Karnataka
-
మైసూరుకు ఏమైంది?
మైసూరు: రాచనగరిలో అప్పుల బాధతో ఓ వ్యాపారవేత్త భార్య, కుమారుడు, తల్లికి విషమిచ్చి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. నగరవాసులు ఈ షాక్ నుంచి తేరుకోకముందే అదే మాదిరి మరో సామూహిక ఆత్మహత్యల ఘటన సంభవించింది. జెస్సీ ఆంటోని, అతని సోదరుడు జోబి ఆంటోని, అతని భార్య స్వాతి బలవన్మరణానికి పాల్పడినవారు. మృతులు నగరంలోని విద్యానగర, యరగనహళ్లి నివాసులుగా గుర్తించారు. వీరి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. వివరాలు.. జోబి ఆంటోని, జెస్సీ ఆంటోనీలు కవల సోదరులు. తాలూకాలోని రమ్మనహళ్లిలో జెస్సీ ఆంటోని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు అతను ఒక వీడియో చేశాడు. అందులో జోబి ఆంటోని, అతని భార్య స్వాతి అలియాస్ శర్మిల, తన సోదరి మేరీ షెర్లిన్ ద్వారా ఊరు నిండా అప్పులు చేశారు, అప్పులవారి బాధ భరించలేకున్నాం, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. షెర్లిన్కి భర్త లేడని, ఆమెను మోసం చేశారని, ఆమెని, ఆమె బిడ్డను చంపాలని ప్రయత్నించారని తెలిపాడు. దీనంతటికీ జోబి ఆంటోని, అతని భార్య స్వాతి కారణమని, వారిని శిక్షించాలని వీడియోలో అభ్యర్థించాడు. ఆ వీడియోను తన సోదరికి పంపి ఉరి బిగించుకున్నాడు. భయపడి.. జోబి జంట.. మేరీ షెర్లిన్ మైసూరు దక్షిణ పోలీసు స్టేషన్లో జోబి, స్వాతిలపై ఫిర్యాదు చేయగా ఆత్మహత్యకు ప్రేరేపించారనే సెక్షన్లతో కేసు నమోదైంది. ఈ పరిణామాలతో భయపడిన జోబి, స్వాతి విజయనగర క్రీడా మైదానంలోని నీటి ట్యాంకు నిచ్చెనకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జోబి ఆంటోని తన సోదరి పేరిట బెట్టింగ్ కోసం సుమారు రూ.80 లక్షల మేర అప్పులు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో ఘర్షణలు చెలరేగాయని తెలుస్తోంది. వరుస ఆత్మహత్యల పరంపర మైసూరులో కలకలం సృష్టిస్తోంది. -
ఇక్కడి అమ్మాయి.. అక్కడి అబ్బాయి (ఫొటోలు)
మైసూరు: ప్రేమ ఎల్లలు దాటింది. మైసూరుకు చెందిన యువతి, నెదర్లాండ్కు చెందిన యువకుడి మధ్య చిగురించిన ప్రేమ ఫలించింది. దీంతో పెద్దల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నగరంలోని హూటగళ్లికి చెందిన విద్య, నెదర్లాండ్కు చెందిన యువకుడు రుటైర్ పరస్పరం ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియపరచగా వారి పెళ్లికి అంగీకరించారు. దీంతో నగరంలోని కల్యాణ మండపంలో చెన్నగిరి తాలూకాలోని పాండోమట్టి విరక్త మఠం డాక్టర్ గురుబసవ స్వామీజీ నేతృత్వంలో విద్యా మెడలో రుటైర్ తాళి కట్టాడు. అనంతరం పెళ్లికి వచ్చిన అతిథులు వారిని ఆశీర్వదించి శుభాశీస్సులు పలికి విందు భోజనం ఆరగించారు. -
భార్య విద్రోహం.. భర్త ప్రాణత్యాగం
తుమకూరు: ప్రేమించుకున్నారు, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి తాళితో ఒక్కటయ్యారు. కానీ ఆమె మరొకరిపై మోజుపడి కట్టుకున్నోడికి ద్రోహం చేసింది. అంతే, భర్త గుండె పగిలి ప్రాణాలే వద్దనుకున్నాడు. తన స్నేహితుడే భార్యను తీసుకెళ్లడంతో విరక్తి చెందిన భర్త సెల్ఫీ వీడియో తీసి, చావుకు పరారైన భార్య, స్నేహితుడే కారణమని, తనకు న్యాయం చేయాలని స్నేహితులను కోరుతూ ఫేస్బుక్లో అప్లోడ్ చేసి ఉరి వేసుకున్నాడు. చిచ్చుపెట్టిన స్నేహితుడు హృదయ విదారకమైన ఈ ఘటన మంగళవారం జిల్లాలోని గుబ్బి పట్టణంలోని గట్టి లేఅవుట్ బడావణెలో జరిగింది. వివరాలు.. నాగేష్ (35), 12 సంవత్సరాల క్రితం రంజిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. నాగేష్ ఇటీవల సొంత ఇల్లు విక్రయించి గట్టి లేఅవుట్ బడావణెలో బాడుగ ఇంట్లో ఉంటున్నాడు. అతని స్నేహితుడు భరత్.. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ రంజిత మనసు మార్చాడు, ఇటీవల ఇద్దరూ వెళ్లిపోయారు. ఈ పరిణామంతో విరక్తి చెందిన నాగేష్.. మిత్రుడు భరత్ తన భార్య రంజితతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని, పరారు కావడంతో ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. గుబ్బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
హోంమంత్రికి హైకమాండ్ పిలుపు
శివాజీనగర: కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు హోం మంత్రి జీ.పరమేశ్వర్ మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. పరమేశ్వర్ దళిత ఎమ్మెల్యేలు, మంత్రులను కలుస్తూ సీఎం పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిలుపు రావడం కుతూహలం కలిగిస్తోంది. హుటాహుటిన ఉదయం ఆయన ఢిల్లీకి వెళ్లారు. సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, ఒక వ్యక్తికి ఒకే పదవి ప్రకారం కేపీసీసీ అధ్యక్ష పదవిని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి తొలగించాలని పరమేశ్వర్ కోరుతున్నారు. అలాగే పరమేశ్వర్ చర్యల వల్ల పార్టీ గౌరవానికి భంగం కలుగుతోందని కొందరు హైకమాండ్కి ఫిర్యాదులు చేశారు. వీటన్నింటి గురించి రాహుల్గాంధీ, వేణుగోపాల్, సుర్జేవాలా వంటి నేతలు పరమేశ్వర్తో చర్చిస్తారని తెలిసింది. సహకార మంత్రి కే.ఎన్.రాజణ్ణ సోమవారం కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీ.కే.శివకుమార్పై మండిపడి, ఎవరి నుంచి క్రమశిక్షణ పాఠాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. శివకుమార్ ఏఐసీసీ పేరును దుర్వినియోగం చేసుకొన్నారని ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లిన పరమేశ్వర్కేపీసీసీ స్థానం ఖాళీగా లేదు: జార్జ్ కేపీసీసీ అధ్యక్ష మార్పు నాకు తెలియదు, ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నారు కదా. ఆ పదవి ఖాళీగా లేదు అని మంత్రి కే.జే.జార్జ్ అన్నారు. అధ్యక్ష మార్పు గురించి హైకమాండ్ ఏమైనా చెప్పారా అని మీడియాను ప్రశ్నించారు. మంత్రి రాజణ్ణ ఏమేం ఫిర్యాదులు చేశారో తెలియదన్నారు. -
చెప్పుతో కొట్టుకున్న పీడీఓ
మైసూరు: గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిణి(పీడీఓ), పంచాయతీ అధ్యక్షుల మధ్య నిధుల విషయంలో గొడవ జరిగి, పీడీఓ చెప్పుతో కొట్టుకున్న ఘటన జిల్లాలోని హుణసూరు తాలూకాలో జరిగింది. వివరాలు.. హనగోడు పీడీఓ డాక్టర్ అనిత కాగా, ప్రభుత్వానికి జమ చేయాల్సిన సొమ్ములో రూ.50 వేల వ్యత్యాసం ఉంది. దీనిపై సిబ్బందికి, ఆమెకు మధ్య గొడవ జరుగుతోంది. మరోవైపు అధ్యక్షుడు చెన్నయ్య, పీడీఓ అనిత మధ్య కొన్ని అంశాలపై వాగ్వాదం జరిగింది. ఆవేశానికి గురైన అనిత చెప్పు తీసుకుని తానే కొట్టుకున్నారు. చెన్నయ్య మాట్లాడుతూ నాలుగు నెలల క్రితం జరిగిన ఘటన ఇది అని, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పారు. తప్పుడు ఫిర్యాదులు చేస్తే కేసులే: కమిషనర్ యశవంతపుర: ఎవరైనా పోలీసుస్టేషన్కు వెళ్లి తప్పుడు ఫిర్యాదు చేస్తే అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొంటామని బెంగళూరు పోలీసు కమిషనర్ బీ దయానంద్ హెచ్చరించారు. విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్లలో తప్పుడు ఫిర్యాదు చేసిన ఆరు మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సంపిగేహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో దాడి జరిగిందని ఓ వ్యక్తి తప్పుడు కేసు పెట్టాడని తెలియడంతో అతనిపైనే చార్జిషీటు దాఖలు చేసినట్లు తెలిపారు. అమృతహళ్లిలో వాహన చోరీ అయ్యిందని తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తికి కోర్టు రూ. వంద జరిమానా విధించినట్లు తెలిపారు. -
మనీ ల్యాండరింగ్ పేరుతో కుచ్చుటోపీ
రాయచూరు రూరల్: మనీ ల్యాండరింగ్ పేరుతో రిటైర్డ్ కేబీజీఎన్ఎల్ అధికారికి రూ.10 లక్షల మేర కుచ్చుటోపీ పెట్టిన ఉదంతం యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. యాదగిరి జిల్లా ఽశహాపుర తాలూకా భీమరాయన గుడి కృష్ణా భాగ్య జల నిగమ ప్రాజెక్టు(కేబీజీఎన్ఎల్)లో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన అధికారికి ముంబై వ్యక్తులు కుచ్చుటోపీ వేశారు. గతనెల 26న కలబుర్గిలో ఉన్న సమయంలో 7418251915 నంబర్ నుంచి వీడియో కాల్ చేయడం ద్వారా హిందీలో సంభాషణ చేశారు. ముంబై క్రైం బ్రాంచ్ నుంచి అధికారిని మాట్లాడుతున్నట్లు చెప్పి మనీ ల్యాండరింగ్ పేరు మీద మీపై నేరం మోపారని తెలిపారు .మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బుల లావాదేవీల వ్యవహారం జరిగిందంటూ కేసు నమోదు చేశామని చెప్పారు. ఎఫ్ఐఆర్ నంబర్ ఎంహెచ్–5621–2024 అంటూ ప్రధాన ముద్దాయి నరేష్ గోయల్ను అరెస్ట్ చేశామన్నారు. ఇందులో మీరు రెండో ముద్దాయి అంటూ వీడియో కాల్లో మాట్లాడారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా నంబర్ ఇతర వివరాలు పంపాలని ఆదేశించారు. అపరిచితులు ఫిర్యాదు దారుడికి వీడియో కాల్లో ఓ నివాసంలో ఓ న్యాయమూర్తిని సృష్టించి నరేష్ గోయల్ను అరెస్ట్ చేసినట్లు చూపించారు. అన్ని వివరాలు వ్యాట్సప్ ద్వారా పంపాలని కోరారు. నిరాకరిస్తే మిమ్ములను అరెస్ట్ చేస్తామని, దాని బారి నుంచి రక్షణ పొందాలంటే మీ కొడుకుకు తెలియకుండా చూడాలని సూచించారు. వివిధ బ్యాంక్ ఖాతాల నుంచి రూ.10 లక్షలను బదలాయించుకుని వంచించారు. ఈ నెల 10న యాదగిరి సీఈఎన్ పోలీస్ స్టేషన్లో కేసును పోలీసులు నమోదు చేసుకున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో నయవంచన రిటైర్డ్ అధికారికి రూ,10 లక్షల మోసం యాదగిరి జిల్లాలో ఘటన వెలుగులోకి -
కిరాతక కొడుకు
కృష్ణరాజపురం: బెంగళూరులో కన్న తండ్రిని తనయుడు హతమార్చిన ఘటన బ్యాడరహళ్లి బాలాజీ లేఅవుట్లో జరిగింది. వివరాలు.. మృతున్ని రిటైర్డ్ బీఎస్ఎఫ్ జవాన్ చెన్నబసవయ్య (54)గా గుర్తించారు. వివరాలు.. అతని కుమారుడు అమిత్ (26) తాగుడుకు బానిసగా మారాడు. నిత్యం పీకలదాకా తాగి వచ్చి మళ్లీ తనకు తాగుడకు డబ్బులివ్వాలని తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తుండేవాడు. తాగుడుకు డబ్బు లేకుంటే తల్లి బంగారు గాజులు, చెవి కమ్మలు ఇవ్వమని అడిగేవాడు. మంగళసూత్రాన్ని కూడా లాక్కొనేందుకు ప్రయత్నించేవాడు. ఈ విషయం తెలిసి కుమారుడిని తండ్రి తీవ్రంగా మందలించాడు. దీనిని మనసులో పెట్టుకుని కక్ష పెంచుకున్న అమిత్ తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యథాప్రకారం తాగి వచ్చి తండ్రితో గొడవకు దిగాడు. కోపోద్రేకంలో ఇనుప రాడ్డుతో కొట్టి చాకుతో పొడిచి తండ్రిని చంపాడు. బ్యాడరహళ్లి పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి అమిత్ను అరెస్టు చేశారు. వ్యసనాలకు లోనై.. తండ్రి హత్య -
విజయపురలో నాటు పిస్టళ్ల దందా
బనశంకరి: విజయపుర (బిజాపుర) జిల్లాలో గన్ కల్చర్ బయటపడింది. నాటు పిస్తోళ్లు పెట్టుకున్న 10 మంది ఇళ్లలో పోలీసులు దాడి చేసి 10 నాటు పిస్టల్స్, 24 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ లక్ష్మణ నింబరగి మంగళవారం వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఇటీవల విజయపురలో రమేశ్గేము లమాణి ఇతరులు కలిసి సతీశ్ ప్రేమసింగ్ రాథోడ్పై పిస్టల్ తో కాల్పులు జరిపి చాకుతో పొడిచి హత్యచేశారు. ఈకేసులో 6 మందిని అరెస్ట్ చేశామని, నిందితులను విచారించినప్పుడు నాటుపిస్టళ్ల గుట్టు బయటపడిందని తెలిపారు. దీంతో జిల్లాలో వివిధ చోట్ల గాలించి తుపాకులు, తూటాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రకాశమర్కీ, అశోకపరంపాండ్రే, సుజిత సుబాష్ రాథోడ్, సుఖదేవ్ రాథోడ్, ప్రకాశ భీమసింగ్ రాథోడ్, గణేశ్ శివరామశెట్టి, చెన్నప్పమల్లప్ప నాగనూరు, సంతోష్ కిషన్ రాథోడ్, జనార్దన వసంత పవార్ అనేవారి ఇళ్లలో గాలించి తుపాకులను సీజ్చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి నాటు తుపాకులను తెప్పించి విక్రయిస్తున్నట్లు సమాచారం. తుపాకులను కలిగి ఉండడం గొప్పగా భావించి వీటిని చాటుమాటుగా కొంటూ ఉంటారు. 10 తుపాకులు, తూటాలు సీజ్ -
అక్రమ లేఔట్లపై కొరడా
బనశంకరి: రాష్ట్రంలో అనధికార లేఔట్లు తలెత్తితే అధికారులనే జవాబుదారీ చేసి నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య హెచ్చరించారు. మంగళవారం నివాస కార్యాలయమైన కృష్ణాలో స్థానిక సంస్థల్లో బీ–ఖాతా అందించడం గురించి జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు, కమిషనర్లతో వీడియో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాలు, నగర, పట్టణ, పాలికె పరిధిలో అనధికార లేఔట్లకు చెక్ పెడతామన్నారు. ఇకపై అక్రమ లేఔట్లకు రాష్ట్రంలో అవకాశం లేదన్నారు. అధికారులు చట్ట ప్రకారం పని చేయాలన్నారు. ఒక వేళ మళ్లీ అక్రమ లేఔట్లు తలెత్తితే అక్కడి అధికారులపై చర్యలు తప్పవని తెలిపారు. ఇప్పటికే అనధికార లేఔట్లలో ఇళ్లు నిర్మించుకున్నవారికి ఇబ్బందులు కలగరాదని ఒకేసారి బీ–ఖాతా అభియాన చేపడుతున్నామన్నారు. 3 నెలలు సమయం ఇస్తున్నామని, అంతలోగా బీ–ఖాతా అభియాన ను పూర్తిచేయాలని ఆదేశించారు. ఎలాంటి గందరగోళానికి ఉండరాదన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కృష్ణబైరేగౌడ, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేశ్, రహీంఖాన్, అధికారులు పాల్గొన్నారు. అధికారులకు సీఎం ఆదేశం సక్రమంగా బి–ఖాతా అభియాన్ -
హోంమంత్రికి హైకమాండ్ పిలుపు
శివాజీనగర: కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు హోం మంత్రి జీ.పరమేశ్వర్ మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. పరమేశ్వర్ దళిత ఎమ్మెల్యేలు, మంత్రులను కలుస్తూ సీఎం పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిలుపు రావడం కుతూహలం కలిగిస్తోంది. హుటాహుటిన ఉదయం ఆయన ఢిల్లీకి వెళ్లారు. సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, ఒక వ్యక్తికి ఒకే పదవి ప్రకారం కేపీసీసీ అధ్యక్ష పదవిని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి తొలగించాలని పరమేశ్వర్ కోరుతున్నారు. అలాగే పరమేశ్వర్ చర్యల వల్ల పార్టీ గౌరవానికి భంగం కలుగుతోందని కొందరు హైకమాండ్కి ఫిర్యాదులు చేశారు. వీటన్నింటి గురించి రాహుల్గాంధీ, వేణుగోపాల్, సుర్జేవాలా వంటి నేతలు పరమేశ్వర్తో చర్చిస్తారని తెలిసింది. సహకార మంత్రి కే.ఎన్.రాజణ్ణ సోమవారం కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీ.కే.శివకుమార్పై మండిపడి, ఎవరి నుంచి క్రమశిక్షణ పాఠాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. శివకుమార్ ఏఐసీసీ పేరును దుర్వినియోగం చేసుకొన్నారని ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లిన పరమేశ్వర్కేపీసీసీ స్థానం ఖాళీగా లేదు: జార్జ్ కేపీసీసీ అధ్యక్ష మార్పు నాకు తెలియదు, ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నారు కదా. ఆ పదవి ఖాళీగా లేదు అని మంత్రి కే.జే.జార్జ్ అన్నారు. అధ్యక్ష మార్పు గురించి హైకమాండ్ ఏమైనా చెప్పారా అని మీడియాను ప్రశ్నించారు. మంత్రి రాజణ్ణ ఏమేం ఫిర్యాదులు చేశారో తెలియదన్నారు. -
శృతి విషాదం వెనుక..పాత స్మృతులు
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని బాగలగుంటలో భర్త ప్రవర్తన సరిగా లేదనే కోపంతో శృతి (33)అనే మహిళ, కుమార్తె రోహిణి(5)కి ఉరివేసి చంపి, తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో మరో విషయం వెలుగు చూసింది. గతంలో శృతి కుటుంబం ఒక ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఆ ఇంటి ఓనర్ భార్య కూడా ఇదే మాదిరిగా డెత్నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆ సంఘటన శృతి మనసులో నాటుకుపోయిందని బంధువులు తెలిపారు. తనకూ అదే సమస్య ఎదురవడంతో అచ్చం అలాగే డేత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుందన్నారు. శృతి భర్త గోపాలక్రిష్ణను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
కుర్చీ కలహం
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొన్ని నెలలుగా రాష్ట్ర కాంగ్రెస్లో లోలోపల కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో ఆటుపోట్ల మధ్య, అసాధ్యమనుకున్న సమయంలో 2023 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారాన్ని సాధించింది. మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కృషి కాదనలేని నిజం. ఆ తర్వాత ఢిల్లీలో రెండురోజుల ఉత్కంఠభరిత చర్చల తరువాత సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పీఠం వరించింది. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం పదవితో సంతృప్తి చెందాల్సి వచ్చింది. తలా రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలనే ఒప్పందం కుదిరిందని అప్పట్లో ప్రచారం సాగింది. అప్పటి నుంచి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు నేతలు విడిపోయి అంతర్గతంగా ముఖ్యమంత్రి పదవి కోసం లాబీయింగ్లు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఎవరి వర్గానిది పైచేయి ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తీవ్ర రూపాన్ని దాల్చింది. బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. డీకే శివకుమార్ బలం తగ్గుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం స్థానంపై గంపెడాశలతో ఉన్న డీకే శివకుమార్ ఆశలపై ఈ వ్యతిరేక వర్గం ఎప్పటికప్పుడు నీళ్లు చదువుతోంది. అధికార పంపిణీ అంశం చర్చకు తెరలేసినప్పుడు డీకే శివకుమార్ తరపున ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతుగా మాట్లాడుతున్నారు. అయితే సీఎం సిద్ధరామయ్య తరపున హేమాహేమీ నాయకులు, సీనియర్లు గళమెత్తడం గమనార్హం. 50–50 సూత్రం లేదు, తమ నాయకుడు సిద్ధరామయ్యనే అని, ఐదేళ్లు అయనే సీఎంగా కొనసాగుతారని మంత్రులు రాజణ్ణ, జమీర్ అహ్మద్, మహదేవప్ప వంటివారు మాట్లాడడం డీకే శిబిరానికి మింగుడు పడడం లేదు. మంత్రులు ఎంబీ పాటిల్, సతీశ్ జార్కిహోళి, జి.పరమేశ్వర్ వంటి సీనియర్లు సిద్దుకు మద్దతుగా నిలిచారు. ఒకవేళ సీఎంను మారిస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకు అవకాశం ఇవ్వాలని డీకే శివకుమార్కు చెక్ పెడుతున్నారు. సీఎం సిద్దరామయ్య వర్గం పైచేయి డిప్యూటీ సీఎం డీకే నిరీక్షణ ఫిఫ్టీ– ఫిఫ్టీ సూత్రంపైనే ఆశలు హైకమాండ్పై ఆశలు డీకే శివకుమార్ తరపున మాట్లాడేవారే కరువయ్యారు. మాగడి బాలకృష్ణ వంటి ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన నేతలెవ్వరూ శివకుమార్కు జై కొట్టడం లేదు. కేబినెట్ మొత్తం దాదాపుగా సీఎం సిద్ధరామయ్య పక్షమే.. ఇటీవల మంత్రులు కేఎన్ రాజణ్ణ, సతీశ్లు హైకమాండ్తో చర్చలు జరిపారు. తమ అభిప్రాయాలు, ఆరోపణలను హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చారు. కానీ ముడా స్థలాల కేసులో సీఎం సిద్దరామయ్య చిక్కుకోవడంతో బలం తగ్గినట్లయింది. ఇక డీకే హైకమాండ్ మీదనే ఆశలు పెట్టుకుని పావులు కదిలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు అన్యాయం చేయదని భావిస్తున్నారు. -
ఆరోగ్యదాయకం.. సూర్య నమస్కారం
