పళ తాలూకాలోని కోళూరు సమీపంలో ఉన్న హిరేహళ్ల వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు సాగిస్తున్న ఇద్దరిపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారిక ఇసుక కాంట్రాక్టర్లకు కేటాయించిన ప్రాంతానికి ఆవల నుంచి అక్రమంగా ఇసుకను వెలికి తీస్తున్నారన్న సమాచారం మేరకు తహసీల్దార్, భూగర్భ గనుల శాఖ అధికారులు, పోలీసు సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడి సమయంలో హిటాచీ యంత్రాల ఉపయోగించి ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు తేలడంతో మురుగుప్ప వనకేరి, నీలేష్ మదరఖండి అనే ఇద్దరిపై కొప్పళ గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తల్లిదండ్రులు మందలించారని ఉద్యోగి ఆత్మహత్య హోసూరు: తాగుడుకు బానిసై విధులకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో జీవితంపై విరక్తి చెందిన ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హోసూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. హోసూరు సమీపంలోని వన్నలవాడి గ్రామానికి చెందిన అగస్టిన్ (27) ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కొద్ది రోజులుగా విధులకు వెళ్లకుండా మద్యం సేవిస్తూ జులాయిగా తిరుగుతున్నాడు. విధులకు వెళ్లకుండా ఇంట్లో ఉంటే ఎలా అని తలిదండ్రులు మందలించారు. జీవితంపై విరక్తి చెందిన అగస్టిన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.15 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లకు సంకెళ్లు
దొడ్డబళ్లాపురం: డిజిటల్ అరెస్టు పేరుతో బెళగావికి చెందిన వ్యాపారవేత్తను బెదిరించి రూ.15.45 కోట్లు కొల్లగొట్టిన కేసులో పోలీసులు ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన వంకదోత్ శరత్ నాయక్, దేగావత శ్రీపాద నాయక్ నిందితులు. వీరు ఓ కంపెనీ పేరుతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి సైబర్ నేరాలకు పాల్పడుతూ వచ్చే డబ్బును హైదరాబాద్, గోవా, హరియాణ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో 10 బ్యాంక్ ఖతాలకు బదిలీ చేసేవారు. వీరి ఖాతాలలో ఉన్న రూ.1 కోటి డబ్బును పోలీసులు ఫ్రీజ్ చేశారు. పదే పదే బెదిరించి.. బెళగావిలోని తిళకవాడికి చెందిన అజిత్ సరాఫ్ అనే వ్యాపారవేత్తకు ఇటీవల కాల్ చేసిన నిందితులు.. తాము సీఐబీ అధికారులమని చెప్పుకున్నారు. మీ పేరుతో రెండు సిమ్ కార్డులు ఉన్నాయి. మీ ఖాతా నుంచి రూ.25 లక్షల మనీ లాండరింగ్ చేసి రూ.5 లక్షలు కమీషన్ తీసుకున్నారు, మీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది.. అని పదే పదే బెదిరించారు. ఇలా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 9 వరకూ పలు విడతలుగా బాధితుని నుంచి రూ.15.45 కోట్లను ఆన్లైన్లో తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు హైదరాబాద్లో నిందితులను అరెస్టు చేశారు. బెళగావివాసి డిజిటల్ అరెస్టు కేసు.. హైదరాబాద్లో నిందితుల అరెస్టు -
2వ అంతస్తు నుంచి కిందపడ్డ చిన్నారి
కృష్ణరాజపురం: బెంగళూరులో దారుణం జరిగింది. ఆటలాడుకుంటూ రెండేళ్ల చిన్నారి పాప భవనం 2వ అంతస్తు నుంచి కిందపడిన ఘటన నాయండహళ్లిలో జరిగింది. వివరాలు నవీన్, జయశ్రీ దంపతుల కుమార్తె చిన్నారి సహన. నవీన్ ఆటోడ్రైవర్గా పనిచేస్తుంటాడు. వీరికి ఈ పాప ఒక్కరే సంతానం. ఈ నెల 6వ తేదీ ఉదయం 7 గంటలకు భర్త పనికి వెళ్లగా, భార్య వంటింట్లో పాప కోసం పాలు వేడి చేస్తోంది. చిన్నారి పాక్కుంటూ బాల్కనీలోకి వచ్చింది. అక్కడ ఉన్న చెయిర్ను ఎక్కి, పట్టు తప్పి కిందకు పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. బయట జనం కేకలు వేయడంతో తల్లి పరుగు పరుగున కిందకు వచ్చి, గాయపడిన కూతురిని చూసి అక్కడే మూర్ఛపోయింది. వెంటనే బాలికను, తల్లిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో బాలికకు చికిత్స అందిస్తున్నారు. పై నుంచి శిశువు కిందపడడం, రోడ్డు మీద అచేతనంగా ఉన్న దృశ్యం అక్కడి సీసీ టీవీ కెమెరాలలో రికార్డయింది. చంద్ర లేఔట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గురువారం బాలిక తండ్రి మాట్లాడుతూ బిడ్డ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారన్నారు. తలకు 3 కుట్లు పడ్డాయని, ఎక్కడా గాయాలు లేవని, ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పాడు. ఐసీయూలో చికిత్స బెంగళూరులో సంఘటన -
తాగునీరు అందించాలని ఆందోళన
రాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా స్పందించక పోవడాన్ని తప్పుబడుతూ ప్రజలు ఆందోళన చేపట్టిన ఉదంతం రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. 15 రోజులైనా కొళాయిలకు తాగునీటిని వదలక పోవడంతో లింగసూగూరు తాలూకా సర్జాపురలో రైతులు, గ్రామస్తులు గ్రామ పంచాయతీ అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. తాగునీరు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని ఖండిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. -
వివాహిత అదృశ్యం కేసులో మలుపు
హుబ్లీ: కొప్పళకు చెందిన నవ వివాహిత అదృశ్యమైన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే మెట్టింటి నుంచి కనిపించకుండా పోయిన ఆ యువతి ముస్లిం యువకుడితో హుబ్లీలో కనిపించింది. ఆ మేరకు పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యుల ఎదుటే ఆ యువతి ప్రేమికుడితోనే కలిసి ఉంటానని మొండికేసింది. అయితే సదరు భర్త ఇప్పటికే అవమానం తట్టుకోలేక మా నాన్న గుండెపోటుతో చనిపోయాడు. అందుకే తమకు పరిహారం చెల్లించాలని భర్తతో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కొప్పళలోని గౌరి అంగళ నివాసి నాగరాజ్ను పెళ్లి చేసుకున్న రాయచూరు జిల్లా సింధనూరుకు చెందిన సంజన అనే యువతి పెళ్లైన రెండు నెలలకే భర్తను విడిచి కనిపించకుండా పోయింది. మనోవేదనతో కుటుంబ పెద్ద మృతి విషయం తెలిసిన మామ అనగా భర్త తండ్రి అవమాన భారంతో మనోదేవనకు గురై అనారోగ్యం కృశించి గుండెపోటుతో మృతి చెందడంతో సర్వత్రా ఆవేదన వ్యక్తమైంది. ఈ కేసులో ప్రస్తుతం కీలక మలుపు చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతి సంజన బుధవారం రాజాబక్షి అనే ముస్లిం యువకుడితో హుబ్లీలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి ఇద్దరిని కొప్పళ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. సొంత ఊరు గదగ్ జిల్లాకు చెందిన రాజబక్షి ఆటో డ్రైవర్. అతడికి పెళ్లి కూడా అయింది. అయినా అతడు యువతిని తీసుకొని వెళ్లిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఇద్దరిని పోలీస్ స్టేషన్కు పిలిపించిన తక్షణమే సంజన భర్త, ఆయన బంధువులు స్టేషన్కు హుటాహుటిన వచ్చారు. అయినా ఆ నవవివాహిత తనకు రాజాబక్షినే కావాలని పట్టుబట్టింది. నష్ట పరిహారం చెల్లించాలని భర్త డిమాండ్ ఆమె ఈ పిచ్చితనానికి, మొండిపట్టుకు కుటుంబ పెద్ద ప్రాణనష్టం జరిగిందని, అందుకు గాను తమను నష్ట పరిహారం చెల్లించాలని ఆమె భర్త నాగరాజ్ డిమాండ్ చేశారు. కాగా వీరిద్దరి వివాహం పరస్పర ఆమోదం మేరకు ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో కొప్పళలోని పార్థ కళ్యాణ మంటపంలో గత ఫిబ్రవరి 8న జరిగి నాగరాజ్, సంజన ఒకింటివారయ్యారు. ఆ తర్వాత ఈ కొత్త దంపతులు నాగరాజ్ ఇంటి తొలి అంతస్తులో ఉండేవారు. ఈ క్రమంలో గత మార్చి 21న రాత్రి 8.30 ప్రాంతంలో సంజన తనకు ఆరోగ్యం బాగోలేదని ఔషధాలు తేవాలని భర్త నాగరాజ్ను పురమాయించింది. నాగరాజ్ ఔషధాలను తేవడానికి వెళ్లి తిరిగి 15 నిమిషాల్లో రాగా ఆ సమయంలో భార్య సంజన ఇంట్లో కనిపించలేదు. అక్కడ, ఇక్కడ అన్ని చోట్ల వెతికినా ఆమె ఇక్కడికి రాలేదని అందరూ సమాధానం చెప్పారు. ఆమె బంధువుల ఇంట్లో కూడా ఆమె గురించి సమాచారం తెలియక పోవడంతో భర్త నాగరాజ్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన ఇంటి కొత్త కోడలు కనిపించకుండా పోవడంతో ఆ ఇంటి పెద్ద, ఆమె మామ కండప్ప గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. హుబ్లీలో ముస్లిం యువకుడితో యువతి కొప్పళ పోలీస్ స్టేషన్లో హైడ్రామా -
ట్రెక్కర్లకు కొత్త నియమాలు!
శివాజీనగర: రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లో పాదయాత్ర, పర్వాతారోహణ తదితరాలకు వెళ్లి టూరిస్టులు తప్పిపోవడం, ప్రమాదాలకు గురి కావడంతో అటవీ శాఖ కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయించింది. కొడగు జిల్లా తడియాండమల్ కొండకు ట్రెక్కింగ్కు వచ్చిన కేరళ యువతి శరణ్య దారితప్పి మూడు రోజుల పాటు అడవిలోనే చిక్కుకొంది. చిక్కమగళూరు జిల్లాలో బాలిక శ్రీనంద అదృశ్యమైంది. ఇలాంటి ఘటనలతో పర్యాటకానికి చెడ్డపేరు వస్తుందని ప్రభుత్వం ఆందోళనగా ఉంది. ఏమేం చర్యలు? పర్యాటకుల రక్షణకు చర్యలు తీసుకోవాలని అటవీ మంత్రి ఈశ్వర ఖండ్రె తమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ట్రాకింగ్ అనే యాప్ను రూపొందించాలని, ట్రెక్కర్ల మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే దారితప్పినప్పుడు జీపీఎస్ ద్వారా కనిపెట్టవచ్చని పేర్కొన్నారు. ట్రెక్కర్లతో పాటు ఉండే నేచర్ గైడ్లకు తప్పకుండా వైర్లెస్ సమాచార వ్యవస్థ కల్పించాలన్నారు. ట్రెక్కర్లకు గ్రూపు ఇన్సూరెన్స్ ఉండాలని తెలిపారు. ప్రమాదాల నేపథ్యంలో అటవీ మంత్రి ఆదేశం -
మాణిక్యధారలో మిస్సింగ్ మిస్టరీ
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా బాబా బుడన్గిరి సమీపంలోని మాణిక్యధార అనే పర్యాటక ప్రాంతంలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన కేరళ బాలిక శ్రీనంద (16) కోసం పోలీసులు, అటవీ సిబ్బంది, స్థానికులు గాలింపు చేపట్టారు. కేరళ నుంచి టూరిస్టులు బస్సులో వచ్చారు, ఆ సమయంలో బాలిక మిస్సయింది. ఆమె అనుకోకుండా లోయలోకి పడి ఉండవచ్చుని అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో బాలిక తల్లి రోహిణి మాట్లాడుతూ ఆమెకు ఏ ప్రమాదం జరగలేదు, ఎవరో ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి ఉంటారని ఆరోపించారు. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో మత్తు మందు ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లారని విలపించారు. గత 10 ఏళ్ల నుంచి తమ కుటుంబం ఎక్కడా టూర్కు వెళ్లలేదు, దీంతో ఎక్కడైనా విహారయాత్రకు వెళ్లాలని ఇక్కడకు వచ్చామని, ఇలా అయ్యిందని తెలిపారు. పోలీసులకే సవాల్ పోలీసులు డ్రోన్ కెమెరాలతో అడవిలో గాలింపు చేపట్టారు. మాణిక్యధారకు వచ్చిన వాహనాల వివరాలతో పాటు అనుమానం ఉన్న వ్యక్తుల సమాచారంను నేకరిస్తున్నారు. నా కూతురిని వెతికి ఇవ్వండి, ఆమె లేకపోతే నేను బతకలేని అని తల్లి రోదిస్తున్నారు. ఏం జరిగిందో తెలియక పోలీసులకే సవాల్గా మారింది. మాణిక్యధారలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. బాలిక జాడ లేక తల్లిదండ్రుల రోదనలు డ్రోన్ కెమెరాలతో పోలీసుల గాలింపు -
ద్వితీయ పీయూసీలో ర్యాంకుల పంట
● కొట్టూరు విద్యార్థినులకు రాష్ట్రానికే ద్వితీయ స్థానం హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరుకు చెందిన హిందూ పీయూ కళాశాల విద్యార్థినులు సంగీత, అర్చన అనే ఇద్దరు 600 మార్కులకు గాను 598 మార్కులను సాధించడం ద్వారా రాష్ట్రానికే ద్వితీయ స్థానం పొందారు. రాష్ట్రంలో మూడబిదిరె నివాసి దిశ కామర్స్లో 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించి రాష్ట్రానికి ప్రథమ స్థానంలో నిలిచింది. విషరహితంగా పంటలు పండించాలి కోలారు: నేటి రోజుల్లో విషంతో కూడిన ఆహార పదార్థాలను పండిస్తున్నారు, ఇది మానవ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తోంది, రైతులు విషరహిత ఆహార ఉత్పాదనకు ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ రవి తెలిపారు. గురువారం జిల్లా పంచాయతీ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన విషరహిత ఆహార ఉత్పాదన వైపు కోలారు జిల్లా ఒక అడుగు అనే సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యవసాయం కేవలం శ్రమ మాత్రమే కాదని అదొక విజ్ఞానమని అన్నారు. రైతులు పంటలకు రోగాలు వస్తే రసాయనిక దుకాణాల వద్దకు వెళ్లకుండా, నిపుణుల సలహాల కోసం రైతులు సంప్రదించేందుకు వీలుగా అగ్రి క్లినిక్లను స్థాపించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. కార్యక్రమంలో ఉప వ్యవసాయ డైరెక్టర్ ఎస్ నాగరాజ్, ఐిసీఏఆర్ ఢిల్లీ నివృత్త అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
