Karnataka
-
వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం ఖండిస్తూ నిరసన
హొసపేటె: వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణాన్ని ఖండిస్తూ కొప్పళ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యకర్తలు టైర్లకు నిప్పు పెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆగస్టు 19న మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విచారణకు అనుమతించాలన్న రాష్ట్ర గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొని టైర్లకు నిప్పు పెట్టారు. టైర్లకు నిప్పు పెట్టి నిరసన ప్రకటిస్తున్న దృశ్యం -
గుండెపోటుతో ప్రముఖ కళాకారుడు మృతి
బళ్లారిటౌన్: నగరానికి చెందిన ప్రముఖ చిత్రలేఖన కళాకారుడు, ప్రముఖ హిందుస్తానీ గాయకుడు జాలిబెంచి దొడ్డబసవాచార్య గవాయి మనవడు మంజునాథ్ గోవిందవాడ(52) సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మంజునాథ్ లలితకళా అకాడమి అవార్డును పొందారు. ఆయన సైకత, తైల, జలవర్ణంలో చిత్రకళను ప్రదర్శించేవారు. హంపీ ఉత్సవాలతో పాటు వివిధ సభలు, సమావేశ వేదికల్లో స్వాగత బ్యానర్లను రూపొందించి ఆకట్టుకున్నారు. ఆయన మృతికి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి, ప్రముఖులు ఎన్.ప్రతాప్రెడ్డి, టీహెచ్ఎం బసవరాజు, నిష్టిరుద్రప్ప, వీరభద్రగౌడ, అధికారులు చోరనూరు కొట్రప్ప, బీ.నాగరాజు, కళాకారులు హంద్యాళ్ పురుషోత్తం, శంకరబండె యల్లనగౌడ, ఆదోని వీణా, తిప్పేస్వామి, రమణప్ప తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 21న బోవి సమావేశం హోసూరు: హోసూరులో జూన్ 21వ తేదీ జరగనున్న క్రిష్ణగిరి జిల్లా బోవి సముదాయ సమావేశాన్ని విజయవంతం చేయాలని కార్యవర్గ కమిటీ నిర్వాహకులు కోరారు. హోసూరు చెరువు వీధి సమీపంలోని అమ్మన్ సెలబ్రేషన్ హాలులో జరుగుతుందని, పెద్దఎత్తున సముదాయ ప్రజలు పాల్గొని, తమ వర్గం అభివృద్ధిపై చర్చించాలని కోరారు. -
ఎలుగుబంటి దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలోని హులికట్టి గ్రామంలో పంట పొలానికి వెళ్లిన ఒక వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. యంకప్ప(60) ఎలుగుబంటి దాడికి గురయ్యాడు. అడవి జంతువుల బారి నుంచి తన పంటను కాపాడుకోడానికి అతను పొలానికి వెళ్లినప్పుడు, అర్ధరాత్రి అకస్మాత్తుగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసి తల, ముఖం, చేతులపై కరిచి తీవ్రంగా గాయపరిచింది. బావిలో పడి బాలుడు మృతి క్రిష్ణగిరి: బావిలో నంచి నీరు తేవడానికి తల్లితో కలిసి వెళ్లిన మూడేళ్ల బాలుడు బావిలో పడి చనిపోయిన ఘటన బేరికె వద్ద జరిగింది. వివరాల మేరకు.. సూళగిరి తాలూకా కడతూరుకు చెందిన వెంకటేష్ (25), భార్య చిత్ర. వీరికి లోకేష్ (3) అనే కుమారుడు, ఏడాదిన్నర కూతురు ఉన్నారు. వెంకటేష్ ఓ రైతు పొలంలో కుటుంబంతో కలిసి ఉంటూ కూలి పనులు చేసేవాడు. ఆదివారం సాయంత్రం చిత్ర బావి నుంచి నీరు తీసుకొచ్చేందుకు కొడుకుతో కలిసి వెళ్లింది. ఈ సమయంలో బాలుడు లోకేష్ ఆకస్మాత్తుగా కాలు జారి బావిలో పడిపోయాడు. ఎవరూ కాపాడలేకపోవడంతో అతడు చనిపోయాడు. బేరికె పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
తుంగభద్రలో యథేచ్ఛగా బోటింగ్
హొసపేటె: తాలూకాలోని పర్యాటక ప్రాంతం హంపీలో రుష్యమూక పర్వత సమీపంలో తుంగభద్ర నదిపై యథేచ్ఛగా తెప్ప(నాటు పడవ) ప్రయాణాలు కొనసాగించడం వల్ల గత ఏడాదిగా సణాపుర గ్రామ పంచాయతీ ఆదాయానికి నష్టం వాటిల్లుతోంది. అవసరమైన భద్రతా చర్యలతో పాటు, గ్రామ పంచాయతీ ఈ–టెండర్ ద్వారా బోటు యజమానుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి, నిర్దిష్ట డిపాజిట్తో వేలం ద్వారా బోటింగ్ కోసం అనుమతిని జారీ చేయాలి. సణాపుర గ్రామ పంచాయతీ పరిధిలోని హనుమనహళ్లి సమీపంలో ఉన్న రుష్యమూక పర్వతం వద్ద తుంగభద్ర నదిలో, హంపీలోని కోదండరామ ఆలయానికి పర్యాటకులను తరలించడానికి తెప్పలను ఉపయోగిస్తున్నారు. గత ఏడాదిగా గ్రామ పంచాయతీ నుంచి టెండర్ లేకుండానే ఒక వ్యక్తిని బోటింగ్ చేయడానికి అనుమతిస్తున్నారు. టెండర్ పిలవాలని, తెప్పను ఏర్పాటు చేసే పనిని అర్హత గల వ్యక్తికి అప్పగించాలని కోరుతూ చాలా మంది గ్రామ పంచాయతీకి లేఖలు రాశారు. టెండర్ సాకుతో అనధికారిక అనుమతి అయినప్పటికీ ఈ టెండర్ నెపంతో గత ఏడాదిగా అనధికారిక బోటింగ్కు అనుమతి ఇస్తున్నారు. దీని వల్ల గ్రామ పంచాయతీ లక్షల రూపాయలు నష్టపోయింది. తక్షణమే నిబంధనల ప్రకారం టెండర్ పిలిచి, ఈ–టెండర్ ద్వారా నిర్దిష్ట డిపాజిట్తో అర్హత గల వ్యక్తులను బోటింగ్ చేయడానికి అనుమతించాలి. అంతేకాకుండా సణాపుర గ్రామం వద్ద జలపాతాల సమీపంలో చట్టవిరుద్ధంగా బోటింగ్ నిర్వహిస్తూ పర్యాటకుల భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతేకాక అవసరమైన భద్రతా చర్యలు లేకుండా అధిక ధరలు వసూలు చేస్తూ, పర్యాటకుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారు. అందువల్ల గ్రామ పంచాయతీ పీడీఓ, తాలూకా పంచాయతీలు నిబంధనలకు అనుగుణంగా హనుమనహళ్లి, సణాపుర సమీపంలో బోటింగ్కు తక్షణమే అనుమతి ఇవ్వాలి. అదనంగా గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరేలా టెండర్ పిలవాలని స్థానికులు డిమాండ్ చేశారు. హంపీ వద్ద తెప్పలో విహరిస్తున్న పర్యాటకులు తుంగభద్ర నదిలో విహారానికి సిద్ధంగా ఉన్న తెప్పలు హంపీలో రుష్యమూక పర్వతం వద్ద జలవిహారం టెండర్ పిలవకుండానే సొమ్ము చేసుకుంటున్న వైనం సణాపుర గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి -
రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయండి
రాయచూరు రూరల్: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు విక్రయించిన జొన్నల డబ్బుల బకాయిలను వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఎమ్మెల్సీ బాదర్లి బసవనగౌడ డిమాండ్ చేశారు. సోమవారం బెంగళూరులోని ఆహార పౌర సరఫరాల శాఖాధికారితో చర్చించారు. ఆరు నెలల క్రితం రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా జొన్నలు విక్రయించిన రైతులకు ఇంత వరకు రైతుల బ్యాంక్ల ఖాతాలోకి డబ్బులు వేయలేదన్నారు. ఇప్పటికై నా నిర్లక్ష్యం చేయకుండా త్వరిత గతిన డబ్బులు చెల్లించాలని అధికారులను కోరారు. రైతుల బకాయి సొమ్ము చెల్లించాలని రాస్తారోకో రాయచూరు రూరల్: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు విక్రయించిన జొన్నల డబ్బులు ఖాతాలోకి జమ చేయాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్ చేసింది. సోమవారం సింధనూరు తాలూకా యాపలపర్వి వద్ద రాయచూరు–సింధనూరు రహదారిని బంద్ చేసి చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అమీన్పాషా దిద్దిగి మాట్లాడారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యల నియంత్రణకు స్వామినాథన్ నివేదికను అమలు చేయాలన్నారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధరలను ప్రకటించాలన్నారు. నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు అవకాశం కల్పించకుండా చర్యలు చేపట్టాలన్నారు. మార్కెట్ ధరలకే విత్తనాలు, ఎరువులు విక్రయాలు జరిపేలా చూడాలన్నారు. ఎరువుల కొరత రాకుండా చూడాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. రామయ్య, తిమ్మన్న, చెన్నప్ప, వెంకటేష్, ఖాసీం, నరసింగ్రావ్లున్నారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ తగదు రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ తీసుకున్న నిర్ణయం మేరకు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం మానుకోవాలని కర్ణాటక విద్యుత్ ప్రసార మండలి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బసవణ్ణ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను డిమాండ్ చేశారు. సోమవారం బెంగళూరులోని కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్యుత్ సరఫరా, పంపిణీ బాధ్యతలను టాటా పవర్ కంపెనీకి అప్పగించే ముందు కేపీటీసీఎల్ అధికారులతో చర్చించి, తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలన్నారు. బలరాం, చంద్రశేఖర్ దేశాయిలున్నారు. బాలల రక్షణ కమిటీని రద్దు చేయండి రాయచూరు రూరల్: జిల్లాలో నియమించిన బాలల హక్కుల రక్షణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని జనపర సంఘటన వేదిక డిమాండ్ చేసింది. సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో వేదిక అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడారు. జిల్లాలో బాలల హక్కుల రక్షణ కమిటీ అధ్యక్షుడిగా సింధనూరు సత్యనారాయణ శెట్టి, సభ్యునిగా బీదర్ జగన్నాథ్లను నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. జయశ్రీ, శరణ బసవ, మారెమ్మ, తాయప్ప, మల్లేష్, రామణ్ణ, కిరణ్ కుమార్, నీలమ్మ, అమరమ్మలున్నారు. పెద్దలను గౌరవించాలి రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో పెద్దలను గౌరవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ సిద్రామప్ప పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భవనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా న్యాయ సేవా ప్రాధికార, దివ్యాంగుల శాఖ, సీనియర్ సిటిజన్, రోటరీ క్లబ్, కృష్ణా తుంగ సంయుక్త ఆధ్వర్వంలో ప్రపంచ సీనియర్ సిటిజన్లపై వివక్ష అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. సీనియర్ సిటిజన్లపై దాడి చేసినట్లు కేసులు నమోదైన 60 నుంచి 90 రోజుల్లో వాటిని పరిష్కరించాలన్నారు. పెద్దల ఆస్తులను తీసుకుని వారిని క్షేమంగా చూడకపోతే వారి ఆస్తులను తిరిగి పొందడానికి వీలుగా చట్టం జారీ చేశారన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ, శరణమ్మ, సరస్వతి, పవన్ పాటిల్, లక్ష్మికాంతరెడ్డి, వీరభద్రప్ప, భాస్కర్, శ్రీదేవిలున్నారు. -
పారిశుధ్య లోపం.. నగరానికి శాపం
సాక్షి బళ్లారి: పేరుగొప్ప ఊరుదిబ్బ అంటే ఇదేనేమో. స్టీల్ సిటీగా పేరుగాంచిన బళ్లారి నగరంలో పలు రోడ్లలో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం, డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగునీరు సర్వసాధారణంగా కనిపిస్తోంది. అసలే ఇటీవల వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి నగరంలో జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మురుగునీరు డ్రైనేజీల్లో నుంచి రోడ్లపైకి వస్తున్నాయి. చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఇంటింటికీ చెత్తసేకరణ వాహనాలు వెళ్తున్నప్పటికీ పలువురు రోడ్లలోనే చెత్తాచెదారం వేస్తున్నారని పాలికె అధికారులు పేర్కొంటున్నారు. అయితే వారానికి ఒక్కసారి కూడా చెత్తసేకరణ వాహనాలు రాకపోవడంతో రోడ్ల పక్కనే చెత్తాచెదారం పారవేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయా కాలనీల్లో జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లలో చెత్తాచెదారం విపరీతంగా వేయడం వల్ల పాదచారులకు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారికి, ఆయా కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డ్రైనేజీల్లో మురుగు నీటితో పాటు చెత్తాచెదారం చేరడంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. రోడ్ల పక్కనే చెత్తాచెదారం నగరంలోని కణేకల్లు బస్టాండు నుంచి పెద్ద మార్కెట్కు వెళ్లే దారిలో నిత్యం రోడ్లలో చెత్తాచెదారం వేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహానగర పాలికె సిబ్బంది, నగర పరిశుభ్రతపై దృష్టి సారించేందుకు తగినంత సిబ్బంది లేకపోవడంతో నగరంలోని పలు వీధుల్లో చెత్తాచెదారం వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పారిశుధ్య కార్మికులు, సిబ్బంది కొరత సగానికి సగం తక్కువగా ఉన్నప్పటికీ నగర స్వచ్ఛతకు కృషి చేస్తున్నామని పాలికె అధికారులు పేర్కొంటున్నారు. నగరంలో చెత్త సేకరణ వాహనాలు కాలనీల్లోకి రాకపోతే తమకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నగరంలోని ప్రధాన రోడ్లు మినహా పలు మురికి వాడల కాలనీల్లో చెత్తాచెదారంతో పాటు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండటంతో దోమల బెడద మరింతగా ఎక్కువ అవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు నగరంలోని రోడ్లలో వేస్తున్న చెత్తాచెదారాన్ని అరికట్టి డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగు నీటిని ఎప్పటికప్పుడు పారేలా శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్ల పక్కనే చెత్తాచెదారం డ్రైనేజీల్లో నిలిచిన మురుగు -
మరో చోట పెచ్చులూడిన పాఠశాల పైకప్పు
●కలబుర్గి జిల్లా ఆళంద తాలూకాలో ఘటన రాయచూరు రూరల్: ప్రభుత్వ కళాశాల పైకప్పు కూలి విద్యార్థులకు తీవ్ర గాయాలైన ఘటన కలబుర్గిలో జరిగిన మూడు రోజులు గడవక ముందే మరోసారి జిల్లాలో పాఠశాల పైకప్పు ఊడిన ఘటన కలబుర్గి ఆళంద తాలూకా సంగొళిగిలో చోటు చేసుకుంది. ఆదివారం ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో ఉన్నఫళంగా సిమెంట్ కాంక్రీట్తో కూడిన పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆదివారం సెలవు కావడంతో విద్యార్థులకు గండం తప్పింది. గదుల నిర్మాణం నాసిరకంగా చేసినందువల్లే పైకప్పు పెచ్చులు ఊడిపతున్నట్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందనే ఆరోపణలున్నాయి. బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్ హుబ్లీ: 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై ఇక్కడి పాత హుబ్లీ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు బాలికను బలవంతంగా ఆటోలో కూర్చొబెట్టుకొని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక ఈ విషయాన్ని ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తి శవం మరో ఘటనలో ఓ వ్యక్తి శవం లభించింది. పాత హుబ్లీ గోకులధామ ఖాళీ స్థలంలో వ్యక్తి శవం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. సుమారు 50, 55 ఏళ్ల వయస్సుగల వ్యక్తి శవం చెత్తచెదారం, ముళ్ల కంపల మధ్య దొరికింది. ఇతడి ఆచూకీ తెలిసిన వారు పాత హుబ్లీ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీసులు ఈ వ్యక్తి శవం పూర్వాపరాలపై దర్యాప్తు చేపట్టారు. యోగాతో ఆరోగ్య రక్షణ రాయచూరు రూరల్: మనిషి ఆరోగ్య రక్షణకు యోగాపై శ్రద్ధ అవసరమని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. సోమవారం ప్రజాిపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన యోగా శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవంలో భాగంగా జరిగే మూడు రోజుల శిబిరాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. కార్యక్రమంలో శారద, తిమ్మప్ప, అయ్యప్ప, డాక్టర్ నవీన్, పూజాలున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం రాయచూరు రూరల్: కారు లారీని ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన ఆదివారం సాయంత్రం తెలంగాణలోని గుడేబల్లూరు వద్ద జరిగింది. ప్రమాదంలో జ్యోతి కాలనీలో నివాసముంటున్న శేఖరప్ప గౌడ(68) మరణించారు. కలబుర్గి శరణ బసవేశ్వర దేవస్థానాన్ని దర్శించుకుని తిరిగి రాయచూరుకు వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమస్యలు తీర్చాలని ధర్నారాయచూరు రూరల్: దేశానికి బంగారాన్ని ఉత్పత్తి చేసే హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం హట్టి బంగారు గనుల కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నానుద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి శఫీ మాట్లాడారు. వైద్యకీయ అనర్హత పథకాన్ని రద్దు పరచాలన్నారు. నూతన వేతనాల ఒప్పందం, ఆహార కిట్ల పంపిణీ, హెచ్ఆర్ఏ, ఎక్స్గ్రేషియా, 2025–26వ సంవత్సరానికి బకాయిలున్న వేతనాలు చెల్లించాలని, రిటైర్డ్ పథకాన్ని జారీ చేయాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ద్వి చక్రవాహనాలతో ర్యాలీ చేపట్టారు. అరగంటసేపు రాస్తారోకో చేశారు. వెంకోబ గౌస్, జమదగ్ని, రమేష్, బాబు, హనుమంతు, మునీర్, సాగర్, సంగయ్య రాజేశ్వరి, వెంకటేష్లున్నారు. -
మోదీ పాలనలో దేశాభివృద్ధి అమోఘం
బళ్లారి టౌన్: అభివృద్ధిలో తిరోగమనంలో ఉన్న భారతదేశాన్ని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలోకి తీసుకెళ్లారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటీ రవి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని మోకా రోడ్డులోని వాజ్పేయి లేఔట్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి, విధాన పరిషత్ సభ్యుడు వైఎం.సతీష్ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ఏళ్ల పాలనలో భారత దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిందని, ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, జాతీయ భద్రత వంటి కీలక రంగాల్లో దేశం గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధాన మంత్రుల్లో మోదీ మొదటి స్థానంలో నిలిచారన్నారు. ప్రజల వి శ్వాసాన్ని పొందుతూ పాలనలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఆ ర్థిక సవాళ్లను అధిగమించేందుకు కేంద్ర ప్ర భుత్వం నిరంతరంగా కృషి చేస్తోందని కొనియాడారు. ఉగ్రవాదం, నక్సలిజంపై కఠిన వైఖరి ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని అణచివేసేందుకు మోదీ తీసుకుంటున్న చర్యలు యావత్ దేశ ప్రజలు హర్షిస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు గత యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొన్న నిర్ణయాలే ప్రధాన కారణమన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ కొనసాగాలని, పరిశుభ్రమైన ఓటరు జాబితా రూపకల్పన ప్రజాస్వామ్యానికి అత్యవసరమన్నారు. కొన్ని సంస్థలు, పార్టీలు అశాంతిని సృష్టించేందుకు ఉద్యమాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉందా? లేదా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ విషయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, మాజీ ఎంపీ సన్నపక్కీరప్ప, బీజేపీ ప్రముఖులు కేఎస్ దివాకర్, హనుమంతప్ప పాల్గొన్నారు. ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రతలో పురోగతి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి -
బస్సు, బైక్ ఢీ.. బైకిస్టు మృతి
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని చిలుమెహళ్లి తాండా సమీపంలో బస్సు, బైక్ మధ్య జరిగిన ప్రమాదంలో బైక్ చోదకుడు కరిబసప్ప (65) మృతి చెందగా, వెనుక కూర్చొన్న సదాశివకు తీవ్ర గాయాలయ్యాయి. సండూరు తాలూకాలోని మట్టజనహళ్లికి చెందిన కరిబసప్ప, సదాశివ వ్యక్తిగత పనిపై కూడ్లిగి తాలూకాలోని అప్పేనహళ్లి తాండాకు వచ్చి తమ గ్రామానికి తిరిగి వెళ్తుండగా స్వాగత కమాను సమీపంలో మట్టజనహళ్లి వైపు నుంచి సండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బైక్ను ఢీకొట్టాడు. బైక్ నడుపుతున్న కరిబసప్ప అక్కడికక్కడే మరణించగా, వెనుక కూర్చొన్న సదాశివ గాయపడ్డాడు. మృతుడు కరిబసప్ప కుమారుడు ఉపేంద్రకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గుడేకోటె పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుబ్రహ్మణ్య తెలిపారు. -
అడవి పందుల తరలింపుదారు అరెస్ట్
హొసపేటె: అడవి పందులను అక్రమంగా పట్టుకుని, తరలిస్తున్న వేటగాళ్లను గుర్తించి, ఇక్కడి ప్రాంతీయ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిందితులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా నుంచి గంగావతి వైపు పందులను తరలిస్తున్న వాహనం గురించి అందిన నిర్ధిష్ట సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సోమవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై టోల్గేట్ సమీపంలో ఒక వాహనాన్ని పట్టుకుని 24 అడవి పందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడు అర్జున్ రామ్సింగ్ షెనూరాను అరెస్టు చేశారు. ఏసీఎఫ్ ఏహెచ్.ముల్లా నేతృత్వంలో అటవీ అధికారి శివరాజ్ మేటి, డిప్యూటీ అటవీ అధికారి అబ్బుసామి గుట్టూరు, పరశురాం చక్రసాలి, సిబ్బంది రాఘవేంద్ర రాథోడ్, శివానంద తళవార, నీలప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో పాల్గొన్నారు. -
పొలంలో శివలింగం ప్రత్యక్షం
హుబ్లీ: కొప్పళ జిల్లాలో కుతూహలకరమైన, చమత్కారం కలిగించే ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారి పొలంలో శివలింగం లభించింది. అందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ శివలింగానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే.శివకుమార్కు ఓ అపూర్వమైన, అరుదైన అవినాభావ సంబంధం ఉందన్న విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. కలలో కనిపించినట్లుగా పొలంలో శివలింగం లభించడంతో కొప్పళ జిల్లా ప్రజల క్షేమం కోసం ఈ అరుదైన లింగాన్ని సీఎం డీకే.శివకుమార్కు అప్పగించాలని సదరు వ్యాపారి సిద్ధమవుతున్నారు. అంతేగాక శివలింగం ప్రత్యక్షం అయిన స్థలంలో నాగుపాము కూడా ప్రత్యక్షం కావడం గమనార్హం. కలలో కనిపించిన మరుసటి రోజే కొప్పళ తాలూకా బసాపుర వద్ద ఉన్న వ్యాపారి వితీన్కుమార్కు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో తనకు దొరికే శివలింగాన్ని పరమ శివభక్తుడైన డీకే.శివకుమార్కు అప్పగించాలనే సదుద్దేశం కనిపించిందని చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కల వచ్చిన మరుసటి రోజు పొలంలో పని చేస్తున్న జడియప్ప అనే రైతుకు ఈ పవిత్ర శివలింగం ప్రత్యక్షం అయింది. శివలింగాన్ని సీఎంకు అప్పగించే యోచన అప్పటి నుంచి ఆ శివలింగాన్ని వ్యాపారి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. కలలో చెప్పినట్లుగానే వ్యాపారి వితీన్కుమార్ ఆ శివలింగాన్ని డీకే.శివకుమార్ ఇవ్వడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఈ విషయంలో భక్తి కంటే కొప్పళ జిల్లా ప్రజలు, రైతుల శ్రేయస్సు ఉందని చెబుతున్నారు. బసాపుర ప్రాంతంలో బల్డోటా ఫ్యాక్టరీ విస్తరణ పనులను అడ్డుకోవాలన్నది జిల్లా ప్రజల డిమాండ్. ఈ నేపథ్యంలో పర్యావరణం, రైతుల శ్రేయస్సు కోసం శివలింగాన్ని అడ్డుగా పెట్టుకొని సీఎంకు విజ్ఞప్తి చేయడానికి వితీన్కుమార్ సిద్ధమవుతున్నారు. మొత్తానికి కొత్త సీఎం చేతుల్లోకి చర్చనీయాంశమైన శివలింగం త్వరలో చేరనుందని, ఫలితంగా పర్యావరణం నుంచి కొప్పళ జిల్లా ప్రజలకు కాస్తయినా ఉపశమనం లభిస్తుందని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదే చోట కనిపించిన నాగుపాము కొప్పళ జిల్లాలో కుతూహలకర ఘటన -
బూడిదైన బార్– రెస్టారెంటు
ఎలా జరిగింది? ఇది ఆకస్మికంగా చెలరేగిన అగ్ని ప్రమాదం. కరెంటు వైర్ల నుంచి మంటలు పుట్టి వ్యాపించగా, గ్యాస్ సిలిండర్ పేలడంతో పరిస్థితి అదుపు తప్పింది. పైగా బార్ రెస్టారెంటులో మండే పదార్థాలతో తయారైన సోఫాలు, కుర్చీలు, చెక్క సామగ్రి ఉండడంతో మంటల ధాటికి అద్దు లేకుండా పోయింది. ఆ సమయంలో సుమారు 30 మంది కస్టమర్లు, 15 మంది దాకా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మహిళా సిబ్బంది పై అంతస్తు నుంచి కిందికి రాలేక హాహాకారాలు చేయసాగారు. ఈ దుర్ఘటనలో ప్రకాష్, షాహిన్ అనే వలస కార్మికులు దుర్మరణం చెందగా, బార్ యజమాని ప్రీతంతో సహా 10 మంది వరకూ సిబ్బంది, వినియోగదారులు గాయాల పాలయ్యారు. స్థానికులు పలువురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. బార్ బయట భారీగా జనం గుమిగూడారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పిన తరువాత మృతదేహాలను వెలికితీశారు. లోపల మొత్తం సామగ్రి బొగ్గుల మాదిరిగా మారింది. పెద్దమొత్తంలో ఆస్తినష్టం జరిగినట్లు అంచనా. పోలీసు, ఫైర్ ఉన్నతాధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘోర అగ్ని ప్రమాదం మైసూరుతో పాటు ఇతర నగరాల్లోని బార్– రెస్టారెంట్లు, పబ్బుల్లో సురక్షిత చర్యలపై అనుమానాలను రేకెత్తిస్తోంది.మైసూరు: అది మైసూరులోని దత్త గల్లిలోని ఫాక్స్ డెన్ లిక్కర్ గ్యారేజ్ పేరు గల బార్ అండ్ రెస్టారెంట్, పబ్ సముదాయం. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయం.. కస్టమర్లు మద్యం తాగుతూ మజాగా ఉన్నారు. సీ్త్ర, పురుష వెయిటర్లు సప్లై చేస్తూ ఉండగా సంగీతంతో వాతావరణం హుషారుగా ఉంది. ఇంతలోనే హఠాత్తుగా మంటలు, పొగ చుట్టుముట్టాయి. ఏమి జరుగుతోందో అర్థం కాక కస్టమర్లు, సిబ్బంది ప్రాణభయంతో తలో దిక్కుకు పరుగులు తీశారు. అయితే ఒకటి, రెండు అంతస్తుల్లోని వారు కిందకు రావడానికి మెట్ల వద్దకు వెళ్తే అక్కడ మంటలు చెలరేగుతున్నాయి. దీంతో పై నుంచి ఆర్తనాదాలు చేయసాగారు. మరికొందరు మొండిధైర్యంతో కిందకు దూకేశారు. మైసూరులో భారీ అగ్ని ప్రమాదం ఇద్దరు సిబ్బంది మృతి 10 మందికి గాయాలు -
మంత్రముగ్ధం.. నాట్య ప్రదర్శన
బనశంకరి: ఉద్యాననగరిలో భరతనాట్యం, కథక్ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మైమరిపించాయి. ఆదివారం సాయంత్రం రవీంద్ర కళాక్షేత్రలో భరతనాట్య ప్రదర్శనను దివ్య ప్రభాత్, దీక్షా జోషి, పాయల్, తాన్యా రక్తి కట్టించారు. దుర్గా వర్ణం, దుర్గా స్తుతి రూపకాలను ప్రదర్శించారు. ఆద్యా, అనన్య, స్వపాంతి కథక్ నృత్యంతో అలరించారు. లంచం... క్లర్కు అరెస్టుయశవంతపుర: గ్రూప్ ఇన్సూరెన్స్ చేయడానికి లంచం తీసుకుంటూ హావేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సహకార సంఘాల ఉప రిజిస్ట్రార్ ఆఫీసులో సీనియర్ క్లర్కు అక్కమ్మ బిరాదార్ లోకాయుక్తకు చిక్కింది. రైతులకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తానని చెప్పి ఆమె రూ.3 వేల లంచం తీసుకొంటుండగా లోకాయుక్త అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. డీఎస్పీ మధుసూదన్, సిబ్బంది పాల్గొన్నారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మొక్కలే ఆధారం గౌరిబిదనూరు: ప్రకృతి సమతుల్యానికి మనం విరివిగా మొక్కలు నాటి చెట్లయ్యే వరకూ పెంచి పోషించాలని వక్తలు తెలిపారు. సోమవారం తాలూకాలోని కాటనకల్లు గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పండ్ల నిచ్చే మొక్కలు, నీడనిచ్చే మొక్కలను వందకు పైగా నాటారు. దూరమవుతున్న మేఘాలను ఆకరించడానికి చెట్లు అవసరమన్నారు. విద్యార్థులు నిత్యం మొక్కలకు నీళ్ళు పోసి కాపాడాలని తెలిపారు. బ్యాంకు ఉద్యోగిని దుర్మరణం దొడ్డబళ్లాపురం: ట్రావెలర్ టెంపో వాహనం స్కూటర్ను ఢీకొన్న ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగిని చనిపోగా, మరో అమ్మాయి తీవ్రంగా గాయపడ్డ సంఘటన దొడ్డబళ్లాపురం అపెరల్ పార్కులో జరిగింది. కంటనకుంటకు చెందిన, తూబుగెరె గ్రామంలోని యూనియన్ బ్యాంక్లో పని చేసే అశ్విని (31) అక్కడే మృతి చెందగా సహన అనే యువతి తీవ్రంగా గాయపడింది. వీరిద్దరూ సోమవారం ఉదయం స్కూటర్పై అపెరల్ పార్కులోని శాంతి స్వీట్స్ ఫ్యాక్టరీ ముందు వెళ్తుండగా టీటీ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. దొడ్డ గ్రామీణ పోలీసులు టీటీ డ్రైవరుపై కేసు నమోదు చేశారు. అతి వేగం వల్ల ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
క్యాన్లకు డీజిల్ ఎందుకివ్వరు?
● రైతుల నిరసన చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురంలో కలెక్టర్ కార్యాలయం వద్ద భారత్ పెట్రోల్ బంక్లో రైతులు, డ్రైవర్లు నిరసనకు దిగారు. ట్రాక్టర్లు, టిల్లర్లను తీసుకువచ్చి బంక్ ముందు నిలబెట్టి ధర్నా చేశారు. వ్యవసాయ అవసరాల కోసం క్యాన్లను తీసుకువచ్చి డీజిల్ అడిగితే ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. రహదారి– 234 లో వాహనాలను అడ్డగించడంతో ఉద్రిక్తత నెలకొంది. బంక్ యజమాని సందీప్తో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చి వాహనాలను అడ్డు తీయాలని కోరినా రైతులు వినలేదు. పొలం పనుల్లో ఉండగా ట్రాక్టర్లకు డీజిల్ అయిపోతే క్యాన్లు తీసుకుని వస్తామని, కానీ డీజిల్ పోసేది లేదని చెబుతున్నారని ఆరోపించారు. చివరకు పోలీసులు రైతులకు నచ్చచెప్పి రోడ్డును ఖాళీ చేయించారు.బెళగావిలో హెల్మెట్ అభియాన్ దొడ్డబళ్లాపురం: హెల్మెట్ ధరించని బైకిస్టులకు పెట్రోల్ విక్రయించరాదని కోరుతూ బెళగావి సిటీ పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సే పెట్రోల్ బంకు యజమానులను లేఖ రాశారు. హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఎన్ని రూల్స్ పెట్టినా బైకిస్టులు పట్టించుకోవడం లేదని కమిషనర్ ఈ నిర్ణయానికి వచ్చారు. పోలీసుల సమాచారం ప్రకారం బెళగావిలో గత 10ఏళ్లలో హెల్మెట్ ధరించని కారణంగా 2,282 రోడ్డు ప్రమాదాలు జరగగా 358 మంది మృతిచెందారు. 1,492 మంది గాయపడ్డారు. సిటీలో వారం రోజులపాటు హెల్మెట్ జాగృతి అభియాన్ చేపట్టనున్నారు. సోమవారంనాడు ఈ అభియాన్లో ఐజీపీ సందీప్ పాటిల్ హెల్మెట్ ధరించి బైక్ నడిపారు. హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలన్నారు.వెనక్కి తగ్గిన అటవీ శాఖ● ఫుట్పాత్కు విముక్తి శివమొగ్గ: అటవీ శాఖ కార్యాలయ సిబ్బంది ఫుట్పాత్ని ఆక్రమించడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కొంత దూరంలో, ఆర్టీఓ కార్యాలయం పక్కనే ఉన్న కర్ణాటక అటవీ అభివృద్ధి సంస్థ ఫుట్పాత్ను ఆక్రమించింది. దానిపై పెద్ద బోర్డును పాతింది. దీని కారణంగా, పాదచారులు ఆ ప్రాంతంలో నడవలేకపోతున్నారు. ఈ సమస్యపై ప్రముఖ జర్నలిస్ట్ బి. రేణుకేష్ రాసిన వార్తలు ప్రజల్లో చర్చను రేకెత్తించాయి. ఆక్రమణను తొలగించాలని డిమాండ్ వచ్చింది. ట్రాఫిక్ పోలీసుల చర్యతో.. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దేవరాజ్, సిబ్బంది కలిసి ఆక్రమణ స్థలంలోని అటవీశాఖ బోర్డును తొలగించాలని నిర్ణయించారు. ఇది తెలిసి అటవీ సిబ్బందే ఆదివారం దానిని తొలగించినట్లు తెలిసింది. అటవీ సిబ్బందే కబ్జాలకు పాల్పడితే ఎలా అని జనం ప్రశ్నించారు. మంటల్లో గ్యాస్ గిడ్డంగి దొడ్డబళ్లాపురం: సిలిండర్ల గోడౌన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా సిలిండర్లు పేలిపోయి ఉవ్వెత్తున మంటలు లేచాయి. దావణగెరె తాలూకా హెచ్ కల్లహళ్లిలో శివారులో వక్క తోటలో శివకుమార్ అనే వ్యక్తి గోదాము ఉంది. మంటలు అంటుకుని 8 సిలిండర్లు పేలడంతో తీవ్రత అధికమైంది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిని దావణగెరె ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. రక్తదాతలకు సన్మానంచిక్కబళ్లాపురం: భారతీయ రెడ్ క్రాస్ సంస్థ సేవలు శ్లాఘనీయం అని జిల్లా కలెక్టర్ జి.ప్రభు అన్నారు. నగరంలోని అంబేడ్కర్ భవనంలో రెడ్ క్రాస్ ఏర్పాటు చేసిన విశ్వరక్తదాన దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1.06 లక్షల మంది నుంచి రక్తదానం చేయించడం గొప్ప విషయమని అభినందించారు. ప్రతి ప్రభుత్వ శాఖ సిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించాలని తాను సూచిస్తానన్నారు. ఎస్పీ కుశాల్ చౌక్సె మాట్లాడుతూ రక్తదాన శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ రక్తదాతలను సన్మానించారు. -
మైషుగర్లో అక్రమాల పర్వం
మండ్య: మైషుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆగడాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, టన్ను చెరకుకు రూ. 5 వేలు చెల్లించాలని రైతులు, సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సేవ్ మైషుగర్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల రైతు ప్రజా ఉద్యమం మొదటి దశ సోమవారం ప్రారంభమైంది. చిక్కమండ్యలో జరిగిన ర్యాలీలో కమిటీ నాయకులు మాట్లాడుతూ, మైషుగర్ ఫ్యాక్టరీని దొడ్డిదారిన ప్రైవేటీకరించారని ఆరోపించారు. ఫ్యాక్టరీ ఆదాయం ఆధారంగా టన్ను చెరకుకు రూ. 5,000 అందించడం సాధ్యమే. అయినప్పటికీ, అసమర్థ పరిపాలన, అవినీతి కారణంగా ఫ్యాక్టరీ యాజమాన్యం సకాలంలో చెరకును క్రషింగ్ చేయలేకపోయిందని దుయ్యబట్టారు. ప్రైవేట్ చక్కెర కర్మాగారాలు చెరకు రైతులను దోచుకుంటున్నాయన్నారు. స్థలాలు, వాహనాలతో పాటు ఫ్యాక్టరీలో అనేక రకాల అక్రమాలు జరుగుతున్నయని ఆరోపించారు. జిల్లా ప్రజాప్రతినిధుల మౌనం అనుమానాస్పదంగా ఉందని అన్నారు. రైతులు పాటలు పాడుతూ నిరసన తెలిపారు. ప్రముఖ రైతు నేతలు, అన్నదాతలు పాల్గొన్నారు. చెరకు రైతులను ఆదుకోవాలని ధర్నా -
లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా చిక్కిన ఎస్ఐ
బెంగళూరు: రాష్ట్రంలో అవినీతి అనేది ఉండరాదని నూతన సీఎం డీకే శివకుమార్ పిలుపునిచ్చిన కొన్ని గంటల్లోనే.. రాష్ట్ర పోలీసులు అందుకు భంగం కలిగించేలా ప్రవర్తించారు. పరాయి రాష్ట్రంలో లంచం తీసుకుంటూ అక్కడి ఏసీబీకి దొరికిపోవడంతో రాష్ట్ర పోలీసుల పరువు ప్రశ్నార్థకమైంది. రూ.2 లక్షలు ఇవ్వాలని.. వరకట్నం వేధింపుల కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి రాజస్థాన్కు వెళ్లిన బెంగళూరు హెచ్ఏఎల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ అనిత, హెడ్ కానిస్టేబుల్ ఉళవప్ప, కానిస్టేబుల్ యతీష్ అక్కడి ఏసీబీకి పట్టుబడ్డారు. హెచ్ఏఎల్ పీఎస్లో నమోదైన కట్నం వేధింపుల కేసులో నిందితుడు జైపూర్లో ఉన్నాడని తెలిసి అరెస్టు చేయడానికి వెళ్లారు. నిందితుని ఇంటికి వెళ్లి బేరసారాలు ప్రారంభించారు. తమకు రూ.2 లక్షల లంచం ఇస్తే, అరెస్టు చేయకుండా వెళ్లిపోతామని తెలిపారు. అంత మొత్తం ఇవ్వలేనని, కొంత ఇస్తానని చెప్పిన నిందితుడు, ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. ఓ లాడ్జిలో రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా స్థానిక ఏసీబీ అధికారులు అనిత, ఇతర పోలీసులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వీరి బాగోతం బెంగళూరు పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. -
పెళ్లైన ఆటో డ్రైవర్తో సహజీవనం.. చివరికి విషాదం..!
