breaking news
Karnataka
-
ఏం జరిగిందో చెప్పలేను.. డీకే కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: ఎడతెగని టీవీ సీరియల్ మాదిరిగా కర్ణాటక ముఖ్యమంత్రి మార్పిడి తతంగం కొనసాగుతోంది. హైకమాండ్ నేతలు ఒకమాట, సీఎం సిద్దరామయ్య మరో మాట చెబుతూ ఉంటే, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారనే చెప్పాలి. ఈ క్రమంలో డీకే శివకుమార్ (Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం, పదవుల కంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండటమే తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. దీంతో, సీఎం మార్పు అనే వ్యవహారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడుతూ..‘సీఎం సిద్ధరామయ్య, నా మధ్య ఏం జరిగిందో నేను వెల్లడించలేను. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కలిసి పనిచేశాం. పార్టీ కోసం ప్రతిఒక్క కార్యకర్త ఎంతో కష్టపడ్డాడు. 1980 నుంచి పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశాను. ఇప్పటికీ పార్టీ వర్కర్గా ఉండేందుకే ఇష్టపడతాను. హైకమాండ్ మాకు స్వేచ్ఛనిచ్చింది. కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. పార్టీ అధికారంలోకి రావడానికి డీకే, సిద్ధూతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో కృషి చేశారు’ అని అన్నారు.ఈ సందర్భంగా సంక్రాంతి తర్వాత నాయకత్వ మార్పునకు సంబంధించిన చర్చల గురించి విలేకరులు ప్రశ్నించారు. అలాంటి చర్చలు మీడియాలో మాత్రమే జరుగుతున్నాయని.. ప్రభుత్వం, పార్టీలో కాదని డీకే స్పష్టం చేశారు. ఇక, ప్రస్తుతం పార్టీ హైకమాండ్ను కలవడం లేదని, విదేశాల నుంచి వచ్చిన రాహుల్గాంధీని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం మాత్రమే సమాధానం చెప్పగలరని వ్యాఖ్యానించారు.27వ తేదీపైనే ఆశలుఇదిలా ఉండగా.. సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా మాజీ మంత్రి కే.ఎన్.రాజణ్ణ రాహుల్గాంధీకి లేఖ రాసి వేడి పుట్టించారు. ఈ నెల 27న కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. అందులో పాల్గొనేందుకు డీకే శివకుమార్ వెళ్తారు. తాను వెళ్లనని సిద్దరామయ్య మొన్ననే చెప్పారు. ఆ సమావేశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని డీకే పట్టుదలతో ఉన్నారు. ఇందులో ఫైనల్ రౌండ్ చర్చలకు శ్రీకారం చుట్టనున్నారు. -
ముని మనవనిపై అవ్వ కసి?
శిశువు మృతదేహం బాగేపల్లి: 40 రోజుల పసికందును సొంత అవ్వ హత్య చేసిందని శిశువు తల్లి చేళూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తాలూకాలోని చేళూరువాసి ఆసిఫా, రాజేశ్ ఒకే కాలేజీలో చదువుతూ మతాంతర ప్రేమపెళ్లిని చేసుకున్నారు. నవంబర్ 12న ఆసిఫాకు మగబిడ్డ పుట్టాడు. దీంతో ఆమె చేళూరు పట్టణం గుంత మోరి వద్ద ఉండే బిరియానీ హోటల్లో పనికి చేరి అక్కడే అమ్మమ్మతో ఉంటోంది. 21వ తేదీన.. డిసెంబర్ 21న తాను హోటల్లో ఉండగా తన చెల్లి ఫోన్ చేసి పసిబిడ్డ చనిపోయాడని చెప్పిందన్నారు. అదే రోజు సాయంత్రం హోటల్ వెనుక భాగంలో శిశువును పూడ్చిపెట్టినట్లు తెలిపింది. కానీ తాను ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని అవ్వ.. శిశువుకు ఊపిరి ఆడకుండా చేసి చంపి ఉండొచ్చని ఫిర్యాదులో తెలిపింది. ఈ క్రమంలో పాతిపెట్టిన శిశువు మృతదేహాన్ని తహశీల్దార్ బీకే శ్వేత సమక్షంలో బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. మనవరాలు మతాంతర ప్రేమ వివాహం చేసుకుందని శిశువు హత్య -
పావురాన్ని పట్టుకోబోయి బాలుడికి తీవ్ర గాయాలు
హుబ్లీ: పావురాన్ని పట్టుకొనేందుకు ప్రయత్నించిన బాలుడు అదుపు తప్పి కింద పడటంతో తీవ్రంగా గాయపడిన ఘటన కొప్పళలోని హమాలీ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. ఆ బాలుడిని అబ్బాస్ అలీ కుమారుడు అహ్మద్ హ్యారీస్(6)గా గుర్తించారు. తొలి అంతస్తులో బాలుడు ఆడుకుంటుండేవాడు. అయితే అక్కడికి వచ్చిన ఓ పావురాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించి తొలి అంతస్తు గ్రిల్ వద్ద నిలబడిన క్రమంలో అదుపు తప్పి ఆకస్మికంగా కింద పడ్డాడు. తక్షణమే తల్లిదండ్రులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడు భవనం పైనుంచి కిందకు పడే దృశ్యం సీసీ టీవీ కెమెరాలో నమోదైంది. తలకు తీవ్ర గాయం కావడంతో కొప్పళలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బాలుడికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు తల్లిదండ్రులు వివరించారు. విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతిహొసపేటె: నగరంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఒక యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. నగరంలోని 100 పడకల ఆస్పత్రికి వెళ్లే మార్గంలో స్థానిక కొత్త హరిప్రియ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో భవనంలో వెల్డింగ్ పనులు చేస్తున్న 18వ వార్డు చప్పరదహళ్లి నివాసి రిజ్వాన్(18) అనే యువకుడు వెల్డింగ్ చేస్తుండగా, అతని చేతిలో ఉన్న ఇనుప పైపు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగను తాకడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయమై ఎక్స్టెన్షన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు తదుపరి చర్యలు తీసుకున్నారు. హుడా ఛైర్మన్ హెచ్ఎన్ఎఫ్ ఇమాం మహ్మద్ నియాజీ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అన్ని కార్యాలయాల్లో కన్నడ భాషను వాడాలిబళ్లారిటౌన్: జిల్లాలోని అన్ని శాఖలు, సంఘ సంస్థలు, వాణిజ్య, నిగమ, మండళ్లలో తప్పనిసరిగా కన్నడ భాషలోనే వ్యవహరించాలని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ అధికారులకు సూచించారు. మంగళవారం నూతన జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కన్నడ జాగృతి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కన్నడ భాష అమలుపై జాగృతి సమితి చురుగ్గా పని చేయాలన్నారు. ఎప్పటికప్పుడు తమకు అధికారిక నివేదిక ఇవ్వాలని సూచించారు. నియమాలను ఉల్లంఘించిన సంస్థలు, ఆయా శాఖలపై చర్యలు తీసుకుంటామన్నారు. మహానగర పాలికె పరిధిలోని వివిధ స్థలాల్లో ప్రకటనలు, బ్యానర్లను కన్నడలోనే ఏర్పాటు చేయాలన్నారు. 60 శాతానికి పైగా కన్నడలో స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఉండాలని సూచించారు. పాలికె కమిషనర్ మంజునాథ్, కన్నడ సంస్కృతి శాఖ ఏడీ నాగరాజు, నిష్టిరుద్రప్ప, కన్నడ సంఘాల నాయకులు పాల్గొన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంరాయచూరు రూరల్: విద్యార్థులకు టెన్నిస్ క్రీడ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని రాయచూరు క్రీడా యువజన సేవా అధికారి వీరేష్ నాయక్ వెల్లడించారు. మంగళవారం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన టెన్నిస్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు బోధనకు తోడు బోధనేతర అంశాలపై దృష్టి సారించాలన్నారు. బాలుర విభాగంలో వ్యవసాయ కళాశాల, ఎన్ఈటీ ఫార్మసీ కళాశాల మొదటి స్థానం పొందగా, బాలికల విభాగంలో వ్యవసాయ కళాశాల, పూర్ణిమ కళాశాలలు రెండో స్థానం గెలుచుకున్నాయి. కళాశాల అధ్యాపకుడు నవీన్ లక్ష్మీనారాయణ, బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, వంశీ, వీరణ్ణలతో పాటు 150 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. కన్నడ సేవలు అపారంరాయచూరు రూరల్: రాష్ట్రంలో కన్నడ భాషకు గడినాడులో చేస్తున్న సేవలు అపారమని ప్రధాన అధ్యాపకుడు రమేష్ అరోలి అభిప్రాయ పడ్డారు. బుధవారం ఆకాశవాణి భవనంలో కవిగోష్టిని ప్రారంభించి మాట్లాడారు. కన్నడ భాష సంరక్షణకు కవితల ద్వారా ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు సాగాలన్నారు. గొరవర్, అమరేష్, వెంకటేష్లున్నారు. -
క్రిస్మస్కు చర్చిలు ముస్తాబు
సాక్షి బళ్లారి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పూజించి, ఆరాధించే ఏసుక్రీస్తు పుట్టిన రోజును పురస్కరించుకొని పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకకు నగరంలోని చర్చిలన్ని సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. నేడు గురువారం క్రిస్మస్ పర్వదిన వేడుక నేపథ్యంలో నగరంలోని సీఎస్ఐ, క్యాథలిక్ చర్చిలన్నింటినీ ముస్తాబు చేశారు. సీఎస్ఐ తెలుగు చర్చి, సీఎస్ఐ కన్నడ చర్చి, సీఎస్ఐ ఇంగ్లిష్ చర్చిలతో పాటు సెయింట్ ఆంథోని చర్చి, క్రైస్తవుల కింగ్, అలాగే స్వతంత్రంగా సుమారు 100 దాకా ఉన్న వివిధ చర్చిలన్ని క్రిస్మస్ వేడుకకు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలతో పాటు వివిధ రకాలుగా ముస్తాబు చేసి నగర వాసులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా బళ్లారికే తలమానికంగా ఉన్న విద్యానగర్లోని ఆరోగ్యమాత చర్చిని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ చర్చికి ఎంతో చారిత్రాత్మక నేపథ్యం, చరిత్ర కూడా ఉంది. సర్వాంగ సుందరంగా చర్చి పరిసరాలు క్రిస్మస్ పర్వదినం రోజునే కాకుండా ప్రతి రోజు కూడా ఈ చర్చికి పెద్ద సంఖ్యలో వచ్చి ప్రార్థనలు చేస్తారు. సువిశాలంగా, సర్వాంగ సుందరంగా నిర్మించిన ఆరోగ్యమాత చర్చిలో కాలు పెట్టిన వెంటనే అదో రకమైన పుణ్యక్షేత్రంగా ప్రతి ఒక్కరినీ కట్టిపడేసి ఆకట్టుకుంటుంది. ఏసుక్రీస్తు జననం నుంచి ఆయన పెరిగిన విధానం, శిలువ వేసిన దృశ్యాలు ఒక్కొక్క దానికి ఒక్కో ఆలయం తరహాలో అద్దాల మేడలో అద్భుతంగా విగ్రహాలు ఏర్పాటు చేసి వాటి కింద ఏసుక్రీస్తు ప్రస్థానానికి సంబంధించిన ఆధార లిఖితాలను పొందుపరచడంతో క్రిస్మస్ పర్వదినం నాడు ఆరోగ్యమాత చర్చి క్రైస్తవులకే కాక అన్ని కుల మతాల వారికి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. దీంతో ఈ చర్చికి క్రిస్మస్ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుండటంతో ఫాదర్లు భక్తులతో ప్రార్థనలు చేయించేందుకు అక్కడే ఉంటూ భక్తిపారవశ్యంతో చర్చిలో క్రిస్మస్ వేడుకలను జరపనున్నారు. బళ్లారి నగరానికే తలమానికం ఆరోగ్య మాత చర్చి నగరంలోని తెలుగు, కన్నడ, ఇంగ్లిష్ చర్చిలన్ని అలంకరణలతో కళకళ క్రిస్మస్కు మేరీమాత చర్చి సిద్ధం బళ్లారి రూరల్: క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్కు రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లాలకు పెద్ద చర్చిగా పేరుగాంచిన బళ్లారి మేరీమాత చర్చిలో బుధవారం అలంకరణలు దాదాపు పూర్తయ్యాయి. బళ్లారి పరిసర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు క్రిస్మస్కు చర్చికి వచ్చి కరుణామయుడిని దర్శించుకొని ప్రార్థనలు నిర్వహించడం అనాదిగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున చర్చి పెద్దలు ఏర్పాట్లు చేశారు. చర్చి ప్రాంగణంలోని యేసయ్య జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలతో కటౌట్లను ఏర్పాటు చేశారు. చర్చి ముందు బొమ్మలతో కూడిన బాల క్రీస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా నగరంలోని కోట ప్రాంతంలో తెలుగు చర్చిల్లో క్రిస్మస్ పర్వదిన ఆచరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. -
పని కల్పించలేదు.. అప్పు ఇవ్వలేదంటూ హత్య
మైసూరు: తనకు అప్పు ఇవ్వలేదు, పైగా చేసేందుకు పని కల్పించలేదనే అక్కసుతో ఒక వ్యక్తిపై యువకుడు దాడి చేసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పిరియాపట్టణ తాలూకా భోగనహళ్లి గ్రామంలో జరిగింది. భోగనహళ్లి గ్రామానికి చెందిన బీటీ స్వామి గౌడ (56)వద్దకు అదే గ్రామానికి చెందిన గోవింద అనే యువకుడు వచ్చి అప్పు అడిగాడు. అయితే తన వద్ద డబ్బు లేదని బీటీ స్వామిగౌడ చెప్పాడు. ఏదైనా పని ఇస్తే చేస్తానని గోవింద చెప్పాడు. ఇతరులకు పని ఇచ్చే స్థోమత తనకు లేదని గౌడ చెప్పాడంతో గోవింద ఆగ్రహానికి గురై బీటీస్వామిగౌడపై దాడి చేశాడు. ఘటనలో స్వామిగౌడ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పిరియూ పట్టణ పోలీసులు వచ్చి పరిశీలించారు. మృతదేహన్ని ఆస్పత్రికి తరలించారు. హతుడి అక్క కుమారుడు బీకే ప్రతాప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు గోవిందను అరెస్టు చేశారు. టెక్కీకి తేనె వల వేసి దోపిడీ ● ఇద్దరు మహాళలు సహా ఐదుగురి అరెస్ట్ యశవంతపుర: టెక్కీకి తేనె వల వేసి డబ్బుదోచుకొని దాడికి పాల్పడిన ఘటన ఇద్దరు మహిళలతోసహా ఐదుగురిని బెంగళూరు ఆర్ఆర్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. సుమలతా అలియాస్ అంజలి, అన్నపూర్ణేశ్వరినగరకు చెందిన హర్షిణి అలియాస్ స్వీటీ, జగదీశ్, లోకేశ్, మంజునాథ్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 10న టెలిగ్రాం ద్వారా టెక్కికీ ఒక అమ్మాయి పరిచయమైంది. ఇంటివద్దకు పిలిపించి రూ.20 వేలు లాక్కుంది. అనంతరం తన స్నేహితురాలిని పిలిపించి ఆమె ద్వారా మళ్లీ రూ.20 వేలు లాక్కుంది. మరో రూ.40వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా టెక్కీ నిరాకరించాడు. దీంతో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేసి సెల్ఫోన్, నగదు లాక్కున్నారు. బాధితుడు తప్పించుకొని 112కు ఫోన్ చేశాడు. హొయ్సళ పోలీసులు వచ్చి మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ అరెస్ట్ విషయాన్ని బుధవారం ప్రకటించారు. ప్రియుని మోజులో పడి కన్నబిడ్డ విక్రయం దొడ్డబళ్లాపురం: ప్రియుని మోజులో పడిపోయిన మహిళ తమ ఆనందానికి అడ్డు వస్తోందని భావించి కన్నబిడ్డను విక్రయించింది. ఈ సంఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు పట్టణంలో చోటుచేసుకుంది. ఐశ్వర్య అనే మహిళ తన భర్తతో విడిపోయి చంద్రప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఆమెకు అప్పటికే రెండేళ్ల కుమార్తె ఉంది. తమ ఆనందానికి కుమార్తె అడ్డుగా ఉందని భావించిన ఐశ్వర్య...కొప్పళకు చెందిన ఒకరికి బ్రోకర్ ద్వారా చిన్నారిని రూ.50 వేలకు విక్రయించింది. మూడు రోజులుగా ఐశ్వర్య కుమార్తె కనిపించకపోవడం, ఆమె ప్రవర్తనలో తేడా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఐశ్వర్యను విచారణ చేపట్టగా అసలు విషయం చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐశ్వర్యను అరె స్ట్ చేశారు. పరారీలో ఉన్న చంద్రప్ప, బ్రోకర్ల కోసం గాలిస్తున్నారు. అధికారులు చిన్నారిని రక్షించే పనిలో పడ్డారు. అక్రమంగా కబేళా.. ఇద్దరి అరెస్ట్ మైసూరు: తాలూకాలోని హుల్లహళ్లి జేఎస్ఎస్ కాలేజీ వెనుక ఓ షెడ్లో అక్రమంగా కబేళా నిర్వహిస్తూ గొడ్డు మాంసం విక్రయిస్తుండగా హుల్లహళ్లి ఎస్ఐ చేతన్ కుమార్ బుధవారం దాడి చేశారు. మహ్మద్, అయూబ్ఖాన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి 34 కేజీల గొడ్డు మాంసం, ఇనుప కొక్కెం, కత్తి, సతార్, తక్కెడను స్వాధీనపరచుకున్నారు. హెలిరైడ్తో కార్వార అందాల వీక్షణ యశవంతపుర: కరావళి ఉత్సవంలో భాగంగా పర్యటకశాఖ తంబి ఏవియేషన్ సంస్థచే హెలికాఫ్టర్ రైడ్ను బుధవారం ప్రారంభించింది. కార్వార లండన్ వంతెన సమీపంలోని మైదానంలో హెలి రైడ్ను ఎమ్మెల్యే సతీశ సైల్ ప్రారంభించారు. తొలుత ఆశానికేతన పాఠశాలకు చెందిన చెవుడు, మూగ చిన్నారులను హెలికాప్టర్లో ఎక్కించి విహారం చేయించారు. కాగా ప్రతి రైడ్ 7 నిముషాలపాటు కొనసాగుతుంది. కార్వార నగరం చుట్టుపక్కల అందాలను వీక్షించే ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ లక్ష్మీప్రియా, జెడ్పీ సీఇఓ దిలీష్శశిలు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే సతీశసైల్ నృత్యాలు చేస్తూ గాయకుడిలా పాటలు పాడి అందరిని అశ్చర్య పరిచారు. బెయిల్ కోసం హైకోర్టుకు భైరతి బనశంకరి: రౌడీషీటర్ బిక్లు శివ హత్య కేసులో పరారీలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే భైరతి బసవరాజ్ ముందస్తు బెయిలు పిటీషన్ను ప్రజా ప్రతినిధి కోర్టు తిరస్కరించడం తెలిసిందే. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం బుధవారం మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. హత్య కేసులో ఇప్పటికే సీఐడీ పోలీసులు 18 మందిని విచారించి 4236 పేజీల చార్జిషీట్ను దాఖలు చేశారు. ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్ మైసూరు: మైసూరు జిల్లా కేఆర్నగర పట్టణంలోని చీరహళ్లి మెయిన్ రోడ్డులో కారులో గంజాయి ఉంచి విక్రయిస్తున్నారనే సమాచారంతో కేఆర్నగర వలయ ఎకై ్సజ్ సీఐ వైఎస్ లోకేష్, ఎస్ఐ సీవీ రాఘవేంద్ర, ఎకై ్సజ్ బీఈ శివకుమార్ దాడి చేశారు. కొడగు జిల్లా మక్కందూరు పోస్ట్ రాజరాజేశ్వరినగర నివాసి వీ.మహమ్మద్ మిర్షద్(23), కుశాలనగర ఖలందర్ క్యాంప్ నివాసి ఎల్.పద్మనాభ(23)ను అరెస్ట్ చేసి 974 గ్రాముల విత్తన మిశ్రిత ఎండు గంజాయి, కారును స్వాధీనపరచుకున్నారు. -
సుభిక్ష దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం
బళ్లారిటౌన్: విద్య అనేది ఒక నిరంతర యాత్ర, అమూల్యమైన సంపద అని, విద్యార్థులు, యువత జ్ఞానాన్ని పెంపొందించుకొని సుభిక్ష దేశ నిర్మాణానికి ముందడుగు వేయాలని రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ పేర్కొన్నారు. బుధవారం బళ్లారిలోని సిరుగుప్ప రోడ్డులో మౌంట్ యూ క్యాంపస్ కిష్కింధ యూనివర్సిటీలో చేపట్టిన ప్రథమ ఘటికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకొని ఉజ్వల భవిష్యత్తును రూపొందించుకోవాలన్నారు. విద్య కేవలం పదవి కోసం పరిమితం కారాదని, ఒక జ్ఞాన సంపద కావాలన్నారు. నేర్చుకున్న విద్యను దేశ అభివృద్ధి కోసం వినియోగించాలన్నారు. భౌతికంగా పెరగడం కాదు. జీవితంలో మానవతా విలువలను కూడా అలవరుచుకోవాలన్నారు. భారతీయ పరంపర, సంస్కృతి, సాంప్రదాయాలను విడవరాదన్నారు. సవాల్గా మారిన విద్యా సంస్థల స్థాపన కార్యక్రమంలో ఉన్నత విద్యా శాఖ మంత్రి ఎంసీ సుధాకర్ పాల్గొని మాట్లాడుతూ కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో విద్యా సంస్థలను స్థాపించడం సవాల్గా మారిందన్నారు. ఇలాంటి సమయంలో యూనివర్సిటీని ప్రారంభించి రెండేళ్లలో ఘటికోత్సవం ప్రారంభించడం శ్లాఘనీయం అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29 ప్రైవేట్ యూనివర్సిటీలు పని చేస్తున్నాయన్నారు. యూనివర్సిటీలు కేవలం విద్యార్థుల దాఖలాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా నాణ్యమైన విద్యను ఇవ్వాలన్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వెలికి తీయాలని హితవు పలికారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతం చాలా వెనుకబడి ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే కలబుర్గిలో ఓ ప్రైవేట్ యూనివర్సిటీ ఉండగా రెండోది బళ్లారి జిల్లాలో స్థాపించడం అభినందనీయమన్నారు. మంచి విద్యాభ్యాసానికి అనుకూలం ఈ యూనివర్సిటీ వల్ల ఈ ప్రాంతంలోని విద్యార్థులకు మంచి విద్యను పొందేందుకు అనుకూలం అయిందన్నారు. కార్యక్రమంలో బళ్లారి సువర్ణగిరి విరక్తమఠం సిద్ధలింగ మహాస్వామికి డాక్టరేట్ పదవి అందించి గౌరవించారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రమాణ పత్రాలు అందజేశారు. బెళగావి ఎంపీ జగదీశ్ శెట్టర్, సిరుగుప్ప ఎమ్మెల్యే బీఎం.నాగరాజు, సింధనూరు ఎమ్మెల్యే హంపనగౌడ, టీఈహెచ్ఆర్డీ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్జేవీ.మహిపాల్, కిష్కింధ యూనివర్సిటీ కులాధిపతి యశ్వంత్ భూపాల్, సహాయక కులాధిపతి వై.జే.పృథ్వీరాజ్, వైస్ ఛాన్సలర్ నాగభూషణ్, యూ.ఈరణ్ణ, నేతలు రాజు, అమరేశయ్య తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ -
లంచగొండి అధికారి మాకొద్దు
పావగడ: ప్రతి పనికి లంచం కావాలని డిమాండ్ చేస్తూ కింది స్థాయి ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించే స్థానిక తాలూకా పంచాయతీ సమితి ఈఓ బీకే ఉత్తమ కుమార్ ఏమంత ఉత్తముడు కాదని, వెంటనే అతన్ని బదిలీ చేయాలని స్థానిక గ్రామ పంచాయతీల పిడిఓలు, కార్యదర్శులు ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్ను కలిసి తమ బాధలను ఏకరువు పెట్టారు. ప్రతి నెలా చెప్పినంత ముడుపులను ఉత్తమకుమార్కు అందించాలని, లేకుంటే అభివృద్ధి పనుల్లో తగాదాలు సృష్టించి నోటీసులు అందిస్తానని బెదిరిస్తాడని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుంటే అభివృద్ధి పనులకు అడ్డుపడతాడని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు చన్నగిరి లో పనిచేసి, అవినీతి ఆరోపణల శిక్షతో బదిలీ పై పావగడ కు వచ్చాడని తెలిపారు. తక్షణమే అతడిని బదిలీ చేయాలని కోరారు. -
మంచు కప్పేసి.. మృత్యువు కాటేసి
చలిగాలులతో కూడిన మంచు ప్రమాదకరంగా మారుతోంది. జాతీయ రహదారిపై పొగమంచు కమ్మేయడంతో వాహన ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత 23 రోజుల్లో దాదాపు 75 మంది ప్రమాదాలకు గురికాగా 33 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గాయపడిన వారు మరెందరో ఉన్నారు. ఈ ఏడాది అత్యధికంగా మంచు కురుస్తోంది. హైదరాబాద్ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలు, పెద్ద వాహనాలు అధికంగా రాకపోకలు సాగిస్తున్నాయి. మంచు కప్పేయడంతో డ్రైవర్లు ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. – చిక్కబళ్లాపురం -
చెరువుల్లో చెత్త.. యంత్రంతో తొలగింపు
మడివాళ చెరువులో శుద్ధీకరణ యంత్రంబనశంకరి: బెంగళూరు చెరువుల నగరంగా పేరుపొందింది. అయితే అనేక చెరువులు నేడు కబ్జాల వల్ల అదృశ్యమయ్యాయి. ఉన్న చెరువులేమో వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మడివాళ చెరువులో గుర్రపుడెక్క, నాచు తొలగించి శుద్ధీకరణ చేసే యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇతర చెరువుల్లో కూడా ఉపయోగిస్తామని జీబీఏ కమిషనర్ మహేశ్వర్రావ్ తెలిపారు. బుధవారం మడివాళ చెరువులో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నగర చెరువులకు జలకళ తీసుకురావాలనే కొత్తగా ఈ అత్యాధునిక యంత్రాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. దీని ఖరీదు రూ.1.28 కోట్లని, రోజుకు 5 టన్నులు వరకు చెత్తను తొలగిస్తుందని చెప్పారు. జీపీఎస్ వ్యవస్థ ద్వారా నిర్దేశిత ప్రాంతంలో పనిచేయించవచ్చని చెప్పారు. మడివాళ చెరువు ను రూ.15 కోట్లతో సుందరీకరిస్తామని తెలిపారు. నడక దారి, కాలువలు, పిల్లల పార్కు, పడవ విహారం, ఆటవస్తువులు తదితరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెరువుల్లోకి చెత్త వేయరాదని నగరవాసులను కోరారు. బెంగళూరులో స్వచ్ఛతకు నాంది -
దైవదర్శనానికి వెళ్లొస్తుండగా..
సాక్షి, బళ్లారి: జిల్లాలోని సిరుగుప్ప తాలూకా తెక్కలకోట సమీపంలోని దేవినగర్ వద్ద జాతీయ రహదారి–150ఏలో దట్టమైన పొగమంచు ఆవహించటంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వంతెన గోడను బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. సిరుగుప్పలో నివాసం ఉంటున్న తాలూకాలోని నిట్టూరు గ్రామ పంచాయతీ సభ్యుడు ప్రసాదరావు కుటుంబ సభ్యులతో కలిసి కారులో తమిళనాడులోని దేవాలయానికి దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రసాదరావు(75), విజయ(70), సంధ్య(35) అనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పద్మ(70), బ్రహ్మేశ్వరరావు(45)లకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమాచారం తెలిసిన వెంటనే తెక్కలకోట పోలీసులు హుటాహుటిన చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను కారులో నుంచి వెలికి తీశారు. గాయపడిన వారిని బళ్లారి ట్రామాకేర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఘటనపై తెక్కలకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వంతెనకు కారు ఢీకొని ముగ్గురు మృతి సిరుగుప్ప తాలూకాలో ఘోరం మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు -
అసంఘటిత కార్మికులకు ఈఎస్ఐ సేవలు
రాయచూరు రూరల్: కార్మికులకు తోడు అసంఘటిత కార్మికులకు ఈఎస్ఐ సేవలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర కార్మిక, ఉద్యోగ శాఖ మంత్రి శోభ కరంద్లాజె వెల్లడించారు. కలబుర్గి ఈఎస్ఐ ఆడిటోరియంలో జరిగిన కార్య క్రమంలో ఆమె మాట్లాడుతూ కలబుర్గిలో 560 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ఉందని, ఐపీసీజీ, జీహెచ్ఎస్ పథకాలు విస్తరించామన్నారు. దేశంలో పది ఈఎస్సీ కళాశాలలు ఉన్నాయని, 27 చట్టాలను రద్దుచేసి నాలుగు కార్మిక చట్టాలను రూపొందించామని వివరించారు. సభలో డీన్ క్షీరసాగర్, కలబుర్గి గ్రామీణ శాసనసభ్యుడు బసవరాజ్, విధాన పరిషత్ సభ్యుడు బిజి.పాటిల్, అమర్నాథ్ పాటిల్, దత్తాత్రేయ పాటిల్, అధికారులు కడ్డిమట్, పద్మ పద్మజ, యువరాజ్, సుబ్రహ్మణ్యం, శివరాజ్పాటిల్, మహదేవ్ పాల్గొన్నారు. -
ఆటో వీలింగ్.. ఒకరి అరెస్ట్
దొడ్డబళ్లాపురం: ఆటోలో వీలింగ్ చేస్తున్న కేఆర్ పురం నివాసి ఉదయ్ విక్రమ్(28) అనే వ్యక్తిని కేఆర్ పుర ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతను ప్రమాదకంగా ఫీట్లు చేస్తూ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో అతడ్ని గుర్తించి అరెస్టు చేశారు. అసోం మహిళ అదృశ్యం శివమొగ్గ: అసోంకు చెందిన మహిళ అదృశ్యమైనట్లు భద్రావతిలోని హళేనగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు అందింది. అసోం నివాసి సమీరున్నీసా(28) హొళెహొన్నూరు రోడ్డులోని అమీర్జాన్ కాలనీలోని హైదర్ అలీ అనే వ్యక్తి ఔట్హౌస్లో ఉంటూ పాచి పని చేస్తుండేది. అయితే ఆమె ఈనెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈమె ఆచూకీ తెలిసిన వారు భద్రావతి హళేనగర పోలీసు స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసు శాఖ ఓ ప్రకటనలో కోరింది. శాంటాక్లాజ్ వేషధారణ బనశంకరి: సిలికాన్సిటీ బెంగళూరులో క్రిస్మస్ సందడి జోరందుకుంది. అంజనానగరలో బ్రిటన్ ఇంటర్నేషనల్ స్కూల్లో బుధవారం చిన్నారులు శాంటాక్లాజ్ వేషధారణతో సందడి చేశారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకొని ఆనందంగా గడిపారు. దర్శన్ భార్యకు అశ్లీల సందేశాలు యశవంతపుర: నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మికి అశ్లీల సందేశాలు రావటంతో ఆమె బెంగళూరు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల సుదీప్–దర్శన్ అభిమానుల మధ్య వార్ నడుస్తుంది. అయితే వివాదాలకు తెర పడుతున్న తరుణంలో విజయలక్ష్మికి కొంతమంది అశ్లీల సందేశాలు పంపారు. దీంతో ఆమె బెంగళూరు నగర పోలీసు కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. తన ఖాతాకు వచ్చిన సందేశాలను అందజేశారు. కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు. అశ్లీల సందేశాలు పెట్టేవారికి తగిన గుణపాఠం నేర్పుతానంటూ విజయలక్ష్మి తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు.డ్రగ్స్ దందా.. నలుగురి అరెస్టు దొడ్డబళ్లాపురం: డ్రగ్స్ దందాపై దావణగెరెలోని విద్యానగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరంలోని జేహెచ్ పటేల్ కాలనీలోని పార్క్లో గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో దాడి చేశారు. రాజస్థాన్కు చెందిన రామ్ స్వరూప్(33), ధోలారామ్(36), దేవ్ కిషన్(35), దావణగెరె తాలూకా శామనూరు గ్రామం నివాసి వేదమూర్తి(53)ని అరెస్ట్ చేశారు. వేదమూర్తి స్థానిక కాంగ్రెస్ నేత కావడం గమనార్హం. నిందితులనుంచి రూ.10 లక్షల విలువైన 90గ్రాముల ఎండీఎం, 200 గ్రాముల ఓపీఎం డ్రగ్స్, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. పొలాల్లోనే సేంద్రియ ఎరువు తయారీ గౌరిబిదనూరు: నగరసభ అందించే పొడి చెత్తతో రైతులు తమ పొలాల్లోనే ఎరువులను తయారు చేసుకోవచ్చని నగరసభ పరిసర ఇంజనీర్ శివశంకర్ తెలిపారు. పొడిచెత్త నిర్వహణపై తాలూకాలోని హోసూరు హోబళీ కదిరేనహళ్లిలో నగరసభ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగరసభ సేకరించిన చెత్తను పొలాల్లో తవ్విన గుంతల్లో వేస్తారన్నారు. దానిని మట్టితో కప్పి పెడతారన్నారు. మూడు నెలల అనంతరం అది సేంద్రియ ఎరువుగా రూపాంతరం చెందుతుందన్నారు. దీనివల్ల రైతులకు ఎరువుల ఖర్చు పూర్తిగా తగ్గుతుందన్నారు. అధికారులు పొలాల వద్దకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. హెల్త్ ఇన్స్పెక్టర్ నవీన్, సణ్ణమీర్ రైతులు పాల్గొన్నారు. -
29న జిల్లా వార్షిక రైతు సమావేశం
హొసపేటె: రైతుల దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 29న ఉదయం 10.30 గంటలకు విజయనగర జిల్లా 3వ వార్షిక రైతు సమావేశం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతుందని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సీఏ.గాళెప్ప తెలిపారు. ఆయన స్థానిక ప్రెస్హౌస్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు సమావేశంలో కొట్టూరు స్వామి సంస్థాన మఠానికి చెందిన జగద్గురు కొట్టూరు బసవలింగ మహాస్వామి, ఒప్పత్తేశ్వర మఠానికి చెందిన నిరంజన్ ప్రభుదేశిక మహాస్వామి పాల్గొంటారన్నారు. ఈ సమావేశాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ప్రారంభిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ మేటి ఊరేగింపును జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. -
విద్యుత్ సాంకేతిక శిక్షణ ప్రారంభం
బళ్లారిఅర్బన్: సండూరు తాలూకా ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిందాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త విద్యుత్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. నైపుణ్య అభివృద్ధే ధ్యేయంగా 120 మంది యువకులకు విద్యుత్ వైరింగ్, భద్రతా చర్యలు, పరికరాల వాడకంపై అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను బోధిస్తారు. శిక్షణ తర్వాత ఉద్యోగ కల్పనకు కూడా అన్ని అండదండలను జిందాల్ సంస్థ అందించనుంది. ఎంపీ తుకారాం మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తాను ఎంతో పాటు పడ్డానన్నారు. తాను చేసిన విజ్ఞప్తి మేరకు జిందాల్ ఫౌండేషన్ చైర్పర్సన్ సంగీత నేతృత్వంలో పనులు జరిగాయన్నారు. ఐటీఐ, డిగ్రీ కళాశాల బోధనలను గ్రామీణ విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. ప్రముఖులు పెద్దన్న బీదల, మనిభూషన్ సింగ్, శ్రీకాంత్ హెగ్డే, నాగనగౌడలతో పాటు శ్రేష్ట, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్బాబు, ఇతర సిబ్బందితో పాటు గ్రామ వికాస సొసైటీ డైరెక్టర్ సచిన్, 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. -
చెరువులోకి కారు బోల్తా, ఒకరు మృతి
శివమొగ్గ: కారు చెరువులోకి బోల్తా పడటంతో ఒకరు మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. బుధవారం ఉదయం జిల్లాలోని శికారిపుర తాలూకా ఆనవట్టి సమీపంలో కనెకొప్ప హొసూరు వద్ద జరిగింది. వివరాలు.. మృతుడిని శికారిపుర తాలూకా పునేదహళ్లి నివాసి నవీన్ (21)గా గుర్తించారు. తెల్లవారుజామున 3.20 గంటలకు శికారిపుర నుంచి ఆనవట్టి వైపునకు ఇకో కారులో నలుగురు బయలుదేరగా కనెకొప్ప హొసూరు రోడ్డు మలుపు వద్ద చెరువులోకి పల్టీలు కొట్టింది. నవీన్ గాయాలతో చనిపోగా, రామచంద్ర అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని కోసం గాలింపు జరుగుతోంది. రుద్రేశ్, మంజునాథ్ అనే ఇద్దరు క్షేమంగా తప్పించుకున్నారు. బాల్య వివాహానికి బ్రేక్ మైసూరు: నగరంలోని షబ్బీర్నగర 2వ అంగన్వాడీ కేంద్రం పరిధిలోని ఏఎం ఫంక్షన్ హాల్లో జరుగుతున్న మైనర్ బాలిక వివాహాన్ని బుధవారం మహిళా శిశు సంక్షేమ, పోలీసు అధికారులు అడ్డుకున్నారు. అక్కడ బాలికకు పెళ్లి చేస్తున్నారని అధికారులకు 1098 సహాయవాణి ద్వారా సమాచారం అందింది. వెంటనే అధికారులు వెళ్లి నిలుపుదల చేశారు. ప్రస్తుతం బాలిక వయస్సు 17 ఏళ్లు కాగా పెళ్లికి 18 ఏళ్లు నిండి ఉండాలి అని ఇరువర్గాలకు వివరించారు. 18 ఏళ్లు నిండేవరకు పెళ్లి చేయబోమని తల్లిదండ్రుల నుంచి హామీపత్రం రాయించుకున్నారు. అధికారులు కే.సోమయ్య, ఎస్జీ హరీష్, జయశ్రీ అంగడి, ఎస్ఐ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళపై పెట్రోలు పోసి నిప్పు దొడ్డబళ్లాపురం: కుమార్తెతో వివాహం జరిపించలేదనే అక్కసుతో ఆమె తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేశాడో కిరాతకుడు. ఈ సంఘటన బెంగళూరు బసవేశ్వరనగరలోని భోవి కాలనీలో జరిగింది. ముత్తు అనే యువకుడు గీత అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేశాడు. బాధితురాలు గీత స్థానికంగా కిరాణా అంగడిని నడుపుతోంది. పక్కనే ముత్తు కూడా టీస్టాల్ పెట్టుకున్నాడు. ఈక్రమంలో గీత కుమార్తైపె కన్నేసిన ముత్తు.. తనకిచ్చి వివాహం చేయాలని పలుమార్లు కోరాడు. అయితే గీత నిరాకరించింది. కక్ష పెంచుకున్న ముత్తు గీత మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడ్డ గీతను స్థానికులు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ముత్తు పరారీలో ఉన్నాడు. బసవేశ్వరనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమించలేదని యువతిపై దాడి బనశంకరి: ఆన్లైన్లో పరిచయమైన యువకుడు ప్రేమించాలని వేధిస్తూ యువతిపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవీన్కుమార్ అనే నిందితున్ని బుధవారం అరెస్ట్ చేశామని జ్ఞానభారతి పోలీసులు తెలిపారు. వివరాలు.. టెలికాలర్గా పనిచేస్తున్న యువతికి 2024లో ఇన్స్టా ద్వారా నవీన్కుమార్ పరిచయమయ్యాడు. అప్పుడప్పుడు కాల్స్, మెసేజ్ చేస్తున్న నవీన్కుమార్ ప్రేమించాలని ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె అతన్ని తిరస్కరించింది. యువతి గత సోమవారం మధ్యాహ్నం పీజీ హాస్టల్ వద్ద నిలబడి ఉండగా కారులో వచ్చిన నవీన్కుమార్ గొడవపడి దాడి చేసి, యువతి బ్యాగ్ను లాక్కుని ఉడాయించాడు. దాడి దృశ్యాలు పీజీ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. 2 లగ్జరీ కార్లు దగ్ధం దొడ్డబళ్లాపురం: ఇంటి ముందు నిలిపిన లగ్జరీ కార్లు కాలిపోయిన సంఘటన బెంగళూరు జేపీ నగరలో జరిగింది. వడ్డరపాళ్యలో ప్రైవేటు స్కూలు యజమాని మంజునాథ్ రోజూలాగే ఇంటి ముందు బీఎండబ్ల్యూ కారు, మరో ఖరీదైన కారును నిలిపాడు. బుధవారం తెల్లవారుజామున కార్లలో మంటలు చెలరేగి కాలిపోయాయి. అగ్నికీలలు వ్యాపించి అక్కడే నిల్వ ఉంచిన టేక్ వుడ్ కూడా భారీ మొత్తంలో బూడిదైంది. ఫైర్ సిబ్బంది సమాచారం తెలుసుకుని వచ్చేసరికి అన్నీ ఆహుతయ్యాయి. కార్లలోనే మంటలు పుట్టాయా, లేక ఆకతాయిల పనా? అనేది తేలాల్సి ఉంది. కోణనకుంట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కళాత్మకంగా ప్రముఖ చర్చిలు
బనశంకరి: క్రిస్మస్ ఆచరణకు చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తిగీతాలతో చర్చిల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. కాగా క్రిస్మస్ ప్రార్థనలకు రాష్ట్రంలోని అనేక చారిత్రాత్మకమైన చర్చిలు ఖ్యాతిఘడించాయి. బెంగళూరు, మైసూరు, మంగళూరు, ఉడుపిలో వందల సంవత్సరాల నాటి ప్రముఖ చర్చిలు వాస్తుశిల్పి, ధార్మిక మహత్యంతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. బెంగళూరు నగరంలో బెంగళూరు నగరంలో క్రిస్మస్ వేడుకలను అత్యంత వైభవంగా ఆచరిస్తారు. ఇక్కడ చర్చిలను విభిన్నరకాల దీపాలతో అలంకరిస్తారు. సెయింట్మేరీస్ బసిలికా చర్చి శివాజీనగరలో ఉంది. గోదిక్ శైలి వాస్తుశిల్పానికి పేరుగాంచింది. బెంగళూరు వివేకనగరలోని ఇన్ఫ్యాంట్ జీసస్ చర్చి క్రైస్తవులకు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రాస్థలాల్లో ఒకటి. బెంగళూరు ఎంజీ రోడ్డులోని సెయింట్ మార్క్ కెదడ్రల్చర్చ్ ఇంగ్లాండ్లోని సెయింట్పాల్స్ కెదడ్రల్ చర్చి తరహాలో ఉంటుంది. బెంగళూరుసిటీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉన్న హడ్సన్మెమోరియల్చర్చ్ అద్భుతమైన వాస్తుశిల్పితో ఆకట్టుకుంటుంది. మైసూరులో... సంతపిలోమినా చర్చ్. ఇది మైసూరులో అత్యంత ప్రముఖ చర్చి మాత్రమే కాకుండా భారత్లో అతి ఎతైన చర్చిల్లో ఒకటిగా ఉంది. దీనిని నవ–గోదిక్ శైలిలో నిర్మించారు. మంగళూరు, ఉడుపిలో మంగళూరులో సంతఅలోసియస్చాపెల్ చర్చి గోడలపై అద్భుత చిత్రకళ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చర్చి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. హంపనకట్టిలో మిలాగ్రెస్ చర్చ్ ఇది అత్యంత పురాతన చర్చిల్లో ఒకటి. ఉడుపి జిల్లా కార్కళ వద్ద సంతలారెన్స్శ్రైన్ చర్చ్ ఉంది. ఇది వార్షిక జాతరకు పేరుగాంచింది. చెక్కు చెదరని వందల ఏళ్లనాటి చర్చిలు క్రిస్మస్కు ప్రత్యేక ప్రార్థనలతో గుర్తింపుశెట్టిహళ్లి రోసరి చర్చి హసనలోని శెట్టిహళ్లి రోసరిచర్చ్ను నీటమునిగిపోయే చర్చి అని కూడా పిలుస్తారు. ఇది వర్షాకాలంలో మునిగిపోతుంది. వేసవిలో మాత్రం శెట్టిహళ్లిచర్చిని చూడటం సాధ్యమవుతుంది. ముడిపు, పనేర్లోని చర్చిలు చాలా ప్రసిద్ధి చెందాయి. -
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ మృత్యువాత
మండ్య: బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మరణించారు. ఈ ఘటన మద్దూరు తాలూకా యరగనహళ్లి గ్రామంలో జరిగింది. మండ్య తాలూకా కొత్తత్తి హోబళి హుల్కెరె గ్రామానికి చెందిన మంచేగౌడ కుమారుడు శంకర్ (43), జోగయ్య కుమారుడు వీరేంద్ర (46)లు తోరెశెట్టి గ్రామంలో బంధువు అంత్యక్రియలకు హాజరయ్యారు. తిరిగి బైక్పై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. రక్తస్రావంతో ఇద్దరు అక్కడిక్కడే పడి మరణించారు. కేసు దర్యాప్తులో ఉంది.మృతులు వీరే -
వైద్యాధికారులపై చర్యలేవీ?
రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్) వైద్యాధికారులు, డీహెచ్ఓలపై చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్త అంబాజీ డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిమ్స్ వైద్యాధికారులు, డీహెచ్ఓ, కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వాహనం డ్రైవర్ అబ్దుల్ మతిన్తో కలిసి శవాలను తరలించడానికి రూ. 5 వేల దాకా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రద్ధాంజలి వాహనం డ్రైవర్ అబ్దుల్ మతిన్ కాంట్రాక్ట్ పద్ధతి నాలుగు నెలల క్రితం ముగిసినా అతనిని అలాగే విధుల్లో కొనసాగిస్తున్నారని, అతనిని విధుల నుంచి తొలగించాలన్నారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశారు. బంగ్లాదేశ్లో హిందువుల హత్యాకాండకు నిరసనరాయచూరు రూరల్: బంగ్లాదేశ్లో హిందువులను హత్య చేయడం తగదని విశ్వ హిందూ పరిషత్, భజరంగదళ్ తీవ్రంగా ఖండించాయి. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు రవికృష్ణ మాట్లాడారు. బంగ్లాదేశ్లో గతంలో హిందువులను సామూహికంగా బహిష్కరణ చేయడంతో పాటు నరమేధానికి పాల్పడ్డారన్నారు. యువకుడిని చెట్టుకు కట్టేసి ఉరి వేసి హత్య చేసి ప్రజల ముందు దహనం చేయడం హేయమైన కృత్యమన్నారు. రెండు నిమిషాల పాటు మౌనం వహించి సంతాపం వ్యక్తం చేశారు. మంత్రాలయంలో నటుడు రిషబ్ శెట్టి సందడి రాయచూరు రూరల్ : మంత్రాలయాన్ని బుధవారం కన్నడ సినీ నటుడు రిషబ్ శెట్టి సందర్శించారు. రాఘవేంద్ర స్వామి మఠంలో రిషబ్ శెట్టి దంపతులు రాఘవేంద్ర స్వామి మూల విరాట్కు ఊంజల్ సేవ చేశారు. అనంతరం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ వారిద్దరిని సన్మానించారు. కాగా భక్తుల సందడి మధ్య మంత్రాలయంలో గజ వాహన రథోత్సవం నిర్వహించారు. ఘనంగా రైతు దినోత్సవం హొసపేటె: నగరంలోని గాంధీ చౌక్ సమీపంలో ప్రొఫెసర్ నంజుండప్ప వర్గం రైతు దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని రైతులు మండిపడ్డారు. చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని, పంటలకు మద్దతు ధర ప్రకటించాలని తదితర డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారు. రైతు సంఘం నేత జడియప్ప తదితరులు పాల్గొన్నారు. జిల్లాధికారి ఆకస్మిక తనిఖీ రాయచూరు రూరల్: జిల్లాధికారి నితీష్ రాయచూరులో ఆకిస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరం లోని దత్తు స్వీకార కేంద్రం, బాల, బాలికల మందిరాలు(రిమాండ్ హోం), ఆశాదీప మూగ, బధిర పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. సకాలంలో పౌష్టికాహారం, వైద్య సౌకర్యాలకు తోడు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. కుమార్, శ్రీదేవి, కిరిలింగప్ప, రమేష్ పాల్గొన్నారు. 28న విశ్వ పాత్రికేయుల దినోత్సవంరాయచూరు రూరల్: ఈ నెల 28న ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం ఏర్పాటు చేసినట్లు రిపోర్టర్స్ గిల్డ్ అధ్యక్షుడు విజయ్జాగటకల్ పేర్కొన్నారు. స్థానిక పాత్రికేయుల భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, రాయచూరు లోక్సభ, శాసనసభ, విధానపరిషత్ సభ్యులు, జిల్లా అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, ఎస్పీ పాల్గొంటారని తెలిపారు. రఘునాథరెడ్డికి జీవమాన సాధన అవార్డు, నలుగురికి సామాన్య అవార్డులు అందజేయనున్నారు. వందేమాతర గీతాలాపన రాయచూరు రూరల్: వందేమాతర గీతానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా బుధవారం దేవదుర్గలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముక్తకంఠంతో వందేమాతర గీతాన్ని పాడారు. ఉప తహసీల్దార్ భీమరావ్, సిద్ధయ్య స్వామి, బసవరాజ్, హంపయ్య, సుభాష్ చంద్ర, అమీర్, బందే నవాజ్, గంగమ్మ, లక్ష్మణ్, రాజశేఖర్, నరసింగరావ్లున్నారు. -
ఏసయ్య ఉదయం.. భక్తజన సంబరం
బుధవారం రాత్రి శివాజీనగర సెయింట్ మేరీస్ చర్చిలో పండుగ శోభకల్వరి చర్చిలో కేక్ కటింగ్ వేడుక శివాజీనగర: మానవాళి పాప విమోచనార్థం, లోక కళ్యాణార్థమై భువికి ఏతెంచిన ఏసుక్రీస్తును స్మరిస్తూ క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో క్రిస్మస్కు సంసిద్ధమయ్యారు. గురువారం పండుగ కాగా, బుధవారం సాయంత్రం నుంచే అన్ని చర్చిలలో ప్రార్థనలు మొదలయ్యాయి. రంగురంగుల విద్యుద్దీప తోరణాలతో రమణీయంగా చర్చిలు అలరారుతున్నాయి. బాల ఏసు జన్మవృత్తాంత పందిర్లు వెలిశాయి. బెంగళూరు శివాజీనగరలోని ప్రసిద్ధ సెయింట్ మేరీస్ బసిలికా చర్చిలో మత గురువుల ఆధ్వర్యంలో విశేష ప్రార్థనలు జరిగాయి. అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. కల్వరి చర్చిలో సంబరాలు మరియమ్మనహళ్ళి కర్ణాటక కల్వరి చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి. చర్చీ పాస్టర్ రెవరెండ్ ఎం.జక్కయ్య ఏసుక్రీస్తు జన్మ విశేషాలను పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆధారంగా భక్తులకు ఉద్బోధించారు. అంధకారంలో మగ్గుతున్న మానవులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు దైవకుమారుడైన ఏసుక్రీస్తు ప్రభువులవారు జన్మించారని తెలిపారు. ఈ సందర్భంగా భక్తి గీతాలాపన, నృత్య వేడుకలు, కేక్ కటింగ్ నిర్వహించారు. క్రిస్మస్కు సంసిద్ధమైన చర్చిలు సాయంత్రం నుంచి విశేష ప్రార్థనలు -
వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనకు భారీ ఏర్పాట్లు
బళ్లారి అర్బన్: ఎస్పీ సర్కిల్లో వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన వేడుకకు నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి సారధ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. పలువురు వాల్మీకి ప్రముఖులు మాట్లాడుతూ ఈ నెల 25న బళ్లారి నగరానికి కొత్త వాల్మీకి విగ్రహం విచ్చేయనుందన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు కోటె ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి వాల్మీకి సర్కిల్ వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విగ్రహానికి వైభవంగా అలంకరణ, వివిధ వాయిద్య, సంగీత, కళా బృందాలతో పూర్ణ కుంభ కలశాలతో 1008 మంది ముత్తైదువులతో భారీగా పూజలు నెరవేర్చనున్నారు. వేలాది మంది పాల్గొనే అవకాశం ఉన్నందున బుధవారం నుంచే సర్కిల్లో హోమ, హవన కార్యక్రమాలను జరిపారు. కాగా రాజనహళ్లి వాల్మీకి పీఠాధిపతి ప్రసన్నానందపురి దివ్య సాన్నిధ్యంలో కార్యక్రమం నెరవేరనుంది. కార్యక్రమంలో మంత్రులు సతీష్ జార్కిహోళి, జమీర్ అహ్మద్, మాజీ మంత్రులు బీ.నాగేంద్ర, కేఎం.రాజన్నలతో పాటు ప్రముఖులు డాక్టర్ సయ్యద్ హుసేన్, కంప్లి ఎమ్మెల్యే గణేష్ పాల్గొననున్నారు. గత మూడు రోజులుగా ఎమ్మెల్యే వాల్మీకి సర్కిల్లో అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. -
కెంపేగౌడ ఒక్కలిగర సంఘం ఆందోళన..
చింతామణి: పట్టణంలోని అశ్విని లే అవుట్లో ఇళ్లు కట్టుకుంటున్న తమను కొందరు బెదిరిస్తున్నారని, విచారించి న్యాయం చేయాలని యజమాని జయరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెంపేగౌడ ఒక్కలిగర సంఘం నాయకులు, తదితరులతో కలిసి జయరామిరెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించారు. జయరామిరెడ్డి మాట్లాడుతూ సర్వే నెం:146/1, 146/2, 146/3లో 12 గుంటల భూమిని కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకుంటున్నామని తెలిపారు. లావణ్య, శ్రీరామ నుంచి చట్ట ప్రకారం తాము భూమి కొనుగోలు చేశామన్నారు. అయితే వెంకటగిరికోట ప్రాంతానికి చెందిన వెంకటరమణప్ప, నరసింహ, మునెయ్య చిక్కనరసింహ, శ్రీనివాస్, మరో పదిమందితో వచ్చి భూమిలో ఇల్లు కట్టవద్దంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని సీఐ విజయకుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రఘునాథరెడ్డి, రాజారెడ్డి, స్కూల్ సుబ్బారెడ్డి, ఊలవాడిబాబు, తదితరులు పాల్గొన్నారు. -
సిద్దుకు మద్దతుగా మైసూరులో సభ
యాత్రా ఫలం ఏమిటో అని అంతటా ఉత్కంఠ శివాజీనగర: ఎడతెగని టీవీ సీరియల్ మాదిరిగా ముఖ్యమంత్రి మార్పిడి తతంగం కొనసాగుతోంది. హైకమాండ్ నేతలు ఒకమాట, సీఎం సిద్దరామయ్య మరో మాట చెబుతూ ఉంటే, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారనే చెప్పాలి. సీఎం మార్పిడి ఏదీ లేదనేలా సిద్దరామయ్య, హైకమాండ్ ప్రకటనలు ఉంటున్నాయి. మాట్లాడాలని వెళితే.. ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. హైకమాండ్ నాయకులు కన్నడ రాజకీయంలో జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రముఖ నాయకులు శివకుమార్ భేటీకి సమయాన్ని ఇవ్వకపోవడం పెద్ద చర్చకు కారణమైంది. మంగళవారం నుంచి హస్తినాపురిలో ఉంటున్న శివకుమార్ సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ఇతర హైకమాండ్ నాయకులను కలవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఎవరూ అందుబాటులోకి రావడం లేదని సమాచారం. ఎందుకు ఇవ్వడం లేదు? రాష్ట్రంలో సిద్దరామయ్య వర్గం ఏర్పాటు చేస్తున్న అహింద బహిరంగ సభకు అడ్డుకట్ట వేయాలని డీకే నిశ్చయంతో ఉన్నారు. మంగళవారం కేంద్ర మంత్రులతో రాష్ట్ర ప్రాజెక్టుల గురించి చర్చలు జరిపారు. బుధవారం పార్టీ సీనియర్లను కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి చర్చకు చెమటోడుస్తున్నారు. అయితే పెద్దల దర్శనాలు దొరకడం లేదు. భేటీకి ఎవరూ సమయాన్నే ఇవ్వలేదని తెలిసింది. ఇది డీకే శివకుమార్ వర్గాన్ని కలచివేస్తోంది. గత నెల డీకే ఢిల్లీకి వెళ్తే, రాహుల్గాంధీతో అపాయింట్మెంట్ దొరకలేదు. ఆపై అధికార మార్పిడి ఒప్పందం అమలుకు డీకే పట్టుబట్టారు. ఇది పార్టీలో గందరగోళం కల్పించింది. మల్లికార్జున ఖర్గేని పలుసార్లు భేటీ చేసి ఒత్తిడి చేయడం కూడా ఢిల్లీ నాయకులకు తలనొప్పిగా పరిణమించింది. అందుచేతనే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం సీటు రగడ భగ్గుమనే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.27వ తేదీపైనే ఆశలు సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా మాజీ మంత్రి కే.ఎన్.రాజణ్ణ రాహుల్గాంధీకి లేఖ రాసి వేడి పుట్టించారు. ఈ నెల 27న కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. అందులో పాల్గొనేందుకు డీకే శివకుమార్ వెళ్తారు, తాను వెళ్లనని సిద్దరామయ్య మొన్ననే చెప్పారు. ఆ సమావేశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని డీకే పట్టుదలతో ఉన్నారు. ఇందులో ఫైనల్ రౌండ్ చర్చలకు శ్రీకారం చుట్టనున్నారు. దర్శనం ఇవ్వని హైకమాండ్ నేతలు? డిప్యూటీ సీఎం విశ్వ ప్రయత్నాలు సీఎం కుర్చీ చుట్టూ తీవ్ర రాజకీయం కురీ ఆటలో సీఎం సిద్దరామయ్య తన అహింద కార్డును తీశారు. గతంలో ఆయన దళిత, బీసీ, మైనారిటీల కోసమని అహింద అనే సంస్థను నెలకొల్పడం తెలిసిందే. మైసూరులోని వస్తు ప్రదర్శన మైదానంలో త్వరలోనే భారీ సభ జరపాలని అహింద నేతలు సన్నాహాలు చేస్తున్నారు. సిద్దరామయ్యకు మద్దతుగా ఈ సభ జరుగుతుంది. సిద్దరామయ్యనే కొనసాగించాలనేది సభ ముఖ్య ఉద్దేశం. కనీసం 20 వేల మందితో సభ జరపనున్నారు. కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనేలా రంగం సిద్ధమవుతోంది. సిద్దరామయ్య అండతోనే సభ జరుగుతోందని సమాచారం. సాహితీవేత్తలు, మేధావులను ఆహ్వానించాం, సిద్దరామయ్యను పిలవలేదు, ఆయన తరఫున మేము సభ జరపబోతున్నాం అని నాయకుడు శివరాం తెలిపారు. జనవరి ఆఖరులో సభ ఉంటుంది. -
మంటల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికుల సజీవ దహనం
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదంపై దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది. రాంగ్రూట్లో వచ్చిన కంటెయినర్ లారీ ఢీ కొట్టడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో 17 మంది మరణించగా.. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది ప్రయాణికులతో( డ్రైవర్, క్లీనర్తో కలిపి 31 మంది అని) కూడిన బస్సు బుధవారం అర్ధరాత్రి దాటాక బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తుండగా.. బెంగళూరు-హెబ్బులి హైవేపై సిరా-హిరియూర్ మధ్య గోర్లత్తు గ్రామం(చిత్రదుర్గ జిల్లా) వద్ద ప్రమాదానికి గురైంది. ఆ మంటల ధాటికి బస్సుతో పాటు ట్రక్కు కూడా పూర్తిగా కాలిబూడిదైంది. తొలుత ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రచారం జరిగింది. అయితే.. ఈ ఘటన నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, హెల్పర్ సురక్షితంగా బయటపడ్డాడు. వాళ్లు తెలిపిన వివరాల ప్రకారం.. అపోజిట్ రోడ్డులోంచి దూసుకొచ్చిన బస్సు ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగింది. ‘‘డివైడర్కు మరోవైపున ప్రయాణిస్తున్న లారీ ఒక్కసారిగా నేను వెళ్తున్న రోడ్డు పైకి దూసుకొచ్చింది. లారీ ఢీకొట్టబోతోందని అర్థమై బస్సును కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించా. కానీ అప్పటికే ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి మా బస్సు పక్కనే వెళ్తోన్న మరో వాహనాన్ని కూడా తాకింది. అయితే ఆ వాహనం ఏంటో నేను చూడలేకపోయా. అతివేగం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుంది’’ అని ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వివరించాడు.ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం సిద్ధరామయ్య.. మంత్రులను, అధికార యంత్రాగాన్ని ఘటనా స్థలానికి తక్షణమే వెళ్లాలని, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించాలని ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు తర్వాతే ప్రమాదానికి గల కారణంపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని అన్నారాయన. ప్రమాదం జరిగిందిలా..చిత్రదుర్గ జిల్లాలోని జాతీయరహదారి-48పై గోర్లత్తు క్రాస్ వద్ద గురువారం వేకువజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటెయినర్ లారీ ఢీకొట్టింది. బస్సు డీజిల్ ట్యాంక్కు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంక్ వద్ద ఢీ కొట్టడంతో.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో రెండు వాహనాలు కాలి బూడిద అయ్యాయి. కంటెయినర్ డ్రైవర్తో పాటు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికుల్లో చాలామంది కాలి బూడిదయ్యారు. Horrible accident Near Hiriyur along Bengaluru Hubballi highway, sleeper bus caught fire, 30+ feared dead! .#Busfire #chitradurga #karnataka pic.twitter.com/Fdpe5Tg999— Naik Kartik (@mekartiknaik) December 24, 2025 యువకుడి సాహసంతో.. ప్రయాణికుల్లో ఒక యువకుడు సాహసం చేసి బస్సు అద్దాలు పగలకొట్టాడు. దీంతో 9 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. వీళ్లలో కొందరికి గాయాలు కావడంతో చిత్రపురి, సిరా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. కాలిన గాయాలతో ఉన్న క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.సకాలంలో స్పందించినా.. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే మంటలు శరవేగంగా అంటుకుని అప్పటికే బస్సు మొత్తం బూడిదైంది. ట్రావెల్స్ నిర్వాహకులు ఇచ్చిన లిస్ట్ ప్రకారం.. మృతుల్లో చాలామంది గోకర్ణవాసులేనని తెలుస్తోంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.తప్పిన ఘోరం!అయితే.. ఈ ప్రమాదం నుంచి 40 మందికి పైగా స్కూల్ విద్యార్థులు త్రుటిలో తప్పించుకున్నారు. టి.దర్శహళ్లి నుంచి దండేలికి వెళ్తున్న ఓ టూర్ బస్సు.. ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సమాంతరంగా ప్రయాణించింది. ఈ టూర్ బస్సులో 42 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో ఆ ప్రమాద ధాటికి స్కూల్ బస్సు కూడా అదుపు తప్పింది. ఈక్రమంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సును వెనక నుంచి ఢీకొట్టి రోడ్డు పక్కకు జారింది. అయితే, పిల్లల బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ మేరకు ఆ బస్సు డ్రైవర్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. -
అయోధ్య రామాలయానికి బంగారు రామయ్య
యశ్వంతపుర : అయోధ్యలోని రామాలయానికి బంగారు రామయ్య విగ్రహాన్ని ఓ భక్తురాలు విరాళంగా అందించారు. రూ.30 కోట్ల విలువ చేసే 10 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో కూడిన బంగారు, వజ్రాలతో కూడిన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని బెంగళూరు రాజాజీనగర్కు చెందిన కళాకారిణి జయశ్రీ ఫణీశ్ స్వయంగా రూపొందించి అందజేశారు. పూర్తిగా స్వచ్ఛమైన బంగారంతో విగ్రహాన్ని తీర్చిదిద్ది... విలువైన మాణిక్యాలు, వజ్రాలు, ముత్యాలు, కెంపులతో అలంకరించారు. తంజావూరు చిత్రకళ శైలిలో, బాలరాముని మూలవిరాట్టు పోలికలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. శ్రీరాముని విగ్రహంలోనే హనుమాన్, గరుడ, దశావతార చిత్రాలున్నాయి. పెద్ద విల్లు, బాణాలు పట్టుకుని ఉన్న రామయ్య విగ్రహాన్ని అయోధ్య రామమందిరంలోనే ప్రతిష్టించాలని రామజన్మభూమి కమిటీ సభ్యులు నిర్ణయించారు. జయశ్రీ ఫణీశ్తోపాటు ఆమె కుటుంబ సభ్యులు విగ్రహ ఖర్చును భరించినట్లు తెలిసింది. విగ్రహాన్ని నాణ్యమైన ఎర్రచందనం చెక్క పెట్టెలో ఆలయానికి మంగళవారం తీసుకెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా స్వర్ణ రామయ్యకు ఆలయంలో విశేష పూజలు చేశారు. -
హైకమాండ్ను ఇబ్బంది పెట్టను
శివాజీనగర/ మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం విషయంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డీకే బుధవారం కర్ణాటక భవన్లో మీడియాతో మాట్లా డుతూ, ‘సీఎం సిద్ధరామయ్య హైకమాండ్ కోర్టులో బంతి వేశారు. హైకమాండ్కు సమస్య కలిగించబోను. రాహుల్గాంధీని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. పార్టీ కార్యకర్తగానే ఉండేందుకు ఇష్టపడతాను’ అని పేర్కొన్నారు. ఢిల్లీలో హైకమాండ్ నేతలు ఎవరితోనూ తాను సమావేశం కాలేదని కూడా స్పష్టం చేశారు. సీఎం మార్పుపై ఎలాంటి ఊహాగానాలు లేవని, అల్పాహార విందులు మా మూలు విషయాలేనని కూడా అన్నారు. మైసూరులో సీఎం సిద్ధరామయ్యకు మద్దతుగా ఆయన వర్గీయు లు బీసీ, దళిత (అహింద) సమావేశం జరపబో తున్నారన్న వార్తలను ప్రస్తావించగా, అదంత మంచిది కాదని సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీ మార్పి డి వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్య పట్టువీడకపోవడం.. హైకమాండ్ కూడా అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడం.. స్థానికంగానే ఈ సమస్యను పరిష్కరించుకుంటారంటూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటన వంటి పరిణామాల నేపథ్యంలో శివకుమార్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంత రించుకుంది. దీనితో ఈ అంశంపై తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. సిద్ధరామయ్య సీఎం కుర్చీ భద్రం: మంత్రి జమీర్కాగా, సిద్ధరామయ్య సీఎం కుర్చీ భద్రంగా ఉందని కర్ణాటక గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ బుధవారం విలేకరులతో అన్నారు. 2028 వరకు ఆయనే సీఎంగా కొనసాగుతారని పేర్కొన్నారు. ‘హైకమాండ్ తప్ప వేరే ఎవరి వల్లా సీఎం సీటు నుంచి సిద్ధరామయ్యను తొలగించడం సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించారు. -
'కార్లపై చూసిన అతిగొప్ప నినాదం ఇదే'
మంగళూరు: ఫ్రిడ్జ్, ఏసీ, ఆపిల్ ఐఫోన్, ల్యాప్టాప్, కారు, బైక్, వాషింగ్ మెషీన్, ఫర్నీచర్.. ఇలా నిత్యావసర ఎలక్ట్రానిక్ వస్తువులను ఈకాలంలో చాలా మంది ఈఎంఐ పద్ధతిలోనే తీసుకుంటున్నారు. వాటి ఈఎంఐ గడువు తీరేలోపే వాటికి రిపేర్లు రావడమో, పాడవడమో, ఎవరో కొట్టేయడమో జరిగితే ఆ బాధ వర్ణణాతీతం. ఆ బాధ పడొద్దనే ఉద్దేశంతో ఓ కారు యజమాని వినూత్న రీతిలో ఆలోచించారు.రోడ్లపై సర్రున దూసుకుపోయే వాహనదారుల్లో ఎవరైనా తన కారును ఢీకొడితే రిపేర్ల ఖర్చుల కోసం జేబుకు చిల్లు పడటం ఖాయమని భావించాడు. అనుకున్నదే తడవుగా కారుకు వెనకాల కొత్త తరహాలో బంపర్ స్టిక్కర్గా వినూత్న క్యాప్షన్ రాసి వెనకాల వచ్చే వాహనదారులందర్నీ ఆలోచనల్లో పడేశాడు. ‘‘నా కారును పొరపాటున ఢీకొట్టకండి. అసలే ఇది ఈఎంఐలో కొన్నా. అదింకా పూర్తవలేదు’’ అనే అర్థం వచ్చేలా ఒక క్యాప్షన్ రాశారు.ఇది చూసి ‘కారు కష్టాలు’ అని కొందరు సానుభూతి వ్యక్తపరిస్తే మరికొందరేమో అతని సృజనాత్మకతను మెచ్చుకుంటూ సరదాగా నవ్వుకుంటూ తమ దారిలో వెళ్లిపోతున్నారు. ఇతనిలో ఎంతో హాస్యచతురత ఉందని లోలోపల పొగుడుతూనే మరోవైపు అతని నిజాయతీకి, విజ్ఞాపనకు ఫిదా అయిపోతున్నారు.కర్ణాటకలోని మంగళూరులో సర్క్యూట్ హౌస్ రోడ్డులో వెళ్తున్న ఒక తెలుపురంగు మారుతి సుజుకీ ఆల్టో కారుకు (Alto Car) సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇప్పటికే ఏకంగా 5.4 కోట్ల మంది ఈ వీడియోను ఆన్లైన్లో చూడడం విశేషం. 33.41 లక్షలకుపైగా లైక్లు వచ్చాయి. వేలాది మంది తమకు నచ్చిన రీతిలో స్పందిస్తున్నారు.ఎంత కష్టపడి కొనుకున్నాడో..‘‘కారు యజమాని తాను చెప్పదల్చుకున్న విషయాన్ని అత్యంత వైవిధ్యభరింతగా చెప్పారు’ అని ఒక నెటిజన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘ఈఎంఐ (EMI) అనేది సగటు భారతీయుని జీవితంలో ఒక భాగమైపోయిందనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ’ అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘ఎంత కష్టపడి కొనుకున్నాడో. అందుకే కారంటే అతనికి అంత ప్రేమ’’ అని మరొకరు పోస్ట్ చేశారు.చదవండి: ఆ కార్ల ఖరీదు 7 కోట్లు.. డెకరేషన్కు 5 కోట్లు!అతిగొప్ప నినాదం ఇదే..‘‘ఈఎంఐ మంజూరుచేసిన బ్యాంక్కు ఇతను అసలు సిసలు నిఖార్సయిన కస్టమర్’ అని మరో నెటిజన్ (Netizen) వ్యాఖ్యానించారు. ‘‘గుంతల రోడ్డుపై వాయుకాలుష్యంలో కొట్టుకుపోతున్న నాకు ఎదురుగా ఈ క్యాప్షన్ ఎండాకాలంలో చల్లటి మజ్జిగలా హాయినిచ్చింది’’ అని ఇంకొకరు పోస్ట్చేశారు. ‘‘ఎన్నో బాధ్యతలున్న సగటు జీవి కారు ఇది’’, ‘‘కార్లపై చూసిన అతిగొప్ప నినాదం ఇదే’’, ‘‘మోదం, ఖేదం కలబోత ఈ క్యాప్షన్’’ అంటూ ఎవరికి నచ్చినట్లు వాళ్లు పోస్ట్లుపెట్టారు. View this post on Instagram A post shared by @bearys_in_dubai -
వ్యక్తి హత్య కేసులో నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: తన భార్య, తన తల్లితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న కోపంతో తండ్రీకొడుకులు కలిసి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఆరు నెలల అనంతరం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన పూర్వాపరాలు.. విజయపుర జిల్లా సింధగి తాలూకా బెన్నట్టి గ్రామంలో మహదేవప్ప(35) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన భూస్వామి సిద్దనగౌడ భార్య మల్లమ్మ(40)తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సిద్దనగౌడ(50), అతని కుమారుడు అప్పుగౌడ(25) కలిసి మహదేవప్పను మట్టు పెట్టి తమకేమీ తెలియనట్లుగా వ్యవహరించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టిన విజయపుర పోలీసులు ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత నిందితులైన తండ్రీకొడుకులను అరెస్ట్ చేసినట్లు ఆ జిల్లా ఎస్పీ తెలిపారు. -
ప్రభువా.. దీనజన బాంధవా
శివాజీనగర: సకల మానవాళిని పునీతుల్ని చేయడానికి ఇలపై ఏసుప్రభువు వెలసిన రోజే పవిత్ర క్రిస్మస్. ప్రపంచం మొత్తం ఎంతో ఉత్సాహంగా క్రిస్మస్ పండుగ కోసం వేచి చూస్తోంది. కర్ణాటకలో అందునా బెంగళూరులో పండుగ కోలాహలం ఉట్టిపడుతోంది. అన్ని షాపింగ్ మాల్స్, దుకాణాలు, హోటళ్లు కలర్ఫుల్గా మారాయి. ఎటు చూసినా క్రిస్మస్, నూతన సంవత్సరం వాతావరణం అలరిస్తోంది. స్టార్ లైట్లు, అలంకారాలతో అన్ని చర్చిలు ధగధగ మెరిసిపోతున్నాయి. ముఖ్యంగా బ్రిగేడ్ రోడ్డులోని సెయింట్ పాట్రిక్ చర్చ్, శివాజీనగరలోని సెయింట్ మేరీ బసిలికా చర్చ్, ఎంజీ రోడ్డులోని ఈస్ట్ పరేడ్ చర్చీ, రిచర్డ్ టౌన్లోని మిస్పా తెలుగు చర్చి, మార్తహళ్ళి అమాన చర్చీతో పాటుగా అన్ని నగరాలు, పట్టణాలలో క్రైస్తవ ప్రార్థనాలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. మరియమ్మనహళ్ళి కర్ణాటక కల్వరి చర్చీ సుందరంగా ముస్తాబైంది. క్రైస్తవులు, క్రైస్తవేతరులు అనే తేడా లేకుండా ఏటా క్రిస్మస్ పర్వదినాన్ని ఆచరిస్తామని ఆ చర్చీ పాస్టర్ రెవరెండ్ ఎం.జక్కయ్య తెలిపారు. ఏటా మాదిరిగానే గత నెల రోజులుగా క్యారెల్స్ వేడుకలను అన్ని చర్చ్లు ఉత్సాహభరితంగా నిర్వహిస్తున్నాయి. రాత్రివేళ ప్రార్థనా గీతాలు ఆలపిస్తూ సంఘ సభ్యుల ఇళ్లకు వెళ్లి క్రిస్మస్ ఆనందాన్ని పంచుతున్నారు. కొన్ని చర్చ్లు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే మహిళా క్రిస్మస్, పిల్లల క్రిస్మస్ వేడుకలు జరిపారు. అర్ధరాత్రి ఆరాధనలు 24వ తేదీ రాత్రి నుంచి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ఆరంభమవుతాయి. అర్ధరాత్రి విశేష ఆరాధన చేస్తారు. మంగళవారం ఉదయం నుంచే బెంగళూరులోని ప్రఖ్యాత చరిత్ర కలిగిన సెయింట్ మేరీస్ బసిలికా చర్చికి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చి ఆరాధనలు చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి చర్చీలో బాల ఏసు ప్రతిమను ఊయలలో ఉంచి పూజిస్తారు. పండుగ సందర్భంగా అలంకరణ సామగ్రి, స్టార్ దీపాలు, కేక్ల వ్యాపారం జోరందుకుంది. క్రిస్మస్ చెట్టు, శాంటాక్లాజ్ దుస్తులకు గిరాకీ ఉంది. అంతటా క్రిస్మస్ సందోహం ముస్తాబైన చర్చిలు మార్కెట్లలో పండుగ కోలాహలం -
ఒడ్డుకు చేరిన కన్నయ్య
యశవంతపుర: ఉడుపి జిల్లా మల్పె వద్ద సముద్రంలో నుంచి శ్రీకృష్ణుని విగ్రహం ఒడ్డుకు చేరింది. ఇది దైవమాయ అని భక్తులు సంతోషపడుతున్నారు. వివరాలు.. ఆదివారం ఉడుపి కృష్ణ మఠంలో ఇస్కాన్ భక్తులు ఓ వేడుకను నిర్వహించి, అక్కడి నుంచి సాయంత్రం మల్పె సముద్ర తీరానికి వెళ్లారు. ఈ సమయంలో తేలుతూ విగ్రహం ఒడ్డుకు చేరింది. దీనిని గమనించిన భక్తులు విగ్రహాన్ని తీసుకువచ్చి పూజలు చేశారు. బస్సు డ్రైవర్ దాష్టీకం.. తల్లయిన టెన్త్ బాలిక దొడ్డబళ్లాపురం: ప్రైవేటు పాఠశాలకు బస్సులో వెళ్లే బాలికను ఆ బస్సు డ్రైవర్ మభ్యపెట్టి లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఫలితంగా గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అమానుషమైన సంఘటన హాసన్ జిల్లాలో జరిగింది. బాలిక చెన్నరాయపట్టణలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. స్కూల్ బస్సు డ్రైవర్ రంజిత్ 8 నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. బాలిక గర్భం దాల్చి మగ బిడ్డకు జన్మనిచ్చింది. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బ్రెడ్డులో కొకై న్ యశవంతపుర: బ్రెడ్లో మత్తు పదార్థం కొకై న్ను దాచి తరలిస్తుండగా బెంగళూరు సీసీబీ పోలీసులు నైజీరియా మహిళ ఓ.ఎస్తేర్ (29) ను అరెస్ట్ చేసి రూ.1.20 కోట్ల విలువైన కొకై న్ను పట్టుకున్నారు. వివరాలు.. ఆమె 2024లో ఢిల్లీ వర్శిటీలో చదువు కోసం వచ్చింది. కానీ ముంబైలో మకాం వేసి తెలిసినవారి ద్వారా డ్రగ్స్ వ్యాపారం సాగిస్తోంది. ముంబై నుంచి బెంగళూరుకు ప్రైవేట్ బస్సులో వస్తోంది. పోలీసులు అనుమానంతో ఆమెను తనిఖీ చేయగా బ్యాగులో బ్రెడ్డు లోపల కొకై న్ దొరికింది. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చిన్నస్వామిలో మ్యాచ్ రద్దు శివాజీనగర: నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరగాల్సిన ఢిల్లీ– ఆంధ్రప్రదేశ్ మధ్య విజయ్ హజారె క్రికెట్ టోర్నీ మ్యాచ్కు పోలీసులు అనుమతివ్వలేదు. సోమవారం బెంగళూరు కమిషనర్ సీమంత్ కుమార్, గ్రేటర్ బెంగళూరు అధికారులు మైదానాన్ని పరిశీలించారు. మ్యాచ్కు వీలు లేదని సర్కారుకు నివేదిక ఇచ్చారు. ఈ ఏడాది జూన్లో ఆర్సీబీ విజయోత్సవాలలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోవడం తెలిసిందే. అప్పటినుంచి ఇందులో మ్యాచ్లను జరపడం లేదు. గేట్ల విస్తరణ జరపలేదు, రద్దీకి తగిన ఏర్పాట్లు లేవని నివేదికలో పేర్కొన్నారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఢిల్లీ టీం నుంచి ఆడాల్సి ఉంది. రిటైర్డు కెప్టెన్ ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: మానసిక రోగంతో బాధపడుతున్న రిటైర్డు సైనికాధికారి రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హాసన్ జిల్లా బేలూరు తాలూకా ఘట్టదహళ్లిలో జరిగింది. జీకే మల్లేశ్ (60) సైన్యంలో కెప్టెన్గా పనిచేసి రిటైరయ్యారు. మల్లేశ్ గత కొన్నాళ్లుగా మానసిక జబ్బుతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నాడు. ఇంట్లో సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఘటనకు ముందు సకలేశపుర పోలీస్స్టేషన్కి ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పాడు. వెంటనే వారు హళేబీడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లేటప్పటికి శవమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తల్లీకూతుళ్ల అదృశ్యం శివమొగ్గ: శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటి నుంచి వెళ్లిన తల్లీకూతుళ్లు 20 రోజుల నుంచి జాడ లేరు, ఈ ఘటన శివమొగ్గ గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలోని హరిగె సమీపంలోని చిలకాద్రిలో జరిగింది. వివరాలు.. అవినాష్ భార్య వీణ(32), కుమార్తె చైతన్య (7)ను తీసుకుని ఈ నెల 3వ తేదీన బంధువుల ఇంట నిశ్చితార్థంకి వెళ్లి ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ అయింది. ఆచూకీ తెలిస్తే శివమొగ్గ గ్రామీణ పోలీసు స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. -
సిద్దుకు మద్దతుగా, డీకేకి ముళ్లుగా..