● మృతుడు బళ్లారి జిల్లా వాసి కళ్యాణదుర్గం రూరల్: విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు... బళ్లారి జిల్లా మోకా సమీపంలోని సింధవాళ గ్రామానికి చెందిన బసవరాజు (32)కు భార్య ఛైత్ర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతను కొన్ని రోజుల క్రితం కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో మొక్కజొన్న పంట కోతకు మిషన్ కూలీగా వచ్చాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కోత మిషన్ పైకి ఎక్కి యంత్రాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై కింద పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వంతెనకు బైక్ ఢీ.. ముగ్గురు దుర్మరణంరాయచూరు రూరల్: వంతెనకు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన బీదర్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతులను హుమ్నాబాద్ తాలూకా హళ్లిఖేడకు చెందిన వెంకట్(40), అతని భార్య శిల్ప(35), కుమార్తె రక్షిత(12)గా పోలీసులు గుర్తించారు. వేగంగా దూసుకుచ్చిన ద్విచక్ర వాహనం అదుపు తప్పి వంతెనకు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ వారిని బీదర్లోని బిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సర్కారు బడిలోనే విద్యార్థులను చేర్పించాలిరాయచూరు రూరల్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు విద్యార్థులను చేర్పించాలంటూ ర్యాలీ చేపట్టారు. కొప్పళ జిల్లా గంగావతిలోని 22వ వార్డు గుండమ్మ క్యాంప్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి వీధుల్లో సంచరిస్తూ 2025–26వ విద్యా సంవత్సరానికి పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడానికి ముందుకు రావాలంటూ జాతాను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక పబ్లిక్ పాఠశాలల పేరుతో కన్నడ బడులను మూసి వేయడానికి కుట్ర పన్నుతున్న నేపథ్యంలో నూతన ఒరవడికి క్యాంప్ వాసులు శ్రీకారం చుట్టారు. ఐదేళ్లు పైబడిన పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఇంటింటా ప్రచారం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్య పుస్తకాలు, బోధన, పాలు, భోజనం, దుస్తులు, గుడ్డు, బూట్లు, అరటి పండు, ఆరోగ్య చికిత్సలు వంటివి అందుబాటులో ఉంటాయని, వాటి ప్రాధాన్యతను గురించి వివరించారు. ఉపాధ్యాయినికి సన్మానం రాయచూరు రూరల్: నేటి యుగంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని మడ్డిపేట ప్రాథమికోన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయిని రూపా పేర్కొన్నారు. నగరంలో గురువందన కార్యక్రమంలో అవార్డును అందుకుని ఆమె మాట్లాడారు. జ్ఞాన సముపార్జనకు విద్య, సాహిత్యం చేదోడు వాదోడుగా ఉంటాయన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలకు తోడు పాఠ్యేతర విషయాలపై ఆసక్తి కనబరచాలని అన్నారు. ఆరోగ్యంపై ఆసక్తి పెంచుకోవాలి రాయచూరు రూరల్: నేటి కాలంలో ప్రజలు ఆరోగ్యంపై ఆసక్తిని పెంచుకోవాలని జిల్లా ఆరోగ్య శాఖాధికారి సురేంద్రబాబు పిలుపునిచ్చారు. జిల్లా ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసుకోవాలన్నారు. మానవుడి జీవన శైలి, ఆహార పద్ధతిలో వచ్చిన మార్పుల వల్ల అనారోగ్యం పాలవుతున్నారన్నారు. సమావేశంలో వైద్యులు గణేష్, శివకుమార్, నాగరాజ్, సరోజ, లేపాక్షి, తాయప్ప, సురేష్, అడివప్పలున్నారు. -
కృతికా కేసు: ‘పోలీసులు అడిగితే మనం స్నేహితులమని చెప్పు’
బెంగళూరు: సంచలనం సృష్టించిన బెంగళూరు డాక్టర్ కేసులో ఏడాది తర్వాత.. చాటింగ్ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బెంగళూరుకు చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి.. కట్టుకున్న భార్యను(చర్మవ్యాధి నిపుణురాలు) కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి తన ప్రియురాలితో కలిసి పథకం పన్నినట్లు తెలుస్తోంది. తన భార్య కృతికా రెడ్డికి ఇంట్లోనే మోతాదుకు మించి అనస్థీషియా డ్రగ్ ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేంద్ర రెడ్డిని.. గతేడాది అక్టోబర్లో పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన గత ఏడాది ఏప్రిల్ 21న జరిగింది. ఇంట్లో కృతిక అస్వస్థతకు గురైనట్లు నాటకమాడి, మహేంద్ర ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మొదట ఇది సహజ మరణంగా భావించినప్పటికీ తదుపరి విచారణలో పోలీసులకు అనుమానాలు కలిగాయి. ఒక డాక్టరుగా తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆ హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు మహేంద్ర ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.దర్యాప్తు సమయంలో నిందితుడు హర్షిత అనే నర్సుతో సంబంధంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ఈ కేసులో అత్యంత కీలక ఆధారాలుగా మారాయి. నిఘా సంస్థలకు దొరకకుండా ఉండేందుకు మహేంద్ర వాట్సాప్ వంటి సాధారణ ప్లాట్ఫారమ్లను వాడకుండా, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్ల ద్వారా సందేశాలు పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) నిందితుడి ఫోన్ నుండి డిజిటల్ ఫైళ్లను రికవరీ చేసింది. ఇందులో డిలీట్ చేసిన డేటా, సన్నిహితంగా ఉన్న ఫోటోలు, ఫోన్ పే చాట్లు ఉన్నాయి. వీటిని పోలీసులు చార్జ్షీట్లో చేర్చారు.నిందితుడు హర్షితకు పంపిన కొన్ని మెసేజ్లు.. అతని నేరం చేయడానికి ముందస్తు ప్లాన్ బయటపడింది. "ఈ మెసేజ్ చూసిన తర్వాత నాకు ఎక్కడా టెక్స్ట్ చేయొద్దు, కాల్ చేయొద్దు. అంతా సర్దుకున్నాక నేనే కాల్ చేస్తాను. ఒకవేళ పోలీసులు నిన్ను పిలిచి మన మధ్య సంబంధం ఏంటని అడిగితే.. మనం కేవలం స్నేహితులమని చెప్పు’’ అంటూ చేసిన చాటింగ్ బయటపడింది. మహేంద్ర, కృతికలకు మే 2024లో వివాహం జరిగింది. వీరిద్దరూ బెంగళూరులోని ఒకే ఆసుపత్రిలో పనిచేసేవారు. సేకరించిన ఆధారాలు బలంగా ఉండటంతో స్థానిక కోర్టు.. మహేంద్ర రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. -
మాజీ భార్యపై లైంగిక దాడి కేసు రద్దు కాదు: హైకోర్టు తీర్పు
బెంగళూరు: భార్య నుంచి విడిపోయాక, ఆమైపె బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడితే ఆ కేసును రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ దంపతులు 2019లో విడిపోయారు. 2021లో ఆమె ఇంటికి వచ్చిన మాజీ భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని నిందితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ కేసులో ఆ మహిళే స్వయంగా వాదించారు. తనపై దౌర్జన్యం జరిగిందని, అతని పిటిషన్ను తిరస్కరించాలని కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలను ఆలకించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న కేసు మాఫీకి తిరస్కరించారు. -
నమో నాగనాథేశ్వర
చింతామణి: పట్టణంలోని పురాణ ప్రసిద్ధ శ్రీనాగ నాథేశ్వర దేవస్థానంలో స్వాముల వారికి విశేష పూజలు నిర్వహించారు. పండితులు అభిషేకం, హోమాలు, అలంకారం నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు దర్శించుకొన్నారు.మహిళ కంట్లో కారం చల్లి రూ.5 లక్షల దోపిడీ కోలారు: ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంఘాల నుంచి వసూలు చేసిన రుణాల డబ్బు రూ.5 లక్షలను పట్టపగలే దొంగలు దోచుకుని వెళ్లిన ఘటన ముళబాగిలు నగరంలోని షామీర్ మొహల్లాలో ఉన్న సంఘం కార్యాలయంలో జరిగింది. సంఘం అధికారి శశికళ రూ.5 లక్షల నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి సిద్ధమవుతుండగా, ఇద్దరు అపరిచితులు ఆఫీసులోకి చొరబడ్డారు. వెంటనే శశికళ కళ్లలోకి కారం పొడి చల్లి, చాకు చూపించి బెదిరించి ఆ నగదును ఎత్తుకుని వెళ్లారు. బాధితురాలు కేకలు వేసేటప్పటికి పరిసరాల్లో లేరు. పోలీసులు చేరుకుని పరిశీలించారు. జాగిలాలు, వేలిముద్రల నిపుణులతో ఆధారాల కోసం ప్రయత్నించారు. నిద్రిస్తున్న వారిపై సైకో దాడిదొడ్డబళ్లాపురం: వేసవి వేడిని తట్టుకోలేక ఇంటి ముందు పడుకున్న వారిపై సైకో కట్టెతో బాదగా ఆరుమంది గాయపడ్డ సంఘటన గదగ్ జిల్లా ముండరగి తాలూకా డోణి తాండాలో జరిగింది. మంగళవారం రాత్రి తాండాలో కొందరు ఇళ్ల ముందు మంచం వేసుకుని పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో గ్రామవాసి, మానసిక రోగి హర్జప్ప లమాణి లావుపాటి కట్టె తీసుకుని పడుకున్నవారిని చావబాదాడు. ఎగ్గప్ప నాయక్, శేఖప్ప నాయక్, షణ్ముఖప్ప, జగదీష్ లమాణి, చవళ్ళప్ప లమాణి, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు వారిని ఆస్పత్రికి తరలించారు. ముండరగి పోలీసులు దుండగున్ని అరెస్టు చేశారు. హర్జప్ప మానసిక అస్వస్థుడని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనతో బయట పడుకోబోమని చాలామంది తెలిపారు. ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ సీజ్ దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుని లగేజీ బ్యాగ్లో రహస్యంగా దాచిన 9.7 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయిని పట్టుకున్నారు, దీని విలువ రూ.3.39 కోట్లుగా తెలిపారు. మరో ప్రయాణికుడు చాక్లెట్లలో దాచిన 1.7 కేజీల చరస్, హషిష్ మత్తుపదార్థాలను సీజ్ చేశారు. వీటి ఖరీదు రూ.4.7 కోట్లుగా తెలిపారు. నిందితులను అరెస్టు చేశారు. ప్రేయసి ఆత్మహత్య, ప్రియుడు సైతం..దొడ్డబళ్లాపురం: ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందన్న ఆవేదనతో ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన బాగలకోట జిల్లాలో జరిగింది. పవిత్ర (19), కార్తీక్ (19) ఆ ప్రేమ జంట. పవిత్ర బనహట్టి నివాసి కాగా, కార్తీక్ అస్కి గ్రామం నివాసి. ప్రేమించుకుంటున్న వీరు ఏదో విషయంలో గొడవ పడ్డారు. దీంతో ఆవేశానికి గురైన పవిత్ర ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆ విషయం తెలిసి కార్తీక్ కూడా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ధార్వాడలో మరో ప్రేమ వివాదం
హుబ్లీ: హుబ్లీ– ధార్వాడ నగరాలకు ఏమైంది.. ఎందుకు ఇలాంటి విపరిణామాలు జరుగుతున్నాయి అని నగరవాసులు కలవరం చెందుతున్నారు. వేర్వేరు మతాలకు చెందిన వారు ప్రేమించుకోవడం, ఇళ్ల నుంచి వెళ్లిపోవడం, ఆపై గొడవలు చెలరేగడం నిత్యకృత్యంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. హుబ్లీలో ఇటీవల జిమ్ ట్రైనర్, ఓ యువతి వివాదం మరిచిపోకముందే ధార్వాడకు చెందిన ఓ వివాహిత, మరో మతానికి చెందిన వ్యక్తి పరారయ్యారు. అతనికి అదివరకే పెళ్లయిందని సమాచారం. ధార్వాడ జిల్లా కెళగేరిలో నివసించే పెళ్లయిన యువతిని, పొరుగింటిలో ఉండే వివాహితుడు మున్నా మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడని ఆమె తల్లి మంజుల నగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. మా ఇంటికి వస్తూ.. తమ కుమార్తె సంజమ్మ (22)ను కారు డ్రైవర్ పని చేసే మున్నా తీసుకెళ్లాడని తల్లి విలపిస్తోంది. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుమార్తెకు తమ బంధువుల అబ్బాయితో పెళ్లి జరిగిందని, అయితే కొన్ని కారణాల వల్ల కుమార్తె తనతోనే ఉండేదన్నారు. తాము బాడుగ ఇంట్లో ఉంటామని, ఓ న్యాయవాది దగ్గర మున్నా కారు డ్రైవర్ పని చేస్తాడని తెలిపింది. ఈ క్రమంలో తమకు ఒక సొంత ఇల్లు కావాలని, ఎక్కడైనా ఉంటే వెతికి పెట్టాలని మున్నా, సదరు న్యాయవాదికి రూ.10 లక్షలు ఇచ్చాను. దీంతో వారిద్దరూ మా ఇంటికి వచ్చి వెళ్లేవారు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని వేళ మున్నా మా ఇంటికి వచ్చి నా కుమార్తెకు మాయమాటలు చెప్పి ఆమెతో పరారయ్యాడని తెలిపింది. తమ కూతురు కొంతకాలంగా కనిపించడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె వాపోయారు. ఆమెకు మద్దతుగా పలు హిందూ సంఘాల నాయకులు వచ్చారు. సంజమ్మ పరిస్థితి గురించి ఆందోళనగా ఉందని, ఆమె ఎక్కడ, ఎలా ఉందోనని అన్నారు. వేర్వేరు మతాలకు చెందిన వివాహిత యువతి, యువకుడు పరార్ కూతురి జాడ కోసం తల్లి ఆందోళన -
ఖర్గే నిప్పులు.. కాషాయం కత్తులు
మల్లికార్జున ఖర్గే ఖర్గే విమర్శలపై బెంగళూరు స్వతంత్ర పార్కులో బీజేపీ నిరసన సాక్షి, బెంగళూరు: రాజకీయాల్లో విమర్శలు సహజమే. హద్దు దాటితే రభస జరుగుతుంది. కన్నడ రాజకీయ కురువృద్ధుడు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవలి కాలంలో చేస్తున్న ఆరోపణలు బీజేపీలో ఆగ్రహావేశాలను పుట్టించాయి. ఏప్రిల్ 5న కేరళ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఓ రాష్ట్ర ప్రజలు నిరక్ష్యరాసులు అని ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళ ప్రజలు విద్యావంతులని, వారిని దారి తప్పించడం సాధ్యం కాదని చెప్పారు. దీంతో ఖర్గే వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు రాజుకున్నాయి. చివరికి తేరుకుని ఎక్స్ ద్వారా ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఏప్రిల్ 7న అస్సాం బహిరంగ సభలో ఆర్ఎస్ఎస్, బీజేపీలను పాముతో పోల్చుతూ తీవ్రంగా విమర్శించారు. ఓ వర్గం ఓటర్ల మెప్పు కోసమే ఖర్గే ఇలా చేస్తున్నారని భావిస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఖర్గే మత విద్వేషాలు రేపుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఖర్గే మాటలను వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యకర్తలు పలుచోట్ల నిరసనలు తెలిపారు. బెంగళూరు ఫ్రీడంపార్క్ వద్ద ఆందోళన చేశారు. ఖర్గేకు మద్దతుగా సీఎం, డీసీఎంలు ఇంకా స్పందించలేదు. ఖర్గే హద్దుల్లో ఉండాలి: బీజేపీ బనశంకరి: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాలుక హద్దుల్లో పెట్టుకుని మాట్లాడాలని, ఆయనకు మానసిక ఆరోగ్యం సరిగా లేదేమోనని బీజేపీ నాయకులు విమర్శించారు. మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ ఖర్గే బీజేపీ , ఆర్ఎస్ఎస్పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆయనపై విద్వేష నియంత్రణ చట్టం కింద కేసు పెట్టాలన్నారు. రజాకార్లు ఆయన కుటుంబం మీద దాడి చేశారని ఖర్గే చెప్పారు, వారి గురించి మాట్లాడటం మానేసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ను దూషించడం తగదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీద వివాదాస్పద విమర్శలతో సెగలు -
ప్లాస్టిక్పై నిషేధం పరిహాసమేనా?
