Karnataka
-
క్లైమాక్స్కు చేరిన కర్ణాటక రాజకీయం
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు హస్తినలో వాడీవేడిగా సాగుతున్నాయి. సీఎం మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో.. ఇవాళ ఇందిరాభవన్లో అధిష్టానం పెద్దలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్లు భేటీ అయ్యారు. సమావేశంలో వాళ్లు కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనంతరం బయటకు వచ్చిన వాళ్లిద్దరూ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా, గత డిసెంబరు నుంచి(రెండున్నరేళ్లు అధికారం పూర్తి కావడం) సీఎం కుర్చీ కోసం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఎడతెగని పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగైదు సార్లు ఇరువురూ ఢిల్లీకి వెళ్లి మంతనాలు సాగించారు. అయితే.. మే 20తో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తి కానుంది. పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ డిమాండ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే, తననే కొనసాగించాలని సిద్ధరామయ్య కోరుతున్నట్లు సమాచారం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మరో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వీళ్లిద్దరి నుంచి అభిప్రాయసేకరణ చేశారు. సిద్ధరామయ్యకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు నేపథ్యంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మూడేళ్లలో తన ప్రభుత్వ పనితీరు, ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు తదితరు అంశాలను సిద్దరామయ్య ప్రస్తావిస్తున్నారు. మరోవైపు.. ఆయన్ని మారిస్తే ఓబీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆందోళనలో అధిష్టానం ఉంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే తనకే సీఎం పదవి ఇవ్వాలని డీకే గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు సమీకరణాలను అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత అనిశ్చితి ఎక్కువకాలం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదని సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ అంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్లో కొనసాగుతున్న అధికారం పోరుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిళ్లు చేయడం ఏమాత్రం మంచిది కాదు. పార్టీ 2028లో మళ్లీ అధికారంలోకి రావాలంటే స్థిరత్వం.. బలమైన టీమ్ అవసరం. అంతర్గత అనిశ్చితి ఎక్కువకాలం కొనసాగితే బీజేపీకి లాభం కలుగుతుంది అని హెచ్చరించారాయన. అదే సమయంలో అధిష్టానం నుంచి త్వరలోనే ఓ ప్రకటన వెలువడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.ఒకవేళ మార్పు గనుక ఉంటే.. ఇప్పుడే చేస్తారా?.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మార్పు ఉంటుందా? ఒకవేళ లేకుంటే అసెంబ్లీ ఎన్నికల వరకు సిద్ధరామయ్యనే కొనసాగిస్తారా?.. డీకేను ఎలా సంతృప్తి పరుస్తారు? అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. -
కోడలిపై కన్నేసిన 75 ఏళ్ల మామ..!
బెంగళూరు: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మామ (75), కేసు సామరస్యంగా పరిష్కరించుకుంటామని బాధితురాలు (కోడలు) దయతల్చడంతో హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. వివరాలు.. బాధిత మహిళ.. భర్త, అత్త, మామ నిరంతరం లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై వారిపై కేసు నమోదైంది. నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మామ బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ వేశాడు, తన వయసు 75 సంవత్సరాలని, 9 నెలలుగా కారాగారంలో ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నాడు. కుటుంబ గొడవలతో తప్పుడు ఫిర్యాదు చేశారన్నాడు. దీనిని ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకిస్తూ, పిటిషనర్పై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని, బెయిల్ నిరాకరించాలని కోరారు. అయితే బాధిత మహిళ.. కేసును సామరస్యంగా పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతోంది. బెయిలు ఇవ్వవచ్చని తెలిపింది. జస్టిస్ జిఎస్ కమల్ వాదనలను ఆలకించి బెయిలుకు ఆమోదించారు. రూ.లక్ష పూచీకత్తు, పలు నిబంధనలను పాటించాలని ఆదేశించారు. కేసు విచారణ యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు. -
కర్ణాటక పవర్ గేమ్లో వైల్డ్ కార్డ్ ట్విస్ట్!
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు మరోసారి ఢిల్లీ కేంద్రంగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఢిల్లీ చేరుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. సీఎం మార్పు ఊహాగానాల నడుమ.. ఇవాళ జరగనున్న కీలక సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు పాల్గొననున్నారు.ఈ భేటీ ప్రధానంగా కర్ణాటక ప్రభుత్వ భవిష్యత్ దిశ, పరిపాలనా మార్పులు.. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందు “పాలిటికల్ రీసెట్”పై కేంద్రంగా సాగనుందని సమాచారం. ప్రభుత్వం పనితీరు మెరుగుపరచడం, మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం వంటి అంశాలు కూడా చర్చలో ఉండే అవకాశం కనిపిస్తోంది. పార్టీ వర్గాల ప్రకారం ప్రస్తుతం మూడు ఆప్షన్లు హైకమాండ్ పరిశీలనలో ఉన్నాయి. అందులో మొదటిది.. సీఎం సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగించడం. అంటే నాయకత్వ మార్పు లేకుండా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయడం ఆప్షన్గా ఉంది. ఇందులో పనితీరు తక్కువగా ఉన్న మంత్రులను తొలగించి, సామాజిక సమతుల్యత (అహిందా ఫార్ములా.. మైనారిటీలు+వెనుకబడిన వర్గాలు+దళితులు) ఆధారంగా కొత్త సమీకరణాలు తీసుకురావాలనే ఆలోచన ఉందని తెలుస్తోంది.రెండో ఆప్షన్గా.. నాయకత్వ మార్పు. డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి బాధ్యతల్లోకి తీసుకురావడం. అదే సమయంలో సీనియర్ నేత హోదాలో సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపించడం. అయితే ఇది అత్యంత సున్నితమైన రాజకీయ నిర్ణయంగా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మూడో ఆప్షన్.. దీనికి అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఇదే జరిగితే.. నిజంగా కర్ణాటక రాజకీయాలకు పెద్ద సర్ప్రైజే. అదే మల్లికార్జున ఖర్గేను కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్రలో తీసుకురావడం. అంటే ప్రస్తుతం జాతీయాధ్యక్షుడిగా ఉన్న ఖర్గేను.. “వైల్డ్ కార్డ్” ఎంట్రీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లోకి తెచ్చి సీఎంను చేయడం. ఇది జరిగితే రాష్ట్రంతో పాటు జాతీయ కాంగ్రెస్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరు వర్గాలను చల్లబర్చే ఈ ఆప్షన్ కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పై మూడు ఆప్షన్లలో ఏది అమలు చేసినా.. అది కర్ణాటక రాజకీయాల వరకు సంచలనమే కానుంది.పార్టీ లోపల వర్గపోరు, నాయకత్వ ఆశలు, సామాజిక సమీకరణాలు.. వెరసి ఢిల్లీలో ఇవాళ్టి కర్ణాటక కాంగ్రెస్ నేతల కీలక భేటీని అత్యంత కీలకంగా మార్చాయి. మరోవైపు.. రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలు కూడా దగ్గరలో ఉండటంతో, టికెట్ల పంపకం గురించీ చర్చించవచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఈ చర్చలు కర్ణాటకలో కేవలం పాలన మార్పుల గురించి కాకుండా.. కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని నిర్ణయించే స్థాయిలో ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కేసు విచారణ వాయిదా
దర్యాప్తు అధికారి డుమ్మా..హుబ్లీ: దర్యాప్తు అధికారి అంటుబాటులో లేని కారణంగా హరిహర పంచమసాలి పీఠం వచనానంద స్వామీజీ కేసు విచారణను వాయిదా వేశారు. స్వామీజీ సోమవారం హరిహర రూరల్ పోలీస్ స్టేషన్కు హాజరు కావాల్సి ఉంది. వేరే కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి హరిహర రూరల్ సీఐ సురేష్ తగరి కేంద్ర స్థానం నుంచి బయటకు వెళ్లిన కారణంగా కేసు విచారణ వాయిదా పడింది. విచారణకు సహకరించాలని సీఐ లిఖితపత్రాన్ని స్వామీజీకి పంపారు. ఇంతకు ముందు హరిహర పంచమసాలి పీఠం వచనానంద స్వామీజీపై పోక్సో కేసు నమోదైంది. హరిహర రూరల్ పోలీస్ స్టేషన్లో ఉదయం 10 గంటలకు మూడోసారి విచారణకు వచనానంద స్వామీజీ హాజరు కావాల్సింది. మఠంలోని హాస్టల్ విద్యార్థులపై శారీరకంగా హింసకు పాల్పడ్డారని స్వామీజీపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గదగ్ జిల్లాలో కేసు నమోదైంది. అక్కడి నుంచి హరిహర రూరల్ స్టేషన్కు కేసును బదిలీ చేశారు. బెయిల్ రద్దు కోసం రిట్ సీఐ సురేష్ తగరి నేతృత్వంలో దర్యాప్తు అధికారిణి ఎస్ఐ జయరత్నమ్మ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. అయితే పోక్సో కేసు దాఖలుకు ముందే స్వామీజీ ముందస్తు బెయిలు తీసుకున్నారు. బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు జిల్లా కోర్టులో రిట్ వేశారు. ఈక్రమంలో వచనానంద స్వామీజీని విచారణకు పిలిచి ఆరోగ్య పరీక్షలు చేయించారు. స్వామీజీ అసభ్యంగా తిట్టేవారని, హింస పెట్టేవారని స్వయంగా పిల్లలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాలల సంక్షేమ కమిటీ అధికారులు మఠానికి వెళ్లి స్వామీజీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. స్వామీజీపై మఠానికి చెందిన బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదైంది. కాగా తూర్పు రేంజ్ ఐజీ డాక్టర్ బీఆర్ రవికాంతేగౌడ సూచన మేరకు స్వామీజీపై పోక్సో కేసు దర్యాప్తు అధికారిణి సీఐ మంజులను ఎస్పీ డాక్టర్ హెచ్టీ శేఖర్ బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. -
అకృత్యాలపై ఉక్కుపాదం మోపండి
బళ్లారిటౌన్: జిల్లాలో ఎక్కువ అవుతున్న బాల్య వివాహాలు, మైనర్ల గర్భధారణ కేసుల నియంత్రణకు అధికారులు తగిన కఠిన చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీష్ సుమేర సూచించారు. సోమవారం నూతన జిల్లాధికారి కార్యాలయ భవన సభాంగణంలో జిల్లా స్థాయి సమన్వయ పరిశీలన సమితి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇలాంటి కేసులను సంపూర్ణంగా నియంత్రించి విద్యా, పౌష్టికాహారం, సామాజిక న్యాయం కల్పించాలన్నారు. డిసెంబర్ 2025 నుంచి మార్చి 2026 వరకు జిల్లాలో రెండు పోక్సో కేసులు, 92 బాల్య వివాహ కేసులు నమోదయ్యాయన్నారు. వీటిలో 80 కేసుల్లో పిల్లలను తల్లిదండ్రులను ఒప్పించి తగిన చర్యలు తీసుకున్నామన్నారు. 15 కేసులు మిగిలి ఉన్నట్లు జిల్లా బాలల సంరక్షణ శాఖాధికారిణి నందిని శిండే వివరించారు. సండూరు, సిడిగినమొళ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ జరపాలని అన్నారు. సండూరులో కేవలం 32 కేజీల బరువు ఉన్న 16 ఏళ్ల గర్భిణి మృతి చెందడం విచారకరమన్నారు. ఇలాంటి విషయాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాల నియంత్రణకు కేవలం చట్ట ప్రకారం చర్యలే కాకుండా గ్రామ స్థాయిలో కూడా జాగృతి కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయసేవ ప్రాధికారం కార్యదర్శి న్యాయమూర్తి రాజేష్ హొసమని, ఏఎస్పీ నవీన్కుమార్, డీఎస్పీ గోవిందరాజులు, అధికారులు రామకృష్ణ నాయక్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అధికారులకు జెడ్పీ సీఈఓ సూచన -
ఇంటింటికీ మంచినీరు అందించండి
హొసపేటె: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ప్రతి ఒక్కరికీ సురక్షితమైన తాగునీటిని అందించడం అనే బృహత్ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు జిల్లాధికారిణి కవిత పేర్కొన్నారు. సోమవారం నగరంలోని టీపీ కార్యాలయ విద్యారణ్య సభాంగణంలో ఏర్పాటు చేసిన నీటి పరీక్షలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. గ్రామీణ తాగునీటి, పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి జూన్ 10 వరకు జిల్లా వ్యాప్తంగా ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమం కొనసాగుతుందన్నారు. గ్రామాల్లో తాగునీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడం చాలా అవసరం అన్నారు. నీటి వనరులు కలుషితం కావద్దు వర్షాకాలం ప్రారంభమైనందున నీటి వనరులు కలుషితం కాకుండా నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ తమకు అందించిన కిట్లను సరిగ్గా ఉపయోగించుకోవాలన్నారు. నీటి నాణ్యతను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని కఠినంగా ఆదేశించారు. అపరిశుభ్ర, కలుషిత నీటిని తాగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపించే కలరా, కామెర్లు, అతిసారం వంటి వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అత్యవసరం అని అన్నారు. గ్రామ నీటి వనరుల్లో సరైన నిష్పత్తిలో క్లోరినేషన్ ప్రక్రియను చేపట్టాలన్నారు. స్వచ్ఛమైన తాగునీటి ప్రాముఖ్యతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కూడా సూచించారు. ప్రత్యేక నీటి పరీక్ష కిట్ల పంపిణీ తాలూకాలోని పీడీఓలందరికీ గ్రామ నీటి సరఫరా, ముఖ్యంగా ప్రతి రోజూ నీటిని సరఫరా చేసే కొళాయిల వద్ద ప్రత్యేక నీటి పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణ తాగునీటి, పారిశుధ్య శాఖ సీనియర్ రసాయన శాస్త్రవేత్త మొత్తం శిక్షణను ఆచరణాత్మక పద్ధతిలో నిర్వహించారు. కిట్ను ఉపయోగించి నీటిలోని ఫ్లోరైడ్, నైట్రేట్, క్లోరైడ్ కాఠిన్య స్థాయిలను అక్కడికక్కడే ఎలా గుర్తించాలో ఆమె ప్రదర్శించారు. టీపీ ఈఓ ఆలం బాషా, ఏఈఓ విజయ్కుమార్, జూనియర్ ఇంజనీర్లు సురేష్, నరేష్, సహాయక ఇంజనీర్ మహారుద్ర గౌడ, సీనియర్ కెమిస్ట్ అరుణ్కుమార్ హాజరయ్యారు. అధికారులకు జిల్లాధికారిణి సూచన జూన్ 10 వరకు జిల్లాలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం -
అక్క కెఫెతో మహిళల ఆర్థికాభివృద్ధి
రాయచూరు రూరల్: అక్క కెఫెతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జెడ్పీ యోజనాధికారి శరణ బసవ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని జిల్లా భవనంలో ఏర్పాటు చేసిన అక్క కెఫె మహిళా సంఘం పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఆర్థిక సహకారంతో పాటు ఉత్తమ రీతిలో పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. కెఫె ద్వారా స్వసహాయ మహిళా ప్రత్యేక కమిటీలను నియమించామన్నారు. రాయచూరు, లింగసూగూరుల్లో తల్లీబిడ్డల ఆస్పత్రిలో అక్క కెఫెతో ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. అక్క కెఫెలో వంటలు హోటల్ కంటే ఇంటి భోజనం మాదిరిగా ఉంటాయన్నారు. సమావేశంలో టీపీ ఈఓ చంద్రశేఖర్ పవార్, నాగరాజ్, శ్రీదేవిలున్నారు. ఆక్రమణల తొలగింపు రాయచూరు రూరల్: నగరంలో అక్రమ కట్టడాలను నగరసభ అధికారులు పోలీసుల సహకారంతో తొలగించారు. సోమవారం చంద్ర మహాబళేశ్వర సర్కిల్ నుంచి రోడ్డుకు కుడి, ఎడమ వైపున ఉన్న దుకాణాలను, కాలువపై స్థలాన్ని ఆక్రమించి కట్టుకున్న వాటిని తొలగించాలని నెల రోజుల క్రితం అక్రమ కట్టడాల యజమానులకు గడువు కల్పిస్తూ నోటీసులిచ్చారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరకు కార్యాచరణ చేపట్టారు. మురుగు కాలువపై స్థలాన్ని ఆక్రమించి దుకాణాలు, హోటళ్లు నిర్మించుకున్నారని, అలాంటి వారందరూ స్థలాలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసినా స్పందించక పోవడంతో వాటిని జేసీబీతో తొలగించారు. బాలికపై అత్యాచారం హుబ్లీ: ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ధార్వాడ లేఔట్లో చోటు చేసుకుంది. 9వ తరగతి చదివే 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఖాజాసాబ్ పఠాన్పై విద్యాగిరి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఖాజాసాబ్ నిన్ను ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా స్థానికులు ఖాజాసాబ్ను పట్టుకొని నిలదీశారు. అతడి మొబైల్ను పరిశీలించగా బాలికతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కనిపించాయి. ఘటనపై కేసు దర్యాప్తులో ఉంది. పాతకక్షతో.. కంప్యూటర్ క్లాస్కు వెళుతున్న బాలికను మాటలతో మభ్య పెట్టి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఘటన గదగ్ జిల్లా లక్ష్మేశ్వర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం 18 ఏళ్ల బాలికపై అల్లాబక్షి కొప్పద అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలిపై నిందితుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. బిగ్ బాస్ నటి కావ్యకు అవమానం ● కలబుర్గిలో వేదికపై హైడ్రామా ● అభిమానుల జోరుతో గందరగోళం రాయచూరు రూరల్: కలబుర్గిలో బిగ్ బాస్ సీరియల్ నటి కావ్యకు అవమానం జరిగింది. గత రాత్రి కలబుర్గిలోని పండిత రంగ మందిరంలో ఏర్పాటు చేసిన 12వ ఎపిసోడ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బిగ్ బాస్ సీరియల్ కావ్యను అభిమానులు హేళన పరిచేలా నడుచుకోవడంతో ఆమె కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. కార్యక్రమంలో అభిమానుల జోరు అధికం కావడంతో ప్రాయోజకులు అభిమానులపై చెయ్యి చేసుకోగా గందరగోళం నెలకొంది. దీంతో ఆమె అర్థాంతరంగా వెనుదిరిగారు. హక్కు పత్రాలివ్వాలని వినతి రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా సింగేరిదొడ్డి వాసులకు హక్కు పత్రాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కార్మిక సంఘం డిమాండ్ చేసింది. సోమవారం దేవదుర్గ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు మల్లనగౌడ మాట్లాడారు. తాగునీరు, రోడ్లు, విద్యుత్, పాఠశాల, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే కరెమ్మకు వినతిపత్రం సమర్పించారు. -
అంగన్వాడీలోనే సోదరి హత్య
● శిగ్గావిలో తమ్ముని కిరాతకం హుబ్లీ: సొంత సోదరి ప్రవర్తన బాగా లేదనే అనుమానంతో అంగన్వాడీలో ఉండగానే ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేసిన కిరాతక ఘటన హావేరి జిల్లా శిగ్గావి పట్టణంలో జరిగింది. సుమా శివశంకర్ వనహళ్లి (29) హతురాలు. శిగ్గావిలోని మౌలాలి గుడ్డలోని అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తోంది. సోమవారం ఉదయం 10:15 గంటలకు తమ్ముడు సంజు వచ్చీ రాగానే ఆమెను చితకబాది, కత్తితో చేతులు, గొంతు కోశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో పడిపోయింది, విలవిలలాడుతూ కొంతసేపటికే మరణించింది. అంగన్వాడీలోని పిల్లలు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితున్ని అరెస్టు చేసినట్లు తెలిసింది. హుబ్లీ ప్రాంతానికి చెందిన సుమ భర్తతో గొడవలొచ్చి ఒంటరిగా జీవిస్తోంది. పైగా తమ్మునితో ఆస్తి గొడవలు ఉన్నాయి. దీంతో అతడు హత్యకు పాల్పడినట్లు సమాచారం. -
గణపయ్యకు వెన్నభిషేకం
కోలారు: ముళబాగిలు తాలూకాలోని కురుడుమలై గ్రామంలో వెలసిన పురాణ ప్రసిద్ధ శ్రీ వినాయక దేవాలయంలో సోమవారం జేష్ట అధికమాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయం అభిషేకం, పూజల తరువాత సుమారు 14 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహాన్ని వెన్నతో అలంకరించారు. ప్రధాన అర్చకులు లోకనాథ్ దీక్షిత్ నేతృత్వంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు విఘ్ననాథున్ని దర్శించుకుని పునీతులయ్యారు. దర్శన్ కేసు కోర్టు మార్పు దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసును విచారణ బెంగళూరు సీసీహెచ్ కోర్టు నుంచి 59వ సెషన్స్ కోర్టుకు మార్చారు. కనీసం 60మంది ప్రముఖ సాక్షులను ఒక సంవత్సరం లోపు విచారించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని నిందితుడు, నటుడు దర్శన్ తరఫు లాయర్ బెంగళూరు సెషన్స్ కోర్టుకు అందించారు. సుప్రీం ఆదేశాల ప్రకారం కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలి. ఖైదీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి. వచ్చే ఏడాది మే లోపు కేసు విచారణ పూర్తి చేయకపోతే దర్శన్ బెయిలు కోసం రావచ్చని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టంచేసింది. కోర్టు మారడంతో విచారణ జడ్జి కూడా మారుతారు. ఘనంగా కరగాదమ్మ ఉత్సవాలు బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలో ఆనేకల్ తాలూకాలోని గెరటిగనబెలెలో 80 సంవత్సరాల తర్వాత గ్రామదేవతల ఉత్సవం జరుగుతోంది. ఆదివారం ప్రారంభమైన వేడుకలలో ఉత్తమ కరగాదమ్మ దేవి, బాలిగై కరగాదమ్మ దేవిల కరగ ఉత్సవం జరగనుంది. మహిళలు జ్యోతులను ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి వచ్చి సమర్పించారు. సోమవారం రాత్రి నుంచి దీపోత్సవం, కరగ వేడుక వైభవంగా సాగాయి. రాజ్యసభ సీటుపై సదానంద కన్నుమైసూరు: రాజ్యసభ సీట్ల కోసం బీజేపీలో పోటీ నెలకొంది. నేను కూడా రాజ్యసభకు వెళ్లాలని ఆశిస్తున్నాను అని మాజీ సీఎం డి.వి.సదానంద గౌడ చెప్పారు. సోమవారం మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ, ‘మేము, జేడీఎస్ ఒకే కూటమిలో ఉన్నాము. మాకు 63, జేడీఎస్కి 17 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. నన్ను రాజ్యసభకు పంపడం జాతీయ నాయకులు చూసుకుంటారు. రాజ్యసభ సీటు కోరుతున్నాను’ అని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షున్ని మార్చే ప్రతిపాదన మాకు లేదు, మరో ఏడాదిలో మూడేళ్ల పదవీకాలం ముగుస్తుందని, అప్పుడు ఆలోచిస్తారని అన్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ హిందూ వ్యతిరేక వైఖరితో ప్రజలు కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ యాభై సీట్ల కన్నా తక్కువకే పడిపోతుంది అని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే ప్రజలు ఇబ్బంది పడకుండా కేంద్రం చూసుకుంటోందని అన్నారు. వేడుకగా భగీరథ మహర్షి జయంతి తుమకూరు: ఉప్పార సముదాయం ఆధ్వర్యంలో తాలూకాలోని హుళికుంటె హోబళి కరేతిమ్మనహళ్లి గ్రామంలో భక్తిశ్రద్ధలతో శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను, గంగ పూజను నిర్వహించారు. మహిళలు పూల జ్యోతుల మధ్య మహర్షి చిత్రపటాన్ని ఉంచి ఊరేగింపు జరిపించారు. ఈ సందర్భంగా సముదాయ నేతలు మాట్లాడుతూ ఉప్పారలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని, ఎస్టీ హోదాను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసే కఠోర శ్రమనే ’భగీరథ ప్రయత్నం’ అంటారు. అటువంటి గొప్ప మహర్షికి వారసులుగా ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. -
పిడుగుపాటుకు ఒకరు బలి
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మరణించగా, 10 పశువులు బలి కాగా ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మస్కి తాలూకా పామన కల్లూరు ఫిర్కా పర్వతాపురలో నింగప్ప(38) పిడుగుపాటుతో మరణించారు. పొలంలో పని చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మస్కి శాసన సభ్యుడు బసనగౌడ తుర్విహాళ, ఎస్ఐ ఘటన స్థలాన్ని పరిశీలించారు. లక్ష్మి(28), రామయ్య(30) గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సింధనూరు తాలూకా సుల్తాన్పురలో హనుమంతు అనే రైతుకు చెందిన 250 బస్తాలు, తిప్పణ్ణకు చెందిన 250 బస్తాలు, నాగేష్కు చెందిన 150 బస్తాలు, లక్ష్మణ్ అనే రైతుకు చెందిన 250 బస్తాల ధాన్యం వర్షానికి తడిసిపోయింది. దాదాపు రూ.10 లక్షల మేర నష్టం సంభవించినట్లు రైతులు వాపోయారు. శాసన సభ్యుడు బసనగౌడ తుర్విహాళ మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 లక్షల పరిహారధనం చెక్ను అందించారు. ఇద్దరికి గాయాలు తడిసిన వరిధాన్యం -
నదిలో తీరని విషాదం
యశవంతపుర: ఉత్తర కన్నడ జిల్లా భట్కళ తాలూకా శిరాలి తట్టెహక్కలు వెంకటాపుర నదిలో ఆదివారం ఆల్చిప్పల కోసం వెళ్లి కొట్టుకుపోయి మరణించినవారి సంఖ్య 11కు పెరిగింది. ఆదివారం రాత్రి పొద్దుపోయాక మరో రెండు మృతదేహాలను, సోమవారం ఉదయం మరొకరి శవాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. సోమవారం ఉదయం మొత్తం 11 మంది మృతదేహాలను బంధువులకు అప్పగించారు. దీంతో బంధువులు రోదనలు మిన్నంటాయి. మృతదేహాల మీద పడి విలపించారు. సారదహొళె గ్రామ శివారులో జేసీబీతో పెద్ద గుంత తీసి సామూహికంగా ఖననం చేశారు. జిల్లా మంత్రి మంకాళు వైద్య నివాళులు అర్పించి కుటుంబాలకు సాంత్వన పలికారు. నదిలో ఆల్చిప్పలను వెతకడం సాధారణమని, ఇప్పుడే ఎందుకు జరిగిందో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. కాపాడాలని వెళ్లి... నదిలో మొదట మాస్తమ్మ నాయక కొట్టుకుపోతుండగా ఆమెను రక్షించడానికి కొడుకు ఉమేశ్ నాయక ప్రయత్నించాడు. కానీ అతడూ ప్రమాదంలో పడిపోయాడు. ఇలా ఒకరిని రక్షించాలని మరొకరు నీటిలో గల్లంతైనట్లు బతికి బయట పడిన మహిళ తెలిపారు. అనాఽథలైన పిల్లలు 9 కుటుంబాలకు చెందిన పిల్లలు తల్లి, లేదా తండ్రిని పోగొట్టుకున్నారు. మాదేవ నాయక, లక్ష్మీ ఇద్దరూ చనిపోగా వారి సంతానం దర్శన్, కీర్తన అనాథలయ్యారు. మరో మహిళ లక్ష్మీ శివరాం భర్త 10 ఏళ్ల క్రితం చనిపోయాడు, ఆమె ఇప్పుడు నదిలో మరణించింది. నలుగురు పిల్లలు రోడ్డునపడ్డారు. ఈ విషాదాలు గ్రామస్తులను కలిచివేశాయి. ఎప్పుడూ జరగని రీతిలో ఏటా ఏప్రిల్, మే నెలల్లో నదిలో ఆల్చిప్పలను వెతకడం ఇక్కడ పేదలకు వృత్తి. ఆల్చిప్పలు నీటిలో కొట్టుకు వస్తుంటాయి. వాటిని పట్టుకొని అమ్ముకుని కొంత సంపాదిస్తారు. 3 రోజులుగా వానలు కురిసి నది నిండి ప్రవహిస్తున్న సమయంలో లోతు తెలియక చాలా మంది దిగారు. చివరకు తీవ్ర విషాదం సంభవించింది. మొత్తం 11 మంది మృత్యువాత శోకసంద్రమైన గ్రామం -
జొన్న కొనుగోళ్ల బకాయిలు చెల్లించండి
రాయచూరు రూరల్: గత ఏడాది రైతుల నుంచి ఖరీఫ్ సీజన్లో జొన్నలు కొనుగోలు చేసిన వారు రైతులకు ఉన్న బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు అమీన్పాషా దిద్దిగి డిమాండ్ చేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 9 లక్షల క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేసిన సర్కార్ రైతులకు రూ.303 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. కేవలం 80 వేల క్వింటాళ్లకు రూ.32 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఆరు నెలలు గడిచినా నేటికీ రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయక పోవడాన్ని తప్పుబట్టారు. సెప్టెంబర్లో కొనుగోలు చేసిన వాటికి నేటికీ డబ్బులు ఇవ్వక పోవడంపై ఆందోళన చేపడతామన్నారు. ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నం ● నిందితుడిని పట్టుకున్న పోలీసులు హొసపేటె: నగరంలోని అనంతశయనగుడి సమీపంలోని శివశక్తి నగర్లో ఒక ఇంట్లో చోరీకి ప్రయత్నిస్తున్న దొంగను ఇంటి యజమాని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆదివారం రాత్రి శివశక్తి నగర్లో మత్తుగా తిరుగుతున్న ఒక వ్యక్తి ఓ ఇంటి గేటు దూకి దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. సీసీ టీవీలో గమనించిన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గ్రామీణ పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. హిందీ మాట్లాడే సదరు వ్యక్తి ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతూ గేటు దూకి లోపలికి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇంటి యజమాని సకాలంలో స్పందించడం వల్ల జరగబోయే దొంగతనాన్ని నివారించగలిగారు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ధర్నా రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక, హైస్కూలులో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఉద్యోగాకాంక్షుల పోరాట సమితి రాష్ట్ర సంచాలకుడు శరణ బసప్ప ఉద్బాళ్ డిమాండ్ చేశారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది 15 వేల నుంచి 20 వేల మంది వరకు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో నూతన ఉపాధ్యాయ పోస్టులను భభర్తీ చేయకుండా అతిథి ఉపాధ్యాయులతో కాలం గడపడం మానుకోవాలన్నారు. విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప నూతన ఉపాధ్యాయ నియామకాలకు పచ్చజెండా ఊపాలన్నారు. ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించాలన్నారు. డ్రిల్, చిత్రలేఖనం, సంగీత ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. విద్యా శాఖలో 79,694 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కళ్యాణ కర్ణాటకలో 22,595 మంది ఉపాధ్యాయులను నియమించుకోవాలన్నారు. జిల్లాలో 1,175 అతిథి, 1,066 ఉపాధ్యాయ పోస్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో చెన్నబసవ, వినోద్ కుమార్, వెంకటేష్, బసవరాజ్, కాశీనాథ్లున్నారు. పర్యాటకుని ఔదార్యం ● మొబైల్ను తిరిగిచ్చిన వైనం హొసపేటె: హంపీలో ఒక పర్యాటకుడు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను ఓ వ్యక్తి తిరిగి ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్న ఘటన జరిగింది. దక్షిణ కాశీ హంపీలోని ప్రపంచ ప్రసిద్ధ విరుపాక్ష ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన ముంబైకి చెందిన ఒక పర్యాటకుడు తన పర్యటన సమయంలో మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న ఆ మొబైల్ ఫోన్ బాషా సాహెబ్ అనే పర్యాటకునికి దొరికింది. అతను ఆ మొబైల్ ఫోన్ను హంపీ పోలీసులకు అప్పగించాడు. ఆ తర్వాత తన మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్న ముంబైకి చెందిన ఒక పర్యాటకుడిని కనుగొని అతనికి తిరిగి ఇచ్చారు. తన మొబైల్ ఫోన్ను తిరిగి పొందిన ముంబైకి చెందిన పర్యాటకుడు దానిని తిరిగి ఇచ్చిన తోటి పర్యాటకుడిని అభినందించాడు. పర్యాటకునికి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను తిరిగి ఇచ్చినందుకు పర్యాటక మిత్రుడు బాషా సాహెబ్ భారీగా ప్రశంసలు అందుకున్నారు. -
విమానాశ్రయ నిర్మాణానికి గ్రహణం
సాక్షి,బళ్లారి: జిల్లాలో పరిశ్రమల పేరుతో భూములను రైతుల వద్ద నుంచి నయానో, భయానో తీసుకున్న తర్వాత ఆయా పరిశ్రమలు నెలకొల్పకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సిరివార, చాగనూరు మధ్య రైతుల వద్ద విమానాశ్రయం నిర్మాణం కోసం తీసుకున్న భూమిలో విమానాశ్రయం నిర్మించకపోగా, మరో ప్రాంతానికి మార్పు చేస్తుండటంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న విమానాశ్రయ నిర్మాణంపై ఈ ప్రాంత ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. 2008లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గాలి జనార్దనరెడ్డి, మంత్రులు శ్రీరాములు తదితరులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిరివార, చాగనూరు వద్ద భూసేకరణ చేపట్టారు. దాదాపు 1000 ఎకరాలను వందలాది మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. సిరివార, చాగనూరు వద్ద విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, త్వరలో పూర్తి చేస్తామని పాలకులు, అధికారులు కాలయాపన చేస్తూ వచ్చారు. స్థల మార్పిడిపై జోరుగా ప్రచారం ఈ విషయంపై అసెంబ్లీలో ఎన్నోసార్లు చర్చ కూడా జరిగింది. అయితే సిరివార, చాగనూరు మధ్య విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టకుండా, స్థల మార్పిడి చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై సంబంధిత మంత్రి కూడా స్పందించి ఒక అడుగు ముందుకు వేశారు. బళ్లారి జిల్లా కుడితిని, దరోజీ సమీపంలో నూతన విమానాశ్రయ నిర్మాణం చేపడితే బళ్లారితో పాటు విజయనగర, కొప్పళ జిల్లా వాసులకు కూడా మేలు చేకూరుతుందని తెలపడం విశేషం. కుడితిని, దరోజీ సమీపంలో నూతన విమానాశ్రయానికి దాదాపు 2 వేల ఎకరాల భూమి అవసరం అవుతుండటంతో ఆ దిశగా పనులు చేపట్టేందకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. సిరివార, చాగనూరు వద్ద విమానాశ్రయ నిర్మాణానికి పదేళ్ల క్రితం భూమిపూజ చేసి పనులు ప్రారంభించి వదిలేశారు. ఇక్కడ ఏవిధంగా ప్రభుత్వం స్పందిస్తుందోనన్న విషయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కుడితిని, దరోజీ సమీపంలో విమానాశ్రయ నిర్మాణం జరిపితే ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీకి వచ్చే పర్యాటకులకు మేలు జరుగుతుందన్న వాదన ఉంది. అక్కడ నిర్మిస్తే హంపీ, అంజనాద్రిలకు మేలు శ్రీఆంజనేయ స్వామి జన్మస్థలమైన అంజనాద్రికి కూడా దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు, భక్తులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పుడు పూర్తి చేస్తారన్న దానిపై స్పష్టత లేకపోవడంతో కాలయాపన చేయడానికి ప్రభుత్వం ఏదో ఒక ప్రకటన చేస్తూ జనంలో చర్చ జరిగేలా చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే బళ్లారి జిల్లాలో పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని పరిశ్రమలు నిర్మించలేదని, రైతులు వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొని పరిశ్రమలు నిర్మించక, రైతుల వద్ద పొలాలు లేకుండా, వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో జిల్లాలో రైతు కుటుంబాలు వీధిన పడుతున్నాయి. భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నయానో, భయానో ప్రభుత్వానికి తక్కువ ధరకే భూములను అప్పగించేశారు. బళ్లారి నుంచి హొసపేటె మార్గ మధ్యలో వేలాది ఎకరాలను వివిధ పరిశ్రమల కోసం రైతుల నుంచి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కొనసాగుతున్న రైతుల పోరాటాలు ఒక పరిశ్రమ పేరు చెప్పి మరో పరిశ్రమకు అప్పగిస్తుండటంతో రైతులు పోరాటాలు చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పేది ఒకటి అయితే చేసేది మరోలా ఉంటోందని, దీంతో రైతులు నష్టపోతున్నారని, రైతు కుటుంబాలు వీధిన పడుతున్నాయని రైతు సంఘఽం నాయకులు ధ్వజమెత్తారు. పరిశ్రమల పేరుతో భూములు తీసుకున్న తర్వాత ఆ పరిశ్రమలు స్థాపించి, రైతు కుటుంబాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సింది పోయి రైతులను పక్కన పెట్టేస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరివార, చాగనూరు వద్ద రైతుల నుంచి తీసుకున్న భూములను కూడా విమానాశ్రయం కోసం తీసుకుని, ప్రస్తుతం స్థల మార్పు చేస్తామని ప్రకటించడంతో, మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను ఏ విధంగా ఉపయోగించుకుంటారని స్థానికులు మండిపడుతున్నారు. రైతులు వద్ద భూములను తీసుకున్నారు, విమానాశ్రయం నిర్మించలేదు, ప్రభుత్వం వద్ద భూమిని ఉంచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరివార, చాగనూరు మధ్య విమానాశ్రయం లేనట్లేనా? తాజాగా కుడితిని, దరోజీ సమీపంలో ఏర్పాటుకు సన్నాహాలు బళ్లారి, విజయనగర, కొప్పళ, జిల్లా వాసులకు అనుకూలం కోసం మార్పు రైతుల నుంచి తీసుకున్న భూములు దేనికి ఉపయోగిస్తారో మరి? పరిశ్రమల పేరుతో భూములు లాక్కోవడం పరిపాటిగా మారిన వైనం -
జల ముప్పును ఎదుర్కొనేలా..
యలహంక చెరువులో విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు బనశంకరి: వర్షాకాలం వస్తుండగా, యలహంకలో పలు ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా వచ్చే ముప్పును ఎదుర్కొనేలా రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ దళాలు సోమవారం యలహంక చెరువులో మాక్ డ్రిల్ నిర్వహించారు. త్వరలో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రుతుపవనాలు వస్తుండగా, ప్రజల్లో జాగృతం అవసరమన్నారు. రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే ముందే ప్రజలు ప్రాథమిక రక్షణ చర్యలు చేపట్టడం గురించి తెలుసుకోవాలని తెలిపారు. ముంగారు వర్షాల సమయంలో ఎన్డీఆర్ఎఫ్, నగరపాలికే అధికారులు, వివిధ శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఆయా శాఖల ఫోన్ నంబర్లు ప్రజల వద్ద ఉండాలన్నారు. వర్షాకాలంలో రోడ్ల భద్రత, వరద నివారణ తదితర చర్యలపై జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నీటిలో చిక్కుకున్న వారిని రబ్బరు బోట్లలో వెళ్లి కాపాడడం, సురక్షితంగా తరలించడం వంటి విన్యాసాలను ప్రదర్శించారు. యలహంక చెరువులో అత్యవసర దళాల రిహార్సల్స్ -
ప్రత్యేక విమానంలో సీఎం..