శివాజీనగర: కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేఎన్ రాజణ్ణ, పార్టీ అగ్రనేత రాహుల్గాంధీకి మరో లేఖ రాశారు. ఓట్ చోరీ అభియానపై తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలతోనే ఆయనను గతంలో మంత్రి పదవి నుంచి తీసేయడం తెలిసిందే. ఇప్పటికే నాలుగు లేఖలను రాసిన రాజణ్ణ, రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలతో పార్టీకి నష్టం జరుగుతోందని తాజా లేఖలో పేర్కొన్నారు. సిద్దరామయ్యను సీఎం స్థానం నుంచి తొలగిస్తే మరింత నష్టం జరుగుతుందని ఆయనకు మద్దతుగా నిలబడడం గమనార్హం. ఓటర్ల జాబితా విషయంలో కేపీసీసి నియమించిన బీఎల్ఏలు సక్రమంగా పనిచేయలేదంటూ కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్పైనా విమర్శలు గుప్పించారు. లేఖలో డీకేకి వ్యతిరేకంగా పలు అంశాలను రాశారు. వివరంగా చర్చించేందుకు భేటీకి సమయం ఇవ్వాలని రాహుల్ను కోరారు. రాహుల్గాంధీకి రాజణ్ణ మరో లేఖ -
సర్కారీ ఇంజనీరు వద్ద ఆస్తుల గుట్ట
బనశంకరి: ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల ఇళ్లు, ఆఫీసులలో లోకాయుక్త దాడులు నిర్వహించింది. బాగల్కోటే, విజయపుర, ఉత్తరకన్నడ, రాయచూరు తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేపట్టింది. భారీగా డబ్బులు, బంగారు నగలు, విలువైన సొత్తు, పొలాలు, స్థలాల పత్రాలను కనుగొన్నారు. ఎక్కడెక్కడ అంటే.. ● బాగల్కోటే జిల్లా పంచాయతీ ప్లానింగ్ డైరెక్టర్ శ్యామ్సుందర్ కాంబ్లేకు చెందిన బాగల్కోటే, గదగ జిల్లా నరగుంద ఇళ్లలో, ఆఫీసులో తనిఖీలు చేపట్టారు. ● ఇదే జిల్లాలో బాగేవాడి వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లప్ప ఇంటిపై దాడి చేశారు. ● ఉత్తర కన్నడ జిల్లా సిద్దాపురలో పంచాయతీ అధికారి మారుతి యశవంత మాళవి నివాసంలో సోదాలు జరిపారు. ఏఈఈ లక్ష్మీ నివాసం రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు ఉప విభాగం గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ఏఈఈ డీ.విజయలక్ష్మీ నివాసం, ఆఫీసు లపై దాడి కలకలం సృష్టించింది. రాయచూరులో ఐడీఎస్ంటీ లేఔట్లో నాలుగు అంతస్తుల ఇల్లు, పక్కన ఉన్న మరో ఇంట్లో ఫైళ్లను పరిశీస్తున్నారు. చెల్లెలి ఇంటిపైనా దాడి జరిగింది. యాదగిరిలో 30 ఎకరాల భూమి, అక్కడే లేఔట్లు, చంద్రబండ వద్ద 25 ఎకరాల భూమిని గుర్తించారు. రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లాల్లో అపారమైన ఆస్తులను కనుగొన్నారు. ఆమెకు ఇంకా ఏడాదిన్నర సర్వీసు ఉంది. సుమారు 49 చోట్ల తనిఖీలు చేపట్టడం గమనార్హం. ఆమె హుబ్లీ పర్యటనలో ఉండడంతో వెంటనే రాయచూరుకు తిరిగి రావాలని లోకాయుక్త అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో లోకాయుక్త మెరుపు దాడులు పలువురు అధికారుల ఇళ్లలో సోదాలు -
బెంగళూరుకు సాయం చేయాలి
బనశంకరి: బెంగళూరులో మెట్రో రైలు పథకం మూడో స్టేజ్ కు ఆమోదం, ఆర్ఆర్టీఎస్ పథకానికి సాయం, మిట్టగానహళ్లి చెరువు వద్ద చెత్త యార్డుకు అనుమతి తో పాటు బెంగళూరు అభివృద్ధికి సాయం చేయాలని కేంద్ర నగరాభివృద్ధి మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను డీసీఎం శివకుమార్ కోరారు. ఢిల్లీలో ఆయనతో సమావేశమయ్యారు. దేశంలో బెంగళూరు మహా నగరమని, మీ వద్ద పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలను పరిష్కరించాలని డీకే కోరారు. మెట్రో రైలు రెండో దశ పథకం ఖర్చు రూ.26,405 కోట్ల నుంచి రూ.40,425 కోట్లకు పెరిగిందని, ప్రతిపాదనలను మీకు పంపించామని, ఆమోదించాలని తెలిపారు. మెట్రో మూడో స్టేజ్ పథకం సర్జాపుర నుంచి హెబ్బాళ వరకు 36.59 కిలోమీటర్లు, 28 స్టేషన్లతో ఉంటుంది, ఇందుకు రూ.28,405 కోట్ల ఖర్చును అంచనా వేసి కేంద్రం ఆమోదానికి పంపించామని, త్వరగా ఆమోదం తెలియజేయాలని కోరారు. కేంద్రమంత్రి ఖట్టర్కు డీసీఎం వినతి -
షాపులో 140 కేజీల వెండి చోరీ
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరం బిబి రోడ్డులో ఉన్న ఎయు జువెలరీస్లో సోమవారం రాత్రి దొంగలు పడి 140 కేజీల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. మంగళవారం ఉదయం షాపును తెరవడానికి వచ్చిన ఉద్యోగులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్పీ కుశాల్ చౌక్సె, పోలీసులు, శునకాలతో వచ్చి ఆధారాలను సేకరించారు. అర్ధరాత్రి సమయంలో దోపిడీ జరిగి ఉండవచ్చని ఎస్పీ అన్నారు. బాగా ఆరితేరినవారే కట్టర్తో ఇనుప గేట్ కు వేసిన తాళాలను కట్ చేసి లోపలకు చొరబడ్డారు, షోకేస్ల లో ఉంచిన వెండి సామగ్రిని దొంగిలించారు. బంగారు ఆభరణాలు మొత్తం లాకర్లో ఉన్నందున వాటిని తీయలేకపోయారు. మొత్తం రూ. 3 కోట్ల సొత్తు దొంగల పాలైంది అని ఎస్పీ తెలిపారు. ఆ షాపులోని సిసి కెమెరాల డివిఆర్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. పక్కనున్న షాపుల కెమెరాల ఆధారంగా క్లూస్ని అన్వేషిస్తున్నారు. లెక్చరర్.. పెళ్లిళ్లలో చోరీల దిట్ట యశవంతపుర: లెక్చరర్ గా పనిచేస్తూ, పెళ్లిళ్లలో చోరీలకు పాల్పడుతున్న రేవతి అనే మహిళను బెంగళూరు బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. శివమొగ్గకు చెందిన రేవతి బెంగళూరు కేఆర్ పురలో నివాసం ఉంటుంది. బెళ్లందూరు సమీపంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కన్నడ లెక్చరర్గా పనిచేస్తుంది. ఆదివారమైతే చాలు.. ఎక్కడ పెళ్లి జరిగినా బంధువునే అంటూ వెళ్తుంది. అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ ఆప్యాయత కురిపిస్తుంది. విందు భోజనం ఆరగించి, బంగారు నగలను కొట్టేసి బయటపడుతుంది. శనివారం రాత్రి నుంచే ఫంక్షన్ హాళ్లకు వెళ్లి ఎక్కడ పెళ్లి ఉంటుందో తెలుసుకోవడం ఆమె ప్రత్యేకత. బసవనగుడి ఠాణా పరిధిలో మూడు చోరీలు చేసింది. రేవతి నుంచి రూ.32 లక్షల విలువగల 262 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సిలిండర్లపై దొంగల కన్ను దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఇటీవల గ్యాస్ సిలిండర్ల చోరీలు ఎక్కువయ్యాయి. దీంతో గృహిణులకు తంటా వచ్చి పడింది. సాధారణంగా చాలామంది ఇళ్లల్లో ఒక నిండు సిలిండర్ అదనంగా ఉంటుంది. దానిని వరండాలోనో, కాంపౌండ్ లోపలో పెట్టి ఉంటారు. దొంగలు వాటిని మాయం చేస్తున్నారు. రాజాజినగర్లోని ఒక ఇంట్లో 2 సిలిండర్లను తీసుకున్న రోజే చోరీ అయ్యాయి. ఇంటి బేస్మెంట్లో పెట్టగా మళ్లీ కనబడలేదు. దొంగలు ఎత్తుకెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దొంగలు సిలిండర్ డెలివరీ వాహనాన్ని ఫాలో చేస్తూ గమనించి తరువాత చోరీలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. పోలీసులు వెతుకులాట చేపట్టారు. జైల్లో స్నేహం.. కలిసి దొంగతనాలు దొడ్డబళ్లాపురం: జైల్లో పరిచయమై స్నేహితులుగా మారి బయటకు వచ్చి చోరీలు చేస్తున్న ముగ్గురు చోరులను విద్యారణ్యపుర పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.38.17 లక్షల విలువైన 257 గ్రాముల బంగారు నగలను సీజ్ చేశారు. తిలక్ నగర నివాసి బాలరాజు (45), ఆడుగోడి గౌరవ్ (23), ప్రవీణ్ (26) పట్టుబడ్డ దొంగలు. పాత దొంగ అయిన బాలరాజుకు జైల్లో గౌరవ్, ప్రవీణ్ పరిచయమయ్యారు. బయటకు వచ్చాక కలిసి చోరీలు చేస్తున్నారు. భైరసంద్రలో జరిగిన ఒక చోరీ కేసులో దొరికారు. గజదొంగకు సంకెళ్లు దొడ్డబళ్లాపురం: ఇళ్లల్లో చోరీ చేసిన బంగారు నగలను కరిగించి విక్రయిస్తున్న ఆంధ్రప్రదేశ్కి చెందిన ఘరానా దొంగని జేపీ నగర పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.4.60 లక్షల నగదు, రూ.65 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మెహబూబ్ ఖాన్ పఠాన్, బెంగళూరు నాగవారలో నివసిస్తున్నాడు. ఇతనిపై ఏపీ, కర్ణాటక, తమిళనాడులో సుమారు 32 చోరీలు, దోపిడీల కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జేపీ నగరలోని 20వ మెయిన్ రోడ్డులో ఒక ఇంట్లో దంపతులు బయటకు వెళ్తూ ఇంటి తాళాలను చెప్పుల స్టాండ్లోని ఒక షూలో ఉంచి వెళ్లారు. ఇంతలో పఠాన్ ఆ తాళం సాయంతో చొరబడి బంగారం దోచుకున్నాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి నగదు,నగలు రికవరీ చేసుకున్నారు. బెంగళూరులోని పలు చోరీలు ఇతని పనేనని గుర్తించారు. -
విద్యార్థుల్లో సానుకూల దృక్పథం అవసరం
హొసపేటె: విద్యార్థులు తమ మనస్సుల నుంచి ప్రతికూల అంశాలను తొలగించి, సానుకూల అంశాలతో నింపుకోవాలని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డీవీ.పరమ శివమూర్తి అన్నారు. హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో నుంచి భవనంలో 2025–26వ మొదటి సంవత్సరం విద్యార్థుల స్వాగత వేడుకను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. కన్నడ విశ్వవిద్యాలయంలో అధ్యయనాలకు చాలా బహిరంగ వాతావరణం ఉందని అన్నారు. 5 లక్షలకు పైగా పుస్తకాలతో లైబ్రరీ వ్యవస్థ ఉందన్నారు. విద్యార్థులు తమ చదువులో 100 శాతం కృషి చేయాలి, మీ సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేయాలని అన్నారు. ముఖ్య భాషా నికాయ డీన్ డాక్టర్ మాధవ్ పెరాజె, కన్నడ సాహిత్య అధ్యయన విభాగాధిపతి డాక్టర్ వెంకటగిరి దళవాయి, విద్యార్థులు పాల్గొన్నారు. మనిషికి మానసిక స్థైర్యం కరాటే రాయచూరు రూరల్ : మనిషి మానసిక బలానికి, ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతుందని కేపీసీఎల్ ఏఈఈ మహేష్ పేర్కొన్నారు. సోమవారం శక్తినగర్ బసవ కళ్యాణ మంటపంలో జిల్లా ఫేం కాక్ సిలాట్ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో జ్యోతి వెలిగించి మాట్లాడారు. దేశఽంలో కరాటేకు ఉన్న ప్రాధాన్యతను వివరించడానికి ఫేం కాక్ సిలాట్ సంస్థ చేస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రకృతి దేహానికి సంబంధించిన క్రీడగా భావించాలన్నారు. ఫేం కాక్ సిలాట్ క్రీడలు ఇండోనేషియా, మలేసియాలో దీనికున్న ప్రాధాన్యతను వివరించారు. ఆత్మరక్షణ, శారీరక మానసిక, సాంస్కృతికతను నేర్పిస్తుందన్నారు. గుండెపోటు నివారణకు మానవుడు ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో జిల్లా ఫేం కాక్ సంస్థ సంచాలకురాలు లక్ష్మి, జేసీఐ అధ్యక్షుడు గౌతమ్ కట్టిమని, శరణే గౌడ, సిద్ధప్ప, బసన గౌడ, సవితలున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన హొసపేటె: నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబాన్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు, మేం ఎల్లప్పుడూ గాంధీ కుటుంబానికి అండగా ఉంటామని కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సిరాజ్షేక్ నాయకత్వంలో మంగళవారం చేపట్టిన నిరసనలో పాల్గొని మాట్లాడారు. హొసపేటె అంబేడ్కర్ సర్కిల్లో జరిగిన నిరసనలో బీజేపీ రాజకీయాలకు తలొగ్గబోమని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. అదే విధంగా నరేగ పథకం పేరు నుంచి గాంధీజీ పేరు తొలగించారు. బీజేపీకి గాంధీజీ చరిత్ర, పోరాటం తెలియదు. అదనంగా నరేగ పథకం పేరును తొలగించి వీబీజీ రామ్జీగా పేరును మార్చారు. దీనిలో 60:40 నిష్పత్తిని చేయడం ద్వారా వారు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి గోపీనాథ్ పళనియప్పన్, మాజీ మంత్రి పీటీ పరమేశ్వర్ నాయక్, ఎమ్మెల్యే శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకుడు నూర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
లబ్ధిదారులకు హక్కు పత్రాల పంపిణీ
హొసపేటె: నగరంలోని తాండా, హాడి, ఇతర మురికివాడలలో దశాబ్దాలుగా నివసిస్తున్న పత్రాలు లేని 351 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇంటి హక్కు పత్రాలను అందించడం ద్వారా చట్టబద్ధమైన యాజమాన్య హక్కును కల్పించిందని ఎమ్మెల్యే హెచ్ఆర్.గవియప్ప అన్నారు. బళ్లారిలోని కర్ణాటక మురికివాడల అభివృద్ధి బోర్డు సబ్–డివిజన్, నగరంలోని జిల్లా ఇండోర్ స్టేడియంలో వసతి శాఖ నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు టైటిల్ డీడ్లను పంపిణీ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. నిరాశ్రయులైన నివాసులకు అధికారిక యాజమాన్య హక్కును అందించడానికి ప్రభుత్వం సాహసోపేతమైన చర్యలు తీసుకుందన్నారు. ఈ పత్రాలు యజమానులకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సబ్సిడీ పొందడానికి సహాయపడతాయన్నారు. హుడా చైర్మన్ హెచ్ఎన్ఎఫ్ ఇమాం నియాజీ, మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ రూపేష్కుమార్, అసిస్టెంట్ కమిషనర్ పీ.వివేకానంద, తహసీల్దార్ ఎం.శృతి, ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, మున్సిపల్ కమిషనర్ శివకుమార్, స్లం డెవలప్మెంట్ బోర్డు ఏఈఈ వి.తిమ్మన్న పాల్గొన్నారు. -
మరిన్ని బస్సులను నడపండి
హొసపేటె: మహిళలు, పిల్లల ప్రయోజనాల దృష్ట్యా తాలూకాలోని మరియమ్మనహళ్లి, గరగ, యశ్వంత్ నగర్ మధ్య సరైన బస్సు సర్వీసులను అందించాలని డిమాండ్ చేశారు. మంగళవారం సండూరు తాలూకాలోని యశ్వంత్నగర్, గరగ, బలకుంది, నాగలాపుర, తాండా, గొల్లరహళ్లి, డణాయకనకెరె, దేవలాపుర, మరియమ్మనహళ్లి, హొసపేటె మధ్య ఒకే ఒక బస్సు నడుస్తోంది. దీంతో మరియమ్మనహళ్లి పట్టణం, హొసపేటె నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆస్పత్రులకు వెళ్లే పిల్లలు, మహిళలు, గర్భిణీ సీ్త్రలు, వృద్ధులు ప్రతి రోజూ ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో ఈ గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉండేలా తగినన్ని బస్సు సర్వీసులను అందించాలని ఈ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మార్గంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.10 గంటల వరకు గరగ నుంచి మరియమ్మనహళ్లికి ప్రత్యక్ష బస్సు సర్వీసు లేదు. పాఠశాల పిల్లలు, వృద్ధులు, గర్భిణులు వచ్చే బస్సు కోసం తలుపు వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్య, ఆరోగ్యం, ఉపాధితో సహా వారి రోజు వారీ పనుల కోసం ప్రయాణించే ప్రజలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. సకాలంలో బస్సు సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
గ్యారెంటీల అమలులో నిర్లక్ష్యం వద్దు
రాయచూరు రూరల్: పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి లభించే సౌకర్యాలను కల్పించే పంచ గ్యారెంటీల అమలులో అధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదని రాష్ట్ర పంచ గ్యారెంటీల అమలు సమితి ఉపాధ్యక్షుడు ఎస్.ఆర్.మెహరోజ్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జెడ్పీ జల నిర్మల కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. పేద ప్రజలకు ప్రభుత్వం పంచ గ్యారెంటీల అమలు విషయంలో అందరికీ అందేలా చూడాలన్నారు. అన్న భాగ్య, యువ నిధి, గృహలక్ష్మి, శక్తి, గృహజ్యోతి అమలులో లోపాలు రాకుండా అందరికీ అందేలా అధికారులు శ్రమించాలన్నారు. గృహజ్యోతి నుంచి 3,52,582 మంది, 1,58,435 మంది నిరుద్యోగులు యువనిధి నుంచి లాభం చేకూరిందన్నారు. సమావేశంలో జిల్లాధ్యక్షుడు పామయ్య మురారి, తాలూకా అధ్యక్షుడు పవన్, రజాక్ ఉస్తాద్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, వ్యవసాయ వర్సిటీ వీసీ హన్మంతప్ప, హుడేద్, నవీన్ కుమార్, రోణలున్నారు. -
బొగ్గు చోరీ బాధ్యులపై క్రిమినల్ కేసు వేయాలి
రాయచూరు రూరల్: యరమరస్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(వైటీపీఎస్)లో బొగ్గు అక్రమంగా చౌర్యం అవుతోందని, అధికారులు, ఇంజినీర్లు భాగస్వాములని, అలాంటి అధికారులపై క్రిమినల్ కేసు వేయాలని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. మంగళవారం వైటీపీఎస్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నరసింహలు మాట్లాడారు. రాయచూరు, యరమరస్ వరకు రైల్వే లైన్లలో వ్యాగన్లతో వెళ్లే రేకులను అన్ లోడ్ చేసి కొద్ది మేర ఉంచుకొన్న బొగ్గును రైల్వే స్టేషన్లో నిలిపి అక్రమంగా విక్రయాలు చేస్తున్నారన్నారు. బొగ్గును వైటీపీఎస్ ఇంజినీర్లు, సబ్ కాంట్రాక్టర్, మేనేజర్, స్టేషన్ మాస్టర్, వ్యాగన్ల క్లీనింగ్ సిబ్బంది, గురు రాఘవేంద్ర ఎంటర్ప్రెజెస్లు ఏకమై అక్రమంగా వైటీపీఎస్కు తరలాల్సిన బొగ్గును దొంగతనంగా ఇతర ప్రాంతాలకు తరలించిన వారిపై చర్యలు చేపట్టి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఒత్తిడి చేశారు. లాభాల ఆశ చూపి లక్షల్లో టోకరాహుబ్లీ: దావణగెరె వినాయక లేఅవుట్కు చెందిన ఓ వ్యక్తిని సైబర్ వంచకులు నిట్టనిలువునా దోచుకున్నారు. సుమారు రూ.76.48 లక్షలు ఎగనామం పెట్టారు. వివరాలు.. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే బాగా లాభాలు వస్తాయంటూ ఆశ చూపించిన వంచకులు ఫేస్బుక్లో పరిచయం అయిన సదరు వ్యక్తి నుంచి ఆ మేరకు ఆన్లైన్ ద్వారా డబ్బులు దోచుకున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ డిసెంబర్ వరకు సుమారు విడతల వారీగా వివిధ బ్యాంకుల నుంచి డబ్బులను తమ ఖాతాల్లోకి వేయించుకొని వంచించారని బాధితుడు నగర సైబర్ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం రాయచూరు రూరల్: ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని దేవదుర్గ తాలూకా నగరగుండ వద్ద జరిగింది. సోమవారం రాత్రి రాయచూరు తాలూకా అరిషిణిగికి చెందిన రంజాన్ అలీ(30), దేవదుర్గ తాలూకా బెళకల్లో ఉన్న హసీనా(25) కాన్పు కోసం బెళకల్ నుంచి దేవదుర్గకు వెళుతుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి ఢీకొట్టడంతో హసీనా అక్కడికక్కడే మరణించింది. రంజాన్ అలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ధ్యానంతో ఆరోగ్య భాగ్యంరాయచూరు రూరల్: మానవుడికి ధ్యానంతోనే ఆరోగ్య భాగ్యమని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత అన్నారు. నగరంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయ భవనంలో ఏర్పాటు చేసిన విశ్వ ధ్యాన దినోత్సవ సభను జ్యోతి వెలిగించి ప్రసంగించారు. యోగా, ధ్యానం వల్ల ప్రపంచానికి భారత్కు గురువు స్థానం లభించిందన్నారు. అందరికీ శాంతి, ప్రపంచ సద్భావన ఆధారంగా మనిషి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో శారద, వనజాక్షి, అసిస్టెంట్ కమిషనర్ గజానన బళి, అరుణ, బసన గౌడ, ప్రభణ్ణ గౌడ, వెంకట సింగ్, ప్రేమ కలాల్లున్నారు. స్లం వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి రాయచూరు రూరల్: మురికి వాడల కాలనీల్లో నివాసమున్న వాసులకు ఇళ్ల పట్టాలను అందించాలని మురికి వాడల కాలనీ వాసులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడారు. 1991–92లో సర్వే నంబర్–572, 573, 574ల్లో నివాసముంటున్న వారికి నేటికీ పట్టాలు ఇవ్వకుండా నగరసభ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మురికి కాలువల నిర్మాణాలు చేపట్టలేదన్నారు. 600 కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అందించాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు. -
సమస్యల సుడిలో సాయంత్రం కళాశాల
సాక్షి బళ్లారి: మారుతున్న కాలానుగుణంగా విద్య ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటిలో తమ పిల్లలను మంచి విద్యా వంతులుగా మార్చాలనే తపన ప్రతి ఒక్కరికీ రోజు రోజుకు పెరుగుతోంది. విద్య ఉపాధికి మార్గం కావడంతో విద్యపై ఆసక్తి పెరిగి, తప్పనిసరిగా కూడా మారింది. అష్టకష్టాలతో ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావడానికి పోటీ పడుతున్నారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదివేందుకు నేటి తరం విద్యార్థులు పరుగులు తీస్తున్నారు. పోటీ ప్రపంచంలో విద్యను పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఆరాట పడుతున్నవారు కోకొల్లలు. ఒకటో తరగతి నుంచి పీయూసీ వరకు ఏదో రకంగా కష్టపడి చదివే వారు. కొందరికి డిగ్రీ పట్టా పొందేందుకు వివిధ రకాల సమస్యలు ఎదురవడంతో అర్థంతరంగా చదువులు మానేసేవారు. మౌలిక సదుపాయాలు కరువు అయితే నేటి పోటీ ప్రపంచంలో ప్రతి చిన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగానికి ఏదో ఒక డిగ్రీ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాల్సిన నిబంధనలు ఉన్నాయి. అర్ధంతరంగా చదువును మధ్యలోనే ఆపేసిన వారికి డిగ్రీ పట్టా పొందేందుకు ప్రభుత్వం వివిధ జిల్లాల్లో సాయంత్రం కళాశాలను ప్రారంభించిందే కానీ అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో అర్ధంతరంగా చదువును మానేసి సాయంత్రం కళాశాలలో చేరి డిగ్రీ పట్టాను పొందాలనుకునేవారి ఆశలు అడియాసలవుతున్నాయి. పేదరికమో, పరిస్థితుల కారణమో ఉదయం పూట కళాశాలలకు వెళ్లని వారికి సాయంత్రం కాలేజీకి వెళ్లి డిగ్రీ పట్టాను తీసుకోవాలనే ఆశతో ఉన్నవారికి సరైన సదుపాయాలు లేక వెనుకడుగు వేస్తున్నారు. బళ్లారి నగరంలోని సతీష్చంద్ర సరళాదేవి కళాశాలలో 2021–22వ విద్యా సంవత్సరంలో ఈ సాయంత్రం కళాశాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఏటా పెరగని విద్యార్థుల సంఖ్య నాలుగేళ్లుగా కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఎంత మాత్రం పెరగడం లేదు. కళాశాలల్లో బీకాం, బీసీఏకి ప్రవేశాలు పొందేందుకు చర్యలు తీసుకొన్నారు. ఒక్కొక్క తరగతికి కనీసం 15 మంది విద్యార్థుల అవసరం ఉంటుంది. నాలుగేళ్లుగా ఇప్పటి వరకు బీకాం కోర్సులకు 35 మందిలోపు, బీసీఏ కోర్సులకు 25 మంది మాత్రమే కళాశాలల్లో ప్రవేశం పొందారు. ఇంట్లో పేదరికం, కుటుంబాల బాధ్యత, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అనివార్య కారణాల వల్ల తరగతి గదులకు హాజరు కాని వారికి సాయంత్రం కళాశాలకు సంబంధించి 2021లో సంధ్యాశక్తి పథకం కింద డిగ్రీ పట్టా పొందేందుకు ప్రారంభమైన సాయంత్రం కళాశాల మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా నడుస్తోంది. ప్రారంభంలో కోర్సులకు జాయిన్ కావడానికి ఆసక్తి చూపినప్పటికీ కళాశాలల్లో బోధన సిబ్బంది సరిగా లేకపోవడంతో విద్యార్థులు చేరడానికి వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలో ఏకై క సాయంత్రం కాలేజీ జిల్లాలో ఉన్న ఏకై క సాయంత్రపు కళాశాల సరళాదేవి కళాశాల ప్రారంభించి నాలుగేళ్లు పూర్తవుతున్నా జనంలో అవగాహన, తగినంత ప్రచారం లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయకపోవడంతో పాటు బోధన సిబ్బంది కూడా అంతంత మాత్రమే ఉండటం వల్ల విద్యార్థుల సంఖ్య పెరగడం లేదనే ఆరోపణలున్నాయి. సాయంత్రం కళాశాలల్లో కఠినమైన బీసీఏ, బీకాం కోర్సులను ప్రారంభించారే కానీ బీఏ కోర్సును ప్రారంభించకపోవడం కూడా విద్యార్థుల సంఖ్య పెరగకపోవడానికి కారణంగా భావిస్తున్నారు. తగిన కోర్సులు ప్రవేశ పెట్టక పోవడంతో సాయంత్రం కళాశాల కాస్త రాత్రి మబ్బుమయంగా మారిపోయింది. బీఏ కోర్సును ఏర్పాటు చేయడంతో పాటు వృత్తి విద్యా కోర్సులు, బోధన సిబ్బందిని నియమించి తగినంత ప్రచారం నిర్వహించి కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రతి పేద విద్యార్థులకు ఉదయం పూట కళాశాలకు వెళ్లలేని వారికి ఓ డిగ్రీ పట్టా తీసుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత విద్యార్థులు, అవిద్యావంతులు కోరుతున్నారు. సరళాదేవి సతీష్చంద్ర అగర్వాల్ కళాశాల ప్రవేశ ద్వారం సరళాదేవి సతీష్చంద్ర అగర్వాల్ కళాశాల భవనం నాలుగేళ్లలో 65 మంది విద్యార్థులకే ప్రవేశం వేధిస్తున్న బోధకులు, తగిన కోర్సుల కొరత సరళాదేవి కాలేజీలో 2021–22వ విద్యా సంవత్సరంలో ప్రారంభం -
బిడ్డను చూపాలంటే రూ.30 లక్షలు ఇవ్వు
మైసూరు: భార్య వేధింపులతో జీవితం మీద విరక్తి చెందిన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మైసూరు ఆలనహళ్లి ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. జిల్లా టి. నరసిపుర తాలూకా నివాసి, ప్రైవేటు కంపెనీ ఇంజనీర్ ఉమేష్ (34), మైసూరులోని సిద్ధార్థ బరంగే నివాసి చన్నబసవేగౌడ కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నాడు. ప్రారంభంలో బాగానే ఉన్న భార్యాభర్తలు తరువాత తరచుగా గొడవ పడుతుండేవారని ఉమేష్ తండ్రి గురుమల్లెగౌడ తన ఫిర్యాదులో తెలిపాడు. గత 2 సంవత్సరాలుగా, ఉమేష్ తన చిన్నారి కూతురిని చూడలేక పోయాడు. భార్య బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. బిడ్డను చూడాలనుకుంటే డబ్బులు ఇవ్వాలని ఆమె వేధించేది. ఇది తల్లిదండ్రులతో చెప్పుకుని బాధపడేవాడు. డిసెంబర్ 19న, భార్యకు వీడియో కాల్ చేసి, తన కూతురిని చూపించమని అడిగాడు. అయితే, రూ. 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్చేసింది. దీంతో ఆవేదన చెందిన ఉమేష్ తన బాడుగ ఇంటిలో ఉరి వేసుకున్నాడు. భార్య రమ్య, అతని తల్లిదండ్రులపై చన్నబసవేగౌడపై అలనహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
చిన్నస్వామిలో మ్యాచ్లపై సమీక్ష
బెంగళూరు: ఇటీవల ప్రాణాంతకమైన తొక్కిసలాట జరిగిన బెంగళూరు చిన్నస్వామి క్రీడా మైదానంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్లను నిర్వహించే విషయం పరిశీలనకు కమిటీని నియమించినట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. సోమవారం విధానసౌధలో క్రికెట్ సంఘం అధికారులు, పోలీసు అధికారులతో ఆయన భేటీ జరిపారు. 24న విజయ్ హజారె టోర్నీ జరపడానికి క్రికెట్ సంఘం అనుమతి కోరిందన్నారు. జీబీఏ కమిషనర్ నేతృత్వంలో పలు ప్రభుత్వ శాఖలతో కమిటీని ఏర్పాటు చేశామని, స్టేడియాన్ని పరిశీలించి మార్పులు చేర్పుల గురించి ప్రభుత్వానికి నివేదికను ఇస్తుందని, దానిని బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
అయోధ్యకు స్వామీజీ రైలు యాత్ర
మైసూరు: గణపతి సచ్చిదానంద స్వామి వేలాది మంది భక్తులతో మైసూరు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన రైల్వే స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ, అయోధ్యలో కర్ణాటక దత్త పీఠానికి స్థలం కేటాయించారని తెలిపారు. దత్త పీఠం శాఖను ప్రారంభించి, రామ పరివార్ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి తాను అక్కడికి వెళ్తున్నానని చెప్పారు. కర్ణాటక హనుమంతుని భూమి. హంపిలోని కిష్కింధలో హనుమంతుడు అవతారం ఎత్తిన ప్రదేశం, కాబట్టి, రాముడు, కర్ణాటక మధ్య ప్రత్యేక సంబంధం ఉంది అని స్వామీజీ వివరించారు. కిచ్చ సుదీప్ వర్సెస్ దర్శన్ శివాజీనగర: హుబ్లీలో జరిగిన మార్క్ సినిమా ఈవెంట్ లో నటుడు కిచ్చ సుదీప్ మాట్లాడిన మాటలు చర్చకు కారణమయ్యాయి. సుదీప్ ఎవరి పేరును ఎత్తకున్నా, దర్శన్ గురించే అని దిబాస్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శన్ సతీమణి విజయలక్ష్మి కూడా ఎవరి పేరును చెప్పకుండా సుదీప్పై విమర్శలు గుప్పించారు. కొందరు దర్శన్ లేకపోవడంతో ఏదేదో మాట్లాడుతున్నారు, వేదికపై నిలబడి మాట్లాడటం, వీడియోల్లో కూర్చొని మాట్లాడటం, బయట మాట్లాడటం చేస్తున్నారు. అదే జనం దర్శన్ ఉన్నప్పుడు బెంగళూరులో ఉంటారో, లేదో కూడా తెలియదు అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక అభిమానులు సుదీప్కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. సుదీప్ మార్క్ సినిమా ప్రచారం కోసం జిమ్మిక్కులు చేస్తున్నాడని వారు మండిపడ్డారు. పేలుడు కేసంటూ.. రూ.5 లక్షలు స్వాహా దొడ్డబళ్లాపురం: సైబర్ నేరగాళ్లు రూ. 5 లక్షలకు పైగా స్వాహా చేశారని శరణ్ ఆర్ ముకుంద్ అనే కన్నడిగుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వివరాలు.. ఆయనకు కాల్ చేసిన వ్యక్తి ఏటీఎస్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో మీ హస్తం ఉందని, విచారించాలని బెదిరించాడు. ఏ తప్పూ చేయలేదని చెప్పినా వినిపించుకోలేదు. తరువాత ఐపీఎస్ అధికారి గౌరవ్ పేరుతో ఒక వ్యక్తి మాట్లాడి వీడియో కాల్లోనే విచారణ పేరుతో ప్రశ్నలు వేశాడు. బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకున్నాడు. ఈ కేసు బయటపడాలంటే ఓ సర్టిఫికెట్ మంజూరు చేయాలి, ఖర్చవుతుందని చెప్పాడు. అలా రూ.5.53 లక్షలు బదలాయించుకున్నారు. తరువాత మోసం అని తెలుసుకుని 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. చిన్నస్వామిలో మ్యాచ్లపై సమీక్ష శివాజీనగర: ఇటీవల ప్రాణాంతకమైన తొక్కిసలాట జరిగిన బెంగళూరు చిన్నస్వామి క్రీడా మైదానంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్లను నిర్వహించే విషయం పరిశీలనకు కమిటీని నియమించినట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. సోమవారం విధానసౌధలో క్రికెట్ సంఘం అధికారులు, పోలీసు అధికారులతో ఆయన భేటీ జరిపారు. 24న విజయ్ హజారె టోర్నీ జరపడానికి క్రికెట్ సంఘం అనుమతి కోరిందన్నారు. జీబీఏ కమిషనర్ నేతృత్వంలో పలు ప్రభుత్వ శాఖలతో కమిటీని ఏర్పాటు చేశామని, స్టేడియాన్ని పరిశీలించి మార్పులు చేర్పుల గురించి ప్రభుత్వానికి నివేదికను ఇస్తుందని, దానిని బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. రూ.5 వేల కోట్లు ఏమయ్యాయి?: కుమారదొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో మహిళల ఖాతాల్లోకి జమ కావాల్సిన రెండు నెలల గృహలక్ష్మి పథకం డబ్బులు రూ.5000 కోట్లు ఏమయ్యాయంటూ కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి సర్కారును ప్రశ్నించారు. హాసన్లో సోమవారంనాడు మీడియాతో మాట్లాడిన ఆయన మార్చ్, ఏప్రిల్ నెలలకు మహిళలకు ఇవ్వాల్సిన గృహలక్ష్మి డబ్బులు ఉన్నాయా, ఉందా లేదా అన్నారు. ఆర్థికమంత్రి అయిన సీఎం సిద్ధరామయ్య జవాబు చెప్పాలన్నారు. రూ.5 వేల కోట్లు మిస్సింగ్ అంటే మామూలు విషయం కాదన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించి రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. -
జనవరి 15లోగా డీకే సీఎం: జ్యోతిష్యుడు
శివాజీనగర: సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి సీటు రగడ మొదటికొచ్చేలా ఉంది. ఇడ్లీ– దోసె, కోడికూర అల్పాహార విందు భేటీల తరువాత కాస్త చల్లారినట్లున్న వివాదం మళ్లీ తారాస్థాయికి చేరుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయి. మధ్యలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేస్తున్న వ్యాఖ్యలు సమస్య తీవ్రతను మరింత పెంచేవిగా ఉంటున్నాయి. కుర్చీ పోట్లాటకు చరమగీతం పాడాలనే దిశలో హైకమాండ్ బలమైన చర్యలు తీసుకుంటోందా, లేదా అనే మీమాంస పార్టీలోనే నెలకొంది. గొడవ అనేది హైకమాండ్ సృష్టించలేదు, స్థానికంగానే తలెత్తింది అని ఖర్గే చెప్పడం ద్వారా కొత్త అనుమానాలను రేకెత్తించారు. ఇద్దరు నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడతామని అంతకుముందు చెప్పేవారు. ఖర్గే తాజా వ్యాఖ్యలు అన్ని లెక్కాచారాలను తలకిందులు చేసేలా ఉన్నాయని నాయకులు భావిస్తున్నారు. సిద్దరామయ్య, డీకే వాగ్బాణాలు ఇక జనవరి 5వ తేదీకి సిద్దరామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం పనిచేసిన నేతగా రికార్డు సృష్టిస్తున్నారు. నేనే ఐదు సంవత్సరాలు పదవిలో ఉంటా, అధికార మార్పిడి చర్చలు జరగలేదని సీఎం సిద్దరామయ్య బెళగావి అసెంబ్లీలో ప్రకటించి డీకే శివ ఆశల మీద నీళ్లు చల్లారు. ఆ రోజు ఢిల్లీలో తమ మధ్య అధికార మార్పిడి ఒప్పందం జరిగిందని డీకే మళ్లీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల మధ్య వారిద్దరే గొడవను పరిష్కరించుకోవాలని ఖర్గే చెప్పడం ద్వారా బంతిని బెంగళూరు మైదానానికి పంపించారు. ఖర్గే వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో భిన్న భావాలు ఏర్పడ్డాయి. సిద్దరామయ్య వర్గంలో సంతోషం, డీకే శిబిరంలో కలవరం నెలకొంది. రాహుల్గాంధీ, సోనియాగాంధీలతో మాట్లాడాలని డీకే నిశ్చయించినట్లు సమాచారం. నేడు ఢిల్లీకి డీసీఎం శివ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంగళవారం ఢిల్లీకి వెళ్తారు. గత 10 రోజుల్లో హస్తినకు వెళ్లడం ఇది రెండవసారి. హైకమాండ్ నేతలు తమ ఇద్దరితో ఓ విషయం చెప్పారని, దాని గురించి ఢిల్లీకి వెళ్లి చర్చించి పరిష్కరించుకుంటామని డీకే ఇటీవల తెలిపారు. ఢిల్లీలో శివకుమార్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ పోలీసుల విచారణకు హాజరవుతారు. కేంద్రజలశక్తి మంత్రి సీఆర్.పాటిల్ నేతృత్వంలో జరిగే నదుల అనుసంధానం సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రనీటి ప్రాజెక్టులకు, మెట్రో రైలు పథకానికి 50 శాతం నిధుల సాయం కోరనున్నారు. కాగా డీకేను కేపీసీసీ పదవి నుంచి తొలగించాలని, మరికొందరు డిప్యూటీ సీఎంలను నియమించాలని సిద్దరామయ్య ఆప్త మంత్రులు, ఎమ్మెల్యేలు లాబీయింగ్ చేస్తున్నారు. ఎత్తు, పై ఎత్తులతో రాష్ట్ర కాంగ్రెస్లో సెగ రాజుకుంది. సీఎం, డీసీఎంలే తేల్చుకోవాలన్న ఖర్గే వ్యాఖ్యలతో అంతా తారుమారు హైకమాండ్ పట్టించుకోదా? అనే సందేహాలు మైలారిలో సీఎం అల్పాహారం మైసూరు: మైసూరులో సీఎం సిద్దు టీకే లేఔట్లోని తన నివాసం వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పరిష్కారానికి హామీ ఇచ్చారు. తరువాత, అగ్రహారలో మైలారి హోటల్కు వెళ్లి దోసె, ఇడ్లీ అల్పాహారం ఆరగించారు. ఆయన వెంట మంత్రి వెంకటేష్, ఎమ్మెల్యే డి.రవిశంకర్, కలెక్టరు లక్ష్మీకాంత్ రెడ్డి, పోలీసు కమిషనర్ సీమా తదితరులు ఉన్నారు. బనశంకరి: జనవరి 15 లోగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని, మంత్రి సతీశ్ జార్కిహొళి కేపీసీసీ చీఫ్ అవుతారని సోమవారం బబలేశ్వర జ్యోతిష్యుడు ఉల్లాస్ జోషి చెప్పారు. దీనిని రాఘవేంద్రస్వామి తన నాలుక నుంచి పలికించారన్నారు. సమస్య గురించి జపం చేస్తూ రాఘవేంద్రస్వామికి నివేదిస్తానని, ఇందుకు స్వామివారు సమాధానం ఇస్తారని చెప్పారు. ఎంతోమందికి జాతకాలు చెప్పానని, ఏదీ అబద్ధం కాలేదన్నారు. జనవరి 15లోగా డీకే కుర్చీలో ఆసీనులవుతారన్నారు. ఈ జోస్యం రాజకీయాల్లో చర్చ రేకెత్తించింది. -
అరటి తోటలో పులి గర్జన
మైసూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకాలోని బండీపుర అభయారణ్యం పరిధిలో బరగి సమీపంలోని ముక్తి కాలనీ వద్ద అరటి తోటలో పెద్ద పులి పట్టుబడింది. వివరాలు.. జిల్లాలో పులుల దాడుల సంఘటనలు పెరగడంతో, అటవీ శాఖ సిబ్బంది గుండ్లుపేట తాలూకాలోని భీమనబీడు, చామరాజనగర తాలూకాలోని నంజెదేవన్పుర పరిసరాల్లో గాలింపు జరుపుతున్నారు. శుక్రవారం భీమనబీడు గ్రామం వద్ద రెండు ఆవులు అరటి తోటలో మేస్తుండగా పులి దాడి చేసింది. ఒక ఆవు ముందు కాలును కరిచింది, మరొక ఆవు వెనుక కాలిని గాయపరిచింది. గత వారం రోజులుగా పులి మేకలను చంపి తింటోంది. పులిని పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మత్తు మందు ఇచ్చి.. ఈ నేపథ్యంలో సోమవారం అరటి తోటలో పులి దాక్కున్నట్లు గుర్తించిన అటవీ సిబ్బంది దానిని వలలతో చుట్టుముట్టారు. మత్తు మందును తుపాకీ ద్వారా కొట్టారు. కొంతసేపటికి అది మత్తులోకి జారుకుంది. వెంటనే దానిని బంధించారు. పులి వయస్సు దాదాపు 7, 8 సంవత్సరాలు ఉంటుందని. పులి ఎద, వెనుక కాళ్ళపై గాయాలు ఉన్నాయని, మరో పులితో జరిగిన పోరాటంలో గాయపడి ఉండవచ్చని అటవీ అధికారులు తెలిపారు. అది కోలుకునేవరకు చికిత్స చేస్తారు. పులిని మైసూరు జూ కు తరలించినట్లు తెలిసింది. వారంరోజులుగా గ్రామస్తులకు భయం ఎట్టకేలకు నిర్బంధం గుండ్లుపేట తాలూకాలో ఘటన -
మైసూరులో మది దోచే మ్యాగి వేడుక
రాజ్యాంగ గ్రంధానికి పుష్ప రూపం ఆదిశేషుడు మైసూర్: క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మైసూరులో జిల్లా యంత్రాంగంచే అంబా విలాస్ ప్యాలెస్ ఆవరణలో 21 నుండి 31 వరకు మ్యాగి ఉత్సవాలు– పుష్ప ప్రదర్శన అందరినీ ఆకర్షిస్తోంది. దేశ, విదేశాల నుంచి మైసూరుకు వచ్చే పర్యాటకులను ఆహ్లాదపరిచేందుకు లక్షలాది పుష్పాలతో వైవిధ్య పుష్ప రూపాలను రూపొందించారు. శృంగేరి ఆలయం, దివంగత చెట్లమాత తిమ్మక్క, హంసలు, రాజ్యాంగ పుస్తకం, ఇంకా అనేక ఆకృతులు అబ్బురపరుస్తాయి. అలాగే సాయంత్రం వేళల్లో సంగీత కచేరీ వీనులవిందు చేస్తోంది. కలెక్టరు లక్ష్మికాంతరెడ్డి, అధికారులు సోమవారం సందర్శించారు.సుందరమైన పూల హంసలు అల్లరి ఉడుత -
మట్టిలో మాణిక్యం.. గుర్తింపు దక్కని వైనం
హుబ్లీ: క్రీడా రంగంలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన యాదగిరి జిల్లా క్రీడాకారుడికి తీరని అవమానం జరిగింది. వివరాలు.. యాదగిరి జిల్లా క్రీడా మైదానంలో తగిన వసతులు లేక క్రీడాకారులు పడరాని పాట్లు పడుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ దుస్థితి నెలకొన్నా సంబంధిత ఆఖ అధికారుల్లో ఎలాంటి స్పందన లేదు. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ఏమి పట్టించుకోవడం లేదని ఖేలో ఇండియా ఫేం క్రీడాకారుడు లోకేష్ రాథోడ్ పెదవి విరిచారు. సోమవారం మైదానం ఎదుట రోడ్డులో తాను సాధించిన వివిధ పతకాలను ప్రదర్శించి ధర్నా చేపట్టారు. గత నెలలో రాజస్తాన్ రాజధాని జైపూర్లో ఖేలో ఇండియా జాతీయ క్రీడల్లో పాల్గొని మూడో స్థానం చేజిక్కించుకొని దేశ గౌరవాన్ని పెంచానన్నారు. ఇప్పటి వరకు వివిధ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని 50కి పైగా పతకాలను సాధించారు. జాతీయ డెకథ్లాన్ పోటీలు–2025కు కసరత్తు చేసే క్రమంలో తగిన సౌకర్యాల కొరతతో బెంగళూరుకు ఎంతో వ్యయప్రయాసలతో వచ్చి వెళ్లాల్సి వస్తోందన్నారు. ఈ కారణంగా ఎన్నో పోటీల్లో పాల్గొనలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా పోటీల్లో తృతీయ విజేతగా నిలిచినా కూడా యాదగిరి జిల్లా యంత్రాంగం ఒక్కసారైనా తనను పిలిచి అభినందించలేదన్నారు. ఐపీఎల్ వంటి జల్సా ఆటల్లో పాల్గొనే క్రీడాకారులకు మాత్రం ఎక్కడ లేని స్వాగతాలు లభిస్తాయి. గ్రామీణ ప్రాంత పేదరికం నేపథ్యంలో క్రీడాకారులు జిల్లా యంత్రాంగానికి కానీ పాలకుల కంటికి గాని కనిపించడం లేదని వాపోయారు. గత మూడున్నరేళ్ల నుంచి జిల్లా క్రీడా యోజన అధికారికి నిరంతరంగా వినతిపత్రాలు సమర్పించి సమస్యలను ఏకరువు పెట్టినా ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆ జాతీయ క్రీడాకారుడు తన ఆవేదనను వ్యక్తం చేశారు. రోడ్డుపై పతకాలను ప్రదర్శించి జాతీయ క్రీడాకారుడి అక్రందన -
విశాఖపట్నం రైలును రాయచూరు వరకు నడపాలి
రాయచూరు రూరల్: విశాఖపట్నం రైలును రాయచూరు వరకు నడపాలని రాయచూరు లోక్సభ సభ్యుడు కుమార నాయక్ను ప్రవాసాంధ్ర ప్రముఖుడు సూర్యదేవర నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం రాయచూరు లోక్సభ సభ్యుడు కుమార నాయక్ను ఆయన కార్యాలయంలో కలుసుకుని పుష్పగుచ్ఛం సమర్పించిన అనంతరం మాట్లాడారు. విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్కు ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు చేరుకునే ఈ రైలును రాయచూరు వరకు పొడిగించాలన్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు ఎంతో అనుకూలం అవుతుందని తెలిపారు. అగ్నిప్రమాదంలో థియేటర్ బుగ్గి హుబ్లీ: గదగ్ నగరంలోని ఓ సినిమా థియేటర్లో ఆకస్మికంగా అగ్నిప్రమాదం చోటు చేసుకోగా అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణపాయం జరగలేదు. కానీ థియేటర్లోని కుర్చీలు, తెర, స్పీకర్లు, పీఓపీ, ఫ్యాన్లు, ఏసీలు తదితర పరికరాలు కాలి బూడిదయ్యాయి. శాంతి టాకీస్లో ఈ ప్రమాదం చోటు చేసుకోగా సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం అధికారులు, సిబ్బంది హుటాహుటిన విచ్చేసి మంటలను ఆర్పి భారీ నష్టం జరగకుండా నివారించారు. ఘటనపై బెటగేరి లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా సోమవారం సూర్యోదయాన్నే ప్రమాదం వల్ల స్థానికులతో పాటు సదరు థియేటర్ యజమాని, ఇతర సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. విజ్ఞాన రంగంలో కొత్త ఒరవడికి బాటలు రాయచూరు రూరల్: శాసీ్త్రయ, విజ్ఞాన రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని డయట్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర శేఖర్ భండారి పేర్కొన్నారు. సోమవారం దేవదుర్గ తాలూకా శివంగి ప్రభుత్వ హైస్కూల్లో శాసీ్త్రయ, విజ్ఞాన సమ్మేళనం–2025ను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని సద్వినియోగ పరచుకోవాలని కోరారు. కార్యక్రమంలో మల్లికార్జున, తహసీల్దార్ నాగమ్మ, జాన్ రాబర్ట్లున్నారు. వీనుల విందుగా సంగీత సమ్మేళనం రాయచూరు రూరల్: నగరంలో ఆదివారం రాత్రి సంగీత పితామహుడు పండిత సిద్ధరామ జంబలదిన్ని జ్ఞాపకార్థం 37వ సంగీత సమ్మేళనాన్ని వీనుల విందుగా నిర్వహించారు. ఉదయ నగర్లోని స్వర సంగమ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కిల్లె బృహన్మఠం శాంత మల్ల శివాచార్య ప్రారంభించారు. అంతర్జాతీయ క్లారినెట్ విద్వాంసుడు, స్వర సంగమ సంగీత కళాశాల అధ్యక్షుడు వడవాటి నరసింహులు, భరత్, శారద, చంద్రశేఖర్, వెంకటసింగ్, శివప్రసాద్లున్నారు. జీరామ్జీ బిల్లును ఉపసంహరించుకోండిహొసపేటె: అభివృద్ధి చెందిన భారతదేశంలో జీరామ్జీ బిల్లు– 2025 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. జీరామ్జీ బిల్లు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగ)బిల్లు– 2005కు పూర్తి వ్యతిరేకమన్నారు. ఈ బిల్లును కార్మికులు, కార్మిక సంఘాలు, ఆలోచనాపరులు, మేధావులు, కార్యకర్తలతో ఎలాంటి సంప్రదింపులు జరుపకుండా రూపొందించారన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం పేదల ఉపాధి హక్కును హరించే కుట్ర అని ఆరోపించారు. భార్యను చంపి ప్రమాదంగా ప్రచారందొడ్డబళ్లాపురం: భార్య తలపై బండరాయితో బాది దారుణంగా హత్య చేసిన భర్తను బాగలూరు పోలీసులు అరెస్టు చేశారు. మిట్టగానహళ్లికి చెందిన గాయత్రి(55)ని ఆమె భర్త అనంత్(62)హత్య చేశాడు. ఇద్దరి మధ్య తరచూ పోట్లాటలు జరిగేవి. ఈ క్రమంలో భార్యను అనంత్ తమ స్థలం వద్దకు తీసికెళ్లి తలపై బండరాయితో కొట్టి చంపాడు, రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని అందరికీ చెప్పాడు. అయితే స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇంటి వద్దకు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారణకు వచ్చారు. తరువాత అనంత్ను విచారించగా అసలు విషయం చెప్పాడు. వీరికి పీయూసీ చదువుతున్న కుమార్తె ఉంది. నిందితున్ని అరెస్టు చేశారు. -
రైల్వే డిమాండ్లు పరిష్కరించండి
హొసపేటె: హొసపేటె–కొట్టూరు–దావణగెరె మీదుగా మంగళూరుకు నేరుగా రైలు ప్రారంభిస్తే, ప్రపంచ వారసత్వ ప్రదేశాల మధ్య కనెక్టివిటీని అందిస్తుందని రైల్వే అభివృద్ధి సంఘం నేత యమునేష్ తెలిపారు. సోమవారం నగరంలో ఎంపీ ఈ.తుకారాంకు వినతి పత్రాన్ని అందజేశారు. హొసపేటె– షోలాపూర్ మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైలును పండర్పూర్ వరకు పొడిగించాలన్నారు. తద్వారా పాండురంగ విఠల భక్తులకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. హొసపేటె రైల్వే స్టేషన్ ఆధునీకరణ, పిట్ లైన్ నిర్మాణం, 2 కొత్త ఫ్లాట్ఫాంల నిర్మాణం చేపట్టి దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు అనుకూలంగా స్టేషన్ను అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా విజయనగర రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో బళ్లారి లోక్సభ సభ్యుడు ఈ.తుకారాంను కలిసి బెళగావి– హొసపేటె–రాయచూరు –హైదరాబాద్– మణుగూరు రైలు పునః ప్రారంభం గురించితో పాటు రైల్వే డిమాండ్లపై పిటిషన్ సమర్పించారు. విజయనగర రైలు వినియోగదారుల సంఘం అధ్యక్షుడు వై.యమునేష్, కార్యదర్శి మహేష్ కుడితిని, నాయకులు దీపక్ ఉల్లి, జీర కల్లేశ్, ప్రభాకర్, ఎం.శంకరప్ప, కేవీ.రమాలి, ఆర్.రమేష్గౌడ, నజీర్సాబ్, శ్రవణ్కుమార్ జే.వరుణ్, మనోహర్, కృష్ణమూర్తిరావు, నాగరాజరావు, అరుణ్కుమార్, శ్రీనివాస్ రావు, అమర్ నాథ్ కటరే, హరిశంకర్ రావు తదితరులున్నారు. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
రాయచూరు రూరల్: రాయచూరు, యాదగిరి జిల్లాల్లో కృష్ణా నదీ తీరం వెంట ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా, మూడు పువ్వలు, ఆరు కాయలుగా సాగుతోంది. వర్షాభావంతో రైతుల పశువులు, ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతోంటే దర్జాగా టిప్పర్ల ద్వారా రాత్రికి రాత్రే ఇసుకను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఇసుక వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇసుక అక్రమ రవాణ చేసే వారిపై పోలీస్, రెవెన్యూ, ఆర్టీఓ శాఖల అధికారులు మౌనం వహిస్తున్నారు. నారాయణపుర జలాశయం కింది భాగంలో జేసీబీలు, హిటాచీలు, ట్రాక్టర్లు, టిప్పర్లతో యాదగిరి, రాయచూరు జిల్లాలు, తెలంగాణలోని జూరాల, గూగల్, గుర్జాపూర్, దేవదుర్గ, వడగేర, సురపుర, భీమరాయన గుడి, శహాపుర ప్రాంతాల్లో చెక్పోస్టులున్నా పోలీసుల కళ్లుగప్పి అక్రమార్కులు ఇసుక రవాణాను నిరాటంకంగా సాగిస్తున్నారు. భాగ్యనగరానికి భారీగా తరలింపు హైదరాబాద్తో పాటు మహారాష్ట్రలోని షోలాపూర్, సాంగ్లీ, మీరజ్ల వరకు అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది. ఒక టిప్పర్కు రూ.55 వేల నుంచి రూ.60 వేలు, కలబుర్గి జిల్లాలో రూ.80 వేలు, ఇతర రాష్ట్రాలకు రూ.1.50 లక్షల వరకు ధరలు పలుకుతున్నాయి. నిత్యం సుమారు 400 టిప్పర్ల మేర ఇసుక అక్రమ రవాణా అవుతోంది. ప్రతి టిప్పర్లో 35 టన్నుల మేర ఇసుకను రవాణా చేస్తున్నారు. రోజు రూ.2 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు కొనసాగుతాయి. యాదగిరి జిల్లా ఇంచార్జి మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్, దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ల నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా వాహనాల సంచారం అధికమైంది. ఇంత జరుగుతున్నా కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాధికారులు, ఎస్పీలు మౌనం వహించడంపై ప్రజలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. మూడు పువ్వులు, ఆరు కాయలుగా వ్యవహారం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికార గణం -
మానవతా విలువలు పెంచుకోవాలి
రాయచూరు రూరల్: విద్యార్థులు మానవతా విలువలను పెంచుకోవాలని కిల్లె బృహన్మఠం శాంతమల్ల శివాచార్య స్వామీజీ పేర్కొన్నారు. సోమవారం తాలూకాలోని నెలెహాళ్ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన కళా ఉత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు మొక్కలు పెంచడంతో పాటు ప్లాస్టిక్ నిర్మూలన, స్వచ్ఛతకు శ్రీకారం చుట్టాలన్నారు. క్రమశిక్షణతో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించాలన్నారు. బీఈఓ ఈరణ్ణ కోసిగి, పాఠశాల ట్రస్టీ మహేశ్వరి, రాఘవేంద్ర, రవి, తిమ్మణ్ణ నాయక్, శ్రీనాథ్లున్నారు. జనవరిలో జిల్లా ఉత్సవాలురాయచూరు రూరల్: జిల్లాలో జనవరి 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు రాయచూరు జిల్లా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. దశాబ్దం అనంతరం చేపడుతున్న జిల్లా ఉత్సవాల్లో అందరూ చురుకుగా పాల్గొని విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ దిశగా ఉత్సవాలకు అధికారులు ఇప్పటి నుంచే తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏడీసీ శివానంద, ఏఎస్పీ కుమారస్వామి, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి నరేష్, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ఈరన్న, సంతోష్ రాణి, సురేష్ వర్మలున్నారు. చిరుధాన్యాలతో ఆరోగ్య విప్లవంరాయచూరు రూరల్: దేశంలో చిరుధాన్యాల వినియోగంతో ఆరోగ్య విప్లవం జరుగుతుందని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అన్నారు. సోమవారం వ్యవసాయ వర్సిటీలో సిరిధాన్యాల జాతాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళ్యాణ కర్ణాటకలోని ఏడు జిల్లాల్లో వర్షాధారిత ప్రాంతాల్లో జొన్నలు, కొర్రలు, సజ్జలు, మినుములు, నువ్వులు, రాగులు, గోధుమ పంటలు పండించవచ్చన్నారు. సర్కార్ వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయనుందన్నారు. జాతాలో వైస్ చాన్సలర్ హన్మంతప్ప, అధికారులు ప్రకాష్ చౌహాన్, కృష్ణలున్నారు. పథకం పేరు మార్పు తగదు రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(నరేగ) పథకం పేరును మార్చడం తగదని గ్రామీణ కూలీ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో కార్యదర్శి గురురాజ్ మాట్లాడారు. పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చి పేదల కడుపు కొట్టడానికి కుట్ర చేస్తోందన్నారు. నరేగ పథకం పేరును యథాతథంగా కొనసాగించాలన్నారు. ఈ పథకం కింద కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో పనులు చేయించడానికి అనుమతి ఉంటుందని వివరించారు. ఆందోళనలో అజీజ్ జాగీర్దార్, కలమంగి పంపాపతి, హన్మంతరాయ, జగదీష్, మహేష్, జిలాని, హనీఫ్, శ్రీనివాస్లున్నారు. బంగ్లా అక్రమ వలసదారులతో సమస్య దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడం పోలీసులకు కష్టంగా మారింది. రాష్ట్రంలో కనీసం 485 మంది అక్రమ బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 308 మందిని బహిష్కరించారు. కొందరు స్థానికులు వలసదారులకు సహకరిస్తుండడంతో వారిని గుర్తించడం సాధ్యం కావడం లేదు. నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి వలసదారులు ఆధార్ తీసుకుని లోకల్ అని చెప్పుకుంటున్నారు. మరోవైపు చదువులు, టూరిస్టుల పేరుతోభారత్లోకి అగుడుపెట్టిన వారు వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోయారు. కేంద్ర హోంశాఖ తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరులో 344, మంగళూరులో 41, బెంగళూరు జిల్లాలో 49, తుమకూరులో 1,కోలారులో 12, హాసన్లో 3, కొడగులో 1, చిత్రదుర్గలో 6, ధారవాడలో 2, శివమొగ్గలో 12, ఉడుపిలో 10, ఉత్తరకన్నడలో 4 మంది అక్రమ వలసదారులను గుర్తించారు. కొందరు నేరాలకూ పాల్పడుతున్నారు. రాష్ట్రంలో 157 మంది అక్రమ వలసదారులపై మొత్తం 37 నేరాల కేసులు నమోదయ్యాయి. -
బిహార్ సీఎం రాజీనామాకు డిమాండ్
రాయచూరు రూరల్: ముస్లిం మహిళలను అవమానపరిచిన బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేసింది. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు సయ్యద్ మహ్మద్ మాట్లాడుతూ ప్రజలు ఏర్పాటు చేసిన సమావేశంలో ముస్లిం మహిళ ధరించిన బురఖాను అక్కడి సీఎం తీసి చూడటం రాజ్యాంగ బద్ధంగా మైనార్టీ ధర్మానికి వ్యతిరేకమన్నారు. హిజాబ్ను తీసి చూసిన ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో తౌసిఫ్, అక్బర్ హుసేన్, ఫర్జానా, మాసూమ్, తయ్యబా, జానీ, షఫీ, జాఫర్లున్నారు. హిజాబ్ ఘటన మత వ్యతిరేకం మైనార్టీ మహిళ హిజాబ్ను తొలగించి చూసిన ఘటనకు నైతిక బాధ్యత వహించి బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని ఏఐఎంఐఎం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళననుద్దేశించి అధ్యక్షుడు ఫారూక్ షేక్ మాట్లాడారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ సామాన్యులు సంచరించే ప్రదేశంలో నిండు సమావేశంలో మైనార్టీ మహిళ వేసుకున్న బురఖాను తీసి చూడటం ముస్లిం మతానికి వ్యతిరేకమన్నారు. హిజాబ్ను తొలగించిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో ఖాజావలి, హాజీ, అఫ్తాబ్ హుసేన్, తన్వీర్, అల్తాఫ్, రహీం, అజీజ్, రఫీ, జలాల్లున్నారు. -
వేషభాషణ చట్టాన్ని విరమించుకోవాలి
బళ్లారిఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన హిందూ వ్యతిరేక వేషభాషణ చట్టాన్ని విరమించుకోవాలని జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. రాయల్ సర్కిల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అనంతరం జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. జిల్లాధ్యక్షుడు అనిల్కుమార్ మోకా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఆసక్తి చూపకుండా ఇలాంటి ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొస్తోందన్నారు. నగరంలో మట్కా, ఇస్పేట్, అక్రమ మద్యం అమ్మకాలు, దొంగతనం, వేశ్యావాటిక, గంజాయి వంటి అమ్మకాలు చేపడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇటీవల మహిళలపై కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. హిందూ వ్యతిరేక వేషభాషణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు శ్రీనివాస్ మోత్కర్, కే.హనుమంతప్ప, ధరప్పనాయక్, రామలింగప్ప, మారుతీ ప్రసాద్, గోవిందరాజులు, అరుణ, బాలచంద్ర, గోవింద్, సిద్దేష్, లోకేష్, నాగరాజు, ఆర్.మల్లేశ్, పుష్ప, చంద్రశేఖర్, చాందిని తదితరులు పాల్గొన్నారు. -
సౌకర్య లోపం.. ప్రజలకు శాపం
హుబ్లీ: నగరానికి వివిధ పనుల కోసం విచ్చేసే ప్రజలకు ప్రకృతి బాధలైన మూత్ర, మలవిసర్జన ఎక్కడ చేయాలో తెలియక పడరాని పాట్లు పడుతున్న దృశ్యాలు కాసింత పరికించి చూస్తే తేటతెల్లం అవుతుంది. మరుగుదొడ్ల వ్యవస్థ కల్పించాల్సిన హుబ్లీ ధార్వాడ సిటీ కార్పొరేషన్ ఆవరణలో శౌచాలయం ఉండీ లేనట్లుగా అఘోరించడంతో ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. పాలికెకు వివిధ పనుల కోసం నిత్యం వందలాది మంది వస్తుంటారు. మూత్రవిసర్జన బయలు ప్రదేశంలో చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక బహిర్భూమి సంగతి సరేసరి. వీటిపై జాగృత పరిచే పాలికె ఆవరణలో ఇలాంటి దుస్థితి ఉన్నా కూడా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా పాలించే ప్రజాప్రతినిధులు గాని సంబంధిత ఉన్నతాధికారులు కాని వారి చేతికింద ఉన్న సిబ్బంది కానీ ఈ దుస్థితి గురించి పట్టించుకోవడం లేదు. పాలికె ఆవరణలో ఓ శౌచాలయాన్ని నిర్మించారు. నిర్వహణ కొరతతో సంవత్సరాలుగా దాన్ని వాడటానికి సాధ్యపడటం లేదు. ఆ మరుగుదొడ్డి లోపలికి వెళితే తరతరాల వాసన ముక్కుపుటాలను అదరగొడుతుంది. దీంతో స్థానికులు బహిర్భూమి ప్రాంతంలోనే తమ ఒకటి, రెండు సమస్యలను తీర్చుకుంటున్నారు. పాలికె ఆవరణలో మరుగుదొడ్ల స్వచ్ఛత, ఉత్తమ ఆరోగ్యం కోసం మరుగుదొడ్డినే వాడండి అన్న నినాదం వెక్కిరిస్తోంది. అయితే శౌచాలయానికి ముక్కు మూసుకొని వెళ్లక తప్పడం లేదు. మరుగుదొడ్డిలో తగిన నీటి వసతి కూడా కరువైంది. వివిధ పనుల కోసం పాలికె ఆవరణలోకి అడుగు పెట్టిన ప్రజలకు శౌచాలయ సమస్య నరకయాతన దర్శనమిస్తుంది. మొత్తం మీద బయలు మరుగుదొడ్డి ఇక్కడ తప్పనిసరి అని స్థానిక తంతు క్షౌ రశాల యజమాని చెన్నమ్మ సర్కిల్ అంగడి నివాసి గోవిందరాజులు, మంజునాథ్, సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యేక మరుగుదొడ్ల వసతి ఉండగా దీంతో వీరు వాటినే వాడతారు. అయితే జనసామాన్య ప్రజలకు ఉండే ఒకే ఒక్క శౌచాలయం ఉండగా నిర్వహణ కొరతతో చెత్తచెదారానికి మరుగుదొడ్లు నెలవయ్యాయి. పాలికెకు వచ్చిన సార్వజనికులు సమీపంలోని హోటల్పై ఆధారపడుతూ తమ ఈతి బాధలను అక్కడికి వెళ్లి తీర్చుకుంటున్నారు. బీజేపీ సీనియర్ కార్పొరేటర్ తిప్పణ్ణ మజ్జిగి ఈ సమస్యపై స్పందించారు. స్థానికులకు అవసరమైన వసతులు కల్పించడం పాలికె కర్తవ్యం అని పాలికె కమిషనర్తో మరుగుదొడ్ల మరమ్మతులతో పాటు నిర్వహణ తీరు గురించి చర్చిస్తానన్నారు. మేయర్ జ్యోతి పాటిల్ తక్షణమే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చి తగిన సూచనలు చేసిన అధికారి ప్రబుద్ధులు సాక్షాత్తు మేయర్ ఆదేశాలను కూడా పట్టించుకోక పోవడం శోచనీయం. ఇప్పటికై నా పాలికె ఆవరణలో ఉన్న సార్వజనిక మరుగుదొడ్లకు తక్షణమే మరమ్మతులు చేయించి పాలికె పనుల కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంచుతామని పాలికె కమిషనర్ డాక్టర్ రుద్రేష్ గాలి తెలిపారు. హుబ్లీలోని సిటీ కార్పొరేషన్ కార్యాలయం హుబ్లీలోని కిత్తూరు రాణి చెన్నమ్మ కూడలి నగరంలో కాలకృత్యాలు తీర్చుకునేదెలా? నగరానికి వచ్చిన ప్రజలకు తప్పని తిప్పలు కానరాని ప్రజా మరుగుదొడ్లు, మూత్రశాలలు పట్టించుకోని హుబ్లీ–ధార్వాడ మహానగర పాలికె యంత్రాంగం సమస్యలమయంగా మరుగుదొడ్లు ఈతి బాధలకు హోటలే గతి -
ప్రేమకు ప్రతిరూపం క్రిస్మస్
బనశంకరి: ప్రేమకు ప్రతిరూపం క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆనందంగా జరుపు కొంటున్నారని తెలుగు బాప్టిస్ట్ చర్చి (టీబీసీ) పాస్టర్ రెవరెండ్ ఎం.బీ.మోసెస్ తెలిపారు. ఆదివారం రాత్రి రామచంద్రపురలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. తెలుగు క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సమాజంలో అసమానతల తొలగింపునకు కరుణామయుడు ఏసుక్రీస్తు పోరాటం చేశారని, శాంతి, ప్రేమలతో కూడిన సమాజం కోసం శ్రమించారని తెలిపారు. ఈ సందర్భంగా బాలలు క్రీస్తు జన్మవృత్తం నృత్యనాటికతో పాటు మహిళలు ఆంధ్ర క్రైస్తవ గీతాలను ఆలపించారు. పాస్టర్లు కేఎన్.రావు, బాలసుందరం తదితరులు పాల్గొన్నారు. -
సాగు రుణాలు మెండుగా ఇవ్వండి
కోలారు: వ్యవసాయ తదితర రుణాలను ప్రాధాన్యత క్రమంలో విరివిగా అందించాలని జెడ్పీ సీఈఓ ప్రవీణ్ బాగేవాడి తెలిపారు. సోమవారం జెడ్పీ భవనంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగానికి అధికంగా రుణాలు అందించాలన్నారు. అటల్ పింఛన్ పథకం లక్ష్యాన్ని సాధించిన బ్యాంకర్లను ఆయన అభినందించారు. పీఎంజేజేవై, పీఎంఎస్బీవై పథకం కింద అధికంగా ప్రజలను చేర్చాలని బ్యాంకర్లకు సూచించారు. ప్రధానమంత్రి సురక్షా పథకం వార్షిక ప్రీమియం రూ.20, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో ప్రతి త్రైమాసికానికి ఉన్న వార్షిక ప్రీమియం రూ.436లను వినియోగదారులు చెల్లించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం కింద అధికంగా రుణాలు అందించాలన్నారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఈ సిల్వియా గౌతం, నబార్డు డీడీఎం హిమాంశు శుక్లా, కెనరా బ్యాంకు ప్రాంతీయ ప్రముఖుడు అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకర్లకు జెడ్పీ సీఈఓ సూచన -
రాజకీయాల్లో తమిళ హీరోలు.. మరి మీరెందుకు లేరు?