చిక్కబళ్లాపురం: చిక్క సమీపంలోని ఆదియోగి పరమేశ్వరుని సన్నిధిలో పతంజలి యోగ సమితి సభ్యులు సూర్య నమస్కారాన్ని ఆచరించారు. నిత్యం 21 రోజులు సూర్య నమస్కారం, యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని యోగా గురు స్వామి లవణ తెలిపారు. యోగా శిక్షకులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సూర్య నమస్కారం నాడీమండలాన్ని చైతన్యం చేస్తుందని అన్నారు. ఒత్తిడిని, అనారోగ్యాన్ని దూరం చేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుందని తెలిపారు. 50 మందికి పైగా యోగాభ్యాసులు సూర్య నమస్కారం నిర్వహించారు. మందు పార్టీ వికటించి.. ఇద్దరు మృత్యువాత దొడ్డబళ్లాపురం: మద్యం, డ్రగ్స్ పార్టీ చేసుకున్న అసోం వలస కార్మికులు అది వికటించి మృత్యువాత పడ్డారు. బెంగళూరు సూర్యనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటనన జరిగింది. అసోంకు చెందిన దివాన్ అఫ్రీద్ అలీ (27), అష్రఫ్ అలీ (34) చనిపోయినవారు. యారండనహళ్లిలో నివసిస్తున్న ఓ అసోంవాసి ఇంట్లో సోమవారం రాత్రి మద్యం విందు చేసుకున్నారు. కొంతసేపటికి ముగ్గురూ అస్వస్థులై పడిపోయారు. తెలిసిన వ్యక్తి ఇంట్లోకి వచ్చి చూడగా ఒకరు మృతిచెంది, మరో ఇద్దరు అపస్మారకంలో పడిఉన్నారు. ఆస్పత్రికి తరలించగా మరో వ్యక్తి మరనించాడు. అతిగా మద్యం తాగి ఏదైనా డ్రగ్స్ను తీసుకోవడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో నిజం తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. బాధితులు బెంగళూరుకు వలస వచ్చి స్థానిక ఫ్యాక్టరీలో పనిచేసేవారు. సూర్యనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. లా ప్రశ్నాపత్రాల లీకేజీలో ముగ్గురు అరెస్టు దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని లా యూనివర్సిటీలో పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన కేసులో సైబర్ క్రైం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. కోలారులోని బసవశ్రీ లా కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ నాగరాజు, ఈయన కారు డ్రైవర్ కమ్ కాలేజీ విద్యార్థి అయిన జగదీష్, బంగారుపేట లా కాలేజీ విద్యార్థి వరుణ్ కుమార్ పట్టుబడ్డారు. రాష్ట్ర లా యూనివర్సిటీ ద్వారా జనవరి 23న జగరాల్సిన పరీక్షల కాంట్రాక్ట్ లా–1 ప్రశ్నాపత్రం టెలిగ్రాం, వాట్సాప్ గ్రూపుల్లో ముందే వచ్చేశాయి. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. మత్తులో కారు డ్రైవింగ్● ఇద్దరు దుర్మరణం దొడ్డబళ్లాపురం: విద్యార్థులు మద్యం తాగిన మత్తులో కారు నడిపి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెంది మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన బెంగళూరు బన్నేరుఘట్ట సమీపంలోని రాగిహళ్లి వద్ద చోటుచేసుకుంది. గొట్టగెరె సమీపంలోని ప్రైవేటు కాలేజీలో చదువుతున్న కేరళకు చెందిన సహా హక్ (25), అర్షు (23) మృతులు. దేవనారాయణ, సాహిల్ అనేవారు తీవ్రంగా గాయపడగా, స్థానిక ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి బాగా మద్యం తాగిన విద్యార్థులు కారులో అతివేగంగా వస్తూ రాగిహళ్లి వద్ద చెట్టును ఢీకొన్నారు. బన్నేరుఘట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. లాకర్లో రూ.8 లక్షలకు చెదలు దొడ్డబళ్లాపురం: ఇంట్లో కంటే బ్యాంకు లాకర్లో భద్రంగా ఉంటాయి కదా అని నగదు దాచుకుంటే, చెదలు పట్టిపోయాయి. రూ.8 లక్షలు పనికి రాకుండా అయ్యాయి. ఈ సంఘటన మంగళూరులో చోటుచేసుకుంది. సఫల్ అనే ఖాతాదారు మంగళూరు కోటెకార్లో ఉన్న ఓ ప్రముఖ బ్యాంకులో 6 నెలల క్రితం రూ.8 లక్షల నగదు దాచాడు. డబ్బులు అవసరమై తీసుకోవాలని బ్యాంకుకి వచ్చాడు. బ్యాంకు సిబ్బందితో కలిసి లాకర్ తెరిచి చూస్తే.. నగదు మొత్తం తడిచి, రంగుమారి చెదలు పట్టి పొడి పొడిగా కనిపించింది. అది చూసి సఫల్ లబోదిబోమన్నాడు. లాకర్లలో నగదు దాచరాదని తాము ముందే చెప్పామని సిబ్బంది జారుకున్నారు. దీంతో బాధితుడు బెంగళూరు వచ్చి బ్యాంకు మెయిన్ బ్రాంచ్లో ఫిర్యాదు చేశాడు. -
ప్రత్యేక గిరిజన హాస్టళ్లు మంజూరు చేయండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో వెనుక బడిన జిల్లాల్లో గిరిజన పిల్లలకు ప్రత్యేక హాస్టళ్లను మంజూరు చేయాలని గిరిజన వర్గాల కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రారష్ట్ర ప్రభుత్వం 2023లో అధికారం చేపట్టిన వెంటనే గిరిజన అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసినా నిధులు కేటాయించక పోవడాన్ని ఖండించారు. అత్యధికంగా కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో రాయచూరు జిల్లాలో అధిక భాగం గిరిజన ప్రజలు నివాసం ఉంటున్నారన్నారు. వారికి మౌలిక సౌకర్యాలు కల్పించడంలో అలసత్వం చూపుతున్నారన్నారు. అంబేడ్కర్ కార్మిక సహాయ హస్త పథకం ద్వారా 20 అసంఘటిత కార్మికులకు పరిహారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. -
సిడిబండి రథోత్సవంపై సమీక్ష
బళ్లారిటౌన్: మార్చి 11న జరగనున్న కనకదుర్గమ్మ దేవస్థానం సిడిబండి రథోత్సవాన్ని వైభవంగా జరపాలని సిటీ ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి సూచించారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం సభాంగణంలో జరిగిన ముందస్తు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఉత్సవాలను సంప్రదాయ బద్ధంగా జరుపుకోనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపదోషాలు లేకుండా చూడాలన్నారు. దీని కోసం గాణిగ సముదాయం సలహాలు పొందాలని దేవస్థానం ఈఓను ఆదేశించారు. ఈ ఉత్సవాలకు సుమారు 4 లక్షల మంది భక్తాదులు రావచ్చని, వీరందరికీ తాగునీరు, వాహనాల పార్కింగ్, విద్యుత్ సదుపాయం, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి కోసం అన్ని ఏర్పాట్లు జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా మాట్లాడుతూ భక్తాదులు తాగునీటి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్నదాసోహ కార్యక్రమానికి ఆహార ధాన్యాలను పరీక్షించాలని ఆరోగ్య అధికారులకు సూచించారు. దేవస్థానం చుట్టు పక్కల ఎప్పటికప్పుడు పరిశుభ్రత కాపాడాలని మహనగర పాలికె అధికారులు సూచించారు. ఇదే దిశలో వివిధ అధికారులకు కూడా వారివారి కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ డాక్టర్ శోభారాణి, పాలికె మేయర్ ముల్లంగి నందీష్, దేవస్థాన ఈఓ హనుమంతప్ప పాల్గొన్నారు. 11న వైభవంగా నిర్వహించండి సిటీ ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి -
సమగ్రాభివృద్ధికి కంకణం
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాను కళ్యాణ కర్ణాటక పరిధిలోకి చేర్చడంతో ఆర్టికల్–371(జె) గ్రాంట్తో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి దోహదపడిందని హరపనహళ్లి ఎమ్మెల్యే ఎంపీ లతా మల్లికార్జున తెలిపారు. హరపనహళ్లి పట్టణంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ రంగం సమగ్ర అభివృద్ధికి న్యాయమైన నిధులు అందించడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందన్నారు. తన సోదరుడు ఎంపీ రవి దూరదృష్టి వల్ల దావణగెరె జిల్లాలోని హరపనహళ్లిని కళ్యాణ కర్ణాటక పరిధిలోకి చేర్చారన్నారు. కేకేఆర్డీబీ ప్రత్యేక గ్రాంట్ ఆర్టికల్–371(జే) నుంచి రూ.5 కోట్ల వ్యయంతో హరపనహళ్లి డిపోకు 11 కొత్త బస్సులను అందించామన్నారు. ఈ ప్రాంతంలో విద్యార్థుల రవాణా సమస్యను పరిష్కరించడమే బస్సుల కొనుగోలుకు ప్రేరణ అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాలకు బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. త్వరలో 6 సిటీ బస్సుల అందజేతకు చర్చలు హరపనహళ్లి పట్టణానికి త్వరలో 6 సిటీ బస్సులను అందించడానికి ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిగాయన్నారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధి, పాఠశాల భవనాల నిర్మాణంతో సహా రోడ్ల మరమ్మతు పనులను త్వరలో చేపడతామన్నారు. సామాన్య ప్రజల సమస్యలను సున్నితంగా అర్థం చేసుకొని పరిష్కరించే సామర్థ్యం తనకు ఉందన్నారు. హరపనహళ్లి ఎమ్మెల్యే లతా వల్ల రాష్ట్రంలో తొలిసారిగా రూ.5 కోట్లతో 11 కొత్త బస్సులను తాలూకాకు అందించడం అభినందనీయమని కేఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రాచప్ప తెలిపారు. గ్రాంట్ మంజూరు చేసిన మూడు నెలల్లోనే డిపోకు బస్సులు అందించడంలో ఎమ్మెల్యే ఎంతో కృషి చేశారని తెలిపారు. నగరసభ అధ్యక్షురాలు ఫాతిమా, గ్యారంటీ పథకం జిల్లా అధ్యక్షులు కురి శివమూర్తి, తహసీల్దార్ గిరీష్, ఆర్టీసీ అధికారి తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 11 కొత్త బస్సులను అందించాం ఎమ్మెల్యే ఎంపీ లతా మల్లికార్జున -
తాగునీటి ఎద్దడి నివారించండి
రాయచూరు రూరల్: నగర వాసులకు వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాంపుర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు. సగానికి పైగా నగర ప్రజలు తుంగభద్ర కాలువ నీటిపై ఆధారపడ్డారన్నారు. నగరానికి వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు రాంపుర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద అదనంగా 10 ఎకరాల స్థలంలో నూతనంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే చేయాలని ఆదేశించారు. కృష్ణ, తుంగభద్ర కాలువల నుంచి లింక్ చేసి నీటిని నింపాలన్నారు. జిల్లాధికారి నితీష్, కమిషనర్ జుబిన్ మహాపాత్ర, ఏసీ గురుసిద్దయ్య, సభ్యులు జయన్న, రమేష్, నేతలు రవీంద్ర, హరిబాబు, తిమ్మారెడ్డి, నరసింహులు, బసవరాజ్, అమరేగౌడ, శాంతప్ప, యల్లప్ప, మునిస్వామి పాల్గొన్నారు. -
అంగన్వాడీ సరుకుల అక్రమ నిల్వ పట్టివేత
హుబ్లీ: గర్భిణులు, బాలింతలతో పాటు అంగన్వాడీ చిన్నారులకు పంపిణీ చేసే పౌష్టికాహార పదార్థాలను అక్రమంగా నిల్వ చేసి రవాణా చేస్తున్న ఆరోపణల కేసులో 18 మంది అంగన్వాడీ కార్యకర్తలతో పాటు 26 మందిని అరెస్ట్ చేశారు. అంతేగాక వాహనాలతో పాటు సదరు ఆహార పదార్థాలను జప్తు చేశారు. ఇద్దరు కీలక నిందితులు పరారయ్యారని, వారి అరెస్ట్ కోసం తీవ్రంగా గాలింపు చేపట్టినట్లు జంట నగరాల పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాకు నిందితుల ఫోటోలతో పాటు వివరాలను వెల్లడించారు. ధార్వాడ తాలూకా నరేంద్ర గ్రామ బొలెరో వాహన యజమాని మంజునాథ్ దేశాయి, డ్రైవర్ లకమాపుర బసవరాజ్ భద్రశెట్టి, గోదాం యజమానికి పాత హుబ్లీ నేకార నగర మహమ్మద్ గౌస్ ఖలిఫా, అద్దెదారుడు గౌతం సింగ్ ఠాగూర్, హుబ్లీ తాలూకా కురిడికేరి మంజునాథ మాదర, కుందగోళ తాలూకా యరగుప్పి ఫక్కీరేష అలగి, కృష్ణ మాదర, రవి హరిజనతో పాటు 18 మంది అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేశామన్నారు. రూ.4 లక్షల సరుకులు స్వాధీనం నిందితుల నుంచి రూ.4 లక్షల విలువ చేసే 329 బస్తాల్లోని 8 టన్నుల 84 కేజీల ఆహార పదార్థాలైన గోధుమ రవ్వ, మిల్లెట్ లడ్డు, బియ్యం, పాలపొడి, సాంబార్ మసాలా పొడి, బెల్లం, ఉప్మా రవ్వ, చక్కెర, శెనగపప్పుతో పాటు మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం పాత గబ్బూరు శివారు గోదాంపై దాడి చేయగా అక్కడ అంగన్వాడీ పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఉచితంగా పంపిణీ చేసే ఆహార పదార్థాలను అక్రమంగా నిలువ చేసి వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయించే వారు ఈ దందాపై సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా నిర్వహణాధికారి కసబాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు 18 మంది అంగన్వాడీ కార్యకర్తలతో కలిపి 26 మందిని అరెస్ట్ చేశారు. కేసుపై సమగ్ర దర్యాప్తు పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు పట్టుబడటంతో ఈ కేసును అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ కేసులో పాలు పంచుకున్నవారు ఎవరెవరో ఆరా తీస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో వీటిని ఎలా విక్రయించే వారు? దీనికి సంబంధించిన ముఠా ఎంత పెద్దగా వ్యాపించిందో దర్యాప్తులో నిగ్గు తేలుస్తారు. ఇది తీవ్రమైన కేసు అని, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్ కమిషనర్ శశికుమార్ వివరించారు. 18 మంది కార్యకర్తలతో పాటు మొత్తం 26 మంది అరెస్ట్ -
అనాథ బిడ్డకు అమ్మానాన్నగా..
సాక్షి,బళ్లారి: ఎవరి కన్న బిడ్డో చెత్తబుట్టలో పారవేశారు. తల్లి ఒడిలో సేదతీరాల్సిన నవజాత శిశువు చెత్తబుట్ట(కసువు)లో రోదిస్తున్న దృశ్యం కనిపించింది. దీంతో గమనించిన చుట్టు పక్కల ప్రజలు పోలీసులకు తెలియజేయడంతో అనాథ బాల శరణాలయంలో చేర్పించిన ఘటన జరిగింది. నవజాత శిశువు అందులోను దివ్యాంగుడైన రెండున్నరేళ్ల బాలుడు ప్రస్తుతం ఇటలీకి పయనం అవుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లాలో రెండున్నరేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన అప్పట్లో జిల్లా వాసులను కలిచివేసింది. ఏడు నెలలకే జన్మించిన నవజాత శిశువును ఏ తల్లి కన్నదో తెలియదుకానీ కనికరం లేకుండా ఊరి శివార్లలో చెత్తకుప్పలో పారవేసి తనకేమీ తెలియనట్లు వెళ్లిపోయింది. అయితే ఆ శిశువును గమనించిన వారు పోలీసులకు సమాచారం చేరవేయడంతో బెళగావిలోని స్వామి వివేకానంద సేవా ట్రస్ట్కు చెందిన గంగమ్మ చిక్కంబిమఠ బాలకళ్యాణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న దివ్యాంగుడు ప్రస్తుతం ఎల్లలు దాటుతున్నాడు. ఆదర్శంగా నిలిచిన వైనం కన్నడ కందమ్మను ఇటలీకి చెందిన బుజార్ డెడె, వైద్యురాలు కోస్టాంజా దంపతులు భారత దేశానికి చెందిన ఈ దివ్యాంగుడిని దత్తత తీసుకొని ఆదర్శంగా నిలిచారు. మంగళవారం బెళగావిలోని గంగమ్మ చిక్కంబిమఠ బాలకళ్యాణ కేంద్రంలో దత్త స్వీకరణ కార్యక్రమం సాదాసీదాగా ముగించారు. ఇటలీలోని ఫ్లారెన్స్ నగరానికి చెందిన కోస్టాంజా, బుజార్ డెడె దంపతులు దివ్యాంగ చిన్నారిని దత్తత స్వీకరణ కార్యక్రమం చట్టబద్ధంగా పూర్తి చేశారు. ఫ్లారెన్స్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ వైద్యురాలైన ఈమె తన ఆస్పత్రిలో ఎంతో మందికి సేవ చేస్తోంది. 2015లో దివ్యాంగుడైన బుజార్ను పెళ్లి కూడా చేసుకుంది. స్వతహాగా దివ్యాంగులైన దంపతులు మరొక్క దివ్యాంగుడికి జీవితం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు వేస్తూ భారత దేశానికి చెందిన బెళగావిలోని చిన్నారుల అనాథ శరణాలయాన్ని సంప్రదించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న ఈ దంపతులకు చట్టం ప్రకారం దత్తత స్వీకరణ పూర్తి చేశారు. చట్టప్రకారం దత్తత పూర్తి ఈ సందర్భంగా బెళగావి చిక్కంబిమఠ బాలకళ్యాణ కేంద్రం అధ్యక్షురాలు మనీష బాండనకర్ మాట్లాడుతూ తమ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న ఈ బాలుడు ఏడు నెలలకే జన్మించడంతో పాటు తూకం ఒక కేజీ 300 గ్రాములు మాత్రమే ఉండటంతో ఆరోగ్యంలో చాలా సమస్యలు ఉన్నాయి. అంతేగాకుండా దృష్టి లోపం కూడా ఉండటంతో చెత్తబుట్టలో దొరికిన ఈ బాలుడిని ఎంతో శ్రద్ధతో పెంచామని ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఇవ్వడంతో ప్రస్తుతం మాట్లాడుతూ, నడుస్తున్నాడన్నారు. అయితే ఎవరి కన్న బిడ్డో ఈ బాలుడిని, ఎవరి రుణం కోసమో పెంచుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం సెంట్రల్ అడాప్షన్ డెసోస్ అథారిటీ( ఖరా) నియమానుసారం దత్తత ఇస్తున్నామన్నారు. జిల్లాధికారి సమక్షంలో దత్తత ప్రక్రియ పూర్తయింది. బాలుడికి పాస్పోర్ట్ కూడా సిద్ధం అయింది. ఇక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లి వీసా తీసుకొని ఇటలీ దేశానికి త్వరలో బయలుదేరుతున్నామన్నారు. 120 మంది పిల్లల దత్తత అంతేగాకుండా 2011 నుంచి ఇప్పటి వరకు తమ కేంద్రంలో దాదాపు 120 మంది చిన్నారులను దత్తత ఇచ్చామన్నారు. విదేశాలకు కూడా దాదాపు 15 మందిని అందజేశామని గుర్తు చేశారు. ఇటలీకి కూడా ఈ బాలుడితో కలిపి ఇద్దరిని పంపామన్నారు. తమ దగ్గర ఉన్న చిన్నారుల చిత్రాలను వైబ్సైట్లో అప్లోడ్ చేస్తామని, కావాల్సిన వారు ఆయా దేశాల నుంచి తమను సంప్రదిస్తారన్నారు. వైబ్సైట్ ద్వారా సంప్రదించిన ఈ దంపతులు నేరుగా వచ్చి చట్ట ప్రకారం దత్తత తీసుకున్నారన్నారు. దత్తత తీసుకొన్న ఇటలీ దంపతులు మాట్లాడుతూ భారత దేశ సంస్కృతి, వారసత్వాలు తమకెంతో నచ్చాయన్నారు. దివ్యాంగుడిని దత్తత తీసుకోవాలని సంకల్పం మేరకు తాము ఇక్కడికి వచ్చి దత్తత తీసుకున్నామన్నారు. ఈ బాలుడిని ఎంతో శక్తి వంతుడిగా తయారు చేస్తామన్నారు. తమ దేశానికి పిలుచుకెళ్లి బాలుడిని తమతో పెంచుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. నవజాత శిశువును పెంచిన బెళగావి అనాథాశ్రమం దివ్యాంగుడిని దత్తత తీసుకున్న ఇటలీ దంపతులు చెత్తబుట్టలో దొరికిన శిశువు త్వరలో ఇటలీకి పయనం -
రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు
బళ్లారి రూరల్ : రాష్ట్రంలో విద్యుత్తు కొరత లేదని, వ్యవసాయానికి 7 గంటలు, ఇళ్లకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధన శాఖ మంత్రి కేజే.జార్జి పేర్కొన్నారు. మంగళవారం దావణగెరె జెడ్పీ సభాంగణంలో అధికారులు, శాసనసభ్యులకు ఏర్పాటు చేసిన ప్రగతి పరిశీలన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకపోయినా కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కొన్ని ప్రాంతాల్లో నిర్వహణ కోసం తక్కువ సరఫరా అవుతోందన్నారు. ప్రభుత్వం నిబద్ధతతో సేద్యానికి 7 గంటల విద్యుత్ ఇవ్వాలని కట్టుదిట్టమైన సూచనలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతినిత్యం 18,500 మెగావ్యాట్ల విద్యుత్ అవసరం ఉందన్నారు. అయితే అంతకంటే 10 శాతం వినియోగం పెరిగిందన్నారు. 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కుసుమ్–సి యోజన ద్వారా ఏడాదిన్నరలో సోలార్ 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలిపారు. లైన్మెన్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం రాష్ట్ర ఇంధన శాఖ ఆధ్వర్యంలో 3000 లైన్మెన్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. అర్జీల పరిశీలన చివరి దశలో ఉంది. ఈ పోస్టుల కోసం లక్ష మంది అర్హత పొందారన్నారు. ఎంపికై న అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అత్యంత పారదర్శకంగా రిజర్వేషన్ అనుసరించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇంధన శాఖలో ఎటువంటి ఎస్కాంలు నష్టంలో లేవు. ప్రభుత్వం నుంచి చాలావరకు నిధులు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ గ్యారంటీల్లో గృహజ్యోతి యోజనలో అన్ని వర్గాల వారికి 200 యూనిట్ల వరకు బిల్లు లేదు. ఇందులో ఏడాదిలో ఉపయోగించిన యూనిట్లకు 10 శాతం చేర్చి యూనిట్లను నిర్ణయిస్తారన్నారు. ప్రగతి పరిశీలన సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యే కె.ఎస్.బసవంతప్ప, లతా మల్లికార్జ్ను, బి.దేవేంద్రప్ప, కేపీటీసీఎల్ ఎండీ డాక్టర్ ఎన్.శివశంకర్, జెడ్పీ సీఈఓ సురేశ్ బి.హిట్నాళ్, అదనపు జిల్లాధికారి పీ.ఎస్.లోకేశ్, జెస్కాం కమీషనర్ ఇంజినీర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. సేద్యానికి 7 గంటలు, గృహ, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ జెడ్పీ ప్రగతి పరిశీలన సమావేశంలో ఇంధన శాఖ మంత్రి జార్జి -
అంగన్వాడీ కేంద్రంలో బాలిక మృతి