బనశంకరి: హైకమాండ్ పిలుపుతో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ సోమవారమే వేర్వేరుగా ఢిల్లీ బయలుదేరారు. సీఎం హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. శివకుమార్ కెంపేగౌడ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల విమానంలో వెళ్లారు. హైకమాండ్ సిద్దరామయ్య ను మాత్రమే ఆహ్వానించగా, డీసీఎం కూడా వెళ్లడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సీఎం వెంట ఆప్త మంత్రులు జీ.పరమేశ్వర్, ఎంబీ.పాటిల్, హెచ్సీ.మహదేవప్ప, బైరతి సురేశ్, కేజే.జార్జ్ ఉన్నారు. మంత్రి సతీశ్ జార్కిహొళి ఢిల్లీలోనే ఉన్నారు. మంత్రులతో సిద్దు బల ప్రదర్శన ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని సిద్దరామయ్య.. ఒకవేళ సీఎం మార్పును కోరితే, సీనియర్ మంత్రుల ద్వారా హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చేలా ఉన్నారు. పరోక్షంగా బల ప్రదర్శనతో ఢిల్లీకి వెళ్లారు. హోంమంత్రి పరమేశ్వర్ హోమం జరిపి బయల్దేరారు. నేడు ఉదయం 11 గంటలకు సిద్దరామయ్య హైకమాండ్ నేతలను కలుస్తారు. తమ్ముడు తోడుగా డీకే దేవనహళ్లి రిసార్ట్లో విశ్రాంతి తీసుకున్న శివకుమార్ తుమకూరులోని నోనవినకెరెకు వెళ్లి తన ఆరాధ్య దైవమైన అజ్జయ్యస్వామి పాదుకల దర్శనం చేసుకున్నారు. ఆదివారం కూడా పాదుకలను దర్శించుకున్నారు. సోమవారం రాత్రి 7:40 గంటలకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కారు. అన్న సూచనతో తమ్ముడు డీకే సురేశ్ ముందే హస్తినకు వెళ్లారు. -
కంప్లి వద్ద కొత్త రోడ్డు వంతెనకు మోక్షం
రాయచూరు రూరల్: కంప్లి– గంగావతి మధ్య తుంగభద్ర నదికి అడ్డంగా ఉన్న వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈనేపథ్యంలో కంప్లి వద్ద నూతన వంతెన నిర్మాణానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. రూ.100 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసి సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కంప్లి వద్ద వంతెన మీద నిత్యం వేలాది వాహనాలు సంచరిస్తుంటాయి. దీంతో కేఆర్డీసీఎల్ అధ్యక్షుడు అర్.జైప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సలహా సమితి సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. 65 ఏళ్ల క్రితం నిర్మించిన పాత వంతెన నేడు శిథిలావస్థకు చేరింది. ప్రతి ఏటా వర్షాకాలంలో తుంగభద్ర డ్యాం నుంచి నది గుండా భారీ ఎత్తున నీరు వదలడంతో కనీసం రెండు మూడు రోజుల పాటు వాహన రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో కంప్లితో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతుండేవారు. ఈ విషయంపై కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గణే్ష్ అసెంబ్లీలో చర్చించడంతో ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి పాత వంతెనను పరిశీలించిన తరువాత అనుమతించారు. కంప్లి వద్ద కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని రైతులు, ప్రజా సంఘాలు, ప్రజలు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో చివరికి సర్కార్ వంతెన నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ.100 కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం -
జూన్ 20 నాటికి గొలుసుల ఏర్పాటు పూర్తి
హొసపేటె: తుంగభద్ర జలాశయం భద్రత, ఆధునీకరణలో కీలకమైన క్రస్ట్గేట్లకు గొలుసులు అమర్చే పనులు వేగంగా జరుగుతున్నాయి. జూన్ 20 నాటికి అన్ని గేట్ల పనులు పూర్తవుతాయి. జలాశయానికి చెందిన మొత్తం 33 గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. పాత, తుప్పు పట్టిన గేట్ల సాంకేతిక వ్యవస్థను పూర్తిగా మార్చి పునరుద్ధరిస్తున్నారు. ఇప్పటికే రెండు గేట్లకు కొత్త గొలుసులు అమర్చారు. మే నెలాఖరు నాటికి మొత్తం 15 గేట్లకు గొలుసుల ఏర్పాటు పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే హెచ్ఆర్.గవియప్ప తెలిపారు. సోమవారం ఆయన తుంగభద్ర డ్యాంలో గేట్లకు చేపడుతున్న గొలుసుల ఏర్పాటు పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ప్రస్తుతం 17 గేట్లకు గొలుసులు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన గేట్ల గొలుసులు జూన్ మొదటి వారంలో అందుతాయి. ప్రతి గేటు బరువు 50 టన్నులు జలాశయం ప్రతి గేటు బరువు సుమారు 50 టన్నులు కాగా, దాని కోసం అమర్చిన ఒక్కొక్కటి 1.8 టన్నుల నుంచి 1.9 టన్నుల బరువు ఉన్న రెండు గొలుసులతో కలిపి మొత్తం బరువు సుమారు 55 టన్నులు ఉంటుంది. ఇంతటి పటిష్టమైన వ్యవస్థను చాలా సురక్షితంగా ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే 40 ఏళ్ల వరకు డ్యాం భద్రతకు ఢోకా లేదన్నారు. మూడు, నాలుగేళ్ల క్రితం డ్యాంపై సమగ్ర భద్రతా సర్వే నిర్వహించారు. ఎక్కడెక్కడైతే నీరు లీక్ అయిందో అక్కడ ఇప్పటికే గ్రౌటింగ్, ఇంజెక్టింగ్ ద్వారా మరమ్మతులు చేశారన్నారు. రాబోయే 40 ఏళ్ల వరకు జలాశయానికి ఎలాంటి సమస్య ఉండదని టీబీ బోర్డు అధికారులు సాంకేతిక హామీ ఇచ్చారు. ఈ భద్రతా నివేదికపై త్వరలో ఉపముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి డీకే.శివకుమార్తో చర్చించి సమీక్షించనున్నారు. ప్రత్యామ్నాయ నవలి కోసం సన్నాహాలు ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 30 టీఎంసీల పూడికతో నిండినందున ప్రత్యామ్నాయంగా నవలిని నిర్మించాల్సిన అవసరం పెరిగింది. సీడబ్ల్యూసీ అనుమతితో సహా కొత్త డ్యాం నిర్మాణానికి కనీసం 10 ఏళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలో కొప్పళ, రాయచూరు జిల్లాల రైతుల సాగునీటి ప్రయోజనాల దృష్ట్యా నవలి ప్రాజెక్టును ప్రారంభించాలని కోరుతూ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందంతో త్వరలో ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. టీబీ డ్యాం ఈఓ ఎన్.చంద్రశేఖర్, ఏఈఈ కే.జ్ఞానేశ్వర్, అసిస్టెంట్ ఇంజనీర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ సీఎం కుర్చీ రచ్చ
కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లడం, అదే సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆకస్మిక పిలుపు రావడం.. భారీ ఊహాగానాలకు దారి తీసింది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో కీలక చర్చలు జరిగే అవకాశం ఉండటంతో సీఎం మార్పు అంశం మళ్లీ కేంద్ర బిందువుగా మారింది.“కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగుతుందా?” అనే ప్రశ్న మరోసారి రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవర్షేరింగ్ ఫార్ములాతో ఈ ఇద్దరు కీలక నేతల మధ్య రాజీ కుదిరిందనే ప్రచారం గురించి తెలిసిందే. దానిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని డీకే వర్గం, సీనియర్ నేత నాయకత్వంలోనే ఐదేళ్లు ప్రభుత్వం పూర్తి చేసుకోవాల్సిందేనని సిద్దూ వర్గం అధిష్టానంపై ఒత్తిళ్లు దిగాయి. ఈ తరుణంలో ఇవాళ్టి భేటీలో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.సిద్ధరామయ్య వైఖరి ఏమిటి?ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గం ప్రస్తుతం “ప్రభుత్వ స్థిరత్వమే ప్రధాన లక్ష్యం” అనే వైఖరిని బలంగా వినిపిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలు, ప్రజాపాలన కార్యక్రమాలు కొనసాగాలంటే నాయకత్వ మార్పు అవసరం లేదని ఆయన వర్గం హైకమాండ్కు వివరించనున్నట్టు సమాచారం. “ప్రభుత్వాన్ని మధ్యలో మార్చడం వల్ల పాలనా స్థిరత్వం దెబ్బతింటుంది” అన్నది సిద్ధరామయ్య వర్గం ప్రధాన వాదనగా చెబుతున్నారు.డీకే శివకుమార్ వాదన ఏమిటి?మరోవైపు డీకే శివకుమార్ వర్గం మాత్రం “పార్టీకి ఇచ్చిన రాజకీయ హామీల అమలు” అంశాన్ని ముందుకు తెస్తోందని సమాచారం. 2023లో జరిగిన అనధికారిక ఒప్పందాల ప్రకారం నాయకత్వ మార్పుపై స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందని డీకే వర్గం భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో తన పాత్ర కీలకమని, అందుకే భవిష్యత్ నాయకత్వ బాధ్యతపై చర్చ జరగాలని ఆయన వర్గం అభిప్రాయపడుతున్నట్టు చెబుతున్నారు.ఢిల్లీ కేంద్రంగా నిర్ణయం?ఇప్పుడు మొత్తం వ్యవహారం ఢిల్లీ హైకమాండ్ చేతిలోకి వెళ్లింది. ఖర్గే, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో సిద్ధరామయ్య–డీకే మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను సమతుల్యం చేసే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తోంది. అయితే తక్షణ సీఎం మార్పు కన్నా, “పార్టీ అంతర్గత సమతుల్యత, భవిష్యత్ రోడ్మ్యాప్”పై నిర్ణయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రస్తుతం ఇది అధికారిక సంక్షోభం కంటే “పవర్ షేరింగ్ చర్చల పొడిగింపు”గానే కనిపిస్తోంది. కానీ ఢిల్లీ భేటీల తర్వాత తీసుకునే నిర్ణయం కర్ణాటక రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలోని మహాదేవపుర నియోజకవర్గం హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రాజేష్ ఆరాధ్య భార్య లక్ష్మీప్రియ (26) శుక్రవారం కృష్ణరాజపురలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. రాజేష్ ఆరాధ్య–లక్ష్మీప్రియల వివాహం 2023లో జరిగింది. రాజేష్ ఆరాధ్య, అతని తండ్రి పాలక్ష రాధ్య, తల్లి భాగ్యమ్మ తమ కుమార్తెను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని లక్ష్మీప్రియ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం లక్ష్మీ ప్రియ వాట్సాప్ ద్వారా తన సోదరి జయశ్రీకి ఫోన్ చేయగా ఆమె కాల్ స్వీకరించలేదు. ఆ తర్వాత రాజేష్ ఆరాధ్య ఆమెకు ఫోన్ చేసి లక్ష్మీ ప్రియ మరణించినట్లు తెలియజేశాడు. లక్ష్మీప్రియ కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సినిమా స్టైల్లో జైలు నుంచి ఎగ్జిట్ ఇచ్చిన జీవితఖైదీ
బెంగళూరు: ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశాలంటూ నకిలీ ఉత్తర్వులను చూపి ఓ ఖైదీ దర్జాగా విడుదలయ్యాడు. 8 ఏళ్ల తరువాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన జీవితఖైదీ శంకర్ ఆర్ముగం కథ ఇది. 2001లో బెంగళూరు వద్ద శంకర్ ఆర్ముగం ముఠా ఓ వ్యక్తిని కిడ్నాప్, హత్య చేసింది. ఈ కేసు సుదీర్ఘ విచారణ తరువాత బెంగళూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు శంకర్ ఆర్ముగంకు యావజ్జీవిత శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. దీంతో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో నుంచి బయటకు రావడానికి ఓ పథకం వేశాడు. అనారోగ్య కారణాల వల్ల విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ముద్ర, సంతకం ఉన్న నకిలీ రికార్డులను సృష్టించాడు. 2018 నవంబరు 13న రూ.10 వేల చలానా కట్టి కుటుంబ సభ్యులు అధికారులకు చెల్లించి నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వులను చూపించారు. అధికారులు నిజమే అనుకుని అతనిని విడుదల చేశారు. ఆకాశవాణి లేఖతో తెలిసింది ఇటీవల జైళ్ల శాఖ డీజీపీకి గుర్తుతెలియని లేఖ వచ్చింది. శంకర్ ఆర్ముగం నకిలీ రికార్డుల గురించి ప్రస్తావించారు. దీంతో జైలు అధికారులు విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు నుంచి అలాంటి విడుదల ఆదేశాలు రాలేదని స్పష్టమైంది. దీంతో అతని మీద స్థానిక పోలీసులకు జైలు అధికారులు ఫిర్యాదు చేయగా, గాలింపు చేపట్టారు. సుప్రీం ఉత్తర్వులు అనగానే ఖైదీని ఎలా విడుదల చేశారు, ఇందులో జైలు అధికారులు కుమ్మక్కయ్యారా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నామని జైలుశాఖ అధికారులు తెలిపారు. -
జింకను అమాంతం మింగిన కొండచిలువ.. వీడియో వైరల్
బెంగళూరు: మాండ్య జిల్లాలోని మళవల్లి తాలూకాలోని నెట్కల్ సమీపంలో బెంగళూరు వాటర్ బోర్డ్ నీటి పైప్లైన్ పక్కన ఉన్న అడవిలో ఒక భారీ కొండచిలువ జింకను మింగేసింది. భుక్తాయాసంతో అది కదలకుండా అక్కడే ఉండిపోయింది. స్థానిక యువకులు మొబైల్ ఫోన్లలో కొండచిలువను చిత్రీకరించారు. -
ఆయిల్ ట్యాంకర్లో గుట్టుగా స్పిరిట్ రవాణా
హుబ్లీ: ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా స్పిరిట్ రవాణా చేస్తున్న ముఠాను బెళగావి జిల్లా ఎకై ్సజ్ అధికారులు పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. కాణాపుర తాలూకా జాంబోటి గ్రామ సమీపంలో ఎకై ్సజ్ అధికారుల బృందం దాడి చేసి ఓ నిందితుడిని అరెస్ట్ చేసింది. అలాగే రూ.14 లక్షల విలువ చేసే 14 వేల లీటర్ల స్పిరిట్, రూ.21 లక్షల విలువ చేసే ట్యాంకర్, రూ.1,500 విలువైన మొబైల్ను జప్తు చేశారు. మైసూర్ జిల్లా నంజనగూడ తాలూకా ఎగ్గినబాలు గ్రామానికి చెందిన ట్యాంకర్ డ్రైవర్ సిద్దరాజును అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ ఎకై ్సజ్ అధికారులకు అనుమానం రాకుండా కొత్త తంత్రాన్ని ప్రయోగించింది. ట్యాంకర్ మూడు భాగాల్లో చిన్న చిన్న పైపులు అమర్చి అందులో మాత్రమే ఆయిల్ లోడ్ చేశారు. అధికారులు తనిఖీ చేసే సమయంలో కేవలం ఆ పైపుల్లో ఉన్న ఆయిల్ను చూపించి అక్కడి నుంచి ఉడాయిస్తారు. విశ్వాసనీయ సమాచారం మేరకు దాడి చేసిన ఖాణాపుర ఎకై ్సజ్ అధికారులు తనిఖీ వేళ అనుమానం వచ్చింది. తక్షణమే ట్యాంకర్లో ఉన్న ఆయిల్ పైపులను బయటకు తీసి క్షుణ్ణంగా పరిశీలించారు. లోపల వేలాది లీటర్ల స్పిరిట్ లోడ్ కనిపించింది. సామాన్యంగా గోవా నుంచి కర్ణాటక తదితర రాష్ట్రాలకు అక్రమంగా మద్యం రవాణా కేసులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఘారానా ముఠా బెంగళూరు రూరల్ జిల్లా నెలమంగల నుంచి గోవాకు ఈ స్పిరిట్ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమ దందాలో ఎవరెవరు ఉన్నారు? ఇందులో సూత్రధారి ఎవరు అనే దానిపై దర్యాప్తు చేపట్టాం.. త్వరలోనే కీలక నిందితులను అరెస్ట్ చేస్తామని ఎకై ్సజ్ అడిషనల్ కమిషనర్ డాక్టర్ వై.మంజునాథ వెల్లడించారు. దాడిలో అధికారులు జగదీశ్, విజయ్కుమార్ హిరేమఠ, నేతృత్వంలో రవి ముడగోడ, నూరుల్లాఖాన్, సునిల్ పాటిల్, తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా కరగ
మాలూరు: తాలూకాలోని మాస్తి ఫిర్కా కుప్పూరు గ్రామంలో ఆదివారం శ్రీ ధర్మరాయస్వామి, శ్రీ ద్రౌపతాంబ దేవి కరగ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కుప్పూరులో పురాతన ద్రౌపతాంబ దేవి దేవాలయంలో ఏటా కరగ వేడుక జరుగుతుంది. ఇదే మాదిరిగా శనివారం రాత్రి ఆవాలయం ముందున్న కళ్యాణి ప్రాంగణంలో కరగ పూజారిని ముస్తాబు చేశారు. మేళాతాళాల మధ్య కరగ పూజారి మల్లెలతో సింగారించిన కరగను ఎత్తుకుని గ్రామంలో ఊరేగారు. పెద్దసంఖ్యలో భక్తులు కరగ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం వరకూ వేడుక జరిగింది. జూన్లో మంగళూరుకు వందేభారత్ రైలు యశవంతపుర: బెంగళూరు–మంగళూరు వందేభారత్ రైలును జూన్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని రైల్వే శాఖ సహాయమంత్రి వీ.సోమణ్ణ తెలిపారు. మంగళూరు రైల్వే జంక్షన్ను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ఆరోజు దేశంలో పలు వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభిస్తారన్నారు. సుకలేశపుర–కుక్కే సుబ్రమణ్య మార్గంలో 55 కిలోమీటర్ల మేర ట్రాక్ విద్యుదీకరణ పనులు ముగిశాయి, బెంగళూరు–మంగళూరు మార్గంలో విద్యుద్దీకరణ పూర్తి కావలసి ఉందని మంత్రి తెలిపారు. వీకెండ్ సరదాలో విషాదం ● కరెంటు షాక్తో టెక్కీ మృతి యశవంతపుర: సరదాగా వీకెండ్ గడుపుదామనుకున్న టెక్కీ జలసమాధి అయ్యారు. నదిలో రబ్బరు బోటులో వేగంగా విహరించే సమయంలో అనూహ్యంగా కరెంటు షాక్ కొట్టి ఐటీ ఇంజనీరు మృతి చెందిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా జోయిడా తాలూకా గణేశగుడి వద్ద కాళీ నదిలో ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన మహేశ్ (27) మృతుడు. ఈయన బెంగళూరులో టెక్కీగా పనిచేసేవాడు. వీకెండ్ కావడంతో నలుగురు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఓ రిసార్ట్లో బసచేసి, అక్కడే నదిలో ర్యాఫ్టింగ్ చేయడానికి వెళ్లారు. నదిలో నుంచి పడవలోకి ఎక్కుతుండగా పక్కనే రిసార్టుకు చెందిన పెద్ద పంపుసెట్టు నుంచి కరెంటు నీటిలో ప్రసారమైంది. దీంతో మహేశ్కు షాక్ తగిలి నీట మునిగి మరణించాడు. మిగతావారికి కూడా షాక్ తగిలింది కానీ అంత ప్రభావం చూపించలేదు. అతని మృతదేహాన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. రాఫ్టింగ్ చేసే ప్రాంతాలలో ఇలాంటి పంపుసెట్ల అమర్చవద్దని స్థానికులు హెచ్చరించినా రిసార్ట్ యాజమాన్యం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రమాదంలోనూ చైన్ స్నాచింగ్ యశవంతపుర: యాక్సిడెంటులో తీవ్ర గాయాల పాలైన మహిళ మీద కనికరం లేకుండా ఆమె చైన్ను ఎత్తుకెళ్లారు. ఈ అమానుష సంఘటన ఉడుపి జిల్లా బైందూరు తాలూకా కొల్లూరులో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న కొల్లూరు వద్ద కేరకు చెందిన పర్యాటకులు ప్రయాణిస్తున్న జీపును చేపల లారీ ఢీకొంది. జీపులోని జ్యోతి, అరియా అనూఫ్లకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాదంతో వాహనాలు నిలిచిపోయి గందరగోళం ఏర్పడింది. ఈ సమయంలో ఎవరో అపస్మారకంలో ఉన్న జ్యోతి మెడలోని 18 గ్రాముల బంగారు చైన్ను తెంచుకున్నారు. తరువాత ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. బంగారు చైన్ పోయిందని బంధువులు కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఉత్తర కర్ణాటకకు భారీ వర్ష సూచన
హుబ్లీ: ఉత్తర కర్ణాటకలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా.. శనివారం రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రారంభం అయ్యాయి. ఉత్తర కర్ణాటకలోని కొన్ని జిల్లాలలో వరుణుడు విజృభించాడు. ఇదే పరిస్థితి మరో మూడు రోజులు కొనసాగనుంది. వ్యవసాయ పనులు చేసుకునే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. యాదగిరి, రాయచూరు, బాగలకోట, బళ్లారి, విజయనగర, దావణగెరె, చిత్రదుర్గ, తుముకూరు, చిక్కబళ్లాపుర, బెంగళూరు రూరల్, నగర జిల్లాలు, కోలారు, రామనగర, చామరాజ నగర, దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ జిల్లాలో ఆదివారం ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు కురిశాయి. -
కోట జాతరకు భక్తకోటి
బొమ్మనహళ్లి: కాఫీనాడు చిక్కమగళూరు నగరం కోట లో శ్రీగాలికెరేయ కెంచరాయ స్వామి జాతర వైభవంగా జరుగుతోంది. దేవదేవుల ఊరేగింపు, రంగు రంగుల దీపాలంకరణలు, వాయిద్యాల నాదం, భక్తుల కేరింతలతో కోలాహలం నెలకొంది. ఈ జాతర ప్రత్యేకత ఏమిటంటే, మల్నాడులోని ముగ్గురు కొండ దేవతల ఆశీస్సులు పొందిన తర్వాతే ఇది ప్రారంభమవుతుంది. కర్ణాటకలోని అత్యంత ఎత్తైన శిఖరమైన ముల్లయనగిరి పైన కొలువై ఉన్న శ్రీ ముల్లప్ప స్వామి సింహాసనం నుండి ఆశీస్సులు పొందిన తర్వాతే కెంచరాయ స్వామి జాతర ప్రారంభమవుతుందని భక్తులు నమ్ముతారు. కెంచరాయస్వామి విగ్రహాలను అలంకరించి ప్రతిష్టించగా భక్తసాగరం దర్శించుకుంది. 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. చిక్కమగళూరులో భక్తి ఉత్సవం -
కార్పొరేటర్ భర్తతో పాటు 13 మందిపై కేసు
సాక్షి బళ్లారి: అధికారం చేతిలో ఉంది కదా అని బరితెగించి వంక పొరంబోకు భూమిని ఆక్రమించి సైట్లు వేసి విక్రయించిన కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త శివరాజుతో పాటు 13 మందిపై కేసు నమోదైంది. మూడు రోజుల క్రితం సిటీ కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు మెరుపు దాడి చేసి నగరంలోని 7వ వార్డు పరిధిలోని బాపూజీ నగర్ సమీపంలోని వంక పొరంబోకు భూమి ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకున్నారు. బాధితులు తాము డబ్బు ఇచ్చి స్థలాలు కొనుగోలు చేశామని రెవెన్యూ అధికారులతో కంటతడి పెట్టుకున్నారు. ఒక్కో స్థలానికి రూ.2 లక్షలు ఇచ్చి స్థలాలు కొనుగోలు చేశామని అధికారులతో చెప్పారు. సమగ్ర దర్యాప్తు చేసిన అధికారులు స్థానిక కార్పొరేటర్ భర్త శివరాజుతో పాటు 13 మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంలో తమ ప్రమేయం లేదని కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త పేర్కొనడం గమనార్హం. నగరంలో పలు ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపి స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఎత్తిపోతల పథకాలతో రైతులకు మేలు రాయచూరు రూరల్: రైతుల సంక్షేమానికి ఎత్తిపోతల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ దద్దల్, యాదగిరి జిల్లా సురుపుర శాసన సభ్యుడు రాజా వేణుగోపాల నాయక్ పేర్కొన్నారు. యాదగిరి జిల్లా సురుపుర తాలుకా తీర్థక్రాస్ బూదిహళ పీరాపూర్ వద్ద ఎత్తిపోతల పథకానికి అనుమతి లభించిందని తెలిపారు. ఆదివారం తీర్థక్రాస్ వద్ద ఇందుకు సంబంధించిన పనులపై అధికారులతో చర్చించారు. రూ.150 కోట్లతో 1,000 ఎకరాల భూమికి నీరందించే పథకానికి సంబంధించి పనులను పరిశీలించారు. గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ నియోజక వర్గం మటమారి వీరభద్రేశ్వర ఎత్తిపోతల పథకానికి సర్కార్ రూ.182 కోట్లతో 16000 ఏకరాలు భూమికి నీరందించే పథకానికి అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ధరలు పెంచడం సరికాదు కెజీఎఫ్: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం దుర్మార్గం అని సీపీఎం కార్యకర్తలు మండిపడ్డారు. ఆదివారం నగరంలోని అండర్సన్ పేట సర్కల్ వద్ద ప్రతిఘటన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ నగరసభ సభ్యుడు తంగరాజ్ మాట్లాడుతూ.. యుద్ధ నెపంతో కేంద్రం ఇష్టారాజ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు జీవించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తీగా విఫలమైందని ఆరోపించారు. కారులో బెంగుళూరుకు వెళ్లే ఎమ్మెల్యే రూపా శశిధర్కు రైలులో ప్రయాణించే కష్టాలు ఎలా తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు నాణ్యతగా చేపట్టాలి కోలారు: నగరంలోని సి.భైరేగౌడ కాలనీలో సుమారు రూ.8 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఒక్కలిగ సముదాయ విద్యార్థినుల హాస్టల్ వసతి నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించండి. సాధ్యమయితే రీ టెండర్ చేయాలని ఒక్కలిగ సంఘం పదాధికారులు తీర్మానం చేశారు. ఆదివారం నగర సమీపంలోని ప్రైవేట్ రిసార్టులో ఒక్కలిగ హాస్టల్ నిర్మాణానికి సంబంధించి సమస్యలపై చర్చించారు. ప్రస్తుత కాంట్రాక్టర్ పనులను సక్రమంగా నిర్వహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. సంఘం రాష్ట్ర డైరెక్టర్ కలుగజేసుకుని దీనిని సరి చేయాలన్నారు. సమావేశంలో ఒక్కలిగ సంఘం రాష్ట్ర డైరెక్టర్ కోనప్పరెడ్డి, సముదాయ ప్రముఖులు ఆర్.ప్రభాకర రెడ్డి, సీసంద్ర గోపాలగౌడ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత విద్యావంతులుగా ఎదగాలికోలారు: విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా బాగా చదువుకుని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ తెలిపారు. ఆదివారం నగరంలో చన్నయ్య రంగమందిరంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.103 కోట్ల నిధులను జిల్లాలో కళాశాలల అభివృద్ధికి మంజూరు చేసిందని తెలిపారు. జిల్లాలో కళాశాలల అభివృద్ధికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి భైరతి సురేష్, ఉన్నత విద్యా శాఖ మంత్రి ఎం.సి.సుధాకర్ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఎంపీ ఎం.మల్లేష్ బాబు మాట్లాడుతూ.. మహిళా కళాశాల విద్యార్థినులు చదువులో, క్రీడల్లో రాణిస్తుండడం సంతోషించదగిన విషయమన్నారు. నేడు మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో రాణించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎం.ఎల్.అనిల్ కుమార్ మాట్లాడుతూ.. కోలారులో మహిళా కళాశాలకు ఒక ఇతిహాసం ఉందన్నారు. ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్య అందుతోందన్నారు. -
ప్రభుత్వ కార్యాలయంలో జల్సాలపై ఆగ్రహం
●ముగ్గురు అధికారులు సస్పెండ్ రాయచూరు రూరల్: ప్రభుత్వ కార్యాలయంలో జల్సాలపై అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలు చేసే దేవాలయాలుగా భావించే సర్కారు కార్యాలయాలను కొంతమంది అధికారులు వాటిని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించారు. రాయచూరు జిల్లా లింగసూగురులో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం కార్యాలయంలో మందు పార్టీలు చేసుకున్నారు. రాత్రి వేళ్లలో అధికారులు పార్టీలు చేసుకుంటూ క్లబ్గా మార్చేయడంతో ఉన్నత స్థాయి అధికారులు స్పందించారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఏఈఈ హనుమప్ప, సిబ్బంది రామణ్ణ పూజారి, హనుమంతును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనంహొసపేటె: హొసపేటె తాలూకా కమలాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1999–2002 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం స్నేహ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు విశ్వమూర్తి మాట్లాడుతూ.. ఒక ఉపాధ్యాయునికి లభించే ఈ గౌరవం ప్రపంచంలోని ఏ వృత్తిలోనూ ఎవరికీ లభించదన్నారు. మీకున్న జ్ఞానాన్ని రోజురోజుకూ పెంచుకుంటూ పోతే అది పరిపక్వంగా నిలుస్తుందని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధే ఉపాధ్యాయుడి నిజమైన విజయం అన్నారు. మంచి విద్యార్థులు మంచి ఉపాధ్యాయులు కాగలరన్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇప్పుడు పిల్లలలో సంస్కారం తగ్గిపోతోందన్నారు. మీరు చేసే విధంగానే మీ పిల్లలలో సంస్కార బీజాలు నాటండి. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించడం వారికి నేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సురేఖ, సుధ, వీరేశ్, భారతి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆధునిక ముస్లిం లీగ్హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం వివిధ 52 కేసులను రద్దు చేయడం ద్వారా మతాంధ శక్తులకు ప్రోత్సాహం అందిస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. ఆదివారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఇది కాంగ్రెస్ బుజ్జగింపు కుహాన రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. కాంగ్రెస్ ఆధునిక ముస్లిం లీగ్ పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కాక్రోచ్ భయం కాంగ్రెస్కే కానీ బీజేపీకి లేదని తేల్చి చెప్పారు. కాక్రోచ్ జనతా పా ర్టీ ఉన్న ఫలంగా పుట్టుకు రావడం వల్ల కాంగ్రెస్ భయపడుతోందన్నారు. దేశంలో కాంగ్రెస్ ఇప్పటికే పూర్తిగా మనుగడ కోల్పోయిందని తెలిపారు. ఈతకెళ్లి బాలుడు మృతిరాయచూరు రూరల్: స్నేహితులతో కలసి సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు నీటమునిగి మృతి చెందిన ఘటన బెళగావి జిల్లా అథణిలో చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం సమర్థ పనాళకర్ (16) మిత్రులతో కలసి ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే క్రమంలో లోతైన ప్రాంతానికి వెళ్లి నీట మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. పనాళకర్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గుండెపోటుతో ఉపాధి కూలీ మృతిరాయచూరు రూరల్: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన రాయచూరు జిల్లా దేవదుర్గ తాలుకా చించోడిలో చోటు చేసుకుంది. ఆదివారం ఉపాధి పనికి వెళ్లిన నాగప్ప (56)కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలి పోయాడు. చికిత్స నిమిత్తం జాళ్లహళ్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. జాళ్లహళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్టదా?
రాయచూరు రూరల్: ప్రాంతీయ అసమానతలతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం గతంలో హైదరాబాద్–కర్ణాటక అభివృద్ధి మండలి ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయిందని సాహితీవేత్త ఆర్కే హుడిగి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో హైదరాబాద్–కర్ణాటక జనాందోళన ఆధ్వర్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(జె)అమలు విషయంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉద్యోగం తదితర రంగాల్లో ఇతర ప్రాంతాలతో సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మండలి పేరుకే పరిమితమైందని ఆరోపించారు. కళ్యాణ కర్ణాటక పరిధిలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయనగర జిల్లాలకు నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. బడ్జెట్లో ఏటా రూ.1,000 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పి మొసం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాఘవేంద్ర కుష్టిగి, బసవరాజ్, నాగన గౌడ, చామరస మాలి పాటిల్, బసన గౌడ, గంగాధర నాయక్, రజాక్ ఉస్తాద్, జాన వెస్లీ, ధనరాజ్, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. -
గాలీవాన హోరు
హొసపేటె: జిల్లాలోని హొసపేటె, కూడ్లిగి, కొట్టూరు తాలూకాలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. హొసపేటె తాలూకా ధర్మసాగర్ గ్రామంలో కే.తిమ్మనగౌడ ఇంటి ప్రహరీ కూలిపోయింది. పలువురు ఇళ్లలోకి నీరు చేరింది. ఇంట్లోని విత్తనాలు, ఎరువులు కొట్టుకుని పోయాయి. అదే విధంగా తాలూకాలోని భువనహళ్లి, గాదిగనూరు గ్రామాల్లో రైతుల పొలాలు, విద్యుత్ కేంద్రంలోకి నీరు చేరింది. కొట్టూరు తాలూకా, ఉజ్జినిలోని కేఈబీ విద్యుత్ కేంద్రంలోకి నీరు చేరడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో ప్రజలు చీకట్లో ఉండిపోయారు. అలాగే నగరంలోని మురికి వాడల్లోని ఇళ్లలోకి నీరు చేరి, భారీ నష్టం కలిగించింది. బైలువద్దిగేరి గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. హొసపేటె–బళ్లారి మధ్య జాతీయ రహదారి–67 పై జరుగుతున్న రోడ్డు పనుల్లో జాప్యం కారణంగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. నీరు తొలగింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో గాదిగనూరు గ్రామస్తులు రహదారిపై నిలబడి నిరసన చేపట్టారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. పిడుగుపాటుకు ఎద్దులు, మేకల మృతి రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా రహదారులు బురదమయం అయ్యాయి. గాంధీ చౌక్, మూన్నూరు వాడి, నగరంలో కూరగాయల మార్కెట్లోకి వర్షపు నీరు చేరింది. అరికెరలో పిడుగు పాటుకు రెండు ఎద్దులు, ఐదు మేకలు మృతి చెందాయి. అలాగే సింధనూరు తాలుకాలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. నిప్పు రవ్వలు పడటంతో గడ్డివాములు కాలిపోయాయి. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు మఠాధిపతి సుబుదేంద్ర తీర్ధ శ్రీ పాదంగల్ కళ్యాణ మంటపం తాళాలు తెరపించి వసతి సౌకర్యం కల్పించారు. -
పబ్లిక్లో మొబైల్ చార్జింగ్.. చేజేతులా కష్టాలు
బనశంకరి: విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్, బస్టాండ్లతో పాటు పబ్లిక్ ప్రదేశాల్లో అమర్చిన యుఎస్బీ చార్జింగ్ సాకెట్లలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను చార్జింగ్ పెట్టరాదని సైబర్ క్రైం పోలీసులు సలహా ఇచ్చారు. ఇలా చార్జింగ్ పెట్టడం వల్ల మొబైల్ లేదా ల్యాప్టాప్లోని ఫోటోలు, వీడియోలు, బ్యాంక్ అకౌంట్లు, ఆన్లైన్ పేమెంట్ యాప్ల వివరాలు సహా వ్యక్తిగత సమాచారం సైబర్ వంచకుల చేతుల్లోకి వెళుతుందని హెచ్చరించారు. దీనిని మాల్వేర్ ప్రమాదం, జ్యూస్ జాకింగ్ అనే పేరుతో వర్ణించింది. తద్వారా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులో దోచేస్తారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు ఉంటే వాటి ద్వారా బ్లాక్మెయిలింగ్కు పాల్పడే ప్రమాదముంది. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆధార్, పాన్ కార్డు వంటివాటిని ఉపయోగించి ఆర్థిక లావాదేవీలు, నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిస్తే మరింత తీవ్ర ముప్పు తప్పదు. వ్యక్తిగత సమాచారాన్ని డార్క్వెబ్లోనూ విక్రయాలకు ఉంచి సొమ్ము చేసుకుంటారు. సొంత చార్జర్, పవర్ బ్యాంక్ మేలు బయట ప్రదేశాల్లో సొంత చార్జర్ ద్వారా చార్జింగ్ చేసుకోవడం, లేదంటే పవర్బ్యాంకును ఉపయోగించడం మేలు. ప్రయాణాలు చేసేవారు పవర్బ్యాంక్ దగ్గర ఉంచుకోవాలి. పబ్లిక్ యుఎస్బీ ద్వారా చార్జింగ్ చేస్తే.. యుఎస్బీ డేటా బ్లాకర్ సాధనం వాడాలి. మొబైల్ చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ తెరపై అలో డేటా యాక్సెస్ అని అడిగితే తిరస్కరించాలని సూచించారు. -
జీన్స్ పరిశ్రమ కుదేలు
విద్యుత్ కోతలతో ● బళ్లారిలో రోజుకు నాలుగైదు గంటలు విద్యుత్ బంద్ ● మూతపడుతున్న పరిశ్రమలు ● ఉపాధి కోల్పోతున్న వేలాది మంది కార్మికులు ● పట్టించుకోని పాలకులు, అధికారులు సాక్షి, బళ్లారి: చారిత్రాత్మక ప్రాధాన్యంతో పాటు అపార ఇనుప ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందిన బళ్లారి, జీన్స్ దుస్తుల తయారీలో కూడా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ తయారయ్యే జీన్స్ దుస్తులు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. జీన్స్ పరిశ్రమలో పని చేసే యువతీ, యువకులు రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదిస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. నగరంలో అనేక మంది తమ ఇళ్ల వద్దనే జీన్స్ ప్యాంట్లు, ఇతర దుస్తులు కుట్టి ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమ యజమానులు మెటీరియల్ను కార్మికుల ఇళ్లకే అందజేయడంతో ఇంటి వద్ద నుంచే పని చేసే అవకాశం కలుగుతోంది. సంక్షోభంలో జీన్స్ పరిశ్రమ అయితే ఇటీవల పెరిగిన విద్యుత్ కోతలు జీన్స్ పరిశ్రమను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. నగరంలో రోజూ నాలుగు నుంచి ఐదు గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుండటంతో పరిశ్రమలు సక్రమంగా నడవడం లేదు. ఎప్పుడు విద్యుత్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీన్స్ తయారీలో కీలకమైన వాషింగ్ యూనిట్లు పూర్తిగా విద్యుత్పైనే ఆధారపడి ఉంటాయి. జీన్స్కు రంగు, మెత్తదనం, డిజైన్, ఫినిషింగ్ ఇచ్చే భారీ యంత్రాలు విద్యుత్ లేకపోతే పని చేయవు. దీంతో అనేక యూనిట్లు పనులు నిలిపివేయాల్సి వస్తోంది. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు కొంతమంది జనరేటర్లతో పరిశ్రమలను నడిపిస్తున్నప్పటికీ డీజిల్ ఖర్చులు పెరగడంతో ఉత్పత్తి వ్యయం అధికమవుతోందని యజమానులు చెబుతున్నారు. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అవసరమైన కెమికల్స్ దిగుమతిలో సమస్యలు నెలకొన్నాయి. ఇప్పుడు విద్యుత్ కోతలు కూడా తోడయ్యాయి. దీంతో జీన్స్ పరిశ్రమ మరింత కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేయడంతో మిషన్లు ఆగిపోతున్నాయి. గంటల తరబడి పనిలేక ఎదురుచూడాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు. జీన్స్ దుస్తులు కుడుతున్న కార్మికులు దుకాణంలో జీన్స్ ప్యాంట్ల విక్రయాలుఉపాధి కోల్పోయే పరిస్థితి విద్యుత్ సమస్యల కారణంగా వందలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. బళ్లారితో పాటు విజయనగర, రాయచూరు, కొప్పళ, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన యువత కూడా ఇక్కడే స్థిరపడి ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. నగరంలో 60కు పైగా జీన్స్ యూనిట్లు ఉన్నాయి. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించాలి. జీన్స్ షాపుల యజమానులు, కార్మికులు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. – జయలక్ష్మి, పాయింట్ బ్లాంక్ జీన్స్ కంపెనీ ఎండీ -
బెంగాల్ తరహా పోరాటమే శరణ్యం
సమావేశంలో పాల్గొన్న సీనియర్ నాయకులు నితిన్ నబిన్కు శ్రీకృష్ణ విగ్రహాన్ని బహూకరిస్తున్న నేతలుబనశంకరి: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలతో బీజేపీ అధికారంలోకి వస్తుందనే భ్రమలో ఉండరాదని, బెంగాల్లో మాదిరిగా పోరాటం చేయాలని పార్టీ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సూచించారు. ఆదివారం బెంగళూరు మల్లేశ్వరంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. కలిసికట్టుగా పనిచేయాలి పార్టీ చీఫ్ హోదాలో తొలిసారి వచ్చిన సందర్భంగా కీలకోపన్యాసం చేశారు. రాష్ట్ర బీజేపీ పనితీరుపై పరోక్షంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇకపై కిందిస్థాయి నుంచి పోరాటం చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు, నేతలు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలపై వివరించాలన్నారు. పశ్చిమ బెంగాల్ తరహాలో పార్టీ బలోపేతం, పోరాటం సాగించాలని స్పష్టం చేయడం గమనార్హం. ఏ పోరాటమైనా అందరూ కలిసికట్టుగా నిర్వహించాలి, బూత్ స్థాయి నుంచి మొదలు పెట్టాలి, బెంగాల్ తరహాలో కార్యకర్తలు, నేతలు గ్రౌండ్లోకి దిగి పార్టీని బలోపేతం చేయాలి. నేడే ఎన్నికలు అనే మాదిరిగా చురుకుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని ఉద్బోధించారు. అలా చేస్తేనే గ్రేటర్ బెంగళూరు ఎన్నికలలో గెలుపొందవచ్చు, గ్రేటర్లో గెలిస్తే రానున్న శాసనసభ ఎన్నికల్లో విజయం సులభమౌతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని రాబోయే శాసనసభ ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు. కేవలం మీడియా ప్రకటనలు, పోస్టులకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయి నుంచి పోరాటమే ప్రధానమ్నారు. కాంగ్రెస్ సర్కారు విఫలం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, ప్రతి మంత్రి అవినీతిలో నిమగ్నమయ్యారని, సీఎం కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని నితిన్ దుయ్యబట్టారు. ధరలు పెరిగాయని, ప్రజల జీవితానికి గ్యారంటీ లేదని, శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలు అదృశ్యం అవుతున్నారని ఆరోపించారు. సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లను తొలగించకుండా నిఘా పెట్టాలని నితిన్ నబిన్ సూచించారు. మాజీ సీఎం యడియూరప్ప, రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, సీనియర్లు అశోక్, శ్రీరాములు, ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు పార్టీ చీఫ్ నితిన్ నబిన్ పిలుపు పార్టీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష -
పోలీస్ క్వార్టర్స్లో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య.. ఏం జరిగింది?
బెంగళూరు: కర్ణాటకలో ఓ పోలీసు కానిస్టేబుల్ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే, ఆమె మృతికి ముందు తన చెల్లికి ఫోన్ పాస్వర్డ్ పంపించడం గమనార్హం. ఆ తర్వాత కాసేపటికే ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, భర్త, అత్తమామలు కలిసి ఆమెను అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు మృతురాలి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన లక్ష్మీ ప్రియ (26)కు మైసూర్ నివాసి అయిన రాజేష్ ఆరాధ్యతో మే 11, 2023న వివాహం జరిగింది. రాజేష్ బెంగళూరులోని హెచ్ఏఎల్ (HAL) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. బెంగళూరులోని కేఆర్పుర ఏరియాలోని పోలీస్ క్వార్టర్స్లో వీరు నివాసం ఉంటున్నారు. కాగా, పెళ్లయిన కొద్ది రోజుల నుండే భర్త రాజేష్, మామ పాలక్షారాధ్య, అత్త భాగ్యమ్మ కలిసి అదనపు కట్నం కోసం లక్ష్మీ ప్రియను వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఎనిమిది నెలల క్రితం లక్ష్మీ ప్రియ ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన ఆమె, దాదాపు ఆరు నెలల పాటు అక్కడే ఉండి, ఇటీవలే తిరిగి బెంగళూరులోని పోలీస్ క్వార్టర్స్కు వచ్చింది.ఇంతలో.. మే 22, 2026 మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో లక్ష్మీ ప్రియ తన చెల్లెలు జయశ్రీకి వాట్సాప్లో ఒక మెసేజ్ పంపింది. అందులో తన మొబైల్ ఫోన్ 'పాస్వర్డ్'ను షేర్ చేసింది. సాధారణంగా కాకుండా అకస్మాత్తుగా ఫోన్ పాస్వర్డ్ పంపడంతో చెల్లెలికి అనుమానం వచ్చి, వెంటనే అక్కకు ఫోన్ చేసింది. కానీ లక్ష్మీ ప్రియ ఎంతకీ ఫోన్ ఎత్తలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే లక్ష్మీ ప్రియ భర్త రాజేష్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే లక్ష్మీ ప్రియ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని రాజేష్ వారికి సమాచారం అందించాడు.అయితే, చనిపోయే ముందు ఫోన్ పాస్వర్డ్ చెల్లికి పంపడం, అప్పటికే ఇంట్లో వేధింపులు జరుగుతుండటంతో.. ఇది ఆత్మహత్య కాదని, లక్ష్మీ ప్రియ మృతి వెనుక భర్త, అత్తమామల హస్తం ఉందంటూ పుట్టింటి వారు గట్టిగా నమ్ముతున్నారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేఆర్ పుర పోలీసులు కానిస్టేబుల్ రాజేష్, అతని తల్లిదండ్రులపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీస్ క్వార్టర్స్లోనే కానిస్టేబుల్ భార్య ఇలా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. -
ఏడాది జైలుశిక్ష.. ఒక్కరోజుతో సరి
బెంగళూరు: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అందుకు కారకులు పరారవుతుంటారు. కానీ ఓ డ్రైవరు గాయపడినవారిని తన కారులోనే ఆస్పత్రికి తీసుకెళ్లినందుకు, మరింత పరిహారం ఇస్తానన్నందుకు హైకోర్టు శిక్షను తగ్గించింది. వివరాలు.. దక్షిణ కన్నడ జిల్లా పక్షికెర నివాసి, డ్రైవరు రియాజ్ అహ్మద్ కారులో వెళ్తూ ఓ బైకిస్టును ఢీకొనడంతో గాయపడ్డాడు. అతనిని తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ బాధితుడు చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి చార్జిïÙటు దాఖలు చేశారు. స్థానిక కోర్టు రియాజ్కు ఏడాది జైలు శిక్ష విధించింది. తరువాతి రోజుల్లో రియాజ్ గాయపడి, చేతికి రాడ్ వేయించుకున్నాడు. డ్రైవరు వృత్తి చేయలేక కూలిపనులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శిక్షను రద్దుచేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయమూర్తి జస్టిస్ వీ.శ్రీషానంద విచారించారు. నిందితుని పరిస్థితిని చూసి, బాధిత కుటుంబానికి మరింత పరిహారం ఇస్తే శిక్ష తగ్గిస్తానని తెలిపారు. రూ. లక్ష ఇవ్వడానికి నిందితుడు అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఏడాది కారాగార శిక్షను ఒక్కరోజుకు జడ్జి తగ్గించారు. జూన్ 30లోగా పరిహారం చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే, సంవత్సరం శిక్ష తప్పదని జడ్జి హెచ్చరించారు. -
యువతిపై 15 వీధి కుక్కల దాడి
యశవంతపుర: బెంగళూరు లో వీధి కుక్కల బెడద రోజురోజుకు అధికమవుతోంది. రోడ్డుపై నడిచి వెళుతున్న మేఘన అనే యువతిపై వీధి కుక్కలు దాడికి యతి్నంచిన ఘటన రామమూర్తి నగరలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హొయ్సళ నగరలో గురువారం రాత్రి యువతి ఫోన్లో మాట్లాడుతూ నడిచి వెళుతుండగా 15 వీధి కుక్కలు ఆమెను వెంబడించాయి. తప్పించుకోవడానికి యువతి పరుగులు తీసింది. మేఘన కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు కుక్కలను తరిమివేసి ఆమెను రక్షించారు. ఈ సంఘటనలో ఆమెకు చిన్నచిన్న గాయాలయ్యాయి. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.A female student was injured after being attacked by a pack of more than 15 stray dogs in Bengaluru’s Hoysala Nagar area near Ramamurthy Nagar, triggering panic among local residents and students.The incident, captured on CCTV, showed the student, identified as Meghana, being… https://t.co/UYPiqxQaFH pic.twitter.com/sZHcWbf88z— Hate Detector 🔍 (@HateDetectors) May 23, 2026 -
విజయ్ మాస్టర్ ప్లాన్.. కర్ణాటకలో టీవీకే ఎంట్రీ?
తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ పేరు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. ఎన్నికల్లో భారీ విజయంతో టీవీకే విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లోకి టీవీకే ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి విజయ్ నేతృత్వంలోని టీవీకే సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో టీవీకే గేమ్ ప్లాన్ ఏంటంటే..తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. తమిళనాడుకు బయట కూడా పార్టీ విస్తరణపై విజయ్ ఫోకస్ చేశారని రాజకీయ వర్గాల చర్చ నడుస్తోంది. దక్షిణాదిలో ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై టీవీకే ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటకలో బరిలోకి దిగాలనే టీవీకే ప్లాన్ చేస్తోంది. బెంగళూరు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కొత్త రాజకీయ అవకాశాలను పరీక్షించుకునేందుకు సిద్దమైనట్టు వార్తలు బయటకు వచ్చాయి. బెంగళూరులో 50 వార్డుల్లో పోటీ చేసి తన బలం పరీక్షించుకోవాలని యోచిస్తోంది. ఇక, ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే విజయ్ స్వయంగా బెంగళూరులో ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇది పార్టీకి పెద్ద మద్దతు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక స్థాయిలో విజయాలు సాధిస్తే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీవీకే అడుగుపెట్టే అవకాశం ఉంది.TVK might contest Bengaluru Local Polls in Karnataka as per Asianet. pic.twitter.com/RSYX5fSRYw— News Algebra (@NewsAlgebraIND) May 23, 2026కర్ణాటకలో టీవీకేకు అవకాశాలు..1. బలంతమిళ ఓటర్ల ఆధారం: బెంగళూరులో సుమారు 15–20 లక్షల తమిళ మాట్లాడే ప్రజలు ఉన్నారని అంచనా. వీరిని లక్ష్యంగా చేసుకోవడం టీవీకే ప్రధాన వ్యూహం.విజయ్ అభిమాన సంఘాలు: బెంగళూరులో విజయ్కు పెద్ద అభిమాన వర్గం ఉంది. అభిమాన సంఘాలు ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తున్నాయి. వీరిని అభ్యర్థులుగా నిలబెట్టడం ద్వారా టీవీకేకు బలమైన గ్రాస్రూట్ నెట్వర్క్ లభిస్తుంది.2. సవాళ్లుస్థానిక సమస్యలు: బెంగళూరులో నీటి సమస్య, ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు వంటి స్థానిక అంశాలపై స్పష్టమైన అజెండా లేకపోతే టీవీకేకు పెద్ద పార్టీలతో పోటీ కష్టమవుతుంది.ప్రతిష్టాత్మక పార్టీలు: కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఇప్పటికే బలమైన స్థావరాన్ని కలిగి ఉన్నాయి. టీవీకేకు మొదటి దశలో వార్డుల స్థాయిలో మాత్రమే ప్రభావం చూపే అవకాశం ఉంది.ప్రాంతీయ గుర్తింపు: టీవీకే తమిళనాడు ఆధారిత పార్టీ కావడంతో, కర్ణాటకలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందే అవకాశం లేదు.టీవీకే బలం..ప్రాంతాలు: శివాజి నగర్, హలసూరు, వివేక్ నగర్, ఈజిపుర, మడివాల, శాంతినగర్ వంటి వార్డుల్లో తమిళ ఓటర్ల ప్రభావం ఎక్కువ.ఓటు బ్యాంక్: ఈ ఓటర్లు సాధారణంగా కాంగ్రెస్ లేదా జేడీఎస్ వైపు మొగ్గు చూపుతారు. టీవీకే ప్రవేశం వల్ల ఈ ఓటు బ్యాంక్ విభజించే అవకాశం ఉంది.ప్రాంతీయ విస్తరణ: తమిళనాడు, పుదుచ్చేరి తర్వాత, కర్ణాటకలో కూడా తన ప్రభావాన్ని విస్తరించడం.అయితే, ఇప్పటివరకు కర్ణాటక రాజకీయాల్లో ప్రత్యక్ష ఎంట్రీపై టీవీకే అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ కర్ణాటకలో టీవీకే.. తమిళ ఓటర్ల ఆధారం మరియు విజయ్ ప్రజాదరణను బలంగా ఉపయోగించుకుంటే, స్థానిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయి. కానీ, స్థానిక సమస్యలపై స్పష్టమైన అజెండా లేకపోతే, పెద్ద పార్టీలతో పోటీ చేయడం కష్టతరం అవుతుంది. ఈ నేపథ్యంలో టీవీకే పోటీ చేస్తుందా? ఒకవేళ బరిలో నిలిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
నీ ప్రైవేటు వీడియోలు నా వద్ద ఉన్నాయి..!