చాలామంది సెలబ్రిటీలు సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ ప్రవేశించారు. ప్రజలకు సేవ చేసేందుకు పాలిటిక్స్లో అడుగుపెట్టామన్నది వారి వాదన. అలా తమిళనాడులో జయలలిత, ఎంజీఆర్, విజయకాంత్, శరత్కుమార్, కమల్ హాసన్, విజయ్.. ఇలా అందరూ రాజకీయాలను ఎంచుకున్నావే.. కానీ కర్ణాటకలో సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం చాలా అరుదు. ఇదే ప్రశ్న ఓ విలేఖరి స్టార్ నటుడు శివన్నను అడిగాడు.కారణాలేంటి?కన్నడ నటులు శివరాజ్కుమార్, ఉపేంద్ర, రాజ్ బి.శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 45: ది మూవీ. మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ జనవరి 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్లో శివన్నకు.. కన్నడ నటులు రాజకీయాల్లోకి ఎందుకు రావడం లేదు? దానివెనక గల కారణాలేంటి? అన్న ప్రశ్న ఎదురైంది.నా డబ్బుతో సేవ చేస్తా..అందుకాయన స్పందిస్తూ.. నాకు రాజకీయాలు తెలియవు. అధికారం, పదవి లేకపోయినా జనాలకు సేవ చేయడమే నాకు తెలుసు. రాజకీయాలు కొన్నిసార్లు జనాల మధ్య బేధాన్ని సృష్టిస్తాయి. కానీ నేను నా డబ్బుతో ఎటువంటి పక్షపాతం చూపించకుండా జనాలకు సేవ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్గా మారింది.ఎన్నికల్లో శివన్న భార్యకాగా శివరాజ్కుమార్ రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన భార్య గీత గతేడాది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి శివమొగ్గ ఎంపీ అభ్యర్థిగా ఎలక్షన్స్లో నిలబడింది. భార్య కోసం శివన్న ప్రచారం కూడా చేసినప్పటికీ ఆమె ఓడిపోయింది. కాగా గీత మరెవరో కాదు.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సారెకొప్ప బంగారప్ప కుమార్తె! You don't need to enter politics or seek power like @TVKVijayHQ . Politics introduces bias towards people & I prefer to help everyone impartially, using my own money 🙌 @NimmaShivanna - Clarity 👌🔥🔥#45TheMovie #Jailer2 #Shivannapic.twitter.com/7BIBRl3j1E— Achilles (@Searching4ligh1) December 22, 2025 -
కాంగ్రెస్లో చీలికలేంటి?..
కర్ణాటకలో పవర్ పాలిటిక్స్కు బ్రేక్ఫాస్ట్, లంచ్ భేటీలతో హైకమాండ్ పుల్స్టాప్ పెట్టిందని భావిస్తున్న వేళ.. ఈసారి కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. సీఎం సిద్ధరామయ్య సన్నిహితులతో డిప్యూటీ సీఎం శివకుమార్ వరస భేటీలు జరపుతుండడం.. వాటిపై అధిష్టానం సీరియస్గా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఆ ప్రచారంపై డీకే శివకుమార్ ఓపెన్ అయ్యారు. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయలపై జరుగుతున్న తాజా ప్రచారాలను సోమవారం మీడియా సాక్షిగా డీకే శివకుమార్ తోసిపుచ్చారు. సిద్ధరామయ్య, తాను అన్నదమ్ముల్లా పని చేస్తుంటే ఇంక కాంగ్రెస్లో చీలిక ఎందుకు ఉంటుందని అన్నారాయన. ‘‘సిద్ధరామయ్యతో నాకు 16 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆ బంధం ఇక మీదట కూడా కొనసాగుతుంది. అన్నదమ్ముల్లా మేం మా పని చేసుకుంటూ పోతున్నాం. అలాంటప్పుడు పార్టీలో అంతర్గత విబేధాలు.. చీలికలు ఎందుకు వస్తాయి?. అధిష్టానం ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేస్తుంది??.. ఇది కేవలం.. మీడియా, బీజేపీ సృష్టిస్తున్న ఊహాగానాలే’’ అని అన్నారాయన. సీఎం సిద్ధరామయ్యకు అత్యంత ఆప్తుడిగా పేరున్న మాజీ మంత్రి కేఎన్ రాజన్నతో ప్రత్యేకంగా భేటీ కావడంపై డీకే శివకుమార్ స్పష్టత ఇచ్చారు. ‘‘ఇందులో రాజకీయ కోణం ఏం లేదు. రాజన్న నాకు కూడా ఆప్తుడే. గతంలో ఎస్ఎం కృష్ణ హయాంలో ఆయనకు ఓ కీలక పదవి ఇప్పించా. నేను ఆయన్ని కలిసింది మర్యాదపూర్వకంగానే‘‘‘ అని అన్నారాయన. అలాగే.. కాంగ్రెస్లో ఏ నేతతోనూ తనకు విబేధాల్లేవని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.పవర్ షేరింగ్.. సీఎం సీటు కోసం ఢిల్లీలో చేసిన ప్రయత్నాలు.. ఈ ప్రయత్నాలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందన్న కథనాలపైనా డీకే రియాక్ట్ అయ్యారు. ‘‘నా ఢిల్లీ పర్యటనలేవీ రాజకీయ పరమైనవి కావు. ఉన్నత స్థాయి సమావేశాల్లో భాగంగానే జరిగాయి. బెంగళూరు మెట్రో ప్రాజెక్టు నిధుల కోసం, ఇతర అభివృద్ధి కోసమే నేను హస్తినకు వెళ్లా’’ అని అన్నారు. అయితే.. కర్ణాటక అధికార కాంగ్రెస్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని పార్టీ సీనియర్ నేత వీఆర్ సుదర్శన్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఓ లేఖ రాశారు. ఈ విషయాన్నే డీకే వద్ద స్పందించగా.. ఆ లేఖ సారాంశం వేరని.. కాంగ్రెస్లో లుకలుకలు నెలకొన్నాయని బీజేపీ సృష్టించిన ప్రయత్నమే ఆ ప్రచారమని కొట్టిపారేశారాయన. -
మళ్లీ జగనన్న పాలనకు కృషి
బనశంకరి: హెచ్ఎస్ఆర్ లేఔట్లోని సమర్థనం దివ్యాంగుల ట్రస్ట్లో డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తరువాత మధ్యాహ్నం 1 గంటకు కేక్ కటింగ్ నిర్వహించి బాలలకు పంచిపెట్టి అన్నదానం చేపట్టారు. ఫౌండేషన్ సంస్థాపక అధ్యక్షుడు బీ.రమణారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అన్నిరంగాల అభివృద్ధితో పాటు ప్రజాసంక్షేమానికి కృషిచేశారని తెలిపారు. మళ్లీ 2029లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రతి ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త సైనికునిగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో కూటమి పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాబు రాజేంద్రకుమార్, కాసినాయన ఎంపీటీసీ భాస్కర్రెడ్డి, కల్లూరు హుసేనయ్య, ముత్యాల నారాయణరెడ్డి, కేఎల్.వెంకటరెడ్డి, వెంకటరామిరెడ్డి, కల్లూరి ఉస్మాన్, నయాబ్, నారాయణరెడ్డి, వీరనారాయణరెడ్డి, పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. -
పోలియో నిర్మూలనకు కట్టుబడి ఉందాం
● ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హొసపేటె: మానవాళికి శాపంగా మారిన పోలియో వైరస్ నిర్మూలనకు అధికారులంతా కట్టుబడి ఉండాలని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. కమలాపూర్ సమీపంలోని హంపీ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంగణంలో చింతపండు, సీతాఫలం, లక్షణ పండ్లతో సహా వివిధ జాతుల మొక్కలను నాటి నీరు పోశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పిల్లలకు టీకాలు వేశారు. మంత్రి మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రాధాన్యం, వైభవం.. సంపన్న భారతదేశాన్ని నిర్మించాలనే సందేశం తీసుకువెళ్తాయన్నారు. విజయనగరాన్ని స్ఫూర్తిగా తీసుకొని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతామన్నారు. అనంతరం హవామా కార్యాలయ ప్రాంగణంలో ఆమె చింత చెట్టు నాటి నీరు పోశారు. ఎంపీ ఇ.తుకారాం, ఎమ్మెల్యేలు హెచ్ఆర్.గవియప్ప, డాక్టర్.ఎన్టి.శ్రీనివాస్ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ వ్యవహరాలు, రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా, నాగరాజు మద్దిరాల, రవిఅగర్వాల్, అనురాధ ఠాకూర్, అనిరుద్ధ శ్రవణ్. కే.మోసెస్చలై, దీప్తిగౌర్ ముఖర్జీ, కలెక్టర్ కవితా ఎస్.మన్నికేరి, తదితరులు పాల్గొన్నారు. హంపీలో నిర్మలా సీతారామన్ హొసపేటె: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రాత్రి హంపీలోని ఎలిఫెంట్ హౌస్ వద్ద ఏర్పాటుచేసిన లేజర్ షో(ధ్వని, కాంతి)ను వీక్షించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో హంపీకి చేరుకున్న ఆమె గత వైభవాన్ని గుర్తుచేసేలా నిర్వహించిన లేజర్షోను ఆసక్తిగా తిలకించారు. విజయనగర సామ్రాజ్యం వైభవం, శ్రీకృష్ణ దేవరాయ పాలనను ప్రతిబింబించేలా దేశ సంస్కృతి, వారసత్వాన్ని ప్రదర్శించి అందరినీ అలరింపజేశారు. శనివారం రాత్రి హంపీ అనిలే సమీపంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. -
చెరువు సంరక్షణకు చర్యలు
రాయచూరురూరల్: పురాతన కాలం నాటి చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజ్ తెలిపారు. నగరంలోని నీరుబావి కుంట చెరువు సంరక్షణ పనులకు ఆయన ఆదివారం భూమిపూజ చేసి మాట్లాడారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పైపులైన్లు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల చెరువులకు నీరందించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాపారెడ్డి, ఎంపీ కుమారనాయక్, శాంతప్ప, తాయన్న నాయక్, జయన్న, శాలం, తదితరులు పాల్గొన్నారు. శివానుభవ గోష్ఠిరాయచూరు రూరల్: శరణుల పరంపర, సంస్కతి మానవ మనుగడకు అవసరమని లింగ సూగురు ఆశ్రమవాసులు వరదానేశ్వర స్వామిజీ పిలుపునిచ్చారు. స్థానిక మారుతీనగర్లోని గిరి అభయాంజనేయ స్వామి అలయంలో ఆదివారం శరణుల చింతన శివానుభవ గోష్టిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 12వ శతాబ్దంలో ఆశ్రమ వాసులు వేసిన బాటలో పయనిస్తే ఎవరికీ ఎలాంటి ఆపదలు రావన్నారు. నేడు కులం, మతం పేరుతో మానవుడి జీవితం దుర్భరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరి, బసవరాజ్, లక్ష్మణ్, అయ్యన్న, శ్రీనివాస్, అశోక్, మహదేవప్ప, భీమన్న, చంద్ర శేఖర్, గిరియప్ప, అరుణ, కురుబర్, తదితరులు పాల్గొన్నారు. అప్పుల బాధతో రైతు అత్మహత్యరాయచూరు రూరల్: వ్యవసాయ కోసం తెచ్చిన అప్పుల తీరకపోవడంతో ఓ రైతు అత్మహత్య చేసుకున్న సంఘటన యాదగిరి జిల్లాలో జరిగింది. వివరాలు ఇవీ.. యాదగిరి జిల్లా వడగేర తాలుకహల గేరలో ఎల్లప్ప(55) తన మూడు ఎకరాల భూమిలో పంటలు సాగు చేశారు. అతివృష్టితో పంట దిగుబడులు రాక నష్టపోయారు. అయితే సాగుకోసం తెచ్చిన రూ.5 లక్షల అప్పులు తీర్చలేక మానసికంగా కుంగిపోయాడు. శనివారం సాయంత్రం పొలంలోనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వడగేర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాసులకు నిలయం.. రాయచూరు క్షేత్రం రాయచూరు రూరల్: దాసులు పుట్టిన నిలయం రాయచూరు క్షేత్రం అని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజ్ వెల్లడించారు. నగరంలోని జోడు వీరాంజనేయస్వామి ఆలయంలో బన్నెంజె గోవిందాచార్యుల 90వ నమన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బన్నెంజె గోవిందాచార్యులు విద్యా వాచస్పతి అని, సంస్క్రతం, కన్నడ సాహిత్యానికి దిగ్గజుడు అని పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో ఎంపీ కుమారనాయక్, రోహిత్చక్రవర్తి, విజయ సింహాచారి, రమేష్, వీణ, వెంకటేష్, త్రివిక్రంజోషి, నరసింగరావు, కవిత, దానప్ప, వీరహనుమాన్ విష్ణుతీర్థ, అరవింద్, తదితరులు పాల్గొన్నారు. సంస్కృతికి ప్రతీక పొరుగు సంబరంరాయచూరురూరల్: సంస్కృతిక ప్రతీకగా నిలిచిన పొరుగు సంబరాలను యాదగిరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే తమ ఎద్దుల బళ్లను చెరకు గడలు, పూలతో అలంకరించారు. వాటిపై ఊరేగింపుగా పొలానికి చేరుకుని భూ మాతకు పూజలు చేశారు. యడ్రామి, రామసముద్రం, అబ్బెతుంకురులో పొలాల్లోనే రైతు కుటుంబీకులు సామూహిక భోజనాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజనుల సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది. నియామకంకోలారు: కర్ణాటక జ్ఞాన విజ్ఞాన సమితి కోలారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా వై.మంజుళ నియమితులయ్యారు. సమితి జిల్లా అధ్యక్షుడు జి శ్రీనివాస్ మాట్లాడుతూ సమితి కార్యక్రమాలకు ఆమె నాయకత్వం అందించాలన్నారు. జగన్నాథ్, పద్మావతి పాల్గొన్నారు. -
కన్నడలోనే రైల్వే పోటీ పరీక్షలు
● కేంద్ర మంత్రి సోమణ్ణ కోలారు: నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానానికి దరఖాస్తు చేసుకోలేదు. ఆ పదవి గురించి హైకమాండ్ చూసుకుంటుందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ అన్నారు. ఆదివారం కోలారులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికలలో సిద్దరామయ్యపై పోటీ చేయాలని హైకమాండ్ ఆదేశిస్తే, పాటించాను. తరువాత లోక్సభ ఎన్నికలలో తుమకూరు నుంచి పోటీ చేయాలని చెబితే పోటీ చేసి గెలిచాను అని చెప్పారు. రైల్వే ఉద్యోగ పరీక్షలను కన్నడంలోనే రాయడానికి ప్రధాని మోదీ ఆమోదం తెలిపారన్నారు. దీనివల్ల కన్నడిగులకు ఉపయోగం కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విద్వేష ప్రసంగాల నిరోధక చట్టం గురించి స్పందిస్తూ సంస్కారం, సంస్కృతి తెలియని వారే ఇదంతా చేస్తారన్నారు. 12 లక్షల రైల్వే ఉద్యోగులు ఉన్నారు. ఇంతవరకు చిన్న ధర్నా కూడా చేయలేదు. రైల్వే ఉద్యోగులకు అన్ని సౌలభ్యాలు అందిస్తున్నామన్నారు. సీఎం సిద్దరామయ్య కుర్చీని కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. ప్రచారానికి చేసిన ఖర్చును అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించి ఉంటే ఎంతో ప్రగతి సాధ్యమయ్యేదన్నారు. రాష్ట్ర బీజేపీ లో ఎలాంటి అసమ్మతి లేదన్నారు. త్వరలో గృహలక్ష్మి సొమ్ము జమ: మంత్రి శివాజీనగర: రాష్ట్రంలో గృహలక్ష్మీ లబ్ధిదారులు వేచి చూస్తున్న పథకం సొమ్ము విడుదల గురించి మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ తీయని కబురు అందించారు. 3 నెలలుగా సొమ్ము పడలేదని ప్రతిపక్షాలు ఆరోపించడం తెలిసిందే. ఆదివారం బెళగావిలో మాట్లాడిన ఆమె సోమవారం నుంచి శనివారం లోగా 24వ కంతు సొమ్ము మహిళల ఖాతాల్లోకి జమ అవుతుందని చెప్పారు. ఆర్థికశాఖ నుంచి శనివారంలోగా సొమ్ము విడుదల కానుందని భరోసానిచ్చారు. మరణించిన మహిళల ఖాతాలకూ సొమ్ము పడుతోందని విలేకరులు ప్రస్తావించగా, ఈ విషయమై సీఎస్ నేతృత్వంలో 2 సార్లు సమావేశం జరిపారు. సాఫ్ట్వేర్ను మెరుగుపరిచాం. మరణ ధృవీకరణ పత్రాలను అంగనవాడి కార్యకర్తలు పరిశీలిస్తారు. డబ్బులను ఖాతాల నుంచి వెనక్కి తీసుకునే బాధ్యతను బ్యాంకులకు ఇచ్చినట్లు తెలిపారు. ఆన్లైన్ మిత్రుని వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం యశవంతపుర: ఆర్థిక సాయం చేసినందుకు ప్రతిఫలంగా కోరిక తీర్చాలని వేధించడంతో మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటన బెంగళూరు రాజగోపాలనగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఇటీవల ఆమె ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలి కూతురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరింది. మహిళ ఆన్లైన్ స్నేహితుడైన పారితోష్ యాదవ్ అనే వ్యక్తిని ఆర్థిక సాయం అడిగింది. అతడు కొంచెం డబ్బులు ఇచ్చాడు. కొన్నిరోజులుగా అతడు బాకీ తీర్చవద్దు, పడకగదికి వస్తే చాలని ఒత్తిడి చేయసాగాడు. ఇలాంటి పనులు చేయనని ఆమె చెప్పేసింది. ఈ గొడవ భర్తకు తెలియటంతో సంసారంలో చిచ్చు రేగింది. అంతటితో వదలకుండా ఆమె మొబైల్ఫోన్కు అశ్లీల ఫోటోలు, వీడియోలు పంపడం ప్రారంభించారు. దీంతో మహిళ దిక్కుతోచక ఆత్మహత్యకు యత్నించగా, ప్రాణాలతో బయటపడింది. పోలీసులు ఆమెను విచారించగా యాదవ్ నిర్వాకాన్ని వివరించింది. అతనిపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. రెండు చుక్కలు.. ఆరోగ్యానికి అస్త్రాలు● చురుగ్గా పోలియో మందు పంపిణీ శివాజీనగర: రాష్ట్రమంతటా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే పల్స్ పోలియో చుక్కల పంపిణీ ఆరంభమైంది. బెంగళూరులో సీఎం సిద్దరామయ్య నివాస కార్యాలయం కృష్ణాలో శిశువులకు చుక్కలు వేశారు. 5 సంవత్సరాలోపు ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా సమీపంలో పల్స్ పోలియో కేంద్రంలో చుక్కలు మందును వేయించాలని సీఎం సూచించారు. ఈ చుక్కలే భవిష్యత్ అంగవైకల్యాన్ని అడ్డుకుంటాయన్నారు. రాష్ట్రంలో 62.40 లక్షల మంది పిల్లలకు చుక్కలు వేస్తారు. అన్ని ఆసుపత్రులు, అంగనవాడీలు, ఆరోగ్య కేంద్రాలు, అలాగే ఆరోగ్య కార్యకర్తలు కర్మాగారాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు వెళ్లి చుక్కలను పంపిణీ చేస్తారు. సోమవారం నుంచి ఆరోగ్య కార్యకర్తలు సంచరిస్తూ మందును ఇస్తారు. రాష్ట్రమంతటా 33,258 బూత్లు, 1,030 సంచార బృందాలు, 1096 ట్రాన్సిట్ బృందాలు, 1,13,115 మంది పల్స్ పోలియో కార్యకర్తలు, 7,322 సూపర్వైజర్లను ఈ కార్యక్రమానికి నియమించారు. -
జగనన్న కోసం సమైక్యంగా కదలాలి: ఐటీ వింగ్
బనశంకరి: 2029లో మళ్లీ వైఎస్.జగన్మోహన్రెడ్డి ని ముఖ్యమంత్రిగా చేయడానికి బెంగళూరులో నివసించే ప్రవాసాంధ్రులు కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు కుమార్ పులివెందుల పిలుపునిచ్చారు. కృష్ణరాజపురం బెళతూరు శబరి ఆశ్రయధామలో ఐటీ వింగ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అన్నదానం నిర్వహించారు. కుమార్ పులివెందుల మాట్లాడుతూ.. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్గా చేసుకుని, అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం విద్య, వైద్య, సంక్షేమ రంగాలను పూర్తిగా విస్మరిస్తూ ఆటవిక పాలన సాగిస్తోందని విమర్శించారు. గత జగనన్న ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఐటీ వింగ్ సభ్యుడు, పార్టీ కార్యకర్తపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీవింగ్ సభ్యులు రాజశేఖర్రెడ్డి, చంద్ర, అనిల్, పూల ప్రవీణ్, పూల సురేంద్ర, నరసింహారెడ్డి, రామ్, రుద్ర, అమర్, హరి, ఓబుళరెడ్డి, పర్వత శివశంకర్రెడ్డి, మురళీకృష్ణ, నారాయణరెడ్డి, సుబ్రమణ్యం, సంతోష్, శివకుమార్గౌడ్, నయాబ్ రసూల్, మహ్మద్ రఫీ, అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
పథకం పేరును మార్చడం తగదు
రాయచూరురూరల్: బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం తగదని సీసీఐఎం(ఎల్) కార్యదర్శి నాగరాజు అన్నారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద కార్మికులతో కలిసి ఆదివారం ఆందోళన చేపట్టారు. నాగరాజు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ ఖాత్రి పథకం పేరును మార్చి కేంద్ర సర్కారు పేదల కడుపు కొడుతోందన్నారు. బీజేపీ, అర్ఎస్ఎస్ పేర్లను నమోదు చేయడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. గతంలో ఉన్న పేరును కొనసాగించాలని, పాత విధానం ప్రకారం కేంద్రం 90 శాతం, రాష్ట్ర సర్కారు 10 శాతం నిధులు సమకూర్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో అజిజ్జాగిర్దార్, కలమంగి, పంపాపతి, హన్మంతరాయ్, జగదీష్, మహేష్, జిలాని, హనీప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈడీ పేరుతో అవమానించారురాయచూరురూరల్: నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో కేసు నమోదు చేయకుండా, ఈడీ పేరుతో కాంగ్రెస్ నేతలను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షుడు విఎస్.ఉగ్రప్ప అరోపించారు. కోప్పళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాహుల్గాంధీ, సోనియాగాంధీలను బలవంతంగా విచారించడం సరికాదన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు కలిసి నడిపిన పత్రికపై అనవసర రాద్ధాంతం చేశారని, న్యాయస్థానంలో కేసు కొట్టి పారేశారని తెలిపారు. గురుధన పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న సంఘటనలు వదలి, కాంగ్రెస్ నేతలపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో క్రిష్ణ, జ్యోతి గోండబాల, శైలజ, మంజునాథ పాల్గొన్నారు. మధుమేహ వ్యాధిపై అవగాహనరాయచూరు రూరల్: మధుమేహ వ్యాధిపై అవగాహన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని నవోదయ వైద్యకీయ కళాశాల ట్రస్టీ రాజేంద్రరెడ్డి అన్నారు. కర్నాటక చాప్టర్ రీసర్స్ సొసైటీ ఆఫ్ డయాబెటీస్, నవోదయ వైద్యకీయ, రిమ్స్ సంయుక్తంగా రాయచూరులోని నవోదయ వైద్యకీయ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాలను దత్తత తీసుకుని వ్యాధి నియంత్రణకు కృషిచేయాలని, సెమినార్లు, వైద్య శిబిరాలను నాలుగు గోడలకు పరిమితం చేయకుండా రోగులకు అవగాహన కల్పించేలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బసవరాజ్ పాటిల్, హరిప్రసాద్, రామక్రిష్ణ, మహలింగ, సురేష్ సగరద, ఎస్ఎస్.రెడ్డి, శ్రీనివాస్, కార్తిక్, విజయ్కుమార్, శ్రీధర్, కల్లప్ప, తదితరులు పాల్గొన్నారు. హోటళ్లపై దాడులురాయచూరు రూరల్: నగరంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లపై జిల్లా అధికారి నితీష్, నగరసభ కమిషనర్ జుబీన్ మోహపాత్రో, ఆహార పౌర సరఫారాల శాఖ అధికారి క్రిష్ణ శనివారం సాయంత్రం విస్తృతంగా దాడులు నిర్వహించారు. అక్కడ వండిన ఆహార పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు పాటించని హోటల్, రెస్టారెంట్ల యజమానులకు జరిమానా విధించారు. సీతరాం తండాలో ఎన్నికలు ప్రశాంతం హొసపేటె: హొసపేటె తాలూకాలోని సీతారాంతాండ పంచాయతీలోని ఎనిమిది వార్డు స్థానాలకు ఆదివారం నిర్వహించిన ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవగా ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు వేశారు. సీతారాం తాండాలో 4, నల్లపూర్లో 3, చిన్నాపూర్ గ్రామంలో ఒక స్థానానికి జరిగే ఈ ఎన్నికల్లో 20 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. విజయనగరం ఎస్పీ ఎస్.జాహ్నవి, డీసీ కవితా ఎస్మన్నికేరి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ మంజునాథ్, డీవైఎస్పీ డాక్టర్ మంజునాథ్ తల్వార్, హంపీ సీఐ రాజేష్ భట్గుర్కి, కమలాపూర్ పీఎస్ఐ సంతోష్, తదితరులు పాల్గొన్నారు. -
24న కిష్కింధ విశ్వవిద్యాలయం ఘటికోత్సవం
సాక్షి బళ్లారి: సిరుగుప్ప తాలూకా సింధిగేరి సమీపంలోని కిష్కింధ విశ్వవిద్యాలయ క్యాంపస్లో డిసెంబరు 24న ప్రథమ ఘటికోత్సవం నిర్వహిస్తున్నట్లు వీసీ టీఎన్.నాగభూషణ్ పేర్కొన్నారు. ప్రముఖులు ఫృథ్వీరాజ్, యశ్వంత్భూపాల్, మహిపాల్తో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి గవర్నర్ థావర్చాంద్ గెహ్లాట్ విచ్చేస్తున్నాని పేర్కొన్నారు. 80 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం ఉంటుందని వివరించారు. ఎంబీఏలో షబానాకు 9.33, సౌగంధిక లక్ష్మీ 9.27 సీజీపీతో ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచారని, వారికి బంగారు, వెండి పథకాలను గవర్నర్ అందజేస్తారన్నారు. బీఐటీఎం డైరెక్టర్ ఫృథ్వీరాజ్ మాట్లాడుతూ పేదలకు ఉన్నత చదువులు అందాలనే దూర దృష్టితో కిష్కింధ విశ్వ విద్యాలయం నెలకొల్పామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖులు అమరేశయ్య, భరత్, ఈరణ్ణ, తదితరులు పాల్గొన్నారు. -
విద్యారత్న, సేవా భూషణ అవార్డుల ప్రదానం
కోలారు : నగరంలోని సువర్ణ కన్నడ భవనంలో ఆదివారం పాఠశాల విద్యాశాఖ, ఉద్యోగుల సంఘం ప్రథమ జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. ఆరు తాలూకాల్లోని 24 మంది ఉపాధ్యాయులకు విద్యారత్న, ఆరు మంది బోధనేతర సిబ్బందికి సేవాభూషణ అవార్డులను అందించారు. కార్యక్రమాన్ని ముళబాగిలు బీఈఓ రామచంద్ర ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు వృత్తి పావిత్య్రతను కాపాడాలన్నారు. సంఘం పదాధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండి పరిషత్ సభ్యుల ద్వారా సమాలోచన చేసి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోలారు జిల్లా నౌకర్ల సంఘం అధ్యక్షుడు అజయకుమార్, గౌరవాధ్యక్షుడు మంజునాథ్, జిల్లా ఉన్నత పాఠశాల సహ శిక్షకుల సంఘం అధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారులకు పోలియో చుక్కలు
సాక్షి బళ్లారి: 0–5 ఏళ్ల చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ప్రముఖులు పేర్కొన్నారు. నగర మేయర్ గాదెప్ప, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు, డీఎంహెచ్ఓ రమేష్బాబు, తదితరులు ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులు మాట్లాడుతూ జిల్లాలో 920 బూత్లలో 49 బృందాలు, రెండు వేల మంది సిబ్బంది. 1000 మంది ఇతర సభ్యులు చురుకుగా పాల్గొని పోలియో చుక్కలు వేశారన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, అంగన్వాడీ కేంద్రాల్లోనూ కార్యక్రమం కొనసాగిందని తెలిపారు. బళ్లారిటౌన్: పిల్లల అంగ వైకల్యాన్ని నియంత్రించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని డాక్టర్.బాబుజగ్జీవన్ రామ్ చర్మ పారిశ్రామిక నిగమ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజ్ పేర్కొన్నారు. బళ్లారి జిల్లా ఆస్పత్రి ఆవరణలో ఆదివారం జిల్లా స్థాయి పల్స్ పోలియో చుక్కల వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ వ్యాప్తంగా గత పదేళ్లుగా పల్స్ పోలియో చురుగా సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ పి.గాదెప్ప, గ్యారెంటీ పథకాల ప్రాధికార అధ్యక్షుడు చిదానందప్ప, జెడ్పీ సీఎస్ మహమ్మద్ హ్యరీస్, అధికారులు రమేష్బాబు, ఏడీసీ మహమ్మద్ ఝుబేర, బసిరెడ్డి, హనుమంతప్ప, ఖుర్కిద్ బేగం తదితరులు పాల్గొన్నార బళ్లారి అర్బన్: జిల్లాలో పల్స్ పోలియో విజయవంతమైంది. జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆవరణలో నమ్మ క్లినిక్ తరఫున ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు అవార్ మంజునాథ్, గౌరవ కార్యదర్శి సురేష్బాబు ప్రారంభించారు. సదరు ఆస్పత్రి ఛైర్మన్ సురేంద్రకుమార్, వైద్యాధికారులు డాక్టర్.అభిషేక్ పాల్గొన్నారు. రాయచూరురూరల్: రాయచూరు జిల్లాలో నాలుగు రోజులపాటు పల్స్ పోలియో చుక్కలు వేయాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజ్ కోరారు. స్థానిక నిజలింగప్ప కాలనీలోని కేఈబీ పాఠశాలలో ఆదివారం ఓ చిన్నారికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 1132 కేంద్రాలల్లో 2,59,984 మంది పిల్లలకు చుక్కలమందు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి నితీష్, సురేంద్రబాబు, నందిత, విజయ్శంకర్, ప్రవీణ్కుమార్, హారతి, శివమానప్ప, అనిల్, గణేశ్, శివ కుమార్, షాకీర్, ఈశ్వర్, బసయ్య, తదితరులు పాల్గొన్నారు. -
భర్త ఎమ్మెల్యే.. భార్య అంగన్వాడీ
సాక్షి, బళ్లారి: ప్రజా ప్రతినిధిగా గెలుపొందితే చాలామంది తమకెవరూ సాటి లేరని గర్వపడతారు. అందులోనూ ఎమ్మెల్యే భర్త దొరికితే భార్యల కనుసన్నల్లోనే పాలన సాగుతుందనేది అందరికీ తెలిసిందే. కానీ ఇందుకు భిన్నంగా భర్త ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన భార్య మాత్రం అంగన్వాడీ టీచర్గా ప్రస్థానం కొనసాగిస్తోంది. తన వృత్తికి స్వస్తి చెప్పకుండా.. చిన్న పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ సాధారణ జీవితం గడుపుతోంది. బెళగావి జిల్లా ఖాణాపుర ఎమ్మెల్యే విఠలహలగేకర్ టీచర్గా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. అనంతరం గత శాసనసభ ఎన్నికల్లో ఖాణాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇతడి భార్య రుక్మిణమ్మ అప్పటికే అంగన్వాడీ టీచర్గా పనిచేసేది. భర్త ఎమ్మెల్యేగా గెలుపొందినా ఆమె తన వృత్తికి స్వస్తి చెప్పలేదు. సాధారణ జీవితం గడుపుతూ బెళగావి 149 సెంటర్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తోంది. 2011 నుంచి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతూ ఆమె పలువురికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తన భర్త ప్రజా ప్రతినిధిగా సేవలందిస్తే.. తాను టీచర్గా పాఠాలు నేర్పుతున్నానని చెబుతున్నారు. చిన్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడంలోనే సంతృప్తి అంటున్న ఎమ్మెల్యే భార్య -
సమాజానికి వెలుగుగా జీవించాలి
మండ్య: మనిషి ఇష్టానుసారం కాదు, ప్రకృతి సంకల్పం ప్రకారం జీవించాలి. ప్రకృతి ముందు మనుషుల ఆట సాధ్యం కాదని కొప్పళ గవిసిద్దేశ్వర సంస్థాన మఠాధిపతి అభినవ గవిసిద్ధేశ్వర మహాస్వామి అన్నారు. జిల్లాలోని మళవళ్లి పట్టణంలో జరుగుతున్న శివరాత్రీశ్వర శివయోగుల 1,066వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. శతాబ్దాల క్రితం శివయోగి స్వామి అందరి సంక్షేమాన్ని కాపాడుతూ అందరికీ దారి చూపించాడని, సమాజానికి వెలుగుగా జీవించాడని అన్నారు. ఒక వ్యక్తి తనకోసం కాకుండా ఇతరుల కోసం జీవించినప్పుడు, అతను ప్రపంచ ప్రసిద్ధి చెందుతాడు. దీపం వెలుగుతూ ఇతరులకు వెలుగునిచ్చినట్లే, మనం కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలని తెలిపారు. డబ్బు, పదవులు శాశ్వతం కాదు మానవులు జీవితాంతం డబ్బు, పదవులు, ఆస్తి, కీర్తి వెంట పరిగెడుతున్నారు, ఇవన్నీ శాశ్వతం కాదనే చిన్న వాస్తవాన్ని గ్రహించకపోవడం విచారకరమని స్వామీజీ అన్నారు. చక్రవర్తి బౌద్ధ భిక్షువు అయ్యాడు, భిక్షువు చక్రవర్తి అయ్యాడని అన్నారు. నేటి తల్లిదండ్రులు పిల్లలకు నైతికత, సంస్కృతిని నేర్పించడానికి బదులు, మంచి స్థానం, సక్సెస్ అంటూ పరుగులు తీయిస్తున్నారు, కానీ ఇవన్నీ తాత్కాలికమేనని వారు మర్చిపోయారని వాపోయారు. హృదయంలో ఆనందం ఉన్నవాడే విజయం సాధిస్తాడని తెలిపారు. మనిషి ఒక సమాజంగా జీవించాలని, అంకితభావంతో బతకాలని, ఘర్షణ పడకూడదని, దేవుని చిత్తం ప్రకారం జీవించాలని ఆయన ఉద్బోధించారు. కోరుకోవడం తప్పు కాదు, కానీ ప్రతిదీ తన సంకల్పం ప్రకారం జరగాలని వాంఛించడం తప్పు అన్నారు. దేవుని సంకల్పం ముందు మన కోరికలన్నీ శూన్యమని ఆయన అన్నారు. మన జీవితాల్లో చెడు ఆలోచనల కలుపు మొక్కలను తొలగించి, మంచి వ్యక్తిత్వం యొక్క పంటను పెంచుకోవాలని తెలిపారు. గతంలో చాలా మంది సాధువులు ఈ మాదిరిగా జీవించి చూపించడం ద్వారా మనకు ఆదర్శంగా నిలిచారని, శివరాత్రి శివయోగి అటువంటి మహానుభావులని పేర్కొన్నారు. అన్నీ నాకే కావాలని పాకులాడొద్దు కొప్పళ గవిసిద్ధేశ్వర స్వామి సుత్తూరు వేడుకలో ప్రసంగంమతం, భక్తితో విజయం సుత్తూరు సంస్థానం మానవ విలువలకు పుట్టినిల్లు అని విశ్వ ఒక్కలిగర మహాసంస్థాన్ మఠం జగద్గురు నిశ్చలానందనాథ మహాస్వామి అన్నారు. ఆయన మాట్లాడుతూ భారత సంస్కృతికి పురాతనమైన చరిత్ర ఉందని అన్నారు. మతం యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకుని భక్తితో ఆచరిస్తేనే విజయం సాధ్యమని ఆయన అన్నారు. ప్రజలు అజ్ఞానం నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు. కుటుంబంలో సామరస్యం ఏర్పడాలంటే, వారి జీవితాల్లో మతపరమైన, సంప్రదాయ ఆలోచనలను పాటించాలని సూచించారు. మతం, మానవతా విలువలను ప్రజలకు తెలియజేయడంలో సుత్తూరు మఠం గొప్ప కృషి చేస్తోందన్నారు. -
జగన్ పాలనలో అన్ని వర్గాలకు మేలు
సాక్షి,బళ్లారి: జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని, ఇపుడు అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిందని వైఎస్ రాజశేఖరరెడ్డి చిన్ననాటి స్నేహితుడు బాలస్వామి, నరాలరోషిరెడ్డి అన్నారు. జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా నగరంలోని గాంధీ నగర్లో శ్రీశివశక్తి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో సూర్య నివాస్ వృద్ధాశ్రమంలో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వృద్ధుల సమక్షంలో కేక్ కోసి మిఠాయిలు, బ్రెడ్లు పంచి పెట్టారు. వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్పనాయకుడు జగన్మోహన్రెడ్డి అన్నారు. మళ్లీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని జనం వేచిచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక గొడవే అది.. హైకమాండ్ సృష్టించలేదు
శివాజీనగర: కర్ణాటకలో సీఎం పదవి వివాదంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం కల్బుర్గిలో మీడియాతో మాట్లాడుతూ ‘దీనిని హైకమాండ్ సృష్టించలేదు. గందరగోళానికి హైకమాండ్ కారణం కాదు. స్థానిక నాయకులే గొడవ చేసుకున్నారు. వారే దీనిని పరిష్కరించుకోవాలి. అన్నిటికీ హైకమాండ్ను అంటే ఎలా?’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎవరో ఒక నాయకుడి వల్ల బలపడలేదని, తన వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని, తానే పార్టీ కోసం శ్రమించానని ఎవ్వరూ చెప్పరాదని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ అనేది కార్యకర్తల ద్వారా విస్తరించిన పార్టీ. పార్టీ అన్న తరువాత అందరి పాత్ర ఉంటుంది. ఫలానా వారే పార్టీకి ఆధారం అని కార్యకర్తలు కూడా అనరాదు’ అని సూచించారు. సోదరుల్లాగా పనిచేసుకుంటున్నాం: శివకుమార్ మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదివారం బెంగళూరులో తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడుతూ తనకు కాంగ్రెస్లో ఏ నాయకుడితో భిన్నాభిప్రాయాలు లేవన్నారు. అవన్నీ మీడియా, ప్రతిపక్షాల సృష్టి అని పేర్కొన్నారు. తాను, సీఎం సిద్ధరామయ్య కలసికట్టుగా సోదరుల్లాగా పని చేయడం లేదా? అని ప్రశి్నంచారు. ‘కొన్ని సందర్భాల్లో రాజకీయంగా వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఇందుకు అసంతృప్తికి గురికావాలా?, అన్నదమ్ములే గొడవపడుతుంటారు. ఇక మా గొడవ అనేది ఏ లెక్కకు వస్తుంది?’ అని ప్రశ్నించారు. పార్టీలో గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని మల్లికార్జున ఖర్గేకు కొందరు నాయకులు లేఖ రాయడంపై మాట్లాడుతూ, ‘నా వరకు ఎలాంటి గందరగోళం లేదు. మీడియాకు వార్తలు కావాలి, అందుకోసమే రోజూ గందరగోళం చేయిస్తున్నారు’ అని అన్నారు. సీఎం సన్నిహిత వర్గానికి చెందిన నేత కేఎన్ రాజన్న కలవడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, ‘ఆయనకు సీఎం సన్నిహితుడా?, నాకు కూడా సన్నిహితుడే’ అని చమత్కరించారు. -
‘పంచాయతీ చట్టాలు అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా ఉండాలి’
అఖిల భారత పంచాయత్ పరిషత్ 18 వ జాతీయ మహాసభల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో గదగ్ మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ డెవలప్మెంట్ యూనివర్సిటీ లో జరిగిన సభలో అఖిల భారత పంచాయతీ పరిషత్ జనరల్ సెక్రటరీ, ఆంధ్ర ప్రదేశ్ AIPP అధ్యక్షులు M. చిదంబర రెడ్డి ప్రసంగిస్తూ...స్థానిక సంస్థల అవశ్యకతను, సర్పంచుల విధులు, నిధులు, విడుదల పై చర్చించి 2011 సెన్సెస్ ప్రకారం కేంద్ర నిధులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నారని, అప్పటి జనాభా అవసరాలకు, ఇప్పుటి 2025. జనాభా అవసరాలకు సరిపడా సదుపాయాలకు 4 రెట్లు పెరిగినది కావున గ్రాంట్ 4 రెట్లు పెంచవలసిన అవసరం ఉందని, ఇండియా 1 అని నాయకులు మాటలు చెప్తున్నారని, దేశం అంతా పంచాయతీ చట్టాలు ఒకే రకంగా ఉండాలని, అయితే ఒకో రాష్ట్రం లో ఒక విధంగా అమలు చేస్తున్నారని, కేరళ రాష్ట్రంలో మాత్రమే సర్పంచుల విధులు చాలా బాగున్నాయని, గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉద్యోగులు, వారి జీతాలు, పని తీరు సర్పంచుల ఆదేశాలు మేరకే జరుగుతాయని.గ్రామాలకు MLA,MP నిధులు వినియోగించాలి అంటే గ్రామ సభ, సర్వ సభ్య సమావేశం లో పంచాయతీ రిజల్యూషన్ ద్వారా అధికారులు నడుచుకుంటారు.స్థానిక సంస్థలలో (సర్పంచి /ఎంపిటిసి/కౌన్సిలర్/జడ్పీటీసీ/కార్పొరేటర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు కనీస విద్యార్థత ఉండేలా చట్టం తేవాలని, గౌరవ వేతనం దేశం మొత్తం ఒకే విధంగా ఉండాలని,MLA,MP,MLC లకు పింఛను రిటైర్డ్ అయినాక స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇచ్చే చట్ట సవరణ చేయాలని , గత ప్రభుత్వం లో మాజీ ముఖ్యమంత్రి గౌ.శ్రీ.YS జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో సచివాలయం, హాస్పిటల్, రైతు భరోసా,గ్రంథాలయం, డైరీ ల సముదాయాలు ఏర్పాటు చేసి దాదాపు ప్రతి గ్రామంలో 11 నుంచి 13 మంది ఉద్యోగులు పని చేసేలా చేశారు. ప్రతి రోజూ ఈ సముదాయాలకు వందల సంఖ్యలో ప్రజలు తమ అవసర నిమిత్తం వందలాదిగా వచ్చేవారు. ప్రభుత్వం మార్పు వల్ల, ఇప్పటి ప్రభుత్వo ఉద్యోగులను కుదించి మరీ అన్యాయంగా ఒకరో, ఇద్దరో వస్తున్నారు. ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుందని, ఉద్యోగులను నియామకం చేయాలని. పై విషయాల పై కమిటీ చర్చించి.. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి గారి దృష్టి కి మరియు ప్రధాన మంత్రి గారిని మనం కలవాల్సిన అవసరం ఉందని అఖిల భారత పంచాయత్ పరిషద్ అధ్యక్షులు, మాజీ యూనియన్ మినిస్టర్ శ్రీ సుభోద్ కాంత్ సహాయి గారిని కోరగా.. సభలో అందరూ సహకారం అందిస్తామని చెప్పారు -
21 నుంచి పల్స్ పోలియో
హొసపేటె: డిసెంబర్ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కవితా ఎస్ మన్నికేరి తెలిపారు. సంబంధిత కార్యక్రమ పోస్టర్లను శుక్రవారం సాయంత్రం ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 0–5 పిల్లలు 1,21,585 మంది ఉన్నారని, వంద శాతం పోలియో చుక్కలమందు పంపిణీ పూర్తి కావాలన్నారు. మొత్తం 923 బృందాలతో 1040 కేంద్రాలలో పోలియో టీకా వేయిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బస్టాండు, రైల్వే స్టేషన్, ప్రధాన కేంద్రాలలో నాలుగు మొబైల్ బృందాలు, 50 ట్రాన్సిట్ కేంద్రాలు ఏర్పాటుచేయాలన్నారు. 2170 మంది కార్మికులను నియమించామని, తొలి రోజున బూత్ స్థాయిలో టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. అదనపు డిప్యూటీ కమిషనర్ ఇ.బాలకృష్ణప్ప, డాక్టర్.జంబయ్య,జేఎం.అన్నదానస్వామి, అధికారులు పాల్గొన్నారు. -
జగనన్న జన్మదినం సందర్భంగా నేటి నుంచి క్రికెట్ టోర్నీ