బెంగళూరు: యువతితో సహజీవనం చేస్తూ ఆమెను గొంతు నులిమి కడతేర్చిన ఆటో డ్రైవర్ ఉదంతం బ్యాడరహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. చిక్కగొల్లరహట్టి నివాసి చంద్రశేఖర్కు వివాహమై కుమారుడు ఉన్నాడు. ఇతను ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తిగరపాళ్యలో సెల్ఫోన్ షోరూమ్లో పనిచేస్తున్న మాగడి ప్రాంతానికి చెందిన భవానీ(22) అనే యువతి ఆటోలో ఎక్కిన సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో తిరగపాళ్యలోని అద్దె ఇంటిలో సహజీవనం చేస్తున్నాడు. అయితే చంద్రశేఖర్కు పెళ్లయ్యిందని తెలియడంతో అతన్ని దూరం పెట్టింది. మరో వైపు ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇకపై తనవద్దకు రావద్దని భవానీ చంద్రశేఖర్కు సూచించింది. దీంతో ఈ నెల 12న ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో చంద్రశేఖర్ ఆమెకు విషం తాపించి తానూ తాగాడు. అనంతరం భవానీ గొంతునులిమి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. అనంతరం తమ ఇద్దరి ఫొటోలను ఇన్స్టాలో అప్లోడ్ చేసి వివాహవార్షికోత్సవం అని పోస్ట్పెట్టాడు. గమనించిన భవాని కుటుంబసభ్యులు ఫోన్లో ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించగా స్పందన లేకపోయింది. అనుమానం వచ్చి తిగరపాళ్యలకు వెళ్లి చూడగా భవానీ మృతి చెందింది. పోలీసులు వచ్చి స్పృహలోలేని చంద్రశేఖర్ను ఆసుపత్రికి తరలించారు. -
కుక్కను తప్పించబోయి.. పోలీస్ దుర్మరణం
మైసూరు: వీధి కుక్క పోలీసు ప్రాణాలను బలిగొంది. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట పట్టణ శివార్లలో రోడ్డుపై ఉన్న కుక్కను ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో బైక్ కిందపడిపోగా కానిస్టేబుల్ మృతి చెందాడు. వివరాలు.. కానిస్టేబుల్ గణేష్ (31) స్వస్థలం నంజనగూడు తాలూకాలోని సిద్దయ్యనహుండి కాగా, గుండ్లుపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. సిద్దయ్యనహుండి నుంచి గుండ్లుపేటకు డ్యూటీకి బైక్లో వెళ్తున్నాడు. గుండ్లుపేట పట్టణ శివార్లలో ఒక కుక్కను ఢీకొట్టకుండా తప్పించుకునే ప్రయత్నంలో కిందపడి స్పహ కోల్పోయాడు. స్థానికులు అతడిని మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కానీ కొంతసేపటికే మరణించాడు.ఆరోగ్య యోగం మైసూరు: మైసూరులో యోగా ఇప్పుడు చాలా ప్రసిద్ధి చెందిందని గణపతి సచ్చిదానంద ఆశ్రమం దత్త విజయానంద తీర్థ స్వామి అన్నారు. త్వరలో రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాల సన్నాహాల్లో ఊటీ రోడ్డులో ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఆదివారం యోగా సాధనను నిర్వహించారు. ఈసారి యోగా దినోత్సవం రాష్ట్ర స్థాయిలో విజయవంతంగా జరగాలి, కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగా సాధనలో పాల్గొనాలని అన్నారు. సామూహిక యోగాభ్యాసం అందరి మధ్య సత్సంబంధాలను వృద్ధి చేస్తుందన్నారు. వయోభేదం లేకుండా ఆరోగ్యం, శారీరక చురుకుదనం కోసం ప్రతి ఒక్కరూ యోగాను అనుసరించాలని తెలిపారు. ఈ సందర్భంగా వందలాది మంది యోగాసనాలను ఆచరించారు. వేకువనే ప్రమాదం ● చింతామణి వద్ద లారీని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీ ● 10 మందికి గాయాలు చింతామణి: రోడ్డు పక్కన టైర్ పంక్చరై నిలిపి ఉన్న లారీని నెల్లూరు జిల్లా ఉదయగిరి డిపోకు చెందిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆదివారం తెల్లవారుజామున బెంగళూరుకు వెళ్తున్న బస్సుకు కర్ణాటకలో చింతామణి పట్టణం వద్ద మాడికెరె క్రాస్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. 23 మంది ప్రయాణికులతో బస్సు బెంగళూరుకు వెళ్తోంది. అయితే డ్రైవర్ నిద్రమత్తుకు గురికావడంతో నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. పెద్ద శబ్ధం, కుదుపు రావడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం ఘోరం జరిగిందోనని ఉలిక్కిపడ్డారు. బస్సు డ్రైవర్కు చిన్నపాటి గాయాలు తగిలాయి. ముగ్గురికి తీవ్రంగా, ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బెంగళూరు కెఆర్ పురంవాసి చెన్నకేశవ (45), నెల్లూరువాసి యాబు (42), నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలవాసి సునీల్ (29) అనేవారికి తీవ్రగాయాలయ్యాయి. చెన్నకేశవ, యాబు పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలించారు. సునీల్ చింతామణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రయాణికులను అదే మార్గంలో వెళ్తున్న కడప ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు పంపించారు. చింతామణి రూరల్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
బన్నేరుఘట్టలో గున్నల సందడి
బొమ్మనహళ్లి: బెంగళూరు బన్నేరుఘట్ట జూ పార్క్లో ఓ జీబ్రా, ఓ నీటి ఏనుగు పిల్లలకు జన్మనిచ్చాయి. కబిని అనే జీబ్రా ఆడ జీబ్రాకు జన్మనిచ్చింది. అలాగే దృశ్య అనే హిప్పో ఆడ పిల్లకు జన్మనిచ్చింది. రెండు పిల్లలూ ఆరోగ్యంగా ఉన్నాయని జూ సిబ్బంది తెలిపారు. ఇప్పుడు పార్కులోని జీబ్రాల సంఖ్య 11కి పెరిగిందని డైరెక్టర్ ఎ.వి.సూర్యసేన్ తెలిపారు. చీతాలు రెడీ అలాగే దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతాలు బన్నేరుఘట్ట వాతావరణానికి అలవాటు పడుతున్నాయి. గత వారం క్వారంటైన్ ముగియడంతో వాటిని ప్రజలు చూసేందుకు అందుబాటులో ఉంచారు. చీతాలు మన దేశంలో అంతరించిపోయాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్లోని కూనో అడవిలో, ఇక్కడ బన్నేరుఘట్టలో మాత్రమే ఉన్నాయి. జీబ్రా, హిప్పోకు పిల్లల జననం -
శ్రీశంకరులే స్ఫూర్తిప్రదాత
మైసూరు: శంకరాచార్యులు ఒక దైవ స్వరూపులు, ఆయన హిందూమతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు, అని ఎమ్మెల్సీ సి.ఎన్. మంజగౌడ అన్నారు. శ్రీ శంకరాచార్యుల జయంతిని ఆదివారం సందర్భంగా కర్ణాటక సేనా ఆధ్వర్యంలో నగరంలోని శృంగేరి శ్రీ శంకర మఠంలో ఘనంగా నిర్వహించారు. శంకరాచార్యులు హిందూమతానికి పునరుజ్జీవం పోసిన ఆచార్యులని అన్నారు. ఆయన చాలా చిన్న వయసులోనే దేశమంతటా పర్యటించారు. నేటి విద్యార్థులు ఆయనలాగే మేధావులైన తత్వవేత్తలుగా ఎదగాలి. వారు బాగా చదువుకుని, పురోగమించాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభావంత విద్యార్థులను సన్మానించారు. పెద్దసంఖ్యలో నగర ప్రముఖులు పాల్గొన్నారు. పిడుగు పడి రైతు బలి మైసూరు: జిల్లాలోని పిరియాపట్టణ తాలూకా, సంగరశెట్టహళ్లి గ్రామ శివార్లలో పిడుగుపాటుకు గురై ఒక రైతు మరణించాడు. ఎస్.టి.ఆనంద్ (60), పొలంలో పొగాకు పంటకు నీరు పెడుతుండగా, ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. ఆయన ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు. వెంటనే పెద్ద శబ్ధంతో చెట్టు మీద పిడుగు పడడంతో ఆనంద్ స్పృహ తప్పి పడిపోయాడు. గ్రామస్తులు అతడిని కె.ఆర్. నగర్లోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడు. ఆనంద్కు ఇద్దరు కుమారులు ఉన్నారు. శివమొగ్గలో రౌడీపై బుల్లెట్శివమొగ్గ: రౌడీషీటర్ నరసింహ హత్య కేసులో నిందితునిపై పోలీసులు కాల్పులు జరిపారు. హనుమంత్ అలియాస్ మధు (27), రౌడీషీటర్ నరసింహ హత్య కేసులో నిందితుడు. ఇటీవల అరెస్టు చేశారు, ఆదివారం తెల్లవారుజామున ఇన్స్పెక్టర్ హరీష్ పాటిల్ నేతృత్వంలో పోలీసులు శివమొగ్గ శివార్లలోని సుబ్బయ్య మెడికల్ కాలేజీ వెనుక ఉన్న డబుల్ రోడ్లోని హత్యాస్థలి పరిశీలనకు తీసుకువచ్చారు. ఈ సమయంలో అతడు బేడీలతో పోలీసులపై దాడి చేసి పరుగులు తీశాడు. దీంతో సీఐ కాల్పులు జరపగా మధు కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే పట్టుకుని ఆస్పత్రిలో చేర్చారు. భద్రావతి, శివమొగ్గ ప్రాంతాల్లో నేరాలు పెరగడంతో కఠిన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
మామిడికి మద్దతు ధర ప్రకటించాలి
శ్రీనివాసపురం: ధరలు తగ్గి తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. రూ.10 మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘం పదాదికారులు డిమాండ్ చేశారు. ఆదివారం ఏపీఎంసీ మార్కెట్లో సమావేశం నిర్వహించారు. సోమవారం శ్రీనివాసపురం మామిడి కాయల సమేతంగా రాష్ట్ర రహదారి రోజర్ పల్లి గేట్ వద్ద నుంచి రైతులు పెద్ద సంఖ్యలో కాలి నడకన బయలుదేరి కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతిఘటన నిర్వహించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నారాయణగౌడ మాట్లాడుతూ.. మామిడి పండ్లను అత్యధికంగా పండించే శ్రీనివాసపురంలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. దిగుబడి బాగున్నా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని తెలిపారు. మామిడి రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మామిడి ఉత్పాదనలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండగా.. మామిడి రైతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టనున్న ప్రతిఘటనకు మామిడి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర రైతు సంఘం నాయకుడు బంగావాది నాగరాజగౌడ, జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్ పాల్గొన్నారు. -
గ్యారంటీలతో ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది
బనశంకరి: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదివారం బెంగళూరు జయనగరలో వికసిత భారత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు. నరేంద్రమోదీ పాలనలో దేశం అన్ని విధాలా పురోగమిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్న ఆరోపణలపై ఆమె స్పందిస్తూ ఆ ఆరోపణలు సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ఇష్టానుసారం గ్యారంటీ పథకాలను అందించడంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. దేశంలో ఆర్థిక వినాశనం జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేసిన ఆరోపణలపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక పరిస్థితి బాగుందన్నారు. హార్ముజ్ జలసంధిలో నౌకల సంచారానికి సమస్య ఉంది. అధిక డబ్బు చెల్లించే దేశాలకు చమురు సరఫరా అవుతోందని, నౌకలకు బీమా ఉన్నప్పటికీ యుద్ధకాలంలో ఉపయోగం లేదని ఆమె తెలిపారు. ఇన్ని సవాళ్లు నెలకొన్నా, దేశంలో ఎల్పీజీ గ్యాస్కు కొరత లేదని, రాహుల్గాంధీకి ఇది తెలియడంలేదని మండిపడ్డారు. భారత జీడీపీ 7.7 శాతానికి చేరడం హర్షనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు విజయేంద్ర, తేజస్వి సూర్య తదితరులు ఉన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ -
బిడది టౌన్షిప్తో రైతులకు మోసం
మండ్య: బిడది టౌన్షిప్ పథకం ఒక ప్రభుత్వ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. ఇది పూర్తిగా డబ్బు దోచుకోవడానికి వేసిన పథకం అని కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆదివారం మండ్యలో విలేకరులతో మాట్లాడుతూ, బిడది టౌన్షిప్ దేశ ప్రయోజనాలకు మంచిది కాదు, దీనిని భూ మాఫియా, భూ దోపిడీదారులకు లబ్ధి చేకూర్చేలా రూపొందించారని అన్నారు. బ్రాండ్ బెంగళూరు అంటున్నారు, రోడ్లపై గుంతలు ఉన్నాయి, ట్రాఫిక్ కష్టంగా ఉంది, వాటిని సరిచేయకుండా బిడది రైతుల జీవితాలను తగలబెట్టడానికి వెళుతోందని సర్కారుపై మండిపడ్డారు. రైతుల భూములను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రైతులకు తాను అండగా నిలబడి న్యాయపోరాటం చేస్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఆర్కావతి సెటిల్మెంట్ కోసం సుమారు మూడు వేల ఎకరాల భూమిని నోటిఫై చేసిందని, ఆ తర్వాత వెయ్యి ఎకరాల భూమిని వదిలేసిందని విమర్శించారు. ప్రధాని, సీఎం ఏం మాట్లాడారో? బిడదిలో తోటలు ఉన్నాయి, పాడి పరిశ్రమ ఉంది, అలాంటి చోట టౌన్షిప్ వద్దని కుమార అన్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రధాని, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. వారు ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు, అయితే, రాష్ట్ర రైతుల ప్రయోజనాలను బలిపెట్టడానికి సీఎం ప్రధానమంత్రి పేరును దుర్వినియోగం చేయకూడదు అని చెప్పారు. అదో పెద్ద కుంభకోణం కేంద్రమంత్రి కుమారస్వామి -
ఉచిత తాగునీటి కేంద్రం ప్రారంభం
కోలారు: నగరంలోని కేఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాష్ట్ర త్రిచక్ర వాహన సంఘం ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి కేంద్రం, ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నగర సభ నోడల్ అధికారి నవీన్ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గల్ఫ్ యుద్ధం పరిణామంగా ఇంధన ధరలు పెరిగి ఆటో డ్రైవర్ల జీవనం కష్టంగా మారిందన్నారు. వంట గ్యాస్ ధరలు పెరగడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడకుండా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆటోడ్రైవర్లు స్వయం ప్రేరితంగా తాగునీటి యూనిట్ను ప్రారంభించి ఉచితంగా తాగునీటి వ్యవస్థ కల్పించడం సంతోషకరమన్నారు. అసంఘటిత కార్మిక పరిషత్ అధ్యక్షుడు కె.వి.సురేష్ కుమార్ మాట్లాడుతూ.. సుమారు 40 సంవత్సరాల పోరాట ఫలితంగా ప్రభుత్వ స్థాయిలో కర్ణాటక రాష్ట్ర వాణిజ్య వాహన డ్రైవర్ల సంక్షేమ మండలి ఏర్పాటైనట్లు వెల్లడించారు. రిజిష్టర్ అయిన ఆటో డ్రైవర్లకు సామాజిక భదతా పథకాలు అమలవుతున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డు పొందిన డ్రైవర్ల పిల్లల విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సౌలభ్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నగరసభ మాజీ సభ్యుడు డెకోరేషన్ కృష్ణ, ఎన్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ వైద్య సేవలందించాలి
రాయచూరు రూరల్: నగరంలోని రాగిమానుగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ప్రత్యేక ఆరోగ్య చికిత్స శిబిరాలను జాతీయ ఆరోగ్య అభియాన అధికారిణి నందిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో తరుచుగా వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. వైద్య శిబిరానికి దాదాపు 250 మంది హాజరయ్యారు. బీపీ, షుగర్, క్యాన్సర్, చికెన్గున్యా, మలేరియా, డెంగ్యూ, క్షయ తదితర వ్యాధులకు వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో వైద్యులు పుష్పలత, సరోజ, నితీష్, తాలూకా ఆరోగ్య అధికారి పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సేవలు అనన్యం రాయచూరు రూరల్: ఉద్యోగ విరమణ సహజమే. అయితే ఉద్యోగులు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు అభిప్రాయపడ్డారు. ఆదివారం నగరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన వెంకోబ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడు వెంకోబ విద్యార్థుల భవిష్యత్తుకు నిరంతరం శ్రమించారని తెలిపారు. కార్యక్రమంలో సిద్దరూడ మఠాధిపతి నిజానంద స్వామిజీ, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, వెంకోబ, అమరేష్, పాగుంటప్ప తదితరులు పాల్గొన్నారు. మొక్కలతో పర్యావరణ పరిరక్షణరాయచూరు రూరల్: నగరంలో పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చి విరివిరిగా మొక్కలు నాటాలని నవోదయ కళాశాల ప్రిన్సిపాల్ రాజాశంకర్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీరామలింగేశ్వర దేవాలయం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలతో పర్యావరణ పరిరక్షణ సాధ్యం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో విధిగా మొక్కలు నాటి పరిరక్షించాలని సూచించారు. పచ్చదనం పెంపొందిస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. రక్తదాన శిబిరంరాయచూరు రూరల్: రక్తదాన శిబిరాలు, రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత సూచించారు. ఆదివారం ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. రక్తదానంతో మరొకరి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అయ్యప్ప, దండెప్ప బిరదార్, తిమ్మప్ప, శారద తదితరులు పాల్గొన్నారు. గుట్కా సీజ్, ఇద్దరి అరెస్టు హోసూరు: బెంగళూరు నుంచి కోయంబత్తూరుకు ద్విచక్రవాహనంలో గుట్కా తరలిస్తున్న ఇద్దరిని సిఫ్కాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూజువాడి చెక్పోస్ట్ వద్ద బైక్ను అడ్డగించి తనిఖీ చేయగా రూ. 24 వేలు విలువ చేసే 36 కేజీల గుట్కా పట్టుబడింది. ద్విచక్రవాహనంతో పాటు, కోయంబత్తూరు సమీపంలోని నల్లంపాళ్యంకు చెందిన శివకుమార్ (33), లింగరాజ్ (26)ను అరెస్టు చేశారు. కూలీపై దుండగుల దాడి హోసూరు: బేరికె సమీపంలో భవన నిర్మాణ కార్మికునిపై కొందరు దాడి చేశారు. హోసూరు తాలూకా బేరికె మసీపంలోని తట్టనపల్లి గ్రామానికి చెందిన ఆర్ముగం (50) బేల్దారీ పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం కురుబరపల్లిలో పనికి వెళ్లాడు, మరుసటి రోజు ఓ మామిడి తోటలో తీవ్ర గాయాలతో పడి ఉండగా, స్థానిక ప్రజలు చూసి అతని భార్య పూంగొడికి తెలిపారు. ఆమె ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన భర్తను చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. పూంగొడి ఫిర్యాదు మేరకు బేరికె పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. -
దాసర నాగేనహళ్లి..నేరేడు తోటలకు కేరాఫ్
బళ్లారి తాలూకాలోని దాసర నాగేనహళ్లి నేరేడు పండ్ల తోటలకు పెట్టింది పేరు. ఈ గ్రామంలోని రైతుల తోటల్లో నేరేడు చెట్లు ఉన్నాయి. ప్రస్తుతం నేరేడు పండ్ల సీజన్ ప్రారంభం కావడంతో బాగా దిగుబడి వచ్చింది. వ్యాపారులు తక్కువ ధరకు నేరేడు కాయలను అడుగుతుండటంతో రైతులే నేరుగా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. కిలో నేరేడు పండ్లను రూ.100 నుంచి రూ.150 చొప్పున బహిరంగ మార్కెట్లో విక్రయించి ఆదాయం గడిస్తున్నారు. నేరేడు పండ్లలో విటమిన్లు సి, ఏ, ఐరన్, కాల్షియం, పొటాషియం, యూంటి ఆక్సిడెంట్లు, సమృద్ధిగా ఉంటాయి. మధుమేహం (షుగర్) వ్యాధిగ్రస్తులకు నేరేడు పండు దివ్య ఔపధంగా ఉపయోగపడుతుంది. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో ప్రజలు కూడా తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. – సాక్షి, బళ్లారి: -
కమనీయం.. రామ పట్టాభిషేకం
కోలారు: కోలారు నగరంలోని శృంగేరి శారదా మఠంలో శ్రీరామ పట్టాభిషేకం, రామ తారక హోమం ఆదివారం భక్తిశ్రద్ధలతో, రమణీయంగా జరిగాయి. గోపూజతో సీతారామ కళ్యాణోత్సవాన్ని ప్రారంభించారు. శ్రీరామచంద్రుల ఊరేగింపు, మహిళల కోలాట నృత్యం విశేషంగా ఆకట్టుకున్నాయి. సాయంత్రం నిర్వహించిన సీతారామ కళ్యాణోత్సవంలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకను కనులారా వీక్షించి తరించారు. మహా నీరాజనం అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరిగింది. సునీల్ శర్మ, అప్పణ్ణశాస్త్రి, సురేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
వీధి కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి గ్రామంలో వీధి కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. హగరిబొమ్మనహళ్లికి చెందిన రాజప్ప గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి పొలంలో ఏర్పాటు చేసిన కంచెలోకి గొర్రెలను తోలి, అక్కడే నిద్రించాడు. అయితే అర్ధరాత్రి తరువాత వీధి కుక్కలు కంచెలోకి చొరబడ్డాయి. గొర్రెలపై దాడి చేయడంతో సుమారు 30 వరకూ మృతి చెందాయి. కష్టపడి పెంచిన గొర్రెలు మృతి చెందడంతో రూ.లక్షల్లో నష్టం వాటిలినట్లు రాజప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. తగిన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరాడు. వీధి కుక్కలను దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు. అదృశ్యం కేసుల ఛేదింపుబళ్లారి అర్బన్: గత ఏడాది నమోదైన వివాహిత, బాలిక అదృశ్యం కేసులను పోలీసులు చేధించారు. తాలూకాలో కొళగల్లు గ్రామానికి చెందిన 21 సంవత్సరాల వివాహిత గత ఏడాది ఏప్రిల్ 24న అదృశ్యమైనట్లు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ చేపట్టిన బళ్లారి మహిళా పోలీసులు.. వివాహిత బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. వివాహితను తీసుకొచ్చి భర్తకు అప్పగించారు. మరో కేసులో బళ్లారి నగరంలోని రామాంజినేయ నగర్కు చెందిన ఓ మైనర్ బాలిక అపహరణకు గురైనట్లు గత ఏడాది నవంబర్ 4న మహిళా పోలీసు స్టేషన్లో నమోదైంది. ఈ కేసును కూడా చేధించిన పోలీసులు బాలికను రక్షించారు. 17న ప్రజా చైతన్య ర్యాలీబళ్లారి అర్బన్: ప్రత్యేక ఓటరు జాబితా (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా కర్ణాటక లౌకిక పార్టీలు, ప్రజా సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 17న నగరంలో ప్రజాచైతన్య ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎద్దేళ్లు కర్ణాటక నాయకుడు సిద్దన్న తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక పత్రికా భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 17న సాయంత్రం 6 గంటలకు స్థానిక మోతీ సర్కిల్ వద్ద బసవన్న విగ్రహం వద్ద ర్యాలీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మోతీ సర్కిల్, రాయల్ సర్కిల్ వద్దకు చేరుకుని గాంధీ భవన్లో బహిరంగ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఓట్లు తొలగించే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గాదెప్ప, మాజీ బుడా అధ్యక్షుడు హుమయూన్ ఖాన్, సంగనకల్లు విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నియామకం కోలారు: అఖిల భారత వీర శైవ లింగాయత మహాసభ జాతీయ యువ విభాగం కార్యదర్శిగా కోలారుకు చెందిన స్పందనా సురేష్ నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు ఈశ్వర ఖండ్రే ఆదేశాల ప్రకారం 14 మంది పదాదికారుల జాబితాను మహాసభ విడుదల చేసింది. కోలారులో డిజిటల్ మీడియా సంస్థ నిర్వహిస్తున్న స్పందన సురేష్ నియమితులు కావడంపై పలువురు హర్షం వ్యక్తంచేశారు. డీఐజీపీ పుట్టిన రోజు కోలారు: తాలూకాలోని కరోరగండనహళ్లి కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయలో డీఐజీపీ దేవరాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు విశేష పూజలు జరిపారు. తరువాత బృహత్ కేక్ను కత్తిరించారు. ఈ కార్యక్రమంలో డిఐజిసి దేవరాజ్ పాల్గొన్నారు. వందలాది అభిమానులు ఆయనకు అభినందలు తెలిపారు. మాజీ ఎంపీ ఎస్ మునిస్వామి, కోముల్ డైరెక్టర్ చలువనహళ్లి నాగరాజ్, జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు జి సురేష్బాబు, కెయస్ గణేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. గంగమ్మ ఆలయంలో పూజలు కెజీఎఫ్: నగరంలోని గణేష పురంలో ఉన్న గంగమ్మ, దుర్గా దేవి దేవాలయంలో ఎంపీ ఎం.మల్లేష్ బాబు ఆదివారం విశేష పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అమ్మవార్లను దర్శించుకుంటే పశ్రాంతంగా ఉంటుందని తెలిపారు. 25 సంవత్సరాలుగా గంగమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకోవడం సంతోషించదగిన విషయమని కొనియాడారు. దేవాలయ అభివృద్ధికి సమితి సభ్యులు, ధర్మకర్తలు శ్రమిస్తున్నారని తెలిపారు. సర్వీస్ రోడ్డును తెరవాలి కెజీఎఫ్: రైతుల బండిదోవను (సర్వీస్ రోడ్డు) మూసివేసిన చైన్నె ఎక్స్ప్రెస్ హేవే ప్రాధికార అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తాలూకాలోని క్యాసంబళ్లి ఫిర్కా వెంగసంద్ర గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని ఎక్స్ప్రెస్ హైవే పై ఉన్న సుందరపాళ్య టోల్గేట్ వద్ద ప్రతిఘటన నిర్వహించారు. బేతమంగల సిఐ జగదీష్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు వెంకటాచలపతి మాట్లాడుతూ.. జాతీయ యోజనా ప్రాధికార అధికారులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి తక్షణమే మధ్య ప్రవేశం చేసి పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలన్నారు. రైతుల హితవును దృష్టిలో ఉంచుకుని మూసి వేసిన సర్వీస్ రోడ్డును తెరవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సుందరపాళ్య టోల్గేట్ వద్ద నిరంతరం ప్రతిఘటన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐ త్యాగరాజ్, రైతులు అప్పాజిగౌడ, న్యాయవాది సుబ్రమణి తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు పెరుగుతున్న ఆదరణ
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో అంగన్వాడీలకు ఆదరణ పెరుగుతోంది. ఎల్కేజీ, యూకేజీలో చిన్నారులను చేర్పించేందుకు తలిదండ్రులు ఉత్సాహం చూపుతున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 200 అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. గ్రామీణ ప్రాంతాల్లో విశేష స్పందన లభిస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు, డొనేషన్లు చెల్లించే ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లాలో రాయచూరులో 96, లింగసుగూరు 232, మాన్వి 181, సిరవార 164, సింధనూరు 211, తుర్విహాళ్ 183, లింగసుగూరు–మస్కి పరిధిలో 441, దేవదుర్గలో 419 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సొంత భవనాలు ఉండి ఎంపిక చేసిన 200 కేంద్రాల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. అందుబాటులో బోధన సామగ్రి ప్రస్తుతం రాయచూరు పరిధిలోని 32 కేంద్రాల్లో 313 మంది, లింగసుగూరు తాలూకాలోని 8 కేంద్రాల్లో 195 మంది, మాన్వి తాలూకాలోని 20 కేంద్రాల్లో 556 మంది, సిరవార తాలూకాలోని 15 కేంద్రాల్లో 395 మంది, సింధనూరు తాలూకాలోని 20 కేంద్రాల్లో 592 మంది, తుర్విహాళ్ తాలూకాలోని 25 కేంద్రాల్లో 457 మంది, లింగసుగూరు–మస్కి తాలూకాలోని 40 కేంద్రాల్లో 792 మంది, దేవదుర్గ తాలూకాలోని 40 కేంద్రాల్లో 753 మంది చిన్నారులు ఎల్కేజీ, యూకేజీ తరగతుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యా పరికరాలు, ఆట బొమ్మలు, బోధన సామగ్రి అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలు పంపాం.. రాబోవు విద్యా సంవత్సరం (2027–28) నుంచి మరో 300 అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం స్పందించి తరగతుల ప్రారంభానికి అనుమతి లభిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మరింత మంది చిన్నారులకు ప్రాథమిక విద్య అందుబాటులోకి రానుంది. – శరణమ్మ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి ఎల్కేజీ, యూకేజీలో చిన్నారులను చేర్పించేందుకు తల్లిదండ్రుల ఆసక్తి గణనీయంగా పెరిగిన విద్యార్థుల సంఖ్య -
కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోండి
కోలారు: తాలూకాలోని నరసాపురం ఫిర్కా లక్ష్మీసాగర చెరువు మరువకు అడ్డంగా నిర్మించిన బ్రిడ్జి భారీ వర్షానికి కొట్టుకుని పోయింది. ఆదివారం ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మల్సీ ఎం.ఎల్.అనిల్ కుమార్ మరువ ప్రదేశాన్ని పరిశీలించారు. పనులు నాసిరకంగా చేయడం వల్ల ఇలా జరిగిందని ఇంజినీర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జి పక్కన రిటైనింగ్ వాల్ కూలి పోవడంపై మండిపడ్డారు. మరువ నీటికి మట్టి పూర్తిగా కొట్టుకు పోవడంతో కూలిందని అధికారులు చెప్పగా.. ఇంజినీర్ సమర్థనను ఎమ్మెల్యే మంజునాథ్ తోసిపుచ్చారు. ఇంత పెద్ద ప్రమాణంలో మట్టి కొట్టుకు పోతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. బ్రిడ్జి నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధ్యతా రహితంగా పనులు చేసిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. ఇకపై ఇలా జరిగితే అధికారులనే బాధ్యులను చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా త్వరగా మరమ్మత్తులు చేయాలన్నారు. కార్యక్రమంలో కోముల్ డైరెక్టర్ చంజిమలై రమేష్, డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఖాజికల్లహళ్లి మునిరాజు పాల్గొన్నారు. -
పొంచి ఉన్న డెంగీ ముప్పు
బనశంకరి: వర్షాకాలంలో డెంగీ జ్వరం పొంచి ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జీబీఏ ప్రధాన ఆరోగ్యాధికారి డాక్టర్ మదని తెలిపారు. ప్రతి వర్షాకాలంలో బెంగళూరు, చుట్టుపక్కల ప్రాణాంతక డెంగీ జ్వరాలు విస్తరిస్తాయి. ఈడీస్ ఈజిప్టె అనే దోమలు కుట్టడంతో డెంగీ జ్వరం సోకుతుంది. ఈ దోమలు నిలిచి ఉన్న నీటిలో జీవిస్తూ, పగటి సమయంలో కుట్టడం వల్ల డెంగీ సోకుతుందని తెలిపారు. డెంగీ లక్షణాలు ఇలా తీవ్రమైన జ్వరం, విపరీతమైన తలనొప్పి, కంటినొప్పి, కండరాలు నొప్పులు డెంగీ ప్రధాన లక్షణాలు. వాంతులు, విరేచనాలు కూడా కనిపిస్తాయి. డెంగీ తీవ్రస్థాయిలోకి చేరుకున్న సమయంలో నోరు, ముక్కు నుంచి రక్తస్రావమయ్యే ప్రమాదం ఉంది. పరిశుభ్రత ప్రధానం డెంగీ నియంత్రణకు ఇంటి చుట్టుపక్కల ప్రదేశాల్లో నీరునిల్వకుండా చూసుకోవాలి. సిమెంటు తొట్టెలు, డ్రమ్ములు, గొట్టాలు, టైర్లు, చిప్పలు పూలకుండీలు, తట్టలు, గుంతలు తదితరాలలో నీరు నిలవకుండా, దోమలు పెరగకుండా చూసుకోవాలి. అటువంటి స్థలాలను శుభ్రం చేయాలని సూచించారు. ఇళ్లలో దోమతెరలు, కాయిల్స్ తదితరాల ద్వారా దోమ కాటు నుంచి రక్షించుకోవాలని సూచించారు. ఎలాంటి జ్వరలక్షణాలు కనబడిన తక్షణం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి , పాలికే ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకోవాలని తెలిపారు. ప్రతి వర్షాకాలంలో బెంగళూరుకు తలనొప్పి -
బిడది టౌన్షిప్ అవసరం
ఎరువుల కొరత రానీయొద్దు రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ మొదలైందని, రసాయనిక ఎరువులు, విత్తనాల కొరత రాకుండా జాగ్రత్తలు వహించాలని సీఎం శివ తెలిపారు. ఎరువుల విషయంలో శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండగా జాగ్రత్తలు వహించాలని చెప్పారు. రాష్ట్రంలో కొన్ని జలాశయాల్లో నీటి కొరత నెలకొంది. అందుచేత తాగునీరు సమస్య కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. బనశంకరి: కేంద్రమంత్రి హెచ్డీ.కుమారస్వామి మార్గదర్శనం ప్రకారం బిడది టౌన్షిప్ పథకాన్ని కొనసాగిస్తామని సీఎం డీకే.శివకుమార్ తెలిపారు. బిడది టౌన్షిప్ గురించి ఢిల్లీలో ప్రధాని మోదీకి వివరించానని, ఆయన సమ్మతం తెలిపారని అన్నారు. బెంగళూరుపై జనం ఒత్తిడి అధికంగా ఉందని, అందుకే టౌన్షిప్ కావాలన్నారు. అవినీతి ఉండకూడదు కర్ణాటక అవినీతి రహితం కావాలని, ఎవరూ రూపాయి కూడా లంచం ఇవ్వకూడదనేది తన ఆశయమని తెలిపారు. మేము తప్పుగా చెప్పినప్పటికీ, మీరు అలా చేయరాదని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. అధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకురాకూడని తెలిపారు. ప్రతికార్యాలయంలో అధికారుల పేరు, ఫోన్ నంబరుతో బోర్డు ఏర్పాటుచేయాలన్నారు. లంచం అడిగితే ఈ నంబరుకు ఫిర్యాదు చేయాలనే వ్యవస్థను తీసుకు వస్తానన్నారు. ఒకేసారి అవినీతి నిర్మూలన సాధ్యం కాదని, ప్రయత్నిస్తూ ఉండాలని తెలిపారు. ఆ లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేయాలి గృహ లక్ష్మీ, గృహ జ్యోతి పథకాల అర్హులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సీఎం డీకే.శివకుమార్ తెలిపారు. సమీప కార్యాలయాల్లో దరఖాస్తులను అందించాలన్నారు. ఉదయం 10 గంటలకు అధికారులు ఆఫీసులకు హాజరు కావాలన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రారంభమౌతుందని, ఓటు కాపాడుకోవడానికి దరఖాస్తు నింపి, బీఎల్ఓలకు ఇవ్వాలని చెప్పారు. -
భర్తకు విషం ఎక్కించి... భార్య ఘాతుకం
దొడ్డబళ్లాపురం: బెళగావి జిల్లా చిక్కోడి పట్టణంలో కలకలం రేపిన మాజీ జవాన్ సందీప్ మంజరగి (45) హత్య కేసులో నిందితుడు పుండలీక దొంబర్ సెల్ఫీ వీడియోలో నిజం ఒప్పుకున్నాడు. రిటైర్డు ఆర్మీ జవాన్ సందీప్ మంజరగి పేరున రూ.2 కోట్లు ఇన్సూరెన్స్ ఉండగా, భర్తను అడ్డు తొలగించి ఆ డబ్బును కొట్టేయడంతో పాటు ప్రియునిగా ఉండిపోవచ్చని సందీప్ భార్య కథ నడిపించినట్లు తెలిసి బంధుమిత్రులు, స్థానికులు నిర్ఘాంతపోయారు. సందీప్ భార్య సుమ (40), ప్రియుడు పుండలీక (26)ను యమకనమరడి, చిక్కోడి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనైతిక సంబంధాల కారణంగా జరుగుతున్న జీవిత భాగస్వాముల హత్యలకు ఈ ఘటన మరోసారి దారుణ ఉదాహరణగా నిలిచింది. వివరాలు.. మార్చి 13న సందీప్, తన వద్ద పనిచేసే పుండలీకతో కలిసి బైక్పై జాతరకు వెళ్లి వస్తుండగా యమకనమరడి ఠాణా పరిధిలో ఘటప్రభ వద్ద ప్రమాదం జరిగి, సందీప్ ఓ మోస్తరుగా గాయపడ్డాడు. పుండలీక్కు చిన్న చిన్న గాయాలయ్యాయి. సందీప్ చిక్కోడిలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 15న చనిపోయాడు. పెద్ద గాయాలేవీ లేకున్నా ఎలా చనిపోయాడని బంధువులు అనుమానపడ్డారు. సుమ ప్రవర్తనపై అనుమానం వచ్చిన సందీప్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి, సుమపై నిఘా పెట్టారు. అనుమానం బలపడడంతో సుమను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రియుడు పుండలీక శనివారం సెల్ఫీని విడుదల చేశాడు. సుమ, తాను ఈ హత్యకు కారణమని పేర్కొన్నాడు.ప్రియుడు పుండలీక సెల్ఫీ వీడియోసైలెన్లోకి విషపు సూది గుచ్చి... బెళగావిలో మిస్టరీ వీడిన రిటైర్డు ఆర్మీ జవాన్ హత్య కేసు మహిళ, ఆమె ప్రియుని అరెస్టు నిందితుడు ఏం చెప్పాడు? సుమ తనను ప్రేమిస్తున్నానని చెప్పి ట్రాప్ చేసిందని, సందీప్ని సాగనంపి నీ ఇద్దరు పిల్లలు, నా ఇద్దరు పిల్లలు సంతోషంగా జీవిద్దామని చెప్పిందని, ఆ తరువాత ఆమె ప్లాన్ చేసి సందీప్ని చంపిందని పుండలీక సెల్ఫీలో చెప్పాడు. మరోవైపు పోలీసులు పూడ్చిపెట్టిన సందీప్ శవాన్ని వెలికితీసి రీ పోస్టుమార్టం జరపడంతో పాటు ఫోరెన్సిక్ పరీక్షల కోసం నమూనాలను సేకరించే పనిలో ఉన్నారు. భర్తను పాశవికంగా చంపిన సుమను, ఆమె ప్రియున్ని కఠినంగా శిక్షించాలని సందీప్ కుటుంబీకులు, బంధుమిత్రులు డిమాండ్ చేశారు.అనైతిక బంధం ఏర్పడి... సందీప్ ఆర్మీ నుంచి రిటైరయ్యాక ఓ హోటల్ను పెట్టాడు, అందులో పనికి పుండలీకను నియమించుకున్నాడు. ఈ సమయంలో సుమతో పుండలీకకు అక్రమ సంబంధం ఏర్పడింది. తమకు అడ్డుగా ఉన్న సందీప్ను హతమార్చాలని అనుకునేవారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా జరిగిన బైక్ ప్రమాదంలో సందీప్ గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అతని మీద రూ.2 కోట్ల బీమా పాలసీ ఉండడం, తమ ఆనందానికి అడ్డుగా నిలిచాడని భార్య సుమ కుట్రను రచించింది. మార్చి 15న సిరెంజిలో పురుగుల మందును తీసుకుని దానిని భర్తకు ఎక్కిస్తున్న గ్లూకోజ్ సీసాలోకి నింపింది. కొంతసేపటికి చనిపోయాడు. తరువాత అంత్యక్రియలను పూర్తి చేశారు. -
బాలలకు బ్యాగుల పంపిణీ
బనశంకరి: బెంగళూరులో తెలుగు పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని పలువురు కోరారు. యలహంకలోని శ్రీ నీలకంఠేశ్వర ప్రాథమికోన్నత పాఠశాలలో శంకర్, సుష్మ దంపతులు, విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, మిఠాయిలు అందజేశారు. జీ.సుబ్రమణ్యం, వరదరాజు, హెచ్ఎం రెడ్డి రాణి పాల్గొన్నారు.బిడది రైతులతో కలిసి పోరాడుతా: కుమార దొడ్డబళ్లాపురం: రామనగర తాలూకా బిడదిలో టౌన్షిప్ నిర్మాణం కోసం కాంగ్రెస్ సర్కారు పట్టుదలతో ఉండగా, ప్రతిపక్షాలు, రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. టౌన్షిప్కు తమ భూములు తీసుకోరాదంటూ పోరాటం చేస్తున్న రైతులకు కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి మద్దతు పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన బిడది టౌన్షిప్ కాంగ్రెస్ వారి పాలిట లూటీ స్కామ్గా మారిందన్నారు. బిడది టౌన్షిప్ డీకే శివకుమార్ కల కాదని, అది నా కల అని చెప్పారు. అయితే నా ఉద్దేశంలో టౌన్షిప్ నిర్మాణం వేరేగా ఉందని, కాంగ్రెస్ వారికి మాత్రం రియల్ ఎస్టేట్ దందా అన్నారు. డీకే శివకుమార్కి రైతులపై ఏ మాత్రం కనికరం లేదన్నారు. ప్రతీ పనికి ముందు సీఎం డీకే శివకుమార్ అజ్జయ్య స్వామి వద్ద కు వెళ్తారని, రైతులకు అన్యాయం చేయమని అజ్జయ్య చెప్పాడా అని ప్రశ్నించారు. టౌన్షిప్కి వ్యతిరేకంగా రైతులతో కలిసి తాను, జేడీఎస్ పోరాటం చేస్తామని తెలిపారు. చిన్నారి కూతుళ్లను చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం మైసూరు: ఎంత కష్టం వచ్చిందో కానీ ఆ తల్లి కిరాతకురాలిగా మారింది. మైసూరు జిల్లాలోని సాలిగ్రామ తాలూకా, జవరేగౌడ కొప్పలు గ్రామంలో ఒక మహిళ ఇద్దరు చిన్నారి కుమార్తెలకు ఉరి వేసి హత్య చేసి, తాను ఆత్మహత్యాయత్నం చేసింది. అనిల్ కుమార్ భార్య ప్రియాంక (26), కూతుళ్లు ద్యుతి (3), దిశ (18 నెలలు). అనిల్, ప్రియాంకకు ఆరేళ్ల కిందట పెళ్లయింది. భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె పిల్లల గొంతుకు తాడు బిగించి ప్రాణాలు తీసింది. ఆపై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కొంతసేపటికి స్థానికులు గమనించి ఆమెను మైసూరులోని ఒక ఆసుపత్రిలో చేర్చారు, ఆమె ప్రాణాలతో పోరాడుతోంది. పిల్లల మృతదేహాలను కృష్ణరాజ నగర ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఇంట్లో గొడవలే కారణం కావచ్చని అనుమానాలున్నాయి. సాలిగ్రామ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. రెండు ప్రమాదాల్లో ముగ్గురి మృతి బనశంకరి: బెంగళూరులోని మైసూరు రోడ్డులో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. శుక్రవారం అర్ధరాత్రి , శనివారం తెల్లవారుజామున ప్రమాదాలు జరిగాయి. కెంగేరి ఆర్ఆర్.డెంటల్ కాలేజీ వద్ద అతుల్, గౌరీశంకర్ అనేవారు బైక్లో మైసూరు నుంచి బెంగళూరుకు వస్తూ ఘటనాస్థలిలో రోడ్డు డివైడరును ఢీకొనడంతో తీవ్ర గాయాలై చనిపోయారు. వీరిద్దరూ నర్సింగ్ విద్యార్థులని తెలిసింది. కెంగేరి వద్ద రెండు ద్విచక్రవాహనాలను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని సుఖదేవ్ (45) అనే వ్యక్తి చనిపోగా, ద్విచక్రవాహనాలలోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కెంగేరి ట్రాపిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
పిల్ల పులి కోసం గాలింపు
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా ముళ్లయ్యనగిరి ప్రాంతంలో వల చుట్టుకున్న ఓ పులి పిల్ల తిరుగాడుతోంది. పరిసర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండగా అటవీశాఖ అధికారులు తెలిపారు. అడవిలోని సీసీ కెమెరాల ద్వారా పులి చిత్రాలు లభించాయి. పులి నడుం వరకు వల చిక్కుకుంది. గాయాలైన ఆ పులిని నాలుగైదు రోజుల కింద అటవీ సిబ్బంది గుర్తించారు. అది జింకను కూడా వేటాడి తిన్నది. దానిని బంధించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. పండరవళ్లి, కొళగామె, ఏళునూరుఖాన్ గ్రామాల్లో గుబులు నెలకొంది. -
ఫీజు గొడవ.. విద్యార్థిని బలవన్మరణం
యశవంతపుర: కాలేజీలో ఫీజు కట్టడానికి తండ్రి ఇచ్చిన డబ్బులను తెలిసిన వ్యక్తికి ఇచ్చింది, తరువాత అతడు ఇవ్వకపోవడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరకన్నడ జిల్లా భట్కళ తాలూకా బెళకె గ్రామంలో జరిగింది. భట్కళలో బీసీఎ చదువుతున్న గాయత్రి (20)కి ఫీజు కట్టడానికి తండ్రి నాగరాజు నాయక రూ.10 వేలు ఇచ్చాడు. ఆమె తన స్నేహితుడు సంతోష నాయకకు ఆ డబ్బు ఇచ్చింది. ఫీజు కట్టే సమయం వచ్చింది, తిరిగి ఇవ్వాలని కోరగా సంతోష తన వద్ద లేవని చెప్పాడు. ఫీజు కట్టలేకపోవడంతో హాల్ టికెట్ మంజూరు కాలేదు. ఇది ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుందని భయపడిన ఆమె బావిలోకి దూకి ప్రాణాలు తీసుకుంది. భట్కళ గ్రామాంతర పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఊపిరి వదిలి.. ప్రాణాలు నిలిపి
● యువ రైతు అవయవదానం మండ్య: బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స ఫలించక కోమాలోకి వెళ్లిన యువ రైతు అవయవాలను దానం చేయడం ద్వారా మృతుని తల్లిదండ్రులు మానవత్వం ప్రదర్శించారు. వివరాలు.. తాలూకాలోని క్యాతఘట్ట గ్రామానికి చెందిన గిరి గౌడ అలియాస్ రంజిత్ (32) ఈ నెల 11న బైక్పై వెళుతుండగా ఆలభోజనహళ్లి వద్ద మరో స్కూటరిస్టు వేగంగా ఢీకొన్నాడు. గిరి గౌడ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని మైసూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే బ్రెయిన్డెడ్లోకి చేరుకున్న గిరి గౌడ చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు తేల్చారు. అవయవాలను దానం చేయాలని వైద్యులు కోరగా, అంత దుఃఖంలోనూ తల్లిదండ్రులు అంగీకరించారు. విధివిధానాలను పూర్తి చేసి అతని అవయవాలను తీసుకున్న తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం మధ్యాహ్నం గ్రామంలో గిరి గౌడ అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా కుటుంబ సభ్యుల మానవతను గ్రామస్తులు ప్రశంసించారు. రైతన్న ఉగ్రరూపం ● పరిహారం ఇవ్వలేదని దాడి దొడ్డబళ్లాపురం: ముంపునకు గురైన భూమికి పరిహారం ఇవ్వకుండా సతాయిస్తుండడంతో అన్నదాత ఉగ్రరూపం దాల్చాడు. విసిగిపోయిన బాధితుడు బీటీడీఏ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన సంఘటన బాగలకోటలోని నవనగరలో ఉన్న బాగలకోట టౌన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో జరిగింది. సఫాయి కర్మచారులకు ఇళ్లస్థలాలు పంపిణీ చేయాలని దళిత సంఘర్ష సమితి ఆధ్వర్యంలో బీటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సమయంలో వారితో పాటు లోపలకు వెళ్లిన రైతు బసప్ప దొడ్డమని తనకు ఎందుకు పరిహారం ఇవ్వడం లేదంటూ హఠాత్తుగా చెప్పు తీసుకుని ఓ ఉద్యోగిని చితకబాదాడు. ఈ చర్యతో అందరూ అవాక్కయ్యారు. తరువాత మాట్లాడిన రైతు బసప్ప గత నాలుగేళ్లుగా ముంపునకు గురైన తన భూమికి కావాలనే పరిహారం ఇవ్వడం లేదని వాపోయాడు. గుంతను తప్పించబోయి.. మహిళ దుర్మరణం బనశంకరి: బెంగళూరులో గుంతల రోడ్ల సమస్య వర్షాలకు మరింత తీవ్రరూపం దాల్చింది. నీళ్లు నిలిచి గుంతలు కనబడక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. శనివారం ఉదయం మారతహళ్లిలో స్కూటర్లో కుమార్తెను కాలేజీకి తీసుకెళుతుండగా జరిగిన ప్రమాదంలో నల్లూరహళ్లి నివాసి కాంత (42) అనే మహిళ దుర్మరణం చెందింది. వివరాలు.. ఉదయం 7:45 సమయంలో కాంత, కూతురు నేహను కాలేజీలో వదిలిపెట్టడానికి స్కూటర్లో వర్తూరు నుంచి మారతహళ్లికి బయలుదేరింది. సిద్దాపుర మీనాక్షీ లేఔట్ వద్ద రోడ్డు గుంత ఉండగా, కాంతా స్కూటర్ ను పక్కకు తిప్పడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన పాఠశాల బస్ ఢీకొట్టి ఆమె మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాంత అక్కడే మరణించింది, నేహకు స్వల్ప గాయాలయ్యాయి. వైట్ఫీల్డ్ ట్రాఫిక్ పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వానికి తరలించారు. కళ్ల ముందే కన్న తల్లి చనిపోవడంతో కుమార్తె బోరున విలపించింది. -
ఛాయారత్న అవార్డు ప్రదానం
బళ్లారిటౌన్: నగరానికి చెందిన ఫోటోగ్రాఫర్ బీఎం రుద్రముని స్వామికి కర్ణాటక ఛాయారత్న అవార్డు లభించింది. కర్ణాటక వీడియో, ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్, రాష్ట్ర పత్రికా ఫోటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ స్థాయి ఫోటో, వీడియో ప్రదర్శనలో తనను అవార్డుతో సన్మానించినట్లు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు హెచ్వీ.కృష్ణప్ప, కార్యదర్శి జగదీష్, కే.దేవరాజు పాల్గొన్నట్లు తెలిపారు. విద్యుదాఘాతంతో ఆవు, దూడ బలి బళ్లారిటౌన్: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో తెగి పడిన విద్యుత్ తీగలను ఆవు, దూడ తాకడంతో ఉన్న ఫళంగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుడు పోతురాజుకు చెందిన ఓ ఆవు, దూడ ఆ పరిసరాల్లో మేత మేయడానికి వెళ్లి తెగి పడిన విద్యుత్ తీగలను తాకి అక్కడే విలవిలా కొట్టుకొని చనిపోయాయి. కాగా తెగి పడిన విద్యుత్ వైర్ల మరమ్మతులపై కేపీటీసీఎల్ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. శనివారం గ్రామ ప్రముఖులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దృష్టికి తేవడంతో అధికారులు హుటాహుటిన వచ్చి పరిశీలించారు. ఈ ప్రాంతంలో బ్రాందీ షాపుతో పాటు వివిధ పాఠశాలలకు వెళ్లే వాహనాలు నిత్యం భారీ సంఖ్యలో తిరుగుతుంటాయని, అధికారులు ఈవైపు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. అతిగా ఎనర్జీ డ్రింక్ తాగి యువకుడు మృతిరాయచూరు రూరల్: ఇటీవలి రోజుల్లో యువకులు ఎనర్జీ, కూల్డ్రింక్లను తాగడం అధికమైంది. రసాయన పదార్థాలతో తయారు చేసిన కిరాణ దుకాణాల్లో విక్రయిస్తున్న ఓ ఎనర్జీ డ్రింక్ను అతిగా తాగిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఎనర్జీ డ్రింక్ను అతిగా తాగడం అలవాటు చేసుకున్న యాదగిరి జిల్లా సురపుర తాలూకా నారాయణపురకు చెందిన బాలప్ప(18) అనే యువకుడు కిడ్నీ వ్యాధికి గురయ్యాడు. అనారోగ్యం బారిన పడిన అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించాడు. దీనిని సహించలేక కుటుంబ సభ్యులు దుకాణాల్లో ఉన్న ఆ ఎనర్జీ డ్రింక్ సీసాలను ధ్వంసం చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ బళ్లారిటౌన్: నగర శివార్లలోని 34వ వార్డు పరిధిలోని బత్రి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మాజీ మేయర్ ఎం.రాజేశ్వరి ఉచిత పాఠ్యపుస్తకాలు, లేఖన సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఎం.సుబ్బరాయుడు, యోగానందరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు తదితరులు పాల్గొన్నారు. హాస్టళ్లను కొనసాగించరూరాయచూరు రూరల్: నగరంలో వెనుక బడిన వర్గాల సంక్షేమ(బీసీఎం) శాఖ ఆధీనంలోని హాస్టళ్లను యథాప్రకారం కొనసాగించాలని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. శనివారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బసవరాజ్ మాట్లాడారు. గతంలో ఉన్న విద్యార్థులను వేరే చోటికి బదిలీ చేయడం వల్ల అడ్డంకులు ఎదురవుతాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి విద్యాభ్యాసానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హాస్టళ్లను కొనసాగించేలా చూడాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
జైలు క్వార్టర్స్లో జైలర్ ఆత్మహత్య
హుబ్లీ: సస్పెండ్కు గురైన జైలర్ జైలు క్వార్టర్లలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ధార్వాడ కొత్త బస్టాండ్ సమీపంలోని జైలు క్వార్టర్స్లో శుక్రవారం సిద్దరామప్ప వడ్డర్(37) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన గత రెండు నెలల నుంచి సస్పెన్షన్కు గురై మైసూరు జైలుకు బదిలీ అయ్యారు. అయితే ఇప్పటి వరకు డ్యూటీకి రిపోర్టు చేసుకోలేదు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు నెలల క్రితం విధి నిర్వహణలో లోపం కారణంగా ఆయనను సస్పెండ్ చేశారు. భార్య, ఇద్దరు పిల్లలు పొరుగూరికి వెళ్లిన సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన తిరిగి వచ్చి కన్నీరు మున్నీరయ్యారు. ధార్వాడ ఉపనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భయంతోనే బలవన్మరణం ఉన్నతాధికారులు తనపై చర్య తీసుకుని జైలుకు పంపుతారన్న భయంతో తన భర్త సిద్దరామప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య లక్ష్మి తెలిపింది. సస్పెండ్ చేసి మైసూరుకు బదిలీ చేయడంతో మైసూరుకు డ్యూటీకి హాజరు కావడానికి వెళ్లారు. అయితే తల్లిదండ్రుల ముఖాలను చూసి వెళతానని చెప్పి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె వాపోయారు. తరచూ తనను జైలుకు పంపుతారనే భయంతోనే ఆయన ఉండేవారని ఆమె తెలిపారు. పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ శాఖా పరమైన చర్యల కారణంగా రెండు నెలల క్రితం సస్పెండ్ చేశాం. పాలనాత్మక కారణాలతో ఆయన్ను మైసూరుకు బదిలీ చేశాం. ఆయన స్వస్థలం గదగ్ జిల్లా అని, కుటుంబ సభ్యులు ఇచ్చే ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఘటనా స్థలాన్ని పోలీసులు కుటుంబ సభ్యుల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించారు. -
వస్తున్నాయ్.. భారీ వర్షాలు
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో పలు జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో తీవ్రంగా, బెంగళూరు– రూరల్, మండ్య, మైసూరు, చామరాజనగర ,రామనగర, కోలారు, చిక్కబళ్లాపుర, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి, విజయనగర తదితర జిల్లాల్లోనూ వర్షాలు కురవవచ్చు. ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. బెంగళూరులో వానలతో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. యాణ పర్యాటక కేంద్రం బంద్ యశవంతపుర: ఉత్తర కన్నడ జిల్లాలో జోరువానలు కురుస్తున్నాయి. దీనితో యాణ పర్యాటక కేంద్రానికి టూరిస్టులు వెళ్లకుండా కట్టడి చేశారు. కారవారలో ఉరుములు–మెరుపులతో వానలు పడుతున్నాయి. కుమటా తాలూకాలో ప్రసిద్ధ టూరిస్టు స్పాట్ యాణకు రోడ్లను బంద్ చేశారు. భూమి కంపించవచ్చని, కొండచరియలు విరిగిపడవచ్చని చెబుతున్నారు. చండికా నది కాలువ పోటెత్తింది. వాతావరణ శాఖ హెచ్చరిక -
భగవాన్పై కేసుల పరంపర
సాక్షి,బళ్లారి: ప్రముఖ రచయిత, హేతువాది, ఆలోచనాకారుడు కే.ఎస్.భగవాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హరిహర పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన శ్రీరాముడి పుట్టుకకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భగవాన్ మాట్లాడుతూ శ్రీరాముడు దశరథ మహారాజు పుత్రుడు కాదని, వాల్మీకి రామాయణంలో కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పుత్రకామేష్టి యాగానికి సంబంధించిన విషయాలను ఉదహరిస్తూ తన వాదనను సమర్ధించుకున్నారు. అంతేకాకుండా రామాయణంలో కొన్ని సంఘటనలు ప్రస్తావిస్తూ రాముడి పాత్రపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖలు చేయడంతో భక్తులు మండిపడుతున్నారు. భగవాన్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, రామ భక్తులు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తూ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. వార్లల్లో నిలవడానికి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కే.ఎస్.భగవాన్పైఽ ధార్వాడ, బెంగళూరు తదితర ప్రాంతాల్లో కేసులు కూడా నమోదు చేశారు. శ్రీరామసేవ వ్యవస్థాపకులు ప్రమోద్ ముతాలిక్ తదితర ప్రముఖులు ఆయనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దశరథ మహారాజు పుత్రుడు శ్రీరాముడు కాదు శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యల ఫలితంగా రచయితపై ఆగ్రహ జ్వాలలు భక్తుల మండిపాటు, పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు -
చినుకు పడితే చిత్తడే.!
