breaking news
Karnataka
-
డాక్టర్ కృతికారెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్!
బెంగళూరు: గతేడాది సంచలనం రేపిన మహిళా వైద్యురాలు డాక్టర్ కృతికా రెడ్డి (28) హత్యకేసులో ఊహించని మలుపు తిరిగింది. ప్రియురాలి కోసం భార్య కృతికాను హత్య చేసిన మహేంద్రరెడ్డికి, అదే ప్రియురాలు పోలీసుల ముందు వ్యతిరేకంగా మాట్లాడింది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కృతికారెడ్డి గతేడాది ఏప్రిల్ నెల 23న అనుమానాస్పదంగా మరణించారు. విచారణ చేపట్టిన పోలీసులు 2,322 పేజీల ఛార్జ్ షీట్ను నమోదు చేసి కోర్టుకు అందించారు. మారతహళ్లి పోలీసులు తీగలాగితే డొంకంత కదిలింది అన్న చందంగా కృతికారెడ్డి మరణించక ముందు ఏం జరిగిందో చెప్పాలంటూ డాక్టర్ మహేందర్రెడ్డి నుంచి వాగ్మూలం తీసుకున్నారు.ఆ వాంగ్మూలంలో ‘ఏప్రిల్ 23వ తేదీ రాత్రి నేను నా భార్యకు క్యాన్యులా (ఇంట్రావీనస్ పైపు) ద్వారా మందు ఇచ్చాను. మేము అర్ధరాత్రి నిద్రపోయాము. తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో నేను నిద్రలేచి క్యాన్యులాను తీసేశాను’అని డాక్టర్ మహేంద్ర రెడ్డి పేర్కొన్నారు. అంతే ఈ ఒక్క వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భర్తే హంతకుడు అని నిర్ధారించేందుకు మొత్తం ఐదు రకాల ఆధారాలు, కారణాల్ని గుర్తించారు.ఇందుకోసం 23 డాక్టర్లతో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులు,స్నేహితులు,సాక్షులు ఇలా 77 మంది నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వాటి ఆధారంగా 2,322 పేజీల ఛార్జ్ షీట్ను కోర్టుకు అందించారు. విచారణ చేపట్టిన కోర్టు ఛార్జ్ షీట్లో 77మంది స్టేట్మెంట్, సేకరించిన ఆధారాలు,కారణాలు ఆధారంగా భర్తే హంతకుడని న్యాయస్థానం తేల్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరుఫు న్యాయవాది ప్రసన్న కుమార్ కోర్టులో తన వాదనల్ని వినిపించారు.వైద్యురాలు హత్యకేసులో భర్తే ప్రధాన నిందితుడు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసును విచారించాం. విచారణలో భర్తే హంతకుడని తేలింది. అందుకు ఊతం ఇచ్చేలా ఐదు రకాల ఆధారాల్ని సైతం సేకరించాం. వాటిల్లో నిందితుడు పోలీసులకు ఇచ్చిన ‘ఏప్రిల్ 23వ తేదీ రాత్రి నేను నా భార్యకు క్యాన్యులా (ఇంట్రావీనస్ పైపు) ద్వారా మందు ఇచ్చాను. మేము అర్ధరాత్రి నిద్రపోయాము. తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో నేను నిద్రలేచి క్యాన్యులాను తీసేశాను’ స్టేట్మెంట్ కీలకంగా వ్యవహరించినట్లు చెప్పారు. నిందితుడు కృతికాతో ఆమె మరణానికి ముందు కొన్ని గంటలపాటు ఆమెతో ఉన్నాడని సాక్ష్యాలు నిర్ధారిస్తున్నాయి. వైద్య ఆధారాల ప్రకారం, కృతికా శరీరంలో ప్రొపోఫోల్ అనే శక్తివంతమైన అనస్థీషియా మందు ఆనవాళ్లు బయటపడ్డాయి. ముఖ్యంగా ఆమె కాళ్లలో కూడా ఈ ఆనవాళ్లు కనిపించడం, మందు బయట నుంచి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చినట్లు స్పష్టంగా చూపుతోంది. కృతికా మరణం తర్వాత నిందితుడు పోస్ట్మార్టం జరగకుండా తీవ్రంగా వ్యతిరేకించాడు. తన మామగారు, కుటుంబ సభ్యులను ఒత్తిడి చేసి అడ్డుకోవాలని ప్రయత్నించాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఒక వైద్యుడిగా ఆయనకు పోస్ట్మార్టం ద్వారా నిజమైన మరణ కారణం బయటపడుతుందని తెలుసు’అదనంగా, నిందితుడు స్వయంగా ప్రొపోఫోల్ మందును ఒక ఫార్మసిస్ట్ వద్ద కొనుగోలు చేసినట్లు ఎలక్ట్రానిక్ ఆధారాలు చూపుతున్నాయి. “తన మొబైల్ ఫోన్ ద్వారా, తన బ్యాంక్ ఖాతా ద్వారా ఆన్లైన్ చెల్లింపు చేశాడు. కృతికా మరణం అనంతరం, నిందితుడు ఒక మహిళా స్నేహితురాలికి పేమెంట్ యాప్ ద్వారా సందేశాలు పంపినట్లు కూడా ఆధారాలు చూపుతున్నాయి.‘ప్రియురాలి కోసమే తన భార్యను హత్య చేసినట్లు చెప్పుకొచ్చాడు. కానీ సదరు ప్రియురాలు మాత్రం ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టి పారేసింది. దీంతో ‘నేను ఎప్పటికీ హంతకుడిగానే ఉంటాను, నువ్వు సంతోషంగా జీవించు’ అని ప్రతిస్పందించాడు” అని ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఈ సందేశాలు నిందితుడి ఉద్దేశాన్ని, ప్రేరణను స్పష్టంగా చూపడమే కాకుండా, అతని నేరాన్ని ఒప్పుకున్నట్లుగా ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించారు. జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్రరెడ్డి (32), డాక్టర్ కృతికారెడ్డి (28) 2024 మే 26న పెద్దలు వైభవంగా పెళ్లి చేశారు. ఇద్దరూ మారతహళ్లిలో నివాసం ఉన్నారు. డాక్టర్ కృతికారెడ్డి బెంగళూరు ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో చర్మ రోగ నిపుణురాలుగా పనిచేసే వారు. అదే ఆసుపత్రిలో భర్త జనరల్ సర్జన్. కాగా, తన వివాహేతర సంబంధానికి డాక్టర్ కృతికారెడ్డి అడ్డుగా ఉందనే ఆమె భర్త డాక్టర్ మహేంద్రరెడ్డి దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలితో సాన్నిహిత్యం కోసమే భార్యను హత్య చేశాడు. ఆ సమయంలో కృతిక సోదరి డాక్టర్ నిఖిత మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరితో వివాహం కాక మునుపు నుంచే మరో వైద్యురాలితో మహేంద్రరెడ్డికి సంబంధం ఉందని ఆరోపించారు. వివామైన అనంతరమూ ఆ సంబంధాన్ని కొనసాగించాడని తప్పుబట్టారు. వివాహమైన రెండు నెలల నుంచే సొంతంగా ఆసుపత్రి పెట్టుకునేందుకు నగదు కావాలని ఒత్తిడి చేయడం, ఆ తర్వాత చికిత్స పేరిట ఎక్కువ మోతాదులో అనస్తీషియా డోసు ఇచ్చాడని ఆక్రోశించారు. ఆపై నేరం భయటపడుతుందనే ఉద్దేశ్యం తన అక్క భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నించినట్లు మండిపడింది. -
డీకే శివకుమార్ సీఎం అయ్యేది అప్పుడే?!
సాక్షి,బెంగళూరు: రాష్ట్రంలో సీఎం పదవి మార్పులపై వస్తున్న వదంతుల్ని గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ ఖండించారు. సీఎం సిద్దరామయ్య తరువాత డి కె శివకుమార్నే ముఖ్యమంత్రి అవుతారని, అయితే అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత జరుగుతుందని తెలిపారు. లక్ష్మీపురలో నూరాని మసీదు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నవంబర్ నెల తరువాత రాజకీయ విప్లవం వస్తుందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలలో వాస్తవం లేదన్నారు. తమ పార్టీలో ప్రతీది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 2028 వరకు సిద్దరామయ్యనే సీఎంగా కొనసాగుతారన్నారు. గతంలో కాంగ్రెసేతర ప్రభుత్వాల కంటే బాగా అభివృద్ధి పనులు చేశామని, వాటిని చెప్పుకుని ప్రజల ముందుకు వెళతామని తెలిపారు. ‘మేము ఎప్పటినుంచో చెబుతున్నాం. శివకుమార్ ముఖ్యమంత్రి కావాలి, కానీ సిద్దరామయ్య తర్వాత మాత్రమే. అదే మా డిమాండ్’. కాంగ్రెస్ అనేది శివకుమార్ రక్తంలో కాంగ్రెస్ ఉంది. మాలో చాలామంది వేరే పార్టీల నుంచి వచ్చాం. కానీ ఆయన రక్తంలో కాంగ్రెస్ ఉంది. రక్తాన్ని మార్చలేం’ అని అన్నారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నాయకత్వ మార్పు గురించి వస్తున్న వదంతులను ఖండిస్తూ జమీర్ స్పందించారు. ‘నవంబర్ విప్లవం, డిసెంబర్ విప్లవం, ఇప్పుడు జనవరి సంక్రాంతి అని చెప్పిన వారు అర్థం చేసుకోవాలి. ఏమీ జరగదు. హైకమాండ్ సిద్దరామయ్యతోనే ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు.మొత్తం మీద, కోలార్లో జమీర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలు,అధిష్టానం వద్ద సిద్దరామయ్య, శివకుమార్ నాయకత్వంపై స్పష్టత ఇచ్చినట్లైంది. -
రెండో పెళ్లి.. రూ.36 లక్షలతో భర్త జంప్
కర్ణాటక: విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడి, కూతురు పుట్టిన తరువాత రూ.36 లక్షల డబ్బుతో ఉడాయించిన ఘరానా భర్త ఉదంతమిది. బెంగళూరులో బనశంకరిపోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ యువతి భర్తకు అనారోగ్యం కారణంగా 2021లో విడాకులు తీసుకుని విడిగా ఉంటోంది. తరువాత మోసగాడు మోహన్రాజ్ పరిచయమై ప్రేమించింది, 2022లో వివాహం చేసుకున్నారు. తరువాతి ఏడాది వారికి కూతురు పుట్టింది. మోహన్రాజ్ను నమ్మిన ఆమె అడిగినంత డబ్బు ఇచ్చింది. కొత్తగా ఇల్లు కట్టిస్తానని చెప్పడంతో బంగారం కుదువ పెట్టి డబ్బులు ఇచ్చింది, ఇలా రూ.36 లక్షల వరకూ జేబులో వేసుకున్నాడు. గతేడాది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి జాడ లేదు. దీంతో కంగుతిన్న బాధితురాలు మోసపోయినట్లు గుర్తించింది. తనకు న్యాయం చేయాలని బనశంకరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
పిల్లలకు టాక్సిక్ టీజర్ చూపించవద్దు
ప్రముఖ నటుడు యశ్ నటించిన టాక్సిక్ సినిమా టీజర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. దీని ప్రసారం నిలిపివేయాలని, లేదా గైడ్లైన్స్ సమేతంగా టీజర్ ప్రసారం చేయాలని ఓ న్యాయవాది రాష్ట్ర సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. కేంద్ర సెన్సార్ బోర్డుకు కూడా లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆ లాయరు శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ టాక్సిక్ టీజర్లో బాలల చట్టాల ఉల్లంఘన జరిగింది. టీజర్లో అతి హింసాత్మకమైన దృశ్యాలు ఉన్నా కూడా గైడ్లైన్స్ లేవు. కాబట్టి దానిని చూసేముందు గైడ్లైన్స్ వేయాలి, దానిని బట్టి ప్రేక్షకులు చూడాలా, వద్దా అనేది నిర్ణయించుకుంటారు అని చెప్పారు. టాక్సిక్ సినిమాను కుటుంబ సమేతంగా చూడటానికి సాధ్యపడదని అన్నారు. పిల్లలతో కలసి కుటుంబంతో కలసి టీజర్ చూశామని అనేక మంది అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు. కుమారస్వామి వీడియో యశవంతపుర: టాక్సిక్ టీజర్ను ఆధారంగా కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి వీడియోను ఆయన అభిమానులు రూపొందించారు. టాక్సిక్ మ్యూజిక్ వస్తుండగా ఈ వీడియోలో మొదట సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్లు కనిపిస్తారు. 2028లో జరిగే ఎన్నికలపై వీరిద్దరూ మాట్లాడతారు. తరువాత కుమారస్వామి ఎంట్రీ ఇస్తారు. -
బంగ్లాదేశీయులకు ఇళ్లు ఇస్తే కఠిన చర్యలు
● హోం మంత్రి జి.పరమేశ్వర్శివాజీనగర: అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు నివసించేందుకు ఇళ్లు ఇచ్చిన యజమానులపై పోలీస్ శాఖ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి జి.పరమేశ్వర్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారత సరిహద్దులో బంగ్లా, ఇతర దేశపు నివాసులు అక్రమంగా చొరబడితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బీఎస్ఎఫ్తో పాటుగా అన్ని బలగాలను సరిహద్దులో నియమించి చొరబాటుదారులను అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. సరిహద్దులో సొమ్ము ఇచ్చి లోపలికి వచ్చామని కొందరు అక్రమ చొరబాటుదారులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. సొమ్ము ఇచ్చి లోపలికి వస్తున్నారంటే.. సరిహద్దుల్లో సరైన భద్రత లేదని అర్థమవుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ బంగ్లా చొరబాటుదారుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఇప్పటికే కొందరిని స్వాధీనంలోకి తీసుకుని సరిహద్దు దాటించామన్నారు. అక్రమ వలసదారులపై పోలీస్ స్టేషన్లలో రోజూ పరిశీలన జరుగుతోందని తెలిపారు. విదేశీయులు భారత్కు వచ్చిన తరువాత అధికారిక వీసా లేకపోతే అటువంటి వారికి నివసించేందుకు బాడుగ ఇల్లు ఇవ్వటం నేరమని పేర్కొన్నారు. ఇంటి యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఆకతాయి రైడర్ అరెస్టు బనశంకరి: డ్రాప్ సమయంలో మహిళను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన ర్యాపిడో బైక్ రైడర్ను అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాజీనగర మంజునాథ నగర నివాసి రోహిత్ (37) నిందితుడు. వివరాలు.. 7వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో నాగరబావి నుంచి హెబ్బాళ మాన్యతాటెక్ పార్కులో విధులకు వెళ్లడానికి మహిళ ర్యాపిడో బైక్ను బుక్చేసింది. మహిళ బైకులో కూర్చుంది, ఆమె బ్యాగును సీటు మీద ఉంచవద్దని రైడర్ కోరాడు. ఏకవచనంతో మాట్లాడుతూ మహిళను తాకాడు. కోపోద్రిక్తురాలైన మహిళ బైకును నిలిపింది, కానీ అతడు అసభ్యంగా ప్రవర్తిస్తూ, డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అతని ప్రవర్తనతో మనస్తాపం చెందిన మహిళ అన్నపూర్ణేశ్వరినగర ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు రైడర్ను అరెస్ట్చేసి బైక్ని సీజ్ చేశారు. ఈ శిశువు కన్నవారెవరో? శివమొగ్గ: ఎంతోమంది దంపతులు సంతానం లేక బాధపడుతుంటే, కొందరేమో పుట్టిన శిశువులను రోడ్లపై వదిలేస్తున్నారు. జిల్లాలో కొన్ని నెలల క్రితం రోడ్డు పక్కన లభించిన గుర్తు తెలియని నవజాత మగ శిశువు తల్లిదండ్రుల ఆచూకీ కనుగొనేందుకు సహాయపడాలని శిశు సంక్షేమ సమితి ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై శనివారంనాడు శిశువు చిత్రంతో పత్రికా ప్రకటన విడుదల చేసింది. భద్రావతి తాలూకా మల్లాపుర గ్రామ గేట్ వద్ద రోడ్డు పక్కన శిశువు లభించింది. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హొళెహొన్నూరు స్టేషన్ పోలీసులు శిశువును రక్షించి శిశు సంక్షేమ సమితి సంరక్షణలో ఉంచారు. తల్లిదండ్రులు, బంధువులు ఎవరైనా గానీ శివమొగ్గలోని ఆల్కోళలోని ప్రభుత్వ బాలమందిరంలో సంప్రదించాలని కోరారు. 2028 తరువాతే డీకే సీఎం: మంత్రి జమీర్ శ్రీనివాసపురం: రాష్ట్రంలో సీఎం సిద్దరామయ్య తరువాత డి కె శివకుమార్నే ముఖ్యమంత్రి అవుతారని, అయితే అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత జరుగుతుందని గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ అన్నారు. శనివారం తాలూకాలోని లక్ష్మీపురలో నూరాని మసీదు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నవంబర్ నెల తరువాత రాజకీయ విప్లవం వస్తుందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలలో వాస్తవం లేదన్నారు. తమ పార్టీలో ప్రతీది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 2028 వరకు సిద్దరామయ్యనే సీఎంగా కొనసాగుతారన్నారు. గతంలో కాంగ్రెసేతర ప్రభుత్వాల కంటే బాగా అభివృద్ధి పనులు చేశామని, వాటిని చెప్పుకుని ప్రజల ముందుకు వెళతామని అన్నారు. -
బళ్లారి అయ్యప్ప భక్తులకు గాయాలు
కొండ అంచుల్లో..వీకెండ్ కావడంతో శనివారం ప్రసిద్ధ బాదామిలోని గుహాలయాల కొండలను అధిరోహిస్తున్న సాహసికులు. ఓ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో యువతీ యువకులు ఈ ట్రెక్కింగ్లో పాల్గొన్నారు సేలం: కర్ణాటక రాష్ట్రం బళ్లారి ప్రాంతానికి చెందిన 15 మంది అయ్యప్ప భక్తులు మాల ధరించి శబరిమలకి వ్యాన్లో వెళ్లి వస్తూ తమిళనాడులో ప్రమాదానికి గురయ్యారు. శబరిమలకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుని సొంతూరికి తిరిగి వెళ్తున్నారు. శనివారం ఉదయం ఈరోడ్ జిల్లా ఆసనూర్ – పులింజూర్ మధ్య భక్తుల వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు గాయపడ్డారు. స్థానికులు, వాహనదారులు వారిని రక్షించి అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెన్సార్బోర్డుకు ఓ వకీలు ఫిర్యాదు -
పిల్లలకు టాక్సిక్ చూపించరాదు
శివాజీనగర: ప్రముఖ నటుడు యశ్ నటించిన టాక్సిక్ సినిమా టీజర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. దీని ప్రసారం నిలిపివేయాలని, లేదా గైడ్లైన్స్ సమేతంగా టీజర్ ప్రసారం చేయాలని ఓ న్యాయవాది రాష్ట్ర సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. కేంద్ర సెన్సార్ బోర్డుకు కూడా లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆ లాయరు శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ టాక్సిక్ టీజర్లో బాలల చట్టాల ఉల్లంఘన జరిగింది. టీజర్లో అతి హింసాత్మకమైన దృశ్యాలు ఉన్నా కూడా గైడ్లైన్స్ లేవు. కాబట్టి దానిని చూసేముందు గైడ్లైన్స్ వేయాలి, దానిని బట్టి ప్రేక్షకులు చూడాలా, వద్దా అనేది నిర్ణయించుకుంటారు అని చెప్పారు. టాక్సిక్ సినిమాను కుటుంబ సమేతంగా చూడటానికి సాధ్యపడదని అన్నారు. పిల్లలతో కలసి కుటుంబంతో కలసి టీజర్ చూశామని అనేక మంది అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు. కుమారస్వామి వీడియో యశవంతపుర: టాక్సిక్ టీజర్ను ఆధారంగా కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి వీడియోను ఆయన అభిమానులు రూపొందించారు. టాక్సిక్ మ్యూజిక్ వస్తుండగా ఈ వీడియోలో మొదట సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్లు కనిపిస్తారు. 2028లో జరిగే ఎన్నికలపై వీరిద్దరూ మాట్లాడతారు. తరువాత కుమారస్వామి ఎంట్రీ ఇస్తారు. -
అమ్మవారికి కూరగాయల అలంకారం
కోలారు: ధనుర్మాసం సందర్భంగా శనివారం ముళబాగిలు నగరంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు. వేకువజాము నుంచే భక్తులు దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. డ్రైవర్ మత్తు.. కారు చిత్తు బనశంకరి: మద్యం మత్తులో కారుడ్రైవరు అడ్డదిడ్డంగా నడిపి జనాల మీదకు దూసుకెళ్లాడు. ఈ ఘటన బెంగళూరు ఇందిరానగర 18 మెయిన్ రోడ్డులో చోటుచేసుకుంది. అక్కడే నిలబడిన యువకుడు, యువతులు ఇద్దరు బైకర్లు వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. హోటల్లో భోజనం చేసుకుని ఆరుమంది బయట నిలబడ్డారు. ఈ సమయంలో కారువేగంగా దూసుకువచ్చి డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డులోని హోటల్లోకి దూసుకెళ్లింది. యువకులు, యువతులు వెంటనే పక్కకు తప్పుకున్నారు. ఎదురుగా వస్తున్న ఇద్దరు బైకిస్టులు కూడా తప్పించుకున్నారు. సినిమా స్టైల్లో సంభవించిన ప్రమాదం అక్కడ సీసీ కెమెరాలలో నమోదైంది. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరచూ పుట్టింటికి.. భార్యను చంపి భర్త ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: తనను పట్టించుకోకుండా పదేపదే పుట్టింటికి వెళ్తోందని భార్యను హత్య చేసిన భర్త ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెళగావి జిల్లా బైలహొంగల తాలూకా తురుకర శీగిహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. శివప్ప సన్నబసప్ప (50) అనే వ్యక్తి తన భార్య యల్లవ్వ (46)ను హత్య చేసి తరువాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. యల్లవ్వ పదేపదే తన పుట్టింటికి వెళ్లి వస్తుండడంతో భర్త గొడవపడేవాడు. యల్లవ్వ తల్లి మంగళవారంనాడు చనిపోవడంతో పుట్టింటికి వెళ్లి వచ్చింది, శుక్రవారం మళ్లీ పుట్టింటికి బయలుదేరగా శివప్ప వద్దని అభ్యంతరం తెలిపాడు. దీంతో పోట్లాట మొదలైంది. ఆగ్రహం పట్టలేక కొడవలితో యల్లవ్వ మెడ నరికి హత్య చేసి, తరువాత తాను ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఉపాధి హామీలో అవినీతి.. అందుకే ప్రక్షాళన ● కేంద్రమంత్రి కుమారస్వామి, బీజేపీ నేతలు శివాజీనగర: ఇప్పటివరకు ఉన్న ఉపాధి హామీ పథకం స్వరూపాన్ని మార్చి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రాం జీ చట్టాన్ని బీజేపీ, జేడీఎస్ నాయకులు గట్టి సమర్థించారు. ఆ పథకంలో జరుగుతున్న అవినీతి, దుర్వినియోగాలను అరికట్టడం సాధ్యపడుతుందన్నారు. శనివారం బెంగళూరులో ఓ హోటల్లో కేంద్రమంత్రి హెచ్.డీ.కుమారస్వామి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. నరేగా పథకంలోని లోపాలను సరిచేసి కొత్తగా వీబీజీ రాం జీ చట్టం తీసుకువచ్చినట్లు చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వ పాలనలో నరేగా చట్టాన్ని అమలులోకి తెచ్చారు, ఇది ఎంతో దుర్వినియోగం అయ్యింది, బోగస్ బిల్లుల ద్వారా భారీగా అవినీతికి పాల్పడ్డారు. వీటిని అరికట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వరూపాన్ని మార్చి రాం జీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. దీని మీద చర్చకు సిద్ధమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సొమ్మును భరించాలనే అభ్యంతరం తీసుకొచ్చింది. కొత్త పథకం ద్వారా కూలీలకు ఏడాదికి 125 రోజులు పని దినాలు, రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా నిధులు లభిస్తాయన్నారు. -
రెండో పెళ్లి.. రూ.36 లక్షలతో భర్త జంప్
బనశంకరి: విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడి, కూతురు పుట్టిన తరువాత రూ.36 లక్షల డబ్బుతో ఉడాయించిన ఘరానా భర్త ఉదంతమిది. బెంగళూరులో బనశంకరిపోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ యువతి భర్తకు అనారోగ్యం కారణంగా 2021లో విడాకులు తీసుకుని విడిగా ఉంటోంది. తరువాత మోసగాడు మోహన్రాజ్ పరిచయమై ప్రేమించింది, 2022లో వివాహం చేసుకున్నారు. తరువాతి ఏడాది వారికి కూతురు పుట్టింది. మోహన్రాజ్ను నమ్మిన ఆమె అడిగినంత డబ్బు ఇచ్చింది. కొత్తగా ఇల్లు కట్టిస్తానని చెప్పడంతో బంగారం కుదువ పెట్టి డబ్బులు ఇచ్చింది, ఇలా రూ.36 లక్షల వరకూ జేబులో వేసుకున్నాడు. గతేడాది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి జాడ లేదు. దీంతో కంగుతిన్న బాధితురాలు మోసపోయినట్లు గుర్తించింది. తనకు న్యాయం చేయాలని బనశంకరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
షేర్ల పేరుతో రూ.కోటి సైబర్ లూటీ
బనశంకరి: డిజిటల్ అరెస్టులు అనేవి ఏవీ లేవు, సైబర్ మోసగాళ్ల వలలో పడవద్దు అని ఆర్బీఐ, పోలీస్శాఖ ఎంత జాగృతం చేసినప్పటికీ అమాయకులు వినిపించుకోవడం లేదు. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లల్లా చేసి భారీగా వంచనకు గురవుతున్నారు. అలాంటిదే ఈ సంఘటన. నిర్మల్ హెల్త్ ఆర్కిటెక్ట్ పేరుతో వాట్సాప్ గ్రూప్లోకి విశ్రాంత ఉద్యోగిని చేర్చుకుని రూ.1.01 కోట్లు కొట్టేశారు. బెంగళూరు తిప్పసంద్ర జీవనబీమానగర నివాసి హెచ్.శివప్రసాద్ (74) మోసపోయి తూర్పు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. వివరాలు.. ఇటీవల ఆయనకు కాల్ చేసిన ఓ యువతి విద్యా కపాడియా అని చెప్పుకుంది, షేరుమార్కెట్లో పెట్టుబడిపెడితే పెద్దమొత్తంలో లాభం వస్తుందని తెలిపింది. తరచూ వేర్వేరు నంబర్ల ద్వారా కాల్స్ చేస్తూ అతన్ని పలు వాట్సాప్ గ్రూపుల్లో చేర్పించింది. షేర్ ట్రేడర్స్ పేరుతో వృద్ధునికి మోసగాళ్లు కాల్స్ చేసి పెట్టుబడులగురించి చెప్పేవారు. 2025 నవంబరు 4 నుంచి డిసెంబరు 9 వరకు రూ.1,01,05,100 ను రెండు ఎస్బీఐ ఖాతాలు, మరో సహకార బ్యాంకు ఖాతా నుంచి దుండగుల ఖాతాలకు పంపించాడు. 10 అకౌంట్లకు జమ చేయడం గమనార్హం. కొన్నిరోజుల తరువాత అసలు, లాభం ఇవ్వాలని యువతిని అడిగాడు. కానీ మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆమె ఒత్తిడి చేసింది. మోసపోయానని తెలిసి అతడు సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. బెంగళూరులో రిటైర్డు ఉద్యోగికి టోకరా -
యువనిధి ప్లస్ ఉన్నా...
సాక్షి, బెంగళూరు: నిరుద్యోగ ఇంజనీరింగ్ పట్టభద్రుల సంఖ్య కర్ణాటకలో నానాటికీ పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం కన్నడనాట ఉద్యోగాలు లభించని ఇంజనీరింగ్ యువత సంఖ్య 43 వేల మందికి పైగా ఉన్నట్లు తెలిసింది. ఇంకా డిగ్రీ, డిప్లొమా చదువులు పూర్తి చేసినా ఉద్యోగాలు దొరకని వారు ప్రస్తుతం 3.79 లక్షల మందికి పైగా ఉన్నట్లు సమాచారం. వీరంతా రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ స్కీమ్ యువనిధికి నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 43,529 మంది వివిధ ఇంజనీరింగ్ కోర్సులు, 4,250 మంది టెక్నికల్ డిప్లొమా చేసిన వారు కాగా, మిగిలిన వారు ఇతరత్రా సాంకేతిక కోర్సులు చేసిన వారున్నారు. రాష్ట్ర నిరుద్యోగుల్లో 13 శాతం ఇంజనీరింగ్ చదివిన వారే ఉండడం గమనార్హం. అయితే వివిధ కారణాల వల్ల యువనిధికి దరఖాస్తు చేయని నిరుద్యోగుల సంఖ్య ఇంతకు రెట్టింపు ఉన్నా ఆశ్చర్యం లేదని సమాచారం. అవన్నీ చేరితే ఇంజనీరింగ్ నిరుద్యోగులు మరింత ఎక్కువమంది ఉండొచ్చని తెలుస్తోంది. భృతి మంజూరు యువనిధికి దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు 2025–26 ఏడాదిలో నిర్ణీత మొత్తం మేర ఆర్థిక సాయం లభించింది. దరఖాస్తు దారుల్లో ఇతర అంశాల్లో పీజీ చేసిన యువతీ యువకులు 27,843 మంది ఉండగా, ఇంజనీరింగ్లో పీజీ హోల్డర్లు 374 మంది ఉన్నారు. నైపుణ్యాలు కరువా? ప్రతి ఏటా కనిష్టంగా లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల నుంచి పట్టాలతో వస్తున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లు, వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా కొందరు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. అయితే చాలా మందికి ఆ చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించడం లేదు. నిర్ణీత ఉద్యోనికి అవసరమైన నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మంది యువతీ యువకులు వెనుకబడిపోతున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోఇంజనీరింగ్ కాలేజీల్లో నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయా కంపెనీలు చెబుతున్నాయి.బెంగళూరులో జాబ్ మేళాలో యువత రద్దీ (ఫైల్)రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇటీవల ధార్వాడలో ధర్నా కోర్సు చేసినా నిరుద్యోగమే రాష్ట్రంలో అలాంటివారు 43 వేల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మంత్రి శరణ ప్రకాశ పాటిల్ మాట్లాడుతూ ‘రాష్ట్ర యువతకు ఉద్యోగాలు లభించకపోవడానికి కారణం తగిన నైపుణ్యాలు లేకపోవడమే అని తెలిసింది. అందుకోసమే ప్రభుత్వం యువనిధి ప్లస్ అనే కార్యక్రమాన్ని రూపొందించింది’ అని చెప్పారు. ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేలా ఈ పథకం ఉందన్నారు. అయితే ఈ శిక్షణ తరగతులకు 90 శాతం మంది గైర్హాజరవుతున్నారని వాపోయారు. యువనిధికి 3.79 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే శిక్షణకు మాత్రం 27,843 మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో నైపుణ్య శిక్షణ కోసం కేటాయించిన రూ. 27 కోట్లను వినియోగించలేకపోయామని అన్నారు. -
జస్ట్ మిస్ భయ్యా.. అదృష్టం అంటే వీరిదే..