సాక్షి,బళ్లారి: ప్లాస్టిక్ రహిత బళ్లారిగా మారుస్తాం అంటూ మహానగర పాలికె మేయర్, కమిషనర్లు ప్రకటనలను జారీ చేస్తున్నారే కాని ఆచరణలో మాత్రం వాటి అమలు శూన్యమనే చర్చ సాగుతోంది. నగరంలో హోటళ్లు, బేకరీలు, అంగళ్లలో యథేచ్ఛగా ప్లాస్టిక్ వాడకం కొనసాగిస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారే కాని నియంత్రణ చర్యలు మాత్రం చేపట్టడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులకు ప్లాస్టిక్ అనే పదం కూడా తెలియదు. అప్పట్లో వాడకం లేకపోవడంతో ఆహారపు అలవాట్లు కూడా మంచిగా ఉండటంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. మారుతున్న కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు మారిపోయి ప్లాస్టిక్ వాడకం కూడా పెరిగిపోవడంతో ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇడ్లీల తయారీకి కూడా ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ కవర్లు, పేపర్లతో కూరగాయలు లేదా ఇతర వస్తువుల ప్యాకింగ్ చేస్తారనుకొంటే పొరపాటు. వేడివేడి ఇడ్లీలు తయారు చేసే పాత్రల్లో కూడా ప్లాస్టిక్ కవర్లు వేసి ఇడ్లీలు తయారు చేస్తున్నారు. వేడి వేడి సాంబారు, అన్నం ఇతరత్రా వాటిని పార్శిల్ చేసి ఇవ్వడానికి కూడా ప్లాస్టిక్ కవర్లు వాడుతుండటంతో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంగళ్లు, హోటళ్లలో ప్రతి నిత్యం ప్లాస్టిక్ కవర్లతోనే ప్యాకింగ్ చేసి ఇస్తుంటారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా హోటళ్లు, అంగళ్లలో ప్లాస్టిక్ వాడుతున్నారు. హోటళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడంలో మహానగర పాలికె సంబంధిత ఆహార అధికారులు పట్టించుకోకపోవడంతో పెద్ద హోటల్ యజమానుల నుంచి పుట్పాత్లో ఉండే చిన్న హోటళ్ల వరకు ప్లాస్టిక్ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. ప్లాస్టిక్ వాడకంతో అనారోగ్య సమస్యలు ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి పదార్ధాలు వేసి పార్శిల్ చేయడంతో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు వాపోతున్నా వాటిని నియంత్రించడంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. హోటళ్లతో పాటు బేకరీల్లో వేడివేడి పదార్ధాలు ఉంచి పార్శిల్ చేసే వారిపై ఉక్కుపాదం మోపకపోతే ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. తక్షణం హోటల్లో వాడే ప్లాస్టిక్ కవర్ల వాడకం నిషేధంపై అధికారులు చొరవ చూపాలి. నగరంలోనే ప్టాస్టిక్ నిషేధం కాకపోతే గ్రామాలు, పట్టణాల్లో ఏ స్థాయిలో వాడకం సాగిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా అధికారులు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బేకరీల్లో ప్లాస్టిక్ కవర్లలో ఆహార పదార్థాల ప్యాకింగ్ దృశ్యంప్లాస్టిక్ కవర్లలో వేడి అన్నం, వంటలు పార్శిల్ చేసిన దృశ్యం రోజురోజుకు ప్లాస్టిక్ వాడకం పెరుగుతున్న వైనం హోటళ్లలో వేడి పదార్ధాల ప్యాకింగ్కూ కవర్లే దిక్కు -
దావణగెరె, బాగలకోటె ఉప పోరు నేడే
సాక్షి,బళ్లారి : దావణగెరె దక్షిణ, బాగలకోటె అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. గురువారం రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని పంపించారు. ఎన్నికల ఘట్టం తుదిదశకు చేరడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతలకు టెన్షన్ నెలకొంది. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శామనూరు సమర్థ బరిలో ఉండగా, బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస దాసకరియప్ప బరిలో ఉండి గత 15 రోజుల నుంచి ఎన్నికల్లో హోరాహోరిగా ప్రచారం నిర్వహించారు. ఇక బాగలకోటె అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉమేష్ మేటి, బీజేపీ అభ్యర్థిగా వీరన్న చరంతిమఠ్ బరిలో ఉండి హోరాహోరిగా ప్రచారం చేశారు. ఇక ఓటరు దేవుళ్లు తీర్పు నేడు ఈవీఎంలలోకి నిక్షిప్తం కానున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అభ్యర్థులకు ఓటరు దేవుళ్ల తీర్పు ఎటు వైపు ఉంటుందోనని ఉత్కంఠత నెలకొంది. ఎన్నికల సిబ్బంది రెండు నియోజక వర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షణ చేస్తున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిపేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు కూడా నిర్వహించారు. బాగలకోటె అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 2,50,797 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 1,26,999 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1,32,775 మంది కాగా ఇతర ఓటర్లు 23 మంది ఉన్నారు. మొత్తం 332 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 1564 మంది ఎన్నికల సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు నియమించారు. వీటిలో సూక్ష్మ, అతిసూక్ష్మ పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. కాగా బాగలకోటె అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 10 మంది ఏఎస్పీలు, డీఎస్పీలు కలిపి మొత్తం 250 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అలాగే దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 284 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1500 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. మొత్తం 2,31,072 మంది ఓటర్లు ఉండగా, ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన ఎన్నికల సిబ్బంది రెండు నియోజకవర్గాల్లో గట్టి పోలీస్ బందోబస్తు దావణగెరె నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,31,072 మంది బాగలకోటె అసెంబ్లీలో మొత్తం 2,50,797 మంది ఓటర్లు -
గని ప్రభావిత ప్రాంతాభివృద్ధికి కృషి
హొసపేటె: గని ప్రభావిత జిల్లాల్లో కర్ణాటక మైనింగ్ ఎన్విరాన్మెంట్ రిస్టోరేషన్ కార్పొరేషన్( కేఈఎంఆర్సీ) ప్రారంభించిన సమగ్ర పర్యావరణ ప్రాజెక్టు అమలు ఊపందుకుంది. ఈ ప్రాజెక్టు కింద జిల్లా అభివృద్ధికి రూ.4,107 కోట్ల గ్రాంటు అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు వివిధ శాఖలకు చెందిన రూ.1,710 కోట్ల విలువైన పనులకు సంబంధించిన 99 ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని కర్ణాటక గని ప్రభావిత ప్రాంత పునరుజ్జీవ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ బిజ్జూరా తెలిపారు. నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 నుంచి జిల్లాలో వివిధ శాఖల క్రింద 99 ప్రతిపాదనలు సమర్పించగా, వాటిలో అటవీ శాఖకు రూ.148 కోట్లతో మరియమ్మనహళ్లిలోని జీటీటీసీ కళాశాల పనులకు రూ.19.65 కోట్లు, వివిధ శాఖల అభివృద్ధికి మొత్తం రూ.1,710 కోట్లు కేటాయించారు. గనుల ప్రభావిత ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల అనుసంధానం, పాఠశాల భవనాలు వంటి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారన్నారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం జరగకుండా, పారదర్శకంగా చేపడతారని ఆయన అన్నారు. మైనింగ్ వల్ల జిల్లాలో సహజ వనరులకు జరిగిన నష్టాన్ని పూడ్చడం, స్థానికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. గనుల ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత కల్పిస్తారన్నారు. జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ అనుపమ పాల్గొన్నారు. జిల్లాకు రూ.4,107 కోట్ల గ్రాంట్ లభ్యం కేఈఎంఆర్సీ ఎండీ సంజయ్ బిజ్జూరా -
గవర్నర్ను మార్చాలని కరవే ధర్నా
కోలారు: రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ను మార్చి కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్ను నియమించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు బుధవారం నగరంలోని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. కరవే జిల్లా అధ్యక్షుడు మేడిహాళ రాఘవేంద్ర మాట్లాడుతూ గవర్నర్ గెహ్లాట్ హిందీ సామ్రాజ్యవాదుల పరంగా మాట్లాడి కర్ణాటక వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తున్నారన్నారు. అందువల్ల కేంద్రం గవర్నర్ గెహ్లాట్ను వెనక్కు పిలిపించుకోవాలని డిమాండ్ చేశారు. పదో తరగతి పరీక్షలో తృతీయ భాష హిందీకి గ్రేడింగ్ వ్యవస్థ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని గవర్నర్ సూచించడం ఆయన కన్నడ వ్యతిరేక ధోరణిని సూచిస్తోందన్నారు. గవర్నర్ చర్య రాష్ట్రంలో కన్నడిగులపై శాశ్వతంగా హిందీని రుద్దేవిధంగా ఉందని అన్నారు. కన్నడ వ్యతిరేకి గవర్నర్ తమకు వద్దని, ఆయనను కేంద్రం వెనక్కు పిలిపించి కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ప్రధాన కార్యదర్శి వీ.మునిరాజు, మహిళా అధ్యక్షురాలు లతాబాయి మాడిక్, తాలూకా అధ్యక్షుడు శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా గురు మహంతేశ్వర రథోత్సవం
రాయచూరు రూరల్: తాలూకాలోని బిచ్చాలిలో వెలసిన గురు మహంతేశ్వర రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. పీఠాధిపతి వీర తపస్వి వీరభద్ర శివాచార్య వేలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. మఠంలో శాంతమల్ల శివాచార్యులు ప్రత్యేక పూజలు నెరవేర్చారు. రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జునగౌడ పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుపై ఆందోళన హుబ్లీ: గత 8–10 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న జిల్లాలోని నవలగుంద తాలూకా ప్రభుత్వ ఆస్పత్రి డీ గ్రూప్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఉన్నఫళంగా పని నుంచి తొలగించడంపై సదరు ఆస్పత్రి ఉద్యోగులు అక్కడి తహసీల్దార్ కార్యాలయం, ఆస్పత్రి ఎదుట నిరవధిక సమ్మె ప్రారంభించారు. సంబంధిత ఏజెన్సీ ద్వారా విధుల్లో ఉన్న ఉద్యోగులను ఆస్పత్రి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ రూపా చినగి ఎలాంటి ముందస్తు సూచన ఇవ్వకుండా విధుల నుంచి తొలగించారని ఆందోళనకారులు ఆరోపించారు. గత 5 నెలల నుంచి జీతాలు కూడా చెల్లించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు హరీష్, రేణవ్వ, లక్ష్మీ తదితరులు పాల్గొని ఎమ్మెల్యే కోనరెడ్డికి వినతిపత్రాలను సమర్పించారు. వేధింపుల కేసులో జిమ్ ట్రైనర్ అరెస్ట్ హుబ్లీ: నగరంలో జిమ్ సెంటర్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ధార్వాడలో షబ్బీర్ అనే ఓ జిమ్ ట్రైనర్ మహిళలతో అసభ్యంగా నడుచుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. ధార్వాడ మరాఠ కాలనీ జిమ్లో హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతూ వ్యాయామం పేరుతో బ్యాడ్టచ్ చేసేవాడని, అంతేగాక మహిళల అవయవాలను చిత్రలేఖనంతో అసభ్యంగా చిత్రీకరించి కామెంట్ చేసేవాడని ఆరోపిస్తూ సదరు జిమ్ సెంటర్కు హిందూ పర సంఘాల కార్యకర్తలు, పలువురు మహిళలు తాళం వేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో విజయలక్ష్మి అనే బాధితురాలు కూడా షబ్బీర్పై ధార్వాడ ఉపనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని షబ్బీర్ను అరెస్ట్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలు అసంబద్ధంరాయచూరు రూరల్: ఆర్ఎస్ఎస్పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని బీజేపీ న్యాయ సలహా ప్రకోష్ట పేర్కొంది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు భీమనగౌడ మాట్లాడారు. అసోం ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్ను విష సర్పంతో పోల్చడాన్ని ఖండించారు. మైనార్టీలు నమాజ్ చేసేటప్పుడు ఆర్ఎస్ఎస్ కనబడితే చంపాలని పేర్కొనడాన్ని తప్పుబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై లేనిపోని ఆరోపణలు చేసిన మల్లికార్జున ఖర్గేపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ అరుణాంగ్శుగిరికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులకు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరంరాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కన్నడ సాహిత్య పరిషత్ కార్యదర్శి దండెప్ప బిరాదార్ పేర్కొన్నారు. బుధవారం రాయచూరు తాలూకా ఉడుంగల్ ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్య దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు పాఠ్యాంశాలకు తోడు పాఠ్యేతర విషయాలపై కూడా దృష్టి సారించాలన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యమని అన్నారు. సమావేశంలో వీరేష్, శివలీల, వీణ, సరస్వతి, సావిత్రి, నఫీసా అంజుంలున్నారు. వృద్ధులకు ఔషధ సాయం హుబ్లీ: నవనగర్లోని వివేకానంద వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అవ్వతాతలకు విక్కీ బాయి ఫౌండేషన్ చేయూతను ఇచ్చింది. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న సుమారు 25 మంది అవ్వతాతలకు నెలకు సరిపడా బీపీ, షుగర్, మూత్రవ్యాధులు, ఆర్థోపెడిక్, గుండె తదితర జబ్బులకు ఔషధాలను విక్రమ్ బాయి ఆశ్రమ సీనియర్ ఉద్యోగి, సూపరింటెండెంట్ రుద్రయ్య మడివాళ చరంతిమఠకు అందజేశారు. విక్రమ్ బాయి మాట్లాడుతూ ప్రతి నెల ఔషధాలను అందించేందుకు కృషి చేస్తానన్నారు. -
గోశాల దుస్థితిపై సమావేశంలో చర్చ
రాయచూరు రూరల్: వేసవిలో మూడు నెలల పాటు గోశాలలో పశువులకు తాగునీరు, పశుగ్రాసం వంటివి సమకూర్చడానికి రాయచూరు తాలూకా జంబలదిన్నిలో 2020–24లో నిర్మాణాలు చేపట్టిన గోశాల నిరుపయోగంగా ఉండటంపై నిర్మాణం ఘనం.. లబ్ధి శూన్యం అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో మంగళవారం వార్త ప్రచురితమైన సంగతి విదితమే. ఈ విషయంపై బుధవారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసన సభ్యులు బసనగౌడ దద్దల్, రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ చర్చకు లేవనెత్తారు. పశు సంవర్ధక శాఖ అధికారి పోంసింగ్ మాట్లాడుతూ గోశాలకు రక్షణ గోడ నిర్మాణానికి రూ.70 లక్షల నిధులు అవసరమవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు బదులిచ్చారు. -
వేసవిలో తాగునీటి ఎద్దడి నివారించండి
రాయచూరు రూరల్: వేసవిలో మూడు నెలల పాటు జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర నీటి సౌకర్యంపై ఆధారపడిన గ్రామాలకు, కృష్ణా నదీ తీర ప్రాంత పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరాలో జాప్యం నెలకొనకుండా చూడాలని సూచిస్తూ నీటి సరఫరా చేపట్టాలని, విద్యుత్ కోత, మోటార్లు చెడిపోవడం, ఇతరత్ర కారణాలు చెప్పకుండా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలను నింపాలని పీడీఓలకు ఆదేశాలు జారీ చేయాలని టీపీ అధికారులకు సూచనలు జారీ చేశారు. జల ధార, జలజీవన్ మిషన్ పథకం పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసనగౌడ దద్దల్, హంపయ్య నాయక్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, అదనపు జిల్లాధికారి శివానంద, జెడ్పీ అధికారులు శరణ బసవ, రోణలున్నారు. దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధీనంలోని దివ్యాంగుల పునర్వసతి కేంద్ర భవన నిర్మాణానికి భూమిపూజ చేసి ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు వచ్చి వారి పనులు ముగించుకోడానికి వీలు కల్పించినట్లు అవుతుందన్నారు. సమావేశంలో శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసనగౌడ దద్దల్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగరసభ కమిషనర్ జుబీన్ మహాపాత్రో, అదనపు జిల్లాధికారి శివానంద, జెడ్పీ అధికారులు శరణ బసవ, రోణలున్నారు. -
రాయర సన్నిధిలో మంత్రి పాటిల్
రాయచూరు రూరల్: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో బుధవారం రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ మూల విరాట్కు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి పాటిల్ను ఽశేష వస్త్రాలతో సన్మానించారు. జిల్లాధికారి కార్యాలయంలో రాయచూరు డీఎస్పీ శాంతవీర ముఖ్యమంత్రి పతకం అందుకున్న సందర్భంగా మంత్రి పాటిల్ సన్మానించారు. శాసన సభ్యులు బసనగౌడ దద్దల్, హంపయ్య నాయక్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగర సభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, అదనపు జిల్లాధికారి శివానందలున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ కనబరచాలిరాయచూరు రూరల్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జరుగుతున్న లవ్ జిహాద్ల వల్ల ఘర్షణలు చెలరేగుతున్న సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ కనబరచి నిఘా ఉంచాలని ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రేమ పెళ్లి పేరుతో యువత దారి తప్పుతున్నారని, ఈ విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించకుండా దృఢ నిర్ణయం తీసుకోవాలన్నారు. తాగునీటి కోసం రాస్తారోకోరాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా స్పందించక పోవడాన్ని నగరవాసులు తప్పుబడుతూ రాస్తారోకో చేపట్టిన ఉదంతం విజయపురలో నెలకొంది. 15 రోజుల క్రితం వదిలిన తాగునీటిని నేటికీ వదలక పోవడంతో 12వ వార్డులో అధికారులను దూషిస్తూ ఆందోళన చేపట్టారు. ఎన్నికల నిబంధనలను రాజకీయ నాయకులు ఉల్లంఘించరాదని, అధికారులు తాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహించడాన్ని ఖండిస్తూ రాస్తారోకో చేశారు. కనీస వేతనాలు చెల్లించండి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని ఏఐసీసీటీయూ డిమాండ్ చేసింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద సంఘం అధ్యక్షుడు అజీజ్ జాగీర్దార్ మాట్లాడారు. కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారిపై చేస్తున్న దౌర్జన్యాలు నశించాలన్నారు. నేడు అన్ని విధాలైన వస్తువుల ధరలు మార్కెట్లో అధికం కావడంతో వేతనాలను పెంచాలన్నారు. అసంఘటిత వలయాల్లో విధులు నిర్వహించే కార్మికులకు నెలకు రూ.37 వేల నుంచి రూ.42 వేల వరకు వేతనాలు చెల్లించేలా సర్కార్ చెల్లించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. భూముల మంజూరును రద్దు చేయండి రాయచూరు రూరల్: రాజధాని బెంగళూరులో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సర్కారీ భూములను రద్దు చేయాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రుద్రయ్య మాట్లాడారు. బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లి పరిధిలోని అరకేననళ్లి, మల్లేన హళ్లి ప్రాంతాల్లో సర్వే నంబర్–37లో 835 ఎకరాల భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని, వాటి విలువ నేడు సుమారు రూ.1500 కోట్లు అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం భూమిలేని పేదలను గుర్తించి వారికి భూములను పంపిణీ చేయాలన్నారు. ఈ భూములు ఎంఎస్ రామయ్య కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని, దానిని రద్దు చేసి ప్రభుత్వం స్వాధీన పరుచుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