నీరు నిలిచిన రోడ్డు ముందు కేవీటీనగర్ వాసులు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చేరిన వాన నీరు ఏపీఎంసీలో బురదలోనే ఆకుకూరల విక్రయం సాక్షి,బళ్లారి: నగర వాసులకు కూరగాయలు, ఆకుకూరలు తదితర నిత్యావసరాలు అందించే, నిత్యం పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు జరిగే ఏపీఎంసీ యార్డు మరింత అధ్వాన్నంగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ రైతులు, వ్యాపారులు, వినియోగదారులు నరకయాతన అనుభవిస్తారు. బళ్లారి జిల్లాతో పాటు చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద ఎత్తున కూరగాయలను ఇక్కడ తీసుకుని వచ్చి అమ్మకాలు సాగిస్తుంటారు. కూరగాయలతో పాటు ఆయా సీజన్లలో పండే పండ్లను కూడా ఇక్కడకు తీసుకు వచ్చి రైతులు నేరుగా విక్రయిస్తారు. జిల్లాతో పాటు పొరుగున ఉన్న చిత్రదుర్గ, విజయనగర, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి కూరగాయలను విక్రయిస్తుంటారు. బురదలోనే కూరగాయల అమ్మకాలు పెద్ద స్థాయిలో వ్యాపార లావాదేవీలు జరిగే ఏపీఎంసీ మార్కెట్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో పలు రోడ్లు బురదమయంగా మారాయి. వర్షాకాలంలో రైతులు, వ్యాపారులు బురదలోనే కూరగాయలను విక్రయిస్తుండటం సర్వసాధారణంగా మారింది. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి శనివారం ఉదయం బురదనీటిలోనే కూరగాయలు, పండ్లు విక్రయించడం కనిపించింది. దీంతో వినియోగదారులు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక అధికారులు, పాలకులకు ఎన్నిసార్లు తమ సమస్యలను చెప్పినా పట్టించుకోవడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే నగరంలో పలు కాలనీలు నీటి గుంటలు, చెరువుల్లా మారడం పరిపాటి అయింది. దీంతో ఆయా కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో రోడ్లు జలమయం ఈ ఏడాది వర్షాకాలం మొదలైనప్పటి నుంచి వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నగరంలో బీభత్సంగా వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. అనంతపురం రోడ్డులోని కేవీటీ నగర్ సెకండ్ క్రాస్ మళ్లీ జలమయంగా మారింది. గత 15 రోజుల నుంచి ఈ కాలనీ వాసులు వాననీటిలోనే తిరుగుతున్నారు. ఇలా ఈ ఒక్క కాలనీ బురద, వాన నీటిలో ఉందనుకుంటే పొరపాటు. నగరంలో ఎన్నో రోడ్లు, లోతట్లు ప్రాంతాలు నీట మునుగుతాయి. చివరకు ప్రభుత్వ కార్యాలయాలు కూడా చెరువులను తలపిస్తున్నాయంటే అధికారులు, పాలకులు పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కురిసిన భారీ వర్షం వల్ల తహసీల్దార్ కార్యాలయం ఆవరణ చెరువును తలపిస్తోంది. ఈ కార్యాలయం ఆవరణలో పోలీసు స్టేషన్, వ్యవసాయ శాఖ కార్యాలయంతో పాటు వీఏఓ, ఆర్ఐ తదితర అధికారుల కార్యాలయాల ఆవరణలు కూడా వర్షం వస్తే చెరువులను తలపిస్తున్నాయి. వర్షాకాలంలో జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని నగర వాసులు కోరుతున్నారు. అస్తవ్యస్తంగా ఏపీఎంసీ యార్డు వినియోగదారులకు నరకయాతన -
ఎన్వైకి మంత్రి పదవి ఇవ్వాలి
హొసపేటె: గతసారి కూడ్లిగి నియోజకవర్గం నుంచి, ఈసారి మొళకాల్మూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్వై గోపాలకృష్ణ ఇప్పటి వరకు మొత్తం 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్లో ఎన్వై గోపాలకృష్ణకు చోటు కల్పించాలని కూడ్లిగి తాలూకాకు చెందిన ఎన్వైజీ అభిమాన సంఘం కేపీసీసీని, ఏఐసీసీని డిమాండ్ చేసింది. ఆయన కూడ్లిగి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉండి తాలూకా పరిపాలన భవనంతో పాటు అనేక రోడ్లు, పాఠశాలలను నిర్మించారు. కూడ్లిగి నియోజకవర్గంలో రూ.680 కోట్ల గ్రాంటుతో 74 చెరువులకు శాశ్వత పరిష్కారం చూపిన గోపాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని కూడ్లిగి ఎన్వైజీ అభిమానుల సంఘం ఒత్తిడి చేసింది. పార్టీ నేతలు ప్రకాష్, బళ్లారి జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు గుండుముణుగు తిప్పేస్వామి, జేడీఎస్ కొట్టూరు ఎంఎంజే హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. గైర్హాజరు పీడీఓలకు నోటీసులు జారీ రాయచూరు రూరల్: ప్రభుత్వ విధులు నిర్వహించాల్సిన అధికారులు ఇళ్లలో కూర్చొని బయోమెట్రిక్లో హాజరు వేస్తున్న అంశం జిల్లా స్థాయి అధికారుల దృష్టికి వచ్చింది. ఏకంగా 105 మంది గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీఓలు) విధులకు గైర్హాజరైన విషయం యాదగిరి జెడ్పీ సీఈఓ లవీష్ ఒడెయర్ పరిశీలనలో వెలుగు చూసింది. ఈనేపథ్యంలో వారందరికీ నోటీసులు జారీ చేశారు. గత ఏడాది రాయచూరు జిల్లాలో పంచాయతీ నిధులు దుర్వినియోగపరిచిన పీడీఓలను విధుల నుంచి సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు విదితమే. 50 మోటార్ సైకిళ్లు స్వాధీనం ● ఐదుగురు నిందితుల అరెస్ట్ రాయచూరు రూరల్ : జిల్లాలోని బళగానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన 50 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మస్కికి చెందిన చెన్నబసవ, రాఘవేంద్ర, గిండి రఘు, మెహబూబ్, మహ్మద్లాల్, రఫీక్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.35.20 లక్షల విలువైన బైక్లను జప్తు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్, ఎస్ఐ ఎరియప్ప తదితరులు పాల్గొన్నారు. 16 నుంచి కృత్రిమ అవయవాల శిబిరం హొసపేటె: కొప్పళ నగరంలోని ముస్లిం షాదీ మహాల్లో ఈనెల 16 నుంచి 18 వరకు ఉచిత జైపూర్ కృత్రిమ కాళ్ల జోడింపు శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఎంఎస్పీఎల్ సంస్థ సామాజిక సేవా విభాగం ఉపాధ్యక్షుడు హెచ్కే.రమేష్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయనగర, బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లోని దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిబిరంలో శిబిరార్థులకు ఉచిత భోజనం, వసతి, కృత్రిమ అవయవాలు అందిస్తారని ఆయన అన్నారు. ఆ శిబిరం లబ్ధి పొందాలని ఆయన కోరారు. కంపెనీ సీఎస్ఆర్ విభాగం సీఈఓ అశ్విన్కుమార్, కంపెనీ ఎండీ బీఎం నాగరాజ్, కృష్ణ పాల్గొన్నారు. బాల కార్మికత పారదోలదాంరాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో బాల కార్మికతను పారదోలదామని కన్నడ సాహిత్య ప్రాధికార కార్యదర్శి దండెప్ప బిరాదార్ పిలుపునిచ్చారు. శనివారం తాలూకాలోని ఉడుంగల్ ఖానాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాల కార్మిక నియంత్రణపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలలపై అధికంగా పని ఒత్తిడి పడుతుందని, దాని నివారణకు ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. వీరేష్, సన్నిధి, సుశ్మిత, శ్రేయ, అఖిల్లున్నారు. వీధి కుక్కల బెడద అరికట్టండిరాయచూరు రూరల్: నగరంలో వీధి కుక్కల బెడద అరికట్టాలని కరవే డిమాండ్ చేసింది. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఖలీల్పాషా మాట్లాడారు. ఇటీవల పలు కాలనీల్లో వీధుల్లో సంచరించే కుక్కలు కరిచి పలువురు ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారన్నారు. వీధి కుక్కలకు సంతాన హరణ చికిత్సలు చేయాలన్నారు. గంగా నివాస్ వద్ద ఐదుగురు బాలలను కుక్కలు కరిచాయని గుర్తు చేశారు. వాటిని పట్టి నగరం నుంచి వెలుపలకు దూరంగా తరలించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. నెట్టికంటుడికి బళ్లారి భక్తుడు రూ.1.50 లక్షల విరాళంగుంతకల్లు రూరల్: తన తండ్రి హనుమప్ప జ్ఞాపకార్థం కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన గుర్రప్ప కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి రూ.1.50 లక్షల విరాళాన్ని శనివారం అందజేశారు. దాత కుటుంబ సభ్యుల పేరిట ఆలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
సమస్యలు తీర్చాలని ధర్నా
రాయచూరు రూరల్: దేశానికి బంగారాన్ని ఉత్పత్తి చేసే హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. శనివారం హట్టి బంగారు గనుల కంపెనీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లా సంచాలకుడు చంద్రశేఖర్ మాట్లాడారు. వేతన ఒప్పందం, ఆహార కిట్ల పంపిణీ, హెచ్ఆర్ఏ, ఎక్స్గ్రేషియా, 2025–26వ సంవత్సర బకాయి వేతనాలు చెల్లించాలని, రిటైర్డ్ పథకాన్ని జారీ చేయాలని కోరుతూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు. అర గంటసేపు రాస్తారోకో నిర్వహించారు. వెంకోబ గౌస్, జమదగ్ని, రమేష్, బాబు, హనుమంతు, మునీర్, సాగర్, సంగయ్య, రాజేశ్వరి, వెంకటేష్లున్నారు. -
ప్రభుత్వ స్థలాల కబ్జాపై ఉక్కుపాదం
సాక్షి,బళ్లారి: నగరంలో గత కొన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన బడా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేసిన నేపథ్యంలో ఆక్రమణల తొలగింపుపై అధికారులు గట్టి చర్యలు చేపడుతున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ రెండూ దొందూ దొందే అన్న చందంగా రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు తాము అఽధికారంలో ఉన్నాం కదా, తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ప్రభుత్వ స్థలాలను ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేసి, ఏకంగా ఇళ్ల స్థలాలను కూడా విక్రయించిన మహానుభావులు ఉండటంతో అలాంటి వాటిని గుర్తించి అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కబ్జాల ఖాళీపై జనం ప్రశంసలు కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాలను గుర్తించి రెవెన్యూ, పోలీసు, సర్వే శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం మూకుమ్మడిగా దాడి చేసి కబ్జాలను తొలగిస్తుండటంతో అధికారులపై జనం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆక్రమణలను తొలగించిన జిల్లా యంత్రాంగం తాజాగా శనివారం నగర శివార్లలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రభుత్వ పొరంబోకు భూమిని ఆక్రమించుకుని కాంపౌండ్ వాల్ నిర్మించుకుని, ఫాం హౌస్ కట్టించుకుని దర్జాగా కాలం గడుపుతున్న తరుణంలో అధికారులు మూకుమ్మడిగా దాడి చేశారు. రెవెన్యూ, పోలీసు, సర్వే అధికారులు జేసీబీలు, ట్రాక్టర్లతో వెళ్లి ఆక్రమణలు ఖాళీ చేశారు. కబ్జాలపై మెరుపు దాడులు నగర శివార్లలోని ఆలదహళ్లి సర్వే నంబర్ 38–ఏ లో 3.28 ఎకరాల స్థలం ఆక్రమించుకుని అందులో కాంపౌండ్ వాల్ నిర్మించుకుని తన స్వాధీనంలో ఉంచుకుని అనుభవిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో అధికారులు సమగ్ర తనిఖీ చేపట్టి ఆక్రమణలు తొలగించారు. ఏడీసీ మహమ్మద్ జుబేర, డీడీఎల్ఆర్ ప్రమోద్, ఏడీఎల్ఆర్ బళ్లారప్ప, తహసీల్దార్, ఆర్ఐలు, వీఏఓ నరేంద్ర తదితరులు మెరుపుదాడి చేసి ఆక్రమణలు తొలగించి ఆ స్థలంలో ఇది ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టారు. ఈ భూమిని ఎవరూ ఆక్రమించుకునేందుకు వీలు లేదంటూ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసు కూడా పెట్టారు. ఈ ఘటనతో నగరంలో ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పుట్టింది. కొనసాగుతున్న పకడ్బందీ చర్యలు కార్యాచరణలో పాల్గొన్న అధికారులు -
ఒకే ఒక్క తప్పుతో అథఃపాతాళానికి..
సాక్షి, బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే యువకుని హత్య శాండల్వుడ్లో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. రాష్ట్రమే కాదు, దేశమంతటా వార్తలకెక్కింది. చాలెజింగ్ స్టార్గా లక్షలాది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు దర్శన్ ఈ హత్య కేసులో జైలు పాలయి గురువారంతో రెండేళ్లు పూర్తి అయింది. ఆయన కెరీర్ అగమ్యగోచరమైంది.2024, జూన్ 11న మైసూరులోని ఒక హోటల్లో ఉండగా దర్శన్ను, ఆయన సన్నిహితులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో అనేకానేక మలుపులు తీసుకుంటూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మధ్యలోనే ఒక్కసారి బెయిల్ మీద బయటకు వచ్చిన దర్శన్ ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ను రద్దు చేయడంతో మళ్లీ బెంగళూరు పరప్పన సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. అన్నీ మిస్.. మిస్ బెయిలు మధ్యలో దర్శన్ తన ప్రతిష్టాత్మక ‘ది డెవిల్’ సినిమా షూటింగ్ పూర్తి చేసినప్పటికీ ఆ సినిమా విడుదల సమయంలో కటకటాల్లోనే ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది తన 49వ పుట్టినరోజు, 23వ పెళ్లి రోజును కూడా అభిమానులు, కుటుంబ సభ్యులతో జరుపుకోలేకపోయారు.దర్శన్ జీవితంలో చీకటిదినం 2024, జూన్ 9 నటుడు దర్శన్ పాలిట ఒక చీకటి రోజు.. బెంగళూరు సుమ్మనహళ్లి రాజకాలువలో రేణుకాస్వామి శవం లభ్యం అయింది. ఈ కేసులో దర్శన్ పేరు వినిపించడంతో పోలీసులు జూన్ 11న అరెస్టు చేశారు. జూన్ 7న కిడ్నాప్ అయిన రేణుకాస్వామి రెండు రోజుల తర్వాత రాజకాలువలో శవమై కనిపించాడు. దర్శన్ స్నేహితురాలు, నటి పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యంగా సందేశాలు పంపించాడనే కారణంతో దర్శన్ అనుచరులు చిత్రదుర్గ నుంచి అతన్ని బెంగళూరుకు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి హత్య చేశారన్నది అభియోగం. తరచూ మలుపులు ఈ కేసు నిరంతరం మలుపులు తిరుగుతూనే ఉంది. బెంగళూరు జైలులో దర్శన్కు రాచ మర్యాదలు కల్పిస్తున్నారని కొన్నాళ్లు బళ్లారి జైలుకు తరలించారు. కొన్ని నెలల తర్వాత వైద్య సేవల కారణంతో బెయిల్ పొందారు. దర్శన్ బెయిల్ను రద్దు చేయాలని పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిలు రద్దయింది. గత ఏడాది ఆగస్టు నుంచి మళ్లీ దర్శన్ జైలు పక్షి అయ్యారు. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన దర్శన్కు తీవ్ర నిరాశే మిగిలింది. దర్శన్, పవిత్రతో పాటు 7 మంది నిందితులు కారాగారంలోనే ఉండగా, అభిమానులు విచారంలో మునిగారు. -
ధర్మస్థళ కేసులో సంచలనం.. ప్రకాష్ రాజ్ పేరు చెప్పిన చిన్నయ్య!
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన చిన్నయ్య జూన్ 11న కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరును ప్రస్తావించారు.ధర్మస్థళ కేసులో తాము చెప్పినట్లుగా వాంగ్మూలాలు ఇవ్వాలని పలువురు తనను ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. వారిలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నారని ఆరోపించారు. గిరీష్ మట్టన్నవర ద్వారా ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడి, జూన్ 29న కలుస్తానని చెప్పారని చిన్నయ్య పేర్కొన్నారు.పిటిషన్లో ధర్మస్థళపై ప్రచారం కోసం రూ.200 కోట్లు కేటాయించారని ఆరోపించారు. మహేష్ శెట్టి తిమరోడి తనకు సహకరిస్తే రూ.50 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని చిన్నయ్య పేర్కొన్నారు. అలాగే, ఈ కుట్రకు కావలసిన నిధులు కేరళ నుంచి వచ్చాయని, చిత్రదుర్గకు చెందిన రామ నాగరాజ్ కూడా ఆర్థిక సహాయం అందించారని ఆరోపించారు.చిన్నయ్య తన భార్య ఖాతాకు జరిగిన బ్యాంకు ట్రాన్సాక్షన్లు, నగదు చెల్లింపుల వివరాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఈ కుట్రకు భాగస్వాములైన మహేష్ శెట్టి తిమరోడి, గిరీష్ మట్టన్నవర, విఠల్ గౌడ, జయంత్ అని ఆయన ఆరోపించారు. వీరి పేర్లు వెల్లడించినప్పటికీ సిట్ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని చిన్నయ్య ఫిర్యాదు చేశారు. చిన్నయ్య దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు స్వీకరించింది. ధర్మస్థళ కేసు వివరాలు కోరింది. తదుపరి కేసు విచారణను జూన్ 29కి వాయిదా వేసింది.ఈ కేసులో తన పేరు ప్రస్తావన రావడంపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. ‘ధర్మస్థళ అంశం కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ముడిపడి ఉంది. ప్రస్తుతం నేను చాలా దూరంలో ఉన్నాను. మరో రెండు రోజుల్లో నేనే స్వయంగా వచ్చి మీడియా ఎదుట స్పందిస్తాను. అప్పటి వరకు నా మీద వస్తున్న కల్పిత కథనాలు, జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని’ అని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. Actor and film director Prakash Raj tweets, "Greetings to all.. In the media… On social networks, some news regarding me about the Dharmasthala case has come to my attention being discussed. Since this is an extremely sensitive matter.. and one that has hurt the faith of… pic.twitter.com/YYpoVB5UfR— IANS (@ians_india) June 12, 2026 -
ప్రియుడి ఘరానా మోసం.. అప్పటికే కన్నతల్లి ఘాతుకం!
కట్టుకున్న భర్తను, కన్నబిడ్డలను వదిలి ప్రియుడితో కొత్త జీవితం ప్రారంభించాలని భావించిన ఓ మహిళ.. చివరకు ఊహించని రీతిలో జైలు పాలైంది. తన సహజీవనానికి అడ్డుగా ఉందనే అనుమానంతో ఆరేళ్ల చిన్నారిని హత్య చేయడమే కాదు.. ప్రియుడి మాయమాటలకు నమ్మి జీవితాన్నే నాశనం చేసుకుంది. బెంగళూరులో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంక దంపతులకు 2007లో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రవీణ్ విద్యాసంస్థ నిర్వహిస్తుండగా, ప్రియాంక న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2025 చివర్లో కుటుంబానికి చెందిన 25 ఎకరాల భూమి వివాదానికి సంబంధించిన కేసు పనిమీద బెంగళూరు వెళ్లిన ప్రియాంక.. కాలేజీ రోజుల స్నేహితుడు, ఒకప్పుడు ప్రేమించిన మోహన్ను మళ్లీ కలిసింది.తాను రూ.1,000 కోట్ల ఆస్తులున్న రియల్ ఎస్టేట్ వ్యాపారినని మోహన్ నమ్మబలికాడు. అంత ఆస్తి ఉందని చెప్పడంతో ఆమె అతనికి ఆకర్షితురాలైంది. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. బెంగళూరు నుంచి తిరిగొచ్చిన తర్వాత భర్త ప్రవీణ్పై విడాకుల కోసం ఒత్తిడి తెచ్చిన ప్రియాంక.. చివరకు ఇంటిని విడిచి వెళ్లిపోయింది.విడిపోయిన తర్వాత పెద్ద కుమార్తె తండ్రి వద్ద ఉండగా, చిన్నారి వెన్నెల మాత్రం ప్రియాంకతో కలిసి బెంగళూరులోని సీగేహళ్లిలో అద్దె విల్లాలో నివసిస్తోంది. ఈ క్రమంలో మార్చి 24న వెన్నెల పుట్టినరోజు వేడుకలు జరిపిన ప్రియాంక.. బిర్యానీ, ఐస్క్రీం తినిపించిన తర్వాత చిన్నారిని కారులోనే వదిలేసి ప్రియుడు మోహన్తో కలిసి కాఫీ షాప్కు వెళ్లినట్లు చెప్పింది. మరుసటి రోజు వెన్నెల నిద్రలేవకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.అనారోగ్యంతో చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులకు చెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే బిడ్డ మృతిపై అనుమానంతో ప్రవీణ్ పోస్ట్మార్టం నివేదికను పరిశీలించాడు. ఆ నివేదికను విదేశాల్లో పనిచేస్తున్న తన డాక్టర్ సోదరికి చూపించగా, అందులో అనేక లోపాలు ఉన్నాయని ఆమె గుర్తించింది. దీంతో ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు.దర్యాప్తులో వెన్నెలది సహజ మరణం కాదని, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తమ భవిష్యత్తుకు చిన్నారి అడ్డుగా మారిందనే కారణంతో ప్రియాంక, మోహన్ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మోహన్ను అరెస్టు చేశారు. అయితే అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రియాంకను గురువారం హాసన్లో అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రియాంక, మోహన్లు కాశీలో రహస్యంగా వివాహం చేసుకున్నారట. ఆ తర్వాత దుబాయ్లో నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకున్నారని తెలుస్తోంది. వెన్నెల కేసు దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడింది. తాను కోటీశ్వరుడినని చెప్పిన మోహన్ వాస్తవానికి పెద్ద వ్యాపారి కాదని, అద్దె ఇళ్ల బ్రోకర్గా పనిచేస్తున్నాడని తేలింది. అతని మాటలు నమ్మి కుటుంబాన్ని వదిలేసిన ప్రియాంక.. చివరకు కన్నకూతురి హత్య కేసులో నిందితురాలిగా కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. -
పోలీసులూ.. నేరగాళ్లతో కలవద్దు
బనశంకరి: రౌడీలు, నేరగాళ్లతో, నేరాల చరిత్ర కలిగినవారితో సంబంధాలు కలిగి ఉండటం, సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నట్లు కనబడితే అలాంటి పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని నూతన హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే హెచ్చరించారు. గురువారం బెంగళూరు పోలీస్ కమిషనరేట్లో పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్ సమస్యల నివారణ గురించి తీసుకుంటున్న చర్యలుపై చర్చించారు. పార్టీలు, సెల్ఫీలు ఏమిటి? సమావేశం తరువాత విలేకరులతో ప్రియాంక్ఖర్గే మాట్లాడారు. ప్రతి పోలీస్ స్టేషన్లో రౌడీ నియంత్రణ దళం ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. కిందిస్థాయి పోలీసులు రౌడీల బర్త్ డేలలో పాల్గొనడం, పార్టీలు, విందులు చేసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం లాంటివి చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవన్నారు. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని సౌకర్యాల కల్పన, లోపాల పరిష్కారం ద్వారా సరిదిద్దాలని తీర్మానించామని తెలిపారు. దీని కోసం పలు సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్పై బెంగళూరు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఐటీ కేంద్రం కావడంతో ఇక్కడ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని హోంమంత్రి తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు హోంశాఖ, ఐటీ బీటీ, ఈ–పాలన శాఖలతో కలిపి సమగ్ర విధానం తీసుకువస్తామని తెలిపారు. డ్రగ్స్ ముఠాలపై హోంశాఖ ఉక్కుపాదం మోపుతుందని, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అయ్యే డ్రగ్స్, మత్తు పదార్థాలను కనిపెట్టడానికి సరిహద్దుల్లో టెస్టింగ్లను పెంచుతామని తెలిపారు. నగరంలో విదేశీ పౌరులు చట్టవ్యతిరేకంగా నివసిస్తుంటే బహిష్కరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని, కేంద్ర విదేశాంగ శాఖతో చర్చిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఫిర్యాదులు చేస్తే కేసు నమోదు చేయకపోవడం, నిర్లక్ష్యంగా ప్రవర్తించే పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే సూచన హెచ్చరిక పోలీసు అధికారులతో సమీక్ష -
కలబుర్గి– బెంగళూరు విమాన సంచారం షురూ
రాయచూరు రూరల్: ఏడాది పాటు స్తంభించిన విమాన ప్రయాణాలను కలబుర్గిలో పునరుద్ధరించారు. కలబుర్గి నుంచి బెంగళూరుకు బుధవారం సాయంత్రం కలబుర్గి– బెంగళూరు విమాన సేవలను కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి సహకారంతో కర్ణాటక పట్టు పరిశ్రమ అభివృద్ధి మండలి అధ్యక్షురాలు ఖనీజా ఫాతిమా ప్రారంభించారు. బెంగళూరు నుంచి 76 సీట్లున్న ఈ స్టార్ ఎయిర్ విమానం కలబుర్గికి ప్రయాణిస్తుందని అధికారి బోపణ్ణ తెలిపారు. శాసన సభ్యుడు ఎం.వై.పాటిల్, జిల్లాధికారి ఇక్రంపాషా, ఎస్పీ శ్రీనివాసులు, అధికారులున్నారు. -
ట్రాఫిక్ కట్టడికి కెమెరా కళ్లు
సాక్షి, బెంగళూరు: బెంగళూరు ట్రాఫిక్ సమస్య అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. విపరీతమైన వాహన రద్దీ, గందరగోళంపై తరచూ విమర్శలు వస్తుంటాయి. అదే రీతిలో కొందరు వాహనదారులు ఇష్టానుసారం వెళ్తుంటారు. ఇలాంటి వారిని కట్టడి చేయడానికి నగర ట్రాఫిక్ పోలీసులు ఆధునిక టెక్నాలజీ సాయం తీసుకున్నారు. బైక్పై హెల్మెట్ లేకుండా వెళ్లినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, సిగ్నల్ జంప్, కారులో సీటు బెల్టు పెట్టుకోకున్నా.. ఇలాంటి అతిక్రమణలకు పాల్పడితే కెమెరాలు గుర్తించి చలాన్లు నమోదు చేస్తున్నాయి. కోటికి పైగా వాహనాలు బెంగళూరులో కోటికి పైగా వాహనాలున్నాయి. రోడ్ల విస్తీర్ణం ఆ స్థాయిలో లేదు. దీంతో రోజూ వందలాది ఉల్లంఘనలు జరుగుతుంటాయి. దీనివల్ల ప్రమాదాలూ తప్పడం లేదు. వాటి నియంత్రణకు ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తుండగా, ఉల్లంఘనుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతోందని తెలిసింది. బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల వార్షిక గణాంకాలు ఇదే చెబుతున్నాయి. ముఖ్యంగా త్రిబుల్ రైడింగ్ కేసులు 2024లో గరిష్ట స్థాయిలో ఉండగా, ఇప్పుడు చాలావరకు తగ్గిపోయాయి. సగానికి నియంత్రణ 18 నుంచి 35 ఏళ్లలోపు యువకులు అధికంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఈ ఉల్లంఘనలు దాదాపు ఇప్పుడు సగానికి పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఏఐ ఆధారిత కెమెరాల ఏర్పాటు, అవగాహన ర్యాలీలు, తనిఖీల వల్ల ఈ ఫలితాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. అధికంగా కాలేజీలు, పీజీ హాస్టళ్లు, పబ్లు ఉండే ప్రాంతాల్లో యువకులు ఎక్కువగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో తగ్గాలి బీటీఏం లేఔట్, కోరమంగళ తదితర హాట్ స్పాట్లలో అర్ధరాత్రిల్లో ట్రాఫిక్ను నియంత్రించడం పోలీసులకు పెద్ద సవాలుగా ఉండేది. పోకిరీలు ప్రమాదకర త్రిబుల్రైడింగ్, బైక్ స్టంట్లు చేస్తారు. మద్యం తాగి డ్రైవింగ్ సరేసరి. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల మధ్య రోడ్డు నిబంధనలు ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి. బీటీఎం లేఔట్, హెచ్ఎస్ఆర్ లేఔట్, కోరమంగళ, ఇందిరానగర, ఎంజీ రోడ్లపై నిబంధనల బేఖాతరు ఎక్కువగా సాగుతోంది. ఎంజీ రోడ్డులో కెమెరాల బిగింపు బెంగళూరులో సత్ఫలితాలు తగ్గిన సిగ్నల్ ఉల్లంఘనలు -
పొట్టకూటి కోసం పడిగాపులు
సాక్షి బళ్లారి: సూర్యోదయానికి ముందుగానే కొప్పళలోని లాల్బహుదూర్శాస్త్రిభి సర్కిల్ను ఒకసారి చూస్తే అక్కడ కనిపించే దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి. వందలాది మంది కూలీలు పల్లెటూళ్లు, పట్టణాల నుంచి వచ్చిన వారు లుంగీలు, చొక్కాలు ధరించి చేతిలో పనిముట్లను పట్టుకొని పని కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. వారి కళ్లల్లో కనిపించే ఆశ, దాని వెనుక ఉన్న బాధలు, ఆరోజు పని దొరికితే కుటుంబానికి అన్నం పెట్టగలమనే ఆరాటం ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తుంది. మామూలుగా నగరాల్లో, పల్లెటూళ్లలో ఏదైనా పనికి వ్యవసాయ కూలీలు దొరకాలంటే వెతకాల్సిన పరిస్థితులుంటాయి. అయితే కొప్పళ నగరంలో లేబర్ సర్కిల్కు వస్తే ఎలాంటి పనికై నా కూలీలు ఇట్టే దొరికిపోతారు. ఇంటి పనులకు సంబంధించి ప్లంబింగ్, పెయింటింగ్, భవనాలు, ఇళ్ల క్లీనింగ్, వ్యవసాయ పనులకు కానీ ఆ సర్కిల్కు వస్తే కూలీలు దొరకడం గమనార్హం. లేబర్ సర్కిల్గా గుర్తింపు కొప్పళలో కూలీలంతా ఐకమత్యంగా ఒక చోట చేరుతారు. లాల్బహుదూర్ శాస్త్రి సర్కిల్ను లేబర్ సర్కిల్గా పిలుస్తున్నారంటే ఎంత పెద్ద ఎత్తున కూలీలు అక్కడికి వస్తుంటారో అర్థం చేసుకోవచ్చు. గడియార స్తంభం, భాగ్యనగర పట్టణ పంచాయతీ కార్యాలయం ముందు కూడా అవే దృశ్యాలు కనిపిస్తుంటాయి. వీరికి ఎలాంటి చదువు కూడా ఉండదు. అయితే టెక్నాలజీ సంబంధించి పనులను కూడా వీరు నిర్వహిస్తుంటారు. స్వంత ఊళ్లలో పని దొరకకపోవడంతో ఇక్కడికి వచ్చి తమ పిల్లలను చదివించుకునేందుకు రోజు వారి పనులు దొరికితే చాలన్న సంతోషంతో ఎదురు చూస్తుంటారు. గోడలు కట్టడం, ఇనుప కడ్డీలను అమర్చడం, కాంక్రీట్ పనులు చేయడం, విద్యుత్ వైరింగ్, పరికరాల అమరిక, నీటి ట్యాంక్లను శుభ్రపరచడం వంటి పనులు, డ్రైనేజీలను శుభ్రంచేయడం వంటి అనే పనులను చేస్తూ పొట్టనింపుకునే వారు ఇక్కడ వందలాది మంది కనిపిస్తుండటం విశేషం. అక్కడ అందుబాటులో కూలీకార్మికులు గత 30 ఏళ్లుగా లాల్బహుదూర్శాస్త్రి సర్కిల్ లేబర్ సర్కిల్గా మారింది. అక్కడికి వస్తే ఎలాంటి పనులకై నా కార్మికులు దొరుకుతారనేది ప్రజల నమ్మకం. తమ పిల్లల చదువుకు, వారి ఆశలను తీర్చేందుకు తాము నిత్యం ఇక్కడికి వచ్చి తమకు నైపుణ్యం ఉన్న పనులను చేస్తూ పొట్టనింపుకుంటున్నామని పలువురు పేర్కొంటున్నారు. చదువు లేకపోయినా తమ అనుభవాన్నే తెలివిగా మార్చుకొని యజమానులను మెప్పించి ఉపాధి పొందుతున్నామన్నారు. లేబర్ సర్కిల్ వద్ద ఉదయం వేళ కారు, బైక్ వస్తే సార్.. రండి..సార్.. ఏ పనైనా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారితో మాటలు కలుపుతారు. రోజు వారి కూలీలు ఈ జీవితం కేవలం ఉపాధి కోసం చేసే పోరాటం మాత్రమే కాదు, కుటుంబాల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం జీవితంలో సాగించే నిరంతర యుద్ధమని పలువురు అంటున్నారు. పాలకుల నుంచి అందని సహకారం దశాబ్దాల తరబడి ఇక్కడ వందలాది మంది కూలీలు పొట్టకూటి కోసం ఆరాటపడుతున్నా పాలకులు, అధికారులు తమకు ఎలాంటి సహకారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ భవన నిర్మాణానికి సంబంధించి కార్మికులే పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు చేయింకోవడానికి ప్రయత్నించే వారు ఈ సర్కిల్కు వస్తే సునాయాసంగా ఇళ్లు పూర్తయ్యే వరకు అన్ని విధాలా పని చేసే కార్మికులు దొరుకుతారు. పని కోసం ఎదురు చూసే కార్మికులకు పని దొరకడం ఎంత కష్టమో ఒక్కొక్క సారి పనులు చేయించుకునేందుకు కార్మికులు దొరకక పోవడంతో ఎన్నో ఇబ్బందులు పడి లేబర్ సర్కిల్కు వస్తే కార్మికులు దొరుకుతుండటంపై స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు కాయకష్టం చేసే కార్మికులు మంగళ, శుక్రవారాల్లో సమీపంలోని హులిగి వద్ద తుంగభద్ర నదిలో స్నానం చేసి హులిగమ్మ దేవిని దర్శించుకొని తమకు ఇష్టమైన ఆహారం వండుకొని అక్కడ బంధువులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కూలీలు వారానికి రెండు రోజులు సెలవు తీసుకొని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో గడపడానికి సమయాన్ని కేటాయిస్తారు. లేబర్ సర్కిల్ వద్ద పనుల కోసం గుమిగూడిన కార్మికులు సర్కిల్లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువకులు రెక్కాడితే కాని డొక్కాడని పేదలు కూలికార్మికుల జీవన్మరణ పోరాటం పట్టెడన్నం కోసం అన్ని రకాల పనులు ఏ పనికి కార్మికులు అవసరమైనా లేబర్ సర్కిలే శరణ్యం -
రౌడీషీటర్పై కాల్పులు
బనశంకరి: దోపిడీ, హత్యాయత్నం తదితర తీవ్రమైన నేరాలతో సంబంధమున్న రౌడీషీటర్ జీవా (19)పై గురువారం బెంగళూరు హెబ్బగోడి పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్చేశారు. పలు దోపిడీలకి పాల్పడి పరారీలో ఉన్న జీవా కోసం పోలీసులు కొన్నిరోజులుగా వెతుకున్నారు. గురువారం తెల్లవారుజామున సింగేన అగ్రహార తోపులో దాగి ఉన్నట్లు తెలిసి వెళ్లారు. పోలీసులను చూసి పారిపోతుండగా అతని వెంటపడ్డారు. అతడు కత్తితో పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో ఎస్ఐ అయ్యప్ప తుపాకీతో కాల్పులు జరిపాడు. తూటా తగిలి జీవా కాలికి గాయం కావడంతో పడిపోగా, పోలీసులు పట్టుకుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. హెబ్బగోడి ఠాణాలో రౌడీషీటర్ అయిన ఇతడు తిరుపాళ్యలో నివాసం ఉంటున్నారు. తరచూ నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారాడు. -
బాబోయ్.. చిరుత
మండ్య: మండ్య జిల్లాలోని మలవల్లి తాలూకాలోని తలగవాడి గ్రామం సమీపంలో చిరుతపులి కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలోని రాకరి గ్రాడ్యుయేట్ స్కూల్ సమీపంలో, నిర్మానుష్య ప్రదేశంలో అది తిరుగుతోంది. బుధవారం రాత్రి, గ్రామానికి చెందిన టి.కె.మను, టి.ఎస్.అభిషేక్ గౌడ కారులో వెళ్తుండగా రోడ్డు దాటుతున్న చిరుతని చూసి భయపడ్డారు. ఫోన్లో దానిని రికార్డు చేశారు. గత వారం కూడా అదే రోడ్డుపై చిరుతపులి కనిపించింది. గత కొన్ని నెలలుగా, ఐదు లేదా ఆరు చిరుత పులులు గ్రామం చుట్టూ తిరుగుతూ, 10కి పైగా పెంపుడు జంతువులను చంపాయి. చిరుతల భయంతో ఒంటరిగా మహిళలు, పిల్లలు బయటకు వెళ్లలేకపోతున్నారని గ్రామస్తులు తెలిపారు. అటవీ సిబ్బంది వెంటనే చిరుతలను బంధించి భద్రత కల్పించాలని కోరారు. -
ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి
రాయచూరు రూరల్: విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని తాలూకా విద్యా శాఖాధికారి ఈరణ్ణ కోస్గి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం గంగా పరమేశ్వరి కాలనీలో అభిజ్ఞాన అంగ్ల గ్ల భాషా పాఠశాలల్లో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించి మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. నేడు విద్యకున్న ప్రాధాన్యత ఏ రంగానికీ లేదన్నారు. ప్రయత్న వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు రమేష్, సాహితీవేత్త ఈరణ్ణ బెంగాలి, రవి, చంద్ర గిరీష్లున్నారు. -
ప్రధానితో సీఎం డీకే భేటీ
బనశంకరి: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ పాల్గొన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి గురించి ప్రధాని, సీఎంలు చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని సీఎం డీకే తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని సీఎం డీకే కలిసి, బసవేశ్వరుని ప్రతిమను బహూకరించారు. శుక్రవారం ప్రధానితో భేటీకి సమయం కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రముఖ నీటి ప్రాజెక్టులు, ఆర్థిక పథకాల గురించి చర్చిస్తాని చెప్పారు. నీతి ఆయోగ్ భేటీలో కర్ణాటక సమస్యలు, అవసరాలను ప్రస్తావించి సహాయం కోరినట్లు తెలిపారు. ఇస్పేటు ఖాకీల సస్పెండ్ మైసూరు: ఇస్పేటు ఆడుతూ పట్టుబడిన ఇద్దరు పోలీసులను చామరాజనగర ఎస్పీ ముత్తురాజు సస్పెండ్ చేశారు. చామరాజనగర మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేసే పోలీసు మల్లికార్జున, రిజర్వ్ పోలీసు నాగేశ్ బుధవారం రాత్రి పెద్ద గుంపులో ఇస్పేటు ఆడుతుండగా పోలీసులు దాడి చేయడంతో దొరికిపోయారు. ఈ నేపథ్యంలో ఎస్పీ చర్య తీసుకున్నారు. గతంలో, ఎస్పీ దివ్య థామస్ హయాంలో సాయుధ రిజర్వ్ దళానికి చెందిన కొందరు సిబ్బంది పట్టుబడి సస్పెండ్ అయ్యారు. నేడు మూకాంబిక దర్శనానికి తమిళనాడు సీఎం దొడ్డబళ్లాపురం: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేడు శుక్రవారం ఉడుపి జిల్లాలోని ప్రసిద్ధ కొల్లూరు మూకాంబికా దేవాలయాన్ని సందర్శించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో చుట్టుపక్కల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ భక్తులు దర్శనానికి రాకపోవడం మంచిదని అధికారులు సూచించారు. సీఎం వస్తుండడం వల్ల భద్రతా తనిఖీల వల్ల భక్తులకు ఇబ్బంది కలగవచ్చని, అందువల్ల దర్శనం సమయాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు తెలిపారు. సాంబార్లో బల్లి, విద్యార్థినులకు అస్వస్థత యశవంతపుర: బల్లి పడిన సాంబారును సేవించి 15 మంది యువతులు అస్వస్థతకు గురైన ఘటన హాసన్ తాలూకా సారాపురలోని అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్లో జరిగింది. బుధవారం రాత్రి వండిన సాంబార్లో బల్లి పడింది. అది తెలియక సాంబార్ను ఆరగించారు. కొంతసేపటికే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి తదితరాలతో విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు. వారిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. సిలిండర్లు లేకపోవడంతో బయట కట్టెల పొయ్యిపై వంట చేశారు, ఆ సమయంలో బల్లి పడినట్లు సిబ్బంది అనుమానిస్తున్నారు. నాలుగు వందల మంది విద్యార్థినులున్న హాస్టల్ గ్యాస్ సిలిండర్ల కొరతను ఎదుర్కొంటోంది. వంట గదిలో పరిశుభ్రత లేక బల్లులు తిరుగుతున్నాయని విద్యార్థినులు ఆరోపించారు. ఘనంగా కరియమ్మ జాతర బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని అరసికెరె గ్రామ దేవత అయిన శ్రీకరియమ్మ శ్రీ మల్లిగమ్మ దేవి జాతర బుధవారం రాత్రి భక్తిశ్రద్ధలతో జరిగింది. అమ్మవారికి సహస్ర కుంకుమార్చన జరిగింది. బుధవారం, మూలస్థానంలోని పంచమాతలు కరియమ్మ దేవి, మల్లిగమ్మ దేవి, చెలువరాయ స్వామి, దూతరాయ స్వామి, కెంచరాయ స్వామిల ఉత్సవ విగ్రహాలకు విశేషంగా అలంకరించి పూజలు చేశారు. శ్రీకరియమ్మ అమ్మవారిని వెండి రథంలో ఊరేగించారు. ఆలయంలో భక్తులు పూజలు చేసి పండ్లు, కూరగాయలను సమర్పించారు. -
రాజ్యసభకు నలుగురి ఎన్నిక
శివాజీనగర: రాష్ట్రంలో ఉత్కంఠ కలిగించిన 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 3 కాంగ్రెస్కు, 1 బీజేపీకి దక్కాయి. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, మన్సూర్ అలీఖాన్, పవన్ ఖేరా, బీజేపీ నుంచి ఎం.నాగరాజు నామినేషన్లు దాఖలు చేశారు. ఇతరులు పోటీలో లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విధానసౌధలో గురువారమే ఇద్దరు అభ్యర్థులకు విధానసభా కార్యదర్శి విశాలాక్షి ధృవీకరణ పత్రం అందజేశారు. శుక్రవారం మల్లికార్జున ఖర్గే స్వీకరిస్తారు. పవన్ ఖేరా మాట్లాడుతూ, కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కన్నడ సుందరమైన భాష, కన్నడ నేర్చుకొంటానని తెలిపారు. రాఘవ మఠంలో పూజలు బనశంకరి: నగరంలోని జయనగర ఐదోబ్లాక్లోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఏకాదశి సందర్భంగా గురువేంద్రస్వామికి అర్చకులు అలంకరణ, పూజలు చేపట్టారు. ప్రియాగణేశ్ బృందంచే భరతనాట్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సముద్ర తీరంలో అలర్ట్ యశవంతపుర: సముద్ర తీరంలో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతు పవనాల వల్ల సముద్ర తీరంలో పెద్ద పెద్ద అలలు ఎగసిపడుతున్నాయి. టూరిస్టులు సురక్షతా చర్యలను పాటించాలని తెలిపారు. మంగళూరు చుట్టుపక్కల ఉన్న ప్రముఖ బీచ్లలో జిల్లా కలెక్టర్, పర్యాటక శాఖ అధికారులు హై అలర్ట్ను ప్రకటించారు. నీటిపై తేలే వంతెనలు, బోటింగ్ లాంటి క్రీడలను బంద్ చేశారు. 9, 10 తరగతులకు ఆర్టీఈపై స్టే దొడ్డబళ్లాపురం: 9, 10వ తరగతులకు కూడా ఆర్టీఈని విస్తరించాలనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 9, 10వ తరగతుల్లో ఉచితంగా సీట్లు ఇవ్వాలని సర్కారు ఆదేశించడం సరికాదంటూ ప్రైవేటు పాఠశాలల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఆర్టీఈ చట్టం పరిధిని దాటి ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. విచారణ జరిపిన హైకోర్టు.. కేసు పూర్తయ్యే వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అమలు చేయరాదని ఆదేశించింది. -
అప్పు తిరిగి చెల్లించమన్నందుకు మహిళ దారుణ హత్య
శ్రీనివాసపురం: ఇచ్చిన అప్పు తిరిగి వాపసు ఇవ్వాలని అడిగి నందుకు మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన శ్రీనివాసపురం తాలూకా లక్ష్మీపుర గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రెడ్డెమ్మ (70) హత్యకు గురైన మహిళ. చింతామణికి చెందిన తిమ్మరాజు, మునిరాజు హంతకులు. గత నెల 17వ తేదీన ఘటన జరగగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇద్దరు అన్నదమ్ములు. వీరు రెడ్డెమ్మ వద్ద వడ్డీకి అప్పు తీసుకుని నెలనెల వడ్డీ కడుతూ వస్తున్నారు. అయితే ఇటీవల వీరు వడ్డీ సరిగా కట్టకపోవడంతో ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని రెడ్డెమ్మ అడిగింది. నిందితులు ఇద్దరు తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేక రెడ్డెమ్మను కడతేర్చాలని ప్లాన్ వేశారు. డబ్బు వాపసు ఇస్తామని చెప్పి చింతామణిలోని తమ ఇంటికి రెడ్డెమ్మను పిలిపించుకున్నారు. రెడ్డెమ్మను నిందితులు ఇద్దరు గొంతు నులిమి చంపి మృతదేహాన్ని కెంచార్లహళ్లి వద్దకు తీసుకు వెళ్లి అక్కడ అటవీ ప్రాంతంలో పడేశారు. రెడ్డెమ్మ కనిపించకపోవడంలో కటుంబీకులు మే నెల 26వ తేదీన రాయల్పాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు తిమ్మరాజు, మునిరాజును అరెస్టు చేశారు. -
రోడ్డు నాసిరకం.. రవాణా కష్టతరం
హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి సమీపంలోని డణాపుర వద్ద నిర్మించిన జాతీయ రహదారి–50లో సర్వీస్ రోడ్డు 8–10 రోజులకే దుస్థితికి చేరడంతో ఒక లోడ్ లారీ రోడ్డులోని గోతిలో చిక్కుకుపోయింది. నాసిరకంగా నిర్మించిన పనుల కారణంగా రోడ్డు కుంగిపోయింది. రెండు నెలల క్రితం బళ్లారి ఎంపీ ఈ.తుకారాం సర్వీస్ రోడ్డు పనులకు భూమిపూజ నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన నిర్మించిన సర్వీస్ రోడ్డు దుస్థితిపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. డణాపుర నుంచి మరియమ్మనహళ్లి వరకు ఉన్న ఈ రహదారిని మొత్తం రూ.33 కోట్ల వ్యయంతో నిర్మించారు. మరియమ్మనహళ్లి వరకు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డుపై జాతీయ రహదారి వెంట పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంట్రాక్టు కంపెనీపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. నాణ్యమైన పనులు చేయకుండా ప్రజాధనాన్ని వృథా చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆ కంపెనీపై తగిన, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులను డిమాండ్ చేశారు. -
డీసీఎంతో ఎమ్మెల్యేల భేటీ
● జిల్లా అభివృద్ధికి సహకారం అందించాలని వినతి సాక్షి,బళ్లారి: జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్ను కలిశారు. గురువారం నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే గణేష్ తదితరులు డీసీఎంను మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాకు చెందిన పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. రోడ్లు, వంతెనలు, మంచినీటి సమస్య తదితరాలపై సమగ్రంగా చర్చించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవించారు. ఎమ్మెల్యేల అభ్యర్థనలపై స్పందించిన డీసీఎం కంప్లి, బళ్లారి నగరాభివృద్ధికి సంపూర్ణంగా ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. అవసరమైన చర్యలు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తామని తెలిపారు. పాము కాటుకు రైతు బలి రాయచూరు రూరల్: పాము కరిచి ఓ రైతు మృతి చెందిన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం అరకెర తాలూకా కరడిగుడ్డలో పొలం పనులు చేస్తుండగా బసవరాజ్(54)ను పాము కరవడంతో దేవదుర్గ తాలూకాస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ రైతు గురువారం ఆస్పత్రిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. మౌలిక సౌకర్యాలకు పెద్దపీట రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరులో మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యత కల్పించాలని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. గురువారం సింధనూరు నగరసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. తాగునీటి జలాశయం, వివిధ ప్రాంతాల్లో వర్షాకాలంలో మురుగు కాలువల్లో పూడిపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. తుర్విహాళ్ ప్రభుత్వాస్పత్రిని, ఇందిరా క్యాంటీన్లను సందర్శిచి రోగులకు వైద్య సేవలు అందించాలన్నారు. రైతులకు ఎరువుల, పురుగు మందుల కొరత రాకుండా దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. చెరువులను సంరక్షించండి రాయచూరు రూరల్: నగరంలో పురాతన కాలం నాటి చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి బోసురాజు వెల్లడించారు. గురువారం నగరంలోని నీరుబావికుంటలో చెరువుల సంరక్షణకు శ్రీకారం చుట్టి ఆయన మాట్లాడారు. పట్టణాలకు తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పైపులైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పురాతన కాలం నాటి చెరువులకు మహర్దశ కల్పించాలనే సదాశయంతో పనులను త్వరిగతిన చేపట్టాలన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, ఎంపీ కుమార నాయక్, నేతలు లక్ష్మిరెడ్డి, బసవరాజ్ పాటిల్, రుద్రప్ప, జయంత్ రావ్, శేఖర్రెడ్డి, శివమూర్తి శాంతప్ప, గోవింద రెడ్డి, నరసింహులు, సుభాష్లున్నారు. రూ.వెయ్యి లంచం.. నాలుగేళ్ల జైలుహోసూరు: తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెళ్లి సహాయ నిధి పథకం ద్వారా అర్హులకు నిధి సహాయం అందజేసేందుకు రూ. వెయ్యి లంచం పుచ్చుకొన్న మహిళా ఉద్యోగినికి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ క్రిష్ణగిరి కోర్టు తీర్పునిచ్చింది. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా మత్తూరు దగ్గర కణ్ణండహళ్లి గ్రామానికి చెందిన రంగస్వామి కూతురికి ప్రభుత్వ పెళ్లి సహాయ నిధి పథకానికి గత 2008లో దరఖాస్తు చేసుకొన్నాడు. ఆ సమయంలో బీడీవో ఆఫీసు ఉద్యోగిని ఇంద్రాణి (45), వెయ్యి రూపాయల లంచం డిమాండ్ చేసింది. రంగస్వామి క్రిష్ణగిరి ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు తీసుకుంటూ ఉండగా పోలీసులు ఇంద్రాణిని అరెస్ట్ చేశారు. ఈ కేసు క్రిష్ణగిరి కోర్టులో జరుగుతూ వచ్చింది. గురువారం ఉదయం కేసును విచారణ జరిపిన న్యాయమూర్తి లత.. ముద్దాయికి నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
ఒక్క అడుగుతో అథఃపాతాళానికి...