బెంగళూరు: కొన్ని సందర్భాల్లో నువ్వు లక్కీ ఫెలో రా.. అని అంటుంటాం కదా.. సరిగ్గా అలాగే ఓ బ్యాచ్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎందుకు అనుకుంటున్నారా?.. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను దాటుకుని వెళ్లి వారి వైపు దూసుకొచ్చింది. సెకన్ల వ్యవధిలో వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని ఇందిరానగర్లో డెరిక్ టోనీ(42) ఫుల్లుగా మద్యం సేవించి తన స్కోడా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. 18వ మెయిన్ రోడ్డు నుండి 100 అడుగుల రోడ్డు వైపు వెళ్తున్నాడు. ఇంతలో మద్యం మత్తులో కారుపై నియంత్రణ కోల్పోయి.. రోడ్డు వద్ద ఎడమ వైపునకు తిరగాల్సి ఉండగా నేరుగా డ్రైవ్ చేశాడు. దీంతో, అతి వేగంలో ఉన్న కారు ఒక్కసారిగా డివైడర్పై నుంచి సినిమా రేంజ్లో జంప్ చేసి అవతలి వైపునకు దూసుకెళ్లింది.ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, చివరకు అక్కడే ఉన్న ‘బార్బెక్యూ నేషన్’ రెస్టారెంట్ గోడను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ గోడ పూర్తిగా దెబ్బతినింది. ప్రమాదం శుక్రవారం రాత్రి 11:35 గంటల సమయంలో కొందరు వ్యక్తులు రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకుని బయట నిలబడి ఉన్నారు. వారిపై కారు దూసుకెళ్లినప్పటికీ సెకన్ల వ్యవధిలో అప్రమత్తమైన బ్యాచ్.. ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ భారీ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.ఇక, ఈ ఘటనలో కారు ఢీకొట్టిన బైక్ను నడుపుతున్న జాబిర్ అహ్మద్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జీవన్ భీమా నగర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి కారు నడిపిన డెరిక్ టోనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
ఉద్యోగం ఇవ్వలేదని భవన యజమాని అక్కసు
హుబ్లీ: స్వార్థం పరిమితి దాటిపోతోంది. తాజాగా తాను అంగన్వాడీ కేంద్రానికి బాడుగ ఇచ్చానని, అందువల్ల తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని పట్టుబట్టి ఆ ఉద్యోగానికి సహకరించలేదన్న కారణంగా సదరు అద్దె ఇంటి తలుపునకు తాళం వేసి విచిత్రంగా ప్రవర్తించిన యజమాని తీరు ఇది. వివరాలు.. ఈ ఘటన సాక్షాత్తు రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ సొంత జిల్లా బెళగావిలోని రాయబాగ తాలూకా నందికోరలి గ్రామంలోని వంజేరి తోట అంగన్వాడీ కేంద్రంలో జరిగింది. ఆ కేంద్రానికి గత నాలుగు రోజుల నుంచి బాబురావ్ వంజేరి అనే వ్యక్తి తాళం వేశారు. దీంతో అంగన్వాడీ చిన్నారులు అంగన్వాడీ బయట ఆవరణలో కూర్చొని చదువుకోవడంతో పాటు అక్కడే భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. హామీ మరిచి ఇతరులకు ఉద్యోగం సదరు కట్టడం నిర్మించి 22 ఏళ్లు దాటింది. 2000 సంవత్సరం నుంచే ఈ స్థలాన్ని ఇచ్చామని, స్థలాన్ని తీసుకున్న అధికారులు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారులు ఇచ్చిన ఆ మాటను మరచిపోయి తమ కుటుంబ సభ్యుడికి బదులుగా ఇతర వ్యక్తికి ఉద్యోగం కేటాయించారని ఆయన వివరించారు. అంగన్వాడీ కేంద్రం సహాయకురాలి పోస్టు ఖాళీ ఏర్పడటంతో అప్పట్లో జిల్లాధికారికి దరఖాస్తు చేశాం. అధికారులకు విన్నవిస్తే మీ కుటుంబ సభ్యులకు ఇస్తామని దరఖాస్తు వేసుకోమని సూచించారు. అధికారులు కూడా పరిశీలించి వెళ్లారు. సీడీపీఓ ఇక్కడికి వచ్చి చూస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఇటు వైపు తిరిగి చూడలేదన్నారు. ఉద్యోగం ఇస్తేనే తాళం తీస్తా తమ కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇస్తే తాళం తీస్తానని ఆ భవన యజమాని బాబూరావు మొండికేశారు. సదరు కేంద్రం అంగన్వాడీ టీచర్ మాలతీ మఠపతి మాట్లాడుతూ ఈ అంగన్వాడీలో యజమాని కుటుంబ సభ్యులకు సహాయకురాలి ఉద్యోగం కావాలి, ఆయన పొలంలోనే కేంద్రం ఉండటం వల్ల తాళం వేశారు. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లాలి. పిల్లలు గత నాలుగు రోజుల నుంచి బయటే ఉన్నారు. సూపర్వైజర్ వచ్చి పరిశీలించి వెళ్లారు. ఆమె తనను కార్యాలయానికి రావాలని సూచించడంతో తాను వెళ్లానని, రేపు వస్తానని ఆమె హామీ ఇచ్చారు. సాయంత్రం వరకు వేచి చూసినా ఆమె రాలేదని, ఉన్న స్థితిగతులను ఉన్నతాధికారులకు తెలియజేశానని అంగన్వాడీ కార్యకర్త వివరించారు. త్వరలో సమస్యకు పరిష్కారం రేపు వస్తామంటున్నారు. సీడీపీఓ అసలు రాలేదు. నేను ఓ మామూలు అంగన్వాడీ టీచర్ని, ఈ ఘటనపై ఇంతకన్నా ఎక్కువగా ఏమి చెప్పలేనన్నారు. ఈ విషయమై ఆ తాలూకా అధికారిణి భారతి ఫోన్లో స్పందించారు. గతంలోని అధికారులతో సదరు భవనం యజమానికి ఏం ఒప్పందం జరిగిందో తనకు తెలియదని, ఆయన విజ్ఞప్తిని రాతపూర్వకంగా ఇవ్వలేదు. గత 20 ఏళ్ల నుంచి కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం, తాళం తీయాలని విజ్ఞప్తి చేశామని, అయినా యజమాని స్పందించలేదని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చానని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని భారతి తెలిపారు. అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసిన వైనం విధి లేక ఆరు బయటే పిల్లల విద్యాభ్యాసం -
ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు ప్రారంభం
హుబ్లీ: హుబ్లీ నుంచి హైదరాబాద్, షోలాపూర్, శక్తినగరకు ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ డీసీ హెచ్.రామనగౌడర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల అనుకూలం కోసం ఈ మూడు నగరాలకు గోకుల్ రోడ్డు కేంద్ర బస్టాండ్ నుంచి బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి రోజూ హైదరాబాద్కు బస్సు సాయంత్రం 7 గంటలకు బయలుదేరి గదగ్, కొప్పళ, గంగావతి, సింధనూరు, రాయచూరు, మహబూబ్ నగర్ గుండా హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్టాండ్కు మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు చేరుతుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో అదే బస్సు అక్కడ నుంచి సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి హుబ్లీకి మరుసటి ఉదయం రోజు ఉదయం 6.30 గంటలకు చేరుతుందని తెలిపారు. ప్రమాద పరిహార బీమా, టోల్ ఫ్రీతో పాటు ప్రయాణ ధర హైదరాబాద్కు రూ.790, అలాగే రాయచూరుకు రూ.408గా టికెట్ ధర నిర్ణయించారు. అలాగే గోకుల్ రోడ్డు బస్టాండ్ నుంచి షోలాపూర్కు రాత్రి 8.30 గంటలకు బయలుదేరే బస్సు ధార్వాడ, సౌదత్తి, రామదుర్గ, లోకాపుర, ముధోళ, జమఖండి, విజయపుర మీదుగా మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చేరుతుందని తెలిపారు. తిరిగి అక్కడి నుంచి రాత్రి 8.30 గంటలకు బయలుదేరి హుబ్లీకి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు వచ్చే ఈ బస్సులో ప్రయాణ ధర రూ.491గా నిర్ణయించారు. అలాగే శక్తినగర్కు రాత్రి 10 గంటలకు బయలుదేరే బస్సు గదగ్, కొప్పళ, గంగావతి, సింధనూరు, రాయచూరు మీదుగా శక్తినగర్కు మరుసటి రోజు 5.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడ తిరిగి రాత్రి 8 గంటలకు బయలుదేరి హుబ్లీకి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. దీనికి కూడా ప్రమాద బీమా, టోల్ఫ్రీతో కలిపి రాయచూరుకు రూ.408 అలాగే శక్తినగర్కు రూ.441గా టికెట్ ధర నిర్ణయించారు. ఆన్లైన్, అడ్వాన్స్ బుకింగ్ ఏర్పాటు చేశారు. ఓ వ్యక్తి నాలుగు సీట్ల కన్నా ఎక్కువ రిజర్వు చేస్తే 5 శాతం రాయితీ, అలాగే వచ్చి పోయే ప్రయాణానికి ఒకేసారి కొంటే ప్రయాణ ధరలో 10 శాతం రాయితీ ఇస్తారని తెలిపారు. మొత్తానికి ప్రయాణీకుల రద్దీ, స్పందన చూసి ప్రముఖ స్థలాలకు ఇలాంటి మరిన్ని బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. -
కష్టాల సుడిలో మొక్కజొన్న రైతన్న
హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వాన్ని మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని ఎందుకు డిమాండ్ చేశామో, ఆందోళన ఎందుకు చేశామో తమకు అర్థం కావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నలను ప్రతి క్వింటాల్కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రూ.2400ల కనిష్ట ధర, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్వింటాల్కు రూ.600 ప్రోత్సాహధనం కోసం జిల్లాతో పాటు వివిధ చోట్ల ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఒక్కో రైతు నుంచి 100 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అయితే హావేరి జిల్లాధికారి కార్యాలయం ఎదుట సమస్యల సాధన కోసం ఆందోళన చేపట్టిన రైతుల సమస్యలపై తొలుత ప్రభుత్వం స్పందించలేదు. పోరాటం తీవ్రతరం కావడంతో ఆ మేరకు మొక్కజొన్నలకు క్వింటాల్కు రూ.2400ల మద్దతు ధర నిర్ణయించింది. 12 క్వింటాళ్ల మొక్కజొన్నను ప్రతి రైతు వద్ద నుంచి కొనుగోలు చేయాలని సూచించింది. అయినా రైతన్నలు మాత్రం తమ పోరాటానికి స్వస్తి పలకలేదు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని ఒక్కో రైతు నుంచి 20 క్వింటాళ్ల చొప్పున మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామని ప్రభుత్వంతో ప్రకటింపజేశారు. ప్రభుత్వ హామీతో ఆందోళన విరమణ అయినా కూడా రైతులు శాంతించక తమ ఆందోళన కొనసాగించారు. దీంతో ఎట్టకేలకు ప్రతి రైతు నుంచి 50 క్వింటాళ్ల మేర కొనుగోలుకు ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు తమ ఆందోళనను ఉపసంహరించుకున్నారు. ఇన్ని పోరాటాలు చేసి పట్టు సాధించినా కూడా తమకు ఎటువంటి లాభం కలగలేదని రైతులు అసంతృప్తి వెళ్లగక్కారు. రైతుల ఆందోళన కంటే ముందే మొక్కజొన్న క్వింటాల్కు రూ.1600 నుంచి రూ.1800 ధర ఉండేది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటనతో మొక్కజొన్నకు కొద్ది మేర డిమాండ్ పలికింది. వ్యాపారులు రూ.2000 వరకు క్వింటాల్కు చెల్లించారు. అయితే ప్రభుత్వం క్వింటాల్కు రూ.2400 ధర చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వ్యాపారులకు మొక్కజొన్న విక్రయించలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలుకు వీలుగా రైతుల పేర్ల నమోదుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతోటే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రతి రైతు నుంచి కేవలం 20 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసేలా పేర్లు నమోదు చేసుకున్నారు. హావేరి జిల్లా రైతన్నకు తప్పని నష్టాలు సర్కారుతో పోరాడినా ఫలితం అంతంతేరైతుల నుంచి మొక్కజొన్న శాంపిళ్లను సేకరించారు. అయితే సదరు శాంపిళ్ల ఫలితాలు వెల్లడించలేదు. ఫలితంగా రైతులు చకోర పక్షుల్లా పడిగాపులు కాస్తున్నారు. మరో వైపు హావేరి కేఎంఎఫ్ కార్యాలయ ఆవరణలో పేర్లు నమోదు చేసిన రైతులు ధార్వాడ, శికారిపురకు మొక్కజొన్న పంటను తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహన బాడుగలు చెల్లించి అక్కడికి తీసుకెళ్లిన రైతులకు వాటి విక్రయానికి వారాలు పట్టింది. దీంతో వాహనాలకు అద్దె, డ్రైవర్ల భత్యం తదితరాలతో రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చినా కూడా ఫలితం దక్కలేదు. పైగా మొక్కజొన్నకు తెగులు ఆశించింది. అలా కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లుగా ఖరీఫ్ ముగిసిన వెంటనే మొక్కజొన్న పంటను విక్రయించి ఉంటే తమకు ఈ పరిస్థితి దాపురించేది కాదని రాష్ట్రంలో అత్యధికంగా మొక్కజొన్నలు పండించే హావేరి జిల్లా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. -
జిల్లా ఎస్పీగా సుమన బాధ్యతల స్వీకారం
సాక్షి,బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద జరిగిన రగడ, కాల్పుల నేపథ్యంలో ఓ యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘర్షణను నివారించడంలో జిల్లా ఎస్పీ పవన్ నెజ్జూర్ నిర్లక్ష్యం వహించారనే కారణంలో ఆయన్ను ప్రభుత్వం ఏకంగా సస్పెండ్ చేయడంతో రాష్ట్రంలోని పోలీసు వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోను చర్చనీయాంశంగా మారింది. జనవరి 2వ తేదీ నుంచి బళ్లారి జిల్లాకు చిత్రదుర్గ జిల్లా ఎస్పీ రంజిత్కుమార్ బండారిని ఇన్ఛార్జిగా నియమించారు. వారం రోజులుగా రంజిత్కుమార్ జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణపై దృష్టి సారించారు. నూతన ఎస్పీగా నియమితులైన సుమన పన్నేకర్ గురువారం నగరంలోని ఎస్పీ కార్యాలయంలో రంజిత్ కుమార్ బండారి నుంచి బాధ్యతలు స్వీకరించడంతో ఆయన లాఠీని అందజేశారు. పోలీసు అధికారులతో కొత్త ఎస్పీ సమీక్ష అనంతరం ఆమె జిల్లాలోని పలువురు పోలీసు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో శాంతిభద్రతల పర్యవేక్షణపై చర్చించారు. నగరంలో గత వారం రోజుల నుంచి టెన్షన్ వాతావరణం ఉండటంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటానన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో రాజీ లేకుండా పని చేస్తానన్నారు. బ్యానర్ వివాదంలో ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, నారా భతర్రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ వివరాలను ఆమె సంబంధిత పోలీసు అధికారుల నుంచి తెలుసుకున్నారు. బళ్లారి డీఐజీగా పని చేసిన వర్తిక కటియార్ కూడా బదిలీ కావడంతో ఆమె స్థానంలో నియమితులైన డాక్టర్ ఎస్.పీ హర్షను కలుసుకుని చర్చించారు. డీఐజీ నేతృత్వంలో పలువురు పోలీసు అధికారులు కూడా గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద ఘర్షణ జరిగిన స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. మొదటి రోజునే విధినిర్వహణలో హడావుడి పవన్ నెజ్జూర్పై వేటు నేపథ్యంలో ముందు జాగ్రత్తలు -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
బళ్లారిఅర్బన్: బళ్లారి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గమ్మ గుడి అండర్ బ్రిడ్జిపై నడుచుకుంటూ పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన సుమారు 40 ఏళ్ల వయస్సుగల వ్యక్తిని రైలు ఢీకొనడంతో మరణించిన ఘటన గురువారం జరిగింది. వివరాలు.. ఉదయం బళ్లారి నుంచి గుంతకల్లు వైపునకు వెళుతున్న జోధ్పూర్– బెంగళూరు రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ నాగరాజ్, ఏఎస్ఐ శివమూర్తి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే రైలును అక్కడే నిలిపి వేశారు. రైలులో ఉన్న గార్డ్ పరిశీలించి మృతదేహాన్ని పట్టాల పైనుంచి పక్కకు మళ్లించారు. ఉదయం సుమారు 6.25 గంటల సమయంలో ఈ ఘటన జరగగా 7.30 గంటలకు మృతదేహాన్ని బీఎంసీఆర్సీ మార్చురీకి రైల్వే సిబ్బంది, పోలీసు బృందం అంబులెన్స్ సాయంతో తరలించారు. గంటకు పైగా మైసూరు, వారణాసి, చిక్కజాజూరుతో కలిపి మొత్తం మూడు రైళ్లను బళ్లారి స్టేషన్లోనే నిలిపి వేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడ్డారు. రెండు ట్రాక్ల మధ్యలో సేఫ్టీ ప్లాట్ఫాం వేసి ఉంటే ప్రాణాలతో బయట పడేవారని అక్కడి వాసులు తెలిపారు. ఈ ఘటనతో రైలు అక్కడే నిలిచిపోగా, బ్రిడ్జి కింద అండర్ గ్రౌండ్లో కూడా సుమారు గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. -
కర్మాగారాల కాలుష్యం అరికట్టండి
హొసపేటె: మరియమ్మనహళ్లి, హగరిబొమ్మనహళ్లి చుట్టు పక్కల ఉన్న కర్మాగారాల నుంచి వెలువడే దుమ్ముతో వేలాది ఎకరాల భూమి సాగుకు పనికి రాకుండా పోయిందని, జిల్లా యంత్రాంగం ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కర్ణాటక రైతు సంఘం, గ్రీన్ సేనె హుచ్చవనహళ్లి (మంజునాథ వర్గం) డిమాండ్ చేశాయి. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.పరశురామప్ప మాట్లాడుతూ మరియమ్మనహళ్లి సమీపంలోని బీఎంఎం, హగరిబొమ్మనహళ్లి సమీపంలోని ప్రగతి స్టీల్స్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే దుమ్ముతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. మరియమ్మనహళ్లి చుట్టు పక్కల ఉన్న హనుమనహళ్లి, వెంకటాపుర, వ్యాసనకెరెల వద్ద దాదాపు 980 ఎకరాల్లో పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా హగరిబొమ్మనహళ్లిలో కూడా ఇలాంటి సమస్య తలెత్తిందన్నారు. కర్మాగారాల నుంచి వెలువడే తీవ్రమైన దుమ్ము వేరుశెనగ, మొక్కజొన్న తదితర పంటలపై పేరుకు పోయి పంటలుదెబ్బ తింటున్నాయని తెలిపారు. దీంతో ఆ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. అయితే ఈ కర్మాగారాలు రైతుల గురించి అసలు పట్టించుకోనట్లు కనిపిస్తోందన్నారు. ఈ నష్టాన్ని పూడ్చడానికి ఎకరానికి రూ.2 వేల పరిహారం ఇవ్వాలి. విజయనగర జిల్లాలో సత్వరం చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించాలి. పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలి. లేకుంటే భారీ పోరాటం ప్రారంభిస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు బణకార్ బసవరాజ్, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, తాలూకా అధ్యక్షుడు షేకప్ప నాగప్ప, హెచ్.పరశురామ, సీ.నాగరాజ్ పాల్గొన్నారు. కాలుష్య కారక పరిశ్రమలు వద్దు రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో బల్డోటా, టాటా ఇస్పాత్ తదితర ప్రైవేట్ కంపెనీలు, నూతన పరిశ్రమల స్థాపనకు చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని కొప్పళ జిల్లా రైతులు డిమాండ్ చేశారు. గురువారం నగరసభ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళననుద్దేశించి ఆందోళనకారుడు బసవప్రభు బెట్టదూరు మాట్లాడారు. దక్షిణ కర్ణాటకలో నెలకొల్పాల్సిన పరిశ్రమలను రైతులు అడ్డుకోవడంతో ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం తగదన్నారు. ఆ పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే పర్యావరణ వాతావరణం నాశనం కావడమే కాకుండా చిన్న పిల్లలకు, మానవులకు అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని ఆరోపించారు. అలాంటి కాలుష్య కారక పరిశ్రమలను నెలకొల్పకుండా అడ్డుకోవాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. క్రీడా పోటీల్లో రాణించాలి రాయచూరు రూరల్: క్రీడా పోటీల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రాణించాలని ఏడీసీ శివానంద పేర్కొన్నారు. గురువారం మహాత్మా గాంధీ క్రీడాంగణంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా క్రీడా శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాయచూరు జిల్లా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణతో పాటు సామాజిక పరిజ్ఞానంతో క్రీడల్లో రాణించాలని కోరారు. కేవలం పేరుకు మాత్రమే క్రీడల్లో పాల్గొన్నామంటే సరిపోదన్నారు. జిల్లా ఉత్సవాలకు మెరుగులు దిద్దాలన్నారు. రాయచూరు జిల్లా నుంచి 21 మంది ప్రభుత్వ ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనడం ముదావహం అన్నారు. కృష్ణ, చంద్రశేఖర్రెడ్డి, శంకరగౌడ, వీరేష్ నాయక్ పాల్గొన్నారు. -
అయ్యప్ప మాలధారులకు అన్నదానం
రాయచూరు రూరల్: మకరజ్యోతి దర్శనానికి వెళుతున్న అయ్యప్ప మాలధారులకు మైనార్టీ సోదరులు అన్నదానం చేశారు. గురువారం లింగసూగూరులో ముిస్లిం–ఏ–అంజుమన్ కమిటీ అధ్యక్షుడు రఫీ ఆధ్వర్యంలో 40 మందికి అన్నదానం నిర్వహించారు. హిందూ ముస్లింలు సఖ్యత, ఐకమత్యంతో శాంతి సౌహార్ధతను కాపాడుతున్నామని రఫీ అన్నారు. విజయ్, అన్వర్బాయి, హుస్సేన్బాషా, ముస్తఫా, సలీం, ఆసిఫ్, ఇబ్రహీం, అరీఫ్, ఆది పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు ఓటు హక్కు రాయచూరు రూరల్: ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ఆయువు పట్టు వంటిదని జిల్లా ఎన్నికల అధికారి పీ.బసవరాజ్ పేర్కొన్నారు. గురువారం జెడ్పీ జలనిర్మల సభాంగణంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, తొలగింపులపై ఆయన బీఎల్ఓలు, తహసీల్దార్లకు పలు సూచనలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంత ఓటరు జాబితాల్లోని లోపాలను సవరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో నోడల్ అధికారి వస్త్రద్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ హనుమంతప్ప, అధికారులు సురేష్వర్మ, రమేష్, సోమశేఖర్ పాల్గొన్నారు. నిందితునిపై చర్యలు చేపట్టండి హుబ్లీ: ఇటీవల దళిత మహిళ రంజితను హత్య చేసిన నిందితుడు రఫీని, అతడి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలని విశ్వ హిందూ పరిషత్, భజరంగదళ్ డిమాండ్ చేశాయి. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రవికృష్ణ మాట్లాడారు. నేటి ఆధునిక సమాజంలో హిందూ యువతులకు రక్షణ కరువైందన్నారు. మైనార్టీ యువకులు ప్రేమ పేరుతో హిందూ యువతులను మోసం చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టి శిక్షలను విధించాలని కోరుతూ స్థానిక అధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. శ్రీనివాస్, రాకేష్, రాజేష్, శరణులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో జాప్యం తగదు రాయచూరు రూరల్: ఇటీవల కాలంలో జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై అధికమవుతున్న దాడుల నియంత్రణకు అధికారులు శ్రద్ధ చూపాలని జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల నియంత్రణపై జరిగిన సమావేశంలో అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో దళిత వార్డుల్లో అంటరానితనం వంటి అమానుషాలను అరికట్టాలన్నారు. మరో వైపు దాడులు జరిగినప్పుడు కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు చేపట్టాలని దళిత నేతలు రవీంద్రనాథ్ పట్టి, విశ్వనాథ్, శరణప్ప జిల్లాధికారిని డిమాండ్ చేశారు. భూగర్భ జలాల వృద్ధికి సహకరించాలి రాయచూరు రూరల్: భూగర్భ జలాల పెరుగుదలకు రైతులు సహకరించాలని స్వామి వివేకానంద యువజన సంఘం అధికారి రమేష్ పేర్కొన్నారు. గురువారం రాయచూరు తాలూకా యాపలదిన్ని మండలం రాళ్లదొడ్డిలో పురాతన బావి జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. వర్షాకాలంలో భూమిలో, చెరువులు, ఇంకుడు గుంతల్లో భూగర్భ జలాలను పెంచడానికి ఇలాంటి శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో అడుగంటి పోతున్న జలవనరులను భావి తరాలకు అందించాలన్నారు. కార్యక్రమంలో రామిరెడ్డి, పంపాపతి, శరణయ్య, వినోద్, ఈరణ్ణలున్నారు. -
మైలార జాతర విజయవంతం చేయండి
హొసపేటె: జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరగనున్న మైలార లింగేశ్వర స్వామి జాతర మహోత్సవంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగుండా అవసరమైన చర్యలు తీసుకొని జాతరను విజయవంతం చేయాలని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి అధికారులను ఆదేశించారు. విజయనగర జిల్లా హడగలి తాలూకాలోని మైలారలో జరిగే మైలారలింగేశ్వర స్వామి జాతర మహోత్సవ సన్నాహాక సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. జాతర సందర్భంగా లక్షలాది మంది ప్రజలు పాల్గొనే దృష్ట్యా నది ఒడ్డున మహిళలు దుస్తులు మార్చుకోవడానికి షామియానా టెంట్లు వేయాలన్నారు. ముందు జాగ్రత్తగా నది ఒడ్డున గజ ఈతగాళ్లను నియమించాలన్నారు. తాత్కాలికంగా మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య శాఖ నుంచి వివిధ ప్రదేశాల్లో వైద్యులు, సిబ్బందితో ఆరోగ్య శిబిరాలను తెరవాలన్నారు. అత్యవసర సేవలకు అంబులెన్స్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ బస్టాప్లలో తాగునీరు, మరుగుదొడ్లు, అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను అందించాలని ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీ కట్టడికి ఏర్పాట్లు ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి పోలీసులు శాఖ తగిన ఏర్పాట్లు చేయాలి. జాతర స్థలంలో నిరంతరం పరిశుభ్రతను కాపాడుకోవాలన్నారు. వివిధ ప్రాంతాల్లో చెత్తబుట్టలను ఉంచాలని ఈఓ వారిని ఆదేశించారు. టాయిలెట్లు ఉన్న ప్రదేశాల్లో ప్రజలకు తెలియజేయడానికి సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణనాయక్, జిల్లా ఎస్పీ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. -
నాగమోహన్దాస్ సిఫార్సులు అమలు చేయాలి
హొసపేటె: రాష్ట్రంలో అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మాదిగ, సమాగర, దోహార, దక్కలిగ ఉపకుల సంస్థల కూటమి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్త నిరసన నిర్వహించనున్నట్లు ఆయా ఉపకుల సంస్థల నాయకుడు బ్యాలహుణసి రామన్న తెలిపారు. నగరంలోని ప్రెస్హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్ధంగా అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడానికి సువర్ణావకాశం ఉన్నప్పటికీ, సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 101 కులాలకు సామాజికంగా న్యాయమైన అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. 2024 ఆగస్టు 1న సుప్రీం కోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని స్పష్టంగా పేర్కొంది. ఈ విషయంలో హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కేవలం 6 నెలల్లో ఎటువంటి గందరగోళం లేకుండా శాసీ్త్రయంగా అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడంలో విజయం సాధించాయన్నారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన గందరగోళాల కారణంగా 16 నెలల తర్వాత కూడా అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడంలో ఇబ్బంది పడుతోందని ఆయన అన్నారు. సమాజ ప్రముఖులు శేషు, రమేష్, పూజప్ప, శ్రీనివాస్, దుర్గేష్ పాల్గొన్నారు. -
ప్రేమ వేధింపులకు బలి
మైసూరు: ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఓ పోకిరీ నిరంతరం వేధించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నంజనగూడులో జరిగింది. దివ్య (17) పీయూసీ ఫస్టియర్ చదువుతోంది, పొరుగూరికి చెందిన ఆదిత్య అనే యువకుడు ప్రేమించాలని వేధించేవాడు. దివ్య తండ్రి గురుమూర్తి ఊరి పెద్దలకు అతని మీద ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఆదిత్య ప్రవర్తనను మార్చుకోకపోవడంతో దివ్య భయపడిపోయింది. విరక్తి చెందిన దివ్య ఇంట్లో ఉరి వేసుకుంది. ప్రేమోన్మాదిపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బళ్లారిపై సీబీఐ దర్యాప్తు వద్దు ● హోంమంత్రి పరమేశ్వర్ శివాజీనగర: బళ్లారి గొడవపై సీబీఐ తనిఖీ చేపట్టాలనే డిమాండ్లను హోం మంత్రి జీ.పరమేశ్వర్ తిరస్కరించారు. గురువారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ సీబీఐ దర్యాప్తు అవసరం లేదు, మన పోలీసులకే దర్యాప్తు సామర్థ్యం ఉంది, వారిచేత కాలేదంటే సీబీఐకి ఇవ్వవచ్చు. అయితే అటువంటి సందర్భం రాలేదు అని చెప్పారు. హుబ్లీ గొడవపై.. హుబ్లీలో పోలీసులు ఓ మహిళను అరెస్టు సమయంలో వివస్త్రను చేశారనే ఘటనపై పోలీస్ కమిషనర్ వివరణ ఇచ్చారని, అది చాలని తనకు అనిపిస్తోందని అన్నారు. అన్నిటిలోనూ రాజకీయం చేయడం సరికాదని బీజేపీని విమర్శించారు. ఆమే బట్టలు తీసేసుకుందని కమిషనర్ చెప్పాడన్నారు. రాష్ట్రంలోను, బెంగళూరులోను బంగ్లాదేశీయులు ఉంటే వారిని కనిపెట్టి దేశం దాటిస్తామని చెప్పారు. తనను రబ్బరుస్టాంపు హోంమంత్రి అన్న కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి మాటలను స్వీకరిస్తానని అన్నారు. బాధ్యత కలిగిన హోమ్ మంత్రిగా పని చేస్తున్నానని చెప్పారు. కేఆర్ మార్కెట్లో భూగర్భ పార్కింగ్ పనులు బనశంకరి: బెంగళూరు కేఆర్ మార్కెట్ కట్టడం బేస్మెంట్లో చేపడుతున్న పార్కింగ్ లాట్ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని పాలికె అదనపు కమిషనర్ దల్జీత్కుమార్ సూచించారు. గురువారం పనులను పరిశీలించారు. ఇక్కడకు నిత్యం వేలాదిమంది వ్యాపారులు, ప్రజలు వస్తుంటారని, వాహనాల పార్కింగ్కు వసతి లేదన్నారు. మార్కెట్ బేస్మెంట్లో నిర్మిస్తున్న పార్కింగ్ సౌకర్యం అందరికీ చాలా ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, వాననీరు వెళ్లిపోయేలా డ్రైనేజీ ఉంటుందన్నారు. కేఆర్ మార్కెట్ చుట్టుపక్కల స్వచ్ఛత మెరుగుపడిందన్నారు. వ్యాపారస్తులు, ప్రజల కోసం శుభ్రతతో కూడిన మార్కెట్గా మార్చాలని సూచించారు. బైక్ను ఎత్తుకెళ్లి దగ్ధం మైసూరు: మైసూరు జిల్లాలోని నంజనగూడులో మహదేశ్వర బ్లాక్లో సురేష్ అనే కార్మికుడు నెస్లే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంటి ముందు పల్సర్ బైక్ను పార్క్ చేశాడు, కానీ అది కనిపించలేదు. ఓ కాలువ పక్కన బైక్ కాలిపోయి ఉంది. పట్టణ పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు. గత వారం ఒక యువకుడు తన బైక్తో సహా సజీవ దహనమైన సంఘటనకు కొంతదూరంలోనే ఈ బైక్ కాలిపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎవరో దుండగులు బైక్ను అపహరించి కాల్చివేశారని అనుమానాలున్నాయి.గంజాయి మత్తులో.. చెయ్యి పోయింది దొడ్డబళ్లాపురం: గంజాయి మత్తులో రైలుకింద పడి చెయ్యి తెగిపడ్డా యువకుడు ఆస్పత్రికి వెళ్లకుండా రోడ్లమీద తిరిగిన సంఘటన దేవనహళ్లిలో వెలుగు చూసింది. దేవనహళ్లి పట్టణంలోని కుంబార వీధిలో బుధవారం అర్ధరాత్రి ఉత్తర భారతానికి చెందిన వలస కూలీ దిలీప్, గంజాయి మత్తులో సమీపంలోని రైలు పట్టాలపై చెయ్యి పెట్టి పడుకున్నాడు. రైలు ఎడమ చెయ్యి మీద నుంచి వెళ్లడంతో మోచేయి కిందవరకు తెగిపోయింది. గంజాయి మత్తులో నొప్పి తెలియని అతడు మొండి చేతితోనే వీధిలో నడుకుంటు వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసి బెంబేలెత్తిపోయిన స్థానికులు అతనిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా దూకి పరిగెత్తాడు. పోలీసులు వచ్చి గంటసేపు యత్నించి అతనిని పట్టుకుని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కూడా వైద్యం చేయించుకోకుండా యాగీ చేశాడు. చివరికి అతనికి కట్టుకట్టి చికిత్స చేశారు. -
ప్రాణం విలువ రూ.2 లక్షలే
● మాజీ మంత్రి రేవణ్ణ దాష్టీకం దొడ్డబళ్లాపురం: మాజీ మంత్రి హెచ్ఎం రేవణ్ణ కుమారుని కారు ఢీకొని ఓ యువకుడు చనిపోయాడు, పరిహారం కోరుతూ అతని కుటుంబీకులు ఆయన ఇంటికి రాగా చుక్కెదురైంది. రూ.2 లక్షలు ఇస్తానని, ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే వెళ్లిపోండి అని రేవణ్ణ మండిపడ్డారు. గతేడాది డిసెంబరు 1న బెంగళూరు దక్షిణ జిల్లా మాగడి తాలూకా గుడేమారనహళ్లి వద్ద కుమారుడు శశాంక్ కారు ఢీకొని బైకిస్టు రాజేశ్ మరణించాడు. కేసు వద్దని, పరిహారం ఇస్తానని కుటుంబాన్ని పిలిపించుకున్న రేవణ్ణ రూ.2 లక్షలకు బేరం పెట్టారు. కష్టాల్లో ఉన్నామని, చెట్టంత కొడుకును పోగొట్టుకున్నామని తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. నాకేం సంబంధం, నేను ఇంతే ఇస్తాను, ఇష్టం లేదంటే వెళ్లిపోండి అని దబాయించాడు. మృతుని తండ్రి గుడ్డేగౌడ, తల్లి రత్నమ్మ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి తీరుపై ఆవేదన చెందారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.క్యాబిన్లో మంటలు.. తండ్రీ కూతురు మృతి మాలూరు: క్యాబిన్ తరహా ఇంటిలో అగ్నిప్రమాదం జరిగి తండ్రీ కూతురు మరణించిన విషాద ఘటన తాలూకాలోని దొమ్మలూరు గ్రామంలో జరిగింది. పంబన్ (44), కుమార్తె యామిని (2) మృతురాలు, వివరాలు.. దొమ్మలూరులోని ఆదిశేష లేఔట్లో తమిళనాడులోని ఉతరకెరె గ్రామానికి చెందిన పంబన్ కరెంటు పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. లేఔట్లోని ఓ క్యాబిన్లో నివసిస్తున్నారు. అయితే బుధవారం రాత్రి విద్యుత్ షార్టు సర్క్యూట్ లేదా మరేం కారణమో కానీ క్యాబిన్లో మంటలు వ్యాపించాయి. ముగ్గురికీ తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయి. బెంగుళూరులోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా తండ్రీ కూతురు చనిపోయారు. మాలూరు పోలీసులు లేఔట్ బిల్డర్లు రమేష్, ప్రదీప్ అనే వారిపై కేసు నమోదు చేశారు. రమేష్ను అరెస్టు చేయగా ప్రదీప్ పరారయ్యాడు. మెట్రో వంతెన కోసం 6 వేలకు పైగా చెట్ల కట్ !శివాజీనగర: మెట్రో రైలు నిర్మాణ పనుల వల్ల భారీసంఖ్యలో చెట్లను కొట్టేయాల్సి వస్తోంది. మెట్రో మూడో దశ పనులకు 6,868 చెట్లను కట్ చేయాలని పాలికె, మెట్రో అధికారులు నిర్ణయించారు. దీనిమీద నగర పర్యావరణ అభిమానులు మండిపడుతున్నారు. సుమారు 37.12 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ మెట్రో రైలు వంతెన పనులు ఈ జూన్లో ఆరంభమవుతాయి. మైసూరు రోడ్డు నుంచి జేపీ నగర వరకు వంతెన కట్టే మార్గంలో 1,092 చెట్లను తొలగించాలని నిర్ధారించారు. ఇప్పటికే బెంగళూరులోనూ ఢిల్లీ స్థాయిలో వాయు కాలుష్యం ఏర్పడుతోంది. ఈ సమస్య మరింత అధికమయ్యే అవకాశముంది. -
ఎంతో సున్నితమైన హృదయానికి ఇబ్బంది వచ్చింది. భారత సిలికాన్ రాజధానిలో గుండెజబ్బు మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నిన్నటివరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి హార్ట్ ఫెయిల్ అని ఆస్పత్రి పాలు కావడమో, మరణించడమో జరుగుతోంది. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు దుఃఖసాగరంలో మ
కారణాలపై నెలకొన్న సందిగ్ధంశివాజీనగర: బెంగళూరు నగరంలో కోవిడ్ మహమ్మారి తరువాత గుండెపోటుతో మరణాలు అధికమయ్యాయి. నగర పోలీసు విభాగం ఈ మేరకు గుండె ఝల్లుమనే సమాచారాన్ని పొందుపర్చింది. ఆ గణాంకాల ప్రకారం 2022 నుంచి బెంగళూరులో ఏటా సరాసరి 3000 హఠాన్మరణాలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రబలిన తరువాత అనేకమందికి ఈ సమస్య తలెత్తింది. దీనిమీద అనేక భిన్న ప్రచారాలు జరగడం తెలిసిందే. కోవిడ్ వైరస్ సోకిన తరువాత గుండె బలహీన పడుతుందని, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో చాలామందికి హృదయ సమస్యలు వస్తున్నాయని ప్రచారాలు వ్యాప్తిలోకి వచ్చాయి. కొన్ని వైద్య సంస్థలు కోవిడ్ టీకాతో ఇబ్బంది లేదని ప్రకటించాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగినట్లు తేటతెల్లమైంది. అధికమైన ఆకస్మిక మరణాల ముప్పు ఏటా 3000 మంది మరణం కరోనా తరువాత విపరిణామాలు ప్రతి సంఘటన నమోదు.. గుండెపోటు మరణాలు కలకలం రేకెత్తించడంతో రాష్ట్ర ప్రభుత్వం హఠాన్మరణాలను నమోదు చేయాలని, పోస్టుమార్టం కూడా జరిపి కారణాలను నిర్ధారించాలని గతేడాది ఆదేశించింది. ఇళ్లలోను, బయట ఆకస్మిక మరణం సంభవిస్తే దానిని పోలీసులు, వైద్యులు నమోదు చేయాలని తెలిపింది. ఆరోగ్యంగా ఉన్నవారు, 15 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలతో పాటుగా అందరూ సంవత్సరానికి ఓసారైనా గుండె, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో 86 వైద్యాలయాల్లో ఉన్న పునీత్ రాజ్కుమార్ హృదయ జ్యోతి పథకాన్ని తాలూకా స్థాయి ఆసుపత్రులకు విస్తరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆకస్మిక గుండెపోటు బాధితులకు తక్షణ చికిత్స అందించడమే ఈ పథకం ఉద్దేశం. ఇతరత్రా కారణాలు ఉన్నాయి: నిపుణులు ఆకస్మిక గుండెపోటు మరణాలకు అనేక అంశాలు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలలో అడ్డంకులు, శ్వాసకోశాల్లో రక్తం గడ్డ కట్టడం, అనియంత్రిత ఆస్తమా సమస్య, తీవ్రమైన అలర్జీలు, మితిమీరి మద్యం, పొగాకు సేవనం, జన్యు పరమైన ఇబ్బందులు వల్ల కూడా గుండెకు ఇబ్బంది కలిగి హఠాత్ మరణాలు సంభవించవచ్చని తెలిపారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని జాగృతి ర్యాలీలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు తదితరాలను ఆరోగ్య శాఖ ఏర్పాటు చేస్తోంది. మితాహారం తీసుకుంటూ రోజూ వ్యాయామం చేయాలని, అధిక చక్కెర, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు తెలిపారు. -
రక్షకభటులే విరక్తి చెందితే..
మండ్య: రాష్ట్రంలో మండ్య, శివమొగ్గలో ఇద్దరు పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. మండ్య జిల్లాలో మద్దూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసే టి. రమేష్ (35) బుధవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కబళ్లాపురంలోని దబలగెరె గ్రామానికి చెందిన రమేష్కు భార్య పుష్పలత, ఏడాదిన్నర కూతురు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం మద్దూరు స్టేషన్కు బదిలీ అయ్యాడు, కోర్టు వారెంట్లు, సమన్లను రవాణా చేసే పనిలో ఉన్నాడు. ఇంటికి వచ్చి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన రమేష్ ఒక గదిలో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కుటుంబ వివాదాలే కారణమని అనుమానాలున్నాయి. పోస్టుమార్టం తరువాత మృతదేహాన్ని స్టేషన్కు తీసుకువచ్చి, సిబ్బంది, ప్రజల సందర్శనార్థం ఉంచారు. తరువాత స్వగ్రామానికి తరలించి కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు జరిపారు. ఠాణాలోనే హెడ్ కానిస్టేబుల్.. శివమొగ్గ: నగరంలోని వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు జకారియా (53), ఆర్ఎంఎల్ నగర నివాసి. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్న జకారియా తన సహోద్యోగిని విశ్రాంతి తీసుకోమని కోరాడు. సరేనని సహోద్యోగి నిద్రపోయాడు, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మెలకువ వచ్చి చూడగా జకారియా ఉరికి వేలాడుతున్నాడు. ఓ కానిస్టేబుల్తో విభేదాల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు జకారియా డెత్నోట్ రాసి ఉంచాడు. పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు పోలీసుల బలవన్మరణాలు ఆ శాఖలో కలకలం సృష్టించాయి. కానిస్టేబుల్ రమేష్ హెడ్ కానిస్టేబుల్ జకారియా రాష్ట్రంలో ఇద్దరు పోలీసుల ఆత్మహత్య -
ఆర్టీసీ బస్సు– లారీ ఢీ
మైసూరు: చామరాజనగర తాలూకాలోని నంజనగూడు రోడ్డులో బెండరవడి గ్రామం సమీపంలో కేఎస్ ఆర్టీసీ (అశ్వమేధ) బస్సు, లారీ ఢీకొన్నాయి, రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. బస్సు, లారీ క్యాబిన్లను గ్యాస్ కట్టర్ తో కత్తిరించి డ్రైవర్లను బయటకు తీసుకువచ్చారు. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని, గ్రామస్తుల సహకారంతో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బయటకు తీసేటప్పటికి బస్సు డ్రైవర్ మృతి చెందగా, లారీ డ్రైవర్తో సహా మొత్తం 18 మంది గాయపడ్డారు. బస్సు డ్రైవర్, కో–ఆపరేటివ్ మంజు (38), చామరాజనగర తాలూకాలోని ఇరసావడి గ్రామవాసి, లారీ డ్రైవర్ గోవిందస్వామి (45) కూడా ఇదే తాలూకావాసే కాగా తీవ్ర గాయాలయ్యాయి. శివకుమార్, గీత దంపతులు సహా నలుగురు తీవ్ర గాయాలతో మైసూరులోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఐదుగురు సిమ్స్లో చికిత్స పొంది వెళ్లిపోయారు. చెట్టును బస్సు ఢీ.. 20 మంది ఆస్పత్రిపాలుయశవంతపుర: కేఎస్ ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా హళియాళ తాలూకా బానసగేరి వద్ద జరిగింది. 8 మంది కాలేజీ విద్యార్థులు, ఇద్దరు మొరార్జీ వసతి స్కూలు విద్యార్థులు, ఇద్దరు మహిళలతో పాటు కండక్టర్ గాయపడ్డారు. ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి రోడ్డు పక్కలోని చెట్టును బస్సు ఢీకొంది. స్థానికులు వచ్చి బాధితులను కాపాడారు. ఇద్దరు విద్యార్థులను.. ● కలబుర్గి జిల్లా జీవర్గి వద్ద సైకిల్పై స్కూల్కు వెళుతున్న దవలసాబ్ (15) అనే 9వ తరగతి విద్యార్థిని కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో చేయి, నడుములకు తీవ్ర గాయాలై విషమ పరిస్థితిలో ఉన్నాడు. జీవర్గి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ● హావేరి తాలూకా కోణనతంబిగికి చెందిన పీయూసీ విద్యార్థి రోహిత్ కెసరళ్లి కాలేజీలో పరీక్ష రాయడానికి నడిచి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొంది. అతనికి తీవ్ర గాయాలు తగిలాయి. హావేరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. డ్రైవర్ మృతి, 18 మందికి గాయాలు చామరాజనగర వద్ద ప్రమాదం రాష్ట్రంలో పలుచోట్ల బస్సు యాక్సిడెంట్లు -
చీటీల పేరుతో రూ.100 కోట్లు ఉఫ్?