వరి బస్తాల లోడ్ ట్రాక్టర్ పల్టీ
హొసపేటె: గంగావతి తాలూకాలోని శ్రీరామ నగర్ సమీపంలో ఉన్న శివరామకృష్ణ పెట్రోల్ బంక్ వద్ద బుధవారం వరి బస్తాల ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. సుమారు 15 టన్నుల వరి బస్తాల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. కంప్లి తాలూకా నుంచి కారటగి రైస్ మిల్లుకు ఒక ట్రాక్టర్లో 15 టన్నుల వరి బస్తాలను తరలిస్తుండగా, శ్రీరామనగర్ సమీపంలోని గంగావతి–రాయచూరు జిల్లా రహదారిపై ఉన్న శివరామకృష్ణ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ట్రాక్టర్ ట్రాలీకి ఉన్న అనుసంధాన లింక్ అకస్మాత్తుగా తెగిపోయింది. దీంతో ట్రాలీ ఒక్కసారిగా బోల్తా పడింది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వరి బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ సమయంలో రహదారిపై ఎటువంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగి రెండు గంటలు గడిచినా కూడా సమీపంలోని టోల్ ప్లాజా సిబ్బంది గాని, వైద్య సహాయ వాహనం గానీ సంఘటన స్థలానికి చేరుకోలేదు. ట్రాక్టర్ డ్రైవర్ విశ్వనాథ్ (32) ముఖం, చేతులు, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. గ్రామీణ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్కు తీవ్ర గాయాలు 2 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ -
వీధి కుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలోని ఒకటో వార్డ్ బస్టాండ్ సమీపంలో మూడేళ్ల బాలికతో సహా ఐదుగురిపై మంగళవారం వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కుక్క వీధిలో కనిపించిన వారిని కరవడంతో ప్రజలు భయపడ్డారు. గాయపడిన వారికి నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీధి కుక్కల బెడదపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధిలో సంచరిస్తున్న కుక్కలకు వెంటనే సంతాన హరణ శస్త్రచికిత్స చేసి, పునరావాసం కోసం వేరే చోటికి తరలించాలని, ఈ విషయంలో తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. బ్యారేజీలోకి చేప పిల్లల విడుదలరాయచూరు రూరల్ : చేపలను పెంచి వాటి సంరక్షణకు మత్స్యకారులు ముందుకు రావాలని బెళగావి మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం బెళగావి జిల్లాలో భీమా నదిపై నిర్మించిన హింగణి బ్యారేజీలో చేప పిల్లలను వదిలిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయపుర జిల్లా చడచణ తాలూకా చణగావ్లో కూడా చేప పిల్లలను వదిలామన్నారు. ఈసందర్భంగా అధికారులు బాంగి సురగిహళ్లి, గంగణ్ణ పూజారిలున్నారు. హోంగార్డ్స్ కమాండెంట్గా దీపారాయచూరు రూరల్ : రాయచూరు హోంగార్డ్స్ కమాండెంట్గా దీపా నియమితులయ్యారు. మంగళవారం హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయంలో ఆమె అధికార బాధ్యతలు చేపట్టారు. గత ఆరు నెలల నుంచి ఖాళీగా ఉన్న ఈ పోస్టులో దీపాను కమాండెంట్గా ప్రభుత్వం నియమించింది. జిల్లాలో అన్ని రకాల కార్యక్రమాలకు హోంగార్డులను రక్షణ కవచంగా నిలుపుతామన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ హరీష్ ఆమెను అభినందించారు. అకాడమి సభ్యుడిగా నియామకం రాయచూరు రూరల్: రాయచూరు మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం అకాడమి సభ్యుడిగా డాక్టర్ జేఎల్ ఈరణ్ణను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో సోమవారం రాత్రి హరిజనవాడలో జనసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సమాజం సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. వైభవంగా శయనోత్సవ వేడుకలు కోలారు: తాలూకాలోని యల్దూరు గ్రామంలో ఉన్న కోదండ రామస్వామి బ్రహ్మ రథోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శయనోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. దేవాలయ ప్రధాన అర్చకుడు వై.ఆర్.రామకృష్ణమాచార్, వై.ఆర్.శేషాద్రి, తిరుమల తిరుపతి దేవాలయం అర్చకులు వై.ఆర్.రామచంద్రాచార్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అంతకుముందు శయనోత్సవం సందర్భంగా స్వామిని పూలమాలలతో అలంకరించారు. అనంతరం ఉయ్యాలలో కోదండ రాముడిని కొలువుదీర్చి శయనోత్సవం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శంచుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాగరత్నమ్మ, మలగానహళ్లి రెడ్డెప్ప బృందంతో హరికథా కాలక్షేపాన్ని ఏర్పాటు చేశారు. కేబుల్ చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్ కేజీఎఫ్: బేతమంగల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బోరువెల్ కేబుల్ చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.80 వేల విలువ చేసే 310 మీటర్ల కేబుల్, చోరీకి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్చి 30న శ్రీనివాసపుర గ్రామానికి చెందిన నారాయణప్ప తన పొలంలో 410 మీటర్ల కేబుల్ చోరీ జరిగినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. బేడమాకనహళ్లి గ్రామానికి చెందిన చలపతి, బాబును అరెస్టు చేశారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. -
బెంగళూరులో రూ.27 కోట్ల డ్రగ్స్ సీజ్
బనశంకరి: బెంగళూరు నగరంలో చాపకింద నీరులా డ్రగ్స్ సామాజ్యం సాగుతోంది. ఏ ఠాణా పరిధిలో చూసినా ఇబ్బడిముబ్బడిగా మత్తు పదార్థాల విక్రయం, వాడకం జరుగుతోందని తేలింది. సిటీలో వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న విదేశీ పౌరునితో 8 మందిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.27.42 కోట్ల విలువచేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్సింగ్ తెలిపారు. హెబ్బగోడిలో నైజీరియాకు చెందిన ఇమాన్యుయేల్ అనే డ్రగ్స్పెడ్లర్ను అరెస్ట్ చేశారు. ఎక్కడెక్కడ ఎవరు? యలహంకలో కేరళ కు చెందిన మహమ్మద్ నిషాద్, అదేశ్ను, మైకో లేఔట్లో అసోంకు చెందిన బొబ్బి నాయుడును, బాగలూరులో యలహంకవాసి మహమ్మద్ నాసిర్ను, పరప్పన అగ్రహారలో ఓ గంజాయి విక్రేతను అరెస్టు చేసినట్లు కమిషనర్ తెలిపారు. రూ.2.85 లక్షల నగదు, రూ.27.42 కోట్ల విలువచేసే 12 కేజీల ఎండీఎంఏ, 275 గ్రాముల కొకై న్, 34 కేజీల గంజాయి, 40 గ్రాముల బంగారం, 2 బైక్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బయటి రాష్ట్రాల నుంచి డ్రగ్స్ను తెప్పించి ఇక్కడ ఐటీ బీటీ ఉద్యోగులకు, విద్యార్థులకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని చెప్పారు. మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న దుండగుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. 8 మంది విక్రేతల అరెస్టు -
మహిళకు 1.8 కేజీల బంగారం టోపీ
యశవంతపుర: బిల్డర్ భార్యను పరిచయం చేసుకొని, ఆమె నుంచి 1.8 కేజీల బంగారు నగలను స్వాహా చేసిన వ్యక్తి ఉదంతమిది. సోషల్ మీడియాలో ముక్కు మొహం తెలియనివారితో చాటింగ్ చేస్తూ అన్ని విధాలా మోసపోతున్నవారికి నిలువెత్తు నిదర్శనంగా ఆమె మారింది. వివరాలు.. బెంగళూరు వైట్ సిటీ లేఔట్ శీగెహళ్లిలో ఓ బిల్డర్ నివాసం ఉంటున్నాడు. అతని భార్య ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ ఏపీలోని చెన్నూరుకు చెందిన మహేశ్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఇలా ఇద్దరూ దగ్గరయ్యారు. బీటెక్ చదివిన నిందితుడు పెళ్లయి భార్యను వదిలేశాడు. బెట్టింగ్ అలవాటు ఉన్న మహేశ్.. మాయమాటలు చెప్పి ఆమెను డబ్బులు అడిగాడు. నా వద్ద డబ్బులు లేవు. బంగారం ఉందని చెప్పి అతడి చేతికిచ్చింది. మహేశ్ తరచూ బెంగళూరుకు వచ్చి ఆమె నుంచి బంగారు నగలు తీసుకెళ్లేవాడు, అలా 1.8 కేజీల బంగారాన్ని ఆమె సమర్పించుకుంది. భర్త అడగడంతో.. మోసగాడు ఆ బంగారాన్ని అమ్మి బెట్టింగ్ ఆడి జల్సాలు చేశాడు. ఇంట్లో బంగారు లేదని భర్త గమనించి భార్యను అడిగాడు. దీంతో ఆమె నగలను తిరిగి ఇవ్వాలని మహేశ్ను కోరింది. అయితే అతడు బంగారం ఇచ్చేది లేదు, గట్టిగా అడిగితే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. బాధిత మహిళ కేఆర్ పుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలించి మహేశ్తో పాటు మరో నిందితున్ని అరెస్ట్ చేశారు. 571 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో పరిచయమై సర్వం దోపిడీ బెంగళూరులో సంఘటన -
గవర్నర్ను తిప్పిపంపాలి
తుమకూరు: కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు, నాయకులు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాష్ట్రంలో ద్విభాషా విద్యా విధానం అమలును అడ్డుకునేలా వ్యవహరించారని ధ్వజమెత్తారు. గవర్నర్ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పిలవాలని మంగళవారం జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. కన్నడ విరోధి గవర్నర్ను వాపసు పంపాలని నినాదాలు చేశారు. జిల్లాధికారిణి శుభ కళ్యాణ్కు వినతిపత్రం అందజేశారు. పలు జిల్లాల్లో లోకాయుక్త పంజా మైసూరు: లోకాయుక్త అధికారులు మైసూరులోని ప్రజా పనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏఈ రేవన్న చాంబర్లో సోదాలు జరిపారు. డీఎస్పీ వెంకటేష్ ఆధ్వర్యంలో తనిఖీలు సాగాయి. అలాగే చిత్రదుర్గలో నిర్మితి కేంద్రం గణాంక అధికారిణి, బళ్లారిలో మత్స్యశాఖ అధికారి ఇల్లు, ఆఫీసులో దాడులు జరిగాయి. అక్రమాస్తులు, లంచాల ఆరోపణలే కారణమని తెలిసింది. పెద్ద మొత్తంలో బంగారు నగలు, డబ్బు, స్థిరాస్తుల సమాచారం లభ్యమైనట్లు తెలిసింది. బీసీ సంక్షేమ అధికారిణిపై లోకాయుక్త దాడులు శివమొగ్గ: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి కేఆర్ శోభ ఇంటితో సహా పలుచోట్ల లోకాయుక్త అధికారులు ఆకస్మిక సోదాలు ప్రారంభించారు. శివమొగ్గ, శికారిపుర, సాగర్తో సహా మొత్తం ఐదుచోట్ల దాడులు చేపట్టారు. ఆమె వ్యక్తిగత సహాయకుని ఇంటికి కూడా వెళ్లారు. దావణగెరె లోకాయుక్త ఎస్పీ నాయకత్వంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టారని, లంచాలు తీసుకోనిదే ఏ పనీ చేయడం లేదని శోభపై ఫిర్యాదులు వెళ్లడంతో లోకాయుక్త కార్యాచరణకు నాంది పలికినట్లు సమాచారం. 110 మొబైళ్ల రికవరీ యశవంతపుర: బెంగళూరు ఉత్తర విభాగం పోలీసులు దొంగతనాలకు గురైన మొబైల్ ఫోన్లను పెద్దసంఖ్యలో ఛేదించారు. రూ.22 లక్షల విలువగల 110 మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు ఉత్తర విభాగం పరిధిలో చోరీకి గురైనవే. బాధితులు ఫోన్ పోయిన వెంటనే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేశారు. ఆ వివరాల ఆధారంగా గాలించి ఫోన్లను రికవరీ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇండక్షన్ స్టవ్లకు గిరాకీ దొడ్డబళ్లాపురం: ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల మనదేశంలో వంట గ్యాస్కు కటకట ఏర్పడింది. ఇక బెంగళూరులోనూ అన్ని వర్గాలూ అవస్థలు పడుతున్నాయి. గ్యాస్ స్టవ్లకు బదులుగా ఇండక్షన్ స్టవ్ల వాడకం పెరిగింది. మార్కెట్లో ఈ రకం స్టవ్లు అన్నీ అమ్ముడుపోవడంతో పాటు అడ్వాన్స్ బుకింగ్లు జరిగాయి. దుకాణదారులు స్టవ్ల కోసం ఫ్యాక్టరీలపై ఒత్తిడి తెస్తున్నారు. బెంగళూరు పీణ్యలోని కర్మాగారాల్లో వీటి ఉత్పత్తి కోసం కార్మికులు పగలు, రాత్రి పని చేస్తున్నారు. నదిలోకి దూకి నర్సు ఆత్మహత్యయశవంతపుర: ఓ నర్సు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్పుర తాలూకా ముడుబ గ్రామం వద్ద జరిగింది. మృతురాలు రన్యా బేసిల్ (30)గా గుర్తించారు. ఆమె ఎన్ఆర్ పుర తాలూకా ముత్తినకొప్పకు చెందినవారు కాగా, శివమొగ్గలోని కార్పొరేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. సోమవారం ఆమె డ్యూటీ చేసి ఇంటికి వచ్చింది. తరువాత నది వద్దకు వెళ్లి వంతెన మీద నుంచి దూకడంతో ప్రాణాలు పోయాయి. 12 ఏళ్ల క్రితం వివాహమైన రన్యకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త కాఫీ తోట సాగు చేస్తున్నాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు. -
నా ఓపికకు కాలమే సమాధానం చెబుతుంది: డీసీఎం శివ
శివాజీనగర: ముఖ్యమంత్రి పదవిలో సిద్దరామయ్యే కొనసాగుతారు అని ఆయన సన్నిహిత మంత్రులు పరమేశ్వర్, మహ్మద్ జమీర్ ఖాన్ మరోసారి ప్రకటించడం అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో చర్చనీయాంశమైంది. పదే పదే సిద్దరామయ్యకు మద్దతుగా, డీసీఎం డీకే శివకుమార్ను చిన్నబుచ్చేలా కొందరు మంత్రులు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. అయితే గృహ నిర్మాణ మంత్రి జమీర్ మరో అడుగు ముందుకేసి 2028 అసెంబ్లీ ఎన్నికల తరువాత కూడా 3వ సారి సిద్దరామయ్య ముఖ్యమంత్రి అవుతారని చెప్పడంతో డీకే వర్గంలో ఆగ్రహాన్ని నింపింది. మంత్రి జమీర్ తనకు అప్పగించిన బాధ్యతలు కాకుండా మిగతా విషయాలలో తలదూరుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పదే పదే సీఎం సీటు వివాదాన్ని లేవనెత్తడం ద్వారా హైకమాండ్కు ఇబ్బంది కలిగిస్తున్నారు, ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు, నేతలు ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఉప ఎన్నికలు ముగియగానే 2 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికలు ముగిసిన తరువాత ఢిల్లీకి వెళ్తారని తెలిసింది. వ్యతిరేకులను కట్టడి చేయాలని ఫిర్యాదు చేయడంతో పాటు డీకే శివకుమార్ కు వెంటనే అధికారం కట్టబెట్టాలని కోరతారని తెలిసింది. మంతి జమీర్ పదే పదే సిద్దరామయ్య తరపున ఏదో ఒకటి మాట్లాడటం డీకే వర్గానికి మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో జమీర్ ఉద్వాసన లక్ష్యంగా పెట్టుకొని ఢిల్లీ యాత్ర చేయాలని డీకే సన్నిహితులు నిశ్చయించారు. సీఎం సిద్దుకు మద్దతుగా కొందరు మంత్రుల వ్యాఖ్యలు 3వ దఫా సిద్దునే సీఎం అన్న మంత్రి జమీర్ ఖాన్ హైకమాండ్కు ఫిర్యాదుకు డీసీఎం డీకే వర్గం నిర్ణయం -
దావణగెరె, బాగల్కోటెలో ప్రచారం సమాప్తం
సాక్షి బళ్లారి: రాష్ట్రంలో దావణగెరె దక్షిణ, బాగల్కోటె అసెంబ్లీ క్షేత్రాల బహిరంగ ప్రచారం మంగళవారం సాయంత్రంతో సమాప్తమైంది. ఉదయం నుంచి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు, వారి మద్దతుదారులు జోరుగా ప్రచారం చేశారు. దావణగెరెలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. ఇక బుధవారం సందడి లేకుండా ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చు. గురువారం పోలింగ్ జరుగుతుంది. నియోజకవర్గాలకు చెందని వారందరూ వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దావణగెరె దక్షిణలో కాంగ్రెస్ నుంచి శామనూరు సమర్థ్, బీజేపీ నుంచి శ్రీనివాస దాస కరియప్ప బరిలో ఉన్నారు. బాగల్కోటెలో కాంగ్రెస్ నుంచి ఉమేష్ మేటి, బీజేపీ అభ్యర్థి చరంతిమఠ తలపడుతున్నారు. మరోవైపు పోలింగ్కు ఆయా జిల్లాల యంత్రాంగాలు ఏర్పాట్లు చేపట్టాయి. సిబ్బంది బుధవారం సాయంత్రం ఈవీఎంలను తీసుకుని పోలింగ్ కేంద్రాలకు బయల్దేరతారు. 9న పోలింగ్కు సన్నాహాలు -
కొబ్బరి క్వింటాలు రూ.32 వేలు
తుమకూరు: జిల్లాలోని కొబ్బరితోటల రైతులకు తీయని వార్త లభించింది. గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి, టెంకాయల కొత్త ధర రూ.32 వేలు దాటడంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. తిపటూరు ఎమ్మెల్యే కె. షడక్షరి, వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు ఎండీ శివానంద్ కపాషి మాట్లాడుతూ ప్రధానంగా సర్దుబాటు టెండర్ను రద్దు చేయడం వల్ల కొబ్బరి మార్కెట్లో మంచి ధరలు లభించడానికి కారణమైందని తెలిపారు. ఇప్పుడు కొబ్బరి ధర క్వింటాల్కు రూ.32,218కి చేరడంతో, రాబోయే రోజుల్లో ఇంకా పెరగవచ్చని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ప్రతికూల వాతావరణం వల్ల కొబ్బరి తోటల్లో దిగుబడి తగ్గిపోయింది. ఒకప్పుడు 10 వేల కాయలు దిగుబడి ఉన్న తోటలో ఇప్పుడు 1,500 నుంచి 2,000 కాయల దిగుబడిని మాత్రమే వస్తోందని రైతులు తెలిపారు. తుమకూరులో రికార్డు ధర -
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు
శివాజీనగర: విమానాశ్రయంలో తనకు అధికారం లేకపోయినా విదేశీ యువతిని బలవంతంగా టాయ్లెట్లోకి తీసుకెళ్లి తనిఖీలంటూ అసభ్యంగా ప్రవర్తించిన బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టు ఉద్యోగి మీద హైకోర్టు కొరడా ఝుళిపించింది. ఆ కేసును రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. బెంగళూరు ఉత్తర తాలూకా రామయ్య లేఔట్కు చెందిన మహమ్మద్ ఆఫాన్ అహమ్మద్ ఈ కేసులో నిందితుడు కాగా, కొన్ని నెలల కిందట జరిగిన ఈ ఘటనలో పోలీసులు అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. దీనిని రద్దు చేయాలని నిందితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఏం చేసినా సహించాలా? విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న.. అతని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అతనిపై గతంలోనూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయని తెలిసి మండిపడ్డారు. దక్షిణ కొరియా మహిళను పురుషుల మరుగుదొడ్డికి తీసుకొని వెళ్లి అసభ్యంగా తాకావు, మరో దేశం మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని సహించాలా?, నీవు ఏమేం చేశావో బాధితురాలు వివరించింది. పురుషుల టాయ్లెట్కు మహిళను ఎందుకు తీసుకెళ్లావు, దానికి సమాధానం చెప్పు అని న్యాయమూర్తి ప్రశ్నల వర్షం కురిపించారు.రోడ్ రేజ్ను మన్నించేది లేదు టెక్కీ పిటిషన్పై హైకోర్టు శివాజీనగర: నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేసినందుకు ఎలాంటి క్షమాపణ ఉండదని హైకోర్టు తెలిపింది. కావాలనే బైకిస్టును ఢీకొని ప్రమాదానికి పాల్పడిన కేసులో టెక్కీకి ఊరటనిచ్చేందుకు నిరాకరించింది. తనపై దాఖలైన హత్యాయత్నం కేసును రద్దు చేయాలని కోరుతూ బెంగళూరులోని కొడిగెహళ్ళికి చెందిన సుకృత్ కేశవ్గౌడ అనే టెక్కీ సమర్పించిన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న విచారించారు. బెంగళూరు ట్రాఫిక్ రద్దీ సహనాన్ని నేర్పుతుంది, అది మీకు ఉండాలని జడ్జి పేర్కొన్నారు. ఆయన ఆఫీసుకు వెళ్తున్నారు, ప్రమాదం చేయాలని ఎలాంటి ఉద్దేశం లేదు, ఎఫ్ఐఆర్లో హత్యాయత్నం అని తప్పుగా నమోదు చేశారు, కాబట్టి కేసును రద్దు చేయాలని పిటిషన్దారు వకీలు విన్నవించారు. అయితే రోడ్ రేజ్కు క్షమాపణ లేదని జడ్జి స్పష్టంచేసి పిటిషన్ను తిరస్కరించారు. ఎయిర్పోర్టు ఉద్యోగిపై హైకోర్టు ఆగ్రహం -
ముంబై, కటక్ డ్రగ్ పెడ్లర్ల అరెస్టు
● హుణసూరు డ్రగ్స్ ఫ్యాక్టరీ కేసు.. మైసూరు: జిల్లాలోని హుణసూరు రత్నపురి సమీపంలోని దాసనపుర తోటలోని ఒక ఇంట్లో డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రంలో కోట్ల రూపాయల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న కేసులో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట పట్టుబడిన నిందితుల ఫోన్లను తనిఖీ చేయగా వీరి జాడ తెలిసింది. ఇద్దరు ముంబైలో, మరొకరు ఒడిశాలోని కటక్లో ఉన్నట్లు గుర్తించి పట్టుకొచ్చారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. రాజా సహాని అనే ముఖ్య నిందితున్ని మైసూరుకు తీసుకువస్తున్నారు. హుణసూరులో 7.35 కేజీల మెఫెడ్రిన్, 41 కిలోల ముడిసరుకులు లభించాయి. ఫోరెన్సిక్ ల్యాబ్కు పరీక్షల కోసం పంపించారు. ఇప్పుడు వచ్చిన నివేదికలో అవి నిజమైన మత్తు పదార్థాలని రుజువైందని పోలీసులు తెలిపారు. బాలునిపై కుక్క దాడి.. యజమానిపై కేసు యశవంతపుర: బాలున్ని వేరేవారికి చెందిన పెంపుడు కుక్క కరిచిన ఘటన బెంగళూరు రాజాజీనగరలో జరిగింది. బాలుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడు (11) బ్రెడ్ తేవాలని సైకిల్పై బయటకు వెళ్లాడు. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేస్తుండగా, ఆ కుక్క బాలున్ని కరిచింది. కుక్క యజమాని పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. బాలునికి ఎలాంటి సాయం చేయకుండా, వైద్యం గురించి మాట్లాడలేదు. బాలుని కుటుంబం సుబ్రమణ్యనగర పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి కుక్క యజమానికి విచారణా నోటీసులిచ్చారు. ప్లైవుడ్ షాపు దగ్ధం, ఆవులు మృతి యశవంతపుర: బెంగళూరు డీజే హళ్లి పోలీసుస్టేషన్ పరిధిలోని శాంపుర రోడ్డులో సోమవారం అర్ధరాత్రి ఓ ప్లైవుడ్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పక్కలో ఉన్న పశువుల షెడ్కు మంటలు వ్యాపించాయి. దీనితో ఆరు ఆవులు సజీవ దహనమయ్యాయి. అనేక పశువులు గాయపడ్డాయి. వ్యాపారి మహమ్మద్ తాళం వేసుకొని వెళ్లగా, కొన్ని గంటల తరువాత మంటలు వ్యాపించాయి. క్షణాల్లో అంగడి కాలిపోయింది. షాపు ముందు నిలిపిన టాటా ఏస్ వాహనంతో పాటు 4 బైకులు దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. గ్యాస్ కోసం అష్టకష్టాలు ● తుమకూరు జిల్లాలో కటకట తుమకూరు: తుమకూరు నగరంతో పాటు జిల్లాలో ఆటోలకు, వాహనాలకు ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ దొరకడం లేదు. కల్పతరునాడులో అనేక ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ స్టేషన్లు మూతపడ్డాయి. మిగిలిన కొన్ని స్టేషన్లలో కూడా ఆటో గ్యాస్ ధర రెట్టింపు అయింది. చాలామంది ఆటో డ్రైవర్లు బాడుగకు తీసుకుని ఆటోలను నడుపుతారు, రెట్టింపు ధరకు గ్యాస్ నింపుకోలేక, ఆటోలు నడపకుండా ఊరికే కూర్చోలేక సందిగ్ధంలో ఉన్నారు. ఆటోచార్జీలను పెంచితే గిరాకీలు దొరకరని వాపోయారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం తొలగిపోయే వరకు గ్యాస్ కొరత కొనసాగుతుందని చాలామంది ఇంధన వ్యాపారులు చెప్పడంతో ఆటోవాలాలు నిరాశలో మునిగిపోయారు. భద్రమ్మ సర్కిల్, బార్లైన్ రోడ్, గుబ్బి గేట్, శిర గేట్, ఎల్లాపుర సహా నగరంలోని ప్రధాన ఆటో గ్యాస్ స్టేషన్లను మూసివేశారు. ఒకటి రెండు బంకులు పనిచేస్తుంటే, గంటలకొద్దీ క్యూలో నిలబడవలసి వస్తోంది. ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలి. లేకపోతే తమ జీవితం దుర్భరమవుతుందని ఆటో డ్రైవర్లు, క్యాబ్ల డ్రైవర్లు చెప్పారు. -
దివ్యాంగులను ఆదరించాలి
మైసూరు: దివ్యాంగులను సమాజంలో ప్రధాన స్రవంతిలోకి తేవాలని పోలీసు పబ్లిక్ పాఠశాల ప్రిన్సిపాల్ దీనా తిమ్మయ్య తెలిపారు. మైసూరు నగరంలోని రాజరాజేశ్వరి నగరలోని నిరీక్ష ప్రత్యేక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా నిరీక్ష ఉత్సవ అనే వేడుకను నిర్వహించారు. దేవుడు అందరికీ అన్ని అవయవాలను సక్రమంగా ఇచ్చాడన్నారు. అయితే కొందరికి లోటు చేయడం వల్ల శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు దీనా తెలిపారు. న్యూనతలను కలిగిన పిల్లలు సమాజంలోకి నిరాదరణకు గురికాకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. -
హంపీ పరిధి నుంచి తొలగించాలని నిరసన
హొసపేటె: అంతరించి పోతున్న జీవజాతులను రక్షించే నెపంతో హంపీ అభివృద్ధి ప్రాధికార సంస్థ సామాన్య ప్రజల ప్రాథమిక, మానవ హక్కులను హరించడాన్ని నిరసిస్తూ ఆనెగుంది రాజవంశస్థుల నాయకత్వంలో 15 గ్రామాల ప్రజలు, రైతులు, మహిళలు సోమవారం కొప్పళలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆనెగుంది ప్రాంతాన్ని హంపీ అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వారు జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆనెగుంది రాజవంశస్తులైన లలితారాణి శ్రీరంగదేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఇటీవల హంపీ అభివృద్ధి ప్రాధికార సంస్థ విధించిన కొన్ని నిబంధనలు, అక్కడి అధికారులు ఆనెగుంది ప్రజల జీవన, మానవ హక్కులను హరించి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు, చిన్న వ్యాపార దుకాణాలకు విద్యుత్ కనెక్షన్లు పొందడాన్ని కఠినతరం చేయడం, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం, గుడిసెలు, ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. హంపీ అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులు, అటవీ శాఖ, పోలీసు అధికారులు ఆనెగుంది ప్రజలను అనుమానంతో చూస్తున్నారని తెలిపారు. అక్రమ నిర్మాణాలు అనే నెపంతో మానవత్వం లేకుండా దుకాణాల ముఖ భాగాలు, ఇళ్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. -
అవినీతి రహిత సేవలు అవసరం
సాక్షి, బళ్లారి: ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, అవినీతి రహితంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని డీజీపీ డాక్టర్ ఎంఏ సలీం పోలీసు అధికారులకు సూచించారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయ సమావేశం మందిరంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు శాఖలో చేరుతున్న జూనియర్ అధికారులు సీనియర్లతో తమ అనుభవాలను పంచుకొని వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. పోలీసు ఉద్యోగం ఎంతో కఠినమైందని, బాధ్యతాయుతంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. సాంకేతికత పాత్ర కీలకం నేటి ఆధునిక కాలంలో నేరాల నివారణలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పోలీసు శాఖలో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పోలీసు సిబ్బంది సరైన శిక్షణ పొందాలని సూచించారు. కేసుల దర్యాప్తులో సాంకేతికతను సమర్థంగా వినియోగించి, చట్టాన్ని, న్యాయాన్ని శాంతి భద్రతలను కాపాడాలని సూచించారు. అనంతరం ఆయన పోలీసు అతిథి గృహాలను పరిశీలించారు. పోలీసు కుటుంబ సభ్యులతో సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. అలాగే నగరంలోని బ్రూస్పేట్ పోలీస్టేషన్ను సందర్శించారు. బళ్లారి రేంజ్ డీఐజీ డాక్టర్ హర్ష, జిల్లా ఎస్పీ సుమన డీ.పన్నేకర్, ఏఎస్పీ నవీన్కుమార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి పోలీసులకు డీజీపీ డాక్టర్ సలీం సూచన -
సీహెచ్ పౌడర్ విక్రేత అరెస్ట్
రాయచూరు రూరల్ : నగర ప్రాంతాల్లో సీహెచ్ పౌడర్ విక్రయించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్పీ అరుణాంగ్శుగిరి వెల్లడించారు. సోమవారం రాత్రి ఎస్పీ తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నగరంలోని గద్వాల రహదారి వీరాంజనేయ దేవస్థానం వద్ద కెంచప్పను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుని వద్ద నుంచి 153 లీటర్ల కల్తీ కల్లును, 203 లీటర్ల సీహెచ్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనపరుచుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో గుండెపోటుతో మహిళ మృతిరాయచూరు రూరల్ : ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సమయంలో గుండెపోటుతో ఓ మహిళ మృతి చెందిన ఘటన బాగల్కోటెలో చోటు చేసుకుంది. మంగళవారం బాగల్కోటె వాజ్పేయి కాలనీకి చెందిన తుప్పద ఫాతిమా(61) కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారానికి వెళ్లిన సమయంలో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలింది. విషాహారం తిని 40 మందికి అస్వస్థతసాక్షి బళ్లారి: బీదర్ జిల్లా భాల్కి తాలూకా జాన్సీ గ్రామంలో కలుషిత ఆహారం తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం బాంతి గ్రామంలోని రాజ్కుమార్ అనే వ్యక్తి సొంత ఇల్లు కడుతున్న నేపథ్యంలో ఇంటి ఫైకప్పు స్లాబ్ వేసే సమయంలో సంతోషంగా అన్నం, సాంబారు, పాయసంతో కూడిన భోజనం ఏర్పాటు చేసి వంద మందికిపైగా ఆహ్వానించి భోజనాలు వడ్డించారు. భోజనం తిన్న కొంత సేపటికి 40 మందికి పైగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో అందరూ భయంతో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. భోజనం కలుషితమైన కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు పేర్కొన్నారు. ఖాళీ ఉద్యోగాల భర్తీకి డిమాండ్బళ్లారిటౌన్: ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కర్ణాటక దళిత సంఘర్షణ సమితి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పత్రికా భవనంలో సమితి రాష్ట్ర కన్వీనర్ ఎం.గురుమూర్తి తదితరులు మాట్లాడుతూ రోస్టర్ పద్ధతిని సరి చేసి కుల వర్గీకరణ తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమూర్తి హెచ్ఎస్ నాగమోహన్ దాస్ కమిషన్ సిఫార్సు మేరకు సంచార జాతులకు ప్రస్తుతం కేటాయించిన 17 శాతంలో ఒక శాతం రిజర్వేషన్ కల్పించేలా కొత్త ఆదేశాలను అము చేయాలని డిమాండ్ చేశారు. 56 శాతం రిజర్వేషన్లు కల్పించినందున ఇతర సముదాయాల్లో సమస్యలు ఉద్భవించిన వాటిపై కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో నేతలు శ్రీధర్, హనుమంతప్ప, గోవర్ధన్ పాల్గొన్నారు. బాలల స్నేహి పోలీస్ స్టేషన్ ప్రారంభం రాయచూరు రూరల్ : నేటి ఆధునిక యుగంలో సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా తల్లిదండ్రులు పిల్లల సంరక్షణకు ముందుండాలని కలబుర్గి ఎస్పీ ఏ.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం కలబుర్గి జిల్లా ఆళంద పోలీస్ స్టేషన్లో సన్మి త్ర సహాయవాణి, బాలల స్నేహి పోలీస్ స్టేషన్, మహిళా సహాయవాణి కేంద్రాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. నేడు మహిళలు, పిల్లలపై దాడులు, దౌర్జన్యాలు అధికమవుతున్న తరుణంలో ఇలాంటి సహాయవాణి కేంద్రాల ద్వారా సహాయం పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. -
ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దు
హొసపేటె: వేసవి ప్రారంభమైనందున ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, పశువులు వేసవి కాలంలో తాగునీటి కొరతను ఎదుర్కోకుండా ఉండేందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా అన్నారు. మంగళవారం నగరంలోని జెడ్పీ కార్యాలయంలో గ్రామీణ తాగునీటి, పారిశుధ్య శాఖ పురోగతి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. జల్జీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. వివిధ సాంకేతిక కారణాల వల్ల పనులు అసంపూర్తిగా ఉంటే వాటిని త్వరితగతిన పూర్తి చేసి, తగినంత నీటిని సరఫరా చేయాలన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయండి పెండింగ్లో ఉన్న పైప్లైన్ ఏర్పాటు, ట్యాంక్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవి ప్రారంభం కారణంగా భూగర్భ జలమట్టం తగిన గ్రామాలను గుర్తించి, ప్రైవేట్ ట్యూబ్వెల్లను అద్దెకు తీసుకుని లేదా ట్యాంకర్ల ద్వారా అటువంటి ప్రదేశాలకు నీటిని సరఫరా చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. మరమ్మతులకు గురైన చేతిపంపులను నిర్లక్ష్యం చేయకూడదని, వాటిని త్వరగా మరమ్మతు చేయాలని ఆయన ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛమైన తాగునీటి యూనిట్లు మంచి స్థితిలో ఉండేలా చూసుకోవాలి. సాంకేతిక పరిస్థితిని తనిఖీ చేసి, సమగ్ర నివేదికను సమర్పించాలి. బోరుబావుల మరమ్మతు చేపట్టండి మరమ్మతులకు గురైన యూనిట్లను వెంటనే మరమ్మతు చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో వర్షాకాలం సమీపిస్తున్నందున అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. అందువల్ల నీటి వనరుల పరిశుభ్రత, పారిశుద్ధ్యం పాటించాలి. గ్రామ స్థాయిలో నీటి నాణ్యతను పరీక్షించడానికి అందించిన ఫీల్డ్ టెస్ట్ కిట్ను ఉపయోగించి, ఎప్పటికప్పుడు నీటి నమూనాలను పరీక్షించి, దాని రికార్డులను గ్రామ పంచాయతీలో నిర్వహించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే లేదా తమ విధులను నిర్లక్ష్యం చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అధికారులకు జెడ్పీ సీఈఓ సూచన -
నగర స్వచ్ఛత కాపాడుకోవాలి
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె నగరంలో స్వచ్ఛతను కాపాడుకోవాలని, నగర ప్రజలు ఈ విషయంపై దృష్టి పెట్టాలని నగరసభ కమిషనర్ ఎర్రగుడి శివకుమార్ తెలిపారు. మంగళవారం నగరంలోని నగరసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సామాన్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే నగరంలో ఇప్పటికే దోమల బెడద విపరీతంగా పెరిగిందన్నారు. అదే విధంగా నగరంలో ప్రముఖ రహదార్లతో పాటు కాలనీల్లో కూడా ప్రజలు ఇష్టానుసారంగా చెత్తను పారవేస్తున్నారన్నారు. దీని వల్ల దుర్వాసనతో పాదచారులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఇకపై నగరవాసులు తమ ఇంటి వద్దకు వస్తున్న మున్సిపాలిటీ వాహనంలో మాత్రమే చెత్తను వేయాలన్నారు. ఇక మీదట రహదార్లలో చెత్తను పారవేస్తే వారిపై నియమానుసారంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు. నగరసభ అధ్యక్షులు రూపేష్కుమార్, ఉపాధ్యక్షులు జీవరత్నం, స్థాయి సమితి అధ్యక్షులు శరవణన్, వివిధ వార్డుల సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
30 మంది డ్రగ్ పెడ్లర్ల బహిష్కరణ
మైసూరు: మైసూరు నగరాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, 30 మంది డ్రగ్ పెడ్లర్లను బహిష్కరించినట్లు మైసూరు నగర పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్ తెలిపారు. మంగళవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సుమారు 30 మంది పెడ్లర్లను నగరం నుంచి బహిష్కరించామన్నారు. అదనంగా ఒక పాత విక్రయదారుడిని ఎన్డీపీఎస్ చట్టం కింద బళ్లారి జైలుకు పంపినట్లు తెలిపారు. మైసూరుకు చెందిన ఇర్ఫాన్ పాషాపై 9 కేసులు ఉండగా.. మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నాడన్నారు. అతడి నుంచి 28 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పోగొట్టుకున్న మీ మొబైల్ ఫోన్ను కనుగొనడంలో ’ఇ–లాస్ట్’ అనే యాప్ సహాయ పడుతుందన్నారు. గత 3 నెలల్లో దొంగిలించబడిన 144 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. 220 మొబైల్ ఫోన్లను గుర్తించి వాటిని 197 మంది సొంతదారులకు తిరిగి అప్పగించామన్నారు. -
జిల్లా విద్యా శాఖలో వింత లీలలు
రాయచూరు రూరల్: జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో వింత లీలలు చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సెకండ్ డివిజన్ గుమాస్తా(ఎస్డీసీ) సవిత పంత్కు వింత అనుభవం ఎదురైంది. కార్యాలయంలో చాలా మంది ఉద్యోగులు, సిబ్బంది కుర్చీల్లో కూర్చొని టేబుళ్లపై పని చేస్తుండగా సవిత పంత్ మాత్రం నేలపైనే కూర్చొని విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో తోటి ఉద్యోగులు మహిళా ఉద్యోగిని అని కూడా చూడకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆమె ఫిర్యాదు చేసింది. గత కొన్నేళ్ల నుంచి అధికారులు తనపై కక్ష గట్టి ఇష్టానుసారంగా విభాగాలను మారుస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో జిల్లా విద్యా శాఖాధికారి బడిగేర్, సూపరింటెండెంట్ జగదీష్లను సంప్రదించగా, వారు కోర్టు పని మీద బెంగళూరు వెళ్లడంతో వారి నుంచి ఎలాంటి సమాధానం లభించలేదు. నేలపై కూర్చొనే ఉద్యోగిని విధులు.! -
నా భార్యను మీ మాజీ ఎమ్మెల్యే తీసుకెళ్లాడు..!