సాక్షి, బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే యువకుని హత్య శాండల్వుడ్లో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. రాష్ట్రమే కాదు, దేశమంతటా వార్తలకెక్కింది. చాలెజింగ్ స్టార్గా లక్షలాది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు దర్శన్ ఈ హత్య కేసులో జైలు పాలయి గురువారంతో రెండేళ్లు పూర్తి అయింది. ఆయన కెరీర్ అగమ్యగోచరమైంది. 2024, జూన్ 11న మైసూరులోని ఒక హోటల్లో ఉండగా దర్శన్ను, ఆయన సన్నిహితులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో అనేకానేక మలుపులు తీసుకుంటూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మధ్యలోనే ఒక్కసారి బెయిల్ మీద బయటకు వచ్చిన దర్శన్ ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ను రద్దు చేయడంతో మళ్లీ బెంగళూరు పరప్పన సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. అన్నీ మిస్.. మిస్ బెయిలు మధ్యలో దర్శన్ తన ప్రతిష్టాత్మక ‘ది డెవిల్’ సినిమా షూటింగ్ పూర్తి చేసినప్పటికీ ఆ సినిమా విడుదల సమయంలో కటకటాల్లోనే ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది తన 49వ పుట్టినరోజు, 23వ పెళ్లి రోజును కూడా అభిమానులు, కుటుంబ సభ్యులతో జరుపుకోలేకపోయారు. దర్శన్ జీవితంలో చీకటిదినం 2024, జూన్ 9 నటుడు దర్శన్ పాలిట ఒక చీకటి రోజు.. బెంగళూరు సుమ్మనహళ్లి రాజకాలువలో రేణుకాస్వామి శవం లభ్యం అయింది. ఈ కేసులో దర్శన్ పేరు వినిపించడంతో పోలీసులు జూన్ 11న అరెస్టు చేశారు. జూన్ 7న కిడ్నాప్ అయిన రేణుకాస్వామి రెండు రోజుల తర్వాత రాజకాలువలో శవమై కనిపించాడు. దర్శన్ స్నేహితురాలు, నటి పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యంగా సందేశాలు పంపించాడనే కారణంతో దర్శన్ అనుచరులు చిత్రదుర్గ నుంచి అతన్ని బెంగళూరుకు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి హత్య చేశారన్నది అభియోగం. తరచూ మలుపులు ఈ కేసు నిరంతరం మలుపులు తిరుగుతూనే ఉంది. బెంగళూరు జైలులో దర్శన్కు రాచమర్యాదలు కల్పిస్తున్నారని కొన్నాళ్లు బళ్లారి జైలుకు తరలించారు. కొన్ని నెలల తర్వాత వైద్య సేవల కారణంతో బెయిల్ పొందారు. దర్శన్ బెయిల్ను రద్దు చేయాలని పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిలు రద్దయింది. గత ఏడాది ఆగస్టు నుంచి మళ్లీ దర్శన్ జైలు పక్షి అయ్యారు. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన దర్శన్కు తీవ్ర నిరాశే మిగిలింది. దర్శన్, పవిత్రతో పాటు 7 మంది నిందితులు కారాగారంలోనే ఉండగా, అభిమానులు విచారంలో మునిగారు. ప్రముఖ నటుడు దర్శన్ జైలుపాలై ఇప్పటికి రెండేళ్లు ప్రకంపనలు సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసు -
టీబీ డ్యాంకు కొత్త జల కళ
హొసపేటె: కళ్యాణ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని లక్షలాది రైతులకు జీవనాధారమైన తుంగభద్ర డ్యాం రుతుపవన వర్షాల ప్రారంభంతో కొత్త వరదను సంతరించుకుంది. తీవ్రమైన వేసవి కారణంగా ఎండిపోయి డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరిన ఈ జలాశయం ఇప్పుడు పరివాహక ప్రాంతాలైన శివమొగ్గ, శృంగేరి, మొరాళు, ఆగుంబె, తీర్థహళ్లి తదితర ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరింది. టీబీ డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 101 టీఎంసీలు కాగా, ప్రస్తుతం డ్యాంలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రుతుపవన వర్షాలు ఇదే విధంగా కొనసాగితే, ఈ ఏడాది నిర్ణీత సమయానికంటే ముందే జలాశయం పూర్తిగా నిండే అవకాశం ఉంది. గత ఏడాది తీవ్ర కరువు కారణంగా డ్యాం నిండకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈసారి రుతుపవనాల ప్రారంభంలో జలాశయం నీటితో నిండడం కళ్యాణ కర్ణాటకలోని కొప్పళ, బళ్లారి, రాయచూరు, విజయనగర జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంత రైతులకు హర్షం కల్గించింది. తుంగభద్ర డ్యాం నీరే జీవనాధారం కళ్యాణ కర్ణాటక రైతుల్లో ఆనందం -
ఏటీఎంల వద్ద పటిష్ట భద్రత కల్పించాలి
హొసపేటె: విజయనగర జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బంది, ఏటీఎం యాజమాన్యం, ఏటీఎంల్లో డబ్బు నింపే ఏజెన్సీల అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు, పోలీసు అధికారులతో బుధవారం నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జాహ్నవి మాట్లాడుతూ నగరంలో అనేక ఏటీఎంల వద్ద సరిగా సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో ఇటీవల రైల్వే స్టేషన్ రహదారిలోని కనకదాసు సర్కిల్ వద్ద ఏటీఎంలో దుండగులు చోరీ యత్నానికి పాల్పడ్డారన్నారు. బ్యాంక్ ఏటీఎంల్లో డబ్బులు నింపే ఏజెన్సీల అధికారులు, బ్యాంక్ లావాదేవీల విషయంలో తప్పనిసరిగా నియమాలను పాటించాలన్నారు. బ్యాంకు ఏటీఎంల్లో డబ్బు నింపడం, తరలించడంపై వివరాలు తెలుసుకున్నారు. అందరూ ఎలా పని చేస్తున్నారో పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో 30 బ్యాంకుల అధికారులు, లీడ్ బ్యాంక్ జిల్లా స్థాయి అధికారి వీరేంద్రకుమార్, ఏఎస్పీ మంజునాథ్, డీఎస్పీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని నవలగుందలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.5,12,000 విలువ చేసే 46 గ్రాముల బంగారు ఆభరణాలు, చోరీకి వాడిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 31న నవలగుందలో ఇంటి చోరీ జరిగింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన నవలగుంద సీఐ రవికుమార్ నేతృత్వంలో ఎస్ఐ జనార్ధన్, ఉమాదేవి తదితర సిబ్బందితో రెండు ప్రత్యేక బృందాలు నవలగుంద పట్టణం, అలాగే శివారులోని వివిధ సీసీ టీవీ కెమెరాలను వివిధ కోణాల్లో పరిశీలించి కెమెరాల ద్వారా లభించిన దృశ్యాలు, అలాగే టెక్నికల్ ఆధారాలతో నిందితుల జాడ పట్టుకొని వారి అసలైన అడ్రస్లను గుర్తించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణ వేళ చోరీ చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారు. వీరు బెళగావి జిల్లాకు చెందిన వారని, ప్రస్తుతం వీరిని జుడీషియల్ కస్టడీకి అప్పగించినట్లు జిల్లా ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. గృహలక్ష్మి లబ్ధిదారులకు ఆందోళన వద్దు హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశం వచ్చే వరకు గృహలక్ష్మి పథకం మహిళా లబ్ధిదారులు కేవైసీ చేయించరాదని హుబ్లీ ధార్వాడ పడమటి విధానసభ గ్యారెంటీ అమలు కమిటీ అధ్యక్షుడు ఆనంద మూశన్నవర తెలిపారు. ఈ పథకం లబ్ధి పొందడానికి కేవైసీ చేయించాలని వదంతులు వ్యాపించడంతో మహిళలు గ్రామ వన్, కర్ణాటక వన్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. ప్రభుత్వ ఆదేశం లేకపోయినా అనవసరంగా మహిళలు గ్రామ వన్, కర్ణాటక వన్ కేంద్రాల్లో అడిగినంత డబ్బులు చెల్లించి కేవైసీ చేయిస్తున్నారు. సదరు కేంద్రాల సిబ్బంది సామాన్య మహిళలకు తగిన సమాచారం ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఆదేశం వచ్చే వరకు మహిళలు కేవైసీ చేయించాల్సిన అవసరం లేదని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. రౌడీషీటర్ల ఇళ్లపై పోలీసు దాడులు హుబ్లీ: శాంతి భద్రతల రక్షణే లక్ష్యంగా బెళగావి నార్త్ రేంజ్లోని బెళగావి, విజయపుర, బాగలకోటె, ధార్వాడ, గదగ్ జిల్లాల్లో ఆయా జిల్లా ఎస్పీల నేతృత్వంలో అధికారుల బృందాలు రౌడీషీటర్ల ఇళ్లపై దాడి చేసి కొరడా ఝళిపించాయి. రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో 456 మంది రౌడీషీటర్ల ఇళ్లపై దాడి చేసి రూ.8.5 లక్షల నగదు, నెంబర్ ప్లేట్, రికార్డులు లేని 10 వాహనాలు, రెండు మచ్చుకత్తులను జప్తు చేశారు. కోర్టు నుంచి పరారైన ఇద్దరు రౌడీలను అరెస్ట్ చేశారు. వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కేసులు నమోదైనట్లు బెళగావి నార్త్ రేంజ్ ఐజీ సందీప్ పాటిల్ తెలిపారు. ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ల సదస్సు బళ్లారిఅర్బన్: నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు నూతన ఆవిష్కరణలు, ఆధునిక నిర్మాణ విధానాలపై నిరంతరం అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఆర్కిటెక్ట్స్ మీట్–2026 కార్యక్రమం బుధవారం సాయంత్రం నగరంలోని హోటల్ రాయల్ ఫోర్ట్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాణ రంగానికి సంబంధించిన నూతన సాంకేతికతలు, ఆధునిక భద్రతా ప్రమాణాలు, స్మార్ట్ లాకింగ్ వ్యవస్థలు, భవన నిర్మాణంలో వినియోగిస్తున్న అత్యాధునిక ఆర్కిటెక్చరల్ విధానాలపై నిపుణులు సమగ్రంగా వివరించారు. భవనాల భద్రత, నాణ్యత, సౌందర్యాన్ని పెంపొందించడంలో ఆధునిక సాంకేతికతల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఏసీసీఈఏ అధ్యక్షుడు సత్యనారాయణ, శశిధర్, రాకేష్, సుభాష్ చంద్ర, సునీల్ పాల్గోన్నారు. చుక్కి ఫౌండేషన్ అవార్డుల పంపిణీరాయచూరు రూరల్: ఉమాపతి చుక్కి 50వ పుణ్యారాధనను పురస్కరించుకుని గురువారం జిల్లాలోని సిరవారలో చుక్కి ఫౌండేషన్ అవార్డులను అందచేశారు. ఈసందర్భంగా మాజీ మంత్రి బోసురాజు మాట్లాడుతూ చుక్కి ప్రతిష్టాన చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. సమాజంలో మార్పు రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు, చర్చాగోష్టులు జరగాలన్నారు. సమావేశంలో ఆళంద విశ్వనాథ్ కూరేణేశ్వర శివాచార్య స్వామీజీ, శాసన సభ్యుడు హంపయ్య నాయక్, చుక్కి ప్రతిష్టాన అధ్యక్షులు శివానంద, సభ్యులు శివకుమార్, రంగణ్ణ పాటిల్, మల్లికార్జున, జ్యోతి, సిద్దలింగప్ప, హాజీ చౌద్రిలున్నారు. మౌలిక సౌకర్యాలు కల్పించరూ రాయచూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కేఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. గురువారం జిల్లాలోని సింధనూరు తాలూకా గోమర్సి ప్రభుత్వ పాఠశాల వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు నిరుపాది మాట్లాడారు. పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, తాగునీరు, పార్కింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి, క్రీడా మైదానం నిర్మించాలని కోరుతూ జీపీ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో అప్పయ్య, ఉమేష్, విరుపణ్ణ, వీరేష్, నాగప్ప, అజ్మీర్ శంశుద్దీన్లున్నారు. -
బురదగా దారి.. ఇబ్బందిగా మారి..
హొసపేటె: తాలూకాలో మరియమ్మనహళ్లి గుండా తండాకు చెందిన రైతుల భూములను కలిపే దారి పాడై పోవడంతో రాకపోకలు కష్టకరంగా మారాయి. ఈ దారిపై నరకయాతన పడుతూ వెళ్లాల్సి వస్తోందని, అధికారులు, ప్రజాప్రతినిధులు నిద్రావస్థలో ఉన్నారని గ్రామస్తులు ఆరోపించారు. జీ.నాగలాపుర జీపీ పరిధిలోకి వచ్చే గుండా తండాలోని రైతుల పొలాలకు చేరుకోవడానికి ఉన్న ఏకై క మార్గం ఈ దారి. దీనిపై చాలా గుంతలు ఉన్నాయి. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. దారి బురదమయంగా మారడంతో పొలాలకు వెళ్లడం సాధ్యం కావడం లేదు. విత్తనాలు నాటే, పంట కోసే సమయాల్లో వ్యవసాయ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోంది. ఈ దారిలో వాహనదారుల తిప్పలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికై నా దారిని వెంటనే మరమ్మతు చేయాలని గ్రామస్తులు కోరారు. యాతన పడుతున్న వాహన చోదకులు -
ఎరువుల కోసం రైతులు బారులు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పొలాల్లో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఖరీఫ్లో ముందుగానే వానలు కురిశాయి. రైతులు కూడా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది 3.44 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయడానికి రంగం సిద్ధమైంది. 84 వేల హెక్టార్లలో నీటి పారుదల, మిగిలిన హెక్టార్లలో ఏకదళ, ద్విదళ ధాన్య, వాణిజ్య పంటలు పండించడానికి అవకాశం ఉంది. జిల్లాలో 1.71 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంది. కేఎస్ఎంఎఫ్లో 7,393 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ దుకాణాల్లో 738.10 మెట్రిక్ టన్నులు, 90 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉంది. ఖరీఫ్కు సరిపడా ఎరువులు నిల్వ ఉన్నాయని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మహ్మద్ హుసేన్ వెల్లడించారు. రైతు కేంద్రాల్లో రైతులకు ఎరువులు, క్రిమి సంహారక మందులు నిల్వ ఉన్నాయని తెలిపారు. మరో వైపు రైతులు ఎరువులు, క్రిమి సంహారక మందుల కోసం దుకాణాల ముందు బారులు తీరి నిలబడి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సీజన్ పనులు ప్రారంభం ముందుగానే కురిసిన వానలు -
తుపాకీతో కాల్చుకుని మహిళ ఆత్మహత్య
కర్ణాటక: ఇంట్లో రివాల్వర్తో కాల్చుకుని మహిళ అనుమానాస్పద రీతిలో చనిపోయిన ఘటన చిక్కమగళూరు నగరంలోని హాళేనహళ్లిలో జరిగింది. వ్యాపారవేత్త రాజేంద్ర భార్య సుమ (55) గృహిణి. బుధవారం ఇంట్లో లైసెన్స్డ్ రివాల్వర్తో ఆమె కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనకు ముందు డెత్నోట్ రాసి పెట్టారు. ఘటన జరిగిన సమయంలో ఆమె భర్త బయటకు వెళ్లాడు, కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. తుపాకీ కాల్పుల శబ్ధాలు విని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వచ్చి చూసేసరికి ఆమె రక్తపు మడుగులో చనిపోయి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.బెయిలు రద్దు అర్జీ తిరస్కృతి యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో విడుదలైన ఐదుమంది నిందితుల బెయిల్ను రద్దు చేయాలని పోలీసుల న్యాయవాది దాఖలు చేసిన అర్జీని హైకోర్టు తిరస్కరించింది. పవన్, ధనరాజు, రాఘవేంద్ర, వినయ్, నందీశ్లకు పెద్ద ఊరట కలిగింది. ఐదుగురికీ గతంలో కింది కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని ప్రాసిక్యూషన్ కోరింది. న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రాచయ్య విచారించి రద్దు చేశారు. దర్శన్ భార్యకు వేధింపులు దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి సోషల్ మీడియా ద్వారా ఆకతాయిలు వేధిస్తున్నారు. ఆమెను కించపరుస్తూ అశ్లీల మెసేజ్లు పెడుతున్నారు. భర్త జైల్లో ఉంటే ఈమె మాత్రం కార్లలో షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తోందని నానా రకాలుగా నిందిస్తున్నారు. దీంతో విసిగిపోయిన విజయలక్ష్మి బెంగళూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అంతర్రాష్ట్ర జల వివాదాలు కొలిక్కి
రాయచూరు రూరల్: తెలంగాణ, కర్ణాటక అంతర్రాష్ట్ర జల వివాదాలకు తెరదించడానికి ఇరు రాష్ట్రాల నాయకులతో చర్చలు కొలిక్కి వచ్చే దశలో ఉన్నాయని మాజీ మంత్రి, విధాన పరిషత్ సభ్యుడు ఎన్ఎస్ బోసురాజు పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతం యాదగిరి, నారాయణపేట మధ్య గుడ్డందొడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మక్తల్, నారాయణపేటె, కోడంగల్లకు భీమా, కృష్ణా నదుల నుంచి నీటిని పొందుతున్నారన్నారు. నీటి వినియోగం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి సుముఖంగా ఉన్నారన్నారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉండడం వల్ల నారాయణపుర డ్యాం నుంచి కింది భాగంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర రైతుల శ్రేయస్సు కాపాడగలమన్నారు. నారాయణపుర డ్యాం నుంచి కింది భాగంలో బ్యారేజీ కం, బ్రిడ్జిల నిర్మాణానికి తెలంగాణ సర్కార్ సానుకూలంగా ఉందన్నారు. నూతన మంత్రివర్గంలో పదవి కోసం పాకులాడటం లేదన్నారు. ఆల్మట్టి ఎత్తును పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలన్నారు. చిక్క మంచాల, చీకలపర్విల వద్ద బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామన్నారు. నూతనంగా మటమారి వీరభద్రేశ్వర ఎత్తిపోతల పథకానికి అనుమతి లభించిందన్నారు. ఎంపీ కుమార నాయక్, రుద్రప్ప అంగడి, అమరేగౌడ, శాంతప్ప, జయన్న, తాయన్న నాయక్, సమీర్, నరసింహులు, శాలం, శివమూర్తిలున్నారు. -
తుపాకీతో కాల్చుకుని మహిళ ఆత్మహత్య
యశవంతపుర: ఇంట్లో రివాల్వర్తో కాల్చుకుని మహిళ అనుమానాస్పద రీతిలో చనిపోయిన ఘటన చిక్కమగళూరు నగరంలోని హాళేనహళ్లిలో జరిగింది. వ్యాపారవేత్త రాజేంద్ర భార్య సుమ (55) గృహిణి. బుధవారం ఇంట్లో లైసెన్స్డ్ రివాల్వర్తో ఆమె కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనకు ముందు డెత్నోట్ రాసి పెట్టారు. ఘటన జరిగిన సమయంలో ఆమె భర్త బయటకు వెళ్లాడు, కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. తుపాకీ కాల్పుల శబ్ధాలు విని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వచ్చి చూసేసరికి ఆమె రక్తపు మడుగులో చనిపోయి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.బెయిలు రద్దు అర్జీ తిరస్కృతి యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో విడుదలైన ఐదుమంది నిందితుల బెయిల్ను రద్దు చేయాలని పోలీసుల న్యాయవాది దాఖలు చేసిన అర్జీని హైకోర్టు తిరస్కరించింది. పవన్, ధనరాజు, రాఘవేంద్ర, వినయ్, నందీశ్లకు పెద్ద ఊరట కలిగింది. ఐదుగురికీ గతంలో కింది కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని ప్రాసిక్యూషన్ కోరింది. న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రాచయ్య విచారించి రద్దు చేశారు. దర్శన్ భార్యకు వేధింపులు దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మిని సోషల్ మీడియా ద్వారా ఆకతాయిలు వేధిస్తున్నారు. ఆమెను కించపరుస్తూ అశ్లీల మెసేజ్లు పెడుతున్నారు. భర్త జైల్లో ఉంటే ఈమె మాత్రం కార్లలో షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తోందని నానా రకాలుగా నిందిస్తున్నారు. దీంతో విసిగిపోయిన విజయలక్ష్మి బెంగళూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేరళ ఉత్సవాలకు రండి ప్లీజ్ ● కన్నడిగులకు కేరళ డీఐజీ వేడుకోలు యశవంతపుర: కేరళలో కణ్ణూరు జిల్లాలోని కొట్టియూరు దేవస్థానంలో జరిగే వైశాఖ మహోత్సవంలో పాల్గొనాలని కన్నడ భక్తులకు కణ్ణూరు డీఐజీ కన్నడంలో విన్నవించారు. ఇన్స్టాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. గత సంవత్సరం కణ్ణూరులో వైశాఖ మహోత్సవం రోజున గొడవలు జరిగాయి. దీనివల్ల కన్నడ భక్తులు ఇబ్బందులు పడ్డారు. చాలామంది ఈ ఏడాది వెళ్లాలా, వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. దీనివల్ల అక్కడ పర్యాటకానికి గండి పడే ప్రమాదం ఉన్నందున డీఐజీ యతీశ్ చంద్ర మాట్లాడుతూ ఈసారి అలాంటి ఘటనలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు. దేవస్థానం చుట్టుపక్కల భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మీ జతలో పోలీసులం ఉంటాం, ఎవరూ భయపడవలసిన పని లేదంటూ భరోసా ఇచ్చారు. ఆలయ సిబ్బంది దౌర్జన్యం గతేడాది వైశాఖ మహోత్సవంలో పాల్గొన్న భక్తులపై దేవస్థానం సిబ్బంది దౌర్జన్యంగా ప్రవర్తించారు. దీనికి నిరసనగా కొందరు కన్నడ భక్తులు ఈసారి వైశాఖ మహోత్సవాలకు రాబోమంటూ వీడియోలు తీసి నెట్లో పోస్ట్ చేశారు. దీంతో డీఐజీ కన్నడిగులను వేడుకోవాల్సి వచ్చింది. దుస్థితిలో శివమొగ్గ ఎయిర్పోర్టు శివమొగ్గ: ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన శివమొగ్గ విమానాశ్రయం రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం కారణంగా విమానాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఎంపీ బీవై రాఘవేంద్ర ఆరోపించారు. శివమొగ్గ విమానాశ్రయంలో రాత్రివేళ ల్యాండింగ్ కావడానికి సమస్య ఉందని, అదనపు స్థలం కావాలని అటవీశాఖను కోరినట్లు తెలిపారు. నైట్ ల్యాండింగ్ సౌకర్యానికి కావాల్సింది రూ. 7 కోట్లేనని, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. అందుకే మూడు నెలలుగా స్పైస్జెట్ విమానాలను నిలిపివేసిందన్నారు. మరోవైపు 4,399 రోజుల పాటు ప్రధాని హోదాలో రికార్డు సృష్టించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ నేతగా మారారని కొనియాడారు. -
హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయొద్దు
బళ్లారిటౌన్: బళ్లారిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయరాదని కన్నడనాడు రైతు సంఘం డిమాండ్ చేసింది. బుధవారం సంఘం నేతలు జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. బళ్లారి జిల్లాలో తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయని, హెల్మెట్ ధరించడం వల్ల దీని ప్రభావం ఆరోగ్యంపై చూపుతుందన్నారు. బళ్లారి జిల్లాలో 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉన్నందున కూలీ కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారులు తీవ్ర అనారోగ్యం పాలవుతారన్నారు. రోడ్డు ప్రమాదాలకు హెల్మెట్ ఒక్కటే కారణం కాదన్నారు. నగరంలో గోతులు పడ్డ అనేక రోడ్లు, జాతీయ రహదారిలో మద్యం అమ్మకాలు, నగరంలో భారీ ట్రాఫిక్ సంచారం ఉన్నందునే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల ట్రాఫిక్ పరిశీలన వేళలో జోళదరాశి గ్రామానికి చెందిన వీరేష్ అనే వ్యక్తి పోలీసులు పట్టుకుంటారని తప్పించుకోబోయి లారీ కింద పడ్డారని, దీంతో ఆ కుటుంబం వీధి పాలైందన్నారు. ఆ కుటుంబానికి పరిహారం కూడా అందజేయాలని డిమాండ్ చేశారు. కన్నడనాడు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప, పదాధికారులు ప్రహ్లాద్, శివమూర్తి, విజయ్కుమార్, యువరాజు, విరుపాక్షిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మస్తాన్, హుస్సేన్, శివకుమార్, పాల్గొన్నారు. -
మామిడి.. మద్దతు ధర కొరవడి..
హొసపేటె: తన మామిడి పండ్లకు సరైన మద్దతు ధర లభించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఒక రైతు కలకేరి–వడకి రహదారిపై సుమారు 3 క్వింటాళ్ల మామిడి పండ్లను రోడ్డు పక్కన కుమ్మరించి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొప్పళ జిల్లా గంగావతి తాలూకాకు చెందిన రైతు ఈశప్ప పండించిన మామిడి పండ్లకు మార్కెట్ ధర పడిపోవడంతో, అతనికి కూలీ సొమ్ము కూడా అందడం లేదు. మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్న ఆ రైతుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాక పోవడంతో అతను తన ఆటోలో తెచ్చుకున్న మామిడి పండ్లను రోడ్డు పక్కన పారబోశాడు. పంట పండించడానికి పెట్టిన పెట్టుబడి డబ్బు కూడా తిరిగి రావడం లేదు. పంట కోతకు, రవాణాకు అయ్యే కూలీ సొమ్ములు కూడా చెల్లించడానికి కావడం లేదు. ఏం చేయాలో తెలియక విసిగి పోయి, వాటినంతా రోడ్డు పక్కన పారవేశాను అని రైతు ఈశప్ప తన ఆవేదనను వ్యక్తం చేశాడు. పెట్టుబడి దక్కక 3 క్వింటాళ్ల పండ్లను రోడ్డు పక్కన పారబోసిన రైతు -
కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
రాయచూరు రూరల్: కలబుర్గి డివిజన్ పరిధిలోని ఆరు జిల్లాల్లో విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర కాంట్రాక్ట్ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం కలబుర్గి డివిజన్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బసవ ప్రభు మాట్లాడారు. విశ్వ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న 281 మందిని పర్మినెంట్ చేయడానికి రాష్ట్ర సర్కార్ ముందుకు రావాలన్నారు. 45 రోజులుగా ఆందోళన చేస్తున్నా ఫలితం లేకపోవడంతో కార్యాలయాన్ని ముట్టడించారు. మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. వారిలో కొంత మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో వేతనాలను పెంచి ఆదుకోవాలని కోరుతూ వైస్ చాన్సలర్ రమేష్కు వినతిపత్రం సమర్పించారు. -
మైసూరులో బీజేపీ సంబరాలు
మైసూరు: ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసిన నేపథ్యంలో బుధవారం మైసూరులో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కేఆర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీవత్స, కార్యకర్తలు అగ్రహార సర్కిల్ నుంచి గణపతి దేవస్థానం వరకు జాతా నిర్వహించారు. మోదీ పేరిట ఆలయంలో అర్చనలు చేయించారు. చంద్రమౌళేశ్వరి దేవస్థానంలో ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయర్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని సుదీర్ఘ పాలనలో దేశం మరింత ప్రగతి సాధించాలని ప్రార్థించారు. పార్టీ నేతలు ఎల్.నాగేంద్ర, సినీ నటుడు ఎస్.జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఊరికి వెళ్తే.. రూ.30 లక్షల నగలు మాయం దొడ్డబళ్లాపురం: ఇంటి తాళం పగలగొట్టిన దొంగలు లోపలకు జొరబడి బీరువాలో ఉన్న రూ.30 లక్షల విలువైన బంగారు నగలు, వెండి సొత్తును దోచుకున్నారు. బెంగళూరు కదిరేనహళ్లిలో ఈ ఘటన జరిగింది. బాధితుడు అరుణ్కుమార్ రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసుకుని కుటుంబ సమేతంగా బంధువుల ఊరికి వెళ్లాడు. గమనించిన దొంగలు చొరబడి బీరువాను పగలగొట్టి అందులోని బంగారు నగలు, వెండి వస్తువులు, పట్టుచీరలు మూటగట్టుకుని పరారయ్యారు. బుధవారంనాడు ఇంటికి తిరిగి వచ్చిన అరుణ్ లబోదిబోమంటూ మాదనాయకనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైషుగర్ను విస్తరించాలి మండ్య: మైషుగర్ కర్మాగారం పునశ్చేతనానికి అవసరమైన బాయ్లింగ్ హౌస్, డిస్టిలరీ, విద్యుత్ యూనిట్లు సంపూర్ణ సామర్థ్యంతో పనిచేయాలని, రాష్ట్రంలో ఆదర్శ చక్కెర కర్మాగారంగా మైషుగర్ను ప్రకటించాలని పోరాట సమితి నేతలు డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని రైతు సభాంగణం ఆవరణలో జాతీయ కవి కువెంపు ప్రతిమ ఎదుట నిరసన తెలిపారు. ఈ నెల 15 నుంచి చేపట్టిన రైతు జనాందోళన పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. కర్మాగారాన్ని పూర్తిస్థాయిలో నిర్వహిస్తే ఎంతో మంది రైతులకు అనుకూలం కావడంతో పాటు సుమారు వెయ్యి మందికి పైగా స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు. రైతు జనాందోళన జాతా ఈనెల 15 నుంచి మైషుగర్ పరిధిలోని 110 గ్రామాల్లో సంచరించి చైతన్యపరుస్తుందన్నారు. రైతు సంఘం ఉపాధ్యక్షుడు శివళ్లి చంద్రు, కొమ్మేరహళ్లి ఆనంద్, హెచ్డీ జయరాం పాల్గొన్నారు. పెద్ద పులి పట్టివేత మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకాలోని తట్టెకెరె వద్ద ఉన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హెచ్పీ మంజునాథ్కు చెందిన తోటలో బోనులో పులి పట్టుబడింది. గత నెల రోజులుగా తట్టెకెరె గ్రామంతో పాటు చుట్టుపక్కల పల్లెల ప్రజలు పులి సంచారంతో బిక్కుబిక్కుమంటున్నారు. తరచూ ఆవులు, ఎద్దులను వేటాడి చంపుతోంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు 10 సీసీ కెమెరాలను అమర్చి, దాని కదలికలపై నిఘా పెట్టి బోనులను కూడా ఏర్పాటు చేశారు. తోటలోని బోనులో పులి బందీ అయింది. పులిని అక్కడి నుంచి తరలించారు. కాగా రెండు పులులు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. మరొక పులి ఉంటే దానిని కూడా పట్టుకుంటామని అటవీ అధికారులు తెలిపారు. ప్రైవేటు స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: విద్యాబుద్ధులు నేర్పాల్సిన హెడ్మాస్టర్ కిరాతకునిలా వేధించడంతో ఓ విద్యార్థి ప్రాణం గాల్లో కలిసింది. ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బీదర్ నగరంలోని ప్రతాప్ నగరలో చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న సమీర్ (16) బుధవారం ఉదయం స్కూల్కి వెళ్లిన కొంతసేపటికే పాఠశాల 4వ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హెచ్ఎం, సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు, తల్లిదండ్రులకు చెప్పకుండా మృతదేహాన్ని బ్రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పలు కారణాలతో స్కూల్ హెడ్ మాస్టర్ వేధిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తెలిసింది. బీదర్ న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
మోదీ పేరిట ప్రత్యేక పూజలు
హొసపేటె: భారతదేశం గర్వించదగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని బుధవారం నగరంలోని నెహ్రూ కాలనీలో ఉన్న సన్నక్కి వీరభద్రేశ్వర ఆలయంలో బీజేపీ ఆధ్వర్యంలో సన్నక్కి వీరభద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్వాన్ అశోక్ జీరె, సాలి సిద్దయ్య స్వామి, ఆర్.కొట్రేష్, వీ.రాధ, గొగ్గ చెన్నబసవరాజు, శశిధర స్వామి తదితరులు పాల్గొన్నారు. లారీ దూసుకెళ్లి బైకిస్టు మృతిహుబ్లీ: జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ చోదకుడు మృతి చెందాడు. భరత్ నాగరాజ్(21) మృతుడు. భరత్ బైక్లో బమ్మిగట్టి క్రాస్ నుంచి ఏపీఎంసీ సమీపంలోని కాంప్లెక్స్కు వెళుతుండగా బైక్ ఆవును ఢీకొన్న తర్వాత లారీని ఢీకొంది. గాయపడి రోడ్డు మీద పడ్డ భరత్ భుజం మీదుగా మరో లారీ వెళ్లింది. భరత్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడని కలఘటిగి పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మహిళ బలవన్మరణం మరో ఘటనలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక కొత్త మేదారవీధికి చెందిన వాసంతి కదం (32) అనే మహిళ కొన్నేళ్ల నుంచి ట్రేడ్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు. అయితే ఇటీవల తీవ్రంగా నష్టం రావడంతో తమ ఇంట్లోని ఫ్యాన్కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె తల్లి హుబ్లీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రక్కు బోల్తా.. డ్రైవర్ సురక్షితం హొసపేటె: కొప్పళ తాలూకా మునిరాబాద్ సమీపంలో జాతీయ రహదారి– 63పై లోడ్ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చేతన్(25)కు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న జాతీయ రహదారుల శాఖ, 112 పోలీసు సిబ్బంది భీమన్న, హనుమంత సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ ఏర్పడిన ట్రాఫిక్ జామ్ను కొంతసేపటికి పరిష్కరించారు. నాగేంద్రకు మంత్రి పదవి కోసం ర్యాలీ బళ్లారిఅర్బన్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బీ.నాగేంద్రకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఒత్తిడి చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కాగె పార్క్ నుంచి గడిగి చెన్నప్ప సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి డీకే.శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం నాగేంద్రకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సంగనకల్లు విజయకుమార్, వై.శివకుమార్, నాగలకెరె గోవింద్, నాగభూషణ గౌడ, బీఎం.పాటిల్, మల్లికార్జున, మల్లేశ్వరి తదితర అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటరు జాబితా సర్వే చేయండి రాయచూరు రూరల్: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు చర్యలు చేపట్టాలని తహసీల్దార్ సురేష్ వర్మ బీఎల్ఓలకు సూచించారు. బుధవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఎల్ఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2.50 లక్షల మందిపై ఓటరు జాబితాల్లో సమీక్షలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లేకుంటే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 29 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టాలన్నారు. ముద్రితమైన ఓటరు జాబితాలో ఉన్న లోపాలను ఇంటి యజమానులతో సమీక్షించి సవరించాలన్నారు. సమావేశంలో విద్యాశాఖాధికారులు మల్లికార్జున, ఈరణ్ణ కోస్గి, శరణప్ప, అిసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ సజ్జన్లున్నారు. -
ఘనంగా గాలి అరుణ బర్త్ డే
సాక్షి,బళ్లారి: గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి సతీమణి గాలి లక్ష్మీ అరుణ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. నగరంలోని బీజేపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలకు గోరింటాకు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ అరుణ తన చేతిపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని వేసుకుని ప్రధానిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కర్ణాటక రెడ్డి జన సంఽఘం ప్రముఖులు గణపాల్ ఐనాథరెడ్డి, ఓఎంసీ డైరెక్టర్ బీ.వీ.శ్రీనివాసరెడ్డి, అభిమానులు అరుణకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో పోటీకి సిద్ధం వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను బళ్లారి సిటీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని గాలి లక్ష్మీ అరుణ చెప్పారు. బళ్లారి సిటీ నియోజకవర్గం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తే కచ్చితంగా తాను పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. ఒకవేళ తమ బావ గాలి సోమశేఖరరెడ్డికి పార్టీ టికెట్ కేటాయిస్తే ఐకమత్యంగా గెలిపించుకుంటామన్నారు. కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామని చెప్పారు. -
ఏటీఎంల్లో నగదు చోరీకి యత్నం
సాక్షి,బళ్లారి/హొసపేటె: వేర్వేరు చోట్ల ఏటీఎంల్లో నగదు చోరీలకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కొప్పళలో ఏటీఎంలో డబ్బులు దోచుకోడానికి యత్నించిన దుండగులు, ఆ ప్రయత్నం విఫలం కావడంతో చివరకు ఏటీఎంకు నిప్పు పెట్టిన ఘటన బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. కొప్పళ నగరంలోని హొసపేటె రోడ్డులో ఉన్న ఏటీఎంలో కొందరు దుండగులు దోపిడీ చేయడానికి విఫలయత్నం చేశారు. ఏటీఎంలోని డబ్బులు దోచుకోవడానికి వీలు కాకపోవడంతో ఏటీఎం యంత్రానికి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఏటీఎంకు నిప్పు పెట్టిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఏటీఎంకు నిప్పు అంటుకుందని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరిన పోలీసులు సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అక్కడి పోలీసు అధికారి తెలిపారు. హొసపేటెలో... హొసపేటె: నగరంలోని స్టేషన్ రోడ్డులో ఉన్న కనకదాస సర్కిల్లోని బోడ రంగప్ప ఇంటి సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులను దొంగలించేందుకు దొంగల ముఠా ముమ్మరంగా ప్రయత్నించిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. జనసంచారం లేని సమయాన్ని గమనించి అర్ధరాత్రి వేళ నలుగురు వ్యక్తుల బృందం ఏటీఎంను దోచుకోవడానికి యత్నం చేశారు. దొంగలు ఏటీఎం మిషన్లో ఉన్న డబ్బులు దొంగలించేందుకు ప్రయత్నిస్తు సమయంలో సీసీటీవీపై స్ప్రే చేయడంతో సైరన్ మోగింది. దీంతో విజయనగర పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందింది. పోలీస్ కంట్రోల్ రూం నుంచి నైట్ బీట్ పోలీసులకు సమాచారం చేరింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునేలోపు అప్రమత్తమైన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై హొసపేటె టౌన్ పోలీస్స్టేషన్లో జరిగింది. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. విఫలమై నిప్పు పెట్టిన దుండగులు కొప్పళ నగరంలో ఘటన కలకలం -
విధానసౌధ ఆవరణలో రైతన్న ఘోష
శివాజీనగర: విధానసౌధ ఆవరణలో ఉన్న చెట్టుకు ఓ రైతు మంగళవారం మధ్యాహ్నం ఉరి వేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడం తీవ్ర సంచలనం కలిగించింది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి ఈ సంఘటన అద్దం పట్టింది. వివరాల ప్రకారం.. చిక్కమగళూరు జిల్లా హుళియూరు గ్రామానికి చెందిన విశుకుమార్ (52) అనే రైతు విధానసౌధ ఆవరణలోని చెట్టుకు ఎక్కి ఉరి వేసుకోవడానికి ప్రయత్నించారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం తన గంధపు తోటను స్వాధీనం చేసుకొని, పరిహారం చెల్లించలేదని రైతు తెలిపాడు. గతంలోనూ ఇదే సమస్యలో 2025లో ఆయన విధానసౌధకు వచ్చి చెట్టును నరికి నిరసన తెలిపాడు. ఇప్పుడు అదే చెట్టు వద్దకు చేరుకొని ఆకుపచ్చ టవల్తో ఉరి బిగించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు ఆయనను గమనించి కిందకు రప్పించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. జిల్లాధికారికి కోర్టు ఆదేశించినా.. ఆ తరువాత రైతు మీడియాతో మాట్లాడుతూ నా భూమిని స్వాధీనం చేసుకుని ఇంతవరకూ పరిహారాన్ని ఇవ్వలేదని ఆరోపించారు. నాలుగు వారాల్లో పరిష్కరించి పరిహారాన్ని చెల్లించాలని చిక్కమగళూరు జిల్లాధికారికి న్యాయస్థానం ఆదేశించింది, అయితే 3 నెలలు గడచినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. తోటలో శ్రీగంధపు చెట్లను పెంచాను, నోటీస్ ఇవ్వకుండానే చెట్లను కట్ చేయడానికి వచ్చారు అని అధికారుల ఆగడాలను వివరించారు. చెట్టుకు ఉరివేసుకునే యత్నం భూమికి పరిహారం ఇవ్వలేదని వెల్లడి -
చువ్వలు తేలి.. పైకప్పు పెచ్చులూడి..