కోలారు: నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇట్టే నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. వారి వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఇదే మాదిరిగా.. నీ ప్రైవేటు వీడియోలు నా వద్ద ఉన్నాయి, వాటిని ఇంటర్నెట్లో పెడతానని ఓ సైబర్ నేరగాడు బెదిరిస్తుండగా, భయాందోళనకు గురైన మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన కోలారు తాలూకాలోని ఛత్రకోడిహళ్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వివాహిత (28) మృతురాలు. తాలూకాలోని బెగ్లిబెణచేనహళ్లికి యువకుడు శ్రీకాంత్ ఆమెకు పరిచయస్తుడు. సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆమె ఫోటోలను సేకరించి అశ్లీలంగా మార్చాడు. వాటిని ఆమెకు చూపించి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, వేధించి ఇప్పటికే లక్షల రూపాయలు వసూలు చేశాడు. భయాందోళనకు గురై.. కొన్నిరోజులుగా మరింతగా బెదిరించి మాంగల్యం చైను, బంగారు ఆభరణాలు కలిపి మొత్తం రూ. 30 నుంచి 40 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. శ్రీకాంత్పై మరో ఇద్దరు మహిళలను ఇదే విధంగా బెదిరించి దోచుకున్నట్లు ఆపణలు ఉన్నాయి. శ్రీకాంత్ వల్ల తన కాపురం బజారుపాలై పరువు పోతుందని ఆమె విరక్తి చెంది ఇంట్లో గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. శనివారం ఉదయం కోలారు రూరల్ పోలీసులు గ్రామానికి వెళ్లి పరిశీలన చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. ఆమె కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలింపు చేపట్టారు. -
అర్ధరాత్రి ఆగిన ఊపిరి
సాక్షి, బళ్లారి, రాయచూరు రూరల్: బంధువుకు అనారోగ్యంగా ఉండడంతో ఉదయమే ఊరి నుంచి మరో ఊరికి వచ్చారు. అర్ధరాత్రి తిరిగి బయల్దేరారు. కొంతసేపు ఉంటే క్షేమంగా చేరేవారే. కానీ మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చి పొట్టనబెట్టుకుంది. ట్రాక్స్ క్రూయిజర్ను లారీ ఢీకొగా, 5 మంది క్షణాల్లోనే చనిపోయారు. కలబుర్గి జిల్లా చిత్తాపూర్ తాలూకా లాడ్లాపూర్ సమీపంలో జాతీయ రహదారి– 50 పై జరిగింది. తుక్కయిన క్రూయిజర్ చిత్తాపూర్ తాలూకా వాడి పట్టణం దగ్గర ఇంగళిగి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 5 మంది క్రూయిజర్లో యాదగిరికి వచ్చి శుక్రవారం అర్ధరాత్రి తిరిగి వెళ్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన తమిళనాడు లారీ అతివేగంతో ఢీకొట్టింది. ఆ ధాటికి క్రూయిజర్ గుర్తుపట్టలేనంతగా తుక్కయింది. అందులోని మహ్మద్ హుస్సేన్ (60), ఫాతిమా (40), రసూల్బీ (40), మహబూబ్ (34), టోలూసాబ్ కాశ్వర్ (27) అనే అందరూ మరణించారు. మృతదేహాలు వాహనంలో చిక్కుకుపోయాయి. ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, స్థానికులతో కలిసి బయటకు తీసి సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు లారీ డ్రైవరు కోసం గాలిస్తున్నారు. ఐదుమంది మరణంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
క్రికెట్ స్టేడియం.. ఆర్థిక వృద్ధికి ఊతం
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని సూర్యనగర్లోని 4వ స్టేజ్లో ఇండ్లవాడి వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియం, క్రీడా సముదాయ నిర్మాణానికి సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శంకుస్థాపన చేశారు. శనివారం ఆర్భాటంగా ఈ కార్యక్రమం జరిగింది. క్రీడలు, పర్యాటకం, ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పనతో పాటు ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి తాము చొరవ తీసుకున్నామని సిద్దరామయ్య అన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో సూర్య షైన్, సూర్య డివైన్ గృహ సముదాయాల నిర్మాణాలకు పునాది రాయి వేశారు. ఈ ప్రాజెక్టు కోసం భూమిని ఇచ్చిన భూ యజమానులకు స్థల కేటాయింపులు చేశారు. బృహత్ స్టేడియం అవుతుంది సిద్దరామయ్య మాట్లాడుతూ గృహ నిర్మాణాలకే పరిమితమైన గృహనిర్మాణ శాఖ, కేహెచ్బీ సంస్థలు ఇప్పుడు 80 వేల సీట్ల సామర్థ్యం గల స్టేడియంను నిర్మిస్తున్నాయని చెప్పారు. గుజరాత్లోని ప్రముఖ స్టేడియంలో సీట్లు 90 వేలయితే, ఈ స్టేడియంలో 80 వేలని, ఇది మన రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద స్టేడియమని చెప్పారు. దీనివల్ల చుట్టుపక్కల టూరిజం, నిర్మాణ, ఆర్థిక రంగాలు బలోపేతమవుతాయన్నారు. భూమి ధరలు పెరుగుతున్నందున, పేద, మధ్యతరగతి ప్రజలకు కేహెచ్బీ అందుబాటు ధరలకే ఫ్లాట్లను నిర్మించి ఇస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య బ్యాటింగ్ ఆడారు. పెద్దసంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు పాల్గొన్నారు. సీఎం సిద్దరామయ్య బెంగళూరు శివార్లలో నూతన మైదాన నిర్మాణానికి శంకుస్థాపన -
బెళగావిలో బంగ్లాదేశీ వలసదారుల కలకలం
సాక్షి,బళ్లారి: బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా వలస వచ్చారని ప్రచారం సాగటంతో పాటు వలసదారుల వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు అందిన నేపథ్యంలో బెళగావి పోలీసులు హై అలర్ట్ అయ్యారు. బెళగావి డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బెళగావిని జల్లెడ పట్టారు. బెళగావి బస్టాండులో 20 మందికి పైగా అక్రమ వలసదారులు ఉన్నారనే అనుమానంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. శ్రీరామసేన జిల్లాధ్యక్షుడు రవి కుకిత్కర్తో పాటు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు హుబ్లీ నుంచి వచ్చిన మూడు బస్సులను కూడా తనిఖీ చేశారు. బెళగావి బస్టాండ్లో గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము బంగ్లాదేశీయులు కాదని, పశ్చిమ బెంగాల్కు చెందిన వారమని, అక్కడ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఉపాధి కోసం కర్ణాటకకు వచ్చినట్లు తెలిపారు. స్థానిక పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టారు. 20 మందిని అదుపులోకి తీసుకుని వారి ఆధార్, ఓటరు ఐడీ, ఇతరత్ర స్థానిక రికార్డులను పరిశీలించారు. డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు కూలంకుషంగా పరిశీలించారు. ఓటరు ఐడీ, ఽఆధార్కార్డులతో పాటు ఫోన్ నంబర్ ద్వారా ఏయే దానికి లింకు అయింది, వారికి ఎక్కడ నుంచి కాల్స్ వస్తున్నాయో కూడా నిఘా ఉంచి పరిశీలన చేశారు. పోలీసులు అన్ని విధాలుగా పరిశీలిచిన తర్వాత బంగ్లాదేశీయులు కాదని, పశ్చిమ బెంగాల్కు చెందిన వారు వచ్చారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బస్టాండ్లో 20 మంది పోలీసుల అదుపులోకి విచారణలో పశ్చిమబెంగాల్ కార్మికులుగా గుర్తింపు -
చురుగ్గా గేట్లకు గొలుసుల అమరిక
హొసపేటె: బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులకు జీవనాడి తుంగభద్ర డ్యాం కొత్త క్రస్ట్గేట్లకు గొలుసులను అమర్చే పనులు శరవేగంగా సాగుతున్నాయి. డ్యాంకు కొత్త క్రస్ట్గేట్లను ఏర్పాటు చేసిన అనంతరం కొత్త గొలుసులను అమర్చే పనులను తుంగభద్ర బోర్డు అధికారులు ఇటీవల ప్రారంభించారు. డ్యాంలోని 33వ క్రస్ట్గేట్కు కొత్త చైన్లను అమర్చే ట్రయల్ విజయవంతంగా పూర్తయిన అనంతరం ఇతర గేట్లకు కూడా కొత్త చైన్లను అమర్చే పనులను చేపట్టారు. ప్రస్తుతం డ్యాంకు నాలుగు కొత్త గొలుసులు చేరుకున్నాయని, మిగిలిన గేట్ల గొలుసులు త్వరలో వస్తాయని అధికారులు చెప్పారు. జలాశయం భద్రత కోసం పాత తుప్పుపట్టిన గొలుసులను తొలగించి కొత్త గొలుసులను అమర్చే పనులను ప్రత్యేక నిపుణుల బృందం మార్గదర్శకత్వంలో చేపడుతున్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే జలాశయంలోని అన్ని గేట్లకు కొత్త గొలుసులను అమర్చడమే లక్ష్యమని తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. -
టైర్ పేలి టెంపో ట్రావెలర్ బోల్తా
● 12 మందికి తీవ్ర గాయాలు ● ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం ● తృటిలో తప్పిన పెను ముప్పు ● కొప్పళ జిల్లాలో రోడ్డు ప్రమాదం సాక్షి,బళ్లారి: హైదరాబాద్ నుంచి గోవాకు విహారయాత్రకు బయలుదేరిన వారు మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. శుక్రవారం తెల్లవారు జామున కర్ణాటకలోని కొప్పళ నగరానికి సమీపంలోని చుక్కనకల్ వద్ద టెంపో ట్రావెలర్ టైర్ పేలి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 12 మంది తీవ్రంగా గాయపడగా, వీరిలో ఓ చిన్నారితో పాటు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే కొప్పళ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని కొప్పళ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 28 నుంచి ముంగారు ఉత్సవాలురాయచూరు రూరల్: నగరంలో జూన్ 28 నుంచి మూడు రోజుల పాటు అఖిల భారత ముంగారు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఏ.పాపారెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 26 ఏళ్ల నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఎద్దుల పోటీల్లో భాగంగా జూన్ 28న కర్ణాటక ఎద్దుల ఒకటిన్నర టన్నుల రాతి దూలం లాగే పోటీలను ప్రారంభిస్తామన్నారు. 29న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఎద్దుల రెండు టన్నుల రాతిదూలం లాగే పోటీలు, 29న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఎద్దుల రెండున్నర టన్నుల రాతి దూలం లాగే పోటీలు జరుగుతాయన్నారు. 29న లక్ష్మిదేవి జాతర, ఎద్దుల ఊరేగింపు, కళా బృందాలతో ఉత్సవం జరుగుతుందన్నారు. 28 నుంచి ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారన్నారు. సమావేశంలో శ్రీనివాసరెడ్డి, శంకర్రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తిలున్నారు. 26న వ్యవసాయ మేళా బళ్లారిటౌన్: రైతులకు నాణ్యమైన విత్తనాల ఎంపిక, వైజ్ఞానిక విధానంలో విత్తన ప్రక్రియ, ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్, జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, వ్యవసాయ ఉద్యాన, పట్టు, చేపల పెంపకం తదితర శాఖల ఆధ్వర్యంలో వ్యవసాయ(కృషి) మేళాను చేపట్టినట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు అవార్ మంజునాథ్, గౌరవ కార్యదర్శి కేసీ సురేష్బాబు తెలిపారు. శనివారం బీడీసీసీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పలువురు నిపుణులను కూడా ఆహ్వానించి రైతులకు నూతన వ్యవసాయ పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయ స్వామి, జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయ కులపతి ఎన్.హనుమంతప్పతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. సమావేశానికి దాదాపు 5 వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. నూతన పరిజ్ఞాన పరికరాల ప్రదర్శనకు 75 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంస్థ ఉపాధ్యక్షులు దొడ్డనగౌడ, సొంతా గిరిధర్, ప్రముఖులు మర్చేడు మల్లికార్జున గౌడ, రామచంద్ర, సత్యనారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్టేడియం పనులు చురుగ్గా చేపట్టండిరాయచూరు రూరల్: కలబుర్గిలో క్రీడా మైదానం పనులు చురుగ్గా చేపట్టాలని నూతన జిల్లాధికారి ఇక్రమ్ శరీఫ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాధికారి ఇతర అధికారులతో కలిసి క్రీడా మైదానాన్ని పరిశీలించారు. మైదానంలో మౌలిక సౌకర్యాలతో పాటు క్రీడాకారులకు అనుకూలమయ్యేలా పనులు కొనసాగించాలని సూచించారు. అధికారులు సంగమేష్, రాహుల్ కాంబ్లే, అభిషేక్, సంజయ్, ప్రవీణ్, అశోక్, రాజు పాల్గొన్నారు. -
జోరుగా బీపీఎల్ కార్డుల రద్దు
సాక్షి, బళ్లారి: అనర్హ బీపీఎల్ కార్డుదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పేదలకు అందాల్సిన ఉచిత బియ్యం, ఇతరత్రా సదుపాయాలు ఆదాయ పన్ను చెల్లించేవారి వద్ద కూడా బీపీఎల్ కార్డులు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య అనర్హుల వద్ద ఉన్న బీపీఎల్ కార్డులను నిర్దాక్షిణ్యంగా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో సంబంధిత అధికారులు అనర్హుల వద్ద ఉన్న బీపీఎల్ కార్డులను తొలగించే ప్రక్రియను చురుగ్గా చేపడుతున్నారు. గత మూడు నెలలుగా జిల్లాలో దాదాపు ఐదు వేలకుపైగా బీపీఎల్ కార్డులను తొలగించారు. ప్రభుత్వ ఆదేశాలతో జోరుగా చేపడుతున్న బీపీఎల్ కార్డుల తొలగింపు ప్రక్రియతో నిజమైన లబ్ధిదారులకు దడ పుట్టిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలు ఒకలా ఉంటే అధికారులు మరోలా వ్యవహరిస్తుండటంతో పాటు అర్హులైన వారికి సంబంధించిన బీపీఎల్ కార్డులను కూడా కొన్నింటిని తీసివేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్తో కార్డుల రద్దు పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరకపోతే సమాజంలో అట్టడుగు వర్గాలు ఎక్కువగా నష్టపోతారనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేస్తూ బీపీఎల్ కార్డుల తొలగింపు చేపడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఒక్కొక్కరికి ఇస్తున్న ఐదు కేజీల బియ్యంతో పాటు మరో ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు ఆ హామీని అమలు చేయడంతో ప్రతి నెల బీపీఎల్కార్డు ఉన్న వారందరికీ ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున బియ్యం సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు పలు పథకాలకు సంబంధించి బీపీఎల్ కార్డు తప్పనిసరి కావడంతో సామాన్య, పేద కుటుంబాలతో పాటు మధ్య తరగతి, ఆదాయపు పన్ను చెల్లించే వారు కూడా ఏదో విధంగా పైరవీలు చేసి బీపీఎల్ కార్డులు పొందారు. ఆకలితో ఉన్నవారికి ఉచిత బియ్యం అందించాలనే సంకల్పంతో అమలు చేసిన ఉచిత బియ్యం 60 శాతం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తక్కువ ధరకే రేషన్ బియ్యం కొనుగోలు ప్రతి నెల జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో బీపీఎల్కార్డు దారుల నుంచి ఉచిత బియ్యాన్ని తక్కువ ధరకే తీసుకుని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న దృశ్యాలు, పట్టుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. ప్రతి నెల ఉచిత బియ్యం అందజేయడం ప్రారంభిస్తే, వ్యాపారులు రంగ ప్రవేశం చేసి, లబ్ధిదారులతో కిలో బియ్యాన్ని కేవలం రూ.10లకే కొనుగోలు చేసి, వాటికి మెరుగులు దిద్ది దేశ, విదేశాలకు ఎగుమతులు చేయడం సర్వసాధారణంగా మారింది. అధికారులు దాడులు చేయడం కూడా సర్వసాధారణమే. తూతుమంత్రంగా దాడులు చేయడం, అక్కడక్కడ రేషన్ బియ్యం పట్టుకోవడం తదితర పరిణామాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అక్రమంగా ఉచితంగా పొందిన బీపీఎల్కార్డులు రద్దు చేస్తే కొద్ది వరకు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకట్టు వేయాలనే సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలో అక్రమంగా పొందిన బీపీఎల్కార్డులను తొలగించేస్తున్నారు. 5 వేల అక్రమ బీపీఎల్ కార్డుల తొలగింపు జిల్లాలో 24,776 అంత్యోదయ కార్డులు, 56,377 ఏపీఎల్ కార్డులు, 2,74,280 బీపీఎల్కార్డులు ఉన్నట్లు అధికార గణాంకాలు తెలియజేస్తున్నాయి. అక్రమంగా పొందిన బీపీఎల్కార్డులను మూడు నెలల్లో ఐదు వేల దాకా తొలగించడంతో పాటు ప్రతి రోజు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న బీపీఎల్ కార్డులను తొలగించిన వారికి ఏపీఎల్ కార్డులు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఏపీఎల్కార్డులు తీసుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో కార్డులు పొందిన ఆదాయ పన్ను చెల్లించే వారి కార్డుల ఏరివేతను కూడా చేపడుతున్నామన్నారు. పేదల హక్కుల్లో ధనికులు కూడా భాగస్వామ్యం కావడంతో వారి కార్డులను తొలగిస్తున్నట్లు సంబంధిత అఽధికారి తెలిపారు. ఒకవేళ నిజమైన లబ్ధిదారుల కార్డులను పొరపాటుగా ఎక్కడైనా తొలగించి ఉంటే బాధితులు అధికారుల దృష్టికి తెస్తే కార్డులను తిరిగి పొందేందుకు అవకాశం ఉందని, నిజమైన బాధితులు, పేదలు ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అనర్హ లబ్ధిదారుల్లో మొదలైన దడ చాపకింద నీరులా కార్డుల తొలగింపు అర్హుల కార్డుల తీసివేతపై విమర్శలు -
అర్ధరాత్రి ఆగిన ఊపిరి
సాక్షి, బళ్లారి, రాయచూరు రూరల్: బంధువుకు అనారోగ్యంగా ఉండడంతో ఉదయమే ఊరి నుంచి మరో ఊరికి వచ్చారు. అర్ధరాత్రి తిరిగి బయల్దేరారు. కొంతసేపు ఉంటే క్షేమంగా చేరేవారే. కానీ మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చి పొట్టనబెట్టుకుంది. ట్రాక్స్ క్రూయిజర్ను లారీ ఢీకొగా, 5 మంది క్షణాల్లోనే చనిపోయారు. కలబుర్గి జిల్లా చిత్తాపూర్ తాలూకా లాడ్లాపూర్ సమీపంలో జాతీయ రహదారి– 50 పై జరిగింది. తుక్కయిన క్రూయిజర్ చిత్తాపూర్ తాలూకా వాడి పట్టణం దగ్గర ఇంగళిగి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 5 మంది క్రూయిజర్లో యాదగిరికి వచ్చి శుక్రవారం అర్ధరాత్రి తిరిగి వెళ్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన తమిళనాడు లారీ అతివేగంతో ఢీకొట్టింది. ఆ ధాటికి క్రూయిజర్ గుర్తుపట్టలేనంతగా తుక్కయింది. అందులోని మహ్మద్ హుస్సేన్ (60), ఫాతిమా (40), రసూల్బీ (40), మహబూబ్ (34), టోలూసాబ్ కాశ్వర్ (27) అనే అందరూ మరణించారు. మృతదేహాలు వాహనంలో చిక్కుకుపోయాయి. ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, స్థానికులతో కలిసి బయటకు తీసి సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు లారీ డ్రైవరు కోసం గాలిస్తున్నారు. ఐదుమంది మరణంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. క్రూయిజర్ను లారీ ఢీ ఒకే కుటుంబానికి చెందిన ఐదుమంది మృతి కలబుర్గి జిల్లాలో ఘోరం -
జయ జయ వేంకటేశా..
మాలూరు: తాలూకాలో మరో తిరుమల క్షేత్రంగా పేరుపొందిన చిక్క తిరుపతి శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దాదాపు 20 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు గోపాలకృష్ణ భారద్వాజ్, ఎన్ శ్రీధర్, కార్తీక్ స్వామి నేతృత్వంలో ఉదయం స్వామి వారికి పంచామృత అభిషేకం, అలంకారం, పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు. ఏనుగు కన్నుమూత మైసూరు: చామరాజనగర జిల్లా యళందూరు తాలూకా బిళిగిరి రంగనబెట్ట మూల్కి బెట్ట అడవిలో ఓ ఆడ ఏనుగు మృత్యువాత పడింది. సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయస్సుగల ఏనుగు సహజ మరణం పొందినట్లు అనుమానిస్తున్నారు. అడవిలో కాలిబాట పక్కన కళేబరం ఉంది. పశువైద్యులు మాట్లాడుతూ ఏనుగులకు వయస్సైన తర్వాత ఆహారాన్ని నమిలి తినే సామర్థ్యాన్ని కోల్పోతాయి. తమ గుంపు నుంచి వేరైపోతాయి. కొంత కాలానికి సహజ మరణానికి గురవడం సాధారణమని తెలిపారు. ఏసీఎఫ్ మహాలక్ష్మి, ఆర్ఎఫ్ఓ సతీష్ గస్తీ సిబ్బందితో కలిసి ఏనుగు కళేబరాన్ని పరిశీలించి పూడ్చిపెట్టారు. భర్త హత్య కేసులో భార్యకు నో బెయిలు శివాజీనగర: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో భార్యకు బెయిల్ ఇవ్వటానికి హైకోర్టు నిరాకరించింది. నిందితురాలు చిత్రదుర్గకు చెందిన సునీత. ఈమె ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. నెలలు దాటినా తనకు స్థానిక కోర్టు బెయిలు ఇవ్వలేదని, మీరైనా మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ పెండింగ్లో ఉంది, ఈ దశలో నిందితురాలికి బెయిల్ ఇస్తే సాక్షులపై ప్రభావం చూపవచ్చని, అందుచేత బెయిలు ఇవ్వడం కుదరదని జస్టిస్ వి.శ్రీషానంద ధర్మాసనం తీర్పు చెప్పింది. సాధారణ కారణాలను చూపి బెయిలు అడగరాదని, కేసు విచారణ ముగిసిన తరువాత బెయిల్కు ప్రయత్నించాలని సూచించారు. ఆ పల్లెకు ఆర్టీసీ బస్సు తుమకూరు: బస్సు సౌకర్యం లేని తుమకూరు జిల్లా సరిహద్దులోని చిక్కనాయకనహళ్లి తాలూకా సింగాపుర గ్రామానికి ఎట్టకేలకు కేఎస్ ఆర్టీసీ బస్సు వచ్చింది. ఈ నెల 21 నుంచి బస్సు సేవలు మొదలయ్యాయి. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం ముందు బస్సుకు పూజలు చేసి, సర్వీసు కోసం పోరాడినవారిని సన్మానించారు. ఏడాది జైలుశిక్ష.. ఒక్కరోజుతో సరి శివాజీనగర: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అందుకు కారకులు పరారవుతుంటారు. కానీ ఓ డ్రైవరు గాయపడినవారిని తన కారులోనే ఆస్పత్రికి తీసుకెళ్లినందుకు, మరింత పరిహారం ఇస్తానన్నందుకు హైకోర్టు శిక్షను తగ్గించింది. వివరాలు.. దక్షిణ కన్నడ జిల్లా పక్షికెర నివాసి, డ్రైవరు రియాజ్ అహ్మద్ కారులో వెళ్తూ ఓ బైకిస్టును ఢీకొనడంతో గాయపడ్డాడు. అతనిని తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ బాధితుడు చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. స్థానిక కోర్టు రియాజ్కు ఏడాది జైలు శిక్ష విధించింది. తరువాతి రోజుల్లో రియాజ్ గాయపడి, చేతికి రాడ్ వేయించుకున్నాడు. డ్రైవరు వృత్తి చేయలేక కూలిపనులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శిక్షను రద్దుచేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయమూర్తి జస్టిస్ వీ.శ్రీషానంద విచారించారు. నిందితుని పరిస్థితిని చూసి, బాధిత కుటుంబానికి మరింత పరిహారం ఇస్తే శిక్ష తగ్గిస్తానని తెలిపారు. రూ. లక్ష ఇవ్వడానికి నిందితుడు అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఏడాది కారాగార శిక్షను ఒక్కరోజుకు జడ్జి తగ్గించారు. జూన్ 30లోగా పరిహారం చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే, సంవత్సరం శిక్ష తప్పదని జడ్జి హెచ్చరించారు. -
ఎస్టీలకు రిజర్వేషన్ పెంచాలి
హొసపేటె: జనాభా ప్రకారం ఎస్టీలకు మరింతగా రిజర్వేషన్ కల్పించాలని మాజీ ఎంపీ వీఎస్.ఉగ్రప్ప డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని వాల్మీకి భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దోపిడీకి గురైన ఎస్సీ, ఎస్టీ ప్రజల తరపున తాను రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించానన్నారు. అందులో భాగంగా మొదట విలేకరుల సమావేశాలు, చర్చలు నిర్వహించి జిల్లా మేజిస్రేట్ల ద్వారా వినతిపత్రాలు సమర్పించామన్నారు. 2011 లెక్కల ప్రకారం జనాభాలో 17.10 శాతం ఎస్సీలు, 7 శాతం ఎస్టీలు, 32 శాతం ఓబీసీలు ఉన్నారన్నారు. ఈ మూడు వర్గాలకు చెందిన వారు 4 కోట్ల మందికి పైగా ఉన్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు వేర్వేరు జీవన విధానాల్లో జీవిస్తున్నారన్నారు. 101 ఎస్సీ కులాలు, 51 ఎస్టీ కులాలు ఉండగా, నకిలీ కుల ధృవీకరణ పత్రాలే లక్షకు పైగా ఉన్నాయని, తళ్వార్, పరివార్లను కూడా కలుపుకుంటే ఎస్టీల వాటా 7 శాతంగా మారిందన్నారు. -
బెదిరింపులకు మహిళ బలి
కోలారు: నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇట్టే నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. వారి వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఇదే మాదిరిగా.. నీ ప్రైవేటు వీడియోలు నా వద్ద ఉన్నాయి, వాటిని ఇంటర్నెట్లో పెడతానని ఓ సైబర్ నేరగాడు బెదిరిస్తుండగా, భయాందోళనకు గురైన మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన కోలారు తాలూకాలోని ఛత్రకోడిహళ్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వివాహిత (28) మృతురాలు. తాలూకాలోని బెగ్లిబెణచేనహళ్లికి యువకుడు శ్రీకాంత్ ఆమెకు పరిచయస్తుడు. సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆమె ఫోటోలను సేకరించి అశ్లీలంగా మార్చాడు. వాటిని ఆమెకు చూపించి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, వేధించి ఇప్పటికే లక్షల రూపాయలు వసూలు చేశాడు. భయాందోళనకు గురై.. కొన్నిరోజులుగా మరింతగా బెదిరించి మాంగల్యం చైను, బంగారు ఆభరణాలు కలిపి మొత్తం రూ. 30 నుంచి 40 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. శ్రీకాంత్పై మరో ఇద్దరు మహిళలను ఇదే విధంగా బెదిరించి దోచుకున్నట్లు ఆపణలు ఉన్నాయి. శ్రీకాంత్ వల్ల తన కాపురం బజారుపాలై పరువు పోతుందని ఆమె విరక్తి చెంది ఇంట్లో గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. శనివారం ఉదయం కోలారు రూరల్ పోలీసులు గ్రామానికి వెళ్లి పరిశీలన చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. ఆమె కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలింపు చేపట్టారు. వివాహిత నుంచి రూ.లక్షల డబ్బు, బంగారం వసూలు విసిగిపోయి బాధితురాలి ఆత్మహత్య కోలారు జిల్లాలో విషాదం -
ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఉద్యోగాకాంక్షుల పోరాట సమితి రాష్ట్ర సంచాలకుడు చెన్నబసవ డిమాండ్ చేశారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది 15 వేల నుంచి 20 వేల వరకు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో నూతన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా అతిథి ఉపాధ్యాయులతో కాలం గడపడం మాని విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప కొత్త ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. ఏడాదికి రెండు మార్లు టీఈటీ పరీక్షలు నిర్వహించాలన్నారు. డ్రిల్, చిత్రలేఖనం, సంగీత ఉపాధ్యాయులను నియమించాలన్నారు. విద్యాశాఖలో 79,694 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కళ్యాణ కర్ణాటకలో 22,595 మంది ఉపాధ్యాయులను నియమించుకోవాల్సి ఉందన్నారు. జిల్లాలో 1,175 అతిథి, 1,066 ఉపాధ్యాయ ఖాళీ పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలన్నారు. వినోద్ కుమార్, వెంకటేష్, బసవరాజ్, కాశీనాథ్లున్నారు. -
వంతెన నిర్మాణ పనులకు శ్రీకారం
బళ్లారిటౌన్: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో చాలా ఏళ్లుగా డిమాండ్గా ఉన్న బళ్లారి రోడ్డులో వంతెన పనులు ఎమ్మెల్యే చొరవతో చురుగ్గా సాగుతున్నాయి. రూ.6 కోట్ల కేఆర్డీసీఎల్ నిధులతో రెండు వంతెనలు నిర్మిస్తున్నారు. బళ్లారి రోడ్డు నుంచి అల్లీపుర రోడ్డు వరకు మధ్యలో కాలువపై వంతెన, ఎర్రితాత మఠం వరకు నాలుగు లైన్ల సిమెంట్ రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మాణ పనులతో అభివృద్ధి చేయనున్నారు. బళ్లారి రోడ్డు, అల్లీపురం రోడ్డులోని కాలువ గట్లపై 30 ఏళ్ల క్రితం వంతెనలు నిర్మించారు. అయితే అవి పూర్తిగా ధ్వంసమయ్యాయని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభురెడ్డి, సిద్దమ్మనహళ్లి హులప్ప, దమ్మూరు హనుమప్ప రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామ అభివృద్ధి కోసం కేఆర్డీసీఎల్ నుంచి రూ.6 కోట్ల నిధులు కేటాయించి పనులు జరుపుతున్నట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు తెలిపారు. ప్రస్తుతం కాలువలో బండరాయి పడినప్పటికీ యుద్ధ ప్రతిపాదికన పనులు సాగుతున్నాయన్నారు. రెండు నెలల్లో ఈ పనులను పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ నాగరాజ్ తెలిపారు. కాగా ఈ పనుల నాణ్యతను పీడబ్ల్యూడీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వంతెన పనులు జరుగుతున్నందున వాహనాలను ఇతర ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించే ఏర్పాట్లు చేశారు. -
ఎబోలా అలర్ట్
శివాజీనగర: ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న భయానక ఎబోలా వైరస్ వ్యాధి కన్నడనాడుకు గుబులు పుట్టిస్తోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ని ప్రకటించింది. వ్యాధి పీడితులు ప్రవేశించకుండా విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ప్రయాణికులకు పరీక్షలు జరపాలని సూచించడమైనది. బెంగళూరు, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎక్కువగా ఉండడమే ఈ ఆందోళనకు కారణం. పొరపాటున ఎబోలా కేసులు వస్తే ఆర్థిక రాజధాని బెంగళూరుకు తీవ్ర ఇబ్బంది తప్పదు. ఆసుపత్రుల్లో ఏర్పాట్లు అనుమానిత లక్షణాలు కనిపిస్తే తక్షణమే ప్రత్యేక వార్డుల్లో చేర్పించాలి. బెంగళూరు, మంగళూరు నగర ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు, రక్షణాత్మక కిట్లు, వైద్య బృందాలను సిద్ధం చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఎబోలా ప్రాథమిక లక్షణాలు తీవ్ర జ్వరం, తలనొప్పి – అతిగా ఆయాసం రావడం – గొంతు నొప్పి –వాంతులు, విరేచనాలు, – కడుపు నొప్పి –కళ్లు ఎర్రగా కావడం – తీవ్రరూపం దాల్చితే శరీరం లోపల అవయవాల్లో రక్తస్రావం అవుతుంది. ఆఫ్రికన్లపై 21 రోజుల నిఘా: మంత్రి ఎబోలా గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండురావు తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ దేశఽంలో ఇప్పటి వరకు ఒక్క కేసూ రాలేదు. అయినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నాం. ఆఫ్రికన్ దేశాలైన ఉగాండా, కాంగో వంటి దేశాల నుంచి వచ్చిన వారిని 21 రోజుల పాటు నిఘాలో ఉంచుతాం, రోగ లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య సిబ్బందికి తక్షణమే సమాచారం ఇవ్వాలని చెప్పామని వివరించారు. కాగా, ప్రధాని మోదీ తీరు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని ఆయన ఆరోపించారు. మోదీ ఇన్స్టాలో ఫోటోలు, వీడియో పోస్టు చేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు.ఆఫ్రికా టు బెంగళూరు రాష్ట్ర ఆరోగ్యశాఖ హెచ్చరిక విమానాశ్రయాలు, పోర్టుల్లో ఆఫ్రికా నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు రెడీ -
రైతుల కోసం ప్రత్యేక సంతలు
రాయచూరు రూరల్: రాయచూరు, కొప్పళ, కలబుర్గి, బళ్లారి, బీదర్, యాదగిరి జిల్లాల్లోని రైతుల కోసం ప్రతి నెల రెండవ, నాలుగవ శనివారాల్లో రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం అధికారులు ప్రత్యేక సంతలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ కళాశాల అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు పండించిన పంటలు, కూరగాయలు, పండ్ల కొనుగోలుకు రైతులు ఎద్దులబండ్లలో తరలి వచ్చారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప, అధ్యాపకులు మల్లికార్జున, అయ్యన గౌడర్, గురురాజ్ సుంకద, బసవణ్ణప్ప, రాజణ్ణ, ప్రభురాజ్, జాగృతి దేశ్మానెలున్నారు. ప్రభుత్వ పాఠశాలల విలీనం తగదురాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను కర్ణాటక పబ్లిక్ పాఠశాల(కేపీఎస్)ల్లో విలీనం చేయడం తగదని ఏఐడీఎస్ఓ పేర్కొంది. శనివారం దేవదుర్గ తాలూకా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో ఆందోళనకారులు మాట్లాడారు. దేవదుర్గ తాలూకాలోని ఆల్కోడ్కు అడకలగుడ్డ, సింగేరిదొడ్డి, ఉలకబండ, కుర్లేకరదొడ్డి ప్రాథమిక పాఠశాలలను చేర్చరాదని, ఆ ప్రయత్నం విరమించుకోవాలని ఒత్తిడి చేశారు. తండ్రీ, కొడుకు నీటి పాలురాయచూరు రూరల్: పొలంలోని నీటి గుంటలో కాలు జారి పడి తండ్రీ, కొడుకు మరణించిన ఘటన హావేరి తాలూకాలోని ఆలదకట్టిలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం తండ్రీకొడుకులిద్దరూ నడుచుకుంటూ పొలం వైపు వెళ్లారు. ముందుగా శరత్ హంసబావి(8) కుంటలో పేరుకున్న పాచిని చూడకుండా కాలు జారిపడ్డాడు. కొడుకును రక్షించడానికి ప్రయత్నించిన తండ్రి శంభులింగప్ప(48) కూడా మరణింంచారు. హావేరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఆలదకట్టిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మురుగు కాలువల్లో పూడిక తొలగింపురాయచూరు రూరల్: నగరంలోని మురుగు కాలువల్లో పూడికను తొలగించారు. నగరంలోని బంగికుంట, కోట బస్టాండ్, అరబ్ మొహల్లా, షియా తలాబ్, ఖాదర్గుండ, నవాబ్గడ్డ, మడ్డిపేట, బైరూన్కిల్ల, మడివాళనగర్, ఇందిరానగర్, సుఖాణి కాలనీల్లో మురుగు కాలువల్లో చెత్తాచెదారం నిండింది. నగరసభ అధికారులు, సిబ్బంది నిఘా ఉంచి స్వచ్ఛత కాపాడేందుకు నగరంలోని 38 మురుగు కాలువల్లో త్వరితగతిన పూడిక తొలగింపు చేపట్టినట్లు నోడల్ అధికారి కృష్ణ శావంతగేర తెలిపారు. తేనెటీగల దాడిలో రైతు మృతిహొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా తంబ్రళ్లిలో ఉదయం వ్యవసాయ పనుల్లో ఉండగా తేనెటీగలు దాడి చేయడంతో రైతు మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. మృతుడిని తళవార హనుమంతప్ప(62)గా గుర్తించారు. ఇతనిపై తేనెటీగల గుంపు దాడి చేసింది. దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మొదట తంబ్రళ్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి, ప్రాథమిక చికిత్స తర్వాత హగరిబొమ్మనహళ్లి ఆస్పత్రికి, అనంతరం కొప్పళలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ హనుమంతప్ప మరణించారు. ఈ ఘటనపై తంబ్రళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
అభివృద్ధి పనులకు భూమిపూజ
బళ్లారిఅర్బన్: నగరంలోని 3వ వార్డు ఏపీఎంసీ సర్కిల్ నుంచి బెంకి మారెమ్మ ఆలయం మీదుగా డీఎస్పీ కార్యాలయం వరకు కలిపే ప్రధాన రహదారి అభివృద్ధి పనులను శుక్రవారం ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ప్రారంభించారు. సుమారు రూ.4.50 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ రహదారి అభివృద్ధి పనులను ప్రారంభించి ఆయన మాట్లాడారు. నగరంలో వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కార్పొరేటర్ ఎం.ప్రభంజన్కుమార్, నాయకులు సుబ్బరాయుడు, వాసురెడ్డి, భరత్, కవిత, కుమారన్తో పాటు పలువురు స్థానికులు హాజరయ్యారు. -
ఆమె వచ్చింది.. పెళ్లి చేస్తాం.. ఇక కిందకి దిగు!