బనశంకరి: వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం నుంచి రెండు రోజుల పాటు ఐటీవింగ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు చేతన్ క్రికెట్ గ్రౌండ్స్ సర్జాపురలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తారు. ఈ సారి టోర్నమెంట్ను పరిమిత జట్లతో నిర్వహించడంతో అందరికీ ఆటలో పాల్గొనే అవకాశం కల్పించలేక పోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శబరి ఆశ్రయధామలో సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ బెంగళూరు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈనెల 21 తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు కృష్ణరాజపురం శబరి ఆశ్రయధామ, బెళత్తూరులో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని బెంగళూరు వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ టీం తెలిపింది. సర్జాపుర చేతన్ క్రికెట్ స్టేడియంలో ఐటీ వింగ్ క్రికెట్ టోర్నమెంట్ -
ప్రజల సహకారం అవసరం
మాలూరు: అవినీతి రహిత తాలూకా నిర్మాణమే తమ లక్ష్యమని, ఇందుకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని స్వాభిమాన పార్టీ సంస్థాపక అధ్యక్షుడు హూడి విజయకుమార్ పేర్కొన్నారు. నగరంలోని అరళేరి రోడ్డులోని ఆయన నివాసంలో కాంగ్రెస్, బీజేపీ ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పాలనకు విసిగిన చాలామంది తమ పార్టీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో తాలూకాలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడంలేదని, అవినీతి పెచ్చుమీరిపోయిందని ఆరోపించారు. లంచం ఇవ్వనిదే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనీ జరగని పరిస్థితి నెలకొందన్నారు. యువకులు అధికంగా పార్టీలోకి చేరడంతో మరింత పటిష్టమవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.ప్రభాకర్, శ్రీనాథ్, రామమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
అంధ విద్యార్థులకు చట్టాలపై అవగాహన
రాయచూరురూరల్: న్యాయ సేవలపై అవగాహన పెంచుకొని విద్యార్థులు అవసరమైనపుడు సద్వినియోగం చేసుకోవాలని రాయచూరు తాలుకా విద్యా శాఖ అధికారి ఈరణ్ణ కోస్గి పిలుపునిచ్చారు. నగరంలోని మాణిక్ ప్రభు అంధ విద్యార్థుల పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈరణ్ణ కోస్గి మాట్లాడారు. ప్రతి నాగరికుడు మానవ హక్కులు, చట్టం వివరాలు తెలుసుకోవాలన్నారు. అపుడే ఉచిత న్యాయ సలహాలు పొందడానికి వీలుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివకుమార్, వెంకటేష్, సుదర్శన్, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. పొరుగు ఉత్సవాల సంబరంరాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల పొలాల్లో పొరుగు ఉత్సవాల సంబరాలు జోరుగా సాగుతున్నాయి. పొలంలో భూ మాతకు రైతులు పూజలు జరిపి సామూహిక భోజనాలు చేశారు. ఉడంగల్లో నువ్వుల అమవాస్యగా పిలవబడే ఈ పండగను రైతులు ఘనంగా జరుపుకున్నారు. కార్మికుల వేతనాల్లో కోత తగదు రాయచూరురూరల్: జిల్లా అరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాల్లో కోత విధించడం తగదని రాజ్ కుమార్ అభిమానుల సంఘం డిమాండ్ చేిసింది. పాత్రికేయుల భవనంలో విలేకరులతో సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ మైసూరు షార్ఫ్వాచ్ ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సంస్థ ఆధ్వర్యంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు జూన్ నుంచి వేతనాలు ఇవ్వలేదన్నారు. నెలవారీ రూ.3 వేలు కోత విధించడమేగాక, వారికి పీఎఫ్, ఈపిఎఫ్, జీపీఎఫ్ చెల్లించకుండా నిధులు కాజేశారని ఆయన అరోపించారు. భూ బాధిత రైతుల దీక్షకు బాసటబళ్లారి అర్బన్: భూ బాధితుల రైతులకు సీఐడీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే.సత్తిబాబు మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి దారీ విధానాలతో కార్మికుల గొంతును నొక్కేస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులు పిడికిలి బిగించి ఒక్కతాటిపైకి వచ్చినపుడే న్యాయం జరుగుతుందన్నారు. జంగ్లి సాబ్, తిప్పేస్వామి, ఓలిగి సిద్దప్ప, శ్రీధర, తులసమ్మ, దేవమ్మ, హులిగమ్మ, ఈరమ్మ, తిమ్మప్ప, గోపాల, రుద్రప్ప, తదితరులు పాల్గొన్నారు. వ్యాపారి హత్యరాయచూరు రూరల్: వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. కడపకు చెందిన సయ్యద్ హుసేన్్ పాషా(25) 15 రోజుల కిందట నగరానికి వచ్చి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం గడుపుతున్నారు. గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో రాయచూరు ఆకాశవాణి కార్యాలయం వద్ద పాషా తన వ్యానులో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని ఎస్పీ పుట్టమాదయ్య, యస్.మంజునాథ్, బసవరాజ్ పరిశీలించారు. -
ఆరోగ్య సేతు ప్రారంభించిన సీఎం
దొడ్డబళ్లాపురం: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం బెళగావిలోని సువర్ణసౌధ ముందు ఆరోగ్య సేతు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మీ ఆరోగ్యం–మా బాధ్యత అనే నినాదంతో సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందాలనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మొబైల్ హెల్త్ సెంటర్లు మారుమూల గ్రామానికి కూడా వెళ్లి సేవలు అందిస్తాయి. ప్రతి జిల్లాకు జనాభా, విస్తీర్ణం తదితర అంశాల ఆధారంగా ఈ వాహనాలను 1, 2, 3, 4 అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 81 వాహనాలను పంపించారు. వీటి నిర్వహణకు ఏడాదికి సుమారు రూ.1686 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. -
నేరాల నియంత్రణకు సహకరించండి
హొసపేటె: జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు యువత సహకరించాలని రచయిత స్వరూప్ కొట్టూరు కోరారు. కూడ్లిగి తాలూకా నరసింహగిరి గ్రామంలోని బోరమ్మ తమప్ప ఉన్నత పాఠశాలలో జరిగిన నేర నివారణా మాస వేడుకల్లో ఆయన మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలను గమనిస్తూ, నేర కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత నేర కార్యకలాపాలకు పాల్పడితే, అది వారి వ్యక్తిత్వంపై మచ్చగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నాగేంద్ర ఆచార్య, ప్రధానోపాధ్యాయుడు జి.బసశెట్టప్ప, ఆర్.బసవరాజ్, ఎం.శివప్రసాద్, డి.రాజ్కుమార్, జి.తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనంలో పురుగులుహొసపేటె: కొప్పళ తాలూకా పాతనింగపుర ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం వైరల్గా మారింది. వివరాలివీ.. పాతనింగపుర ప్రభుత్వ పాఠశాల పిల్లలకు వడ్డించే భోజనంలో పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పిల్లలకు వడ్డించే ఆహారం, పరిశుభ్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పురుగులను చూసిన తర్వాత, విద్యార్థులు భోజనం పడేసి అధికారులకు సమాచారం ఇచ్చారని ఉపాధ్యాయులు తెలిపారు. మధ్యాహ్న భోజన సిబ్బంది నిర్లక్ష్యమే ఈ సంఘటనకు కారణమని వారు ఆరోపించారు. పథకం పేరు మార్చవద్దురాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం తగదని గ్రామీణ కూలీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు గురురాజ్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఇటీవల కేంద్ర సర్కార్ మార్చిందన్నారు. ఇది పేదల కడుపు కొట్టేలా ఉందని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పేర్లను నమోదు చేసేందుకు చేసే ప్రయత్నమేనని అన్నారు. గతంలో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరునే కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో బసవరాజ్, మారెమ్మ, రూప, హుచ్చమ్మ, తదితరులు పాల్గొన్నారు. 21న సంగీత సమ్మేళనంరాయచూరు రూరల్: సంగీత పితామహుడు పండిత సిద్ధరామ జంబులదిన్నె జ్ఙాపకార్థం ఈ నెల 21న సంగీత సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంగీత విద్వాంసుడు వడవాటి నరసింహులు తెలిపారు. పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ నగరంలోని స్వరసంగమ సంగీత కళాశాలలో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. చెరకు కోత యంత్రంలో పడి ఇద్దరు మహిళల దుర్మరణంరాయచూరురూరల్: చెరకు కోత యంత్రంలో పడి ఇద్దరు మహిళలు దుర్మరణం చెందిన సంఘటన బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం బెళగావి జిల్లా అథణి తాలుకా సత్తి గ్రామంలోని కాడగౌడ పోలంలో చెరకు కోత యంత్రం పనులు చేసేందుకు చౌరవ్య(60), లక్ష్మీభాయి(65) వెళ్లారు. యంత్రం పనిచేస్తున్న సమయంలో.. వెనుకభాగంలో మిగిలిన చెరుకుగడలు తీసేందుకు వారు ప్రయత్నించారు. చక్రాలలో ఇరుక్కు పోవడంతో చౌరవ్య, లక్ష్మిబాయి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబీకులకు సాయంకోలారు: ఉపాధ్యాయురాలు అక్తర్ బేగం కుటుంబీకులకు ప్రభుత్వం రూ.20 లక్షల పరిహారం అందజేసింది. తాలూకాలోని కెబిహొసహళ్లి పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న అక్తర్ బేగం నరసాపురం ఫిర్కాలో జాతి సమీక్ష నిర్వహణ విధులకు వెళ్లారు. అదే సమయంలో ఆమె చెరువులో విగతజీవిగా కనిపించారు. జిల్లా కలెక్టర్ ఎంఆర్.రవి ఆమె మృతిపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. స్పందించిన ప్రభుత్వం అక్తర్ బేగం కుటుంబీకులకు రూ.20 లక్షల పరిహారం అందజేసింది. -
రైతుకు నష్టం.. దళారులకు లాభం
సాక్షి, బళ్లారి: నెల రోజులు కిందట ఉల్లి ధర అమాంతం పడిపోయింది. దళారుల మాయతో .. తాజాగా రోజు రోజుకూ పెరుగుతోంది. రైతులు విక్రయించినపుడు కిలో ఉల్లి రూ.5కు కొనుగోలు చేసిన దళారులు గోదాముల్లో నిల్వ ఉంచారు. ఇపుడు కిలో రూ.25కు పైగా విక్రయిస్తున్నారు. పంట పండించిన రైతన్న పెట్టుబడులు దక్కక నష్టపోగా.. వ్యాపారులు మాత్రం లాభం మూటగట్టుకుంటున్నారు. రైతులకు భారీ నష్టం ఉమ్మడి బళ్లారి జిల్లాతోపాటు, చిత్రదుర్గం, బాగల్కోట, బీజాపూర్, బీదర్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాల్లో రైతులు ఉల్లి పంట సాగు చేశారు. ఎకరాల పొలంలో ఉల్లి పంట సాగుకు రూ.80 వేల వరకు ఖర్చు చేసిన రైతులు గిట్టుబాటు ధరలేక అప్పులు కట్టుకోలేని దుస్థితి. 50 కిలోల ఉల్లిగడ్డ సంచిని రూ.200కే విక్రయించుకున్నారు. క్వింటాకు రూ.50 వేలు కూడా రాలేదని గతంలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల కిందట ఉల్లి గడ్డలను రోడ్డుపై పారవేసి, శవయాత్రలు చేసి ఆందోళన చేస్తే ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా లేకపోయింది. పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర పెరగడంతో తమకూ నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారుల చేతివాటం ఉల్లి గడ్డ నిల్వలు రైతుల వద్ద తగ్గిపోవడంతో దళారులు, వ్యాపారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అన్నం పెట్టే రైతన్న వద్ద దిగుబడులను కిలో రూ.5కే కొన్న వ్యాపారులు నిల్వలను గోదాములకు చేర్చారు. ఇపుడు రేట్లు పెంచే దానిపై దృష్టిసారించారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో నిల్వ ఉంచిన ఉల్లి గడ్డలు మార్కెట్కు చేరుతున్నాయి. నగరంలోని ఏపీఎంసీలోని చిరువ్యాపారులు మాత్రం తమ చేతుల్లో ఏమీలేదని, మార్కెట్కు వచ్చే దానిని బట్టి ధర నిర్ణయిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 50 కిలోల ఉల్లి గడ్డల సంచి ధర రూ.2000 పలుకుతోంది. లోకల్ ఉల్లి గడ్డల 50 కిలోల సంచి ధర రూ.1500గా ఉంది. రైతుల వద్ద ఖాళీ అయిన తర్వాత, వ్యాపారులు నిల్వలు బయటికి తీసి ధర పెంచి నాలుగింతలు లాభాలు ఆర్జిస్తున్నారు. వచ్చే ఏడాదైనా పాలకులు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెల కిందట కిలో ఉల్లి ధర రూ.5 కొనుగోలు చేసి నిల్వ ఉంచిన వ్యాపారులు కొరత చూపుతూ ఉల్లి ధరల పెంపు నష్ట పరిహారం అందించాలని రైతుల డిమాండ్ -
జింకలతో పంటలకు నష్టం
రాయచూరు రూరల్: రైతులు సాగు చేసిన పంటలపై జింకలు తొక్కి.. పరుగుతీయడంతో నష్టపోతున్నారు. కళ్యాణ కర్నాటక పరిధిలోని రాయచూరు, యాదగిరి, కోప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాల్లోని లక్షలాది ఎకరాల్లో రైతులు జొన్న, వేరుశనగ, పత్తి, మిరప, ఇతర పంటలు సాగు చేశారు. ఇటీవల పొలంలోకి చొరబడుతున్న జింకలు పంట తొక్కుతూ చిందరవందర చేసి నాశనం చేస్తున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నికల సమయంలో జింకల వనం ప్రాధాన్యం గుర్తించే నాయకులు అనంతరం వదిలేస్తున్నారు. తమ బాధను పట్టించు కోవడంలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల జింకలు జిల్లాలో 20,572 క్రిష్ణ జింకలు, జింకార 16,420, లాంగ్ చాపర్ 10,856, చుక్కలున్న జింకలు 370 ఉన్నాయి. 2006 నుంచి ఈ జింకల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు రైతు సంఘం నేతలు అనందప్ప, రుద్రప్ప వెల్లడించారు. 2010లో పరిహారం అందించడంతో పాటు జింకల వనం నిర్మాణానికి రూ.50 లక్షల మంజూరుకు అనుమతి లభించినా అమలుకు నోచుకోలేదు. 2016లో విధాన సభలో చర్చలు జరిగినా ప్రాధాన్యం ఇవ్వలేదు. వెంటనే జింకల వనం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
నేనే సీఎం...అలాగని రాసిచ్చారా?
శివాజీనగర: అసెంబ్లీలో చివరిరోజు శుక్రవారం సీఎం సిద్ధరామయ్య, ప్రతిపక్ష నేత అశోక్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మున్ముందూ తానే సీఎంగా కొనసాగుతానని సీఎం సిద్ధు అనగా..అలాగని రాసిచ్చారా అంటూ అశోక్ కౌంటరిచ్చారు. ఉత్తర కర్ణాటక ప్రాంత అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ రెండున్నరేళ్లకు మాత్రమే ముఖ్యమంత్రి స్థానం అనే నిర్ణయం కాలేదని, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీర్మానిస్తే మున్ముందు కూడా తానే కొనసాగుతానని, హైకమాండ్ తనకు అండగా ఉందని అన్నారు. ఇందుకు ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ జోక్యం చేసుకుంటూ .. ‘మేమంతా బ్రహ్మ వద్ద ఎక్కువ సేపు ఉండకుండా విడిచి వచ్చేశాం. సిద్ధరామయ్య మాత్రం బ్రహ్మ వద్ద కూర్చొని 2013 నుంచి 2018 వరకు ఐదు సంవత్సరాలూ ముఖ్యమంత్రిగా ఖరారు చేసుకుని రాయించుకుని వచ్చారు. ప్రస్తుతం మాత్రం రెండున్నర సంవత్సరాలు రాసిచ్చార’ంటూ ఎద్దేవా చేశారు. ఇది మీకు ఎలా తెలిసిందని సిద్ధు ప్రశ్నించగా... ‘మీరు అధికార మార్పిడి గురించి ఢిల్లీ విమానం ఎక్కి వెళ్లిన నాటి నుంచి తీర్మానం అయ్యే వరకు కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి నాకు ఫోన్ ద్వారా సమాచారం వస్తుండేది. మీకు రెండున్నరేళ్లనని గడువు రాశారు. దానితో సరిపెట్టుకోవాలి’ అని అన్నారు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య తమది హైకమాండ్ ఉన్న పార్టీ అని, తొలిసారి కాలావధికి ఐదేళ్లు అధికారాన్ని పూర్తి చేశానని, ప్రస్తుతం హైకమాండ్ తనకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఇన్ని సమస్యల మధ్య కూడా మీరు సమర్థించుకోవటాన్ని మెచ్చుకోవాలని బీజేపీ సభ్యులు అరగ జ్ఞానేంద్ర, వి.సునీల్కుమార్ తదితరులు ఎద్దేవా చేశారు. బీజేపీలో యడియూరప్పను అధికారం నుంచి తొలగించింది ఎందుకని సిద్ధు ప్రశ్నించారు. అశోక్కు ప్రతిపక్ష నాయకుడిగా ఐదేళ్లు పూర్తి చేసే విశ్వాసముందా అని సవాల్ చేశారు. అశోక్ ఐదేళ్లూ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారని, ఆ విషయంలో తమకు గ్యారెంటీ ఉందని, మీకు ఐదేళ్లూ ముఖ్యమంత్రిగా ఉంటాననే విశ్వాసం ఉందా అని సునీల్కుమార్ ప్రశ్నించారు. ‘శాసనసభా పార్టీ సమావేశంలో నన్ను ఎంపిక చేశారు. అదే ప్రకారం ముఖ్యమంత్రి అయ్యా. హైకమాండ్ తీర్మానించినట్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. రెండున్నరేళ్లు అంటూ మాలో ఎలాంటి తీర్మానమూ కాలేద’ని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. మంత్రి కేజే జార్జ్ మాట్లాడుతూ తమ పార్టీ విషయాలు బీజేపీ వారికి ఎందుకని ప్రశ్నించారు. సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండే మాట్లాడుతూ రెండున్నరేళ్లలో అధికార మార్పిడి అంటూ తీర్మానం కాలేదు.. అనవసరమైన చర్చ ఎందుకన్నారు. అసెంబ్లీలో సీఎం సిద్ధు, ప్రతిపక్ష నేత అశోక్ మాటల యుద్ధం -
ఐవీఎఫ్ కేంద్రం ఏర్పాటుకు పచ్చజెండా
హుబ్లీ: కేఎంసీ పరిశోధన ఆస్పత్రి ఆవరణలో తొలిసారిగా కృత్రిమ గర్భధారణ కేంద్రం(ఐవీఎఫ్) ప్రారంభం కానుంది. ఈ ఆస్పత్రిలో ఇప్పటికే సీ్త్ర రోగాలు, కాన్పుల విభాగం పనులు పూర్తవడంతో ఐవీఎఫ్ కేంద్రం ప్రారంభిస్తున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్. డాక్టర్ ఈశ్వరహొసమని తెలిపారు. 2021–22లో ఈ మేరకు ప్రతిపాదనలు పంపగా వివిధ వర్గాల నుంచి ఆర్థిక వనరులు సేకరించి ఐవీఎఫ్ కేంద్రంలో వైద్య పరికరాలు సిద్ధం చేశామన్నారు. ఏ దశలో పరీక్షలు జరపాలి, ఔషధాల పంపిణీ ఎలా ఉండాలనేది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఒక్కో మహిళకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు వస్తుందని ఆయన తెలిపారు. పేద రోగులకు బీపీటీ తరహాలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. లోపాలు అధిగమించి మార్గదర్శకాలను రూపొందిస్తామని, ఎంతమేర సర్వీస్ ఛార్జి విధించాలో ప్రకటిస్తామని తెలిపారు. సీసీసీ తరహాలో పిల్లలు లేని మహిళలకు అనుకూలంగా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తామన్నారు. -
చిన్నారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి
కోలారు: పిల్లలలో దాగిన ప్రతిభను గుర్తించి ఉపాధ్యాయులు తగిన ప్రోత్సాహం కల్పించాలని, ఇందుకు ప్రతిభా కారంజీలు చక్కటి వేదిక అని బీఈఓ మధు మాలలీ పడువణె తెలిపారు. నగరంలోని అంజుమన్ ఆల్ అమీన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాలూకాస్థాయి ప్రతిభా కారంజి పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పాఠాలతోపాటు, ఇతర కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉండాలని తెలిపారు. కోలాటం, పౌరాణిక నాటకాలు, బుర్రకథ, ఇలా అనేక కళల సాధకులు జిల్లా నుంచే వెళ్లారన్నారు. పాఠాలతోపాటు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి నాగరాజ్, వెంకటాచలపతిగౌడ, గోవిందు, శ్రీనివాస్, నంజుండగౌడ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల సహకారంతో స్వచ్ఛ నగరం
కోలారు: కోలారు నగరాన్ని సుందర స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారం అవసరమని కలెక్టర్ ఎంఆర్.రవి అన్నారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయ సభాంగణంలో పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చారిత్రక ఇతిహాసం కలిగిన కోలారు నగరంలో నేటికీ రహదారులు, పాదచారి మార్గాలు, శౌచాలయం, ట్రాఫిక్ నియంత్రణ, సూచన పలకాల కొరతతో నిత్యం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితి మార్చడానికి జిల్లా యంత్రాంగం ప్రయతిస్తోందని, పిల్లలు సురక్షితంగా తిరిగే రోడ్లు, సీనియర్లకు విశ్రాంతినిచ్చే పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ మంగళ, కమిషనర్ నవీన్చంద్ర పాల్గొన్నారు. -
కేరళ ఆర్టీసీ బస్సు బుగ్గి
● 40 మందికిపైగా ప్రయాణికులు క్షేమం మైసూరు: ప్రయాణికులతో వెళుతున్న కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్న 40 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని నంజనగూడు హొసళ్లి గేట్ సమీపంలో జరిగింది. మైసూరు నుంచి కేరళకు వెళ్తున్న బస్సు గురువారం అర్ధరాత్రి సమయంలో హొసళ్లి గేట్ వద్దకు రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులను కిందకు దింపేశాడు. అనంతరం కొన్ని నిమిషాల్లోనే మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపే బస్సు మొత్తం కాలిపోయింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేశారు. నంజనగూడు ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. జగదీశ్వరి ఆలయంలో డీసీఎం పూజలు దొడ్డబళ్లాపురం: డీసీఎం డీకే శివకుమార్ శుక్రవారం కార్వార జిల్లా అంకోల తాలూకాలో ఉన్న ప్రసిద్ద జగదీశ్వరిదేవి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు. ఆయనతో పాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి మంకాళ వైద్య, ఎమ్మెల్యే సతీస్ సైల్ ఉన్నారు. అయితే వీరందరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులను బయటే ఉంచి డీకే శివకుమార్ ఆలయ గర్భగుడి తలుపులు మూసి పూజలు చేశారు. కాలితో తన్నడంతో గాల్లోకి లేచి పడిన చిన్నారి దొడ్డబళ్లాపురం: రోడ్డు మీద ఆడుకుంటున్న చిన్నారిని ఒక వ్యక్తి ఫుట్బాల్ తరహాలో కాలితో తన్నాడు. దీంతో బాలిక గాల్లోకి లేచి కిందపడి గాయపడింది. ఈ అమానుష సంఘటన బెంగళూరు త్యాగరాజగనర్లో చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారి తన తల్లితో కలిసి ఇంటి బయట బ్యాడ్మింటన్ ఆడుతుండగా వెనుక నుంచి వచ్చిన రంజన్ అనే వ్యక్తి కాలితో తన్నాడు. దీంతో ఆ చిన్నారి గాల్లోకి లేచి కిందపడింది. చిన్నారి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఎందుకు అలా తన్నాడో తెలియరాలేదు. ఈ దృశ్యం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటనకు సంబంధించి రంజన్(35)ను బనశంకరి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి మానసిక పరిస్థితి బాగాలేదని తెలిసింది. లీటర్ పాలపై ప్రోత్సాహక ధనం రూ.7కు పెంపు ● ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి శివాజీనగర: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బెళగావి సమావేశాల్లో సిద్దరామయ్య అతి ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇంతకాలం ప్రతి లీటర్ పాలకు రూ.5ల ప్రోత్సాహ ధనం ఇచ్చేవారు. రైతుల మేలు దృష్ట్యా వారికి ఇస్తున్న రూ.5ల ప్రోత్సాహ ధనాన్ని రూ.7లకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. ప్రస్తుత ప్రోత్సాహ ధనం రైతులకు పూర్తిగా చేరటం లేదనే ఆరోపణలపై శుక్రవారం విధానసభలో సీఎం సమాధానమిచ్చారు. ధర పెంపుదలతో పాటు ప్రభుత్వం నుంచి పాడి రైతులకు సాయం కొనసాగుతుందన్నారు. -
ఘర్షణ వద్దన్న వ్యక్తి హత్య
హొసపేటె: నగర శివారులోని కారిగనూర్లో చిన్న విషయంపై జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. రూరల్ పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివరాలివీ.. కరిగనూర్ నివాసి మాబుసాబ్(50) కుమారుడు మౌలా హుసేన్తో కొందరు యువకులు ఘర్షణ పడ్డారు. ఈ సమయంలో తన కుమారుడితో ఘర్షణ పడవద్దంటూ తండ్రి మాబూసాబ్ ఆ యువకులను అడ్డుకునేందుకు యత్నించారు. కోపోద్రిక్తులైన యువకులు మాబూసాబ్పై దాడిచేసి హత్య చేశారు. కుటుంబ సభ్యులు నగర ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని రోధించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు భంగి హనుమంత, చరణ, హులిగెమ్మతోసహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాఘవేంద్ర, దర్శన్, చంద్రశేఖర్, గురురాయ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఐజీపీ వర్తికాకటియార్, ఎస్పీ ఎస్.జాహ్నవి, ఏఎస్పీ మంజునాథ్, డీవైఎస్పీ డాక్టర్. మంజునాథ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. -
బెళగావికి బైబై
సాక్షి బెంగళూరు: కుందానగరి బెళగావి సువర్ణసౌధలో రెండు వారాలుగా జరుగుతున్న రాష్ట్ర విధాన మండల ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఒకవైపు ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరిగిన పోటీ, డిన్నర్ మీటింగ్లు, వివిధ సంఘాల ఆందోళనల మధ్య శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగిన సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలతో పాటు వివిధ తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాల వల్ల బెళగావికి ఒక్కసారిగా రాజకీయ నాయకులు, అధికారులు, ఇతరులు వచ్చి చేరడంతో పర్యాటక, యాత్రా స్థలాలు కిక్కిరిసిపోయాయి. డిసెంబర్ 8న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. పది రోజుల్లో రెండు రోజులు దివంగత ఎమ్మెల్యేలు హెచ్.వై.మేటి, శామనూరు శివశంకరప్పలకు సంతాపం వ్యక్తం చేసి కార్యకలాపాలను వాయిదా వేశారు. ఇటీవల మరణించిన ఇతర ప్రముఖులకు కూడా సమావేశాల ప్రారంభంలో శ్రద్ధాంజలి ఘటించారు. మిగిలిన 8 రోజుల్లో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యలపై ప్రశ్నోత్తరాల సమయంలో సలహా సూచనలిచ్చారు. జీరో అవర్లో వివిధ అంశాలపై చర్చ జీరో అవర్లో వివిధ అంశాలను ప్రస్తావించి ప్రభుత్వం నుంచి పరిష్కారం కోసం నేతలు శ్రమించారు. ఉత్తర కర్ణాటక జలవనరుల ప్రాజెక్టులతో పాటు వివిధ రకాల అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టు వరకు ఉన్న పెండింగ్ బకాయిలన్నింటిని చెల్లించిందని మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ ప్రకటించారు. అయితే ప్రతిపక్షాలు ఒక అడుగు ముందుకేసి ఫిబ్రవరి, మార్చి నెలల డబ్బులు విడుదల కాలేదని నిరూపించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సీఎం సిద్ధరామయ్య కలుగజేసుకుని ఆ రెండు నెలల డబ్బులను త్వరగా అందిస్తామని హామీనివ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత మంత్రి కూడా తాను చేసిన తప్పునకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నిధుల వినియోగ బిల్లు, ద్వేషప్రసంగాల నియంత్రణ బిల్లు, అంతర్గత రిజర్వేషన్కు సంబంధించిన బిల్లు తదితర బిల్లులకు విధానసభలో ఆమోదం లభించింది. ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు పది రోజుల పాటు బెళగావిలోనే నాయకులు, అధికారుల మకాం -
విద్యార్థులు సాహిత్యంపై ఆసక్తి పెంచుకోవాలి
హొసపేటె: వచన సాహిత్యంలో దాగిన జీవిత విలువలు, సందేశాలను అర్థం చేసుకోవడం వ్యక్తిత్వ వికాసానికి దారితీస్తుందని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం వైస్ఛాన్సలర్ డీవీ.పరమశివమూర్తి అన్నారు. నగరంలో కన్నడ, సాంస్కృతిక శాఖ, కర్ణాటక సాహిత్య అకాడమీ, బెంగళూరు చకోర సాహిత్య విచార్ వేదిక, శ్రీశంకర్ ఆనంద్ సింగ్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాల నిర్వహించిన ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సాహిత్య శైలిలో వచన సాహిత్యానికి ముఖ్యమైన, ఆకర్షణీయమైన ప్రాముఖ్యత ఉందన్నారు. సాంకేతికత, కృత్రిమ మేథస్సు యుగంలో, వచనాలను చదివే వారి సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. వచనాలను చదవడం ద్వారా ప్రతి ఒక్కరూ వాటి ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలన్నారు. కర్ణాటక సాహిత్యం అకాడమీ సభ్య కన్వీనర్ డాక్టర్ మల్లికార్జున బి.మన్నాడే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులలో సాహిత్యంపై ఆసక్తి, అవగాహన పెంచడానికి పీయూ, డిగ్రీ కళాశాలలో చకోర వచన సాహిత్య వేదిక కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. పాఠ్యాంశాలతో పాటు వచన సాహిత్యం, నవలలు, కథలు, కవితలను చదవాలన్నారు. -
ఉద్యోగి పాదయాత్ర
హుబ్లీ: అవినీతి ఎన్నికల వ్యవస్థను మార్పు చేయాలని కోరుతూ బాగళకోటె నివాసి, ఐటీ ఉద్యోగి నాగరాజ కలకుటకర్ జన జాగృతి పాదయాత్ర చేపట్ట్టారు. భుజంపై జాతీయ జెండా, కన్నడ మాత భువనేశ్వరి ధ్వజం పట్టుకుని ముందుకు కదిలారు. బెళగావి సువర్ణ సౌధలో తన సంకల్పాన్ని ప్రస్తావించేందుకు వచ్చిన నాగరాజ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏరోస్పేస్ ఇంజినీర్గా పనిచేస్తూ లక్షల వేతనాలు వస్తున్నా..వదిలేసి ప్రామాణిక ఉత్తమ ఎన్నికల వ్యవస్థ ఏర్పాటే లక్ష్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి 16న బెంగళూరు విధాన సౌధ నుంచి పాదయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య మనుగడ కోసం, అవినీతి, కుల,మత పిచ్చిలేని, సంస్కార సంప్రదాయాల వ్యక్తిత్వాలకు ప్రతినిధులుగా ఉన్న వారికే ఓటు వేయాలని ప్రజలను జాగృతి చేస్తున్నట్లు వెల్లడించారు. 31 జిల్లాలు, 224 అసెంబ్లీ నియోజక వర్గాలలో పాదయాత్ర చేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే 18 జిల్లా కేంద్రంలో 2300 కిలో మీటర్ల మేర ప్రయాణించానని తెలిపారు. లక్షలాది మంది తనకు నైతికంగా అండగా నిలిచారన్నారు. -
కార్యాలయాల్లో స్వచ్ఛ భారత్
రాయచూరు రూరల్: జిల్లా పంచాయతీ కార్యాలయం వద్ద వివిధ ప్రభుత్వ ఽశాఖల కార్యాలయాల అధికారులు పరిసరాలను శుభ్రపరిచారు. శనివారం జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ ఆదేశాల మేరకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. నెలలో మొదటి, మూడవ శనివారం కార్యాలయాలను, పరిసరాలను, రికార్డులను శుభ్రపరచాలని ఆదేశించడంతో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆ దిశగా పని చేశారు. బస్సులను ఆపాలని వినతిరాయచూరు రూరల్: నగర, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అనుకూలంగా ఆర్టీసీ బస్సులను పలు చోట్ల ఆపాలని అఖండ కర్ణాటక రక్షణ సమితి డిమాండ్ చేసింది. శనివారం సింధనూరు ఆర్టీసీ డిపో వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ సింధనూరు తాలూకా హంచినాళ క్యాంప్ వద్ద 15 గ్రామాల ప్రజలు, విద్యార్థులు ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గంగావతి, కొప్పళ, సింధనూరు, మస్కి, రాయచూరు ఆర్టీసీ బస్ డిపో మేనేజర్లకు లేఖలు రాసి హంచినాళ క్యాంప్ వద్ద ఆర్టీసీ బస్సులను నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో స్వాతి, విశ్వనాథ్, పార్వతి, ప్రభుస్వామి, ముదుకప్ప, అమరేగౌడ, శేఖరప్ప, శరణప్ప, సుభాష్లున్నారు. కేఎస్ఆర్పీ బెటాలియన్ ఏర్పాటు చేయండి రాయచూరు రూరల్: రాయచూరులో 13వ కేఎస్ఆర్పీ బెటాలియన్ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేడీఎస్ గ్రామీణ అధ్యక్షుడు నరసింహ నాయక్ పేర్కొన్నారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కలబుర్గిలోని కర్ణాటక రిజర్వ్డ్ పోలీస్ బెటాలియన్ కేంద్రాన్ని మహిళా రిజర్వ్డ్ పోలీస్ బెటాలియన్ కేంద్రంగా మార్చారన్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో 12 చోట్ల కేఎస్ఆర్పీ బెటాలియన్ కేంద్రాలున్నాయన్నారు. మునిరాబాద్లో విధులు నిర్వహిస్తున్న బెటాలియన్ తిరిగి కలబుర్గికి వాపస్ రావాలంటూ ఆదేశాలు జారీ చేశారన్నారు. బందోబస్తు సమయంలో మరింత కఠినం అవుతుందన్నారు. నైతిక విలువలు పతనంరాయచూరు రూరల్: సమాజంలో నైతిక విలువలు నశిస్తున్నాయని సీనియర్ కవి బరగూరు రామచంద్రప్ప విచారం వ్యక్తం చేశారు. శనివారం నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో 11వ అఖిల భారత దళిత సాహిత్య సమ్మేళనాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. సందర్భానుసారంగా నైతిక విలువల గురించి ప్రజలకు వివరించాలన్నారు. అఖిల భారత దళిత సాహిత్య సమ్మేళన అధ్యక్షురాలు యశోద మాట్లాడుతూ అంబేడ్కర్ వేిసిన బాటలో నడిచి నిజమైన వారసులుగా నిలవాలన్నారు. లోక్సభ సభ్యుడు కుమార నాయక్, అర్జున్, శాంతప్ప, నరసమ్మ, కృష్ణ, జయన్న, తాయరాజ్లున్నారు. వృద్ధులకు దుస్తుల పంపిణీరాయచూరు రూరల్: క్రిస్మస్ను పురస్కరించుకొని పేద వృద్ధులకు ఉచితంగా దుస్తులను పంపిణీ చేశారు. గురువారం సాయంత్రం రాయచూరు తాలూకా గిల్లేసూగూరు క్యాంప్లో సమాధాన సువార్త ప్రార్థన సంఘం ఆధ్వర్యంలో రెవరెండ్ పరిశుద్ధరావ్ అనాథ పిల్లలకు, వృద్ధులకు నూతన వస్త్రాలను అందించి భగవంతుడి కృపకు పాత్రులు కావాలన్నారు. దేవుడు అందరినీ ఆదరించడానికి మానవతా దృక్పథంతో సేవ చేయాలన్నారు. -
విద్యా బోధనపై రాష్ట్ర స్థాయి సదస్సు
హొసపేటె: విజయనగర కళాశాలలో అంతర్గత నాణ్యత హామీ సెల్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులందరికీ ఫలితాల ఆధారిత విద్య ద్వారా బోధన, అభ్యాసంలో నాణ్యతను అందించడం అనే అంశంపై ఒక రోజు రాష్ట్ర స్థాయి సదస్సును శనివారం నిర్వహించింది. కార్యక్రమాన్ని విజయనగర కళాశాల అధ్యక్షుడు మల్లికార్జున్ ఎన్.మైత్రి ప్రారంభించారు. ప్రిన్సిపాల్ మహంతేష్ ఎన్. ఆరాధ్యమట్ అధ్యక్షత వహించారు. వర్క్షాప్ ఫెసిలిటేటర్గా ఉన్న ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ డి.రవికిరణ్ వర్క్షాప్, ఫలితాల ఆధారిత విద్యపై పరిచయ వ్యాఖ్యలు చేశారు. కొప్పళలోని ప్రభుత్వ ఫస్ట్గ్రేడ్ కళాశాలలో జర్నలిజంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, రిసోర్స్ పర్సన్ సుధా హెగ్డే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. కర్ణాటక నలుమూలల నుంచి తరలి వచ్చిన మొత్తం 180 మంది ఉపాధ్యాయులు వర్క్షాప్లో పాల్గొన్నారు. డాక్టర్ సుప్రియ, డాక్టర్ శ్రింగేష్, డాక్టర్ శివమల్లికార్జున, డాక్టర్ గాదెప్ప, అమృత్, డాక్టర్ శివప్రసాద్, తదితరులు హాజరయ్యారు. -
రూ.వెయ్యి కోట్ల సైబర్ నేరాల ముఠా
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలోనే అతిపెద్ద సైబర్ క్రైం కేసును దావణగెరె పోలీసులు ఛేదించారు. సుమారు రూ.1000 కోట్ల మేరకు ఈ సైబర్ నేరస్తులు దోచుకున్నట్టు భావిస్తున్నారు. అర్ఫాత్, సంజయ్ కుంద్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ప్రమోద్ ఫిర్యాదుతో.. గత రెండు నెలల క్రితం ప్రమోద్ అనే వ్యక్తి ఖాతా నుంచి రూ.52 లక్షలు పోయాయని దావణగెరె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ప్రమోద్ ఖాతా నుంచి రూ.150 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అయితే ఇంకా లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు సైబర్ క్రైంలో ఇతడూ భాగస్వామి అని తేలింది. అతని ఖాతాలోకి అపరిచిత అకౌంట్ల నుంచి కోట్ల రూపాయలు వచ్చేవి. అతనిని ప్రశ్నించగా, వ్యాపారవేత్తనంటూ బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలను తెరిచి వాటిని సైబర్ నేరస్తులకు ఇచ్చేవాడు. నేరగాళ్లు తాము కొట్టేసిన సొమ్ములను ఈ ఖాతాల్లో నిల్వ ఉంచేవారు. ఇందుకుగాను ప్రమోద్కు కమీషన్ ఇచ్చేవారు. గ్యాంబ్లింగ్, ఫేక్ ట్రేడింగ్, ఆన్లైన్ గేమింగ్ తదితర అక్రమ దందాల ద్వారా వచ్చే డబ్బు జమ ఇతని ఖాతాల్లో అయ్యేది. అర్ఫాత్ ఖాతాలో రూ.18 కోట్లు ఈ కేసులో అర్ఫాత్ అనే వంచకున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇతని బ్యాంక్ అకౌంట్లో కూడా రూ.18 కోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో నిందితుడు సంజయ్ కుంద్ను గుజరాత్లో పట్టుకున్నారు. ఈ ముఠాలో చాలా మంది ఉన్నట్లు, సుమారు రూ. వెయ్యి కోట్ల మేర అక్రమాలు జరిగాయని తేల్చారు. ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. ఛేదించిన దావణగెరె పోలీసులు బ్యాంకు ఖాతాదారు ద్వారా కదిలిన డొంక -
జంతు సంరక్షణ మన ప్రాధాన్యత కావాలి
హొసపేటె: మన చుట్టు ఉన్న జంతువులను మన స్వంత కుటుంబ సభ్యుల మాదిరిగానే జాగ్రత్తగా చూసుకోవాలి, వాటికి ఇబ్బంది కలిగించకూడదు అని అటల్ బిహారీ వాజ్పేయి జూలాజికల్ పార్క్ వన్యప్రాణి జీవశాస్త్ర వేత్త, విద్యా అధికారిణి బీ.ఎల్.శైలశ్రీ తెలిపారు. కన్నడ సాహిత్య అధ్యయన విభాగం అల్లమ హాల్లో శనివారం ఆమె జంతువుల ప్రవర్తన అనే అంశంపై మాట్లాడారు. మానవుల్లో తల్లికి తన పిల్లలపై ఉన్న ప్రేమ వలె తల్లి పులి, నీటిగుర్రం వంటి జంతువులలో మనం దానిని చూడవచ్చన్నారు. అదే విధంగా జంతువుల ప్రవర్తన నుంచి నేర్చుకోవడం అనే నినాదం ప్రకారం మానవులు జంతువులను ఇబ్బంది పెట్టకపోతే అవి మనల్ని ఇబ్బంది పెట్టవని అన్నారు. నేడు కొన్ని జంతువులకు ప్రకృతిలో తినే ఆహారానికి బదులుగా మనకు లభించే ఆహారాన్ని ఇస్తున్నాం, ఇది జంతువుల ప్రవర్తనలో తేడాలను కలిగిస్తోందన్నారు. జంతువులను అడవి సంస్కృతిలో జీవించడానికి అనుమతించాలని ఆమె అన్నారు. వేదికపై మోడరేటర్ డాక్టర్ గోవింద రవిచంద్ర, విభాగాధిపతి ప్రొఫెసర్ వెంకటగిరి దళవాయి, పరిశోధకులు రవిచంద్ర, ఇస్మాయిల్ సిద్ధిక్, అక్షత పాల్గొన్నారు. -
కాటేస్తున్న వాయు కాలుష్యం
సాక్షి బళ్లారి: తాలూకాలోని శిడిగినమొళ, కారేకల్లు గ్రామాల సమీపంలో వెలసిన ప్రముఖ ఇండస్ట్రీ జానకీ బసాయ్ స్టీల్ పరిశ్రమలతో సమీపంలోని గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పలుమార్లు అధికారులకు నివేదికను, సూచనలు చేసినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఇండస్ట్రీ పక్కనే గల భూముల్లో దుమ్ము, ధూళి చేరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్న తరుణంలో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో శనివారం అసిస్టెంట్ కమిషనర్ రాజేష్, పర్యావరణ శాఖాధికారి సిద్దేశ్వరబాబు శిడిగినమొళ, కారేకల్లు పరిసరాల్లోని పంట పొలాలను పరిశీలించారు. అధికారులు విచ్చేయడంతో స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో చేరి పరిశ్రమల నుంచి జరుగుతున్న నష్టాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. తాము పంటను నష్టపోతున్నామని, ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, ఒక ఎకరానికి కేవలం రూ.1000ల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, ఇలాంటి నామమాత్ర పరిహారం తమకు అవసరం లేదని వాపోయారు. భారీగా పంటనష్టం వాటిల్లుతోందని ఆవేదన ఎకరాకు దాదాపు 10 క్వింటాళ్లు పంట పండేదని, దుమ్ము, ధూళి వల్ల ఒకటి లేదా రెండు సంచులు కూడా పండటం లేదన్నారు. వారు ఇచ్చే పరిహారం అక్కరలేదని, దుమ్ము, ధూళి లేకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. అంతేకాకుండా మంచినీటి చెరువుల్లో కూడా విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోందన్నారు. సమీపంలోని ఇళ్లల్లోకి కూడా కాలుష్యం రావడం వల్ల ప్రజలకు ఆనారోగ్యకర పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. దుమ్ము, ధూళి, వాయు కాలుష్యం వల్ల పంట పొలాలు, తాగునీరు, ప్రజలకు శ్వాసకోస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని కన్నీరు పెట్టుకున్నారు. మానవతా ధృక్పథంలో ఆలోచించి పరిశ్రమల నుంచి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమల ద్వారా ప్రారంభం నుంచి ఇదే సమస్య తలెత్తిందన్నారు. అయితే అధికారులు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారే కానీ సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. నివేదిక వచ్చిన అనంతరం చర్యలపై హామీ పర్యావరణ శాఖాధికారులు, జిల్లాధికారుల బృందం సమగ్ర తనిఖీ నిర్వహించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఓ వైపు ఆరోగ్యాలు దెబ్బతినడంతో పాటు పంటలు కూడా పూర్తిగా నాశనమవుతున్నాయన్నారు. ప్రారంభంలో చిన్నగా మొదలైన జానకీ బసాయి పరిశ్రమలు అంచెలంచెలుగా పెద్ద స్థాయికి చేరుకోవడంతో తమకు శాపంగా మారిందన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ఒత్తిడి చేశారు. రైతులు, స్థానికుల ఆవేదనను విన్నపాన్ని ఆలకించిన అధికారుల బృందం ఉన్నతాధికారులతో చర్చించడంతో పాటు పూర్తి స్థాయి నివేదిక తీసుకొని ప్రజలకు పరిశ్రమల ద్వారా హాని కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈసందర్భంగా రైతు సంఘం నాయకులు, స్థానికులు, పరిశ్రమల ప్రముఖులు పాల్గొన్నారు. కారేకల్లు వద్ద పరిశీలిస్తున్న అధికారులు అధికారికి పంటనష్టంపై వివరిస్తున్న రైతులు కారేకల్లు, శిడిగినమొళ పరిసరాల్లో పర్యావరణానికి ముప్పు అసిస్టెంట్ కమిషనర్, పర్యావరణ శాఖ అధికారుల పరిశీలన దుమ్ము, ధూళితో పంట నష్టాన్ని వివరించిన రైతులు -