రాయచూరు రూరల్: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే పాఠశాల విద్యా శాఖ తాలూకా అధికారి(బీఈఓ) కార్యాలయం నగరంలో శిథిలావస్థకు చేరుకుంది. ఈ కార్యాలయం నిర్మించి 50 ఏళ్లు దాటినా మరమ్మతులకు మాత్రం నోచుకోవడం లేదు. కార్యాలయం పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. ఈ విషయంలో చొరవ చూపాల్సిన ప్రజా ప్రతినిధులు ఏరోజు కూడా ఈ కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదు. జిల్లాధికారి, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి(డీడీపీఐ) కూడా కార్యాలయం స్థితిగతుల గురించి ఏనాడూ పరిశీలించిన, పట్టించుకున్న సందర్బాలు లేవు. ఇటీవల కురిసిన వానలకు భవనంపై కప్పుపై నీరు నిలిచి కారడంతో పాటు పెచ్చులూడి కింద పడడంతో సిబ్బంది త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అధికారులు, సిబ్బంది, పనిపై కార్యాలయానికి వచ్చే ఉపాధ్యాయులు ఏ సమయంలో పెచ్చులూడి తమపై పడతాయోననే భయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. తాలూకా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు భాగంలో పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. నూతన జిల్లాధికారి కార్యాలయం మినీ విధానసౌధకు తరలి పోగా, నగరసభ కార్యాలయాన్ని పాత జిల్లాధికారి కార్యాలయానికి తరలించారు. కానీ బీఈఓ కార్యాలయాన్ని మాత్రం వేరే చోటకు తరలించడం లేదు. ఈనేపథ్యంలో ఈ సమస్యపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శిథిలావస్థకు చేరిన బీఈఓ కార్యాలయం 50 ఏళ్లు దాటినా మరమ్మతులు శూన్యం -
మోదీతో మంచి అనుబంధం
బనశంకరి: నాకు ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక అనుబంధం ఉంది. అది రాజ్యసభ స్థానం కంటే ఎక్కువ అని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ అన్నారు. జేడీఎస్– బీజేపీ సంకీర్ణం నుంచి ఆయనకు రెండవసారి రాజ్యసభ సీటు దక్కలేదని కాంగ్రెస్ నాయకులు పలు రకాల విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవేగౌడ బుధవారం బెంగళూరులో పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారం కంటే ప్రజాసేవ ముఖ్యమని అన్నారు. సీటు ఇవ్వకుండా అవమానం చేశారని కొందరు చెప్పడంలో అర్థం లేదన్నారు. నాకు, మోదీకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, రాజ్యసభ సీటు దీనిని చెడగొడుతుందని ఎవరైనా భావిస్తే అది వారి మూర్ఖత్వమని దళపతి అన్నారు. తాను ఒకానొక సమయంలో మోదీని కటువుగా విమర్శించింది నిజమని, కానీ కొన్నేళ్లుగా నేను ఆయనను అర్థం చేసుకున్నానని తెలిపారు. మంచి పనులను మనస్ఫూర్తిగా కొనియాడానని అన్నారు. తాను ఊరికే కూర్చోనని, జేడీఎస్ బలోపేతానికి శక్తిమీరి పనిచేస్తానని, రాష్ట్ర కేంద్ర విషయాలపై మాట్లాడతానని కాంగ్రెస్ను ఉద్దేశించి తెలిపారు. రాజ్యసభ సీటు రాలేదని అపోహలు వద్దు దళపతి దేవేగౌడ వ్యాఖ్యలు -
హిందువుల అడ్డగింత తగదు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో హిందువులను అడ్డుకోవడం తగదని హిందూ సంఘాల కార్యకర్త పునీత్ కెరెనళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మైసూరు నుంచి రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా హట్టిలో జరిగే హిందూ సమావేశానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడంతో పాటు జిల్లాలోకి ప్రవేశాన్ని నిర్బంధిస్తూ జిల్లాధికారిణి పూవిత, ఎస్పీ అరుణాంగ్శు గిరి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన తాను మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చానని, నోటీసులు స్వీకరించడం వీలు కాదని పోలీసులతో వాగ్వాదం చేశారు. హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే హిట్లర్లా వ్యవహరిస్తున్నారని, హిందూ సమావేశానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడం తగదని పునీత్ ఆరోపించారు. రాయచూరు జిల్లాలో ప్రవేశించే సమయంలో నోటీసులు జారీ చేయాలని, అలాంటిది ఆంధ్రప్రదేశ్లో పోలీసులు నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. -
మేలుకోటె ఆలయంలో ఇంటి దొంగలు
మండ్య: జిల్లాలోని ప్రఖ్యాత మేలుకోటె యోగ నరసింహస్వామి దేవస్థానంలో ఇంటి దొంగల నిర్వాకం బయటపడింది. అర్చకుడు నారాయణభట్టతో పాటు ఆరుమందిపై మేలుకోటె పోలీసు స్టేషన్లో దొంగతనం కేసు దాఖలైంది. చెలువనారాయణ స్వామి దేవాలయ ఈఓ శీలా మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఆలయ రక్షకుడు శ్రీధర్, అర్చకుడు నారాయణ భట్ట, పరిచారకుడు తిరువేంగడాచార్, కాపలాదారులు ఎంబీ గంగాధర, బసవరాజు, కోశాధికారి కస్తూరి శ్రీనివాసన్పై ఐపీసీ సెక్షన్ 306 కింద ఎఫ్ఐఆర్ దాఖలు అయింది. ఆలయ హుండీలోని బంగారం, వెండి, కానుక డబ్బులు, సీసీ కెమెరాల ధ్వంసం జరిగినట్లు శీలా ఫిర్యాదు చేశారు. పోలీసులు యోగానరసింహస్వామి బెట్టకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రహస్య కెమెరాలలో.. చాలాకాలంగా హుండీలో భక్తులు వేసిన బంగారం, వెండి, నగదు చోరీ అవుతున్నట్లు తనకు అనుమానంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దొంగలను గుర్తించేందుకు గర్భగుడి, ఇతర చోట్ల రహస్య కెమెరాలను ఏర్పాటు చేసినట్లు శీలా తెలిపారు. అయితే జనవరి 5న మధ్యాహ్నం ఆ కెమెరాలను నాశనం చేసి డీవీఆర్ను కాల్చివేసినట్లు తెలిసిందన్నారు. ఆ రోజు విధుల్లో ఉన్న అందరికి నోటీసులు జారీ చేసినట్లు, ఆ ఆరు మందిపై ఫిర్యాదు చేసినట్లు శీలా తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ఆలయంలో ఇలాంటి అపచారాలు జరగడంపై భక్తజనంలో తీవ్ర ఆదుర్దా నెలకొంది. హుండీలలో డబ్బు, బంగారం చోరీ ఈఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు -
ఢిల్లీ యాత్రలో సీఎం బిజీ బిజీ
శివాజీనగర: రాష్ట్ర మంత్రిమండలిలో నెలకొన్న లుకలుకలకు పరిష్కార మార్గం కనిపెట్టేందుకు ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ ఢిల్లీ యాత్రలో ఉన్నారు. బుధవారం కాంగ్రెస్ హైకమాండ్తో సమాలోచనలు జరిపారు. ఢిల్లీలో బుధ, గురువారం జరగనున్న కేంద్ర ప్రభుత్వ అధికారిక సమావేశాలు, నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. పనిలో పనిగా కేబినెట్లో మంత్రుల అలకలు, ముఖ్యమైన శాఖలు ఇవ్వలేదని మంకుపట్లను ఎలా తీర్చాలనేది పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. బెంగళూరు నగరాభివృద్ధి శాఖలోని బీడీఏ, బీఎంఆర్డీఏ విభాగాలను తనకు ఇవ్వనందుకు కృష్ణబైరేగౌడ కినుక వహించి, ఢిల్లీకి వెళ్లి హైకమాండ్కు విన్నవించుకొన్నారు. బీఎంఆర్డీఏను ముఖ్యమంత్రి శివకుమార్ తన వద్దే ఉంచుకొన్నారు. ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి కే.హెచ్.మునియప్ప కూడా అసంతృప్తితో ఉన్నారు. అలకబూనినవారికి నచ్చజెప్పాలని ఆయన పార్టీ పెద్దలను కోరనున్నారు. 20 మంత్రి బెర్తులు ఖాళీ హైకమాండ్ నేతలతో సీఎం డీకే సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశముంది. ఇంకా 20 మంత్రి కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులను 30 మందికి పైగా బలమైన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. పరిపాలన వేగంగా సాగాలంటే పూర్తిస్థాయిలో కేబినెట్ ఏర్పడాలని, కాబట్టి త్వరగా మంత్రివర్గంలోని ఖాళీలను భర్తీ చేయాలని డీకే కోరనున్నారు. ఈ నెల ఆఖరికి మంత్రివర్గ విస్తరణ నెరవేర్చే అవకాశముంది. మళ్లీ 21వ తేదీ తరువాత సిద్దరామయ్యతో కలసి ఢిల్లీకి వెళ్లి నూతన మంత్రులు ఎవరెవరనేది హైకమాండ్తో చర్చించి ఫైనల్ చేస్తారని తెలిసింది. ఎమ్మెల్యేల మకాం సీఎం ఢిల్లీలో ఉండగా, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా హస్తినకు వెళ్లారు. సుమారు 15 మందికి పైగా ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రే వెళ్లారు. మంత్రి పదవి కావాలని, తమ అర్హతలను వివరిస్తూ పార్టీ పెద్దలకు దరఖాస్తులు ఇచ్చారని తెలిసింది. కుర్చీ కోసం తమకు తెలిసిన మార్గాల్లో తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు. కొందరు ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కే.సీ.వేణుగోపాల్, సుర్జేవాలాలను భేటీ చేసి మంత్రి గిరీ కోసం విన్నవించారు. హైకమాండ్ కూడా ఎమ్మెల్యేల జాబితా తీసుకుని వారి గుణగణాలు, ప్రాంతం, తదితరాలను పరిశీలించి ఓ జాబితాను రూపొందిస్తుంది, డీకే, సిద్దు కలిసి పలు దఫాల చర్చల తరువాత ఖరారు చేయవచ్చని సమాచారం. ఢిల్లీలో సోనియాగాంధీని కలిసిన సీఎం డీకే శివకుమార్, చిత్రంలో రాహుల్, ప్రియాంకగాంధీమంత్రి పదవుల ఎంపికలు హైకమాండ్కు సవాలే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో డీకే శివకుమార్ సమావేశం కేబినెట్ విస్తరణపై పార్టీ నేతలతో చర్చలు నేడు పలు భేటీలకు హాజరు సోనియాగాంధీతో భేటీ ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీని సీఎం డీకే కలిశారు. సోనియాగాంధీని ఆమె నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. రాత్రికి సీఎం ఢిల్లీలో మకాం వేశారు. కర్ణాటక సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో విందులో పాల్గొన్నారు. గురువారం ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల అనుమతుల గురించి చర్చిస్తారని తెలిసింది. -
చెరువుల సంరక్షణకు చర్యలు చేపట్టండి
రాయచూరు రూరల్: నగరంలో చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బోసురాజు సూచించారు. మంగళవారం నగరంలోని రాంపుర తాగునీటి చెరువు సంరక్షణపై అధికారులతో మాట్లాడారు. పట్టణాలకు తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని పైపులైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు మహర్దశ కల్పించడానికి బడ్జెట్లో నిధులు కేటాయించారన్నారు. శాంతప్ప, తాయన్న నాయక్, జయన్న, శివమూర్తి, రుద్రప్ప అంగడి, అమరేగౌడ, శాలంలున్నారు. అంబేడ్కర్ ప్రతిమ ఏర్పాటుకు వినతి రాయచూరు రూరల్: నగరంలో అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని చలువాది మహాసభ డిమాండ్ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లా సంచాలకుడు విశ్వనాథ్ పట్టి మాట్లాడారు. ఏడాది క్రితం కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆలస్యం కాకుండా త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లాధికారిణి పూవితకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో వసంత్కుమార్, రవీంద్రనాథ్, తమ్మణ్ణ, బాబు, పుష్పరాజ్, దొడ్డమని, యల్లప్ప, విజయ్ ప్రసాద్, శరణప్ప, చెన్నరాయుడులున్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం రాయచూరు రూరల్: మనిషి సంపూర్ణ ఆరోగ్య రక్షణకు యోగాపై శ్రద్ధ చూపాలని యోగా శిక్షకుడు తిమ్మప్ప పేర్కొన్నారు. బుధవారం ఆయుర్వేద ఆస్పత్రిలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆయుర్వేద, యునాని శాఖల ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా 11 రోజుల పాటు జరిగే యోగా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. యోగాసనాలతో ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో అధికారులు శంకర్గౌడ ఐ పాటిల్, శంకర్ గౌడ, పూజాలున్నారు. పచ్చదనం వృద్ధికి పెద్దపీట రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి పట్టణంలో పచ్చదనం వృద్ధికి పరిసరాలను సంరక్షించాలని మాజీ నగరసభ అధ్యక్షురాలు లక్ష్మిదేవి పేర్కొన్నారు. బుధవారం మాన్వి తాలూకా పంచాయతీ కార్యాలయం వద్ద ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా రాజా వసంత నాయక్ జ్ఞాపకార్థం మొక్కలు నాటి మాట్లాడారు. భవిష్యత్తులో ఎండల వేడిమి నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. భూగర్భ జలాల పెంపుదలకు ప్రాముఖ్యతనివ్వాలని అన్నారు. -
కుప్పలు కుప్పలుగా పాములు
దూరంగా వెళ్లే ఒక్క పామును చూస్తేనే ఒళ్లు భయంతో జలదరిస్తుంది. అలాంటి ఇళ్ల ముందే అనేక సర్పాలు కనిపిస్తే చెమటలు పట్టాల్సిందే. బెంగళూరు సమీపంలో నెలమంగల పట్టణంలో ఇలాంటి సమస్యే ఏర్పడింది. ఇళ్ల మధ్యలో కుప్పలుగా సర్పాలు తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేతెల్లిపోతున్నారు. ఇళ్ల లోపల, ముందు, కాంపౌండ్లలో, చెప్పుల స్టాండ్లలో, పొదల్లో ఇలా ఎక్కడ చూసినా సర్పాలే దర్శనమిస్తున్నాయి. స్నేక్ క్యాచర్ విశ్వనాథ్ ఎవరు ఫోన్ చేసినా వెంటనే వెళ్లి బంధించి దూరంగా వదిలేస్తున్నాడు. ఎక్కువగా ప్రమాదకర రక్తపింజర, నాగుపాములు ఉంటున్నాయి. ఓ ఫాం హౌస్లోనే 20 పైగా రక్తపింజర పాముల పిల్లలు కనిపించగా వాటిని పట్టి బకెట్లో వేశారు. అలాగే నాగుపాము పిల్లలూ దొరికాయి. దేశంలోనే అత్యధిక విషం కలిగిన నాలుగు రకాల పాములు కూడా నెలమంగలో దొరికాయని విశ్వనాథ్ తెలిపాడు. ప్రజలు చాలా జాగ్రత్తా ఉండాలని ఆయన సూచించారు.- కర్ణాటక -
Karnataka: ట్రాఫిక్ ఈ–చలాన్లపై రాయితీ
రాష్ట్రంలో 2026 మే నెలలో పోలీసు శాఖలో నమోదైన ట్రాఫిక్ ఈ–చలాన్లు, రవాణా శాఖలో 1991 నుంచి 2022 వరకు నమోదైన చలాన్లపై 50 శాతం రాయితీని ఇచ్చినందున వాహనదారులు సద్వినియోగపరచుకోవాలని జిల్లా సెషన్స్ జడ్జి ఉషారాణి సూచించారు. నగరంలోని కొత్త కోర్టు సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విలేకరులతో మాట్లాడారు. 50 శాతం రాయితీతో ప్రజలు ఈ నెల 21 నుంచి జూలై 10వ తేదీలోగా చలాన్లను చెల్లించవచ్చన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి, నగర ఉప పోలీసు కమిషనర్ సుందర్రాజ్, నాగరాజ్ అంకనదొడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శివశంకర్, ఏఎస్పీ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.కర్ణాటక -
రాజ కాలువలు శుభ్రం చేయాలని ధర్నా
● మూడు గంటల పాటు మురుగు నీటిలో ఆందోళన రాయచూరు రూరల్: రాజ కాలువలను శుభ్రం చేయాలంటూ ఓ వ్యక్తి మూడు గంటల పాటు మురుగు నీటిలో ఆందోళన చేపట్టిన ఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం బెళగావి జిల్లా బైలహొంగలలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కులకర్ణి వీధి, కూలికార్ కాలనీ, పాటిల్ వీధుల్లో మురుగు కాలువల్లో పేరుకు పోయిన చెత్తా చెదారాలు తొలగించకుండా వదిలి వేయడంతో ఈశ్వర్ అనే వ్యక్తి వర్షపు నీటిలో మూడు గంటల పాటు నిలబడి ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న బైలహొంగల మున్సిపల్ కమిషనర్ భాగ్యశ్రీ ధర్నా స్థలానికి వచ్చి కాలువల శుభ్రతకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో ఈశ్వర్ ధర్నాను విరమించారు. మరణంలోనూ వీడని బంధం● ఒకే రోజు తల్లీ, కుమారుడు మృతి హుబ్లీ: శతాయుష్కురాలైన తల్లి, ఆమె కుమారుడు ఇద్దరూ ఒకే రోజు మరణించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. అణ్ణిగేరిలోని కురుబ వీధికి చెందిన శతాయుషి గంగమ్మ(102), ఆమె కుమారుడు శంక్రప్ప(60) మృతులు. ముందుగా గంగమ్మ వయోసహజ మరణం చెందారు. ఆమెకు ముగ్గురు కుమారులు. ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్లగా ఇంట్లో ఉన్న ఆమె కుమారుడు శంక్రప్ప కూడా మృతి చెందాడని సమాచారం అందింది. వెంటనే శ్మశానంలో తల్లి అంత్యక్రియలను నిలిపి వేసి కుమారుడి మృతదేహాన్ని కూడా అంతిమయాత్ర ద్వారా తీసుకొచ్చి ఇద్దరికీ అంత్యసంస్కారాలు నెరవేర్చారు. తల్లీ, కుమారుడు చావులోను ఒక్కటయ్యారని, ఎంతో పుణ్యాత్ములు అని బంధువులు మాట్లాడుకున్నారు. కాగా శంక్రప్పకు భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెట్రో ధరలు తగ్గించండి రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ మాట్లాడారు. కేంద్ర సర్కార్ ఇటీవల ధరలు పెంచుతూ పేద ప్రజల నడ్డివిరుస్తోందన్నారు. మే 15 నుంచి 25 వరకు పెట్రోల్పై రూ.7.38, డీజిల్పై రూ.7.52, గ్యాస్ సిలిండర్పై రూ.100 చొప్పున పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రో ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. ఆందోళనలో జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, శాంతప్ప, శివమూర్తి, జాగీర్దార్, అస్లాం పాషా, పవన్, మర్రిస్వామి, శ్రీదేవి, శశికళ, సురేఖ, రజాక్ ఉస్తాద్లున్నారు. రైతుల సంక్షేమానికి ఎత్తిపోతల అవసరంరాయచూరు రూరల్: రైతుల సంక్షేమానికి ఎత్తిపోతల పథకాలు అవసరమని భావించి రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసిందని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ పేర్కొన్నారు. మంగళవారం గ్రామీణ శాసన సభ్యుడి కార్యాలయంలో రైతులు ఆయనను సత్కరించిన సందర్భంగా మాట్లాడుతూ మటమారి వీరభద్రేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం రూ.182 కోట్లతో 16 వేల ఎకరాలకు నీరందించే పథకానికి అనుమతి లభించిందన్నారు. విద్యార్థుల హాస్టళ్లను ప్రారంభించాలి రాయచూరు రూరల్: 2026–27వ విద్యా సంవత్సరానికి విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైనందున హాస్టళ్ల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. మంగళవారం దేవదుర్గ తాలూకా సాంఘీక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు సంతోష్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా హాస్టళ్లను ప్రారంభించాలన్నారు. బయో మెట్రిక్ పద్ధతిని రద్దు చేయాలని కోరుతూ తాలూకా విద్యాశాఖాధికారి రాధాదేవికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో గిరియప్ప, అభిషేక్, రియాజ్, రాజు, మౌనేష్, బసవరాజ్, రామన్న, బాలు, హనుమంతులున్నారు. -
ఆశల పల్లకీలో ఆశావహులు
హుబ్లీ: దళిత కోటాలో తనకు నూటికి నూరు శాతం మంత్రి పదవి లభించే విశ్వాసం ఉందని, తనకు తప్పకుండా ఈ అవకాశం లభిస్తుందని స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ అబ్బయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ తర్వాత రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా గత 30 ఏళ్ల నుంచి కిత్తూరు కర్ణాటక భాగంలోని దళిత ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వలేదని, దీంతో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఈ ప్రాంతంలో శంకరానంద కుమారుడు ఓం ప్రకాష్ తర్వాత ఇప్పటి వరకు సుమారు 30–32 ఏళ్ల నుంచి ఎవరూ కూడా తమ సమాజానికి ప్రాతినిధ్యం ఇవ్వలేదు. దీంతో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని ముఖ్యంగా తాను ఇక్కడి స్థానికుడు అయినందు వల్ల తనకు అవకాశం ఇస్తే ఎక్కువగా పని చేయడానికి అనుకూలం అవుతుందన్న కారణంగా మంత్రి పదవి ఇవ్వాలని అగ్రనేతలకు, పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశానన్నారు. స్థానికులకు మంత్రి పదవి ఇస్తే జిల్లా అభివృద్ధికి అనుకూలం అవుతుందన్నారు. ఉత్తర కర్ణాటకకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కేవలం దక్షిణ భాగానికి ప్రాధాన్యత ఇస్తే చాలదు. ఉత్తర కర్ణాటకకు కూడా అవకాశం కల్పించాలి. ఈ భాగానికి రాజకీయ శక్తి నింపాలంటే మనం కూడా ఆర్గనైజ్డ్గా జాతీయ స్థాయిలో పార్టీని సంఘటితం చేయాలంటే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ జెండా ఇంకా మరింత గట్టిగా ఎగరాలని, తనలాంటి వారికి అవకాశం కల్పించాలని హైకమాండ్కు విన్నవించాను. దీని వల్ల కాంగ్రెస్ బలోపేతానికి దోహదపడుతుందన్నారు. బెంగళూరు మినహా హుబ్లీ రెండో ప్రముఖ కేంద్రం. ఇది కేవలం నోటి మాటలతో చెబితే చాలదు. దీంతో ఈ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, తమ సమాజం కాంగ్రెస్ పరంగా ఓటు వేస్తుంది. అందుకని తమ సమాజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయంలో ఎటువంటి భేద అభిప్రాయాలు లేవు. సాధారణంగా చిన్నా చితకా అభిప్రాయ భేదాలు ఉంటాయి. తమది పెద్ద పార్టీ. వారి వారి అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ఈ విషయమై ఇప్పటికే హైకమాండ్లో చర్చ జరిగింది. ఏ ఇబ్బంది లేదు, సరిపోతాయి. కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇస్తామని పార్టీ పేర్కొంది. 60 ఏళ్ల లోపు వారికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనపై మంతనాలు జరుగుతున్నాయన్నారు. మంత్రిగిరీ కోసం బసనగౌడ పావులు రాయచూరు రూరల్: రాష్ట్రంలోని డీకే శివకుమార్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలో మతివిడత మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వదంతుల నేపథ్యంలో జిల్లాలోని శాసన సభ్యులు మంత్రి పదవి కోసం పైరవీలు చేస్తున్నారు. సింధనూరు శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి, రాయచూరు గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, విధాన పరిషత్ సభ్యులు బసనగౌడ బాదర్లి, శరణేగౌడ, వసంత్ కుమార్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఈనెల 20 తరువాత న్యూఢిల్లీకి రావాలని ఆదేశించిన నేపథ్యంలో పాత వారిని వదిలి కొత్త వారికి అవకాశాలకు తోడు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చి చెప్పడంతో డీ.కే. శివకుమార్ కేబినెట్లో ఎమ్మెల్సీ బసనగౌడ బాదర్లి పేరు రేసులో ముందంజలో వినబడుతోంది. దళిత కోటాలో మంత్రి పదవి లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం కేబినెట్లో యువతకు చోటు కల్పిస్తారని ఎమ్మెల్సీ ఎదురు చూపు -
జన జాతరగా చేప మందు పంపిణీ
రాయచూరు రూరల్: ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరైనా పర్యటనకు వచ్చారా? లేక ఏదైనా జాతర, రథోత్సవానికి వచ్చారా? అనే విధంగా చేప మందు కోసం వేలాదిగా జనం తరలి వచ్చారు. సోమవారం సాయంత్రం కొప్పళ తాలూకా కుటుగానహళ్లిలో అశోక్రావ్ కులకర్ణి చేప మందును తమలపాకులో పంపిణీ చేశారు. మృగశిర కార్తెలో ఆయాసం, ఉబ్బసం ఇతర వ్యాధులు సోకిన వారికి చేప మందు వాడడం వల్ల వ్యాధి నయమవుతుందనే నమ్మకంతో గత 70 ఏళ్ల నుంచి చేప మందును పంపిణీ చేస్తున్నారు. ఈనేపథ్యంలో వందలాది కి.మీ.ల దూరం నుంచి ప్రజలు చేప మందు కోసం ప్రత్యేక వాహనాల్లో తరలి వచ్చి రాత్రి ఇక్కడే బస చేసి మందును తీసుకున్నారు. భారీగా కొప్పళకు తరలి వచ్చిన ప్రజలు -
ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీ
రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను సక్రమంగా అమలు చేసి, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వ మహత్వాకాంక్ష పథకం సంయుక్త కార్యదర్శి ఉజ్వల్ కుమార్ ఘోష్ సూచించారు. మంగళవారం రాయచూరు, గబ్బూరు, మసరకల్లోని ప్రభుత్వ ఆదర్శ విద్యాలయం, యరమరస్ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల చుట్టు పక్కల పరిశుభ్రతను పాటించి, వంట గది, తరగతి గదులు, గోదాములను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. వానా కాలంలో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఒపెక్ ఆస్పత్రిని పరిశీలించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ ఈశ్వర్, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ఐసీడీఎస్ అధికారిణి శరణమ్మ, జిల్లా విద్యా శాఖాధికారి మల్లికార్జున, నందిత, ఒపెక్ ఆస్పత్రి అధికారి రమేష్లున్నారు. -
11న చరంతప్పజ్జ స్వాముల స్మరణోత్సవం
బళ్లారిటౌన్: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా గద్దికేరికి చెందిన మహిమాన్విహితుడు చరంతప్పజ్జ స్వాముల 22వ పుణ్య స్మరణ ఉత్సవాన్ని ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు పార్వతి నగర్లోని బసవ భవన్లో ఏర్పాటు చేసినట్లు నందిపుర పుణ్యక్షేత్రం డాక్టర్ మహేశ్వర స్వామీజీ పేర్కొన్నారు. మంగళవారం పత్రికా భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అవార్డు ప్రదానం, వివిధ గ్రంథాల విడుదల, గ్రంథ ప్రదర్శన, ఉచిత కంటి చికిత్స శిబిరం, రక్తదానం శిబిరం, గుండె, ఎముకలు, కీళ్లు, యోగా థెరపీ వంటి శిబిరాలతో పాటు సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. తొలి రెండు రోజులు సాయంత్రం 6.30 గంటల నుంచి కార్యక్రమాలు ఉంటాయని, 13వ తేదీ చివరి రోజున వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశానికి సండూరు విరక్త మఠం ప్రభుస్వామీజీ సానిధ్యం వహిస్తారన్నారు. కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు. సమావేశంలో నేతలు పంచాక్షరప్ప, శివానంద, తిమ్మప్ప, బసవరాజు, వామన్న, రేణుకమ్మ, నటరాజు, చెన్నబసవ పాల్గొన్నారు. -
సండూరు రాజవంశీకుడు కన్నుమూత
బళ్లారిఅర్బన్: బళ్లారి జిల్లా సండూరు సంస్థాన రాజవంశానికి చెందిన ప్రముఖుడు, బీజేపీ నాయకుడు కార్తికేయ ఘోర్పడే (63) మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరులోని తన నివాసంలో ఉదయం 6 గంటల సమయంలో తీవ్ర గుండెపోటుకు గురైన కార్తికేయ ఘోర్పడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్తికేయ ఘోర్పడే మాజీ మంత్రి ఎంవై ఘోర్పడే కుమారుడు. సండూరు రాజవంశ వారసుడిగా సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. బీజేపీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తూ బళ్లారి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. సాధారణ జీవనశైలి, ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన ఆకస్మిక మరణంతో సండూరుతో పాటు బళ్లారి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్తికేయ ఘోర్పడే పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి సండూరుకు తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం సండూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతిపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గుండెపోటుతో బెంగళూరులో తుదిశ్వాస -
విత్తనాలు, ఎరువుల కొరత రానీయొద్దు
రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చూడాలని రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ సూచించారు. తన కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు విత్తనాల పంపిణీపై జాగృతి జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో ముందుగానే వానలు కురిసినందున, రైతులకు ఎలాంటి విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే సబ్సిడీ పథకాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖాధికారిణి దీపా, నేతలు శ్రీనివాస్రెడ్డి, మల్లికార్జునగౌడ, బసవరాజ్, నాగేంద్రప్ప, బషీరుద్దీన్లున్నారు. -
త్వరలో అభివృద్ధి పనుల ప్రారంభం
బళ్లారిఅర్బన్: నగరంలో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి పనులను త్వరలో ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి తెలిపారు. మంగళవారం 14వ వార్డులో నిర్వహించిన సలాం బళ్లారి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గడిగి చెన్నప్ప సర్కిల్, మహర్షి వాల్మీకి విగ్రహం, రహదారి పనులను ప్రజలకు అంకితం చేయనున్నట్లు చెప్పారు. అలాగే రూ.270 కోట్ల శాశ్వత తాగునీటి పథకానికి భూమిపూజ నిర్వహిస్తామన్నారు. భారీ వర్షాల సమయంలో అధికారులు, జెస్కాం సిబ్బంది సమర్థంగా పని చేశారని ప్రశంసించారు. పాత విద్యుత్ లైన్లు, స్తంభాల మార్పునకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేటర్ నూర్ మహమ్మద్, బీఆర్ఎల్ శీనా, మంజుల, పద్మ, థియేటర్ శివు, రాకీ తదితరులు పాల్గొన్నారు. రోడ్డుకు నామకరణం నగర అభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖుల జ్ఞాపకార్థం రోడ్లకు పేరు పెట్టే కార్యక్రమంలో భాగంగా బళ్లారి మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఓ రోడ్డుకు ముండ్లూరు నరసింహప్ప రోడ్డుగా నామకరణం చేశారు. మంగళవారం నగరంలోని అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి నామఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సమాజ సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, బళ్లారి నగర అభివృద్ధికి విశేష కృషి చేసిన ముండ్లూరు నరసింహప్ప పేరిట రోడ్డుకు నామకరణం చేయడం గర్వకారణమన్నారు. ముండ్లూరు కుటుంబ సభ్యులు, మహానగర పాలికె కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి -
ఎల్ఎల్సీ వద్ద యువకుడి దారుణ హత్య
బళ్లారిఅర్బన్: తాలూకాలోని తంబ్రళ్లి గ్రామ సమీపంలోని ఎల్ఎల్సీ కాలువ వద్ద ఓ యువకుడి మృతదేహం సగం కాలిన స్థితిలో మంగళవారం లభించింది. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. కాలువ వద్దకు వెళ్లినవారు మృతదేహాన్ని గమనించి మోకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడిని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలోని బొల్లనగుడ్డం గ్రామానికి చెందిన బసవనగౌడ(27)గా పోలీసులు గుర్తించారు. మృతుడు బళ్లారిలోని ఓ ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లో టెక్నీషియన్గా పని చేస్తున్నట్లు తెలిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో యువకుడిపై దాడి చేసి హత్య చేశారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు అనంతరం మృతదేహాన్ని సుమారు 13 కిలోమీటర్ల దూరంలోని తంబ్రళ్లి గ్రామ సమీపంలోని ఎల్ఎల్సీ కాలువ వద్దకు తరలించి పెట్రోల్ పోసి నిప్పటించినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మంటలు పూర్తిగా వ్యాపించక పోవడంతో మృతదేహం సగం కాలిన స్థితిలో బయటపడింది. మృతదేహం లభించిన ప్రదేశానికి సుమారు 13 కిలో మీటర్ల దూరంలో మృతుడికి చెందిన పల్సర్ మోటార్ సైకిల్, చెప్పులు లభ్యమైనట్లు తెలిసింది. సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు, హత్య జరిగిన తీరు పరిశీలిస్తే ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కోణంలో హత్య జరిగిందా? అని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు. సగం కాలిన స్థితిలో యువకుడి మృతదేహం మృతుడికి చెందిన పల్సర్ మోటార్ సైకిల్ సగం కాలిన స్థితిలో మృతదేహం ప్రేమ వ్యవహారమే కారణంగా అనుమానం -
కేకేఆర్టీసీ బస్సు బోల్తా
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా మోరిగేరి క్రాస్ సమీపంలో కేకేఆర్టీసీ బస్సు యాక్సిల్ విరగడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి బోల్తా పడిన ఘటన మంగళవారం జరిగింది. అయితే డ్రైవర్ చాకచక్యంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 6.45 గంటలకు హడగలి నుంచి హగరిబొమ్మనహళ్లి వైపు వెళుతున్న కేకేఆర్టీసీ బస్సు యాక్సిల్ పూర్తిగా విరగడంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉండగా, కొందరికి మాత్ర ం స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారికి తాలూకా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. నియామకం బళ్లారిటౌన్: జాతీయ మానవ హక్కుల పురుషుల హితరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడుగా ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగి రామకృష్ణను నియమించినట్లు కమిటీ సంస్థాపక అధ్యక్షురాలు రజినీ రాజ్ వెల్లడించారు. మంగళవారం పత్రికా భవనంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమితిని కొద్ది రోజుల క్రితం మండ్య జిల్లాలో ప్రారంభించామన్నారు. ప్రతి జిల్లాలోను సమితిని ఏర్పాటు చేసి పురుషుల హక్కుల కోసం ఈ సమితిని ఏర్పాటు చేశామన్నారు. ఇంత వరకు మహిళలకు జరిగే అన్యాయాలు, హక్కులపై పోరాడుతూనే ఉన్నారన్నారు. కానీ ఇటీవల పురుషులపై కూడా పలువురు మహిళల నుంచి దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయన్నారు. మహిళల మేలు కోసం ఏర్పాటు చేసిన చట్టాల దుర్వినియోగంతో పురుషులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమాజంలో పురుషుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. తాము సమితి రచించినప్పటి నుంచి పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయన్నారు. తాము వెంటనే స్పందించి కౌన్సిలింగ్ ఇచ్చి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. బళ్లారి జిల్లాలోను పురుషులు వేధింపులకు గురవుతున్న వెంటనే స్థానిక అధ్యక్షుడిని సంప్రదించవచ్చని వివరించారు. కోశాధికారి వేదవల్లి, మేనేజింగ్ ట్రస్టీ శకుంతల, రామకృష్ణ పాల్గొన్నారు. కనకగిరిలో దారుణం● అత్యాచారం చేసి మహిళ హత్య ● ఆపై మృతదేహాన్ని కాల్చిన వైనం హుబ్లీ: నిర్మాణ దశలోని భవనంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం మంటల్లో కాలుతున్న స్థితిలో లభించిన ఘటన కొప్పళ జిల్లా కనకగిరిలో చోటు చేసుకుంది. కనకగిరి 5వ వార్డులో సంగప్పకు చెందిన సదరు నిర్మాణ దశలోని భవనం 3వ అంతస్తులో కాల్చి వేసిన స్థితిలో మృతదేహం లభించింది. దుండగులు మహిళపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి నిప్పు పెట్టి కాల్చినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కనకగిరి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. హితవు పలికాడని తండ్రి హత్యహుబ్లీ: హితవు పలికినందుకు తండ్రిపై కోపంతో కట్టెతో దాడి చేసి చంపిన ఘటన నగరంలోని గోపనకొప్ప సిద్దేశ్వర కాలనీలో చోటు చేసుకుంది. కల్లప్ప మూలిమని(50) మృతుడు. ఈయన కుమారుడు మహేష్ నిందితుడు. కల్లప్ప కుమారుడు మహేష్కు తరచు బుద్ధిమాటలు చెప్పేవాడు. దీంతో ఆగ్రహం చెందిన కుమారుడు కట్టెతో ముందుగా ముఖం, ఆ తర్వాత తలపై బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కల్లప్ప మృతి చెందాడు. అశోక్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. డిమాండ్లు తీర్చాలని నిరసనహొసపేటె: వేతన బకాయిల చెల్లింపుతో సహా పలు డిమాండ్లను తీర్చాలని ఒత్తిడి చేస్తూ ఆశా కార్యకర్తలు నగరంలో నిరసన చేపట్టారు. ఏఐయూటీయూసీ అనుబంధ కర్ణాటక రాష్ట్ర యునైటెడ్ ఆశా వర్కర్స్ అసోసియేషన్ నేతృత్వంలో జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయం ముందు నిరసన తెలిపిన ఆశా కార్యకర్తలు, అనంతరం జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ శంకర్ నాయక్కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకూ గత ఐదు నెలలుగా జీతాలు లేవన్నారు. స్కూళ్లు ఇప్పటికే తెరిచారు. నిత్యావసర వస్తువుల ధరలు మరింతగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆశాల జీవితాలతో చెలగాటం ఆడటం ఖండనీయమన్నారు. ఆశా కార్యకర్తలు మంగళ, మహేశ్వరి, చెన్నమ్మ, నాగమ్మ, సుప్రియ, గౌరి, రుక్కిణి, లక్ష్మీదేవి పాల్గొన్నారు. -
పలుచోట్ల జోరు వాన
దొడ్డబళ్లాపురం: బెళగావి జిల్లా బైలహొంగల పట్టణంలో సోమవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. తగ్గు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వాననీరు, ముగురునీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. నగరసభ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ యూట్యూబర్ ఈశ్వర్ శిల్లేదార్ నీటి ప్రవాహంలో 3 గంటలపాటు నిరసన వ్యక్తం చేశాడు. డ్రైనేజీలను శుభ్రం చేయడం లేదని ఆరోపించాడు. నగరసభ కమిషనర్ భాగ్యశ్రీ హుగ్గి వచ్చి క్లీన్ చేయిస్తామని చెప్పడంతో ధర్నా విరమించాడు. మరోవైపు హుబ్లీ, ధార్వాడ నగరాల్లోనూ జోరు వాన కురిసింది. -
రాజ్యసభకు నలుగురూ ఏకగ్రీవమే
శివాజీనగర: కన్నడనాట మరోసారి రిసార్ట్ రాజకీయం మొదలైనట్లే మొదలై చివరి ఘడియల్లో రద్దయింది. మంగళవారం మధ్యప్రదేశ్లోని భోపాల్లో, ఇటు బెంగళూరులో పెద్ద తతంగమే సాగింది. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్, ఆపరేషన్ కమలం ఆందోళనల నడుమ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించాలని సాయంత్రం విమానంలో బయల్దేరారు. కొందరు ఎమ్మెల్యేలు అక్కడి అధికార పార్టీ బీజేపీ వలలో పడతారనే భయాలున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకు మొత్తం ఎమ్మెల్యేలను ఉద్యాననగరికి పంపించాలని నిర్ణయించారు. వారి కోసం బిడదిలోని వండల్ లాలో స్థానిక కాంగ్రెస్ నాయకులు వారి అతిథ్యం, పర్యవేక్షణ చేపట్టారు. పోలింగ్ ప్రక్రియ ముగిసేవరకు కూడా ఎమ్మెల్యేలు ఇక్కడే బస చేయాలని, పోలింగ్ రోజున బెంగళూరు నుంచి నేరుగా మధ్యప్రదేశ్కు తీసుకు వెళ్లాలని తీర్మానించారు. భోపాల్ నుంచి బయల్దేరిన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల విమానం వెనక్కి రాజ్యసభ ఎన్నికల్లో జాగ్రత్త చర్యలు అనూహ్యంగా అభ్యర్థి నామినేషన్ రద్దుతో రిసార్టు బస క్యాన్సిల్ మొత్తం తారుమారు భోపాల్ నుంచి చార్టర్డ్ విమానంలో 63 మంది ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రికి దేవనహళ్ళి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాలి. పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు వారికి స్వాగతం పలికి రిసార్టుకు తరలించడానికి చేరుకున్నారు. కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాల కూడా వచ్చారు. కానీ అంతలోనే ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మధ్యప్రదేశ్ నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఎన్నికల సంఘం తిరస్కరిస్తున్నట్లు సాయంత్రం ప్రకటించింది. ఆమె నామినేషన్లో పలు వివరాలను పొందుపరచలేదని ఈసీ అభ్యంతరం తెలిపింది. దీంతో మధ్యప్రదేశ్లో ఓ అభ్యర్థి తగ్గడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు నిర్ణయమైంది. ఈ ఆకస్మిక పరిణామంతో ఎమ్మెల్యేల బెంగళూరు క్యాంపును కాంగ్రెస్ పార్టీ రద్దు చేసుకుంది. బెంగళూరుకు బయల్దేరిన విమానాలు మళ్లీ భోపాల్కు వెళ్లిపోయినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల 10 రోజుల విలాసవంత యాత్ర ఇలా రద్దయింది. నామినేషన్ల ఆమోదం శివాజీనగర: కర్ణాటక నుంచి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగేనా?, ఏకగ్రీవమయ్యేనా అనే కుతూహలానికి తెరపడింది. ఈ స్థానాలకు అభ్యర్థులు సమర్పించిన నాలుగు నామినేషన్లు ఆమోదం పొందడంతో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖరారైంది. అదనపు అభ్యర్థులు పోటీలో లేకపోవడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేతలు మన్సూర్ అలీఖాన్, పవర్ ఖేరా, అలాగే బీజేపీ నుంచి నాగరాజు నామినేషన్ దాఖలు చేయడం తెలిసిందే. విధానసౌధలో ఎన్నికలాధికారి కే.ఎం.విశాలాక్షి నామినేషన్ పత్రాలను పరిశీలించి సక్రమంగా ఉన్నాయని ఆమోదం తెలిపారు. తప్పిన పోలింగ్ ప్రక్రియ అదనంగా అభ్యర్థులు రంగంలో ఉంటే ఎమ్మెల్యేలచే రహస్య ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ దఫా పార్టీలు సామరస్యంగా స్థానాలను పంచుకొన్నాయి. దీంతో ఏ విధమైన బేరాలకు ఆస్కారం లేకుండా పోయింది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11న ఆఖరు రోజు. ఆ రోజు సాయంత్రం గడువు తీరగానే ఏకగ్రీవ ఫలితాలను ప్రకటిస్తారు. -