సాక్షి,బళ్లారి: అంగన్వాడీ కేంద్రంలో ఆటలాడుతూ ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకా బళూటగిలో జరిగింది. గ్రామానికి చెందిన అలియా మహమ్మద్ రియాజ్(5) అనే బాలిక అంగన్వాడీ కేంద్రంలో ఆటలాడుతున్న సమయంలో కుప్పకూలి పోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు బాలిక మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. బాలిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేడు వెట్టిచాకిరీ నిషేధంపై సదస్సు హుబ్లీ: జిల్లా యంత్రాంగం, జెడ్పీ, జిల్లా న్యాయసేవా ప్రాధికార, వివిధ శాఖల సంస్థల ఆధ్వర్యంలో వెట్టిచాకిరీ నిర్మూలన దినం సందర్భంగా వెట్టిచాకిరీ నిషేధ సదస్సును బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జెడ్పీ సభాంగణంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని జిల్లా న్యాయసేవా ప్రాధికార సభ్యత్వ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి పరశురామ దొడ్డమని ప్రారంభిస్తారు. కార్యక్రమంలో జిల్లాధికారిణి దివ్య ప్రభు, జెడ్పీ సీఈఓ భునేష్ పాటిల్, పోలీస్ కమిషనర్ శశికుమార్, ఎస్పీ డాక్టర్ గోపాల్ బ్యాకోడ, ఏడీసీ గీతా సీడీ తదితరులు పాల్గొంటారు. ముక్తి అలయన్స్ కర్ణాటక సర్లిన్ య్యాథోని, ధార్వాడ కిడ్స్ సేవా సంస్థ డైరెక్టర్ అశోక్ యరగట్టి మానవ సంపన్మూల వ్యక్తిగా పాల్గొని శిక్షణ ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పౌష్టికాహార కిట్లలో అక్రమాలు తగదు హుబ్లీ: అంగన్వాడీ పిల్లలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం కిట్లను కాంగ్రెస్ నేత అక్రమంగా నిల్వ చేయడం తగదని, ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి దీని వెనుక ఉన్న వారిని గుర్తించి దోషులను శిక్షించాలని వీఐకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బీజేపీ యువ నేత వెంకటేష్ కాట్వే డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ అంగన్వాడీ చిన్నారుల ఆహార పదార్థాలను నల్లబజారుకు తరలించడం సిగ్గుచేటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంతరాజ్ నివేదిక అమలుకు డిమాండ్రాయచూరు రూరల్: రాష్ట్రంలో వెనుక బడిన వర్గాలకు రిజర్వేషన్ల పెంపుదల విషయంలో జస్టిస్ కాంతరాజ్ నివేదికను అమలు చేయాలని వెనుక బడిన వర్గాల కమిటీ అధ్యక్షుడు శాంతప్ప పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2023లో అధికారం చేపడితే కాంతరాజ్ కమిషన్ నివేదికను అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా స్పందించ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసినా నిధులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించడాన్ని ఖండించారు. స్వసహాయ సంఘాలకు లాభాలు పంపిణీబళ్లారిఅర్బన్: ధర్మస్థల గ్రామీణ అభివృద్ధి పథకం స్వసహాయ సంఘాలకు లాభాల వాటా పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా డైరెక్టర్ రోహితాక్ష ప్రారంభించారు. నగరంలోని గాంధీనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాభాల వాటాను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. గ్రామీణ బ్యాంకుల్లో స్వసహాయ సంఘాల సీసీ ఖాతాలను ప్రారంభించి ప్రతివారం చెల్లించిన పొదుపుపై లాభాలను కల్పించే కీలక పాత్ర పోషిస్తున్న శ్రీక్షేత్రధర్మస్థల గ్రామాభివృద్ధి పథకం దేశానికే ఆదర్శం అన్నారు. ఆ మేరకు జిల్లా పరిధిలో మొత్తం 8409 స్వసహాయ సంఘాలకు రూ.12 కోట్ల 36 లక్షల లాభాల వాటా పంపిణీ చేశామన్నారు. బళ్లారి తాలూకా పరిధిలో 1345 సంఘాలకు మొత్తం రూ.2 కోట్ల 8 లక్షల లాభాల వాటా మంజూరైందన్నారు. బళ్లారి నగర జోన్లో 165 సంఘాలకు రూ.31.16 లక్షల లాభాల వాటా పంపిణీ చేశామన్నారు. కర్ణాటక గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకుల్లో స్వసహాయ సంఘాల సభ్యుల నుంచి మొత్తం రూ.12.81 కోట్లను పొదుపు చేశారన్నారు. బళ్లారి–1, బళ్లారి–2, సిరుగుప్ప, సింధనూరు, కంప్లి, సండూరు ఇలా ఆరు పథకాల కార్యాలయాల పరిధిలో స్వసహాయ సంఘాలకు ఆ బ్యాంకుల ద్వారా అతి తక్కువ 14 శాతం వడ్డీ ధరతో ప్రగతి నిధి రుణాలను ఇచ్చామన్నారు. దీని వల్ల ఆ సంఘా సభ్యులు ఆర్థిక స్వావలంబన సాధించి మెరుగైన జీవితం గడుపుతున్నారన్నారు. ఆ సంఘం ప్రముఖులు వెంకటేష్ పటగార్, సంజీవ్కుమార్, వనిత, దుర్గమ్మ పాల్గొన్నారు. సేంద్రియంపై పరిశోధనలేవీ? రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు సేంద్రియ వ్యవసాయంపై పరిశోధనలు జరపాలని వైస్ చాన్సలర్ హనుమంతప్ప పేర్కొన్నారు. మంగళవారం రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చీ, భూసేన మాదిరి నమూనా సమ్మేళనాన్ని ప్రారంభించి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నూతన సాంకేతిక రంగాలను అభివృద్ధి పరచుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న వ్యవసాయ అంశాలను రైతులకు వివరించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గురునాథ్, వీరనగౌడ, దేశాయి, ప్రమోద్ కట్టిమని, అధికారులు పాల్గొన్నారు. -
కూలి కార్మికులకు రైతన్న విమాన భాగ్యం
సాక్షి,బళ్లారి: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా సిరిగినహళ్లిలో ఓ రైతు తన పొలంలో వ్యవసాయ పనులు చేసే మహిళా కూలీ కార్మికులకు విమానంలో ప్రయాణించే భాగ్యాన్ని రైతు కల్పించారు. గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే రైతు తోటలో నిత్యం కూలీ పనులు చేసే మహిళా కూలీలు తమ మనసులోని మాటను పంచుకున్నారు. తమకు విమానంలో ప్రయాణించాలని ఆశగా ఉందని చెప్పుకోవడంతో నిత్యం పొలంలో పనులు చేస్తూ సహాయం అందిస్తున్న కూలీ కార్మికులకు సదరు రైతు శివమొగ్గ నుంచి గోవా వరకు విమానంలో ప్రయాణించేందకు తానే మొత్తం ఖర్చులు భరించి కూలీ కార్మికుల ఆశను నెరవేర్చడంతో మహిళా కూలీ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో మహిళా కూలీకార్మికులు రైతుతో కలిసి తీసుకున్న ఫోటో వైరల్గా మారింది. జిల్లాధికారి కార్యాలయంలో సహాయవాణి ప్రారంభం హుబ్లీ: రాష్ట్రంలో వీఏఓల సమ్మె ఫలితంగా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల పంపిణీలో జాప్యం జరుగుతోంది. దీంతో విద్యార్థులకు పరీక్షలు, నియామక ఉద్దేశాల కోసం సత్వరంగా ప్రమాణ పత్రాలను పొందే దిశగా స్పందనకు జిల్లాధికారి కార్యాలయంలో సహాయవాణిని ప్రారంభించారు. సదరు ఆదాయ పత్రం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే విద్యార్థులు, ప్రజలు జిల్లా ఏజేఎస్ కన్వీనర్ను 8277862923, లేదా 08362233880 నెంబరులో సంప్రదిస్తే తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కుల ఆదాయ ధృవీకరణ పత్రం పంపిణీలో జరిగే జాప్యాన్ని నివారిస్తారని జిల్లాధికారిణి దివ్యప్రభు ఏ ప్రకటనలో తెలిపారు. వీఏఓల సమ్మెకు మద్దతు బళ్లారిటౌన్: రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని గ్రామ పాలన అధికారులు(వీఏఓలు) చేపడుతున్న సమ్మెకు డాక్టర్ అంబేడ్కర్ సంఘర్షణ సమితి మద్దతు తెలిపింది. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చొన్న ఆందోళన కారుల సమ్మెకు మద్దతు తెలిపి సమితి నేతలు మాట్లాడారు. వీఏఓలు రైతుల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. వారు కోరుతున్న న్యాయసమ్మతమైన డిమాండ్లను కల్పించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సమితి సంస్థాపక అధ్యక్షుడు మహేష్ కురువళ్లి, ఉపాధ్యక్షుడు కేఎం.మల్లేశ్, వెంకటేష్, పదాధికారులు విశ్వనాథ్, కొర్లగుంది పంపాపతి, చంద్రశేఖర్, హిమంత్రాజ్ తదితరులు పాల్గొన్నారు. జానపద కళలపై అవగాహన అవసరం హుబ్లీ: పిల్లలకు జానపద కళలు, సాహిత్యంపై అవగాహన అవసరమని రాజ్యోత్సవ ప్రశస్తి విజేత ఇమామ్ సాబ్ వల్లప్పనవర తెలిపారు. కర్ణాటక విద్యావర్థక సంఘంలో ప్రజ్వల ఔత్సాహిక కన్నడ, కొంకణి కళా సంఘం ధార్వాడ, కన్నడ సంస్కృతి శాఖ సహకారంతో జానపద సంభ్రమ, షహనాయి వాదన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జానపద నిపుణులు డాక్టర్ రాము ముళగి మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతిని అధిగమించి నిలదొక్కుకునే శక్తి జానపద కళకు మాత్రమే ఉందన్నారు. యువతలో జానపదం గురించి అవగాహనకు ప్రయోగాత్మక శిక్షణ చాలా అవసరం అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రకాష్ మల్లిగె వాడ, జానపద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ షాజహాన ముదకవి, శ్రీధర్ భజంత్రి, రవి కులకర్ణి, స్నేహ మహలే తదితరులు పాల్గొన్నారు. పక్షులకు నీటి తొట్టెల ఏర్పాటు రాయచూరు రూరల్: నగర ప్రాంతాల్లో ప్రాణి పక్షులకు తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని అస్కిహాళ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని వన సిరి ఫౌండేషన్, అస్కిహాళ యూకో క్లబ్ల ఆధ్వర్యంలో అస్కిహాళ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెట్లు, కొండలు, గుట్టల్లో వేసవి కాలంలో నీటి దాహం తీరడానికి నీటి తొట్టెలు ఏర్పాటు చేశారన్నారు. భవిష్యత్లో ఎండవేడిమి నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో సమితి నేతలు ప్రకాష్ పాటిల్, సునీల్, పాఠశాల ఉపాధ్యాయులున్నారు. -
Snake: పాము గాయాలకు శస్త్రచికిత్స
మైసూరు: నాగుపామును చూడగానే జడుసుకుని అంత దూరం పరిగెడతారు. కానీ వీరు మాత్రం దానికి వైద్యం చేశారు. పొలంలో మట్టిని నింపుతున్న సమయంలో హిటాచీ యంత్రంలో నాగుపాము తీవ్రంగా గాయపడింది. మైసూరు తాలూకాలోని వరగొడు గ్రామంలో ఓ పొలంలో పాము ఈ ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో హిటాచి వాహనం పామును జాగ్రత్తగా సంచిలో వేసుకుని మైసూరులోని పశువుల ఆస్పత్రికి తీసుకొచ్చాడు. డాక్టర్. యశ్వంత్కుమార్ నాగుపామును పరిశీలించగా పలుచోట్ల పెద్ద గాయాలు కనిపించాయి. శస్త్రచికిత్స ద్వారా 24 కుట్లు వేసి మందు అంటించాడు. తరువాత దూరంగా అడవిలో వదిలేశారు. -
మా చావుకు ఎవరూ కారణం కాదు..
మైసూరు: వారసత్వ నగరి మైసూరులో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, వారి కొడుకు, వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని విశ్వేశ్వరయ్య నగరలో ఉన్న సంకల్ప్ అపార్ట్మెంటులో ఈ విషాదం చోటుచేసుకుంది. అంతా భయానకం అపార్టుమెంటులో నివసిస్తున్న చేతన్ (45), రూపాలి (43) దంపతులు, వారి కొడుకు కుశాల్ (15), చేతన్ అమ్మ ప్రియంవద (65) మృతులు. మొదట చేతన్ తల్లి, భార్య, కుమారునికి ఏదో శక్తివంతమైన పురుగుల మందును తాగించడంతో వారు మరణించారు. తరువాత అతడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు అక్కడి దృశ్యాలను బట్టి చూస్తే ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాటులో తల్లీ కొడుకు మృతదేహాలు ఒకచోట, వృద్ధురాలి మృతదేహం మరోచోట ఉండగా, పై కప్పునకు చేతన్ మృతదేహం వేలాడుతున్న దృశ్యాలు నగరవాసులకు గగుర్పాటును కలిగించాయి. ఈ సామూహిక ఆత్మహత్యలు ఉదయం నుంచి తీవ్ర సంచలనానికి కారణమయ్యాయి. మేమే కారణం విద్యారణ్యపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మొబైల్ఫోన్లు తదితరాలను స్వాదీనం చేసుకున్నారు. చేతన్ రాసిపెట్టిన డెత్నోట్ అక్కడ లభించింది. ఆర్థిక ఇబ్బందులే కారణం, మా చావుకు ఎవరూ కారణం కాదు, మేమే కారణం అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మా స్నేహితులను, బంధువులను ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు, మమ్మల్ని క్షమించాలి అని రాశారు. సోదరునికి కాల్ చేసి నగర పోలీసు కమిషనర్ సీమా లాట్కర్ ఆ ఫ్లాటును పరిశీలించి మీడియాతో మాట్లాడారు. చేతన్ కార్మికులను సౌదీ అరేబియాకు పంపించే ఏజెన్సీ నడుపుతున్నాడు. చేతన్ కుటుంబం, తల్లి ప్రియంవద పక్క పక్క ఫ్లాట్లలో జీవిస్తున్నారు. ప్రతి ఆదివారం అందరూ కలిసి ఉండేవారు. హాసన్ జిల్లాలోని గోరూరు దేవాలయానికి వెళ్ళి ఆదివారం సాయంత్రం తిరిగి వచ్చారు. చేతన్ సొంతూరు గోరూరు, భార్య రూపాలి మైసూరువాసి. 2019 నుంచి మైసూరులో నివాసం ఉంటున్నారని కమిషనర్ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు చేతన్ అమెరికాలో ఉన్న సోదరుడు భరత్కు ఫోన్ చేసి ఆర్థికంగా కష్టాల్లో ఉన్నామని, అందరం ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పాడు. దీంతో భరత్ రూపాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి హెచ్చరించాడు. వారు చేతన్ ఫ్లాటుకు వచ్చి చూడగా అప్పటికే అందరూ ఆత్మహత్య చేసుకున్నారని కమిషనర్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులా, లేక ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా? అనేది సస్పెన్స్గా మారింది. -
మృత్యుశకటమైన లారీ
దొడ్డబళ్లాపురం: లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దొడ్డ తాలూకా మాకళి వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. బెంగళూరు–హిందూపురం రహదారి మార్గంలోని మాకళి వద్ద పెట్రోల్ ట్యాంకర్ లారీ, కారు ఎదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులో ఉన్న బెంగళూరు కోణనకుంటకు చెందిన వసంత్, ఆవలహళ్లికి చెందిన చేతన్ గాయాలతో మరణించారు. కిరణ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గౌరిబిదనూరు నుంచి కారులో వస్తుండగా లారీ మృత్యుశకటంలా ఎదురొచ్చింది. కారు ఒకవైపు నుజ్జునుజ్జయింది. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారును ఢీ, ఇద్దరు మృతి దొడ్డ వద్ద యాక్సిడెంటు -
గురుకుల భవనానికి భూమిపూజ
కోలారు : వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపరాదని సమాజ సేవకుడు సీఎంఆర్ శ్రీనాథ్ తెలిపారు. వృద్ధులను ఇంట్లోనే పెట్టుకుని పోషించే మనోభావాన్ని పిల్లలు పెంచుకోవాలన్నారు. ఆదివారం తాలూకాలోని నేర్నహళ్లి ద కింగ్ డం ఎడ్యుకేషన్ ట్రస్టు నుంచి నూతనంగా రూ.2.25 కోట్ల వ్యయంలో నిర్మిస్తున్న శ్రీసత్యసాయి బాబా గురుకుల కట్టడ పనులను ప్రారంభించి మాట్లాడారు. అనివార్య కారణాలతో వృద్ధాప్యంలో ఉన్న వారిని వారి కుటుంబ సభ్యులు పోషించడానికి నిరాకరించిన సందర్భాల్లో వృద్ధాశ్రమాలు వారికి ఆసరా ఇచ్చి ప్రశాంత జీవితాన్ని అందిస్తున్నాయన్నారు. నేర్నహళ్లి సమీపంలో కరోనా కష్ట కాలంలో సత్యసాయి వృద్ధాశ్రమం, యోగా, ధ్యాన మందిరం ప్రారంభించి నేడు 50 మందికి పైగా వృద్ధులకు ఆశ్రయం ఇస్తున్న సురేష్కుమార్ కుటుంబం చేస్తున్న సేవలు శ్లాఘనీయమన్నారు. ప్రస్తుతం అనాథ పిల్లల కోసం గురుకులం ప్రారంభిస్తున్నారన్నారు. సత్యసాయి వృద్ధాశ్రమ సంస్థాపకుడు సురేష్కుమార్, జేడీఎస్ నాయకుడు బణకనహళ్లి నటరాజ్, సమృద్ధి సుధాకర్, రామాంజినప్ప పాల్గొన్నారు. -
జూన్, జూలైలో స్థానిక ఎన్నికలు
యశవంతపుర: వచ్చే జూన్, జూలై మాసంలో తాలూకా, జిల్లా పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపింది. సోమవారం జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాది శశికిరణ్ శెట్టి హాజరై మే నెలలో టీపీ, జడ్పీ స్థానాల రిజర్వేషన్లను ప్రకటించి, జూన్, జూలై నెలల్లో ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. మూడేళ్ల నుంచి టీపీ, జడ్పీ ఎన్నికలను నిర్వహించలేదు. ఎన్నికల సంఘం న్యాయవాది ఫణీంద్ర.. ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటిస్తే ఎన్నికలను జరపడానికి ఈసీ సిద్ధమని తెలిపారు. -
జాగృతితో రోడ్డు ప్రమాదాలకు చెక్
రాయచూరు రూరల్: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ప్రజల పాత్ర ముఖ్యమని ఎస్పీ పుట్టమాదయ్య పేర్కొన్నారు. సోమవారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద రోడ్డు సురక్షతా సప్తాహ– 2025 కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. వాహనాలను నడిపే ముందు రోడ్లలో ప్రయాణించే సమయంలో సంచార నియమాలను, తగిన జాగ్రత్తలను పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో ప్రచారం చేయడానికి జాగృతి జాతాను నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్టీఓ వినయ్ కాటికోర్, ఏఆర్టీఓ సిబ్బంది శివశంకర్, సిద్దయ్య స్వామి, సుధా పరిమళ, అర్జున్, జీనత్ సాజిద్, హుసేన్, సయ్యద్ సాజిద్లున్నారు. -
బిదరి కళాకారుడు కన్నుమూత
యశవంతపుర: సీనియర్ బిదరి లోహ కళాకారుడు మహమ్మద్ అబ్దుల్ రౌఫ్ (60) గుండెపోటుతో బీదర్లోని తమ నివాసంలో కన్నుమూశారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న గురుకుల యోజనలో భాగంగా వెయ్యి మంది నిరుద్యోగులకు లోహంతో బొమ్మలను తయారు చేయాలో శిక్షణనిచ్చి ఉపాధిని చూపారు. ఆయన లోహంతో కళాకృతులను చేయడంలో సిద్ధహస్తుడు. అప్పటి రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీల నుంచి అవార్డులను అందుకున్నారు. రౌఫ్ చేసిన కళాకృతులను అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఒరాక్ ఒబామాలకు బహుమతిగా అందించారు. -
భవనం పై నుంచి భార్యను పడేసి హత్య
బొమ్మనహళ్లి: భార్యకు మతిస్థిమితం సరిగా లేదని ఆమెను భవనం పై నుంచి కిందకు పడేసి హత్య చేశాడో కిరాతక భర్త. బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ తాలూకాలోని సర్జాపుర వద్ద తిగరచౌడెదేనహళ్ళిలో జరిగింది. మృతురాలు మంజుల (40). భర్త మంజునాథ్ పాల వ్యాపారి. కొంతకాలంగా మంజులకు మానసిక ఆరోగ్యం సరిగా లేదు. దీంతో మంజునాథ్ ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. ఆదివారం రాత్రి భార్యను భుజంపైకి ఎక్కించుకొని నిర్మాణంలో ఉన్న భవనం ఎక్కాడు. రెండవ అంతస్తు పై నుంచి కిందకి పడేశాడు, తీవ్ర గాయాలై ఆర్తనాదాలు చేయగా స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయింది. సర్జాపుర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి మంజునాథ్ను అరెస్టు చేశారు. హత్య దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. -
నేత్రపర్వంగా అంజన్న రథోత్సవం
హొసపేటె: తాలూకాలోని లోకికెరె గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో నేత్రపర్వంగా జరిగింది. ఆలయ నుంచి ఉత్సవ మూర్తిని పల్లకీ ద్వారా సకల వాయిద్యాలతో రథంపైకి తీసుకొచ్చి మూడుసార్లు ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఉత్తవమూర్తిని రథంలో ప్రతిష్టించి లాగడంతో తరలివచ్చిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు. రథానికి ఉత్తత్తి, అరటిపండ్లు, తరిగిన మిరియాలను భక్తి అంకితం చేశారు. రథాన్ని పాదాల వరకు లాగి తిరిగి మూలస్థానానికి తీసుకొచ్చారు. నందిధ్వజ కుణిత, సామల, హలగె, ఉరుమె తదితర జానపద వాయిద్యాలు రథోత్సవానికి శోభను చేకూర్చాయి. రథోత్సవానికి ముందు ఉదయం గ్రామస్తుల సమక్షంలో ఆలయంలో పూజలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు బసవేశ్వర స్వామి ఉచ్ఛాయం జరిగింది. రథోత్సవంలో తాలూకా చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కానాహొసహళ్లి స్టేషన్ ఎస్ఐ సిద్రామ బిదారాణితో పాటు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పెట్టుబడి.. రూ. 5 కోట్ల బురిడీ
వృద్ధురాలి డిజిటల్ అరెస్టు, రూ. 42 లక్షలకు పైగా లూటీ బనశంకరి: సిలికాన్ సిటీలో సైబర్ నేరాల గురించి పోలీసులు ఎంత జాగృతం చేసినప్పటికీ ప్రజలు మోసపోతూనే ఉన్నారు. దుండగులు సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న వారికి గాలంవేసి నగదు దోచేస్తున్నారు. హొసకెరెహళ్లి రంజిత్ అనే వ్యక్తి పెట్టుబడి డబుల్ అని ఆశపడి రూ.5 కోట్లు పోగొట్టుకున్నారు. బ్యాటరాయనపుర రెడ్డి లేఔట్లో అధ్యాపకురాలి నుంచి రూ.7.76 లక్షలు దోచేశారు. మరొక వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు చేసి రూ. 43 లక్షల వరకూ టోపీ వేశారు. 1 కోటికి రూ.2 కోట్లు ఇస్తామని హొసకెరెహళ్లి రింగ్రోడ్డు నివాసి రంజిత్ సోషల్ మీడియాలో షేర్మార్కెట్ ఔత్సాహికుల కోసం గాలించాడు, అతడికి ఫైనాన్స్ సర్వీస్ వెబ్సైట్లో మోసగాళ్లున జి.తుషీత్, మంగుకియా, జుహి వీ.పాటిల్, డీ.జడేజా అనేవారు పరిచయమయ్యారు. రంజిత్ను సీ–606 అనే వాట్సాప్ గ్రూప్లో వంచకులు చేర్చారు. గ్రూప్లో జడేజా అనే వ్యక్తి పెట్టుబడి సమాచారం పోస్టు చేసేవాడు. కోటి రూపాయలు పెట్టుబడిపెడితే కొద్దిరోజుల్లో రూ.2 కోట్లు ఇస్తామని ఆశచూపించేవారు. వంచకుల మాటలు నమ్మిన రంజిత్ డిసెంబరు 28 నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు తన బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.5.2 కోట్లు జమచేశాడు. ప్రతిఫలంగా రూ.12.93 కోట్లు ఇస్తామని వంచకులు హామీ ఇచ్చారు. రంజిత్ నగదు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించగా కొన్ని కోట్ల రూపాయల సేవా పన్ను చెల్లించాలని సూచించారు. ఎంత అభ్యర్థించినా వారు పట్టించుకోలేదు. దీంతో ఇది స్కాం అని గుర్తించి బెంగళూరు దక్షిణ విభాగం సీఈఎన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసులు బాధితుడు ఏయే ఖాతాలకు నగదు పంపిందీ ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అధ్యాపకురాలికి రూ.7.76 లక్షలు బ్యాటరాయనపుర రెడ్డి లేఔట్లో నివసించే అధ్యాపకురాలు ఎంసీ లక్ష్మీప్రియాకు షేర్లు– పెట్టుబడి పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.7.76 లక్షలు మోసగించారు. ఆమెను స్నేహ అగర్వాల్ అనే యువతి ఓ వాట్సాప్ గ్రూపులో చేర్చింది. తరువాత సిద్దార్థ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఏఐ పాలసీ ఉందని, పెట్టుబడిపెడితే కొద్దిరోజుల్లో రెట్టింపు డబ్బు వస్తుందని నమ్మించాడు. ప్రారంభంలో కొద్దిగా నగదు పెట్టుబడి పెట్టింది, హెచ్ఈం యాప్ ద్వారా లాభం వచ్చినట్లు చూపించారు. వేర్వేరు షేర్లలో నగదు పెట్టుబడి పెట్టాలని చెప్పగా ఆమె జనవరి 24 తేదీ నుంచి ఫిబ్రవరి 7 వరకు ఐఎంపీఎస్ ఆర్టీజీఎస్ , నెఫ్ట్ ద్వారా రూ.7.76 లక్షలు నగదు జమచేసింది. ఆ తరువాత స్పందన లేకపోవడంతో పశ్చిమ విభాగం సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. సిలికాన్ సిటీలో బడా సైబర్ మోసం మరో ఇద్దరు మహిళలకు రూ.50 లక్షకు పైగా టోపీసీబీఐ ముసుగులో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోనికి రూ.42.85 లక్షలు వంచన చేశారు. బాధితురాలు హుడి సర్కిల్ నివాసి కేఎన్.సావిత్రి (77), ఆమెకి దుండగులు కాల్ చేసి మీపై అక్రమ నగదు బదిలీ కేసు నమోదైందని, బ్యాంక్ అకౌంట్ పరిశీలించాలని డిజిటల్ అరెస్టు అని బెదిరించారు. ఆమె ఖాతా వివరాలను చెప్పడంతో రూ.42.85 లక్షలు నగదు లాగేసుకున్నారు. బాధితురాలు వైట్ఫీల్డ్ సైబర్క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మొదట ఆమెకు ఫోన్ చేసి ట్రాయ్ అధికారినని దుండగుడు చెప్పాడు, మీ పేరుతో అక్రమ మార్కెటింగ్ మెసేజ్లు పలువురికి వెళ్లాయని, ఫిర్యాదులు రాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపాడు. ఈ కేసులో మీకు సహాయం చేస్తానని, ముంబై పోలీసులకు కనెక్షన్ కలుపుతానని చెప్పాడు. తరువాత గుర్తుతెలియని వ్యక్తులు ఆమెకు ఫోన్ చేసి తాము సీబీఐ అధికారులమని, మీ వాంగ్మూలం నమోదు చేయాలని చెప్పారు. ఈ తతంగంతో వృద్ధురాలు హడలిపోయి వారు చెప్పినట్టల్లా చేసింది, చివరకు బ్యాంకు ఖాతాల నుంచి రూ.42.85 లక్షలు దోచుకుని ఫోన్లు బంద్ చేసుకున్నారు. సైబర్ ఠాణా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