● పరారీలో ఫైనాన్స్ వ్యాపారి ● బళ్లారి నగరంలో భారీ వంచన ● బాధితులు లబోదిబో సాక్షి, బళ్లారి: చీటీలంటే చీటింగ్గా మారిపోయింది. కొన్నాళ్లపాటు జనం నమ్మకం సంపాదించాక పెద్దమొత్తంలో ఉడాయిస్తుంటారు. బళ్లారి నగరంలో అలాంటి భారీ స్కాం బయటపడింది. వివరాలు.. నగరంలోని దేవీనగర్కు చెందిన వెంకటేశ్ అనే ఫైనాన్స్ వ్యాపారి చీటీలు నిర్వహించేవాడు. ఇలా దాదాపు 800 మంది నుంచి చీటీలు వేశారు. కట్టిన సొమ్ముకు రెట్టింపు నగదు ఇస్తానని నమ్మబలికేవాడు. దీంతో చాలామంది సంపాదించుకున్న డబ్బుతో పాటు అప్పులు చేసి అతనికి చెల్లించారు. ఈ మొత్తం సుమారు రూ.100 కోట్ల దాకా ఉంటుందని బాధిత ప్రజలు చెబుతున్నారు. పత్తా నై.. గత రెండు మూడు రోజులుగా వెంకటేశ్ జాడ లేకపోవడంతో గురువారం మధ్యాహ్నం లబోదిబోమన్నారు. బ్రూస్పేట పోలీసు స్టేషన్ ముందు చేరి నిరసన తెలిపారు. కొందరు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ ధరకే బంగారమంటూ ఇటీవలే ఓ వ్యాపారి జనం నుంచి రూ.50 కోట్ల దాకా వసూలు చేసి ఐపీ పెట్టడం తెలిసిందే. -
అనధికార లేఔట్ల స్థలాలకు ఏ ఖాతా
బనశంకరి: ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో గురువారం విధానసౌధలో మంత్రిమండలి సమావేశం జరిగింది, ఇందులో పలు ముఖ్య నిర్ణయాలను తీసుకున్నారు. తుమకూరు, రాయచూరులో కాంగ్రెస్ ఆఫీసులకు స్థలం మంజూరు చేశారు. నగర, స్థానిక సంస్థల పరిధిలో సక్రమ ప్రాధికార ఆమోదం పొందకుండా ఏర్పాటు చేసిన అనధికార లేఔట్లలో బీ–ఖాతా స్థలాలు, కట్టడాలు, అపార్టుమెంట్లు, ప్లాట్లకు ఏ–ఖాతా అందించాలని తీర్మానించారు. దీనివల్ల స్థల యజమానులకు ఊరట కలుగుతుంది. కొన్ని ముఖ్య నిర్ణయాలు ● కేఎస్డీఎల్ బెంగళూరు కాంప్లెక్స్ కోసం రూ.17.70 కోట్లతో ఆధునిక సబ్బుల తయారీ యంత్రం కొనుగోలు ● కోలారు వ్యవసాయ మార్కెట్లో రూ.24.96 కోట్ల వ్యయంతో బయో సీఎన్జీ కేంద్రం ఏర్పాటు ● కలబుర్గిలో రూ.50 కోట్ల వ్యయంతో మెగా డైరీ నిర్మాణం ● రూ.127 కోట్లతో పీఎం–అబిమ్ పథకం కింద రాష్ట్రంలో 196 రూరల్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు ● రూ.40 కోట్లతో చిక్కబళ్లాపుర నంది మెడికల్ కాలేజీకి పరికరాల కొనుగోలు ● కలబుర్గి మహానగర పాలికె పరిధిలో మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్గాంధీల విగ్రహాల ఏర్పాటుకు ఆమోదం ● రూ.11.03 కోట్లతో ఉత్తర కన్నడ జిల్లా కుమటా తాలూకా దుబ్బనశశి, గంగెకొళ్ల తీరంలో సముద్రకోత నియంత్రణ పనులు ● సత్ప్రవర్తన ఆధారంగా 33 మంది ఖైదీల విడుదలకు ఓకే. అలాగే పలు జిల్లాల్లో నూతన భవనాలు, అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. బీ ఖాతా నుంచి మార్చుకోవచ్చు కేబినెట్ భేటీలో నిర్ణయం -
కుమారా.. నీ పాఠాలొద్దు
శివాజీనగర: మంత్రిగా నాకు కుమారస్వామి కంటే అధిక అనుభవముంది. ఎవరితో సమావేశం జరపాలి అనేది నాకు బాగా తెలుసు. ఆయన నుంచి పాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ అన్నారు. గురువారం కేపీసీసీ కార్యాలయంలో కొందరు జేడీఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా డీకే మాట్లాడుతూ బళ్లారిలో తాను ఏ అధికారంలో పోలీసు అధికారులతో సమావేశం జరిపానని కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రశ్నించడాన్ని ప్రస్తావించారు. జేడీఎస్కు ఒక సిద్ధాంతం, తత్వం ఏదీది లేదు. అది త్వరలోనే బీజేపీలో విలీనం కావచ్చని అన్నారు. రాష్ట్రంలో లెక్కకు మూడు పార్టీలు. ఆడేందుకు రెండు పార్టీలు అన్నట్లు అయిందని ఎద్దేవా చేశారు. ఇది ఎన్నికల సంవత్సరమని, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని తెలిపారు. బెంగళూరు పాలికె ఎన్నికలు వస్తున్నాయన్నారు. అసోం పరిశీలకునిగా.. ఈ సందర్భంగా కాబోయే సీఎం డీ.కే.శివకుమార్ అని కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ డీకేను అసోం ఎన్నికలకు సీనియర్ పరిశీలనకునిగా నియమించింది. ఇది సీఎం కుర్చీ మార్పిడి గొడవకు హైకమాండ్ ఇచ్చే విరామమని అందరూ భావిస్తున్నారు. త్వరలో బీజేపీలో జేడీఎస్ విలీనం డీసీఎం శివకుమార్ -
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారా?
తెల్లవారు జామున లేవగానే.. రోడ్డుపై అడుగుపెట్టే వాహనదారులు.. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడెక్కడ ఉన్నారా? ఫోటోలు తీస్తున్నారా? చలానాలు వస్తాయెమోనన్న భయంతో బిక్కు బిక్కు మంటూ వెళ్లడం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. ఇక ముందు ట్రాఫిక్ పోలీసులున్నా.. లేకపోయినా... మనం మాత్రం ట్రాఫిక్ పోలీసుల కనుసైగల్లోనే ఉంటాం. నిబంధనలు ఉల్లంఘించగానే ఆ సమాచారం నేరుగా ట్రాఫిక్ కంట్రల్ రూం చేరి.. తద్వారా వాహనదారులకు జరిమానా చేరుతుంది. ఇదేం కొత్త టెక్నాలజీ అని ఆశ్చర్యపోతున్నారా.... అయితే జాగ్రత్తగా ఈ వీడియోను చూడండి..బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. నగరంలోని ట్రాఫిక్ సమస్యలను గమనించాడు. నిబంధనలు పాటించని వాహనదారుల కారణంగానే సమస్యలు పెరుగుతున్నాయని గుర్తించాడు. ట్రాఫిక్ పోలీసులున్నా.. వారిని గుర్తించి పట్టుకోలేరనే ధీమాతో వాహనదారులు ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తున్నారని గుర్తించి అలాంటి వాహనదారులను చెక్ పెడితే.. ట్రాఫిక్ సమస్యలను కొంత వరకు నివారించవచ్చని ఊహించాడు. సాధారణంగా వాహనదారులు తమకు కేటాయించిన దార్లలో కాకుండా.. రాంగ్సైడ్ వెళ్లడం.. అతివేగంగా వెళ్లడంతోనే ప్రమాదాలు జరగడం.. ఫలితంగా ట్రాఫిక్ అంతరాయాలు ఉంటాయని.. ఆ సమస్య నివారణ కోసం ఫోకస్ చేశాడు.రోడ్డుపై పోలీసులు ఉన్నా లేకున్నా.. వాహనదారుడు మాత్రం క్రమశిక్షణ పాటించాల్సిందేనని.. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిని గుర్తించడానికి ఓ హెల్మెట్ను సృష్టించాడు. ఏఐ టెక్నాలజీతో కెమెరాతో అనుసంధానించిన ఆ హెల్మెట్ పెట్టుకుని వాహనదారుడు వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలపై ఆ హెల్మెట్ దృష్టి సారిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాన్ని గుర్తించి వాటి ఫోటోలు తీసి ఏకంగా ట్రాఫిక్ అధికారులకు పంపించేలా ఏర్పాట్లు చేశాడు. ఆధారాలతో పోలీసులు తదుపరి చర్యలు చేపడతారు. కొత్త సాంకేతికతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా కృషి చేసిన బెంగళూరు నగర యువకుడు పంకజ్ తన్వర్ను బెంగళూరు పోలీసు కమిషనర్ అభినందించారు.i was tired of stupid people on road so i hacked my helmet into a traffic police device 🚨while i ride, ai agent runs in near real time, flags violations, and proof with location & no plate goes straight to police. blr people - so now ride safe… or regret it. pic.twitter.com/lWaRO01Jaq— Pankaj (@the2ndfloorguy) January 3, 2026ఈ హెల్మెట్ ఎలా పనిచేస్తుందంటే.. హెల్మెట్లో ఉన్న కెమెరాలో చిప్తో పాటు సిమ్ అమర్చి ఉంటుంది. తీసిన ఫోటోలు ఆటోమెటిక్గా పోలీసులకు అందుతాయి. అందులోని సాఫ్ట్వేర్ ఆధారంగా పోలీస్ కంట్రోల్ రూంకు మెయిల్ ద్వారా పంపించే ఏర్పాట్లు ఉన్నాయి. లభించిన ఆధారాలతో పోలీసులు వాహనదారుల్ని గుర్తించి చలానాలు విధించడం లేదా కోర్టులో హాజరు పరుస్తారు. ఇలాంటి కఠినచర్యలు తీసుకోవడంతో పాటు కనిపించని కెమెరాతో ఫోటోలు వస్తాయని వాహనదారులకు తెలిస్తే రోడ్డు నిబంధనలు పాటించే అవకాశముంది. -
మగవాళ్ల మూడ్.. నటి వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం
వీధికుక్కల కేసు విచారణలో.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తున్నది తెలిసిందే. అయితే కోర్టు వ్యాఖ్యల ఆధారంగా ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య(దివ్య స్పందన) చేసిన ఓ పోస్ట్పై నెటిజన్స్ భగ్గుమంటున్నారు. కుక్కలను.. మగవాళ్లకు ముడిపెట్టి ఆ పోస్ట్ ఉండడమే అందుకు కారణం. వీధి కుక్కల అంశంపై మరోసారి విచారణ జరుపుతున్న సర్వోన్నత న్యాయస్థానం.. వీధి కుక్కలను(Dogs) వాటి ప్రవర్తన ఆధారంగా వర్గీకరించడం సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ‘‘ఫలానా కుక్క కాటేస్తుంది.. ఫలానాది కాటేయదు అని వీధుల్లో తిరిగే కుక్కలను చూసి ముందుగా తెలుసుకోవడం సాధ్యం కాదు. వీధి కుక్కల మూడ్ ను ఎవరు అర్థం చేసుకోలేరు’’ అంటూ బుధవారం విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై రమ్య తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ‘మరి మగవాళ్ల మైండ్ను కూడా చదవలేం. వాళ్ళు ఎప్పుడు లైంగికదాడి చేస్తారో.. ఎప్పుడు హత్య చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్లందరినీ జైలులో పెట్టాలా?’ అని ఇన్స్టాలో ఓ పోస్టు చేశారు. దీంతో కుక్కలతో పోలుస్తావా? అంటూ కొందరు పురుషులు నటి రమ్యపై భగ్గుమంటున్నారు. ఆమె క్షమాపణలు చెప్పేదాకా ఊరుకునేది లేదని.. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. కన్నడ నటి రమ్య అలియాస్ దివ్య స్పందనకు శాండల్వుడ్ క్వీన్గా పేరుంది. ఆమె తెలుగు, తమిళ్ భాషల్లోనూ నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరారు. కాంగ్రెస్ తరఫున 2013 మాండ్య లోక్సభ ఉప ఎన్నికల్లో నెగ్గి ఎంపీ అయ్యారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. యువతలో ఆమెకు ఉన్న క్రేజ్ గుర్తించి.. రాహుల్ గాంధీ ఆమెకు సోషల్ మీడియా వింగ్ను అప్పగించారు. ఈ క్రమంలోనే తరచూ పలు అంశాలపై స్పందిస్తూ వస్తున్నారు. కన్నడనాట సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో స్టార్ నటుడు దర్శన్ నిందితుడిగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కన్నడ సినీ పరిశ్రమ మౌనంగా ఉండిపోయింది. అయితే.. ఎంతటి వారైనా చేసినదానికి ఫలితం అనుభవించాల్సిందే అంటూ రమ్య స్పందించడంతో దర్శన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆమెను రేప్ చేస్తామని, చంపుతామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. -
గదిలో బంధించి.. యువతిపై 12 మంది అత్యాచారం!
బెంగుళూరు: మంగళూరులో అమానుష ఘటన జరిగింది. యువతి తండ్రి అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న కామాంధులు బాధితురాలిని లోబర్చుకొని కామవంఛతీర్చుకున్నారు. రెండు రోజులు నరకం అనుభవించిన యువతి కామాంధుల బారి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. చిక్కమగళూరు జిల్లా బీరూరు గ్రామానికి చెందిన తల్లిలేని బిడ్డ తన బంధువుల ఇంటిలో ఉంటూ పీయూసీ వరకు చదివింది. అనంతరం తండ్రి వద్దకు వచ్చింది. గతనెలలో తన అవ్వ ఇంటికి వెళ్లి రెండు రోజులు అక్కడే ఉంది. మంగళూరుకు చెందిన భరత్శెట్టి అనే వ్యక్తి యువతి తండ్రి వద్దకు వెళ్లి స్నేహంగా ఉండేవాడు. మంగళూరులో తమకు ఇల్లు ఉందని, మీరిద్దరూ వస్తే ఆశ్రయం కల్పిస్తామని చెప్పడంతో యువతి, ఆమెతండ్రి, యువతి అవ్వ కలిసి భరత్శెట్టి వెంట వెళ్లారు. అక్కడ భరత్శెట్టి ఆ యువతి తండ్రిని మభ్య పెట్టి డబ్బు ఇచ్చాడు. అనంతరం యువతిని ఒక ఇంటిలో ఉంచి కొంతమంది విటులను పంపించాడు. రెండు రోజులపాటు కామాంధులు ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తనను వదిలేయాలని యువతి వేడుకున్నా కనికరించలేదు. భరత్శెట్టికి డబ్బులు ఇచ్చామని చెప్పి లైంగికదాడికి పాల్పడ్డారు. ఎట్టకేలకు యువతి తప్పించుకొని వచ్చి దక్షిణకన్నడ జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళూరుకు వెళ్లి భరత్శెట్టితోపాటు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. యువతి తండ్రి, అవ్వపై కూడా కేసు నమోదు చేశారు. -
యువతి తల్లికి ప్రేమోన్మాది నిప్పు..
కర్ణాటక: ఓ మహిళ ఆమె కూతురితో పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమోన్మాది పెట్రోలు చల్లి నిప్పంటించడంతో మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి కన్నుమూసింది. బాధితురాలు గీత (42) విక్టోరియా ఆసుపత్రిలో గత 20 రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతూ మంగళవారం రాత్రి చనిపోయింది. వివరాలు.. గీతా బసవేశ్వరనగర బోవికాలనీలో కిరాణా షాపును నడుపుతోంది. అక్కడే ప్రేమోన్మాది ముత్తు టీస్టాల్ పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంతో గీత కుమార్తె (19)ను ముత్తు ప్రేమించాడు. ఆమెతో తనకు వివాహం చేయాలని గీతను కోరేవాడు, ఇందుకు ఆమె నిరాకరించేది. కోపోద్రిక్తుడైన అతడు.. గీత ఇంట్లో ఉండగా పెట్రోలు చల్లి నిప్పు అంటించి ఉడాయించాడు. తీవ్రంగా గాయపడిన గీత ఆస్పత్రిలో మరణించింది. స్థానిక పోలీసులు దుండగున్ని అరెస్ట్ చేశారు. -
శాంతి భద్రతల రక్షణే ధ్యేయం
రాయచూరు రూరల్: నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని ఎస్పీ అరుణాంగ్షు గిరి పేర్కొన్నారు. బుధవారం నగరంలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ను సందర్శించి అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, ఈఆర్ఎస్ 112, 1930 సహాయవాణి ద్వారా ప్రజలు సహకరించాలన్నారు. నగరంలో రాత్రి వేళ పోకిరీల ఆగడాలు అధికం అయ్యాయని, వాటిని అరికట్టాలన్నారు. షేస్బుక్, వాట్సప్, ట్విటర్, ఇన్స్టా వంటి వాటిని వినియోగించే ముందు ఆలోచించుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ కాంబ్లే, సాబయ్య, లక్ష్మిలున్నారు. పాఠశాలల మూసివేత నిరసిస్తూ ఆందోళన రాయచూరు రూరల్ : రాష్ట్రంలోని కన్నడ ప్రభుత్వ పాఠశాలను బంద్ చేసి కర్ణాటక పబ్లిక్ పాఠశాలలోకి విలీనం చేయడానికి సర్కార్ ముందుకొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయబోమనే ఆదేశాలను జారీ చేయాలని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. బుధవారం రాయచూరు తాలూకా దేవసూగురు ప్రాథమిక పాఠశాల వద్ద చేపట్టిన ఆందోళన సంచాలకులు అయ్యప్ప,చెన్నబసవ మాట్లాడారు. ప్రాథమిక పాఠశాల విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప రాష్ట్రంలో కన్నడ భాష ప్రాథమిక పాఠశాలను మూసేయడం లేదని చెప్పిన సమాధానానికి లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పిల్లల అపహరణలు అరికట్టాలి రాయచూరు రూరల్: జిల్లాలో పిల్లల కిడ్నాప్ నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని రాయచూరు జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి హన్మంతు అనంతరావ్ సాత్విక్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ఎస్పీ కార్యాలయంలో న్యాయ సేవా ప్రాధికార, మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల రక్షణ శాఖాధికారుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అధికారులకు సలహా సూచనలు ఇచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అధిక భాగం పిల్లలు, మహిళలు, యువతులు అధికంగా కిడ్నాప్, విక్రయాలు చోటు చేసుకుంటున్న కేసులు అధికంగా నమోదైందని, అలాంటి వాటిపై నిఘా ఉంచాలని సూచించారు. ఎస్పీ అరుణాంగ్షు గిరి, ఏఎస్పీ కుమారస్వామి, డీఎస్పీ శాంతవీర, ఇతర పోలీస్ అధికారులున్నారు. -
కంది ధరలు తగ్గుముఖం.. ఆందోళనలో రైతాంగం
రాయచూరు రూరల్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మార్కెట్లో ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, కలబుర్గి, యాదగిరి, కొప్పళ వంటి జిల్లాలోల రైతులు పండించిన కంది పంటకు మార్కెట్లో ధర పూర్తిగా పడిపోయింది. కళ్యాణ కర్ణాటకలో 10 లక్షల టన్నుల కందులు కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కలబుర్గి, రాయచూరు ఏపీఎంసీల్లో నెలరోజుల్లో ధర క్వింటాల్కు రూ.వెయ్యి తగ్గింది. ప్రస్తుతం క్వింటాల్కు రూ.8,169 ధర ప్రకటించారు. జనవరి 1 నుంచి 4వ తేదీ వరకు 28,967 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. గతంలో 75,185 క్వింటాళ్లను కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో వైపు కంది పంటకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతులు జిల్లాధికారి కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ -
ధర వెలవెల.. రైతన్న విలవిల
బళ్లారి రూరల్ : ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటుధర లభించకపోతే ఆ రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కరలేదు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. రాష్ట్రప్రభుత్వం క్వింటాల్ మొక్కజొన్న పంటకు రూ.2400 ధర నిర్ణయించగా ఏపీఎంసీ మార్కెట్లో మాత్రం రైతుల నుంచి ఈ ధర ప్రకారం పంటను కొనుగోలు చేయడం లేదు. బాగా ఎండబెట్టిన మొక్కజొన్నకు రూ.1800 నుంచి రూ.1900 వరకు మాత్రమే ధర లభిస్తోంది. అంతకంటే నాణ్యత తగ్గితే పంటను రూ.1100లకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కౌలు రైతులకు పంటపై పెట్టుబడి, రసాయనాలు, గింజలు వేరు చేసే మిషన్ ఖర్చులు పోను ఏమాత్రం మిగలడం లేదని రైతులు అంటున్నారు. ఎకరం మొక్కజొన్న పంటకు రూ.35 వేలకు పైగా పెట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ సారి మిర్చి పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ప్రస్తుతం మొదటి రకం క్వింటాల్ మిర్చి పంటకు ధర రూ.14 వేలు లభిస్తోంది. రెండవ రకం రూ.11 వేలు, తెలుపు ఎరుపు కలిగిన మిర్చికి రూ.7 వేలు ధర లభిస్తున్నట్లు కొళగల్లు రైతు గంజి సురేశ్రెడ్డి తెలిపారు. గిట్టుబాటు ధర లభించడానికి రైతులు పంట పొలాల్లోని కల్లాల్లోనే మొక్కజొన్న, మిర్చి పంటలను కొన్ని రోజులు ఎండబెడుతున్నారు. మొక్కజొన్న, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఏదీ? కౌలు రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా దక్కని వైనం -
ఇంటింటికీ డీఈఓ మేడం
కోలారు: జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) అంటే తీరికలేనంత బిజీగా ఉంటారు, వారు విద్యార్థులకు ఇళ్లకు వెళ్తారా? అని అనుకుంటారు. కానీ కోలారు జిల్లా డీఈఓ అల్మాస్ పర్వీజ్ తాజ్ చొరవను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తరచుగా పాఠశాలకు గైర్హాజరు అవుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆమె ఎందుకు రావడం లేదని ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులు పాఠశాలలకు వచ్చి చదువుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. బుధవారం ఆమె కోలారు నగరంలో పలువురు విద్యార్థుల ఇళ్లకు వెళ్లారు. క్రమం తప్పకుండా బడికి రావాలని తెలిపారు. బాగా చదువుకుంటున్నారా? అని తల్లిదండ్రులను అడిగారు. విద్యార్థుల ముందు కూర్చుని వారు పరీక్షలకు ఏ విధంగా చదువుకుంటున్నారో పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ఇంట్లో సక్రమంగా చదువుతున్నారా, లేదో తెలుసుకోవడానికి ఇంటికి వెళ్లి పరిశీలన చేయడమే మంచి మార్గమని అన్నారు. టెన్త్లో ఎక్కువ ఉత్తీర్ణత సాధనకు శ్రమిస్తున్నట్లు చెప్పారు. పరీక్షలకు ఇంక 72 రోజులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. శిక్షణాధికారి వీణా, డివైపిసి రాజేశ్వరి తదితరులు ఉన్నారు.కలబుర్గి సెంట్రల్ జైలులో గ్యాంగ్వార్దొడ్డబళ్లాపురం: కలబుర్గిలోని సెంట్రల్ జైలు తరచూ వార్తల్లోకి వస్తోంది. తాజాగా ఖైదీలు కొట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన వెంకటరమణ అనే ఖైదీ, స్థానిక ఖైదీకి మధ్య మొదలైన వాగ్వాదం.. రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే వరకూ వెళ్లింది. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న వెంకటరమణను ఓ వీడియో వైరల్ చేసిన కారణంగా కలబుర్గి సెంట్రల్ జైలుకు తరలించారు. 5 రోజుల క్రితమే జైళ్ల శాఖ చీఫ్ అలోక్కుమార్ ఆ జైలును తనిఖీ చేశారు. ఖైదీలు మద్యం, సిగరెట్లు తాగడం, జూదం ఆడుతున్న వీడియో వైరల్ కావడంతో ఆయన వెళ్లి ఏం జరుగుతోందో విచారించారు. ఇంతలోనే ఖైదీల గ్యాంగ్ వార్తో ఈ కారాగారంలోని లోటుపాట్లు బయటపడ్డాయి.హోంశాఖలో డీసీఎం జోక్యమా?● కేంద్ర మంత్రి కుమారస్వామిశివాజీనగర: బళ్లారిలో పర్యటించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అక్కడ పోలీస్ అధికారుల సమావేశం ఎందుకు జరిపారు?, ఆయనకు ఆ అధికారం ఎవరు ఇచ్చారు? రాష్ట్రంలో ఉన్నది రబ్బర్ స్టాంప్ హోం మంత్రినా? అని కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖల మంత్రి హెచ్.డీ.కుమారస్వామి విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలో నివాసంలో మీడియాతో మాట్లాడుతూ డీకేపై మండిపడ్డారు. డీసీఎం ఏ అధికారంతో పోలీస్ అధికారులతో సమావేశం జరిపారని ప్రశ్నించారు. హోం శాఖలో ఆయన జోక్యం ఏమిటి అన్నారు.అన్నీ సందేహాలేబళ్లారి గొడవల కేసును మూసివేతకు ప్రభుత్వం యత్నిస్తోందని కుమార ఆరోపించారు. కేవలం బ్యానర్ గొడవకే వీధుల్లో తుపాకులను పేలుస్తారా?, పోస్టుమార్టం అయిన వెంటనే కార్యకర్త మృతదేహాన్ని హడావుడిగా ఎందుకు దహనం చేశారు అని అనుమానాలు వ్యక్తంచేశారు. దీనికి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలన్నారు. -
లోకాయుక్తలో 45 వేల కేసుల నమోదు
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటక భాగంలో ఈనెల 7వ తేదీ వరకు లోకాయుక్త అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారని లోకాయుక్త రిజిస్ట్రార్ ఏ.వీ.పాటిల్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల విధి నిర్వహణలో లోపాలు కనిపించాయన్నారు. ఆస్తి పన్ను, రిజిేస్ట్రేషన్ సాంకేతిక విభాగం, ఇతరత్ర పరిశీలన జరపాలన్నారు. అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును చూసి మండిపడ్డారు. రికార్డులను సక్రమంగా వినియోగించక పోవడం, ఇష్టం వచ్చినట్లు పేపర్లు పారవేయడంతో ఆక్రోశించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై విరుచుకు పడ్డారు. రారష్ట్రంలో లోకాయుక్త పరిధిలో 45 వేల కేసులు నమోదు కాగా 20 వేల కేసులు పరిష్కరించామని వివరించారు. చెరువులను, రాజ కాలువల ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కార్యదర్శి శ్రీనాథ్, లోకాయుక్త ఎస్పీ సతీష్, జిల్లాధికారి నితీష్, ఎస్పీ అరుణాంగ్షు గిరి, నగరసభ కమీషనర్ జుబిన్ మహాపాత్రోలున్నారు. ఇప్పటికే 20 వేల కేసుల పరిష్కారం లోకాయుక్త రిజిస్ట్రార్ ఏ.వీ.పాటిల్ -
జిల్లా ఎస్పీగా సుమన పెన్నేకర్
సాక్షి బళ్లారి: మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి ఇంటి సమీపంలో మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ బ్యానర్ గొడవ, కాల్పుల నేపథ్యంలో తాజాగా పోలీసు అధికారులపై కూడా రాష్ట్రప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. బుధవారం బళ్లారి రేంజ్ డీఐజీపీగా పని చేస్తున్న వర్తిక కటియార్ను బదిలీ చేశారు. రగడ జరిగిన రోజు ఆమె కూడా సక్రమంగా విధులు నిర్వహించలేదనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రతిపక్షం కూడా ఎస్పీ సస్పెండ్ను ఖండిస్తూ వచ్చింది. దీంతో కటియార్ను బదిలీ చేసి ఆమె స్థానంలో బళ్లారి రేంజ్ డీఐజీపీగా పీఎస్.హర్షను నియమించారు. ఇక బళ్లారి నూతన ఎస్పీగా సుమన పెన్నేకర్ను నియమించారు. కాగా బళ్లారి కాల్పుల ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. డీఐజీ వర్తికా కటియార్ బదిలీ నూతన డీఐజీగా హర్ష నియామకం కాల్పుల ఘటనతో అధికారులపై చర్యలు -
హుబ్లీలో పోలీసులు వర్సెస్ బీజేపీ
హుబ్లీ: హుబ్లీలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. తమ మహిళా కార్యకర్తను పోలీసులు వివస్త్రను చేశారంటూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఠాణాను చుట్టుముట్టడంతో గందరగోళం నెలకొంది. ఇంతకూ జరిగింది ఏమిటంటే.. సదరు మహిళ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు, ఇటీవల బీజేపీలోకి చేరారు. 5వ తేదీన ఓటరు జాబితా గురించి బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు గలాటా పడ్డారు. ఆమె మీద గదగ్ రోడ్డు గాంధీవాడ ప్రాంతవాసులతో కలిసి 59వ వార్డు కార్పొరేటర్ సువర్ణ కల్లకుంట్ల కేశ్వాపుర ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ప్రతిఘటించింది. దీంతో పోలీసులు, ఆమె మధ్య తోపులాట జరిగి దాడి వరకూ వచ్చింది. పోలీసులు ఆమెను ఈడ్చుకొచ్చి జీపులో కూర్చోబెట్టారు, అప్పటికే ఆమె వివస్త్రగా మారింది, అలాగే పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ మేరకు వీడియోలు వైరల్ అయ్యాయి. ఠాణా ముట్టడి ఈ నేపథ్యంలో బాధితురాలికి న్యాయం చేయాలని, దాడి చేసిన పోలీసులను శిక్షించాలని బుధవారం సాయంత్రం నుంచి కేశ్వాపుర ఠాణా ముందు బీజేపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. పోలీసులు ఎంత చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. కొందరిని అరెస్టు చేశారు. బాధిత మహిళ కూడా ఈ ధర్నాలో పాల్గొని పోలీసులపై ఆరోపణలు చేసింది. ఆమే తీసేశారు: కమిషనర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి వాహనంలో కూర్చోబెట్టగా, ఆమే బట్టలు తీసి వేశారని హుబ్లీ పోలీసు కమిషనర్ ఎన్.శశికుమార్ వివరణ ఇచ్చారు. కేశ్వాపుర ఠాణాకు వచ్చి ఏం జరిగిందో విచారించారు. మీడియాతో మాట్లాడారు. పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఆమె దుస్తులతోనే ఉన్నారు, అదుపులోకి తీసుకునేటప్పుడు ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతి దాడి చేశారు. మగ కానిస్టేబుల్ను తోసివేసి తప్పించుకునే యత్నం చేశారు, నోటితో కరిచారు, ఆమె అంతగా రెచ్చిపోతుంటే, పోలీసు వాహనంలోకి ఎక్కించుకొనే వేళ వివస్త్ర అయ్యారు, పోలీసులు స్థానికుల ద్వారా వేరే బట్టలను తెచ్చి ఆమెకు ధరింపజేశారు అని చెప్పారు. ఈమెకు నేరచరిత ఉందని, గతేడాది 5 కేసులు దాఖలయ్యాయి, ఈ 7 రోజుల్లో 7 కేసులతో నమోదైనట్లు తెలిపారు. మహిళ వివస్త్రగా మారిన వీడియోలను ఎవరు వైరల్ చేశారన్నది దర్యాప్తు చేస్తామని చెప్పారు. అరెస్టు వేళ బీజేపీ మహిళా కార్యకర్తను వివస్త్రను చేశారని ధ్వజం పోలీసు స్టేషన్ ముట్టడి.. ఉద్రిక్తత సీఎం ఏమన్నారు? సీఎం సిద్దరామయ్య ఈ ఘటనపై స్పందిస్తూ ఆ మహిళ పోలీసులను కొరికింది, వెరీబ్యాడ్, ఈ సమయంలో 10 మంది పోలీసులు, వారు చట్టపరమైన చర్యలు తీసుకున్నారని సమర్థించారు. -
పెద్ద పులి పట్టివేత
మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకాలోని హనగోడు సమీపంలోని బీరతమ్మనహళ్లి అడవి సరిహద్దుల్లో సంచరిస్తూ గత కొన్ని నెలలుగా ప్రజలకు ఆందోళన కలిగించిన పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. కొబ్బరి తోటలో పెట్టిన బోనులో సుమారు 6–7 ఏళ్ల వయస్సుగల మగ పులి పట్టుబడింది. గత ఐదారు నెలల నుంచి హనగోడుతో పాటు సమీపంలోని హెమ్మిగె, హెమ్మిగె కాలనీ చుట్టుపక్కల గ్రామాల్లో తరచుగా పులి సంచరిస్తూ కొన్ని పశువులను బలి తీసుకుంది. దీంతో గ్రామస్తుల ఒత్తిడి మేరకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆపరేషన్ని ప్రారంభించారు. బుధవారం ఉదయం సిద్దేగౌడర కొబ్బరి తోటలోని బోనులోకి పులి పడింది. పులిని చూడాలని వేలాదిమంది జనం తరలివచ్చారు. బోనుకు సమీపంలో కట్టేసిన దూడ పులి గాండ్రింపులకు భయపడి సొమ్మసిల్లింది. ఏసీఎఫ్ లక్ష్మీకాంత్, ఆర్ఎఫ్ఓలు సుబ్రహ్మణ్య, నందకుమార్ తదితరులు సిబ్బంది చేరుకుని దానికి మత్తు మందు ఇచ్చి ప్రత్యేక వ్యాన్లో బెంగళూరు బన్నేరుఘట్ట జూపార్క్కి తరలించారు. విమానాశ్రయంలో గాలింపు మైసూరులోని మండకళ్లి విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతంలో కనిపించిన పులిని పట్టుకునేందుకు అటవీ సిబ్బంది కొడగులోని దుబారె శిబిరం నుంచి ప్రశాంత్, కంజన్, హర్ష, సుగ్రీవ అనే ఏనుగులను తెప్పించి గాలింపు ప్రారంభించారు. డీసీఎఫ్ పరమేష్, ఆర్ఎఫ్ఓ సంతోష్ హూగార్ పాల్గొన్నారు. అటవీ శాఖ నిపుణులైన సిబ్బంది, షూటర్లు, పశువైద్యుల బృందం అక్కడే మకాం వేసింది. మైసూరు జిల్లా హుణసూరు వద్ద ఆపరేషన్ టైగర్ -
హిప్పరగి డ్యాం గేట్ ధ్వంసం