కర్ణాటక: మండ్యలో జేడీఎస్ మాజీ ఎమ్మెల్యే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆమెకు మైసూరులో కోటిన్నర రూపాయల విలువైన అపార్ట్మెంట్ ఫ్లాటును ఇచ్చాడని ప్రసన్న అనే వ్యక్తి కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామికి ఫిర్యాదు చేశాడు. ఆ మాజీ ఎమ్మెల్యే రాత్రి పూట మాత్రమే ఫ్లాటుకు వెళ్తారని, రోజూ గంటల తరబడి భార్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడని ఆరోపించాడు.పలువురు పెద్దలకు ఫిర్యాదు చేసినప్పటికీ తనకు న్యాయం జరగలేదని, పైగా తనపై పరువు నష్టం కేసు పెట్టారని వాపోయాడు. విడాకులు ఇవ్వమని నా భార్యను అడిగాను, కానీ, రూ.30 లక్షలు ఇస్తే విడాకులు ఇస్తానని ఆమె చెప్పింది. నా భార్య వేరొకరితో ఉంటే నేను ఎలా సహిస్తాను అని బాధితుడు ప్రశ్నించాడు. వారి బాగోతాలకు చెందిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నట్లు ఆయన చెప్పాడు. కుమారన్న నాకు న్యాయం చేస్తానని చెప్పాడని తెలిపాడు. ఈ తగవును కుమార ఎలా పరిష్కరిస్తారోనని స్థానికులు కుతూహలం వ్యక్తం చేశారు. -
మహిళను ఇంట్లోంచి ఈడ్చి కొట్టిన జనాలు!
కర్ణాటక: పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ వ్యభిచారం చేస్తోందనే అనుమానంతో స్థానిక జనం ఇంట్లోంచి బయటకు ఈడ్చి దాడి చేసిన సంఘటన బెంగళూరు వర్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. 4వ తేదీన రాత్రి ఈ సంఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్తూరు పీఎస్ పరిధిలో నివసిస్తున్న పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ రాత్రి అపరిచిత యువకునితో ఉందని ఆరోపిస్తూ స్థానికులు కేకలు వేస్తూ ఆమెను ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి కొట్టారు. మహిళ గాయపడగా కొందరు ఆస్పత్రికి తరలించారు. వర్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
బెంగళూరులో ఆటోడ్రైవర్లకు గ్యాస్ కష్టాలు
బనశంకరి: ఐటీ సిటీలో ఇంధన గ్యాస్ కష్టాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గే సూచనలు లేవు. ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధం వల్ల బెంగళూరులో తీవ్ర గ్యాస్ ఎద్దడి నెలకొంది. గత ఐదురోజులుగా కొరత మరింత తీవ్రమైంది. సిలికాన్ సిటీలో 130కి పైగా ఆటో ఎల్పీజీ గ్యాస్స్టేషన్లు మూతపడ్డాయి, నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగరవ్యాప్తంగా వివిధ కంపెనీలకు చెందిన 160 ఆటో ఎల్పీజీ స్టేషన్లకు వారం రోజుల నుంచి సక్రమంగా గ్యాస్ సరఫరా కావడం లేదు. దీంతో ఇప్పుడు 30 స్టేషన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. సోమవారం కూడా గ్యాస్ ట్యాంకర్లు రాకపోవడంతో ఎల్పీజీ సరఫరా నాసిరకంగా మారింది.గంటల కొద్దీ ఎదురుచూసినా..ఆదివారం, సోమవారం నగరంలో అనేక ఎల్పీజీ గ్యాస్స్టేషన్ల వద్ద ఆటోడ్రైవర్లు పడిగాపులు పడటం కనిపించింది. కొన్ని స్టేషన్లు ముందు మూడుగంటలకు పైగా వేచిచూసినప్పటికీ గ్యాస్ లభించక మరో గ్యాస్ స్టేషన్కు పరుగులు తీశారు. రాజాజీనగర ఎల్పీజీ స్టేషన్ వద్ద మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే అందించి నోస్టాక్ బోర్డు పెట్టారు. ఎల్పీజీ ధర గణనీయంగా పెరిగింది. ఒక లీటరు రూ.65 ఉండగా ఇప్పుడు రూ.135 కు చేరుకుంది.ఇల్లు గడవడం లేదని ఆవేదనరోజులో ఐదారు గంటలు గ్యాస్ కోసమే అయిపోతోంది, మాకు గ్యారంటీ పథకాలు వద్దని, గ్యాస్ ఇవ్వాలని, గ్యాస్ లేకపోతే ఉపాధి ఉండదని ఆటోవాటాలు చెప్పారు. ఇల్లు గడవదు, పిల్లలకు స్కూలు ఫీజులు కట్టలేము అని వాపోయారు. అనేకమంది ఆటోడ్రైవర్లు ఆటోలు నడవక, ఇంటి అద్దెలు చెల్లించలేక ఇళ్లు ఖాళీచేసి సొంత ఊర్లకు వెళుతున్నారు. సమస్యను పరిష్కరించకపోతే నగర రవాణా వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముంది. ఆర్థిక సాయం చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని డ్రైవర్లు కోరుతున్నారు. మంగళవారం సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, రవాణాశాఖమంత్రి రామలింగారెడ్డి తదితరులను కలుస్తామని డ్రైవర్ల సంఘాల నాయకులు తెలిపారు. -
మహిళపై మూక దాడి
దొడ్డబళ్లాపురం: పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ వ్యభిచారం చేస్తోందనే అనుమానంతో స్థానిక జనం ఇంట్లోంచి బయటకు ఈడ్చి దాడి చేసిన సంఘటన బెంగళూరు వర్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. 4వ తేదీన రాత్రి ఈ సంఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్తూరు పీఎస్ పరిధిలో నివసిస్తున్న పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ రాత్రి అపరిచిత యువకునితో ఉందని ఆరోపిస్తూ స్థానికులు కేకలు వేస్తూ ఆమెను ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి కొట్టారు. మహిళ గాయపడగా కొందరు ఆస్పత్రికి తరలించారు. వర్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గవర్నర్ దిగిపోవాలి● కన్నడ సంఘాల ధర్నా దొడ్డబళ్లాపురం: హిందీ భాషకు మద్దతుగా, కన్నడ భాషకు వ్యతిరేకంగా గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ వ్యవహరిస్తున్నారని కన్నడ సంఘాల నాయకులు ఆరోపించారు. సోమవారంనాడు కర్ణాటక రక్షణ వేదిక ఆధ్వర్యంలో బెంగళూరు ఫ్రీడం పార్క్లో ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో హిందీ భాషను బలవంతంగా అమలు చేయాలనేది గవర్నర్ ఉద్దేశమన్నారు. గవర్నర్ అధికార పరిధిని మీరుతున్నారని దుయ్యబట్టారు. గవర్నర్కు రాష్ట్రంలో అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. తక్షణం రాజీనామా చేసి రాష్ట్రాన్ని వదిలి వెళ్లాలని డిమాండు చేశారు. కాశీ విశ్వేశ్వర రథోత్సవం బొమ్మనహళ్లి: ఆనేకల్ తాలూకాలోని నెరలూరులో చరిత్ర ప్రసిద్ధ శ్రీకాశీ విశ్వనాథేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి మూల విరాట్టుకు విశేష పూజలు సాగించారు. ఆపై ఉత్సవ విగ్రహానికి పూజలు, యాగాలు నిర్వహించి తేరులో ప్రతిష్టించారు. కళాకారుల డప్పు వాయిద్యాల మధ్య తేరును లాగారు. భక్తులు రథంపై అరటి పండ్లను విసిరి జై కాశీ విశ్వేశ్వరా అని గట్టిగా స్మరించారు. 19 నుంచి మైసూరులో సైనిక నియామకాలు మైసూరు: మైసూరు నజరాబాద్లోని చాముండి విహార్ స్టేడియంలో ఏప్రిల్ 19 నుంచి 27 వరకు సైనికుల నియామకాల కోసం అగ్నివీర్ ర్యాలీ జరగనుంది. 6 వేల మందికిపైగా అభ్యర్థులు పాల్గొంటారని బెంగళూరుకు చెందిన సైనిక అధికారి కల్నల్ వివేక్ జాందార్ తెలిపారు. సోమవారం ఆయన స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ర్యాలీలో 6043 మంది యువకులు, 192 మంది యువతులు పాల్గొంటారన్నారు. ప్రతిరోజూ 800 మంది అభ్యర్థులకు శారీరక, ఇతర పరీక్షలు నిర్వహిస్తారు. శారీరక పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 27న మహిళా అభ్యర్థుల ర్యాలీ జరుగుతుందని ఆయన తెలిపారు. భారీ దంతాల గజరాజు యశవంతపుర: చిక్కమగళూరు జిల్లాలో అతి పెద్ద దంతాలు కలిగిన ఓ గజరాజు ప్రత్యక్షమైంది. దాని దంతాల రాజసం చూసి పర్యాటకులతో పాటు స్థానిక జనం కూడా సంభ్రమానికి గురయ్యారు. ముత్తోడి అభయ అరణ్యంలో వందల సంఖ్యలో ఏనుగులున్నాయి. ఒక్కో ఏనుగు భారీ సైజులో ఉంటుంది. పెద్ద దంతాలున్న ఓ ఏనుగు కొన్నిరోజులుగా బ్రిటిష్కాలంనాటి అరణ్య విశ్రాంతి గృహం వద్ద కనపడుతోంది. పనస చెట్టు కాయలను తినడానికి ఇది వస్తోందని గుర్తించారు. ఈ ఏనుగుకు 40 ఏళ్లు ఉండవచ్చని స్థానిక పర్యావరణవాది వీరేశ్ తెలిపారు. దాని దంతాల పొడవు మామూలు ఏనుగుల కంటే చాలా ఎక్కువని చెప్పారు. గతంలో బండీపుర అడవుల్లో భోగేశ్వర అనే కరిరాజు అతి పొడవైన దంతాలతో ఆసియాలోనే రికార్డులకెక్కింది. కొన్నేళ్ల కిందట అది కన్నుమూసింది. -
తడి చెత్తే వరదాయిని!