భూ సమస్యలు తీర్చాలని రైతుల ధర్నా
కోలారు: భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం పదాధికారులు సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. సంఘం రాష్ట్ర కార్యాధ్యక్షుడు అబ్బణి శివప్ప మాట్లాడుతూ జిల్లాలో రైతులు అంతర్జాలం సాయంతో ఉత్తమ పంటలను పండిస్తున్నారు. ప్రభుత్వ గోమాళం భూములను పలువురు రైతులు సాగు చేసుకుంటూ వాటిని తమ పేరు మీద ఖాతా చేసి ఇవ్వాలని దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడిచినా ఇంతవరకు ప్రభుత్వం రైతుల డిమాండ్లను పట్టించుకోవడం లేదన్నారు. భూ మంజూరు సమితి లబ్ధిదారులను ఎంపిక చేసినా అర్జీలను సరిగా పరిశీలించకుండా వాటిని తిరస్కరించడం ఎంతవరకు సమంజసమన్నారు. అర్జీలను తిరస్కరించడానికి తగిన కారణాలు కూడా అధికారులు తెలపడం లేదన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు బేడశెట్టిహళ్లి రమేష్ మాట్లాడుతూ రైతులకు మంజూరు చేసిన భూములను కొలతలు వేయడం ద్వారా పి– నెంబర్లను తొలగించి కొత్త సర్వే నెంబర్లు ఇవ్వాలని, బగర్హుకుం సాగు రైతులకు భూములను ఖాతాలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో హసిరు సేన రాష్ట్ర సంచాలకుడు కె.ఆనంద్కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిసనహళ్లి బైచేగౌడ, మహిళా సంచాలకురాలు రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నౌకా స్థావరంలో విచారణ
యశవంతపుర: ఉత్తరకన్నడ జిల్లా కార్వార వద్ద గల భారతీయ నౌకాదళ స్థావరం ఐఎన్ఎస్ కదంబలో ఎన్ఐఎ అధికారులు ముగ్గురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం స్థావరానికి చేరుకొని విచారించారు. 2024 ఆగస్ట్లో ఎన్ఐఎ అధికారులు మొదటిసారి ఇక్కడ విచారణ జరిపారు. ముదగాద వేతన్ తండేల్, తోడూరు సునీల్, అక్షయ్ నాయక్ అనేవారు ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరు కార్వార, గోవాకు చెందినవారు. స్థావరానికి సంబంధించిన ఫోటోలు, ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులకు చేరవేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ముగ్గురు నిందితులను విచారించి నోటీసులిచ్చారు. వరుసగా ఏడు కార్లు ఢీ దొడ్డబళ్లాపురం: బెంగళూరు– మంగళూరు రహదారిలో ఆదివారం అర్ధరాత్రి వాహనాలు వరుసగా ఢీకొన్న ప్రమాదంలో 7 కార్లు ధ్వంసమయ్యాయి. చోలగెరె టోల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ కొత్తగా టోల్గేట్ ఏర్పాటు చేయడం వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. వేగంగా వచ్చిన ఒక కారు ముందు ఉన్న కారును ఢీకొనడంతో ఒకదానికొకటి 7 కార్లు గుద్దుకొని ధ్వంసమయ్యాయి. కార్లలోని కొందరికి చిన్న చిన్న గాయాలయ్యాయి. దీంతో ఈ మార్గంలో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆలూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈదఫా రూ.8 లక్షల కోట్ల బడ్జెట్! ● మార్చి 7న సమర్పణ: సీఎం శివాజీనగర: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 3వ తేదీ నుంచి ఆరంభం కానున్నాయి. మార్చి 7న సీఎం సిద్దరామయ్య బడ్జెట్ను ప్రకటిస్తారు. సోమవారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడిన సిద్దరామయ్య, తొలిరోజున గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతారని, గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో మూడు రోజులు చర్చ జరుగుతుందని తెలిపారు. 7న అసెంబ్లీలో తాను బడ్జెట్ను సమర్పిస్తానని చెప్పారు. ఆర్థిక శాఖను కూడా చూస్తున్న సిద్దరామయ్య బడ్జెట్ను ప్రకటించడం ఇది 16 వ సారి. ఈసారి బడ్జెట్ పరిమాణం రూ. 8 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత మొత్తంలో బడ్జెట్ లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఐదు గ్యారంటీలు అమలులో ఉన్నాయి. ఇంకా కొత్త సంక్షేమ పథకాలు ప్రకటిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. రైతులకు పెద్దపీట: సీఎం శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేరుస్తుంది, ఎప్పటికీ రైతులకు అనుకూలంగా ఉంటామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. సోమవారం విధానసౌధలో రైతు సంఘాల ప్రతినిధులు, నాయకులతో రాష్ట్ర బడ్జెట్ ముందస్తు సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ అత్యధిక ఉద్యోగాలు సృష్టి అయ్యేది వ్యవసాయంలోనే. అందుచేత రైతుల డిమాండ్లకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రైతులకు కావాల్సిన సహాయం, కార్యక్రమాల గురించి రైతు నేతలు వినతి పత్రాన్ని సమర్పించారు. మైక్రో ఫైనాన్స్ల బలవంతపు వసూళ్ల వేధింపులను అరికట్టాలన్నారు. మారమ్మదేవికి విశేష పూజలుబొమ్మనహళ్లి: బెంగళూరు బొమ్మనహళ్ళి నియోజకవర్గం హెచ్ఎస్ఆర్ లేఔట్ పరంగిపాళ్యలో గ్రామదేవత మారమ్మదేవికి సోమవారం విశేష పూజలు చేశారు. ఉదయం అభిషేకం, అలంకరణ గావించారు. అమ్మవారికి అక్షింతలతో పాటు పూలతో ముస్తాబు చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. -
తుపాకీతో ఆటలు.. బాలుని దుర్మరణం
మండ్య: కోళ్ళ ఫారంలో తుపాకీ పేలి నాలుగేళ్ల బాలుడు చనిపోగా, అతని తల్లి గాయపడింది. జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని దూందేమాదనహళ్ళి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ విషాద సంఘటన జరిగింది. నరసింహమూర్తి అనే వ్యక్తి కోళ్ల ఫారం నడుపుతున్నాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన కుటుంబం ఇందులో నివసిస్తూ ఫారంలో పని చేస్తోంది. సదరు మహిళ లిపిక, కొడుకు అభిజిత్ (4), మరో బాలుడు సుదీప్ దాస్(15) ఆడుకుంటూ ఉన్నారు. ఫారం యజమానికి చెందిన సింగిల్ బ్యారెల్ తుపాకీతో సుదీప్దాస్ ఆడుకుంటూ ట్రిగ్గర్ నొక్కడంతో తూటా పేలింది. తూటా రవ్వలు ఎదురుగా ఉన్న లిపిక, అభిజిత్కు తగలగా అభిజిత్ తీవ్ర గాయాలై చనిపోయాడు. మహిళను ఆస్పత్రికి తరలించారు. నాగమంగల పోలీసులు పరిశీలించి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. దొంగనోట్లు మార్చబోయి.. శివాజీనగర: ఇటీవల ఆడుగోడిలోని ఓ షాపులో నకిలీ నోట్ల మార్పిడికి ప్రయత్నించి ముగ్గురు ప శ్చిమ బెంగాల్ కార్మికులు పోలీసుల చేతికి చిక్కారు. నిందితులు సుమన్, గులామ్, మరొకరు కలిసి గౌహతి ఎక్స్ప్రెస్ రైలు ద్వారా బెంగళూరుకు భవన నిర్మాణ పని కోసం వస్తుండగా, రైలు టాయ్లెట్లో నకిలీ నోట్లు ఉన్న బ్యాగ్ దొరికింది. దానిని తమతో పాటు బెంగళూరుకు తీసుకొచ్చారు. తరువాత ఆడుగోడికి చెందిన సురేశ్ అనే వ్యక్తి అంగడికి వెళ్లి రూ.70 వేల నకిలీ నోట్లను ఇచ్చి, కమీషన్ పట్టుకుని, తమ ఖాతాలోకి జమ చేయాలని కోరారు. సురేశ్ నగదును లెక్కించేటపుడు నోట్ల సీరియల్ నంబర్ ఒకటే ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఉప్పందించాడు, నిందితులను ప్రశ్నించగా రైలు– బ్యాగు కథ చెప్పారు. ఇది విశ్వసించని పోలీసులు బెంగాల్కు నిందితులను తీసుకెళ్లి వారి ఇళ్లలో తనిఖీలు చేయాలని నిర్ణయించారు. అన్నదాత శ్రమ ఆహుతి మండ్య: రాగి గడ్డి వాము మంటల్లో చిక్కుకుని రూ.75 వేల విలువ చేసే రాగులు, గడ్డి బూడిదయ్యాయి. నాగమంగల తాలూకాలోని కరడహళ్ళిలో ఈ ప్రమాదం జరిగింది. రైతు రామేగౌడ పొలంలో రాగి పంట పండించాడు. సుమారు ఐదు ట్రాక్టర్ల రాగి పైరును కోసి వాము వేశాడు. ఆదివారం సాయంత్ర మంటలు అంటుకొన్నాయి. రైతులు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఫైర్ సిబ్బంది వచ్చి ఆర్పివేసేటప్పటికి బూడిద మిగిలింది. ఎంతో నష్టం జరిగిందని బాధిత రైతు విలపించాడు. పాటిల్ అలకపాన్పు.. ఈసారి మంచి పోస్టు యశవంతపుర: కర్ణాటక ప్రణాళికా విభాగం ఉపాధ్యక్షునిగా ఆళంద కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనకు మంత్రి హోదా కల్పిస్తూ, వారికి లభించే అన్ని సౌకర్యాలను తక్షణం ఇవ్వాలని ఆ ఆదేశాల్లో సూచించారు. బీఆర్ పాటిల్ సీఎం సిద్దరామయ్య రాజకీయ సలహాదారు పదవిలో ఉండేవారు. మంత్రి పదవి కోరుకున్న ఆయనకు నిరాశే మిగిలింది. దీంతో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రావడం లేదు, అన్నీ గ్యారంటీ పథకాలకే ఖర్చయిపోతున్నాయని ఆరోపించి గత నెలలో సలహాదారు పదవికి రాజీనామా చేశారు. దీంతో సిద్దరామయ్య అయనను బుజ్జగించి ఈ స్థానాన్ని కట్టబెట్టారు. చిన్నారికి ఉరివేసి, తల్లి ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: భర్తపై కోపంతో ఓ భార్య చిన్నారి కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరులోని బాగలగుంటలో చోటుచేసుకుంది. శృతి (33), కుమార్తె రోహిణి (5)ని మొదట ఫ్యాన్కు ఉరివేసి హత్య చేసి తరువాత అదే ఫ్యాన్కు తానూ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. శృతి తుమకూరు జిల్లా పావగడ తాలూకా గుండారహళ్లి గ్రామపంచాయతీ అధ్యక్షురాలు కావడం గమనార్హం. ప్రస్తుతం భర్త, ఆడిటర్ గోపాలక్రిష్ణతో కలిసి బాగలగుంటలో నివసిస్తోంది. భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఎంత చెప్పినా తన మాట వినడం లేదని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు శృతి డెత్ నోట్ రాసింది. బాగలగుంట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు
హుబ్లీ: పొలానికి వెళ్లిన రైతన్నపై ఎలుగుబంటి దాడికి తీవ్రంగా గాయపడిన ఘటన జిల్లాలోని కలఘటిగి తాలూకా ఇతేనహళ్లి తాండాలో చోటు చేసుకుంది. ఆ తాండ నివాసి మారుతీ రామప్ప రాథోడ(56) ఎలుగుబంటి దాడికి గురైన వ్యక్తి. ఆయన పంటపై దాడి చేస్తున్న కోతులను వెంటపడి తరుముతుండగా ఎలుగుబంటి ఆకస్మికంగా దాడి చేసింది. దీంతో ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. తక్షణమే ఆయన్ను కలఘటిగి తాలూకా ఆస్పత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్సకు హుబ్లీ కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఇచనహళ్లి గ్రామానికి వెళ్లి పరిశీలించారు. బాధిత రైతుకు అటవీ శాఖ ద్వారా పరిహారం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అడవి అంచున పొలాలు ఉన్న రైతులు అటవీ జంతువుల రాకపోకలపై జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా సంచరించరాదు. జంతువుల గురించి తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని ఆ జోన్ అటవీ అధికారి అరుణ్కుమార్ తెలిపారు. వేమన రెడ్డి మండలిని ఏర్పాటు చేయండి రాయచూరు రూరల్: రాష్ట్రంలో వేమన రెడ్డి సమాజం అభివృద్ధికి వేమన రెడ్డి అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి, బడ్జెట్లో రూ.1000 కోట్ల నిధులు కేటాయించాలని తాలూకా వేమన రెడ్డి సమాజం ఉపాధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మండలిని ఏర్పాటు చేసి సత్వరం అధ్యక్షుడి నియామకానికి చర్యలు తీసుకోవాలన్నారు. 2014లో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉండగా మండలిని ఏర్పాటు చేసి నిధులు ప్రకటించారని గుర్తు చేశారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతం వారికి అధ్యక్ష పదవిని కేటాయించాలని ఒత్తిడి చేశారు. పెద్దకర్మకు వచ్చి.. ఇద్దరు మృత్యు ఒడికిహుబ్లీ: అవ్వ పెద్దకర్మ కార్యాన్ని ముగించుకొని తిరిగి వస్తున్న వేళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి చెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. స్థానిక కేశ్వాపుర గాంధీవాడ నివాసి వికాస్ గోన (21), తన అవ్వ పెద్దకర్మ కార్యానికి సుజీత్ మోండ(17)తో కలిసి ద్విచక్రవాహనంలో వెళ్లారు. తిరిగి కార్యం ముగించుకొని వచ్చేటప్పుడు విద్యానగర్ సిరియూరు పార్కు వద్ద రోడ్డుపై ఉన్న మిట్టపై నియంత్రణ కోల్పోయి జంప్ అయి రోడ్డు పక్కన ఉన్న గ్రిల్కు ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన వీరిని కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం దక్కలేదు. ఉత్తర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. బైక్, బొలెరో ఢీ.. ఇద్దరు మృతి చెళ్లకెరె రూరల్: బైక్, బొలెరో పికప్ వాహనం ఢీకొనడం వల్ల ఇద్దరు స్థలంలోనే మృతి చెందిన ఘటన చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా హాగలకెరె వద్ద ఆదివారం రాత్రి జరిగింది. మృతులను బైక్ నడుపుతున్న శివణ్ణ(53), నాగరాజ్ (45)గా గుర్తించారు. వీరిది చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా వడ్డరహళ్లి. ఘటన స్థలానికి శ్రీరామపుర పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ మధు, పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. శ్రీరామపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైభవంగా నీరమాన్వి యల్లమ్మ దేవి రథోత్సవం రాయచూరు రూరల్: మాన్వి తాలూకా నీరమాన్విలో యల్లమ్మ దేవి జాతర వైభవంగా జరిగింది. సోమవారం వేలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. రాయచూరు, లింగసూగూరు, సింధనూరు, మాన్వి, ఆదోని, కర్నూలు, హైదరాబాద్, బళ్లారి, మహబూబ్నగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయదేవకు సన్మానం కోలారు: బంగారుపేటెలో జరిగిన రేణుకా యల్లమ్మ జాతర మహోత్సవంలో కోలారు జిల్లా సవదత్తి రేణుకా యల్లమ్మ బళగ గౌరవ అధ్యక్షుడు కె జయదేవ్ సమాజానికి అందించిన సేవలను గుర్తించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ ఎం.మల్లేష్బాబు, బంగారుపేటె ఎమ్మెల్యే ఎస్ఎన్ నారాయణస్వామి, మాజీ ఎంపీ ఎస్.మునిస్వామి, మాజీ ఎమ్మెల్యే బీపీ వెంకటమునియప్ప తదితరులు పాల్గొన్నారు. -
మరణంలోనూ వీడని బంధం
హుబ్లీ: దాంపత్యంలో అన్యోన్యంగా దాదాపు 60 ఏళ్ల పాటు బతుకు నెట్టుకొచ్చిన ఆ వృద్ధ దంపతులు కష్టాలు, కన్నీళ్లలోనే కాదు మరణంలోను ఒకరికొకరు తోడు అంటూ ఇద్దరు ఒకే రోజే పరమపదించారు. ధార్వాడ సమీపంలోని దేవరహుబ్బళ్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు ఈశ్వర అరేర (82), ఆయన సతీమణి పారవ్వ అరేర(73) సోమవారం తెల్లవారు జామున తమ నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. నలుగురు కుమార్తెలు, 12 మంది మనవళ్లుతో నిండు సంసారంతో పాటు అపారమైన బంధుమిత్రులను ఈ దంపతులు విడిచి వెళ్లారు. గత కొన్ని నెలల నుంచి పారవ్వ వయో సహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేది. ఆదివారం రాత్రి కూడా ఎంచక్కగా ఇద్దరూ కలిసి భోజనం చేసి అందరికీ చెప్పి పడుకున్నారు. అయితే సూర్యదయం తోటే ఇద్దరు మృతి చెందారు. బతుకు సమరంలోనే కాక చావులోనూ ఒక్కటిగా నిలిచిన ఈ దంపతులను చూసి ఆ గ్రామస్తులంతా కన్నీరు మున్నీరయ్యారు. సోమవారం వీరి అంత్యక్రియలు నెరవేర్చారు. తోడునీడగా బతికారు.. చివరికి తోడుగానే ఈ లోకం నుంచి నిష్క్రమించారు.. -
క్రీడల్లో గెలుపోటములు సహజం
రాయచూరు రూరల్ : క్రీడల్లో గెలుపు ఓటమిలు సహజం, వాటిని సమానంగా స్వీకరించాలని జిల్లాధికారి నితీష్ అభిప్రాయపడ్డారు. సోమవారం వ్యవసాయ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ, జెడ్పీ ఆధ్వర్యంలో 2024–25వ సంవత్సరానికి ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా స్థాయి వార్షిక క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విధి నిర్వహణలో బిజీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా ఎదుగుదలకు క్రీడలు దోహదపడతాయన్నారు. క్రీడా పోటీల్లో 8 జట్లకు చెందిన సుమారు 600 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ ఉప కార్యదర్శి శశికాంత్, అధికారులు శరణ బసవ, రోణ, విజయ్ శంకర్, కృష్ణ, వీరేష్ నాయక్లున్నారు. -
ఫుట్పాత్ దుకాణదారుల ర్యాలీ
రాయచూరు రూరల్: జాతీయ రహదారిలో ఉన్న పుట్పాత్ దుకాణాలను తొలగించడం తగదని వీధి వ్యాపారుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో గౌరవాధ్యక్షుడు అమరేష్ మాట్లాడారు. రాయచూరు– హైదరాబాద్ జాతీయ రహదారిలో ఫుట్పాత్లపై వెలసిన, నిర్మించుకున్న దుకాణాల తొలగింపునకు సిటీ కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారన్నారు. ముందుగా వ్యాపారులకు తగిన పరిహారం అందించాలన్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను తీర్చడానికి ఇబ్బందిగా మారిందన్నారు. వీధుల్లో పుట్పాత్ వ్యాపారులకు పరిహారం, ప్రత్యామ్నాయం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులకు శాపంగా ఫ్లైయాష్ వాహనాలు రాయచూరు రూరల్: కాడ్లూరు నుంచి విద్యనభ్యసించడానికి శక్తినగర్కు వచ్చే విద్యార్థులకు ఫ్లైయాష్ వాహనాలు శాపంగా పరిణమించిన ఘటన సోమవారం శక్తినగర్ వద్ద చోటు చేసుకుంది. శక్తినగర్, అరషిణిగి, కారేకల్, రంగాపూర్, వడగేర, దేవదుర్గ తదితర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విద్యార్థులు సంచరించడానికి ఇబ్బందికరంగా మారింది. ఈ ప్రాంతంలో ఫ్లైయాష్ను తరలించే వాహనాలు ఈ దారిలోనే సంచరించడంతో ఇరువైపుల దారి చిన్నదిగా మారి ప్రయాణానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఫ్లైయాష్ను తరలించే వాహనాలు ఇష్టమొచ్చినట్లు నిలపడంతో పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లారు. కుంటలతో నీటి ఎద్దడి దూరంరాయచూరు రూరల్: తాలూకాలోని గ్రామాల్లో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు నీటి గుంటలే శరణ్యం అవుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉద్యోగ ఖాత్రి పథకం(నరేగ)లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామాల్లో వ్యవసాయ నీటి కుంటలు తవ్వారు. దీంతో గ్రామంలో వేసవిలో నరేగ పథకంలో గ్రామీణ కూలీకార్మికుల సంఘం కూలీలకు తాగునీటి ఎద్దడి, పఽశువులకు, పక్షులకు తాగడానికి అవకాశం కలిగింది. కూలీ కార్మికులు చేసిన పనికి సరైన కూలీ డబ్బులు చెల్లించక పోవడాన్ని కూలీలు తప్పుబడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటే అధిక మొత్తంలో గుంతలను తవ్వారు. నేడు గ్రామాల్లో ఆ కుంటలు అందరినీ ఆకట్టుకున్నాయి. సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి డిమాండ్ రాయచూరు రూరల్: మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణం చేపట్టాలని మాజీ శాసన సభ్యుడు, జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు పాపారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2001–02లో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి రూ.2.91 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. అనంతరం ప్రభుత్వం ఆ నిధులను ఉపసంహరించుకున్నారన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు సింథటిక్ నిర్మాణానికి నిధులు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతకు ఈడీ నోటీసులు? రాయచూరు రూరల్ : కాంగ్రెస్ పార్టీ వెనుక బడిన వర్గాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.మారెప్పకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమా చారం అందింది. బెంగళూరు ఈడీ కార్యాలయం నుంచి చరవాణిలో ఇందుకు సంబంధించి సంభాషణ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఏడాది నుంచి బెంగళూరులో సొంత పనులపై ఉంటున్న నేపథ్యంలో అక్రమ ఆస్తులను గడించినట్లు సమాచారం అందుకున్న అధికారులు నోటీసులు పంపించడానికి సమాచారం అడిగినట్లు తెలిసింది. -