రాయచూరు రూరల్: బాగలకోటె జిల్లా జమఖండి తాలూకాలో హిప్పరగి గ్రామం వద్ద కృష్ణా నదిపైనున్న హిప్పరగి డ్యాం గేట్ తెగి నీరు వృథా అవుతోంది. మంగళవారం సాయంత్రం డ్యాం గేట్ గొలుసు తెగిపోయింది. దీంతో సదరు గేటు తెగిపోయి నీరు భారీగా వెళ్లిపోతోంది. డ్యాంలో ఇప్పుడు 6 టీఎంసీలు నీరుంది. 22వ గేటు ధ్వంసం కావడంతో నీటి నిల్వ తగ్గుతోంది. ఈ బ్యారేజ్ అథణి తాలూకాకు సాగు, తాగు నీటిని అందిస్తోంది. వేసవి రాబోతున్న సమయంలో నీరు వృథా అవుతోందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందగానే బాగల్కోటె ఇన్చార్జి, ఎకై ్సజ్ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ బుధవారం వెళ్లి పరిశీలించారు. డ్యాంలో నీటి నిల్వ ఎక్కువగా ఉన్నందున కృష్ణ భాగ్య జల మండలి అధికారులతో చర్చించి నీటిని వృథా కాకుండా అరికట్టాలని, సత్వరం మరో గేట్ను అమర్చాలని సూచించారు. మంత్రి వెంట జిల్లాధికారి, ఇతర నీటిపారుదల శాఖ అధికారులున్నారు. మరమ్మతు పనులు జరుగుతున్నాయి. వృథాగా పోతున్న కృష్ణా జలాలు బాగల్కోట జిల్లాలో ఘటన మంత్రి తిమ్మాపూర్ తనిఖీ -
మహా దాసోహకు భారీగా అప్పడాల తయారీ
హొసపేటె: గవిసిద్దేశ్వర జాతర మహోత్సవంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా జాతర మహోత్సవం మూడో బుధవారం ప్రత్యేక వంటకంగా అప్పడాల పంపిణీ జరిగింది. బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకాలోని సిరిగేరికి చెందిన గవిశ్రీ స్నేహ ఫ్రెండ్స్ గ్రూప్, ఉదయ ఫ్రెండ్స్ గ్రూపుతో గత 8 ఏళ్లుగా వివిధ ఇమి, జిలేబీ తయారీ సేవల్లో పాల్గొంటున్నారు. సిద్రాంపుర, హావినహాళ, సిరిగేరి, దాసాపుర, కొంచగేరి, ముద్దటనూరు, గుండిగనూరు, పరిసర ప్రాంతాల గ్రామస్తుల సహకారంతో ఈ సంవత్సరం అప్పడాల పంపిణీ సేవను చేపట్టారు. అప్పడాల తయారీకి 14 డబ్బాల నూనె, 50 మంది వంట వారు, వారికి సహాయం చేయడానికి 20 మందిని అందించారన్నారు. మొత్తం రూ.5 లక్షల అప్పడాలను తయారు చేసి జాతరకు వచ్చిన భక్తులకు ఉచితంగా చేసినట్లు గవిమఠం ప్రతినిధులు తెలిపారు. -
గరుడ రాష్ట్ర అవార్డు ప్రదానం
బళ్లారి అర్బన్: సండూరు తాలూకా గరుడ న్యూస్ సంపాదకులు మహేష్ కమ్మత్తూర బృందం ఆధ్వర్యంలో 2026వ సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రశస్తి సమాజ సేవా రత్న అవార్డును డీ.అరుణ్కుమార్కు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. అరుణ్కుమార్ కర్ణాటక జలహిత రక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడుగా, వందేమాతరం యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడుగా, జగజ్యోతి బసవేశ్వర యువక సంఘం గౌరవ అధ్యక్షుడుగా, నెహ్రు యువ కేంద్రంతో పాటు వివిధ రంగాల్లో సేవలు అందించారు. బళ్లారికి చెందిన ఈయన సమాజ సేవను మెచ్చి గరుడ న్యూస్ అవార్డుకు ఎంపిక చేశామని గరుడ న్యూస్ నిర్వాహకులు తెలిపారు. అరుణ్కుమార్ మాట్లాడుతూ ఈ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు తనకు మరింతగా సేవ చేసేందుకు ప్రోత్సాహం లభించిందన్నారు. తాను శాయశక్తులా సమాజ చేయడం ద్వారా ఆపన్నులకు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. -
హంపీ, అంజనాద్రిలో వైఎస్సార్సీపీ నేత ఉమా
సాక్షి బళ్లారి: వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రముఖ వైఎస్సార్సీపీ నాయకుడు ఉమా మహేశ్వరనాయుడు హంపి, ఆనెగుందిని దర్శించుకొన్నారు. బుధవారం ఆయన హంపీలోని విరుపాక్షేశ్వరస్వామి, భువనేశ్వరిదేవి, పంపాదేవి, కోదండరామ ఆలయం, యంత్రోద్ధారక శ్రీఆంజనేయస్వామి ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. చారిత్రాత్మకమైన హంపి కట్టడాలను వీక్షించారు. హంపీలోని విజయవిఠల ఆలయం, రాతిరథం, మహానవమిదిబ్బ, కమల మహల్ తదితర స్మారకాలను వీక్షించి శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఈ ప్రాంతాన్ని సువర్ణయుగంగా చేశారని కొనియాడారు. అనంతరం ఆంజనేయస్వామి జన్మస్థలమైన అంజనాద్రిని దర్శించి అంజనాద్రి కొండపై 575 మెట్లను ఎక్కి కొండపై వెలసిన ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చలు కూడా చేయించారు. -
మిస్ఫైర్ కాదు, పక్కా ఫైరే
సాక్షి బళ్లారి: నగరంలో జనవరి 1వ తేదీన తన ఇంటి వద్ద కాల్పులు జరిగింది మిస్ఫైర్తో కాదని, పథకం ప్రకారమే కాల్పులు జరిపి రాజశేఖర్ అనే యువకుడి మృతికి కారకులయ్యారని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు ఆరోపణలు చేశారు. బుధవారం తన నివాసం గృహం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఘటన జరిగిన రోజు వీడియోలను మీడియాకు విడుదల చేశారు. పెద్ద టీవీ స్క్రీన్పై వాటిని ప్రదర్శించారు. మృతుడు రాజశేఖర్ కూడా తమ ఇంటిపై బాటిల్ విసిరాడన్నారు. అదే సందర్భంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో చిందర వందరగా వదిలి వెళ్లిపోయారన్నారు. బ్యానర్ కట్టే సమయంలో ఘర్షణ ముగిసిన తర్వాత రాత్రి 9 గంటలకు నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి రావడంతో మళ్లీ గొడవ ప్రారంభమైందన్నారు. పెద్ద రగడ చేయాలని హైడ్రామా పథకం ప్రకారం తమ వారిపై కాల్పులు జరిపి పెద్ద రగడ చేయాలని హైడ్రామా చేశారన్నారు. ఆ వీడియో చూస్తే మిస్ఫైర్ కాదు, పథకం ప్రకారం ఫైర్ చేశారనే విషయం స్పష్టమవుతోందన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎమ్మెల్యే నారా భరత్రెడ్డిని, సతీష్రెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని లేకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు రావడం ఖాయమన్నారు. 17వ తేదీన ఆందోళన చేపడతామని, సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ బళ్లారిలో విలేకరులతో మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయన శాంతి భద్రతలను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే భరత్రెడ్డి రాకతోనే మళ్లీ గొడవ ప్రారంభం విలేకరులతో మాజీ మంత్రులు గాలి జనార్దన్రెడ్డి, శ్రీరాములు -
ఎమ్మెల్యే చాటింగ్ రచ్చ
శివాజీనగర: తన ఇన్స్టా ఖాతాను హ్యాక్ చేసి ఓ యువతికి మెసేజ్ పంపి చెడ్డపేరు తీసుకొచ్చే కుట్ర జరిగింది, ఇది కాంగ్రెస్ ఐటీ టీం పని అని బీజేపీ ఎమ్మెల్యే సీ.కే.రామమూర్తి ఆరోపించారు. ఆయన ఖాతాతో ఫేస్బుక్, ఇన్స్టాలో చాటింగ్లు వైరల్ అయ్యాయి. దీనిపై మీడియాతో స్పందిస్తూ, రీల్స్ బాగుందని హాసన్కు చెందిన మహిళకు మెసేజ్ వెళ్లింది, వెంటనే కాంగ్రెస్ ఐటీ టీం వైరల్ చేసింది. ఇది ఎలా సాధ్యం? అని అన్నారు. నా పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలున్నాయి, నా ఖాతా రెండుసార్లు హ్యాక్ అయ్యింది అని చెప్పారు. యూత్ కాంగ్రెస్ టీంపై పరువునష్టం కేసు వేస్తానని అన్నారు. -
గ్రామాభివృద్ధికి సభ్యుల నిర్ణయమే అంతిమం
బళ్లారి రూరల్ : గ్రామాభివృద్దికి ఆ గ్రామ పంచాయతీ సభ్యులే తీర్మానించి తగు చర్యలు తీసుకోవాలని దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున తెలిపారు. దావణగెరె జెడ్పీ, టీపీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మాయకొండ నియోజకవర్గంలోని హొన్నూరు గ్రామంలో పనికి ఆహార పధకం కూలికార్మికులకు ఏర్పాటు చేసిన ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. గ్రామాల్లో అవసరమైన పాఠశాలలు, మరుగుదొడ్లు, రోడ్ల నిర్మాణానికి తీర్మానాలు తీసుకొని తగు చర్యలు చేపట్టాలన్నారు. హొన్నూరు గ్రామ పంచాయితీ అధికారులు పనికి ఆహార పథకం అమలు చేయడంలో తమ కర్తవ్యాన్ని నిర్వహించారని కొనియాడారు. ఉత్తమ కూలీకార్మికులకు ఉద్యోగాన్ని కల్పించారన్నారు. పనికి ఆహార పథకం కూలికార్మికులు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగ పడుతోందన్నారు. ఈ పథకాన్ని యూపీఏ ప్రభుత్వంలో దివంగత మాజీ ప్రధాని 2005లో ప్రవేశ పెట్టింది. ఈ పథకాన్ని ఇప్పటికి కేంద్రప్రభుత్వం పేరు మార్చి అమలు చేస్తోందన్నారు. ఎమ్మెల్యే బసవంతప్ప, జెడ్పీ సీఈఓ గిత్త మాధవరావు విఠ్ఠల్, జీపీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు పౌష్టికాహారం అందించరూ
రాయచూరు రూరల్ : రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం సగం మేర బంద్ చేశారని అంగన్వాడీ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. బుధవారం మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు పద్మ మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలో మూడేళ్ల నుంచి ఆరేళ్ల వరకు వయస్సు గల పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ విషయంలో సర్కార్ కేవలం గుడ్డు, గోధుమ పిండి, బియ్యం, పొడి, చిన్నపాటి సరుకులు ఇస్తుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు పిల్లలతో పాటు ఇతర పనులు అప్పగించడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి లోపాలు రాకుండా పని చేస్తున్నారన్నారు. న్యాయసమ్మతంగా విధులు నిర్వహించే కార్యకర్తలపై ఆరోపణలను పరిగణనలోకి తీసుకోకూడదని అధికారి నవీన్కు వినతిపత్రం సమర్పించారు. -
కన్నడకు కువెంపు సేవలు భేష్
రాయచూరు రూరల్ : జాతీయ కవి కువెంపు కన్నడ భాషకు చేసిన సేవలు భేష్ అని జిల్లా వార్త ప్రచార శాఖాధికారి గవిసిద్దప్ప హొసమని వెల్లడించారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో కువెంపు జయంతిని జ్యోతి వెలిగించి మాట్లాడారు. కువెంపు కన్నడ భాషకు చేసిన సేవలను గురించి వివరించి కొనియాడారు. కన్నడ భాషకు జ్ఞానపీఠ అవార్డు రావడానికి ప్రధాన కారకుడన్నారు. కార్యక్రమంలో వెంకట్రావ్ కులకర్ణి, వీర హనుమాన్, సీకే జైన్, మ్యాదర్, రావుత్రావ్, ప్రతిభ పాల్గొన్నారు. కుస్తీ పోటీలు అదుర్స్ హొసపేటె: కొప్పళ గవిసిద్దేశ్వర జాతర సందర్భంగా బుధవారం క్రీడా మైదానంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేశారు. గవిమఠం ప్రాంగణంలో పురుషులు, మహిళల కుస్తీ పోటీలు హోరాహోరీగా జరిగాయి. వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నాగవేణి మాట్లాడుతూ కుస్తీ ఓ పురాతన క్రీడ అన్నారు. ఈ క్రీడ ప్రతి వ్యక్తిలో శారీరక, మానసిక సమతుల్యతను పెంపొందించడంలో సహాయ పడుతుంది. తద్వారా వారిని బలమైన వ్యక్తిగా మార్చడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. పురుషుల విభాగంలోని 16 జట్ల కుస్తీ పోటీదారులు పాల్గొన్నారు. ఘనంగా ఫలపుష్ప ప్రదర్శనహొసపేటె: గవిసిద్దేశ్వర జాతర మహోత్సవంలో భాగంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జనవరి 5 నుంచి 14 వరకు గవిమఠం తేరు మైదానంలో 10 రోజుల ఉద్యానవన, ఫల, పుష్ప ప్రదర్శన–2026 నిర్వహిస్తున్నారు. ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ కృష్ణ ఉక్కుంద మాట్లాడుతూ ఈ సంవత్సరం ఉద్యానవన పండ్ల, పుష్పాల ప్రదర్శనలో ఉద్యానవన శాఖ నుంచి అందుబాటులో ఉన్న వివిధ పథకాల గురించి రైతులకు తెలియజేశారన్నారు. ఈ సంవత్సరం రైతుల కోసం విదేశీ కూరగాయలను, పండ్ల ప్రదర్శనను ఏర్పాటు చేశామన్నారు. నేల రహిత వ్యవసాయం(హైడ్రో ఫోనిక్స్ లేదా నీటి వ్యవసాయం)లో కూరగాయల సాగుపై ప్రదర్శన ఇస్తున్నామన్నారు, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థిని చితకబాదిన గెస్ట్ టీచర్ రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకాలో ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని అతిథి ఉపాధ్యాయిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడో తరగతి చదువుతున్న ఖాజాసాబ్ను కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న అతిథి ఉపాధ్యాయిని తరగతి గదిలో కట్టేసి వంటిపై వాతలు తేలేలా కొట్టారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి పరిశీలించగా తరగతి గదిలో కట్టేసి కొట్టిన ఖాజాసాబ్ను ఇంటికి తీసుకొచ్చి ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. కాగా విద్యార్థిని చితక బాదిన ఉపాధ్యాయినిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వెనెజువెలాపై దాడి తగదు రాయచూరు రూరల్ : అగ్రరాజ్యం అమెరికా చిన్న దేశం వెనెజువెలా రాజధానిపై దాడి చేయడం తగదని ఎస్యూసీఐ పేర్కొంది. బుధవారం అంబేడ్కర్ ప్రతిమ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు ఎన్ఎస్ వీరేష్ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సైనిక బలంతో వెనెజువెలాపై దాడికి దిగి, అధ్యక్షుడు నికోలాస్ మదురో, అతని భార్య సిలియో ఫ్లోరిస్ను కిడ్నాప్ చేయించడం సరికాదన్నారు. ఈ ఘటనను యూరప్ దేశాలు ఖండించక పోగా దానికి మద్దతు పలకడం శోచనీయమన్నారు. కిడ్నాప్కు గురైన వారి విడుదలకు భారత్తో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు ముందుకు రావాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. తుపాకీ స్వాధీనం కెలమంగలం: అంచెట్టి సమీపంలో గెస్తూరు గ్రామంలో హుచ్చేగౌడు తోటలో పోలీసులు సోదాలు జరిపారు. గడ్డి వాము కింద దాచి ఉంచిన నాటు తుపాకీని స్వాధీనపరుచుకొన్నారు. సొంతదారు మునిశివణ్ణ (45)ను అరెస్ట్ చేశారు. అంచెట్టి సీఐ సమిద్రావ్, పోలీసులు పాల్గొన్నారు. -
హెల్మెట్తో.. టెక్కీ బ్రిలియంట్ ఐడియా
సాక్షి,బెంగళూరు: ఐటీ ఉద్యోగి వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. పంకజ్ తన్వర్ తన హెల్మెట్ను వినూత్నంగా మార్చారు. సాధారణ హెల్మెట్ను కృత్రిమ మేధస్సు ఆధారిత రోడ్ సేఫ్టీ టూల్గా మార్చేశారు.పంకజ్ తన్వర్ ఆవిష్కరణ ఒక సాధారణ ఆలోచనతో మొదలైంది. ‘టెక్నాలజీని కేవలం సౌకర్యం కోసం కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించాలి’ అనే సదుద్దేశ్యంతో ఆయన ఈ హెల్మెట్ను రూపొందించారు.ఈ స్మార్ట్ హెల్మెట్ ద్వారా ట్రాఫిక్ పోలీసులకు నిర్ధారిత ఆధారాలు చేరుతాయి. ఫలితంగా, రోడ్లపై క్రమశిక్షణ పెరుగుతుంది. చిన్న ఆవిష్కరణ కూడా ప్రతిరోజు జీవనాన్ని మరింత సురక్షితంగా మార్చగలదని నమ్ముతున్నారు.బెంగళూరులో పుట్టిన ఈ ఆవిష్కరణతో ఇన్నోవేషన్, టెక్నాలజీ కలిస్తే సమాజానికి ఎంతటి మేలు జరుగుతుందో స్పష్టంగా తెలుస్తోంది. ఒక సాధారణ హెల్మెట్ను ఏఐ ఆధారిత రోడ్ సేఫ్టీ సాధనంగా మార్చిన పంకజ్ తన్వర్ ఆవిష్కరణ, రోడ్లపై క్రమశిక్షణను పెంచుతూ, ప్రజల జీవనాన్ని మరింత సురక్షితంగా మార్చే దిశగా అడుగులు పడినట్లేనని పలువురు వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హెల్మెట్ ప్రత్యేకతలు ఈ స్మార్ట్ హెల్మెట్ రియల్ టైమ్లోనే ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించగలదువిజువల్స్ను క్యాప్చర్ చేయడంలొకేషన్ వివరాలు నమోదు చేయడం వాహన నంబర్ ప్లేట్ను గుర్తించడం సమాచారాన్ని ధృవీకరించి ట్రాఫిక్ పోలీసులకు పంపించడం విధంగా, రోడ్లపై జరుగుతున్న ఉల్లంఘనలకు తక్షణ సాక్ష్యాలు అందుబాటులోకి వస్తాయి -
అతి కిరాతకంగా భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త..
విజయనగర జిల్లా: విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలో వరుసగా హత్యలు జరగడంతో నగర ప్రజలు హడలెత్తుతున్నారు. ఇటీవల తాలూకాలోని కారిగనూరు వద్ద పురుషుడు, కమలాపుర సమీపంలోని వెంకటాపుర క్యాంప్లో వివాహిత హత్య ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు హత్య కేసులను మరువక ముందే నగరంలోని చాపలగడ్డ ప్రాంతంలో మంగళవారం ఉదయం మరో మహిళ గొంతు కోసి హత్య చేసిన ఘటన నగరంలో చర్చనీయంగా మారింది. హత్యకు గురైన మహిళ ఉమా (35) నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని చాపలగడ్డ ప్రాంతవాసి. ఆమె భర్త ఖాజా హుస్సేన్ ని చిత్తవాడ్గి పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే రెండో పెళ్లి.. ఉమాకు 13 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్కు చెందిన రఘు అలియాస్ రామాంజినితో వివాహమైంది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉమా గత 6 ఏళ్లుగా తన భర్త నుంచి విడిపోయి చాపలగడ్డలోని తన ఇంట్లో ఉంటోంది. ఉమా నాలుగు నెలల క్రితం నగరానికి చెందిన ఖాజా హుస్సేన్ అనే వ్యక్తిని పరిచయం చేసుకొని కొండనాయకనహళ్లిలోని సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకొంది. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరగడంతో ఖాజా హుస్సేన్ కోపోద్రేకంలో ఉమాను కత్తితో గొంతు కోసి చంపినట్లు చిత్తవాడిగి పోలీసులు తెలిపారు. విజయనగర జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి, ఏఎస్పీ మంజునాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై చిత్తవాడిగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.భర్తపై భార్య దాడి బనశంకరి: రెండో భార్యను వదిలేయాలని మొదటి భార్య.. భర్తపై (రౌడీషిటర్) దాడికి పాల్పడింది. ఈ ఘటన జేజే నగర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దాడికి గురైన భర్త మొదటి భార్యపై జేజే నగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివరాలు.. జేజే నగర నివాసి సయ్యద్ అస్గర్ చోరీలు, డ్రగ్స్ విక్రయాల కేసులో జైలు పాలయ్యాడు. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్యను వదిలేయాలని భర్త సయ్యద్ అస్గర్ను మొదటి భార్య కోరింది. భర్త ఒప్పుకోక పోవడంతో మొదటి భార్య దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ అస్గర్ను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జేజే నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘర్షణ కారకులను అరెస్ట్ చేయాలి
సాక్షి,బళ్లారి: మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ జరిగే క్రమంలో గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద ఘటనకు మూల కారణమైన వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని డీసీఎంపై మాజీ మంత్రి బీ.శ్రీరాములు మండిపడ్డారు. ఆయన మంగళవారం నగరంలోని గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. ఘటనకు కారణమైన నారా భరత్రెడ్డితో సీఎం మాట్లాడతారు, డీసీఎం ఆయన్ను పక్కన కూర్చొబెట్టుకుని పత్రికా సమావేశం నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు మృతుడి కుటుంబానికి ఏం న్యాయం చేస్తారు? ఘటనకు మూల కారకులైన వారిని అరెస్ట్ చేస్తారా, లేదా వేచిచూస్తామన్నారు. దాడి చేయడానికి పెద్ద ఎత్తున గూండాలను తీసుకుని వచ్చి రగడ సృష్టించారు, కాల్పులు జరిపారు, తమపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? దాడికి ప్రతి దాడి చేయడం సహజమేనని మండిపడ్డారు. అయితే ఘర్షణను తాను ఏమాత్రం సమర్థించేది లేదన్నారు. ఎమ్మెల్యే ఏమైనా సత్యవంతుడా? ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఏమైనా సత్యవంతుడా? అని ప్రశ్నించారు. తమ వారు ప్రాణ రక్షణ కోసం కట్టెలు, కారంపొడి తెచ్చి ఉండవచ్చు. అంతమాత్రాన కాంగ్రెస్ వారు దాన్ని బూతద్దంలో చూపడంలో అర్థం లేదన్నారు. మనుషుల ప్రాణాలు తీసేందుకు కాల్పులు జరపడం ఎక్కడైనా చూశామా? సతీష్రెడ్డి గన్మెన్ కాల్చడంతోనే వ్యక్తి మృతి చెందారని దర్యాప్తులో కూడా తేలిందన్నారు. వారు ఎవరిని హత్య చేయడానికి కాల్పులు జరిపారో అందరికీ తెలిసిందేనన్నారు. ప్రైవేటు వ్యక్తులు గన్మెన్ను కాల్చారంటే వారికి ఎంత ధైర్యం? అని మండిపడ్డారు. శ్రీరాములుపై, గాలి జనార్దనరెడ్డిపై కాల్పులు జరుగుతున్నాయని జనం పరుగెత్తుకుని వచ్చారన్నారు. గాలి జనార్దనరెడ్డి పక్కనే ఉన్నప్పుడు కాల్పులు జరిగాయన్నారు. ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారన్నారు. నిన్న సత్యశోధన కమిటీని పంపారు. నేడు మృతుడి కుటుంబ పరామర్శకు శివకుమార్ వచ్చారన్నారు. ప్రాణరక్షణకు కట్టెలు, కారంపొడి తెచ్చి ఉండవచ్చు విలేకరులతో మాజీ మంత్రి శ్రీరాములు వెల్లడి -
నిఘా నీడలో ఇనాం వీరాపుర
హుబ్లీ: కులాంతర వివాహం చేసుకొని కన్న తండ్రి చేతిలో కర్కశంగా బలైన 7 నెలల గర్భిణి మాన్య నివసించే ఇనాం వీరాపుర గ్రామం సీసీ టీవీ డేగ కళ్ల పహారాలో చిక్కుకుంది. ఇనాం వీరాపుర గ్రామంలో భయంతో కూడిన వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గత నెల 21న మాన్య పాటిల్ హత్యతో ఆందోళనకు గురైన ఈ చిన్న గ్రామ ప్రజలు భయంతో ఇల్లు వదిలి బయటకు రావడం లేదు. ప్రస్తుతం ఆ గ్రామంలో పరిస్థితులు కుదుట పడటంతో ప్రజలు కాసింత ఊరట చెంది భయాన్ని వదిలి బయటకు వస్తున్నారు. ఎప్పటిలాగే రోజు వారీ పనులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు, అంగళ్లు యథావిధిగా ప్రారంభించారు. పోలీస్ బందోబస్తు కొనసాగుతూనే ఉంది. ఘటనపై స్థానికులు పెదవి విప్పడానికి ఇప్పటికీ భయపడుతున్నారు. ఇలాంటి దారుణ హత్య జరిగి ఉండాల్సింది కాదని, అయినా ఏం చేయగలమని అని వారు నిస్సహాయతను వ్యక్తం చేశారు. ప్రతి వీధిలోనూ సీసీ కెమెరాలు కాగా ఆ ఊరిలోని ప్రతి వీధిలో కూడా సీసీ టీవీ కెమెరాలు పహారా కాస్తున్నాయి. పరువు హత్యతో తమ గ్రామానికి చెడ్డ పేరు రావడంతో ప్రజలు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. భారీ బందోబస్తు మధ్య సీసీ టీవీల నిఘా కళ్లతో పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితులను విశ్లేషిస్తోంది. స్థానికులు కూడా ఈ విషయమై సామరస్య వాతావరణం ఉండాలని, జరిగిన హత్య వ్యక్తిగత కారణంగా జరిగిందన్నారు. అన్ని కులాల వారికి చెందిన 150 ఇళ్లు ఉన్నాయని, గ్రామంలో సుమారు 600 జనాభా ఉందని స్థానికులు వివరించారు. అందరూ సామరస్యంతో సుహృద్భావంతో జీవిస్తున్నామన్నారు. మొత్తం మీద 17 రోజులుగా ఉన్న భయానక వాతావరణం నుంచి ఇనాం వీరాపుర గ్రామస్తులు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. -
అధికారులపై ఎమ్మెల్యే విసుర్లు
రాయచూరు రూరల్: గ్రామీణ అసెంబ్లీ పరిధిలో వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి జరిగిన కేడీపీ సమావేశంలో గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్ అధికారులపై మండిపడ్డారు. మంగళవారం తాలూకా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జెస్కాం, సాంఘీక సంక్షేమ శాఖ, పంచాయతీ అభివృద్ధి అధికారుల మధ్య సమన్వయం లభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అధికారులు, కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. తోటల పెంపకానికి ప్రాధాన్యత కల్పించాలని, విద్యుత్ మీటర్ లేదు, బిల్ కట్టలేదంటూ విద్యుత్ను కట్ చేయరాదన్నారు. అక్రమంగా ఇసుక రవాణ నియంత్రణకు అధికారులు ముందుండాలన్నారు. పీడీఓలు గ్రామాల్లో పర్యటించి సమస్యలపై స్పందించాలని సూచించారు. సమావేశంలో ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, ఆర్ ఏపీఎంసీ అధ్యక్షుడు జయంతిరావ్, పంచ గ్యారెంటీల అధ్యక్షుడు పవన్ పాటిల్, టీపీ ఈఓ చంద్రశేఖర్, ఏసీ హంపన్న, తహసీల్దార్ సురేష్ వర్మ, అధికారిణి వనిత, శరణ బసవ, సభ్యులు పల్లవి, ఈరేశ, రామప్ప, శ్రావణి, తిమ్మప్ప, చెన్నబసవనాయక్, ఫారూక్, జిలానీలున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
సాక్షి,బళ్లారి: వారందరూ వక్కలు వ్యాపారం చేసేవారు. వక్కతోటకు వెళ్లి పంట కోయడానికి ఏర్పాట్లు చేసుకుని తిరిగి వస్తుండగా, రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం రాత్రి చిత్రదుర్గ జిల్లా హొళల్కెరె తాలూకా సాసలు సమీపంలో బొలెరో వాహనం బోల్తా పడటంతో కల్లవ్వనాగతిహళ్లి గ్రామానికి చెందిన గిరిరాజ్, కిరణ్, అరుణ్, హనుమంతప్ప అనే నలుగురు మృతి చెందారు. బొలెరో వాహన డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంతో వాహనం నడుపుతూ రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో ఘటన స్థలంలో, గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరో ఇద్దరు కలిపి మొత్తం నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని దావణగెరె ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే హొళల్కెరె పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవించే వక్కల వ్యాపారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కల్లవ్వనాగతిహళ్లిలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. బొలెరో వాహనం బోల్తా చిత్రదుర్గం జిల్లాలో ఘోరం ఘటనా స్థలంలో ఇద్దరు మృతి ఇదే ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి -
ఎక్కడైనా బ్యానర్ కట్టవచ్చు
సాక్షి,బళ్లారి: బ్యానర్లు నా ఇంటి ముందూ కట్టవచ్చు, సీఎం ఇంటి ముందు కూడా బ్యానర్లు కడతారని, అంతమాత్రాన ఇంత రాద్ధాంతం చేయాలా? అని ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రశ్నించారు. ఆయన మంగళవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. రగడకు కారకులందరిపై చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. బళ్లారి గౌరవాన్ని కాపాడేందుకు పార్టీలకతీతంగా పని చేయాలన్నారు. ఉన్నతాధికారుల సలహా సూచనలతోనే ఎస్పీని సస్పెండ్ చేశారన్నారు. పుణ్య పురుషుడు వాల్మీకి విగ్రహావిష్కరణ చేయడంలో రగడ జరగడం, ఒక యువకుడు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. గొడవ జరిగిన వెంటనే తనకు మొదట ఫోన్ చేసిన వ్యక్తి మాజీ మంత్రి శ్రీరాములులేనన్నారు. పరిస్థితి అదుపు తప్పుతోందని చెప్పారని, తాను వెంటనే ఎస్పీతో మాట్లాడానన్నారు. అయితే ఎందుకు, ఎలా జరిగింది అనేదానిపై పోలీసులు విచారణ చేసి, చట్టప్రకారం ఇప్పటికే పలువురు అరెస్ట్ చేశారని, ఇంకా అరెస్ట్లు కూడా చేస్తారన్నారు. కాల్పుల ఘటన జరగకూడదని, అందుకు సంబంధించిన గన్మెన్లను కూడా అరెస్ట్ చేశారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా పని చేస్తున్నారన్నారు. గాలి జనార్దనరెడ్డి పైకి గురిపెట్టి ఎక్కడ కాల్చారు? ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మండిపాటు బళ్లారిలో పర్యటన, మృతుని కుటుంబానికి పరామర్శ పక్కా స్కెచ్తోనే విగ్రహావిష్కరణకు బ్రేక్ నగరంలో రెండు రోజుల తర్వాత జరగాల్సిన వాల్మీకి విగ్రహావిష్కరణను పథకం ప్రకారమే అడ్డుకున్నారనే అనుమానం కలుగుతోందని డీసీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. రాజశేఖర్ మృతదేహానికి రెండుసార్లు పోస్టుమార్టం నిర్వహించారని కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి పేర్కొనడంలో అర్థరహితమన్నారు. ఆయన రాజకీయంగా దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదన్నారు. ఆయన వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కచ్చితంగా ఒకేసారి పోస్టుమార్టం జరిగిందని అధికారులు సమాధానం ఇచ్చారన్నారు. రెండుసార్లు పోస్టుమార్టం కోరితే చేస్తారని, ఎలా పడితే అలా పోస్టుమార్టం చేయరన్నారు. తనపై కాల్పులు జరిపారని, హత్య చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్న గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిని ఎక్కడ కాల్చారు, ఎలా కాల్చారో చెప్పాలని ఎద్దేవా చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్, ఎమ్మెల్యేలు నారా భరత్రెడ్డి, నాగేంద్ర, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ధార్వాడ హైకోర్టుకు బాంబు బూచీ
హుబ్లీ: ధార్వాడ హైకోర్టు పీఠంలో బాంబు పెట్టినట్లు అధికారులకు ఈ–మెయిల్ చిరునామాకు సందేశం అందింది. ఈ నేపథ్యంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జిల్లా ఎస్పీ గుజ్జన్ ఆర్య నేతృత్వంలో తీవ్రంగా గాలించారు. కోర్టు హాలు నుంచి న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగులు తదితరులతో పాటు కక్షిదారులను హుటాహుటిన బయటకు పంపి వేసి బాంబు స్క్వాడ్ దళంతో అణువణువు పరిశీలించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ–మెయిల్ ద్వారా సమాచారం వచ్చిందన్నారు. దీంతో తాను తక్షణమే పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశానన్నారు. అందరినీ బయటకు పంపించి వివిధ బృందాలతో కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. పరిశ్రమల అభివృద్ధికి చొరవ చూపాలి రాయచూరు రూరల్: రాయచూరులో పరిశ్రమల అభివృద్ధికి చొరవ చూపాలని రాయచూరు కాటన్ మిల్లర్స్ సంఘం అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాటన్ మిల్లర్స్ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాయచూరులో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కురుబదొడ్డి, సింగనోడి, చంద్రబండల్లో 693 ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. ఖాళీ స్థలానికి ప్రభుత్వం పన్ను విధించడాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రాయచూరు జిల్లాలో యువతకు ఉద్యోగాలు కల్పించేలా స్పిన్నింగ్ మిల్లును ప్రారంభించాలన్నారు. అన్నదాన కేంద్రం ప్రారంభం హుబ్లీ: నగరంలో నిరాశ్రయులకు కాసింత ఓదార్పునిచ్చి తమకు చేతనైన రీతిలో వారికి అండదండగా నిలిచిన నగరంలోని కరియప్ప శిరహట్టి దంపతులు తమ సమాజ సేవలను విస్తరించారు. క్రమంలో వారు గదగ్ జిల్లా చారిత్రాత్మక స్థలం లక్ష్మేశ్వరలో ఆకలిగొన్న వారికి అన్నం పెట్టే అన్నదాత సత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆ మేరకు మంగళవారం సంబంధిత బోర్డును ఆ గ్రామ ప్రముఖులచే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరియప్ప శిరహట్టి సేవా సంఘం అధ్యక్షుడు కరియప్ప మాట్లాడుతూ గత 15 ఏళ్ల నుంచి హుబ్లీలోని వీధుల్లో నిరాశ్రయులకు, దిక్కుమొక్కులేని వారికి స్నానం, గడ్డం చేయించి, బట్టల పంపిణీతో పాటు అన్నం, చపాతీలు పెట్టే వారమన్నారు. ఈ క్రమంలో తమ సేవలను తమ సొంత ఊరు అయిన లక్ష్మేశ్వరలో కూడా చేపట్టాలని స్థానికులు మద్దతు తెలపడమే కాక అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించడంతో లక్ష్మేశ్వరలో ఆకలిగొన్న వారికి అన్నం పెట్టే కేంద్రంగా హసిదవర అన్నజోళిగె కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. నిరాశ్రయులు తమను సంప్రదించి, తమ ఆకలి బాధలను, ఇతర సమస్యలను తీర్చుకోవచ్చని కరియప్ప, సునంద దంపతులు తెలిపారు. -