బీజేపీ మహిళా కార్యకర్త ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: బీజేపీ కార్యకర్త ఇంట్లో మహిళా కార్యకర్త ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలబుర్గి తాలూకా నందికూర గ్రామంలో జరిగింది. కార్యకర్త మల్లినాథ్ ఇంట్లో జ్యోతి పాటిల్ అనే మహిళా కార్యకర్త ఇలా ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో మల్లినాథ్ ఇంట్లో లేడని సమాచారం. ఆమె కలబుర్గి తాలూకా బ్రహ్మపురి కాలనీ నివాసిగా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. ఫరతాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మల్లినాథ్ను విచారించే పనిలో ఉన్నారు. సస్పెండ్ చేశారని మహిళా హెచ్ఎం రోదన దొడ్డబళ్లాపురం: రాజకీయ ఒత్తిళ్లతో తనను సస్పెండ్ చేశారని, న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒక టీచర్ విలవిస్తోంది. వివరాలు.. బెళగావి తాలూకా హరగాపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం సురేఖ ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేసింది. పాఠశాల ఎస్డీఎంసీ అధ్యక్ష ఎన్నికలను స్థానిక రాజకీయ నేత పవన్ పాటిల్ నిర్వహించాలని ప్రయత్నించాడు. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ సురేఖ అడ్డుకున్నారు. దీంతో పగబట్టి రాజకీయ పలుకుబడితో తనను సస్పెండ్ చేయించాడని వీడియోలో తెలిపింది. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ సురేఖ చేసిన వీడియో వైరల్గా మారింది. గుడ్లపై భయం, తగ్గిన బేకరీ వ్యాపారం శివాజీనగర: గత కొన్ని రోజుల నుండి కోడిగుడ్లలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయనే ప్రచారం తీవ్ర చర్చకు కారణమైంది. ఇది ప్రజల్లో భయాన్ని కలిగించింది. క్రిస్మస్, కొత్త ఏడాది పండుగ సీజన్లో కూడా బేకరీ వ్యాపారాన్ని ఓ మోస్తరుగా దెబ్బతీసింది. గుడ్డు మంచిదా, కాదా అని ఒక క్లారిటీ లభించేవరకు గుడ్లు, దాంతో చేసిన ఆహార పదార్థాల సేవనానికి దూరంగా ఉన్నారు. దీనివల్ల బెంగళూరులోని కాండిమెంట్స్, బేకరీల్లో 10 శాతం వ్యాపారం తగ్గినట్లు తెలిసింది. బేకరీ ఉత్పత్తుల్లో గుడ్లను విరివిగా వాడతారనేది తెలిసిందే. ఎగ్ పఫ్స్ కొనుగోళ్లు బాగా పడిపోయాయి. బేకరీల్లో కేక్ ఆర్డర్లు ముందులాగా రావడం లేదు. కేక్ల వ్యాపారం ఏమవుతుందోనని గందరగోళంలో వ్యాపారులు ఉన్నారు. గుడ్లు వాడని కేక్లు తయారు చేస్తున్నట్లు బేకరీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పెద్దలపై ద్వేష రాజకీయాలు తగవు● కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా శివాజీనగర: దేశంలో రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేసుకొని కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీల మీద కేంద్ర ప్రభుత్వం ద్వేషపూరిత రాజకీయం చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. నగరంలో స్వాతంత్య్ర ఉద్యానవనంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ నేతృత్వంలో సత్యమేవ జయతే పేరిట ధర్నా జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ద్వేషపూరిత రాకీయం ఎక్కువ కాలం సాగదని అన్నారు. డీ.కే.శివకుమార్ మాట్లాడుతూ ద్వేష రాజకీయాలు చేసే నాయకులకు పోయేకాలం దగ్గర పడిందన్నారు. ఈడీని దుర్వినియోగం చేసి సోనియాగాంధీ, రాహుల్గాంధీల మీద తప్పుడు కేసులు పెట్టారని, దీని మీద పోరాటం చేస్తామని అన్నారు. కేంద్రం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి పేదలపై దాడి చేస్తోందన్నారు. దేశంలో పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందని, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్ కుమ్మకై ్కనట్లు ఆరోపించారు. ఈ ఆందోళనలో పెద్దసంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. -
బొగ్గు చౌర్యం ఇంటి దొంగల పనే
రాయచూరు రూరల్: రాష్ట్రానికి 60 శాతం విద్యుత్ను అందించే రాయచూరు తాలూకా ఆర్టీపీఎస్ నుంచి విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే బొగ్గును అక్రమంగా నిల్వ ఉంచిన అధికారులు, కాంట్రాక్టర్లు భాగస్వాములు కావడం శోచనీయం. రైల్వే శాఖ, సీఐఎస్ఎఫ్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమని బీజేపీ ఆరోపించింది. మూడేళ్ల నుంచి అక్రమంగా సింగరేణి బొగ్గు గనుల నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా రాయచూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేకంగా విద్యుత్ ఉత్పత్తి యూనిట్లకు ఏర్పాటు చేసిన రైల్వే లైన్లపై యద్లాపూర్కు సరఫరా చేసేవారు. యరమరస్ నుంచి యూనిట్కు మధ్య ఐదు కి.మీ.దూరం ఉంది. మధ్యలో రైలు వ్యాగన్లను నిలిపి నాణ్యతతో కూడిన 120 మెట్రిక్ టన్నుల బొగ్గు విలువ రూ.5 కోట్లు కాంట్రాక్టర్, అధికారులపై దొంగతనం చేసినట్లు తేలింది. ఆర్టీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కాంట్రాక్టర్, యద్లాపూర్ రైల్వేస్టేషన్ మాస్టర్లను నిందితులుగా గుర్తించారు. నాణ్యతతో కూడిన బొగ్గును దొంగిలించారు. ఈ బొగ్గు నడిచే రైలు నుంచిి కిందపడింది కాదని నివేదికల్లో పేర్కొన్నారు. గత మూడేళ్ల నుంచి ఈ బొగ్గును దొంగలిస్తున్నట్లు సమాచారం సేకరించారు. అధికారులు, కాంట్రాక్టర్లు కూడా భాగస్వాములు తోడైన రైల్వే శాఖ, సీఐఎస్ఎఫ్ అధికారుల నిర్లక్ష్యం -
విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానం అత్యవసరం
హొసపేటె: నేటి ఆధునిక పరిజ్ఞాన యుగంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శనివారం విజయనగర జిల్లా హొసపేటెలో సియెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ పీయూ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తరగతులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎస్టీఈఎం, రోబోటిక్స్, కోడింగ్, డిజిటల్ ఇన్నోవేషన్లో అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. సియెంట్ లిమిటెడ్ అధినేత డాక్టర్ బీవీఆర్ మోహన్రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వ విద్యాశాఖ సహకారంతో అమలు చేసిన ఈ ప్రాజెక్టును ఈరోజు భారత ప్రభుత్వ ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభించడం గర్వకారణమన్నారు. కర్ణాటకలో మొట్టమొదటి హొసపేటె తాలూకాలోని ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ఈ పైలెట్ ప్రాజెక్ట్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదివే 2000 మందికి పైగా విద్యార్థులకు ఐటీ సాధికారత కల్పిస్తుందన్నారు. ఎమ్మెల్యే గవియప్ప, జిల్లాధికారి కవిత తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
పోలియో రహిత దేశానికి టీకా తప్పనిసరి
హొసపేటె: దేశాన్ని పూర్తిగా పోలియో రహితంగా మార్చాలంటే ప్రజలు సమీపంలోని పోలియో చుక్కల కేంద్రాలకు వెళ్లి ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న తమ పిల్లలకు చుక్కలు వేయించాలని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ ఎల్ఆర్ శంకర్ నాయక్ అన్నారు. మాతా శిశు ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో అవగాహన జాతాను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈసారి ఈనెల 21 నుండి 24 వరకు వివిధ విభాగాల సమన్వయంతో నిర్వహించే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తప్పనిసరి టీకాను వేయించుకోవాలన్నారు. అనంతరం నగర వీధుల్లో ప్రధాన సర్కిళ్ల గుండా మాతాశిశు ఆస్పత్రి ప్రాంగణం వరకు జాతా సాగింది. 200 మందికి పైగా విద్యార్థులు, ఆశా వర్కర్లు పోలియోకు సంబంధించిన వివిధ నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. జిల్లా ఆర్సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య, జిల్లా కుష్టు వ్యాధి నిర్మూలన అధికారి డాక్టర్ కే.రాధిక, జిల్లా సర్వే అధికారి డాక్టర్ షణ్ముఖ, తాలూకా వైద్యాధికారి డాక్టర్ వినోద్, బాలల అభివృద్ధి ప్రాజెక్టు అధికారి సింధు అంగడి, ఐఎంఏ అధ్యక్షుడు రఘునాథ్ దీపాలి, పిల్లల వైద్యురాలు లలితా జైన్, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కళ్యాణ కర్ణాటకకు 112 బస్సులు
సాక్షి,బళ్లారి: కళ్యాణ కర్ణాటక పరిధిలోని అన్ని జిల్లాలకు మంజూరైన 112 బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. శుక్రవారం ఆయన విజయపురలో కళ్యాణ కర్ణాటక పరిధిలోని అన్ని జిల్లాలకు చెందిన కొత్త బస్సులను ప్రారంభించి మాట్లాడారు. ఈ ఏడాది కళ్యాణ కర్ణాటకకు 400 బస్సులు మంజూరు చేశామన్నారు. అన్నింటిని దశల వారిగా అందజేస్తామన్నారు. ఈ 112 బస్సుల్లో విజయపుర జిల్లాకు 27, కలబుర్గికి 25, రాయచూరుకు 18, బళ్లారికి 10, బీదర్కు 4, యాదగిరికి 3 బస్సులను మంజూరు చేశామన్నారు. ఈ ప్రాంతానికి ప్రతిష్టాత్మకమైన బస్సులను కూడా మంజూరు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో మరో 56 బస్సులను కూడా మంజూరు చేస్తామన్నారు. వాటిలో ఏసీ, స్లీపర్, 16 సీటర్ బస్సులను కూడా మంజూరు చేస్తామన్నారు. అంతేకాకుండా కళ్యాణ కర్ణాటకకు విద్యుత్ బస్సులను కూడా చేర్చామన్నారు. వాటిలో కలబుర్గి జిల్లాకు 100, విజయపుర జిల్లాకు 75, బళ్లారి జిల్లాకు 50 బస్సులను ఇవ్వాలని తీర్మానించామన్నారు. మంత్రి ఎం.బీ.పాటిల్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. మంత్రి రామలింగారెడ్డి -
అద్దె చెల్లించని యజమానుల అంగళ్లకు తాళాలు
హుబ్లీ: దావణగెరె కేఆర్ మార్కెట్లోని ప్రభుత్వ సీనియర్ ప్రాథమిక పాఠశాల భవన సముదాయంలో బాడుగ రూపంలో ఆదాయం చేకూరాలన్న సద్దుదేశంతో 365 అంగళ్ల సముదాయాన్ని నిర్మించారు. వీటిని అద్దెకు కేటాయించారు. అయితే సదరు బాడుగదారులు కొన్నేళ్ల నుంచి అద్దెలు సక్రమంగా చెల్లించకుండా అద్దె అడిగితే నేడు, రేపు అంటూ కాలహరణం చేస్తున్నారు. దీంతో జిల్లాధికారి ఆదేశం మేరకు తహసీల్దార్ డాక్టర్ అశ్వత్, డీడీపీఐ కొట్రేష్ నేతృత్వంలో విద్య, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో దావణగెరె సిటీ కార్పొరేషన్ సిబ్బంది సంయుక్త కార్యాచరణ చేపట్టి బాడుగ బకాయిలు చెల్లించకుండా ఉదాసీన వైఖరితో నడుచుకుంటున్న వ్యాపారుల షాపులకు తాళాలు వేసి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో దారి కొచ్చిన వ్యాపారులు బకాయి పడ్డ లక్షలాది రూపాయల అద్దెలను చెల్లించగా మరి కొందరు మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. నాలుగు సార్లు నోటీసులు జారీ చేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన వ్యాపారులపై అధికారులు కొరడా ఝళిపించారు. దీంతో దిగి వచ్చిన వ్యాపారులు సుమారు 60 షాపులకు తాళాలు వేయగా, వీటిలో 30 షాపుల వ్యాపారులు అక్కడికక్కడే రూ.24 లక్షల మేర అద్దెలు చెల్లించారు. మిగిలిన 30 అంగళ్ల వారు బాడుగ బకాయి సొమ్ము విద్యా శాఖకు చెల్లించాల్సి ఉంది. అంతకు ముందు అధికారులు ఒక్కొక్క అంగడికి వెళ్లి ఎంతెంత మేరకు ఎన్ని నెలల నుంచి అద్దె బాపత్తు చెల్లించలేదో క్షుణ్ణంగా ఆరా తీసి కారణాల గురించి సమగ్రంగా తెలుసుకున్నారు. బాడుగలు కట్టకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అబ్బురం.. ముళ్ల కంపలపై శయనం
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో వివిధ రకాలైన పండుగలను ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఒళ్లు గగుర్పొడిచేలా ముుళ్ల పందిరిపై శయనించే జాతర కొప్పళ జిల్లాలో జరిగింది. అచంచల భక్తివిశ్వాసాలతో ముళ్ల కంప చెట్ల కొమ్మలపై శరీరంపై గాయాలైన వారు వెల్లికిలా పడుకున్నా ఏమీ కాదు. కొప్పళ తాలూకాలోని పలు గ్రామాల్లో ముళ్లకంప చెట్ల శయన ఉత్సవాలను ఆచరిస్తారు. కార్తీక అమావాస్య నుంచి 41 రోజుల పాటు పూజలు జరిపి చట్టి అమవాస్య నాడు మారుతేశ్వర ఆలయంలో యువకులు ఉదయం చెప్పులు వేసుకోకుండా ముళ్ల కంప చెట్లను నరికి తీసుకొచ్చి కుప్పలుగా పోస్తారు. మిద్దెల మీద నుంచి శయనంగా చేసిన ముళ్ల కంప చెట్ల కుప్పలపైకి దూకుతారు. అందులో పడిన యువకులకు గాయాలు కాకుండా ఉంటాయనేది భక్తితో కూడిన విశ్వాసం. ముళ్లకంప చెట్లను రాయితో కత్తిరించి తీసుకొస్తారు. ఎలాంటి ఇనుముతో కూడిన వస్తువులను వినియోగించరాదని గ్రామస్తులు వెల్లడించారు. ముళ్లకంప చెట్లకొమ్మల రాశులపై దూకిన యువకులు రక్త గాయాలతో ఇంటికెళ్లి రాత్రి పూట నల్ల కంబళిపై పడుకుంటే అది నయమవుతుందనే విశ్వాసం వారిలో ఉంది. రెండు, మూడు రోజుల్లో గాయాలు వాటంతటవే మానిపోతాయని చెబుతున్నారు. ముళ్ల కంప చెట్ల రాశుల మీద పడితే తాము కోరుకున్న కోరికలు నెరవేరతాయని వారు వెల్లడించారు. ఒళ్లు గగుర్పొడిచేలా భక్తుల విన్యాసం కొప్పళ జిల్లాలోని పల్లెల్లో వింత ఆచారం -
జర్నలిస్టులకు సదస్సులు అవసరం
హొసపేటె: జర్నలిజంలో ఆధునిక అంశాలను తెలుసుకోడానికి జర్నలిస్టులకు వర్క్షాప్ అవసరం, విజయనగర జిల్లాలో కర్ణాటక మీడియా అకాడమి ద్వారా అధ్యక్షుడితో ఇప్పటికే చర్చలు జరిగాయని కర్ణాటక మీడియా అకాడమీ సభ్యుడు కే.నింగజ్జ అన్నారు. హొసపేటెలోని కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయాన్ని ఆయన సందర్శించి సన్మానం అందుకున్న తర్వాత మాట్లాడారు. ఆధునిక కాలంలో జర్నలిజం చాలా అభివృద్ధి చెందినప్పటికీ ప్రజల సమస్యలకు స్పందించే వృత్తిపరమైన నైపుణ్యాలు, నివేదికలు లేకపోవడం గమనార్హం. అందువల్ల కర్ణాటక మీడియా అకాడమీ వర్క్షాప్లను నిర్వహించడం ద్వారా జర్నలిజంలో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించి, కొత్త ఆలోచనలను తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం మీడియా అకాడమి కలబుర్గి, హుబ్బళ్లి, కోలారు, మైసూరులలో వర్క్షాప్లను నిర్వహిస్తోందన్నారు. ఈ ప్రాంతాల్లో జర్నలిజం పండితులు, సీనియర్ జర్నలిస్టుల ప్రస్తుత సమస్యలు, సవాళ్ల గురించి జర్నలిస్టులకు అవగాహన కల్పించడానికి త్వరలో వర్క్షాప్ను నిర్వహిస్తామని తెలిపారు. సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ, ఉపాధ్యక్షులు నాగరాజ్, కోశాధికారి వెంకటేష్ పాల్గొన్నారు. ఘనంగా బసవేశ్వర ఉత్సవం రాయచూరు రూరల్: తాలూకాలోని ఆల్కూరులో వెలసిన బసవేశ్వర ఆలయంలో మల్లికార్జున, బసవేశ్వర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శుక్రవారం రాత్రి ఆలయంలో భక్తులు విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు. కిల్లే బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్యుల ఆధ్వర్యంలో భక్తులు స్వామివారిని సేవించి రథోత్సవం జరిపారు. కళాకారులను ఆదుకోవాలి బళ్లారి అర్బన్: కళాకారులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కర్ణాటక ఇతిహాస అకాడమి జిల్లా అధ్యక్షుడు టీహెచ్ఎం బసవరాజ్ పిలుపునిచ్చారు. శివదీక్ష మందిరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కళను నమ్ముకున్న కళాకారులు తమ వ్యక్తిగత కనీస అవసరాలకు తమపై ఆధార పడిన కుటుంబ నిర్వహణ కోసం పడరాని పాట్లు పడుతున్నారన్నారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా జడేష్ బృందం జానపద గీతాలను ఆలపించారు. అనంతరం ముఖ్యఅతిథులను ఘనంగా సన్మానించారు. వేదికపై దేవస్థాన అధ్యక్షుడు కే.రాజశేఖర్ గౌడ, తోలుబొమ్మలాట కళాకారుడు కే.హొన్నూరు స్వామి, ఆలాప్ సంగీత కళా ట్రస్ట్ అధ్యక్షుడు రమణప్ప భజంత్రి, నాగనగౌడ, హాల్రెడ్డి, కండక్టర్ పంపాపతి, అరుణ్ గురునాథ్ భట్ పాల్గొన్నారు. -
బతికి ఉన్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్ జారీ
హొసపేటె: గదగ్ జిల్లాలోని లక్ష్మేశ్వర్ పట్టణ పంచాయతీలో తన సోదరుడి సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి మరణ ధృవీకరణ పత్రం అందించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గదగ్ జిల్లాలోని లక్ష్మేశ్వర్ పట్టణంలోని దేశాయ్ ప్రాంతానికి చెందిన అశోక్ మహదేవప్ప హంపన్నవర్ 2024 ఆగస్టు 1న అనారోగ్యంతో మరణించాడు. అతని సోదరుడు నాగరాజ్ మహదేవప్ప హంపన్నవర్ 2024 ఆగస్టు 9న తన సోదరుడు మరణ ధృవీకరణ పత్రం కోసం పట్టణ మున్సిపాల్టీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే మరణించిన అశోక్ మహదేవప్ప హంపన్నవర్ మరణ ధృవీకరణ పత్రం జారీ చేయడానికి బదులుగా జీవించి ఉన్న వ్యక్తి సోదరుడు నాగరాజ్ హంపన్నవర్ పేరిట బాధ్యతారహితంగా 2024 మార్చి 11న మరణ ధృవీకరణ సర్టిఫికెట్ను జారీ చేశారు. నాగరాజ్ హంపన్నవర్ తన మరణ ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని గత 8 నెలలుగా మున్సిపాల్టీ చుట్టూ తిరుగుతున్నాడు. కానీ మరణ ధృవీకరణ పత్రం రద్దు కాలేదు. తాను బతికి ఉన్నా ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన సౌకర్యాలు అందలేదని నాగరాజ్ వాపోయాడు. మున్సిపాల్టీ జనన, మరణ నమోదు అధికారి మంజునాథ్ ముద్గల్ను కోరారు. దీంతో ఆయన సంబంధిత శాఖ సిబ్బందికి మరణ ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని వెంటనే నోటీసు జారీ చేశారు. మున్సిపల్ అధికారుల బాధ్యతారాహిత్యం బట్టబయలు -
వ్యాపారి హత్య కేసులో నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నలుగురు నిందితులను పోలీ్సులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డబ్బులు ఇచ్చి పుచ్చుకొనే విషయంలో జరిగిన గొడవే హత్యకు కారణమన్నారు. నిందితులను నగరంలోని తిమ్మాపూర్పేటకు చెందిన నాగరాజ్(17), బాషా(17), పునీత్ కుమార్ (18), సమీర్(18)లుగా గుర్తించారన్నారు. గురువారం రాత్రి 1 గంట సమయంలో ఆకాశవాణి వద్ద వ్యానులో నిద్రిస్తున్న సయ్యద్ హుసేన్ పాషాను హత్య చేశారన్నారు. -
కాలితో తన్నడంతో గాల్లోకి లేచి పడిన చిన్నారి
కర్ణాటక: రోడ్డు మీద ఆడుకుంటున్న చిన్నారిని ఒక వ్యక్తి ఫుట్బాల్ తరహాలో కాలితో తన్నాడు. దీంతో బాలిక గాల్లోకి లేచి కిందపడి గాయపడింది. ఈ అమానుష సంఘటన బెంగళూరు త్యాగరాజగనర్లో చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారి తన తల్లితో కలిసి ఇంటి బయట బ్యాడ్మింటన్ ఆడుతుండగా వెనుక నుంచి వచ్చిన రంజన్ అనే వ్యక్తి కాలితో తన్నాడు. దీంతో ఆ చిన్నారి గాల్లోకి లేచి కిందపడింది. చిన్నారి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఎందుకు అలా తన్నాడో తెలియరాలేదు. ఈ దృశ్యం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటనకు సంబంధించి రంజన్(35)ను బనశంకరి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి మానసిక పరిస్థితి బాగాలేదని తెలిసింది. What’s wrong??https://t.co/pbux7NWQ0T— Divya Gandotra Tandon (@divya_gandotra) December 19, 2025 -
నేనే సీఎం... అలాగని రాసిచ్చారా?
కర్ణాటక: అసెంబ్లీలో చివరిరోజు శుక్రవారం సీఎం సిద్ధరామయ్య, ప్రతిపక్ష నేత అశోక్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మున్ముందూ తానే సీఎంగా కొనసాగుతానని సీఎం సిద్ధు అనగా..అలాగని రాసిచ్చారా అంటూ అశోక్ కౌంటరిచ్చారు. ఉత్తర కర్ణాటక ప్రాంత అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ రెండున్నరేళ్లకు మాత్రమే ముఖ్యమంత్రి స్థానం అనే నిర్ణయం కాలేదని, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీర్మానిస్తే మున్ముందు కూడా తానే కొనసాగుతానని, హైకమాండ్ తనకు అండగా ఉందని అన్నారు. ఇందుకు ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ జోక్యం చేసుకుంటూ .. ‘మేమంతా బ్రహ్మ వద్ద ఎక్కువ సేపు ఉండకుండా విడిచి వచ్చేశాం. సిద్ధరామయ్య మాత్రం బ్రహ్మ వద్ద కూర్చొని 2013 నుంచి 2018 వరకు ఐదు సంవత్సరాలూ ముఖ్యమంత్రిగా ఖరారు చేసుకుని రాయించుకుని వచ్చారు. ప్రస్తుతం మాత్రం రెండున్నర సంవత్సరాలు రాసిచ్చార’ంటూ ఎద్దేవా చేశారు. ఇది మీకు ఎలా తెలిసిందని సిద్ధు ప్రశ్నించగా... ‘మీరు అధికార మారి్పడి గురించి ఢిల్లీ విమానం ఎక్కి వెళ్లిన నాటి నుంచి తీర్మానం అయ్యే వరకు కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి నాకు ఫోన్ ద్వారా సమాచారం వస్తుండేది. మీకు రెండున్నరేళ్లనని గడువు రాశారు. దానితో సరిపెట్టుకోవాలి’ అని అన్నారు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య తమది హైకమాండ్ ఉన్న పార్టీ అని, తొలిసారి కాలావధికి ఐదేళ్లు అధికారాన్ని పూర్తి చేశానని, ప్రస్తుతం హైకమాండ్ తనకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఇన్ని సమస్యల మధ్య కూడా మీరు సమరి్థంచుకోవటాన్ని మెచ్చుకోవాలని బీజేపీ సభ్యులు అరగ జ్ఞానేంద్ర, వి.సునీల్కుమార్ తదితరులు ఎద్దేవా చేశారు. బీజేపీలో యడియూరప్పను అధికారం నుంచి తొలగించింది ఎందుకని సిద్ధు ప్రశ్నించారు. అశోక్కు ప్రతిపక్ష నాయకుడిగా ఐదేళ్లు పూర్తి చేసే విశ్వాసముందా అని సవాల్ చేశారు. అశోక్ ఐదేళ్లూ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారని, ఆ విషయంలో తమకు గ్యారెంటీ ఉందని, మీకు ఐదేళ్లూ ముఖ్యమంత్రిగా ఉంటాననే విశ్వాసం ఉందా అని సునీల్కుమార్ ప్రశ్నించారు. ‘శాసనసభా పార్టీ సమావేశంలో నన్ను ఎంపిక చేశారు. అదే ప్రకారం ముఖ్యమంత్రి అయ్యా. హైకమాండ్ తీర్మానించినట్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. రెండున్నరేళ్లు అంటూ మాలో ఎలాంటి తీర్మానమూ కాలేద’ని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. మంత్రి కేజే జార్జ్ మాట్లాడుతూ తమ పార్టీ విషయాలు బీజేపీ వారికి ఎందుకని ప్రశ్నించారు. సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండే మాట్లాడుతూ రెండున్నరేళ్లలో అధికార మారి్పడి అంటూ తీర్మానం కాలేదు.. అనవసరమైన చర్చ ఎందుకన్నారు. -
పాపం.. ఫుట్బాల్లా తన్నాడు..వైరల్ వీడియో
బెంగళూరులో జరిగిన అనూహ్య సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లితో కలిసి ఆడుకుంటున్న పిల్లవాడిని ఒక వ్యక్తి అమాంతం తోసి వేసిన ఘటన నెట్టింట దిగ్భ్రాంతి రేపుతోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో వైరల్గా మారింది.డిసెంబర్ 14న ఆ బాలుడు నీవ్ జైన్ తన అమ్మమ్మ ఇంటి దగ్గర ఇతర పిల్లలతో ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. త్యాగరాజనగర్ ప్రాంతంలోని ఒక వీధిలో ఐదేళ్ల బాలుడు తోటిపిల్లలతో ఆటుకుంటున్నాడు. తల్లి కూడా అక్కడే ఉంది. ఇంతలో వెనకనుంచి వ్యక్తి ఆ బాలుడిని గట్టిగా కాలితో తన్నాడు. ఊహించని పరిణామానికి బాలుడు బొక్కబోర్లా పడిపోయాడు.A five-year-old boy was allegedly assaulted by a passerby in Bengaluru’s #Thyagarajanagar area, with CCTV footage capturing the incident. Police arrested the accused, who was later released on bail, and further investigation is underway. #Bengaluru #Banashankari pic.twitter.com/eWeZpN9nIC— Madhuri Adnal (@madhuriadnal) December 19, 2025 ఈ సంఘటన సిసిటివిలో రికార్డైంది. బాలుడి తల్లి దీపిక జైన్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, నిందితుడిని అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.తదుపరి దర్యాప్తు జరుగుతోంది. తన కొడుకును "ఫుట్బాల్ లా" తన్నాడని, దీంతో కనుబొమ్మల వద్ద గాయం రక్త స్రావమైందని, కాళ్లు, చేతులకు కూడాగాయాలైనాయని తల్లి ఆరోపించింది. మరోవైపు నిందితుడిని అదే ప్రాంతానికి చెందిన రంజిత్గా గుర్తించారు. ఇతను మాజీ జిమ్ ట్రైనర్ కూడా అట. ఉద్యోగాన్ని వదిలేసినట్టు సమాచారం. నిందితుడు ఈ ప్రాంతంలో ప్రజలపై దాడి చేయడం, దుర్భాషలాడడం లాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటాడట.ఇవీ చదవండి: ట్వీట్స్తో మోత మోగించిన ప్రధాని మోదీబెట్టింగ్ యాప్స్ : యూట్యూబర్ హై-ఎండ్ స్పోర్ట్స్ కార్లు చూసి ఈడీ షాక్! -
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి
హొసపేటె: జీపీల పరిధిలోని ప్రభుత్వ భూమిని గుర్తించి, గ్రామీణ ప్రాంతాల్లో స్థలాలు లేని పేద కుటుంబాలకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. తాలూకాలో భూమి లేని వారికి స్థలాలు అందించడానికి ప్రభుత్వ భూమిని గుర్తించాలని డిమాండ్ చేస్తూ సైట్, హౌసింగ్ హక్కుల పోరాట కమిటీ తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం నిరసన చేపట్టారు. సమితి నాయకురాలు అక్కమహాదేవి మాట్లాడుతూ తాలూకాలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలు నివసించడానికి ఇళ్లు లేవు. గ్రామాల్లో పేదలు ఉమ్మడి కుటుంబాల్లో, అద్దె ఇళ్లలో, పరిచయస్తుల భూముల్లోని గుడిసెల్లో తలదాచుకుంటున్నారన్నారు. మరబ్బిహాళు, బెణకల్లు, వల్లభాపుర, హంపసాగర, వరదాపుర, దశమాపుర, కిత్తూరు, రామేశ్వరబండి, హంపాపట్టణ తదితర గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భూమిని వెంటనే గుర్తించి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ ఆర్.కవితకు వినతిపత్రం అందించారు. సంస్థకు చెందిన సి.సుధ, రత్నమ్మ, రేఖ, నింగమ్మ, కోగళి మల్లేష్, అన్నపూర్ణ, మీనాక్షి, నింగమ్మ, ప్రమీలమ్మ, గంగమ్మ, రేణుకమ్మ, లక్ష్మమ్మ, సావిత్రిమ్మ, గులెదల్ వెంకటేష్, శోభ, రేణుక, చంద్రగౌడ, దొడ్డబసప్ప, నింగప్ప పాల్గొన్నారు. -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
హొసపేటె: విజయనగర జిల్లా యంత్రాంగం, జెడ్పీ, విజయనగర డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం, పాఠశాల విద్యా శాఖ, విజయనగర జిల్లా స్థాయి ప్రతిభా కారంజి, కళోత్సవాన్ని హొసపేటె ఎంపీ ప్రకాష్ నగర్లోని మార్కండేశ్వర్ ఇంగ్లిష్ మీడియం ప్రైమరీ, హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన హొసపేటె నగరాభివృద్ధి సంస్థ(హుడా) చైర్మన్ హెచ్ఎన్ఎఫ్. మహమ్మద్ ఇమాం నియాజీ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. జిల్లా స్థాయి ప్రతిభా కారంజికి ఎంపికై న విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి విజయనగర నియోజకవర్గ కీర్తి పతాకాన్ని ఎగరవేయాలని ఆకాంక్షించారు. ఏఎస్పీ మంజునాథ్, బీఈఓ శేఖర్ హొరపేటె తదితరులు పాల్గొన్నారు. బాగల్కోటె కలెక్టరేట్కు బాంబు బెదిరింపుసాక్షి,బళ్లారి: గదగ్ జిల్లాధికారి కార్యాలయం, మంగళూరు ఆర్టీఓ కార్యాలయానికి బాంబు బెదిరింపులతో పోలీసులు ఆ దిశగా తీవ్రంగా తనిఖీ చేస్తున్న నేపథ్యంలో తాజాగా బాగల్కోటె జిల్లాధికారి కార్యాలయానికి కూడా బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. బాగల్కోటె జిల్లాధికారి కార్యాలయానికి ఈ–మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు చేయడంతో అధికారులు తీవ్ర భయాందోళన చెందారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి డాగ్ స్క్వాడ్, బాంబ్ నిష్క్రియ దళంతో తనిఖీ చేస్తున్నారు. జిల్లాధికారి కార్యాలయాన్ని జల్లెడ పట్టి అణువణువు బాంబు కోసం వెదికారు. 14 నుంచి అంబిగర శరణ సంస్కృతి ఉత్సవాలుబళ్లారిటౌన్: నిజ శరణ అంబిగర చౌడయ్య గురుపీఠం ఆధ్వర్యంలో హావేరి జిల్లాలోని నరసాపురలో అంబిగర 10వ శరణ సంస్కృతి ఉత్సవాలను జనవరి 14 నుంచి రెండు రోజుల పాటు ఏర్పాటు చేస్తున్నట్లు గురుపీఠం శాంతభీష్మ చౌడయ్య స్వాములు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని పత్రికా భవనంలో ఆ సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బీ.మౌలాలి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొలి రోజున ఊయల ఉత్సవం, ఐక్య మంటప పూజలు, సామూహిక రక్తదాన శిబిరం, సామూహిక వివాహాలు, ప్రతిభావంతులకు పురస్కారాలు, గంగా హారతి, జానపద సాంస్కృతిక కార్యక్రమాలు, రెండవ రోజున ధర్మ ధ్వజారోహణం, ధర్మసభ, వివిధ మంటపాలు, శిలా శాసనాలు, సాయంత్రం మహరథోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ఆశ్రమానికి వివిధ పార్టీల రాజకీయ నాయకులు, సమాజం నేతలను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశంలో గంగామతస్థుల సంఘం నేతలు రిటైర్డ్ ఆర్టీఓ పంపాపతి, సిద్దప్ప, శివమూర్తి దాక్షాయిణి, కేఎస్.బసవరాజు, ఈశన్న, జగదీశ, నాగరాజు, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటు తగదురాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతంలో కేపీటీసీఎల్ విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటు చేయడం తగదని గ్రామస్థులు పేర్కొన్నారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఆంజనేయ మాట్లాడారు. రాయచూరు తాలూకా చంద్రబండ జెడ్పీ పరిధిలోని అరసికెరె వద్ద చేపట్టనున్న విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటు భావ్యం కాదని, 70 ఎకరాల భూమిని భూమి లేని పేదలకు పంచాలని 34 ఏళ్ల క్రితం పంపిణీ చేశారన్నారు. అలాంటి స్థలంలో 9 మందికి భూములను కేటాయించిన ప్రభుత్వం కేపీటీసీఎల్ ఉప కేంద్రం ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లాధికారి నితీష్కు వినతిపత్రం సమర్పించారు. బొగ్గు చౌర్యంపై క్రిమినల్ కేసురాయచూరు రూరల్: యరమరాస్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(వైటీపీఎస్)లో బొగ్గు అక్రమంగా దొంగతనం అవుతోందని, అధికారులు, ఇంజినీర్లు భాగస్వాములైన వారిపై క్రిమినల్ కేసు నమోదైంది. బొగ్గును వైటీపీఎస్ ఇంజినీర్లు హరీష్, చంద్ర శేఖర్, సబ్ కాంట్రాక్ట్ పొందిన పవర్ మేక్ సూపర్వైజర్ హరికృష్ణ, మేనేజర్ సురేంద్రనాథ్, స్టేషన్ మాస్టర్ సర్కార్, వ్యాగన్ల క్లీనింగ్ సిబ్బంది, గురు రాఘవేంద్ర ఎంటర్ప్రైజస్ శేషగిరిలపై గ్రామీణ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైనట్లు ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. -
కాలిన ట్రాన్స్ఫార్మర్.. ఆగిన నీటి సరఫరా
చెరువుల సంరక్షణకు చర్యలు చేపట్టండి రాయచూరు రూరల్: రాష్ట్రంలో పురాతన కాలపు చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్, చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే ఆదేశించారు. బుధవారం బెళగావి విధానసౌధలో నీటిపారుదల శాఖ, భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెరువుల సంరక్షణ సమావేశాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. గ్రామాలకు, పట్టణాలకు తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పైపులైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు మహర్దశ కల్పించడానికి బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. గ్యారెంటీల అమలులో ప్రగతి సాధించాలి బళ్లారిటౌన్: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్యారెంటీ పథకాల అమలులో ఉత్తమ ప్రగతి సాధించాలని గ్యారెంటీ పథకాల అమలు ప్రాధికార జిల్లాధ్యక్షుడు కేఈ.చిదానందప్ప అధికారులకు సూచించారు. బుధవారం కోట ప్రాంతంలోని జెడ్పీ నజీర్ సభాంగణంలో ప్రగతి పరిశీలన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం గృహలక్ష్మి, గృహజ్యోతి, శక్తి పథకం వంటి అనేక పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. వాటిని లబ్ధిదారులకు అందేలా అధికారులు శ్రమించాలన్నారు. తాలూకా స్థాయిలో ప్రగతి పరిశీలన జరిపి ఆయా జీపీల్లో కూడా సమర్థవంతంగా పని చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. గృహలక్ష్మి పథకంలో జిల్లాలో 2 లక్షల 90 వేల మందికి పథకం అమలు చేసి ప్రగతి సాధించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వివిధ స్థాయి అధికారులు పాల్గొన్నారు. పాత గేట్ల తొలగింపు పనుల పరిశీలన ● 24 నుంచి కొత్త గేట్ల ఏర్పాటు పనులు షురూ హొసపేటె: తుంగభద్ర డ్యాం పాత గేట్ల తొలగింపు ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం నాలుగు గేట్లను తొలగించారు. తుంగభద్ర డ్యాంలోని అన్ని గేట్లను మార్చాల్సిన నేపథ్యంలో పాత గేట్ల తొలగింపు ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 18, 20, 24, 27వ నెంబరు గేట్లను తొలగించారు. గేట్ నెంబర్ 28 తొగింపు ప్రక్రియ ప్రారంభమైంది. తుంగభద్ర డ్యాంను సందర్శించిన సింధనూరు ఎమ్మెల్యే హంపనగౌడ బాదర్లి డ్యాం గేట్ల తొలగింపు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాత గేట్ల తొలగింపు ప్రక్రియ వేగంగా జరుగుతోందని అన్నారు. ఇక కొత్త గేట్ల ఏర్పాటు నిర్ణీత సమయంలోగా పూర్తవుతుందన్నారు. కొత్త గేట్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.10 కోట్లు విడుదల చేసిందని కూడా ఆయన అన్నారు. శామనూరు సేవలు అనన్యంరాయచూరు రూరల్: దావణగెరె దక్షిణ శాసన సభ్యుడు శామనూరు శివశంకరప్ప మరణంపై నగరంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో వీర శైవ సమాజం ఏర్పాటు చేసిన సంతాప సభలో కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి ఽశివాచార్య శామనూరు శివశంకరప్ప చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ప్రసంగించారు. సమాజానికి తోడు పేద ప్ర జలకు చేసిన సేవలను గురించి మాట్లాడారు. వ్యాపారం, సమాజసేవలు, రాజకీయం, ధర్మం పట్ల చేసిన క్రషిని అభినందించారు. రాయచూరు రూరల్: నగరంలో తాగునీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో చలికాలంలోనే తాగునీటి ఎద్దడి అధికమైంది. అయినా అధికారులు మౌనం వహిసున్నారు. జలనిర్మల పథకం కింద రూ.100 కోట్లు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో తాగు నీటి సమస్య అధికమైంది. తాగునీటి ఎద్దడి విషయంలో నగరసభ యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. బుధవారం నగరంలోని గంగానివాస్ వద్ద ఉన్న పంప్హౌస్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, మోటార్లు కాలిపోయాయి. సోమవారం వదిలిన నీటితో శుక్రవారం వరకు ప్రజలు నీటి కోసం పడిగాపులు పడాల్సిందే. ఇక ట్యాంకర్ల ద్వారా నగరవాసులు నీటిని పొందాల్సి వస్తుంది. 1వ వార్డు నుంచి 10వ వార్డు వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి రెండు రోజుల నుంచి నీరు రాకుండా పోయింది. నీటిని సరఫరా చేసే పంపులు, మోటార్లు కాలిపోగా మరమ్మతు పనులు చేపట్టడంలో నగరసభ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తాగునీటి సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించలేదు. ఇప్పటికై నా నగరసభ అధికారులు చర్యలు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. రెండు రోజులుగా సరఫరా కానీ తాగు నీరు మరో రెండు రోజులు నీటి సరఫరా లేదు -
8 శాతం రిజర్వేషన్ కల్పించాలని ధర్నా
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించలేదని, సాంఘీక న్యాయంతో మాదిగ సముదాయాలకు 8 శాతం రిజర్వేషన్ కల్పించాలని మాదిగ దండోరా రాష్ట్ర సంచాలకుడు నరసప్ప డిమాండ్ చేశారు. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేపట్టినా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు వర్గీకరణ చేయడంలో మౌనం వహించడాన్ని ఖండించారు. ప్రభుత్వం నాగమోహన్ దాస్ కమిషన్ నివేదిక ఆధారంగా స్పందించడం లేదన్నారు. ఇంటింటికీ అధికారులు సర్వేకు వచ్చినప్పుడు మాదిగ అని జాబితాలో రాయించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కాగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
కేంద్రానివి కక్ష సాధింపు రాజకీయాలు