వాహనదారుకు సంకటం
సాక్షి,బళ్లారి: ఎవరూ అడిగే వారు లేకపోతే ఏ రంగంలోనైనా మోసాలు షరా మామూలే. ఇటీవల పెట్రోలు బంకు యజమానులు లేదా పెట్రోలు సరఫరా చేసే కంపెనీలో తెలియదు కాని, పవర్ పెట్రోలు బంకు పేరుతో అధిక ధరలు ప్రకటించి మరీ వినియోగదారుల నుంచి గుంజుతున్నారు. ప్రతి నిత్యం, ప్రతి ఇంటా పెట్రోలు లేకపోతే ఏ పని గడవని నేటి రోజుల్లో పెట్రోలు బంకుల్లో పవర్ పెట్రోలు పేరుతో లీటరుకు రూ.7లకు పైగా పెంచుతూ వినియోగదారులను ముంచుతున్నారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న వందలాది పెట్రోలు బంకుల్లో నెలలో కనీసం రెండు రోజులు లేదా మూడు రోజులు పవర్ పెట్రోలు వేస్తున్నట్లు బోర్డులు పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన లీటరు పెట్రోలు ధర రూ.104 అయితే పవర్ పెట్రోలు వేస్తున్నామని వినియోగదారుల నుంచి ఏకంగా రూ.111లకు పైగా వసూలు చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు, కార్లలో వెళ్లేవారు పవర్ పెట్రోలు వేయించుకుంటున్నారు. అసలే కొన్ని పెట్రోలు బంకుల్లో ప్రతి లీటరులో కూడా కనీసం 100 ఎంఎల్ తక్కువ వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం పవర్ పెట్రోలును తెరపైకి తెస్తూ మోసాలు చేస్తున్నారు. ధర ఎడాపెడా పెంచుతున్న ప్రభుత్వాలు ప్రభుత్వాలు జీఎస్టీ పేరుతో విపరీతంగా పెట్రోలు ధరను పెంచుతూ వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. కర్ణాటకలో రూ.100లు లీటరు పెట్రోలు ధర ఉండగా, ఏడాది క్రితం లీటరకు రూ.4లు పెంచడంతో ప్రభుత్వం నిర్ణయించిన పెట్రోలు ధర లీటరు రూ.104కు చేరుకుంది. పెట్రోలు ధరలు పెంచడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో పెట్రోలు బంకు యజమానులు పవర్ పెట్రోలు వేస్తున్నామని చెబుతూ లీటరుకు రూ.7ల ధరను అధికంగా పెంచడంతో వినియోగదారులు ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇక బంకు యజమానులు ఆడిందే ఆట పాడిందే పాటగా పెట్రోలు ధరలను ఎడాపెడా పెంచుకుంటూ పెద్ద ఎత్తున, గుట్టు చప్పుడు కాకుండా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవర్ పెట్రోలు నిరంతరంగా వేయించుకుంటేనే వాహన ఇంజన్లకు బాగుంటుందని, ఎప్పుడో ఒకసారి వేయించుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని పెట్రోలు బంకుల్లో పనిచేసే నిపుణులు కూడా చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఎవరి స్వప్రయోజనాల కోసం పవర్ పెట్రోలును నెలలో మూడు రోజులు పెట్రోలు బంకులు సరఫరా చేస్తున్నాయని వినియోగదారులు ఽమండిపడుతున్నారు. ఏ పెట్రోలో ఎలా తెలుస్తుంది? పవర్ పెట్రోలు బోర్డులు పెట్టిన వారు అసలు పవర్ పెట్రోలు వేస్తున్నారా లేక మామూలు పెట్రోలు వేస్తున్నారో వినియోగదారులకు ఎలా తెలుస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలలో మూడు రోజుల పాటు పవర్ పెట్రోలు పేరుతో పెద్ద ఎత్తున వినియోగదారుల జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నారని, ఇది పెద్ద ఎత్తున మోసం అంటూ వినియోగదారులు బాహాటంగా పెట్రోలు బంకుల వద్ద గొడవలు పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మీ ఇష్టమైతే వేయించుకోండి, లేకపోతే వెళ్లిపోండి అని కూడా పెట్రోలు వేసే వారు చెబుతుంటారు. దీనికి ఒకటే కారణమని, పెట్రోలు అయిపోయిన తర్వాత వాహనం బంకు వద్దకు వస్తే ఎంత ధర అయినా పెట్రోలు పోసుకుని వెళతారని వారికి తెలుసు కాబట్టి తమ మోసాలను ఎవరూ అడగరని ధీమాతో ధర పెంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులకు మామూళ్లు ఇస్తూ పవర్ పెట్రోలు పేరుతో వినియోగదారులకు మోసం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తనిఖీ చేసి వినియోగదారులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పెట్రోలు పేరుతో బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న వైనం ఎప్పుడో ఒకసారి వేయించుకుంటే వృథా అంటున్న నిపుణులు బంకు యజమానుల తీరుపై వినియోగదారుల మండిపాటు -
ప్రధానోపాధ్యాయునికి సన్మానం
హొసపేటె: ఇటీవల రాష్ట్ర స్థాయి గ్రామీణ విద్యారత్న అవార్డు పొందిన జిల్లాలోని హూవినహడగలి తాలూకా లింగనాయకనహళ్లి తండాలోని ప్రభుత్వ జూనియర్ ప్రాథమిక పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు చంద్రానాయక్ను క్షేత్ర విద్యాశాఖాధికారి, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు సోమవారం ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమావేశానికి విచ్చేసిన బీఈఓ మహేష్ పూజారి ఆయనను సన్మానించారు. ఇదే సమయంలో ఆయన మాట్లాడుతూ విద్యారత్న అవార్డు రావడం మనందరికీ సంతోషకరమైన విషయమన్నారు. ఇదే సందర్భంగా గ్రామ నాయకులు, ఎస్డీఎంసీ అధ్యక్షులు, సభ్యులు, గ్రామ సభ్యులు, పాఠశాల పూర్వ విద్యార్థులను అభినందించారు. జీఆర్.పీటీ సభ్యుడు సోమప్పగౌడ, ఎస్డీఎంసీ అధ్యక్షుడు హాల్యానాయక్, ఉపాధ్యాయుడు వీరేష్, నాయకులు రాజానాయక్, చిన్నప్ప కత్తి, ఆనందనాయక్, వెంకటేష్, తారానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల రక్షణపై అప్రమత్తంగా ఉండండి
రాయచూరు రూరల్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, సాంఘీక సంక్షేమ హాస్టళ్లలో పిల్లల హక్కుల రక్షణ చట్టాన్ని అనుసరించి అధికారులు అప్రమత్తంగా మెలగాలని కర్ణాటక రాష్ట్ర పిల్లల హక్కుల రక్షణ చట్టం కమిషన్ అధ్యక్షుడు కె.నాగనగౌడ సూచనలు జారీ చేశారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యార్థులపై లైంగిక దాడులు, రోడ్డు ప్రమాదాలు, వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై అధికారులతో చర్చించారు. పిల్లల హక్కుల రక్షణ చట్టం–2016ను అధికారులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆర్టీఓ అధికారులు వాహనాలను పరిశీలించాలన్నారు. ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు, గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ పుట్టమాదయ్య, అదనపు ఎస్పీ హరీష్, డీఎస్పీ సత్యనారాయణ, అమరేష్లున్నారు. -
మహిళల సంతోషమే దేశానికి సంపద : శ్రీ శ్రీ రవిశంకర్
బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం 10వ అంతర్జాతీయ మహిళా సదస్సు ఘనంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్న ఈ సదస్సులో తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుని, శ్రేయస్సును అందుకునే దిశగా అడుగులు పడ్డాయి. సామాజిక, లౌకిక విషయాలపై లోతైన చర్చలు, ప్రగాఢమైన మానసిక విశ్రాంతి నిచ్చే అంతరంగ ప్రయాణాలు, వాటికి తోడుగా సాంస్కృతిక ప్రదర్శనలు కలగలిసి ఆహుతుల కోసం ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. బహ్రెయిన్కు చెందిన మహిళా సైనిక సైనికాధికారిణి, ఒక భారతీయ నటి, టర్కీదేశపు డిజిటల్, కృత్రిమ మేధ కళాకారుడు కలుసుకుని,మనస్సు, చైతన్యం - వీటిపై సృజనాత్మకత ప్రభావం గురించి చర్చించారు.ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, “నేను ఎదుగుతున్న దశలో కళలు నాకు ధ్యానాన్ని నేర్పాయి. అది సహజంగా జరిగిపోయింది. ఐతే నేను ఇక్కడ అడుగుపెట్టిన మరుక్షణమే నా శక్తిసామర్థ్యాలలో చిత్రమైన మార్పును గమనించాను. ప్రజలు మంచిగా ఉంటూ, అందరి మంచినీ కోరుకున్నప్పుడే సృజనాత్మకత వృద్ధి చెందుతుంది.” అని అన్నారుబహ్రెయిన్ సైనిక, క్రీడా విభాగాలకు అధిపతిగా పనిచేస్తున్న కుమారి నూరా అబ్దుల్లా మాట్లాడుతూ, “సైన్యంలో ఆజ్ఞలను పాటించడమే తప్ప సృజనాత్మకతకు తావు లేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను చూసిన తర్వాత, మార్పును సృష్టించేందుకు స్వేచ్ఛ అవసరమని, నిజమైన సృజనాత్మకత సమాజాభివృద్ధికి ఉపయోగపడుతుందని నేను గ్రహించాను.” అన్నారు.ఈ సదస్సుకు చోదకశక్తిగా ఉన్న చైర్ పర్సన్ భానుమతి నరసింహన్ మాట్లాడుతూ, మహిళల జీవితంలో విశ్రాంతి, పని మధ్య సమతుల్యత ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. “మహిళలుగా మనము మరింత ఎక్కువగా, మరింత త్వరగా సాధించాలనే ఆతృతలో ఉంటాము. నిజానికి మీరు తగినంత విశ్రాంతి తీసుకున్నపుడే మీరు అనుకున్నవి సాధించగలరు. ఇది విశ్రాంతిగా, ప్రశాంతంగా ఉండేందుకు తగిన సమయం.” అని పేర్కొన్నారు. శ్రీ శ్రీ రవిశంకర్ 180 దేశాలలో కోట్లాదిప్రజలకు అంతర్గత శాంతిని అందించడంలో ప్రపంచ శాంతి నాయకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ పోషించిన పాత్రను ఈ సదస్సుకు హాజరైన పలువురు ప్రముఖులు కొనియాడారు. ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడంలో గురుదేవ్ పాత్రను ప్రశంసిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, “భారతదేశం ఆధ్యాత్మిక దేశం, కానీ మారుతున్న కాలంతో మనం మన మూలాలకు దూరమవుతున్నాము. అందుకోసమే, మనం మరచిపోయిన విలువలను గుర్తుచేందుకు, మనకు స్ఫూర్తినిచ్చేందుకుగురుదేవ్ వంటి ఆధ్యాత్మిక నాయకులు ఇక్కడ ఉన్నారు.” అని అన్నారు.ప్రతిష్టాత్మకమైన విశాలాక్షి అవార్డు అందుకున్న సందర్భంగా కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ, "ఒక సాధుపుంగవునికి జన్మనిచ్చిన తల్లి పేరు మీద అవార్డును అందుకోవడం కంటే గొప్ప బహుమతి మరొకటి లేదు." అని భావోద్వేగానికి గురయ్యారు.జపాన్ మాజీ ప్రథమ మహిళ అకీ అబే మాట్లాడుతూ, హింసలేని ప్రపంచం కోసం గురుదేవ్ దృక్పథాన్నితన స్వీయ అనుభవంతో పోల్చి చూశారు. ఆమె భర్త, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దుండగుని కాల్పులలో మరణించిన సంగతి విదితమే.“ప్రతి నేరస్థుడిలో ఒక బాధితుడు ఉంటాడని గురుదేవ్ చెప్పడం నేను విన్నాను. నా భర్త ప్రాణం తీసిన వ్యక్తిని ద్వేషించే బదులు, నేను కరుణించగలనా? అటువంటి హింస జరుగకుండా ఉండేందుకు నేను ఏమైనా సహాయం చేయగలనా? కేవలం నేరం జరిగిన తర్వాత బాధితులకు మద్దతిచ్చే సమాజం కంటే, నేరాలు తక్కువ జరిగే సమాజమే ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది.” అని ఆమె అన్నారు.సీతా చరితం: సాంస్కృతికదృశ్య వైభవంఈ 10వ అంతర్జాతీయ మహిళా సదస్సు కేవలం చర్చలు, ఆత్మపరిశీలనలకు మాత్రమే పరిమితం కాకుండా, సీతా చరితం అనే చక్కని రంగస్థల సాంస్కృతిక ప్రదర్శనకు, వేదికగా కూడా మారింది. భారతీయ కావ్యమైన రామాయణాన్ని ఏ షరతులూ లేని ప్రేమ, జ్ఞానం, ఆత్మస్థైర్యం, భక్తి, కరుణరసాల కలయికగా సీతాదేవి దృక్కోణం నుండి చూపే ప్రయత్నం ఇక్కడ జరిగింది. 500మంది కళాకారులు 30 విభిన్న సంగీత నృత్య రీతులను మేళవించి, దేశంలో మొట్టమొదటిసారిగా 4-డి సాంకేతికతను ఉపయోగించి చేసిన సంగీత నృత్య రూపకం ప్రపంచం నలుమూలలనుండి హాజరైన ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది.కాలానికి అతీతంగా, మానవాళికి ఆదర్శంగా నిలచిన రామకథను ఈ ప్రదర్శన 190 దేశాలకు తీసుకువెళుతుంది. ఇంగ్లీషులో రూపొందించిన స్క్రిప్ట్ కోసం 20కి పైగా వివిధ భాషలు, సంస్కృతులలోని రామాయణాలను పరిశీలించారనీ, ఇది నిజమైన ప్రపంచ సాంస్కృతిక అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. సీతా చరితం నిర్మాణం వెనుక ఉన్న ప్రేరణ గురించి సృజనాత్మక దర్శకురాలు శ్రీవిద్యా వర్చస్వి మాట్లాడుతూ, “సీతమ్మవారి కథ పరివర్తకు ప్రతిబింబంగా నిలుస్తుంది. అంతే కాక, ఈ నాటకం, స్క్రిప్ట్, డైలాగ్లు అన్నీ గురుదేవుల జ్ఞానంతో నిండి ఉన్నాయి.” అని అన్నారు. -
అపోహలు వీడితే మూర్చ వ్యాధి నుంచి విముక్తి
హొసపేటె: మూర్చవ్యాధి గురించిన అజ్ఞానం, అపోహల నుంచి సామాన్య ప్రజలు బయటకు రావాలని అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్.హరిప్రసాద్ సూచించారు. నగర జిల్లా యంత్రాంగం, జెడ్పీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా మానసిక ఆరోగ్య విభాగం, సమాచార, ప్రజా సంబంధాల శాఖ, తాలూకా ఆరోగ్య అధికారి కార్యాలయం, రాఘవేంద్ర పారామెడికల్ కళాశాల సహకారంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మూర్చ దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మూర్చ వ్యాధి గురించి భయపడకుండా, సరైన మందులు తీసుకునేలా అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూర్చ చికిత్స చేయగల వ్యాధి అని, సరైన మందులు తీసుకోవడం ద్వారా మూర్చను నయం చేయవచ్చన్నారు. ఒక వ్యక్తికి మూర్చ వచ్చినప్పుడు వీడియో తీయాలన్నారు. ఇది వైద్యులు వారికి చికిత్స చేయడంలో సహాయ పడుతుందన్నారు. రోగి స్పృహ కోల్పోయినప్పడు వారిని లాక్ చేసిన స్థితిలో ఉంచరాదన్నారు. స్పృహ కోల్పోయిన సందర్భంలో రోగికి ప్రథమ చికిత్స అందించి,సమీపంలోని ఆస్పత్రికి తరలించాలన్నారు వైద్యులు భరత్, రాధిక, ఆశా కోరి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
హంపీ ఉత్సవాలకు ఏర్పాట్లు షురూ
హొసపేటె: విజయనగర సామ్రాజ్య గత వైభవాన్ని చాటిచెప్పే హంపీ ఉత్సవాలు ఈ నెల 28, మార్చి 1, 2న మూడు రోజులు పాటు ఘనంగా జరుగునున్నాయి. ఉత్సవాలకు విజయనగర జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ప్రారంభించింది. హంపీలోని గాయత్రీ పీఠం సమీపంలోని మైదానంలో ప్రముఖ వేదికను రాయలు కాలంనాటి స్మారకాల వాస్తు శైలి నమూనాల పద్దతిలో ఏర్పాటు చేయనున్నారు. గాయత్రీ పీఠం సమీపంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను నిర్మిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా 4 ప్రధాన ప్రదేశాల్లో వేదికలను ఏర్పాటు చేయనున్నారు. దీనితో పాటు బసవన్న మంటపం ఆవరణ, విరూపాక్ష ఆలయ ఆవరణ, సాసివెకాళు గణపతి మంటపం సమీపంలో వేదికలపై దేశ ప్రఖ్యాత కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఐదు ఎకరాల్లో ప్రధాన వేదిక రాయల కాలం నాటి వాస్తుశైలితో పనులు -
కృష్ణదేవరాయల పాలన జనరంజకం
రాయచూరు రూరల్: మూన్నూరు కాపు సమాజ ప్రజలు శ్రీకృష్ణదేవరాయల ఆదర్శాలను అలవర్చుకోవాలని మాజీ శాసనసభ్యుడు పాపా రెడ్డి కోరారు. శ్రీకృష్ణదేవరాయల జయంతిని పురస్కరించుకుని మూన్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వీరాంజనేయ కల్యాణ మంటపంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాయల పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగించారన్నారు. సాంస్కృతిక కళా రంగాలకు పెద్ద పీట వేశారన్నారు. నరసారెడ్డి, కృష్ణమూర్తి, సర్వ మంగళ, చెన్నారెడ్డి, జ్యోతి, శంకర రెడ్డి, మాజీ సభ్యులు నరస రెడ్డి, మహేంద్ర రెడ్డి, వెంకట రెడ్డి, గోపాలరెడ్డి పాల్గొన్నారు. -
రాయచూరు జిల్లావాసులకు అవార్డులు
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా వాసులకు రాష్ట్ర స్థాయి కృషి ఆగ్రో ఫుడ్స్ అవార్డు లభించింది. బెంగళూరులో జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో జిల్లా తరఫున ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేంద్రమంత్రి శోభాకరందాజ్లే, వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి నుంచి రాయచూరుకు చెందిన హరీష్, ఎం.వెంకటేశ్లు అవార్డులు అందుకున్నారు. ఏపీఎంసీ ఎదుట ఉల్లి రైతుల ఆందోళన రాయచూరు రూరల్: రాయచూరు రూరల్: ఉల్లిగడ్డలు కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు శనివారం రాత్రి నగరంలోని ఏపీఎంసీని ముట్టడించారు. రైతు సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ మాట్లాడుతూ జిల్లాలో ఉల్లిపంట విస్తారంగా సాగైందన్నారు. రైతులు పంట ఉత్పత్తులను ఏపీఎంసీకి తీసుకువస్తున్నారని, ఇక్కడ విక్రయాలు సాగడం లేదన్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారన్నారు. పంటల విక్రయం కోసం రైతులు తిండి నీళ్లు లేకుండా పడిగాపులు కాస్తూ సొమ్మసిల్లి పోతున్నారన్నారు. అధికారులు స్పందించి ఉల్లి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొనసాగుతున్న చౌడేశ్వరి దేవి ఉత్సవాలు హుబ్లీ: తాలూకాలోని నుల్విలో కొలువైన చౌడేశ్వరి దేవి జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం ఉత్సవాలు ప్రారంభం కాగా రెండో రోజు ఆదివారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆదివారం పలువురు దాతలు భక్తులకు చెరుకు రసం, పానకం పంపిణీ చేశారు. ఫక్కీరప్ప, లక్షప్ప బుల్లన్నవర కుటుంబ సభ్యులు ఐదు టన్నుల చెరుకు గడలను కొనుగోలు చేసి మూడు యంత్రాలలో చెరుకు రసాన్ని బయటకు తీసి పంపిణీ చేశారు. దొంగ అరెస్ట్, సొత్తు స్వాధీనం హొసపేటె: శ్రీరామనగరలోని రమణ కాలనీలో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంటిలో గత నెల 31న జరిగిన చోరీ కేసును గంగావతి రూరల్ పోలీసులు ఛేదించారు. నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. అతని వద్దనుంచి రూ.11.35 లక్షల నగదు, 67 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైదరాబాద్ నగరంలోని నాంపల్లి సమీపంలోని అగాపురాలో నివసిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు వెళ్లి దాడి చేసి అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ రామ్ ఎల్.అరసిద్ది అభినందించారు. -
విద్యార్థుల వికాసానికి క్రీడలు దోహదం
హుబ్లీ: పాఠ్యాంశలు విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాన్ని పెంచితే పాఠ్యేతర కార్యకలాపాలు మానసిక, శారీరక సామార్థ్యాన్ని మరింత పెరుగు పరుస్తాయని ఎక్సలేట్ గ్రూప్ విద్యా సంస్థ సంస్థాపక అధ్యక్షుడు బసవరాజ్ కౌలగి అభిప్రాయపడ్డారు. బెంగళూరులో ఇటీవల జెడ్పీ విద్యాశాఖ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి జంప్ రోప్ పోటీల్లో ఆరు బంగారు, ఒక కాంస్య పతకం సాధించిన ఎక్సలేట్ గ్రూప్ సంస్థల ది గ్లోబుల్ స్కూల్ ఆఫ్ ఎక్సలేట్ పాఠశాల విద్యార్థులను ఆయన అభినందించి ఆయన మాట్లాడారు. క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయన్నారు. -
నత్తనడకన కృష్ణా వంతెన పనులు
రాయచూరు రూరల్: రెండు రాష్ట్రాలకు మధ్య కృష్ణా నదిపై వారధిగా ఉన్న రోడ్డు వంతెన పనులు మందకొడిగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి– 167లో కృష్ణా నది వద్ద నూతనంగా వంతెన నిర్మాణ పనులను మూడేళ్ల క్రితం ప్రారంభించింది. అప్పటి నుంచి పనులు నత్తనడకన సాగుతున్నాయి. రాయచూరు తాలూకా దేవసూగూరు వద్ద సరిహద్దు నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కృష్ణా వరకు గల 2.13 కిలోమీటర్ల పొడవున రెండో వంతెన నిర్మాణానికి రూ.150 కోట్ల మేర నిధులు విడుదల చేశారు. కృష్ణా నదిలో నిత్యం నీటి ప్రవాహం ఉండడంతో పునాదులు వేయడానికి ఆలస్యమైందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కర్ణాటక, తెలంగాణలకు రాకపోకల సంబంధాలు కల్పించే వంతెనను త్వరలో ప్రారంభించాలని ప్రజాప్రతినిధులు ఊవ్విళ్లూరుతున్నా పనులు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. 2016లో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, 2019లో అనుమతి లభించింది. 2022లో పనులు ప్రారంభం కాగా మధ్యలో కాంట్రాక్టర్ మరణించడంతో పనులు స్తంభించాయి. తిరిగి పనులు చేపడుతున్నారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సారిగా బోస్ట్రింగ్ మాదిరిగా వంతెన నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. కృష్ణా నదిపై విల్లు ఆకారంలో వంతెన నిర్మాణానికి పూనుకున్నారు. ప్రతి 83.5 మీటర్లకు కమానును ఏర్పాటు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం పనులు ప్రారంభం ఏళ్ల తరబడి ఇంకా పూర్తి కాని వైనం -
నేడు నీరమాన్వి యల్లమ్మ దేవి జాతర