నేరాల నియంత్రణపై ముమ్మర ప్రచారం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగం నడుం బిగించాలని ఎస్పీ అరుణాంగ్షు గిరి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని సైబర్ పోలీస్ స్టేషన్ను సందర్శించి అధికారులకు సలహా సూచనలు ఇచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ట్రాఫిక్ నియమాలు, ఈఆర్ఎస్ 112, 1930 సహాయవాణి ద్వారా ప్రజలు సహకరించాలన్నారు. ఈ విషయంలో సాంకేతిక రంగంలో మార్పులు వచ్చినా నేరాలు కట్టడి కాకపోవడంపై అందరూ ఆలోచించాలన్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్ట్రాగాంవంటి వాటిని వినియోగించే ముందు ఆలోచించుకోవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ హరీష్, డీఎస్పీ శాంతవీర, ఇతర పోలీస్ అధికారులున్నారు. -
జోషి పరిశోధనా సహకారం అపారం
హొసపేటె: కన్నడ భాష, సంస్కృతి, పరిశోధన రంగానికి లోతైన, విమర్శనాత్మక కృషి చేసిన ప్రముఖ ఆలోచనాపరుడిగా డాక్టర్ శంబా జోషి గుర్తింపు పొందారని హంపీ కన్నడ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ డీవీ.పరమశివమూర్తి తెలిపారు. ఆయన కన్నడ యూనివర్సిటీలో జరిగిన డాక్టర్ శంబా జోషి 130వ జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. డాక్టర్ శంబా జోషి తనను తాను ఉపరితల అధ్యయనాలకే పరిమితం చేసుకోలేదు. కానీ సమాజంలోని లోతుల్లోకి వెళ్లి కొత్త పరిశోధనలు చేశారన్నారు. ఇప్పటికే స్థాపించిన నమూనాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా అతను విమర్శనాత్మక, ప్రశ్నించే పరిశోధన పద్ధతిని అనుసరించారన్నారు. డాక్టర్ శ్యామ్ బీ.జోషి బంధుత్వం, జానపద కథలు, సంస్కృతం మూలాలపై అనేక ముఖ్యమైన పరిశోధనలు నిర్వహించారన్నారు. కనిపించని మూలాల విలువలు, సాంస్కృతిక చిహ్నాలను కనిపించే మూలాల కంటే ఎక్కువగా అధ్యయనం చేయాలనే అభిప్రాయాన్ని ఆయన సమర్థించాడు. ఈ రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై అల్లర్లు జరుగుతున్న సమయంలో, కన్నడ, మరాఠీ మాట్లాడే వారి మధ్య సాంస్కృతిక జీవితం సామాజిక ప్రవర్తన, రాజకీయ అంశాలు దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయని డాక్టర్ శ్యామ్.బీ జోషి చాలా కాలం క్రితమే స్పష్టం చేశారని వైస్ ఛాన్సలర్ గుర్తు చేశారు. భాష విభజన సాధనంగా కాకుండా సృజనాత్మకతకు వారధిగా నిలిచిందన్నారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేదు
రాయచూరు రూరల్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ పార్టీకి పొత్తు లేదని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జెడ్పీ, టీపీ, జీపీ, నగరసభ, సిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. బీఎల్ఓల వద్ద ఉన్న ఓటర్ల జాబితాను సరి చేసి విడిచి పెట్టిన వారి పేర్లను నమోదు చేయడానికి అందరూ ముందుండాలని అన్నారు. ఈ నెల 11 నుంచి దేవదుర్గలో సోషల్ మీడియా ద్వారా ప్రచారానికి శ్రీకారం చుడతామన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మాత్రమే బీజేపీ, జేడీఎస్ పార్టీల మైత్రి కొనసాగుతుందన్నారు. విలేఖర్ల సమావేశంలో శివశంకర్, నరసింహ నాయక్, రామకృష్ణ, లక్ష్మిపతి, అమరేష్ పాటిల్, నాగరాజ్లున్నారు. వెనెజువెలాపై దాడి తగదు హొసపేటె: దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాపై శనివారం అమెరికా సైనిక దళాలు నిర్వహించిన వైమానిక దాడిని ఖండిస్తూ నగరంలో సీపీఐ(ఎం) కార్యకర్తలు నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బోర్డు సభ్యుడు బసవరాజ్ మాట్లాడుతూ వెనెజువెలాపై అమెరికా దాడిని, అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోరెస్ అపహరణను సీపీఎం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. భారత్ సీపీఎంతో సహా వామపక్షాలు వెనెజువెలా దేశ ప్రజలకు మద్దతు తెలిపాయని ఆయన అన్నారు. నిరసనలో సీపీఎం కార్యదర్శి ఎన్.యల్లాలింగ, రాష్ట్ర కమిటీ నాయకురాలు బి.మాళమ్మ, ఎం.గోపాల్, ఎం.జంబయ్య నాయక్, వి.స్వామి, బీ.మహేష్, కే.నాగరత్నమ్మ, సిద్దలింగప్ప, సుంకమ్మ, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. వెనెజువెలాపై దాడికి నిరసన రాయచూరు రూరల్: అమెరికా సైన్యం వెనెజువెలా వంటి చిన్న దేశంపై దాడి చేయడం తగదని సీపీఐ(ఎంఎల్) పేర్కొంది. మంగళవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు వీరేష్ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిన్న దేశమైన వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురో, భార్యను కిడ్నాప్ చేయడం సరి కాదన్నారు. ఈ ఘటనను ఇతర యూరప్ దేశాలు ఖండించక పోవడంతో పాటు దానికి మద్దతు పలకడం అమానుషమన్నారు. కిడ్నాప్కు గురైన వారి విడుదలకు భారత్తో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర దేశాలు ముందుకు రావాలని కోరుతూ డొనాల్డ్ ట్రంప్ చిత్రపటాన్ని దహనం చేశారు.నీలగల్ జాతరకు శ్రీకారం రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా నీలగల్లో ఈ నెల 10 నుంచి జరగనున్న జాతర ఉత్సవాలకు నాల్వార కోరి సిద్దేశ్వర పీఠాధిపతి తోటేంద్ర స్వామీజీ శ్రీకారం చుట్టారు. సోమవారం రాత్రి మఠంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం హేమరెడ్డి మల్లమ్మ పురాణం గురించి వివరించారు. కేవలం సహనంతో ఆదర్శ గృహిణిగా జీవితాన్ని సాగించిన సాధ్వి అని అన్నారు. శివభక్తితో పాటు సంసారిక జంజాటంలో ఉన్న ఒడిదుడుకులను సైతం ఎదిరించిన మహా సాధ్విగా కొనియాడారు. మానవుడు సమాజంలో సత్పురుషునిగా మారాలని సూచించారు. పంచాక్షరి, అభినవ రాచోటి రేణుక శాంతమల్ల శివాచార్య, విరుపాక్ష పండితారాధ్య, శంభు సోమనాథ శివాచార్య, విశ్వారాధ్య, మహాంతదేవరులున్నారు. విద్యుదుత్పత్తి కేంద్రాల పరిశీలన రాయచూరు రూరల్: ఆర్టీపీఎస్, వైటీపీఎస్ విద్యుత్ స్ధావరాలను తుమకూరు సిద్దగంగ మఠం పీఠాధిపతి సిద్దలింగ స్వామీజీ వీక్షించారు. సోమవారం ఆర్టీపీఎస్, వైటీపీఎస్ అధికారులు స్వామీజీకి యూనిట్ల పని తీరు, బాయిలర్, కూలింగ్ టవర్, ఉత్పత్తి సామర్థ్యం కల ప్లాంట్లను చూపించారు. రాయచూరు నుంచి రాష్ట్రానికి 60 శాతం విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలను చూశారు. నీటి ఆవిరితో విద్యుత్ ఉత్పత్తి వల్ల ఈ ప్రాంత ప్రజలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం విచిత్రమన్నారు. ఈ ప్రాంతంలో అధిక మొత్తంలో చెట్లు నాటాలని అధికారులకు సూచించారు. -
మృతుడి కుటుంబానికి డీకేశి పరామర్శ
సాక్షి,బళ్లారి: జనవరి 1వ తేదీన నగరంలోని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద చోటు చేసుకున్న రగడలో ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఆప్తుడు సతీష్రెడ్డి గన్మెన్ గురుచరణ్ సింగ్ కాల్పులు చేసిన నేపథ్యంలో మృతి చెందిన రాజశేఖర్ కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పరామర్శించారు. మంగళవారం ఆయన బెంగళూరు నుంచి బళ్లారికి విచ్చేసి, నేరుగా నగరంలోని హుస్సేన్ నగర్లో మృతుడు రాజశేఖర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కాల్పుల్లో మృతి చెందిన రాజశేఖర్ తల్లి తులసి, సోదరి ఉమా, సోదరుడు ఈశ్వర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. రగడలో మీ కుటుంబ సభ్యుడు మృతి చెందడం తనను ఎంతో బాధిస్తోందన్నారు. అయితే మృతి చెందిన వ్యక్తిని ఎవరూ వెనక్కు తేలేమన్నారు. ధైర్యంగా ఉండాలని ఓదార్పు అయితే తమకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులకు ఉద్యోగం, ఇల్లు కట్టించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని మనవి చేశారు. తమకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు మృతి చెందాడని, తన భర్త కూడా మరణించారని మృతుడి తల్లి కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులందరిని ఆయన ఓదార్చారు. మంత్రి జమీర్ అహమ్మద్, ఎమ్మెల్యేలు నారా భరత్రెడ్డి, నాగేంద్ర, గణేష్, బుడా అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, కార్పొరేటర్ వివేక్(విక్కీ) పాల్గొన్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా డీసీఎంకు ఘన స్వాగతం పలికిన నేతలు -
వీడిన చోరీ కేసుల మిస్టరీ
చెళ్లకెరె రూరల్: నగరంలో జరిగిన ప్రత్యేక దొంగతనాల కేసుల మిస్టరీని ఛేదించడంలో చెళ్లకెరె పోలీసులు సఫలీకృతులయ్యారు. ఈ కేసులకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.లక్షలాది విలువ చేసే బంగారు, వెండి, నగదును స్వాధీనపరుచుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 9న నగరంలోని రాణిచెన్నమ్మ రహదారిలో వీ.లక్ష్మి అనే మహిళ నడుచుకుంటూ వెళుతుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 65 గ్రాముల బంగారు మాంగల్యం చైన్ను లాక్కొని పరారయ్యారు. శ్యామసుందర్, దుర్గావర గ్రామానికి చెందిన జేఎస్.మంజునాథ్ అనే వారిని అజ్జనగుడి వద్ద అరెస్ట్ చేసి రూ.7 లక్షల విలువ చేసే 65 గ్రాముల బంగారు చైన్, బైక్ను జప్తు చేసుకున్నారు. మరో ఘటనలో .. నగరంలోని కుబేర నగరలో జరిగిన మరో ఇంటి దొంగతనంలో బెంగళూరుకు చెందిన నిందితుడు మహ్మద్ ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.1.74 లక్షల నగదు, రూ.1.18 లక్షల విలువ చేసే 493 గ్రాముల వెండిని స్వాధీనపరుచుకున్నారు. జిల్లా ఎస్పీ రంజిత్కుమార్ బండారు, ఏఎస్పీ శివకుమార్, డీఎస్పీ సత్యనారాయణరావ్ల మార్గదర్శనంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కే.కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఈరేష్, కానిస్టేబుల్ శివరాజ్ కార్యాచరణలో పాల్గొన్నారు. ముగ్గురు దొంగల అరెస్టు రూ.లక్షలాది సొత్తు స్వాధీనం -
జీ రాం జీ మాకొద్దు
మండ్య: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నరేగా పథకం స్వరూపాన్ని మార్చివేసి ఆ స్థానంలో జీ రాం జీ పథకాన్ని అమలు చేయడంపై వ్యవసాయ గ్రామీణ కార్మికుల సంఘం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్ ముందు బైఠాయించారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. కొత్త పథకంతో కూలికార్మికులకు 125 రోజుల పాటు పని దొరకదని, ఇబ్బందులు తప్పవని తెలిపారు. అందువల్ల పాత చట్టాన్ని పునరుద్ధరించాలని కోరారు. పెద్దసంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ధర్మస్థల మిస్సింగులపై సుప్రీంలో విచారణ శివాజీనగర: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల పోలీస్ స్టేషన్లో గత కొన్ని సంవత్సరాల నుంచి నమోదైన 74 మంది మహిళల అదృశ్యం, అనాథ శవాల కేసులపై కొత్తగా దర్యాప్తు చేపట్టాలని దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మార్చి 23 కు వాయిదా వేసింది. అత్యాచారం, హత్యకు గురైన విద్యార్థిని సౌజన్య తల్లి కుసుమావతి గౌడ ఈ పిటిషన్ వేశారు. న్యాయమూర్తి జస్టిస్ సంజయ్కుమార్ నేతృత్వపు ద్విసభ్య ధర్మాసనం విచారించింది. వరుసగా రెండేళ్ల పాటు వందలాది అనాథ మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు గతంలో మాస్క్మ్యాన్ చిన్నయ్య ప్రకటించడాన్ని న్యాయవాదులు ప్రస్తావించారు. అక్కడి నేత్రావతి నది ఒడ్డులో 74 అనాథ శవాలను పూడ్చిపెట్టినట్లు ఆరోపణలు వినిపించాయి, ఆ అన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదై, విచారణ జరపాలి, అనాథ శవాలు, అదృశ్యం కేసులకు న్యాయం లభించాలని కుసుమావతి కోరారు. ఇరువర్గాల విచారణల తరువాత జడ్జిలు మార్చి ఆఖరికి వాయిదా వేశారు. కోగిలు లేఔట్లో 37 కుటుంబాలే లోకల్ ● 119 ఇళ్లలో అధికారుల సర్వే శివాజీనగర: బెంగళూరులోని యలహంక కోగిలు లేఔట్లో ఆక్రమణల తొలగింపు తెలిసిందే. ఇందులో 37 కుటుంబాలను మినహాయిస్తే మిగిలినవారంతా వేరే రాష్ట్రాల నుంచి వచ్చినవారని గ్రేటర్ బెంగళూరు, రెవిన్యూ, గృహవసతి అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. అక్కడ కూల్చివేసిన 119 ఇళ్లను సర్వే చేశారు, 118 కుటుంబాలకు ఆధార్ కార్డులు ఉన్నాయి, 102 కుటుంబాలకు ఓటర్ కార్డులు, 77 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నట్లు తెలిపారు. 63 కుటుంబాలకు ఆదాయ ధృవీకరణ పత్రం, 56 కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలు ఉన్నాయి. వీరిలో 37 కుటుంబాలకు మాత్రమే గృహ వసతి లభించే అవకాశముంది. అపార్టుమెంటులో ఫ్లాట్లు కోగిలు బండె క్వారీ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన 167 ఇళ్లు, షెడ్లను తొలగించాక, తమకు గృహవసతి ఇవ్వాలని 250 కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇళ్ల కూల్చివేతను కేరళ సర్కారు వ్యతిరేకించడంతో ఇది రెండు రాష్ట్రాల సమస్యగా మారింది. అర్హులకు బైయప్పనహళ్లిలో నిర్మించిన వసతి అపార్టుమెంట్లో ఫ్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానించింది. 8 నుంచి వర్షసూచన యశవంతపుర: బంగాళాఖాతం సముద్రంలో మార్పుల కారణంగా ఈ నెల 8 నుంచి కరావళి, మలెనాడు, దక్షిణ ఒళనాడుతో అనేక ప్రాంతాలలో వానలు పడే అవకాశం ఉన్నట్లు బెంగళూరు వాతావారణశాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో మేఘావృతమై ఉంటుంది. చలిగాలులు వీచనున్నాయి. దీంతో తెల్లవారుజామున చలి అధికం కానుంది. ఎక్కువ ప్రాంతాలలో పొగమంచు ఆవరిస్తుంది. ఉత్తర ఒళనాడు, మధ్య కర్ణాటక భాగంలో చలి అధికంగా ఉంటుంది. నాలుగైదు రోజుల నుంచి చలి తగ్గినట్లే తగ్గి మళ్లీ ఎక్కువ కావడం తెలిసిందే. పగటిపూట కొంచెం ఎండలు తీవ్రత పెంచాయి. ఈ తరుణంలో వర్షసూచన వెలువడింది. ఇంటి దొంగల అరెస్టు, భారీగా నగలు సీజ్ యశవంతపుర: ఇంటి యజమాని అభిషేక్ తాళం చెవిని ఇచ్చేసి, కుటుంబంతో కలిసి తమిళనాడుకు విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఇంటిలో పనిమనిషులు దోచుకుని పరారైన కేసులో బెంగళూరు సదాశివనగర పోలీసులు పురోగతి సాధించారు. ఇంటిలో పని చేస్తున్న హాజిరా బేగం (19), ఆమె భర్త షబ్బీర్ హుసేన్(23) ను అసోంలో అరెస్ట్ చేశారు. గత నెల 30న ఈ చోరీ జరిగింది. 7 విలువైన గడియారాలతో పాటు రూ.1.37 కోట్ల విలువగల బంగారు నగలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. -
ఆనేకల్లో భారీ భూ డీల్
బొమ్మనహళ్ళి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలో ఓ ఐటీ సంస్థ 53.5 ఎకరాల భూమిని మరో రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించడం పెద్ద దుమారం రేపుతోంది. ఈ కేసుపై బెంగళూరు జిల్లా కలెక్టర్ దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని రెవిన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ తెలిపారు. ఏమిటీ డీల్.. ఓ ఐటీ సంస్థ ఆనేకల్ తాలూకాలోని తన 53.5 ఎకరాల భూమిని రియాల్టీ దిగ్గజానికి రూ.250 కోట్లకు విక్రయించింది. తన ఆస్తుల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ ఆస్తిని విక్రయించినట్లు పేర్కొంది. అలాగే, భూమి అమ్మకంలో ఎటువంటి చట్టాన్ని ఉల్లంఘించలేదు. అన్ని నియమాలను పాటించాం, ఈ భూమిని ప్రభుత్వం కేటాయించలేదని పేర్కొంది. అభ్యంతరాలు? కానీ ఈ వాదనను ప్రభుత్వం అంగీకరించలేదు. భూవిక్రయాలను ఆమోదించిన సర్జాపుర సబ్ రిజి స్ట్రార్ రవి సంకనగౌడను సస్పెండ్ చేసింది. అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా 40 సేల్ డీడ్లు పుట్టుకొచ్చాయని ఆరోపణలు ఉన్నాయి. అలాగే రిజిస్ట్రేషన్ శాఖ సాఫ్ట్వేర్ కావేరి 2.0లోని లోపాలను వాడుకున్నారని, కోర్టు ఆదేశం ఉన్నట్లయితే సేల్ డీడ్లు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు పొందే నిబంధన ఉంది. దీనిని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. రెండు ప్రైవేటు సంస్థల ఒప్పందం సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు -
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నెట్టుకురావాల్సిన జీవితాన్ని కొందరు మధ్యలోనే వదిలేస్తున్నారు. సమస్యలు, సంకటాలు వచ్చాయంటూ అకాల మరణాన్ని ఆశ్రయిస్తున్నారు. భారత ఐటీ రాజధానిలో ఈ ప్రమాదకర ధోరణి మరీ అధికమైంది. అందులోనూ యువత, విద్యార్థులు అధికంగా ఆత్మహత్యల పాలవుతూ కన్నవ
మానసిక సమస్యల పాపం ● నిమ్హాన్స్ సంస్థ విశ్లేషణ ప్రకారం బాధితుల్లో మూడోవంతు మానసిక రోగాలతో బాధపడేవారే. మిగిలిన రెండు భాగాల మంది ఆర్థిక సమస్యలు, కుటుంబంలో బాంధవ్యాలను కోల్పోవడంతో వ్యథచెంది తనువు చాలిస్తున్నారు. ● గతంలో ఆత్మహత్యకు దోహదంచేసే క్రిమిసంహారక మందులతో పాటు విషపూరిత సాధనాలు సులభంగా లభించేవి కావని మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ బీఎన్. రవీశ్ చెప్పారు. మానసిక ఒత్తిళ్లతోనూ బలవన్మరణాలుటెలిమనస్ సహాయం బనశంకరి: ఎంతో విలువైన జీవితం మధ్యలోనే కడతేరిపోతోంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ గొడవలు, నిరుద్యోగం, అనారోగ్యం.. ఇలా ఎన్నో కారణాల వల్ల బెంగళూరు నగరంలో ఆత్మహత్యల సంఖ్య విస్తరిస్తోంది. గత నాలుగేళ్లలో 9,450 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ప్రతిరోజు సరాసరి 6 లేదా 7 మంది ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. మానసిక అనారోగ్యాలు కూడా బలవన్మరణాలకు కారణం అవుతున్నాయి. ఏటా 2 వేల మంది.. రాష్ట్ర హోంశాఖ తెలిపిన సమాచారం ప్రకారం బెంగళూరు లో ప్రతి ఏటా 2 వేల మంది ఆత్మహత్యతో అకాల మృత్యువాత పడుతున్నారు. భవనాల పై నుంచి దూకడం, ఉరివేసుకోవడం, పురుగుల మందు తాగడం, రైలు కింద పడడం, తుపాకీతో కాల్చుకోవడం తదితర మార్గాల్లో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది యువత కావడం మరింత విషాదకరం. 2022 జనవరి నుంచి 2025 నవంబరు వరకు ఆత్మహత్యకు పాల్పడిన 9,450 మందిలో 8,148 మంది ఉరివేసుకున్నారు. 740 మంది విషం తాగి చనిపోగా 204 మంది ఎత్తైన కట్టడాల నుంచి దూకారు. 2022లో 2,313 మంది, 2023లో 2,370 మంది, 2024లో 2,403 మంది, 2025 నవంబరు నాటికి 2,364 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిమ్హాన్స్ ప్రారంభించిన టెలిమనస్ సహాయవాణికి (14416) ప్రతినిత్యం వేలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మానసిక కల్లోలంతో కాల్ చేస్తున్నారు. మానసికంగా దృఢంగా ఉండాలని వారికి కౌన్సిలింగ్ ఇస్తుంటారు. 2022 అక్టోబరులో ఆరంభించిన టెలిమనస్కు ఇప్పటివరకు 30 లక్షల మందికి పైగా కాల్ చేశారు. ఇందులో ఎక్కువమంది 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు ఉన్నారు. దుఃఖం, భయం, పెళ్లి, ఆర్థిక ఇబ్బందుల గురించి, పరీక్షల ఒత్తిడి మీద ఫిర్యాదు చేశారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అండగా నిలిచినట్లు టెలిమనస్ చీఫ్ అర్చనా కార్తీక్ తెలిపారు. -
గ్రేటయ్యా.. సిద్దరామయ్య
మైసూరు: దేవరాజ అరసు తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యంత ఎక్కువ కాలం ఉన్న నేతగా సిద్దరామయ్య మంగళవారంతో రికార్డు సృష్టించారు. దీంతో ఆయన సన్నిహిత మంత్రులు, అభిమానులు అభినందనలతో ముంచెత్తారు. మైసూరులో టి.కె. లేఔట్లోని నివాసంలోనే ఉన్న సిద్దరామయ్యను కలవడానికి నేతలు, అధికారులు తరలివచ్చారు. జిల్లా, నగర నేతలు సంబరాలు చేసుకుని లడ్డు, పలావు, మైసూరు పాక్లు తదితరాలను ప్రజలకు పంపిణీ చేశారు. కె.ఎస్. శివరాము, యోగేష్ ఉప్పర్, హెచ్.ఎస్. ప్రకాష్, జె.గోపీ, మోహన్, కోటేహుండి సి. మహదేవ్, హరీష్ మోగన్న తదితరులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద పోస్టర్లు, బ్యానర్లతో సందడి చేశారు. జిల్లా కలెక్టర్ జి. లక్షీమాకాంత్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్, డీఐజీ బోరలింగయ్య, ఎస్పీ మల్లికార్జున బాలదండి తదితరులు సీఎంను కలిశారు. నాటుకోడి బిర్యానీ పంపిణీ సీఎం సిద్ధరామయ్య నివాసం సమీపంలో నాటు కోడి బిర్యానీని ప్రజలకు పంపిణీ చేశారు. మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని నినాదాలు చేశారు. చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సిటీ బస్టాండ్లో మైసూర్ పాక్ను పంచిపెట్టారు. ఎస్.ఎన్. రాజేష్, నవీన్ కెంపి, రవిచంద్ర, రాకేష్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. సిద్దరామయ్యే సరైన వ్యక్తి: మహదేవప్ప సిద్ధరామయ్య లేకుండా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఊహించడం కష్టం అని ఆయన మిత్రుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.సి. మహదేవప్ప అన్నారు. మంగళవారం మైసూరులోని సెనేట్ భవన్లో ఓ వేడుకలో మాట్లాడారు, 2028 వరకు సిద్ధరామయ్య పదవిలో ఉంటారు. అధికారం ఎల్లప్పుడూ సరైన వ్యక్తుల చేతుల్లోనే ఉండాలి. నన్ను, పరమేశ్వర్ను ఎవరైనా సీఎం కావాలని కోరవచ్చు. కానీ ఏకై క వ్యక్తి సిద్ధరామయ్య మాత్రమే అని చెప్పారు. సిద్ధరామయ్య అధికారం నుంచి తప్పుకుంటే, అహింద వర్గం మునిగిపోతుందన్నారు. ఐదేళ్లూ ఆయనే సీఎం: రాయరెడ్డి బనశంకరి: సీఎంగా సిద్దరామయ్య ఐదేళ్లు ఉంటారు. ఆయనను సగం కాలానికి ఎన్నుకోలేదు అని ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి అన్నారు. విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మార్పు అనేది మీడియా సృష్టి అన్నారు. కొంతమంది కాలక్షేపానికి డీకే.శివకుమార్ సీఎంఅని చెబుతున్నారని, ఆయనకు తరువాత అవకాశం దక్కవచ్చు అన్నారు. ఈసారి బడ్జెట్ పరిమాణం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు. సిద్దునే చెప్పారు కదా: హోంమంత్రి శివాజీనగర: దేవరాజ అరసు రికార్డు బద్దలుకొట్టారని సీఎం సిద్దరామయ్యకు హోం మంత్రి పరమేశ్వర్ అభినందనలు తెలిపారు. ఇందుకు సోనియా, రాహుల్, ఖర్గే, వేణుగోపాల్ కూడా సహకారం అందించారన్నారు. పూర్తికాలం నేనే సీఎం అని సిద్దరామయ్య చెప్పిన తరువాత ఇంకేముంది? ఆయన విశ్వాసం అది, నాకు కూడా ఆ నమ్మకం ఉంది అని చెప్పారు. అత్యంత దుష్పరిపాలన: జేడీఎస్ శివాజీనగర: సిద్దరామయ్యది దుష్పపరిపాలన అని ప్రతిపక్ష జేడీఎస్ ఎక్స్లో దుయ్యబట్టింది. రాష్ట్రంలో అత్యధిక మతకలహాలు, హింస, అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు, అవినీతిలో కర్ణాటక నంబర్ 1 రాష్ట్రమైంది. ఎంతోమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లారు. ప్రభుత్వ అధికారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాల్మీకి మండలి, భోవి మండలి, అంబేద్కర్ మండలిలో కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి, నిత్యావసరాల ధరలు పెంచి సామాన్య ప్రజల బతుకును నకరయాతనకు గురిచేస్తున్నారు, గుంతల రోడ్ల వల్ల ప్రజలు చనిపోతున్నారు. రాష్ట్రం అప్పులు పెరిగాయి, కులమతాల విద్వేషాలు పెచ్చరిల్లాయి అని ఆరోపించింది. అత్యధిక కాలం సీఎంగా రికార్డు సన్నిహితులు, అభిమానుల సంబరాలు -
నమో లక్ష్మీనారాయణా..
మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామంలో ఉన్న పురాతన శ్రీలక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలను మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు సురేష్ చైతన్య నేతృత్వంలో మూల విగ్రహానికి పంచామృత అ భిషేకం, వేదమంత్రపారాయణం, అలంకారం, మంగళహారతి సాగించారు. ఆలయంలోని శ్రీ కన్నికా పరమేశ్వరి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీసోమేశ్వర స్వామి, శ్రీఆంజనేయస్వామి, నవగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. సంపులో పడి తల్లీబిడ్డల మృతి ● తుమకూరు వద్ద ఘోరం తుమకూరు: తుమకూరు తాలూకాలోని హిరేహళ్లి సమీపంలోని సంగనహళ్లి కాలనీలో మంగళవారం తమ ఇంటి పక్కన ఉన్న సంప్లో పడి తల్లి, ఆమె కవల పిల్లలు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. విజయలక్ష్మి (26), 5 ఏళ్ల పాప చేతన, బాబు చైతన్య మృతులు. సాయంత్రం 4 గంటలప్పుడు సంప్లో పడిపోయారని తెలిసి ఫైర్ సిబ్బంది వచ్చారు. అందులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. సంపు సుమారు 10 అడుగుల లోతు ఉంది. అనుకోకుండా పడిపోయారా, లేక ఆత్మహత్యా? అనేది తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బళ్లారిపై సీబీఐ దర్యాప్తు: బీజేపీ శివాజీనగర: బళ్లారిలో 1వ తేదీన జరిగిన అవాంఛనీయ ఘటనల గురించి రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసిందని ఎమ్మెల్సీ సీటీ రవి తెలిపారు. బెంగళూరులో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బళ్లారిలో జనార్దనరెడ్డి హత్యకు ప్రయత్నం జరిగింది. అదుపు తప్పి కాంగ్రెస్ కార్యకర్త చనిపోయాడు, దీనిమీద సీబీఐ దర్యాప్తు చేయించాలని కోర్ కమిటీలో నేతలు తీర్మానించారన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై జేడీఎస్తో సమాలోచన జరిపి అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర.. జేడీఎస్తో మాట్లాడతారని కోర్ కమిటీ నిర్ణయించిందన్నారు. యడియూరప్ప, సహ ఇన్చార్జి సుధాకర్రెడ్డి, కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి తదితరులు కమిటీ భేటీలో పాల్గొని రాజకీయ అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారన్నారు. రూ.3.5 కోట్ల డ్రగ్స్ సీజ్ ● టెక్కీ, మరొకరు అరెస్టు బనశంకరి: న్యూ ఇయర్ పార్టీల్లో విక్రయాల కోసం శ్మఽశానంలో డ్రగ్స్ దాచిపెట్టిన ఇద్దరిని బెంగళూరు అశోకనగర పోలీసులు అరెస్ట్చేశారు. వీరి నుంచి రూ.3.5 కోట్ల విలువచేసే ఎండీఎంఏ క్రిస్టల్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. కేసు వివరాలను ఆయన తెలిపారు. చిక్కబాణసవాడి నివాసి, టెక్కీ మహమ్మద్ తారిఖ్ ఇక్బాల్, కాడుగోడి శీగేహళ్లివాసి షేక్ అహ్మద్ అబ్రాజ్ అనే ఇద్దరు నిందితులు. హోసూరురోడ్డు హిందూశ్మశానంలో ఓ సమాధి పక్కన డ్రగ్స్ను దాచి ఉంచి, గిరాకీలకు విక్రయించేవారు. పోలీసులకు తెలిసి దాడి చేసి 2.48 కేజీల ఎండీఎంఏ, బైక్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే సీగేహళ్లి ఇంట్లో దాచిపెట్టిన 720 గ్రాముల ఎండీఎంని వశపరచుకున్నారు. మొత్తం డ్రగ్స్ విలువ రూ.3.5 కోట్లు అని తెలిపారు. ల్యాప్టాప్ చోరీల్లో స్పెషలిస్టులు యశవంతపుర: సిలికాన్ సిటీలో పీజీ హాస్టళ్లలోకి చొరబడి ల్యాప్టాప్లను ఎత్తుకెళ్లే ఇద్దరు ఘరానా చోరులను ఎలక్ట్రానిక్ సీటీ పోలీసులు అరెస్ట్ చేసి రూ.40 లక్షల విలువగల 48 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని ఓ ఎమ్మెల్యే బంధువు, ఐటీ ఇంజనీరు గౌతమ్, రాజదొరైలను పోలీసులు అరెస్ట్ చేశారు. దొడ్డతోగూరు అబ్బయ్యస్టీట్లోని ఒక పీజీలో డిసెంబర్ 28న ల్యాప్టాప్లు చోరీ కావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టగా మొదట రాజదొరై దొరికాడు. అతనిని ప్రశ్నించగా నగరంలో వివిధచోట్ల ల్యాప్టాప్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. అతడు ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడు గౌతమ్ను అత్తిబెళెలో అరెస్ట్ చేశారు. వీరు తమిళనాడులో అమ్మిన 6 ల్యాప్టాప్లు, స్నేహితులకు అమ్మిన 9 ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 38 మంది సొంతదారులను ఇప్పటివరకు గుర్తించారు. -
పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె?