సాక్షి,బళ్లారి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగ)లో గాంధీజీ పేరును తొలగించడం సరైన చర్య కాదని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. నగరంలోని మోకా రోడ్డులోని వాజ్పేయి లేఅవుట్ పక్కనే సర్కిల్ వద్ద కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో గుమికూడి కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చిన మహాత్మాగాంధీజీ అంటే బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు గిట్టడం లేదని మండిపడ్డారు. కేంద్రంలో మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేదల కడుపు నింపేందుకు అప్పట్లో నరేగ పథకాన్ని ప్రవేశపెట్టడంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం ద్వారా పేదలు లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీజీ పేరును తొలగించి వీబీజీరామ్జీ పేరును పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గాంధీజీ పేరునే తొలగించే సాహసం చేస్తున్న వీరికి జనం తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మార్చి మహాత్మాగాంధీజీ పేరును యధాతథంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలో బళ్లారి గ్రామీణ కాంగ్రెస్ నేత శివయోగి, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజు, గ్యారంటీ పథకాల అమలు సమితి జిల్లా అధ్యక్షుడు చిదానందప్ప, డీసీసీ ప్రధాన కార్యదర్శి అయాజ్ అహ్మద్, జగన్, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేగ పథకం పేరును మార్చొద్దురాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేగ పథకం పేరును మార్చడం తగదని మహిళా కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షురాలు నిర్మల మాట్లాడారు. గతంలో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ ఖాత్రి పథకం పేరును కేంద్ర ప్రభుత్వం యథాతథంగా కొనసాగించాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు హేయం మహాత్మా గాంధీజీ అంటే బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు గిట్టదు కేంద్రంపై విరుచుకుపడిన కాంగ్రెస్ నాయకులు -
వణికిస్తున్న చలి పులి
సాక్షి,బళ్లారి: బిసిల బళ్లారి(ఎండల బళ్లారి)లో ఎంతటి ఎండలనైనా ఈ ప్రాంత వాసులు తట్టుకునేందుకు వెనుకాడరు. అదే చలి అయితే వామ్మో.. చలి అంటూ బెదిరిపోతున్నారు. సాధారణంగా వేసవి కాలంలో ఉమ్మడి బళ్లారి జిల్లాలోనే కాకుండా ఉత్తర కర్ణాటక పరిధిలో కలబుర్గి, యాదరిగి, రాయచూరు, బాగల్కోటె, బీదర్ తదితర జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు చేరుకుంటాయి. అదే చలికాలం వచ్చిందంటే అమాంతంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలికి జనం వణికిపోతున్నారు. గత 15 రోజులుగా చలి ప్రభావంతో ఉదయం 9 గంటలు అయినా జనం బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో వాతావరణంలో తీవ్ర మార్పులు రావడం వల్ల జలుబు, దగ్గు లాంటి సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. చలికాలంలో సాధారణంగా వచ్చే వ్యాధులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. చలికి తట్టుకోలేక స్వెట్టర్లు, చలిమంటలు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పల్లెల్లో రైతుల బాధలు ఎన్నెన్నో పల్లెల్లో అయితే రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. రాత్రిళ్లు కరెంటు వదిలినప్పుడు పొలాల్లోకి వెళ్లి పంటలకు నీరు అందించే రైతుల బాధలు వర్ణించలేని విధంగా ఉన్నాయి. చలికాలం ముగిసే వరకు అయినా పగటిపూట పంట పొలాలకు విద్యుత్ వదిలితే బాగుంటుందని రైతులు పేర్కొంటున్నారు. చలి ప్రభావంతో పాటు మంచు విపరీతంగా కురుస్తోంది. ప్రతి రోజు తెల్లవారు జామున 5 గంటల నుంచి ఉదయం 8 గంటలకు వరకు పొగమంచు కప్పేయడంతో ముందు వచ్చే వాహనాలు కాని, మనుషులు కాని దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడంతో వాహనాల్లో వెళ్లే వారు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచు వదిలే వరకు వాహనాల్లో వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాలని సూచనలు అందిస్తున్నప్పటికీ గత్యంతరం లేక అవసరం ఉన్నప్పుడు వాహనాల్లో వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలువురు డ్రైవర్లు పేర్కొంటున్నారు. నగర శివారు కాలనీలో వ్యాపించిన దట్టమైన పొగమంచు మంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని వైనం రోజురోజుకు తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు ఉదయం 9 గంటల వరకు కురుస్తున్న పొగమంచు పొగమంచుతో వాహనాల్లో వెళ్లేవారికి ఇబ్బందులు చలికాలంలో ప్రజలకు తప్పని ఆరోగ్య సమస్యలు మరో నెల పాటు ఇదే వాతావరణం మరో నెల రోజుల పాటు జనవరి ఆఖరు వరకు ఇదే విధంగా దాదాపు చలి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో నెల రోజులకు పైగా చలికి ఏవిధంగా తట్టుకోవాలో దిక్కుతెలియక జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చలి ప్రభావంతో ముఖ్యంగా చిన్న పిల్లలకు వెంటనే పలు అనారోగ్య సమస్యలు వస్తున్నందున తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల జలబు, దగ్గు నుంచి కొంత మేరకు బయటపడేందుకు వీలవుతుందంటున్నారు. చలికాలంలో ఉదయం వేళల్లో ఆరోగ్య సమస్యలు ఉన్న వారు బయటకు వెళ్లి వాకింగ్ చేయడం సరికాదని కూడా వైద్యులు చెబుతున్నారు. గతంలో కంటే ఈసారి బళ్లారి జిల్లాతో పాటు ఉత్తర కర్ణాటక పరిధిలో చలి ప్రభావం బాగా పెరిగిందంటున్నారు. అన్ని విధాలుగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ, ఉదయం వేళల్లో వాహనాల్లో వెళ్లే వారు మంచు వల్ల ప్రమాదాల బారిన పడకుండా వాహనాలను నడపాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. -
క–కలో తెల్ల బంగారం వెలవెల
రాయచూరు రూరల్: తెల్ల బంగారానికి మార్కెట్లో ధర లభించక రైతులు తల్లడిల్లి పోతున్నారు. గత ఏడాది క్వింటాల్కు రూ.8,500–రూ.9,000 ఉండగా నేడు రూ.6,800 నుంచి రూ.7,100 ధరలు పలుకుతున్నాయి. నూతన పత్తి మార్కెట్లో ధరలు ప్రకటించిన మిల్లు యజమానులు క్వింటాల్కు రూ.300 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. అధికంగా తెలంగాణలోని కృష్ణ, మక్తల్, నారాయణపేట, మద్దూరు, ఊట్కూరు, గద్వాల, ధరూరు, నందిన్ని, బలిగేర, అయిజ, మాధవరం, ఇతర ప్రాంతాల నుంచి అధికంగా పత్తి బేళ్లు వస్తున్నాయి. ప్రతి నిత్యం హైదరాబాద్– రాయచూరు రహదారిలో పత్తి లారీలు, ట్రాక్టర్లు, మినీ లారీలు, జీపులు, క్యాబ్లలో రైతులు పత్తిని తీసుకు రావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతుల ముఖాల్లో కళ లేదు. కళ్యాణ కర్ణాటక(క–క) ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాలు కరువు ప్రాంతాలుగా మారాయి. రాయచూరు, కొప్పళ జిల్లాల్లో నదుల్లో నీరున్నా రాయచూరు, యాదగిరి, కలబుర్గి జిల్లాల్లోని కృష్ణా నదిలో నీరందక రైతుల భూముల్లో వేసుకున్న పంటల దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రైతులు జిల్లాలో లక్షా 70 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. భారతీయ పత్తి మండలి అధికారులు ఎక్కడా కొనుగోలు చేస్తున్నట్లు రైతులకు సమాచారం అందడం లేదు. రాజకీయ నేతలు బూటకపు ప్రకటనలతో ప్రచారం చేయడాన్ని రైతులు ఖండిస్తున్నారు. తగిన ధర లభించక తల్లడిల్లుతున్న రైతులు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఢమాల్ -
విశాఖ రైలును రాయచూరు వరకు పొడిగించండి
రాయచూరు రూరల్: విశాఖపట్నం–మహబూబ్నగర్ మధ్య సంచరించే రైలును రాయచూరు వరకు పొడిగించాలని రాయచూరు, మహబూబ్ నగర్ లోక్సభ సభ్యులు విజ్ఞప్తి చేశారు. గురువారం న్యూఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ఆయన కార్యాలయంలో కలిసిన రాయచూరు లోక్సభ సభ్యుడు కుమార నాయక్, మహబూబ్ నగర్ లోక్సభ సభ్యురాలు డీకే అరుణ వినతిపత్రం సమర్పించారు. విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్కు ఉదయం 9 గంటలకు చేరుకునే ఈ రైలును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రాయచూరు వరకు పొడిగించాలని మంత్రిని కోరారు. తద్వారా రాయచూరు నుంచి కృష్ణా, మహబూబ్ నగర్, హైదరాబాద్, ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, తుని, అనకాపల్లి మీదుగా విశాఖపట్నం వరకు ప్రయాణించే అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు. విశాఖపట్నం రైలును రాయచూరు వరకు పొడిగిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు వెళ్లి వచ్చే ప్రవాసాంధ్రులకు ఎంతో ఉపయోగ పడుతుందని నగరానికి చెందిన ప్రవాసాంధ్రుడు సూర్యదేవర నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
అన్ని చోట్లా అవినీతి తాండవం
సాక్షి, బళ్లారి: ఆయన ముక్కుసూటి మనిషి. సీనియర్ నాయకుడు. మచ్చలేని వ్యక్తి. తనకంటు సమాజంలో ఓ మంచి గుర్తింపు కలిగిన విధాన పరిషత్ సభ్యుడు కూడా. అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలపై తనదైన శైలిలో పార్టీలకు అతీతంగా ప్రజాగళాన్ని వినిపిస్తూ అందరినీ ఆకర్షించే వ్యక్తి. అన్ని పార్టీల్లో కూడా ఆయన మాట్లాడిన మాటలకు తప్పు పట్టే ప్రశ్నే ఉండదు. ఆయనే ఉమ్మడి బళ్లారి జిల్లా ఎమ్మెల్సీ వైఎం.సతీష్. బెళగావిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలతో పాటు ఆయన మరొక అంశంపై అసెంబ్లీలో చర్చించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అధికారులు నన్నే లంచం అడిగారని ఆరోపణ అయితే ఆయన అసెంబ్లీలో ముక్కుసూటిగా అధికారుల, ప్రజాప్రతినిధుల లంచావతారాలను ఎండగట్టారు. లంచం అనే మహమ్మారి పట్టిపీడిస్తోందని, అది ఏ స్థాయికి చేరిందంటే అధికారులు సిగ్గు, ఎగ్గు లేకుండా ఏకంగా ప్రజాప్రతినిధి అయినా తననే లంచం అడుగుతున్నారని విధాన పరిషత్లో తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేయడం కలకలం రేపింది. పనులు చేయడానికి తన వద్దకే వచ్చి లంచం ఇవ్వాలని అడుగుతున్నారన్నారు. దీంతో ఏ స్థాయికి అవినీతి, లంచాల తీరు దిగిజారిందో అర్థం చేసుకోవాలని సూచించారు. ఇది ఏమైనా న్యాయమా? అవినీతికి లైసెన్స్ ఇచ్చామా అని స్పీకర్ను ప్రశ్నించారు.బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు లంచాల్లో ఆరితేరారు విధాన పరిషత్లో ఎమ్మెల్సీ వైఎం.సతీష్ ఆవేదన -
నేటి నుంచి మధుమేహ శిబిరం
రాయచూరు రూరల్: నగరంలో మూడు రోజుల పాటు మధుమేహ వ్యాధి చికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కర్ణాటక చాప్టర్ రిసెర్చ్ సొసైటీ డయాబిటిస్ సంఘం అధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ పేర్కొన్నారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరులో నవోదయ వైద్య కళాశాలలో నవోదయ వైద్య కళాశాల, రిమ్స్ల ఆధ్వర్యంలో ఈనెల 19 నుండి 21 వరకు మధుమేహ వ్యాధిపై సుదీర్ఘ చర్చలకు తోడు వివిధ నిపుణులైన వైద్యులతో సలహా, సూచనలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. గ్రామాలను దత్తత తీసుకొని వ్యాధి నియంత్రణకు ఉచిత పరీక్షలను చేపడుతున్నట్లు తెలిపారు. హరిప్రసాద్, రామకృష్ణ, మహాలింగ, సురేష్ సగరద, ఎస్ఎస్రెడ్డిలున్నారు. -
బైక్ను ఢీకొన్న బొలెరో
సాక్షి బళ్లారి: బొలెరో అదుపు తప్పి బైక్ను ఢీ కొనడంతో ఘటన స్థలంలోనే ముగ్గురు యువకులు మృతి చెందిన హృదయ విదారక ఘటన ఇది. గురువారం కొప్పళ జిల్లా ఇందరగి సమీపంలోని హొసళ్లి గ్రామానికి చెందిన రాజాహుస్సేన్(17), వాజిద్ (17), గంగావతి తాలూకా శ్రీరామనగర్కు చెందిన ఆసీఫ్(18) అనే ముగ్గురు యువకులు శ్రీరామనగర్ నుంచి హొసళ్లికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్న సమయంలో ఇందరగి సమీపంలో బొలెరో వాహనం ఢీ కొంది. దీంతో బైక్ నుజ్జు కావడంతో పాటు తీవ్ర గాయాలతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బొలెరో వాహనం డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడపడంతో ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ప్రమాదం అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని వివరాలను సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన హొసళ్లి, శ్రీరామనగర్ గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 48 గంటల్లో తండ్రీకుమారుల మృతి ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాజాహుస్సేన్ తండ్రి బుడేన్సాబ్ రెండు రోజుల క్రితం మృతి చెందారు. కొప్పళ తాలూకా హిట్నాల్ టోల్గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో రాజాహుస్సేన్ తండ్రి బుడేన్సాబ్(45) మృతి చెందగా తండ్రి అంత్యక్రియలు ముగిసిన తర్వాత రోజు గడవక ముందే కుమారుడు రాజాహుస్సేన్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం యాదృచ్ఛికం. మరణంలోను తండ్రీకుమారుల బంధం వీడనిదిగా మారడంతో మృతుల కుటుంబాల్లో మరింత విషాదాన్ని నింపింది. ఈ ఘటన కొప్పళ జిల్లాలో మృతుల బంధువులు, స్నేహితులకు కన్నీటిని మిగిల్చింది. ఘటనపై మునిరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు యువకుల దుర్మరణం కొప్పళ జిల్లాలో ఘోర ప్రమాదం -
మానవ అక్రమ రవాణా నియంత్రణ అందరి బాధ్యత
బళ్లారిటౌన్: మహిళలు, పిల్లలను అక్రమంగా రవాణా చేయడాన్ని నియంత్రించడం మన అందరి బాధ్యత అని, దీని కోసం ఏర్పాటు చేసిన చట్టాలను కూడా సక్రమంగా అమలు చేయాలని మహిళ శిశు సంక్షేమ శాఖ డీడీ రామకృష్ణ నాయక్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, న్యాయసేవల ప్రాధికార శాఖల ఆధ్వర్యంలో గురువారం జిల్లా పంచాయతీ నజీర్ సభాంగణంలో ఏర్పాటు చేసిన మహిళలు, పిల్లల అనైతిక రవాణా నియంత్రణపై సదస్సులో పాల్గొని మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ మహిళలు, పిల్లల రవాణాతో పెరిగే దుష్పరిణామాలపై అన్ని సంఘ సంస్థలు అవగాహన కల్పించాలన్నారు. వివిధ శాఖల సహభాగత్వంతో నియంత్రించే దిశగా పని చేయాలన్నారు. విద్యాశాఖ డీడీ బీ.రమాదేవి మాట్లాడుతూ పిల్లలకు చదువుపై అవగాహన కల్పించాలన్నారు. 7 రోజుల కన్నా ఎక్కువగా గైర్హాజరైతే ఇలాంటి పిల్లలపై వారి తల్లిదండ్రులతో చర్చించి మళ్లీ పాఠశాలకు చేర్చేలా చర్యలు చేపట్టాలన్నారు. జీత కార్మిక పద్ధతిలో పిల్లలను పని చేయించరాదన్నారు. 6 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. బాల కార్మిక పథకం అధికారి ఏ.మౌనేష్, వివిధ శాఖల అధికారులు ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. అసత్య ఆరోపణలు తగదురాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నేతలపై అసత్య ఆరోపణలు చేయడం తగదని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. గురువారం పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ మాట్లాడారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై వేసిన డెక్కన్ హెరాల్డ్ పత్రిక కేసును కోర్టు రద్దు చేసి నిర్దోషులుగా ప్రకటించిన నేపథ్యంలో అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. జాతీయ గ్రామీణ ఉద్యోగ ఖాత్రి పథకం పేరును కేంద్ర ప్రభుత్వం యథాతథంగా కొనసాగించాలని కోరారు. ఏకగ్రీవ ఎన్నిక రాయచూరు రూరల్: కేపీటీసీఎల్ ఇంజినీరింగ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ దేశాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల బెంగళూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కేపీటీసీఎల్ ఇంజినీరింగ్ విభాగం సంఘానికి జరిగిన ఎన్నికల్లో రాయచూరు జెస్కాం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న దేశాయి ఏకగ్రీవంగా విజయం సాధించారు. సర్కారు బడులను బలపరచండిరాయచూరు రూరల్ : రాష్ట్రంలో ప్రభుత్వ కన్నడ ప్రాథమిక పాఠశాలలను సంరక్షించి బలపరచాలని ప్రభుత్వాన్ని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఏఐడీఎస్ఓ సంచాలకులు చెన్నబసవ మాట్లాడారు. కర్ణాటక పబ్లిక్ పాఠశాలలను నెలకొల్పి ప్రాథమిక పాఠశాలలను మూసివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం ఇచ్చారు. మానసిక వ్యథతో ఇద్దరు ఆత్మహత్య రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సర్కార్ పెద్దలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించక పోవడంతో యువత ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. నాలుగేళ్ల నుంచి పోటీ పరీక్షలు నాలుగు సార్లు రాసి విజయం సాధించినా నియామకాలు చేయక పోవడంతో మానసికంగా కుంగిపోయిన ధార్వాడకు చెందిన పల్లవి(25) గురువారం ఆత్మహత్య చేసుకుంది. సిరివార తాలూకా బాగలవాడకు చెందిన దేవరాజ్(25)అనే యువకుడు ఉద్యోగం లభించక మానసిక వ్యధతో ఆత్మహత్యకు పూనుకున్నారు. గత ఆరు నెలల్లో ముగ్గురు మరణించారు. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ బళ్లారిఅర్బన్: భీమరావ్ ఐఏఎస్, కేఏఎస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఐఏఎస్, కేఏఎస్, సీఐ, సీ గ్రూప్, పీటీఓ, ఎఫ్డీఏ, ఎస్బీఏ తదితర వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ చైర్మన్ కేఆర్ హుసేనప్ప నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం వ్యాప్తంగా ముఖ్యంగా కళ్యాణ కర్ణాటక బీసీ విద్యార్థుల కోసం ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రవేశ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురికి రివార్డులు ఇస్తామన్నారు. ఆ తర్వాత స్థానాలు సాధించిన 10 మంది విజేతలకు రూ.1000 చొప్పున నగదు, అందుకు సమానమైన పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేస్తామన్నారు. మెరిట్ సాధించిన 50 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ కల్పిస్తామని సంస్థ డైరెక్టర్ శేఖరప్ప వివరించారు. ఉచిత నమోదు ఇప్పటికే ప్రారంభం అయిందని, ఈ నెల 26 వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. విలేకరుల సమావేశంలో శేఖరప్ప, శేషప్ప, హనుమేష్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరితగతిన డ్యాం గేట్లను అమర్చండి
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాంకు రూ.52 కోట్లతో చేపడుతున్న 33 క్రస్ట్గేట్ల అమరిక పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని నీటిపారుదల సలహా మండలి సబ్ కమిటీ సంచాలకుడు, సింధనూరు శాసన సభ్యుడు హంపన గౌడ బాదర్లి, రిటైర్డ్ ఇంజినీర్ జీ.టీ.చంద్రశేఖర్ పేర్కొన్నారు. వారు కొప్పళ తాలూకా హిట్నాల్ వద్ద పాపయ్య టన్నెల్ను పరిశీలించిన అనంతరం రాయచూరు జిల్లాలో పర్యటించి అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వచ్చే ఖరీఫ్ నాటికి క్రస్ట్గేట్లు అమర్చే పనులను పూర్తి చేయాలన్నారు. టీంలతో కాంట్రాక్టర్లు 2026 మే నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. తుంగభద్ర డ్యాంకు 19వ నంబరు క్రస్ట్గేట్తోపాటు 33 క్రస్ట్గేట్లను మార్పు చేయాలన్నారు. తుంగభద్ర డ్యాంలో 23 టీఎంసీల నీటిని వినియోగించారన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ హార్డ్వేర్ టూల్స్, మిషనరీ ప్రాజెక్టు కంపెనీ ప్రతినిధుల సలహా మేరకు పశ్చిమ బెంగాల్లోని పరాక్ బ్యారేజీకి 124 క్రస్ట్గేట్లను అమర్చిన విషయాన్ని ప్రసాద్ ఆరు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే 241 కి.మీ.పొడవున ఉన్న ఎడమ కాలువ మరమ్మతు పనులకు రూ.430 కోట్లు ఖర్చు చేస్తారన్నారు. పాపయ్య సొరంగ మార్గం నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చవుతుందన్నారు. -
శ్మశానస్థలం కోసం శవంతో నిరసన
హుబ్లీ: శ్మశానస్థలం కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మృతదేహంతో నిరసన చేపట్టిన ఘటన దావణగెరె జిల్లా హరిహర తాలూకా బన్నికోడు గ్రామంలో చోటు చేసుకుంది. అంత్యక్రియలు నెరవేర్చడానికి శ్మశానం లేకపోవడంతో ఆక్రోశించిన ఆ గ్రామస్తులు మహిళ మృతదేహాన్ని ఆ జీపీ కార్యాలయం ఎదుట పెట్టి నిరసన తెలిపారు. ఈ గ్రామంలో గత కొన్నేళ్ల నుంచి శ్మశానం లేకపోవడం ప్రధాన కారణం కాగా ఎవరు చనిపోయినా గ్రామస్తులకు అంత్యక్రియల కోసం నానా పాట్లు పడక తప్పని పరిస్థితిని ఆ గ్రామస్తులు ఎదుర్కొంటున్నారు. మృతురాలు కెంచమ్మ(60) అనారోగ్యంతో చనిపోయారు. ఆమె అంత్యక్రియలకు శ్మశానం లేక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ నిరసన ప్రదర్శన చేపట్టి ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ సమస్యలపై ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా కూడా అధికారులు తమ ఉదాసీనతను వీడటం లేదు. అంతేగాక శ్మశానం కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమించినా తగిన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికై నా శ్మశానానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ సందర్భంగా గ్రామస్తులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న తహసీల్దార్ హుటాహుటిన అక్కడికి వచ్చి ఆందోళనకారులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా స్థానికుల కోపం చల్లారలేదు. దీంతో శ్మశాన స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేస్తానని అధికారి హామీ ఇచ్చాకే గ్రామస్తులు ఆందోళనను విరమించి మృతదేహాన్ని అంతిమ సంస్కారాలకు తీసుకెళ్లారు. -
మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
హొసపేటె: మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి అన్ని రంగాల్లో రాణించాలని విజయనగర జిల్లాధికారి కవిత పేర్కొన్నారు. గురువారం పునీత్ సర్కిల్లో మహిళలు, పిల్లల భద్రత కోసం విజయ మహిళా సురక్ష పడె కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ, స్వావలంబన సాధించినప్పుడే సమాజం మార్పు చెందుతుందన్నారు. మహిళలు తమ ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలన్నారు. అనంతరం మహిళా పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ జాహ్నవి, అసిస్టెంట్ కమిషనర్ వివేక్ పాల్గొన్నారు. వ్యక్తి దారుణ హత్యహొసపేటె: నగర శివార్లలోని బళ్లారి రోడ్డులో ఉన్న కారిగనూరులో ఓ వ్యక్తిని హతమార్చిన ఘటన గురువారం జరిగింది. ఒక వర్గం వారు కారిగనూరులో నివాసమంటున్న కాసీం(56)పై సుమారు 20 మందికి పైగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో కాసీం మృతి చెందారు. ప్రస్తుతం హత్య చేసిన వ్యక్తి పోస్ట్మార్టం కోసం నగరంలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ జాహ్నవి ఘటనా స్థలానికి చేరుకొని సమాచారం సేకరిస్తున్నారు. రోడ్ల మరమ్మతు చేపట్టరూ రాయచూరు రూరల్: నగరంలోని వివిధ వార్డుల్లో రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని దమనిత సేవా సమితి డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు భరత్ మాట్లాడుతూ రాయచూరు నగరంలోని గోశాల నుంచి మన్సలాపూర్, బస్టాండ్ నుంచి అంబేడ్కర్ సర్కిల్, శశిమహల్ నుంచి ఆకాశవాణి, ఆశాపూర్ రోడ్డు నుంచి రాజమాత ఆలయం, అరబ్ మొహల్లా నుంచి యక్లాసపూర్ వరకు అధ్వానంగా మారిన రోడ్లను మరమ్మతు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో సువర్ణ, నరసింహులు, శివశంకర్, సుశీల్, పరశురాం, అశోక్, జావిద్రాజులున్నారు. హాస్టల్లో సమస్యలు తీర్చాలని ధర్నా రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా హట్టిలోని సాంఘీక సంక్షేమ శాఖ హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. గురువారం హట్టిలోని అంబేడ్కర్ సంక్షేమ శాఖ హాస్టల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రమేష్ మాట్లాడారు. విద్యార్థులకు మంచి ఆహారం పెట్టడం లేదన్నారు. వార్డెన్ కనీసం ఫోన్ కాల్ కూడా స్వీకరించడం లేదన్నారు. విద్యార్థులను వార్డెన్ బెదిరిస్తున్నారని, మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందన్నారు. విద్యార్థులకు ఆహారం పంపిణీ విషయంలో అలసత్వం వహిస్తున్నట్లు ఆరోపించారు. పెట్టుబడి పెడితే అధిక లాభాలంటూ వంచన ●నిందితుడు అరె్స్ట్ రాయచూరు రూరల్: సామాన్య ప్రజలు పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తామని ప్రజలను నమ్మించిన ఉదంతం జిల్లాలో చోటు చేసుకుంది. గుజరాత్కు చెందిన మోహిత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అధిక లాభం వచ్చేలా చూస్తామని బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వేయించుకున్నట్లు తెలిసింది. గత ఏడాది డిసెంబర్ 17 నుంచి 2025 జూన్ 21 వరకు రూ.3.50 లక్షలను గుజరాత్లోని సూరత్ జిల్లాకు చెందిన మోహిత్ రాజ్వాని, మదతల్లి రాజ్వాని ఖాతాలకు డబ్బులు వేసిన సింధనూరు టీపీ ఇంజినీర్ మహబూబ్ రెహమాన్ సింధనూరు సైబర్ పోలీస్ సెల్కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి మోహిత్ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేష్ తెలిపారు. అవినీతిపై దర్యాప్తు జరపాలి బళ్లారిఅర్బన్: కార్మిక శాఖలో కట్టడ కార్మికులకు ఇవ్వాల్సిన వివిధ సౌకర్యాలలో ఎన్నో లోటు పాట్లు కనిపిస్తున్నాయని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.800 కోట్లకు పైగా కార్మికుల ధనం దుర్వినియోగం అయిందని, తక్షణమే దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కట్టడ నిర్మాణ, అసంఘటిత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీ.దేవరాజ్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కార్మికులకు ఇచ్చే కిట్ల పంపిణీ, స్మార్ట్ కార్డుల నమోదు, పరికరాల కొనుగోలులో మార్కెట్ ధర కన్నా 5 రేట్లు ఎక్కువకు నకిలీ బిల్లులు సృష్టించి శ్రమ జీవుల కార్మికుల ధనాన్ని దోచుకున్నారన్నారు. ఈ అవినీతి కుంభకోణంపై జనవరి 16 తర్వాత బెంగళూరు ఫ్రీడం పార్కులో భారీ ఆందోళన చేస్తామన్నారు. ప్రముఖులు శ్రీనివాస్, శివనాయక్, శంకరప్ప, తిప్పేస్వామితో పాటు ఆయా సంఘాల పదాధికారులు సభ్యులు పాల్గొన్నారు. -
విభిన్నం.. రథోత్సవం
నేలపై కూర్చొని ప్రసాదం స్వీకరిస్తున్న పురుషులు సన్నిధికి హారతులు ఇస్తున్న పురుష భక్తులు బసాపురలో స్వామివారి సన్నిధి, రథం లాగుతున్న మహిళా భక్తులు హుబ్లీ: వెన్నదోసె(బెణ్ణెదోసె)లకు పేరుగాంచిన దావణగెరె జిల్లాలో జాతరలు, ధార్మిక కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ జరిగే వివిధ దేవతల జాతరలు రాష్ట్రంలో పేరు మోశాయి. దుర్గాంబికా దేవి జాతర మొదలు హరిహరేశ్వర తేరు, ఉక్కడగాత్రి కరిబసవేశ్వర జాతర సుప్రసిద్ధమైనవి. అయితే దావణగెరె తాలూకా యరగుంటెలో జరిగే మహిళల జాతరకు మరొక విశేషత ఉంది. ఈ జాతరలో పురుషులకు బదులుగా మహిళలే తేరు(రథం)ను లాగుతారు. మరో విశేషం అంటే దావణగెరె శివారులోని బసాపుర గ్రామంలో జరిగే మహేశ్వరుడి జాతరలో మహిళలకు మాత్రమే ప్రవేశ నిర్బంధం ఉంది. ఈ జాతరలో పురుషులే స్వామివారి సమాధిని దర్శించుకుని పునీతులవుతారు. అందుకే దీన్ని పురుషుల ఐక్యత చాటే జాతరగా కూడా పిలుస్తారు. భార్య, పిల్లా, జల్లా, తల్లిదండ్రులు, తోబుట్టువులతో జాతర చేసే ఈ కాలంలో వైవిధ్యంగా పురుషులు మాత్రమే మహేశ్వర స్వామి సన్నిధిని దర్శనం చేసుకొని ప్రసాదాన్ని స్వీకరించి తమ మొక్కలను సమర్పించి ఊరి బయట బంతి భోజనం చేయడం ద్వారా భక్తి సాగరంలో మునిగి తేలుతారు. శతాబ్దాల ఘన చరిత్ర సొంతం ఈ ప్రాచీన ఆచార వ్యవహారాలకు సుమారు 3 శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. మహిళలు అక్కడికి వస్తే చెడు జరుగుతుందన్న విశ్వాసం ఇక్కడ ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. కోరుకున్న కోరికలు, మొక్కుకున్న మొక్కులు తీరుతాయి. పొలాల కొనుగోలు, కష్టసుఖాలు, సాధక, బాధకాల గురించి గట్టి సంకల్పం చేసుకుంటే సమస్యలు ఇట్టే దూరం చేస్తారని పరమభక్తుడు కొట్రయ్య అభిప్రాయపడ్డారు. మొత్తానికి చెన్నగిరి తాలూకా చిక్కొల్లికెరెలో తొలిసారిగా మహేశ్వరుడి జాతరను వైభవంగా ఆచరించారు. ఈ జాతరకు, బసాపుర జాతరకు అవినాభావ సంబంధం ఉంది. బసాపుర నివాసి ఓ యజమాని ఎద్దుల కొనుగోలుకు చిక్కొల్లికెరెకు బయలుదేరి వెళ్లి మహేశ్వర స్వామి జాతరను వీక్షించి మహేశ్వరుడి సన్నిధిని దర్శించి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ భక్తిప్రపత్తులతోనే ఆయన బసాపురలో మహేశ్వరుడి ఆరాధనకు శ్రీకారం చుట్టారు. కాలక్రమేణ ఇది బసాపుర గ్రామ జాతరగా మార్పు చెంది వాసికెక్కినట్లు ఆ గ్రామ పెద్దలు చెబుతారు. నేటికీ ప్రతి ఏటా కార్తీకమాసంలో ఈ జాతర జరుగుతుంది. యరగుంటెలో రథం తాడు పట్టుకొని మహిళా భక్తుల ఆనంద పరవశం కరిబసవేశ్వరుడు, మహేశ్వర దేవుడి మూల విగ్రహాలు యరగుంటె జాతర మహిళలకే సొంతం బసాపుర జాతర పురుషులకే ప్రత్యేకం ఇది బెణ్ణెదోసె దావణగెరె జిల్లా వైవిధ్యంనేలపై కూర్చొనే ప్రసాద స్వీకరణ రెండు రోజుల పాటు జరిగే ఈ జాతరకు విచ్చేసే పురుష భక్తులు నేలపై కూర్చొనే ప్రసాదం స్వీకరిస్తారు. క్వింటాళ్ల మేర అన్నం, చారు, మజ్జిగ, అరటి పండు ప్రసాద రూపంలో లభిస్తుంది. ముఖ్యంగా మహేశ్వర స్వామి సన్నిధి సమీపంలో ఆనెకొండ బసవేశ్వర స్వామి, బసాపుర గురుసిద్దేశ్వర స్వామి, అలాగే హాలస్వామి దేవతలు సంగమం అవుతారని నమ్ముతారు. సన్నిధిపై పళ్ల తొక్కలను పెడతారు. ఓ పూజారి పుష్కరిణిలో ఈ అరటి తొక్కలను నిమజ్జనం చేస్తారు. ఈ తొక్కలు పుష్కరణి నీటిలో తేలితే గ్రామానికి శుభం అని, అలాకాకుండా మునిగితే ప్రమాదం తప్పదని స్థానికులు విశ్వసిస్తారు. ఈసారి పుష్కరిణిలో వదిలిన అరటి పండు తొక్కలు నీటిలో కొద్ది సేపు తేలడంతో ప్రజలు ఎంతో ఆనందంతో చిందులు వేశారని గ్రామస్తులు తెలిపారు. బసాపుర నివాసి సిద్దరామేశ్వర మాట్లాడుతూ ఏడాదికి ఒక్కసారి జరిగే జాతర తేరుతెన్నుల గురించి వివరించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆచరణ పరంపర కొనసాగుతోందని కరిబసవేశ్వర స్వామి సన్నిధి మఠం పరమేశ్వర స్వామి తెలిపారు. -
యథేచ్ఛగా హనీట్రాప్
బనశంకరి/ కృష్ణరాజపురం: బెంగళూరులో నిర్భయంగా హనీట్రాప్ బాగోతాలకు పాల్పడుతున్న ఓ కిలాడీ ఎట్టకేలకు కటకటాలకు చేరింది. రామూర్తినగర పోలీస్స్టేషన్ సీఐ సతీశ్ను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వెంటపడుతున్న నిందితురాలు వనజ అలియాస్ సంజనను కేసు నమోదు చేసి బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. విచారణలో ఆమె నిర్వాకాలు అనేకం బయటపడినట్లు పోలీసులు చెప్పారు. హనీట్రాప్ దందాకు పాల్పడుతోందని తెలిపారు. కాంట్రాక్టరుకు వలపు సంజన డబ్బున్నవారితో స్నేహం చేసి ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది, సన్నిహితంగా గడిపి ఫోటోలు, వీడియోలను తీసి వాటితో బ్లాక్మెయిల్చేసి అందినంత డబ్బు, బంగారం దోచుకుంటుందని చెబుతున్నారు. సతీష్ అనే ఓ కాంట్రాక్టర్ ను హనీట్రాప్ చేసి రూ.3 లక్షలు, బంగారు చైన్, బ్రేస్లెట్, ఉ ఉంగరం తీసుకుంది. బాధితుడు 2022లో రామమూర్తినగర ఠాణాలోనే ఫిర్యాదు చేశాడు. అంతేకాక అతని రెండు అంతస్తుల భవనం కాజేయడానికి కిలాడీ ప్రయత్నించడంపై కేఆర్.పురం పోలీస్స్టేషన్లో మరో కేసు పెట్టాడు. ఇలా పలువురిని హనీట్రాప్ ఉచ్చులోకి లాగింది. సీఐ మీద సైతం ప్రయోగం కిలాడీ సంజనకు సంకెళ్లు పెళ్లంటూ పోలీసుకు టోపీ 2018లో సంజన దావణగెరె హెడ్కానిస్టేబుల్ జగదీశ్ను పెళ్లి పేరుతో మోసగించడంతో వైట్ఫీల్డ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఆమె బాధితుల జాబితాలో ఎంతమంది ఉన్నారని దర్యాప్తు చేపట్టారు. తాను కాంగ్రెస్ నాయకురాలినని, సీఎం, మంత్రులు తెలుసని దబాయించేది. చివరకు సీఐ సతీశ్ను వలలోకి లాగాలని చూసింది కానీ, తెలివిగా బయటపడ్డాడు. -
వేణుగోపాలునికి ధనుర్మాస పూజలు
కోలారు: నగరంలోని కిలారి పేటలో ఉన్న వేణుగోపాల స్వామి ధనుర్మాస పూజలను తెల్లవారుజామునే భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారు 3 గంటల నుంచి తీవ్రమైన చలిలోను భక్త భజన బృందం సభ్యులు నగర వీధులలో తిరిగి భజనలు చేశారు. ఈ భజనలు సంక్రాంతి వరకూ కొనసాగుతాయి. అర్చకుడు రఘుశర్మ నేతృత్వంలో పూజలను నిర్వర్తించారు. వేణుగోపాల స్వామి వారిని అభిషేకించి విశేష పూలతో అలంకరించారు. వేకువ నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. 21న సేవా కార్యక్రమాలు ● వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ బనశంకరి: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఐటీ వింగ్– బెంగళూరు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. నవరత్నాలు పథకాలతో అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడిన మహోన్నత నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాల సాధన కోసం జగనన్న అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం మనందరిపై ఉందని ఐటీ వింగ్ నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్యం, విద్యకు ప్రాధాన్యత ఇస్తూ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం, నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. మన ప్రియతమ నేత జగనన్న పుట్టినరోజు డిసెంబరు 21 తేదీ కాగా, ఆరోజు సాయంత్రం 6 గంటలకు కృష్ణరాజపురం శబరి ఆశ్రయధామ, బెళతూరులో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని మనవి చేశారు. మరిన్ని వివరాలకు– 9035193106, 9703518965 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. గజ దాడి, బైకిస్టు మృతి మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలే మహదేశ్వర అభయారణ్యంలో జల్లిపాళ్య సమీపంలో అడవి ఏనుగుల దాడిలో ద్విచక్రవాహనదారు చనిపోయాడు. మృతుడిని శివమూర్తిగా గుర్తించారు. ఆయన జల్లిపాళ్య నుంచి తమిళనాడు రాష్ట్రంలోని మకనపాళ్య గ్రామానికి బైక్లో వెళుతుండగా ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో తీవ్రగాయాలతో చనిపోయాడు. అటవీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గజ దాడులతో జనం ఆందోళనకు గురయ్యారు. -
భార్య హత్యకు భర్త సుపారీ
మైసూరు: భార్య తరచూ అవమానిస్తోందనే కసితో భర్త ఆమెను అంతమొందించాలని ఇద్దరు యువకులకు సుపారీ ఇచ్చాడు. దుండగులు సినిమా శైలిలో ఆమైపె పాశవికంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మైసూరు బిఎం శ్రీ నగరలో జరిగింది. వివరాలు.. భర్త మహేష్, కొడగు జిల్లాకు చెందిన కిరాయి నిందితులు భాస్కర్, అభిలను పోలీసులు పట్టుకున్నారు. పానీపూరి వ్యాపారి మహేష్, భార్య నాగరత్న (46)కు 18 సంవత్సరాల క్రితం పెళ్లయింది, వీరికి పిల్లలు లేరు. డబ్బు గొడవలతో నాగరత్న భర్తను చిన్నచూపు చూసేదని చెబుతారు. వీధిలోనే నిలబెట్టి దూషించేది. దీంతో ఆమెను హతమార్చాలని అతని నిశ్చయించి రూ. 5 లక్షలు సుపారీ కుదుర్చుకున్నాడు. నిందితులు భాస్కర్, అభి ఇద్దరూ రెండు రోజుల కిందట ఇంటికి వచ్చారు. ఆ సమయంలో భర్త షాపులో ఉన్నాడు, నాగరత్న పై అంతస్తులోని తన ఫ్లాటులో ఉండగా, దుండగులు హెల్మెట్లు ధరించి, కత్తులు పట్టుకుని చొరబడ్డారు. ఆమెను పొడిచి, గదిలో పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయారు. మంటల మధ్య ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. స్థానికులు పట్టుకునేలోపు దుండగులు పారిపోయారు. భర్తను పిలిపించి ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. భర్తను అనుమానంతో పోలీసులు విచారించగా సుపారీ గుట్టు బయటపడింది. దీంతో ముగ్గురినీ అరెస్టు చేశారు. బాధితురాలు చికిత్స పొందుతోంది. బాధితురాలికి తీవ్రగాయాలు -
ప్రియుడు కాదు.. కర్కోటకుడు
● యువతిపై సామూహిక అత్యాచారం దొడ్డబళ్లాపురం: ప్రేమపేరుతో యువతిని మభ్యపెట్టి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాలేజీ విద్యా ర్థినిపై గ్యాంగ్ రేప్కు పాల్పడిన ముగ్గురు దుండగులను మాగడి పోలీసులు అరెస్టు చేశారు. వికాస్, చేతన్, ప్రశాంత్ అరైస్టెన వారు. మాగడి నివాసి, బెంగళూరులో చదువుతున్న యువతిని (19)ప్రేమ పేరుతో లొంగదీసుకున్న వికాస్ ఆమె వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు తీసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అనేకసార్లు లైంగికదాడి చేయడంతోపాటు తన స్నేహితులైన చేతన్, ప్రశాంత్లను కూడా పిలిపించుకుని అత్యాచారం చేయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. -
కలబుర్గిపై డిజిటల్ నేరగాళ్ల కన్ను
దొడ్డబళ్లాపురం: డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి కోట్ల రూపాయలను దోచేస్తున్నారు. కలబుర్గి పోలీసులు నేరగాళ్లను అరెస్టు చేసి రూ.2.73 కోట్లు రికవరీ చేసినట్టు ఆ నగర పోలీస్ కమిషనర్ శరణప్ప ఎస్డీ తెలిపారు. వివరాలు.. కలబుర్గి దంపతులకు ఇటీవల వాట్సాప్లో ఓ మేసేజ్ వచ్చింది. డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. కోర్టు సెట్టింగు వేసి మరీ వీడియో కాల్లో రోజూ ఆన్లైన్ విచారణ పేరిట సతాయించారు. 25 రోజులపాటు ఈ విచారణ కొనసాగింది. చివరకు వారి నుండి రూ.1.26 కోట్లు వసూలు చేశారు. తరువాత బాధితులకు తాము సైబర్ నేరస్తుల వలలో పడ్డట్టు అర్థమయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఇదేమాదిరిగా మరో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మహమ్మద్ అలీని సైబర్ నేరస్తులు బెదిరించి రూ.96 లక్షలను వసూలు చేశారు. 40 నేరాల ఛేదన కలబుర్గి పోలీసులు దుండగుల ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా విచారణ జరిపారు. సుమారు 40పైగా సైబర్ నేరాలతో సంబంధమున్న నేరగాళ్లను అరెస్టు చేసి రూ.2.73 కోట్లు రికవరీ చేశారు. ఆ డబ్బును బాధితుల అకౌంట్లలోకి బదిలీ చేసినట్లు కమిషనర్ తెలిపారు. భారీగా మోసాలు, దోపిడీలు పలు కేసుల్లో రూ.2.73 కోట్ల రికవరీ అధికమైన ఆన్లైన్ నేరాలు బెంగళూరు, మైసూరు తరువాత కలబుర్గి జిల్లాలో సైబర్ మోసాల బాధితులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. 2023లో 1,029 కేసులు నమోదు కాగా రూ.6.16 కోట్ల మేరకు దోచుకున్నారు. అందులో రూ.17.16 లక్షలు మాత్రమే రికవరీ అయ్యాయి. 2024లో 1,592 కేసులు నమోదు కాగా రూ.18.87 కోట్ల మోసం జరిగింది.అందులో రూ.34.85 లక్షలను రికవరీ చేశారు. 2025లో 2,275 సైబర్ నేరాలు జరగ్గా, రూ.21.86 కోట్లను దోచేశారు. అందులో రూ.2.73 కోట్లను మాత్రం స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా విద్యావంతులు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, ఉద్యోగులే మోసపోవడం గమనార్హం. -
కలెక్షన్ కింగ్ ఎవరో తెలుసా?