రాయచూరురూరల్: మాన్వి తాలుకా నీరమాన్విలో కొలువైన యల్లమ్మ దేవి జాతర ఉత్సవాలు సోమవారం ఘనంగా జరగనున్నాయి. ఈమేరకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రాయచూరు జిల్లాతోపాటు వివిధ జిల్లాలనుంచి భక్తులు తరలిరానున్నారు.గంగావతి తాలూకాలో కొలువైన హులిగమ్మ, రాయచూరు తాలుకా అరోలిలో కొలువైన హులిగమ్మ, సవదత్తి యల్లమ్మ అమ్మవార్ల తరహాలోనే మాన్వి తాలుకా నీరమాన్వి రే ణుకా యల్లమ్మ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నారు. ఊదో ఊదో అని అమ్మవారిని ప్రార్థిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దాదాపు 200 సంవత్సరాలుగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం అమ్మవారి రథోత్సవం జరగనుంది. అంతకుముందు వేకువజాము నుంచి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయ చరిత్ర 200 సంవత్సరాల క్రితం కొందరు ఎడ్ల వ్యాపారులు మాన్వి నుంచి రాయచూరుకు వెళ్తూ రాత్రి సమయంలో నీరమాన్వి వద్ద బస చేశారు. ఎడ్లను అక్కడే ఉన్న ఒక రాతికి కట్టి వేశారు. మరుసటి రోజ ఉదయం వ్యాపారులు చూపు కోల్పోయారు. ఏమైందో తెలియక ఆందోళనతో ఉండగా తాను యల్లమ్మదేవినని, తాను కొలువైన రాతికి ఎడ్లను కట్టి వేశారని, అందుకే మీకు చూపు పోయిందని ఆకాశం నుంచి ఒక గొంతు వినిపించింది. తమకు తెలియక పొరపాటు చేశామని, కానుకలు సమర్పిస్తాము, కాపాడాలని అమ్మవారిని ప్రార్థించారు. దీంతో అమ్మవారు వారికి చూపును ప్రసాదించింది. అనంతరం వ్యాపారులు అమ్మవారికి ఆలయం నిర్మించారు. అప్పటినుంచి ఏటా అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. అమ్మవారి మహత్యంతో కోర్కెలు నేరవేరుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు. -
నీటి ఎద్దడి తీవ్ర రూపం
రాయచూరు రూరల్ : రాయచూరులో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. ఏవీధిలో చూసినా నీటి కోసం హాహాకారాలు మిన్నంటుతున్నాయి. నగరానికి సమీపంలోని రాంపురం రిజర్వాయర్ నుంచి తుంగభద్ర జలాలు సరఫరా చేస్తున్నారు. అక్కడ తగినంత నీటి నిల్వలు లేవు. ఈక్రమంలో మూడు రోజులుగా 1 నుంచి 10వ వార్డు వరకు తాగునీరు సరఫరా కాలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుద్ధజల నీటి పథకాలు మరమ్ములకు గురవ్వడంతో నీటి సరఫరా ఆగిపోయింది. అయినప్పటికీ అధికారులు స్పదించడం లేదు. గత్యంతరం లేక ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లి బోరు నీటిని తెచ్చుకుంటున్నారు. మరో వైపు నీటి కోసం నగరంలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం పలు కాలనీల్లో మహిళలు రోడ్డెక్కారు. రోజుల తరబడి నీటి సరఫరా ఆగిపోయినా పాలకులు, అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. చుక్కనీటి కోసం తాము పడరాని పాట్లు పడుతున్నామని వాపోయారు. ఇదిలా ఉండగా శుద్ధ జల ప్లాంట్ల మోటార్లు మరమ్మతుకు గురయ్యాయని, వాటిని సరి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. సరిగ్గా పనిచేయని నీటి పథకాలు మరమ్మతుకు గురైన మోటార్లు రాయచూరులో హాహాకారాలు మూడు రోజులుగా అందని నీరు ఖాళీ బిందెలతో నిరసనలు -
ఉదయగిరి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
హుబ్లీ: హుబ్లీ: అసాంఘిక శక్తులతో సర్కారు కుమ్మక్కు అయ్యిందని, ఇందుకు రాష్ట్రంలో పదేపదే జరుగుతున్న అలర్లు నిదర్శనమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి ఆరోపించారు. స్థానిక మీడియాతో పాత హుబ్లీ, కేజేహళ్లి, డీజేహళ్లి, మైసూర్ ఉదయగిరిలో జరిగిన అలర్లు సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయన్నారు. ఉదయగిరిలో జరిగిన ఘటన పథకం ప్రకారం జరిగిందన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. పాత అలర్ల కేసుల నిందితులపై చర్యలు తీసుకొని ఉంటే ఉదయగిరి లాంటి అలర్లు పునరవృతం అయ్యేవి కాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పీఎఫ్ఐ, ఎస్బీపీఐ, సంఘాలపై కేసులను రద్దు చేశారన్నారు. కాంగ్రెస్ కలహాలు రాష్ట్రంలో పాలనపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నాన్నారు. దళితులు సీఎం కావడంపై బీజేపీలో వ్యతిరేకత లేదన్నారు. అయితే ఈ విషయాన్ని వీధి జగడం చేసి పాలనను అస్తవ్యస్తం చేస్తే రాష్ట్ర ప్రజలు సహించరన్నారు. దళిత సీఎంపై చర్చ జరగలేదు హుబ్లీ: కాంగ్రెస్ పార్టీలో దళిత సీఎం విషయంపై ఎటువంటి చర్చ జరగలేదని ఎమ్మెల్సీ సలీం అహ్మద్ అన్నారు. ఆదివారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీతో పాటు అన్ని సమాజాల సమావేశాలు గతం నుంచి సాధారణంగా జరుగుతున్నాయని తెలిపారు. పార్టీ అంతర్గత విషయాల గురించి మాట్లాడకూడదని హైకమాండ్ సూచించిందన్నారు. కేపీసీసీ అధ్యక్షుడి మార్పు, సీఎం మార్పు గురించి అందరితో చర్చించి హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. సీఎం సిద్దరామయ్య, డీకే.శివకుమార్ తమ పదవులను సమర్థవంతంగా నిర్వర్థిస్తున్నారన్నారన్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీలోని అన్ని నిర్ణయాలను హైకమాండ్ తీసుకుంటుందన్నారు. అంతకు ముందు ఆయన స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు. పార్టీ సంఘటితం గురించి చర్చలు జరిపారు. ఎమ్మెల్యేలు ఎన్హెచ్ కోనరెడ్డి, ప్రసాద్ అబ్బయ్య, పార్టీ జిల్లాధ్యక్షుడు అనిల్కుమార్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. బస్సు ఢీకొని బైకిస్టు దుర్మరణం హొసపేటె: కారటగి తాలూకా మరలనహళ్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. సిద్దాపూర్ గ్రామానికి చెందిన మంజునాథ్ హండ్ర (30) రవినగర్లోని ఓ రైస్ మిల్లులో పని చేస్తున్నాడు. బ్యాంకులో డబ్బు జమ చేసేందుకు కారటగిలోని బ్యాంక్కు బైక్పై వెళ్తుండగా దారిమధ్యలో మర్లనహళ్లికి చెందిన ఖాసీమ్ డ్రాప్ అడిగాడు. అతన్ని ఎక్కించుకొని వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. మంజునాథ్ మృతి చెందగా ఖాసీం గాయపడ్డాడు. కారటగి పోలీసులు క్షతగాత్రున్ని గంగావతిలోని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు గోదాముపై అధికారుల దాడి హుబ్లీ: అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలు, గర్భిణిలకు పంపిణీ చేయాల్సిన కందిపప్పు, బియ్యం, బెల్లం, గోధుమలు, పాలు పౌడర్, పెసరపప్పు తదితర వాటిని కబ్బూరు సర్కిల్ వద్ద ఉన్న ఒక గోదాములో నిల్వ చేసినట్లు గుర్తించి అధికారులు ఆదివారం దాడి చేశారు. 300 బస్తాల్లోని సరుకులను స్వాధీనం చేసుకున్నారు. అంగన్వాడీ కార్యకర్త బతూల్ భర్త ఫరుఖ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దాడుల్లో అసిస్టెంట్ కమిషనర్ సలాం హుస్సేన్, తహసీల్దార్ కల్లనగౌడ పాటిల్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటి డైరెక్టర్ హెచ్ హులిగమ్మ కుకనూర, కసబపేట పోలీస్ స్టేషన్ సీఐ రాఘవేంద్ర అల్లూర, గోడౌన్కు వెళ్లి పరిశీలించారు. ఘనంగా పల్లకీ ఉత్సవం హొసపేటె: కొట్టూరు తాలూకా ఉజ్జయినిలో ఆదివారం శ్రీ మురుళసిద్దేశ్వర స్వామి పల్లకీ ఉత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్థానికులతోపాటు పరిసర ప్రాంతాల ప్రజల ఆలయానికి తరలివచ్చి స్వామి వారికి, జగద్గురువులు సిద్దలింగ రాజదేశీ కేంద్రం భగవత్పాద శివాచార్యుల వారికి పూజలు సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
అనుమానం.. అంతం చేసింది
బనశంకరి: పచ్చని సంసారంలో అనుమానం, అక్రమ సంబంధాలు నిప్పులు పోస్తున్నాయి. అర్ధాంతరంగా గొడవలు చెలరేగి కుటుంబాలు కూలిపోతున్నాయి. రాష్ట్రంలో రెండు చోట్ల ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు. భర్త ప్రవర్తన పట్ల అనుమానంతో ఆవేదన చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని బెల్లందూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాయచూరు కు చెందిన మల్లమ్మ (26) మృతురాలు. ఆమెకు ఆరేళ్ల క్రితం క్యాబ్డ్రైవరు గా పనిచేసే బసవరాజుతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబంతో కలిసి తిమ్మారెడ్డి లేఔట్లో కుటుంబం నివాసం ఉంటుంది. భర్త ప్రవర్తన పట్ల బార్యకు అనుమానం ఏర్పడింది. వేరే మహిళలతో చనువుగా ఉంటూ తనను పట్టించుకోవడం లేదని మథనపడేది. ఈ వ్యథతో శనివారం ఉదయం ఇంట్లో పై కప్పు ఇనుపరాడ్కు చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందిన వెంటనే బెల్లందూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. భార్యను శిక్షించాలని డెత్నోట్ రాసి.. యశవంతపుర: భార్య అక్రమ సంబంధంపై విరక్తి కలిగి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన దావణగెరె జిల్లా జగళూరు పట్టణంలో జరిగింది. భర్త బసవరాజ్ డెత్నోటు రాసి ఇంటిలో ఉరి వేసుకొని తనువు చాలించాడు. తన ఆత్మహత్యకు భార్య కారణం. ఆమె అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకొంటున్నట్లు రాశాడు. భార్య, అనైతిక సంబంధం కలిగి ఉన్న వ్యక్తికి చట్ట ప్రకారం శిక్ష పడాలి. నా పిల్లలను మా అమ్మ చూసుకోవాలని రాశాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
బెంగళూరులో దారుణం.. టోల్గేట్ వద్ద అరాచకం!
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. టోల్గేట్ వద్ద ఓ వ్యక్తిని కారు కొంత దూరం లాకెళ్లి పడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని నెలమంగళలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టోల్బూత్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. టోల్గేట్ వద్ద ఓ కారును మరో కారు ఓవర్ టేక్ చేయడంతో సదరు కారులో వ్యక్తి.. ముందుకు వచ్చి కారులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించారు. దీంతో, టోల్బూత్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ముందు కారులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆవేశంతో రగిలిపోయాడు.ఈ క్రమంలోనే కారు స్టార్ చేసి.. వాగ్వాదానికి దిగిన వ్యక్తి కాలర్ పట్టుకుని కారును ముందుకు నడిపాడు. ఆ తర్వాత కారు ఆ వ్యక్తిని దాదాపు 50 మీటర్ల దూరం కారు ఈడ్చుకెళ్లింది. కొంత దూరం వెళ్లాక అతడిని వదిలిపెట్టడంతో ఆయన కిందపడిపోయాడు. కారు డ్రైవర్ మాత్రం ఆగకుండా వెళ్లిపోయాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. Shocking Incident in Bengaluru!A man was dragged for 50 meters by a car at Nelamangala toll booth after an argument over overtaking. The entire incident was caught on CCTV. Police have launched an investigation to identify the accused. #Bengaluru #RoadRage #ViralVideo pic.twitter.com/mFJ8YOMXoQ— Shubham Rai (@shubhamrai80) February 16, 2025 -
వక్ఫ్ బిల్లును విరమించుకోవాలి
రాయచూరు రూరల్ : లోక్సభ, రాజ్యసభల్లో ప్రవేశ పెట్టిన వక్ఫ్ బిల్లును విరమించుకోవాలంటూ ఎస్డీపీఐ డిమాండ్ చేసింది. శనివారం ముదుగల్ అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఫారూక్ బేగ్ మాట్లాడారు. 2024లో వక్ఫ్ చట్టం అమలు పరిచే విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మైనార్టీ యువకుల్లో హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలకు తావు ఇచ్చినట్లు అవుతుందన్నారు. ఈ చట్టం వల్ల హిందువుల ఆస్తులను కొల్లగొట్టడానికి వక్ఫ్ బిల్లు ద్వారా కుట్రలు పన్నుతున్నారని, ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. -
కమనీయం.. వల్లభరాయ వసంతోత్సవం
బనశంకరి: సిలికాన్ సిటీలో ఏడుకొండలవాని దేవస్థానమైన వసంతపుర వసంత వల్లభరాయస్వామి ఆలయంలో వసంతోత్సవం కనుల పండువగా జరిగింది. వల్లభరాయస్వామి ఉత్సవాల్లో భాగంగా శనివారం వేకువజామున సుప్రభాతసేవ అనంతరం అర్చకులు వీఆర్.రఘురామ భట్టర్ నేతృత్వంలో మూలవిరాట్కు అభిషేకం, అర్చనలు చేసి సుందరంగా అలంకరించారు. ఉదయం 11.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా వసంత వల్లభరాయస్వామి ఉత్సవమూర్తులను మేళతాళాలతో ఉరేగింపుగా పుష్కరిణికి తీసుకెళ్లి పూజలు చేసి రమణీయంగా వసంతోత్సవం గావించారు. వందలాది మంది భక్తులు పాల్గొని పుష్కరిణిలో స్నానాలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జే.శ్రీనివాస్రెడ్డి, కే.మాదవరావ్, కస్తూరి, ఆలయ ఈఓ జీ.శాంతమ్మ, అకౌంటెంట్ ఎన్.మహేశ్, పురటాశి వెంకటేశ్, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు తరలివచ్చిన భక్తజనం -
అపురూపం ఈ పావురం
బొమ్మనహళ్లి: ఉత్తర కన్నడ జిల్లాలోని దాండేలి పట్టణంలోని బంగూరు నగర జూనియర్ కాలేజీ దగ్గర అరుదైన రంగుల పావురం కనిపించింది. రావి చెట్టు మీద ఆ పక్షి ఉన్నట్లు తెలుసుకుని ప్రముఖ ఫోటోగ్రాఫర్, వన్యజీవి ప్రేమికుడు రాహుల్ బాలాజీ కెమెరాలో బంధించారు. మామూలుగా పావురాలు తెలుపు, నలుపు, బూడిద రంగుల్లో ఉంటాయి. పసుపు రంగువి అరుదు. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రశంసలు దక్కాయి. భారత ఉపఖండంలో, ఆగ్నేయాషియాలోని కొన్ని ప్రాంతాల్లో ఇది అరుదుగా కనిపిస్తుందని తెలిపారు. ఇది మహారాష్ట్ర రాష్ట్ర పక్షి అని, మరాఠీలో హరోలి లేదా హరియల్ అని పిలుస్తారని బాలాజీ తెలిపారు. ఈ పావురం దట్టమైన అడవుల్లో జీవిస్తుందని చెప్పారు. కుక్క కాటు గొడవ యజమానికి కత్తిపోట్లు మైసూరు: చామరాజనగర కుక్క పెద్ద గొడవకు కారణమైంది. కుక్క కరిచిందని దాని యజమానిని కత్తితో పొడిచారు. వివరాలు.. చామరాజనగర తాలూకా హరదనహళ్లిలో బసవరాజు, కుమార్ కుటుంబాలు ఇరుగు పొరుగు ఇళ్లలో నివసిస్తున్నారు. ఇటీవల కుమార్ తండ్రిని బసవరాజుకు చెందిన కుక్క కరిచి గాయపరిచింది. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీనిపై బసవరాజు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన కుమార్.. దొడ్డంగడి వీధిలో బసవరాజు చొప్ప అమ్మే పనిలో ఉండగా, కత్తితో దాడి చేశాడు. బసవరాజుకు చేతిపై, పొట్ట కత్తిపోట్లు తగిలాయి. ఇన్స్పెక్టర్ రాజేష్, పోలీసులు చేరుకుని బాధితున్ని జిల్లాస్పత్రిలో చేర్పించారు. నిందితున్ని అరెస్టు చేశారు. బ్యాంకు ఖాతాల నుంచి రూ.19 లక్షలు మాయం మైసూరు: వారసత్వ నగరిని సైబర్ నేరగాళ్లు లక్ష్యం చేసుకుని భారీగా దోచుకుంటున్నారు. గంట వ్యవధిలో ఓ వ్యక్తికి చెందిన రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.19.30 లక్షలను బదలాయించుకున్నారు. వివరాలు.. ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్న శ్రీరాంపుర నివాసి మురుగేష్ బాధితుడు. ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న ఓ ఖాతా నుంచి రూ.17 లక్షలు, మరొక ఖాతా నుంచి రూ.2.30 లక్షలను బదిలీ చేసుకున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యవస్థ కలిగిన మురుగేష్ ఖాతాలను దుండగులు హ్యాక్ చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఒక గంట అవధిలో ఖాతాలోని డబ్బు మాయమైంది. డబ్బు బదిలీ అయినట్లు మెసేజ్లు రావడంతో బాధితుడు కంగుతిని సైబర్ క్రైం పీఎస్లో ఫిర్యాదు చేశాడు. మణిపాల్లో విద్యార్థుల కొట్లాట యశవంతపుర: తాగిన మత్తులో రెండు విద్యార్థుల గుంపులు గొడవ పడిన ఘటన విద్యానగరి అయిన మణిపాల్లో కాయిన్ సర్కిల్ వద్ద జరిగింది. శుక్రవారం రాత్రి బార్కు వెళ్లిన విద్యార్థులు బాగా మద్యం తాగారు. మాటమాట పెరిగి రెండు గుంపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఒక విద్యార్థి బట్టలను చించివేసి కొట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చేలోపు పోకిరీలు పారిపోయారు. మళ్లీ కొట్లాటలు జరగకుండా ఆ సర్కిల్లో బందోబస్తు ఏర్పాటైంది. సమీపంలో అమర్చిన సీసీ కెమెరాల చిత్రాలను పరిశీలించి ఆకతాయిలను గుర్తించే పనిలో ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ పట్టివేత చిక్కబళ్లాపురం: పలు నేరాల్లో పోలీసులకు బాగా కావలసిన మహమ్మద్ ఖలీలుల్లా అలియాస్ బాంబే సలీంను బాగేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో ఇతనిపై హత్యలు, దోపిడీల కేసులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సీ తెలిపారు. నిందితుని నుంచి రూ. 30 లక్షల విలువగల కారు, రూ. 5.15 లక్షల విలువైన బైక్, దోపిడీలకు వాడే ఇనుప సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గత డిసెంబరు 20వ తేదీన గుడిబండ తాలూకా గంగానహళ్లివాసి అశ్వత్థ నారాయణ భూమిని అమ్మి డబ్బుతో వెళ్తుండగా కారులో వచ్చిన బాంబె సలీం రూ. 16 లక్షలను దోచుకొన్నాడు. అశ్వత్తనారాయణను కిడ్నాప్ చేసి రూ. 50 లక్షలు ఇవ్వాలని కుటుంబాన్ని బెదిరించాడు. అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. సీఐ ప్రశాంత్ వర్ని బృందం నిఘా వేసి నిందితున్ని పట్టుకుంది. -
ఖజానా ఖాళీనా.. మరి ఖర్చులు ఎలా?
రాయచూరు రూరల్: రాయచూరు సిటీ కార్పొరేషన్ ఖజానా ఖాళీనా? అయితే ఖర్చులు ఎలా భరిస్తారని నగరసభ సభ్యుడు జయన్న ప్రశ్నించారు. శనివారం సిటీ కార్పొరేషన్ భవనంలో మేయర్ నరసమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బడ్జెట్ ముందస్తు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుధ్యం, మురుగు కాలువలు శుభ్రం చేయడానికి నెలవారి జీతాలు ఎలా చెల్లిస్తారని నిలదీశారు. అధికారులుచెప్పడాన్ని బట్టి చూస్తే బడ్జెట్ కేవలం రూ.30 లక్షలు ఉందని అన్నారు. ప్రస్తుతమున్న సిబ్బందికి వేతనాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. వివిధ పద్దుల కింద కాంట్రాక్టర్లకు రూ.15 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉంచడాన్ని తప్పుబట్టారు. తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు చేపట్టాలన్నారు. దశాబ్దం గడిచినా నగరసభ పరిధిలోని దుకాణాలకు టెండర్లు పిలువకుండా కాలయాపన చేయడం తగదన్నారు. సభ్యుల పదవీ కాలం ముగుస్తున్నా మౌనం వహించడం సరికాదన్నారు. సమావేశంలో ఉప మేయర్ సాజిద్ సమీర్, కమిషనర్ గురుసిద్దయ్య, సభ్యులు పవన్, రత్న, ప్రశాంతి. లక్ష్మి, సరోజమ్మ, జిందప్ప, నాగరాజ్లున్నారు. నగరసభ సభ్యుడు జయన్న సూటిప్రశ్న -
దర్శనానికి వచ్చి.. నదిపాలు
● కావేరిలో మునిగి ఇద్దరు మహిళల మృతి మండ్య: కావేరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు మహిళలు నదిలో మునిగి మరణించారు. మండ్య జిల్లా మళవళ్ళి తాలూకాలోని ముత్తత్తిలో ఈ విషాదం జరిగింది. కనకపుర తాలూకాలోని గాణాలు గ్రామానికి చెందిన వడివేలు కుమార్తె నదియా (19), మురళి భార్య శోభ(23) ముత్తత్తి ఆంజనేయస్వామి ఆలయం దర్శనానికి వచ్చారు. వారితో పాటు సుమారు 50 మంది గ్రామస్తులు వచ్చారు. కావేరి నదిలో స్నానం చేయడానికి దిగిన సమయంలో అనుకోకుండా లోతైన చోట జారిపడిపోయారు. కొంతసేపటికే నీట మునిగి చనిపోయారు. హలగూరు పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకి తీసి ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ నదిలో స్నానం చేస్తూ గతంలో కూడా కొందరు మరణించారు. రక్షణ చర్యలు చేపట్టి ప్రాణాలను కాపాడాలని పలువురు డిమాండ్ చేశారు. -
అనుమానం.. అంతం చేసింది
బనశంకరి: పచ్చని సంసారంలో అనుమానం, అక్రమ సంబంధాలు నిప్పులు పోస్తున్నాయి. అర్ధాంతరంగా గొడవలు చెలరేగి కుటుంబాలు కూలిపోతున్నాయి. రాష్ట్రంలో రెండు చోట్ల ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు. భర్త ప్రవర్తన పట్ల అనుమానంతో ఆవేదన చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని బెల్లందూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాయచూరు కు చెందిన మల్లమ్మ (26) మృతురాలు. ఆమెకు ఆరేళ్ల క్రితం క్యాబ్డ్రైవరు గా పనిచేసే బసవరాజుతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబంతో కలిసి తిమ్మారెడ్డి లేఔట్లో కుటుంబం నివాసం ఉంటుంది. భర్త ప్రవర్తన పట్ల బార్యకు అనుమానం ఏర్పడింది. వేరే మహిళలతో చనువుగా ఉంటూ తనను పట్టించుకోవడం లేదని మథనపడేది. ఈ వ్యథతో శనివారం ఉదయం ఇంట్లో పై కప్పు ఇనుపరాడ్కు చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందిన వెంటనే బెల్లందూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. భార్యను శిక్షించాలని డెత్నోట్ రాసి.. యశవంతపుర: భార్య అక్రమ సంబంధంపై విరక్తి కలిగి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన దావణగెరె జిల్లా జగళూరు పట్టణంలో జరిగింది. భర్త బసవరాజ్ డెత్నోటు రాసి ఇంటిలో ఉరి వేసుకొని తనువు చాలించాడు. తన ఆత్మహత్యకు భార్య కారణం. ఆమె అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకొంటున్నట్లు రాశాడు. భార్య, అనైతిక సంబంధం కలిగి ఉన్న వ్యక్తికి చట్ట ప్రకారం శిక్ష పడాలి. నా పిల్లలను మా అమ్మ చూసుకోవాలని రాశాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఓ చోట మహిళ, మరోచోట పురుషుడు ఆత్మహత్య -
ఇకనైనా భద్రత లభించేనా?