సోషల్ మీడియా రోజుకో వింత వైరల్గా మారుతుంది. తాజాగా మరోసారి వైరల్ వింత మిస్టరీగా మార్చింది. ఎక్కడ చూసినా ఆమె ఫోటోనే. ఇంతింత కళ్లతో ఉన్న ఒక మహిళ ఫోటోను దిష్టి బొమ్మలా కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలలో తెగ వాడేస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ దీనిపై ఎక్స్లో ఒక పోస్ట్ పంచుకోవడంతో చర్చ జోరందుకుంది. బెంగళూరు వెలుపల ఉన్న ఒక నిర్మాణ స్థలంలో ఈ ఫోటో చూశాననీ, Google Lens, ఆన్లైన్ శోధనలను ప్రయత్నించానని, కానీ స్పష్టమైన సమాధానాలు దొరకలేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ "ఆమె ఎవరు?" కోరింది. దీంతో ఆన్లైన్లో హాస్యాస్పదమైన ఊహాగానాలతోపాటు, రకరకాల సమాధానాలు వచ్చాయి.I see this woman everywhere in Karnataka outside bangalore where there’s a construction happening. I tried google lens to check for discussions but can’t find any details. Who is she? pic.twitter.com/RAgMDXXJMt— unc unitechy (@unitechy) January 5, 2026కర్ణాటకలో నిర్మాణ ప్రదేశాలు, దుకాణాలు, పొలాలలో కూడా పదే పదే కనిపించే ఒక మహిళ ఫోటోపై దృష్టి సారించింది. సగం నిర్మించిన ఇళ్ల నుండి వ్యవసాయ భూమి వరకు ఈ మహిళ ఫోటోను ఎందుకు పెట్టారనే చర్చ ఇంటర్నెట్ వినియోగదారులను ఆశ్చర్యపర్చింది. ఆఖరికి AI చాట్బాట్లను కూడా ఈ పిక్ గురించి అడిగేశారు. ఈ ఫోటోను'దిష్టి పరిహారం'గా వాడుతున్నారని కొందరంటే, చిక్కబల్లాపుర సమీపంలోని ఒక పొలంలో దిష్టిబొమ్మలా ఇదే ఫోటోలను చూశానని మరొకరు కమెంట్ చేశారు.ఇదీ చదవండి: గ్వాలియర్లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్This lady is Niharika Rao, a You Tuber. Hundreds of people in Karnataka are putting up her photo in front of their shops, houses, farms to ward off negativity (drishti)This, is the true power of feminism pic.twitter.com/xsPRbFX7OD— 𝕲𝖆𝖓𝖊𝖘𝖍 * (@ggganeshh) May 16, 2024ఇంతకీ ఆమె ఎవరంటేగణేష్ అనే వినియోగదారు వివరణాత్మక వివరణ ఇవ్వడంతో దీనిపై ష్టత వచ్చింది. అతని ప్రకారం, ఫోటోలో ఉన్న మహిళ పేరు నిహారిక రావు. ఒక యూట్యూబర్. స్థానికులు ఆమె ఫోటోను ఇళ్ళు, దుకాణాలు, పొలాలు, నిర్మాణ ప్రదేశాల వెలుపల ఉంచిన తరువాత నెగిటివిటీ పోయిందట, మంచి జరిగిందట. ఇది ఆ నోటా ఈ నోటా పాకి దీన్ని దిష్టిబొమ్మగా వాడేస్తున్నారన్నమాట. ఇదీ చదవండి: సీనియర్ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలి -
ఇంట్లో మంటలు.. మహిళా టెక్కీ మృతి
బెంగళూరు: అనుమానాస్పదంగా మహిళా టెక్కీ మృతిచెందిన ఘటన ఈ నెల 3 తేదీన రామమూర్తినగర పోలీస్స్టేషన్ పరిధిలోని సుబ్రమణ్య లేఔట్లో జరిగింది. మృతురాలు శర్మిలా (34) ఇంట్లో శవమై తేలింది. వివరాలు.. మంగళూరుకు చెందిన శర్మిలా గత ఏడాది నుంచి బెంగళూరులో ఓ కంపెనీలో టెక్కీగా పనిచేస్తోంది. 3వ తేదీ రాత్రి 10.30 సమయంలో ఆమె ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంటి యజమాని విజయేంద్ర చూసి రామమూర్తినగర పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకుని తలుపులు బద్ధలుకొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. సోఫా, తెరలు, బెడ్షీట్లు కాలిపోగా శర్మిలా స్పృహ కోల్పోయినట్లు కనబడింది. మంటలు అదుపుచేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చనిపోయిందని తెలిపారు. అగ్నిప్రమాదం ఎలా జరిగింది, ఆమె మృతికి కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. -
మనసంతా చిత్రసంతె
● సిలికాన్ సిటీని మురిపించిన పెయింటింగ్స్ జాతా బనశంకరి: బెంగళూరులో ఏడాదికి ఒకరోజు జరిగే చిత్రలేఖనాల ప్రదర్శన.. చిత్రసంతె ప్రజలకు కనువిందు చేసింది. కుమారకృప రోడ్డు ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ, అలాగే సోమవారం కూడా కొన్ని స్టాళ్లలో చిత్రలేఖనాల ప్రదర్శన, విక్రయాలు జరిగాయి. విభిన్న రూపాల పెయింటింగ్స్ అబ్బురపరిచాయి. ఈదఫా చిత్రసంతెను 3 లక్షల మందికిపైగా సందర్శకులు వీక్షించగా, రూ.3 కోట్లకు పైగా పెయింటింగ్స్ వ్యాపారం జరిగినట్లు చిత్రకళాపరిషత్ సభ్యులు తెలిపారు. భారీ ధరలకు విక్రయం కొన్ని కళాఖండాలు భారీ రేట్లకు అమ్ముడుపోయాయి. బెంగళూరు కళాకారుడు భరణి ధరణ్ తైలవర్ణ నెమలి పెయింటింగ్ను రూ.లక్షకు విక్రయించారు. మైసూరు కళాకారుడు వీరేశ్ గీసిన ప్రకృతిలో శివుడు కళాకృతి రూ.1.30 లక్షలకు కొనుగోలు చేశారు. కోయంబత్తూరు సతీశ్ గీసిన ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులు ఒకేచోట చేరిన పెద్ద చిత్రలేఖనం రూ.3 లక్షల అమ్ముడుపోయింది. ఇలా కొందరు చిత్రకారులకు కాసుల వర్షం కురిసింది. వైవిధ్య వర్ణచిత్రాలను తిలకించి నగరవాసులు మురిసిపోయారు. వందలాది చిత్రకారులు తమ చిత్రలేఖనాలను అమ్ముకుని సంతృప్తిగా వెనుదిరిగారు.లెక్కకు మిక్కిలి పెయింటింగ్స్ముఖానికి వర్ణ అలంకారంతో బాలిక చిత్రలేఖనాలతో ఓ చిత్రకారిణి రమణీయంగా మయూరాలు పెయింటింగ్స్ వీక్షణం -
పోస్టుమార్టంపై గందరగోళం
సాక్షి,బళ్లారి: జనవరి 1వ తేదీన రాత్రి గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద బ్యానర్ రగడ అనంతరం కాల్పులు జరగడంతో ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఆప్తుడు సతీష్రెడ్డికి చెందిన గన్మెన్ గురుచరణ్ సింగ్ కాల్చడంతో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందినట్లు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు తేల్చిన సంగతి విదితమే. సతీష్రెడ్డి ముగ్గురు గన్మెన్లు గురుచరణ్సింగ్, మహేంద్రసింగ్, బల్జీత్సింగ్లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన నాలుగు రోజుల నుంచి రోజురోజుకు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండంటంతో రాష్ట్రంలోనే బళ్లారి ఘటన హాట్టాపిక్గా మారింది. రాజశేఖర్ మృతదేహానికి పోస్టుమార్టంలో లోపాలు జరిగాయని, మొదట బుల్లెట్ను వెలికితీయకుండానే ముగించారని, కొందరు వైద్యులు ప్రశ్నించడంతో మరోదఫా పోస్టుమార్టం నిర్వహించి తూటాను బయటకు తీసినట్లు సమాచారం. దీంతో పోస్టుమార్టం వ్యవహారం మిస్టరీగా మారింది. ఇక పోస్టుమార్టం చేసిన వైద్యుల సమాధానం ఏమిటో తెలియాల్సి ఉంది. బుల్లెట్ల ఆచూకీ కోసం ముమ్మర గాలింపు సోమవారం హుబ్లీ–ధాఽర్వాడ నుంచి విచ్చేసిన ప్రత్యేక ఎఫ్ఎస్ఎల్ బృందాలు గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్దకు చేరుకుని బుల్లెట్ల శకటాల కోసం ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా గాలించారు. ఈ సోదాల్లో ఓ బుల్లెట్ లభ్యమైంది. గాలి ఇంటిపైకి గురిపెట్టి కాల్చడంతో అద్దాలు పగిలిపోగా వాటిని కూడా పరిశీలించారు. మెటల్ డిటెక్టర్ల సాయంతో ఇంటి పరిసరాలను కూడా జల్లెడ పడుతున్నారు. ఆదివారం అరెస్టు చేసిన 26 మందిని పోలీసులు కోర్టులో హాజరు పరిచి, బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిని బళ్లారి జైలులో ఉంచడం మంచిది కాదని బెంగళూరుకు పంపించడం గమనార్హం. కాగా గాలి జనార్దనరెడ్డిని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లకు చెందిన పలువురు బీజేపీ నాయకులు పరామర్శలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పలువురు బీజేపీ నాయకులు గాలిని పరామర్శించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో గాలి ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ఎన్నిసార్లు చేశారో తెలియక మిస్టరీ రాష్ట్రంలో హాట్టాపిక్గా బళ్లారి ఘటన -
కొప్పళలో హైడ్రామా
సాక్షి,బళ్లారి: రైల్వే వంతెన పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి వీ.సోమణ్ణపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం కొప్పళ జిల్లా హిట్నాళ గ్రామంలో రూ.27 కోట్లతో నూతనంగా రైల్వే వంతెన ఏర్పాటు చేసే పనులకు ఆయన భూమిపూజ చేసేందుకు వచ్చారు. అయితే శంకుస్థాపన శిలాఫలకంలో స్థానిక జిల్లా మంత్రి, లోక్సభ సభ్యుడి పేర్లు లేవని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో చేరి, కేంద్రమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలను ఆయనపైకి విసిరేందుకు ప్రయత్నించి, చిందర వందర చేసి, నిరసన వ్యక్తం చేశారు. శంకుస్థాపన ముగిసిన తర్వాత కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, ఆయన వ్యక్తిగత సిబ్బంది భద్రత మధ్య ఆయనను సురక్షితంగా కారులోకి ఎక్కించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాము నిబంధనలకు వ్యతిరేకంగా శంకుస్థాపన చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ రైల్వే వంతెన నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధి వ్యతిరేకించడం బాధాకరమన్నారు. అయితే అభివృద్ధి పనులను ఎవరు అడ్డుకున్నా ఆపేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి సోమణ్ణ ఎదుట కాంగ్రెస్ నేతల ఆగ్రహం రైల్వే వంతెనకు శంకుస్థాపనలో చోటు చేసుకున్న రగడ కార్యక్రమంలో కుర్చీలను చిందర వందర చేసిన వైనం -
రాష్ట్రంలో పులుల గణన షురూ
శివాజీనగర: రాష్ట్రంలో కాళి, భద్రా, నాగరహొళె, బండీపుర, బీ.ఆర్.టీ హిల్స్ తదితర అరణ్య ప్రాంతాలలో సోమవారం నుంచి పులి, ఇతర మాంసాహార ప్రాణుల గణాంక ప్రక్రియ ఆరంభమైంది. అటవీ మంత్రి ఈశ్వర ఖండ్రె బాల్కిలో విలేకరులతో ఈ విషయం తెలిపారు. ప్రతి నాలుగేళ్లకు ఓసారి దేశమంతటా పులుల సర్వే జరుగుతుందన్నారు. ఇప్పుడు 6వ సర్వే ఆరంభమైందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 563 పులులు ఉన్నాయని అంచనా ఉందన్నారు. దేశంలోనే రాష్ట్రం 2వ స్థానం పొందిందన్నారు. 38 అటవీ విభాగాల్లో లెక్కింపు జరుగుతుందన్నారు. 3 రోజుల పాటు ముగ్గురితో కూడిన బృందాలు రోజూ 5 కి.మీ.అడవిలో సంచరించి, పులి, చిరుతతో పాటుగా అన్ని మాంసాహార ప్రాణుల, ఏనుగుల అడుగుల గుర్తులను సేకరిస్తారన్నారు. ఆ తరువాత జనవరి 15 నుంచి 17 వరకు 2వ స్థాయి లెక్కింపు జరుగుతుందని తెలిపారు. జింకలు, ఏనుగులు, అడవి దున్నలతో పాటుగా శాకాహార జంతువుల సమాచారాన్ని నమోదు చేస్తారని చెప్పారు. మైసూరు ఎయిర్పోర్టులో పెద్ద పులిమైసూరు: మైసూరు జిల్లాలోని అడవి అంచున ఉన్న గ్రామాల్లో భయభ్రాంతులకు గురిచేస్తున్న పులులు ఇప్పుడు ఏకంగా మైసూరు నగరానికే వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం, మైసూరులోని బెమెల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఓ పెద్ద పులి సంచరిస్తున్నట్లు కనిపించింది. అటవీ అధికారులు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించినా దొరకలేదు. ఇప్పుడు, మైసూరులో మండకల్లి విమానాశ్రయంలో మరో పులి కనిపించింది. అక్కడి సిబ్బంది మొబైల్ ఫోన్లో దానిని వీడియో తీయగా అది ప్రచారంలో ఉంది. సోమవారం ఉదయం పులి అక్కడ తిరుగాడింది. సిబ్బంది కేకలు వేయడంతో పొదల్లో దాక్కుంది. అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవిశంకర్, డీసీఎఫ్ కె. పరమేష్, ఏసీఎఫ్ రవీంద్ర, ఆర్ఎఫ్ఓ సంతోష్ హూగర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పులి అక్కడకు వచ్చిందని, దానిని పట్టుకుంటామని తెలిపారు. కొళాయిల్లో కలుషిత నీరు యశవంతపుర: బెంగళూరు లింగరాజపుర వ్యాప్తిలోని కెఎస్ఎఫ్సి లేఔట్లో తాగునీటి పైపుల్లోకి డ్రైనేజీ నీళ్లు కలవడంతో తాగునీరు కలుషితమైంది. అనేకమందికి వాంతులు, విరేచనాలు మొదలు కావడంతో స్థానికంగా కలవరం నెలకొంది. ఎక్కడి నుంచి కలుషితం అవుతున్నాయో బెంగళూరు జలమండలి అధికారులు తనిఖీ చేపట్టారు. ఆ లేఔట్లో తాగునీటిని నిలిపివేశారు. గత 10 రోజుల నుంచి లేఔట్లో కలుషిత నీరు వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణం నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. పెళ్లి పేరుతో యువతికి రూ.11 లక్షల టోపీ మైసూరు: పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతి వద్ద నుంచి రూ.11.76 లక్షలు వసూలు చేశాడో మోసగాడు. ఈ సంఘటన మైసూరు విజయనగరలో జరిగింది. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసే యువతి పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో తన వివరాలను నమోదు చేసింది. సచిన్ అనే వ్యక్తి నీ ప్రొఫైల్ నచ్చిందని, తాను విదేశాల్లో ఉన్నానని, నిన్ను పెళ్లి చేసుకుంటానని మెసేజ్ చేశాడు. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు, త్వరలోనే భారతదేశానికి వస్తానని హామీ ఇచ్చాడు. నీకొక మంచి కానుకను పంపుతానని చెప్పి తన ఖాతాకు రూ.35 వేలు బదిలీ చేయించుకున్నాడు. అలా అప్పటి నుంచి ఆమె ద్వారా రూ.11.76 లక్షలను తన ఖాతాకు జమ చేసుకున్నాడు. కొన్నిరోజులుగా అతని ఫోన్ స్విచాఫ్ వస్తోంది. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితురాలు సైబర్ఠాణాలో ఫిర్యాదు చేసింది. -
మళ్లీ మళ్లీ పోస్టుమార్టం చేశారా, లేదా?
సాక్షి,బళ్లారి: మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిని పథకం ప్రకారం హత్య చేసేందుకు కుట్ర పన్ని, రగడ సృష్టించి, కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, అందుకు నారా భరత్రెడ్డి ఆప్తుడు సతీష్రెడ్డి గన్మెన్ గురుచరణ్సింగ్ కాల్చడంతోనే మృతి చెందాడని నివేదిక వచ్చినందున వెంటనే ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, సతీష్రెడ్డిలను అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన సోమవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. కాల్పుల్లో మృతి చెందిన రాజశేఖర్ మృతదేహానికి మూడు, నాలుగు సార్లు పోస్టుమార్టం చేశారన్నారు. రాజకీయ ఒత్తిడితో మృతదేహంలోని బుల్లెట్ను వెలికితీయకుండానే అంత్యక్రియలు పూర్తి చేసేందుకు సిద్ధం అయ్యారన్నారు. అయితే కొందరు పోలీసు అధికారులు నిజాయితీగా పని చేసి పోస్టుమార్టం మరోసారి చేయడంతో 12 ఎంఎం బుల్లెట్ దొరికిందన్నారు. అది సతీష్రెడ్డి గన్మెన్ తుపాకీది అని తేలిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు, బళ్లారికి న్యాయం జరుగుతుందనే భరోసా లేదన్నారు. అందువల్ల సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐకి కేసు దర్యాప్తును అప్పగిస్తే న్యాయం జరుగుతుందన్నారు. ఈ ఘటనలో గాలి జనార్దనరెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నించి వారు తవ్వుకున్న గోతిలో వారే పడ్డారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయం జరగపోతే తమ పార్టీ పెద్దలు అనుమతి ఇస్తే బళ్లారి నుంచి బెంగళూరుకు పాదయాత్ర చేపట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే టీ.హెచ్ సురేష్బాబు, మాజీ మేయర్ వెంకటరమణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కే.ఎస్.దివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
స్కావెంజర్లతో మలమూత్రాదుల తొలగింపు సరి కాదు
రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహించే స్కావెంజర్లతో మలమూత్ర తొలగింపు పనులు చేయిస్తున్నారని బహుజన దళిత సంఘర్ష సమితి సంచాలకుడు నరసింహులు ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్వామ్యంలో పని చేస్తున్న అధికారులు సఫాయి కర్మచారులతో మ్యాన్ హోల్లో నిండిన మలమూత్రాదులను గుంతలోకి దింపి తొలగించే పనులు చేయిస్తున్నారని, బాధ్యులపై చర్యలు చేపట్టాలన్నారు. కాంట్రాక్ట్ పొందిన సంస్థ లైసెన్స్ను రద్దు చేయాలని ఒత్తిడి చేశారు. సఫాయి కర్మచారులతో కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించుకున్న సంస్థలు నిండిన మ్యాన్హోల్లోకి దింపి పనులు చేయించారని, వారికి ఎలాంటి రక్షణ, భద్రతా చర్యలు తీసుకోలేదన్నారు. -
ఆధునిక జ్ఞానానికి విలువల మిళితం
మైసూరు: ‘ఆధునిక జ్ఞానాన్ని విలువలతో మిళితం చేసే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయవలసిన అవసరం చాలా ముఖ్యం‘ అని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. సోమవారం మైసూరు క్రాఫోర్డ్ ఆడిటోరియంలో మైసూరు విశ్వవిద్యాలయం 106వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ భారతీయ సంస్కృతి, విద్యారంగం గొప్పదనాన్ని వివరించారు. కొత్త జాతీయ విద్యా విధానం ఒక ముఖ్యమైన అడుగు అన్నారు. నేటి ప్రపంచం వేగంగా మార్పు చెందుతోంది. సైన్స్– టెక్నాలజీ, ఏఐ, డిజిటల్ ఎకానమీ వంటి రంగాలలో యువత ప్రాధాన్యం వహిస్తోందని తెలిపారు. భారతదేశం లక్ష్యాలను సాధించడంలో మీ జ్ఞానం, కృషి ప్రధాన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వందలాది పట్టభద్రులకు డిగ్రీ, పీజీ పట్టాలు, పీహెచ్డీ పట్టాలను బహూకరించారు. అలాగే సినీ దర్శకుడు ఎస్.వి. రాజేంద్ర సింగ్ బాబు, డాక్టర్ టి. షామ్ భట్, పి. జయచంద్ర రాజులకు గౌరవ డాక్టరేట్లను అందజేశారు. మంత్రి ఎం.సి. సుధాకర్, వీసీ ఎన్.కె. లోక్నాథ్ పాల్గొన్నారు. గవర్నర్ గెహ్లాట్ పిలుపు ఘనంగా మైసూరు వర్సిటీ స్నాతకోత్సవం -
ఇద్దరు దొంగల పట్టివేత
హొసపేటె: కర్ణాటకలో కొప్పళ జిల్లా గంగావతి పోలీసులు రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రూ.13.10 లక్షల విలువైన సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పట్టణంలోని మారెమ్మ గుడి ప్రాంత నివాసి రామాంజనేయ అలియాస్ రామాంజి గురుస్వామి, హొసపేటె తాలూకాలోని మలపనగుడి నివాసి మహేష్ గురుస్వామిగా గుర్తించారు. దొంగతనం కేసులో రూ.12 లక్షల విలువైన 110 గ్రాముల బంగారు, రూ.1.10 లక్షల విలువైన 440 గ్రాముల వెండి ఆభరణాలను సీజ్ చేశారు. గంగావతి డీఎస్పీ న్యామగౌడ మాట్లాడుతూ గంగావతిలోని హొసళ్లి రోడ్డులో రవాణా శాఖ ఉద్యోగి కే.కొట్రేష్ రామప్ప ఇంటిలో జరిగిన చోరీ ఘటనపై జనవరి 17న ఫిర్యాదు నమోదైందని తెలిపారు. అలాగే నీలకంఠేశ్వర క్యాంప్ రవాణా శాఖ డిపో వద్ద అనసూయ మల్లయ్య శెట్టి తన ఇంట్లోనూ చోరీ చేశారని చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు కుమారుడిపై ఎఫ్ఐఆర్ హుబ్లీ: బెళగావి డీసీసీ బ్యాంక్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లింగరాజ్పై దాడి చేసిన ఆరోపణలకు సంబంధించి అథణి ఎమ్మెల్యే లక్ష్మణ సవధిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దాడికి గురైన బాధితుడు బెళగావి ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి నుంచే అథణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే సవధి, ఆయన కుమారుడు చిదానందప్పతో పాటు 8 మందిపై కేసులు నమోదు చేసుకున్నారు. కాగా లక్ష్మణ సవధి అభిమానులు తమ నేతపై కుట్ర చేసి కేసు పెట్టారని ఆరోపిస్తూ అథణి పట్టణ బంద్ను సోమవారం చేపట్టారు.భక్తిశ్రద్ధలతో కొప్పళ గవిసిద్దేశ్వర రథోత్సవం ● లక్షలాదిగా తరలి వచ్చిన భక్త జనం సాక్షి బళ్లారి: కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఆరాధించి, కొలిచే మఠాల్లో ఒకటైన కొప్పళ గవిసిద్దేశ్వరస్వామి జాతర, రథోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం కొప్పళ పట్టణ నడిబొడ్డున వెలసిన గవిసిద్దేశ్వరస్వామి మఠం ఆవరణలో ఏటా నిర్వహించే రథోత్సవాన్ని ఈఏడాది కూడా కొప్పళ గవిసిద్దేశ్వరస్వామి మఠం పీఠాధిపతితో పాటు మేఘాలయ గవర్నర్ సీహెచ్.విజయ్శంకర్, కేంద్ర మంత్రి సోమణ్ణ, రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, స్వామీజీలు పాల్గొని రథోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. దాదాపు 5 లక్షల మందికి పైగా భక్త జనసందోహం పాల్గొనడంతో కొప్పళలో జనజాతర కనిపించింది. గవిసిద్దేశ్వర స్వామి మఠంలో పూజలు, అన్నదానాలతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో వారం రోజుల నుంచి జాతర మహోత్సవాన్ని పండుగలా జరుపుకొన్నారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనడంతో కొప్పళ వీధుల్లో భారీ భద్రతను కల్పించారు. పోక్సో కేసుల్లో ఏడుగురు అరెస్ట్ హుబ్లీ: నగరంలో ఒకే రోజు రెండు ప్రత్యేక పోక్సో కేసులు నమోదయ్యాయి. హుబ్లీ టౌన్, అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో చిన్నారులపై మైనర్ బాలలు లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారు. టౌన్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ముగ్గురు మైనర్లు చిన్నారిపై హత్యాచారానికి ఒడిగట్టారు. అశోక్ నగర్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మైనర్ బాలురు ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులతో పాటు దాడి కూడా చేశారు. పైగా ఆ చిన్నారి తండ్రిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తొలి కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, రెండో కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ రెండు ఘటనలపై పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ తమ పిల్లలు తీరిక వేళల్లో ఎవరెవరితో కలుస్తున్నారో, స్నేహం చేస్తున్నారో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా గమనించాలన్నారు. లేకుంటే ఇలాంటి దుష్కృత్యాల బారిన పడి చిన్నారులు తమ భవితను నాశనం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన తల్లిదండ్రులకు హితవు పలికారు. -
కేంద్ర కారాగారంలో డీజీపీ తనిఖీ
రాయచూరు రూరల్: కలబుర్గిలోని కేంద్ర కారాగారాన్ని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ అలోక్ కుమార్ తనిఖీ చేశారు. రాష్ట్రంలో జైళ్లలో ఉన్న ఖైదీల విలాసవంతమైన జీవితంపై వీడియోలు వైరల్ కావడంతో తీవ్రమైన నిఘా ఉంచినట్లు తెలిపారు. జైలు అధికారి అనిత, అధికారులు, ఇతర సిబ్బందిపై విచారణకు అదనపు డీజీపీ ఆనందరెడ్డితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కమిటీ విచారణ జరిపి 10 రోజుల్లో నివేదికను అందించాలని సూచించామన్నారు. నాలుగు గంటల పాటు జైలు ఆవరణలో గడిిపిన డీజీపీ మాట్లాడుతూ ఖైదీలకు జైలులోనే జూదం, ఇస్పేట్ వంటివి ఆడటానికి, మద్యం, ధూమపానం చేయడానికి అవకాశం కల్పించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా జైలులో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం వల్లనే ఇలాంటి కుట్రలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయని, దీనిపై కూడా విచారణ చేపట్టినట్లు తెలిపారు. -
ఓంశక్తి భక్తులపై రాళ్ల దాడి
బనశంకరి: దేవీ తేరు సమయంలో ఓంశక్తి మాలధారులపై కొందరు అల్లరిమూకలు రాళ్ల దాడులు చేశారు, ఈ ఘటన బెంగళూరు చామరాజపేటే జగ్జీవన్రామ్ నగరలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. జేజే నగర వీఎస్.గార్డెన్ ఓంశక్తి దేవస్దానం ముందు మాలధారులు రథోత్సవం జరుపుతుండగా ఎవరో దుండగులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఓ బాలిక, మహిళా భక్తురాలికి గాయాలు తగిలాయి. దీంతో మాలధారులు ఆందోళనకు దిగారు. కోపోద్రిక్తులైన ఓంశక్తి మాలధారులు వందలాదిగా పోలీస్స్టేషన్ ముందు బైఠాయించారు. దుండగులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాంతంలో హిందూ భక్తులపై తరచూ దాడులు జరుగుతున్నట్లు ఆరోపించారు. ముందుజాగ్రత్తగా ఠాణాతో పాటు ఆలయం వద్ద కేఎస్ఆర్పీ బలగాలు మోహరించాయి. దాడికి పాల్పడిన నలుగురు కుర్రవాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పశ్చిమ డీసీపీ యతీశ్ తెలిపారు. మంత్రి జమీర్ ఖండన స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జమీర్ అహ్మద్ఖాన్ పోలీస్స్టేషన్ కు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. రాళ్ల దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది కనిపెట్టాలని డీసీపీని ఆదేశించారు. చామరాజపేటేలో హిందూ–ముస్లింలు సోదరులుగా జీవిస్తున్నారని ఇలాంటి ఘటన గతంలో జరగలేదన్నారు. కాగా, నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని హోం మంత్రి పరమేశ్వర్ తెలిపారు. బాలిక, మహిళకు గాయాలు ఠాణా ముందు భారీ నిరసన బెంగళూరు చామరాజపేటేలో ఘటన -
యువకుడు ఆత్మహత్యాయత్నం
చెళ్లకెరె రూరల్: నన్నివాళ గ్రామానికి చెందిన యువకుడు మహేష్ వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసిన ఘటన పట్టణంలోని ప్రైవేట్ బస్టాండ్ వెనుక భాగంలో జరిగింది. సగం మేర కాలిన యువకుడిపై ప్రజలు నీరు పోసి మంటలను ఆర్పివేశారు. విషయం తెలుసుకున్న వెంటనే 112 హొయ్సళ వాహనంలో పోలీసులు స్థలానికి వచ్చి యువకుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్రదుర్గ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు కారణాలు తెలియరాలేదు. స్థలాన్ని సబ్ఇన్స్పెక్టర్ శివరాజ్, పోలీసులు సంతోష్, చౌహాన్ పరిశీలించారు. -
క్రిమినల్ ఎమ్మెల్యేకు డీసీఎం బాసట
సాక్షి, బళ్లారి: తనను పథకం ప్రకారం హత్య చేసేందుకు జరిపిన కాల్పుల్లో దూసుకు వచ్చిన మూడు బుల్లెట్లను పోలీసులకు అప్పగించానని, మరో బుల్లెట్ కూడా బాంబ్ స్క్వాడ్ అధికారులకు లభ్యమైందని, ఘటన జరిగిన రోజున ఐదారుగురు గన్మెన్లు ఒక్కొక్కరు ఏడెనిమిది సార్లు దాదాపు 30 నుంచి 40 రౌండ్ల మేర కాల్పులు జరిపారని, ఆ బుల్లెట్లన్నీ దొరకాల్సిన అవసరం ఉందని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం నగరంలోని తన నివాసగృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు తమ ఇంటి చుట్టూ సోదాలు చేశారన్నారు. కాల్పుల్లో మృతి చెందిన రాజశేఖర్ మృతదేహానికి పోస్టుమార్టం రెండు సార్లకు పైగా జరిపారన్నారు. తనయుడు నారా భరత్రెడ్డిని ఈ ఘటన నుంచి రక్షించేందుకు అతని తండ్రి సూర్యనారాయణరెడ్డి వైద్యులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తనకు పక్కా సమాచారం ఉందన్నారు. క్రిమినల్స్ అయినందున ప్రైవేటు గన్మెన్లను పెట్టుకుని కాల్పులు జరిపారన్నారు. బుల్లెట్ వెలికి తీయకుండా అంత్యక్రియలకు ప్లాన్ కాల్పుల్లో మృతి చెందిన రాజశేఖర్ మృతదేహంలో నుంచి బుల్లెట్ను వెలికి తీయకుండా అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుగా ఏర్పాట్లు చేసుకున్నారన్నారు. అయితే రెండోసారి పోస్టుమార్టం చేయడంతో 12 ఎంఎం బుల్లెట్ బయటకు తీసినట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఈ కేసులో తనను కూడా ఇరికించేందుకు కుట్ర పన్నినా వారి ఆటలు సాగలేదన్నారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత బాంబ్ స్క్వాడ్ వచ్చిందంటే తనిఖీ ఎంత వేగవంతంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇక పోలీసులను ఎలా నమ్మాలని అన్నారు. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న వ్యక్తి డీ.కే.శివకుమార్ మాటలు చూస్తుంటే పోలీసులు నిష్పక్షపాతంగా తనిఖీ చేస్తారనే నమ్మకం లేదన్నారు. డీకే శివకుమార్ వ్యంగ్యంగా మాట్లాడుతుంటే, ఈయన ముఖ్యమంత్రి అయితే ఇక రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. పోస్టుమార్టం రెండుసార్లు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. పోలీసులను బెదిరించేందుకు డీకేశి ప్రయత్నిస్తున్నారన్నారు. భరత్రెడ్డికి డీకే శివకుమార్ అండగా ఉంటానని అనడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదన్నారు. ఈ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. 30 రౌండ్లకు పైగా ఐదారుగురు గన్మెన్లు కాల్పులు జరిపారు గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి వెల్లడి -
క–కలో రైల్వే అభివృద్ధికి రూ.12,900 కోట్లు
హొసపేటె: అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారని, కళ్యాణ కర్ణాటక(క–క)లో రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.12,900 కోట్ల గ్రాంట్ను కల్పించిందని కేంద్ర జలశక్తి, రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ తెలిపారు. హగరిబొమ్మనహళ్లిలోని లెవెల్ క్రాసింగ్ 35 వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి సమగ్ర సమాచారం ఇచ్చారు. గతంలో కర్ణాటకకు రైల్వే శాఖ నుంచి ఏటా రూ.882 కోట్లు మాత్రమే అందేవి. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా రూ.7,500 కోట్ల నుంచి రూ.8,000 కోట్లు ఇస్తున్నట్లు ఆయన గణాంకాలతో సహా వివరించారు. బళ్లారి–చిక్కజాజూరు డబుల్ లైన్ నిర్మాణ ప్రాజెక్టుకు రూ.3,400 కోట్లు, బళ్లారి, చిత్రదుర్గ జిల్లాల్లో చేపట్టే మైనింగ్ కార్యకలాపాలతో సరుకు రవాణాకు, మంగళూరు–హైదరాబాద్ మధ్య కనెక్టివిటీకి ముఖ్యమైన బళ్లారి–చిక్కజాజూరు డబుల్ లైన్ ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం 2025 జూన్లో ఆమోదించిందన్నారు. రైల్వే కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పు సుమారు రూ.3,400 కోట్ల వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలో రైల్వే కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పును తెస్తుందని మంత్రి తెలిపారు. హగరిబొమ్మనహళ్లిలోని ఎల్సీ–35కు బదులుగా గుండా రోడ్–కొట్టూరు మధ్య రూ.38.7 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఎల్సీ– 37, 38 పనులు కూడా ప్రారంభించామన్నారు. హొసపేటె రైల్వే స్టేషన్ను రూ.15.17 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. 80 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. హంపాపట్టణ, హగరిబొమ్మనహళ్లి కనెక్షన్కు అవసరమైన 1 ఎకరం 41 గుంటల భూమిని సేకరించడంలో ఆలస్యం చేయవద్దని మంత్రి వేదికపై ఉన్న జిల్లాధికారికి సూచించారు. రైల్వే పనులకు అవసరమైన అనుమతులను త్వరగా అందించాలని ఆయన జిల్లా యంత్రాంగాన్ని కోరారు. బళ్లారి ఎంపీ తుకారాం, హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే నేమిరాజ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే చంద్రనాయక్, డిప్యూటీ కమిషనర్ కవిత ఎస్.మన్నికేరి, జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి, మరియమ్మనహళ్లి మల్లికార్జున స్వామీజీ, డాక్టర్ మహేశ్వర స్వామీజీ, రైల్వే శాఖ సీఈఓ అజయ్ శర్మ, ఏడీఆర్ఎం ఎం.విష్ణుభూషన్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు వద్దు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమణ్ణ -
వైభవంగా కాడుగొల్లర చాతప్ప దేవర జాతర
చెళ్లకెరె రూరల్: తాలూకాలోని పుర్లహళ్లి గ్రామంలో కాడుగొల్లర ఆరాధ్య దైవం చాతప్ప దేవర జాతర అశేష భక్తుల నడుమ వైభవంగా జరిగింది. ఈ జాతరలో 5 మంది వీరగారరు ఉపవాసం ఆచరించి 20 అడుగుల ఎత్తు గల ముళ్లకంపలపై ప్రతిష్టించిన కలశాన్ని తీసుకురావడం విశేషం. కొర్లగుంటె గ్రామానికి చెందిన మహంతేష్ పోటీ పడి ముళ్లకంపల పైకి ఎక్కి కలసాన్ని తీసుకొచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే టి.రఘుమూర్తి, కాడుగొల్లర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న, యాదవానంద స్వామీజీ, రమానంద స్వాములు పాల్గొన్నారు. -
సంధ్య థియేటర్లో దారుణం.. వాష్రూమ్లో సీక్రెట్ కెమెరా!