బిట్కాయిన్ల లూటీలో మళ్లీ ఆ ఇద్దరే
బనశంకరి: సంచలనాత్మక బిట్కాయిన్ల కేసులో ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నలపాడ్పై సిట్ అధికారులు చార్జిషీట్ వేశారు. ఇదే కేసుల్లో ఈడీ కూడా ఆయనపై దర్యాప్తు చేస్తోంది. తుమకూరు కంపెనీలో బిట్కాయిన్ల చోరీల్లో ప్రధాన నిందితుడు హ్యాకర్ శ్రీకృష్ణ నుంచి నలపాడ్కు, ఆప్త మిత్రులకు వాటా దక్కిందని సిట్ చార్జిషీటులో పేర్కొంది. ఏమిటీ కేసు? 2017లో తుమకూరుకు చెందిన యూనికాయిన్ బిట్కాయిన్ ట్రేడింగ్ కంపెనీ వెబ్సైట్ను శ్రీకృష్ణ హ్యాక్ చేసి 60 కాయిన్లు (అప్పటి మార్కెట్ విలువ రూ.1.14 కోట్లు) దోచేశాడు. దీనిపై బాధితులు తుమకూరు కొత్త లేఔట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిట్ అధికారులు విచారించి శ్రీకృష్ణ, స్నేహితులు రాబిన్ ఖండేవాలా, మహమ్మద్ నలపాడ్తో పాటు మరికొందరిపై కోర్టులో ఇప్పుడు చార్జిషీట్ సమర్పించారు. దోచేసిన బిట్కాయిన్లను నలపాడ్ సాయంతో నగదుగా మార్చారు. ఇందులో నలపాడ్కు భాగం దక్కింది. ఆ డబ్బులతో నలపాడ్, రిటైర్డు ఐపీఎస్ కుమారుడు లగ్జరీ కారును కొనుగోలు చేశారు. మరోవైపు విచారణకు రావాలని నలపాడ్ కు ఈడీ 3వ సారి నోటీస్ పంపింది. ఇటీవల రెండుసార్లు జారీచేసినా హాజరు కాలేదు. హ్యాకర్ శ్రీకృష్ణ, మహమ్మద్ నలపాడ్ పేర్లు సిట్ చార్జిషీటు దాఖలు -
నగరంలో భారీగా పేలుడు సామగ్రి
బనశంకరి, కృష్ణరాజపురం: బెంగళూరు నగర శివారులో 225 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు ఉన్న బాక్సులు లభ్యమయ్యాయి. వైట్ఫీల్డ్ ఆవలహళ్లి కాడ అగ్రహార వద్ద భారీ మొత్తంలో విస్ఫోటక పదార్థాలను నిల్వ చేశారని తెలిసి ఆవలహళ్లి పోలీసులు చేరుకుని పరిశీలించారు. వాటిలో క్వారీలు, గనులలో పేలుళ్లకు ఉపయోగించే జిలెటిన్ కడ్డీలు, డిటోనేటర్లు కనబడ్డాయి. బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. వెంకటరామరెడ్డి, మధుసూదన్, పునీత్, వికాస్, సందీప్, తౌహీద్, అంబరీశ్, వేలు అనే వారిపై కేసు నమోదు చేశారు. బండరాళ్లు పేల్చడానికి తీసుకొచ్చినట్లు వారు తెలిపారు. కానీ ఎలాంటి రికార్డులు లేకుండా పేలుడు పదార్థాలను కొని, నిల్వ చేయడం చట్ట విరుద్ధమని పోలీసులు తెలిపారు. ఇటీవల బెంగళూరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రోడ్డులో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సమయంలో జిలెటిన్ కడ్డీలు దొరకడంతో భద్రతా లోపమని విమర్శలు వచ్చాయి. యరపనహళ్లి విధానసౌధ లే ఔట్లో అక్రమంగా వీరు గ్రానైట్ క్వారీని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. క్వారీకి ఎలాంటి అనుమతి లేదని చెబుతున్నారు. ఆవలహళ్లిలో స్వాధీనం పలువురి అరెస్టు -
లక్ష్మీ నరసింహా నమోస్తుతే
కోలారు: ముళబాగిలు తాలూకాలోని కదరిపుర గ్రామంలోని పురాణ ప్రసిద్ధ కంబద శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయంలో అధిక జేష్ట మాసం సందర్భంగా మంగళవారం స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. గణపతి ప్రార్థన, స్వస్తి వచనం, పుణ్యావహం, మూల లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకం తదితర ధార్మిక కార్యక్రమాలను నెరవేర్చారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. విద్యార్థులపై తేనెటీగల దాడి బనశంకరి: తేనెటీగలు కుట్టడంతో 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా ముండగోడు తాలూకా మొరార్జీ దేశాయ్ వసతి పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం భోజన వేళలో విద్యార్థులు తరగతి నుంచి బయటికి వచ్చారు. ఈ సమయంలో పాఠశాల రెండో అంతస్తులో ఉన్న తేనెగూడును ఎవరో విద్యార్థి రాయితో కొట్టడంతో తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేశాయి. 21 మందిని కుట్టడంతో నొప్పితో విలపించసాగారు. బాధితులను ముండగోడు తాలూకా ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. 20 రోజుల్లో పెళ్లి.. అంతలోనే బ్రెయిన్డెడ్ ● అవయవ దానంతో ఘనత విజయపుర: బెంగళూరు రూరల్ విజయపుర పట్టణానికి సమీపంలో ఉన్న ఐబసాపుర గ్రామానికి చెందిన శామణ్ణ కుమారుడు దీపక్ కుమార్ (32) జూన్ 4న సహకార నగర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. యలహంక స్పర్శ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విషమించగా, మంగళవారం బ్రెయిన్డెడ్ అని వైద్యులు తెలిపారు. దీపక్ కుమార్కు 20 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. వైద్యుల వినతి మేరకు ఆయన కుటుంబ సభ్యులు దీపక్ అవయవాలను దానం చేశారు. గుండె, మూత్రపిండాలు, కళ్లు, కాలేయం తదితర అవయవాలను వైద్యులు సేకరించి అవసరమైన రోగుల కోసం పంపించారు. రౌడీల కట్టడికి ప్రత్యేక దళం ● వారంరోజుల్లో ఏర్పాటుకు సర్కారు ఆదేశం బనశంకరి: రాష్ట్రంలో పెచ్చుమీరిన రౌడీయిజం, అసాంఘిక శక్తుల అణచివేతకు ప్రత్యేక పోలీసు బలగం ఏర్పాటు కానుంది. సీఎం డీకే.శివకుమార్ నిర్వహించిన పోలీసు అధికారుల సమావేశంలో దీనిపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్కిల్, పోలీస్స్టేషన్ స్థాయిలో యాంటీ రౌడీ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ ఎంఏ.సలీం ఆదేశించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటం, ప్రజలు నిర్భయంగా జీవించడానికి రౌడీయిజం, గూండాయిజం రహిత సమాజం అవసరమని ప్రభుత్వ ఆదేశాల్లో తెలిపింది. ప్రతి పోలీస్స్టేషన్లో సీఐ నేతృత్వంలో రౌడీ నియంత్రణ దళం ఉంటుంది. నిఘా.. నియంత్రణ క్రిమినల్ కేసుల్లో ఉన్న వ్యక్తుల చరిత్రను పరిశీలించి కొత్తగా రౌడీషీట్ తెరవడం, రౌడీల కౌన్సెలింగ్, నిఘా వంటి పనులను నిర్వహిస్తారు. రౌడీషీటర్ల ఇళ్లు, అడ్డాలపై తరచూ దాడులు చేస్తారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే రౌడీలపై గూండాయాక్ట్, కోకా యాక్ట్, నగర బహిష్కరణ లాంటి కఠిన చర్యలు తీసుకుంటారు. 15 రోజులకు ఒకసారి రౌడీల వ్యవహారాలపై సమీక్ష చేస్తారు. ప్రజలను బెదిరించడం, వసూళ్లు, దోపిడీలు, ముఠా కలహాలు వంటి వాటికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. వారంరోజుల్లోగా దళాలను ఏర్పాటుచేసి తమ ఆఫీసుకు నివేదిక పంపాలని అన్ని నగరాల పోలీస్ కమిషనర్లు, ఐజీపీలు, జిల్లా ఎస్పీలకు ఆదేశించారు. -
ప్రభుత్వ ఉద్యోగి డిజిటల్ అరెస్టు.. రూ.83 లక్షల వసూలు
దొడ్డబళ్లాపురం: డిజిటల్ అరెస్టు అని సైబర్ నేరగాళ్లు బెదిరించి ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.83.82 లక్షలు వసూలు చేశారు. ఈ ఘటన బాగల్కోటలో జరిగింది. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు కార్యాలయంలో పని చేస్తున్న హెచ్వీ సురేశ్ రావ్ (59) బాధితుడు. ముందుగా ట్రాయ్ పేరుతో ఫోన్ చేసిన దుండగులు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులమని చెప్పారు. మీ ఆధార్ కార్డు పేరుమీద తీసుకున్న సిమ్ కార్డుల నుంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని, కేసులు నమోదు చేశామని బెదిరించారు. ఆ తరువాత వీడియోకాల్స్ చేసి పోలీస్ట్షన్, కోర్టు లాయర్లు, జడ్జీలను చూపించారు. సురేశ్ రావ్ భయపడడంతో కేసుల నుంచి బయటపడాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండు చేశారు. దీంతో సురేశ్ పలు విడతలుగా మొత్తం రూ.83.82లక్షలు సమర్పించుకున్నాడు. ఈ తతంగం మార్చ్ 18 నుండి ఏప్రిల్ 15 వరకూ నడిచింది. తాను మోసపోయినట్టు తెలుసుకున్న సురేశ్రావ్ ఇప్పుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుప్పలు కుప్పలుగా పాములు ● నెలమంగలలో భయం భయం దొడ్డబళ్లాపురం: దూరంగా వెళ్లే ఒక్క పామును చూస్తేనే ఒళ్లు భయంతో జలదరిస్తుంది. అలాంటి ఇళ్ల ముందే అనేక సర్పాలు కనిపిస్తే చెమటలు పట్టాల్సిందే. బెంగళూరు సమీపంలో నెలమంగల పట్టణంలో ఇలాంటి సమస్యే ఏర్పడింది. ఇళ్ల మధ్యలో కుప్పలుగా సర్పాలు తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేతెల్లిపోతున్నారు. ఇళ్ల లోపల, ముందు, కాంపౌండ్లలో, చెప్పుల స్టాండ్లలో, పొదల్లో ఇలా ఎక్కడ చూసినా సర్పాలే దర్శనమిస్తున్నాయి. స్నేక్ క్యాచర్ విశ్వనాథ్ ఎవరు ఫోన్ చేసినా వెంటనే వెళ్లి బంధించి దూరంగా వదిలేస్తున్నాడు. ఎక్కువగా ప్రమాదకర రక్తపింజర, నాగుపాములు ఉంటున్నాయి. ఓ ఫాం హౌస్లోనే 20 పైగా రక్తపింజర పాముల పిల్లలు కనిపించగా వాటిని పట్టి బకెట్లో వేశారు. అలాగే నాగుపాము పిల్లలూ దొరికాయి. దేశంలోనే అత్యధిక విషం కలిగిన నాలుగు రకాల పాములు కూడా నెలమంగలో దొరికాయని విశ్వనాథ్ తెలిపాడు. ప్రజలు చాలా జాగ్రత్తా ఉండాలని ఆయన సూచించారు. నేనేమీ చించలేదన్నావు.. నన్నెందుకు కలుస్తావు? ● సీఎం శివపై కుమారస్వామి రుసరుస శివాజీనగర: నూతన సీఎం డీకే శివకుమార్ మాజీ సీఎంలను, సీనియర్ నాయకులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. అదే మాదిరిగా మాజీ సీఎం, ప్రస్తుత కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి అవకాశమిస్తే వెళ్లి ఆయనను కలుస్తానని ప్రకటించారు. కాకపోతే ఇద్దరి మధ్య దశాబ్దాలుగా తీవ్ర వైరం సాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం బెంగళూరులో కుమారస్వామి తనదైన శైలిలో స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ ‘డీకే శివకుమార్ ఈ అతి వినయపు ప్రదర్శన వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన నేను ఏమి చించాను? అని గతంలో ఇదే డీకే శివకుమార్ విర్శించారు. నేనేమీ చింపలేదన్న తరువాత ఆయన ఎందుకు నా వద్దకు వచ్చి ఏ సలహాను అడుగుతారు? ఆయనకు నేనేమి సలహాలు ఇవ్వగలను?’ అని దుయ్యబట్టారు. డీ.కే.శివకుమార్కు మీడియాలో ప్రచారం, ఫోటోలు కావాలి, అందుకోసమే నేతల ఇళ్లకు వెళుతున్నారని కుమార ఆరోపించారు. అతి వినయం ధూర్త లక్షణం అనే సంస్కృత సూక్తి శివ కుమార్కు సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేపై ఈడీకి ఫిర్యాదు బనశంకరి: రూ.2 వేల కోట్లకు పైగా విలువచేసే బెంగళూరు నగర పాలికే ఆస్తిని చట్ట వ్యతిరేంగా కుదువపెట్టి రూ.754 కోట్ల రుణం తీసుకున్నారని చిక్కపేటే ఎమ్మెల్యే ఉదయ్ గరుడాచార్, మరికొందరిపై ఈడీకి ఫిర్యాదు వెళ్లింది. జాగృతి ఓటర్ల వేదిక కార్యదర్శి బీ.గణేశ్సింగ్ ఈ మేరకు 1,430 పేజీలతో మంగళవారం ఈడీకి ఫిర్యాదు చేశారు. కోరమంగల ఈజీపురలో 15.64 ఎకరాల పాలికే భూమి విలువ రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుందన్నారు. పేదలకు 1,640 ఇళ్లు నిర్మించడానికి 2012లో ఈ భూమిని ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారన్నారు. అక్కడ ఎమ్మెల్యేకు చెందిన సంస్థ ఇళ్లే కట్టలేదని, పైగా భూమిని కుదువపెట్టి రూ.754 కోట్లు రుణం తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం పదవి మళ్లీ మిస్: డీసీఎం తుమకూరు: నాకు గతంలో 3 సార్లు సీఎం పదవి తప్పిపోయింది అని కొత్త డిప్యూటీ సీఎం పరమేశ్వర్ వాపోయారు. తుమకూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావాలనే తన చిరకాల కోరిక ఇంకా అలాగే ఉందని ఉద్వేగానికి గురయ్యారు. 2013 ఎన్నికల్లో పార్టీ గెలిచినా, తాను ఓడిపోవడం వల్ల ముఖ్యమంత్రి పదవి తప్పిపోయిందని, ఆనాడు తాను గెలిచి ఉంటే సిద్ధరామయ్య సీఎం అయ్యేవారు కాదని తెలిపారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 స్థానాల్లో గెలుపొందినా మైత్రి సర్కార్ కారణంగా హెచ్డీ కుమారస్వామి సీఎం అయ్యారన్నారు. ఈసారి కూడా సీఎం పదవి తనకు రావాల్సి ఉన్నా, వివిధ రాజకీయ కారణాల వల్ల సాధ్యపడలేదని అన్నారు. ఇటీవల ఢిల్లీలో సీఎం పదవి ఇవ్వకపోతే వెంటనే చెప్పేయాలని, తనకు అవతల చాలా పనులు ఉన్నాయని హైకమాండ్కు చెప్పేశానన్నారు. -
పాఠశాలల్లో చివరి బెంచీకి స్వస్తి?
బెంగళూరు: ప్రతి తరగతి గదిలో ఇకపై చివరి బెంచ్ ఉండదు. యూ ఆకారంలో లేదా వృత్తాకారంలో బెంచ్లు ఏర్పాటు చేస్తారు. కేరళలో ఇదే విధానం కొనసాగుతోంది. ఇదేవిధానాన్ని రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. చదువులో వెనుకబడిన విద్యార్థులను వెనుకబెంచ్లో కూర్చొబెడతారనే అపవాదు ఉండేది. దీంతో చివరి బెంచ్లో కూర్చునే విద్యార్థులకు సరైన ప్రోత్సాహం ఉండేది కాదు. దీంతో ప్రతి ఒక్క విద్యార్థిపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టేలా వృత్తాకార, లేదా యూ ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంటుందని, ఇన్నాళ్లూ తాము చివరి బెంచీకి పరిమితం అయ్యామనే వేదన వారిలో తొలగిపోతుందని భావిస్తున్నారు. సంప్రదాయ వరుస ఆసనాల వ్యవస్థకంటే కేరళ విధానంలో విద్యార్థులను కూర్చొబెట్టడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచినట్లు అవుతుందని విద్యానిపుణుల అభిప్రాయం. యూ ఆకార ఆసనాల వ్యవస్థలో ఉపాధ్యాయులు తరగతి కేంద్రభాగాల్లో నిల్చొని పాఠాలు చెబుతారు. దీంతో విద్యార్థులందరూ శ్రద్ధగా పాఠాలు వింటారు. పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయి. అంతేగాకుండా విద్యార్థులతో బృంద చర్చలు, పాఠ్యాంశాలలో సందేహాలు తీర్చుకునేందుకు ఈ విధానం అత్యుత్తమమైనదని నిపుణులు భావిస్తున్నారు. -
హమ్మయ్యా అనుకునేలోపే.. కర్ణాటకలో బిగ్ ట్విస్ట్
కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు సర్దుమణిగాయి అనుకునేలోపే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు కొత్త తలనొప్పి మొదలైంది. కేబినెట్ కేటాయింపులపై అసంతృప్తి.. ఇంకా చల్లారలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ‘మా మొర ఆలకించండి మహా ప్రభో’.. అంటూ మరో ఇద్దరు సీనియర్లు ఢిల్లీకి పయనమవడం కొత్త చర్చకు దారితీసింది.బెంగళూరు డెవలప్మెంట్ పోర్ట్ఫోలియోపై అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి కృష్ణ బైరేగౌడ ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఈ కీలక శాఖ నిర్వహణపై స్పష్టత లేకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి బాధ్యతలు సీఎం వద్దే ఉండటం, బీడీఏ, బీఎంఆర్డీఏ వంటి కీలక సంస్థలు కూడా ఆయన పరిధిలోనే ఉండటంతో అధికార విభజనపై గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆయన పార్టీ హైకమాండ్తో చర్చించేందుకు ఢిల్లీలో ఉన్నారని సమాచారం.ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీకే శివకుమార్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయన గతంలోనూ నాయకత్వ మార్పుపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఇక గత వారం కేబినెట్ విస్తరణలో మొత్తం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఇంకా 21 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలపై తీవ్ర స్థాయిలో లాబీయింగ్ కొనసాగుతోంది. ఒక్కో శాఖ కేటాయింపే ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం పొందుతుండటంతో కాంగ్రెస్లో అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఇప్పటికే సీనియర్ నేత రామలింగారెడ్డి వ్యవహారం, ఆయన రాజీనామా వెనక్కి తీసుకోవడం.. తదితర పరిణామాలు పార్టీకి తలనొప్పిగా మారింది. అదే సమయంలో సీనియర్ నేత కెహెచ్ మునియప్ప కూడా తనకు ఇచ్చిన శాఖపై అసంతృప్తి వ్యక్తం చేవారు. తన స్థాయికి తగ్గ ప్రాధాన్యం లభించలేదని హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాహుల్ గాంధీతో సహా పార్టీ పెద్దలకు తన అభిప్రాయాలు తెలియజేశానని ఆయన స్వయంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.మొత్తానికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలివారాల్లోనే కర్ణాటక కాంగ్రెస్లో కేబినెట్ అసంతృప్తి, శాఖల పంపిణీ వివాదాలు, ఢిల్లీ లాబీయింగ్ రాజకీయ వేడి పెంచుతున్నాయి. పరిస్థితి ఇంకా పూర్తిగా చక్కబడలేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
వాన నీటిలో కాలనీలు.. తప్పని ఇబ్బందులు
సాక్షి,బళ్లారి: వర్షాకాలం వచ్చిందంటే బళ్లారిలో పలు కాలనీలు అస్వవ్యస్తంగా మారతాయి. ప్రతి ఏటా వర్షాకాలం రావడం సర్వసాధారణం. అయితే వర్షాకాలంలో వర్షాలు వచ్చినప్పుడు ఆయా కాలనీలు నీటికుంటల్లా మారడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. వర్షాలు వచ్చినప్పుడు కాలనీ రోడ్లలో నీరు నిలిచి పోయినప్పుడు పాలకులు, అధికారులు తూతూమంత్రంగా పర్యవేక్షణ చేసి అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రకటించడం షరా మామూలే. అయితే శాశ్వత పరిష్కారం చూపక పోవడంతో కాలనీ వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనంతపురం రోడ్డులో బీపీఎస్సీ గర్ల్స్ హాస్టల్ సమీపంలోని కేవీటీ నగర్ 2వ క్రాస్లోని పలు రోడ్లు నీటి కుంటల్లా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో నరకయాతన ఆయా రోడ్లు లోతట్టు ప్రాంతాలు కావడంతో బురద, వర్షం నీరు ఇళ్లలోకి రావడంతో పాటు అలాగే నిలిచి పోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే హనుమాన్ నగర్ 1వ వార్డులోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో ఇంకా వర్షం నీరు రోడ్ల మీదనే ఉన్నాయి. వర్షం ఆగిన తర్వాత కూడా వారం, పది రోజులు బురద, వర్షం నీరు కలిసి చెరువులను, కుంటలను తలపిస్తాయి. శాశ్వత పరిష్కారం చేయాల్సిన పాలకులు, అధికారులు తాత్కాలికమైన చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయా కాలనీల వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్లలో వర్షం నీటి నిల్వతో ప్రజలకు తిప్పలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు -
కుట్టుమిషన్ల పంపిణీ
రాయచూరు రూరల్: చదువుపై దృష్టి పెట్టేలా నేటి విద్యార్థులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని స్వామి వివేకానంద ఆశ్రమ సంచాలకుడు వేణుగోపాల్ పేర్కొన్నారు. ఆదిఽవారం నగరంలోని ప్రైవేట్ భవనంలో రోటరీ ఫౌండేషన్, క్లబ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లల భవిష్యత్తును అంధకారంలో పడేయకుండా వారికి బంగారు బాటలు వేయాలన్నారు. నేడు విద్యకు ఉన్న ప్రాధాన్యత ఏ రంగానికీ లేదన్నారు. మహిళలు స్వశక్తితో తమ కాళ్లపై తాము నిలబడి జీవించడానికి రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. కార్యక్రమంలో లక్ష్మీదకాంతరెడ్డి, త్రివిక్రం జోషి, చంద్రకాంత్, నిజానందరెడ్డి, కేశవరావు్, రవీంద్ర, కృష్ణ, అశోక్ కుమార్, పవన్, మునిస్వామి, శివశంకర్లున్నారు. పథకాలు లబ్ధిదారుల దరి చేర్చండిరాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను లబ్ధిదారులకు అందించాలని కేంద్ర ప్రభుత్వ మహత్వాకాంక్ష శాఖ సంయుక్త కార్యదర్శి ఉజ్వల్ కుమార్ ఘోష్ సూచించారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, మహిళా శిశు సంక్షేమ శాఖ, మౌలిక సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రధానమంత్రి మహత్వాకాంక్ష పథకం దేశ వ్యాప్తంగా 122 జిల్లాల్లో అమలులో ఉండగా, రాయచూరు జిల్లా 49వ స్థానంలో ఉందన్నారు. కనీసం 250 గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లాధికారిణి పూవిత, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, అిసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ సజ్జన్, జిల్లా విద్యాశాఖాధికారి మల్లికార్జున, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, రోణ, తిమ్మప్ప, సోమశేఖరప్ప, శరణమ్మ, నందిత, వీరేష్ నాయక్లున్నారు. గవియప్పకు మంత్రిగిరీ కోసం హంపీలో ప్రత్యేక పూజలు హొసపేటె: విజయనగర అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే హెచ్ఆర్.గవియప్పకు మంత్రి పదవి లభించాలని కోరుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం హంపీలోని విరుపాక్షేశ్వర స్వామి ఆలయంలో పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ మొక్కును తీర్చాలని 201 కొబ్బరికాయలు కొట్టారు. కాంగ్రెస్ నాయకుడు సోమేష్ మాట్లాడుతూ కొత్త జిల్లా అభివృద్ధి దృష్ట్యా తప్పనిసరని, ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్పకు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు రామన్న, మహేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. కుక్కలకు రేబిస్ టీకాలుహొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా హంపాపట్టణ గ్రామ పంచాయతీ, తాలూకా పశుసంవర్థక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో పెంపుడు, వీధి కుక్కలకు రేబిస్ టీకాలు వేశారు. ప్రభుత్వ పశువైద్యశాల సమీపంలో నిర్వహించిన టీకాల పంపిణీ కార్యక్రమంలో గ్రామంలోని 30కి పైగా పెంపుడు కుక్కలకు రేబిస్ టీకాలను వేయడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టారు. ఇటీవల గ్రామంలో పిచ్చికుక్క దాడిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈనేపథ్యంలో రేబిస్ వ్యాప్తిని నివారించడానికి సోమవారం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ అధ్యక్షుడు పత్రీ యల్లప్ప ప్రారంభించారు. పంచాయతీ అభివృద్ధి అధికారి ఖాజా బన్నీ మాట్లాడుతూ రేబీస్ ఒక ప్రాణాంతక వ్యాధి అని, దాని వ్యాప్తిని నివారించడానికి మనమందరం కలిసి పని చేయాలని అన్నారు. ప్రతి కుక్కకు రేబిస్ టీకా వేయించాలి. టీకా కార్యక్రమాన్ని తప్పనిసరి చేస్తే, గ్రామంలో రేబిస్ వ్యాధి సోకిన కుక్కలు ఉండవు. ప్రజారోగ్యం దృష్ట్యా, ప్రతి ఒక్కరూ తమ కుక్కలను రేబిస్ టీకాలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. -
చదువుతోనే ఉన్నత స్థాయికి
మండ్య: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువుతోనే లక్ష్యాలను సాధించగలరని వక్తలు తెలిపారు. మండ్య తాలూకాలోని హనకెరె గ్రామంలోని రైతు విద్యా సంస్థలో విద్యార్థులకు ఉచిత నోట్బుక్లను పంపిణీ చేశారు. విద్య అనేది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి. ప్రతి విద్యార్థి మంచి విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవాలని అన్నారు. బాలలు విద్యతో పాటు మంచి నడవడిక, క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకోవాలి. మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.ఉగ్ర దాడులకు పన్నాగం బనశంకరి: పాక్ ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతూ అరెస్టయిన తుమకూరు శ్రీరామనగర నివాసి అల్లాబక్షి, దావణగెరెవాసి జమీర్ఖాన్ దేశంలో పేలుళ్లకు కుట్ర చేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది. అల్లాబక్షి ఇన్స్టాలో పాక్ ఉగ్రవాదులను ఠాణా బాయి బాయి అని సేవ్ చేసుకున్నాడు. హిందీలో వారికి సందేశాలు పంపేవాడు. జమీర్ఖాన్తో కలిసి దేశంలో కనీసం 60 మంది యువకులను ఉగ్రవాదులుగా తయారు చేయాలని, దీనికి అయ్యే ఖర్చును ఉగ్రసంస్ద అందిస్తుందని నిందితులు విచారణలో తెలిపారు. తుమకూరు పోలీసులు, కేంద్ర నిఘా అధికారులు వారిని విచారిస్తున్నారు. దేశంలో విధ్వంసానికి పాల్పడాలని, తమ మత వ్యతిరేకులపై దాడులు చేయాలని అనుకున్నట్లు చెప్పారు. ఎస్పీ పేరుతో మోసాల దందాదొడ్డబళ్లాపురం: విజయపుర జిల్లా ఎస్పీ లక్ష్మణ్ నింబరగి పేరుతో ఫేక్ ఫేస్బుక్ ఐడీ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్న వంచకున్ని అక్కడి సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బెళగావి జిల్లా గోకాక్కు చెందినన హనుమంత భజంత్రి. విజయపుర జిల్లా ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఐడీ క్రియేట్ చేశాడు. చాటింగ్ చేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పుకునేవాడు. ఇలా బబలేశ్వర తాలూకా బిదరి గ్రామం నివాసి సురేశ్ అథణి అనే వ్యక్తికి పీడబ్ల్యూడీ శాఖలో క్లర్కు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.5లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇవ్వకపోవడంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా భజంత్రి గుట్టు రట్టయింది.కాంగ్రెస్ నేత సూరజ్ హెగ్డే కన్నుమూత శివాజీనగర: ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర గ్యారెంటీ పథకాల అమలు కమిటీ ఉపాధ్యక్షుడు సూరజ్ హెగ్డే (55) తీవ్ర గుండెపోటుతో బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో ఆదివారం రాత్రి కన్నుమూశారు. నివాసంలో ఉండగా అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. హెగ్డే మృతికి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ, సీఎం డీ.కే.శివకుమార్తో పాటు పెద్దసంఖ్యలో నాయకులు సంతాపం తెలిపారు. పార్టీ నేతగా ఆయన సేవలను కొనియాడారు. సూరజ్ హెగ్డే తన తాత దేవరాజ అరస్ మాదిరిగా వెనుకబడిన వర్గాలు, కార్మికుల హక్కు, సామాజిక న్యాయం కోసం శ్రమించేవారని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సూరజ్ ఆత్మకు శాంతి కలగాలన్నారు. బీజేపీతో జేడీఎస్కు అంతే మండ్య: రాజ్యసభ ఎన్నికల్లో మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ, మాజీ ఎంపీ సుమలత అంబరీష్కు బీజేపీ రాజ్యసభ టికెట్లు ఇవ్వకుండా ఒక్కలిగలకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.రవికుమార్ ఆరోపించారు. సోమవారం ఇక్కడ ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేవేగౌడకు టికెట్ ఇవ్వకుండా జేడీఎస్ను అంతం చేయడానికి బీజేపీ మేకులు కొడుతూనే ఉంది. వారు చివరి మేకు ఎప్పుడు కొడతారో మాకు తెలియదు, జేడీఎస్ అనే పార్టీని బీజేపీ నాశనం చేస్తుంది అని విమర్శలు గుప్పించారు. దేవెగౌడపై ప్రధాని నరేంద్ర మోదీ చూపే ప్రేమ నాటకమని, టీవీలు, కెమెరాల కోసం వేసే పోజు అని విమర్శించారు. కుమారస్వామి పోటీ చేస్తానంటే సుమలత మండ్య స్థానాన్ని త్యాగం చేశారని, అలాంటి ఆమెకు బీజేపీ ఏ పదవీ ఇవ్వకుండా అన్యాయం చేయడం ఖండనీయమన్నారు. -
ఇది రాజకీయ చదరంగం
బనశంకరి: రాజకీయ చదరంగం ఆడేటప్పుడు ఏమి చేస్తారో ఎవరూ చెప్పరు.. అని ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ అన్నారు. సోమవారం విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జేడీఎస్ అదనపు అభ్యర్థిని నిలపడాన్ని ప్రస్తావించగా ఇది రాజకీయ చదరంగమని, తమ ఆటను ఎవరూ బయటకు చెప్పరని సమాధానమిచ్చారు. దళపతి దేవేగౌడకు రాజ్యసభ టికెట్ ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేసిందని సుర్జేవాలా విమర్శించారని చెప్పగా, దీనిపై తానేమీ మాట్లాడను, సుర్జేవాలానే మాట్లాడతారని చెప్పారు. మంత్రులకు గదుల కేటాయింపు డీకే కేబినెట్లోని 13 మంది మంత్రులకు గదులను కేటాయించారు. విధానసౌధ, వికాససౌధలో మంత్రులకు గదులు కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. జల వనరుల శాఖ మంత్రి రామలింగారెడ్డికి 335, 336, 337, 337ఏ గదులను కేటాయించారు. గతంలో డీసీఎంగా డీకే.శివకుమార్ వినియోగించిన గదులకు మరమ్మతులు చేసి రామలింగారెడ్డికి కేటాయించడం గమనార్హం. సీఎంకు కుమారకృప కుమారకృపా అతిథి గృహం ఇకపై ముఖ్యమంత్రి నివాసం కార్యాలయం కానుంది. ప్రస్తుతం ప్రధాన ముఖద్వారం తూర్పు భాగంలో ఉంది. ఆ ద్వారాన్ని మార్చారు. సీఎం డీకే ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తారు. సీఎం డీకే శివ వ్యాఖ్యలు -
పర్యవేక్షణ లోపం.. సంక్షేమానికి శాపం
హాస్టల్లో ఆలనా పాలనా కరువై తుప్పు పడుతున్న పడకలు పరిశుభ్రత లోపించి దుస్థితిలో మరుగుదొడ్లు సాంఘీక సంక్షేమ శాఖ విద్యార్థుల హాస్టల్ రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో సాంఘీక సంక్షేమ, వెనుక బడిన వర్గాల శాఖ పరిధిలోని హాస్టళ్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆ శాఖ హాస్టళ్లలో అవినీతి మితిమీరి పోవడంతో విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు. కళ్యాణ కర్ణాటక పరిధిలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయనగర జిల్లాల్లో సాంఘీక సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, కింది స్థాయి ఉద్యోగుల అక్రమార్జన ఫలితంగా హాస్టళ్ల పని తీరు నిరాశాజనకంగా మారింది. కళ్యాణ కర్ణాటకలో వెనుక బడిన వర్గాల హాస్టళ్లు 450, సాంఘీక సంక్షేమ హాస్టళ్లు 550, షెడ్యూల్డ్ తెగల హాస్టళ్లు 100, రాయచూరు జిల్లాలో వెనుక బడిన వర్గాల హాస్టళ్లు 90, సాంఘీక సంక్షేమ హాస్టళ్లు 110, షెడ్యూల్డ్ తెగల హాస్టళ్లు 25కు పైగా ఉన్నాయి. లోపించిన కనీస వసతులు విద్యార్థులకు తగ్గట్టు హాస్టళ్లలో భోజనం వడ్డించక పోవడం, కనీస వసతులు కల్పించడంపై వార్డెన్లు, సిబ్బంది దృష్టి సారించలేక పోతున్నారు. ఫలితంగా విధి లేని పరిస్థితులో విద్యార్థులు కాలాన్ని వెళ్లదీయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక హాస్టళ్ల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో ఊహించుకోవచ్చు. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి దారుణ పరిస్థితి ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని హాస్టళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో విదితమవుతోంది. హాస్టళ్ల పనితీరుపై పర్యవేక్షణ లోపం వల్లే నేడు ఈ పరిస్థితికి దిగజారాయి. హాస్టళ్లలో పారిశుధ్యం కొరవడడంతో అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. ఉన్నతాధికారులు వీటిని తూతూ మంత్రంగా తనిఖీ చేస్తుండడంతో వార్డెన్లు, సిబ్బంది అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. విధులకు సిబ్బంది డుమ్మా గ్రామీణ ప్రాంతాల్లో హాస్టల్ వార్డెన్లు వారానికోసారి మాత్రమే పర్యవేక్షిస్తున్నారు. హాస్టళ్లలో వాచ్మెన్లు, వంట మనిషులుగా నియమితులవుతున్న సిబ్బంది తమ విధులను ఇతరుల ద్వారా చేయిస్తూ దర్జాగా తిరుగుతున్నారు. జిల్లాలో హాస్టల్ విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడం సర్వసాధారణమైంది. వారం రోజుల క్రితం లింగసూగూరు, సింధనూరు, రాయచూరు హాస్టళ్లలో వార్డెన్లు విద్యార్థులకు భోజనం పెట్టకుండా మూడు రోజుల పాటు ఉపవాసం పెట్టిన ఘటన నెలకొంది. ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు మౌనం వహించడం తగదని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టళ్లలో కనీస సౌకర్యాలు మెరుగు పరచడంతో పాటు అక్రమార్జనకు అలవాటు పడ్డ వార్డెన్లు, సిబ్బందిపై చర్యలు చేపటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కళ్యాణ కర్ణాటకలోని జిల్లాల్లో అధ్వానంగా హాస్టళ్ల నిర్వహణ పెరిగిన వార్డెన్, సిబ్బంది అవినీతి, అక్రమార్జనతో నిరాశాజనకం -
లోకాయుక్త వలలో ఇద్దరు అధికారులు
రాయచూరు రూరల్: కృష్ణా భాగ్య జల నిగమ నియమిత(కేబీజేఎన్ఎల్)లో విధులు నిర్వహిస్తున్న అధికారులు లంచం తీసుకుంటూ లోకాయుక్త వలలో చిక్కిన ఘటన సోమవారం విజయపుర జిల్లాలో చోటు చేసుకుంది. కాంట్రాక్టర్ నానా సాహెబ్ చేసిన పనులకు చెల్లించాల్సిన రూ.3,71,419 బిల్లుకు చెక్ ఇచ్చేందుకు విజయపుర జిల్లా ఇండి తాలూకా సాలోటగి కార్యాలయం అధికారులు రూ.18 వేలు లంచం అడిగారు. ఈ విషయంపై కాంట్రాక్టర్ నానా సాహెబ్ లోకాయుక్త అధికారులను ఆశ్రయించారు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏఈ సేవాలాల్ చౌహాన్ రూ.10 వేలు, జూనియర్ ఇంజనీర్ సాత్లింగప్ప రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు దాడి చేసి వారిద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. హెస్కాం ఉద్యోగి ఆత్మహత్యహుబ్లీ: కుందగోళ హెస్కాం కార్యాలయంలో పవర్ మ్యాన్గా పని చేస్తున్న హెస్కాం ఉద్యోగి హుబ్లీలోని ఆర్ఎం లోహియానగర్లోని అద్దె ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంజునాథ్ డొంబర(28) ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. భార్య మేఘ, తల్లి శోభ, సోదరుడు రాజేష్ వేధింపులతో మనోవేదనకు గురై మంజునాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తండ్రి పాత హుబ్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలారా భయపడకండి, అండగా మేమున్నాం ● కూడ్లిగిలో రాత్రంతా వీధుల్లో అధికారులు, పోలీసుల గస్తీ హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలోని బసవేశ్వర సర్కిల్ సమీపంలో ఇళ్ల చుట్టూ ఇటీవల ముసుగులు ధరించిన దొంగలు తిరుగుతున్న వీడియో వైరల్ కావడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. హొసహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కానామడుగులో మూడు ఇళ్లలో చోరీలు జరిగినట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ ఘటనలపై కేసులు నమోదు కాలేదు. ఈనేపథ్యంలో కూడ్లిగి డీఎస్పీ మల్లేష్ దొడ్డమని నేతృత్వంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, కూడ్లిగి, గుడేకోటె, హొసహళ్లి, కొట్టూరు, హగరిబొమ్మనహళ్లి స్టేషన్లకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు ఆదివారం రాత్రంతా కూడ్లిగి బస్టాండ్తో సహా పట్టణ వీధుల్లో గస్తీ తిరుగుతూ తాము మీకు అండగా ఉన్నామని, భయపడవద్దని ప్రజలకు భరోసా కల్పించారు. ప్రజా సమస్యలు పరిష్కరించండి రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తోడు మౌలిక సౌకర్యాలు కల్పించాలని విధాన పరిషత్ సభ్యుడు బసనగౌడ బాదర్లి అధికారులను ఆదేశించారు. సోమవారం సింధనూరు తాలూకా గాంధీనగర్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని మురుగు కాలువల్లో పూడిపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. తుంగభద్ర కాలువ నుంచి చెరువుకు తాగునీటిని పంపింగ్ చేయాలన్నారు. గుంతలు పడ్డ రహదారులకు మరమ్మతులు చేయాలన్నారు. చౌక ధర దుకాణాల ద్వారా పేదలకు సక్రమంగా బియ్యం పంీపిణీ చేపట్టాలన్నారు. అనుమానాస్పద రీతిలో విద్యార్థి మృతి హుబ్లీ: ధార్వాడలోని ప్రముఖ పాఠశాల హాస్టల్లో విద్యార్థి అనుమానాస్పద రీతిలో ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. బెళగావి జిల్లా సవదత్తి తాలూకా హిరేఉల్లిగేరి గ్రామానికి చెందిన ప్రీతం కంప్లి (15) అనే బాలుడు ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. విషయం తెలిసిన వెంటనే హాస్టల్కు వచ్చిన మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడు తనంత తాను ఉరి వేసుకోలేదని, ఎవరో అతనిపై దాడి చేసి చంపి ఉంటారని బాలుడి తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. ఆ మేరకు ధార్వాడ గ్రామీణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. -
విస్తరిస్తున్న వానలు
యశవంతపుర: పలు జిల్లాల్లో నైరుతీ ముంగారు వానలు జోరుగా కురుస్తున్నాయి. వారం రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని బెంగళూరు వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. కరావళిలోని దక్షిణ ఒళనాడు భాగంలో అతి భారీ వానలు కురుస్తాయని తెలిపారు. రుతుపవనాలు రెండు రోజుల్లో విస్తరించి దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ జిల్లాలో మంగళవారం నుంచి వర్షాలు పడవచ్చు. బెంగళూరు చుట్టుపక్కల 2 రోజుల పాటు మేఘావృతమై ఉంటుంది. సిటీలో 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. చిక్కమగళూరులో సోమవారం కూడా జోరు వాన కురవడంతో జన జీవనం స్తంభించింది. -
సుర్జేవాలా వర్సెస్ జేడీఎస్