బనశంకరి: మైక్రో ఫైనాన్స్ సంస్థలు, రుణాలు అందించే చిన్నా చితకా సంస్థలు, వడ్డీ వ్యాపారుల దౌర్జన్యాలకు సామాన్య జనం బెంబేలెత్తిపోతోంది. రూ.20 వేలు అప్పు తీసుకుంటే వడ్డీల పేరిట బాదేసి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని గగ్గోలు రేగుతోంది. రుణదాతల వేధింపులను తట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం రాష్ట్రంలో పెద్ద సమస్యగా మారడం తెలిసిందే. బలవంతపు వసూళ్లకు చెక్ పెట్టాలని సిద్దరామయ్య ప్రభుత్వం కర్ణాటక మైక్రో ఫైనాన్స్ (వేధింపుల నివారణ) ఆర్డినెన్స్–2025 ని తీసుకువచ్చింది. పలు చర్చోపచర్చల తరువాత ఆర్డినెన్స్కు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదముద్ర వేయడంతో చట్టంగా రూపుదాల్చింది. గ్యారంటీ లేకుండా అప్పులివ్వాలి చట్ట ప్రకారం మైక్రో ఫైనాన్స్ సంస్థలు రుణగ్రహీతల నుంచి ఎలాంటి గ్యారంటీ తీసుకోరాదని సర్కారు ఆదేశించింది. ఇంటిని, ఆస్తుల పత్రాలను పెట్టుకుని రుణాలు ఇవ్వకూడదని తెలిపింది. అలాగే అప్పుదారులపై విధించే వడ్డీరేటు న్యాయపరంగా ఉండాలి, లిఖితపూర్వకంగా, స్థానిక భాషలో నిబంధనలను రుణగ్రహీతలకు తెలియజేయాలి. భారతీయ రిజర్వు బ్యాంక్లోను , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో రిజిస్ట్రేషన్ లేని మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ఈ ఆర్డినెన్స్ వర్తిస్తుంది. నమోదిత సంస్థలకు ఈ చట్టంలోని నియమాలు వర్తించవు. నమోదిత సంస్థల నుంచి 1.09 కోట్ల మంది రూ.60 వేల కోట్ల రుణాలు తీసుకున్నట్లు అంచనా. రిజిస్ట్రేషన్ కానీ ఫైనాన్స్ల నుంచి రూ. 40 వేల కోట్లు రుణాలు జారీ అయినట్లు అంచనా. ఎంతమంది అనేది సర్కారుతోను వివరాలు లేవు. ఫైనాన్స్ కంపెనీల వద్ద కచ్చితమైన రికార్డులు లేకపోవడమే దీనికి కారణం. కలెక్టర్లకు వ్యాపార నివేదికలు ఆర్డినెన్స్ ప్రకారం జిల్లాల్లో వ్యవహారాలు నిర్వహించే మైక్రోఫైనాన్స్ సంస్థలు కలెక్టర్లకు త్రైమాసిక, వార్షిక లావాదేవీల నివేదికలను అందజేయాలి. అందించకపోతే 6 నెలల జైలుశిక్ష లేదా రూ.10 వేలు జరిమానా విధిస్తారు. వివాదాల పరిష్కారానికి అంబుడ్స్పర్సన్స్ను ప్రభుత్వం నియమించవచ్చు. బలవంతపు వసూళ్ల చర్యలకు కఠిన శిక్షలు తప్పవు. 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.5 లక్షలు జరిమానా విధిస్తారు. బెయిల్ కూడా దొరకదని పేర్కొన్నారు. దాడుల గురించి తెలిస్తే డీఎస్పీ స్థాయి అధికారి సుమోటోగా కేసు నమోదు చేయవచ్చు. ప్రభుత్వం నిత్యం చట్టం అమలును పర్యవేక్షిస్తూ ఆదేశాలు జారీ చేయవచ్చు. అప్పులు ఇచ్చి, వేధించేవారికి కొత్త చట్టంతో చెక్ పడితే మేలు ఈ చట్టంతోనైనా బలవంతపు వసూళ్లు, దౌర్జన్యాల నుంచి బడుగులకు విముక్తి లభించాలని ప్రజాసంఘాల నేతలు కోరారు. ఈ చట్టాన్ని త్వరలోనే అమలులోకి తీసుకువస్తామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. ఆర్డినెన్సులో ఉన్న నియమ నిబంధనలు నిరుపేదలు, మహిళలు, రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాలు రుణాల చెల్లింపులో వేధింపులను తప్పించడానికి సహాయపడుతుంది. ఆ చట్టంలో ఉన్న ప్రకారం జరగాలని బాధితులు కోరుతున్నారు. కాగితాలపైనే ఆ చట్టం సత్తా నిలిచిపోరాదని, ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయడం రుణగ్రహీతలకు అండగా ఉండాలని, రుణాల పేరిట దోచుకునే సంస్థలను వడ్డీవ్యాపారులను కట్టడి చేయాలని డిమాండ్లు ఉన్నాయి. ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారులపై సర్కారు గురి ఫలించేనా? ఆర్డినెన్స్కు ఆమోదముద్రతో చట్టరూపం త్వరలోనే అమలులోకి: సీఎం సిద్దు రక్షణ కోసం రుణగ్రహీతల నిరీక్షణ -
లంచగొండి ఎస్ఐకి సంకెళ్లు
మైసూరు: హత్య కేసును మూసివేసేందుకు రూ.80 వేల లంచం తీసుకుంటుండగా ఓ ఎస్ఐ లోకాయుక్త వలలో చిక్కిన ఘటన జిల్లాలోని పిరియాపట్టణ తాలూకాలోని బెట్టదపురలో జరిగింది. వివరాలు.. బెట్టదపుర స్టేషన్ ఎస్ఐ శివశంకర్ ఓ కేసును మూసివేస్తానని, ఇందుకు లంచం ఇవ్వాలని సంబంధీకులకు తెలిపాడు. డబ్బులు ఇవ్వలేమని, కేసుతోను తమకు సంబంధం లేదని వారు చెప్పినా ఎస్ఐ వినిపించుకోలేదు. దీంతో వారు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాధితుల నుంచి ఎస్ఐ శివశంకర్ రూ.80 వేలు తీసుకుంటూ ఉండగా, లోకాయుక్త అధికారులు దాడి చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి తరలించారు. -
జాడలేని బిహార్ గజదొంగలు
● బీదర్ ఏటీఎం డబ్బు దోపిడీ కేసు.. దొడ్డబళ్లాపురం: బీదర్ పట్టణంలో జనవరి 16న బిహార్ దోపిడీ దొంగలు పట్టపగలు కాల్పులు జరిపి రూ. 1 కోటి నగదును ఎత్తుకెళ్లడం తెలిసిందే. కాల్పుల్లో ఓ ఉద్యోగి మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నెలరోజులు అవుతున్నా ఇంతవరకు దోపిడీ దొంగలను పట్టుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇప్పుడిప్పుడే కాస్త కదలిక వచ్చింది. బిహార్ దొంగలు అమన్, అలోక్గా గుర్తించారు. ఇద్దరి ఫోటోలను ముద్రించి వాంటెడ్ పోస్టర్లను విడుదల చేశారు. వారి గురించి సమాచారం ఇచ్చినా, పట్టించినవారికి రూ.5 లక్షల బహుమానం ఇస్తామని బీదర్ పోలీసులు ప్రకటించారు. నిందితుల కుటుంబ సభ్యులను నిర్బంధించి బీదర్కు తీసుకువచ్చారు పోలీసులు. -
అభివృద్ధి బాధ్యత ప్రతి ఒక్కరిదీ
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక భాగంలో విద్య, ఆరోగ్యం విషయాలకు తోడు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో నడుచుకోవాలని కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్ సింగ్ పిలుపునిచ్చారు. శనివారం రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం జగజ్యోతి బసవేశ్వర, అంబేడ్కర్ భవనంలో విద్యాభ్యాసం–పాలకుల భాగస్వామ్యం అనే అంశంపై జరిగిన ముగింపు సదస్సులో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు విద్యారంగంలో మార్పులకు పరిశోధనలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవాలన్నారు. విద్యారంగం కోసం రూ.30 కోట్లతో 1008 పాఠశాలల్లో నర్సరీ తరగతుల్లో 42 వేల మంది విద్యార్థులు చేరారన్నారు. వంద పబ్లిక్ పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో శాసన సభ్యుడు బసనగౌడ, విద్యాశాఖ డైరెక్టర్ మమత, విద్యా కమిటీ అధ్యక్షురాలు చాయ దేవగాంవకర్, సభ్యులు పాటిల్, ఖదీర్, మల్లికార్జున, బాష్యుం, రుద్రేష్, యశవంత్, నాగబాయి, బుళ్లా, కలబుర్గి డివిజన్ విద్యా శాఖ కమిషనర్ ఆకాష్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారం పాండే, విద్యా శాఖాధికారులు బడిగేర, ఇందిర, చంద్రశేఖర్, రంగస్వామిలున్నారు. ఆరోగ్య కమిషనరేట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు కళ్యాణ కర్ణాటక అభివృద్ధిలో భాగంగా రాయచూరులో ఆరోగ్య కమిషనరేట్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్సింగ్ వెల్లడించారు. శనివారం రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య ఆవిష్కార పథకంలో రూ.857 కోట్ల నిధులు సేకరించినట్లు తెలిపారు. 18 నూతన తాలూకా కేంద్రాలకు మినీ విధానసౌధలను నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్రాంతీయ పత్రికలకు ప్రకటనలివ్వరూ.! కళ్యాణ కర్ణాటకలోని జిల్లాల్లోని ప్రాంతీయ పత్రికలకు ప్రకటనలివ్వాలని పత్రికా సంపాదకుల సంఘం డిమాండ్ చేసింది. శనివారం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్సింగ్కు జిల్లాధ్యక్షుడు చెన్నబసవ వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. వార్త ప్రచార శాఖ ఆధీనంలో పని చేసే అధికారులకు కేకేఆర్డీబీ నుంచి రాజ్యాంగంలోని అర్టికల్–371(జె) ప్రకారం ప్రకటనలు ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఆందోళనలో లక్ష్మణరావ్, బసన గౌడ, ప్రభాకర్, ఖాన్ సాబ్ మోమిన్, ఖాజా హుసేన్లున్నారు. -
త్వరలో చెరువుల భర్తీ పథకం ప్రారంభం
హొసపేటె: చెరువులను నింపే పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నామని ఎమ్మెల్యే డాక్టర్ ఎన్టీ శ్రీనివాస్ తెలిపారు. శనివారం రామసాగర హట్టి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రూ.1 కోటి 50 లక్షలతో మౌలిక వసతులు, అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాలూకాలోని హుడెం గ్రామంలో చెరువుల పూడికతీత, తైకాన గ్రామం నుంచి హుడెం గ్రామం వరకు రూ.8.07 కోట్లు, లోకికెరె గ్రామం ఎస్సీ కాలనీలో రూ.35 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైయిన్ల నిర్మాణం చేపడతామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జీపీ అధ్యక్షుడిగా సిద్దనగౌడ హొసపేటె: తాలూకాలోని కానాహొసహళ్లి గ్రామంలో అవిశ్వాస తీర్మానంతో ఖాళీ అయిన అధ్యక్ష పదవికి శనివారం జరిగిన ఎన్నికల్లో కేజీ.సిద్దనగౌడ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ అధ్యక్ష పదవికి కేజీ సిద్దనగౌడ, ఏ.నాగరాజు నామినేషన్ పత్రాలు సమర్పించగా మొత్తం 30 మందికి గాను 27 మంది సభ్యులు హాజరయ్యారు. కేజీ సిద్దనగౌడకు 23 ఓట్లు, ఏ.నాగరాజుకు 4 ఓట్లు లభించాయి. తద్వారా అధ్యక్షుడిగా కేజీ సిద్దనగౌడ ఎన్నికై నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్ ఎం.రేణుక ప్రకటించారు. ఎన్నికల సహాయకులు శివకుమారగౌడ, వాసు, పీడీఓ వినయ్కుమార్, కార్యదర్శి నాగరాజు, బిల్ కలెక్టర్లు కేజీ నాగరాజు, శశికుమార్ తదితరులు ఉన్నారు. అధ్యక్షుడిగా కేజీ సిద్దనగౌడ ఎన్నిక కావడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బాణసంచా పేల్చి నాయకులు, యువకులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. స్వయం ఉపాధికి నైపుణ్యత దోహదం బళ్లారిటౌన్: నిరుద్యోగులు స్వయం ఉద్యోగం ఏర్పాటు చేసుకొనేందుకు సృజనాత్మక నైపుణ్యత దోహదపడుతుందని జెడ్పీ సీఈఓ రాహుల్ శరణప్ప సంకనూరు పేర్కొన్నారు. శనివారం కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉద్యోగుల ట్రైనింగ్ సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన 30 రోజుల బ్యూటిపార్లర్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం మహిళలు సౌందర్యం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇందుకోసం బ్యూటీటిపార్లర్కు మంచి డిమాండ్ ఉందన్నారు. నిరుద్యోగ మహిళలు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగ పరచుకోవాలన్నారు. దీని వల్ల మహిళలు తమ కుటుంబ జీవితం ఆర్థికంగా పెంపొందేందుకు దోహద పడుతుందన్నారు. ఈ సందర్భంగా 34 మంది శిబిరార్థులకు బ్యూటీపార్లర్ కిట్లను అందజేశారు. జెడ్పీ ఉపకార్యదర్శి గిరిజా శంకర్, వివిధ అధికారులు వినోద్, బసవరాజ్ హిరేమఠ, రాజేంద్ర, రఘువర్మ, ఉపన్యాసకులు జడియప్ప, దినేష్, సిద్దలింగమ్మ పాల్గొన్నారు. నకిలీ జర్నలిస్టుల బెడద అరికట్టండి హొసపేటె: విజయనగర జిల్లాలో నకిలీ జర్నలిస్టుల బెడదను అరికట్టాలని వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తాలూకా శాఖ తరపున శనివారం గ్రేడ్– 2 తహసీల్దార్ నేత్రావతి ద్వారా జిల్లాధికారికి వినతిపత్రం అందించారు. వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తాలూకా అధ్యక్షుడు మంజు మయూర మాట్లాడుతూ తాలూకాలో వర్కింగ్ జర్నలిస్టుల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. తమ పేరు మీద ఉన్న గుర్తింపు కార్డు (ఐడీ కార్డు)ను చూపించి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ప్రశ్నలు వేసి సమాచారం సేకరిస్తున్నానని బెదరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. మరి కొందరు తాలూకా స్థాయి కార్యాలయాలు, ఆసుపత్రుల్లో కాంట్రాక్టర్లు చేస్తున్న అభివృద్ధి పనులను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని తెలిపారు. -
జిల్లా కోర్టు తాత్కాలిక భవనం పరిశీలన
హొసపేటె: విజయనగర జిల్లా నూతన జిల్లా కోర్టు కోసం తాత్కాలికంగా ఇచ్చిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని జిల్లా స్థాయి జడ్జితో కలిసి ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాలూకా కార్యాలయ పాత భవనాన్ని ప్రస్తుతానికి జిల్లా కోర్టుకు ఇచ్చామన్నారు. జిల్లాధికారి కార్యాలయం సమీపంలో కోర్టు కాంప్లెక్స్ నిర్మించే వరకు ఇక్కడే కోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తారన్నారు. జిల్లా కోర్టు భవనంతో పాటు జిల్లా పాలనా సముదాయ భవన నిర్మాణానికి తక్షణమే రూ.200 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మంజునాథ స్వామి, కోశాధికారి మారియప్ప, న్యాయవాదులు ఏ.కరుణానిధి, కేటు జంబయ్య, గుజ్జల నాగరాజ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. సమాచార శాఖ కార్యాలయ భవనం కూడా.. నిలిచి పోయిన వార్త, ప్రజా సంబంధాల శాఖ అధికారి కార్యాలయ నూతన భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కేఆర్డీఎల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశిస్తామని విజయనగర ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప తెలిపారు. ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉన్న పటేల్ నగర్లో నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. విజయనగర జిల్లా కావడంతో జిల్లా స్థాయి కార్యాలయాలన్ని పూర్తి స్థాయిలో పని చేయాలంటే సొంత భవనం తప్పనిసరి అన్నారు. -
ఘనంగా సేవాలాల్ జయంతి
రాయచూరు రూరల్: నగరంలో సంత్ సేవాలాల్ జయంతిని శనివారం ఆచరించారు. బసవేశ్వర సర్కిల్లో సంత్ సేవాలాల్ చిత్ర పటాన్ని ఊరేగించారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ సేవాలాల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ జ్యోతి వెలిగించారు. కార్యక్రమంలో నగరసభ కమిషనర్ గురుసిద్దయ్య, శ్రీదేవి నాయక్, దీపా నాయక్, రాజు, జ్యోతి బాయి, లచ్చప్ప, వెంకటేష్, ఈరణ్ణ, శశికళ, తహసీల్దార్ సురేష్వర్మలున్నారు. హొసపేటెలో.. హొసపేటె: టీబీ డ్యాం పీఎల్సీ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సేవాలాల్ మహారాజ్ జయంతిని శనివారం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి కార్యక్రమంలో పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నిర్మల, ఈరప్ప, మంజుల, శారద, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా సేవాలాల్ జయంతి బళ్లారిటౌన్: జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ సంస్కృతి శాఖ, మహానగర పాలికెల ఆధ్వర్యంలో శనివారం జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో సంత సేవాలాల్ జయంతిని ఘనంగా జరిపారు. పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సేవాలాల్ తమ తత్వాల ద్వారా లోకజ్ఞానం, ముక్తిమార్గం చూపారని గుర్తు చేశారు. అంతకు ముందు మున్సిపల్ కళాశాల ఆవరణ నుంచి సంత సేవాలాల్ చిత్రపటానికి పుష్పార్చన చేసి ఊరేగించారు. కన్నడ సంస్కృతిక శాఖ ఏడీ నాగరాజు, శివమొగ్గ జిల్లా ప్రొఫెసర్ నాగేంద్ర నాయక్, సేవాలాల్ బంజార సంఘం అధ్యక్షుడు రాజు నాయక్ పాల్గొన్నారు. -
అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు తగదు
రాయచూరు రూరల్ : కొప్పళ జిల్లాలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుతో పాటు ఎంఎస్పీఎల్ బల్డోటా తదితర 50 కంపెనీలను ఏర్పాటు చేయడం తగదంటూ ప్రజలు ఆందోళన చేపట్టారు. జిల్లాలోని గంగావతి తాలూకా హిరేబెణకల్, చిక్కబెణకల్ గ్రామాల వద్ద చేపట్టనున్న విద్యుత్ యూనిట్ ఏర్పాటుకు గ్రామస్తులు మూకుమ్మడిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం యూనిట్ల ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహంతేష్, డీహెచ్ పూజార్, మంజునాథ్, రఘు, హన్మంతప్ప, మూకప్ప, రామణ్ణ, రుద్రప్ప, శివప్పలున్నారు. బైక్ చోరుని అరెస్ట్ హుబ్లీ: బైక్ చోరీ కేసులో మంటూరు రోడ్డు నివాసి నూర్ అహ్మద్ మిర్జీ (30)ని అరెస్ట్ చేసిన హుబ్లీ టౌన్ పోలీసులు బైక్ను జప్తు చేశారు. నిందితుడు దుర్గదబైలు కలాదగి వీధి నివాసి అజయ్ ఇంటి ఎదుట నిలిపిన బైక్ను చోరీ చేసి పరారయ్యాడు. ఘటనపై టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని జేసీ నగర్ రోడ్డులో అరెస్ట్ చేశారు. కాగా మరో ఘటనలో బంకాపుర చౌక్ దగ్గర బస్టాండ్లో బస్సు ఎక్కే వేళలో యల్లాపుర వీధి నివాసి లలిత కుసుగల్ అనే మహిళ బ్యాగ్లో పెట్టిన రూ.1.45 లక్షల విలువ చేసే బంగారు చైన్ చోరీపై గంటికేరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లలిత సవణూరులో బంధువుల ఇంటికి వెళ్లడానికి బస్టాండ్కు వచ్చారు. ఈ క్రమంలో బస్సు ఎక్కి బ్యాగ్ చూసుకోగా అందులో ఉన్న బంగారు చైన్ చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మరో ఘటనలో పాత హుబ్లీ తిమ్మసాగర రోడ్డులో మారణాయుధాలను పట్టుకొని తిరుగుతున్న ధార్వాడ రోడ్డు శివశంకర కాలనీ నివాసి సాగర్ బిలానను పాత హుబ్లీ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకున్నారు. సిలిండర్ల విక్రయం.. ఐదుగురిపై కేసుహుబ్లీ: తాలూకాలోని చెన్నాపుర గ్రామంలో ఓ షెడ్లో అనుమతి లేకుండా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా నియమాలను ఉల్లంఘిస్తూ వంట గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న ఐదుగురిపై హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పాత హుబ్లీ ఈశ్వర్ నగర్ రఫీక్, ప్రకాష్, జాఫర్, శంషుద్దీన్, రవి బంకాపురలపై ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ ఫిర్యాదు చేశారు. అక్రమంగా సిలిండర్లను విక్రయిస్తున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులు పోలీసులతో కలిసి దాడి చేసి నిందితులపై చర్యలు తీసుకున్నారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం రాయచూరు రూరల్: తాలూకాలోని యాపలదిన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. కత్తితో గొంతు కోసి హత్య చేసి సంచిలో చుట్టి వాహనంలో తెచ్చి శుక్రవారం రాత్రి చంద్రబండ వద్ద పొలంలో పడేసినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉపాధ్యాయ డిప్యుటేషన్ల రద్దుకు వినతి రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ జారీ చేసిన డిప్యుటేషన్ ఆదేశాలను రద్దు చేయాలని జయ కర్ణాటక సంఘం డిమాండ్ చేసింది. శనివారం కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్సింగ్కు జిల్లాధ్యక్షుడు శివకుమార్ యాదవ్ వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. హైస్కూలులో విధులు నిర్వహించే ఉపాధ్యాయులను కార్యాలయాల్లో పనులకు వినియోగించుకోవడం తగదన్నారు. 10వ తరగతి విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్, సాంఘీక, సామాన్య శాస్త్రం పాఠాలు బోధించే వారికి ఇలాంటి విధులు ఇవ్వడంతో ఉత్తీర్ణత శాతం తగ్గుతుందన్నారు. డిప్యుటేషన్ల నుంచి విడుదల చేసి పాఠశాలల్లో విధులకు హాజరయ్యేలా ఆదేశాలను జిల్లా విద్యాశాఖాధికారి బడిగేరకు జారీ చేయాలని కోరారు. నిందితులనుకఠినంగా శిక్షించాలని ధర్నారాయచూరు రూరల్ : మహిళలు, విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత జనవాది మహిళా సంఘం, సీపీఐ(ఎం) డిమాండ్ చేశాయి. శనివారం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంఘం కార్యకర్తలు పద్మ, వీరేష్ మాట్లాడారు. రెండో తరగతి బాలికపై అత్యాచారం జరిగిన పోత్నాళలోని ప్రైవేట్ పాఠశాల లైసెన్సును రద్దు చేయాలని కోరారు. బాధితులకు సత్వరం పరిహారం అందించాలని తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం హుబ్లీ: ధార్వాడలోని ఆదర్శ విద్యాలయంలో 2025–26వ సంవత్సరంలో 6వ తరగతిలో 120 మంది విద్యార్థుల దాఖలు కోసం ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించారు. ప్రవేశ పరీక్ష దరఖాస్తుల దాఖలుకు ఈ నెల 23 చివరి తేదీ అని, మరిన్ని వివరాలకు బెబ్సైట్ లేదా 9741779832లో సంప్రదించాలని ఆ విద్యాలయ ప్రధానోపాధ్యాయులు ఓ ప్రకటనలో తెలిపారు. -