కర్ణాటక బెంగళూరులోని సంధ్య థియేటర్లో దారుణం చోటు చేసుకుంది. మహిళల వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల విక్టరీ వెంకటేశ్ సూపర్ హిట్ మూవీ 'నువ్వు నాకు నచ్చావ్' రీరిలీజ్ అయింది. ఆదివారం రోజు బెంగళూరులోని తెలుగువారు ఈ సినిమా చూసేందుకు దగ్గర్లోని సంధ్య థియేటర్కు వెళ్లారు.సీక్రెట్ కెమెరాఅయితే ఓ మహిళ లేడీస్ వాష్రూమ్కు వెళ్లిన సమయంలో అక్కడ ఎవరో సీక్రెట్ కెమెరా పెట్టి రికార్డు చేస్తున్నట్లు గుర్తించింది. వెంటనే విషయాన్ని బయటకు వచ్చి చెప్పింది. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఒక అనుమానిత బాలుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. సదరు బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. View this post on Instagram A post shared by Namma Bengaluru (@nammabengaluroo) చదవండి: చెల్లి పెళ్లిలో హీరో డ్యాన్స్.. ఒక్క పైసా తీసుకోలే! -
ఉమ్రా యాత్రకు తరలిన ముస్లింలు
హొసపేటె: నగరంలోని అంజుమన్ షాదీ మహల్లో ఆదివారం జిల్లా నుంచి ఉమ్రా యాత్ర చేపట్టిన 15 మంది యాత్రికులకు సన్మానం చేసి, వీడ్కోలు పలికారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, కమిటీ చైర్మన్ హెచ్ఎన్ మొహమ్మద్ ఇమామ్ నియాజీ మాట్లాడుతూ.. గృహ నిర్మాణం, మైనార్టీ సంక్షేమ మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ ఎల్లప్పుడూ రాజకీయాల్లో చురుగ్గా ఉంటారని తెలిపారు. ఈ సారి రాష్ట్రం అంతటా 470 మంది ఆర్థికంగా వెనుకబడిన యాత్రికులను, స్వచ్ఛంద సేవకులను గుర్తించి సొంత ఖర్చులతో ఉచితంగా ఉమ్రా యాత్రకు పంపారని పేర్కొన్నారు. పవిత్ర మక్కాలో మంత్రి ఆరోగ్య కోసం, ప్రపంచ సంక్షేమం కోసం ప్రార్థిస్తామని యాత్రికులు తెలిపారు. కార్యక్రమంలో అంజుమన్ కమిటీ ఆఫీస్ బేరర్లు అన్సార్ బాషా, సిరోజ్ ఖాన్, ఎండీ అబూబకర్, డాక్టర్ దర్వేష్, ఎండీ మొహ్సిన్ కోట్కల్, సద్దాం హుస్సేన్ కమ్యూనిటీ నాయకుడు రాధా మలార్ అహ్మద్ గఫూర్ సాబ్, షేక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు రథోత్సవం
రాయచూరు రూరల్: కొప్పళ్ల గవిమఠంలో అభినవ సిద్ధేశ్వర శివాచార్యుల జాతరలో భాగంగా సోమవారం రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం మఠంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన గవి మఠానికి భక్తులు భారీగా తరలిరానున్నారు. లక్షలాది మంది భక్తులకు రొట్టెలు, బజ్జీలు, మాదిలి, జిలేబీలు సిద్ధం చేశారు. గవి మఠం ఆధ్వర్యంలో జల సంరక్షణ, రక్తదానం, లక్ష వృక్షోత్సవం, పేద పిల్లలకు ఉచితి విద్య, భోజన వసతి, దార్మిక అంశాలపై గోష్టులు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
ఢిల్లీకి చేరిన బ్యానర్ రగడ
సాక్షి బళ్లారి: నగరంలో మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి గృహం వద్ద బ్యానర్లు ఏర్పాటు చేసే క్రమంలో మొదలైన వివాదం ఢిల్లీకి చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర బీజేపీ–కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు మాటల సమరంతో బళ్లారి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. తన ఇంటి ముందు బ్యానర్ కట్టవద్దని గాలి జనార్దనరెడ్డి.. కట్టి తీరుతామని ఎమ్మెల్యే భరత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరణంలో మొదలైన వాగ్వాదం.. అక్కడ జరిగిన ఘర్షణ, ఓ ప్రైవేటు వ్యక్తి జరిపిన కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందడం కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా.. గాలి జనార్దన రెడ్డి, నారాభరత్ రెడ్డి కుటుంబాల మధ్య గత 20 సంవత్సరాలుగా విభేదాలు ఉన్నాయి. రాజకీయ, వ్యక్తిగత విభేదాలతో రెండు కుటుంబాలకు చెందిన నేతలు గొడవ పడుతూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరి జాతీయ స్థాయికి చేరడంతో రెండు ప్రధాన పార్టీల పెద్దలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గాలి జనార్ధన రెడ్డి ఇంటి వద్దకే వచ్చి బీభత్సం సృష్టించడంతో బీజేపీ పెద్దలు రగిలిపోతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర, ప్రతిపక్ష నాయకుడు కే.ఆర్.అశోక్తో పాటు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమణ్ణ, విధాన పరిషత్ ప్రతిపక్ష నాయకుడు చలవాది నారాయణ స్వామి తదితర ప్రముఖులు గాలి జనార్దనరెడ్డి ఇంటికి చేరుకుని అండగా నిలుస్తున్నారు. స్వయంగా వివరాలు సేకరిస్తూ అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇస్తున్నారు. గాలికి భద్రత పెంచి, ఈ ఘటనకు కారణమైన ఎమ్మెల్యే నారా భరత్రెడ్డిని అరెస్ట్ చేయాలని పట్టుబడుతున్నారు. గాలిపై డీకే విమర్శలు.. ఎమ్మెల్యే భరత్రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గాలిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వారు డ్రామా ఆడుతున్నారని.. కోట గోడల్లా నిర్మించుకున్న ఇళ్లు, శత్రుదుర్భేధ్యమైన స్థలం, పెద్ద సంఖ్యలో ఉన్న అంగరక్షకులను తప్పించి వారిని అంతం చేయడం ఎవరి తరం కాదని చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి జిల్లాలోని తోరణగల్లు సమీపంలో జిందాల్ విమానాశ్రయంలో సిద్ధరామయ్యను కలిసి జరిగిన వివాదాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. మంత్రులు సంతోష్లాడ్, ప్రియాంక ఖర్గే తదితరులు కూడా ఎమ్మెల్యేకు అండగా నిలుస్తున్నారు. పోలీసుల పటిష్ట భద్రత ఇరు పార్టీలకు చెందిన రాష్ట్ర, జాతీయస్థాయి నేతల పరామర్శలు చేస్తున్న తరణంలో బ్యానర్ వివాదం ఎటు వైపు దారితీస్తుందోనని చర్చ సాగుతోంది. బ్యానర్ వివాదం ఇప్పట్లో చల్లారక పోవడంతో బళ్లారి భగభగమంటోంది. వాల్మీకి సర్కిల్, నగరంలో ప్రధాన రహదారుల్లో పోలీసులు భద్రత చేపట్టారు. గాలి జనార్దన రెడ్డి ఇంటి వద్ద పోలీసు బలగాలను మొహరించారు. ప్రతిపక్ష నాయకుడు అశోక్, గాలి జనార్దన రెడ్డి, శ్రీరాములు తదితర బీజేపీ నాయకులు పవన్ నెజ్జూర్కు అండగా నిలుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. ఎస్పీ సస్పెండ్ను సమర్థించుకున్న ప్రభుత్వం ఇక ఎస్పీ నెజ్జూర్ను సస్పెండ్ చేయడ సరైందని డీసీఎం డీకే శివకుమార్ సమర్థించుకుంటున్నారు. ఘటన జరిగిన రోజు ఎస్పీకి ఫోన్ చేయగా.. ఆయన మద్యం తాగినట్లు ఉందని మండిపడ్డారు. ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నాక శాంతిభద్రతలు పర్యవేక్షణ ఆయన మీదే ఉంటాయని హోంమంత్రి పరమేశ్వర్ చెప్పుకొచ్చారు. ఎస్పీ ఏమైనా చిన్న పిల్లవాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నారాకు అండగా సీఎం, డీసీఎం, మంత్రులు -
జెడ్ ప్లస్ భద్రత కల్పించండి
● ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి సాక్షి బళ్లారి: ‘తనను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను. ప్రాణహాని ఉండటంతో జెడ్ ప్లస్ భద్రత కల్పించండి’ అని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆదివారం ఆయన ప్రభుత్వాలకు వేర్వేరుగా లేఖలు రాశారు. జనవరి ఒకటవ తేదీన తన ఇంటి వద్దకు ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో చేరి హత్యాయత్నం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘నేను బళ్లారిలో పుట్టి, పెరిగాను. గతంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పని చేశాను. బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా పని చేశాను. అప్పట్లో బీజేపీ అధికారంలోకి రావడానికి శ్రమించాను. తప్పుడు కేసుల వల్ల జైలుకు వెళ్లి వచ్చాను. ప్రస్తుతం నాకు ప్రాణహాని ఉంది. జెడ్ కేటగిరీ భద్రత లేదా అందుకు సరిపడేంత మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించండి’ అని లేఖలో పేర్కొన్నారు. ఇంటి వద్ద కాల్పులు జరిపించిన ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, ఆయన ఆప్తుడు సతీష్రెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ గన్మెన్ గురుచరణ్ సింగ్సాక్షి బళ్లారి: తనను అంతం చేయడానికి కాల్పులు జరిపిన గురుచరణ్ సింగ్ అనే గన్మెన్ సతీష్ రెడ్డికే కాదు.. ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా గన్మెన్గా పని చేస్తున్నట్లు వీడియోలు ఉన్నాయని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగే సమయంలో ప్రభుత్వ గన్మెన్లతో పాటు, సతీష్ రెడ్డికి చెందిన గన్మెన్లు కూడా తిరుగుతుండేవారన్నారు. నారా భరత్రెడ్డి సతీమణికి భద్రతకూడా ఆ గన్మెన్లు చూస్తున్నట్లు కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోందన్నారు. కాల్పుల జరిగినప్పడు 3 తూటాలు దొరికాయని చెప్పారు. నారా భరత్రెడ్డి, ఆయన ఆప్తుడు సతీష్రెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలన్నారు. రాజశేఖర్ మృతదేహంలో లభ్యమైన బుల్లెట్ ఎవరిదో తేలిపోయిందన్నారు. -
ఘనంగా బ్రెయిలీ దినోత్సవం
రాయచూరు రూరల్: బ్రెయిలీ లిపిని కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఘనంగా నిర్వమించారు. నగరంలో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి బసవరాజ పాటిల్ అన్వరి వివిధ కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో బ్రెయిలీ దినోత్సవం జరుపుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంధులకు బ్రెయిలీ లిపి వరంగా మారందని పలువురు కొనియాడారు. బ్రెయిలీ లిపితో ఎంతో మంది చూపులేని వారు చదువుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత, ఆంజనేయ, శాంత, లక్ష్మీకాంత రెడ్డి, యత్నళ్లి, విమల, రంజిత తదితరులు పాల్గొన్నారు. సమాజ నిర్మాణానికి ముందడుగు వేయాలిరాయచూరు రూరల్: సధృడ సమాజ నిర్మాణం కోసం మహిళలు ముందడుగు వేయాలని ీసీనియర్ సాహితీవేత్త జయలక్ష్మి మంగళమూర్తి పేర్కొన్నారు. ఆదివారం కన్నడ భనవంలో మహిళ పరిషత్ వేదికను జ్యోతి వెలిగించి మాట్లాడారు. వివేకవంతమైన చింతన, మౌల్యాలతో కూడిన సమాజం అభివృద్ధికి పూరకంగా ఉంటుందన్నారు. మహిళలు హక్కులు, విధులు, సమానత్వంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.కార్యక్రమంలో పర్వ మంగళ సక్రి,అణ్ణప్ప మేటి, యశోద, శరణమ్మ, శీలాదాస్, ఈరమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు. పేదల పెన్నిధి ఈరణ్ణ రాయచూరు రూరల్: నగర సభ మాజీ అధ్యక్షుడు ఎం.ఈరణ్ణ విశేష సేవలిందించి పేదల పెన్నిధిగా నిలిచారని కిల్లే బ్రహన్మఠం పీఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు కొనియాడారు. ఆదివారం శశిమహల్ సర్కిల్ వద్ద ఈరణ్ణ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరణ్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అధ్యక్షుడిగా, సమాజ సేవకుడిగా ఈరణ్ణ అందించిన సేవలు వెలకట్టలేనివని తెలిపారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ అధ్యక్షురాలు పద్మావతి, నగర సభ సభ్యుడు పవన్ కుమార్, రేణుకాచార్య, రఘు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాల కూల్చివేత హుబ్లీ: దావణగెరె ఎస్ఓజీ కాలనీలో పాలికె స్థలంలో నిర్మించిన ప్రైవేట్ పాఠశాలను ఆదివారం తహసీల్దార్, పాలికె కమిషనర్ సమక్షంలో కూల్చివేశారు. విద్యా సంవత్సరం ముగిసేదాక కూల్చొద్దని పాఠశాల యజమాన్యం సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. విద్యార్థులను బయటకు పంపించి కట్టడాన్ని కూల్చి వేశారు. రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ అధ్యక్షుడు శశికాంత కోసంబే మాట్లాడుతూ.. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని పాలికె అధికారులకు నోటీసులు జారీ చేశారు. పాలికె కమిషనర్ ఇచ్చే సమాదానాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పాలికె కమిషనర్ స్పందిస్తూ.. పాఠశాల కట్టడం పాలికె స్థలంలో ఉండటంతో పాఠశాలను తరలించాలని యాజమాన్యానికి సూచించినా పట్టించుకోలేదన్నారు. దీంతో కట్టడాన్ని కూల్చి వేశామన్నారు. ఈ స్థలాన్ని నిరాశ్రయులకు అందజేస్తామన్నారు. మంత్రాలయంలో సిద్ధగంగ పీఠాధిపతి రాయచూరు రూరల్: తుమకూరు సిద్ధగంగ మఠం పీఠాధిపతి సిద్ధలింగ స్వామి ఆదివారం మంత్రాలయంలో పర్యటించారు. రాఘవేంద్ర స్వామి మూల విరాట్కు ఊంజల సేవలు జరిపారు. మఠం అధికారులు మంచాలమ్మ దేవి దర్శనం చేయించారు. -
29 నుంచి జిల్లా ఉత్సవాలు
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో జనవరి 29 నుంచి 31 వరకూ (మూడు రోజులు) జిల్లా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ తెలిపారు. ఆదివారం జిల్లా అధికారి కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దశాబ్దం అనంతరం జరగనున్న జిల్లా ఉత్సవాల్లో అందరు చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఇప్పటి నుంచే ముమ్మరంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం, రంగ మందిర్, మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏడెదోరె రాయచూరు ఉత్సవాలకు రూ.10 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. నాటకాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్, శాసన సభ్యులు హంపన గౌడ బాదర్లి, హంపయ్య నాయక్, బసవనగౌడ దద్దల్, వసంత్ కుమార్ బసన గౌడ, జిల్లా అధికారి నితీష్, అదనపు జిల్లా అధికారి శివానంద, ఎస్పీ అరున్ంగ్సు గిరి, నగర సభ కమిషనర్ జుబీన్ మోహ పాత్రో, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి నరేష్, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ఈరన్న, సంతోష్ రాణి, సురేస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సమానమే రాయచూరు రూరల్: క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్, రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ సూచించారు. ఆదివారం మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో రాయచూరు ఉత్సవాలు–2026లో భాగంగా క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. శారీరక ధృఢత్వం పెంచుకోవచ్చని తెలిపారు. క్రీడాకారులందరూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. కార్యక్రమంలో శాసన సభ్యులు హంపన గౌడ బాదర్లి, హంపయ్య నాయక్, బసవన గౌడ దద్దల్, వసంత్ కుమార్ బసన గౌడ, జిల్లా అధికారి నితీష్, ఎస్పీ అరుణాంగ్సు గిరి, నగర సభ కమిషనర్ జుబీన్ మోహ పాత్రో, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నరేష్, జిల్లారోగ్య అధికారి సురేంద్ర బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి బడిగేర తదితరులు పాల్గొన్నారు. -
సావిత్రి బాయి పూలే సేవలు అమూల్యం
హొసపేటె: స్థానిక జీటీ కాంపౌండ్ ప్రాంతంలో ఆదివారం అక్షరాల తల్లి సావిత్రి బాయి పూలే జయంతిని మురికివాడల ప్రజల సంస్థ కర్ణాటక విజయనగర జిల్లా మహిళా విభాగంలో ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయ సంఘం సీనియర్ గైడ్ ఉమాదేవి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే అన్నారు. మహిళలు చదువుకునే హక్కు పొంది, అక్షరాలు నేర్చుకోవాలనే సదుద్దేశంతో పోరాటం చేశారని తెలిపారు. భర్త జ్యోతిబాపూలే సహకారంతో ఆమె పాఠశాలను స్థాపించినట్లు వెల్లడించారు. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, విద్యా సంస్థలను స్థాపించడంలో జ్యోతిబాపూలే పాత్ర ముఖ్యమైనదని పేర్కొన్నారు. కార్యక్రమానికి మహిళా విభాగం అధ్యక్షురాలు హులిగెమ్మ అధ్యక్షత వహించారు. జిల్లా కమిటీ అధ్యక్షురాలు హెచ్.శేషు, ఉపాధ్యాక్షురాలు తన్నీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటేష్, మాజీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలు జిబేదాబి, షేక్ మెహబూబ్ బాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ కై లాస్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ తాజుద్దీన్, బినా రూపలత, జాఫ్రియన్ పద్మలత పాల్గొన్నారు. -
శీఘ్రగతిన టీబీ డ్యాం గేట్ల పనులు: సీఎం
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాంకు సంబంధించిన క్రస్ట్ గేట్లను శీఘ్రగతిన అమరుస్తాని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. శనివారం రాత్రి సింధనూరు తాలుకా అంబామఠం ఉత్సవాలను ప్రారంభించిన ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుంగా వచ్చే ఖరీఫ్ నాటికి క్రస్ గేట్లు అమర్చే పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.20 కోట్లతో క్రస్ట్ గేట్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. కర్ణాటక సర్కార్ రూ.10 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు. మరో 18 క్రస్ట్ గేట్లు తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్కు 7 టీఎంసీలు, తెంగాణలకు 5 టీఎంసీలు చొప్పున మొత్తం 12 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. పంచ గ్యారెంటీలకు రూ.1,12,000 కోట్ల వ్యయం చేశామని తెలిపారు. ఆశ్రమంలో అన్నదానంబళ్లారి అర్బన్: బళ్లారికి చెందిన మంగళముఖి చాందిని 35వ జన్మదినం సందర్భంగా గాంధీ నగర్లోని శ్రీ సూర్య నివాస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, బెడ్ షీట్లు అందజేశారు. ఈ ఏడాది వృద్దులకు తనవంతు సేవ చేసి ఆశీర్వాదం పొందడంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చాందిని తెలిపారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో వైజాగ్ సత్య, హైదరాబాద్ ఐసుమతి, బళ్లారి హనీ, ధర్మవరం నరిత, కృష్ణ, శైలజ, హేమావతి, వినోద్, గాయత్రి లక్ష్మీ పాల్గొన్నారు. ‘శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం విఫలం’ సాక్షి బళ్లారి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. శాంతిభద్రతలు కాపాడటంలో సీఎం సిద్దరామయ్య విఫలమయ్యారు. ఫ్లెక్సీ ఏర్పాటు వివాదంలో ఓ యువకుడు మృతి చెందడంతో ఎమ్మెల్యే నారా భరత్రెడ్డిని అరెస్ట్ చేయాలి’ అని మాజీ మంత్రి రేణుకాచార్య పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తదితరులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. డ్రగ్స్, మద్యం తీసుకుని సినీ ఫక్కీలో గొడవలు సృష్టించి, గాలి జనార్దన రెడ్డిపై కాల్పులు జరిపారన్నారు. హత్య చేసేందుకు యత్నించడంతో దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. తమ పార్టీ గాలి కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, కేంద్రమంత్రులు గాలి ఇంటికి చేరుకుని బాసటగా నిలిచారన్నారు. ముగిసిన అంబా మఠం జాతరరాయచూరు రూరల్: సింధనూరు తాలుకాలోని సిద్ధ పర్వతం అంబా మఠం మాతేశ్వరి జాతరలో భాగంగా రథోత్సవం వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం రథోత్సవాన్ని ముఖ్యమంత్రి సిద్ద రామయ్యతో పాటు లక్షలాది మంది భక్తుల సముక్షంలో నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగారు. కార్యక్రమంలో శాసన సభ్యులు హంపన గౌడ బాదర్లి, హంపయ్య నాయక్, బసవన గౌడ దద్దల్, వసంత్ కుమార్ బసన గౌడ, జిల్లా అధికారి నితీష్, ఎస్పీ అరుణాంగ్సు గిరి పాల్గొన్నారు. ఉగ్రయ్యకు సేవా రత్న అవార్డు హుబ్లీ: కర్ణాటక మానవ హక్కుల సంరక్షణ సంస్థ, డాక్టర్ నాగలక్ష్మి చౌదరి జనసేవ సంస్థ, చెన్నమ్మ మంజేగౌడ జనసేవ సంస్థ, ఆధ్వర్యంలో వృక్షమాత సాలుమరద తిమ్మక్క సేవ రత్న ప్రశస్తి–2026ను సి.ఉగ్రయ్యకు ప్రదానం చేశారు. గత 50 ఏళ్లుగా బెంగళూరు మాగడి రోడ్డులోని గాంధీ వృద్ధాశ్రమంలో అనాథలకు ఉగ్రయ్య సేవలందిస్తున్నారు. లగ్గేరే బసవేశ్వర కళ్యాణ మంటపంలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్వహకుడు గణేష్ గౌడ్రు మాట్లాడారు. గత 5 దశబ్దాలుగా ఉగ్రయ్య నిరాశ్రయులకు సేవ చేయడం హర్షణీయమన్నారు. -
నోరూరేలా.. సంక్రాంతి రుచులు
మైసూరు: నగరంలోని రామకృష్ణ నగరలోని వాసు లేఔట్లో బడగనాథ భవన్ లో సంక్రాంతి ఆహార మేళా ప్రజలను ఆకర్షిస్తోంది. డజన్ల కొద్దీ తీయని, కారం వంటకాలు ఆహారప్రియులను అలరిస్తున్నాయి. అలాగే వివిధ రకాల దుస్తులు, ఆభరణాలు, కళాకారులు రూపొందించిన చిత్రాల ప్రదర్శన కూడా ఏర్పాటైంది. సందర్శకులకు నోరూరగా వంటకాలను రుచి చూశారు. బాదం పాలు, కొబ్బరి పాలు, చెరకు పాలు, వీటితో పాటు రాగి, జొన్న పాలు విక్రయించారు. రాగి లేదా జొన్నలను కనీసం 3 గంటలు నీటిలో నానబెట్టి, కొబ్బరి, యాలకులు, బెల్లంతో కలిపి మెత్తగా రుబ్బితే జొన్న పాలు ఉత్పత్తి అవుతాయి. ఇది రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మహిళలు తాము తయారుచేసిన చిరుతిళ్లను స్టాళ్లలో విక్రయించారు. బడగనాథ్ బలగ అధ్యక్షుడు ప్రభాకర్, నిర్వాహకులు పాల్గొన్నారు. -
గూండాలకు సర్కారు అండ
● బీజేపీ పక్ష నేత అశోక్ సాక్షి, బళ్లారి: ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిని అంతం చేయాలనే లక్ష్యంతోనే బ్యానర్ గొడవను సృష్టించి, కాల్పులు జరిపారని బీజేపీ పక్ష నాయకుడు ఆర్ అశోక్ ఆరోపించారు. ఆయన ఆదివారం నగరంలో శ్రీరాములు, గాలి సోదరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘బళ్లారి ఘటనకు కారకులైన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?, స్థానిక డీఎస్పీని సస్పెండ్ చేయకుండా, ఎస్పీని సస్పెండ్ చేయడం ఏమిటి? దోషులను పక్కన పెట్టి, బీజేపీ వారిపై కేసులు ఎందుకు పెట్టారు. అన్నీ మీరే చేసి కేసులు మావారిపైనే పెడతారా? సీఎం, పీఎంఇంటి ముందు కూడా బ్యానర్ కట్టవచ్చునని, అయితే చట్టప్రకారం అనుమతులు ఉండాలి. అనుమతి లేకుండా బ్యానర్ కట్టడం వల్ల గొడవ జరిగింది. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఖబడ్దార్’ అని హెచ్చరించారు. సిద్దరామయ్య ప్రభుత్వం గూండాలకు కొమ్ము కాస్తోందని అన్నారు. కాంగ్రెస్వారి సత్యశోధన కమిటీ నివేదిక వారికి అనుకూలంగా ఉంటుందన్నారు. కాల్పులు జరిపేందుకు గన్మెన్ను ఎవరు ఆదేశించారో తేలాలి, గొడవపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
రూ.70 లక్షల పన్ను ఎగవేత.. బెంట్లీ కారు సీజ్
దొడ్డబళ్లాపురం: ట్యాక్స్ ఎగ్గొట్టిన ఆరోపణలపై ఆర్టీఓ అధికారులు ఎంతో ఖరీదైన బెంట్లీ కారును సీజ్ చేసిన సంఘటన బెంగళూరు కోరమంగలలో జరిగింది. ఈ కారు విలువ రూ. 5.50 కోట్లు అయితే, ఆర్టీఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ సమయంలో రూ.2.43 కోట్లుగా చూపించారు. తద్వారా రూ.70 లక్షల ట్యాక్స్ను ఎగ్గొట్టినట్టు తేలింది. దీంతో కోరమంగల ఆర్టీఓ అధికారులు బెంట్లీ కారును సీజ్ చేశారు. ఈ సందర్భంగా కారు యజమాని అధికారులతో గొడవకు దిగాడు. విజయ్ మల్య లాగా వందల కోట్ల రూపాయలు మోసం చేయలేదని, అలాంటి వాళ్లను పట్టుకునే దమ్ము ఎవరికీ లేదని చిందులు వేశాడు. చిక్కదేవమ్మ జాతర మైసూరు: మైసూరు జిల్లాలోని సరగూరు తాలూకా కుందూరు గ్రామంలో శ్రీ చిక్కదేవమ్మ జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాలకు ముందు, చిక్కదేవమ్మ కొండ నుంచి ఉత్సవ దేవతను కుందూరుకు తీసుకువచ్చారు. ఉదయం ఆలయ సమీపంలో బిజాసురుడు అనే రాక్షసున్ని అమ్మవారిచే వధింఛే ఘట్టం ఆచరించారు. తరువాత విజయోత్సవాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారి దర్శనం కోసం వందలాదిగా క్యూలలో తరలివచ్చారు. ఎమ్మెల్యే అనిల్ చిక్కమధు ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. ఈసారి జాతర మహోత్సవాన్ని సక్రమంగా జరుపుకొన్నారని అభినందించారు. ధర్మం ద్వారా సార్థక జీవనం తుమకూరు: ధర్మం మనకు ప్రేమ, సమైక్య జీవనాన్ని నేర్పిస్తుందని, అలాంటి వ్యక్తిత్వం ద్వారానే మనం దేవున్ని చూడగలమని పట్టనాయకహళ్లిలోని స్ఫటికపురి గురుగుండ బ్రహ్మశ్వర స్వామి పీఠాధిపతి నంజావదూత స్వామీజీ అన్నారు. గురుగుండ బ్రహ్మేశ్వర స్వామి జాతర మహోత్సవంలో ఆదివారం ధర్మ పతాక ఆవిష్కరణ జరిగింది. స్వామీజీ మాట్లాడుతూ మనమందరం దేవుని అంశ, దానిని అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు మానవ జన్మను ఇచ్చాడు. మన దేశ శాశ్వత మతం, వారసత్వాన్ని కాపాడుకునే లక్ష్యంతో జాతరలు, పండుగలు జరుగుతాయి. మనమందరం ఒకటే అనే భావనతో ముందుకు సాగినప్పుడు, మానవ జన్మ అర్థవంతంగా ఉంటుందని ఆయన అన్నారు. పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. టమాటా.. నష్టాలకు టాటా ● కోలారు ఏంపీఎంసీ మార్కెట్లో మంచి ధరలు కోలారు: కోలారు ఎపిఎంసి మార్కెట్లో టమాటా ధరలు రోజు రోజుకు పెరుగుతుండడం రైతులకు సంతోషం కలిగిస్తోంది. వారితో పాటు దళారులు కూడా ఖుషీ అవుతున్నారు. ఇక్కడ 15 కేజీల టమాటా బాక్సు రూ.850 వరకు అమ్ముడవుతోంది. మంచి నాణ్యత కలిగిన టమాటాలకు మరింత ధర ఉంది. బయట మార్కెట్లో కిలో రూ. 50 నుంచి 60 మధ్య కొనసాగుతోంది. కొత్త సంవత్సరంలో రేట్లు పెరగడం వల్ల టమాటా రైతులకు అంతో ఇంతో ఆదాయం లభిస్తోంది. ఎపిఎంసి మార్కెట్కు టన్నుల కొద్దీ పంటను రైతులు తరలిస్తున్నారు. తమిళనాడు నుంచి టమాటాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది, అక్కడి నుంచి వ్యాపారులు వచ్చి లారీలలో తీసుకు వెళుతున్నారు. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్ల నుంచి కూడా డిమాండ్ నెలకొంది. చిత్రదుర్గ, తుమకూరు, చిక్కబళ్లాపుర, ఆంధ్రప్రదేశ్లోని కొన్నిప్రాంతాల నుంచి కూడా రైతులు టమాటాను తీసుకువస్తున్నారని మార్కెట్ కార్యదర్శి కిరణ్ తెలిపారు. -
బుడతల యోగా విన్యాసాలు
బొమ్మనహళ్లి: బెంగళూరు రవీంద్ర కళాక్షేత్రలో నాట్య సంభ్రమ– 2026 కృష్ణార్పణం వేడుకలు రమణీయంగా జరిగాయి. ఈ సందర్భంగా కృష్ణుని జన్మ వృత్తాంతాన్ని బాలలు భరతనాట్యం ద్వారా కళ్లకు గట్టారు. అలాగే బాలికల యోగా విన్యాసాలు అబ్బురపరిచాయి. స్థల వివాదంలో యశ్ తల్లి పుష్పయశవంతపుర: ప్రముఖ నటుడు యశ్ తల్లి పుష్ప మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వివరాలు.. హాసన్ పట్టణంలోని విద్యానగరలో పుష్పాకు ఇల్లు ఉంది. ఆమె నిర్మించిన కాంపౌండ్ను మూల యజమాని కూల్చివేశాడు. లక్ష్మమ్మ స్థలంలో పుష్ప కొంత జాగాని ఆక్రమించి ప్రహరీని కట్టారని దేవరాజు ఆరోపించాడు. లక్ష్మమ్మ స్థలాన్ని తాను జీపీఏ చేసుకున్నట్లు అతడు తెలిపాడు. కబ్జా గురించి హాసన్ జెఎంఎఫ్ కోర్టులో కేసు వేయగా తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, ఆ మేరకు కూల్చివేసినట్లు చెప్పాడు. ఆ జాగా నాదే: పుష్ప ఈ గొడవపై పుష్ప స్పందిస్తూ ‘నేను అక్రమంగా నిర్మించలేదు. ఆ జాగా నాదే. అయితే మేము ఊరిలో లేని సమయంలో దౌర్జన్యంగా కాంపౌండ్ను తొలగించారు’ అని చెప్పారు. దేవరాజుతో స్థానిక పిడిఓ కుమ్మకై అవినీతికి పాల్పడినట్లు పుష్ప అన్నారు. తన జాగాకు పన్నులు కూడా చెల్లించానన్నారు. షాపులో భారీ సర్పం శివమొగ్గ: శివమొగ్గలోని ఇలియాజ్ నగరలో వాహన విడిభాగాలను షాపులో ఒక భారీ బురద పాము కనిపించింది. దానిని చూసిన షాపు యజమాని భయంతో కేకలు వేస్తూ పరిగెత్తాడు. 100 అడుగుల రహదారిలోని ఫరూఖ్ దుకాణంలో ఆ పాము కనిపించింది. స్నేక్ కిరణ్కు సమాచారం ఇచ్చాడు. కిరణ్ కొంతసేపు గాలించి టైర్లలో దాక్కున్న సర్పాన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు. ఇది ఎనిమిదిన్నర అడుగుల పొడవు ఉంటుంది. ఇది బురద పాము అని, విషపూరితం కాదని చెప్పాడు. ‘పర్యావరణంలో జీవవైవిధ్యంలో పాములు అరుదైన జీవులు. అవి కనిపించినప్పుడు వాటిని చంపవద్దు, లేదా హింసించవద్దు. శివమొగ్గ నగరం చుట్టూ పాములు కనిపిస్తాయి. నాకు సమాచారం ఇస్తే, వాటిని రక్షిస్తాను’ అని తెలిపాడు. -
అమెరికా నుంచి సెక్యూరిటీని తెచ్చుకోనీ: డీకే
శివాజీనగర: జనార్దనరెడ్డి ఇరాన్ లేదా అమెరికా నుంచైనా భద్రత తెప్పించుకోమను.. అని డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ అన్నారు. జనార్దనరెడ్డి జడ్ ప్లస్ భద్రత కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడం గురించి డీకే ఆదివారం బెంగళూరులో మీడియాతో స్పందించారు. ఎక్కడి నుంచైనా రక్షణను తెచ్చుకోనీ, మాకు అభ్యంతరం లేదు. వందలమంది బీజేపీ కార్యకర్తలనే భద్రతగా నియమించుకున్నా వద్దనం అని అన్నారు. బళ్లారి గొడవలో వచ్చిన తూటా సతీష్రెడ్డి గన్మెన్ తుపాకీదని రిపోర్టు వచ్చిందనగా, ఆ సంగతి నాకు తెలియదన్నారు. ఎవరైనా భక్తితో విగ్రహాన్ని నెలకొల్పితే అసూయ ఎందుకు పడాలి, వాల్మీకి ఒక సముదాయానికి చెందినవారా, ఆయన అందరి ఆస్తి అని పేర్కొన్నారు. కేసును సీఐడికి ఇవ్వడం గురించి హోమ్ మంత్రి, సీఎం సిద్దరామయ్య నిర్ణయం తీసుకుంటారన్నారు. కేపీసీసీ సత్యశోధనా కమిటీ అధ్యక్షుడు హెచ్.ఎం.రేవణ్ణ బళ్లారిలో విచారించారు, మంచి సమాచారం సేకరించుకొని వచ్చారు, త్వరలో నివేదికను ఇస్తారని తెలిపారు. -
పెళ్లికి నిరాకరించిందని వివాహితను హత్య చేసి.. ఆ తర్వాత
యల్లాపుర: కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది ఓ వివాహిత.. తన బాల్య స్నేహితుడి చేతిలో హత్యకు గురైంది. హత్య అనంతరం ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. యల్లాపుర పట్టణంలో ఈ ఘటన జరిగింది. తాను వివాహానికి అంగీకరించకపోవడంతో ఆమె స్నేహితుడే కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. స్నేహితురాలిని హత్య చేసిన నిందితుడు రఫిక్ ఇమామ్సాబ్ సమీపంలోని అడవిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు.బాధితురాలు రంజిత బనసోడే, నిందితుడు రఫిక్ ఇద్దరూ పాఠశాల రోజుల నుంచే స్నేహితులు. రంజిత సుమారు 12 ఏళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన సచిన్ కటేరాను వివాహం చేసుకుంది. వీరికి 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆమె భర్తతో వేరుగా ఉంటూ.. యల్లాపురలో తన కుటుంబంతో నివసిస్తోంది. రంజిత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సహాయకురాలిగా పనిచేస్తోంది. రఫిక్ తరచుగా రంజిత ఇంటికి భోజనానికి వచ్చేవాడు.అతను పెళ్లి చేసుకోమని రంజితను ఒత్తిడికి గురిచేసేవాడు. పెళ్లికి రంజితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన రఫిక్.. రంజిత పనివేళ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పదునైన కత్తితో దాడి చేశాడు. రంజితను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. కొన్ని గంటల తర్వాత రఫిక్ సమీప అడవిలో ఉరేసుకుని మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద తాడు, మద్యం సీసా కూడా లభించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ దీపన్ ఎం.ఎన్. తెలిపారు. -
భార్య హత్యకు గన్ ఫైరింగ్లో శిక్షణ
బెంగళూరు: బసవేశ్వర నగరలో గతనెల 24న చోటు చేసుకున్న బ్యాంక్ మహిళా ఉద్యోగి భువనేశ్వరి హత్య కేసు దర్యాప్తులో కొత్త అంశం వెలుగు చూసింది. భార్యను పిస్తోలుతో కాల్చేందుకు భర్త బాలమురుగన్ బిహార్లో 15 రోజుల పాటు శిక్షణ తీసుకున్నట్లు మాగడిరోడ్డు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. బాలమురుగన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసేవాడు. దంపతుల మధ్య విభేదాలు రావడంతో భువనేశ్వరి తన పిల్లలతో కలిసి వేరే ఇంట్లో నివాసం ఉంటోంది. భార్యను హత్య చేయాలని భావించిన బాలమురుగన్ బిహార్కు వెళ్లి అక్కడ ఓ వ్యక్తితో రూ.50 వేలకు పిస్తోల్ కొనుగోలు చేసి 15 రోజుల పాటు అక్కడే మకాం పెట్టి గన్ ఫైరింగ్పై శిక్షణ తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. గతంలో తమిళనాడుకు చెందిన వ్యక్తికి భార్య హత్యకు రూ.1.25 లక్షలు సుపారీ ఇచ్చాడు. అయితే సుపారీ కిల్లర్ ఆమెను హత్యచేయకుండా వెనక్కి వచ్చేశాడు. దీంతో బాలమురుగన్ గతనెల 24 తేదీన నడిరోడ్డులో భార్యపై పిస్తోల్తో కాల్పులు జరిపి హత్య చేశాడు. -
సెలవు తీసుకోకుండా విధులకు గైర్హాజరు కావడం దుష్ప్రవర్తనే
● కర్ణాటక హైకోర్టు తీర్పు శివాజీనగర: సెలవు తీసుకోకుండా విధులకు గైర్హాజరు కావడం దుష్ప్రవర్తన అని, శ్రద్ధతో పని చేయని ఉద్యోగిపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు వెల్లడించింది. అనధికారికంగా ఉద్యోగానికి గైర్హాజరైన నేపథ్యంలో ట్రైనీ డ్రైవర్గా పని చేస్తున్న ఓ వ్యక్తిని సేవల నుంచి తొలగించిన ఆదేశాలను కార్మిక న్యాయస్థానం రద్దు చేసింది. ఈ ఆదేశాలను ప్రశ్నిస్తూ బీఎంటీసీ సమర్పించిన పిటిషన్ను న్యాయమూర్తి ఎం.జ్యోతి ధర్మాసనం విచారించింది. సెలవు కోరటం గాని, ముందుగా అనుమతి తీసుకోకుండా అనధికారికంగా విధులకు గైర్హాజరైన నేరం రుజువైన నేపథ్యంలో బీఎంటీసీ క్రమశిక్షణ ప్రాధికార ఉద్యోగిని సేవల నుంచి సస్పెండ్ చేసింది. ఉద్యోగ నిర్వహణ సమయంలో సరైన కారణం లేకుండా విధులకు ఉద్యోగి అనధికారికంగా గైర్హాజరు కాకూడదు. అలాంటి దుష్ప్రవర్తన క్రమశిక్షణ చర్యలను సమర్థిస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. -
సుడిగాలికి ఎగిరిపోయిన భారీ పెండాల్
● మంత్రి సతీష్ జార్కిహోళికి తప్పిన ప్రమాదం దొడ్డబళ్లాపురం: భారీ పెండాల్ సుడిగాలికి ఎగిరిపోయిన సంఘటనలో మంత్రి సతీష్ జార్కిహోళి తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. హావేరి జిల్లా రాణెబెన్నూరు పట్టణంలో శనివారం ఈ సంగటన జరిగింది. పట్టణంలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం నిమిత్తం భారీ పెండాల్ ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముగిసాక పెండాల్ కింద మంత్రి సతీష్ జార్కిహోళి మీడియాతో మాట్లాడుతుండగా సుడిగాలి వచ్చింది. దీంతో భారీ పెండాల్ ఎగిరి మంత్రి పక్కనే పడింది. దీంతో మంత్రికి ప్రమాదం తప్పింది. సీఎంతో ఎమ్మెల్యే భేటీ సాక్షి, బళ్లారి: రాయచూరు జిల్లాలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య శనివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని బెంగళూరు వెళుతూ తోరణగల్లు వద్ద ఉన్న జిందాల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈక్రమంలో బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ సీఎంను కలిశారు. బళ్లారిలో చోటు చేసుకున్న ఘర్షణలు, కార్యకర్త మృతి, ప్రస్తుతం బళ్లారిలో నెలకొన్న వాతావరణం గురించి వివరించినట్లు సమాచారం. -
రాజకీయాల్లోకి ఎలా వచ్చావో గుర్తుందా?