కర్ణాటక: పాగల్ ప్రేమికుని వ్యవహారం తీవ్ర రచ్చకు కారణమైంది. ప్రియురాలు పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడు విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి నానా రభస సృష్టించాడు. ఈ సంఘటన బెంగళూరు శివార్లలో ఆనేకల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక చిన్నయ్యనపాళ్యకు చెందిన సోమశేఖర్ అనే యువకుడు విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కారు. మూడేళ్ల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నానని, ఆమె ఇప్పుడు ప్రేమ, పెళ్లికి తిరస్కరించిందని బాధితుడు తెలిపాడు. జనం అతన్ని కిందకు దిగమని కేకలు వేసినా దిగేది లేదని చెప్పాడు. ఇది తెలిసి విద్యుత్ సిబ్బందిని కరెంటును నిలిపివేసి ఆనేకల్ పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు ఎంతగా అతన్ని కోరినా.. ప్రియురాలు ఇక్కడికి వచ్చేవరకు దిగేది లేదని సోమశేఖర్ గట్టిగా కేకలు వేశాడు.యువతిని రప్పించిదీంతో పోలీసులు సదరు యువతిని తాళి, పసుపు కుంకుమ తీసుకుని రావాలని చెప్పగా ఆమె, తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. నీ ప్రియురాలు వచ్చిందని, ఆమెతో వివాహం బాధ్యత తమదే అని, నిన్ను ఎవరూ ఏమి చేయరు, కిందికి వచ్చేయాలని మైకులో పోలీసులు ప్రకటించారు. అయితే అతనికి టవర్ను ఎక్కినంత సులువుగా దిగడానికి రాలేదు. తాడు కట్టి కిందకు దిగడానికి సహాయం చేశారు. చివరకు క్షేమంగా దిగడంతో కథ సుఖాంతమైంది. సోమశేఖర్ అంతకుముందే ఇంటి పైకెక్కి షీట్లు పగలగొట్టి హంగామా చేశాడని స్థానికులు తెలిపారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. -
నకిలీ ప్రొఫైల్తో యువతులకు మోసం
బనశంకరి: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో తాను డాక్టర్ని అని ఓ వంచకుడు నకిలీ ప్రొఫైల్ సృష్టించి వివాహం చేసుకుంటానని నమ్మించి మైసూరు, బెంగళూరులకు చెందిన 10 మందికి పైగా యువతులకు లక్షలాది రూపాయల వంచనకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రదీప్ సోలోమన్ మ్యాట్రిమోనియల్ సైట్లో డాక్టర్ ప్రదీప్ సోలోమన్ పేరుతో హైఫై ప్రొఫైల్ను తెరిచారు. కుమారుడి వంచనకు తల్లి కళావతి మద్దతు తెలిపింది. వీరిద్దరూ మైసూరులో విలాసవంతమైన బంగళాను అద్దెకు తీసుకుని శ్రీమంతులుగా బిల్డప్ కొట్టారు. వివాహ సంబంధాలు కలుపుకోవడానికి ముందుకువచ్చే వధువు కుటుంబ సభ్యులకు తమ మాయమాటలతో వల వేసేవారు. డబ్బు బ్లాక్ అయిందని నమ్మించి.. యువతుల కుటుంబ సభ్యులకు నమ్మకం కలిగించిన అనంతరం సాంకేతిక కారణాలతో పెద్ద మొత్తంలో నగదు బ్యాంకులో చిక్కుకుందని, కొద్దిరోజుల్లో డబ్బు వెనక్కివస్తుందని, ప్రస్తుతం చాలా అర్జెంట్గా ఉందని తెలిపి లక్షలాది రూపాయల డబ్బును డిమాండ్ చేసేవారు. ప్రదీప్ మాటలు నమ్మిన బెంగళూరుకు చెందిన కుటుంబం లక్షలాది రూపాయలు డబ్బు ఇచ్చి వంచనకు గురయ్యారు. డబ్బు తమ చేతికి అందగానే తల్లీ కుమారుడు ఇద్దరూ పారిపోయారు. ప్రదీప్ చేతిలో మోసపోయిన మైసూరు, బెంగళూరులకు చెందిన అనేక మంది మైసూరులోని బంగళా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వీరిపై ఆడుగోడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
బక్రీద్ శాంతియుతంగా జరుపుకోండి
రాయచూరు రూరల్: జిల్లాలో ఈనెల 28న బక్రీద్ పండుగను ముస్లింలు శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అరుణాంశు గిరి సూచించారు. శుక్రవారం సదరు బజార్ పోలీస్ స్టేషన్లో ముస్లింలతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బక్రీద్ నిర్వహణపై ముస్లింలతో చర్చించారు. పండుగ సమయంలో జంతు వధను నిషేధించాలన్నారు. పండుగను ప్రశాంతంగా ఆచరించడానికి సహకరించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ షక్రిదా, సీఐలు దాదావలీ, ఉమేష్ కామ్లే, ఎస్ఐలు మంజునాథ్, లక్ష్మి, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. మురికి కాలువలపై బండలు అమర్చాలిరాయచూరు రూరల్: రాయచూరు నగరంలో పలు ప్రాంతాల్లో మురికి కాలువలకు మూతలు లేకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని కర్ణాటక సేనే అధ్యక్షుడు అనిల్ పాషా తెలిపారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయంలో ఆందోళన చేపట్టి మాట్లాడారు. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానుండటంతో వర్షపు నీరు డ్రైనేజీల్లో అధికంగా ప్రవహిస్తుందన్నారు. ప్రజలు నడచి వెళ్లేందుకు వీలుగా తెరచిన కాలువలపై బండలు వేసి మూసి వేయాలని కోరుతూ స్థానిక అధికారికి వినతిపత్రం అందజేశారు. మామను హతమార్చిన అల్లుడుహుబ్లీ: షెడ్డులో మొబైల్ చార్జింగ్ పెట్టవద్దు అని చెప్పినందుకు మామను అల్లుడు ఇనుప రాడుతో కొట్టి హతమార్చిన ఘటన గురువారం రాత్రి తాలూకా రేవడిహళలో చోటు చేసుకుంది. శబ్బి గ్రామానికి చెందిన దాదాపీర (38) వహత్యకు గురైన వ్యక్తి. ఈయన అల్లుడు, కార్మికుడు అయిన అజీమ్ జమకానే హత్య చేశాడు. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మానవ హక్కుల కమిషన్ పేరు దుర్వినియోగం ● మహిళపై కేసు నమోదు బళ్లారి అర్బన్: జాతీయ మానవ హక్కుల కమిషన్ పేరును దుర్వినియోగం చేసి, ప్రజల్లో గందరగోళం సృష్టించిన ఆరోపణలపై ఒక మహిళపై గాంధీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నగరంలోని మోకా రోడ్డులో ఉన్న కేఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో మార్చి 10, 11 తేదీల్లో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల మండలి అనే సంస్థ అధ్యక్షురాలు జే.పుష్ప, ఆమె సభ్యులు తమ సంస్థను జాతీయ మానవ హక్కుల కమిషన్గా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయమై సమాచారం సేకరించిన పోలీసులు, ప్రభుత్వ సంస్థ పేరును అక్రమంగా ఉపయోగించినందుకు జె.పుష్ప, ఇతర సభ్యులపై కేసు నమోదు చేశారు. గాలీవానకు కూలిన షెడ్డు: రైతు మృతి మాలూరు: తాలూకాలోని లక్కూరు ఫిర్కాలోని హసాండహళ్లి గ్రామంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. షెడ్డు కూలడంతో హసాండహళ్లి గ్రామానికి చెందిన నారాయణప్ప మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన కిరణ్ అనే వ్యక్తికి చెందిన ఇల్లు కూలడంతో ఇంట్లో ఉన్న 7 మంది చిన్న గాయాలతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. దొడ్డడాసవహళ్లి గ్రామానికి చెందిన రైతు చన్నరాయప్పకు చెందిన ఇల్లు పూర్తిగా దెబ్బతింది. కోతకు వచ్చి క్యాప్సికం పంట నాశనమైంది. అరసనహళ్లి గ్రామంలో సౌభాగ్య అనే మహిళకు చెందిన ఇంటి సిమెంట్ రేకులు గాలికి ఎగిరి పోయాయి. దాదాపు 40 నిమిషాలకు పైగా వర్షం కురిసింది. అనుభవ మంటపం స్థాపించడం హర్షణీయం కోలారు: బసవణ్ణ అనాటి కాలానికి మాత్రమే కాకుండా నేటి తరం ప్రజల ప్రశ్నలకు కూడా సమాధానంగా నిలబడ్డారు. బెంగుళూరు ఉత్తర విశ్వ విద్యాలయం అనుభవ మంటపం వేదికను స్థాపించడం హర్షణీయమని హంపీ కన్నడ విశ్వ విద్యాలయం కులపతి పరశివమూర్తి తెలిపారు. శుక్రవారం నగర సమీపంలోని బెంగుళూరు ఉత్తర విశ్వ విద్యాలయంలోని సువర్ణగంగ క్యాంపస్లో అనుభవ మంటపం విచార మంథన మాలె కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.అనుభవం, అనుభావ వ్యత్యాసాలను తెలియజేశారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచే వారే అనుభవవంతులు అని పేర్కొన్నారు. బసవణ్ణ బాల్యంలోని శిక్షణ, ప్రశ్నించే మనో భావం అందరికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు లోకనాథ్, డి.కుముద తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి
రాయచూరు రూరల్: సమాజ సేవ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అరుణాంశు గిరి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని నవోదయ వైద్య విద్యాలయంలో పోలీసులకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో ఒత్తిడికి గురికాకూడని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకుని పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్నారు. క్యాన్సర్, గుండెపోటు తదితర వ్యాధుల నుంచి ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. దాదాపు 200 మంది పోలీసులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కుమారస్వామి, డీఎస్పీ శాంతివీర, కళాశాల రిజిస్ట్రార్ శ్రీనివాస్, విశ్వనాథ్లు ఉన్నారు. వాల్మీకి విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రాధాన్యత రాయచూరు రూరల్: రాయచూరు మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తామని గ్రామీణ శాసన సభ్యుడు బసవన గౌడ పేర్కొన్నారు. శుక్రవారం మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయ ఆవరణలో రూ.8 కోట్లతో భవన నిర్మాణానికి భూమి పూజ చేసి మాట్లాడారు. రాయచూరు, యాదగిరి జిల్లాలోని పీజీ విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు వీలు కల్పించే విధంగా భవన నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. పనులు నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి పనుల విషయంలో ప్రజల సహకారం అవసరం అని తెలిపారు. ఇంట్లో నగలు, నగదు చోరీ క్రిష్ణగిరి: ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగులగొట్టి నగలు, నగదు దోచుకెళ్లిన ఘటన సూళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. సూళగిరి తాలూకా అడ్డగురికి గ్రామానికి చెందిన రవి దంపతులు గురువారం కూలి పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటి కొచ్చి చూడగా ఇంటి తాళాలు పగులగొట్టినట్లు గుర్తించారు. లోపలకి వెళ్లి చూడగా బీరువాలో ఉంచిన 6 పౌన్ల బంగారు నగలు, రూ.20 వేల నగదు కనిపించ లేదు. గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లినట్లు తెలియడంతో సూళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 8న మలూరుకు సీఎం సిద్దుమాలూరు: మాలూరులో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య జూన్ 8వ తేదీన రానున్నారని ఎమ్మెల్యే కేవై నంజేగౌడ తెలిపారు. మాలూరులోని శ్రీరంగంకళ్యాణ మంటపంలో బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ పథకాల లబ్ధిదారులకు సీఎం హక్కు పత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు. 800 పైగా వసతి లేని వారికి ఇళ్ల స్థలాల పట్టాలను అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తిగళ సముదాయ మండలికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న మంజునాథ్ను ఎమ్మెల్యే అభినందించారు. -
డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాల్సిందే
హొసపేటె: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఐఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐఎం నేత భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమని తెలిపారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలు, సామాన్యులు, చిరు ఉద్యోగులపై పెట్రో ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. సామాన్యుల నడ్డి విరిచేలా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని మండిపడ్డారు. ధరల నియంత్రణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇంకా పొదుపు మంత్రం చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. డీజిల్ కోసం రైతుల బారులు హొసపేటె: పెట్రోల్, డీజిల్ కోసం ఇప్పుడు బైకర్లే కాకుండా రైతులు కూడా క్యూ కట్టిన ఘటన విజయనగర జిల్లా హువినహడగలిలో గురువారం రాత్రి జరిగింది. ఇటీవల తొలకరి వర్షాలు కురవడంతో రైతులు తమ వ్యవసాయ పనులు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ట్రాక్టర్లకు అవసరమైన ఇంధనం లభించక పోవడంతో రైతులు గుర్రుగా ఉన్నారు. గురువారం రాత్రి మైలార గ్రామంలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద రైతులు రాత్రంతా డీజిల్ కోసం క్యూలో నిలబడ్డారు. కొన్ని పెట్రోల్ బంక్లో డీజిల్ నిల్వలు ఖాళీ అయ్యాయి. డీజిల్ అందుబాటులో ఉన్న బంక్ దగ్గర రైతులు క్యాన్లను క్యూలో ఉంచి డీజిల్ కోసం ఎదురు చూస్తున్నారు. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడం కనిపించింది. డీజిల్ ట్యాంకులు రాత్రికి ఆలస్యంగా వస్తాయనే ఆశతో రైతులు రాత్రంతా ఎదురు చూశారు. -
వ్యవసాయం రంగంపై ఆసక్తి పెంచుకోవాలి
రాయచూరు రూరల్: వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు వ్యవసాయం రంగంపై ఆసక్తి పెంచుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన అధికారి జాగృతి దేశ్మాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సార్ప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. నేడు అంతరించి పోతున్న వ్యవసాయ రంగానికి పునరుత్తేజం కల్పించేందుకు అన్ని విధాలుగా సహాయ పడాలని పేర్కొన్నారు. రైతులకు ఆధునికి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని సూచించారు. క్రమశిక్షణతో చదివితే ఉజ్వల భవిష్యత్తురాయచూరు రూరల్: నేటి పోటీ యుగంలో విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీనియర్ సంపాదకుడు సుశులేంద్ర తెలిపారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఇటీవల విడుదలైన పది, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన పాత్రికేయుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను బాగా చదివించాలని తెలిపారు. కార్యక్రమంలో విజయ్, సత్యనారాయణ, చెన్నబసవ, ఖాన్సాబ్, విశ్వనాథ్ పాల్గొన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు కృషి రాయచూరు రూరల్: దేశంలో ఉగ్రవాద నిర్మూలనకు అందరూ శ్రమించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్కుమార్ కాందూ పిలుపునిచ్చారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో జాతీయ ఉగ్రవాద దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలనపై అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు శాంతియుతంగా జీవనం సాగించాలంటే ఉగ్రవాదులను అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
అఖిల భారత కరాటే పోటీల్లో పతకాలు
బళ్లారి అర్బన్: అస్సాంలోని గౌహతిలో జరిగిన 24వ అఖిల భారత కరాటే చాంపియన్షిప్లో కర్ణాటక జట్టు క్రీడాకారులు పతకాల పంట పండించారు. ట్రెడిషనల్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బళ్లారి, విజయనగర జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. యశ్రాజ్, సాగర్ కవాసి, ధనిష్ రెడ్డి, బింద్యా, సరస్వతి కులకర్ణి ద్వితీయ స్థానాలు సాధించగా.. అక్షుభ్య రిహాన ఠాకూర్, అన్మోల్ కుమార్, ఆనంద్ కవాసి, రేవంత్ రెడ్డి, సూర్యదర్శిని, నవీన్ తృతీయ స్థానాల్లో నిలిచారు. 15 ఏళ్ల పై బడిన కటా జట్టు విభాగంలో పిసా అనూప్, కోమట్టి వరుణ్ బాబు, సరస్వతి కులకర్ణి బృందం మూడో స్థానం సాధించింది. 35 ఏళ్ల కమిటే, కటా విభాగాల్లో కొండయ్య రెండో స్థానంలో నిలిచాడు. విజేతలను అకాడమీ వ్యవస్థాపకుడు కట్టె స్వామి, టెక్నికల్ డైరెక్టర్ సుభాష్ చంద్ర, జిందాల్ విద్యా మందిర్ ప్రిన్సిపల్, కోచ్లు అభినందించారు. -
భూముల ఆక్రమణ
వెలుగులోకి పొరంబోకుసాక్షి, బళ్లారి: అధికారం ఉందనే అహంకారంతో తమ వార్డు పరిధిలోని వంక పొరంబోకు భూమిని ఆక్రమించి, ఇంటి స్థలాలుగా విభజించి విక్రయాలకు పాల్పడిన ఓ కాంగ్రెస్ నాయకుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బళ్లారి నగరంలోని 7వ వార్డు పరిధిలోని బాపూజీ నగర్ సమీపంలోని సర్వే నంబర్ 125లో మొత్తం 17 ఎకరాల వంక పొరంబోకు భూమి ఉంది. ఒక్కో సైట్ సుమారు మూడు సెంట్లు ఉండేలా విభజించి రూ.2 లక్షలకే ఇస్తానని చెప్పి పలువురిని ఆకర్షించాడు. అంతేకాక, వాటికి సంబంధించిన రికార్డులు కూడా సిద్ధం చేసి ఇస్తానని.. తన భార్య కార్పొరేటర్, అధికారంలో ఉన్నది తమ పార్టీ అని చెప్పి ఎవరూ అడ్డుకోలేరని నమ్మబలికాడు. ఆయన మాటలు నమ్మిన కొందరు డబ్బు చెల్లించి స్థలాలు కొనుగోలు చేయగా.. మరికొందరు పునాదులు కూడా వేశారు. ఒకరిద్దరు ఇళ్ల నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. భూమి ఆక్రమణపై చర్యలు.. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో శుక్రవారం రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు పోలీసు బలగాల సహాయంతో జేసీబీలు తీసుకెళ్లి అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇదే తరహాలో మరో వ్యక్తి కూడా తన మూడు ఎకరాల పట్టా భూమి పక్కనే పాత్రబూదిహాల్ గ్రామ సర్వే నంబర్లో సుమారు 70 సెంట్ల వంక పొరంబోకు భూమిని ఆక్రమించాడు. రోడ్లు, సైట్లు వేసి విక్రయాలకు సిద్ధం చేసినట్లు గుర్తించి అధికారులు మెరుపు దాడి చేసి ఆక్రమణలు తొలగించారు. ఒక్కో సైట్ రూ.2 లక్షలు.. ఒక్కో సైట్కు రూ.2 లక్షలకు పైగా చెల్లించామని స్థానిక రెవెన్యూ అధికారుల వద్ద బాధితులు తమ గోడు చెప్పుకున్నారు. తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వంక పొరంబోకు భూమి అని తెలియదని, న్యాయం చేయాలని వేడుకున్నారు. డబ్బు పెట్టి స్థలాలు కొనుగోలు చేసినట్లు కన్నీటి పర్యంతమయ్యారు. సర్వే నంబర్ 125లోని మొత్తం 17 ఎకరాలు వంక పొరంబోకు భూమి అని.. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లు నిర్మించేందుకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. డబ్బు తీసుకున్న వారిపై కేసులు పెట్టాలని సూచించారు. సరైన ఆధారాలు లేని భూములు లేదా ఇంటి స్థలాలను కొనుగోలు చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు.అక్రమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏడీసీ మహమ్మద్ జుబేదార్, అసిస్టెంట్ కమిషన్ రాజేష్, తహసీల్దార్ రేఖ, డీడీఎల్ఆర్, ఏడీఎల్ర్ బళ్లారప్ప, ఆర్ఐలు, వీఏలు నరేంద్ర, సురేష్, ఉమేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సైట్లుగా విభజించి విక్రయించిన కాంగ్రెస్ నాయకుడు పోలీసు బలగాల సహాయంతో రెవెన్యూ, కార్పొరేషన్ అధికారుల దాడి జేసీబీలతో అక్రమ నిర్మాణాల తొలగింపు -
విద్యార్థులకు సహాయం చేయడం బాధ్యత
బళ్లారి అర్బన్: ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయం చేయడం సమాజ బాధ్యత అని బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి అన్నారు. నగరంలోని బీడీఏఏ గ్రౌండ్ ఆడిటోరియంలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలోని 7 ఎయిడెడ్ కళాశాలలకు చెందిన 129 మంది విద్యార్థులకు ట్రస్ట్ స్కాలర్షిప్స్ అందజేసిందని తెలిపారు. విద్యార్థులకు ఈ సహాయం ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు సహాయం చేయాలని ట్రస్ట్ ప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో మెహతాబ్, ఎర్రిస్వామి, కప్పగల్లు చంద్రశేఖర్ ఆచార్, ఎమ్మిగనూర్ జగదీష్, కాంగ్రెస్ నాయకుడు సుబ్బరాయుడు, కళాశాల ప్రిన్సిపల్లు విద్యార్థులు పాల్గొన్నారు. -
మహిళలపై నేరాలు కొనసాగడం దారుణం
సాక్షి బెంగళూరు: దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. నేటి ఆధునిక కాలంలోనూ మహిళలు ఇప్పటికీ అక్కడక్కడ లైంగిక వేధింపులు, అత్యాచారాలకు గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతకు పటిష్ట చట్టాలు రూపొందిస్తున్నాయి. వారి రక్షణ కోసం అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా అతివలపై వేధింపులు, దాడులకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు. వారిపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు కూడా చెబుతున్నాయి. ఇక ఎంతో వేగంగా విస్తరిస్తూ, అభివృద్ధి చెందుతూ ప్రపంచ స్థాయి నగరంగా పేరొందిన బెంగళూరు నగరంలో కూడా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మహిళల భద్రతకు ఎన్నో చర్యలు చేపట్టినా.. సిలికాన్ సిటీ బెంగళూరులో మహిళల భద్రత కోసం పోలీసు శాఖ ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. అయితే ఈ చర్యలన్నీ కొద్దిమేర సత్ఫలితాలు ఇస్తున్నా, పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించడంలో విఫలం అవుతున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాల్లో దేశంలోనే మూడో స్థానంలో బెంగళూరు నిలిచింది. ఎన్సీఆర్బీ విడుదల చేసిన నివేదిక– 2024 ప్రకారం దేశంలోని 19 ప్రధాన మెట్రో పాలిటన్ నగరాలకు గాను మహిళలపై జరుగుతున్న నేరాల పరంగా ఢిల్లీ, ముంబై తొలి రెండు స్థానాల్లో నిలిస్తే ఆ తర్వాత స్థానంలో ఐటీ సిటీ బెంగళూరు నిలిచింది. మహిళలపై జరిగిన లైంగిక దాడులు, అత్యాచారాలు, వరకట్న వేధింపులు తదితరాలన్నీ కలుపుకుని 2024లో మొత్తం 4,748 కేసులు నమోదయ్యాయి. ఇక 2023లో ఈ సంఖ్య 4,870గా ఉండడం గమనార్హం. గణనీయమైన మార్పులేమీ లేవు ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం మహిళలపై అత్యాచార కేసుల్లో గణనీయమైన మార్పులు ఏమీ కనిపించలేదు. 2023లో 169 కేసులు నమోదైతే 2024లో ఆ సంఖ్య 168గా నమోదైంది. లైంగిక వేధింపుల కేసులు గత ఏడాది కంటే 30 శాతం మేర పెరిగాయి. 2023లో మొత్తం 210 లైంగిక వేధింపులు కేసులు నమోదు కాగా, 2024లో మొత్తం 180 లైంగిక వేధింపులు రికార్డయ్యాయి. మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు సంబంధించిన కేసుల్లో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. మొత్తం 897 కేసులు నమోదయ్యాయి. ఇక మహిళలను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన కేసుల సంఖ్య 66గా ఉంది. ఇక వరకట్న వేధింపుల మరణాలు కూడా బెంగళూరులో పెరిగాయి. 2024లో బెంగళూరులో మొత్తం 25 వరకట్న వేధింపుల మరణాలు రికార్డయ్యాయి. వరకట్న మరణాల్లో జైపూర్ నగరంతో పాటు బెంగళూరు నాల్గో స్థానాన్ని పంచుకుంది. ప్రతీకాత్మక చిత్రాలు బెంగళూరులో మహిళలపై అత్యాచారాలు ఎక్కువ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన సిలికాన్ సిటీ బెంగళూరు వంటి మహానగరంలో మహిళలపై నేరాలు ఇంకా కొనసాగుతుండడం ఏమాత్రం మంచిది కాదని పలు మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి రోజూ దినపత్రికల్లో లైంగిక దాడులకు సంబంధించిన అనేక కేసులు ప్రచురితం కావడం ఇంకా చూస్తూనే ఉన్నామని, ఇలాంటి తరుణంలో బాధితుల పక్షాన నిలబడి ప్రతి ఒక్కరూ న్యాయం కోసం పోరాటం చేయాలని ఆయా సంఘాలు పిలుపునిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 19 మహానగరాల్లో నమోదైన మహిళలపై లైంగిక దాడి కేసుల్లో దాదాపు 28 శాతం భర్త లేదా బంధువులే నిందితులుగా ఉన్నారని ఎన్సీఆర్బీ లెక్కలు చూస్తుంటే అర్థమవుతోందని చెబుతున్నాయి. కేవలం లైంగిక దాడులే కాకుండా 20.1 శాతం కిడ్నాప్ కేసులు కూడా నమోదవుతుండడం మహిళల భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. -
బనశంకరీదేవికి విశేష పూజలు
బనశంకరి: భక్తుల మొక్కులు తీర్చే కల్పవల్లి బనశంకరీదేవి ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చింది. ఆలయ ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం వేకువజామున సుప్రభాతసేవ అనంతరం బనశంకరీదేవీ మూలవిరాట్కు ప్రత్యేక అర్చనలు, అభిషేకం నిర్వహించి వివిధ పుష్పాలతో విశేష అలంకరణచేసి పూజలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు.పేదల ఓట్ల తొలగింపునకు కుట్ర ● సర్పై డీసీఎం డీకే శివకుమార్ దొడ్డబళ్లాపురం: పేదల ఓట్లు తొలగించేందుకు ప్రత్యేక సవరణ ప్రక్రియ(సర్) సాకుతో కుట్ర చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. శుక్రవారం బెంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. తమ కార్యకర్తలు సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఎల్ఏలకు సర్పై అవగాహన కల్గిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యకర్తలకు వివరిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ పిటిషన్ ఇవ్వాలన్నారు. లేకుంటే ఓటు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాగే జరిగిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయన్నారు. ఓటర్లు ఓటు కోల్పోతే అనేక ప్రభుత్వ పథకాలను పొందలేరన్నారు. కాటేసిన కనురెప్ప ● కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం యశవంతపుర: తాగిన మత్తులో ఓ తండ్రి 13 ఏళ్ల కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా అంకోలా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. తండ్రి క్రూరత్వ ఘటనను బాలిక చుట్టుపక్కల కుటుంబాలకు చెప్పటంతో ఈ విషయం బహిరంగమైంది. తక్షణం పక్కింటివారు అంకోలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి తండ్రిని అరెస్ట్ చేసి బాలికను అంకోలా ఆస్పత్రికి పరీక్ష నిమిత్తం తరలించారు. ప్రగతి పరిశీలన బనశంకరి: ప్రగతి, ఉత్పత్తి సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి తదితర అవకాశాలను నిర్ణయించే దృష్ట్యా హెచ్ఎంటీ మెషిన్ అండ్ టూల్స్ లిమిటెడ్, ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్, ప్లూయిడ్ కంట్రోల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాయకత్వ బృందాలతో శుక్రవారం కేంద్రమంత్రి హెచ్డీ.కుమారస్వామి ప్రగతి పరిశీలన సమావేశం నిర్వహించారు. స్థానిక ఉత్పత్తి సామర్థ్యం బలోపేతం చేయడం, సాంకేతిక పరిజ్ఞాన పోటీతత్వాన్ని పెంచడంపై దృష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు. ఇంజనీరింగ్, నికర ఉత్పత్తి, పరీక్ష, పరిశోధనలు, భారత పారిశ్రామిక పరిసర వ్యవస్దలో ప్రముఖ పాత్ర వహిస్తాయన్నారు. రాజ్యసభ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ శివాజీనగర: వచ్చే నెలలో ఖాళీ అవుతున్న రాజ్యసభలోని కర్ణాటకకు చెందిన నాలుగు స్థానాలతో పాటు మొత్తం 24 స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. జూన్ 18న పోలింగ్ జరుగనుంది. నామినేషన్ సమర్పణకు జూన్ 8 ఆఖరి రోజు. నామినేషన్ ఉపసంహరణకు జూన్ 11 ఆఖరి తేదీ. జూన్ 18న ఓట్ల లెక్కింపు జరిపి ఆరోజునే ఫలితాలు ప్రకటిస్తారు. ఈ 24 మంది రాజ్యసభ సభ్యులు వివిధ రాష్ట్రాల శాసనసభల నుంచి ఎన్నికవుతారు. ప్రస్తుతం కర్ణాటకను ప్రాతినిథ్యం వహిస్తున్న జేడీఎస్ అధినేత హెచ్.డీ.దేవెగౌడ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బెళగావి బీజేపీ నాయకుడు ఈరణ్ణ కదడి, దక్షిణ కన్నడ బీజేపీ నాయకుడు కే.నారాయణల రాజ్యసభలో ప్రస్తుత కాలావధి జూన్ 25న పూర్తి కానుంది. దేవెగౌడ మరో అవధికి రాజ్యసభలోకి ప్రవేశిస్తారనే చర్చ రాజకీయ రంగంలో ఆరంభమైంది. రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం ఖాళీ కానున్న నాలుగు స్థానాల్లో 3 స్థానాలు కాంగ్రెస్కు లభించనున్నాయి. బీజేపీకి ఒక స్థానం మాత్రమే లభించే అవకాశముంది. 93 ఏళ్ల వయస్సులో కూడా దేవెగౌడ మరోసారి రాజ్యసభలోకి ప్రవేశించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే వారి పార్టీకి సంఖ్యా బలం లేని కారణంగా బీజేపీ సహాయ హస్తం అందిస్తే రాజ్యసభలోకి ప్రవేశించవచ్చనే అంచనాలో జేడీఎస్ పార్టీ అధినాయకత్వం ఉంది. -
అనుమానాస్పదంగా యువతి మృతి
● ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మన హళ్లిలో ఓ యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. మృతురాలిని ప్రియాంక (27)గా గుర్తించారు. ప్రియాంక స్థానికంగా ఉన్న మియా ఫ్యాషన్ బట్టల దుకాణంలో పని చేస్తోంది. ఆమెకు గతంలో వివాహం జరిగి, అనంతరం విడాకులు అయినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో ప్రియాంక ఇద్దరు యువకులతో కలిసి బయటకు వెళ్లినట్లు తెలిసింది. అనంతరం ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును హిట్ అండ్ రన్గా భావిస్తున్న పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ జాహ్నవి, డీవైఎస్పీలతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు హగరిబొమ్మన హళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరుణుడి విధ్వంసంతో ఉద్యాననగరి విలవిల
భారీ వర్షానికి కుప్పకూలిన టెంట్లు, ఫ్లెక్సీ బ్యానర్లు ● అంతర్జాతీయ స్టేడియం శంకుస్థాపనకు ఆటంకం బొమ్మనహళ్లి : బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ తాలూకాలోని సూర్యనగర్ నాలుగో స్టేజ్లో అంతర్జాతీయ స్టేడియానికి శనివారం సీఎం శంకుస్థాపన చేయనుండగా గురువారం రాత్రి ఆకస్మిక ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ టెంట్ (పందిరి) పూర్తిగా ముక్కలై నేలమట్టమైంది. ఇనుప స్తంభాలు, భారీ షీట్లు, కటౌట్లు, స్వాగత బ్యానర్లు పెనుగాలులకు కొట్టుకుపోయాయి. గాలి తీవ్రతకు గూడ్స్ వాహనం బోల్తా పడిపోయింది. శనివారం నాటి ముహూర్తం కోసం మొత్తం పాలనా యంత్రాంగం సిద్ధంగా ఉన్న సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక షామియానా కేవలం గంట వర్షానికే పూర్తిగా ధ్వంసమైంది. బనశంకరి: సిలికాన్సిటీ బెంగళూరు నగరంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి భారీ విధ్వంసం చోటు చేసుకుంది. జయనగర, బసవనగుడి, రాజాజీనగర, విజయనగర, ఆర్టీ.నగర, శేషాద్రిపురం, చామరాజపేటె, జేపీ.నగర, సదాశివనగర తో పాటు 50కి పైగా ప్రదేశాల్లో 40కిపైగా భారీ వృక్షాలు నేలకూలిపోయాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. కార్లు, బైకులు దెబ్బతిన్నాయి. స్తంభాలు నేలకూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజాజీనగరలో వెస్ట్ ఆఫ్కార్డ్స్ రోడ్డులో చెట్టు కూలి రోడ్డుబ్లాక్ కాగా సర్వీస్రోడ్డులో వాహనాలను మళ్లీంచారు. మహాలక్ష్మీలేఔట్ పైపులైన్ రోడ్డులో చెట్లు కూలి కార్లు ధ్వంసమయ్యాయి. చెట్టు తొలగించడం ఆలస్యం కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల సగానికి పైగా చెట్టు తొలగించి పుట్పాత్లో వదిలిపెట్టి వెళ్లిన ఆరోపణలు వినిపించాయి. జీబీఏ పరిధిలో ఆరు కంట్రోల్ రూమ్లకు 600కు పైగా ఫిర్యాదులు అందాయి. ఇళ్లలోకి నీరు చొరబడటం, విద్యుత్ అంతరాయం, చెట్లు విరిగిపడి రోడ్డుబంద్ కావడంపై ఫిర్యాదులు అందాయి. వర్షానికి కూలిపోయిన చెట్లు త్వరితగతిన తొలగించాలని జీబీఏ కమిషనర్ మహేశ్వరరావ్ నగరపాలికెలకు సూచన చేశారు.రాజాజీనగర మోదీ ఆసుపత్రి వద్ద కారుపై కూలిన వృక్షంచామరాజపేటె పచ్చప్ప సర్కిల్ వద్ద జలమయమైన దృశ్యం చెట్ల తొలగింపులో జాప్యంపై ఫిర్యాదుల వెల్లువ -
బంగారం తాకట్టు పెడితే.. అందరికీ బురిడీ
అలా.. అల గురువారం మంగళూరులో తన్నీరుబావి బీచ్లో అలలపై యువ సర్ఫర్ విన్యాసం. త్వరలో జాతీయ సర్ఫింగ్ పోటీలు జరగనున్నాయి మైసూరు: మీరు డిపాజిట్ చేసిన బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకే కొనుగోలు చేస్తా. మిగిలిన డబ్బును వెంటనే ఇస్తానని చెప్పి వందలాది మందిని మోసం చేసిన ఆరోపణలపై జైలు పాలైన సౌందర్ రాజ్ అలియాస్ చిన్నతంబికి చెందిన ఎస్డీజే గోల్డ్ కంపెనీపై కేవలం 4 రోజుల్లోనే సీసీబీకి 200కు పైగా ఫిర్యాదులు అందాయి. చిన్నతంబి చేసిన మోసంపై పత్రాలతో ఫిర్యాదులు స్వీకరించాలని మైసూరు నగర పోలీస్ కమిషనర్ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంవత్సరాలుగా చిన్నతంబి చేసిన మోసాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మైసూరు, మండ్య, బెంగళూరుతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి 200 మందికి పైగా ప్రజలు సరైన పత్రాలతో మైసూరులోని సీసీబీ కార్యాలయాన్ని సంప్రదించి న్యాయం చేయాలని కోరుతున్నారు. అనుబంధ సంస్థలైన డీజీఎఫ్ గోల్డ్ అండ్ డైమండ్స్, ధన గణపతి ఫైనాన్స్పై నమోదైన బహుళ కోట్ల రూపాయల బంగారు మోసం కేసులో బాధితులు సీసీబీకి ఫిర్యాదు చేస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా, దావణగెరె, మైసూరు, హాసన్కు చెందిన ముగ్గురు వ్యక్తులు చిన్నతంబి మోసాల వలలో చిక్కుకుని రూ.40 లక్షలకు పైగా పోగొట్టుకున్నట్లు తేలింది. ఇంకా చాలా మంది రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు నష్టపోయారు. తక్షణం తమకు డబ్బు లేదా బంగారం ఇప్పించాలని మహిళలకు గొడవకు దిగుతున్నారు. డిపాజిట్ల రక్షణ చట్టం కింద కేసు కేపీఐడీ (కర్ణాటక డిపాజిటర్ల ఆర్థిక సంస్థల ప్రయోజనాల పరిరక్షణ చట్టం) చిన్నతంబిపై మైసూరు నుంచి బీదర్ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక ఆర్థిక సంస్థల డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నారు. కేసు దర్యాప్తుకు సమయం అతనిపై నిరంతరం ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు పూర్తి కావడానికి మరో నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుందని ఈ కేసు దర్యాప్తు అధికారి, సీసీబీ ఏసీపీ మహమ్మద్ షరీఫ్ రావార్తా తెలిపారు. ఇటీవల బంగారు ఆభరణాల అమ్మకం లేదా తాకట్టుకు సంబంధించి మైసూరు నగర పోలీసుల అధికారిక ఫేస్బుక్ పేజీలో ఒక వీడియో, అవగాహన పోస్టర్ను విడుదల చేశారు. మోసపూరిత సంస్థలతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయవద్దని పౌరులను హెచ్చరించారు. మైసూరులో ఘరానా మోసం గుట్టురట్టు వందలాది బాధితులు లబోదిబో బడా మోసగాడు చిన్నతంబి అరెస్టు ఇప్పటికే 200 మంది ఫిర్యాదు -
అతలాకుతలం
బనశంకరి: రుతుపవనాలకు ముందుగానే రాజధాని బెంగళూరులో వర్షాలు పలకరిస్తున్నాయి. గురువారం సాయంత్రం భారీ గాలులు, ఉరుములు పిడుగుల మధ్య జడివాన కురిసింది. నగరం అతలాకుతలమైంది. వాహనాలు ఎక్కడివక్కడే ● బెంగళూరులో మెజస్టిక్, సంపంగి రామనగర, కంఠీరవ స్టేడియం, కార్పొరేషన్ సర్కిల్, ఎంజీ.రోడ్డు, గాంధీనగర, రిచ్మండ్సర్కిల్, హలసూరు.. ఇలా అన్ని ప్రాంతాలో ఆకస్మిక జడివాన హడలెత్తించింది. ● రోడ్లు జలమయం కావడంతో కార్లు, బైక్లు చిక్కుబడిపోయారు. ఇళ్లకు వెళ్లేవారందరూ రోడ్లపై నిలబడిపోయారు. ● శాంతినగర, లాల్బాగ్, కబ్బన్పార్కు, జయనగర, రాజాజీనగర, బసవేశ్వరనగర, విధానసౌధ, విల్సన్గార్డెన్, కన్నింగ్హ్యామ్ రోడ్డులో వడగండ్లు కురిశాయి. ● దాదాపు అన్ని కూడళ్లలో రాత్రి పొద్దుపోయే వరకూ ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. విధానసౌధ, వికాససౌధ, నృపతుంగ రోడ్డు, మైసూరు బ్యాంక్ సర్కిల్, కబ్బన్ పార్కుతో పాటు ప్రముఖ రోడ్లలో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. కార్ల మీద పడిన చెట్లు ● నగరంలో అనేకచోట్ల చెట్లు కూలి ప్రజల ఇబ్బందులను తీవ్రం చేశాయి. వెస్ట్ కార్డు రోడ్డులో సిటి ఆసుపత్రి వద్ద చెట్టు కూలి రెండుకార్లు ధ్వంసమయ్యాయి. ● ఇందిరానగర 16 వ క్రాస్లో చెట్టు పడి కారు దెబ్బతింది. ఎవరికీ ఏమీ కాలేదు. ● కృష్ణరాజపురం దూరవాణి నగర చర్చ్ వద్ద చెట్టు, కరెంటు స్తంభం రోడ్డుకు అడ్డుగా పడ్డాయి. దీంతో దూరవాణినగర, రామూర్తినగర రోడ్డులో సంచారం బందయింది. ● రాజాజీనగర కేతమారనహళ్లి వరదరాజస్వామి ఆలయంలో చెట్టు కూలి ఆలయం మీద పడింది. కేఆర్ సర్కిల్ వద్ద అండర్పాస్ను మూసేయడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ● అర్ధగంట కురిసిన వర్షానికే బెంగళూరు మధ్యభాగం కకావికలమైంది. మెట్రో రైళ్లకు బ్రేక్ వర్ష తీవ్రత ఎంతగా ఉందంటే నమ్మ మెట్రో రైళ్లకు కూడా ఆటంకం ఏర్పడింది. గ్రీన్, పర్పుల్ లైన్తో పాటు ప్రముఖ మార్గాల మెట్రో సర్వీసులు అస్తవ్యస్తమయ్యాయి. గాలీవాన వల్ల అన్ని మెట్రో మార్గాల్లో సేవలకు అంతరాయం ఏర్పడిందని, ప్రయాణికుల భద్రత తమ మొదటి ప్రాధాన్యత అని మెట్రో సంస్థ తెలిపింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది. బెంగళూరులో జడివాన కూలిన చెట్లు, ట్రాఫిక్ ఇబ్బందులు పలుచోట్ల మెట్రో సర్వీసులకు అంతరాయం -
హైకోర్టుకు ఒకటో తరగతి.. ఆరేళ్ల గొడవ
బనశంకరి: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి చేరడానికి వయో పరిమితి నిబంధనను పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మార్చి 28 తేదీన విద్యాశాఖ విధించిన నిబంధనలను ప్రశ్నిస్తూ బెంగళూరుకు చెందిన పలువురు తల్లిదండ్రులు హైకోర్టులో అర్జీలు దాఖలు చేశారు. గురువారం హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఆర్.కృష్ణకుమార్ విచారించారు. ఒకటో తరగతిలో చేరాలంటే 6 ఏళ్లు పూర్తయి ఉండాలనే నిబంధన సరికాదని వారి న్యాయవాదులు వాదించారు. 5 ఏళ్ల 5 నెలలు పూర్తయిన బాలలను చేర్చుకోవాలన్నారు. దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు. జడ్జి స్పందిస్తూ వయో పరిమితి సడలింపును పునఃపరిశీలించి వారంలోగా పూర్తిస్థాయి ఉత్తర్వులు ఇవ్వాలని ప్రాథమిక విద్యాశాఖను ఆదేశించారు. కాగా, గత కొన్నేళ్లుగా ఒకటో తరగతిలో బాలల వయసుపై వివాదం సాగుతోంది. దీంతో తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారింది. గృహలక్ష్మీ సొమ్ము కోసం కోర్టుకు మహిళలు శివాజీనగర: పంచ గ్యారెంటీలలో ఒకటైన గృహలక్ష్మీ పథకం లబ్ధిదారులకు పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు, ప్రభుత్వానికి నోటీస్ జారీచేసింది. పలువురు మహిళలు కోర్టుకెక్కడమే కారణం. బెంగళూరులోని ఆర్.గంగా, జీ.డీ.పవిత్ర అనే లబ్ధిదారులు తమకు డబ్బులు పడడం లేదని ప్రజాహిత పిటిషన్ను దాఖలు చేయగా, న్యాయమూర్తులు జస్టిస్ సూరజ్ గోవిందరాజు, కే.మన్మథరావులు విచారించారు. ఈ పథకం పేద మహిళలకు మంచిదే. కానీ నెలనెలా డబ్బులు పడడం లేదు, పెండింగ్లో ఉన్న సొమ్మును లబ్ధిదారుల ఖాతాలకు విడుదల చేసేలా సర్కారును ఆదేశించాలి అని పిటిషనర్ల వకీలు విన్నవించారు. దీనిపై సమాధానం ఇవ్వాలని జడ్జిలు సర్కారుకు నోటీసులు జారీచేసి వాయిదా వేశారు. వయో పరిమితిపై తల్లిదండ్రుల పిటిషన్లు వారంలోగా తేల్చాలన్న కోర్టు -
నీట్ అక్రమాలకు కేంద్రానిదే బాధ్యత
శివాజీనగర: జాతీయ నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం బెంగళూరులో బృహత్ ధర్నా జరిగింది. స్వతంత్ర పార్కులో జరిగిన ధర్నా సభలో సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలాతో పాటుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్ను నాశనం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ రాజీపడ్డారు అనే పేరుతో టీషర్టును సీఎం విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మానవ వనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. నీట్ రద్దుతో 22 లక్షల మందికి పైగా విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు, నీట్ అక్రమాలకు కేంద్రానిదే బాధ్యత అన్నారు. నీట్ పరీక్షలో పదే పదే అక్రమాలు జరుగుతున్నాయి. దీనికి బదులు రాష్ట్రాలే పరీక్ష నిర్వహించేలా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గవర్నర్కు వినతిపత్రం ధర్నా తరువాత కాంగ్రెస్ కార్యకర్తలు చలో లోక్భవన్ ర్యాలీ చేపట్టారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఆ తరువాత కొందరు నాయకుల బృందం గవర్నర్కు వినతి పత్రాన్ని సమర్పించింది. కాంగ్రెస్ నేతల ధ్వజం ధర్నాలో పాల్గొన్న సీఎం సిద్దు -
ధర్మస్థలలో ఫోరెన్సిక్ తనిఖీలు
దొడ్డబళ్లాపురం:ఽ దేశంలో సంచలనం కలిగించిన ధర్మస్థలలో అస్థిపంజరాల లభ్యం కేసులో పోలీసు ఫోరెన్సిక్ సిబ్బంది మరోసారి దర్యాప్తు ప్రారంభించారు. 4 నెలల క్రితం ధర్మస్థలలోని బంగ్ల గుడ్డె అడవిలో 7 అస్థిపంజరాలు దొరికాయి. వాటిని బెంగళూరు మడివాళలోని ఎఫ్ఎస్ఎల్ సెంటర్కి తరలించి పరీక్షలు జరిపారు. గురువారంనాడు ముగ్గురు ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది బెంగళూరు నుంచి ధర్మస్థలకు వెళ్లారు. ఎముకలు లభించిన చోటును పరిశీలించారు. ఈ సందర్భంగా నిందితుడు ప్రదీప్ని కూడా తీసుకెళ్లారు. అది వదంతి మాత్రమే: డీకే మైసూరు: చామరాజనగరను సందర్శిస్తే అధికారం చేజారడం ఖాయం అనేది కేవలం తప్పుడు వదంతి మాత్రమేనని, ఎలాంటి నిజం లేదని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. ఆయన గురువారం చామరాజనగర జిల్లాలో కొళ్లెగాలలో విలేకరులతో మాట్లాడారు. చామరాజనగర పుణ్యక్షేత్రాలతో కూడిన పుణ్యభూమి అని అభివర్ణించారు. గతంలో కోవిడ్ సమయంలో ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించినవారి కుటుంబీకులకు ఉద్యోగాలు కల్పించామన్నారు. తమిళనాడుకు 177 టీఎంసీల కావేరి నీటిని వదలాలన్న సుప్రీంకోర్టు ఆదేశంపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. సీఎం గొడవను తేల్చేయాలి ● కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ శివాజీనగర: సీఎం కుర్చీ వివాదాన్ని హైకమాండ్ తక్షణమే పరిష్కరించాలని బంగారుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణస్వామి హైకమాండ్ను డిమాండ్ చేశారు. గురువారం విధానసౌధలో మాట్లాడుతూ... సీఎం కుర్చీపై గొడవ జరగకుండా ఉండాల్సింది. ప్రజలు 136 స్థానాలు ఇచ్చారు. రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గ పునర్విభజన చేసి, పని చేయని మంత్రులను తొలగించి ఉంటే సరిపోయేది. సీఎం కుర్చీ రభసపై ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సిద్దరామయ్యను కొనసాగిస్తారా?, లేక మరెవరికై నా ఇస్తారా? అనేది హైకమాండ్ తేల్చేయాలి అని ఆయన అన్నారు. అనేక శాఖల్లో మంత్రుల మాటలను అధికారులు వినటం లేదు, దీనిని పరిష్కరించాలన్నారు. రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చాక తాను, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి మంత్రి పదవులను కోరతామన్నారు. 15 మంది కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం వస్తుందని తెలిసిందన్నారు. 26న ప్రధాని మోదీ రాక! దొడ్డబళ్లాపురం: ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర బీజేపీ వేడుకలను నిర్వహించనుంది. ఇందులో పాల్గొనడానికి ఈ నెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, 26న ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరుకు వస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. వివిధ రకాల కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. యలహంక సమీపంలోని ప్రైవేటు రిసార్టులో నితిన్ పార్టీ నేతలతో సమావేశం జరుపుతారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, పక్ష నేత ఆర్ అశోక్ తదితరులు ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్ర బీజేపీ సారథి ఎంపికపై కసరత్తు శివాజీనగర: రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుని నియామకంపై పార్టీ హైకమాండ్ కసరత్తుకు నాంది పలికింది. ప్రస్తుత అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర కొనసాగుతారో, లేదో.. కొత్త సారథి ఎవరో అనేది ఉత్కంఠకు బీజమేసింది. రాష్ట్ర బీజేపీకి పూర్తిస్థాయి అధ్యక్షున్ని నియమించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నిర్ణయించారు. ప్రస్తుతం విజయేంద్ర తాత్కాలికంగా పదవిలో ఉన్నారు. సీనియర్ నేత శివప్రకాశ్ బుధవారం బెంగళూరుకు వచ్చారు. కొత్త సారథి గురించి పార్టీ ఆఫీసులో నాయకులతో అభిప్రాయాలను ఆలకించారు. రోజంతా ఈ భేటీ సాగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని స్థాయిల నాయకులు ఇందులో పాల్గొన్నారు. దీంతో అధ్యక్ష పదవికి పోటీ మొదలైనట్లు కనిపిస్తోంది. పెట్రో ధరలపై సీఎం భగ్గు శివాజీనగర: పెట్రోల్, డీజిల్పై ఉన్న రాష్ట్ర పన్నును తగ్గించేది లేదని సీఎం సిద్దరామయ్య చెప్పారు. కేంద్రం ధరలు పెంచడంతో, పన్నుల్ని తగ్గించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయడం తెలిసిందే. దీనిపై సీఎం విధానసౌధలో మాట్లాడుతూ కేంద్రం ధరలను పెంచితే, మేము తగ్గించాలా?, పెంచినవారిని అడగండి అని విలేకరులపై రుసరుసలాడారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇంధన ధరలు ఎలా ఉండేవి? మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు పెట్రోల్ రూ.70, డీజిల్ రూ.48 ఉండేవి. గ్యాస్ సిలిండర్ ధర రూ.414 ఉండేది. నేడు ధరలు ఎంత, ఎవరు పెంచారు? అని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మీరు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని మీడియాపై ఆగ్రహించారు. -
హంపీలో ప్రాచీన విగ్రహాల లభ్యం
హొసపేటె: ప్రసిద్ధ చారిత్రక హంపీలోని హజార రామ ఆలయం సమీపంలో భారతీయ పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతోంది. క్రీ.శ 1565లో జరిగిన తాళికోటె యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత శత్రువులు వందలాది ఆలయాలు, శిల్పాలను ధ్వంసం చేసినవి ఈ తవ్వకాల్లో బయట పడుతున్నాయి. ఆలయం ముందు సాగిన తవ్వకాలలో వైష్ణవ ఆళ్వారుల విగ్రహాలు లభించాయి. సుమారు 11 మంది ఆళ్వార్ల విగ్రహాలను యుద్ధం తరువాత పాడు చేసి ఉంటారని అధికారులు చెప్పారు. విగ్రహాలను ధ్వంసం చేసి గుంతలో వేసి మట్టితో కప్పేశారన్నారు. శిరచ్ఛేదం చేసిన రీతిలో ఈ విగ్రహాలు బయటపడ్డాయి. తవ్వకాలను కొనసాగిస్త్నుట్లు తెలిపారు. హజారా రామ మందిరం ముందు తవ్వకాలు -
2 రోజులు.. భారీ వానలు!
● బెంగళూరు సహా పలు జిల్లాలకు అలర్ట్ శివాజీనగర: రాష్ట్రంలో రెండు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ప్రకటించింది. బెంగళూరుకు ఆరెంజ్ అలర్ట్ వచ్చింది. భారీ వానల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. బీదర్, కల్బుర్గి, యాదగిరి, రాయచూరు, తుమకూరు, చిక్కబళ్లాపుర, కోలారు, బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గాలులతో భారీ వర్షం కురిసే అవకాశముంది. ఉత్తర, మధ్య కర్ణాటక జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీచేసింది. బెంగళూరులో పాలికె అధికారులు సిబ్బందిని సిద్ధం చేశారు. ఉద్యాననగరిలో మధ్యాహ్నం నుంచి దట్టంగా మేఘావృతమై తరువాత వర్షం ఊపందుకుంది. -
కారు, ఆటో ఢీ, 11 మందికి తీవ్ర గాయాలు
మైసూరు: కారు, ప్యాసింజర్ ఆటో ఎదురుగా ఢీకొనడంతో 11 మంది తీవ్రంగా గాయపడిన ఘటన జిల్లాలోని టీ.నరసీపుర తాలూకా చౌహళ్లి గ్రామం వద్ద జరిగింది. తలకాడు మెయిన్ రోడ్డులోని చౌహళ్లి గ్రామం వద్ద వేగంగా వచ్చిన కారు, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటో రోడ్డు పక్కకు బోల్తా పడింది. అందులోని ప్రయాణికులు లోపలే ఇరుక్కుపోయారు. కారు డ్రైవర్ మైసూరువాసి శివప్రకాష్ అరస్, ఆటోలో ఉన్న తలకాడువాసులు రాణి, మణి, పుట్టతాయమ్మ, రాచప్పాజీ తదితరులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే సహాయం చేసి ఆటోలోని 11 మంది క్షతగాత్రులను వెలికితీసి టీ.నరసీపుర ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం మైసూరులోని కేఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. టీ.నరసీపుర పోలీసు అధికారులు రెండు వాహనదారులపై కేసు నమోదు చేశారు. -
సకాలంలో పత్తి విత్తనాలు అందించండి
రాయచూరు రూరల్: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులకు సకాలంలో పత్తి విత్తనాలు అందించాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మరిలింగ పాటిల్ మాట్లాడారు. జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు అవకాశం కల్పించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. మార్కెట్ ధరకే విత్తనాలు, ఎరువులు విక్రయించాలన్నారు. గత ఏడాది దేవదుర్గ తాలూకాలో రైతులు వేలాది ఎకరాల్లో నకిలీ పత్తి విత్తనాలు వేసి నష్టాల పాలయ్యారన్నారు. ఎరువుల కొరత రాకుండా చూడాలని కోరుతూ వ్యవసాయ శాఖ జేడీ అహ్మద్కు వినతిపత్రం సమర్పించారు. ఉమాదేవి, మల్లేష్ నాయక్, నాగరాజ్, రమేష్, బసన గౌడ, పరమేష్లున్నారు. -
ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నింగప్ప
బళ్లారిఅర్బన్: కర్ణాటక రాష్ట్ర ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం 2026–31వ సంవత్సరాలకు జిల్లా విభాగానికి సి.నింగప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి ఈశయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియలో గుండప్ప నాగరాజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, పరశురామ చౌకాలి ఉపాధ్యక్షుడిగా, శాంతికుమారి ఎం.బసవనగౌడ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నింగప్ప వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. మిగిలిన ఇద్దరు ఆర్గనైజింగ్ కార్యదర్శులు, ఇద్దరు సంయుక్త కార్యదర్శులను తదుపరి కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో నియమిస్తామని నింగప్ప తెలిపారు. -
బెళగావి– సికింద్రాబాద్ రైలు ప్రారంభం
రాయచూరు రూరల్ : కుందానగరి బెళగావి నుంచి తెలంగాణలోని సికింద్రాబాద్కు వీక్లీ నూతన రైలును మాజీ ముఖ్యమంత్రి, బెళగావి లోక్సభ సభ్యుడు జగదీష్ శెట్టర్ మంగళవారం బెళగావి రైల్వే స్టేషన్లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ప్రతి మంగళవారం బెళగావి నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్కు మరుసటి రోజు ఉదయం చేరుతుంది. కాగా ఈ రైలు ప్రతి సోమవారం సికింద్రాబాద్లో 4.30 గంటలకు బయలుదేరి బెళగావికి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు చేరుతుంది. ప్రయాణికులు ఈ రైళ్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. శాసన సభ్యులు అభయ్ పాటిల్, అనిల్ బెనక, అధికారి ప్రేమ్చంద్ తదితరులు పాల్గొన్నారు. ఔషధ దుకాణ వ్యాపారుల నిరసనహొసపేటె: ఫార్మసీల వెల్లువ, ఆన్లైన్ భారీ డిస్కౌంట్లకు నిరసనగా విజయనగర జిల్లా వ్యాప్తంగా మందుల దుకాణాల వ్యాపారులు తమ దుకాణాలు మూసివేసి నగరంలో నిరసన చేపట్టారు. హొసపేటెలోని టౌన్ రీడింగ్ రూం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల గుండా అంబేడ్కర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మెడికల్ షాపుల యజమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో మందుల దుకాణాల యజమానులు నిరసనలో పాల్గొన్నారు. ఇంటి పైకప్పు కూలి మహిళ మృతిసాక్షి,బళ్లారి: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పాత మిద్దె కూలి ఓ మహిళ దుర్మరణం చెందిన ఘటన విజయపుర జిల్లా నిడగుంది పట్టణంలో జరిగింది. గౌరీశ్వర దేవస్థానం సమీపంలో మహాదేవి (55) తన ఇంట్లో నిద్రిస్తుండగా, ఇంటి పైకప్పు కూలి అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటి బయట భర్త శివానంద పడుకోవడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే నిడగుంది పోలీసులు చేరుకుని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల అరె్స్ట్కు వినతి రాయచూరు రూరల్: బీదర్లో కబడ్డీ క్రీడాకారిణిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయాలని కర్ణాటక భీమ సేన అధ్యక్షుడు శంకర్ రామలింగయ్య డిమాండ్ చేశారు. గురువారం బీదర్ జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. బీదర్లో నివాసముంటున్న క్రీడాకారిణిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారన్నారు. దళిత బాలికపై ఇలాంటి కృత్యానికి పాల్పడిన దోషులకు బీదర్ జిల్లా ఎస్పీ ప్రదీప్ రక్షణ కల్పిస్తున్నారని, ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు. స్పిరిట్ ట్యాంకర్ స్వాధీనం● నిందితుడు అరెస్ట్ ● 14 వేల లీటర్ల స్పిరిట్ జప్తు రాయచూరు రూరల్ : బెళగావి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 14 వేల లీటర్ల స్పిరిట్ను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎకై ్సజ్ శాఖ కమిషనర్ మంజునాథ్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఖానాపుర తాలూకా జాంజోట–కణకుంబి మధ్యలో స్పిరిట్ను తరలిస్తుండగా మైసూరు జిల్లా నంజనగూడుకు చెందిన సిద్దరాజ పుట్టస్వామి(47)ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఘటనపై ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
వాణిజ్యం, సాంకేతికత అభివృద్ధికి రెండు కళ్లు
హొసపేటె: వాణిజ్యం, సాంకేతికత అనేవి అభివృద్ధికి రెండు కళ్లులాంటివని బళ్లారి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మునిరాజు తెలిపారు. బుధవారం ప్రౌఢదేవరాయ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. వాటిలో ఏ ఒక్కటి దెబ్బ తిన్నా దేశాభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని తెలిపారు. ఈ విషయంలో సాంకేతికత, వ్యాపారం సమాంతరంగా దృష్టి సారిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధి కోసం విద్యార్థులు కష్టపడాలని అన్నారు. ఈ ప్రాంతం వెనుకబడినందున ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో లేవన్నారు. విద్యార్థులు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్లను ప్రారంభించి తమ సొంత కాళ్లపై నిలబడాలన్నారు. కాలేజీ పాలక మండలి అధ్యక్షుడు కల్గుడి మంజునాథ్, సభ్యులు సంగనబసవ, అనిల్, జవళి, ప్రిన్సిపాల్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.మునిరాజు -
విద్యుత్ షాక్తో కార్మికుడు మృతి
హొసపేటె: విజయనగర జిల్లా హూవినహడగలి తాలూకా రాజవాళ గ్రామంలో విద్యుత్ షాక్కు గురై ఒక కార్మికుడు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. మృతుడిని నవలికి చెందిన సురేష్(31)గా గుర్తించారు. రాజవాళ గ్రామంలో లైన్మెన్లతో కలిసి వెళ్లి విద్యుత్ స్తంభంపై సురేష్ మరమ్మతులు చేస్తున్నాడు. ఈ ఘటనలో సురేష్ స్తంభం మీదే విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. హిరే హడగలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాజీవ్గాంధీ సేవలు అనన్యం రాయచూరు రూరల్: దేశానికి మాజీ ప్రధాని రాజీవ్గాంధీ చేసిన సేవలు అనన్యమని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. అత్యంత ప్రభావశాలి ప్రధానమంత్రిగా ఉండి దేశంలో విజ్ఞాన, సాంకేతిక రంగంలో పురోగతి చెందేలా తీర్చిదిద్దారన్నారు. దేశ భద్రతను పటిష్ట పరిచే ప్రక్రియలో రాజీవ్గాంధీ చేసిన ప్రయత్నం మరువలేనిదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు చట్ట ప్రకారం రిజర్వేషన్లు, దళితులకు, మైనారిటీ, వెనుకబడిన వర్గాలకు పదవులు లభించే మార్గం దొరికిందన్నారు. కార్యక్రమంలో అమరేగౌడ, రుద్రప్ప, చేతన్, ఆంజనేయ, శంశాలం, శివమూర్తి, జయంత్రావ్లున్నారు. కుసుమ దిగుబడి ఘనం.. రైతన్న దరహాసం● ఈసారి ఆశించిన మేర పంట దిగుబడి ● కొనుగోళ్లకు ఏపీఎంసీ అధికారులు సిద్ధం రాయచూరు రూరల్: ఉత్తర, కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి, బాగల్కోటె, విజయపుర జిల్లాల్లో రైతులు తమ భూముల్లో సాగు చేసిన కుసుమ పంట ఆశించిన మేర దిగుబడి లభించింది. రాయచూరు జిల్లాలో రైతులు 10 వేల ఎకరాలు, బాగల్కోటె జిల్లాలో 25 వేల ఎకరాలు, యాదగిరి జిల్లాలో 5 వేల ఎకరాలు, కలబుర్గి జిల్లాలో 2 వేల ఎకరాల్లో కుసుమ పంటను సాగు చేశారు. పంటను విక్రయించడానికి రైతులు సిద్ధం కాగా ఏపీఎంసీ అధికారులు కొనుగోలుకు ముందుకు వచ్చారు. క్వింటాల్ ధర రూ.6,540 పలుకుతోంది. ఆన్లైన్లో నమోదు పూర్తి స్థాయిలో జరగడంతో కొనుగోలుకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు కొనుగోళ్లకు ముందుకు వచ్చారని రైతు సంఘం అధ్యక్షుడు అందానప్ప పేర్కొన్నారు. విమానాశ్రయ నిర్మాణం సత్వరం పూర్తి చేయాలి రాయచూరు రూరల్: జిల్లా కేంద్రం చేపడుతున్న విమానాశ్రయం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లాధికారిణి పూవిత సూచించారు. బుధవారం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆమె అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. భూ అభివృద్ధి, రన్ వే, మౌలిక సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కారు, లారీ ఢీ.. ఒకరు మృతి●ముగ్గురికి గాయాలు సాక్షి,బళ్లారి: కారు, లారీ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన జరిగింది. బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా సంకేశ్వర గోటూరు రోడ్డులో జరిగిన ప్రమాదంలో మహారాష్ట్రలోని పుణెకు చెందిన హనమంతు పాయాళ(55) అనే వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని బెళగావి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దారూఢ మఠానికి రూ.31.82 లక్షల కానుకలుహుబ్లీ: ప్రజల ఆరాధ్య దైవం సిద్దారూఢ మఠం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను ఆ మఠం స్ట్రేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ సిబ్బంది, భక్తుల సమక్షంలో లెక్కించారు. గత 27 రోజుల్లో హుండీల్లో రూ.31,82,905 నగదు, రూ.5,89,518 విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు లభించాయి. -
స్కూళ్లు సరే.. అయ్యవార్లేరీ?