శ్రీశైలంలో భారీ సముదాయ భవన నిర్మాణం
హుబ్లీ: పంచపీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి వచ్చే అశేష భక్తులకు కనీస వసతులు కల్పించే దిశలో 400 వసతి గదులతో సముదాయ భవన నిర్మాణ పనులను చేపట్టినట్లు శ్రీశైల జగద్గురువులు డాక్టర్ చెన్నసిద్దరామ పండితారాధ్య శివాచార్య స్వామీజీ తెలిపారు. ఉనకల్ సిద్దప్పజ్జ నూతన శిలామంటప నిర్మాణ పనులను శనివారం పరిశీలించి ఆలయ కమిటీ గౌరవ సన్మానం స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ప్రభుత్వం 10 ఎకరాల భూమి ఇచ్చింది. 5 ఎకరాలను స్వాధీనం చేసుకొని అందులో భక్తుల కోసం వసతి గదులతో ఆధునిక ఆస్పత్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. భక్తులు తెచ్చే ఇనుప కడ్డీలతో మంటపం నిర్మాణం చేపట్టామన్నారు. నిర్మాణ కార్యానికి భక్తులు ఉదారంగా విరాళాలు ఇవ్వాలని కోరారు. ఉణకల్ సిద్దప్పజ్జ తమ బతుకును పోరాటాల మధ్య భక్తుల మనసు గెలిచిన ధీశాలి అన్నారు. దేవమానవులుగా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే సిద్దపురుషులని కొనియాడారు. దేవస్థాన కమిటీ నూతన శిలా మంటప నిర్మాణ పనులు చేపట్టిందని, దీనికి భక్త బృందం కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం సిద్దప్పజ్జ మహిమకు నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు రాజన్న కొరవి, శివాజీ, రామన్న, సిద్దనగౌడ తదితరులు పాల్గొన్నారు. -
సేవే మార్గం.. సమాజానికి ఆదర్శం
రాయచూరు రూరల్ : నేటి ఆధునిక యుగంలో భిక్షమెత్తి దెప్పిపొడుపు మాటలు పడుతూ సమాజానికి మంచి చేయాలనే తపన, మానవత్వంతో పేదలకు తన వంతు సేవ చేయాలనే తలంపుతో ముందుకు వచ్చిన వారిలో హిజ్రా జమునమ్మ ఒకరు. చదువు సంధ్య లేని ఆమె కొప్పళ జిల్లా కారటిగి తాలూకా బెన్నూరు నివాసి. గత 16 ఏళ్ల నుంచి రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా ముక్కుంద గ్రామంలో నివాసముంటోంది. బాలుడిగా ఉండగా వయస్సు పెరిగే కొద్దీ ఆమెలో బాలిక లక్షణాలు గోచరించాయి. జమునమ్మకు 53 ఏళ్లు నిండాయి. ట్రాన్స్జెండర్(హిజ్రా)గా మారిన జమునమ్మ పేదవిద్యార్థినులను బీఏ, బీకాం వరకు చదివించింది. మధుశ్రీ అనే మహిళను పోలీస్ శాఖలో ఉద్యోగం లభింపచేసింది. భిక్షమెత్తిన డబ్బుల్లో 75 శాతం సొమ్మును సమాజ సేవకు, 25 శాతం సొమ్మును స్వంత ఖర్చులకు వినియోగిస్తోంది. సమాజంలో అన్ని చోట్ల అవమానాలు భరించి దశాబ్ద కాలం నుంచి 25 మంది పేదలకు పెళ్లిళ్లు చేశారు. ట్రాన్స్జెండర్ జమునమ్మ అక్షరదాత, మార్గదర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు. సమాజ సేవకు అంకితమైన జమునమ్మను కాయకరత్న అవార్డు, బసవ శ్రీ అవార్డు, ఇతర సమాజ సేవ అవార్డులు వరించాయి. సింధనూరు తాలూకా హొసళ్లి క్యాంప్ దుర్గా పరమేశ్వరి ఆలయంలో ఐదు మంది పేద జంటలకు పెళ్లిళ్లు జరిపించింది. విద్యార్థుల అనుకూలం కోసం పాఠ్య పుస్తకాలు, బెంచీలు, టేబుళ్లు, కుర్చీలు అందించింది. తాను పెళ్లి చేసుకోకుండా తన సొంత డబ్బులతో తన వంతుగా పేద పిల్లలకు పెళ్లిళ్లు చేయించినట్లు తెలిపింది. పేద విద్యార్థులకు బాసట జమునమ్మ భిక్షమెత్తి వివాహాలు జరిపించిన వైనం -
చచ్చి బతికిన ఆ వ్యక్తి ఇక లేరు
హుబ్లీ: చనిపోయాడనుకొని ఆస్పత్రి నుంచి ఊరికి తరలిస్తుండగా మార్గమధ్యంలో బతికిన వ్యక్తి వారం తర్వాత చికిత్స ఫలించక శనివారం మృతి చెందిన ఘటన హావేరి జిల్లా శిగ్గాంవి తాలూకా బంకాపుర గ్రామం వద్ద చోటు చేసుకుంది. బిస్టప్ప అశోక్ గుడిమని(45) మృతుడు. 15 రోజుల క్రితం పచ్చకామర్ల వ్యాధితో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో చికిత్స చేసిన వైద్యులు వ్యక్తి చనిపోయాడని మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు. ఆ మేరకు శవాన్ని తరలిస్తుండగా ఆయన ఎప్పుడూ ఇష్టపడే డాబా వద్ద డాబా వచ్చింది చూడు, భోజనం చేస్తావా అంటూ మృతుడి భార్య మృతదేహాన్ని పట్టుకొని అల్లాడించడంతో ఆ వ్యక్తి కళ్లు తెరిచారు. దీంతో తక్షణమే ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్సకు హుబ్లీ కిమ్స్లో చేర్పించారు. అలా ఓ వారం పాటు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే చికిత్స ఫలించక అతడు చనిపోయినట్లు వైద్యులు తెలపడంతో తాజాగా మృతదేహాన్ని బంకాపురకు తరలించారు. -
బంజారా సముదాయ అభివృద్ధికి చర్యలు
బళ్లారి రూరల్ : బంజారా సముదాయ అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హెచ్సీ.మహదేవప్ప తెలిపారు. దావణగెరె జిల్లా పరిపాలన, సాంఘిక సంక్షేమశాఖ, తాండా అభివృద్ధి మండలి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం దావణగెరె జిల్లా న్యామతి తాలూకా సూరగొండనకొప్పలో ఏర్పాటు చేసిన సంత సేవాలాల్ 286వ జయంతిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బంజారా సముదాయ ప్రజలు కష్టజీవులన్నారు. పనుల కోసం, ఉపాధి కోసం వలసలు వెళ్లేవారు అధికం. అందుకోసం వారి పిల్లల చదువులకు దూరమయ్యేవారు. ఈ నేపథ్యంలో సూరగొండనకొప్పలో 1 నుంచి పీయూసీ వరకు వసతి పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. 2025–26వ ఏడాదికి బడ్జెట్లో ఆమోదం పొందినట్లు తెలిపారు. ఇందుకోసం రూ.40 కోట్ల నిధులు వెచ్చించినట్లు తెలిపారు. సంత సేవాలాల్ నీతిమంతుడు, తత్వసిద్ధాంతాలను ప్రతిపాదించారన్నారు. సంత సేవాలాల్ ఆరాధన కోసం రాష్ట్రంలో 1500 బంజారా భవనాలను నిర్మాణం జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బంజారా సముదాయ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. హొన్నాళి ఎమ్మెల్యే డీజీ శాంతనగౌడ, మహారాష్ట్ర ప్రభుత్వ భూజల సంరక్షణ శాఖ మంత్రి సంజయ్ డి.రాథోడ్, ఎమ్మెల్యేలు బి.వై.విజయేంద్ర, డాక్టర్ చంద్రు కె.లమాణి, కౌశల్యాభివృద్ధి నిగమ అధ్యక్షుడు శాంతానాయక్, మాజీ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 1500 బంజాన భవన నిర్మాణానికి ఏర్పాట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హెచ్సీ.మహదేవప్ప -
నా భర్త ఎక్కడ ఉంటే అక్కడకు వస్తోంది...
బనశంకరి: హత్యాయత్నం చేశారంటూ బెంగళూరు ఏసీపీ గోవర్ధన్, అతని తల్లిదండ్రులపై హైగ్రౌండ్స్ పోలీస్స్టేషన్లో భార్య అమృత ఫిర్యాదు చేసింది. ఆమె పలు తీవ్ర ఆరోపణలు చేసింది. తన భర్తకు శిక్షణలో ఉన్న మహిళా డీఎస్పీతో అక్రమ సంబంధం ఉందని పేర్కొంది. ఆమైపె కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఆ మహిళా డీఎస్పీకి పెళ్లయి, పిల్లలు ఉన్నప్పటికీ నా భర్తతో స్నేహంగా ఉంటోంది. నా భర్త ఎక్కడ డ్యూటీలో ఉంటే అక్కడకు వస్తోంది. ఈ విషయాన్ని ప్రశ్నించానని నా భర్త కోపోద్రిక్తుడై నాపై దాడికి పాల్పడ్డారు. విడాకులు ఇస్తానని బెదిరించారు. అంతేగాక నాపై తప్పుడు కేసు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు, అత్త కిరోసిన్ పోసి నిప్పంటించాలని చూసింది అని చెప్పారు. పోలీసులు గోవర్ధన్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి విచారణ రావాలని ఆదేశించారు. -
భార్యను కాల్చి చంపిన భర్త
సేలం: తెన్కాశి సమీపంలో మదునాదపేరి కుళం ప్రాంతంలో ముళ్ల పొదలో ఓ మహిళ కాల్చి చంపిన స్థితిలో మృతదేహంగా కనిపించింది. ఘటనా స్థలంలో అనేక మద్యం బాటిళ్లు ఉన్నాయి. ప్రత్యేక బృందం పోలీసులు సీసీటీవీ వీడియోల ఆధారంగా విచారణ జరిపారు. అందులో.. ముందు రోజు రాత్రి 9.30 గంటలకు సందేహాస్పదంగా ఒక కారు వెళ్లినట్లు తెలిసింది. ఆ కారు నెంబర్ ఆధారంగా జరిపిన విచారణలో... ఆ కారు శివకాశికి చెందిన ఒకరికి సొంతమైనది అని తెలిసింది. పోలీసుల విచారణలో శివకాశి భారతి నగర్కు చెందిన జాన్కిల్బర్ట్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద జరిపిన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను తన భార్యను కాల్చి చంపినట్టు తెలిసింది. వివరాలు.. జాన్కిల్బర్ట్ అదే ప్రాంతానికి చెందిన కమలి (30) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు వేరు వేరు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తల్లిదండ్రులను వ్యతిరేకించి జాన్కిల్బర్డ్ తన ప్రియురాలు కమలినినిపెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఈ స్థితిలో భార్య, భర్త మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈనెల 10వ తేదీ జరిగిన గొడవలో తీవ్ర ఆవేశానికి గురైన జాన్కిల్బర్డ్ తన భార్య కమలిపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. తర్వాత తన సోదరుడి సహకారంతో ఆమె మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని శంకరన్కోవిల్, తిరువెంగడం మార్గంగా తెన్కాశికి తీసుకువచ్చి 110 కిలో మీటర్ల దూరం కారులో కమలి మృతదేహాన్నీ తీసుకువచ్చి ఇలదూర్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ముల్ల పొదల్లో కాల్చినట్టు తెలిసింది. అనంతరం పోలీసులు జాన్కిల్బర్డ్తో పాటూ అతనికి సహకరించిన సోదరుడు తంగతిరుపతిని పోలీసులు అరెస్టు చేసి, గురువారం రిమాండ్కు తరలించారు. -
అద్దెకు బాయ్ఫ్రెండ్!
సాక్షి, బెంగళూరు: ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే... ప్రేమికుల కోసం షాపింగ్ మాల్స్, బేకరీలు, వస్త్ర దుకాణాలు, చివరికి ఆన్లైన్ షాపింగ్ విక్రయదారులు అనేక ఆఫర్లను ఇచ్చి ప్రేమికులను ఆకర్షిస్తుంటారు. అయితే బెంగళూరులో మాత్రం.. ఓ విచిత్రమైన పోస్టర్ ఒకటి కలకలం సృష్టించింది. ‘బాయ్ఫ్రెండ్ కావాలా?’ అంటూ పోస్టర్ ముద్రించడం సర్వత్రా వివాదాస్పదమైంది.‘కేవలం రూ.389 చెల్లిస్తే చాలు.. మీకు బాయ్ ఫ్రెండ్ లభించును’ అంటూ బెంగళూరు జయనగరలోని వివిధ ప్రాంతాల్లో ఈ విధమైన పోస్టర్లు దర్శనమిచ్చాయి. వాటిపై క్యూఆర్ కోడ్ కూడా ఉంది. వీటిని నెటిజన్లు, నగరవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు దృష్టి సారించి, నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. -
జయలలిత వస్తువుల అప్పగింత షురూ!
సాక్షి, బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. కోర్టు ఆదేశాల మేరకు జయలలిత వస్తువులను తీసుకెళ్లేందుకు తమిళనాడు పోలీసులు, అధికారులు కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరుకున్నారు. జయలలితకు సంబంధించిన ఆస్తి పత్రాలు, 11,344 పట్టు చీరలు, 750 జతల పాదరక్షలు, గడియారాలు, 7,040 గ్రాముల బరువైన 468 రకాల బంగారు, వజ్రాభరణాలు, 700 కిలోల వెండి అభరణాలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీసెట్లు, 8 వీసీఆర్లు, ఒక వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్లు, 24 టూ ఇన్ వన్ టేప్రికార్డర్లు, 1,040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లతోపాటు ఇతర విలువైన వస్తువులను కర్ణాటక అధికారులు న్యాయమూర్తి సమక్షంలో తమిళనాడు అధికారులకు అప్పగిస్తున్నారు. ఈ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ అప్పగింత ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తికానుంది. జయలలిత బంధువులమంటూ దీప, దీపక్ అనే వ్యక్తులు గతంలో కర్ణాటక ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. జయలలితకు సంబంధించిన ఆభరణాలు, వస్తువులను తమకు అప్పగించాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. అవన్నీ తమిళనాడు ప్రభుత్వానికే చెందుతాయని తేల్చిచెప్పింది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 19వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. 2024 మార్చి 6, 7 తేదీల్లో వాటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారిక బృందాన్ని ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. అంతలోనే దీప, దీపక్ ప్రత్యేక కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జయలలిత వస్తువుల అప్పగింతపై గతేడాది మార్చి 5న హైకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత దీప, దీపక్ల పిటిషన్ను కొట్టివేసింది. దాంతో ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు వస్తువుల అప్పగింత ప్రక్రియ ప్రారంభమైంది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలితకు స్పెషల్ కోర్టు 2014 సెప్టెంబర్ 27న నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. -
3 శాతం రిజర్వేషన్ కల్పించరూ.!
బళ్లారిఅర్బన్: ఎస్సీ అలెమారి చెన్నదాసర వలయ, మాలదాసులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డీ.రంగయ్య న్యాయమూర్తి నాగమోహన్దాస్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన జిల్లాధికారి వినతిపత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు. న్యాయమూర్తి హెచ్ఎన్ నాగమోహన్ దాస్ నివేదిక ప్రకారం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అమలు కోసం సుప్రీంకోర్టు ఏడుగురు ప్రధాన న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వివేచన మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించిందన్నారు. విద్య, రాజకీయ, ఆర్థిక, సామాజిక అత్యంత వెనుకబడిన చెన్నదాసుల సమాజానికి అంతర్గత రిజర్వేషన్లలో మూడు శాతం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల శాతం వల్ల ఆ సమాజానికి తగినంత మేలు జరగడం లేదన్నారు. ఈ వర్గాల సర్వతోముఖాభివృద్ధికి మూడు శాతం రిజర్వేషన్ కేటాయించాలని ఆయన న్యాయమూర్తిని కోరారు. ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మహాదేవప్ప, ప్రముఖులు మంజునాథ్, ఎర్రిస్వామి, రామయ్య రంగన్న, రామన్న, లక్ష్మణ, సోమశేఖర్లు పాల్గొన్నారు. -
ఆస్పత్రుల్లో వసతులు కల్పించాలని ధర్నా
బళ్లారిఅర్బన్: జిల్లా కేంద్రంలోని బీఎంసీఆర్సీ, జిల్లా ఆస్పత్రి, జిల్లాలోని అన్ని ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్యూసీఐ ఆధ్వర్యంలో జిల్లాధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఎస్యూసీఐ నేత రాధాకృష్ణ ఉపాధ్య మాట్లాడుతూ రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే కనీస సౌకర్యాలు అందడం లేదన్నారు. నాణ్యమైన మందులు కరువయ్యాయన్నారు. బాలింతల మరణాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్నారు. లేకుంటే తీవ్ర పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సంఘం ప్రముఖులు దేవదాస్, సోమశేఖర్గౌడ, మంజుల, డాక్టర్ ప్రమోద్, గోవింద్ ఈశ్వరి, జగదీశ్, రవికుమార్, సురేష్, ఈరణ్ణ తదితరులు పాల్గొన్నారు. పరీక్షల భయంతో విద్యార్థి ఆత్మహత్య సాక్షి,బళ్లారి: వచ్చే నెల 21వ తేదీన జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. గురువారం రాత్రి చిత్రదుర్గ నగరంలోని తమటెకల్లు రోడ్డులో నివాసం ఉంటున్న రాకేష్(15) పరీక్షల భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా విద్యార్థి ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయం ఉండటంతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై చిత్రదుర్గం కోట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాలూకా కసాప సమ్మేళన అధ్యక్షుడిగా అయ్యప్పయ్య రాయచూరు రూరల్: తాలూకా కన్నడ సాహిత్య పరిషత్(కసాప) 6వ సమ్మేళన అధ్యక్షుడిగా అయ్యప్పయ్య హుడా ఎన్నికై నట్లు తాలూకా కసాప అధ్యక్షుడు వెంకటేష్ బేవినబెంచి తెలిపారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 6న నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో కార్యక్రమాలను నాడోజ చెన్నబసప్ప ప్రారంభిస్తారన్నారు. విలేఖర్ల సమావేశంలో అశోక్ కుమార్ జైన్, రేఖ, దేవేంద్రమ్మ, ప్రతిభ, అన్వర్లున్నారు. ఉద్యోగుల తొలగింపుపై చర్యకు సూచన బనశంకరి: మైసూరు ఇన్ఫోసిస్ సంస్థ నుంచి 400 మంది ట్రైనీ ఉద్యోగులను ఈనెల 7న తొలగించిన వైనంపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర కార్మిక శాఖకు సూచించింది. ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇన్ఫోసిన్ మైసూరు క్యాంపస్లో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపుపై కేంద్రప్రభుత్వం స్పందించింది. కేంద్ర కార్మిక ఉద్యోగ మంత్రిత్వ శాఖ ఈ విషయం పరిష్కారానికి అత్యవసర చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖకు సూచించింది. కేంద్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖతో రాష్ట్ర కార్మిక శాఖ జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించింది. తాగునీటి సమస్య తలెత్తనీయొద్దు హొసపేటె: నియోజకవర్గంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప సూచించారు. శుక్రవారం తాలూకా పంచాయతీ సభాంగణంలో జరిగిన త్రైమాసిక కేడీపీ ప్రగతి సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. విజయనగర నియోజకవర్గ ప్రగతి పనులను సమీక్షించి సలహాలు ఇచ్చారు. వార్డులు, గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. రానున్న బడ్జెట్లో నిత్యావసర పనుల మంజూరుకు వినతిపత్రం అందజేస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉన్నందున రాష్ట్రం నుంచి వచ్చే గ్రాంట్ పక్కదారి పట్టకుండా చూసుకోవాలన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా ఉచితంగా కూరగాయల విత్తనాలు, ఎరువులు పంపిణీ చేశారు. తాలూకా పంచాయతీ ద్వారా మహిళా సంఘాల ప్రతినిధులకు ఏకరూప దుస్తులు, గుర్తింపు కార్డులు అందజేశారు. నగర అసిస్టెంట్ కమిషనర్ వివేకానంద, తహసీల్దార్ శృతి, టీపీ ఈఓ లక్ష్మికాంత్ పాల్గొన్నారు. -
నేడు జ్ఞానసిరి ఉత్సవాలు
బళ్లారిటౌన్: శరభేశ్వర విద్యాపీఠం ఆధ్వర్యంలో నడుస్తున్న జ్ఞానసిరి పాఠశాల, పీయూ కళాశాల ఉత్సవాలు–2025ను శనివారం సాయంత్రం గుగ్గరహట్టిలోని కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ ఎస్ఎం శివనాగ తెలిపారు. స్థానిక పత్రికాభవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు డాక్టర్ హంసరేఖ, సిటీ ఎమ్మెల్యే నారాభరత్రెడ్డి, వీఎస్కేయూ కులపతి ప్రొఫెసర్ మునిరాజు, శరభేశ్వర విద్యాపీఠం అధ్యక్షుడు హెచ్ఎం దక్షిణామూర్తి హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు పోటీ పరీక్షలను నిర్వహించి ఎక్కువ మార్కులు సంపాదించిన విద్యార్థులకు బహుమతులను అందజేస్తున్నట్లు తెలిపారు. తమ విద్యాసంస్థలో 2017 నుంచి సీబీఎస్ఈ స్కూల్, పీయూసీ, నర్సింగ్, బీఈడీ వంటి కోర్సులను ప్రవేశ పెట్టి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలను పొందేలా దోహద పడిందని వివరించారు. ఈసందర్భంగా పాలనాధికారి జానకీరాముడు, వైస్ ప్రిన్సిపాల్ దేవరాజు తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక బడ్జెట్ తగదు
రాయచూరు రూరల్ : కేంద్ర సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అసంఘటిత కార్మిక వ్యతిరేక బడ్జెట్ అని ఏఐటీయూసీ ఖండించింది. శుక్రవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మహేష్ మాట్లాడారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వే, బ్యాంకింగ్ రంగాలను ప్రైవేటీకరిస్తూ తీసుకున్న నిర్ణయాలను, ఏపీఎంసీ, విద్యుత్, కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహించే వారిని పర్మినెంట్ చేయాలన్నారు. కార్మికులకు కనీసం రూ.31 వేల వేతనం చెల్లించాలన్నారు. అంగన్వాడీ, బిసిఊట కార్యకర్తలకు గౌరవధనం పెంచాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలను కల్పించాలన్నారు.