శివాజీనగర: రాజ్యసభకు మాజీ ప్రధాని దేవేగౌడను బీజేపీ ఎంపిక చేయక పోవడం హాట్ టాపిక్ అయ్యింది. జేడీఎస్ను బీజేపీ అవమానించినా కేంద్ర మంత్రి కుర్చీని కాపాడుకునేందుకు మౌనంగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఎక్స్లో విమర్శించారు. ఈ విమర్శలపై జేడీఎస్ మండిపడింది. వసూళ్ల కోసం కర్ణాటకను ఏటీఎంగా చేసుకొన్న సుర్జేవాలా.. దేవేగౌడ సంగతిని పక్కనపెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అంతర్గత గొడవల వైపు చూడాలని దుయ్యబట్టింది. దేవేగౌడ మేటి కన్నడిగుడని, భరత భూమిని ఏలిన శ్రేష్ట నాయకుడని ఎక్స్లో పేర్కొంది. మరోవైపు బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ నేత ఎం.నాగరాజ్ విధానసౌధలో నామినేషన్ దాఖలు చేశారు. యడియూరప్ప, విజయేంద్ర, నేతలు పాల్గొన్నారు.ఎయిర్పోర్టులో రూ.5.90 కోట్ల గంజాయి సీజ్ దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు రూ.5.90 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఒక ప్రయాణికుని లగేజీని తనిఖీలుచేయగా, అక్రమంగా దాచి తరలిస్తున్న 10.20 కేజీల హై.గంజాయి పట్టుబడింది. అతన్ని అరెస్టు చేసి మత్తు పదార్థాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరో ప్రయాణికుని వద్ద 6.6 కేజీల హై.గంజాయి లభించింది. మైసూరులో 280 కేజీలు... మైసూరు: మైసూరులో పోలీసులు 280 కేజీల సాధారణ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బన్నూర్ చెక్పోస్ట్ సమీపంలో ఓ కారు, లారీని ఆపి సోదాలు చేయగా, అందులో ఈ గంజాయి బస్తాలు లభించాయి. దానిని తరలిస్తున్న మహమ్మద్ జుబేర్, ముదాసిర్ అహ్మద్, అబూబకర్ సిద్ధిఖీ, సయ్యద్ మజార్ అనేవారిని అరెస్టు చేశారు. పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్ కేసు వివరాలను వెల్లడించారు. మైసూరులో ఇటీవలి కాలంలో ఇంత భారీ మొత్తంలో గంజాయి దొరకడం ఇదే తొలిసారి. వీటిని ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది మిస్టరీగా ఉంది. జూదగానిపై హత్యాయత్నంశివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని భద్రావతి నగరంలోని హోళహొన్నూరు రోడ్డులోని అన్వర్ కాలనీలో ముద్దె అలియాస్ ఎం.విశ్వనాథ్ (35) అనే వ్యక్తిపై దుండగులు కత్తులు, కొడవళ్లతో హత్యాయత్నం చేశారు. ఆరేడు మంది వ్యక్తుల గుంపు ఆకస్మాత్తుగా విశ్వనాథ్పై దాడి చేసి పరారైంది. తీవ్ర గాయాలతో పడిపోయిన విశ్వనాథ్ను స్థానికులు, కుటుంబ సభ్యులు శివమొగ్గలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భద్రావతి ప్రాంతంలో విశ్వనాథ్ను ’ఇస్పేట్ కింగ్’ అని పిలుస్తారు. జూదాల్లో ఆరితేరినవాడని పేరుంది. ఈ గొడవలతోనే దాడి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. భద్రావతి హలేనగర్ పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డీఎస్పీ, సీఐలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు అలముకొన్నాయి. -
అభివృద్ధి పేరుతో రూ.కోట్లు లూటీ
రాయచూరు రూరల్: అభివృద్ధి పనుల పేరుతో రూ.కోట్లలో నిధులు లూటీ చేశారు. కానీ స్థానికులకు ఉద్యోగాలు మాత్రం దక్కలేదు. 2009లో ప్రారంభించిన యరమరస్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(వైటీపీఎస్) గత 16 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 1600 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. కేవలం 800 మంది ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రూ.12,915 కోట్లు పెట్టుబడి పెట్టగా నేడు హైదరాబాద్ మేక్ పవర్ ప్రాజెక్టు కంపెనీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. 700 మంది కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్నారు. ప్రారంభంలో రూ.8,806 కోట్లు అంచనా వ్యయం కాగా రూ.12,915 కోట్లు వ్యయం చేశామని, అదనంగా రూ.4,109.67 కోట్లు ఖర్చు చేసినట్లు మేక్ పవర్ ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. రూ.12,247 కోట్లు కేపీసీఎల్కు అప్పు మిగిల్చారు. కష్టాల్లో ఉన్న కార్మికులను ఆదుకునే వారు కరువయ్యారు. నాణ్యతతో కూడిన విద్యుత్ను ఉత్పత్తి చేయడంపై కంపెనీ శ్రద్ధ కనబరచలేక పోయిందని కార్మిక నేతలు పెదవి విరుస్తున్నారు. అప్పుల సుడిగుండంలో రాయచూరులోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఊగిసలాడుతోందని అన్నారు. వైటీపీఎస్లో స్థానికులకు దక్కని ఉద్యోగాలు కంపెనీ నిర్మాణానికి మొత్తం రూ.12,915 కోట్ల వ్యయం -
పురుషులకే ఎక్కువ ప్రమాదం
● ఊబకాయం కనిపించిన వెంటనే మధుమేహం, అధిక బీపీ వంటివి అనుసరిస్తాయి. ఇవి మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా ఉన్నాయి. ● కన్నడనాట 2023–24లో పురుషుల్లో మధుమేహం కేసులు 7.6 శాతం నుంచి 17.8 శాతానికి పెరిగితే, మహిళల్లో 6.8 శాతం నుంచి 14.8 శాతానికి పెరిగింది. ● చక్కెర వ్యాధికి మందులు వాడుతున్న పురుషులు 29.7 శాతమైతే, మహిళల్లో ఇది 25 నుంచి 27.8 శాతంగా ఉంది. ● అలాగే హై బీపీ కూడా పురుషులనే వేధిస్తోంది. నగరాల్లో 32.4 శాతం పురుషుల్లో బీపీ ఉంటే, మహిళల్లో 27.8 శాతంగా ఉంది. నిత్యం వ్యాయామంతో ఆరోగ్యానికి పునాదిఆరోగ్యమే మహాభాగ్యం అని ఏనాడో చెప్పారు. ఎంత సంపద ఉన్నా మంచి ఆరోగ్యం లేకపోతే చేయగలిగిందేమీ ఉండదు. అన్నీ యాప్ల ద్వారా జరిగిపోతున్న ఈ డిజిటల్ యుగంలో నడక, వ్యాయామం సహా ఆరోగ్య సంరక్షణకు సమయం ఉండడం లేదు. దీంతో రోగాల దాడులు అధికమయ్యాయి.సాక్షి, బెంగళూరు: ఆధునిక జీవనశైలిలో సాంకేతికత పెరిగి శారీరక శ్రమ తగ్గింది. ఉరుకులు, పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు మారాయి. దీంతో చిన్న వయసులోనే వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక వ్యాధులు సతమతం చేస్తున్నాయి. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి జబ్బులు సాధారణమవుతున్నాయి. వాటి బారినపడినవారు నిత్యం మాత్రలు మింగుతూ బతుకీడ్చాలి. పల్లెల్లో సైతం కర్ణాటకవ్యాప్తంగా చాలామంది మధుమేహం, రక్తపీడనం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. సరైన జీవన విధానం లేకపోవడంతో స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపీడనం వంటి వాటితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పట్టణ, నగర ప్రాంతాల్లో మాత్రమే కాకుండా పల్లెల్లో కూడా ఇలాంటి అనారోగ్యాలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే –6 నివేదికలో ఈ భయంకర వాస్తవాలు వెలుగుచూశాయి. సర్వే ప్రకారం బెంగళూరు, మైసూరు, హుబ్లీ, బెళగావి వంటి నగరాలు, వాటి చుట్టుపక్కల గ్రామాల్లో ఫిట్నెస్ కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు ఎక్కువగా వెలుస్తున్నాయి. ఆరోగ్య జాగృతి కల్పిస్తున్నా ఊబకాయం, అసాంక్రమిక రోగాలు ప్రబలుతున్నాయి. ఇక పల్లెల్లో ఇప్పటికీ పౌష్టిక ఆహారం దొరకడం కష్టంగా ఉంది. మహిళలకు స్థూలకాయం సమస్య ● నగర ప్రాంతాల్లో మహిళల్లో సగం మంది అంటే.. 51.7 శాతం మంది స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంత మహిళల్లో 33 శాతం మంది అధిక బరువుతో ఉన్నారు. ● రాష్ట్ర మహిళల్లో స్థూలకాయం శాతం గత సర్వేలో 30.2 శాతంగా ఉండగా, తాజా సమీక్ష–6లో 41.2 శాతానికి పెరగడం గమనార్హం. ● పురుషుల్లో స్థూలకాయం సమస్య 30.9 శాతం నుంచి 36.4 శాతానికి పెరిగింది. ● ఇక పల్లెల్లో 18.6 శాతం మంది మహిళలు, 18.4 శాతం మంది పురుషులు మామూలు కంటే తక్కువ బరువున్నారు. పౌష్టికాహార లోపమే దీనికి కారణం. మొత్తం మహిళల్లో 15.1 శాతం, పురుషుల్లో 14 శాతం అపౌష్టికత ఉన్నట్లు తేలింది. అనారోగ్యాలకు పలు కారణాలు.. ● వేపుళ్లు, జంక్ఫుడ్, శీతల పానీయాల అధిక వినియోగం ● పనిభారం, మానసిక ఒత్తిడికి గురికావడం ● అధిక బరువు, మద్యపానం, ధూమపానం ● వ్యాయాయం చేయకపోవడం బీపీ, షుగర్తో ఇబ్బంది రాష్ట్రంలో షుగర్, బీపీ, క్యాన్సర్ జబ్బుల బెడద వెంటాడుతున్న ఊబకాయం ఆధునిక జీవనశైలితో పెను ముప్పు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే హెచ్చరిక -
జల్సాల కోసం కూతురి బలి
బనశంకరి: కన్నకూతురినే పొట్టనబెట్టుకున్న తల్లి ఉదంతం అంతటా చర్చనీయాంశమైంది. బెంగళూరు కాడుగోడిలో ఆరేళ్ల బాలిక వెన్నెల అనుమానాస్పద మృతి కేసులో ఆమె తల్లి, ప్రియునిపై అనుమానాలు బలపడ్డాయి. మార్చి 24 తేదీన బాలిక అనుమానాస్పద రీతిలో చనిపోయింది. తల్లి ప్రియాంక పుట్టిన రోజు వేడుకలను కోలారు వద్ద ఓ కెఫెలో జరుపుకొంది, అక్కడ వెన్నెలా కేక్ తిని కారులో నిద్రపోగా ఉదయానికి చనిపోయిందని తెలిపింది. మోహన్ అనే రియల్టర్తో ప్రియాంక జీవిస్తోంది. భర్త ప్రవీణ్ను వదిలేసిన ప్రియాంక లగ్జరీ లైఫ్ కోసం తపించేది. సంతోషానికి అడ్డు అని.. కొన్ని నెలల కిందట మోహన్ను కాశీలో రహస్యంగా పెళ్లి చేసుకుంది. సంతానం కావాలని అనుకున్నారు. తమ సంతోషాలకు వెన్నెలా అడ్డుగా ఉందని, పైగా బాలిక అంద విహీనంగా ఉందనే కారణంతో బాలిక గొంతు పిసికి చంపారనే అనుమానాలున్నాయి. ప్రియాంక కు హొసకోటే వద్ద ఐదు ఎకరాలు భూమి ఉండగా, అందులో వాటా ఇవ్వాల్సి వస్తుందనేది కూడా హత్యకు కారణమని భావిస్తున్నారు. మోహన్ను కాడుగోడి పోలీసులు అరెస్ట్చేసి విచారిస్తున్నారు. బాలిక చనిపోయిన రోజున ఆమె దుస్తులు మార్చారని సీసీ కెమెరాలలో వెల్లడైంది. కాగా ప్రియాంకను అరెస్టు చేశారా, పరారీలో ఉందా అనేది తెలియడం లేదు. కాడుగోడి ప్రియాంక కేసులో కొత్త నిజాలు -
శ్రమదానంతో రోడ్డుకు మరమ్మతులు
హొసపేటె: రోడ్డు కోత వల్ల లేదా భారీ వాహనాల రద్దీ వల్లో కానీ విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో హొసహళ్లి–జుమ్మోబనహళ్లి రోడ్డు మధ్యలో చిన్న చిన్న గుంతలు ఏర్పడ్డాయి. దీంతో రోజూ ప్రయాణించే బైకర్లు ప్రమాదాలకు గురై గాయపడ్డారు. అంతేకాకుండా జనవరిలో రోడ్డుకు ప్యాచ్ వేసినప్పటికీ రోడ్డు మళ్లీ పాడైపోయి గుంతలతో నిండిపోయింది. దీంతో గమనించిన జుమ్మోబనహళ్లికి చెందిన మలియమ్మ దేవి స్నేహితర బళగ ప్రజలకు, బైకర్లకు సురక్షితమైన రాకపోకలను కల్పించడానికి ఆదివారం నుంచి ట్రాక్టర్లతో గుంతల్లో మట్టి వేసి మరమ్మతులు చేసే పనులను స్వయంగా శ్రమదానం చేయడం ద్వారా పనులు ప్రారంభించారు. సామాజిక స్పృహతో గుంతలను పూడ్చే పనిని చేపట్టిన స్నేహితర బళగ సేవలను జుమ్మోబనహళ్లి జీపీ మాజీ సభ్యుడు జే.మెసరహట్టి ప్రశంసించి మాట్లాడుతూ రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చడానికి వారు స్వచ్ఛందంగా ట్రాక్టర్తో మట్టిని తోలించారని తెలిపారు. స్వచ్ఛందంగా గుంతలు పూడ్చిన స్నేహితర బళగ బృందం సభ్యులు -
కలెక్టర్ సుడిగాలి పర్యటన
రాయచూరు రూరల్: నగరంలో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయాలని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. సోమవారం నీరుబావికుంట, రాంపుర తాగునీటి జలాశయం, షియాతలాబ్, యక్లాస్పూర్ ప్రాంతాల్లో ఆమె సుడిగాలిలా పర్యటించారు. వర్షాకాలంలో మురుగు కాలువల్లో పూడికను తొలగించి నీరు సజావుగా సాగేలా చూడాలన్నారు. రాంపుర తాగునీటి రిజర్వాయర్ను పరిశీలించి నగర ప్రజలకు రక్షిత మంచినీరు అందించాలన్నారు. నీరుబావికుంటలో నగరసభ అధికారులు, సిబ్బంది నిరంతర నిఘా ఉంచి స్వచ్ఛత కాపాడాలన్నారు. చెత్తను రోడ్లలో పారేసే వారిపై జరిమానా విధించాలన్నారు. వర్షా కాలంలో వాన నీరు రోడ్ల పైకి రాకుండా కాలువల్లో ప్రవహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. యక్లాస్పూర్లో డంప్ యార్డును తనిఖీ చేశారు. నగర పాలికె కమిషనర్ జుబీన్ మహాపాత్రో, స్వచ్ఛత నోడల్ అధికారి కృష్ణ శావంతగేర, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బయల్పడిన పురాతన శాసనం
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలోని గుండ్లవద్దిగెరె గ్రామానికి చెందిన చంద్రయ్య స్వామి పొలంలో హోయ్సళుల కాలానికి చెందిన పురాతన శాసనం బయల్పడింది. గుండ్లవద్దిగెరె గ్రామ ఉపాధ్యాయులు మహాకాళప్ప, మల్లనగౌడ, గంగాధర్ల సహకారంతో తుమకూరు శశికుమార్ నాయక మార్గదర్శకత్వంలో, విజయనగర పరిశోధకుల బృందం సభ్యులు డాక్టర్ గోవింద, ప్రొఫెసర్ తిప్పేస్వామి, డాక్టర్ కృష్ణగౌడ, ఇస్మాయిల్ సిద్దిక్, అశోక్ తలేఖాన్ ఈ శాసనాన్ని కనుగొన్నారు. ఈ శాసనం ఒక గ్రానైట్ శిలపై రాయబడింది. 15 ఫంక్తుల ఈ శాసనం ఎనిమిది అడుగుల ఎత్తు, ఒకటిన్నర అడుగుల వెడల్పు ఉంది. రాజు పేరు మొదటి ఫంక్తిలోనే పేర్కొన్నారు. హోయ్సళ చక్రవర్తి నరసింహ పాలనా కాలంలో కాశీగడ్ గుండ్లవాడిని పరిపాలించింది. ఆయన ఒక చెరువును నిర్మించడమే కాకుండా దానికి భూమిని కూడా దానం చేశారు. దీనిని బట్టి ఈ జిల్లాను హోయ్సళ రాజులు పరిపాలించారని స్పష్టమవుతోందని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం చరిత్ర ప్రొఫెసర్ హెచ్.తిప్పేస్వామి అన్నారు. -
మోహన్ నా కూతురు అందంగా లేదు.. వేరే సంతానం కావాలి..!
బెంగళూరు: కన్నకూతురినే పొట్టనబెట్టుకున్న తల్లి ఉదంతం అంతటా చర్చనీయాంశమైంది. బెంగళూరు కాడుగోడిలో ఆరేళ్ల బాలిక వెన్నెల అనుమానాస్పద మృతి కేసులో ఆమె తల్లి, ప్రియునిపై అనుమానాలు బలపడ్డాయి. మార్చి 24 తేదీన బాలిక అనుమానాస్పద రీతిలో చనిపోయింది. తల్లి ప్రియాంక పుట్టిన రోజు వేడుకలను కోలారు వద్ద ఓ కెఫెలో జరుపుకొంది, అక్కడ వెన్నెలా కేక్ తిని కారులో నిద్రపోగా ఉదయానికి చనిపోయిందని తెలిపింది. మోహన్ అనే రియల్టర్తో ప్రియాంక జీవిస్తోంది. భర్త ప్రవీణ్ను వదిలేసిన ప్రియాంక లగ్జరీ లైఫ్ కోసం తపించేది. సంతోషానికి అడ్డు అని.. కొన్ని నెలల కిందట మోహన్ను కాశీలో రహస్యంగా పెళ్లి చేసుకుంది. సంతానం కావాలని అనుకున్నారు. తమ సంతోషాలకు వెన్నెలా అడ్డుగా ఉందని, పైగా బాలిక అంద విహీనంగా ఉందనే కారణంతో బాలిక గొంతు పిసికి చంపారనే అనుమానాలున్నాయి. ప్రియాంక కు హొసకోటే వద్ద ఐదు ఎకరాలు భూమి ఉండగా, అందులో వాటా ఇవ్వాల్సి వస్తుందనేది కూడా హత్యకు కారణమని భావిస్తున్నారు. మోహన్ను కాడుగోడి పోలీసులు అరెస్ట్చేసి విచారిస్తున్నారు. బాలిక చనిపోయిన రోజున ఆమె దుస్తులు మార్చారని సీసీ కెమెరాలలో వెల్లడైంది. కాగా ప్రియాంకను అరెస్టు చేశారా, పరారీలో ఉందా అనేది తెలియడం లేదు. -
రహస్య వీడియోలతో వేధింపులు.. అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
కర్ణాటక: స్నానం చేస్తున్న మహిళ ఫోటో, వీడియోలను చిత్రీకరించుకుని వేధించడమే కాకుండా రూ.17 లక్షల నగదు వసూలు చేసిన నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని ఉణకల్లో జరిగింది. వివరాలు.. సుధ మృతురాలు. సిద్దారూఢ, అరుణ, మీనాక్షి, మల్లికార్జున, వీరప్ప, ప్రకాష్ బసవలింగప్ప, శివానంద, గిరిజాలపై కేసు నమోదైంది. సుధ ప్రస్తుతం ఉణకల్లో నివసిస్తూ సవదత్తి మునవళ్లిలో అంగన్వాడీ టీచర్గా పని చేస్తోంది.రెండేళ్ల క్రితం ఇంట్లో స్నానం చేస్తుండగా ఫొటో, వీడియో తీసుకొని ఆమెపై నిందితులు వేధింపులకు పాల్పడి ఆమె నుంచి క్రమంగా రూ.17 లక్షల మేర వసూలు చేశారు. అంతేగాక చెక్ బౌన్స్ కేసులో సవదత్తి కోర్టు ద్వారా కూడా ఆమెను మనోవేదనకు గురి చేశారు. వారి వేధింపులు భరించలేక ఉణకల్లోని అద్దె ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యానగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
పోక్సో కేసు: డబ్బులు ఇస్తేనే మీకు అనుకూలంగా రాస్తా!
బెంగళూరు: పోక్సో కేసులో పోలీస్స్టేషన్లో లంచం తీసుకుంటూ మహిళా కానిస్టేబుల్ జ్యోతి లోకాయుక్తకు చిక్కగా, ఏఎస్సై శివశరణప్ప పరారయ్యారు. ఈ సంఘటన కలబుర్గిలోని స్టేషన్ బజార్ పోలీస్స్టేషన్లో జరిగింది. వివరాలు.. చెత్త ఏరుకునే మహిళ కుమార్తె (మైనర్) పై అత్యాచారం జరిగింది. ఈ కేసులో చార్జ్షీట్ వేయాలని, మీకు అనుకూలంగా రాయాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని జ్యోతి, ఏఎస్సై శివశరణప్ప బాలిక తల్లిని డిమాండు చేశారు. కూతురిపై అఘాయిత్యం జరిగి బాధపడుతుంటే, పోలీసులు డబ్బుల కోసం పీడించడంతో ఆమె వేదనకు గురైంది. దీంతో కొందరు సామాజిక కార్యకర్తల సాయంతో లోకాయుక్తను ఆశ్రయించింది. ఆమె నుంచి జ్యోతి లంచం తీసుకుటుండగా లోకాయుక్త పోలీసులు దాడి చేశారు. అక్కడే ఉన్న ఏఎస్సై పలాయన మంత్రం పఠించాడు. అతని కోసం గాలిస్తున్నారు. -
భారీగా పెరిగిన టమాటా ధరలు
టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. గత రెండు వారాల నుంచి బెంగళూరు, చుట్టుపక్కల జిల్లాల్లో వానలు పడుతున్నాయి. దీంతో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో టమాటా ధర కేజీ రూ.60 పలుకుతోంది. మునగకాయ, బీన్స్ ధరలు తగ్గితే, ఆకుకూరల ధరలకు రెక్కలొచ్చాయి. బీన్స్ గతనెలలో కేజీ రూ.150 ఉండగా ఇప్పుడు రూ.78 కి పడిపోయింది. వంకాయ ధరలు పెరిగాయి. బజ్జి మిరప, దోస, చోళేకాయ, అనప, కాకర, టమాటా, కొత్తిమీర ధరలు పైపైకి వెళ్తున్నాయి. ఇందుకు వర్షాలతో పాటు పెట్రో ధరలు పెరగడం కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయలను రవాణా చేసే వాహనాల డ్రైవర్లు బాడుగలు పెంచినట్లు చెబుతున్నారు. ఈ ధరలతో గృహిణులు ఇబ్బంది పడుతున్నారు. -
సీఎం ఇంటి దగ్గర క్షుద్ర పూజలు
బెంగళూరు: సీఎం డీ.కే.శివకుమార్ బెంగళూరు సదాశివనగరలోని నివాసం దగ్గరలో క్షుద్ర పూజలు జరగడం కలకలానికి కారణమైంది. ఆయన నివాసానికి వెనుకవైపు జీబీఏ మైదానం ముందున్న రోడ్డులో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వృత్తాకార ముగ్గులు వేసి, కోడిని కోసి, నిమ్మకాయలు పెట్టి పూజలు చేశారు. ఆదివారం ఉదయం ఇది చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఎంతోమంది వీఐపీలు నివసించే ప్రాంతంలో ఇలాంటిది జరిగింది.స్థానిక పోలీసులు చేరుకుని కోడి, ఇతర వస్తువులను తొలగించారు. సమీపంలోనే ముఖ్యమంత్రి నివాసముండటంతో ఈ ప్రదేశంలో భారీ పోలీస్ భద్రత ఉంటుంది. అయినప్పటికీ ఎలా క్షుద్రపూజలు జరిగాయి అనేది చర్చనీయాంశమైంది. పూజలు చేసినవారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
సరస్వతీ నిలయంలో చీడ పురుగులు
కర్ణాటక: చదువుల తల్లి నిలయంలో చీడ పురుగులు విద్యార్థినులను కాటేస్తున్నాయి. ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, అదే విభాగం పీహెచ్డీ విద్యార్థినితో ప్రేమాయణం సాగించిన సంఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చదువులు చెప్పాల్సిన గురువు.. తన కూతురు వయసున్న అమ్మాయిని ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడని అనేకమంది మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఏఎం ఖాన్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. విద్యార్థులతో ప్రొఫెసర్ల ఇలాంటి నడవడికతో తలెత్తిన విమర్శలపై సదరు బాధ్యుడైన ప్రొఫెసర్ దేవరాజ్ తంగదొరై నుంచి వివరణ తీసుకున్నారు. అలానే పీహెచ్డీ విద్యార్థినిపై కూడా తొలి దశ విచారణను ఇప్పటికే పూర్తి చేశారు. ఆధారాల సమర్పణ ప్రొఫెసర్ విద్యార్థినితో గడిపిన వీడియోలు, ఆడియోలను కూడా ఫిర్యాదుదారుడైన విద్యార్థి వేదవ్యాస్ చౌహాన్ వర్సిటీ కమిటీకి అప్పగించారు. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత చర్యలను చేపడతామని వీసీ తెలిపారు. తంగదొరై ఆమెతోనే కాదని, అనేకమంది పీహెచ్డీ, పీజీ విద్యార్థులను ప్రేమపేరుతో మభ్యపెట్టి షికార్లు చేసేవాడని విద్యార్థులు ఆరోపించారు. దీనికి సంబంధించి అనేక ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో యూనివర్సిటీలో ఏం జరుగుతోంది అనేది చర్చనీయాంశమైంది. చదువుకునే వాతావరణం కావాలి ఈ ఘటనలపై చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ.. తాను తంగదొరై వద్దే పీహెచ్డీ చేసేవాడినని, ఆయన అనుచిత డిమాండ్లను తీర్చలేక ఆయన గుట్టును బయట పెట్టినట్లు తెలిపారు. వర్సిటీలోని విద్యార్థి సంఘాల నేతలు ఈ వ్యవహారంపై భగ్గుమంటున్నారు. విద్యార్థులు క్షేమంగా చదువుకోవడానికి తగిన వాతావరణం ఉండాలని, విద్యాబోధకులకు నైతిక నియమావళిని ఏర్పరచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను బోధకులు బెదిరించడం, లైంగిక దోపిడీకి పాల్పడడం క్షమించరాని నేరమని, అటువంటి దుష్కృత్యాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.విద్యార్థిని ప్రొఫెసర్ ప్రేమాయణం -
వర్షంతో జనజీవనం అస్తవ్యస్తం
బళ్లారిటౌన్: నగరంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం అస్తవ్యస్తమైంది. మోకా రోడ్డులోని విద్యుత్ సబ్స్టేషన్ జలమయమై విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అధికారులు మధ్యాహ్నం వరకు పంపింగ్ చేసి నీటిని తొలగించారు. చాలా ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో కేఈబీ ఉద్యోగులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇక పొలాలు, లోతట్టు ప్రాంతాల్లోని వాన నీరు కప్పగల్ రోడ్డులోని హెచ్ఎల్సీ 14వ నంబరు ఉపకాలువలోకి చేరడంతో ఉప కాలువ నిండుగా ప్రవహించింది. ఇంకా డ్యాం నుంచి నీరు వదలలేదు. అయినా కాలువ నిండుగా ప్రవహించడంతో రైతులకు కూడా ఒకింత ఆశ్చర్యం కలిగించింది. కలబుర్గి, సేడంలలో భారీ వర్షం రాయచూరు రూరల్: కలబుర్గి, సేడంలలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిిసింది. సేడంలో ఎక్కడ చూసినా రోడ్లు బురద గుంటలుగా మారాయి. గంట పాటు వానలు కురిశాయి. కురిసిన వానలకు అంబేడ్కర్ సర్కిల్, జిల్లా పంచాయతీ కార్యాలయం, బస్టాండ్ వద్ద మురుగు కాలువలు పూర్తిగా నిండి రహదారులపై నీరు ప్రవహించాయి. అంగళ్లు, ఇళ్లలోకి నీరు చేరడంతో వాటిని తొలగించడానికి ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. కలబుర్గి జిల్లా సేడంలో కురిసిన భారీ వర్షానికి వంతెనపై గుండా నీరు పారాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో భారీ వర్షానికి అతలాకుతలమైనా అమాత్య పదవి కోసం ఎమ్మెల్యే ఇంకా బెంగళూరులోనే మకాం వేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. లోతట్టు కాలనీలు జలమయం రోడ్లపై ఏరులా పారిన నీరు -
భాష ఉనికిని కాపాడదాం
రాయచూరు రూరల్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో కన్నడ భాష ఉనికిని కాపాడదామని కలబుర్గి సీనియర్ కవి గవిసిద్దప్ప పేర్కొన్నారు. ఆదివారం కన్నడ భవనంలో కసాప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కన్నడ భాషాభివృద్ధికి కవులు చేసిన సేవలను కొనియాడారు. కన్నడ నాడు, నీరు, సాహిత్యం, సంస్కృతిని పెంపొందించడంలో శ్రమించాలన్నారు. కన్నడ సాహిత్య అభివృద్ధికి దాతలు ముందుకొస్తే కన్నడ భాషకు మరింత ఆదరణ పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో లక్ష్మిదేవి శాస్త్రి, రాఘవేంద్ర కుష్టిగి, తాలూకా అధ్యక్షుడు వెంకటేష్, రావుత్ రావ్, రామణ్ణ హవళే, వీర హనుమాన్, దండెప్ప, ప్రతిభ, విజయరాజ్, మీనాక్షి ఖండిమఠ్్లున్నారు. -
డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజల అవస్థ
హొసపేటె: నగరంలోని 9వ వార్డులోని సిద్దలింగప్ప చౌకి ప్రాంతంలోని రాజాజీనగర్లో రోడ్లు, భూగర్భ మురుగునీటి పారుదల(డ్రైనేజీ) వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ లేక ఆ వార్డులోని 2వ క్రాస్ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. తాగునీటి పైప్లైన్ ఏర్పాటు, మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణం పేరుతో ఈ ప్రాంతంలోని రోడ్డును తవ్వారు. తవ్విన రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడంతో నిత్యం అసౌకర్యానికి గురవుతున్నారు. రోడ్డు తవ్వడం వల్ల ఈ ప్రాంత వాసుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. తాగునీటి పైప్లైన్ ఏర్పాటు చేస్తామన్న సాకుతో ఇళ్ల ముందున్న మెట్లను కూడా తొలగించారు. ఆ ప్రాంతంలో నిర్మించిన మురుగు కాలువ కూడా అశాసీ్త్రయంగా ఉంది. మురుగునీటి ప్రవాహం సజావుగా లేదు. తాగునీటి పైప్లైన్ కూడా ఈ కాలువ గుండానే వెళుతోంది. దీంతో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. నిలిచిన మురుగునీటితో అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయనే భయం కూడా నెలకొంది. వర్షపు నీరు, మురుగునీరు ఇళ్లలోకి వస్తున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా మున్సిపల్ కౌన్సిలర్, అధికారులు సమస్యపై దృష్టి సారించాలని వార్డు వాసులు కోరారు. -
ఆకట్టుకున్న కీచక
కోలారు: నగరంలోని రంగ మందిరంలో రంగ గోకుల కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కీచక నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండు గంటల నిడివి కలిగిన నాటకం ఆద్యంతం పరవశుల్ని చేసింది. కా.ల. విశ్వనాథ్ రచించిన ఈ నాటకానికి కృష్ణ కశ్యప్ దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా కీచక పాత్రధారిగా నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. భీముని పాత్రలో కా.ల. విశ్వనాథ్ నటించారు. వీరిద్దరూ కూడా తండ్రి కొడుకులు కావడం విశేషం. నాటక ప్రదర్శన ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా సంస్థలకు అందిస్తామని తెలిపారు. పరప్పన జైలులో రభస దొడ్డబళ్లాపురం: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో గొడవలు జరిగాయి. బాంబు పేలుడు కేసులో జైల్లో ఉన్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు ఓ మతానికి మద్దతుగా నినాదాలు చేశారు. వారించబోయిన వార్డర్పై దాడికి ప్రయత్నించారు. ఇద్దరు ఖైదీలు జైలు ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. సిబ్బంది వారి రికార్డులను తనిఖీ చేస్తుండగా, మతపరమైన నినాదాలు చేస్తూ వార్డర్ను కొట్టబోయారు. పేలుళ్ల కేసుల్లో నిందితులైన సుమారు 50 మంది ఖైదీలు అక్కడకు చేరుకుని రభస సృష్టించారు. స్థానిక పోలీసులు చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. చిక్కనంటున్న టమాటా ● కేజీ రూ.60కి చేరిక యశవంతపుర: టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. గత రెండు వారాల నుంచి బెంగళూరు, చుట్టుపక్కల జిల్లాల్లో వానలు పడుతున్నాయి. దీంతో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో టమాటా ధర కేజీ రూ.60 పలుకుతోంది. మునగకాయ, బీన్స్ ధరలు తగ్గితే, ఆకుకూరల ధరలకు రెక్కలొచ్చాయి. బీన్స్ గతనెలలో కేజీ రూ.150 ఉండగా ఇప్పుడు రూ.78 కి పడిపోయింది. వంకాయ ధరలు పెరిగాయి. బజ్జి మిరప, దోస, చోళేకాయ, అనప, కాకర, టమాటా, కొత్తిమీర ధరలు ౖపైపెకి వెళ్తున్నాయి. ఇందుకు వర్షాలతో పాటు పెట్రో ధరలు పెరగడం కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయలను రవాణా చేసే వాహనాల డ్రైవర్లు బాడుగలు పెంచినట్లు చెబుతున్నారు. ఈ ధరలతో గృహిణులు ఇబ్బంది పడుతున్నారు. వ్యాయామంతో మంచి ఆరోగ్యం మండ్య: ప్రతి ఒక్కరూ రోజూ కనీసం 20 నిమిషాల పాటు వ్యాయామం లేదా ఆటలలో పాల్గొనడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా పంచాయత్ సీఈఓ కె. ఆర్. నందిని తెలిపారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జడ్పీ నుంచి బాలలతో ర్యాలీ నిర్వహించారు. శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని ఆమె అన్నారు. ఆహారాన్నే ఔషధంగా ఉపయోగించి శరీరాన్ని ఫిట్గా ఉంచుకుందామని చెప్పారు. నడక, వ్యాయామం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటు వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని తెలిపారు. నగరంలో ఆకాశ వింత బనశంకరి: బెంగళూరు ఆకాశ వీధుల్లో వింత ఏర్పడింది. రాకెట్ వెళ్తున్నప్పుడు ఏర్పడే పొగ వంటిది కనిపించడంతో జనం ఆశ్చర్యానికి గురయ్యారు. కేఆర్ మార్కెట్ ఫ్లై ఓవర్ వద్ద శుక్రవారం సాయంత్రం కనబడిన దృశ్యాన్ని రాఘవేంద్ర గుడి అనే వ్యక్తితో పాటు కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏదైనా విమానం నుంచి ఆ పొగ ఏర్పడిందా, లేక అంతరిక్ష వాహనం ప్రయాణించిందా అని సందేహాలు వ్యక్తంచేశారు. -
కేపీసీసీ అధ్యక్షుడితో భేటీ
సాక్షి బళ్లారి: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా బీకే.హరిప్రసాద్ నియామకం కావడంతో ఆయన్ను నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి కలిశారు. ఆదివారం బెంగళూరులో కేపీసీసీ అధ్యక్షుడిని కలిసి పలు విషయాలపై చర్చించారు. జిల్లాలో పార్టీ స్థితిగతులు, అభివృద్ధి, రాజకీయ అంశాలపై చర్చించారు. బళ్లారిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి శాయశక్తులా కృషి చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. జూన్ 28 నుంచి పల్స్ పోలియోరాయచూరు రూరల్: నగరంలో జూన్ 28 నుంచి పల్స్ పోలియో నిర్వహిస్తామని నగరసభ అదనపు కమిషనర్ శరణప్ప పేర్కొన్నారు. శనివారం నగరసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్స్ పోలియో కార్యక్రమంలో 37,983 మందికి చుక్కలు వేస్తారన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలు 37,983 మందికి చుక్కలు వేయడానికి 132 కేంద్రాలు, 5 ట్రాన్సిట్ బూత్లు, 3 మొబైల్ టీంలు, 24 మంది సూపర్వైజర్లను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో ఆరోగ్య శాఖ అధికారులు శాకీర్, చంద్ర శేఖరయ్య, ఈరణ్ణ, రవి, సరోజ, రామచంద్ర, ఈరమ్మ, తిక్కారెడ్డి, చెన్నమ్మ, జయపాల్ రెడ్డి, వరలక్ష్మిలున్నారు. చేప మందు పంపిణీ రాయచూరు రూరల్: నగరంలో శనివారం 100 మందికి చేప మందు పంపిణీ చేశారు. మృగశిర కార్తెలో ఆయాసం, ఉబ్బసం ఇతర వ్యాధులు సోకిన వారికి చేప మందు వాడడం వల్ల వ్యాధి నయం అవుతుందని నమ్మకం. ఈనేపథ్యంలో నగరంలోని జిల్లా జైలు సమీపంలోని మందుల దుకాణంలో డాక్టర్ అలీ కరోనా నిబంధనల మేరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చేప మందును అందించారు. విశాఖ రైలును పొడిగించాలిరాయచూరు రూరల్: విశాఖపట్నం–మహబూబ్నగర్ మధ్య నడుస్తున్న రైలును రాయచూరు వరకు నడపాలని రాయచూరు వాణిజ్యోద్యమ సంఘం డిమాండ్ చేసింది. శనివారం తుమకూరులో జరిగిన వాణిజ్యోద్యమ సంఘం సమ్మేళనంలో సంఘం అధ్యక్షుడు కమల్ కుమార్ జైన్ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమణ్ణకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. రాయచూరు వాసులకు విశాఖపట్నం–మహబూబ్నగర్ రైలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందన్నారు. రైల్వే స్టేషన్ నుంచి యరమరస్కు గూడ్స్ షెడ్ను తరలించాలన్నారు. నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలును కేఎస్ఆర్ వరకు పొడిగించాలన్నారు. రెండో ప్లాట్ఫాంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. త్రివిక్రం జోషి, జంబణ్ణ, ఉదయ్కిరణ్లున్నారు. కేసెట్లో విజయపుర విద్యార్థుల సత్తా● రాష్ట్ర స్థాయిలో 4, 6వ ర్యాంకుల సాధన రాయచూరు రూరల్: కేసెట్ ఫలితాలు ప్రకటించడంతో విజయపుర జిల్లా విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. రాష్ట్ర స్థాయిలో 4, 6వ ర్యాంకులను సాధించారు. విజయపుర ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చదివిన బసవరాజ్ పశు సంవర్ధక బీఎస్సీ నర్సింగ్లో 4, ఫార్మా బీ, డీలలో 6వ, యోగా న్యాచురోపతిలో 10వ ర్యాంకును పొందారు. రైతు కుటుంబంలో జన్మించిన బసవరాజ్ తాను నీట్లో మంచి ర్యాంక్ పొంది ఎయిమ్స్లో సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా ఎక్సలెంట్ కళాశాల విద్యార్థిని అనూషా పశు సంవర్థకంలో 4, బీఎస్సీ అగ్రికల్చర్లో 3వ ర్యాంకును సాధించారు. దొంగల ముఠా అరెస్ట్ హొసపేటె: తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న నలుగురు దొంగలను విజయనగర జిల్లా కొట్టూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. విజయనగర జిల్లా కొట్టూరు పట్టణంలో తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడిన నిందితులను కొట్టూరు పోలీసులు గుర్తించి, 50 గ్రాముల బంగారం, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన శికారి మదన్(30), గణేష్ (20), బాలచంద్ర (20), అశోక్లను పోలీసులు అరెస్టు చేశారు. బసవరాజ్ అనూషా -
జోరుగా ఏరువాక పనులు
సాక్షి బళ్లారి: మట్టి వాసన...ఆకాశంలో నల్లటి మేఘాలు... జిల్లా వ్యాప్తంగా అదునులో కురుస్తున్న వర్షాలతో పొలాల వైపు కదులుతున్న ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు. రైతుల ముఖాల్లో చిరునవ్వులు... ఇవన్ని కలిసి బళ్లారి జిల్లాలో జోరుగా ఏరువాక సందడి కనిపిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే అదునులో వరుణదేవుడి కృపా కటాక్షాలతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురువడంతో రైతులు ఖరీఫ్కు దుక్కులు దున్నే పనులకు శ్రీకారం చుట్టి జోరుగా కొనసాగిస్తున్నారు. బళ్లారిలో వర్షాధారిత, సాగునీటి భూములు పుష్కలంగా ఉన్నాయి. జిల్లాలోని బళ్లారి, సిరుగుప్ప, కంప్లి, సండూరు తాలూకాల్లో వర్షాధారిత భూములతో పాటు సగానికిపైగా తుంగభద్ర ఆయకట్టు భూములు కూడా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాలకు పైగా సాగుభూములు ఉండటంతో వేలాది మంది రైతులు తమ వ్యవసాయ భూములను ఖరీఫ్ సీజన్కు సిద్ధం చేస్తున్నారు. వర్షాధారితో భూములతో పాటు తుంగభద్ర ఆయకట్టు భూములను కూడా ముందుగానే సిద్ధం చేసుకొని పంటలను పెట్టుకునేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. తొలకరి వర్షాలు జోరుగా కురవడంతో గ్రామాల్లో రైతులు మేల్కొని ఎద్దులకు పూజ చేసి, నాగళ్లను భుజాన వేసుకొని పొలాల బాట పట్టిన రైతులు కొందరు కనిపిస్తుండగా మరికొందరు ట్రాక్టర్లతో దుక్కి దున్నేందుకు పొలాల్లో చురుగ్గా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలో ప్రధానంగా తుంగభద్ర ఆయకట్టు కింద వరి, మిర్చి, పత్తిపంట సాగు చేసే రైతులు భూములను సిద్ధం చేసుకుంటున్నారు. ఎద్దులు, ట్రాక్టర్లతో పొలాల్లో దుక్కులు వర్షాధారిత భూముల్లో సజ్జలు, జొన్నలు, వేరుశెనగ, రాగి, తదితర పంటలను వేసుకునేందుకు ఆ దిశగా రైతులు పొలాలను దుక్కి దున్ని వాటికి ఎరువులను కూడా అందించే ప్రక్రియలో ముందుకు వెళ్తున్నారు. గత ఏడాది ఖరీ్ఫ్లో నష్టాలు రాకపోయినా పెట్టిన పెట్టుబడులు రావడంతో రైతులు ఉత్సాహంగా ఏరువాక చేపడుతున్నారు. వ్యవసాయ పనులు జోరుగా కొనసాగుతుండటంతో కూలీలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. రైతులు దుక్కులు దున్నే ప్రక్రియ జోరుగా కొనసాగుతుండటంతో ఖరీఫ్ సీజన్కు ఎరువులు, విత్తనాలను అన్ని విధాలుగా సిద్ధం చేశామని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నా రైతులు విత్తనాలు, ఎరువులు చేతికి అందే వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న రైతులకు ఈ ఏడాది ఎరువుల కొరత లేకుండా అధికారులు చూడాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే జోరుగా వర్షాలు కురవడంతో జూలైలో విత్తనాలు వేసే సమయంలో వరినాట్లు నాటేటప్పుడు వరుణదేవుడు సకాలంలో వానలు కురవాలని రైతన్నలు కోరుతున్నారు. పొలంలో దుక్కి దున్నుతున్న రైతన్న ట్రాక్టర్తో దుక్కి దున్నుతున్న దృశ్యం రైతన్నల్లో చిగురించిన ఖరీఫ్ ఆశలు తొలవరి వర్షాల రాకతో ఊపందుకున్న సందడి పొలాల బాట పట్టిన రైతులు, వ్యవసాయ కూలీలు -
దక్షిణ కాశీలో హనుమ శోభాయాత్ర
శోభాయాత్ర కోలాహలం మైసూరు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మైసూరులోని నంజనగూడు పట్టణంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు శోభాయమానంగా జరిగాయి. ప్రసిద్ధ శ్రీకంఠేశ్వర స్వామి ఆలయం ముందు వేడుకలను సిద్దలింగస్వామి, ఇమ్మడి మురుగ స్వామి, పట్టాడ నాగరాజ స్వామి తదితరులు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే బి. హర్షవర్ధన్ మాట్లాడుతూ, హనుమాన్ జయంతి యువత సౌభ్రాతృత్వానికి, స్వేచ్ఛకు ప్రతీక అని అన్నారు. హనుమాన్ విగ్రహ ఊరేగింపు ఆరంభం కాగా 38 జానపద కళా బృందాల ప్రదర్శనలతో ఆర్భాటంగా సాగింది. వేలాది మంది హిందూ కార్యకర్తలు పాల్గొని ’జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. కాషాయ జెండాలు రెపరెపలాడాయి. వందలాది మంది యువకులు వీర హనుమంతున్ని కీర్తిస్తూ పాటలు పాడుతూ చిందులేశారు. అవాంఛనీయాలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటైంది. -
ఉన్నత విద్యకు పెద్ద పీట వేయాలి
రాయచూరు రూరల్: విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి ముందడుగు వేయాలని జిల్లా విద్యా శాఖాధికారి మల్లికార్జున పేర్కొన్నారు. తాలూకాలోని శ్రీరామనగర క్యాంప్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు నలి కలి పాఠ్య పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. నేడు విద్యకున్న ప్రాధాన్యత ఏ రంగానికీ లేదన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ భండారి, ఉపాధ్యాయులు మహంతేష్, తాయప్ప, నారాయణ, గీతా రాణి, రమేష్, జంగ్లప్ప, నందీష్లున్నారు. -
నీటికుంటలో పడి ముగ్గురి దుర్మరణం
రాయచూరు రూరల్: నీటికుంటలో పడి ముగ్గురు మరణించిన ఘటన యాదగిరి జిల్లా వడగేర తాలూకా బసవనగర వద్ద జరిగింది. గ్రామ సమీపంలోని కుంటలో పడి ఇద్దరు బాలికలతో పాటు ఓ మహిళ మరణించిన ఘటన ఆదివారం జరిగింది. సూరత్–చైన్నె జాతీయ రహదారి పనుల కోసం లోతుగా మట్టిని తవ్వేశారు. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురవడంతో వాననీరు ఆ కుంటలో నిలిచింది. అయితే దుస్తులు ఉతకడానికి వెళ్లిన శివలీల(10), సుజాత(10) అనే బాలికలు కుంటలో పడి బయటకు రాలేక కేకలు పెట్టారు. గమనించిన అక్కడకు సమీపంలో ఉన్న గుండమ్మ(35) అనే మహిళ వారిని కాపాడేందుకు ప్రయత్నించి ఆమె కూడా కుంటలో పడిపోయి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందిన వెంటనే ఎస్పీ పృథ్వీ శంకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై వడగేర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే స్కూల్లో చదివిన 17 మంది జవాన్లుగా ఎంపిక