శివాజీనగర: కలెక్షన్ కింగ్ అంటే విజయేంద్ర. ఆయన తండ్రి బీ.ఎస్.యడియూరప్ప పేరును తుడిచివేసే వ్యక్తి ఎవరంటే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్రే.. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాలే అని డీసీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి కాంగ్రెస్ హైకమాండ్ను సంతోషపరిచారన్న బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర విమర్శల మీద డీకే శివకుమార్ గురువారం బెళగావిలో అసెంబ్లీ ఆవరణలో ఘాటుగా స్పందించారు. విజయేంద్రకు అనుభవం లేదు, ఏ ఖజానా ఖాళీ అయ్యింది? వచ్చి అసెంబ్లీలో చెప్పాలి, తప్పించుకొని తిరగడం కాదు అని అన్నారు. మీ లావాదేవీలు, మీ ఖాతాలు విడమరచి చెప్పమంటారా? అని ఎద్దేవా చేశారు. విజయేంద్ర హద్దు, అదుపులో ఉండి మాట్లాడాలి. కలెక్షన్ కింగ్ అంటే విజయేంద్రే. ఆయన తండ్రి పేరును తగ్గించేస్తున్నారని డీకే తీవ్ర ఆవేశంతో ధ్వజమెత్తారు. బెళగావి అసెంబ్లీ సమావేశాలు చాలా సంతృప్తికరంగా జరిగాయి, చెరకు, మొక్కజొన్న రైతుల సమస్యలు తీరాయి అని అన్నారు. చరిత్ర అంతా చెబుతా: యత్నాళ్ మరోవైపు బీజేపీ నేత విజయేంద్ర తనపై పరువు నష్టం కేసు వేస్తే బాగుంటుంది. అది చేస్తే ఆయన అసలు రంగును సవివరంగా కోర్టుకు తెలియజేస్తానని బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ చెప్పారు. ఎమ్మెల్యే యత్నాళ్ నా కుటుంబానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఆయన మీద పరువు నష్టం కేసు వేస్తానని ఇటీవల విజయేంద్ర చెప్పడంపై ఇలా స్పందించారు. డీకేది అధికార మదం: విజయేంద్ర సీఎం సిద్దరామయ్య ఔట్గోయింగ్ సీఎం అంటూ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర బెళగావిలో తీవ్ర విమర్శలు చేశారు. ఇది సీఎం సన్నిహతులకు చింత పుట్టించింది. అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ డీసీఎం డీకే శివకుమార్ మీద కూడా ఆరోపణలు గుప్పించారు. డీకే శివకుమార్ అధికార మదంతో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు, ఇతరుల మాదిరి నన్ను బెదిరించవద్దు. నేను ఎమ్మెల్యే, ఒక పార్టీ రాష్ట్రాధ్యక్షునిగా ఉన్నా. బీ.ఎస్,యడియూరప్ప మీద ఎలా కుట్ర పన్నారో తెలుసు, ఆ విషయాన్ని నేను మాట్లాడేలా చేయవద్దు అని అన్నారు. డీకే ద్వారా తాను పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అవినీతి పితామహుడు ఎవరని అడిగితే రాష్ట్రంలో డీకే శివకుమార్ పేరు చెబుతారని విజయేంద్ర దుయ్యబట్టారు. తన గురించి మాట్లాడేటప్పుడు నాలుక అదుపులో పెట్టుకో అని మండిపడ్డారు. రోడ్డు గుంతలను మూసే యోగ్యత ఈ సర్కారుకు లేదు అని అన్నారు. రాష్ట్రంలో 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఈ ప్రభుత్వం భర్తీ చేయనే లేదు అని ఆరోపించారు. సీఎం సొంత జిల్లాలో ఖోఖో క్రీడాకారిణి చైత్ర కు రూ.5 లక్షల బహుమతి ఇస్తే ఇంత తక్కువ ఇస్తారా అని ఆమె తిరస్కరించారు, ఇదీ ఈ సర్కారు దుస్థితి అని విమర్శించారు. సిద్దరామయ్య ప్రభుత్వం మీద విజయేంద్ర గట్టిగా విమర్శించిన సందర్భాలు లేవు, దీనిమీద గతంలో విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయేంద్ర ఉగ్రరూపం చర్చనీయాంశమైంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్సెస్ బీజేపీ నేత విజయేంద్ర బెళగావిలో పరస్పరం తీవ్ర ఆరోపణలు గతంలో ఎన్నడూలేని పరిణామం జగదీశ్వరి మాతకు డీకే పూజలుదొడ్డబళ్లాపురం: సీఎ కుర్చీపై కన్నేసిన డీసీఎం డీకే శివకుమార్ ఇష్టార్థసిద్ధి కోసం దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా అంద్లెశ్రీ జగదీశ్వరి దేవి ఆలయంలో విశేష పూజలు జరిపించారు. గురువారం ఉదయం బెళగావి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గోకర్ణకు వచ్చి అక్కడి నుంచి కారులో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. పూజలు చేయించి మొక్కు తీర్చుకున్నారు. గతంలో జైలు నుంచి విడుదలైనప్పుడు, గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా డీకే ఈ దేవాలయాన్ని సందర్శించారు. శివాజీనగర: ఆర్థిక శాఖ ద్వారా విడుదలైన రూ.5 వేల కోట్ల నిధులు ఎక్కడికి వెళ్లాయనే ప్రతిపక్షాల ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రూ.5 వేల కోట్ల సొమ్ము విడుదలే కానప్పుడు ఎక్కడికి వెళ్తుంది? అని ఆమె జవాబిచ్చారు. ఫిబ్రవరి, మార్చి నెలల గృహలక్ష్మీ సొమ్ము లబ్ధిదారులకు పెండింగ్ పెట్టారని బుధవారం అసెంబ్లీలో గలాటా జరగడం తెలిసిందే. ఆర్థిక శాఖ నుంచి ప్రతి ఒకటో తేదీ గ్రాంట్ విడుదల అవుతుంది. నిధులు విడుదలైన తక్షణమే గృహలక్ష్మీ లబ్దిదారుల ఖాతాకు సొమ్ము వేస్తాం. ఆర్థికమంత్రి సీఎం కాబట్టి ఆయనే అసెంబ్లీలో సమాధానం ఇస్తారని ఆమె తెలిపారు. -
రక్షకులే భక్షకులు
= మూడేళ్లలో 88 మంది పోలీసులపై నేరాభియోగాలు: హోంమంత్రి శివాజీనగర: రాష్ట్రంలో ఇటీవల జరిగిన దోపిడీ, కిడ్నాప్లాంటి నేరాల్లో పోలీసులే పాల్గొనడం మీద కలవరం నెలకొంది. బెంగళూరులో ఏటీఎం సొమ్ము రవాణా వాహనాన్ని దోచుకోవడం, కోరమంగల కాల్సెంటర్ ఉద్యోగుల కిడ్నాప్లో పోలీసులు పాల్గొన్నట్లు తేలింది. గత మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో 88 మంది పోలీసులు నేర కృత్యాలకు పాల్పడినట్లు హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. బెళగావి అసెంబ్లీలో జేడీఎస్ ఎమ్మెల్సీ శరవణ అడిగిన ప్రశ్నకు హోం మంత్రి పై విధంగా సమాధానమిచ్చారు. కంచే చేను మేసినట్లు అవుతోంది. పోలీసులే దోపిడీలు, దొంగతనాలకు ఒడిగడుతున్నారు. రక్షకులే భక్షకులవుతున్న కారణాన పోలీసులపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారని సభ్యులు ఆరోపించారు. నేరాలలో పాల్గొన్న పోలీసులను సస్పెండ్ చేయటం కాకుండా ఉద్యోగం నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ చేశాం హోంమంత్రి బదులిస్తూ పోలీసులు అందరూ దొంగలు అనలేము. నేరాలతో పోలీసులు కుమ్మకై ్క ఉంటే విడిచిపెట్టేది లేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి సస్పెండ్ చేశాం, పోలీసులు కట్టుదిట్టంగా ఉండటంతో శాంతిభద్రతలు చక్కగా ఉన్నాయన్నారు. 96 చోరీల గజదొంగ అరెస్టు చిక్కబళ్లాపురం: హైదరాబాద్కు చెందిన గజదొంగ రాహుల్కుమార్ శర్మ ఆలియాస్ భరత్కుమార్ (38)ను చిక్కబళ్లాపురం పోలీసులు అరెస్టు చేశారు. నాటకీయంగా పోలీసులకు దొరికాడు. వివరాలు.. శిడ్లఘట్ట పట్టణంలో ఉండే తోడుదొంగలు సంతోష్, అల్లాబకాష్లను చూడడానికి వచ్చాడు, అక్కడ గత నెల 27న అణకనూరు గ్రామంలోని నాగరాజ్ అనే ఇంటిలోకి చొరబడి బంగారు నగలు, డబ్బు ఎత్తుకెళ్లాడు. చిక్కబళ్లాపురం రూరల్ పోలీసులు విచారణ చేపట్టి శర్మ, అల్లాబకాష్, సయీద్లను అరెస్టుచేశారు. శర్మ హైదరాబాద్లో ఉంటూ దొంగతనాలకు పాల్పడేవాడు. ఇప్పటికి 96 చోరీ కేసులు ఇతనిపై ఉన్నాయి. అరెస్టయిన ప్రతిసారీ కొన్నాళ్లు జైలుకెళ్లి రావడం, మళ్లీ దొంగతనాలు చేయడం వృత్తిగా మార్చుకున్నాడు. -
విద్వేష ప్రసంగ వ్యతిరేక బిల్లు ఆమోదించిన కర్ణాటక అసెంబ్లీ
బెళగావి: దేశంలోనే మొట్టమొదటిసారిగా తీసుకు వచ్చిన విద్వేష ప్రసంగ వ్యతిరేక బిల్లును కర్ణాటక అసెంబ్లీ గురువారం ఆమోదించింది. బీజేపీ సభ్యుల తీవ్ర నిరసనల మధ్య సభ ‘ది హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్)బిల్లు’కు ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లులో ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం..విద్వేష ప్రసంగాలు, నేరాలకు పాల్పడిన వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించేందుకు వీలుంటుంది. ఈ నెల 4వ తేదీన కేబినెట్ ఆమోదం తెలపగా, ఈ నెల 10వ తేదీన అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం, బతికున్న/ మరణించిన వ్యక్తి, వ్యక్తుల సమూహం, వర్గం/ సమాజంపై ఏదైనా ప్రతికూల ప్రయోజనాన్ని ఆశించి... హాని, అశాంతి, శత్రుత్వం, ద్వేషం కలిగించాలనే ఉద్దేశంతో, బహిరంగంగా, మాటల ద్వారా రాతపూర్వకంగా, సైగలు దృశ్య రూపాల ద్వారా, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా లేదా మరే ఇతర మార్గంలోనైనా చేసే ప్రకటనలు లేదా వ్యక్తీకరణలు ద్వేషపూరిత ప్రసంగం కిందకు వస్తాయి. కాగా, ఈ బిల్లును ప్రతిపక్షం, మీడియా లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన బ్రహ్మాస్త్రంగా బీజేపీ అభివర్ణించింది. -
ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్ బోర్డులు
జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రవేశపెట్టిన క్యూఆర్ (QR) కోడ్ ఆధారిత సమాచార బోర్డులు చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరులోని కీలక రహదారులపై ఏర్పాటు చేసిన ఈ బోర్డులు, ఆశించిన స్థాయిలో సమాచారాన్ని అందించడం లేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.ఎన్హెచ్ఏఐ ఏం చెబుతోంది?బెంగళూరులోని ఎన్హెచ్-48 (బెంగళూరు-నెలమంగళ), ఎన్హెచ్-75 (బెంగళూరు-కోలార్-ముల్బాగల్) రూట్లలో క్యూఆర్ కోడ్ బోర్డులను ఎన్హెచ్ఏఐ ఏర్పాటు చేసింది. సాంకేతికతను ఉపయోగించుకుని వినియోగదారులకు కొన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. అత్యవసర సమాచారంలో భాగంగా హైవే పెట్రోలింగ్ బృందాలు, ఇంజినీర్లు, సమీప పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రుల ఫోన్ నంబర్లు ఉంటాయి. సమీపంలోని టోల్ ప్లాజాలు, మార్గమధ్యలో ఉండే మౌలిక సదుపాయాల వివరాలు ఉంటాయి.పారదర్శకత ఎక్కడ?క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎన్హెచ్ఏఐ చెబుతున్న దానికి భిన్నంగా ఉందని వాహనదారులు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుత బోర్డులకు పొంతన లేదని వాదిస్తున్నారు.To enhance transparency and improve ease of travel for National Highway users, NHAI is installing QR code-based information boards on key National Highway corridors in #Bengaluru. These QR boards are currently available on Bengaluru–Nelamangala section of NH-48 and… pic.twitter.com/jzgAfGQwnj— NHAI (@NHAI_Official) December 15, 2025ప్రయాణికులు లేవనెత్తుతున్న ప్రధానాంశాలుక్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ప్రాజెక్టు వ్యయం, పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పేరు, కన్సల్టెంట్ వివరాలు, స్థానిక ఎమ్మెల్యే వివరాలు కనిపించడం లేదు.రోడ్డు నాణ్యత సరిగ్గా లేనప్పుడు ఎవరిని ప్రశ్నించాలో తెలియడం లేదని ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా కమ్యూనిటీ నోట్స్ ద్వారా వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.‘ప్రాజెక్ట్ కాంట్రాక్టర్, కన్సల్టెంట్, అధికారులు ఎవరో క్యూఆర్ కోడ్ ద్వారా ప్రదర్శించాలి. తద్వారా జవాబుదారీతనం పెరుగుతుంది’ అని గతంలో నితిన్ గడ్కరీ స్వయంగా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోర్టల్లో ఈ వివరాలు లేకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: సామాన్యుడి చేతిలో సమస్తం! -
స్వామీజీ మసాజ్ వీడియో వైరల్
సాక్షి,బళ్లారి: అదో ప్రముఖ ఆధ్యాత్మికత క్షేత్రం. ఎంతో మంది భక్తులు ఆరాధించే మఠం కూడా. అయితే అక్కడ ఓ స్వామీజీ నగ్నంగా ఓ అమ్మాయితో మసాజ్ చేయించుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ధారవాడ జిల్లా కవలగేరి మఠానికి చెందిన శివానంద మఠ సరస్వతి స్వామీజీ కామ పురాణం వీడియో బయటకు వచ్చింది. ఇంత వరకు స్వామీజీ సన్యాసి అని జనం ఎంతో భక్తితో పూజించేవారు. అయితే ఆయన ఓ మహిళతో నగ్నంగా ఉంటూ మసాజ్ చేయించుకున్నారు. మసాజ్ చేయించుకున్న వీడియోను ఐదు మంది తమ దగ్గర ఉంచుకుని స్వామీజీని డబ్బు డిమాండ్ చేశారు. రూ.20 లక్షలు ఇవ్వకపోతే వీడియో వైరల్ చేస్తామని బెదిరించారు. స్వామీజీ వారితో చర్చలు జరిపి రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకుని, చెప్పిన ప్రకారం రూ.7 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. అనంతరం వీడియోను డిలీట్ చేయాలని విన్నవించారు. మిగిలిన రూ.3 లక్షలు ఇవ్వలేదని, ఐదు మందిలో ఒకరు వీడియోను బయటకు వదలడంలో స్వామీజీ మసాజ్ వీడియో వైరల్ అయింది. సన్యాసిగా ఫోజులు ఇచ్చిన స్వామీజీ కామ పురాణం వీడియో బయట పడటంతో ఒక్కసారిగా మఠం పరిసరాల్లో జనం చేరి స్వామీజీ తీరుపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాగా తనను బ్లాక్ మెయిల్ చేసి, వీడియోను వైరల్ చేసిన వారిపై స్వామి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఉపాధి హామీ ఉసురు తీయొద్దు
● అసెంబ్లీ ఆవరణలో సీఎం, డీసీఎంల ధర్నా శివాజీనగర: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (నరేగా) నుంచి గాంధీ పేరును తొలగించిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెళగావిలో సువర్ణసౌధ ఆవరణంలో ఉన్న గాంధీ విగ్రహం ముందు సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. బుధవారం ఉదయాన్నే ధర్నా నిర్వహించి కేంద్రానికి విరుద్ధంగా నినాదాలను చేశారు. పేరును మార్చడం ద్వేషపూరిత రాజకీయం, దీనిని తాము ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నీచమైన రాజకీయానికి పాల్పడుతోందన్నారు. పేరు మార్చడంతో పాటు పథకం స్వరూపాన్నే మార్చేశారు, రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు వాటాను పెంచారు, ఇది సరికాదు. గతంలో మాదిరిగానే ఉపాధి పథకాన్ని కొనసాగించాలని నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ధర్నాపై బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి విమర్శలు గుప్పించారు. నెహ్రూ కాలంలోనే గాంధీజీ విధానాలకు కాంగ్రెస్ తిలోదకాలు ఇచ్చిందన్నారు. తుక్డా గ్యాంగ్తో కలసి దేశాన్ని విడదీయటానికి కుట్ర చేస్తోందన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు గాంధీజీ జ్ఞాపకం రాలేదా అని విమర్శించారు. -
మోసగాళ్లకు వరం.. నకిలీ సిమ్లు
క్షణాల్లో సిమ్ల మంజూరు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇస్తే చాలు కొద్ది క్షణాల్లో సిమ్లను అందిస్తున్నారు. ఓటీపీ కోసం ప్రత్యామ్నాయ నంబరు ఇస్తారు. కొత్త సిమ్ ఈ–కేవైసీకి నెలల సమయం కావాలి. అంతలోగా వంచకులు సిమ్లతో పలువురికి బురిడీ కొట్టిస్తున్నారని పోలీసులు తెలిపారు.అక్రమ సిమ్కార్డుల ద్వారా సైబర్ మోసాలుబనశంకరి: రోడ్డు పక్కన, ఫుట్పాత్ల మీద అతి తక్కువ ధరతో, లేదా ఉచితంగా లభించే సిమ్కార్డులు సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి. వాటి ద్వారా అమాయకులకు కాల్స్ చేస్తూ, బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తూ ప్రజలను దోచేస్తున్నారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసినప్పుడు ఈ విషయం రుజువైంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇలాంటి 18 కేసులను పోలీసులు వెలికితీశారు. గుర్తుతెలియని వ్యక్తుల పేరుతో కంపెనీల సిమ్ కార్డులను చాలా ఈజీగా తీసుకోవచ్చు. 12 గంటల్లోగా సిమ్ యాక్టివేషన్ అవుతుంది. కంపెనీలు మార్కెట్లో పోటాపోటీగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇష్టానుసారం సిమ్లను జారీ చేయడం ఆన్లైన్ నేరాలకు ఊతమిస్తోంది. నిబంధనలు గాలికి ఒక వ్యక్తి తన ఆధార్ కార్డుపై 9 సిమ్కార్డులను మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఇతరుల పేర్లతో అక్రమంగా సిమ్ కార్డులను పొందినా, జారీచేసినా జరిమానా, జైలుశిక్ష పడేలా చట్టాలున్నాయి. ఒక ఆధార్ నంబరుతో ఎన్ని సిమ్కార్డులు నమోదయ్యాయి అనేదానిని ధృవీకరించుకోవడానికి సంచార్ సారధి యాప్లో అవకాశం ఉంది. రూ.500 ఇస్తే జిరాక్స్ కాపీ ఇతరుల ఆధార్ కార్డుల జిరాక్సులను కోరినన్ని సరఫరా చేసే ముఠాలు బెంగళూరుతో పాటు అన్నిచోట్లా చురుగ్గా ఉన్నాయి. రూ.500 ఇస్తే చాలు ఆధార్ జిరాక్స్లు ఇస్తారు. కొన్నిచోట్ల జిరాక్స్ సెంటర్లతో కుమ్మకై ్క ఈ దందాను సాగిస్తున్నారు. కర్ణాటకలో తీసుకున్న సిమ్లను బయటి రాష్ట్రాలు, బయటి రాష్ట్రాల్లోని సిమ్లను ఇక్కడ విక్రయిస్తున్నారు. పోలీస్, సీఐడీ, సీబీఐ, కస్టమ్స్ అధికారుల పేర్లతో ట్రూకాలర్లో సేవ్ చేసి మోసాలకు తెరతీస్తారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఇతరుల ఆధార్తో యథేచ్ఛగా జారీ బెంగళూరుతో పాటు రాష్ట్రమంతటా నేర ముఠాల దందా పోలీసులకు సవాల్ -
20, 21న క్రికెట్ టోర్నీ
● వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ ఏర్పాట్లు బనశంకరి: జన నేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. గతంలోనూ రెండు సీజన్లు నిర్వహించడం తెలిసిందే. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో ఐటీ వింగ్ సీజన్ –3 క్రికెట్ టోర్నీ జరుపుతున్నట్లు ఐటీ వింగ్ నేతలు తెలిపారు. ఈ నెల 20, 21 తేదీల్లో బెంగళూరు సర్జాపురలో చేతన్ క్రికెట్ గ్రౌండ్స్లో టోర్నమెంట్ జరుగుతుంది. ప్రేక్షకులు, జట్లు విరివిగా పాల్గొని, ఆడేవారిని ప్రోత్సహించండి అని విజ్ఞప్తి చేశారు. జననేత బర్త్ డేని అభిమానంతో సగర్వంగా సెలబ్రేట్ చేసుకుందామని పిలుపునిచ్చారు. క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనాలని ఆసక్తి కలిగినవారు ముందుగా వివరాలను తెలియజేయాలి. మరిన్ని వివరాలకు రమేశ్– 974330 0010 నంబరులో సంప్రదించాలని తెలిపారు. బీకాం విద్యార్థిని ఆత్మహత్యశివమొగ్గ: జిల్లాలోని హొసనగర తాలూకాలోని వసవె గ్రామంలో బీకాం విద్యార్థిని ఒకరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వసవె గ్రామ నివాసి రచన (20), హొసనగరలోని కొడచాద్రి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీకాం చదువుతోంది. ఎప్పటిలానే కాలేజీకి వెళ్లి వచ్చిన రచన ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నట్లు తెలిసింది. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. కూతురి మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు. గుండెపోటుకు యువతి బలి శివమొగ్గ: తగ్గాయనుకున్న ఆకస్మిక గుండెపోటు మరణాలు మళ్లీ దడ పుట్టిస్తున్నాయి. జిల్లాలో తీర్థహళ్లికి చెందిన అమ్మాయి గుండెపోటుకు బలైంది. మృతురాలిని దిశ (22)గా గుర్తించారు. శృంగేరిలోని జేసీబీఎం కాలేజీలో ఫైనలియర్ బీకాం చదువుతున్న దిశ శృంగేరిపేటెలోని బీసీఎం హాస్టల్లో ఉండేది. హాస్టల్లో ఉండగానే దిశకు ఆకస్మికంగా ఎదలో నొప్పి వచ్చి కుప్పకూలిపోయింది. కొంతసేపటికి ఇతర విద్యార్థినులు వచ్చి చూడగా అప్పటికే తుదిశ్వాస విడిచింది. అధ్యాపకులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు శోకతప్తులయ్యారు. శృంగేరి పోలీసులు కేసు నమోదు చేశారు. -
బ్యాంకు ఖాతాలు సైతం
ఆధార్ ఐడీలు సైబర్ వంచకుల చేతికి వెళ్లడంతో దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ కేసులు అధికమయ్యాయి. ఆధార్ నంబరుతో ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్, పాన్ నంబర్ ను ఇట్టే కనిపెడతారు. 50 శాతం డిజిటల్ అరెస్ట్ కేసుల్లో మోసగాళ్లకు ఇదే ఆధారం. టెక్కీలు, వ్యాపారవేత్తలు, రిటైర్డు ఉద్యోగులకు ఫోన్లు చేసి మొదట వారి ఆధార్ సంఖ్యను చెబుతారు, దీంతో నిజమేనేమోనని భయపడి నేరగాళ్ల వలలో పడిపోతున్నారు. ఆపై బెదిరించి కోట్లాది రూపాయలను తమ అకౌంట్లకు జమ చేసుకుంటున్నారు. ఆధార్ కార్డు ఇతరులకు చేరడం ఇంత పని చేస్తోందని ఆందోళన నెలకొంది. ఐటీ నగరంలో డ్రగ్స్ వ్యాపారంలో ఉన్న విదేశీయుల వద్ద 15 సిమ్ కార్డులు దొరికాయి. స్థానికుల ఆధార్కార్డులతో తీసుకున్నట్లు వెలుగుచూసింది. అదే ఆధార్లతో బ్యాంక్ అకౌంట్లను తెరిచి అక్రమ నగదు దందా చేపడుతున్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. -
సీఐకి ప్రేమ బాణాలు
శివాజీనగర: ఇక్కడ అంతా రివర్స్ అయ్యింది. ఓ పురుష సీఐని మహిళ ప్రేమపేరుతో వేధిస్తోందని తెలిసింది. బెంగళూరులోని రామమూర్తినగర ఠాణా సీఐ సతీష్ కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. తాను అధికార కాంగ్రెస్ పార్టీ నాయకురాలినని, ప్రేమించకపోతే ఇబ్బంది పడతావని కూడా బెదిరిస్తూ ప్రముఖులతో తీసుకున్న ఫోటోలను వాట్సాప్లో పంపి సతాయిస్తోంది. ఎలా మొదలైంది.. సదరు మహిళ పని మీద ఒకటి రెండుసార్లు ఠాణాకు వచ్చి సీఐతో మాట్లాడింది, అంతే అప్పటి నుంచి ఆయనంటే మోజు పడింది. ప్రేమగా కజ్జికాయల డబ్బా, పూల బొకే తీసుకుని సీఐ కోసం వస్తుంది. మొదట్లో మామూలే కదా అనుకున్న సీఐకి తరువాత సీరియస్ అని అర్థమైంది. సుమారు 11 నంబర్ల నుంచి ఫోన్ చేసి, ప్రేమించాలని డిమాండ్ చేస్తోందని ఠాణా సిబ్బంది చెబుతున్నారు. నన్ను ప్రేమించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని, మీరే కారణమని డెత్నోట్ రాస్తాను అని బెదిరిస్తూ రక్తంతో మరో లేఖను రాసింది. మహిళపై కేసు ఈ చర్యలతో విసుగెత్తి ఇన్స్పెక్టర్ సతీశ్.. తన విధులకు అడ్డుపడుతున్న, ఆత్మహత్య బెదిరింపులకు పాల్పడుతున్న సెక్షన్ల కింద ఆమె మీద కేసు నమోదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలి వింత ధోరణి బెంగళూరులో విడ్డూరం -
సీఐ గారు మీరంటే నాకు మోజు..!
కర్ణాటక: ఇక్కడ అంతా రివర్స్ అయ్యింది. ఓ పురుష సీఐని మహిళ ప్రేమపేరుతో వేధిస్తోందని తెలిసింది. బెంగళూరులోని రామమూర్తినగర ఠాణా సీఐ సతీష్ కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. తాను అధికార కాంగ్రెస్ పార్టీ నాయకురాలినని, ప్రేమించకపోతే ఇబ్బంది పడతావని కూడా బెదిరిస్తూ ప్రముఖులతో తీసుకున్న ఫోటోలను వాట్సాప్లో పంపి సతాయిస్తోంది. ఎలా మొదలైంది.. సదరు మహిళ పని మీద ఒకటి రెండుసార్లు ఠాణాకు వచ్చి సీఐతో మాట్లాడింది, అంతే అప్పటి నుంచి ఆయనంటే మోజు పడింది. ప్రేమగా కజ్జికాయల డబ్బా, పూల బొకే తీసుకుని సీఐ కోసం వస్తుంది. మొదట్లో మామూలే కదా అనుకున్న సీఐకి తరువాత సీరియస్ అని అర్థమైంది. సుమారు 11 నంబర్ల నుంచి ఫోన్ చేసి, ప్రేమించాలని డిమాండ్ చేస్తోందని ఠాణా సిబ్బంది చెబుతున్నారు. నన్ను ప్రేమించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని, మీరే కారణమని డెత్నోట్ రాస్తాను అని బెదిరిస్తూ రక్తంతో మరో లేఖను రాసింది. మహిళపై కేసు ఈ చర్యలతో విసుగెత్తి ఇన్స్పెక్టర్ సతీశ్.. తన విధులకు అడ్డుపడుతున్న, ఆత్మహత్య బెదిరింపులకు పాల్పడుతున్న సెక్షన్ల కింద ఆమె మీద కేసు నమోదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు. -
ఇదోరకం ప్రేమ!
అది అక్టోబర్ 30, 2024. బెంగళూరులోని రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్లో 45 ఏళ్ల ఇన్స్పెక్టర్, తన దైనందిన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. హఠాత్తుగా.. ఆయన అధికారిక ఫోన్కి ఒక అపరిచిత నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత.. వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్లు వెల్లువెత్తాయి. అవతలి నుంచి మాట్లాడుతున్న మహిళ మాటలు అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నాయి. మొదట్లో ఇన్స్పెక్టర్ దాన్ని ఏదో సాధారణ ఫిర్యాదు అనుకున్నారు. కానీ, అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది!ప్రేమించకపోతే ఉద్యోగం తీయిస్తా.. ఆ మహిళ పదేపదే ఫోన్ చేసింది. తనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి వంటి అత్యున్నత రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పడం మొదలుపెట్టింది. వాట్సాప్లో ఆ ప్రముఖులతో తాను ఉన్న ఫొటోలను పంపింది. ఆమెది ఫిర్యాదు కాదని, ప్రేమ ప్రతిపాదన అని ఇన్స్పెక్టర్కు అర్థమైంది. ‘నా ప్రేమను అంగీకరించండి. లేదంటే, నా పలుకుబడిని ఉపయోగించి మీ ఉద్యోగాన్ని, కెరీర్ను నాశనం చేస్తాను’.. అంటూ బెదిరింపులకు దిగింది. నిందితురాలి అధికారం, పలుకుబడి ఇన్స్పెక్టర్ను మానసిక ఆందోళనకు గురిచేసింది.రక్తంతో లేఖ అధికారిక విధులకు ఆటంకం కలుగుతుండడంతో, ఇన్స్పెక్టర్ ఆమెను పోలీస్ స్టేషన్కు వచ్చి రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వమని పదేపదే సూచించారు. కానీ, ఆమె స్టేషన్కు రాలేదు.. వేధింపులు కూడా ఆపలేదు. నవంబర్ 7వ తేదీన ఆమె వేధింపులు పతాక స్థాయికి చేరాయి. ఆ మహిళ ఏకంగా ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వచ్చింది. అతనికి ఒక కవరును అందజేసింది. ఆ కవరులో కొన్ని మాత్రలు, చేతితో రాసిన లేఖలు ఉన్నాయి. అత్యంత భావోద్వేగపూరితంగా ఉన్న ఆ లేఖలు తన రక్తంతో రాసినవని ఆమె స్పష్టం చేసింది. ఇది ఆమె తీవ్రమైన మానసిక సమస్యకు నిదర్శనం. ఇన్స్పెక్టర్ అధికారిక డ్యూటీ నంబర్కు అనవసర కాల్స్, మెసేజ్లు పంపిస్తూ.. ఆయన రోజువారీ పనులకు తీవ్ర ఆటంకం కలిగిస్తూనే ఉంది. పోలీసుల విచారణలో, ఈ మహిళ గతంలో కూడా ఇతర పోలీసులు, ప్రభుత్వ అధికారుల్ని ఇలాగే వేధించినట్లు వెల్లడైంది.ఆత్మహత్య చేసుకుంటా.. డిసెంబర్ 12న, ఇన్స్పెక్టర్పై వేధింపుల పర్వం తారస్థాయికి చేరింది. ఆ మహిళ నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి, అందరూ చూస్తుండగానే అరిచింది. ‘నా ప్రేమ ప్రతిపాదనను అంగీకరించకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. నీ ఉద్యోగాన్ని, కెరీర్ను నాశనం చేస్తాను’.. అని బెదిరించింది. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో, రామమూర్తి నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదు ఆధారంగా, ఆ మహిళపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 132 (ప్రభుత్వ ఉద్యోగిని విధులకు ఆటంకం కలిగించడం), 351(2) (క్రిమినల్ బెదిరింపు), 221 (ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విచిత్ర కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఒక పోలీసు అధికారికి తన విధి నిర్వహణలో ఎదురైన ఈ ‘ప్రేమ ఉచ్చు’రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నౌకా స్థావరంలో చైనా గూఢచార పక్షి
దొడ్డబళ్లాపురం: కర్ణాటకలోని కార్వార్లో అరేబియా సముద్ర తీరంలోని భారతీయ నౌకాదళ స్థావరంలో ఓ పక్షి అనుమానాస్పదంగా కనిపించింది. కదంబ నేవీ బేస్ పరిధిలో మంగళవారం జీపీఎస్ ట్రాకర్ కలిగిన సీగల్ బర్డ్ను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పక్షికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇది చైనాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. చైనా భాషలో ఎకో ఎన్విరాన్మెంట్ అని రాసి ఉంది. చైనాలోని ఆ సంస్థతో సంప్రదించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. కార్వార్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గూఢచర్య పక్షిగా అనుమానాలను వ్యక్తం చేశారు. -
ఆన్లైన్లో నిశ్చితార్థం.. మరి పెళ్లి..! (ఫోటోలు)
కర్ణాటక: ప్రస్తుతం అన్నీ ఆన్లైన్ మయమైపోయాయి. ఆఖరికి పెళ్లిచూపులు, నిశ్చితార్థాలు కూడా. మాగడికి చెందిన యువకుడు కెనడాలో ఉంటాడు, అతనికి ఉడుపి యువతితో ఆన్లైన్లోనే నిశ్చితార్థం జరిగింది. వరుడు సుహాస్, వధువు మేఘన. ఉడుపిలోని ఒక కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిపించారు. ఉడుపిలో మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం జరిగితే, అప్పుడు కెనడాలో అర్ధరాత్రి సమయం అయ్యింది. పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి అతిథులు వీక్షించారు. సుహాస్కి సెలవులు దొరక్కపోవడంతో ఇలా కానిచ్చేశారు. జనవరి 7, 8 తేదీల్లో వీరి వివాహం జరగనుంది. పెళ్లి కూడా ఆన్లైన్లో జరిపిస్తారా? అని బంధువులు హాస్యమాడారు. -
ప్రాణం పోతున్నా పట్టించుకోని జనం
కర్ణాటక: కళ్ల ముందే ప్రాణం పోతున్నా.. గుండెపోటుతో రోడ్డుపై విలవిల్లాడుతున్నా.. సాయం కోసం అతని భార్య చేతులు జోడించి వేడుకుంటున్నా.. జనం పట్టించుకోలేదు. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరకు ఆ వ్యక్తి మరణించాడు. ఈ విషాద ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు.. బనశంకరి మూడో స్టేజ్ బాలాజీనగర్కు చెందిన వెంకటరామన్(34) మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యాడు. ఆందోళనకు గురైన భార్య రూప అతనిని వెంటనే స్కూటీపై సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గుండెపోటు అని నిర్ధారించారు. ప్రథమ చికిత్స చేసి.. జయదేవ హృద్రోగ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ అంబులెన్సు లేకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న రూప.. భర్తను వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మళ్లీ స్కూటీపైనే బయలుదేరింది. కదిరేనహళ్లి బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి.. వెంకటరామన్ స్కూటీపై నుంచి కిందపడిపోయాడు. దీంతో రూప రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు అడ్డుపడి సాయం కోసం వేడుకుంది. అయినా ఎవరి మనసూ కరగలేదు. ఆ తర్వాత కొద్ది సేపటికి వెంకటరామన్ సోదరి అక్కడకు చేరుకుంది. చివరకు ఇద్దరూ కలిసి క్యాబ్లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే వెంకటరామన్ మరణించాడు. సమయానికి ఎవరూ మానవత్వం చూపకపోయినా.. రూప పెద్ద మనసుతో తన భర్త కళ్లను దానం చేసి ఆదర్శంగా నిలిచింది. #Heartbreaking incident in Bengaluru has left many shaken and questioning humanity. Thirty-four-year-old Venkataramanan suffered a sudden cardiac arrest while riding a bike with his wife. Near Kadrihalli Bridge, he collapsed on the road, gasping for life. His wife screamed for… pic.twitter.com/VXSUDWDq8Z— Bharathirajan (@bharathircc) December 17, 2025 -
న్యాయ సేవల లబ్ధి పొందండి
రాయచూరు రూరల్: సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టం, న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాయచూరు జిల్లా అదనపు న్యాయమూర్తి స్వాతిక్ పిలుపునిచ్చారు. వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయ సేవా ప్రాధికార, కార్మిక శాఖ, కట్టడ కార్మికుల కళ్యాణ మండలి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్క పౌరుడు మానవ హక్కుల సంరక్షణ గురించి తెలుసుకోవాలన్నారు. అప్పుడే ఉచితంగా న్యాయ సలహాలు పొందడానికి వీలవుతుందన్నారు. రాయచూరు జిల్లాలో 1.07 లక్షల మంది కార్మికులు పేర్లు నమోదు చేసుకున్నారని జిల్లా కార్మిక శాఖాధికారి అరతి వెల్లడించారు. కార్యక్రమంలో అవినాష్, రాజేశ్వరి, ప్రియాంక, నాగరాజ్, తిప్పేస్వామి, రంగప్ప, వెంకటేష్, వీరనగౌడ, చెన్నప్ప, మంజునాథ్లున్నారు. టీచర్పై పోక్సో కేసు.. ఇద్దరు ఖాకీలపై వేటు హుబ్లీ: హావేరి జిల్లాలో ఓ ఉపాధ్యాయుడి మెడలో చెప్పుల మాల వేసి ఊరిలో ప్రదర్శన నిర్వహించిన సంఘటనలో సవణూరు పోలీస్ స్టేషన్ సీఐ, హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఆ జిల్లా ఎస్పీ ఆదేశాలను వెల్లడించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపిన ఆరోపణలపై సీఐ దేవానంద్, హెడ్కానిస్టేబుల్ మల్లికార్జునను సస్పెండ్ చేస్తూ ఎస్పీ యశోద వంటగోడి ఆదేశాలను వెల్లడించారు. ఈనెల 10న సవణూరులో పోక్సో కేసు నిందితుడైన ఉపాధ్యాయుడిని అవమానించిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. టీచర్ జగదీశ్పై అక్కడి స్థానికులు తీవ్రంగా దాడి చేసి మెడలో చెప్పుల మాల వేసి పాఠశాల నుంచి పోలీస్ స్టేషన్ వరకు వీధుల్లో ఊరేగించారు. కాగా సదరు టీచర్పై అడవి జంతువుల్లా దాడి చేస్తున్నా కూడా పై ఇద్దరు పోలీస్ సిబ్బంది తగిన నివారణ చర్యలు తీసుకోక పోవడంపై బాధితుడైన టీచర్ తనపై దాడి చేసిన 22 మందిపై కేసు పెట్టారు. దీంతో పోలీసులపై విమర్శలు రావడంతో ఎస్పీ ఈ చర్య తీసుకున్నారు. దివ్యాంగుల క్రీడా పోటీలుహొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లిలోని తాలూకా స్టేడియంలో తాలూకా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు జరిగాయి. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా తాలూకా యంత్రాంగం, తాలూకా, దివ్యాంగుల సీనియర్ సిటిజన్ల సాధికారత విభాగం, దివ్యాంగులకు సేవలందించే సంస్థలు నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీలను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వై.హెచ్.చంద్రశేఖర్ ప్రారంభించారు. దివ్యాంగులకు షాట్పుట్, వీల్చైర్ రేస్, రన్నింగ్ రేస్, త్రోబాల్ మ్యూజికల్ చైర్ పోటీలను నిర్వహించారు. స్లం వాసులకు ఇళ్ల పట్టాలివ్వండి రాయచూరు రూరల్: నగరంలోని మురికి వాడల కాలనీలో నివాసమున్న వాసులకు ఇళ్ల పట్టాలను అందించాలని మురికి వాడల కాలనీ వాసులు డిమాండ్ చేశారు. మంగళవారం బెళగావి విధానసౌధ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడారు. 1991–92లో సర్వే నంబర్– 572, 573, 574లలో నివాసముంటున్న వారికి నేటికీ పట్టాలు ఇవ్వకుండా నగరసభ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. సుమారు 600 కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అందించాలని కోరుతూ గృహ వసతి శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్కు వినతిపత్రం సమర్పించారు. లోకాయుక్త న్యాయవాది నియామకం రాయచూరు రూరల్: లోకాయుక్తకు వచ్చిన ఫిర్యాదులను వాదించడానికి రాయచూరు నుంచి న్యాయవాది మల్లినాథ్ ఎస్. హిరేమట్్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధులు నిర్వహించిన ఇందూధర్ పాటిల్ పదవీ కాలం ముగియడంతో త్వరితగతిన బాధ్యతలు చేపట్టాలని ఆదేశిస్తూ లోకాయుక్త జాయింట్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
బొగ్గు చౌర్యంపై క్రిమినల్ కేసు పెట్టండి
రాయచూరు రూరల్: యరమరస్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(వైటీపీఎస్)లో బొగ్గు దొంగతనంలో అధికారులు, ఇంజినీర్లు భాగస్వాములని, బాధ్యులపై క్రిమినల్ కేసు పెట్టాలని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు నరసింహులు మాట్లాడారు. రాయచూరు నుంచి యరమరస్ వరకు రైల్వే లైన్లలో వ్యాగన్లతో వెళ్లే రేకులను అన్లోడ్ చేసి కొద్ది మేర ఉంచుకొని ఆ బొగ్గును యరమరస్ రైల్వే స్టేషన్లో గంట సేపు నిలిపి అక్రమంగా విక్రయాలు చేశారన్నారు. బొగ్గును వైటీపీఎస్ ఇంజినీర్లు హరీష్, చంద్రశేఖర్, సబ్ కాంట్రాక్ట్ పొందిన పవర్ మేక్ సూపర్వైజర్ హరికృష్ణ, మేనేజర్ సురేంద్రనాథ్, స్టేషన్ మాస్టర్ సర్కార్, వ్యాగన్ల క్లీనింగ్ సిబ్బంది, గురు రాఘవేంద్ర ఎంటర్ప్రెజస్ శేషగిరి ఏకమై అక్రమంగా వైటీపీఎస్కు తరలాల్సిన బొగ్గును దొంగచాటుగా ఇతర ప్రాంతాలకు తరలించిన వారిపై చర్యలు చేపట్టాలన్నారు. -
విద్యార్థులకు చట్టాలపై జాగృతి అవసరం
రాయచూరు రూరల్: విద్యార్థులకు చట్టం, న్యాయంపై జాగృతి అవసరమని తాలూకా విద్యా శాఖాధికారి ఈరణ్ణ కోస్గి పేర్కొన్నారు. మంగళవారం రాయచూరు తాలూకా గాణదాళ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా యంత్రాంగం, జెడ్పీ, జిల్లా న్యాయ సేవా ప్రాధికార, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, జిల్లా మహిళా సబలీకరణ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. లైంగిక దాడుల నుంచి మహిళల సంరక్షణ మనందరి బాధ్యత అన్నారు. సాంఘీక దురాచారాలైన బాల్య వివాహాలు, బాల కార్మిక, దేవదాసి పద్ధతి వంటి వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. -
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
కోలారు : విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గుండె పోటుతో మరణించిన ఘటన జిల్లాలోని ముళబాగిలు పట్టణంలో చోటు చేసుకుంది. ముళబాగిలు నగర ముత్యాల పేటకు చెందిన సుబ్రమణి (49) నంగలి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 112 ట్రాఫిక్ వాహనంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించినా చికిత్స ఫలించక మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. త్రిచక్రవాహనం అందజేత కోలారు : దివ్యాంగుడికి కలెక్టర్ త్రిచక్రవాహనం అందించి అండగా నిలిచారు. జిల్లా కలెక్టర్ ఎం ఆర్ రవి బృహత్ స్వచ్ఛతా ఆందోళన కార్యక్రమం కోసం నగరంలో సంచరిస్తుండగా స్థానిక ఆటో డ్రైవర్లు కలిసి దివ్యాంగుడైన ఖాసీంఖాన్ ఇబ్బందులను వివరించారు. దీంతో కలెక్టర్ స్పందించి త్రిచక్రవాహనం అందించాలని నగరసభ కమిషనర్ నవీన్ చంద్రను ఆదేశించారు. ఖాసిం ఖాన్కు నగరసభ నుంచి చిన్న వ్యాపారం చేసుకోవడానికి తగిన అవకాశం కల్పించాలని, ఫించన్ అందించాలని ఆదేశించారు. -
ధరల దరువు.. పంపిణీ బరువు
హుబ్లీ: ఎంతో మహదాశయంతో ప్రారంభించిన విద్యార్థులకు కోడిగుడ్ల పంపిణీ పథకానికి పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల కారణంగా విద్యార్థులకు సక్రమంగా అందాల్సిన కోడిగుడ్లు అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎయిడెడ్, అన్ఎయిడెడ్ విద్యా సంస్థల్లో గుడ్లు, అరటి పండు పంపిణీ చేసే వారు. మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులకు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారంలో నాలుగు రోజులు గుడ్లు పంపిణీ చేసే వారు. గుడ్ల పంపిణీ విషయం సవాల్గా మారిందని చెబుతున్నారు. ఓ చంటి బిడ్డకు నిత్యం గుడ్డు ఇవ్వడానికి ప్రభుత్వం రూ.6 భరిస్తుంది. అయితే మార్కెట్లో మాత్రం నిత్యం గుడ్ల ధరలు తీవ్రంగా పెరిగిన క్రమంలో కొందరు ఉపాధ్యాయులే డబ్బులు భరించి గుడ్లు పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. నిధుల లేమితో నిలిచిన పంపిణీ పంపిణీకి కావాల్సిన నిధుల లభ్యత లేకపోవతడంతో విద్యార్థులపై ఈ ప్రభావం పడింది. 83 వేల దమంది గుడ్లు, 30 వేల మంది పిల్లలకు అరటి పండ్లు పంపిణీ చేసే గురుతర బాధ్యతలను ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అప్పగించడంతో ఉపాధ్యాయులపై కొంచెం భారం పడిందని సమాచారం. రాష్ట్రంలో 53 లక్షల మందికి వారంలో రెండు రోజులు పంపిణీ చేసే వారు. అయితే ప్రస్తుతం గుడ్ల ధరలు ఆకాశాన్నంటాయి. వారానికి రెండు రోజులు పంపిణీ చేస్తుండగా క్రమేణ అది 6 రోజులకు విస్తరించారు. తాజాగా గుడ్లు, అరటి పండ్లను వారంలో 6 రోజులకు సరిపడా పండ్లు క్రమం తప్పకుండా మంజూరు చేయాలని అందరూ ఆశిస్తున్నారు. గత బడ్జెట్లోనే నిధుల కేటాయింపు 6 రోజుల పాటు పౌష్టిక ఆహారం లభ్యత ఉంటే ఇక పిల్లల్లో పౌష్టిక ఆహార పద్ధతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి లేదు. సదా ఈ ఉత్తమ పథకానికి వ్యాపార దిగ్గజం అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ సహకారం అందిస్తుంది. గత మార్చి బడ్జెట్లోనే నిధుల కేటాయింపు జరిగినట్లు తెలుస్తోంది. దావణగెరె జిల్లాలో సుమారు 1.21 లక్షల మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం పరిధిలోకి వస్తున్నారు. ఈ మేరకు గత నవంబర్ వరకు 83,436 పిల్లలకు గాను 70 శాతం మంది పిల్లలు గుడ్లు తింటున్నారు. 38,334 మంది ప్రకారం 30 శాతం విద్యార్థులు మొత్తానికి ఈ పథకంపై ధరల పెంపు ప్రభావం చూపుతోంది. పాఠశాలల్లో పిల్లలకు అందని కోడి గుడ్డు సవాల్గా పరిణమించిన కోడిగుడ్ల సరఫరా -
వీధి కుక్కలను ఆశ్రయ కేంద్రాలకు తరలిస్తాం
కోలారు : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి కుక్కలను తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలకు తరలిస్తామని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.రవి తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సభాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 79,281 వీధి కుక్కలు ఉన్నాయన్నారు. ఈ కుక్కలను బంధించి సంతాన హరణ చికిత్స చేయించి ఆశ్రయ కేంద్రానికి తరలిస్తామన్నారు. వంద కుక్కల ఆశ్రయ కేంద్రానికి నెలకు రూ.3.33 లక్షల ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. ఆశ్రయ కేంద్రాల్లోని క్కులకు నిత్యం రెండు పూటలా భోజనం, మందులు, టీకాలు వేయిస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ ఉప కార్యదర్శి టి కె రమేష్, అదనపు జిల్లా కలెక్టర్ మంగళ, నగరసభ కమీషనర్ నవీన్చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
డీహెచ్ఓ ఇంటిపై లోకాయుక్త మెరుపు దాడి
హొసపేటె: లోకాయుక్త అధికారులు తెల్లవారు జామునే అవినీతి అధికారి ఇంటి తలుపు తట్టారు. విజయనగర జిల్లా డీహెచ్ఓ శంకర్ నాయక్కు చెందిన ప్రైవేట్ ఆస్పత్రి, కార్యాలయం, ఇంటిపై లోకాయుక్త అధికారులు ఏకకాలంలో ముమ్మరంగా దాడులు నిర్వహించారు. విజయనగర లోకాయుక్త డీఎస్పీ సచిన్, పీఐ అమరేష్, రాజేష్ లమాణి, కొప్పళ, బళ్లారి లోకాయుక్త అధికారులు ఈ దాడులు నిర్వహించారు. లోకాయుక్త అధికారులు ఉదయం ఈ దాడులు నిర్వహించి పలు మహత్తరమైన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్రమ ఆస్తుల సంపాదన అద్భుతమైన మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుతో సహా డజన్ల కొద్దీ ఆస్తులను ఆయన సంపాదించారు. డాక్టర్ శంకర్ నాయక్ హయాంలో ఆరోగ్య శాఖలో నియామక ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల లోకాయుక్త అధికారులు ఈ దాడి చేసి దాఖలాలను పరిశీలిస్తున్నారు. -
పల్స్పోలియోలో వందశాతం లక్ష్యాన్ని సాధిద్దాం
కోలారు: జాతీయ పల్స్ పోలియో టీకా కార్యక్రమంలో భాగంగా వందశాతం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులు 1,63, 508 మంది ఉన్నారన్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు వీరందరికీ చుక్కల మందు వేస్తామన్నారు. ఇందు కోసం 738 బూత్లు ఏర్పాటు చేసి 37 బృందాలను నియమించిట్లు తెలిపారు. 21వ తేదీ ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, బస్టాండు, రైల్వే స్టేషన్లలో చుక్కలమందు వేస్తారన్నారు. 22, 23, 24 తేదీల్లో పారా మెడికల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేస్తారన్నారు. సమావేశంలో ఆర్సిహెచ్, జాతీయ పల్స్ పోలియో జిల్లా నోడల్ అధికారి డాక్టర్ చారిణి, జిల్లా ఆరోగ్య శిక్షణాధికారి ప్రేమ పాల్గొన్నారు.