రాయచూరు రూరల్: విద్యా రంగంలో వెనుక బడిన కళ్యాణ కర్ణాటకలో ఉత్తమ ఫలితాలు సాధించాలనే తపన తపనగానే మిగిలింది. కళ్యాణ కర్ణాటక పరిధిలో కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయనగర జిల్లాలు ఉన్నాయి. కలబుర్గి జిల్లాలో హైస్కూళ్లలో 550, ప్రాథమిక పాఠశాలల్లో 2740, రాయచూరు జిల్లా హైస్కూళ్లలో 926, ప్రాథమిక పాఠశాలల్లో 4304, యాదగిరి జిల్లా హైస్కూళ్లలో 761, ప్రాథమిక పాఠశాలల్లో 3363, కొప్పళ జిల్లా హైస్కూళ్లలో 589, ప్రాథమిక పాఠశాలల్లో 1952, బీదర్ జిల్లా హైస్కూళ్లలో 450, ప్రాథమిక పాఠశాలల్లో 607, బళ్లారి జిల్లా హైస్కూళ్లలో 496, ప్రాథమిక పాఠశాలల్లో 1450, విజయనగర జిల్లా హైస్కూళ్లలో 143, ప్రాథమిక పాఠశాలల్లో 860 ఉపాధ్యాయినుల పోస్టుల ఖాళీలు, పీఈటీ, డ్రాయింగ్ ఉపాధ్యాయులు 2745, విషయ పరిశీలకుల పోస్టులు 598 ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉపాధ్యాయుల ఉద్యోగాలను పొందిన ఏడాదికే మైసూరు, తుమకూరు, విజయపుర, బాగల్కోటె, గదగ్, హాసన, హావేరి, మండ్య, రామనగర, శివమొగ్గ, దావణగెరె తదితర జిల్లాలకు తిరిగి బదిలీలపై వెళ్లిపోయారు. నియామకాలపై నిర్లక్ష్యంతోనే చేదు ఫలితాలు వారి స్థానంలో ఉపాధ్యాయులను నియామకాలు చేసుకోవడంలో ప్రభుత్వం పెడ చెవిన పెట్టడం వల్ల నేడు పది ఫలితాల్లో తక్కువ శాతం ఉత్తీర్ణత ఫలితాలు వచ్చాయి. 48 మంది శాసన సభ్యులు, ఆరుగురు మంత్రులున్నా విద్యా రంగంపై మక్కువ చూపడంలో నిరాసక్తతను కనబరుస్తున్నారు. నూతనంగా 14 బీఈఓ పోస్టులతో పాటు కార్యాలయాలను ప్రారంభించడానికి కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి కార్యదర్శి, విద్యా శాఖ కమిషనర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కలబుర్గి జిల్లాలో యడ్రామి, కాళగ, కమలాపుర, యాదగిరి జిల్లాలో గురుమఠకల్, రాయచూరు జిల్లాలో అరికెరె, మస్కి, సిరవార, కొప్పళ జిల్లాలో కారటగి, కుకనూరు, బీదర్ జిల్లాలో చిటగుప్ప, కమలానగర, బళ్లారి జిల్లాలో కురుగోడు, విజయనగర జిల్లా కొట్టూరులో ప్రారంభించడానికి అనుమతించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. కల్యాణ కర్ణాటకలో 22,953 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అత్యధికంగా ఉపాధ్యాయినుల కొరత మౌనం వహించిన మంత్రులు, ఎమ్మెల్యేలు 14 కొత్త బీఈఓ ఉద్యోగాలకు ప్రతిపాదనలు -
వేశ్యావాటికలపై మెరుపు దాడి
బళ్లారిఅర్బన్: నగరంలో వేశ్యావాటికలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. అనంతపురం రోడ్డులోని గాంధీనగర్, ఏపీఎంసీ, కౌల్బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వేర్వేరు చోట్ల దాడులు చేసి విటులను అదుపులోకి తీసుకొని నలుగురు మహిళలను రక్షించి కేసులు నమోదు చేశారు. ఈనెల 17న గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సొంత లింగణ్ణ కాలనీలోని తిరుమల ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఒక ఇంటిపై పోలీసులు సెర్చ్ వారెంట్తో దాడి చేశారు. ఒక మహిళను రక్షించి ఈ కేసులో దేవి ప్రసాద్ను, సూరి అలియాస్ జల్లా సూరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 20న అనంతపురం రోడ్డు ఎన్బీ ఆస్పత్రి సమీపంలో ఉన్న నీలకంఠేశ్వర నిలయంలో అక్రమ లైంగిక కార్యకలాపాలు జరుగుతున్న సమాచారం మేరకు గాంధీనగర్ పోలీసులు మరోసారి దాడి చేసి ఒక మహిళను రక్షించి శ్రీసేవా నికేతన్కు అప్పగించారు. ఈ కేసులో నిందితుడు ఎస్.షాజబిన్ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీఎంసీ పోలీస్ స్టేషన్ పరిధిలో అగడి మారెప్ప కాంపౌండ్లో రెండో అంతస్తులో కేఎంఎస్ శకుంతలమ్మ ఇంటిపై పోలీసులు దాడి చేసి ఇద్దరు మహిళలను రక్షించి ఈ కేసులో గణేష్, ఉషాలను అరెస్ట్ చేశారు. నిందితురాలు శాంతి పరారీలో ఉన్నట్లు తెలిపారు. కౌల్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బండిహట్టి సర్కిల్ వెంకటేశ్వర్ కాంప్లెక్స్ వెనుక ఉన్న ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఫిరోజ్, అబ్దుల్ ఖాదిర్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం నిందితులు డబ్బు ఆశ చూపించి అద్దె ఇంట్లో వ్యభిచారం చేపట్టడంతో జిల్లా ఎస్పీ డాక్టర్ సుమన్ డి.పన్నేకర్ ఆదేశాల మేరకు ఆయా స్టేషన్ల ఇన్స్పెక్టర్లు సిబ్బందితో వెళ్లి అరెస్ట్ చేశారు. నలుగురు మహిళల రక్షణ పలువురు విటుల అరెస్ట్ -
ఆచారాలు లేని అభ్యుదయ వివాహం
బళ్లారి రూరల్: పురోహితుడు లేడు, మేళ తాళ వాయిద్యాలు లేవు, ఆచార వ్యవహారాలు లేవు, రాహుకాలం యమగండం, ముహూర్తం లేదు. వధువు, వరుడు ఇష్టపూర్వకంగా తల్లిదండ్రులు, ముఖ్యఅతిథుల సమక్షంలో తాళికట్టి పెళ్లి చేసుకొన్నారు. ఈ అభ్యుదయ వివాహం నగరంలోని విద్యానగర్ గంగామత కళ్యాణ మండపంలో జరిగింది. ఓ కార్యక్రమం తరహాలో జరిగిన ఈ పెళ్లికి అధ్యక్షుడిగా సండూరు విరక్తమఠ పీఠాధ్యక్షుడు ప్రభు మహాస్వామి పాల్గొని మాట్లాడారు. ఇది ఆదర్శ వివాహం. వాయిద్యాలు, పురోహితుడు, రాహుకాలం, యమగండం చూడని పెళ్లి అని తెలిపారు. ఆచారాల పేరుతో లక్షలు వెచ్చించి ఆడంబరంగా పెళ్లిళ్లు చేసి చివరకు పెళ్లికి చేసిన అప్పు తీర్చడానికి జీవితాంతం కష్టపడుతున్నారన్నారు. ఇద్దరి మనసులు కలిసినపుడే లగ్నమని తెలిపారు. ఇప్పుడు చాలా మంది యువత సరళ పెళ్లిళ్లపై మొగ్గు చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. పెళ్లి ఖర్చును సామాజిక సహాయ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కన్నడ వారపత్రిక కార్యనిరత సంపాదకుడు డాక్టర్ ఎస్.వై.గురుశాంత్ మాట్లాడుతూ ఆర్భాటంగా పెళ్లిళ్లు చేస్తూ చివరకు వరకట్నం సరిపోలేదని వేధింపులు, నవవధువుల ఆత్మహత్యలను నివారించే దిశగా ఈ తరహా పెళ్లిళ్లు జరగాలని ఆకాంక్షించారు. వరుడు యూ.వికాస్ వధువు యూ.అఖిల మెడలో తాళికట్టాడు. కర్ణాటక జనవాది మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జీ.చంద్రకుమారి, సీపీఐ(ఎం) కార్యదర్శలు జీ.సత్యబాబు, ఆర్.భాస్కర్రెడ్డి, వరుడి తండ్రి కర్ణాటక ప్రాంత రైతు సంఘం రాష్ట్రాధ్యక్షుడు యూ.బసవరాజ్ కుటుంబ సభ్యులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. పురోహితుడు, మేళతాళాలు, ముహూర్తం లేని పెళ్లి సరళ వివాహం ఓ కార్యక్రమంలా ముగిసిన వైనం -
ఉగ్రవాదాన్ని అరికడదాం
హొసపేటె: దేశ ఐక్యత, శాంతి, సామరస్యాలకు ముప్పుగా పరిణమించే దురాగతాలను అరికడదామని, యువతలో అవగాహనకు యావత్ దేశం నేడు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటోందని జిల్లాధికారిణి కవిత ఎస్. మన్నికేరి పేర్కొన్నారు. గురువారం నగరంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మాజీ ప్రధాని దివంగత రాజీవ్గాంధీ జ్ఞాపకార్థం ఈ రోజును పాటిస్తారన్నారు. దేశంలో శాంతి, అహింస, మానవతా విలువలను కాపాడడం, యువతను హింసకు దూరంగా ఉంచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఉగ్రవాదం ఏ మతానికో, కులానికో, దేశానికో పరిమితం కాదన్నారు. దీనిని తుదముట్టించేందుకు యావత్ మానవాళి ఏకం కావాలన్నారు. ఏడీసీ లోకేష్, వివిధ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘సీఎం సీటొద్దులే.. మంత్రిగా సరిపెట్టుకుంటా’
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో ఇప్పటివరకు బయట నుంచి మద్దతు ఇస్తున్న విదుతలై చిరుతైగల్ కట్చి (VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అంగీకరించాయి. దీంతో విజయ్ మంత్రి వర్గంపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ విజయ దుందుభి మోగించారు. విజయ్ గెలుపే కాదు రాజకీయ సమీకరణాలు సైతం మారాయి. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఒంటరిగా నెలకొల్పే అవకాశాన్ని ఆమడ దూరంలో కోల్పోయారు. దీంతో కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంల్, సీపీఐ, సీపీఎం వంటి వామపక్షాల సహకారంతో విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు మంత్రివర్గ విస్తరణలో వ్యూహంవిజయ్ ఇప్పటి వరకు 33 మంది సభ్యులతో (ముందుగా 10 మంది, ఇప్పుడు 23 మంది చేరారు) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ వీసీకే, ఐయూఎంల్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ రెండు పార్టీలు డీఎంకే ఆధ్వర్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్లో భాగమై ఉండటంతో, టీవీకే మంత్రివర్గంలో చేరడంపై జాగ్రత్తగా వ్యవహరించాయి. విజయ్ ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి, మంత్రివర్గంలో మూడు స్థానాలను ఖాళీగా ఉంచారు. భవిష్యత్తులో వీరిని ఒప్పించవచ్చన్న ధీమాతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.వీసీకే, ఐయూఎంల్ వైఖరివీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ ‘మేము మంత్రిపదవులు కోరలేదు, రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరగకుండా ఉండటానికి మాత్రమే మద్దతు ఇచ్చాం’అని స్పష్టం చేశారు. అయినప్పటికీ, పార్టీ చర్చల అనంతరం మంత్రివర్గంలో చేరేందుకు అంగీకరించింది. ఐయూఎంల్ కూడా మొదట్లో సంకోచం చూపినప్పటికీ, చివరికి తమ ఎమ్మెల్యే ఏ.ఎం. షాజహాన్ను మంత్రివర్గంలోకి పంపేందుకు సిద్ధమైంది.వీసీకే, ఐయూఎంల్ మంత్రివర్గంలో చేరడం ద్వారా విజయ్ ప్రభుత్వానికి మరింత స్థిరత్వం లభిస్తుంది. కాంగ్రెస్ ఇప్పటికే మంత్రివర్గంలో భాగమై ఉండటంతో, చిన్నపార్టీలకు కూడా ప్రాధాన్యం లభిస్తుంది. ఇది అలయెన్స్ రాజకీయాల్లో సమతుల్యతను కాపాడడమే కాకుండా, విజయ్కు కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మరింత బలం ఇస్తుంది. మొత్తం మీద, వీసీకే, ఐయూఎంల్ మంత్రివర్గంలో చేరడం విజయ్ ప్రభుత్వానికి ఒక పెద్ద ఊరట. ఇది తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుంది.సీఎం సీటొద్దులే.. మంత్రి పదవి చాలు.. వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ గతంలో సీఎం కావాలనే ఆశయాన్ని బహిరంగంగా ప్రకటించారు. కానీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ ఘన విజయం సాధించడంతో ఆ అవకాశం ఆయనకు దూరమైంది. విజయ్ మెజారిటీకి తక్కువగా నిలిచినప్పటికీ, వీసీకే, ఐయూఎంల్, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. మొదట్లో వీసీకే బయట నుంచి మాత్రమే మద్దతు ఇచ్చింది.విజయ్ వ్యూహాత్మకంగా మంత్రివర్గంలో ఖాళీ స్థానాలు ఉంచి, మిత్రపక్షాలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. చివరికి వీసీకే కూడా మంత్రివర్గంలో చేరేందుకు అంగీకరించింది. ఇలా, సీఎం కావాలనే కల నెరవేరకపోయినా, ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా వీసీకే అధినేత తన రాజకీయ ప్రాధాన్యాన్ని నిలబెట్టుకున్నారు. -
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
బెంగళూరు: ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో రన్వేను విమాన చివరి భాగం(తోక) తగలడంతో ఒక్కసారిగా కలవరం మొదలంది. ఢిల్లీ నుంచి నుంచి బెంగళూరుకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అవుతుండగా ఇది చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో 181 ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానం AI2651లో ఇది చోటు చేసుకుంది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండింగ్ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించారు. ల్యాండింగ్ కోసం సమీపిస్తున్నప్పుడు విమానం తీవ్రమైన కుదుపులకు గురైంది. ఈ అస్థిరమైన ల్యాండింగ్ ప్రయత్నం తరువాత పైలట్ గో-అరౌండ్ (ల్యాండింగ్ ప్రయత్నాన్ని రద్దు చేసి మళ్లీ గాల్లోకి ఎగిరి, మరోసారి ల్యాండింగ్ ప్రయత్నం చేయడం) చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది చేస్తున్నప్పుడు విమాన చివరి భాగం నేలను తాకింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణీకులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి పీటీఐకి తెలిపారు. -
AIతో నెలకు లక్ష రూపాయలు సంపాదించడం ఎలా?
సాక్షి,బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాల్లో ఏఐ చొచ్చుకుపోతుంది. దీంతో పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల నుంచి చిన్న చిన్న సంస్థల్లో రెగ్యులర్గా ఒకే పనిచేసే ఉద్యోగుల వరకు ఉపాధిని కోల్పోతున్నారు. అయితే, ఇప్పుడు అదే ఏఐ వినియోగంతో పలువురు లక్షలు సంపాదిస్తున్నారు. తాజాగా, బెంగళూరులో కూరగాయలు అమ్మే యువకుడు ఏఐ సాయంతో గంటకు రూ.350 నెలకు రూ.లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడని ఇన్స్టాగ్రామ్ యూజర్ వైభవ్ తన ఇన్స్టా అకౌంట్లో ఓ వీడియోని షేర్ చేశారు.‘నేను నా స్కూటీ మీద అలా వెళ్తుండగా ఈ దృశ్యం నా కంటపడింది. వెంటనే కుతూహులంగా వెళ్లి హెడ్ బ్యాండ్ గురించి ఆరా తీశాను. ఐఫోన్, మెమరీ కార్డ్తో హెడ్బ్యాండ్తో డేటా కలెక్ట్ చేస్తున్నాడు అని పేర్కొన్నారు. ఆ వీడియోలో ఓ యువకుడు రియల్ టైం డేటా కలెక్ట్ చేసేలా ఏఐ డేటా కలెక్షన్ హెడ్ గేర్ను ధరించాడు. హెడ్గేర్ను తలకు ధరించిన ఆ యువకుడు కరివేపాకు కట్టలు కడుతున్నారు. కరివేపాకు కట్టలను కొనుగోలు దారులకు అమ్ముతున్నాడు. అమ్మే సమయంలో కొనుగోలు దారులు, అమ్మకం దారుల మధ్య ఏం జరుగుతుంది అనే విషయాల్ని హెడ్గేర్ సాయంతో డేటాను సేకరిస్తున్నాడు.అలా సేకరించిన రియల్ టైమ్ డేటాను ఏఐ కంపెనీలకు అందిస్తాడు. రియల్ డేటా విలువైనదిగా ఉండటంతో సంస్థలు భారీ మొత్తాన్ని చెల్లిస్తాయి. ఈ ఘటనలో కరివేపాకు అమ్మే యువకుడు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. ఏఐ కంపెనీలు హెడ్ గేర్ల సాయంతో కంపెనీలకు కావాల్సిన డేటాను వీడియో, ఆడియో, సంభాషణల రూపంలో తీసుకుంటాయి. తీసుకున్న డేటాను ఏఐ మోడళ్లకు అప్లయి చేస్తాయి. అలా అప్లయి చేయడం వల్లే యూజర్లుకు అందిస్తున్న సమాచారం నిజమా? కాదా? అని నిర్ధారించుకుంటాయి. యూజర్లకు అందించే డేటాను..రియల్ టైం డేటాతో సరిపోల్చి యూజర్కు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి. ఏఐ డేటా గేర్ కనెక్షన్ ధరపై స్పష్టత లేదు. కానీ ఇది సాధారణంగా ఐఫోన్ లేదా కెమెరా, మెమరీ కార్డ్, హెడ్బ్యాండ్ వంటి పరికరాలతో తయారు చేసిన తాత్కాలిక టూల్. ఈ గేర్ను కంపెనీలు గిగ్ వర్కర్లకు అందిస్తాయి. ఓ వైపు పనిచేసుకుంటూనే మరో వైపు అదనపు ఆదాయం కోసం పలువురు ఇలాంటి మార్గాల్ని అన్వేషిస్తున్నారు. పలువురు ఈ పరికరాన్ని ధరించి గంటకు రూ.350 వరకు సంపాదిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. View this post on Instagram A post shared by Vaibhav | Peaks & Protein (@vai.bhaaavvv) -
అప్పు తీసుకుని ఎగవేత.. ఎమ్మెల్సీపై కేసు
మైసూరు: ఇచ్చిన రుణం రూ.55 లక్షలను తిరిగి ఇవ్వాలని అడిగేందుకు వెళ్తే ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ దాడి చేశారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. నేతలందరికీ నీతులు చెప్పే విశ్వనాథ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. వివరాలు.. మైసూరులోని జలదర్శినిలో హెచ్.విశ్వనాథ్ ఉండగా డబ్బు అడిగేందుకు వెళ్లగా దూషించి దాడి చేశారని కాంగ్రెస్ నాయకుడు కోటెహుండి మహదేవు ఆరోపించారు. 2013లో విశ్వనాథ్ ఎంపీగా ఉండగా కోటెహుండి మహదేవు.. ఎంటీబీ నాగరాజ్ ద్వారా విశ్వనాథ్, అతని కుమారుడు అమిత్ దేవరహట్టిలకు రూ.55 లక్షల అప్పు ఇచ్చా, కానీ ఇంతవరకు డబ్బు వాపసు ఇవ్వలేదని మహదేవు చెబుతున్నారు. 2026 ఫిబ్రవరిలో విశ్వనాథ్ జలదర్శినిలో ఉండగా డబ్బులు అడిగేందుకు వెళ్లగా తిట్టి తలపై కొట్టారన్నారు. దేవరాజ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశా, తరువాత కోర్టుకు వెళ్లి కేసు నమోదుకు ఆదేశాలు తెచ్చా, ఈ నేపథ్యంలో విశ్వనాథ్పై ఎఫ్ఐఆర్ దాఖలైందని చెప్పారు. నాపై కేసు వెనుక సీఎం తనయుడుమైసూరు: తనపై నమోదైన కేసు వెనుక సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర హస్తం ఉందని ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ ఆరోపించారు. మహదేవు ఎఫ్ఐఆర్ నమోదు చేయించడంపై స్పందించారు. తనకు ఇవ్వడానికి మహదేవుకు రూ. 55 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ డబ్బుల వ్యవహారం నడపలేదని, నా పరువుకు భంగం కలిగించేందుకు సీఎం కుమారుడు ఇలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారని, సమాధానం ఇస్తానని చెప్పారు. సీఎం కుమారునిపై ఎమ్మెల్సీ విమర్శలు -
భారీ వర్షం .. అవస్థలు తీవ్రం
సాక్షి,బళ్లారి: వర్షం వచ్చిందంటే బళ్లారి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారడం సర్వసాధారణమైంది. భారీ వర్షం కురిస్తే రోడ్లు బురదమయంగా మారడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు నీటికుంటలను తలపిస్తాయి. ఈసారి ముందస్తు వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మూడు సార్లు ఒక మోస్తరు వర్షాలు కురిసాయి. మంగళవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. వర్షం వచ్చిన మరుసటి రోజున కూడా బుధవారం పలు ప్రాంతాల్లో నీటి కుంటలను తలపించాయి. జిల్లా స్టేడియంలో చిన్న చెరువును తలపించేలా నీరు నిలిచాయి. ఈ స్టేడియంలోకి ప్రతి రోజు పెద్ద ఎత్తున వాకింగ్ చేయడానికి జనం తరలివస్తుంటారు. వివిధ క్రీడలను ఆడేందుకు కూడా యువత వస్తుంటారు. ప్రస్తుతం కురిసిన వర్షానికి స్టేడియంలోకి నీరు చేరడంతో క్రీడాకారులు, వాకింగ్ చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటి దృశ్యాలు మామూలు కావడంతో ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు, పాలకులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాయచూరులో.. రాయచూరు రూరల్: నగరంతో పాటు జిల్లాలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన జడివాన గంట సేపు ఏకధాటిగా కొనసాగి భారీ వర్షం కురిసింది. జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు జలమయం అయ్యాయి. గాంధీచౌక్, మున్నూరు వాడితో పాటు నగరంలోని కూరగాయల మార్కెట్లోకి వర్షపు నీరు చొరబడ్డాయి. అరబ్ కాలనీ పక్కనే వంతెనతో నీరు కాలనీలోకి ప్రవేశించాయి. రాయచూరు–హైదరాబాద్ రహదారిలో వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. మస్కిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్తంభం కూలింది. ఏపీఎంసీలోకి వాన నీరు చేరి ఉల్లిగడ్డలు, వరి ధాన్యం తడిసి పోయాయి. చెరువును తలపిస్తున్న జిల్లా స్టేడియం రాయచూరులో ఏపీఎంసీ జలమయం -
అక్రమాల కుప్ప.. తిరుమలకొప్ప
హుబ్లీ: తాలూకాలోని అగడి గ్రామ పంచాయతీ పరిధిలోని తిరుమలకొప్ప గ్రామాభివృద్ధికి 2020–21వ సంవత్సరం నుంచి 2025–26 వరకు పంచాయతీ పాలనలో నిధి–1, 15వ ఆర్థిక ప్రణాళిక ద్వారా మంజూరైన నిధులు దుర్వినియోగమయ్యాయని ఆ గ్రామ నేత చెన్నవీర పాటిల్ ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ 34 పనులకు గాను గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు నకిలీ బిల్లులు సృష్టించి నిధులు స్వాహా చేశారని పేర్కొన్నారు. తిరుమలకొప్పను అక్రమాల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ప్రభులింగ శివాచార్యుల పుణ్యారాధన రాయచూరు రూరల్ : జిల్లాలోని దేవదుర్గ తాలూకా గబ్బూరులో ప్రభులింగ శివాచార్యుల పుణ్యారాధన చేపట్టారు. మంగళవారం ప్రభులింగ బృహన్మఠంలో కిల్లే మఠాధిపతి శాంతమల్ల శివాచార్య 22వ పట్టాధ్యక్షుడు ప్రభులింగ శివాచార్యుల మూల విరాట్కు అభిషేకం, పుష్పార్చన, కుంకుమార్చన, మంగళ హారతి నెరవేర్చారు. అనంతరం ప్రభులింగ శివాచార్యుల పుణ్యారాధన జరిపారు. గబ్బూరు మఠాధిపతి బూదిబసవ శివాచార్యులు, రేణుకాచార్య, శరణయ్యలున్నారు. భక్తులకు అన్న ప్రసాదం నిర్వహించారు. గుండెపోటుతో యువ న్యాయవాది మృతి సాక్షి,బళ్లారి: ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. కొప్పళ జిల్లా గంగావతి కోర్టు ఆవరణలో ఓ యువ న్యాయవాది గుండెపోటుతో కుప్పకూలారు. కనకగిరి తాలూకా చిక్కమాదినాళ గ్రామానికి చెందిన కనకేష్(25) అనే యువ న్యాయవాది గంగావతి కోర్టుకు వచ్చి తన విధులను నిర్వహిస్తున్న సమయంలో కోర్టు ఆవరణలో గుండైపె చేయి పెట్టుకుని నొప్పి ఎక్కువ కావడంతో కిందపడి పోయారు. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఈ ఘటనతో మృత న్యాయవాది కుటుంబంతో పాటు గంగావతి కోర్టు ఆవరణలో విషాదఛాయలు అలుముకున్నాయి. కలబుర్గి జెడ్పీ సీఈఓగా నియామకం రాయచూరు రూరల్: కలబుర్గి జెడ్పీ సీఈఓగా ఉన్న భన్వర్సింగ్ మీనాను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మహేంతేష్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో ఐటీ బీటీ శాఖలో విధులు నిర్వహిస్తున్న రాహుల్ సంకనూరును నియమించారు. జెడ్పీ సీఈఓ భన్వర్సింగ్ మీనాకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా బెంగళూరు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని సూచించారు. పక్షుల దాహార్తి నివారణకు ఏర్పాట్లు రాయచూరు రూరల్: వేసవిలో పక్షుల దాహార్తిని నివారించేందుకు జిల్లా కేంద్రంలోని కోర్టులో విధులు నిర్వహించే న్యాయవాదులు, ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది మట్టి పాత్రలను ఏర్పాటు చేశారు. బుధవారం జిల్లా కోర్టులో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తులు జేడీ మహావర్ఖర్, శ్వేతా సింగ్, ప్రభు సిద్దప్ప, స్వాతిక్, కృపా, సుదీన, చెన్నబసప్ప మట్టి పాత్రలను అందించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మల్లికార్జున, శ్రీకాంత్, ఎస్జీ మఠ, లక్ష్మప్పలున్నారు. రాతప్రతుల డిజిటలీకరణకు జిల్లాధికారిణి పిలుపు హొసపేటె: తాళపత్రాలు ఉన్న ఇళ్లకు వెళ్లి, కుటుంబాలను ఒప్పించి, వాటిని సేకరించడం చాలా సవాలుతో కూడుకున్న పని, ఇంతటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించి, దానిని భావి తరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ చేయి కలపాలని జిల్లా మేజిస్ట్రేట్ కవిత ఎస్. మన్నికేరి అన్నారు. హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో కవి పంప ఆడిటోరియంలో నిర్వహించిన కర్ణాటక ప్రాచీన రాతప్రతుల సర్వే, డిజిటలీకరణను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. భారతదేశంలో మొట్టమొదటి సమగ్ర డిజిటలైజేషన్ పనిని విజయనగర జిల్లాలోని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం చేపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కన్నడ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డీవీ పరమ శివమూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ విరుపాక్షి పూజారహళ్లి, డీన్లు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఆగస్టు 31లోగా బెంగళూరు పాలికేలకు ఎన్నికలు
బనశంకరి: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధిలోని 5 నగర పాలికేలకు ఆగస్టు 31లోగా కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే చివరి గడువు అని, ఇకపై పొడిగించేదిలేదని స్పష్టం చేసింది. దీంతో గతంలో ఇచ్చిన జూన్ 30 గడువు 2 నెలలు పొడిగించినట్లయింది. జనాభా లెక్కల సేకరణ, ఓటర్ల జాబితా ప్రత్యేక పరిష్కారం వంటి కార్యక్రమాల వల్ల సిబ్బంది కొరత ఉందని రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. త్రిసభ్య ధర్మాసనం విచారణ బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్ మల్య బాగ్చి, విపుల్ పంచోలి ధర్మాసనం విచారణ జరిపింది. ఈసీ అభ్యర్థనను ఆమోదిస్తూ, గ్రేటర్ బెంగళూరు ఎన్నికలకు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చింది. సెప్టెంబరు చివరి వరకు సమయం కావాలనగా తిరస్కరించింది. ఇకపై ఎన్నికల వాయిదాకు అనుమతి ఇచ్చేది లేదని జడ్జిలు స్పష్టం చేశారు. 2 నెలల సమయం సరిపోతుందని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు బెంగళూరు పాలికేలకు ఎన్నికలు జరిపే బాధ్యత సర్కారు ముందుంది. సుప్రీంకోర్టు ఆదేశం -
డ్యాం నీరు తాగునీటికే వాడాలి
● కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ హొసపేటె: విజయనగర జిల్లాలో విస్తృతంగా నెలకొన్న వడగాల్పుల నేపథ్యంలో ఈ ప్రాంత రైతులకు జీవనాధారమైన తుంగభద్ర జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు తగ్గిపోతోంది. కర్మాగారాలకు నీటి సరఫరాను నిలిపి వేసి, నీటిని కేవలం ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రమే కేటాయించాలని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. సంఘం తాలూకా కమిటీ నేతృత్వంలో రైతులు ఈ విషయమై జిల్లాధికారి, తుంగభద్ర బోర్డు అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఎండ తీవ్రత కారణంగా టీబీడ్యాంలో నీటిమట్టం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం డ్యాంలోని నీటిని ప్రజల, పశువుల తాగునీటి అవసరాల కోసం విజయనగర రాయ, బసవ కాలువల కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. జీవరాశుల మనుగడకు, ప్రజల నిత్యవసరాలకు వీలుగా టీబీ డ్యాం నుంచి ఫ్యాక్టరీలకు సరఫరా అవుతున్న నీటిని తక్షణమే నిలిపి వేయాలని రైతులు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. రైతు సంఘ తాలూకా అధ్యక్షుడు గంటి సోమశేఖర్తో పాటు పలువురు రైతులు హాజరయ్యారు. ఆరోగ్య సిబ్బందితో సమర్థ పాలన ● జిల్లాధికారిణి కవిత మన్నికేరి హొసపేటె: నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై ఉండే అధికారులు, సిబ్బంది నేటి ఆధునిక జీవితంలో తమ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించగలరని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి తెలిపారు. బుధవారం నగరంలోని జెడ్పీ సభాంగణంలో అధికారులు, సిబ్బంది కోసం నిర్వహించిన ఉచిత ఆరోగ్య, కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. రోజువారీ విధి నిర్వహణ ఒత్తిళ్ల మధ్య ఉద్యోగులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. రోటరీ కంటి ఆస్పత్రి వైద్యుల బృందం అత్యాధునిక డిజిటల్ పరికరాలతో ఉచిత కంటి పరీక్షలతో పాటు రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలను నిర్వహించింది. అనంతరం సిబ్బందికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లాధికారిణి కవిత, జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ అలీ అక్రమ్ షా కూడా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ హంపీ పెర్ల్స్ అధ్యక్షురాలు అన్నపూర్ణ సదాశివ, కార్యదర్శి దీపా అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్లో మందుల విక్రయం అరికట్టాలిరాయచూరు రూరల్: దేశ వ్యాప్తంగా మందులను ఆన్లైన్లో విక్రయించే వ్యాపారాలను నిలిపి వేయాలని రాయచూరు మందుల దుకాణాల యజమానుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జేఎస్ షిండే మాట్లాడారు. కార్పొరెట్ రంగంలో రాయితీలను స్తంభింప చేయాలని, స్పూరియస్ మందులను తొలగించాలన్నారు. అంతకు ముందు నగరంలోని అన్ని మందులు దుకాణాలను బంద్ చేసి నిరసన ర్యాలీ నిర్వహించారు. మహావీర్ సర్కిల్ నుంచి సూపర్ మార్కెట్ వరకు ర్యాలీగా వచ్చి నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద జిల్లాధికారిణి పూవితకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో సంఘం రఘునాథ రెడ్డి, రాజీవ్ సింగహాల్, జీవన్, మురళీధర్, వెంకటేష్, అరవింద్, సురేష్, మురారీ అగర్వాల్లున్నారు. -
పల్లెల్లో మిన్నంటిన దాహాకారాలు
రాయచూరు రూరల్: జిల్లాలోని రాయచూరు, అత్తనూరు, కల్మల, అమీన్గడ, దేవదుర్గ, సిరవార, మస్కి, మాన్వి, లింగసూగూరు, కల్లూరు, ఇడపనూరు, తలమారి, బూడిదపాడు, అత్కూరు, సగంకుంట, హట్టి కవితాళ, చించరికి, నవలకల్, నీలగల్ గుంజహళ్లి, సింగనోడి గ్రామాల్లో తాగునీటి ఎద్దడి విశ్వరూపం దాల్చింది. తుంగభద్ర ఎడమ కాలువలో నీరు బంద్ కావడంతో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సమస్య ఉల్బణమైంది. తాగునీరు అందించండి మహాప్రభో అంటూ పట్టణ, గ్రామీణ ప్రజలు గ్రామ, తాలూకా, జిల్లా పంచాయతీ కార్యాలయాల చుట్టు ప్రదక్షణలు, నిరసనలు చేసి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. చిన్న నీటి పారుదల పథకాల కింద మినీ ట్యాంకులను నిర్మించినా అవి అర్దాంతరంగా ఆగిపోయాయి. 700 గ్రామాల్లో నీటి ఎద్దడి జిల్లాలో 700 గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ప్రజలు చెరువులు, కుంటలు, బోరుబావుల మీద ఆధారపడినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. సిరవార తాలూకా అత్తనూరులో తాగునీటి కోసం 2 కి.మీ. దూరంలో సోమవారపేటె మఠం నిర్మించిన చెరువు నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. అత్తనూరుకు అమ్మాయి ని ఇవ్వాలంటే గ్రామంలో తాగునీరు ఉందా? అని అడిగి అబ్బాయికి అమ్మాయిని ఇస్తున్నారు. అత్తనూరుకు నేను రాను బిడ్డో.. అని వారిస్తూ అమ్మాయిలు వివాహానికి వెనుకడుగు వేస్తున్నారు. అధికారులు మేల్కొని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి శాశ్వత నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కృష్ణమ్మ వెలవెల.. చేపలు విలవిల ప్రతి ఏటా కృష్ణా నదిలో ఎంతో కొంత నీరు నిల్వ ఉండేది. మత్స్యకారులు చేపలను వేటాడి విక్రయానికి ముందుండేవారు. బెళగావి, బాగల్కోట జిల్లాల్లోని నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాలకు కూడా జల క్షామం నెలకొంది. మహారాష్ట్ర నుంచి నీరు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆధ్వర్యంలో మంత్రులతో కలిసి చర్చలకు ముందుకు రాలేదు. వేసవిలో తాగునీరు అందక పోవడం, వర్షాకాలంలో పశ్చిమ ఘాట్లలో నీరు అధికంగా వచ్చి వరద రావడం, వీటి నుంచి ప్రజా ప్రతినిధులు మౌనం వహించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కృష్ణా నదిలో చుక్క నీరు లేక పోవడంతో చేపలు విరివిగా మరణించాయి. మరో వైపు నీరు లేక చివరికి చెలిమలో ఊరిన నీటిని చెంబుల ద్వారా పట్టుకుంటున్నారు. పంటల విషయంలో రైతులు ప్రతినిధులపై శాపనార్థాలు పెడుతున్నారు. నది పూర్తిగా ఎండిపోవడంతో లక్షలాది చేపలు వేసవి తాపానికి మరణించాయి. చనిపోయిన చేపలను తినడానికి పక్షులు వస్తున్నాయి. మరణించిన చేపల వల్ల గ్రామంలో దుర్వాసన వెదజల్లుతోంది. ప్రతి ఏడాది నీరు పుష్కలంగా ఉండేవి. పక్షులు వలసలు వచ్చేవి. నీరు ఇంకిపోవడంతో మరణించిన చేపలను తినడానికి వలస పక్షులు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు శూన్యం ఎప్పటికి తీరేను గ్రామస్తుల దాహం -
గాలివానతో పంటలకు నష్టం
హొసపేటె: భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి చేతికొచ్చిన అరటి, బొప్పాయి పంటలతో పాటు పాఠశాల గోడ కూడా దెబ్బతిన్న ఘటనలు విజయనగర జిల్లాలో బుధవారం చోటు చేసుకున్నాయి. నింబళగెరెలోని పాఠశాల భవనం కారుతుండటంతో వారు పైకప్పుపై ఇనుప రేకులను పరిచారు. ఈదురు గాలికి పైకప్పుతో సహా రేకులన్నీ నేలకూలాయి. మంగాపుర, నింబళగెరె, యర్రమ్మనహళ్లి, గాణగట్టి, ఉజ్జయిని చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ఈ గ్రామాల్లో బొప్పాయి పండించే రైతులు చాలా మంది ఉన్నారు. బలమైన గాలులకు బొప్పాయి మొక్కలు సగానికి విరిగి నేలకూలాయి. అప్పులు చేసి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో ఇలా గాలివానలకు దెబ్బ తినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. -
పిల్లలూ.. సర్కారీ బడిలో చేరండి
కోలారు: తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ప్రధానోపాధ్యాయురాలు తాహేరా నుస్రత్ మనవి చేశారు. బుధవారం దాఖలాతి అభియాన్ కార్యక్రమంలో భాగంగా అరాభి కొత్తనూరు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి మీ పిల్లలను సర్కారీ బడులలోనే చేర్పించాలని కోరారు. దాతల సహకారంతో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా చదువుల బోధన, సౌకర్యాలు లభిస్తున్నాయని ఆమె తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నేడు వంద శాతం ఉత్తీర్ణత ఫలితాలు వస్తున్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సౌలభ్యాలను స్వయంగా చూడాలన్నారు. ప్రైవేటు పాఠశాలల్లోలాగా ఉత్తమ ల్యాబొరేటరి, కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నామన్నారు. టీచర్లు భవాని, కె లీలా, సుగుణా, శ్రీనివాసులు, రమాదేవి పాల్గొన్నారు. సత్యమ్మ దేవి జాతర ఉత్సవం కోలారు: తాలూకాలోని కామధేనుహళ్లి గ్రామంలో వెలసిన ఆదిశక్తి సత్యమ్మ దేవి ఉట్ల జాత్ర, దీపోత్సవాలలో చుట్టుపక్కల 9 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అమ్మవారికి అభిషేకం, అలంకారం, నైవేద్య సమర్పణ నిర్వహించారు. ఉట్ల స్తంభాన్ని ఏర్పాటు చేసి టెంకాయలు కొట్టి పూజలు చేశారు. మహిళలు తలపై దీపాలను తీసుకు వచ్చి సమర్పించారు. జోసెఫ్ స్వామి జయంతి వేడుకలు బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ పట్టణంలో సెయింట్ జోసెఫ్ స్వామి జయంతి వేడుకలను మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో జరిపారు. వందలాది భక్తులు చర్చి నుంచి కొవ్వొత్తులు పట్టుకుని ప్రధాన వీధుల్లో ఊరేగింపు సాగించారు. ఆనేకల్ వద్ద 18వ శతాబ్దంలో ఖననం చేయబడిన స్వామి మాన్యుయెల్ డికునా సమాధి చరిత్రకు ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో సెయింట్ జోసెఫ్ యొక్క నిరాడంబరత, విశ్వాసం, సామరస్యాన్ని అలవర్చుకోవాలి. సహనంతో జీవితాన్ని గడపాలి అని సెయింట్ జోసెఫ్స్ రిలీజియస్ సెంటర్ ఫాదర్ శాంతరాజ్ థామస్ అన్నారు. అరేబియాలో గాలుల కల్లోలం● చేపల వేట నిషేధం యశవంతపుర/ దొడ్డబళ్లాపురం: నైరుతి రుతు పవనాల రాకతో అరేబియా సముద్రంలో కల్లోల వాతావరణం నెలకొంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. కోస్తా జిల్లాల్లో తీరం వెంబడి తీవ్ర గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. సముద్రంలో ఉన్న మత్యృకారులు తక్షణం ఒడ్డుకు రావాలని హెచ్చరికలను జారీ చేశారు. ఉత్తర కన్నడలో జలక్రీడలు బంద్ రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా జల క్రీడలపై నియంత్రణ విధించారు. ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్రం తీర ప్రాంతాలు, శరావతి నది బ్యాక్ వాటర్, అఘనాశిని నదీ తీర ప్రాంతాల్లో అన్ని రకాల పడవలు, స్పీడ్ బోట్ల విహారం తదితరాలపై నిషేధం విధించారు. వర్షాకాలం ముగిసే వరకూ ఇది అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
గ్రామీణ విద్యార్థులకు ఉచిత శిక్షణ వరం
హొసపేటె: ప్రతిభావంతులైన, పేద పిల్లలకు ఉచితంగా శిక్షణ అందించడం వరంలాంటిదని ముతుగనహళ్లి కొట్రేశ్ తెలిపారు. తాలూకాలోని బ్యాసిగదేరి గ్రామంలో ఉన్న క్రాంతివీర సంగొళ్లి రాయణ్ణ కోచింగ్ సెంటర్ మూడో వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కన్నడ పాఠశాలలు మనుగడ సాగిస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా ఉచిత విద్య పొందడానికి గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు నవోదయ, మొరార్జీ దేశాయి రెసిడెన్షియల్ స్కూల్, సర్వోదయ, కిత్తూరు రాణి చెన్నమ్మ వంటి పాఠశాలల్లో పరీక్షలు రాయవలసి వస్తోందన్నారు. ఆ పరీక్షలకు శిక్షణను అందించి, చిన్న పిల్లలను పరీక్షకు సిద్ధం చేసే పనే ఒక సామాజిక సంస్కరణ అని ఆయన అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఫెయిర్ ప్రైస్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హెచ్ఏ కొట్రేష్ మాట్లాడుతూ తాము చిన్నపిల్లల మనసుల్లో ఆలోచనల బీజాలు నాటుతున్నామని అన్నారు. వారి ఆలోచనల ద్వారా వారి భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందన్నారు. మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో ఈ కోచింగ్ సెంటర్ చేస్తున్న పని గొప్పదని ఆయన అన్నారు. వెనుకబడిన కులాల సమాఖ్య అధ్యక్షుడు బుడ్డి బసవరాజ్, హిరేమని నాగప్ప, బానాడ హనుమంత, కొట్రేష్, సంతోష్, నాగరాజ్, ఉమేష్, ఎస్టీఎంసీ అధ్యక్షుడు సురేష్, హొసమని రామన్న, హెచ్ అజ్జప్ప, ఉచిత కోచింగ్ సెంటర్ ఇన్చార్జి హొసమని మంజునాథ్, హేమంతప్ప, ట్రైనర్ కొట్రేష్, యూ.భరత్, హర్షవర్ధన్, సీ.మంజునాథ్, లైబ్రేరియన్ రామలింగప్ప, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ సహకార సంఘానికి ఎన్నిక
బళ్లారి అర్బన్: నగరంలోని ఎస్పీ సర్కిల్ సమీపంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం ఎన్నికల్లో కే.ఫకీరప్ప అధ్యక్షుడిగా గెలుపొందారని ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి హెచ్.అమీనా బేగం తెలిపారు. మంగళవారం జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో కే.ఫకీరప్ప, కే.శ్రీకళ అధ్యక్ష స్థానాలకు పోటీ పడ్డారు. ఎన్నికల్లో 13 మంది డైరెక్టర్లు తమ ఓటు హక్కు ద్వారా ఫక్కీరప్పకు 7 ఓట్లు, శ్రీకళకు 6 ఓట్లు వేయగా, ఫకీరప్ప ఒక ఓటు తేడాతో విజయం సాధించారు. సంఘానికి డైరెక్టర్ల ఎన్నికలు 2024 డిసెంబర్లో జరగగా 2025 జనవరిలో అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు జరిగాయి. బీ.శ్రీనివాస్రెడ్డి అధ్యక్షుడుగా, వి.శిల్ప ఉపాధ్యక్షురాలుగా ఎంపికయ్యారు. అయితే వీరి అధికారావధి ముగియడంతో గత నెల 19న శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసినట్లు అధికారిణి తెలిపారు. నెలరోజుల పాటు ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు చర్చలు జరగగా, చివరకు ఎన్నికల ద్వారా అధ్యక్ష స్థానం భర్తీ చేశారు. బీడీసీసీ బ్యాంకు ప్రతినిధి జే.రవీంద్రకుమార్, డైరెక్టర్లు, ప్రముఖులు మాజీ కార్పొరేటర్ కెరెకోడప్ప, కే.పరమేష్, పోస్టల్ వెంకటేష్, నరేష్, పంపాపతి, కృష్ణ, మాజీ ఉప మేయర్ భర్త వడ్డే రాముడు తదితరులు అభినందించారు. -
జూన్ 28 నుంచి పల్స్ పోలియో
రాయచూరు రూరల్: జిల్లాలో జూన్ 28 నుంచి పల్స్ పోలియోకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన పోలియో చుక్కల కార్యక్రమంలో 26,00,002 చుక్కలు వేశారన్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 1132 కేంద్రాలు, 53 ట్రాన్సిట్ బూత్లు, 33 మొబైల్ జట్లు, 248 మంది సూపర్వైజర్లను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఆరోగ్య శాఖాధికారులు సురేంద్ర బాబు, నంది, గణేష్, చంద్రశేఖరయ్యలున్నారు. -
నమ్మించి.. తాడుతో గొంతు బిగించి..