యడియూరు బయోగ్యాస్ ప్లాంటులో డ్రమ్ముల్లో తడిచెత్త యడియూరు ప్లాంటులో గ్యాస్ ట్యాంకు బనశంకరి: బెంగళూరులో నిత్యం ఇళ్లు, హోటళ్ల నుంచి వెయ్యి టన్నులకుపైగా తడి చెత్త సేకరణ అవుతుంది. మిగిలిపోయిన ఆహారం, కూరగాయలు, పండ్లు వంటివి ఇందులో ఉంటాయి. ఈ చెత్తతో మీథేన్ గ్యాస్ను ఉత్పత్తి చేయవచ్చు. బెంగళూరులోని యడియూరు వార్డులో నగర పాలికె ఆధ్వర్యంలో ఇటువంటి గ్యాస్ ఉత్పాదన క్షేత్రం పనిచేస్తోంది. రోజూ 5 టన్నుల తడి చెత్తతో 3,000 కిలోవాట్ల విద్యుచ్చక్తి, 4,500 లీటర్ల మీథేన్ గ్యాస్ ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు తెలిపారు. 198 వార్డుల్లో ఏర్పాటుకు ప్లాన్ ఇదే తరహాలో గత బీబీంపీ పరిధిలో 198 వార్డుల్లో 2,400 చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున స్థలాలను గుర్తించి అందులో బయోగ్యాస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఆయా వార్డుల్లో ఉత్పత్తిఅయ్యే తడిచెత్తను మీథేన్ గ్యాస్గా మార్చాలని ప్రతిపాదనలు ఉండేవి. తద్వారా వేలాది లీటర్ల ఇంధన గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్ను ఇళ్లకు సరఫరా చేయవచ్చు. తద్వారా ఎల్పీజీ మీద ఆధారపడడం తగ్గుతుంది, అలాగే గ్యాస్ ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించినట్లు అవుతుందని పర్యావరణ నిపుణులు తెలిపారు. ఈ పథకాన్ని పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తే ప్రతి నెలా 14 లక్షల కుటుంబాలకు 50 శాతం సిలిండర్ల పంపిణీ చేయవచ్చు. దేశంలోనే పెద్ద మార్పు సృష్టించినట్లు అవుతుందని చెప్పారు. అన్ని నగరాల్లో.. ఇదే మాదిరిగా రాష్ట్రంలో 12 మహానగరాల్లో ప్రతి నిత్యం సేకరించే తడి చెత్తతో బయో గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల గ్యాస్ కొరత అనేది ఉండదని పేర్కొన్నారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ. 75 లక్షల నుంచి కోటి రూపాయలు వ్యయం అవుతుందన్నారు. 5 నుంచి 10 టన్నుల సామర్థ్యంతో నిర్మించవచ్చని తెలిపారు. రూ.200 కోట్లతో మొత్తం బెంగళూరులో 198 వార్డుల్లో ఒక్కో గ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. గ్యాస్ ప్లాంట్ల ద్వారా ఇంధన ఉత్పత్తి బెంగళూరులో సాకారమైతే మంచిరోజులే గతంలో వార్డుకు ఒక ప్లాంటు ఏర్పాటుకు యోచన -
ముమ్మరంగా ఉప ప్రచారం
సాక్షి, బళ్లారి: దావణగెరె దక్షిణ, బాగల్కోటె అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం ముమ్మరంగా ప్రచార పర్వం సాగింది. మంగళవారం సాయంత్రంతో బహిరంగ ప్రచారం ముగుస్తుంది. బుధవారం అభ్యర్థులు సందడి లేకుండా ఇంటింటికి వెళ్లి ఓట్లు అర్థించవచ్చు. సోమవారం దావణగెరెలో కాంగ్రెస్ అభ్యర్థి శ్యామనూరు సమర్థ్కు మద్దతుగా సీఎం సిద్దరామయ్య ప్రచారం నిర్వహించారు. దావణగెరె వెన్న దోసె ఎంత రుచిగా ఉందో అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అద్భుతమైన ఫలితాలు అందించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన వెన్న దోసెను ఆరగించారు. -
దర్శన్ రోల్.. బాస్పై స్టే
బనశంకరి: రేణుకాస్వామి హత్య ఘటన ఆధారంగా బాస్ అనే కన్నడ సినిమా రూపొందించినట్లు తెలిసింది. ఈ చిత్రం విడుదల చేయరాదంటూ ఆ కేసులో నిందితుడు, నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి కోర్టును ఆశ్రయించారు. దర్శన్ను అభిమానులు ‘ది బాస్’ అని పిలుచుకోవడం తెలిసిందే. వివరాలు.. బాస్ సినిమా టీజర్ ఇటీవల సోషల్ మీడియాలో విడుదల అయ్యింది. రేణుకాస్వామి హత్య ఆధారంగా ఈ సినిమా తీశారని అందులో స్పష్టమైంది. అతని కిడ్నాప్, హత్య దృశ్యాలు కనిపిస్తాయి. దీంతో దర్శన్ భార్య విజయలక్ష్మి సినిమాను విడుదల చేయరాదని బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయగా, విచారించిన జడ్జి.. చిత్రంపై స్టే ఇచ్చారు. ఈ నెల 14న విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నాల్లో ఉండగా స్టే జారీ అయ్యింది.మహిళా ఎస్ఐపై దాడికి యత్నం చింతామణి: తనపై కొందరు దాడికి యత్నించారని రూరల్ ఎస్ఐ నాగమ్మ పోలీసులకు పిర్యాదు చేశారు. వివరాలు. ఆదివారం రాత్రి 11 గంటలకు పట్టణ శివార్లలోని చిన్నసంద్ర గ్రామంలో జమ్జమ్ హోటల్ తెరిచి ఉండగా, సమయం అయిందని, మూసివేయాలని యజమాని షాహిద్ఖాన్కు తన జీప్ డ్రెవర్ వేణుగోపాల్ చెప్పారు. అక్కడ ఉన్న కొందరిలో 6 మంది డ్రైవరుపై దౌర్జన్యానికి వచ్చారు, తాను అడ్డుకోగా సెల్ఫోన్ను లాక్కుని, పక్కకు తోసేశారని తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బెంగళూరు– ముంబై ఎక్స్ప్రెస్ వే? దొడ్డబళ్లాపురం: బెంగళూరు నుంచి ముంబైకి రోడ్డు మార్గాన వెళ్తే కనీసం 12 గంటలు పడుతుంది, ఈ సమయాన్ని తగ్గించేలా పూణె– బెంగళూరు మధ్య 745 కిలోమీటర్ల మేర రూ.40 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ని నిర్మించే ప్రస్తావన కేంద్ర ప్రభుత్వం ముందుంది. ఇది పూర్తయితే బెంగళూరు–ముంబై మధ్య రోడ్డు ప్రయాణం 5.5 గంటలే పడుతుంది. ప్రయాణం నిరాటంకంగా సాగేలా 8 లేన్ల రహదారి, బైపాస్లను నిర్మిస్తారు. 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీడియాతో సూచనప్రాయంగా ఈ విషయాన్ని చెప్పారు. ఎక్స్ప్రెస్వేలు నిర్మిస్తున్న మార్గాల్లో విమాన సర్వీసులు రద్దవుతున్నాయని ఆయన చమత్కరించారు. ఇప్పుడు పనులు ప్రారంభిస్తే రెండేళ్లలో పూర్తవుతాయని అంచనాలున్నాయి. -
ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ను నయం చేయొచ్చు
బళ్లారిఅర్బన్: క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయడం సాధ్యమని బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రి సర్జికల్ అంకాలజీ, రోబోటిక్ సర్జరీ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ దేవీష్ బల్లాళ్ తెలిపారు. సోమవారం పత్రికా భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాధి నిర్ధారణలో ఆలస్యం జరిగితే రోగుల జీవన అవకాశాలు తగ్గడమే కాకుండా, వారి జీవిత మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కర్ణాటకలో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పుపై అవగాహన, ముందస్తు గుర్తింపు అవసరం అనే అంశం గురించి తెలిపారు. రాష్ట్రంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో సుమారు 25 శాతం పొగాకు వాడకంతో సంబంధం ఉన్నవేనని తెలిపారు. ప్రతి సంవత్సరం దాదాపు 22 వేల కేసులు నమోదవుతుండగా వాటిలో నేరుగా పొగాకుతో సంబంధించినవి ఎక్కువగా ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. -
మరణంలోనూ వీడని భార్యాభర్తల బంధం
సాక్షి,బళ్లారి: తీవ్ర అనారోగ్య సమస్యతో భార్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా, భార్యను చూసేందుకు వస్తూ రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందడంతో మరణంలోనూ భార్యాభర్తల బంధం వీడనిదిగా మారింది. వివరాలు... బెళగావి జిల్లా బైలహొంగల తాలూకా అరవళ్లికి చెందిన మధుర(30), కరెప్ప(36) భార్యాభర్తలు. మధుర కొన్ని నెలలుగా ఆనారోగ్యం బారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం కూడా. అనారోగ్యం బారిన పడటంతో కుటుంబానికి భారంగా మారుతానని విషం తాగి మధుర ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించింది. భార్యను చూసేందుకు భర్త కరెప్ప బెళగావికి వస్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా ధార్వాడ నుంచి బైలహొంగల వెళుతున్న వాయువ్య కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాథలు ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే బైలహొంగల పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ పెళ్లి చేసుకుని తొమ్మిదేళ్లు కాగా, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఒకే రోజు తల్లిదండ్రులు మృతి చెందడంతో చిన్న పిల్లలు అనాథలయ్యారు. ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాల్సింది పోయి తల్లి ఆత్మహత్య చేసుకోవడం ఏంటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యను చూడటానికి వస్తూ భర్త కూడా మృతి చెందడంతో ఒకే రోజు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల రోదనలను ఆపేందుకు ఎవరి తరం కాలేదు. ఈ విషాదకర ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఒకే రోజు భార్యాభర్తలు మృతి చెందడం, ముగ్గురు చిన్నారులు అనాథలు కావడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. అనారోగ్య సమస్యతో భార్య బలవన్మరణం భార్య వద్దకు వస్తూ బస్సు ఢీకొని భర్త మృతి -
నిర్మాణం ఘనం.. లబ్ధి శూన్యం
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి తోడు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పథకాలను జారీ చేస్తోంది. సర్కార్ ఆశయ సాధన దిశగా పని చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి శూన్య సాధన చేసిన నిదర్శనాలున్నాయి. వేపవి కాలంలో పశువులకు తాగునీరు, పశు గ్రాసం లభించడం కష్టమని భావించి ప్రభుత్వం గోశాలల నిర్మాణం చేపట్టింది. పేరుకు మాత్రమే గ్రామాల్లో గోశాలల నిర్మాణాలు చేపట్టారు. 2023–24వ సంవత్సరంలో రాయచూరు తాలూకా జంబలదిన్ని గ్రామంలో జెడ్పీ, జిల్లా యంత్రాంగం, పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో రూ.51.55 లక్షలతో గోశాలను నిర్మించారు. గోబర్ గ్యాస్ ఉత్పత్తికి వీలుగా కేఆర్డీఎల్ సంస్థ నేతృత్వంలో రూ.11.30 లక్షల వ్యయంతో గోబర్ గ్యాస్ ప్లాంట్ను నిర్మించి గాలికొదిలేశారు. కనిపించని పచ్చదనం గోశాల చుట్టు పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటాలని ఆదేశాలున్నా వాటిని మూలన పడేశారు. రైతులకు ఉపయోగపడాల్సిన గోశాల నిరుపయోగంగా మారింది. గ్రామానికి 2 కి.మీ.ల దూరంలో గోశాలను నిర్మించినా ఫలితం లేకుండా పోయింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మూడు నెలల పాటు పశువులకు పశుగ్రాసం, తాగునీటికి కటకట ఏర్పడుతుందని గ్రహించి సర్కార్ సదాశయంతో గోశాలను నిర్మించినా జీపీ అధికారులు నిర్వహణపై పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. దాదాపు రూ.63 లక్షలతో నిర్మించిన గోశాలలో జంబలదిన్ని గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు చెందిన పశువులకు నీడనివ్వాల్సిన గోశాల నిర్మాణం చేపట్టి మూడేళ్లు గడుస్తున్నా ఇంత వరకు గోశాలను ఉపయోగించిన దాఖలాలు లేవని గ్రామస్తుస్థులు ఆంజనేయ, తిమ్మప్ప వాపోయారు. గోవులకు రక్షణ కరువు నిరుపయోగంగా గోశాల నెరవేరని ప్రభుత్వ ఆశయం -
దేశ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది
సాక్షి,బళ్లారి: దేశ రాజకీయ చరిత్రలో 1980 ఏప్రిల్ 6న ఒక కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలికిందని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం బీజేపీ సంస్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ముందుగా తన స్వగృహంపై బీజేపీ జెండాను ఎగరవేసిన అనంతరం, నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యఽక్షుడు అనిల్ కుమార్ మోకా, ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్, మాజీ ఎమ్మెల్సీ మృత్యుంజయ జినగ తదితరులతో కలిసి భారతమాత, శ్యాంప్రసాద్ ముఖర్జి, దీనదయాళ్ ఉపాధ్కాయ చిత్ర పటాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేతలందరితో కలిసి బీజేపీ జెండాను ఎగరవేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కే.ఎస్ దివాకర్, నాయకులు వెంకటరమణ, గురులింగనగౌడ తదితరులు పాల్గొన్నారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: యాదగిరి, రాయచూరుల్లో బీజేపీ సంస్థాపన దినోత్సవాన్ని ఆయా జిల్లా బీజేపీ కార్యవర్గం చేపట్టింది. సోమవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్.శంకరప్ప, జిల్లాధ్యక్షుడు వీరనగౌడ, యాదగిరిలో నగరసభ మాజీ అధ్యక్షురాలు లలిత తదితరులు బీజేపీ 44వ సంస్థాపనా దినోత్సవాన్ని పురస్కరించుకుని పండిత్ దీన్ దయాళ్, శివ ప్రసాద్ ముఖర్జి, భారత మాత చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో గోవిందు, రవీంద్ర, యల్లప్ప, నరసింహులు, గోపి, సుభాష్లున్నారు. -
లవ్ జిహాద్పై నేహా తండ్రి ఆక్రోశం
హుబ్లీ: తన కుమార్తె హత్య, అత్యాచారం ఆరోపణల ఉదంతంలో అరెస్ట్ అయిన సమీర్, అతడి తండ్రి పాత్ర ఉండవచ్చని నేహా హిరేమఠ తండ్రి, కార్పొరేటర్ నిరంజన్ హిరేమఠ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియా వారికి వీడియోలో వివరించారు. నేహా హత్య కేసు నిందితుడు ఫయాజ్ కూడా అదే జిమ్లో శిక్షణ పొందేవాడు. తనకు సమీర్ తండ్రి అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు. మీ ఏరియాలో బాడీబిల్డింగ్ పోటీలు ఏర్పాటు చేద్దాం. దీనికి ఆర్థిక సహాయం చేయండి అంటూ డిమాండ్ చేసేవాడు. తమ ఇంటికి రావాలని కూడా ఆహ్వానించేవారు. నా భార్య బిరియానీ చేసింది. భోజనానికి రండి అంటూ ఆహ్వానించేవాడు. తాను జంగమ సమాజ వ్యక్తిని, మాంసాహారం తిననని తెలిపానన్నారు. ఆయన ఎంత పిలిచినా తాను వెళ్లలేదు. వెళ్లి ఉంటే ట్రాప్ చేసి ఉండేవాడేమో. నా కుమార్తె హత్య కేసులో కూడా సమీర్, అతడి సోదరి, తండ్రి కుమ్మక్కు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. -
బొలెరో ఢీకొని ఇద్దరు మృతి
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా వెంకటాపుర గ్రామంలో సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపుర శివారులో బైక్పై వెళుతున్న ఇద్దరు అటవీ శాఖ ఔట్ సోర్స్ వాచ్మెన్ సిబ్బంది వెంకటాపుర అటవీ శాఖలో విధులు ముగించుకొని తెల్లవారు జామున ఇంటికి వెళుతుండగా ఎదురుగా అతి వేగంగా వస్తున్న బొలెరో గూడ్స్ వాహనం బైక్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కమలాపురకు చెందిన కృష్ణ (26), వెంకటాపురకు చెందిన హనుమంతప్ప (50) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కమలాపుర పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరి మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. బోలెరో గూడ్స్ వాహనాన్ని స్వాధీన పరచుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిరసనకారులతో ‘నారా’ చర్చలు సఫలం
సాక్షి,బళ్లారి: మహానగర పాలికె ఏఈఈ వీరేష్పై కార్పొరేటర్ కుబేర దాడి చేయడాన్ని నిరసిస్తూ మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నారా సూర్యనారాయణరెడ్డి రంగంలోకి దిగారు. కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న పాలికె సిబ్బందితో చర్చించారు. మహానగర పాలికె ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోవిందబాబుతో పాటు ఆందోళనలో పాల్గొన్న ప్రముఖులతో నేరుగా మాట్లాడారు. చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తామని, ఽఅందరి అభిప్రాయాలను తీసుకుని కచ్చితంగా న్యాయం చేస్తానని, తన మాటపై విశ్వాసం ఉంచాలని, ఇకపై ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అన్ని విషయాలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత పాలికె ఉద్యోగులు ఆందోళనలకు స్వస్తి పలికి యథావిధిగా విధులకు హాజరయ్యారు. ఆదివారం రాత్రి మేయర్ గాదెప్ప కూడా పాలికె సిబ్బందితో చర్చించారు. కేసులు వెనక్కి తీసుకునేలా రాజీ ఇరు వర్గాలు కేసులు వెనక్కి తీసుకునేలా ఒప్పిస్తామని, క్షమాపణలు చెప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాలికె సిబ్బంది, అధికారులు ధర్నాను విరమించారు. ఆందోళనను విరమించిన పాలికె సిబ్బంది యథావిధిగా విధులకు అధికారుల హాజరు న్యాయం చేస్తానని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి భరోసా -
పాత వీడియోతో కేసు మార్పునకు కుట్ర