హుబ్లీ: ఉప్పినబెటగేరి గురు విరుపాక్షేశ్వర హైస్కూల్లో చదివిన 17 మంది యువకులు జవాన్లుగా ఎంపికయ్యారు. ఒకే పాఠశాలలో చదివిన ఇంత మంది విద్యార్థులు ఏకకాలంలో సైనికులుగా దేశ సేవకు వెళ్లడంపై ఆ గ్రామస్తుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ఉప్పినబెటగేరి చుట్టు పక్కల గ్రామాలకు చెందిన అనేక మంది యువకులు ఇప్పటికే అగ్నివీరులుగా దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్నారు. ఈ నెల 2న వెల్లడైన జాబితాలో ఈ పాఠశాలలో చదివిన ఉప్పినబెటగేరి, కల్లూరు, హనుమనాళ గ్రామాలకు చెందిన మొత్తం 17 మంది యువకులు అగ్నివీరులుగా ఎంపికై ఆయా గ్రామాల కీర్తిని ఇనుమడింపజేశారు. ఉప్పినబెటగేరి నుంచి ఏడుగురు, కల్లూరు నుంచి ఆరుగురు, హనుమనాళ నుంచి నలుగురు ఎంపికై నట్లు మూరుసావిర విరక్త మఠం కుమార విరుపాక్ష స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని అనేక మంది యువకులు దేశ సేవకు ఎంపికవడం ఆ గ్రామస్తుల దేశభక్తికి నిదర్శనం అని, రైతులు, సైనికులు దేశానికి రెండు కళ్లు లాంటి వారని అన్నారు. వేధింపులు తాళలేక మహిళ బలవన్మరణంహుబ్లీ: స్నానం చేస్తున్న మహిళ ఫోటో, వీడియోలను చిత్రీకరించుకుని వేధించడమే కాకుండా రూ.17 లక్షల నగదు వసూలు చేసిన నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని ఉణకల్లో జరిగింది. వివరాలు.. సుధ మృతురాలు. సిద్దారూఢ, అరుణ, మీనాక్షి, మల్లికార్జున, వీరప్ప, ప్రకాష్, బసవలింగప్ప, శివానంద, గిరిజాలపై కేసు నమోదైంది. సుధ ప్రస్తుతం ఉణకల్లో నివసిస్తూ సవదత్తి మునవళ్లిలో అంగన్వాడీ టీచర్గా పని చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇంట్లో స్నానం చేస్తుండగా ఫొటో, వీడియో తీసుకొని ఆమైపె నిందితులు వేధింపులకు పాల్పడి ఆమె నుంచి క్రమంగా రూ.17 లక్షల మేర వసూలు చేశారు. అంతేగాక చెక్ బౌన్స్ కేసులో సవదత్తి కోర్టు ద్వారా కూడా ఆమెను మనోవేదనకు గురి చేశారు. వారి వేధింపులు భరించలేక ఉణకల్లోని అద్దె ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యానగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 260 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనంహొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న 260.35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గదగ్ నుంచి మండ్య, తుమకూరు జిల్లాల వైపు కేఏ–14 ఏ–8680 నెంబర్ గల లారీలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తమకు అందిన నిర్దిష్ట సమాచారం మేరకు ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు, మరియమ్మనహళ్లి స్టేషన్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి లారీతో సహా సుమారు రూ.6.04 లక్షల విలువైన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై మరియమ్మనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీధి వ్యాపారుల సంక్షేమానికి కృషిరాయచూరు రూరల్: వీధి వ్యాపారుల సంక్షేమానికి పాటు పడాలని రాష్ట్ర వీధి వ్యాపారుల సంక్షేమాభివృద్ధి సమితి అధ్యక్షుడు అతిక్ పాటిల్ పేర్కొన్నారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఏర్పాటు చేసిన వీధి వ్యాపారుల సమ్మేళనాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. దేశంలో ఆర్థిక లావాదేవీల్లో వీధి వ్యాపారుల పాత్ర కీలకమన్నారు. సర్కార్ వీధి వ్యాపారులకు తగిన భద్రత, రక్షణ, మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాజ్ కుమార్, భాస్కర్ బాబు, శ్రీనివాస్, గోపినాథ్, రఫీ, మౌలాలి, సోనమ్మ, అమీనా, మరియప్ప, పుట్టరాజు, యేసుమిత్ర, కుప్పణ్ణ, ప్రకాష్ ప్రవీణ్లున్నారు. విత్తనాలు, ఎరువుల కొరత తలెత్తనీయొద్దురాయచూరు రూరల్: ఈసారి ఖరీఫ్ సీజన్లో జిల్లాలో రైతులకు ఎలాంటి విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారి నయీం హుసేన్ అధికారులకు సూచించారు. రాయచూరు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర పథకం కింద రైతులకు విత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖరీఫ్లో ముందుగానే వానలు కురిశాయని, రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖాధికారిణి దీపా, రైతు లక్ష్మణగౌడ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంను కాదు.. మీ ఇంటి మనిషిని
శివాజీనగర: ‘నేను ముఖ్యమంత్రిని అనేకంటే ముందు మీ ఇంటి కుమారున్ని. మీ సేవకున్ని. జీవితంలో ప్రయత్నాలు విఫలం కావచ్చు. అయితే భగవంతుని కృప, ప్రజల ఆశీర్వాదముంటే ప్రయత్నం ఫలిస్తుంది. అదే మాదిరిగా నేను ముఖ్యమంత్రిని కాగలిగాను’ అని సీఎం డీకే శివకుమార్ అన్నారు. సీఎం అయిన తరువాత ఆయన ఆదివారం తొలిసారిగా సొంత నియోజకవర్గమైన బెంగళూరు దక్షిణ (రామనగర) జిల్లాలోని కనకపురలో హారోహళ్ళిని సందర్శించారు. విధానసౌధ నుంచి సిల్స్ బోర్డు వరకు మెట్రో రైలులో ప్రయాణిస్తూ అందులో జనంతో ముచ్చటించారు. మెట్రో రైలులో ప్రయాణికులు హాయిగా వెళ్తున్నారని, అది చూసి తనకు ప్రజలకు అనుకూలమైన రవాణా వ్యవస్థ ఎంత అవసరమనేది మరోసారి అర్థమైందన్నారు. బెంగళూరు తమందరికి గర్వకారణమని అన్నారు. భారీ స్వాగతం సిల్క్బోర్డులో దిగి కారులో కనకపురకు వెళ్లారు. సీఎం వాహనాలు కనకపుర సరిహద్దుల్లోకి ప్రవేశించగానే భారీఎత్తున టపాసులు పేల్చి ప్రజలు, అభిమానులు స్వాగతించారు. కోటే ఆంజనేయస్వామి ఆలయంలో డీకే పూజలు చేసి టాపు లేని వాహనంలో బయల్దేరారు. స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ తన మీద అభిమానంతో ఏదేదో మాట్లాడాడని చమత్కరించారు. కనకపురలో మెడికల్ కాలేజీ.. రామనగరను ‘బెంగళూరు దక్షిణ జిల్లా’గా ప్రకటించడం చారిత్రక నిర్ణయమని డీకే అన్నారు. దీంతో ఇక్కడ భూముల విలువ గణనీయంగా పెరుగుతుందని, ఆర్థిక వికాసం మొదలవుతుందని చెప్పారు. కనకపురలో త్వరలోనే సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో ఉన్నత విద్యాసంస్థలు, సౌకర్యాల కల్పనకు హామీ ఇచ్చారు. ఆదివారం రాత్రి 8 గంటలకు కనకపుర పట్టణంలోని చన్నబసప్ప సర్కిల్లో పర్యటనను ముగించారు. సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్య మెట్రో రైలులో ప్రయాణం సొంత నియోజకవర్గంలో పర్యటన -
సరస్వతీ నిలయంలో చీడ పురుగులు
విద్యార్థినులతో కీచక ప్రొఫెసర్ తంగదొరై షికార్లు ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయం హుబ్లీ: చదువుల తల్లి నిలయంలో చీడ పురుగులు విద్యార్థినులను కాటేస్తున్నాయి. ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, అదే విభాగం పీహెచ్డీ విద్యార్థినితో ప్రేమాయణం సాగించిన సంఘటనపై అన్ని వైపులా నుంచి విమర్శలు వస్తున్నాయి. చదువులు చెప్పాల్సిన గురువు కూతురు వయసున్న అమ్మాయిని ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడని అనేకమంది మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఏఎం ఖాన్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. విద్యార్థులతో ప్రొఫెసర్ల ఇలాంటి నడవడికతో తలెత్తిన విమర్శలపై సదరు బాధ్యుడైన ప్రొఫెసర్ దేవరాజ్ తంగదొరై నుంచి వివరణ తీసుకున్నారు. అలానే పీహెచ్డీ విద్యార్థినిపై కూడా తొలి దశ విచారణను ఇప్పటికే పూర్తి చేశారు. ఆధారాల సమర్పణ ప్రొఫెసర్ విద్యార్థినితో గడిపిన వీడియోలు, ఆడియోలను కూడా ఫిర్యాదుదారుడైన విద్యార్థి వేదవ్యాస్ చౌహాన్ వర్సిటీ కమిటీకి అప్పగించారు. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత చర్యలను చేపడతామని వీసీ మీడియాకు తెలిపారు. తంగదొరై ఆమెతోనే కాదని, అనేకమంది పీహెచ్డీ, పీజీ విద్యార్థినులను ప్రేమపేరుతో మభ్యపెట్టి షికార్లు చేసేవాడని విద్యార్థులు ఆరోపించారు. దీనికి సంబంధించి అనేక ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో యూనివర్సిటీలో ఏం జరుగుతోంది అనేది చర్చనీయాంశమైంది. చదువుకునే వాతావరణం కావాలి చౌహాన్ మాట్లాడుతూ తాను తంగదొరై వద్దే పీహెచ్డీ చేసేవాడినని, ఆయన అనుచిత డిమాండ్ల తీర్చలేక ఆయన గుట్టును బయట పెట్టినట్లు తెలిపాడు. వర్సిటీలోని విద్యార్థి సంఘాల నేతలు ఈ వ్యవహారంపై భగ్గుమంటున్నారు. విద్యార్థులు క్షేమంగా చదువుకోవడానికి తగిన వాతావరణం ఉండాలని, విద్యాబోధకులకు నైతిక నియమావళిని ఏర్పరచాలని డిమాండ్ చేశారు. విద్యార్థినీ విద్యార్థులను బోధకులు బెదిరించడం, లైంగిక దోపిడీకి పాల్పడడం క్షమించరాని నేరమని, అటువంటి దుష్కృత్యాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. విద్యార్థినులతో ప్రొఫెసర్ ప్రేమాయణాలు ధార్వాడ కర్ణాటక వర్సిటీలో కలకలం -
ఏఐ ఉత్తిదే.. మామూలు సీసీ కెమెరాలే
శివాజీనగర: బెంగళూరు ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇటీవల ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల సమయంలో సీసీ కెమెరాల వైర్లను కట్ చేశారనే వ్యవహారం మలుపు తిరిగింది. సీసీ కెమెరాల నిర్వాహక సంస్థలే తప్పుడు ఆరోపణలు చేశారని తేలింది. గతేడాది తొక్కిసలాట దుర్ఘటన తరువాత హైకోర్టు కఠిన భద్రతా నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ప్రశ్నించడంతో గొడవలు ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కేఎస్సీఏలు రూ.7 కోట్లతో ఏఐ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయించాయి. ఇందులో హర్యానాకు చెందిన సంస్థకు రూ.4.5 కోట్ల టెండర్ ఇచ్చారు, మరికొన్ని కంపెనీలకు కూడా పనులు ఇచ్చారు. ఏఐ కెమెరాల పేరుతో సాధారణ హెడ్ కౌంట్ సామర్థ్యమున్న కెమెరాలను పలు సంస్థలు బిగించి మోసం చేశాయి. దీనిని స్టేడియం సిబ్బంది ప్రశ్నించడంతో ఆయా కంపెనీల సిబ్బంది ఘర్షణ పడ్డారు. కక్ష గట్టి మ్యాచ్ సమయంలో కెమెరాల తీగలను కత్తిరించి రచ్చ చేశారని స్టేడియం వర్గాలు తెలిపాయి. కెమెరాల వ్యవహారంలో కేఎస్సీఏ ఐటీ హెడ్ ఒకరు పెద్దమొత్తంలో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి చర్యల వల్ల చిన్నస్వామి స్టేడియం అప్రతిష్ట పాలవుతోంది. చివరకు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్కు మారడం తెలిసిందే. చిన్నస్వామి స్టేడియంలో అవకతవకలు వైర్ల కటింగ్తో బట్టబయలు -
చెట్టు పైనుంచి పడి విద్యార్థి మృతి
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగిలోని అమరదేవరహళ్లికి చెందిన ఓ యువకుడు చెట్టు పైనుంచి కిందపడి మరణించిన ఘటన జరిగింది. ఆకాష్(23) బెంగళూరు గాంధీ కృషి విజ్ఞాన్ కేంద్రంలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ చదువుతున్నాడు. శనివారం సాయంత్రం క్యాంపస్ ఆవరణలో పనస చెట్టు ఎక్కుతుండగా కిందపడ్డాడు. అతని తలకు తీవ్ర గాయమైంది. అతనిని సహచర విద్యార్థులు వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అతను ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. విద్యా, క్రీడా కార్యకలాపాల్లో మృతుడు చూపిన శ్రద్ధకు ఎన్ఎస్ఎస్ విభాగంలో ఉత్తమ వలంటీర్గా పురస్కారాన్ని అందుకున్నారు. మృతుడు 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించి, కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. పేద రైతు కుటుంబానికి చెందిన ఆకాష్ మరణంతో గ్రామం శోకసంద్రంలో మునిగింది. కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ గ్రామాన్ని సందర్శించి, మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనపై బెంగళూరులోని యలహంక పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
జనం నుంచి రూ.2,400 కోట్ల డిపాజిట్లు
బనశంకరి: బెళగావిలో సంచలనం సృష్టించిన శివం అసోసియేట్స్ యజమాని శివానంద నీలణ్ణవర్ 40,700 మంది నుంచి రూ.2,400 కోట్ల డిపాజిట్లు పెట్టుబడి పెట్టించాడని సీఐడీ డీఐజీ భీమాశంకర్ గుళేద్ తెలిపారు. ఆదివారం బెళగావిలో భీమాశంకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్తగా వచ్చిన డబ్బు నుంచి పాతవారికి వడ్డీ ఇచ్చేవాడు. వడ్డీల మొత్తం పెరిగితే డబ్బులు ఇవ్వడం నిలిపివేసేవాడు. ప్రజల నుంచి రూ.2,400 కోట్లు సేకరించాడు, ఇందులో చాలావరకు ప్రజలకు చెల్లించాడు. రూ.540 కోట్లు షేర్ మార్కెట్లో పెట్టాడు. ఇందులో రూ.170 కోట్లు నష్టపోయాడు. రూ.660 కోట్ల లోటు ఏర్పడింది’ అని వివరించారు. నిందితుడు శివానంద డిపాజిట్లకు అధిక వడ్డీల పేరుతో బెళగావి, పరిసర జిల్లాల్లో ప్రజలు, ఉద్యోగుల నుంచి భారీమొత్తంలో డిపాజిట్లు సేకరించి, తిరిగి ఇవ్వడం లేదని ఆరోపణలు రావడం తెలిసిందే. శివానంద సొంతానికి రూ.55 కోట్లు వాడుకున్నాడని తెలిపారు. 5 లగ్జరీ కార్లను సీజ్ చేశామన్నారు. మహారాష్ట్రలోనూ ఎక్కువమంది పెట్టుబడులు పెట్టారని, అక్కడా దర్యాప్తు జరుగుతోందని భీమాశంకర్ తెలిపారు. రికవరీలు చేసిన తరువాత ప్రత్యేక అధికారి ద్వారా ప్రజలకు నగదు వెనక్కి ఇస్తామని తెలిపారు. 40 వేల మందికి పైగా బాధితులు శివం స్కాంపై సీఐడీ డీఐజీ -
ఆరంకెల జీతమున్నా బైక్ రైడర్గా..
బెంగళూరు: గ్రామాల్లో వేలల్లో జీతాలొస్తే చాలు ఎంతో హాయిగా అన్ని సౌకర్యాలతో జీవిస్తారు. మరి బెంగళూరు వంటి మహానగరంలో ఆరంకెల జీతమొచ్చినా కొందరు కుటుంబ ఆర్థిక భద్రతపై బాగా ఆలోచిస్తారని ఒకతను నిరూపించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఆరంకెల జీతమొస్తున్నాసరే వారాంతాల్లో ర్యాపిడో బైక్ ట్యాక్సీ రైడర్గా పనులు చేస్తుంటానని ఒకతను చెప్పిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇటీవల బెంగళూరులోని బన్నేరఘట్ట అనే ప్రాంతంలో షాబాజ్ అనే వ్యక్తి మరో చోటుకు వెళ్లేందుకు ర్యాపిడో బైక్ బుక్చేశాడు. వెళ్తూ మార్గమధ్యంలో రైడర్తో మాట్లాడాడు. ఆ సంభాషణ తాలూకు వివరాలను షాబాజ్ తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నాడు. ‘‘ రైడర్ నన్ను మీరేం చేస్తారు అని అడిగాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని గొప్పగా చెప్పా. నువ్వేం చేస్తావని 35 ఏళ్ల ఆ రైడర్ను అడిగా. అతను చెప్పిన సమాధానం విని ఆలోచనలో పడ్డా. తను కూడా సాఫ్ట్వేర్ డెవలపర్గా ఒక పెద్ద బహుళజాతి సంస్థలో పనిచేస్తున్నాడు. ఆరంకెల జీతం వస్తోంది అతనికి. మరి రైడర్గా ఎందుకు చేస్తున్నావని అడిగా. వారాంతాల్లో మాత్రమే ఈ పని చేస్తాడట’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘నాకు పెళ్లయింది. మాకొక చిన్నారి. ముగ్గురం ఈ మహానగరంలో వాళ్లను ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలని ఉద్దేశంతోనే అదనపు ఆదాయం కోసం ఈ పార్ట్టైం జాబ్ చేస్తున్నా’’ అని చెప్పడంతో ఆలోచనలో పడ్డానని షాబాజ్ చెప్పాడు. ఈ పోస్ట్లు స్పందనలు వెల్లువెత్తాయి. భారత్లోని బెంగళూరు వంటి నగరాల్లో ఇంటి అద్దెలు, ద్రవ్యోల్బణం, పిల్లల ఫీజులతో వేతనజీవుల వెతలు ఏ స్థాయిలో ఉంటాయో ఈ ఉదంతం తేటతెల్లంచేస్తోందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఆరంకెల జీతమొచ్చే ఉద్యోగులు భిన్నమైన బైక్ రైడ్ వృత్తిని ఎంచుకోకుండా సాఫ్ట్వేర్ రంగంలోనే కొత్త కోర్సులు, మెళకువలు నేర్చుకుని ఆ రంగంలో మరింత పైకి ఎదిగి ఆదాయాన్ని రెట్టింపుచేసుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు. -
విద్యార్థిని ప్రొఫెసర్ ప్రేమాయణం
హుబ్లీ: విద్యాను బోధించే గురువు స్థానం అత్యున్నతమైనదని భారత సంప్రదాయాలు చాటి చెబుతున్నాయి. అయితే విద్యా బోధన చేసే గురువే విద్యార్థినితో ప్రేమాయణం సాగించిన ఘటన కర్ణాటక విశ్వవిద్యాలయంలో జరిగింది. ఇక్కడి శాస్యశాస్త్రం విభాగం ఫ్రొఫెసర్ దేవరాజ సంగుదొరై విజయపురకు చెందిన అదే వి«భాగంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినితో ప్రేమ వ్యవహారం జరిపారు. ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు. వీరిద్దరి ప్రేమ గొడవ తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె పీహెచ్డీని సంగంలోనే ఆపేసి ఇంటికి తిరిగి తీసుకెళ్లి పోయారు. కొన్ని రోజుల తర్వాత విజయపురకు చెందిన విద్యార్థి తన వద్దకు పీహెచ్డీ చేయడానికి రాగా గతంలో మధ్యలోనే పీహెచ్డీని ఆపేసి వెళ్లిన విద్యార్థినిని తిరిగి కళాశాలకు తీసుకొని వస్తేనే పీహెచ్డీ పూర్తి చేసేందుకు అవకాశం ఇస్తానని ఆంక్షలు పెట్టారని తెలిసింది. దీంతో ఆ విద్యార్థి ఈ విషయంపై వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ ప్రొఫెసర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
రోడ్డు విస్తరణ చేపట్టాలి
రాయచూరు రూరల్: నగరంలోని రాజేంద్ర గంజ్ రహదారిలోని చంద్ర బండ రోడ్డును విస్తరించాలని జయ కర్ణాటక సేన నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘం సంచాలకురాలు జాఫర్ ఫరీఫ్ మాట్లాడుతూ చంద్రబండ సర్కిల్ పరిధిలోని 28, 29, 30 వార్డుల మీదుగా 15 గ్రామాలకు రాకపోకలు జరుగుతాయన్నారు. చంద్రబండ రోడ్డు హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానమై ఉందని, దీనికితోడు ఈ రోడ్డులో వ్యాపార కేంద్రాలు, బియ్యం మిల్లు లు, ఓపెక్, రిమ్ష్ అస్పత్రలు ఉన్నాయన్నారు. దీంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుందన్నారు. అయితే రోడ్లు చిన్నవిగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందన్నారు. అధికారులు స్పందించి రోడ్డును వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గుండెపోటుతో యువకుడి మృతిరాయచూరు రూరల్: గుండె పోటుతో యువకుడు మృతి చెందాడు. గయాదగిరి జిల్లా సురుపురకు చెందిన మరు కలబుర్గి (25) ధార్వాడలో ఉంటూ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నాడు. అక్కడే ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. శుక్ర వారం రాత్రి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. విద్యతోనే సమాజంలో గుర్తింపు రాయచూరు రూరల్: నేటి విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వేదవతి సూచించారు. రాయచూరు తాలూకా జేగరకల్ ప్రభుత్వ హైస్కూల్లో శనివారం ఆమె విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించి మాట్లాడారు. సమకాజంలో విద్యకు ఉన్న ప్రాధాన్యత ఏ రంగానికీ లేదన్నారు.విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు మంజునాథ్, తోటమ్మ పాల్గొన్నారు. అప్పుల బాధతో కారు డ్రైవర్ ఆత్మహత్యరాయచూరు రూరల్: అప్పులు తీర్చాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో కారు డ్రైవర్ అత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదగిరి జిల్లాలో జరిగింది. యాదగిరి జిల్లా సురుపుర తాలూకా కాచాపురు గ్రామానికి చెందిన సోమప్ప(30) ప్రైవేటు బ్యాంకులో రూ.15 లక్షల రుణం తీసుకొని కారు కొనుగోలు చేసి అద్దెలకు తిప్పుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కంతులు కట్టడంలో జాప్యం జరగడంతో బ్యాంకు అధికారులు ఒత్తిడి చేశారు. కంతు కట్టకపోతే వాహనాన్ని తీసుకెళ్తామని హెచ్చరించారు. దీంతో శుక్రవారం తన ఇంటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. ఊపందుకున్న వ్యవసాయ పనులు హొసపేటె: రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు ఎంతో ఉత్సాహంగా వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే భూమిని చదును చేసుకున్న రైతులు విత్తనాలు వేయడం ప్రారంభించారు. జొన్న, పొద్దుతిరుగుడు, వరి, సజ్జ వంటి వర్షాకాలపు పంటలను విత్తడంలో నిమగ్నమయ్యారు. హొసపేటె తాలూకాలో 60,493 హెక్టార్లు ఉండగా 48,753 హెక్టార్లు సాగుకు అనుకూలంగా ఉంది. ప్రస్తుత 17,620 హెక్టార్లలో సాగు జరుగుతోంది. పెద్ద రైతులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. విత్తనాలు నాటడానికి యంత్రాలను ఉపయోగిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ పనులకు ఎద్దులను ఉపయోగించి జొన్న, పొద్దుతిరుగుడు, వరి, సజ్జ విత్తనాలు నాటుతున్నారు. -
పార్టీ బలోపేతానికి శ్రమించండి
రాయచూరు రూరల్: ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు శ్రమించాలని జేడీఎస్ కార్యాధ్యక్షుడు, మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ తెలిపారు. దేవదుర్గ తాలూకాలో శనివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో జరగునున్న జెడ్పీ, టీపీ, జీపీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్, జిల్లాధ్యక్షుడు విరుపాక్షి, శివ శంకర్, మహంతేష్ పాటిల్, నరసింిహనాయక్, అమరేష పాటిల్, సిద్దయ్య పాల్గొన్నారు. పండిత్ తారానాథ సేవలు అనన్యంరాయచూరు రూరల్: పండిత తారనాథుడి 135వ జయంతిని శనివారం నగరంలోని హందర్ హైస్కూలులో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తారనాథుడి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తారనాథుడు విద్యా, వైద్య రంగాలకు చేసిన సేవలు అనన్యమన్నారు. అనంతరం టెన్త్లో మంచి మార్కులు సాధించిన వారిని సన్మానించారు. అదేవిధంగా ఎల్వీడీ కళాశాలలో తారానాఽథుడి విగ్రహనికి టీఎస్ఎస్ అధ్యక్షుడు సుఖాణి నివాళులర్పించారు. హందర్ పాఠశాల సమితి అధ్యక్షుడు శరత్ కళస, సభ్యులు పురుషోత్తం ఇన్నాణి, అంభాపతి పాటిల్, శ్రీనివాస్, రాఘవేంద్ర పాల్గొన్నారు. విద్యార్థినితో ప్రొఫెసర్ ప్రేమాయణంహుబ్లీ: విద్యాను బోధించే గురువు స్థానం అత్యున్నతమైనదని భారత సంప్రదాయాలు చాటి చెబుతున్నాయి. అయితే విద్యా బోధన చేసే గురువే విద్యార్థినితో ప్రేమాయణం సాగించిన ఘటన కర్ణాటక విశ్వవిద్యాలయంలో జరిగింది. ఇక్కడి శాస్యశాస్త్రం విభాగం ఫ్రొఫెసర్ దేవరాజ సంగుదొరై విజయపురకు చెందిన అదే విఽభాగంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినితో ప్రేమ వ్యవహారం జరిపారు. ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు. వీరిద్దరి ప్రేమ గొడవ తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె పీహెచ్డీని సంగంలోనే ఆపేసి ఇంటికి తిరిగి తీసుకెళ్లి పోయారు. కొన్ని రోజుల తర్వాత విజయపురకు చెందిన విద్యార్థి తన వద్దకు పీహెచ్డీ చేయడానికి రాగా గతంలో మధ్యలోనే పీహెచ్డీని ఆపేసి వెళ్లిన విద్యార్థిని తిరిగి కళాశాలకు తీసుకొని వస్తే నీ పీహెచ్డీ పూర్తి చేసేందుకు అవకాశం ఇస్తానని ఆంక్షలు పెట్టారని తెలిసింది. దీంతో ఆ విద్యార్థి ఈ విషయంపై వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ ప్రొఫెసర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జోరుగా హెల్మెట్ల విక్రయాలు బళ్లారిటౌన్: నగరంలో హెల్మెట్ విక్రయాలు ఊపందుకున్నాయి. నగరంలో రోడ్డు ప్రమాదాలు అధికం కావడంతో ఈనెల 1నుంచి ద్విచక్ర వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ గట్టి ఆదేశాలను జారీ చేశారు. కేఈబీ సర్కిల్, ఇందిరా సర్కిల్, రాయల్ సర్కిల్, మోతీ సర్కిల్, దుర్గమ్మగుడి సర్కిల్, వాల్మీకి సర్కిల్స్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.హెల్మెట్ లేని వారికి రూ.500 ఫైన్ వేస్తున్నారు.దీంతో బైకిస్టులు హెల్మెట్లను కొనుగోలుపై ఆశక్తి చూపుతున్నారు. నగరంలో హెల్మెట్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఒక హెల్మెట్ రూ.500 నుంచి వాటి నాణ్యత బట్టి రూ.1500 వరకు విక్రయిస్తున్నారు. జల్జీవన్ పూర్తిగా విఫలం ● ఎమ్మెల్యేల ఆరోపణ కోలారు: ఇంటింటికీ జల్జీవన్ పథకం ద్వారా తాగునీరు సరఫరా చేయడంతో ప్రభుత్వం విఫలమైందని, దీని వల్ల ప్రజల ప్రశ్నలకు ప్రజా ప్రతినిధులు సమాధానం చెప్పలేకపోతున్నారని శనివారం నగరంలోని జిల్లా పంచాయతీ హాలులో జరిగిన జిల్లా సమావేశంలో ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మంజునాథ్ మాట్లాడుతూ కోలారులోనే పనులు పూర్తి కాలేదు, ఇక గ్రామాలకు వెళ్తే ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాదానం చెప్పలేకపోతున్నానని అన్నారు. ఎమ్మెల్యే జీకే వెంకట శివారెడ్డి మాట్లాడుతూ ప్రతి సమావేశంలోనూ ఇదే చర్చిస్తున్నారని, సంబంధిత ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో కలిసి పనిచేయడం లేదని విమర్శించారు. పైప్ లైన్ల పేరుతో రోడ్లను పాడుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో మామిడి ధరలు పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఎమ్మెలే సమృద్ధి మంజునాథ్ అన్నారు. వారిని కాపాడాలని, దీనిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. -
ఓ తల్లి కిరాతకం
కృష్ణరాజపురం: అక్రమ సంబంధం మోజుతో ఓ తల్లి ఎవరూ చేయరాని అకృత్యానికి పాల్పడింది. ప్రియునితో వెళ్లిపోయిన తల్లి.. ఆ తరువాత కూతురిని కడతేర్చింది. ఈ దారుణం బెంగళూరు కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. బాలిక హత్యపై భార్య ప్రియాంక, ఆమె ప్రియుడు మోహన్ పై తండ్రి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. దావణగెరెకు చెందిన ప్రవీణ్, బెంగళూరువాసి ప్రియాంకకు 2007లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 17, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం, ప్రియాంక కాలేజీ ప్రియుడు మోహన్తో అక్రమ సంబంధం ఏర్పడింది. దీని గురించి భర్త ప్రశ్నించగా, ప్రియాంక విడాకులు కావాలని పట్టుబట్టింది. చివరకు కుమార్తెలతో వెళ్లిపోయింది. హఠాత్తుగా బాలిక మృతి.. మార్చి 24న చిన్న కూతురు ఆకస్మాత్తుగా మరణించింది. ఏమైందని భర్త వెళ్లి ప్రియాంకను అడగ్గా, బిర్యానీ తింటూ చనిపోయిందని ఒకసారి, ఐస్ క్రీమ్ ఇచ్చి, ఏసీ వేసి కారులోనే పడుకోబెడితో మరణించిందని మరోసారి చెప్పింది. బాలిక నల్లగా ఉందని తరచూ తల్లి సతాయించేదని తెలిసింది. కుమార్తెను కొట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రియుడు మోహన్ను అరెస్టు చేయగా, ఇంతలో తల్లి పరారైంది. ప్రియుని మోజులో పడి, చిన్న కూతురి హత్య పరారీలో నిందితురాలు బెంగళూరులో ఘోరం -
‘సర్’తో లోపరహిత ఓటర్ల జాబితా
బళ్లారిటౌన్: లోపరహిత ఓటర్ల జాబితా తయారీనే సర్ ఉద్దేశమని బళ్లారి తాలూకా అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల నమోదు అధికారి రాజేష్ హెచ్ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దీన్ని వల్ల అనర్హులు నకిలీ మృతి చెందిన వంటి వారి పేర్లు ఉండకుండా సంపూర్ణ పరిశుద్ధంగా పట్టికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా ఏడాదికి ఒక్కసారి జరిగే జాబితా పరిశీలనకన్నా సర్ ప్రక్రియ భిన్నంగా ఉంటుందన్నారు. పట్టికలో ప్రతి పేరును లోతుగా పరిశీలించే ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ సారి ఎస్ఐఆర్ ప్రముఖ మార్పుతో ప్రతి ఓటు ఓటర్ను బీఎల్ఓలు కలిసి అర్హులను గుర్తిస్తారన్నారు. బూత్ స్థాయిలో అధికారులు ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారన్నారు. మరణించిన వారు, ఇతర చోట్లకు వలస వెళ్లిన వారు, ఒకటి కన్న ఎక్కువ చోట్ల పేర్లను నమోదు చేసుకున్న వారిని ఓటర్ జాబితా నుంచి తొలగిస్తారన్నారు. ఈ ప్రక్రియ ఈనెల 20 నుంచి 29 వరకు జరుగుతుందన్నారు. జూన్ 30 నుంచి జూలై 29 వరకు ఓటర్ల జాబితను తయారు చేయడం, ఆగస్ట్ 5 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఓటర్ల జాబితలో అక్షేపనలు ఉంటే తెలపవచ్చునన్నారు. అంతిమ జాబితాను అక్టోబర్ 7న ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ టి.రేఖా, తాలూకా పంచాయతీ ఈఓ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. హొసపేటె: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ కొనసాగుతోందని డిప్యూటి కమిషనర్ కవితా ఎస్.మన్నికేరి తెలిపారు. జిల్లాలో ఎస్ఐఆర్ పూర్వ కార్యకలాపాలు విజవయవంతంగా జరుగుతున్నాయన్నారు. హడగలి 89.30 శాతం, హగరిబొమ్మనహళ్లి 91.05 శాతం, విజయనగర్ 98.58 శాతం, కూడ్లిగి 95.70 శాతం, హరపనహళ్లి 87.58 శాతం పురోగతిని సాధించాయన్నారు. జిల్లాలో 1234 పోలింగ్ బూత్లు ఉండగా, వాటిలో 5,65,999 మంది పురుషులు, 5,76,735 మంది మహిళలు, 127 మంది ఇతరులు, మొత్తం 1142861 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకతను పాటించేందుకు, బూత్ లెవెల్ ఆఫీసర్లకు (బీఎల్ఓలకు) సహకరించేందుకు ప్రతి రాజకీయ పార్టీ తమ సొంత బీఎల్ఏలను ( బూత్ లెవెల్ ఏజెంట్లను) నియమించుకోవాలని సూచించినట్లు తెలిపారు. బీఎల్ఓలు ఇళ్లకు వచ్చినప్పుడు తగిన సమాచారం అందించి సహకరించాన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రజల అభ్యంతరాలను ఈఆర్ఓ స్థాయిలో విని పరిష్కరిస్తారన్నారు. అదనపు జిల్లా కలెక్టర్ ఈ బాలకృష్ణ పాల్గొన్నారు. హుబ్లీ: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30 నుంచి ఆగస్టు 7 వరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరగనుందని జిల్లా ఎన్నికల అధికారిణి స్నేహల్ ఆర్ మీడియాకు తెలిపారు. ఈ నెల 20 నుంచి 29 వరకు ఓటర్ల జాబితా తయారీ, శిక్షణ ముద్రణ ప్రక్రియను చేపడుతామన్నారు. బీఎల్ఓలు ఈ నెల 30 నుంచి జూలై 29 వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారన్నారు. సదరు ఓటర్ల జాబితాను ఆగస్ట్ 5న ప్రకటిస్తామన్నారు. అభ్యంతరాలు సమర్పణకు ఆగస్ట్ 5నుంచి సెప్టెంబర్ 4 వరకు గడువు ఉంటుందన్నారు. ఆగస్ట్ 5నుంచి అక్టోబర్3 అభ్యంతరాలను స్వీకరిస్తారని, తుది ఓటర్ల జాబితాను ఆగస్ట్ 7న ప్రకటిస్తారన్నారు. జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 1665 పోలింగ్కేంద్రాలు ఉండగా మొత్తం 16,22,294 ఓటర్లు ఉన్నారన్నారు. ఓటర్ల జాబితా సవరణకు జిల్లాలో 1665 పోలింగ్ కేంద్రాలలో 1665 బీఎల్ఓలు, 230 బీఎల్ఓ పర్యవేక్షకులను నియమించినట్లు తెలిపారు. ఈ సంపూర్ణ ప్రక్రియ పర్యవేక్షకులుగా జిల్లా నోడల్ అధికారిగా కేఎస్ఎన్ఎల్ ముఖ్య పాలన అధికారి ఎస్ఎన్ రుద్రేశ్ను నియమించామన్నారు. -
ఇంకుడు గుంతలతో భూగర్భజలాల వృద్ధి
రాయచూరు రూరల్: ఇంకుడు గుంత నిర్మాణాలకు ప్రాధాన్యత కల్పిస్తే భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని కాలుష్య నియంత్రణ మండలి అధికారి గణపతి హెగ్డే పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ఆయన పాల్గొని కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అక్కడ తవ్విన ఇంకుడు గుంతలను ప్రారంభించి మాట్లాడారు. ఎకర విస్తీర్ణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే కోట్ల లీటర్లు మేర నీరు భూగర్బంలోకి చేరుతాయన్నారు. ఇంకుడు గుంతల తవ్వకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాదికారి మల్లికార్జున, శిల్పా మెడికేర్ విష్ణుకాంత్, నర సింహయ్య, గిరీష్, సిదార్థ, సరస్వతి, హనుమేష్, రమేష్, అన్నపూర్ణ, మురళి, సంధ్య, గురురాజ్, వెంకటేష్ పాల్గొన్నారు. -
పలు ప్రాంతాల్లో జోరు వర్షాలు
బనశంకరి: రుతు పవనాల ప్రభావంతో బెంగళూరుతో పాటు చిక్కమగళూరు, హుబ్లీ– ధార్వాడ, బాగల్కోటె తదితర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం బెంగళూరులో జోరువాన పడింది. మెజెస్టిక్, మల్లేశ్వరం, రాజాజీనగర, విజయనగర, వసంతనగర, ప్యాలెస్ గుట్టహళ్లి, కాటన్పేటే, కార్పొరేషన్, చిక్కపేటే, గాంధీనగరతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వానకు రోడ్లు జలమయం అయ్యాయి. 11 వరకూ అలాగే శుక్రవారం నుంచి కరావళి, మలెనాడు, దక్షిణ ఒళనాడులోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 11వ తేదీ వరకు వానలు పడతాయి. బాగల్కోటెలో ఆకాశంలో మేఘాలు సుడులు తిరుగుతూ మేఘావృతం కావడం విశేషం. బెంగళూరులోనూ వాన -
రాజీనామా వెనక్కి తీసుకున్నట్టే!
శివాజీనగర: కొత్త ప్రభుత్వంలో అలకలు తగ్గాయి. మంత్రి రామలింగారెడ్డి తనకు నచ్చిన శాఖను ఇవ్వలేదని మంత్రి పదవికి రాజీనామా చేయగా హైకమాండ్ దూతలు చర్చలు జరిపారు. ‘శుక్రవారం రాత్రి నాతో సీఎం డీకే శివకుమార్, పార్టీ ఇన్చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా భేటీ అయ్యారు. వారితో మాట్లాడాను. వారు ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో వేచి చూస్తా’ అని రామలింగారెడ్డి శనివారం ఉదయం విలేకరులకు తెలిపారు. ఓ హోటల్లో భేటీ చేసి సుదీర్ఘంగా చర్చలు జరిపామన్నారు. ‘నా రాజకీయ జీవితంలో ఎలాంటి నిర్దిష్టమైన శాఖను కోరుకోలేదు. అయితే ఇచ్చిన భరోసా నెరవేర్చని నేపథ్యంలో నిరాశకు గురయ్యాను. రాజీనామాను వాపస్ తీసుకోవాలని సుర్జేవాలా విన్నవించారు. ఎన్నిసార్లు కోరినా అంగీకరించను. ముఖ్యమంత్రి, సుర్జేవాలా ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తాను’ అని తెలిపారు. రాజీనామా వెనక్కి: సుర్జేవాలా బనశంకరి: రామలింగారెడ్డి, కృష్ణబైరేగౌడతో రణదీప్సింగ్ సుర్జేవాలా సుమారు గంటపాటు చర్చించారు. బుజ్జగింపులతో రామలింగారెడ్డి రాజీనామాను వెనక్కి తీసుకున్నారని సుర్జేవాలా ప్రకటించారు. రామలింగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని అన్నారు. ఆయనకు అదనపు శాఖ ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిందన్నారు. రామలింగారెడ్డి విషయంలో బీజేపీ గందరగోళం సృష్టించిందని ఆయన ఆరోపించారు. సీఎం శివ కూడా ఆయన రాజీనామాను ఆమోదించబోనని చెప్పారు. చివరకు రామలింగారెడ్డి పదవిలో కొనసాగుతానని తెలిపారు. ఇవన్నీ సాధారణమే: డీసీఎం శివాజీనగర: రాజీనామా చేసిన రామలింగారెడ్డితో సీఎం మాట్లాడారు, మరో మంత్రి మునియప్పలో ఎలాంటి అసంతృప్తి లేదు, రాజకీయాల్లో ఇవన్నీ కూడా సర్వ సాధారణమని డీసీఎం పరమేశ్వర్ అన్నారు. తన రెవెన్యూ శాఖ గురించి త్వరలో విలేకరుల సమావేశంలో వివరిస్తానని తెలిపారు. సీఎం, హైకమాండ్ చొరవ.. మంత్రి రామలింగారెడ్డి ఓకే? -
ముసుగు దొంగల ముఠా సంచారం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలో ముసుగు దొంగల ముఠా సంచరించింది. నలుగురు వ్యక్తులు ముసుగులు, జీన్స్, జాకెట్లు, గ్లౌజులు, బూట్లు ధరించి శుక్రవారం రాత్రి బసవేశ్వర సర్కిల్ సమీపంలో సంచరించారు. ఈ దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. వారి వయస్సు ముప్పై నుంచి నలభై ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా. వీరు పట్టణంలోని చోరనూర్ రోడ్డు సమీపంలో, మసీదు వెనుక ఉన్న ఇళ్ల దగ్గర రాత్రిపూట తిరిగారు. అయితే ఏ ఇంట్లోనూ దొంగతనం జరిగినట్లు సమాచారం లేదు. స్థానికులు అప్రమత్తం కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ ప్రాంతంలో నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో జరిగిన ఒక ఘటనలో, పట్టపగలు తాళం వేసి ఉన్న మూడు నాలుగు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, లక్షల రూపాయల విలువైన డబ్బు, విలువైన వస్తువులను దోచుకుని పారిపోయారు. సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు పోలీసుల నిఘా పెంచాలని కోరుతున్న స్థానికులు -
తుంగభద్ర నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
హొసపేటె: హొసపేటె – కొప్పల్ పరిధిలో ఉన్న తుంగభద్ర నదిలో తేలుతున్న మృత దేహాన్ని వెలికితీసేందుకు సరిహద్దు వివాదంపై పోలీసులు పరస్పరం వాదులాడుకున్నారు. తుంగభద్ర నది విజయనగర, కొప్పళ్ జిల్లాలకు సరిహద్దుగా ఉంది. బుక్కసాగర్ వంతెన సమీపంలోని నదీ జలాల్లో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండగా గమనించిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. విజయనగర జిల్లా కమలాపూర్, కొప్పల్ జిల్లా గంగావతికి చెందిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే మృతదేహం పడి ఉన్న స్థలం తమ పరిధిలోకి రాదంటూ ఇరు జిల్లాల పోలీసులు వాగ్వాదం చేసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న ప్రజలు పోలీసుల తీరుపై మండిపడ్డారు. మృతదేహాన్ని వెలికి తీయకుండా సరిహద్దుల గరించి చర్చించుకుంటారా అంటూ మండిపడ్డారు. చివరకు కమలాపూర్ పోలీసులు స్థానిక మత్స్యకారుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి గుర్తింపు ఇంకా నిర్ధారణ కాలేదు. ఇది ఆత్మహత్య లేక హత్యా అనే కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని వెలికి తీయకుండా పోలీసుల నిర్లక్ష్యం అది తమ పరిధిలో లేదంటూ విజయనగర, కొప్పళ జిల్లా పోలీసుల వాగ్వాదం ఆగ్రహం వ్యక్తం చేసిన జనం ఎట్టకేలకు మృతదేహం వెలికితీత -
ముళ్ల సీమ చెట్లతో బొగ్గు తయారీ
సాక్షి,బళ్లారి: ీసమ జాలి(సీంజాలి)గా పిలిచే ఈ మొక్క ఒకప్పుడు పొలాలు, కంచెలకు, వంట చేసేందుకు కట్టెలుగా ఉపయోగపడేది. ముళ్లతో కూడిన జాలి చెట్లను తొలగించేందుకు రైతులు ఎన్నో అవస్థలు పడేవారు. ఇప్పుడు అదే ముళ్లు జాలి చెట్లు రైతుల పాలిట నల్ల బంగారంగా మారాయి. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ముళ్ల జాలితో తయారయ్యే బొగ్గుకు మంచి డిమాండ్ ఏర్పడింది. అమెరికా, మెక్సికో ప్రాంతాల్లో ఉన్న మొక్కను బ్రిటిష్ కాలంలో, లేదా స్వాతంత్రం తర్వాత మన ప్రాంతాల్లో నాటారని కూడా తెలుస్తోంది. ఒకప్పుడు పల్లె ప్రాంతాల్లో కంపచెట్లను వంట చెరకుగా వినియోగించేవారు. కాలక్రమేణా ప్రతి ఇంటా గ్యాస్ పొయ్యిలు వచ్చాయి. దీంతో కట్టెలు వాడకం దాదాపు తగ్గిపోయింది. మొండి మొక్కగా పేరొందిన ఈ ముళ్ల జాలి ఎంత నరికివేసినా మళ్లీ త్వరగా పెరగడం దీని సహజ స్వరూపం. దీంతో జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో బీడు భూములు, కొండలు, గుట్టలు, రాళ్ల మధ్య జాలి పొదలు కనిపించడం సర్వసాధారణంగా మారింది. జాలి చెట్లతో బొగ్గు తయారీ ఎక్కడ చూసినా విస్తృతంగా పెరిగే ఈ చెట్లను కొందరు ఉపాధి మార్గంగా మలుచుకున్నారు. పొలాలు, గట్ల వద్ద పెరిగే జాలి చెట్లను కొనుగోలు చేసి బొగ్గుగా మార్చి విక్రయించి ఉపాధి పొందుతున్నారు. క్రమంగా ఇది ఒక పరిశ్రమంగా రూపొంతరం చెందింది. బళ్లారి, విజయనగర, చిత్రదుర్గం, కొప్పళ, దావణగెరె పొరుగున ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు తదితర జిల్లాలో కట్టెలనుంచి బొగ్గు తయారు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతతో బొగ్గుకు డిమాండ్ అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఏర్పడి వంటగ్యాస్కు కొరత ఏర్పడటంతో జాలి చెట్లకు మళ్లీ డిమాండ్ పెరిగింది. గ్రామాల్లో చాలా మంది పూర్వం తరహాలోనే ముళ్లకంపచెట్లతోనే వంటలు చేస్తున్నారు. మరో వైపు వీటితో తయారయ్యే బొగ్గుకు డిమాండ్ ఏర్పడింది. హోటళ్లు, తందూరి రొట్టెల తయారీకి, ఇసీ్త్ర దుకాణదారులనుంచి బొగ్గుకు డిమాండ్ ఏర్పడింది. ఈ బొగ్గుల వల్ల తక్కువ పొగ రావడమే కాకుండా, ఎక్కువ సేపు మండటం, అధిక వేడి ఇవ్వడం, తక్కువ బరువు ఉండటంతో ఎగుమతులు చేయడానికి ఎంతో మేలు చేస్తుందని బొగ్గు తయారీదార్లు పేర్కొంటున్నారు. ముళ్ల సీమజాలిచెట్లను జేసీబీలతో తొలగిస్తున్న దృశ్యం ముళ్ల సీమజాలితో బొగ్గు తయారీ దృశ్యం ఒకప్పుడు పనికిరానిఈ చెట్లు నేడు ఎంతో మందికి జీవనోపాధి సీమ చెట్లతో బొగ్గు తయారీ సిలిండర్ల కొరతతో బొగ్గుకు డిమాండ్