హుబ్లీ: ధార్వాడ శివారులో వృద్ధురాలి మృతదేహం లభ్యమైన కేసులో మిస్టరీని గ్రామీణ పోలీసులు కేసును ఛేదించారు. తాలూకాలోని దడ్డి కమలాపుర శివారు తోటలోని ఓ ఇంట్లో గత నెల 9న విశాలాక్షి అంగడి (68) అనే వృద్ధురాలి మృతదేహం లభించింది. అనుమానం నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులకు ముందుగా ఎటువంటి సాక్ష్యాలు లభించలేదు. అయితే కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టడంతో తలకు దెబ్బ తగలడంపై ఫోరెన్సిక్ సైన్స్ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసు గట్టురట్టయింది. హంతకుడిని మహారాష్ట్రకు చెందిన బబన్ సదాశివ జావిర్ (40)గా గుర్తించారు. ఒంటరి మహిళలే అతడి టార్గెట్. చిక్కమల్లిగెవాడ ఇటుకల బట్టీలో పని చేస్తున్న ఇతడు వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోందని పసిగట్టాడు. ఆమెతో ఎలాగోలా పరిచయం చేసుకొని నమ్మకం సంపాదించాడు. అమాయకత్వమే అస్త్రంగా.. పిల్లల నుంచి దూరంగా ఉన్న విశాలాక్షిని బుజ్జగించే మాటలతో మీ పిల్లలు దూరమైతేనేం నేను మీ కొడుకులా ఉంటానంటూ నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన వృద్ధురాలు అప్పుడప్పుడు ఫోన్లో బాధలను పంచుకునేది. ఆ అమాయకత్వాన్నే అస్త్రంగా చేసుకున్న నిందితుడు అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చి కాలక్షేపంగా కబుర్లు చెప్పేవాడు. ఈ క్రమంలో ఒక రోజు ఇంటికి వచ్చి తాను అనుకున్నట్లుగా ఆమె తలపైన కొట్టి తాడుతో గొంతు బిగించి ఊపిరి తీసి హత్య చేసి పరారైనట్లు దర్యాప్తులో తేర్చారు. నిందితుడి నుంచి ఓ బైక్, రూ.4.70 లక్షల విలువ చేసే బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కొన్నేళ్ల క్రితం హరిహర హత్య కేసులో కూడా అరెస్ట్ అయ్యాడన్న సంగతి దర్యాప్తులో తెలుసుకున్నారు. అక్కడ ఇటుకల బట్టీ యజమానిని హత్య చేసిన బబన్ ఆ తర్వాత అతడి వద్ద ఉన్న డబ్బులను తీసుకొని పరారయ్యాడు. ఆ కేసు విచారణలో ఉండగానే తాజాగా వృద్ధురాలిని హత్య చేయడంతో నిందితుడిని జుడీషియల్ కస్టడీకి అప్పగించినట్లు జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య మీడియాకు వివరించారు. వీడిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్ -
1.8 కేజీల బంగారు నగల దోపిడీ
● బెంగళూరు మల్లేశ్వరంలో ఘటన యశవంతపుర: కొనుగోలు సాకుతో రూ.3 కోట్ల విలువగల బంగారు నగలను దోచేశారు. ఈ సంఘటన బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగింది. నగర్త పేటలో ప్రసిద్ధి చెందిన మెమతా జువెలరీస్ షాపు యజమాని నుంచి 1.8 కేజీల బంగారాన్ని దుండగులు కాజేశారు. వివరాలు.. యజమానికి పరేశ్ సోని అనే వ్యక్తి ఫోన్ చేసి తమకు ఓ సంస్థ ఉందని, హోల్సేల్గా బంగారాన్ని కొంటామని నమ్మించి తమ ఆఫీసుకు రావాలన్నారు. తమకు 3 కేజీల అభరణాలు కావాలని చెప్పారు. మల్లేశ్వరంలో మాహి ఎంటర్ప్రైజెస్ అని ఓ ఆఫీసుకు నకిలీ బోర్డు వేసి అక్కడికి పిలిపించారు. యజమాని, అతని మేనేజర్ నగలను తీసుకొచ్చారు. మోసగాళ్లు ఆభరణాల డిజైన్లను పరిశీలిస్తామంటూ కొన్ని నగలను పక్క గదిలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి నుంచి ఉడాయించారు. గదిలోకి వెళ్లినవారు ఎంతసేపటికీ రాకపోవటంతో అనుమానం వచ్చి చూడగా ఎవరూ లేరు. ఫిర్యాదు మేరకు శ్యామ్, రామచంద్ర, పరేశ్ సోనిలపై మల్లేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. మెట్రో చార్జీల పెంపు లేనట్టే శివాజీనగర: నిత్యం లక్షలాది మంది ప్రయాణించే బెంగళూరు మెట్రో రైలు టికెట్ రేట్లను పెంచడం లేదని తెలిసింది. ఇటీవల జరిగిన బోర్డు మీటింగ్లో బీఎంఆర్సీఎల్ అధికారులు చార్జీల పెంపు గురించి ప్రస్తావించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు దీనిపై మరింత చర్చ జరగాలని సూచించారు. దీంతో చార్జీల పెంపు కొంతకాలం లేనట్లేనని సమాచారం. పరప్పనలో వదంతుల గోల యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న ఓ ప్రముఖ నిందితుడు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన తరువాత ఆత్మహత్యకు యత్నించిన్నట్లు వచ్చిన వార్తలు గుప్పుమన్నాయి. సుమారు రెండేళ్లుగా జైల్లో ఉండడం, బెయిలు రాకపోవడంతో విరక్తి చెంది ఆత్మహత్యాయత్నం చేశాడని వదంతులు వ్యాపించాయి. ఆందోళన చెందిన అభిమానులు పరప్పన అగ్రహారలోని సెంట్రల్ జైలుకు పరుగులు తీశారు. ఇది తెలిసి జైళ్ల శాఖ చీఫ్ అలోక్కుమార్ జైలును సందర్శించారు. ఇదంతా అవాస్తవమని, ఎవరూ ఆందోళన చెందరాదని ఆయన ప్రకటించారు. నిందితులు ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరూ భయపడరాదన్నారు. వేలాది టీచర్ పోస్టుల భర్తీ! ● నివేదికకు సీఎం సూచన శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 15 వేల మంది ఉపాధ్యాయులను భర్తీ చేసే ప్రతిపాదనలను సమర్పించాలని సీఎం సిద్దరామయ్య ఆర్థిక శాఖను ఆదేశించారు. విద్యాశాఖ గురించి తమ నివాసంలో విద్యామంత్రి మధు బంగారప్ప, సీనియర్ అధికారులతో భేటీ నిర్వహించారు. నాణ్యమైన విద్య, ఉపాధ్యాయుల కొరత తదితరాలపై చర్చించారు. ఎల్కేజీ నుంచి పీయూసీ వరకు ఒకే ఆవరణలో కన్నడ, ఇంగ్లీష్ రెండు భాషలలో విద్య లభించే కర్ణాటక పబ్లిక్ స్కూల్ (కేపీఎస్) పథకాన్ని జూన్ 1న శివమొగ్గలో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచి బడుల్లో ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలను అందిస్తారు. టెన్త్, ఇంటర్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించారని సీఎం అభినందించారు. కట్టెల లారీ బీభత్సం ● బైకిస్టు మృతి తుమకూరు: బైక్ను లారీ ఢీ కొనడంతో ద్విచక్రవాహనదారుడు మరణించాడు. ఈ ఘటన కొరటెగెరె పట్టణం వడ్డెగెరె వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. మృతుడు మధుగిరి తాలూకా దొడ్డహోసహళ్లికి చెందిన తిమ్మణ్ణ (47). తిమ్మణ్ణ, మహిళ బైక్లో వస్తుండగా, కొరటెగెరె సౌదే మండి ముబారక్కు చెందిన లారీ కట్టెల లోడుతో వస్తూ, ముందు వెళ్తున్న బైక్ని ఢీకొట్టింది. తరువాత రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. తిమ్మణ్ణ తీవ్ర గాయాలతో అక్కడే చనిపోగా, మహిళకు గాయాలయ్యాయి. మృతుడు తిమ్మణ్ణ కొరటెగెరెలో రోడ్డు పక్కన టీ, కొబ్బరికాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. లారీ డ్రైవర్ అనిల్ కూడా గాయపడ్డాడు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగే ప్రమాదానికి కారణమని తెలిసింది. -
మందులు బందయితే..
శివాజీనగర: చిన్న సుస్తీ చేసినా మందుల అంగడికి వెళ్లి మాత్ర తీసుకుని ఉపశమనం పొందడం సామాన్యులకు అలవాటే. కానీ హఠాత్తుగా షాపులు మూతపడడంతో ఇబ్బందులు పడ్డారు. మెడికల్ స్టోర్ల బంద్కు రాష్ట్రంలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. రాష్ట్రంలో సుమారు 26 వేలు, బెంగళూరులో సుమారు 6,500లకు పైగా మందుల షాపులు ఉండగా, ఎక్కువశాతం యజమానులు బుధవారం సమ్మెలో పాల్గొన్నారు. కొన్నిచోట్ల మాత్రం తెరిచే ఉన్నాయి. ఆన్లైన్లో మందుల అమ్మకాలను బంద్ చేయాలని, ఇంకా పలు డిమాండ్లతో సమ్మె నిర్వహించారు. బంద్ నేపథ్యంలో పలు చోట్ల ప్రజలు షాపుల కోసం గాలించారు. కేంద్రం పరిష్కరించాలి తుమకూరు: ఔషధ వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తుమకూరు నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా ఔషధ వ్యాపారులు అంగళ్లను మూసివేసి నిరసనలో పాల్గొన్నారు. మెడ్ప్లస్, అపోలో వంటి షాపులు పనిచేశాయి. ఔషధాల కోసం తెరిచి ఉన్న షాపులకు ప్రజలు ఎక్కువగా రావడంతో రద్దీ ఏర్పడింది. బెంగళూరు సహా రాష్ట్రంలో మెడికల్ షాపుల యజమానుల సమ్మె -
జైల్లోనే పెళ్లిరోజు.. ఎప్పటికీ నీ చేయి వదలను: దర్శన్ భార్య
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న నటుడు దర్శన్కు కాస్త ఊరట కలిగింది. దర్శన్ను కలిసేందుకు భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీశ్కు జైలు, పోలీసు అధికారులు అనుమతిచ్చారు. కుటుంబంతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఇటీవలే దర్శన్ అధికారులను కోరాడు. 30 నిమిషాలుమామూలుగా ఖైదీలను కుటుంబసభ్యులు కలవాలంటే ఇనుప కడ్డీలు, అద్దం అడ్డుగా ఉంటాయి, అలాగే మాట్లాడుకోవాలి. కానీ, దర్శన్కు ముఖాముఖి సంభాషణకు వీలు కల్పించారు. ఈ క్రమంలో తమ పెళ్లిరోజు(మే 19)నాడు భర్తను కలిసింది విజయలక్ష్మి. దాదాపు 30 నిమిషాలపాటు అతడితో సంభాషించింది. అనంతరం సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.నీ చేయి వదలనుప్రతి తుఫానులో, ప్రతి నిశ్శబ్ధంలో నీ చేయి నేను విడవను. పరిస్థితులు మనల్ని విడదీయాలని చూసినా నా గుండెచప్పుడు మాత్రం ఎల్లప్పుడూ నిన్నే కోరుకుంటుంది. ఈ ప్రపంచమంతా నీకు ఎదురు తిరిగినా సరే నేను మాత్రం నీవైపే ఉంటాను. నీకోసమే నిలబడతాను అని రాసుకొచ్చింది. కాగా దర్శన్- విజయలక్ష్మి 2003 మే 19న పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు వినీశ్ సంతానం. పెళ్లయిన కొంతకాలానికి దర్శన్- విజయలక్ష్మిల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. జైలు జీవితంఅదే సమయంలో నటి పవిత్రగౌడతో ప్రేమలో పడ్డాడు దర్శన్. 2014 నుంచి వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. ఇంతలోనే వీరి జీవితాల్లో పెద్ద కుదుపు ఏర్పడింది. 2024లో అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్టయ్యాడు. ప్రియురాలికి అశ్లీల సందేశాలు పంపాడన్న కారణంతో అనుచరులతో కలిసి దర్శన్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే దర్శన్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. View this post on Instagram A post shared by Vijayalakshmi darshan (@viji.darshan) చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద ఫ్యాన్స్ కోలాహలం -
రెండేళ్లలో 5 వేల మంది రైతుల ఆత్మహత్య
● రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ● కేంద్ర మంత్రి కుమారస్వామి బనశంకరి: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను కాంగ్రెస్ సర్కారు దాచిపెట్టిందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖమంత్రి హెచ్డీ.కుమారస్వామి ఆరోపించారు. మంగళవారం నగరంలోని జేడీఎస్ ఆఫీసులో ఆయన మాట్లాడారు. అన్నదాతలు ఆత్మహత్యల పెరిగాయని పత్రికల్లో గమనించానన్నారు. తీవ్ర దిగ్భ్రాంతి చెందానని, ప్రభుత్వం కళ్లుమూసుకుని కూర్చుందా? అని భావించానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాధనా సంబరాలు చేసుకుంటూ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2023లో 2,423 మంది, 2024లో 2,971 మంది రైతులు, కూలీలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. రెండేళ్లలో మొత్తం 5,394 మంది రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారని, రైతుల ఆత్మహత్యల్లో కర్ణాటక దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వివరాలు తెలియవా, లేక తెలిసినప్పటికీ మౌనంగా ఉందా? అనే అనుమానం కలుగుతోందని దుయ్యబట్టారు. బెంగళూరులో 10 నిమిషాలు వర్షం వస్తే ఎక్కడ చూసినా నీరు నిలబడుతోందని మండిపడ్డారు. సాధనా సమావేశానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందన్నారు. రైతులు, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని క్షమించరని మండిపడ్డారు. బిడది టౌన్షిప్పై డీసీఎం డీకే శివకుమార్తో చర్చకు సిద్ధమని చెప్పారు. హోటల్ గదిలో తూటాల పెట్టె ● వదిలేసి వెళ్లిన వ్యక్తి అరెస్టు బనశంకరి: పిస్టల్ తూటాల పెట్టెను హోటల్లో వదిలేసిన వెళ్లిన ఉదంతం కలకలం సృష్టించింది. అర్మాన్ ముతాహర్ (34), ఓ యువతితో కలిసి వచ్చి బెంగళూరు జయమహల్ ప్యాలెస్ హోటల్లో రూంలో దిగాడు. గత నెల 27 తేదీ రాత్రి హోటల్కు వచ్చిన అతడు నేను యుఎస్ఏ గ్రీన్కార్డు హోల్డర్ అని తెలిపి పాస్పోర్ట్ చూపించాడు. మరుసటి రోజు రూం ఖాళీ చేశారు. కొంతసేపటికి హోటల్ రిసెప్షన్కి ఫోన్ చేసి గదిలో పిస్టల్ తూటాల మ్యాగజైన్ మరిచిపోయానని, వచ్చి తీసుకుంటానని చెప్పాడు. ఈ నెల 4వ తేదీన హోటల్ సిబ్బంది అతనికి ఫోన్ చేసి తూటాలను ఇక్కడ ఉంచుకోలేమని, తీసుకెళ్లాలని, లేదంటే పోలీసులకు అప్పగిస్తామని చెప్పారు. తానే వచ్చి తీసుకుంటానని ఆ వ్యక్తి తెలిపాడు. చివరకు హోటల్ సిబ్బంది జేసీ నగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి మ్యాగజైన్ను అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి అర్మాన్ ముతాహర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తూటాలు అమెరికాలో తయారైనవని తేలింది. ఆయుధాల చట్టం ఉల్లంఘన కింద విచారణ చేపట్టారు. బైక్ను కారు ఢీ, ఒకరు మృతి మైసూరు: కారు, బైక్ ఢీకొనడంతో ఒకరు మరణించిన ఘటన మైసూరు నగరంలో జరిగింది. బెంగళూరు నివాసి మంజు (23) మృతుడు. ఇతను మైసూరు నగరంలోని బన్నూరు రోడ్డులోని కేఈబీ స్టేషన్లో జరుగుతున్న పనుల్లో పాల్గొనేందుకు వచ్చాడు. మంజు, అతని స్నేహితుడు వికాస్ భోజనానికి దేవెగౌడ సర్కిల్లో హోటల్కు వచ్చారు. తర్వాత బైక్లో వాపసు ఇంటికి వెళుతుండగా బన్నూరు మెయిన్ రోడ్డులోని టీఎంఈ కాలేజీ వద్ద వేగంగా దూసుకువచ్చిన కారు బైక్ను ఢీకొంది. దీంతో ఇద్దరూ బైక్ పైనుంచి కిందపడ్డారు. మంజు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. కారు డ్రైవరుపై వరుణ పోలీసులు కేసు నమోదు చేశారు. తోటల్లో గజ మంద విధ్వంసం మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలే మహదేశ్వర కొండ చుట్టుపక్కల గ్రామాల్లో అడవి ఏనుగుల బెడద పెరిగిపోవడంతో రైతులకు నిద్ర పట్టడం లేదు. కిరణహోళ గ్రామానికి చెందిన రైతు తోటలోకి చొరబడిన ఏనుగులు పనస, మామిడి చెట్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. రాత్రి తోటల్లోకి ప్రవేశించిన అడవి ఏనుగుల గుంపు, ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న ఫలవంతమైన చెట్లను వేళ్లతో సహా పెకిలించి నాశనం చేశాడని, దీంతో రైతులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధిత రైతులు తెలిపారు. మలే మహదేశ్వర కొండ అటవీ ప్రాంతంలో ఆహారం, నీటి కొరత కారణంగా అడవి ఏనుగులు రోజూ భూములపై దాడి చేస్తున్నాయని, దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొందని తెలిపారు. ఈ నేపథ్యంలో, సంబంధిత అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, తక్షణమే తగిన నష్టపరిహారం అందించాలని, ఏనుగులకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఇంట్లోకి కింగ్ కోబ్రా యశవంతపుర: చిక్కమగళూరు జిల్లాలో వేసవి ఎండలు, మధ్యలో వర్షాల వల్ల పాముల బెడద పెరిగింది. భారీ నాగుపాములు ఇళ్లలోకి వస్తున్నాయి. మూడిగెరె తాలూకా కె.తలగూరులో మంజునాథ్ అనే వ్యక్తి ఇంటిలోకి 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా చొరబడింది. తలుపు వద్ద పడగ తీసి నిలబడింది, దానిని చూసి అందరికీ వణుకు పుట్టింది. ఒణకల్కు చెందిన పాములు పట్టే అరిఫ్ను రప్పించారు. ఆయన గంటపాటు కష్టపడి ఆ కాళింగ సర్పాన్ని పట్టుకుని దూరంగా తరలించారు. తాను ఇప్పటి వరకు 318 కాళింగ సర్పాలను బంధించినట్లు అరిఫ్ తెలిపారు. -
గాలీవానతో బెంబేలు
తుమకూరు: రాష్ట్రంలో బెంగళూరుతో సహా పలు జిల్లాల్లో సోమవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది. తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకా హుళియారులో రాత్రి ఏకధాటిగా వీచిన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి యళనాడు గ్రామ పంచాయతీ పరిధిలో 40కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మూడు ప్రధాన ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. దీంతో పలు గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. యళనాడు, సింగాపుర, మోటిహళ్లి, కెరెసూరుగొండనహళ్లి, హుళియారు సమీపంలోని కెంకెరె పరిధిలో విధ్వంసం ఏర్పడింది. పండరగుత్తి వద్ద ప్రైమరీ, సెకండరీ కరెంటు తీగలపై పెద్ద చెట్లు విరిగి పడటంతో స్తంభాలు కూడా విరిగి పడ్డాయి. మరమ్మతు పనులను చేపట్టినట్లు బెస్కాం ఎస్ఈ రఘురాం తెలిపారు. ఇళ్లు ధ్వంసం శివమొగ్గ తాలూకాలోని కుడ్లిగెరె, హోళహొన్నూరు హోబ్లీ పరిధిలోని అనేక గ్రామాలలో గాలీవానకు చెట్లు విద్యుత్ లైన్లపై కూలిపోయాయి. రేకుల ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి. చాలా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బాధిత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తుమకూరు జిల్లాలో కూలిన చెట్లు, కరెంటు స్తంభాలు అంధకారంలో పలు గ్రామాలు -
నమో సుబ్రమణ్యేశ్వరా
కోలారు: ముళబాగిలు నగరంలోని శ్రీ బాల సుబ్రమణ్వేరస్వామి దేవాలయంలో మంగళవారం అధిక జేష్టమాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయమే స్వామివారి మూల విగ్రహానికి అభిషేకించి తరువాత ప్రత్యేక పూలతో అలంకరించారు. వడల మాలను సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. కట్న వేధింపులకు నవ వివాహిత బలి మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని నాగానగర గ్రామంలో నవ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానికురాలు ఐశ్వర్య (20)కు, జనవరిలో జీఆర్ నగరకు చెందిన నవీన్తో పెళ్లయింది. కొన్నిరోజులకే భర్త, అత్తమామలు అదనపు కట్నం తేవాలని వేధించడంతో ఆమె పుట్టినింటికి వచ్చేసింది. ఎన్నో ఆశలతో జరిగిన పెళ్లి విఫలమైందని ఆవేదన చెంది తమ తోటలోని ఇంట్లో ఉరి వేసుకుంది. వరకట్న వేధింపులు, అవమానాల కారణంగానే తన కుమార్తె మరణించిందని తండ్రి పళనిస్వామి.. ఆమె భర్త నవీన్, మామ మాదేశ్, అత్త ఈశ్వరి తదితరులపై రామాపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాపాడమ్మా యల్లమ్మా కోలారు: నగరంలోని రేణుకా యల్లమ్మ దేవాలయంలో మంగళవారం అమ్మవారికి దీపోత్సవం, హోమం, విశేష పూజలు జరిగాయి. పూజా కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు అన్న సంతర్పణ జరిగింది. మంత్రి కెహెచ్ మునియప్ప పాల్గొని మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం, కోలారు జిల్లాలో వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని పూజలు చేయడం సంతోషకరమన్నారు. రేణుకా యల్లమ్మ శక్తిదేవత అయి ఉండి ప్రజల కష్టాలకు స్పందించి ఇష్టార్థసిద్దిని ప్రసాదిస్తుందన్నారు. అది సమారాధన సభ ● బీజేపీ చీఫ్ విజయేంద్ర శివాజీనగర: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లయినా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, తుమకూరులో జరిపింది ప్రభుత్వ సాధన సమావేశం కాదని, ప్రభుత్వ సమారాధన అని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర దుయ్యబట్టారు. బెంగళూరులోని మల్లేశ్వరంలో బీజేపీ ఆఫీసులో మాట్లాడారు. ప్రభుత్వ ప్రకటనలను ప్రస్తావిస్తూ హేళన చేశారు. పెద్ద పెద్ద పదాలతో పత్రికలకు ెపెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారని, ఏం సాధించారని ఈ సభ పెట్టారని విమర్శించారు. సిద్దరామయ్య అహింద వర్గాన్ని వాడుకుని అధికారం అనుభవిస్తున్నారు, రాష్ట్రమంతటిని అప్పుల్లో కూరుకునేటట్లు చేశారని అన్నారు. మూడేళ్లలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు అస్తవ్యస్తంగా మారాయన్నారు. గుంతల రోడ్లను సరిచేయలేదన్నారు. కరువు, వరదల్లో రైతులను కనీసం పరామర్శించలేదన్నారు. అభివృద్ధి శూన్యం, అవినీతి మాత్రం ఘనమన్నారు. తుమకూరు సభకు ప్రజల సొమ్మును యథేచ్ఛగా ఖర్చు చేశారన్నారు. గ్యారెంటీల సొమ్ముతోనే ఉప ఎన్నికల్లో గెలిచారని, ఇది కొనసాగదని అన్నారు.దర్శన్తో భార్య భేటీకి ఓకే యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న నటుడు దర్శన్కు కొంచెం ఊరట కలిగింది. దర్శన్ను కలవడానికి భార్య విజయలక్ష్మి, కొడుకు వినీశ్కు జైలు, పోలీసు అధికారులు అనుమతిచ్చారు. కుటుంబంతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని దర్శన్ ఇటీవల వినతి చేశారు. మామూలుగా ఖైదీలను కుటుంబసభ్యులు కలవాలంటే ఇనుప కడ్డీలు, అద్దం అడ్డుగా ఉంటాయి, అలాగే మాట్లాడుకోవాలి. కానీ దర్శన్కు ముఖాముఖి సంభాషణకు వీలుంది. యమపాశమైన చీర దొడ్డబళ్లాపురం: నిచ్చెనకు కట్టిన చీర గొంతుకు చుట్టుకుని బాలిక మృతిచెందిన సంఘటన చిక్కమగళూరు జిల్లా శృంగేరి తాలూకా కల్లొళ్లి గ్రామంలో జరిగింది. 8వ తరగతి చదువుతున్న సప్తమి (14) మృతురాలు. సెలవులు కావడంతో సప్తమి నానమ్మ ఇంటికి వచ్చింది. ఇంటి అటకమీద ఆడుకుంటున్న సప్తమి నిచ్చెన ద్వారా కిందకు దిగుతుండగా నిచ్చెనకు కట్టిన చీర గొంతుకు చుట్టుకుని ఊపిరాడక స్పృహ తప్పింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో చనిపోయింది. శృంగేరి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
కర్ణాటక అభివృద్ధి మోడల్ మిన్న
తుమకూరు: గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలోని 580 హామీల్లో 290కి పైగా హామీలను నెరవేర్చామని సీఎం సిద్దరామయ్య చెప్పారు. రెండేళ్లలో మిగతా భరోసాలను నెరవేరుస్తామని తెలిపారు. ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంలో మంగళవారం తుమకూరు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీ మైదానంలో అట్టహాసంగా జరిగిన సాధన సమర్పణ సమావేశంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు పాల్గొన్నారు. సిద్దరామయ్య మాట్లాడుతూ 35 ఏళ్లుగా బీజేపీనే అధికారంలో ఉన్న గుజరాత్.. కర్ణాటక అభివృద్ధి నమూనా ముందు డొల్ల అని వర్ణించారు. పెట్రో ధరల భారానికి ప్రధాని మోదీనే కారణమని, నీట్ పరీక్ష రద్దుకు మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మహిళలకు భూహక్కు పత్రాలను పంపిణీ చేసి గిన్నిస్బుక్లో రికార్డు నమోదు చేశారు. సీఎం, డీసీఎంలు కలివిడిగా కనిపించారు. తుమకూరును బెంగళూరు ● ఉత్తర జిల్లా చేయాలి: హోంమంత్రి బెంగళూరుకు అతి సమీపంలో ఉన్నందున తుమకూరును బెంగళూరు ఉత్తర జిల్లాలో చేర్చాలని హోం మంత్రి జి.పరమేశ్వర్ డిమాండ్ చేశారు. ఆయన ప్రసంగిస్తూ బెంగళూరుకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉందని అన్నారు. అందువల్ల, తుమకూరును బెంగళూరు ఉత్తర జిల్లాలో చేర్చడానికి చొరవ తీసుకోవాలని సీఎం, డీసీఎంలను కోరారు. కాగా, ఈ సభకు వేలాదిమంది ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు. సీఎం సిద్దరామయ్య తుమకూరులో అర్భాటంగా మూడేళ్ల సాధన సభ -
లెక్చరర్ల కొరత.. విద్యార్థులకు వెత
సాక్షి బళ్లారి: ఈఏడాది ఉమ్మడి బళ్లారి జిల్లాలో 10వ తరగతిలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ్పభిగణనీయంగా పెరిగింది. విద్యార్థులు ఉత్సాహంగా కళాశాలల్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు పేద విద్యార్థులు అధిక సంఖ్యలో మొగ్గుచూపుతున్నా బోధన సిబ్బంది, వసతులు లేక ప్రైవేటు కళాశాలల్లో చేరేందుకే మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలో దాదాపు 180 మందికి పైగా లెక్చరర్ల కొరత వేధిస్తుండటంతో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు వెనుకంజ వేస్తున్నారు. నగరంలోని ప్రభుత్వ మున్సిపల్ కళాశాల ఒకప్పుడు ఈ కళాశాలలో చేరేందుకు సీట్లు దొరకాలంటే విద్యార్థులు అష్టకష్టాలు పడేవారు. ప్రస్తుతం మున్సిపల్ కళాశాలలో సిబ్బంది కొరత, వసతులు లేకపోవడంతో ఏటేటా చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. మున్సిపల్ కాలేజీలో 22 మంది బోధన సిబ్బంది కొరత ఉన్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కళాశాలలో ఎలా చేరాలి? అని పేద విద్యార్థులు కన్నీరుపెడుతున్నారు. మెరుగైన విద్య కరువై ప్రైవేటు వైపు విద్యార్థుల మొగ్గు ఒక్క మున్సిపల్ కళాశాలలో సిబ్బంది కొరత ఉంది అనుకుంటే పొరపాటు. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో కూడా ఇదే విధమైన సమస్య వేధిస్తోంది. బళ్లారి జిల్లాలోని 21 పీయూ కళాశాలల్లో 95 మంది లెక్చరర్లు, 8 మంది ప్రిన్సిపాల్స్ కొరత ఉండగా, విజయనగర జిల్లాలో 28, ప్రభుత్వ కళాశాలలకు గాను 85 మంది లెక్చరర్లు, 15 మంది ప్రిన్సిపాల్స్ కొరత వేధిస్తుండగా, ఇందులో ప్రధానంగా ముఖ్యమైన సబ్జెక్టులకు సంబంధించి అంటే గణితం, సైన్స్(ఫిజిక్స్, కెమిస్ట్రీ), ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో లెక్చరర్ల కొరత ఉన్నట్లు ఆయా కళాశాలల సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో సిబ్బంది కొరత ఉందని తెలియడంతో పేద విద్యార్థులు కూడా అష్టకష్టాలతో ప్రైవేటు కళాశాలల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. మరో 15 రోజుల్లో పీయూ కళాశాలలు ప్రారంభమవుతుండగా ప్రభుత్వ కళాశాలల్లోని సిబ్బందిని భర్తీ చేయడంలో ప్రభుత్వం మీనమేషాలను లెక్కిస్తోంది. దీంతో ఇదే అదునుగా చేసుకొని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చుకొని ఏటేటా ఫీజులను విపరీతంగా పెంచుతూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అప్పు చేసైనా ప్రైవేట్ కాలేజీల్లో చదివిస్తున్న తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా అప్పుల పాలవుతున్నారు. సర్కారీ కళాశాలల్లో సీట్లు ఖాళీగా ఉండగా, ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు దక్కించుకోవడానికి విద్యార్థులు ఆరాటపడుతున్నారు. నాణ్యమైన విద్య పేరుతో ప్రైవేటు కళాశాలలు ఏటేటా ఫీజులను పెంచుతూ దోపిడీ చేస్తుండగా, కట్టడి చేసే సామర్థ్యం ఉన్న ప్రభుత్వ పెద్దలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యను చదివించడానికి బంగారం, ఆస్తులను అమ్మాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని విధాలైన సౌకర్యాలు, వసతి, బోధన సిబ్బందిని కల్పిస్తే ప్రైవేటు కళాశాలల్లో తాము ఎందుకు తమ పిల్లలను చేర్పించి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుంటామని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత పాలకులు, అధికారులు స్పందించి ప్రభుత్వ కళాశాలల్లో బోధన సిబ్బందిని నియమించి సామాన్య, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించేందుకు తోడ్పాటును అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ పీయూ కాలేజీల్లో వేధిస్తున్న సిబ్బంది లోటు అఖండ బళ్లారిలో 180కి పైగా లెక్చరర్ పోస్టులు ఖాళీ ఫీజుల భారంతో విద్యార్థుల తల్లిదండ్రులు సతమతం సర్కారు నిర్లక్ష్యమే ప్రైవేటు కళాశాలల దోపిడీకి ఊతం -
దళిత కుటుంబాలకు ఇళ్ల స్థలాలేవీ?
బళ్లారిఅర్బన్: బళ్లారి జిల్లా కంప్లి తాలూకాలోని శ్రీరామరంగాపురం గ్రామంలో 101 దళిత కుటుంబాల సంక్షేమం కోసం ఇంటి స్థలాలు మంజూరు చేయాలని మంగళవారం కర్ణాటక మాదిగ రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కరియప్ప గుడిమని నేతృత్వంలో వందలాదిగా మహిళలు, గ్రామస్తులు పాల్గొని జిల్లాధికారికి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారికి, ఎంపీ ఈ.తుకారాంకు వినతిపత్రాలను సమర్పించారు. ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్న గ్రామాల్లో సొంత ఇల్లు లేని పేద దళిత కుటుంబాలకు ప్రభుత్వం ఇంటి స్థలాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పెరుగుతున్న జనాభాతో పాటు ఉమ్మడి కుటుంబాల నుంచి కూడా కొందరు ఇంటి స్థలాలు లేక బయటికి రాలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. గ్రామంలో గృహ నిర్మాణ స్థలాల కోసం గ్రామస్తులకు సుమారు 3 ఎకరాల 94 సెంట్ల భూమిని గుర్తించారు. దాని విలువ రూ.2.56 కోట్లు అవుతుందన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ భూమిని కొనుగోలు చేసి ఇంటి స్థలాలను మంజూరు చేయాలన్నారు. గ్రామస్తులు రామకృష్ణ, నీలప్ప పెయింటర్, సోమయ్య, కృష్ణ, పెద్దన్న, మోహన్రాజ్, వెంకటస్వామి, నవీన్కుమార్ మల్లమ్మ, లక్ష్మీ, సరస్వతి, సరోజమ్మలతో పాటు వందలాది మంది పాల్గొన్నారు. -
మూడేళ్ల పాలన అంటే వంద అబద్ధాలా?