హుబ్లీ: నన్ను బెదిరించి ఆరు నెలల క్రితం ముఫిస్ వీడియో రికార్డు చేసుకున్నాడు. ఇప్పుడేమో ఆ దృశ్యాలను వైరల్ చేస్తున్నాడని, ఈ విషయంలో కొందరు రాజకీయ నేతలు తమ పబ్బం గడుపుకున్నారని హుబ్లీ లవ్ జిహాద్ బాధితురాలు ఆరోపించారు. ఆమె మీడియాకు ఇచ్చిన ప్రకటనలో జైల్లో ఉంటూనే నిందితుడు ముఫిస్, అలాగే అతడి స్నేహితుల నుంచి కేసును మార్చే కుట్ర చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాక పాత వీడియో విడుదల చేసి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నిందితుడు ముఫిస్, అలాగే ప్రముఖ హాల్తాజ్ హోటల్ యజయానిపై బాధితురాలు ఆక్రోశం వెళ్లగక్కారు. తాను స్వచ్ఛందంగానే ముఫిస్తో సంబంధాన్ని వదులుకున్నాను. అతడితో ఉన్నప్పుడు బలవంతంగా ఇస్లాం మతం ఆచరణ గురించి నన్ను ఒత్తిడి చేసేవాడు. నాకు బ్రెయిన్ వాష్ చేసి వారు చెప్పినట్లుగానే నడుచుకొనేలా చేశారు. దీంతో నేను అతడి స్నేహానికి బ్రేకప్ చెప్పాను. అందుకే అతడికి వ్యతిరేకంగా కేసు నమోదు చేశానని ముఫిస్ నుంచి లవ్ జిహాద్కు బలి అయిన బాధిత యువతి వివరించారు. పట్టపగలే ఇంట్లో చోరీ హొసపేటె: హగరిబొమ్మనహళ్లి పట్టణంలోని బోవి కాలనీలోని ఓ ఇంట్లో సోమవారం ఓ నిందితుడు పట్టపగలే చోరీ చేసి పారిపోయిన ఘటన జరిగింది. ఈ ఘటన హగరిబొమ్మనహళ్లి వాసులను హడలెత్తించింది. పగటిపూట దొంగతనం చేసి పారిపోతున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దొంగ తాళం పగలగొట్టి ఈ నేరానికి పాల్పడ్డాడు. బోవి కాలనీలో నివాసమంటున్న జగదీష్ ఇంట్లో ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. దొంగ ఇంట్లోంచి రూ.15 వేల నగదును దొంగలించాడు. ఘటనపై హగరిబొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అభివృద్ధి పనుల పరిశీలన బళ్లారిటౌన్: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర సోదరుడు వెంకటేష్ ప్రసాద్ పరిశీలించారు. గ్రామ శివారులో రెండు చోట్ల రూ.4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెనల పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ పనులను నాణ్యతగా, చురుకుగా నిర్వహించాలని కాంట్రాక్టర్ నాగరాజుకు సూచించారు. అంతకు ముందు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎస్డీఎంసీ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష బాధ్యతల స్వీకార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ పాఠశాలలను ఎమ్మెల్యే నిధులతో దత్తత తీసుకొని అభివృద్ధి పరుస్తారని, దీనికి ప్రజలు సహకరించాలన్నారు. ఈ నిధులలతో పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ శ్రద్ధ చూపి ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధనరెడ్డి, రాజేష్, గాదిలింగనగౌడ, ప్రభురెడ్డి, సిద్దమ్మనహళ్లి ఉలెప్ప, మల్లేశప్ప, నాగరాజ్రెడ్డి, నాగిరెడ్డి, అంజినప్ప, శివరామ, ఉచ్చీరప్ప, చిదానంద, చంద్రప్ప, ఎర్రిస్వామి, గాదిలింగ, షణ్ముఖ, శివమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన ఎస్డీఎంసీ పదాధికారులను సన్మానించారు. గవర్నర్ను రీకాల్ చేయాలి రాయచూరు రూరల్: రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ను రీకాల్ చేయాలని కర్ణాటక రక్షణ వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు వినోద్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రానికి వ్యతిరేకంగ నడుచుకుంటున్నారని పదో తరగతి పరీక్షల్లో మూడో భాష హిందీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు లేఖలు రాశామన్నారు. ప్రతి చిన్న విషయంలో రాష్ట్ర సర్కార్కు తలనొప్పిగా మారిన గవర్నర్ను రీకాల్ చేయాలని కోరుతు జిల్లాధికారి నితీష్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. పీడీఓను సస్పెండ్ చేయరూ రాయచూరు రూరల్: సగమకుంట పీడీఓను సస్పెండ్ చేయాలని స్వాభిమాని కర్ణాటక రక్షణ వేదిక డిమాండ్ చేసింది. సోమవారం టీపీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు రాము మాట్లాడారు. పీడీఓ కరెప్పను విధుల నుంచి తొలగించాలని కోరుతూ టీపీ ఈఓ చంద్రశేఖర్ పవార్కు వినతిపత్రం ఇచ్చారు. -
పాఠశాలల్లో సమస్యలు పరిష్కరిస్తాం
రాయచూరు రూరల్: కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న గడినాడు ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరిస్తామని అదనపు జిల్లాధికారి శివానంద హామీ ఇచ్చారు. సోమవారం రాయచూరు తాలూకా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత 50 ఏళ్ల నుంచి గడినాడు పాఠశాల సమస్యలపై నిరంతరం ఆందోళన చేస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చొరవతో సమస్యలను పరిష్కరించి గడినాడు ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య, నిరుద్యోగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. 1956లో ఫజల్ అలీ కమిషన్ నివేదిక ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజనతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. హాస్టల్ సౌకర్యం, రవాణా సౌకర్యాలను కల్పించాలని జేఏసీ నాయకులు అధికారులకు వివరించారు. పీయూ అధికారి సోమశేఖరప్ప, తహసీల్దార్ సురేష్ వర్మ, సాంఘీక సంక్షేమ శాఖాధికారులు ప్రవీణ్, మోనప్ప, ఈరణ్ణ కోస్గి, రంగస్వామి, జేఏసీ నాయకులు అమర దీక్షిత్, రామలింగప్ప, నిజాముద్దీన్, నాగభూషన్, కిషోజుఏ కుమార్, నాగరాజ, రవి, నాగేంద్ర, రేష్మా షబ్బీర్లున్నారు. అదనపు జిల్లాధికారి శివానంద హామీ 5 శాతం రిజర్వేషన్ అమలుకు చర్యలు -
తల్లీ శిశు మరణాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ
బళ్లారిటౌన్: జిల్లాలో తల్లీ శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అధికారులు జాగ్రత్త వహించాలని డీఎంహెచ్ఓ యల్లా రమేష్ బాబు పేర్కొన్నారు. సోమవారం జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సభాంగణంలో ఏర్పాటు చేసిన జాగృతి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం సిజేరియన్ కాన్పుల్లో మరణాలను 20 శాతానికి తగ్గించే ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రాణాపాయం నుంచి 75 మందికి రక్షణ 2025–26వ సంవత్సరంలో బళ్లారి వైద్య విజ్ఞాన కళాశాల పరిశోధన కేంద్ర నుంచి 54 మంది, జిల్లా ఆస్పత్రి నుంచి 24 మంది తల్లులను ప్రాణాపాయం నుంచి కాపాడి మరణాల సంఖ్యను నియంత్రించినట్లు ఆయన వెల్లడించారు. వీటి నియంత్రణ, మరింతగా తగ్గించేందుకు జాగృతి కల్గించాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఆర్సీహెచ్ అధికారులు హనుమంతప్ప, వివిధ అధికారులు హెచ్ఈ రామరాజు, వైద్యులు డాక్టర్ విశ్వనాథ్, రిజేష్, ప్రశాంత్, బాల వెంకటేశ్వరరావు, అబ్దుల్, సునీల్, అరుణ్, మంజునాథ్, భరత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. దావణగెరె దక్షిణ మొత్తం ఓటర్లు 2,31,072● పురుషులు 1,13,399, మహిళలు 1,17,690 మంది ● కొత్తగా పేర్లు చేర్పించుకున్న యువ ఓటర్లు 2,870 మంది బళ్లారి రూరల్ : దావణగెరె దక్షిణ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,31,072 మంది ఉన్నట్లు దావణగెరె ఎన్నికల అఽధికారి పత్రికా ప్రకటనలో తెలిపారు. వీరిలో పురుషులు 1,13,399 మంది కాగా మహిళలు 1,17,690 మంది, ట్రాన్స్జెండర్స్ 43 మంది ఉన్నట్లు తెలిపారు. మొత్తం యువ ఓటర్లు 2,870 కాగా వీరిలో 1,494 మంది యువకులు, 1,376 మంది యువతులు ఉన్నట్లు తెలిపారు. దివ్యాంగులు మొత్తం 2,512 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 1,375 మంది కాగా మహిళలు 1,137 మంది ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన వయోవద్ధులు 1,974 మంది ఉండగా వీరిలో పురుషులు 891 మంది కాగా మహిళలు 1,083 మది ఉన్నారు. 100 ఏళ్ల వయస్సు పైబడిన వయోవృద్ధులు 28 మంది ఉండగా వీరిలో పురుషులు 8 మంది, మహిళలు 20 మంది ఉన్నట్లు తెలిపారు. సర్వీసు ఓటర్లు మొత్తం 35 మంది ఉండగా, వీరిలో పురుషులు 34 మంది, మహిళలు ఒకరు ఉన్నట్లు తెలిపారు. వరిగడ్డి వాముల దగ్ధం ● రూ.2 లక్షల మేర నష్టం హొసపేటె: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల 10 పశుగ్రాసం కుప్పలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలోని దేవర తిమ్లాపుర గ్రామంలో సోమవారం జరిగింది. విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా వరదహళ్లి హనుమంతప్ప అనే రైతుకు చెందిన కుప్పలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కుప్పలకు నిప్పంటుకొని పూర్తిగా కాలి పోయాయి. సుమారు రూ.2 లక్షల విలువైన పశుగ్రాసం బూడిదైంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రానందుకు పశుగ్రాసం కుప్పలు పూర్తిగా కాలిపోయాయని రైతు వాపోయారు. -
హైవేలో ఘోర ప్రమాదం
కారును లారీ ఢీ, ఇద్దరు మృతి సాక్షి, బళ్లారి: చిత్రదుర్గం జిల్లా మొళకాల్మూరు తాలూకా రాంపురం సమీపంలోని రాజాపుర గేటు వద్ద కారు–లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఆదివారం బెంగళూరు నుంచి బళ్లారి వైపు వస్తున్న కారు డీవైడర్కు ఢీ కొని ంది. అదే సమయంలో వెనుకనే బళ్లారి నుంచి బెంగళూరు వైపు వెళుతున్న లారీ వేగంగా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన ఇంజనీర్ రవిచంద్ర (42), డ్రైవర్ కిరణ్ (24) అక్కడే మరణించారు.తుమకూరు: తుమకూరు జిల్లాలోని శిరా తాలూకాలో మినీ విధాన సౌధ సమీపంలో జాతీయ రహదారి– 48పై ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సును కేఎస్ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొనింది. ఈ ప్రమాద తీవ్రతకు ప్రైవేట్ బస్సులోని ఇద్దరు ప్రయాణికులు మరణించగా, రెండు బస్సుల్లో 35 మంది గాయపడ్డారు. మృతులను హావేరికి చెందిన ప్రవీణ్ కృష్ణప్ప (28), గదగ్కు చెందిన సంగీత (16)గా గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. 2 బస్సులూ బెంగళూరుకు వస్తున్నాయి. ప్రైవేటు బస్సు హైవేలో హఠాత్తుగా ఒక లేన్ నుంచి మరో లేన్లోకి మారింది. అదే సమయంలో వేగంగా వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సుకు అడ్డుగా రావడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రైవేటు బస్సు వెనుక భాగాన్ని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో బాగా ధ్వంసమైంది. ఫలితంగా, ప్రైవేట్ బస్సు వెనుక సీట్లలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు గాయాలతో చనిపోయారు. 2 బస్సుల్లోనూ 35 మందికి గాయాలు తగిలాయి. శిర పోలీసులు, స్థానికులు చేరుకుని బాధితులను ఆస్పత్రులకు తరలించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు రెండు వాహనాల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి. హఠాత్తుగా లేన్ మారిన ప్రైవేటు బస్సు వెనుక నుంచి ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఇద్దరు మృతి, 35 మందికి గాయాలు తుమకూరు జిల్లాలో దుర్ఘటన -
క్రీడల్లో గెలుపోటములు సహజం
రాయచూరు రూరల్: క్రీడల్లో గెలుపోటములు సహజం. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని వేంకటేశ్వర కళాశాల అధ్యక్షుడు సంతోష్ రాజ్ సూచించారు. ఆదివారం వేంకటేశ్వర కళాశాల క్రీడా మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానసికంగా, శారీరకంగా, దైహికంగా అభివృద్ధి చెందడానికి క్రీడలు దోహదపడుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు క్రీడల్లో సత్తా చాటి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాక్షించారు. అనంతరం గెలుపొందిన జట్టుకు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో చిదానంద, అక్షయ్ కుమార్, మహేష్, సతీష్, శరణప్ప అమరేష్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఆరాధన ఉత్సవాలు రాయచూరు రూరల్: మంత్రాలయంలో సుశీమింద్ర తీర్థుల ఆరాధన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం రాత్రి రాఘవేంద్ర స్వాముల మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీ పాదంగల్ ప్రత్యేక పూజలు చేశారు. ఆరాధనకు తరలివచ్చిన వందలాది మంది భక్తుల సమక్షంలో రాఘవేంద్ర స్వామికి తెపోత్సవం నిర్వహించారు. అనంతరం రాయచూరుకు చెందిన శేషగిరి దాస్ ఆధ్వర్యంలో గాన కచేరీ, భక్తిగీతాలన చేపట్టారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంహొసపేటె: సమాజంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందిన ఆనంద్ గురూజీ తెలిపారు. ఆదివారం నగరంలో మారికాంబిక గ్రామీణ అభివృద్ధి, మహిళా శక్తి సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. తొలుత సన్నిక్కి వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన హోమంలో ఆనంద్ గురూజీ పాల్గొని పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛారణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. లోక కళ్యాణం, వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని స్వామిజీ ఆశీర్వదించారు. ముఖ్యంగా సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ఈ హోమం ఉద్దేశమని తెలిపారు. హోమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామిజీ ఆశీస్సులు పొందేందుకు భక్తులు క్యూకట్టారు. ‘కుమారుడిని ఇండియాకు తీసుకు రండి’ రాయచూరు రూరల్: జీవనోపాధి కోసం ఖతార్ వెళ్లిన తమ కుమారుడిని ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని బీదర్ తాలుకా బక్చౌడికి చెందిన శాంతాబాయి కోరింది. ఆదివారం బీదర్ దక్షిణ శాసన సభ్యుడు డా.శైలేంద్ర బెల్దాళ్ను కలసి సమస్యను విన్నవించింది. ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాల మధ్య యుద్ధం జరుగుతుండటంతో తమ కుమారుడు అమర్ అక్కడే చిక్కుకుని పోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడే యుద్ధ ప్రభావం ఎక్కువ ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. శాసన సభ్యుడు శైలేంద్ర స్పందిస్తూ.. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. బాలల కోసం వేసవి శిబిరం కోలారు: కోలారు క్రీడా సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిబిరాన్ని అంబేడ్కర్ ఉద్యానవనంలో ప్రారంభించారు. కోలారు కృషి కేంద్రం ప్రముఖుడు శివానంద హొంగల మాట్లాడుతూ పిల్లలకు పశువుల పెంపకం, గొర్రెల పెంపకం, వ్యవసాయం, సీడ్ బాల్ తయారు గురించి తెలియజేస్తామన్నారు. వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పరమేశ్వర్ మాట్లాడుతూ.. నేడు పిల్లలు మట్టి వాసనను మరిచిపోయారని వారికి మన మట్టి ఘమఘమల గురించి తెలియజేయాల్సి ఉందని అన్నారు. పాత్రికేయుడు కెయస్ గణేష్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఓం శక్తి చలపతి, సామా అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో క్లీనర్ మృతి
హోసూరు: ముందు వెళ్తున్న లారీని వెనుక వెళ్తున్న మరో లారీ ఢీకొన్న ప్రమాదంలో క్లీనర్ మృతి చెందిన ఘటన సిఫ్కాట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. వేలూరు జిల్లా గుడియాత్తం ప్రాంతానికి చెందిన లోకేష్ (28) క్లీనర్గా పని చేస్తున్నాడు. వాణియంబాడికి చెందిన డ్రైవర్ లింగేశ్వరన్ లారీని నడుపుతుండగా పక్కనే లోకేష్ కూర్చొన్నాడు. శనివారం సాయంత్రం బెంగళూరు–హోసూరు జాతీయ రహదారిపై లారీలో వెళ్తుండగా.. దర్గా సమీపంలో ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లోకేష్ తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సిఫ్కాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఉరివేసుకుని హెడ్కానిస్టేబుల్ ఆత్మహత్య హోసూరు: విధులు ముగించుకుని ఇంటికెళ్లిన హెడ్కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల మేరకు.. క్రిష్ణగిరి సమీపంలోని పెద్దదాళపల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్ (40). మహారాజగడ పోలీస్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. ఈనెల 3వ తేదీ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు గది తలుపులు తెరిచి చూడగా విజయ్కుమార్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. భార్య భారతి వెంటనే క్రిష్ణగిరి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు కారణాలపై విచారణ జరుపుతున్నారు. ప్రశాంతంగా సాక్షరతా పరీక్షలు కోలారు: కేంద్ర ప్రభుత్వ ఉల్లాస్ నవ భారత సాక్షరతా కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 23 గ్రామ పంచాయతీల వ్యాప్తిలో 189 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన సాక్షరతా పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. 6 వేల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే లక్ష్యంతో మూల సాక్షరతా కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందని జిల్లా సాక్షరతా అధికారి ఉమా తెలిపారు. ఆదివారం నిర్వహించిన పరీక్షకు 6 వేల మంది హాజయ్యారని తెలిపారు. బంగారుపేట తాలూకాలో 4 గ్రామ పంచాయతీల 26 పరీక్షా కేంద్రాల్లో 1,000 మంది, కెజీఎఫ్ తాలూకాలో 3 గ్రామ పంచాయతీల్లోని 5 పరీక్షా కేంద్రాల్లో 250 మంది, కోలారు తాలూకాలోని 13 గ్రామ పంచాయతీల్లోని 74 పరీక్ష కేంద్రాల్లో 1,750 మంది, మాలూరు తాలూకాలో 4 గ్రామ పంచాయతీల్లోని 35 కేంద్రాల్లో 1,000 మంది, ముళబాగిలు తాలూకా 6 గ్రామ పంచాయతీల్లోని 46 పరీక్ష కేంద్రాల్లో 1,750 మంది, శ్రీనివాసపురం తాలూకాలో 2 పరీక్షా కేంద్రాల్లో 250 మంది పరీక్షలు రాశారని అధికారులు వెల్లడించారు.