సాక్షి బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సాగించిన మూడేళ్ల పాలన వంద అబద్ధాలతో కొనసాగిందని, పచ్చి అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసం చేయడంతోనే కాంగ్రెస్ పాలన సాగుతోందని మాజీ మంత్రి శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరూ అబద్ధాలకు సాక్ష్యంగా నిలిచారన్నారు. కేవలం అబద్ధాలపై పునాదులు కట్టుకొని పాలన సాగిస్తున్నారన్నారు. మూడేళ్లలో ఏం సాధించారని సంబరాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని నిలదీశారు. రైతుల పరిస్థితి దారుణం రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు విత్తనాల కొరత, మరో వైపు వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయి పంటలకు పెట్టిన పెట్టుబడులు దక్కకుండా పోతున్నాయన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య పట్టి పీడిస్తోందన్నారు. ఐదు గ్యారంటీ పథకాలతో అధికారంలోకి వచ్చి ఆ పథకాలను సక్రమంగా అందజేయకుండా ఓటర్లను మోసగించారన్నారు. వాల్మీకి అభివృద్ధి మండలిలో కోట్లాది రూపాయల అవినీతి మూడేళ్ల పాలనకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. పాకిస్తాన్కు జిందాబాద్పై చర్యలు శూన్యం పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేసిన విషయంలో ఓ కాంగ్రెస్ నాయకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ మధ్య అధికారం కోసం కుర్చీ ఆట సాగుతోందన్నారు. సీఎం పదవి కోసం డీకేశి పైరవీలు చేస్తున్నారని, ఆ కుర్చీని కాపాడుకునేందుకు సిద్ధరామయ్య పాట్లు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీ నాయకులు అనిల్కుమార్ మోకా, వీరశేఖర్రెడ్డి, శ్రీనివాస్ మోత్కర్, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు. రైతు ఆత్మహత్యలు, ధరల పెరుగుదల, రవాణా సంక్షోభంపై ఆగ్రహం వాల్మీకి అభివృద్ధి మండలి, ఐదు గ్యారంటీల అమలులో చిత్తశుద్ధి లోపం బీజేపీ నేత, మాజీ మంత్రి బీ.శ్రీరాములు మండిపాటు -
దేవెగౌడ ప్రతిమకు క్షీరాభిషేకం
రాయచూరు రూరల్ : మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ 93వ జన్మదినాన్ని దేవదుర్గలో ఘనంగా ఆచరించారు. దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ గోపాలకృష్ణ నాయక్ గాణదాళలో దేవెగౌడ ప్రతిమకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కృష్ణానది నుంచి సాగునీటిని పారించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన మహా నేత దేవెగౌడ అని అభివర్ణించారు. భూముల అక్రమ స్వాధీనం తగదు రాయచూరు రూరల్: జిల్లాలో అక్రమంగా భూములను స్వాధీనం చేయడం తగదని రాష్ట్ర ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు రూప మాట్లాడారు. దేవదుర్గ తాలూకా అరకెరలో 100 ఎకరాలకు పైగా సర్కారు భూములను ఆక్రమించారని, దానికి తహసీల్దార్ అమరేష్ బిరాదార్ మద్దతు పలుకుతున్నారని, అలాంటి అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. జంతు, ప్రాణి బలి వద్దు రాయచూరు రూరల్: జిల్లాలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని వన్య జీవులు, జంతు ప్రాణులను బలి ఇవ్వవద్దని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన బక్రీద్ పండుగపై అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఒంటె, గోవులు, పశువులను చంపడం నిషేధమన్నారు. వాటిని వధించరాదని ఆదేశించారు. పశువులను తరలించే సమయంలో పోలీసులు, పశు సంవర్థక శాఖాధికారులు, స్వచ్ఛంద సంస్థలు ముందుండాలన్నారు. సమావేశంలో ఎస్పీ అరుణాంగ్శు గిరి, ఏడీసీ శివానంద, అధికారులు కుమారస్వామి, తిమ్మప్ప, శరణప్ప, జోసెఫ్, మల్లికార్జున, రాజశేఖర్, పోం సింగ్, ఉమేష్ కాంబ్లేలున్నారు. విలేకరి మృతికి సంతాపం రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలోని హట్టికి చెందిన సీనియర్ పాత్రికేయుడు సోమణ్ణ గురికార్ మృతికి విలేకరుల సంఘం ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన జిల్లా విలేఖర్ల సంఘం అధ్యక్షుడు గురునాథ్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో గురికార్ చేసిన సేవలు గురించి వివరించారు. రెండు దశాబ్దాల పాటు పత్రికా రంగంలో సోమణ్ణ విశేషంగా రాణించారన్నారు. సిద్దయ్య, చెన్నబసవ, శ్యాం, గౌడ, మంజునాథ్, శివమూర్తి, ప్రసన్న జైన్, ముత్తన్న, వీరభద్రప్ప, పాషా పాల్గొన్నారు. కుంటలో పడి ఇద్దరు బాలికల మృతి సాక్షి, బళ్లారి: వ్యవసాయ కుంటలో కాలు జారి పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన కొప్పళ జిల్లా కుకనూరు తాలూకా యరేహంచినాళ గ్రామ శివార్లలో జరిగింది. గదగ్ జిల్లా తిమ్మాపుర గ్రామానికి చెందిన లక్ష్మవ్వ(15), ముత్తవ్వ(16) అనే ఇద్దరు బాలికలు వ్యవసాయ కుంట వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదవాతావరణం నెలకొంది. ఘటనపై కుకనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నేడు మెడికల్ షాపుల బంద్ శివాజీనగర: వివిధ డిమాండ్లతో మెడికల్ షాపుల యజమానులు దుకాణాలను బుధవారం మూసివేయనున్నారు. రాష్ట్రంలో వేలాది మెడికల్ షాప్లు బంద్ కానున్నాయి. రాష్ట్రంలో సుమారు 26 వేలకు పైగా మెడికల్ షాప్లు, బెంగళూరులో సుమారు 6,500లకు పైగా షాపులు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా ఔషధాల అమ్మకాన్ని నిలిపివేయాలని ప్రధానంగా కోరుతున్నారు. విచ్చలవిడి అమ్మకాల వల్ల ఔషధాల దుర్వినియోగం పెరిగిపోతుందని తెలిపారు. -
బళ్లారిలో గాలి వాన జోరు
● పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు బళ్లారి రూరల్ : నిన్నటివరకు ఎండలతో ఉక్కిరిబిక్కిరైన బళ్లారి నగరం మంగళవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, గాలివానతో దద్దరిల్లింది. విపరీతమైన గాలికి తోడు జోరువాన కురిసింది. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో గాలికి చెట్లు నేలకొరిగాయి. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కరెంట్ స్తంభాలు కూలడం, తీగలు తెగిపోవడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని మొదటి గేటు, రెండో గేటు, సుధాక్రాస్, హొసపేటె రోడ్డు, బీఎంసీఆర్సీ ఆసుపత్రి ప్రాంగణం, విద్యానగర్ 5వ క్రాస్ ప్రాంగణంలో పలు చెట్లు కూలాయి. -
పిడుగుపాటుకు 52 గొర్రెలు బలి
శివమొగ్గ: భద్రావతి తాలూకాలోని కల్లహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సిరియూర్ గ్రామంలోని రవికుమార్ ఫారంలో గొర్రెల మందలో సుమారు 52 గొర్రెలు మరణించాయి. చిత్రదుర్గ జిల్లా, హిరియూరుకు చెందిన నరసింహ మూర్తి 400 గొర్రెల మందను రవికుమార్ ఫారంలో వదిలిపెట్టారు. సాయంత్రం ఆకస్మాత్తుగా ఉరుములతో కూడిన వర్షం కురిసి పిడుగులు పడడంతో ఆ ధాటికి 52 గొర్రెలు చనిపోయాయి. శివమొగ్గ పశుసంవర్ధక సిబ్బంది వినయ్, వైద్య అధికారి మధుసూదన్, రెవెన్యూ సిబ్బంది పరిశీలించి పరిహారం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. -
జునేష నేత్రదానం
యశవంతపుర: కొడగు జిల్లాలో దుబారె ఏనుగుల శిబిరంలో సోమవారం ఏనుగులు కంచన్, మార్తాండ పోట్లాటలో మార్తాండ కిందపడిపోగా దాని కింద చిక్కి మరణించిన చైన్నె పర్యాటకురాలు జునేష (33) నేత్రాలను భర్త దానం చేశారు. అంత దుఃఖంలోనూ భర్త జోయెల్ నేత్రదానం చేసి మానవీయతను చాటుకున్నారు. ఈ దుర్ఘటనలో ఆమె దేహం నుజ్జుయింది. ఇతర అవయవాలను కూడా దానం చేయాలని అనుకున్నా సాధ్యం కాలేదని వైద్యులు తెలిపారు. భార్యను తలచుకుని జోయెల్ కన్నీరుమున్నీరయ్యారు. దుర్ఘటనకు కొంతసేపటి ముందు జునేష తీసుకున్న ఫోటో వైరల్ అయ్యింది. ఇందులో ఆమె ఏనుగుల వద్ద సెల్ఫీ తీసుకుంది. మావటీలే రెచ్చగొట్టారా? ఏనుగుల మధ్య గొడవను మావటీలు అడ్డుకోలేదా, మావటీల మధ్య విభేదాలతో ఏనుగులను ఘర్షణకు ప్రేరేపించారా, అనే పలు అనుమానాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఏనుగుల శిబిరంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు, టూరిస్టులను ఇష్టానుసారం వదిలేశారు అని అటవీశాఖ, పర్యాటకశాఖ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. ఓవైపు కావేరి నది, మరోవైపు భారీ కాయాల ఏనుగులు ఉన్నా పర్యాటకుల భద్రతకు పట్టించుకోలేదని విమర్శలున్నాయి. ఇక బుధ, గురువారం పర్యాటకులను నిషేధించారు. కాగా దసరా ఏనుగులను వరుసగా ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 2023 డిసెంబరులో హాసన్ జిల్లాలో ఓ అడవి ఏనుగును బంధించే ఆపరేషన్లో అటవీ సిబ్బంది కాల్పుల్లో గజరాజు అర్జున నేలకొరిగింది. దుబారె ఏనుగు శిబిరం విషాద ఘటన.. -
అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య
● భర్త అరెస్ట్ సాక్షి,బళ్లారి: అత్తింటి వేధింపులను తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. భర్త, అత్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బళ్లారి జిల్లా కంప్లి పట్టణంలో గృహిణి ఐశ్వర్య తన భర్త, అత్త వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త పశుసంవర్థక శాఖలో పని చేస్తుండేవాడు. పెళ్లైన కొత్తలో బాగానే సాగిన కాపురం బెంగళూరులో సంసారం పెట్టిన 9 నెలలకే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయని భార్య కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అత్త, భర్త ప్రతి రోజూ చిన్న గొడవలు పెట్టుకొని వేధించేవారని, దీంతో మనస్తాపంతో ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుందని, ఆమె మృతికి కారణమైన భర్త ప్రదీప్కుమార్ను కంప్లి పోలీసులు అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి మృతికి సంతాపం రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని తాలూకాల అభివృద్ధి విషయంలో ముందుండాలని కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్ సింగ్ పేర్కొన్నారు. ఆదివారం కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. నూతన తరగతి గదులు, ఆస్పత్రులు, రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి పథకాలు, ఇతరత్ర పనులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సమావేశంలో మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, ప్రియాంక్ ఖర్గే, ఈశ్వర్ ఖండ్రే, శివరాజ్ తంగడిగి, బోసురాజ్, రహీంఖాన్, శరణ బసప్ప దర్శనాపురలున్నారు. అంతకు ముందు మంత్రి సుధాకర్ మృతికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు అరెస్ట్ ● ఎట్టకేలకు గోవాలో పట్టివేతహుబ్లీ: 16 ఏళ్ల క్రితం లారీలో లక్షలాది రూపాయల విలువ చేసే సరుకులతో ఉడాయించిన నిందితుడిని అరెస్ట్ చేయడంలో హుబ్లీ గ్రామీణ పోలీసులు సఫలీకృతులయ్యారు. జిల్లాలోని కమలాపుర నివాసి లోకేష్ భీమక్కన్నవర అరెస్ట్ అయిన నిందితుడు. 2010 జూన్ 7న నిందితుడు లోకేష్ శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి సీజ్ అయి నిలబడిన లారీ నెంబర్ ప్లేట్ను తన లారీకి అమర్చుకున్నాడు. ఆ తర్వాత నకిలీ రికార్డులు సృష్టించి కార్బోక్యారియర్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మేనేజర్ను నమ్మించాడు. హిందూస్తాన్ లివర్ కంపెనీ నుంచి హొసపేటె, కొప్పళకు చేర్చాల్సిన రూ.14,87,289 విలువ చేసే సోపులు, పౌడర్, శ్యాంపు తదితర వస్తువులను లారీలో లోడ్ చేసుకొని వెళ్లి వేరే చోట విక్రయించడానికి ప్రయత్నించాడు. 2010లో కేసు నమోదు ఘటనపై 2010 జూన్ 11న హుబ్లీ రూరల్ పోలీస్ స్టేషన్లో వంచన కేసు నమోదైంది. కేసు నమోదయ్యాక కోర్టు నుంచి బెయిల్ పొందిన నిందితుడు అనంతరం విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నాడు. దీంతో కోర్టు అతడిపై వారెంట్ జారీ చేసింది. నిందితుడి కోసం హుబ్లీ రూరల్ సీఐ ఎంఆర్ చెన్ననవర నేతృత్వంలోని బృందం గాలించి నిందితుడు ఉపయోగించే వివిధ మొబైల్ నెంబర్లను తెలుసుకుని అతడు ఇతర రాష్ట్రాల్లో దాగి ఉన్నాడని ధృవీకరించుకున్నారు. గత నెల రోజులుగా వివిధ రాష్ట్రాల్లో మకాం వేసిన పోలీస్ బృందాలు ఈ నెల 14న గోవాలో అతడిని అరెస్ట్ చేశాయి. బీదర్లో కబడ్డీ క్రీడాకారిణిపై హత్యాచారం రాయచూరు రూరల్: బీదర్ జిల్లాలో కబడ్డీ క్రీడాకారిణిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన సోమవారం జరిగింది. బీదర్కు చెందిన క్రీడాకారిణి(15)పై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని కర్ణాటక భీమ సేన అధ్యక్షుడు శంకర్ రామలింగయ్య ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన మాట్లాడుతూ దళిత బాలికపై ఘోరానికి పాల్పడిన దోషులకు బీదర్ జిల్లా ఎస్పీ ప్రదీప్ గుంటి రక్షణ కల్పిస్తున్నారని, ఆ ఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పేలిన మందుగుండు.. నలుగురికి గాయాలుమాలూరు: కొండపై రాతి బండలను పేల్చేందుకు ఉపయోగించే మందుగుండు పేలి నలుగురు వ్యక్తులు గాయపడిన ఘటన మంగళవారం తాలూకాలోని కదరేనహళ్లి గ్రామ సమీపంలోని కొండపై చోటు చేసుకుంది. కొప్పళ జిల్లాకు చెందిన కార్మికులు చిరంజీవి, రాము, హేమంత, రాజు గాయపడ్డారు. ఎప్పటిలాగా కొండపై పని చేస్తున్న సమయంలో కార్మికులు బండను బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అకస్మాత్తుగా మందుగుండు పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన నలుగురిని చికిత్స కోసం కోలారులోని ఆర్.ఎల్.జాలప్ప ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాస్తి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాంబ్ స్క్వాడ్ను పిలిపించి తనిఖీ చేశారు. రాతి బండ యజమాని హనుమంతప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పలకరించిన తొలకరి
బళ్లారిఅర్బన్: గణినాడుగా పేరు గాంచిన బళ్లారిలో సుమారు 45 డిగ్రీల వరకు ఎండలు మండుతున్నప్పటికీ గత రెండు నెలలుగా అల్లాడి పోతున్న ప్రజలకు మంగళవారం తొలిసారి కురిసిన భారీ వర్ష ప్రభావంతో వాతావరణం చల్లబడి ఊరటను కల్గించింది. ఈ వర్షంలో వడగళ్లు కూడా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కురిసిన గాలి, వాన, ఉరుములు, మెరుపుల ప్రభావంతో కురిసిన వర్షంతో చెట్లు విరిగి కరెంట్ తీగలపై పడి రోడ్లపైకి నేలకొరిగి రాకపోకలు స్తంభించాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ భారీ వర్ష ప్రభావంతో కనక దుర్గమ్మ గుడి సమీపంలోని అండర్ బ్రిడ్జి, సత్యనారాయణ పేట అండర్ బ్రిడ్జి, రంగమందిరం రైల్వే బ్రిడ్జిల కింద మోకాలి లోతున నీరు నిలబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఏదేమైనా ఈ వర్ష ప్రభావంతో బళ్లారిలో వాతావరణ చల్లబడి రోడ్లపై కాస్త నీరు నిలబడటంతో మంటుడెండల నుంచి ఉపశమనం కలిగింది. బళ్లారిలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం వేసవి మండుటెండల నుంచి ప్రజలకు ఊరట -
నీటి బావుల్లో చమురు ఊట
యశవంతపుర: పశ్చిమాసియా యుద్ధం వల్ల మనదేశంలో పెట్రోలు, డీజిల్కు తీవ్ర కొరత ఏర్పడింది. ఇలాంటి సమయంలో రేవు నగరం మంగళూరులో కావూరు వద్ద బల్లపగురి రోడ్డులోని మూడు ఇళ్లలోని మూడు బావుల్లో డీజిల్ ఉప్పొంగుతోంది. దీంతో జనం సంభ్రమానికి లోనయ్యారు. బావుల నీటిలో 28 శాతం శుద్ధమైన డీజిల్ ఉందని ల్యాబ్ పరీక్షల్లోనూ బయటపడింది. బావిలోని నీటిని అనేకసార్లు తోడినా మళ్లీ అదే మాదిరిలో ఆయిల్తో కూడిన నీరు ఊరుతోంది. చమురు ఉత్పత్తి వల్ల ఇబ్బందిగా ఉందని, తాగడానికి, పాత్రలు కడగడానికి కుదరడం లేదని మహిళలు వాపోయారు. సమీపంలోని డీజిల్ బంకు నుంచి లీకై బావుల్లోకి చేరుతోందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ బంకుల్లో డీజిల్ నిక్షేపంగా ఉందని యజమానులు చెప్పారు. మంగళూరులో భారీ పెట్రోలియం రిఫైనరీ ఉండడం తెలిసిందే. దాని ప్రభావమా? అనే సందేహాలున్నాయి. పరిశీలన చేస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులు తెలిపారు. మంగళూరులో వింత -
రాజ కాలువల్లో స్వచ్ఛత కాపాడాలి
రాయచూరు రూరల్: నగరంలో రాజ కాలువల స్వచ్ఛతకు ప్రాధాన్యత కల్పించి పరిసరాలను సంరక్షించాలని స్వచ్ఛత నోడల్ అధికారి కృష్ణ శావంతగేర పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని భంగికుంట, కోట బస్టాండ్ వంటి ప్రాంతాల్లో మురుగు కాలువల్లో పూడి పోయిన చెత్తా చెదారాన్ని తొలగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. నగరసభ అధికారులు, సిబ్బంది నిఘా ఉంచి స్వచ్ఛత కాపాడలేని వారిపై జరిమానా విధించాలన్నారు. వర్షాకాలంలో వర్షపు నీరు పైకి రాకుండా కాలువల్లో ప్రవహించే విధంగా చూడాలని కోరారు. -
ఆ ఇంటి దీపం ఆరిపోలేదు
అనుకోని రీతిలో మృత్యువు ఆమెను కబళించింది. అయితే అంత విషాదంలోనూ ఆమె భర్త శెభాష్ అనిపించే నిర్ణయం తీసుకున్నారు. ఏనుగుల దాడిలో చనిపోయిన తన భార్య కళ్లను దానం చేశారు. కర్ణాటకలో పర్యాటక ప్రాంతం కొడగు జిల్లా దుబారే వద్ద ఏనుగుల పొట్లాటలో ఓ మహిళ నలిగి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే వైద్యుల సలహా మేరకు మృతురాలు తులసి కళ్లను దానం చేశాడు భర్త జోయెల్. తద్వారా ఆమె చూపు మరొకరి జీవితంలో వెలుగుని నింపుతుందని.. ఇలాగైనా తాను జీవించి ఉంటుందని చెబుతూ ఆ భర్త కన్నీళ్లు పెట్టుకున్నాడు. Heartbreaking Yet Inspiring Story of Love & Humanity ❤️Tulsi, lost her life in a tragic elephant attack at Dubare. Even in the deepest pain, her husband Joel showed extraordinary strength and compassion.Following doctors’ advice (as the body was severely injured), Joel… pic.twitter.com/gO3VuwF8Q0— Aparajite (@amshilparaghu) May 18, 2026ఏనుగులను చూసేందుకు దుబారే శిబిరం, దాని సమీప కావేరి నది వద్దకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. సోమవారం కూడా తమిళనాడుకు చెందిన ఝాన్సీ (33) కుటుంబం అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలోనే కావేరి నది వద్దకు ఏనుగులను మావటీలు స్నానానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో రెండు ఏనుగులు పోట్లాడుకోగా.. అందులో ఒకటి అక్కడే ఉన్న ఝాన్సీపై పడిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించేె లోపు మృతి చెందింది. ఆమె భర్త, కుమార్తె ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో భార్యను రక్షించుకునేందుకు జోయెల్ చేసిన ప్రయత్నం.. వీడియోగా నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఆమె శరీరం ఏనుగు కింద పడి నలిగిపోగా.. కళ్లు మాత్రం దెబ్బతినలేదు.Today, a tragic incident at Dubare Elephant Camp in Kodagu district, Karnataka, India.A 33-year-old tourist died after a temporary structure collapsed during an elephant bathing session following a clash between two elephants. pic.twitter.com/lfKJ5tpM6i— Weather Monitor (@WeatherMonitors) May 18, 2026 -
పిడుగు శబ్ధానికి హెచ్ఎం మృతి
దొడ్డబళ్లాపురం: పిడుగుపాటుకు గుండె ఆగి ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా మలెకుంబళూరు గ్రామంలో జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం నాగరాజప్ప (56) మృతుడు. ఆదివారం రాత్రి జోరువాన కురిసింది. నాగరాజప్ప ఇంటి ముందు నిలబడి ఉండగా సమీపంలోనే పిడుగు పడింది. ఈ భీకర శబ్దానికి ఆయన గుండె ఆగి కుప్పకూలి మరణించారు. హొన్నాళి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ఊపిరి తీసిన ఉసిరి మాలూరు: పసిబాలుడు ఉసిరికాయతో ఆటలాడుతూ నోట్లో పెట్టుకోగా గొంతులో చిక్కుకుంది. విలవిలలాడుతూ చనిపోయాడు. ఈ విషాద ఘటన కోలారు పట్టణంలోని గాంధీ నగర్లో జరిగింది. వివరాలు.. రవి, మాలా దంపతుల కుమారుడు విజయేంద్ర (2). ఇంట్లో ఆడుకుంటూ నేలపై పడిన ఉసిరి కాయను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో చిక్కుకుంది. తల్లిదండ్రులు చూసి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. వైద్యులు గొంతులో చిక్కుకున్న ఉసిరికాయను బయటకు తీసేసరికి బాలుడు మరణించాడు. కళ్ల ముందే కుమారుడు దూరం కావడంతో తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది.దళపతి 94వ పుట్టినరోజు ● పోరాటం చేస్తూనే ఉంటానని వెల్లడి శివాజీనగర: జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్.డీ.దేవేగౌడ సోమవారం 94వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొన్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. సతీమణి చెన్నమ్మతో కలసి బెంగళూరు జేపీ నగరలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అసమానమైన సేవలు అందించారని, దేవుని దయతో మరింతకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తుతోనే ఎన్నికలకు తన చేతనైన వరకు రాష్ట్ర సమస్యలపై ప్రజల కోసం పోరాటం చేస్తానని దేవేగౌడ తెలిపారు. 68 సంవత్సరాలుగా రాజకీయ పోరాటం చేస్తూ వచ్చాను, ఎలాంటి క్లిష్ట సమస్య వచ్చినా పరిష్కరించుకొంటాననే దృఢ విశ్వాసముందని ఆయన తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో పొత్తు ఉంటుందని, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సత్సంబంధాలు ఉన్నాయని, ఎలాంటి సమస్యా రాదని చెప్పారు. దక్షిణాన కేరళ, తెలంగాణ, కర్ణాటకలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉందని, మునుముందు ఏమి జరుగుతుందోనని వేచి చూడాలని అన్నారు. హైవేలో డివైడర్కు కారు ఢీ ● తల్లీ, కుమార్తె దుర్మరణం తుమకూరు: రోడ్డు డివైడర్ను కారు ఢీ కొట్టిన ప్రమాదంలో తల్లీకూతురు మరణించారు. ఈ ఘటన జిల్లాలోని కుణిగల్ తాలూకా లాళపుర వద్ద హైవే– 75లో సోమవారం జరిగింది. బెంగళూరుకు చెందిన జయమాల (59), ఆమె కుమార్తె రాజేశ్వరి (42) మరణించారు. వీరు రాయచూరుకు చెందిన వారు కాగా కొన్నేళ్లుగా బెంగళూరులో నివాసం ఉంటున్నారు. రాజేశ్వరి కుమారుడు ప్రీతంను శ్రావణ బెళగొళలోని పాఠశాలలో చేర్పించేందుకు బెంగళూరు నుంచి తుమకూరుకు రైలులో వచ్చారు. తమ బంధువు మహావీర్తో కారులో శ్రావణ బెళగొళకు బయలుదేరారు. వేగంగా వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొనడంతో మహిళలు మరణించగా, మహావీర్, ప్రీతంకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో హైవేలో కొన్ని గంటలపాటు రాకపోకలకు ఆటంకం కలిగింది. కుణిగల్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. -
ధాన్యం కొనుగోళ్లు ఎన్నడో?
హొసపేటె: ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన అన్నదాతలకు కాలం కలసి రావడం లేదు. అప్పులు చేసి మరీ వరి సాగు చేసిన రైతులకు మద్దతు ధర లభించడం లేదు. ప్రస్తుతం పంట నూర్పిడి చేసి కల్లాల్లో ఆరబెట్టారు. అయితే దాన్యం కొనుగోళ్లకు ఎవరూ ముందుకు రావడం లేదు. తుంగభద్ర జలాశయం క్రస్ట్ గేట్లలో మార్పు కారణంగా రెండవ పంటకు నీరు అందుబాటులో లేదు. ఎరువుల ధరలు, కూలీల సమస్యలతో వరి పండించే రైతులకు సరైన ధరలు లభించడం లేదు. విజయనగర జిల్లా హోస్పేట్ తాలూకాలో ఉన్న నాగేనహళ్లి, కమలాపూర్, హంపీ తదితర ప్రాంతాల్లో 500 నుంచి 600 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. పంట కాలం పూర్తి కావడంతో పంటను నూర్పిడి చేసి ఆరబోశారు. రైతులు పండించిన వరిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ వరికి రూ.2440 మద్దతు ధర ప్రకటించింది. అయితే జిల్లాలో వరి సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ మద్దతు ధర కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారుల చేతివాటం.. జిల్లాలో వరి కోతలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. అయితే పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోతలు పూర్తయి, పెద్ద మొత్తంలో వరి ధాన్యం విజయనగర, బళ్లారి జిల్లాల మార్కెట్లకు చేరుకుంటోంది. జిల్లాలో వరి కొనుగోలుదారులు లేరు. దీనిని ఆసరాగా చేసుకున్న దళారులు.. తక్కువ ధరకు వరిని కొనుగోలు చేస్తున్నారు. రైతులు పండించిన వరికి ప్రభుత్వం ఎందుకు సరైన ధర నిర్ణయించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు, విద్యుత్, రవాణాతో సహా అన్ని ధరలను పెంచుతున్నప్పటికి.. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం ఎలాంటి ధరలు పెంచక పోవడం విడ్డూరం. ఎన్నికల ప్రసంగాల్లో రైతులు దేశానికి వెన్నెముక అని సుదీర్ఘ ప్రసంగాలు చేసి అధికారంలోకి వచ్చే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు.. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడటం లేదు. రైతులు పండించే పంటలకు సరైన ధర అందేలా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే జిల్లాల్లో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేస్తే రైతులకు ఇబ్బంది ఉండదు. రైతుల గోడు పట్టదా? ఒక ఎకరంలో వరి పండించడానికి రైతులకు విత్తనాలు, నారు, ఎరువులు, పురుగు మందులు అవసరం. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రభుత్వాలు రైతులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి. వారికి రైతు సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఎరువులు, విద్యుత్, రవాణా, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచినట్లే రైతులు పండించే పంటల ధరలను కూడా ప్రతి ఏటా పెంచాలని రైతు సంఘం నేతలు తలవార్ నాగరాజ్, సన్నక్కి రేవుద్రప్ప డిమాండ్ చేస్తున్నారు. పంటలకు సరైన ధర లభించకపోతే రాబోయే రోజుల్లో రైతులు నిరసన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం వరి రైతుకు మద్దతు అంతంతే.. ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు -
బళ్లారి జిల్లాలో 4,764 బీపీఎల్ కార్డులు రద్దు
బళ్లారి అర్బన్: బళ్లారి జిల్లాలో అక్రమంగా పొందిన రేషన్కార్డుల తొలగింపు ప్రారంభమైంది. సుమారు 4,764 బీపీఎల్ కార్డులు రద్దు అయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో అంత్యోదయ కార్డులు 24,773, బీపీఎల్ కార్డులు 2,74,280 ఉన్నాయి. అన్నభాగ్య పథకం కింద పేద కుటుంబాలకు ఉచిత బియ్యం, రాయితీపై ఇతర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం వివిధ సామాజిక భద్రత పథకాలకు బీపీఎల్ కార్డులు ఉన్న వారినే అర్హులుగా ఎంపిక చేస్తోంది. అయితే ఈ జాబితలో ఆర్థికంగా బలంగా ఉన్న వారు ఆదాయపు పన్ను చెల్లింపు దారులు, పేద భూస్వాములు విలాసవంతమైన వాహనాలు, ప్రయాణం చేస్తున్న వారు కూడా ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు అనర్హులైన కార్డులను గుర్తించే ప్రక్రియ ఎక్కువగా స్థానిక స్థాయి ధ్రువీకరణ, ఇంటింటా ఆహార శాఖ పూర్తిగా డిజిటల్ సాంకేతికను ఆశ్రయించింది. రేషన్ కార్డులకు తప్పనిసరిగా ఆధార్ నంబర్, బ్యాంక్ నంబర్, పాన్ కార్డులను జత చేసి సమాచారం సరి చేసి ధ్రువీకరించారు. ఆహార శాఖ అధికారులు, బీపీఎల్ కార్డు పొందడానికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణ కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలకు మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కన్న పెద్ద ఇళ్లు ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో 3 హెక్టార్ల మెట్టు భూమి, సాగునీటి భూమి ఉంటే అనర్హులుగా పరిగణించబడుతారు. జీవనోపాధి కోసం ఆటోలు, ట్యాక్సీలు మినహా సొంత నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారికి కూడా బీపీఎల్ సౌకర్యం అందుబాటులో లేదన్నారు. బళ్లారి గణాంకాల ప్రకారం బళ్లారి తాలూకా 3,960 కార్డులు రద్దు.. కాగా సిరుగుప్ప 243, కురుగోడు 190, సండూరు 168, కంప్లి 59 కార్డులు రద్దు అయ్యాయి. అర్హులైన పేదలకు మాత్రమే అన్నభాగ్య ఇతర ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూరేలా తనిఖీలు కొనసాగుతాయని ఆహార శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవరాజ్ స్పష్టం చేశారు. -
పురావస్తు ప్రదేశాలను కాపాడుకోవాలి
హొసపేటె: పురావస్తు ప్రదేశాల పరిరక్షణ ప్రతి ఒక్కరి ప్రాథమిక కర్తవ్యం కావాలని హంపీ పురావస్తు శాఖ సూపరింటెండెంట్ కే.రామకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం కమలాపూర్ మ్యూజియంలో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రజలు ప్రాథమిక హక్కుల గురించి మాత్రమే మాట్లాడతారని.. వారి ప్రాథమిక కర్తవ్యాలపై దృష్టి పెట్టరని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన హంపీ చుట్టూ తగినన్ని పురావస్తు ప్రదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. కార్యక్రమంలో కన్నడ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ విరుపాక్షి పూజారిహళ్లి, విరుపాక్షేశ్వర ప్రీ–యూనివర్సిటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బసవరాజ్ ఎమ్మిగనూరు, జేఎస్డబ్ల్యూ పంకజ్కుమార్, మహమ్మద్ అమర్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సిబ్బంది డాక్టర్.దేవరాజు ఎస్.ఎం.డాక్టర్ కేసీ ప్రేమ, డాక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. భూముల పంపిణీ చేపట్టాలి రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేదలకు వెంటనే భూములు పంపిణీ చేయాలని భూమి వసతి హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం టిప్పు సుల్తాన్ ఉద్యాన వనంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంచాలకుడు మారెప్ప మాట్లాడుతూ.. గోమాళ, గైరాణ, పరంబోకు, ఖరాబ్, అటవీ భూ బ్యాంక్ నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, సన్న, చిన్నకారు రైతులకు సర్కార్ మిగులు భూములు పంపిణీ చేయాలని కోరారు. అనంతరం స్థానిక అధికారికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆంజనేయ, రంగారెడ్డి, నరసింహులు, గోవింద, జిందమ్మ,అంబమ్మలున్నారు నియామకంహొసపేటె: అఖిల భారత వాల్మీకి నాయక సంఘం జాతీయ అధ్యక్షుడిగా హొసపేటెకు చెందిన గుజ్జల నాగరాజ్ ఎన్నికయ్యారు. ఇటీవల అఖిల భారత వాల్మీకి నాయక సంఘం కార్యవర్గ సమావేశం ఢిల్లీలోని జనకపురిలో ఉన్న జాతీయ కార్యాలయంలో జరిగింది. నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. విజయనగర జిల్లాకు చెందిన న్యాయవాది గుజ్జల్ నాగరాజును నూతన జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సెక్యూరిటీ గార్డు దారుణ హత్య రాయచూరు రూరల్: ఇనుప రాడ్తో కొట్టి సెక్యూరిటీ గార్డును దారుణంగా హత్య చేసిన ఘటన కలబుర్గి జిల్లాలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కలబుర్గిలోని ఇండియన్ ఆయిల్ కంపెనీలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు రవిచంద్ర ఖేడ్ (45) హత్యకు గురైన వ్యక్తి. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ఉన్న రవిచంద్ర ఖేడ్ను బయటకు పిలిచి, రామ మందిరం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఏమి జరిగింది ఏమో తెలియదు కాని.. ఇనుప రాడ్తో కొట్టి రవిచంద్ర ఖేడ్ను హత్య చేశారు. కలబుర్గి పోలీస్ కమిషనర్ శరణప్ప ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ పథకాలు అందాలి రాయచూరు రూరల్: జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి. అలాగే అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారి పూవిత తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ శాఖ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలు కూడా ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూముల ఆక్రమణపై విచారించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టాల్లో తేడాలు, సవరణ, భూముల హక్కు పత్రాలు, సర్వేలు, అక్రమ ఇసుక రవాణా తదితర వాటిపై నిఘా పెట్టాలని తెలిపారు. ప్రజల సమస్యలను ఓపికగా విని, సమర్థవంతంగా పని చేయడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. -
వరకట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దు
సాక్షి, బళ్లారి: కలబుర్గి జిల్లాలో లంబాణి గిరిజనులు వరకట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దు అంటూ ఆదర్శ తీర్మానం చేశారు. వరకట్నం మహిళ కుటుంబాలను పట్టిపీడిస్తున్న నేపథ్యంలో వరకట్నం లేకుండా పెళ్లిళ్లు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. సమాజంలో వరకట్నం కారణంగా పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఆడబిడ్డలకు వివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు అప్పులపాలవుతున్న సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై తాండాల్లో జరిగే వివాహాల్లో ఎవరైన వరకట్నం కోరితే లేదా ఇస్తే సామాజికంగా బహిష్కరించడం వంటి చర్యలు తీసుకుంటామని పెద్దలు హెచ్చరించారు. మహిళ గౌరవం, సమానత్వం ఆర్థిక భారం తగ్గించడమే ప్రధాన ఉద్దేశం అని చర్చించారు. తల్లిదండ్రులు చట్టపరంగా ఆడపిల్లకు ఇవ్వాల్సిన ఆస్తి ఇతరత్ర వాటిని ప్రేమతో ఇస్తారు. అయితే బలవంతంగా వరకట్నం రూపేణ తీసుకోకూడదన్నారు. వరకట్నం అడిగితే సామాజిక బహిష్కరణ చేస్తామని చెబుతున్నారు. ఇకపై లాంబాణి సమాజంలో జరిగే వివాహాల్లో వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం పూర్తిగా నిషేధించాలని తాండాల పెద్దలు, మహిళలు తీర్మినించారు. పెళ్లి పేరుతో అమ్మాయి కుటుంబాలపై ఆర్థిక భారం మోపడం అన్యాయం. దీని వల్ల చాలా పేద కుటుంబాలు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నాయి. నిరాడంబర వివాహాలు జరిపి, ఆడంబరాలకు దూరంగా ఉండాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం కేవలం ఒక గ్రామానికే పరిమితం కారాదని తెలిపారు. కలబుర్గి జిల్లాలో లంబాణి గిరిజనుల ఆదర్శ తీర్మానం ఆడంబరాలు, అప్పుల భారం అడ్డుకట్ట దిశగా అడుగు నిబంధనలు ఉల్లంఘిస్తే సామాజిక బహిష్కరణ -
అంతర్గత రిజర్వేషన్లపై గందరగోళం
బళ్లారి అర్బన్: అంతర్గ రిజర్వేషన్ అమలులో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని మాదిగ రిజర్వేషన్ల పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.హనుమంతప్ప ఆరోపించారు. సోమవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న అంతర్గ రిజర్వేషన్లు నిర్ణయాలను అమలు చేయకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తుందన్నారు. దళితులపై చిత్తశుద్ది ఉంటే నాగమోహన్ దాస్ నివేదికను ఇప్పటికే అమలు చేసి ఉండాల్సి ఉందని గుర్తు చేశారు. ఏసీపీ, టీఎస్పీ నిధులను గ్యారెంటీ పథకాల కోసం వినియోగిస్తున్నారని తెలిపారు. దళితుల సంక్షేమంపై కాంగ్రెస్కు శ్రద్ధ లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అంతర్గ రిజర్వేషన్ల నిర్ణయంపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం బాధకరమన్నారు. రిజర్వేషన్ అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రిజర్వేషన్ల అమలుపై నెలకొన్న గందరగోళాన్ని వెంటానే నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోకా అనిల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఈదురు గాలులు, పిడుగుల బీభత్సం
రాయచూరు రూరల్: రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి, రాయచూరు జిల్లాల్లో ఈదురు గాలులు, పిడుగులు బీభత్సం సృష్టించి ఒకరిని బలి తీసుకున్నాయి. లింగసూగూరు తాలూకా ముదుగల్ మండలం సోమలాపూర్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పొలం పనుల చేస్తున్న సమయంలో పిడుగు పడటంతో కరియప్ప అయ్యప్ప గెణికిహళ (47) అక్కడికక్కడే మృతి చెందాడు. మేగళపేటలో పిడుగు పడి మూడు గడ్డి వాములు కాలిపోయాయి. మరో వైపు హోరు గాలికి విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి కిందిపడ్డాయి. టిన్ షెడ్లు గాలికి కొట్టుకుని పోయాయి. కలబుర్గి జిల్లా చిత్తాపూరలో క్రీడా మైదానంలో నిర్మించిన పైకప్పులు ఎగిరిపోయాయి. -
ఐదేళ్లలో గణనీయమైన అభివృద్ధి
బళ్లారి అర్బన్: గత ఐదేళ్లలో విజయనగర శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విద్య, మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వైస్ చాన్సలర్ మునిరాజ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీఎస్ఆర్ నిధులతో జిమ్ గది, క్యాంటీన్ నిర్మించామని చెప్పారు. రూ.23 కోట్ల వ్యయంతో మల్టీ యుటిలిటీ కాంప్లెక్స్ నిర్మించి, ఆస్పత్రి, బ్యాంకు, ఏటీఎం, జిరాక్స్ సెంటర్ సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. గవర్నర్ గ్రాంట్ ద్వారా రూ.42 కోట్లతో విశ్వవిద్యాలయాన్ని సౌరశక్తి ఆధారితంగా మార్చామని వెల్లడించారు. దీని వల్ల ప్రతి నెలా విద్యుత్ ఖర్చు ఆదా అవుతోందన్నారు. స్మార్ట్ క్లాస్రూమ్స్, కొత్త ఆడిటోరియం, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. క్యాంపస్ టు కేరీర్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మెడికల్ ఫిజిక్స్ సహా పలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టామని తెలిపారు. విద్యార్థుల కోసం కొత్త స్టేడియం నిర్మించడంతో పాటు జర్నలిజం విభాగానికి కెమెరా, డ్రోన్ అందజేసినట్లు వెల్లడించారు. ఎన్ఎమ్డీసీ సహకారంతో రూ.1.5 కోట్ల వ్యవయంతో భోజన శాల నిర్మాణం జరుగుతోందని.. వచ్చే నెలలో ప్రారంభిస్తామని తెలిపారు. అంబేడ్కర్ స్టడీ సెంటర్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశ్వవిద్యాలయంలో ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. కార్యక్రమంలో సాలి, లోకేష్ పాల్గొన్నారు. -
ఇంటి అద్దె పేరిట రూ.200 కోట్ల లూటీ
బనశంకరి: సిలికాన్ సిటీలో ఇంటిని లీజుకు తీసుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇళ్లు బాడుగకు తీసుకునేవారిని మభ్యపెట్టి సుమారు రూ.200 కోట్లకు పైగా వంచనకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. జాన్స్ అసెట్ పేరుతో ఓ వంచకుడు 300 మందికి పైగా ప్రజలను దోచేశాడు, యజమాని స్టీఫెన్ జాన్ పారిపోగా బాధితులు ఇందిరానగర ఠాణాలో ఫిర్యాదు చేశారు. పెట్టుబడి పెడితే.. అద్దె చెల్లిస్తానని. ఇల్లు బాడుగకు కావాలనుకునేవారే స్టీఫెన్ లక్ష్యం. తమ వద్ద పెట్టుబడిపెడితే.. మేము మీకు ఇంటిని గాలించి ఇప్పిస్తాం, నెల అద్దెను మేమే చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నాడు. ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి 75 లక్షల వరకు డిపాజిట్లు తీసుకున్నాడు. ఈ డబ్బును కంపెనీలలో పెట్టుబడి పెట్టి ఆ వడ్డీ డబ్బుతో ఇంటి బాడుగ కడతానని చెప్పేవాడు. కొన్ని నెలలు అద్దెలు చెల్లించడంతో చాలా మంది నిజమే అని నమ్మారు. తరువాత స్టీఫెన్ అద్దె కట్టకపోవడంతో ఇంటి యజమానులు బాడుగదారులను ప్రశ్నించారు. కొందరు వెళ్లి స్టీఫెన్ని ప్రశ్నించగా, డబ్బు వెనక్కి ఇవ్వడానికి నిరాకరించి, మీ డబ్బులకు నెలకు 4 శాతం వడ్డీ ఇస్తామని నమ్మించాడు. ప్రస్తుతం కంపెనీ మూసేసి కోట్లాది రూపాయలు డబ్బుతో పారిపోయాడు. కొత్త కస్టమర్ల నుంచి వచ్చిన డబ్బును పాత కస్టమర్లకు అందిస్తూ పొంజి స్కీమ్ నడిపేవాడని తెలిసింది. గతంలోనూ ఇతనిపై చీటింగ్ కేసు ఉంది. 300 మందికి పైగా కుచ్చుటోపీ పరారీలో నయవంచకుడు -
తాలూకా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
హొసపేటె: మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వ్యామోహాన్ని వదిలించుకుని.. క్రీడలపై దృష్టి సారించాలని కాంగ్రెస్ యువజన నాయకుడు అశోక్ భీమనాయక యువతకు పిలుపునిచ్చారు. తంబ్రహళ్లిలో తాలూకా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో యువతరం ఆందోళనకర స్థాయిలో మొబైల్ ఫోన్లకు బానిసలు అవుతున్నారని తెలిపారు. సామాజిక అభివృద్ధికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక బాధ్యత అవసరమని అభిప్రాయపడ్డారు. క్రీడలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు.. అవి క్రమశిక్షణ నాయకత్వం, ఇది సహనాన్ని, జట్టు స్ఫూర్తిని పెంపొందించేందుకు ఉపయోగపడుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువతకు తగిన వేదికను కల్పిస్తే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. వివిధ రకాల చెట్లను నాటడం ద్వారా పర్యావరణ అనుకూల సందేశం వ్యాప్తి చేయబడిందన్నారు. విద్యార్థులు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోరి గోనిబసప్ప, హామీ పథకం అమలు కమిటీ అధ్యక్షుడు గురుబసవన రాజ్, గౌరజ్జనవర గిరీష్, సురేష్, డిష్ బాలప్ప, బాదర్డికి నాగరాజ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
డిపాజిట్ల స్కాంలో సీఐడీ కస్టడీ
బనశంకరి: బెళగావిలో రూ.4,500 కోట్ల డిపాజిట్ల కుంభకోణం కేసులో అక్యూమెన్ ఫైనాన్స్ అధినేత శివానంద నీలణ్ణవర్కు 10 రోజుల పాటు సీఐడీ కస్టడీకి బెళగావి రెండో అదనపు సెషన్స్కోర్టు ఆదేశించింది. 35 వేల మంది నుంచి పెట్టుబడులు సేకరించి రూ.వెయ్యి కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయని, లోతైన విచారణ కోసం 10 రోజులు కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు కోర్టుకు విన్నవించారు. జడ్జి గంగాధర ఆమోదించారు. తనకు బీపీ ఉందని శివానంద తెలిపారు. వైద్యుల్ని అందుబాటులో ఉంచాలని జడ్జి ఆదేశించారు. కోర్టులో హైడ్రామా 35 వేల మందికి డబ్బు అవసరం లేదు, నేను అవసరమని శివానంద చెప్పగా, న్యాయమూర్తి స్పందిస్తూ అమాయకులకు అన్యాయం జరగరాదని, ప్రభుత్వమే ప్రజలకు రక్షణ కల్పిస్తుందన్నారు. మీరు ప్రజలకు అవసరం కావచ్చు, మంచి చేసి ఉండవచ్చు, కానీ తనకు తెలియదన్నారు. చాలామంది డబ్బులు సేకరించి పారిపోయారని, చరిత్ర నుంచి పాఠం నేర్చుకోవడానికి పలు చట్టాలు తీసుకువచ్చారు, ధర్మో రక్షతి రక్షితః అనే సూక్తిని జడ్జి వినిపించారు. కోర్టు హాల్ బయట ఉన్న సోదరున్ని చూసి శివానంద కన్నీరు పెట్టుకున్నారు. నిందితున్ని బెంగళూరుకు తీసుకొచ్చి విచారిస్తారు. శివానంద వింత వాదనలు -
20వ తేదీకి సిద్దరామయ్య సర్కారు ఘనత
● నేడు తుమకూరులో భారీ బహిరంగ సభ ● పాల్గొననున్న సీఎం, డీసీఎం, మంత్రులుసాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మే 20తో మూడేళ్ల కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని 4వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. మంగళవారం తుమకూరులో అట్టహాసంగా సాధన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం, డీసీఎం, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఈ సభలో పాల్గొంటారు. పలు పథకాల కింద ఈ సమావేశంలో వేలాది లబ్ధిదారులకు సంక్షేమ పత్రాలను అందిస్తారు. అన్నీ నాటకీయంగా.. అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్యంగా గెలవడం, ఢిల్లీలో నాటకీయ పరిణామాల సీఎం, డీసీఎంల ఎంపిక జరగడం కొత్త విషయమేమీ కాదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రతిపక్షాలు ఆశించినంత పుంజుకోలేకపోవడం, ఉప ఎన్నికలలో గెలుపు, పంచ గ్యారంటీ పథకాలతో ప్రజాకర్షణ అనేవి ప్రభుత్వానికి అనుకూలమయ్యాయి. ఇదే సమయంలో ఆ గ్యారెంటీ స్కీముల అమలు ద్వారా ఖజానాపై భారం పడడంతో ధరల పెంపు మార్గాన్ని ఆశ్రయించింది. ఇలా ఈ మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఎత్తుపల్లాలను చూసింది. అనుకూల, ప్రతికూలతలు పంచ గ్యారెంటీ పథకాలు, బెంగళూరు అభివృద్ధికి పెద్దపీట, మెట్రో రైలు విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణలో గణనీయ ప్రగతిని సాధించినట్లు ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. అయితే జిల్లాల్లో అభివృద్ధిలో వెనుకంజ, ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ యువత ఉద్యమించడం, కులగణన నివేదికను అటకెక్కించడం, ముఖ్యమంత్రి కుర్చీ కోసం కలహాలు, ఢిల్లీలో పంచాయతీలు, కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలు వంటివి సర్కారుకు ముళ్లుగా మారాయి. నేడు సాధన సభ: హోంమంత్రి తుమకూరు: సిద్దరామయ్య సర్కారు మూడేళ్ల సాధన సభ నేడు మంగళవారం తుమకూరులో జరుగుతుందని హోం మంత్రి జి.పరమేశ్వర తెలిపారు. సభ జరిగే ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాట్లను మంత్రి పరిశీలించి మాట్లాడారు. మూడేళ్లలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేసేందుకు ఈ సాధన సభ జరుపుతున్నట్లు చెప్పారు. తుమకూరు జిల్లా రెవెన్యూ శాఖ సాధనలను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ సందర్భంగా నమోదు చేస్తారని, గిన్నిస్ ప్రతినిధులు ఇంగ్లాండ్ నుంచి వచ్చారని తెలిపారు. తుమకూరు జిల్లాలో రికార్డుస్థాయిలో 1,52,492 మందికి భూ హక్కు పత్రాలను అందించినట్లు తెలిపారు. జిల్లాలో అన్ని తాలూకాల నుంచి సుమారు 3 వేల బస్సులను ఏర్పాటు చేశామన్నారు. భారీగా పోలీసు బందోబస్తును, 15 అంబులెన్స్లను, వైద్య సిబ్బందిని సిద్ధం చేసినట్లు చెప్పారు. -
అల్యూమినియం వైర్ దొంగలు అరెస్ట్
హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరులో విండ్ ఫ్యాన్ విద్యుత్ స్తంభం నుంచి అల్యూమినియం వైర్ దొంగిలించిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ఏప్రిల్ 7, 2026న కొట్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విండ్ ఫ్యాన్ విద్యుత్ స్తంభం నుంచి ఒక అల్యూమినియం తీగ దొంగిలించబడింది. ఈ విషయమై కొట్టూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల కూడ్లిగి ఉజ్జిని రహదారిపై గంగమ్మన హళ్లి క్రాస్ సమీపంలో నిర్వహించిన ఆపరేషన్లో సండూర్ తాలూకాలోని హిరేకెరేయగినహళ్లి గ్రామానికి చెందిన ఏ.మల్లికా రేణాన, జోగజ్జర్ అంజినప్ప, గుడ్లుమార్పూర్ బసవరాజ్, జోగజ్జర్ దురుగప్పను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి నుంచి నేరంలో ఉపయోగించిన రూ.4 లక్షల విలువైన అల్యూమినియం వైర్, రూ.3 లక్షల విలువైన టాటా ఏసీ గూడ్స్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొట్టూరు పోలీస్ స్టేషన్ పీఏఎస్ గీతాంజలి షిండే, సిబ్బంది యు.నాగప్ప హెచ్.బసవరాజ్, శశిధర్, టెక్నికల్ విభాగంలోని బసవకుమార్, శశిధర్, టెక్నికల్ పత్రీకుమార్, విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించినందుకు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ఎస్ జాహ్నవి అభినందించారు. -
కన్నతల్లిని చంపి.. బూడిద చేసి
● అనుమానంతో.. కొడుకు కిరాతకం ● మైసూరు జిల్లాలో ఘోరం మైసూరు: జిల్లాలో అత్యంత అమానుషమైన ఘోరం వెలుగుచూసింది. కని పెంచిన తల్లి అనే ప్రేమ లేకుండా ప్రాణాలు తీశాడో కర్కోటకుడు. తల్లి రుణం తీర్చుకోవడానికి బదులు ఆమె రక్తం కళ్లజూసిన ఘటన మైసూరు తాలూకా మాదహళ్లి గ్రామంలో జరిగింది. శివరుద్రప్ప (30) అనే కుమారుడు తల్లి సుధా (48)ను కిరాతకంగా అంతమొందించాడు. తల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉందని, పదేపదే చెప్పినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని కుమారుడు తరచూ గొడవ పడేవాడు. ఇటీవల ఆమె, ఆ వ్యక్తితో బైక్పై కలిసి వెళ్తుండగా చూసి రగడకు దిగాడు. తలపై బండ వేసి.. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కోపంతో ఆమైపె దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సుధాను బంధువులు ఆస్పత్రిలో చేర్పించేందుకు యత్నిస్తుండగా శివరుద్రప్ప తానే తీసుకెళ్లి, కొంతదూరం వెళ్లాక ఆమె తలపై బండరాయిని ఎత్తివేసి చంపేశాడు. కణియనహుండి సమీపంలోని తోటలో తల్లి శవాన్ని కాల్చివేసి బూడిద చేసి పరారయ్యాడు. అతనికి చిన్నాన్న కుమారులు ఆకాశ్, అభి సహకరించారు. కేసు ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మైసూరులో గంజాయి సీజ్మైసూరు: ముగ్గురు డ్రగ్స్ విక్రేతల నుంచి సుమారు రూ. 5.5 లక్షల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను నగర పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి. 11 కేజీల గంజాయి, కారు పట్టుకున్నారు. మంజ, కుంటె మంజ, బీఆర్ కార్తీక్ అప్పాజీ అనేవారిని అరెస్టు చేశారు. వీరు స్విఫ్ట్ కారులో గంజాయి తరలిస్తున్నారని తెలిసి ఆలనహళ్లి పోలీసులు కాపుకాచి నిర్బంధించారు. నిందితులు గతంలోనూ గంజాయి కేసులో అరెస్టు అయి బెయిల్మీద బయటకు వచ్చారు. ఎరువుల కొరత తప్పదు: మంత్రిశివాజీనగర: రాష్ట్రంలో 38 వేల మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువుల కొరత ఉంది. 14 వేల టన్నుల యూరియా కొరత ఉంది. ఇరాన్ యుద్ధం వల్ల ఎరువులు అందడం లేదు అని వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి తెలిపారు. సోమవారం బెంగళూరు ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. ఎరువుల కొరతపై కేంద్రంతో చర్చిస్తున్నాం, రసాయనిక ఎరువులను తగ్గించి సహజ ఎరువులను రైతులు ఉపయోగించాలి, జూన్లో వ్యవసాయ పనులు మొదలవుతాయి, ఈ ఖరీఫ్ సీజన్కు కేంద్ర ప్రభుత్వం నుంచి 30 లక్షల టన్నుల వివిధ రకాల రసాయన ఎరువులను పంపిణీ అయ్యాయి అని తెలిపారు. తాము కోరినంతగా కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా, డీఏపీ రసాయనిక ఎరువులు అందలేదు, దీంతో ఈ సీజన్లో ఎరువుల కొరత తప్పదని తెలిపారు. మత సమైక్యతపై పాఠాలొద్దు యశవంతపుర: ఓ చిత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణలకు కారణమైంది. ఉడుపిలో జిల్లా మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ వద్దకు ఓ వృద్ధ హిందూ మహిళను ఇద్దరు ముస్లిం మహిళలు తీసుకువచ్చి, ఆమెకు ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి సాయం చేయాలని మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ఈ ఘటన మత సమైక్యతకు చిహ్నమని, బీజేపీ నాయకులు ఇది చూసి నేర్చుకోవాలని మంత్రి పేర్కొన్నారు. కానీ బీజేపీ నేతలు ప్రతిస్పందిస్తూ ఆ వృద్ధురాలు గిరిజా శెట్టిగార్ అయితే, ముస్లిం మహిళ్లలో ఒకరు ఆమె కూతురని, 25 ఏళ్ల క్రితం మతమార్పిడి చేసుకుందని చెప్పారు. మత సౌహార్ధ్రత మీద కాంగ్రెస్ నుంచి పాఠాలు నేర్చుకోవసిన పని లేదని మహిళా మోర్చా నాయకులు మండిపడ్డారు. లంచం కేసు కొట్టివేతకు నోయశవంతపుర: లంచం కేసులో ప్రభుత్వ ఉద్యోగి కాదనే కారణం చూపి విచారణను రద్దు చేయడం సాధ్యం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. అధికారుల తరఫున లంచం తీసుకున్న మధ్యవర్తిపై దాఖలైన కేసు రద్దుకు తిరస్కరించింది. బెంగళూరు బసవేశ్వర నగరకు చెందిన కెఎస్ గంగాధరయ్య అనే వ్యక్తి ఓ అధికారి తీసుకునే కేసులో నిందితునిగా ఉన్నాడు. ఇతడు ట్రాన్స్పోర్టు కంపెనీ నడుపుతున్నాడు. తాను ప్రభుత్వ ఉద్యోగిని కాదని, అవినీతి కేసు వర్తించదని హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న అతని వకీలు వాదనను తిరస్కరించారు. లోకాయుక్త విచారణను పరిశీలిస్తే కేసును కొట్టివేయటం సాధ్యం కాదని తీర్పునిచ్చారు. యూత్ కాంగ్రెస్ భేటీలో రగడ శివాజీనగర: బెంగళూరులోని క్వీన్స్ రోడ్డులో ఉన్న కేపీసీసీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ భేటీ రసాబాసగా జరిగింది. యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు దీపికారెడ్డి మద్దతుదారులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంజునాథ్గౌడ వర్గాలు గొడవపడ్డాయి. మే 21న నీట్ అక్రమాలను ఖండిస్తూ ధర్నాలను జరపడం గురించి ముందస్తు సమావేశం నిర్వహించారు. అయితే నోటీస్ ఇవ్వకుండా 15 మంది పదాధికారులను తొలగించారని కొందరు ప్రస్తావించడంతో గొడవ మొదలైంది. తొలగించినవారిలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దీపికారెడ్డి, ఎనిమిది మంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా తీసేస్తారని ప్రశ్నించడంతో తోపులాట, ఉద్రిక్తత నెలకొంది. మంజునాథగౌడ, సీనియర్ నేత నిగం భండారీని ఘోరావ్ చేశారు. -
రాజధానిలో జడివాన
బనశంకరి: బెంగళూరు నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం మెజస్టిక్, కేఆర్.మార్కెట్, టౌన్హాల్, కార్పోరేషన్, శాంతినగర, వసంతనగర, సదాశివ నగరతో పాటు నగర నడిబొడ్డున జడివానతో రోడ్లు, కూడళ్లు జలమయం అయ్యాయి. సరిగ్గా ఉద్యోగులు ఆఫీసుల ఉంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వాన రావడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో రాత్రి వరకూ ఎడతెరపి లేకుండా వాన పడింది. దక్షిణ, ఈశాన్య ప్రాంతాలైన హెబ్బాళ, యలహంక, గిరినగర, బసవనగుడి, జయనగర, జేపీ.నగర, బనశంకరి, కోణణకుంటె పరిధిలో వర్షం కురిసింది. గాలులకు కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడటంతో సంచారానికి ఇబ్బంది ఏర్పడింది. మరింతగా వర్షసూచన ముంపు ప్రమాదం ఉన్నందున కేఆర్ సర్కిల్ అండర్పాస్ను అధికారులు మూసివేశారు. అటు ఇటు బ్యారికేడ్లను అమర్చి వాహనాలను మళ్లించారు. శివానంద సర్కిల్ అండర్పాస్లో నీరు నిలవడంతో పాత రేస్కోర్సు రోడ్డు నుంచి శేషాద్రిపురం వైపు వెళ్లే ఫ్లై ఓవర్ మీద తీవ్ర రద్దీ ఏర్పడింది. తొలకరి వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ శాస్త్రవేత్త సీఎస్.పాటిల్ తెలిపారు. కరావళి, మలెనాడు, ఒళనాడు జిల్లాల్లో సాదారణం కంటే భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. పలు జిల్లాలకు ఉరుములు, పిడుగులతో కూడిన వర్ష ఉధృతి పెరుగుతుందన్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకూ వర్షం తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు -
రిసార్ట్లో రెండు గుంపుల మధ్య ఘర్షణ
● మహిళా కానిస్టేబుల్ సహా 8 మందికి గాయాలు హొసపేటె: గంగావతి తాలూకాలోని ఒక రిసార్ట్లోని స్విమ్మింగ్ పూల్లో ఆదివారం సాయంత్రం చిన్న విషయంలో జరిగిన ఘర్షణలో మహిళా కానిస్టేబుల్ సహా 8 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో కొప్పళకు చెందిన మహిళా పోలీస్ కానిస్టేబుల్పై దాడి చేసి, ఆమె మెడలోని బంగారం గొలుసు లాక్కున్నారు. వివరాలు.. తాలూకాలోని చిక్క జంతకల్ గ్రామం నుంచి రిసార్ట్కు వచ్చిన మహిళలతో సహా 8 మంది వ్యక్తుల బృందం స్విమ్మింగ్ పూల్లోకి దిగింది. అదే సమయంలో, గంగావతి నుంచి వచ్చిన కొందరు యువకులు నీళ్ల సీసాలు విసిరి గొడవకు దిగారు. ఆ తర్వాత అంజనాద్రి సమీపంలో మాటల యుద్ధం జరిగి వారు గొడవకు దిగారు. ఈ ఘటనలో పోలీస్ కానిస్టేబుల్ను కొట్టారు. ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఇన్చార్జ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సిద్దలింగప్ప గౌడ, రూరల్ పోలీస్ స్టేషన్ సీపీఐ రంగప్ప దొడ్మణి, గంగావతి నగర్ పోలీస్ స్టేషన్ పీఐ ప్రకాష్ యతానూర్ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఘటనపై విచారణ జరిపారు. ఇద్దరు దొంగలు అరెస్ట్ రాయచూరు రూరల్: బెళగావి జిల్లా అణి బస్టాండ్లో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి, రూ.1.26 లక్షల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నట్లు అథణి డీఎస్పీ పి.రాజేంద్ర వెల్లడించారు. సోమవారం సాయంత్రం అథణి బస్టాండ్లో చోరీ చేస్తున్న సమయంలో కోల్హాపూర్కు చెందిన హేమ, నీలం కాంబ్లేను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉచిత వైద్య శిబిరం రాయచూరు రూరల్: నగరంలోని ఆజాద్ నగర్లో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విజి కులకర్ణి ఆస్పత్రి వైద్యుడు డా.అజిత్ కులకర్ణి మాట్లాడుతూ.. ప్రజలు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దాదాపు 200 మందికి బీపీ, షుగర్, మధుమేహం, గుండెపోటు, ఇతర వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. నరేగా కార్మికులకు వైద్య పరీక్షలు రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా హీరాపూర్లో సోమవారం నరేగా (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం) కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎన్ఈసీ అధికారి ధన్రాజ్ సూచించారు. అనంతరం వైద్యులు బీపీ, షుగర్, తదితర వైద్య పరీక్షలు చేశారు. పాఠశాల విలీనంపై ఆగ్రహంబళ్లారి టౌన్: బళ్లారి తాలూకా కొర్లగుంది గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ ప్రాథమిక పాఠశాలను కేపీఎస్ పాఠశాలకు విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో స్థానిక విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల విలీనం వద్దని ప్రధాన ఉపాధ్యాయులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐడీఎస్ఓ నేతలు నాగరత్న తదితరులు మాట్లాడుతూ.. కొర్లగుంది గ్రామంలో 100 మందికి పైగా పేద విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నారన్నారు. ఈ పాఠశాలను కేపీఎస్లో విలీనం చేస్తు పాఠశాలను మూసివేసే దిశగాప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కేపీఎస్ మ్యాగినీట్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ రాష్ట్రంలో పలు పాఠశాలలను మూసి వేసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో స్థానిక నేతలు గాదిలింగ, సోమశేఖర్, ఎస్డీఎం అధ్యక్షుడు వీరేశ, ప్రసన్న, శివప్ప, చంద్రశేఖర్, గోపాల, కుమార్, సోమ, శాంతమ్మ, సుమంగళమ్మ, హేమావతి, శ్యామల, శివమ్మ, మారుతీ ప్రసన్న పాల్గొన్నారు. ఇద్దరికి కుక్క కాటురాయచూరు రూరల్: నగరంలో కుక్కల స్వైర విహారం అధికమైంది. వీధుల్లో గుంపులుగా తిరుగుతూ యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నాయి. సోమవారం నగర పరిధిలోని యరమరాస్, ఎల్బీఎస్ నగర్లో ఇద్దరు పిల్లలపై కుక్కలు దాడి చేశాయి. గమనించిన స్థానికులు పిల్లలను చికిత్స నిమిత్తం సర్కారు ఆస్పత్రిలో చేర్పించారు. ఇదిలా ఉండగా నగరంలో ఎక్కడ పడితే అక్కడ కుక్కలు సంచరిస్తున్నాయి. వీధి కుక్కల తరలింపులో నగర సభ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా స్పందించి కుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు. -
గజరాజుల జలకాలాటలో మహిళ జలసమాధి
యశవంతపుర: గజరాజుల జలకాలాట ఒక కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. ఏనుగులను దగ్గరగా చూడాలని ముచ్చటపడిన ఓ పర్యాటకురాలు అనూహ్యంగా ఏనుగు కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని కొడగు జిల్లాలోని దుబారెలో ఉన్న అటవీశాఖ ఏనుగుల శిబిరంలో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మైసూరు దసరా ఉత్సవాలలో పాల్గొనే ఏనుగులు కావేరీ నదీతీరం వెంట జలకాలాడుతున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు ఎగబడ్డారు. తమిళనాడు నుంచి వచ్చిన 33 ఏళ్ల తులసి అనే మహిళ సైతం తన కుమార్తె, భర్తతో కలిసి నది ఒడ్డున ఏనుగులను చూసేందుకు అత్యంత సమీపంగా వెళ్లారు. అదే సమయంలో కంజన్, మార్తాండ అనే ఏనుగులు స్వల్పంగా ఘర్షణపడ్డాయి. ఈ సమయంలో కోపంతో కంజన్ అనే ఏనుగు మార్తాండ అనే ఏనుగును తోసేసింది. దీంతో అది బురదతో నిండిన ఒడ్డులో పడిపోయింది. ఒరిగిపోతూ అది అక్కడే ఉన్న తులసి మీద పడింది. దీంతో ఆమె బురదలో కూరుకుపోయింది. ఇది చూసిన మావటి కంజన్ను దూరంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఫలితంలేకుండా పోయింది. అది కిందపడిపోయిన ఏనుగును పదేపదే నెట్టడంతో అది లేవలేక అలాగే బురదలో ఉండిపోయింది. దీంతో ఏనుగు బరువుకు దాని కింద ఇరుక్కుని మహిళ మట్టిలో కూరుకుపోయి ప్రాణాలుకోల్పోయారు. ఎట్టకేలకు దాడిచేసిన ఏనుగును మావటి దూరంగా తీసుకెళ్లాక కిందపడిన ఏనుగు పైకి లేచింది. వెంటనే తోటి పర్యాటకులు తులసిని సమీప ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు ధ్రువీకరించారు. ఏనుగుల ఘర్షణ, తులసి పడిపోవడం, ఆమెపై ఏనుగు పడటం అన్నీ సమీపంలోని పర్యాటకుల స్మార్ట్ఫోన్లలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో మహిళ భర్త, కూతురు అక్కడే ఉన్నా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. భార్యను ఎలాగైనా ఏనుగు కింద నుంచి లాగేందుకు భర్త ఎంతగానో శ్రమించడం వీడియోలో రికార్డయింది. అప్పటిదాకా ఏనుగుల ఘీంకారాలు, పర్యాటకులతో ఆనందంతో సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. భయంతో జనమంతా దూరంగా పారిపోయారు. ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. వన్యప్రాణులకు ముఖ్యంగా ఏనుగులను కనీసం 100 అడుగుల దూరం నుంచే పర్యాటకులు చూడాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె సూచించారు. ఏనుగును తాకడం, దగ్గరగా ఉండి ఫొటోలను తీసుకోవడం చేయరాదని హెచ్చరించారు. పర్యాటకులు అరటిపండ్లు, బెల్లం, చెరకు గడలు వంటివి ఏనుగులకు చేతితో అందించడంపై నిషేధం విధిస్తామని తెలిపారు. వన్యప్రాణులుండే పర్యాటక ప్రదేశాల్లో అమలుచేయాల్సిన ప్రామాణిక కార్యాచరణ ప్రణాళిక(ఎస్ఓపీ)ని అధికారులు తప్పకుండా అమలుచేయాలని ఫారెస్ట్, వైల్డ్లైఫ్ వార్డెన్ల ప్రధాన కార్యదర్శికి మంత్రి ఆదేశాలు జారీచేశారు. I have always been stunned by, and have marvelled at, the raw brute force of nature manifested in elephants.[in this tragedy, a life was lost]https://t.co/OfHTUtgkwn— Sandeep Manudhane (@sandeep_PT) May 18, 2026 -
చిక్క బస్టాండులో మొబైల్ దొంగలు
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురంలోని కేఎస్ ఆర్టీసీ బస్టాండు ఏపీ– కర్ణాటక రాష్ట్రాల మధ్య వారధిలా ఉంటూ నిరంతరం కిటకిటలాడుతూ ఉంటుంది. దీనినే దొంగలు అనువుగా మార్చుకున్నారు. విలువైన మొబైల్ పోన్లు, బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. పేరేసంద్రకు చెందిన కేశవ అనే ప్రయాణికుడు బెంగళూరుకు వెళ్లడానికి బస్సు ఎక్కాడు, బస్సు జనంతో కిటకిటలాడుతోంది. జేబులో ఉన్న ఫోన్ పోతుందేమో అనే భయంతో తీసుకుని, పక్కనున్న వ్యక్తికి పట్టుకోమని ఇచ్చాడు. క్షణాల్లోనే ఆ అపరిచితుడు మాయం కావడంతో బాధితుడు కంగుతిన్నాడు. అలాగే.. చిక్కవాసి అభిలాష్ గౌరిబిదనూరుకు వెళ్లడానికి బస్సు ఎక్కాడు, ముదుగానకుంటె గ్రామంలోని గంగమ్మ ఆలయానికి వెళ్లే భక్తులు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ రద్దీలో అభిలాష్ ఐఫోన్ను దొంగలు కొట్టేశారు. కొంతసేపటికి గమనించి, ఆర్టీసీ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలను పరిశీలించి ఓ దొంగను పట్టుకొన్నారు, మరొకరు పరారయ్యాడు. వీరు ఇతర రాష్ట్రాలకు చెందినవారు, అందులోనూ బాలలని తేలింది. మైనర్లను ఉపయోగించి మొబైల్ దొంగల ముఠాలు ఈ దందాను నడిపిస్తున్నట్లు అనుమానాలున్నాయి. మరికొందరి మొబైళ్లు కూడా చిక్క బస్టాండులోనే చోరీ అయ్యాయి. ప్రయాణికులకు భయం భయం -
పెట్రోలు, డీజిల్ ధరల పెంపు దుర్మార్గం
సాక్షి, బళ్లారి: కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఎస్యూసీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎస్యూసీఐ ఆధ్వర్యంలో కురుగోడు పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. ఉన్నఫళంగా పెట్రోలు,డీజల్ ధరలను పెంచడం దుర్మార్గమని మండిపడ్డారు. రష్యా నుంచి రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేసే అవకాశాన్ని అమెరికా ఒత్తిడికి లోబడి వదులుకున్న విషయం అందరికి తెలిసిందే అని విమర్శించారు. అదే విధంగా పెట్రోలు, డీజిల్ ధరల్లో సగానికి పైగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే ఉన్నాయని తెలిపారు. చమురు కంపెనీల లాభాల కోసం దేశంలోనే శుద్ధి చేసి తయారు చేసే పెట్రోలు, డీజిల్కు అంతర్జాతీయ ధరలను నిర్ణయించే విధానాన్ని రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్యూసీఐ కమ్యూనిష్టు పార్టీ నాయకులు గురళ్లి రాజ్,కమిటి సభ్యులు మణికంఠ,అంబరీష్,తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రీడం పార్క్లో యోగా శిబిరం
హొసపేటె: రోజూ ధాన్యం, యోగా చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని పతంజలి యోగా సమితి గదగ్, విజయనగర్ జిల్లా ఇన్చార్జ్ డాక్టర్.ఎస్బి.హండ్రాల్ తెలిపారు. ఆదివారం ఉదయం ఫ్రీడం పార్క్లో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. కపాలభాతి, అపాన ముద్ర, సూర్య ముద్ర అనే మూడు ముద్రలతో సాధన చేయడం మన జీర్ణాశయ సమస్యలకు కూడా ఒక దివ్యౌషధంలా పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో పతంజలి యోగా సమితి జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ ఎఫ్టి.హళ్లికేరి, బళ్లారి జిల్లా ఇన్చార్జి రాజేష్ కర్వ, సత్యప్ప, విఠోబా బళ్లూరు. ద్రాక్షాయిణి శివకుమార్, కవితా ఆనంద్, శ్రీధర్, ప్రకాష్ కులకర్ణి, శివమూర్తి, శ్రీధర్, ప్రకాష్ కులకర్ణి, శివమూర్తి, శ్రీధర్ వెంకటేష్ వాసి, అశోక చిత్ర, శ్రీరామ్, చంద్రిక, శైలజ కలకప్ప, రామచంద్ర పాల్గొన్నారు. -
కిక్కులో.. కుటుంబాలు తుక్కు
సాక్షి, బెంగళూరు: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని సీసాసై రాసి ఉంటుంది. కానీ అనేక రకాలుగా కూడా అది అపాయకారే. ముఖ్యంగా మద్యం మహమ్మారి పచ్చని సంపారాలను కూల్చేస్తోంది. కైపులో తన మన తేడా లేకుండా దౌర్జన్యాలకు పాల్పడుతూ అశాంతిని రేకెత్తిస్తున్నారు. మద్యం వల్ల కుటుంబాల్లో దాడులు జరుగుతున్న కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. కట్టుకున్న భార్య, తల్లిదండ్రులు, తోబుట్టువులు అనే తేడా లేకుండా మందుబాబులు విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో అబ్కారీ శాఖ గణాంకాల ప్రకారం 11 శాతం మంది మద్యపాన వ్యసనులుగా ఉన్నట్లు తెలిసింది. ఇందులో 71 శాతం మంది భార్యలపై దాడులకు పాల్పడుతున్నట్లు కూడా గణాంకాలు చెబుతున్నాయి. బెంగళూరు నిమ్హాన్స్ సంస్థ కూడా గతంలో అధ్యయనంలో తెలిపింది. అన్నింటికీ చుక్కే కారణం మద్యపానం వల్ల సామాజికంగా ఏర్పడుతున్న పరిణామాలపై అవగాహన కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేసి ఒక నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఇందులోని చేదు నిజాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మద్యం తాగి వెళ్లి భార్యలపై దాడులకు ఒడిగడుతున్నట్లు తెలిసింది. దేశంలో అత్యధికంగా మద్యం అమ్ముడయ్యే రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఆర్థిక వనరుగా ఈ మద్యం విక్రయాలు మారినప్పటికీ సామాజికంగా సమస్యగా తయారైంది. కుటుంబాల్లో శారీరక హింస, గొడవలు, ఆర్థిక ఇబ్బందులకు మద్యమే ప్రధాన కారణమని నివేదికలో పేర్కొన్నారు.మైనర్లకూ అలవాటు రాష్ట్రంలో 15 ఏళ్లు, అంతకుమించి వయసు కలిగిన వారిలో మద్యం సేవించే వారు 8.62 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో తలసరి మద్య సేవనం ఏటా 9.1 లీటర్లుగా ఉంది. అలాగే 15–49 ఏళ్ల మధ్య వయసున్న పురుషుల్లో సుమారు 16.5 శాతం మంది మద్యాన్ని సేవిస్తుండగా, 0.9 శాతం మంది మహిళలు సైతం అలవాటు చేసుకున్నారు. మద్యపానం వల్ల సంసారాల్లో తీవ్ర గొడవలు అబ్కారీ శాఖ సర్వేలో చేదు నిజాలు రాష్ట్రంలో 11 శాతం మంది మద్యానికి బానిసలు -
రిజర్వేషన్ల కోత వెనుక కాంగ్రెస్ సర్కార్ కుట్ర
సాక్షి, బళ్లారి: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల తగ్గింపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ జాబితాలోకి కొన్ని కులాలను చేర్చడంతో జనాభా పెరిగినా దానికి అనుగుణంగా లభించాల్సిన రిజర్వేషన్లు పెంచలేదని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి, సఫాయి కర్మచారి మాజీ అధ్యక్షుడు హనుమంతప్ప ధ్వజమెత్తారు. ఆదివారం వారు నగరంలోని మోకా రోడ్డులోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి, అలాగే ఎస్టీ రిజర్వేషన్లను 3 నుంచి 7 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. 2022 నుంచి 2025 వరకు వేలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పెంచిన రిజర్వేషన్లతో ఇంజనీరింగ్, మెడికల్ ప్రైవేశాలల్లో లబ్ధి పొందారని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు ఎస్సీ, ఎస్టీ నిధులను కూడా గ్యారెంటీ పథకాలకు మళ్లించి అన్యాయం చేస్తోందన్నారు. ఇప్పటికైనా స్పందించి ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్, బీజేపీ నాయకులు దరప్ప నాయక్, అడవి స్వామి తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలకు ఈత.. గుండెకోత
మాలూరు: పిల్లలకు ఈత నేర్పాలనే ఓ తండ్రి తపన విధి విలాసం ముందు ఓడిపోయింది. పిల్లలు, తండ్రీ నీట మునిగి మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదారక సంఘటన కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని నక్కనళ్లి గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కూలీ కార్మికుడు శ్రీనివాస్ (40), కుమారులు చేతన్ (13), రాజేష్ (8)ను తీసుకుని ఈత నేర్పించడం కోసం ఓ రైతుకు చెందిన పొలంలోని నీటి కుంటకు వెళ్లాడు. పిల్లలు పట్టుతప్పి నీటిలో మునిగిపోతుండగా, వారిని కాపాడేందుకు వెళ్లిన శ్రీనివాస్ కూడా నీటిలో మునిగిపోయాడు. దగ్గర్లో ఎవరూ లేకపోవడంతో కాపాడేవారు కరువయ్యారు. ఎంతసేపటికీ ఇంటికి రాలేదని అతని భార్య, స్థానికులతో కలిసి గాలించగా నీటికుంటలో శవాలై కనిపించడంతో ఆమె కన్నీరుమున్నీరైంది. మాస్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేశారు. కేసు నమోదు చేసుకున్నారు.తండ్రి శ్రీనివాస్ పిల్లలు చేతన్ మృత్యు కొలను మింగేసింది తండ్రీ, ఇద్దరు పిల్లల మృతి -
డెంగ్యూ, మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
హొసపేటె: డెంగ్యూ, మలేరియా, కలరా తదితర ప్రాణాంతక వ్యాధుల నుంచి జిల్లాను వంద శాతం విముక్తి చేసేందుకు అధికారులు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కవితా ఎస్ మన్నికేరి ఆదేశించారు. నగర జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారి కార్యాలయంలో నిర్వహించిన అంతర్ శాఖ సమస్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక యంత్రాంగం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని తెలిపారు. పైప్లైన్ మరమ్మతులు లేదా ఇతర కారణాల వల్ల కలుషిత నీటి సరఫరా కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటే, సంబంధిత అధికారులను నేరుగా బాధ్యులుగా చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలు, కళాశాలల్లో రోజూ ఉదయం ప్రార్థనల తర్వాత ఈ వ్యాధుల దుష్ప్రభావాలను వివరించాలని పేర్కొన్నారు. అంటువ్యాధుల నియంత్రణలో శాఖల ప్రాతతో పాటు ప్రజల సహకారం కూడా అవసరం అని తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. నీటిని మరిగించి, వడకట్టి తాగాలని సూచించారు. ఏదైనా ఆరోగ్య సమస్య కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శంకర్ నాయక్, వైద్యులు జంబయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సాలీడు గూడు
డిపాజిట్ల స్కాంలో సీఐడీ దర్యాప్తు బనశంకరి: బెళగావిలో అక్యూమెన్ పేరిట రూ.4,500 కోట్ల డిపాజిట్ల వంచన కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బెళగావి పోలీసులు కేసు నివేదికను సీఐడీ పోలీసులకు అప్పగించారు. సీఐడీ డీఐజీ భీమాశంకర్ గుళేద్ నేతృత్వంలో బెళగావి పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సేతో భేటీ అయ్యారు. జప్తుచేసిన రికార్డులు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 35 వేలమంది నుంచి శివానంద నీలణ్ణవర్ పెట్టుబడుల పేరిట భారీ మొత్తాల్లో డిపాజిట్లను సేకరించాడు. వారికి నెలకు రూ.75 కోట్లకు పైగా వడ్డీ జమ చేస్తున్నట్లు తెలిసింది. కొన్నినెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. ఇతని వ్యాపారాలకు ఆర్బీఐ అనుమతులు ఏవీ లేవు. ఇతను వాడే నాలుగు బ్యాంకు అకౌంట్లను సీజ్ చేశారు. ఒక్కో అకౌంట్లో వందలాది కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. -
బెంగళూరు టు ముంబై ఎక్స్ప్రెస్ రైలు షురూ
బనశంకరి: బెంగళూరు–ముంబై మధ్య నూతన ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఆదివారం బెంగళూరు బైయప్పనహళ్లి విశ్వేశ్వరయ్య రైల్వేస్టేషన్లో కేంద్ర రైల్వే సహాయ మంత్రి వీ.సోమణ్ణ, ఎంపీలు పీసీ.మోహన్, తేజస్విసూర్య ప్రారంభించారు. బెంగళూరు–ముంబై మధ్య ఈ స్టేషన్ నుంచి వారానికి రెండు సార్లు సంచరిస్తుంది. శనివారం, మంగళవారం బెంగళూరు నుంచి ముంబైకి వెళ్తుంది, ఆదివారం, బుధవారం ముంబై నుంచి బెంగళూరుకు వస్తుంది. హుబ్లీ, ధార్వాడ, బెళగావి, పూణె మీదుగా ప్రయాణిస్తుంది. ఇందులో 17 బోగీలు ఉండగా, ఒక ఏసీ 2 టైర్ , 4 ఏసీ–టైర్, 6 స్లీపర్, 4 జనరల్ బోగీలుంటాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి, ఎంపీలు ఎంజీ రోడ్డు మెట్రో స్టేషన్ నుంచి స్వామి వివేకానంద మెట్రోస్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ముంబైకి హైస్పీడ్ కారిడార్ కావాలి దావణగెరె, హుబ్లీ మీదుగా బెంగళూరు– ముంబై మధ్య హై స్పీడ్ రైలు కారిడార్ను మంజూరు చేయాలని ఎంపీ తేజస్విసూర్య కేంద్ర సర్కారును డిమాండ్ చేశారు. ఇది ఆర్థిక వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ రెండు నగరాల మధ్య ఏటా లక్షలాది మంది ప్రయాణిస్తారని, మధ్యలో దావణగెరె, హుబ్లీలను అనుసంధానంంతో ఉత్తర కర్ణాటక ఆర్థిక ప్రగతికి ప్రోత్సాహం అందించినట్లు అవుతుందన్నారు. వారంలో రెండు సర్వీసులు -
విద్యా రంగంలో ముందుండాలి
రాయచూరు రూరల్: నగరంలో మైనార్టీలు విద్యా రంగంలో ముందుండాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ పేర్కొన్నారు. నగరంలోని ప్రిన్స్ ఫాతిమా కళాశాలలో రూ.50 లక్షలతో నూతన తరగతి గదుల నిర్మాణాలకు ఆదివారం ఆయన భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రిన్స్ ఫాతిమా జీవిత చరిత్ర అందరూ తెలుసుకోవాలన్నారు. మానవతా ధర్మం ఆధారంగా ఆమె చేసిన సేవలు అనన్యమన్నారు. కార్యక్రమంలో శాలం, రుద్రప్ప అంగడి, దరూరు బసవరాజ్, శాంతప్ప, జయణ్ణ, నాసిర్ అహ్మద్, శంశుద్దీన్, నరిసింహులు, ఫిరోజ్, అమరే గౌడ, రమేష్, తిమ్మప్ప, యూనస్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. పది, ఇంటర్ విద్యార్థులకు సన్మానం రాయచూరు రూరల్: సమాజంలో విద్యార్థులు మానవీయ మౌల్యాలను పెంచుకోవాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ పేర్కొన్నారు. ఆదివారం వీరశైవ కళ్యాణ మంటపంలో గాణిగ సమాజం ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరంలో ఉత్తమ శ్రేణిలో పాసైన పది, ఇంటర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పచ్చని నగరం, ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సోమవారిపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య, గాణిగ సమాజం అధ్యక్షుడు చెన్నప్ప సజ్జన్, సిద్రామప్ప, శకుంతల, లక్ష్మీబాయి, బసప్ప గోరేబాళ్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసం రాయచూరు రూరల్: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ క్రీడా మైదానంలో పాత్రికేయుల సంఘం, పోలీస్ అధికారుల సంఘం మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించారు. క్రీడల్లో గెలుపు, ఓటమిని అందరూ సమానంగా స్వీకరించాలని సూచించారు. పోలీస్ జట్టుపై పాత్రికేయుల జట్టు విజయం సాధింరచింది. కార్యక్రమంలో పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు గురునాథ్, కార్యదర్శి సిద్ధయ్య, విజయ్ జాగటకల్, అదనపు ఎస్పీలు కుమార స్వామి, హరీష్, డీఎస్పీ శాంతవీర, తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ‘గురువందన’హొసపేటె: హొసపేటె తాలూకా, కమలాపురలో ఆదివారం గురువందన, మహాస్నేహ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కమలాపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తోప్పల్ చన్నప్ప పాఠశాల, సిద్దేశ్వర్ పాఠశాల, హంపీ ప్రాథమిక పాఠశాలలకు చెందిన పూర్వ విద్యార్థులు తరలివచ్చారు. గురు బ్రహ్మ, గురువిష్ణు, గురు మహేశ్వర్ అని గంట మోగిస్తూ 9 మంది గురువులను వేదికపైకి తీసుకొచ్చి సన్మానించారు. బాల్యంలో జరిగిన సంఘటలు, మధుర జ్ఞాపకాలను పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. విచారణ జరపాలిరాయచూరు రూరల్: రాయచూరు జిల్లా కేంద్ర సహకార (ఆర్డీసీసీ)లో గతంలో జరిగిన నియామకాల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. వాటిపై విచారణ జరపాలని దళిత సంఘర్ష సమితి సంచాలకుడు రవీంద్ర నాథ్ పట్టి డిమాండ్ చేశారు. ఆదివారం పాత్రికేయుల భనవంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో చేపట్టిన నియామకాలను రద్దు చేసి మళ్లీ పోస్టులు భర్తీ చేయాలని సూచించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సర్కార్ ముందుకు రావాలన్నారు. బ్యాంక్ నియామకాలకు కోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలు రావడం జరిగిందన్నారు. -
ఓ తండ్రి కిరాతకం.. కూతురి పరువు హత్య
తుమకూరు: పరువు హత్యలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర సర్కారు ఏకంగా చట్టాన్ని తెచ్చినా దుండగులు వెనకడుగు వేయడం లేదు. కుమార్తెను కంటికి రెప్పలా చూసుకుంటూ ఆమె భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కన్నతండ్రే కాలయముడై ప్రాణాలు బలిగొన్నాడు. ఈ ఘటన తుమకూరు శిర తాలూకా నింబెమరదహళ్లిలో జరిగింది. మేఘన (17) అనే అమ్మాయిని ఆమె తండ్రి తిమ్మరాయప్ప (48) దారుణంగా హత్య చేశాడు. తనకు ఇష్టం లేకుండా భార్య తరఫు బంధువుతో పెళ్లికి కూతురు సిద్ధమైందని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి ఒప్పుకుందని గొడవ వివరాలు.. తిమ్మరాయప్ప, నిర్మల దంపతులు కూలీ పనులు చేస్తుంటారు. వీరి కూతురు మేఘన. తల్లి మేఘనకు తమ బంధువుల అబ్బాయితో పెళ్లి కుదిర్చింది. వరుని కుటుంబ సభ్యులు పెళ్లి కోసం చీరలు, తాళి తదితర వస్తువులు కొనుగోలు చేశారు. ఈ పెళ్లి తండ్రికి ఇష్టం లేదు, దీంతో తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉండేవి. కూతురును చంపేయాలని నిర్ణయించుకున్నాడు. గత నెల రోజులుగా మేఘన కనిపించడం లేదు. దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతురి కోసం ఘరానా తండ్రి విలపిస్తూ రక్తి కట్టించాడు. బావిలోకి తోసి.. రాయి వేసి.. తిమ్మరాయప్ప మీద అనుమానం బలపడిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా నోరు విప్పాడు. ఏప్రిల్ 16న కుమార్తెను తానే చంపినట్లు కిరాతకుడు అంగీకరించాడు. నిర్మల కూలీ పనులకు వెళ్లగా, ఇంట్లో ఒక్కతే ఉన్న కూతురికి మాయమాటలు చెప్పి ఊరిబటయ బావి వద్దకు తీసుకెళ్లాడు. ఆమెను బావిలోకి తోశాడు. మళ్లీ బయటకు వస్తుందేమోనని బండరాయి తీసి ఆమె మీదకు వేశాడు. ఇలా హత్య చేశాక, మృతదేహాన్ని బయటకు తీసి దగ్గర్లో పాతిపెట్టినట్లు చెప్పాడు. ఆ రోజు సాయంత్రం తల్లి ఇంటికి వచ్చాక కూతురు కనబడలేదు. ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో పోలీసు స్టేషన్కు వెళ్లి కనబడడం లేదని ఫిర్యాదు చేసింది. తిమ్మరాయప్ప కూడా ఠాణాకు వచ్చాడు. కిరాతకున్ని అరెస్టు చేశారు. ఇష్టం లేని పెళ్లికి సిద్ధమైందని దారుణం తుమకూరు జిల్లాలో ఘటన నెల రోజుల తరువాత నేరం గుట్టురట్టు -
మూతపడిన ఇందిరా క్యాంటీన్లు
సాక్షి, బళ్లారి: పట్టణ పేదలు, శ్రామికులకు సరసమైన ధరలకు రాయితీపై పౌష్టికాహారాన్ని (టిఫిన్, భోజనం) ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఇందిరా క్యాంటీన్లు బళ్లారి నగరంలో మూతపడిపోతున్నాయి. వినియోగదారుడు కేవలం రూ.5 అల్పాహారానికి, రూ.10 భోజనానికి చెల్లిస్తే.. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, తాలూకా కేంద్రాలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇవి పని చేస్తున్నాయి. పేదలు, కూలీలు, కార్మికులు ఆకలి తీర్చేందుకు ప్రారంభించిన ఇందిరా క్యాంటీన్ల నిర్వహణ ప్రస్తుతం అధ్వానంగా తయారైంది. బళ్లారి నగరం మోతీ సర్కిల్ సమీపంలోని బుడా ఆవరణ, ఏపీఎంసీ కూరగాయల మార్కెట్, బాపూజీ నగర్, బెళగల్ క్రాస్, టీబీ శ్యానిటోరియం, జిల్లా ఆస్పత్రి తదితర జన సంచారం ఎక్కువగా ఉన్న ఏడు ప్రాంతాల్లో ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ప్రారంభంలో ఇందిరా క్యాంటీన్లు బాగా పని చేసినా.. కాలక్రమేణ నిర్వహణను గాలికొదిలేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ క్యాంటీన్లను పునరుద్ధరించాలని, పేదలకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. బడ్జెట్లో నిధులు కేటాయించి, అవసరమైన ప్రాంతాల్లో కొత్త క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. అయితే నిధులు విడుదల చేయకపోవడంతో మూడపడిపోతున్నాయి. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు అప్పులు చేసి క్యాంటీన్లు నడిపారు. అయితే బకాయిలు పేరుకుపోవడంతో చేతులెత్తేశారు. ఒక్క బళ్లారి నగరంలోనే 7 ఇందిరా క్యాంటీన్లు ఉండగా.. 8 నెలలకు సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉంది. నెలకు ఒక్కో ఇందిరా క్యాంటీన్కు సుమారు రూ.20 లక్షల వ్యయం అవుతుంది. ఆ లెక్కన బళ్లారిలో 7 ఇందిరా క్యాంటీన్లు ఉండగా 8 నెలలకు సంబంధించి రూ.కోటిన్నర వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉంది. అక్కడ పని చేసిన సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లించ లేదు. అప్పులు చేసిన క్యాంటీన్లు నడిపిన కాంట్రాక్టర్లు బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు బళ్లారిలో ఏడు బంద్ అధికారులు, పాలకుల అలసత్వంతో 8 నెలలుగా ఇదే పరిస్థితి పేదలపై తీరని భారం అధ్వానంగా మారిన నిర్వాహణ బకాయిల గుదిబండబళ్లారి నగరంలో రోజూ సుమారు 500 నుంచి 1000 మంది వరకూ ఇందిరా క్యాంటీన్లను ఆశ్రయించే వారు. సరసమైన ధరలకు టిఫిన్, భోజనం అందడంతో క్యాంటీన్లకు పరుగులు పెట్టేవారు. ప్రస్తుతం బళ్లారిలో మొత్తం 7 ఇందిరా క్యాంటీన్లు మూతపడి పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. క్యాంటీన్లు తెరవాలని నిర్వాహకులను అడిగితే నిధుల కొరత కారణంగా మూసేస్తున్నట్లు చెబుతున్నారు. బయట హోటళ్లలో ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఇందిరా క్యాంటీన్లు మూతపడటం పేదలకు శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓ వైపు పశ్చిమాసియాలో యుద్దం కారణంగా ఇప్పటికే గ్యాస్ ధరలు పెంచడంతో పాటు, పలు హోటళ్లు మూతపడగా.. ధరలు కూడా పెంచారు. హోటల్లో టిఫిన్ చేయాలంటే కనీసం రూ.50కి పైగా చెల్లించాల్సిందే. ఇక భోజనం అంటే కనీసం రూ.100లు వరకు ఉంటుంది. క్యాంటీన్ల సమస్యలపై స్థానిక పాలకులు, అధికారలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు గ్యారెంటీలు అమలు చేయడానికి పలు పథకాలకు కోతలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇకనైనా సంబంధిత అధికారులు, పాలకులు మూతపడిన ఇందిరా క్యాంటీన్లు తెరిపించి పేదలకు భోజనం అందేలా చూడాల్సిన అవసరం ఉంది. -
‘మద్యం తాగొద్దన్నందుకు అన్ననే హతమార్చాడు’
రాయచూరు రూరల్: మద్యం తాగొద్దని బుద్ధి మాటలు చెప్పిన అన్నను.. తమ్ముడు హతమార్చాడు. ఈ ఘటన శనివారం రాత్రి రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. లింగసూగురులోని బసవ సాగర్ క్రాస్ వద్ద అన్నాతమ్ముళ్లు బసవరాజ్ వాసుదేవ్, శ్రీధర్ నివసిస్తున్నారు. శ్రీధర్ రాత్రి వేళల్లో మద్యం సేవించి వచ్చేవాడు. ఇంట్లో తల్లిని ఇష్టం వచ్చినట్లు తిడుతూ వేధించసాగాడు. మద్యం తాగడం మంచిది కాదు.. మద్యం మానేయాలని శ్రీధర్కు అన్న బసవరాజ్ వాసుదేవ్ సూచించాడు. అప్పటి నుంచి కోపం పెంచుకున్న శ్రీధర్.. శనివారం రాత్రి బసవరాజ్ వాసుదేవ్ నిద్రించినప్పుడు గొంతు నులిమి హత్య చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు శ్రీధర్ను అదపులోకి తీసుకున్నట్లు ఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హుసికేరప్ప వివరించారు. -
గుర్తు తెలియని వాహనం ఢీ: ముగ్గురు మృతి
హుబ్లీ: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైక్లో వెళుతున్న ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన సవదత్తి తాలూకా హులికట్టి గ్రామం వద్ద చోటు చేసుకుంది. నరగుంద దండాపుర వీధి నివాసులైన ప్రశాంత (25), నింగప్ప (28), లోకేష్ (28) మృతులు. మునవళ్లి నరగుంద రోడ్డు హెక్కేరి కరియమ్మ దర్శనం చేసుకుని తిరిగి నరగుందకు ముగ్గురు ఒకే బైక్లో బయలుదేరారు. నరగుంద నుంచి మునవళ్లి వైపు వస్తున్న భారీ వాహనం హులికట్టి వద్ద బైక్ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రశాంత, నింగప్ప స్థలంలోనే మృతి చెందారు. లోకేష్ ఆస్పత్రిలో చికిత్స ఫలించక మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై సవదత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీ అయిన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ‘జై శ్రీరామ్ అని చెప్పండి’ హుబ్లీ: ‘జూన్లో పాఠశాలలు ప్రారంభం అయ్యాక ప్రతి ఒక్కరికీ కేసరి శాలువాలు పంపిణీ చేస్తాను. ఇక ముందు పాఠశాలలో హాజరు పలికే వేళ ఎస్ సార్ అనే దానికి బదులుగా జై శ్రీరామ్ అని చెప్పాలి. ఉపాధ్యాయులకు నమస్కరించేటప్పుడు జై శ్రీరామ్ అని చెప్పండి’ అని ఎమ్మెల్యే బసవన గౌడ పాటిల్ యత్నాళ్ సూచించారు. ఆదివారం విజయపూర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యా సంస్థల్లో పునర్ హిజాబ్ ధరించడానికి అవకాశం కల్పించడంపై మండిపడ్డారు. కేసరి శాలువా ధరించడంపై నిషేధం విధించేందుకు కాంగ్రెస్కు అధికారం ఇచ్చింది ఎవరు? కేసరి శాలువా ధరించే హక్కు మాకు ఉందని తెలిపారు. హిందూ పోషకులందరూ తమ పిల్లలకు తిలకం దీద్ది కేసరి శాలువా కప్పి స్కూల్కు పంపాలని సూచించారు. బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్రాయచూరు రూరల్: సమాజంలో బడుగు, దళిత వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని అంజుమన్ సంస్థ అధ్యక్షుడు అన్సరుద్దీన్ అభిప్రాయపడ్డారు. శనివారం రాత్రి లింగసూగురులో అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ బాటలో అందరూ పయనించాలని సూచించారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలన్నారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన పది, ఇంటర్ విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో హుసేన్ పాషా, రహీం, రసూల్, అస్లాం, అరిఫ్, యాసిన్, మజీబాబు, రాజ్ మహ్మద్ పాల్గొన్నారు. రాయచూరు వాసి మృతి చిలమత్తూరు: మండల పరిధిలోని 44 వ నంబర్ జాతీయ రహదారి కొడికొండ చెక్పోస్ట్ గంగోత్రి డాబా వద్ద 7 హిల్స్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొని మైసూరుకు చెందిన ప్రకాష్ (60) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాయచూరు నుంచి ప్రకాష్ బెంగళూరుకు బయలుదేరాడు. టీ తాగేందుకు బస్సు గంగోత్రి డాబా వద్ద ఆపారు. ప్రకాష్ రోడ్డు అవతలి వైపు మూత్ర విసర్జన కోసం వెళ్లే క్రమంలో బెంగళూరు నుంచి హైదరాబాదు వెళుతున్న బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు బస్సును సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఆవుల పంపిణీ శ్రీనివాసపురం: శ్యాగత్తూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో రోటరీ సంస్థ నుంచి 150 ఆవులను మహిళలకు ఉచితంగా అందించారు. రోటరీ జిల్లా గవర్నర్ శ్రీధర్, ఎస్.వి సుధాకర్, కె.మంజునాథ్ రెడ్డి, రవీంద్రనాథ్, అశ్విని మస్తి పాల్గొన్నారు. -
వల వేసి.. బెదిరించి వసూళ్లు
దొడ్డబళ్లాపురం: వేధింపులు, అత్యాచారం కేసులు పెడతానని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న కిలాడీ లేడీని బెళగావి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. బెళగావిలోని లక్ష్మినగర్లో నివసిస్తున్న రేష్మ శంకర్ ముతగా.. అధికారులు, ప్రముఖులు, పోలీసులను వలలో వేసుకుని దండుకునేదని తెలిపారు. మ్యాట్రిమోనిలలో అందమైన అమ్మాయిల ఫోటోలు అప్లోడ్ చేసి వల వేసేది. సంప్రదిస్తే.. ఫలానా చోటుకు రావాలని పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డారంటూ బెదిరిస్తానని భయపెట్టి డబ్బులు వసూలు చేసేది. ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రేష్మని అరెస్టు చేశారు. విచారణలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. 2012లో పక్కింటి వ్యక్తి పెళ్లి పేరిట మోసం చేశాడని కుడచి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2022లో ఘటప్రభలో నాగరాజు అనే కానిస్టేబుల్పై, 2023లో గజేంద్రఘడలో ఆకాశ్ అనే వ్యక్తిపై అత్యాచారం కేసు పెట్టింది. 2025లో సురేశ్ అనే వ్యక్తిపై, ధార్వాడలో ఓ సీఐ మీద రేప్ కేసు పెట్టింది. ఇంకా పలువురిపై ఇలాంటి నకిలీ ఫిర్యాదులు చేసిందని బెళగావి జిల్లా ఎస్పీ కే.రామరాజన్ తెలిపారు.రేష్మ శంకర్ బెళగావిలో కిలేడీ అరెస్టు -
శ్రీరాజరాజేశ్వరీ నమోస్తుతే
కోలారు: తాలూకాలోని వక్కలేరి గ్రామంలో ఆదివారం శ్రీరాజ రాజేశ్వరి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం చండికా హోమం, సర్పదోష నివారణ, అశ్లేష పూజ, అమ్మవారికి విశేష అలంకారం తదితరాలను నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహించారు. వేలమంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు. ఎయిర్పోర్టులో రూ.7 కోట్ల గంజాయి సీజ్ దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లగేజ్ బ్యాగుల్లో రహస్యంగా దాచి ఉంచిన 20 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.7.12 కోట్లుగా తెలిపారు. వారిని అరెస్టు చేశారు. బాలికపై అత్యాచారం, హత్య? ● కోలారు జిల్లాలో ఘటన కోలారు: కనిపించకుండా పోయిన బాలిక నీటికుంటలో శవంగా తేలింది. ఈ ఘటన తాలూకాలోని హరటి గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బాలిక (15) 3 రోజుల క్రితం అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు కోలారు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పొరుగింటి ఆనంద్ అనే యువకునిపై అనుమానం వ్యక్తం చేశారు, బాలిక అత్తమామల ఇంట్లో ఉండి 9వ తరగతి చదువుకుంటోంది. ఇప్పుడు పదో తరగతికి వెళ్లాల్సి ఉంది. శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని ఓ పొలంలో ఫారంపాండ్లో శవం ఉన్నట్లు పోలీసులకు తెలిసి వెళ్లారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. ఫైర్ సిబ్బంది శవాన్ని వెలికి తీసి పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రియల్టర్కు బెదిరింపులు యశవంతపుర: బెంగళూరు విద్యారణ్యపురకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి అండర్వల్డ్ డాన్ విక్కి శెట్టి పేరున బెదిరింపు వచ్చింది. అడిగినంత ఇవ్వకుంటే నీ కొడుకును పెళ్లి రోజునే లేపేస్తామని బెదిరించారని బాధిత రియల్టర్ శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏప్రిల్ 21న మొదట ఓ కాల్ చేసి బెదిరించారు, తాను పట్టించుకోలేదని, మళ్లీ మరో నంబర్ నుంచి కాల్ చేసి డబ్బులను డిమాండ్ చేశారు. పదేపదే కాల్స్ రావడంతో స్విచాఫ్ చేశానని తెలిపాడు. నిజంగా విక్కీశెట్టి వర్గీయులు కాల్చేశారా, లేక వ్యాపారంలో పోటీదారులు ఈ పనిచేశారా? అనేది విద్యారణ్యపుర పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, మంగళూరుకు చెందిన విక్కి శెట్టి మోస్ట్ వాంటెండ్ అండర్వరల్డ్ నేరగాళ్లలో ఒకరు, 20 ఏళ్ల నుంచి విదేశాలలో తలదాచుకున్నాడు. అతని అరెస్ట్కు సీబీఐ రెడ్కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. దుబాయ్, దక్షిణ ఆఫ్రికాలో నివాసం ఉంటాడని సమాచారం. వంతెన పైనుంచి కారు పల్టీ ● నలుగురికి తీవ్ర గాయాలు కోలారు: నిర్మాణ దశలో ఉన్న అండర్పాస్ సర్వీస్ రోడ్డుపై నుంచి కారు కింద పడి బాలునితో పాటు నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన ముళబాగిలు తాలూకా నరసింహ తీర్థ అండర్పాస్ వద్ద జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి కారులో వెళుతున్న కుటుంబం ఆదివారం తెల్లవారున 3 గంటలప్పుడు ఘటనాస్థలికి రాగానే అదుపు తప్పి కింద పడింది. నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ముళబాగిలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బెంగళూరువాసులకు ఈ–ఖాతా అభియాన
శివాజీనగర: బెంగళూరు నగరంలో భూములు, స్థలాల యజమానులకు సహాయకారిగా ‘నా ఈ–ఖాతా, నా హక్కు’ అనే అభియానను శనివారం డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ ప్రారంభించారు. తూర్పు నగర పాలికె పరిధిలో హొరమావులో నేషనల్ పబ్లిక్ పాఠశాలలో ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ 6వ గ్యారంటీగా ఈ పథకాన్ని జారీచేసింది, ఖాతా లేని ఇళ్లు, భవనాల యజమానులు ఇప్పుడు ఈ–ఖాతా పొందవచ్చు. 100 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారు. దరఖాస్తుల పరిశీలన తరువాత ఈ–ఖాతా పంపిణీ చేస్తారు అని తెలిపారు. ఇందుకు ఆస్తి విలువలో 2 శాతం ఫీజుగా చెల్లించాలని చెప్పారు. అలాగే మిగతా నగర పాలికెల్లోనూ డీసీఎం ఈ అభియానకు నాంది పలికారు. జీబీఏ చీఫ్ కమిషనర్ మహేశ్వరరావు, కమిషనర్లు పాల్గొన్నారు. సర్వజ్ఞనగరలో ఖాతా అభియాన్ను కమిషనర్ పరిశీలించారు. తొలిరోజే వందలాదిమంది దరఖాస్తులు చేసుకొన్నారు. ఈ అభియాన 100 రోజులు మాత్రం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ–ఖాతా పంపిణీ, కొత్తగా ఈ–ఖాతా దరఖాస్తులు చేయడం, బీ–ఖాతా నుంచి ఎ–ఖాతాకు మార్చేందుకు దరఖాస్తులు, విన్నపాల పరిష్కారం తదితరాలు అభియాన కేంద్రాలలో లభిస్తాయని తెలిపారు. ప్రారంభించిన డీసీఎం శివ