సాక్షి, బళ్లారి: ‘రాజకీయంగా తనకు భిక్ష పెట్టింది గాలి జనార్దన్ రెడ్డే అని ఎన్నోసార్లు నువ్వే చెప్పావు. ఎక్కడో రౌడీయిజం చేసుకుని జీవిస్తున్న నిన్ను శ్రీరాములు, నేను ఈ స్థాయికి తీసుకొచ్చాం. దీన్ని మరిచి మాట్లాడితే సహించేది లేదు. శ్రీరాములు కాలిధూళికి కూడా సరిపోని నీవు.. మమల్ని విమర్శిస్తావా?’ అని బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్రపై గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఫ్లెక్సీ ఏర్పాటు వివాదంలో ఎస్పీని సస్పెండ్ చేయడం సరైంది కాదన్నారు. డీఎస్పీ నందారెడ్డిని సస్పెండ్ చేయాలని సూచించారు. ఎస్పీ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పాదయాత్ర ద్వారా పెద్ద సంఖ్యలో జనాన్ని తీసుకుని వస్తున్నప్పుడు డీఎస్పీ నందారెడ్డి వెంట ఉన్నారన్నారు. అలాంటి డీఎస్పీని బాధ్యుడిని చేయకుండా ఎస్పీని సస్పెండ్ చేయడం ఏమిటన్నారు. గంజాయి సరఫరా చేస్తున్న ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి అనుచరుడు ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి అనుచరుడు విచ్చలవిడిగా గంజాయి సరఫరా చేస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్నారన్నారు. బళ్లారిలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నారన్నారు. అలాంటి వారికి ఎమ్మెల్యే భరత్రెడ్డి సహకారం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డాం గాలి జనార్దన రెడ్డి ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే భరత్రెడ్డి ఆప్తుడు సతీష్ రెడ్డికి చెందిన గన్మెన్లు జరిపిన కాల్పుల్లో తాము ప్రాణాలతో బయటపడ్డామంటే అది దేవుడి దయతో సాధ్యమైంది. లేకపోతే ఈ పాటికి పరలోకాలకు చేరే వారము’ అని మాజీ మంత్రి శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. సతీష్ రెడ్డికి ఏ హోదాతో గన్మెన్లను ఇచ్చారని ప్రశ్నించారు. ఆ గన్మెన్లు కాల్పులు జరపడానికి అధికారం ఎవరు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాగేంద్రపై విరుచుకుపడిన గాలి జనార్దన్ రెడ్డి -
అంబామఠ జాతరకు సీఎం శ్రీకారం
రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు తాలూకా అంబామఠంలో సుమారు 400 ఏళ్ల చరిత్రగల అంబాదేవి జాతర ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శ్రీకారం చుట్టారు. శనివారం అంబామఠ సమీపంలోని సిద్ధ పర్వతంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నెరవేర్చారు. సింధనూరులో రూ.400 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజలు చేశారు. జానపద జాతర, నృత్యం, హాస్య సంజె, దేవి పల్లకీ సేవ, నాటకం, కుంభోత్సవాలను తిలకించారు. మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, రామలింగారెడ్డి, లోక్సభ సభ్యుడు కుమార నాయక్, ఎమ్మెల్యేలు హంపనగౌడ బాదర్లి, హంపయ్య నాయక్, రాఘవేంద్ర హిట్నాళ్, ఎమ్మెల్సీ బసనగౌడ బాదర్లి, జిల్లాధికారి నితీష్, ఎస్పీ అరుణాంగ్షు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, తహసీల్దార్ అరుణ్ దేశాయి, టీపీ ఈఓ చంద్రశేఖర్లున్నారు. జీ రామ్జీ చట్టం రద్దుకు డిమాండ్ శివాజీనగర: మహాత్మాగాంధీ నరేగ పథకం పేరు, స్వరూపాన్ని మార్చటాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య బలంగా వ్యతిరేకించారు. తన నివాస కార్యాలయం కృష్ణాలో శనివారం ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్, గ్రామీణాభివృద్ధి మంత్రి ప్రియాంక ఖర్గేతో సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పల్లె అధికారాన్ని లాక్కొని గ్రామీణ ఆర్థిక పరిస్థితిని నాశనం చేసేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. గతంలో యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నరేగ పథకం ప్రజలకు ఉద్యోగ హక్కును కల్పిస్తే నేడు ఆ హక్కును హరించడం సరికాదని అన్నారు. నరేగ పథకాన్ని ముందున్న స్వరూపంలో పునర్ స్థాపించాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం నరేగ పథకాన్ని ఉపసంహరించుకొని వీబీ జీరామ్జీ పేరుతో కొత్త చట్టం అమల్లోకి తెచ్చే ముందుగా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను తీసుకోకుండా నేరుగా కొత్త చట్టం అమలు చేయడం ద్వారా సర్వాధికార ధోరణిని ప్రదర్శించిందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేపట్టిందన్నారు. నరేగ పథకాన్ని పునర్ స్థాపించే వరకు తాము పోరాటం చేస్తాం. సంఘ సంస్థలు, పార్టీలు ఎవరైనా కూడా తమ పోరాటంలో పాల్గొనవచ్చన్నారు. నరేగ పథకం పేరును మార్చటం వెనుక ఆర్ఎస్ఎస్ హస్తముందని ఆయన ఆరోపించారు. ప్రూట్ జామ్ సీసాలో పురుగులు చిక్కబళ్లాపురం: ప్రూట్జామ్ బాటిల్స్లో పురుగులు కనిపించిన ఘటన తాలూకాలోని నందిగ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శాంతకుమార్ అనే వ్యక్తి అదే గ్రామంలోని ఓ బేకరీలో ప్రూట్ జామ్ బాటిల్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి మూత తీసి చూడగా పురుగులు కనిపించాయి. బాటిల్పై తయారీ తేదీ సెప్టెంబర్ 2025, ఎక్స్పైరీ డేట్ అక్టోబరు 2026 అని నమోదు చేశారు. బాటిల్లో పురుగులును గమనించిన శాంతకుమార్ బేకరీకి వెళ్లి ఆరా తీయగా తమకేమి తెలియదని, పంపిణీదారుడిని అడగాలని సూచించారు. దీంతో ఈ విషయంపై ఆహార నాణ్యత తనిఖీ అధికారికి ఫిర్యాదు చేస్తానని శాంతకుమార్ తెలిపారు. కారు దగ్ధం కృష్ణరాజపుర: చలనంలో ఉన్న కారు దగ్ధమైన ఘటన బెంగళూరు నగరం బయ్యప్పనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ మద్రాస్ రోడ్డులో జరిగింది. కోరమంగళ నివాసి డాక్టర్ నాగరాజు తన డ్రైవర్తో కలిసి శనివారం కారులో వెళ్తుండగా ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి కిందకు దిగారు. క్షణాల్లోనే మంటలు చెలరేగి వాహనం కాలిపోయింది. బయ్యప్పనహళ్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. -
మృతుడి కుటుంబానికి పరామర్శ
సాక్షి,బళ్లారి: బళ్లారిలో వాల్మీకి మహర్షి విగ్రహం ఆవిష్కరణ కోసం బ్యానర్ ఏర్పాటు చేసే క్రమంలో చోటు చేసుకున్న ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందిన నేపథ్యంలో కేపీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నియమించిన సత్యశోధన కమిటీ శనివారం బళ్లారిలో పర్యటించింది. కమిటీ సభ్యులు, పంచ గ్యారెంటీల అమలు సమితి రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.ఎం.రేవణ్ణ, మాజీ ఎంపీ జయప్రకాష్ హెగ్డే, చెళ్లకెరె ఎమ్మెల్యే రఘుమూర్తి, ఎంపీ కుమార్నాయక్, ఎమ్మెల్సీలు బసనగౌడ బాదర్లి, జక్కప్పనవర్లు గాలి జనార్ధన్రెడ్డి ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘర్షణ స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నగరంలోని హుస్సేన్ నగర్కు వెళ్లి కార్యకర్త రాజశేఖర్ తల్లి తులసి, అక్క ఉషా, తమ్ముడు ఈశ్వర్ తదితర కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజశేఖర్ మృతి తమను ఎంతో బాధిస్తోందన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మృతుడి కుటుంబానికి ఇల్లు, తమ్ముడికి ఉపాధి అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు మేయర్ గాదెప్ప, కార్పొరేటర్ వివేక్ పాల్గొన్నారు. రూ.25 లక్షల నగదు అందజేత కాల్పుల్లో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ కుటుంబాన్ని మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ పరామర్శించారు. శనివారం ఆయన నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే గణేష్తో కలిసి నగరంలో హుస్సేన్నగర్లోని రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆయన తల్లి, అక్క, తమ్ముడితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రాణాలకు వెలకట్టలేమని, తమ వంతుగా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.25 లక్షలు అందజేస్తున్నామన్నారు. మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అధైర్య పడవద్దని సూచించారు. ఈసందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, కార్పొరేటర్ విక్కీ పాల్గొన్నారు. అండగా ఉంటాం, ఆదుకుంటామని సత్యశోధన కమిటీ భరోసా -
వైభవం.. బనశంకరీ దేవి రథోత్సవం
ప్రత్యేక పూల అలంకరణలో బనశంకరీ దేవి మూలవిరాట్బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో శాకంబరీ దేవిబనశంకరి: బనశంకరీ దేవి బ్రహ్మ రథోత్సవం అశేష జనవాహినితో జనసంద్రంగా మారింది. బనశంకరీ దేవి జాతర మహోత్సవాల్లో భాగంగా బనద పౌర్ణమి(పుష్యశుద్ధ పౌర్ణమి) శనివారం వేకువ జామున సుప్రభాత సేవ అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ బనశంకరీ దేవి మూలవిరాట్కు ప్రత్యేక పంచామృత అభిషేకం చేశారు. ఆలయ అర్చకుల బృందం బనశంకరీ దేవి మూలవిరాట్కు ప్రత్యేక పూల అలంకరణ, శాకంబరీ దేవి మూలవిరాట్ను బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి కలశాలను బనశంకరీ దేవస్థాన వ్యవస్థాపన కమిటీ ఆధ్వర్యంలో మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి రథంపై ప్రతిష్టించారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ప్రత్యేక అలంకరణ చేపట్టి బనశంకరీ దేవి ఉత్సవమూర్తి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి విశేష అలంకరణ చేపట్టిన రథంపై అధిష్టింపజేశారు. ఆలయ ప్రధాన అర్చకుల నేతృత్వంలో అర్చకుల బృందం రథానికి ప్రత్యేక పూజలు చేపట్టారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ఆలయ వ్యవస్థాపన కమిటీ అధ్యక్షుడు జీఎన్ఆర్.మోహన్, ఈఓ ఎన్.కృష్ణప్ప, కమిటీ సభ్యులు బనశంకరీ దేవి రథాన్ని లాగి రథోత్సవం ప్రారంభించారు. రథం ముందుకు కదలగానే భక్తులు అరటిపండ్లు, దవనం రథంపైకి విసిరి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవం సందర్భంగా డోలు కుణిత, వీరగాసె, కేరళ చండీ మేళ, వివిధ జానపద కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. జాతర సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పూలతో అలంకరణ చేపట్టడంతో ప్రత్యేక శోభ సంతరించుకుంది. జాతర మహోత్సవానికి బెంగళూరు నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలి రావడంతో జనసంద్రంగా మారింది. భక్తులు బారులు తీరి బనశంకరీ దేవిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బనశంకరి, కుమారస్వామి లేఔట్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతర సందర్భంగా బనశంకరీ దేవస్థానం నుంచి సారక్కి వరకు భక్తులు విరివిగా అన్నదానం, మజ్జిక, పానకం వితరణ చేశారు. రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ను మళ్లించారు. వేడుకల్లో మాజీ కార్పొరేటర్లు ఎన్.నాగరాజు, ఎల్.శ్రీనివాస్, నారాయణ, కమిటీ సభ్యులు నాగేష్, బాలాజీ యాదవ్, రమేష్, కార్తీక్, స్మిత, సురేష్బాబు హాజరయ్యారు. అమ్మవార్లకు విశేష అలంకరణలు దర్శనానికి బారులు తీరిన భక్తులు -
కాల్పుల ఘటనలో ఇద్దరు గన్మెన్ల అరెస్ట్
సాక్షి, బళ్లారి: గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు బ్యానర్ ఏర్పాటు వివాదం చినికి, చినికి గాలి వానగా మారింది. మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో మొదలైన ఈ వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న రాజకీయ సమరంలో ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఆప్తుడు, కాంట్రాక్టర్ సతీష్రెడ్డి అంగరక్షకుడు తన ప్రైవేటు గన్ తీసుకుని కాల్పులు జరపడంతో అమాయకుడైన రాజశేఖర్ అనే యువకుడు మృతి చెందాడు. దీంతో బళ్లారిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో నివురుగప్పిన నిప్పులా మారింది. గాలి జనార్దన్ రెడ్డిపై గన్ గురి పెట్టి కాల్పులు జరిపిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏకమైన గాలి అన్నదమ్ములు, శ్రీరాములు ఇటీవల కొంత కాలంగా గాలి సోదరులు, శ్రీరాములు మధ్య సఖ్యత కొరవడి ఎవరికి వారు రాజకీయాల్లో కొనసాగుతున్న తరుణంలో గాలి జనార్దన్ రెడ్డి నివాసం సమీపంలో జరిగిన ఈ వివాదం, తుపాకీ కాల్పుల ఘటనలతో అన్నదమ్ములైన మాజీ మంత్రి గాలి కరుణాకరరెడ్డి, గాలి సోమశేఖరరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి ముగ్గురు ఏకమయ్యారు. గాలి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న శ్రీరాములు కూడా గాలి జనార్దనరెడ్డితో కలిసిపోవడంతో అభిమానులు, కార్యకర్తల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. బళ్లారిలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసు బలగాలతో బందోబస్తు కొనసాగిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కూడా తనను హత్య చేసేందుకే కాల్పులు జరిపారని పేర్కొనడంతో ఆయన ఇంటి ముందు భద్రత కట్టుదిట్టం చేశారు. గాలి స్వగృహం వద్దకు ఆయన సన్నిహితులు, అభిమానులు, బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో శనివారం భారీ జనసందోహం కిటకిటలాడింది. ఎస్పీ సస్పెన్షన్పై విమర్శలు బళ్లారిలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో అధికార బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే ఎస్పీ పవన్ నెజ్జూర్ను సస్పెండ్ చేయడంపై జిల్లాలో సామాన్య ప్రజలతో పాటు బీజేపీ నాయకులు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఏ అధికారి అయినా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో పరిస్థితి ఎలా ఉంది? ఏయే పోలీసు స్టేషన్లలో ఎవరెవరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పని చేస్తున్నారో తెలుసుకుని వారితో శాంతిభద్రతల గురించి సమీక్షించేందుకు సమయం పడుతుంది. అలాంటిది అధికార బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే రాష్ట్రాన్ని కుదిపేసే విధంగా బళ్లారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు గాలి జనార్దన్ రెడ్డి, నారా భరత్రెడ్డి మధ్య రాజకీయ యుద్ధం జరిగింది. ఎమ్మెల్యే భరత్రెడ్డి ఆప్తుడు సతీష్రెడ్డికి చెందిన గన్మెన్ కాల్పులు జరపగా ఓ యువకుడు మృతి చెందడంతో అందుకు బాధ్యుడిని చేస్తూ ఎస్పీని సస్పెండ్ చేయడం ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఎస్పీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ నాయకులు శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎస్పీని కాదు.. డీఎస్పీ నందారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సీఎం సిద్దరామయ్య అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందని కూడా విమర్శలు చేశారు. జేడీఎస్ అధినేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ స్పందించారు. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములుతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. 12 ఎంఎం బుల్లెట్ లభ్యం బళ్లారిలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో వాల్మీకి సర్కిల్, రాయల్ సర్కిల్ తదితర ప్రధాన కూడళ్లతో పాటు గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద కూడా భారీగా పోలీసు భద్రత కల్పించారు. కాల్పుల్లో యవకుడు మృతి చెందిన తరుణంలో పోస్టుమార్టం తర్వాత, మృతదేహంలో లభ్యమైన బుల్లెట్ను అన్ని కోణాల్లో పరిశీలించారు. మృతదేహం నుంచి లభ్యమైన బుల్లెట్ 12 ఎంఎం సైజులో ఉందని తేలింది. ఎవరికి చెందిన గన్ నుంచి 12 ఎంఎం బుల్లెట్ వచ్చిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.విలేకరుల సమావేశంలో గాలి కరుణాకర్రెడ్డి, గాలి సోమశేఖర్రెడ్డి, గాలి జనార్దన్రెడ్డి, గాలి నివాసం వద్దకు చేరిన పార్టీ కార్యకర్తలు, అభిమానులుజనార్దన్రెడ్డికి మాట్లాడే హక్కు లేదు డీసీఎం డీకే శివకుమార్ శివాజీనగర: గాలి జనార్దన్రెడ్డి బళ్లారిలో కాలు పెట్టే వరకు అక్కడ ఏ ఒక్క గొడవ, చిన్న అవాంఛనీయ ఘటన కూడా జరుగలేదు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. ఆయన వచ్చిన తరువాతే గొడవ జరిగింది. అందువల్ల ఆయనకు మాట్లాడే ఎలాంటి హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డికి అండగా నిలుస్తుందని డీసీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. శనివారం బెంగళూరులో ఆయన మాట్లాడుతూ తాము తమ పార్టీ కార్యకర్తను కోల్పోయాం. ఇందుకు కారణం ఎవరో దర్యాప్తులో వెల్లడవుతుందన్నారు. చట్టం తన పని తాను చేస్తుంది. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందన్నారు. పోలీసు దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమన్నారు. పార్టీ ద్వారా ఈ ఘటనపై అధ్యయనానికి హెచ్.ఎం.రేవణ్ణ అధ్యక్షతన కమిటీని నియమించామన్నారు. ఈ కేసు నేపథ్యంలో అందరి ప్రైవేట్ గన్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. గన్ లైసెన్స్ పంపిణీ విషయంలో చేపట్టాల్సిన చర్యలను సిద్ధం చేసి, నియమావళిని రూపొందిస్తామన్నారు. తన హత్యకు కుట్ర పన్నారన్న ఎమ్మెల్యే జనార్దన్రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ గాలి జనార్దన్రెడ్డి ఒక డ్రామా మాస్టర్ అని అన్నారు. ఆయన మొదటే సినిమా నిర్మాత కదా? డ్రామా చేస్తారు అని చమత్కరించారు. కంచుకోటను కట్టుకొని వంద మంది భద్రతా సిబ్బందిని పెట్టుకున్న వారిని ఎవరు హత్య చేస్తారు అని ప్రశ్నించారు.రాజకీయ దుమారం రేపిన ఫ్లెక్సీ వివాదం ప్రైవేటు వ్యక్తి జరిపిన కాల్పులకు ఎస్పీ సస్పెండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు గాలి నివాసం వద్దకు భారీగా చేరిన అభిమానులు, జన సందోహం జనార్దన్ రెడ్డి, శ్రీరాములుకు మాజీ ప్రధాని దేవెగౌడ ఫోన్లో పరామర్శ మరో 40 మంది అదుపులోకి అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం ఎస్పీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రచారంఎస్పీ పవన్ నెజ్జూర్ సస్పెండ్ కావడంతో మనస్తాపానికి గురై తుమకూరుకు వెళ్లి స్నేహితుడికి చెందిన ఫాంహౌస్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు జోరుగా ప్రచారం జరిగింది. మోతాదుకు మించి నిద్ర మాత్రలు మింగడంతో ఆస్పత్రిలో చేర్చారని.. ప్రాణాపాయం లేదంటూ సోషల్ మీడియాతోపాటు అన్ని ప్రముఖ మీడియా చానల్స్లో ప్రచారం చేశారు. అయితే ఎస్పీ పవన్ నెజ్జూర్ ఎలాంటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదు.. ఫాంహౌస్లో స్నేహితులతో కలిసి ఉన్నారని సన్నిహిత ఎస్పీలు, స్నేహితులు కొట్టిపారేయడం గమనార్హం.సాక్షి,బళ్లారి: నగరంలోని గాలి జనార్ధన్రెడ్డి నివాసానికి సమీపంలో జరిగిన ఘర్షణలో గురువారం రాత్రి ఎమ్మెల్యే భరత్రెడ్డి ఆప్తుడు సతీష్రెడ్డికి చెందిన గన్మెన్లు జరిపిన కాల్పుల నేపథ్యంలో ఇద్దరు గన్మెన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘర్షణలో సతీష్రెడ్డి గన్మెన్ కాల్పులు జరుపుతున్న వీడియో వైరల్ కావడంతో బీజేపీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నందున పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. శనివారం సతీష్రెడ్డి గన్మెన్లను ఇద్దరిని అరెస్ట్ చేయడంతో పాటు ఆ గొడవలో పాల్గొన్న నారా భరత్రెడ్డి, గాలి జనార్ధన్రెడ్డి అనుచరులైన 40 మందిని కూడా బ్రూస్పేట పోలీసులు అరెస్ట్ చేసి రాజశేఖర్రెడ్డి మృతికి కారణమైన బుల్లెట్ ఎవరి గన్ నుంచి వచ్చిందో అన్ని కోణాల్లో ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. -
గనుల తవ్వకాలతో గ్రామాలకు హాని
కోలారు: మాలూరు తాలూకా టీకల్ ఫిర్కా కరడుగుర్కి, హులిగుట్టె, ఊరుగుర్కి, జంగమహళ్లి గ్రామాల సమీపంలోని కొండ ప్రాంతాల్లో గనుల తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తవ్వకాలు జరిగే ప్రదేశానికి వంద మీటర్ల దూరంలో తమ గ్రామాలు ఉన్నాయని, కాలుష్యం వెలువడి తమ ఆరోగ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండ సమీపంలోనే గోమాళం భూమి ఉందని, మేత కోసం పశువులు అక్కడకు వస్తుంటాయన్నారు. తవ్వకాలతో ప్రజలతోపాటు మూగజీవాలకు ప్రమాదం పొంచి ఉందని గ్రామ పంచాయతీ సభ్యుడు విజయకుమార్ పేర్కొన్నారు. గనుల తవ్వకాల సమయంలో డైనమెట్లను పేల్చే ప్రమాదం ఉందని, శబ్దాలకు ప్రజల ఇళ్లకు హాని జిగే ప్రమాదం ఉందన్నారు. దుమ్ము ధూళి పొలాలలపై పేరుకు పోయి పంటలు నాశనమవుతాయన్నారు. ఈ నేపథ్యంలో గనుల తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
నిందితులను అరెస్ట్ చేయాలి
రాయచూరు రూరల్: దార్వడ జిల్లా హుబ్లీలో జరిగిన పరువు హత్య కేసులో నిందితులను అరె్స్ట్ చేయాలని అఖిల భారత సామాజిక కార్యకర్త ప్రభురాజ్ మకోడ్లి డిమాండ్ చేశారు. శనివారం సిందనూరు ప్రభత్వ అతిథి నివాసం వద్ద ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వినతిపత్రం అందజేశారు. ప్రేమ పేరుతో కులంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఎస్సీకి చెందిన వివేకానంద, ఏడు నెలల గర్భిణి మాన్యా పాటిల్ను తల్లిదండ్రులు హత్య చేశారని తెలిపారు. వివేకానంద, మాన్యా పాటిల్ను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసి కోరారు. వివేకానంద కుటుంబానికి పోలీస్ భద్రత కల్పించాలన్నారు. ఘనంగా తెప్పోత్సవం రాయచూరు రూరల్: కోప్పళ గవి మఠంలో అభినవ సిద్ధేశ్వర శివాచార్యుల జాతరలో భాగంగా శుక్రవారం రాత్రి ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. లక్షలాది మంది భక్తుల ఆధ్వర్యంలో గంగాహారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు రొట్టెలు, బజ్జీలు, మాదిలి, జిలేబీని ప్రసాదంగా అందజేశారు. బళ్లారిలో బ్యానర్ల తొలగింపు సాక్షి బళ్లారి: నగరంలో మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటు వివాదంగా మారిన విషయం తెలిసిందే. నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు వేసి ఘనంగా నిర్వహించాలని భావించిన కాంగ్రెస్ నేతలకు ఎదురు దెబ్బ తగిలింది. కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందడంతో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భారీ ఎత్తున పోలీసులను మొహరింపజేశారు. మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన వాయిదా పడింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, కాషాయ జెండాలు, శ్రీరాముడు, వాల్మీకి చిత్రపటాలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. ముగ్గురిపై పోక్సో కేసుహుబ్లీ: హుబ్లీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చిన్నారిపై సామూహిక హత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల పరిచయం అయిన ముగ్గురు బాలురు సదరు మైనర్ బాలికపై ఈ ఘాతకానికి పాల్పడినట్లు సమాచారం. బాధిత చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు మైనర్ బాలురును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బాలికను హత్యచారం చేసిన దృశ్యాలను బాలురు వీడియో తీసి పెట్టుకున్నారు. ముగ్గురిపై పోక్సో కేసు నమోదైంది. రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభంహొసపేటె: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను శనివారం జిల్లా సెషన్స్ జడ్జి కుమార్ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 30వ తేదీ వరకు జరగనున్న రోడ్డు భద్రతా వారోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియామాలు పాటించాలని తెలిపారు. అనంతరం రవాణా శాఖ ఉద్యోగులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పలువురు డ్రైవర్లకు అవగాహన కల్పించి భద్రతా నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేయించారు. అంతకుముందు నగరంలో గాంధీ కూడలి నుంచి ర్యాలీని ప్రారంభించి ప్రముఖ వీధుల గుండా పుణీత్ కూడలి వరకు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా అధికారి బాలకృష్ణ, తహసీల్దార్ శృతి, అదనపు జిల్లా ఎస్పీ మంజునాథ్, ఆర్టీఓ దామోదర్, బీఈఓ శేఖర్ హొరపేట్, నగరసభ అధికారి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బౌద్ధ అధ్యయన కేంద్రానికి స్థలం కేటాయించండి
కోలారు: బంగారుపేట తాలూకాలో బౌద్ధ అధ్యయన కేంద్రం ఏర్పాటుకు స్థలం మంజూరు చేయాలని కేజీఎఫ్ అశోక దమ్మధూత బౌద్ధ సంఘం సంచాలకుడు డాక్టర్ ఆర్.ప్రభురాం విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శనివారం జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.రవికి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ కేజీఎఫ్లో అశోక దమ్మధూత బౌద్ధ సొసైటీ ద్వారా బౌద్ధ ధర్మ ప్రచారంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈక్రమంలో బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని స్థాపించాలని చాలా మంది అడుగుతున్నారని, కనీసం ఐదు ఎకరాలు కేటాయించాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. -
సావిత్రి బాయి పూలేకు ఘన నివాళి
హొసపేటె: దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, దేశంలో పాఠశాలలు నిర్మించి విద్యను అందించిన చదువుల తల్లి సావిత్రి బాయి పూలే సమాజానికి చేసిన సేవలు మరువలేమని టీబీ డ్యాం పీఎల్సీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముఖ్యోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం పాఠశాలలో సావిత్రి బాయి పులే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సావిత్రి బాయి పూలే వేసిన విద్య పునాదులే నేటి స్వేచ్ఛకి ప్రధాన కారణమని తెలిపారు. కులమతాల పేరుతో తరతరాలుగా అణిచివేతకు గురైన నిమ్నజాతి ప్రజలకు ఆత్మసైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడారని కొనియాడారు. మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ అట్టడుగు వర్గాలకు చెందిన సీ్త్రలు చదువుకునేందుకు పాఠశాలలు ప్రారంభించారన్నారు. భర్తతో కలిసి సత్యశోధక సమాజాన్ని స్థాపించి బాల్య వివాహాల నిర్మూలనకు శ్రమించారని పేర్కొనానరు. అనంతరం కేజీఎస్ పాఠశాల విద్యార్థుల వేషాధారణ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, నిర్మలా రవి, మంజుళ పాల్గొన్నారు. రాయచూరు రూరల్: నవోదయ ఆస్పత్రి వద్ద శనివారం సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంఆ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి రవీంద్ర జాలదార్ మాట్లాడుతూ.. సావిత్రి బాయి పూలే సర్కిల్ నిర్మాణం చేపట్టి నామకరణం చేయడం జరిగిందన్నారు. నవోదయ కళాశాల వద్ద సర్కిల్కు పేరు పెట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉగ్ర నరసింహప్ప, అధ్యక్షుడు ఈరణ్ణ, బసవరాజ్, శశిధర్, రవి కుమార్, మహదేవ్, లక్ష్మి, యశోద, శారద, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాయచూరు తాలుకా ఉడుంగల్ ఖానాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి ఆచరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు దండెప్ప బిరదార్ మాట్లాడుతూ.. సావిత్రి బాయి పూలే విద్యా రంగానికి విశేష సేవలందించారని తెలిపారు. సావిత్రి బాయి పూలే సరస్వతి పుత్రికగా పేరుపొందారన్నారు. కార్యక్రమంలో వీణ, శివలీల, పద్మావతి, సావిత్రి, నాగారాజ్, దివ్య తదితరులు పాల్గొన్నారు. -
మా‘స్టార్’ బీరప్ప సార్
రాయచూరు రూరల్: మా సార్ బీరప్పను బదిలీ చేయొద్దు అంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. వివరాలు.. కోప్పళ జిల్లా బహద్దూర్ బండి ప్రభత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయుడు బీరప్ప అండగి సొంత ఖర్చులతో విద్యార్థులకు విమానయానం చేయించారు. విద్యార్థులను ఆకట్టుకునేలా విద్యా బోధన చేశారు. విద్యార్థుల కలలు సాకారం చేసిన ఉపాధ్యాయుడికి విద్యాశాఖ అధికారులు బదిలీ ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులు, విద్యార్థులు ఏకమై బదిలీ అయిన బీరప్ప మాస్టార్ను పంపమని తెలిపారు. పాఠశాలకు తాళం వేసి నిరసన ప్రదర్శన చేపట్టారు. మరోవైపు మధ్యాహ్న భోజనం కూడా వండొద్దంటూ గదికి తాళం వేశారు. హెచ్ఎం బీరప్ప విద్యార్థులకు ఎంత నచ్చజెప్పినా ఆందోళన విరమించలేదు. మధ్యాహ భోజనం తినకుండా మౌన ప్రతిఘటన చేశారు. జక్కనాచారి జీవన విధానం అలవర్చుకోండి రాయచూరు రూరల్: అమర శిల్పి జక్కనాచారి జీవన విధానాన్ని అందరూ అలవర్చుకోవాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ సూచించారు. శనివారం నగరంలోని కాళికా దేవి అలయం వద్ద అమర శిల్పి జక్కనాచారి చిత్రపటానికి పూజలు చేశారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో నగర సభ, జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ సాంస్కృతిక శాఖ, విశ్వకర్మ సమాజం నేతల ఆధ్వర్యంలో జక్కనాచారి చిత్రపటానికి పూజలు చేశారు. సమాజంలో మానవుడు దుర్మార్గం వైపు వెళ్లకుండా సన్మార్గంలో పయనించాలని దారి చూపిన మహనీయుడు జక్కనాచారి అని కొనియాడారు. కార్యక్రమంలో గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ, విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్, తహసీల్దార్ సురేష్ వర్మ, విశ్వకర్మ సమాజం నేతలు మారుతి, బ్రహ్మయ్య, రాములు పాల్గొన్నారు. వైద్య కళాశాల ఏర్పాటు చేయాలిరాయచూరు రూరల్: విజయపురలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ఆందోళన కార్యకర్త లలిత డిమాండ్ చేశారు. శనివారం విజయపుర జిల్లా ప్రభుత్వ ఆస్పతి వద్ద ఏఐడీఎస్ కార్యకర్తలతో కలసి ఆందోళన చేపట్టారు. విజయపురలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు విషయంలో జిల్లాలోని మంత్రులు, శాసన సభ్యులు మౌనం వహించడం సరికాదన్నారు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో రూ.500 కోట్లతో ఆస్పత్రి నిర్వహణకు మంత్రి ఎంబీ పాటిల్, శాసన సభ్యుడు బసన గౌడ పాటిల్ యత్నాల్ ముందుకు రావడం తప్పన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు మద్దతుగా జిల్లాలోని మంత్రులు శాసన సభ్యులు పదవులకు రాజీనామాలు చేయాలని కోరుతూ ఆందోళనకారులు మంత్రి ఎంబీ పాటిల్ నివాసాన్ని ముట్టడించారు. మరో వైపు ఏఐడీయస్ కార్యకర్తలు రాస్తోరోకో చేపట్టి మద్దతు పలికారు. దయా మరణం కల్పించాలని లేఖ రాయచూరు రూరల్: బ్రతికి ఉన్న వ్యక్తికి మరణ ప్రమాణం పత్రం ఇవ్వడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి దయా మరణం కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాయచూరు జిల్లా మాన్విలో చోటు చేసుకుంది. మాన్విలోని మూడవ వార్డు మారుతి నగర్లో నివాసముంటున్న మహ్మద్ హర్శద్దీన్ భార్య కరిష్మా చనిపోయింది. భార్య కరిష్మా పేరు మీద నివాసాన్ని తన పేరుపై మార్చాలని మహ్మద్ హర్శద్దీన్ అధికారులకు వినతిపత్రం అందజేశాడు. అయితే మహ్మద్ హర్శద్దీన్ చనిపోయినట్లు అధికారులు నకిలీ ప్రమాణ పత్రాలను నమోదు చేయడంతో ఇంటిని మార్చేందుకు సాధ్యం కాలేదు. ఈ విషయంలో న్యాయం చేయాలంటూ మహ్మద్ హర్శద్దీన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నగరాభివృద్ధి శాఖ మంత్రి, నగరాభివృద్ధి శాఖ కార్యదర్శి, జిల్లాధికారితో పాటు 22 మంది అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. మనస్థాపానికి గురైన మహ్మద్ హర్శద్దీన్.. తనకు దయా మరణం కల్పించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసినట్లు వివరించారు. గ్రామస్తులపై తేనెటీగల దాడికోలారు : బంగారుపేట తాలూకా భీమగానహళ్లి గ్రామంలో తేనెటీగలు దాడి చేయడంతో పాలువురు గాయపడ్డారు. గ్రామంలోని పాఠశాల సమీపంలోని చెట్టుపై తేనెటీగలు స్థావరం ఏర్పరుచుకున్నాయి. శనివారం గుంపులుగా వచ్చి దాడి చేయడంతో రోడ్లపై తిరుగుతున్న గ్రామస్తులు పరుగులు తీసి ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. తేనెటీగలు విద్యార్థులపై కూడా దాడి చేశాయి. దీంతో పిల్లలు తలుపులు, కిటికీలు వేసుకున్నారు. -
విమర్శిస్తే చూస్తూ ఊరుకోం
సాక్షి బళ్లారి: తమ కుటుంబాన్ని అనవసరంగా విమర్శిస్తే చూస్తూ ఉరుకోబోమని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. తమ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ.. గాలి కుటుంబంపై మాజీ బుడా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చిన్నాన్న నారా ప్రతాప్రెడ్డి విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు ఆహ్వానించడాన్ని స్వీకరిస్తున్నానని తెలిపారు. చర్చకు ఎప్పుడైనా, ఎక్కడైనా వస్తామని స్పష్టం చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున తాను, తన మరదలు, (తమ్ముడు గాలి జనార్దనరెడ్డి భార్య లక్ష్మీ అరుణ) పోటీ పడటంతో ఓట్లు చీలిపోయాయి. ఎమ్మెల్యేగా నారా భరత్రెడ్డిని గెలిపించినందుకు జనం బాధపడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నగరంలో ఏదో ఒక రెండు రోడ్లలో అభివృద్ధి పనులు చేశారని ఎద్దేవా చేశారు. గతంలో తాము చేసిన అభివృద్ధి పనులను విమర్శిస్తుండటంతో జనం నవ్వుకుంటారన్నారు. ముందుగా లక్ష్మీ మిట్టల్ పరిశ్రమను ప్రారంభించాలని.. ఆ తర్వాత ఎన్ఎండీసీ గురించి మాట్లాడాలని సూచించారు. కొళగల్లు సమీపంలో తమ తల్లిదండ్రులు రుక్మిణమ్మ, చెంగారెడ్డి పేరు మీదుగా చెరువు నిర్మిస్తామని చెప్పిన మాట వాస్తవమే అన్నారు. అయితే అక్కడ భూమి పరిశీలన చేసిన తర్వాత అధికారుల సూచన మేరకు దానిని రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. గాలి జనార్దన రెడ్డి, శ్రీరాములు మంత్రులుగా ఉన్న సమయంలో తాను నగర ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బళ్లారికి భారీగా నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధానంగా రింగ్ రోడ్డు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, నగరంలో ప్రధాన రహదారుల అభివృద్ధి, కనక దుర్గమ్మ ఆలయ పనులు, బ్రిడ్జీల ఏర్పాటు తదితర పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో నగరంలో మట్కా, పేకాట, గంజాయి తదితర అసాంఘిక కార్యలాపాలు పెరిగిపోయాయన్నారు. చివరకు రేషన్ బియ్యం కూడా అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ప్రీతి గేహ్లాట్ నగర కమిషనర్గా ఉన్నప్పుడు నగరంలో ఎక్కడెక్కడ బ్యానర్లు, ఫెక్సీలు ఏర్పాటు చేయాలో నిబంధనలు రూపొదించారన్నారు. ప్రస్తుతం వాటిని పక్కన పెట్టి, ఇష్టారాజ్యంగా బ్యానర్లు ఏర్పాటు చేస్తుండటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో తన తమ్ముడు గాలి జనార్దనరెడ్డిని అన్యాయంగా జైలుపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బళ్లారిలో చోటు చేసుకున్న ఘటనపై సీఎం సిద్ధరామయ్య కూడా మండిపడ్డారని గుర్తు చేశారు. మా ఇంటి పేరును ప్రస్తావిస్తూ మాట్లాడితే.. మేము కూడా మీ ఇంటి పేరు ఉచ్చరించి మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. అభివృద్ధి విషయంలో ఎక్కడికై నా చర్చకు వస్తామంటూ మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్రెడ్డిని ఉద్దేశించి బదులిచ్చారు. కార్యక్రమంలో మాజీ బుడా అధ్యక్షుడు పాలన్న, వెంకటరమణ, దమ్మూరు శేఖర్, కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు మోత్కూరు శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కే.ఎస్.దివాకర్ పాల్గొన్నారు. బళ్లారి అభివృద్ధికి కృషి చేశాం అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధం కాంగ్రెస్ పాలనలో పెరిగిన మట్కా, పేకాట, గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి ఆగ్రహం -
ఉత్తమ సేవలకు సత్కారం
బళ్లారి అర్బన్: బెంగళూరులోని ఎంఎన్ఎన్ కన్నడ న్యూస్ చానల్ కార్యాలయంలో సావిత్రీ బాయి పూలే జయంతి సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఐదుగురు మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ చైతన్య సమితి కర్ణాటక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జానకి మోహన్ మాట్లాడారు. దేశంలోని ప్రతి ఒక్కరూ సావిత్రి బాయి పూలే జయంతిని జరుపుకోవాలన్నారు. మహిళా అధ్యక్షురాలిగా బీసీల సంక్షేమం కోసం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ బీసీ చైతన్య సమితి బళ్లారి జిల్లా అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ.. బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారి కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో బీసీ చైతన్య సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ రమణ, జాతీయ ఉపాధ్యక్షుడు గిరి యాదవ్, జాతీయ కార్యదర్శి వెంకటరమణ, బీసీ చైతన్య సమితి జాతీయ కార్యదర్శి జ్యోతి కుమార్, బెంగళూరు యు.కృష్ణమోహన్, బళ్లారి రవీంద్ర, మనోజ్, దివ్య యాదవ్, శరణమ్మ, యాంకర్ దివ్య, ప్రజ్వల్, చిరంజీవి సుప్రీత్, గాయత్రి, సత్య ప్రకాష్ బీసీ చైతన్య సమితి జాతీయ రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సేవ చేయడం అభినందనీయం
హొసపేటె: మానసిక దివ్యాంగులకు సేవ చేయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే కేవీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. గుండుమునుగు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, ఆమె సోదరుడు బసవరాజ్, ప్రత్యేక ప్రతిభావంతులైన వ్యక్తి, ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసుకుని సేవా పనిలో నిమగ్నమయ్యారని తెలిపారు. దివ్యాంగులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని సూచించారు. ప్రతిష్ట సమాజ సేవా ట్రస్ట్ అధ్యక్షురాలు గుండుమునుగు లక్ష్మీదేవి మాట్లాడుతూ.. ప్రతిష్ట సమాజ సేవా ట్రస్ట్ పాఠశాలలో మానసిక వికలాంగుల పిల్లల విద్య, భోజనం, అల్పాహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే కేవీ.రవీంద్రనాథ్ బాబు సూచించారని తెలిపారు. ప్రత్యేక సామర్థ్యాలు ఉన్న పిల్లలకు మద్దతు అందించడానికి దాతలు ముందుకు వస్తే ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి, మాజీ ఎమ్మెల్యే కేవీ రవీంద్రనాథ్ బాబు దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో ప్రతిష్ట సమాజ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు గుండుముంగు బసవరాజ్, కార్యదర్శి పుష్పలత, ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రశాంత్ కుమార్, సిబ్బంది ఓబన్న, అభిషేక్, చంద్రిక పాల్గొన్నారు. -
రౌడీయిజం చేసినట్లు ఆధారాలు ఉన్నాయా?
సాక్షి బళ్లారి: మాజీ మంత్రి, గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర రౌడీయిజం చేసిన ఆధారాలు ఎక్కడైనా ఉన్నాయా అని వాల్మీకి నాయకులు ప్రశ్నించారు. శనివారం నగరంలోని నక్షత్ర హోటల్లో వాల్మీకి సముదాయ ప్రముఖులు రాంప్రసాద్, జగన్, పరిశురాం, (పరిశీ) మల్లికార్జున తదితరులు విలేకరులతో మాట్లాడారు. తమ సమాజానికి చెందిన ఎమ్మెల్యే నాగేంద్ర రౌడీయిజం చేశారని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి మాట్లాడటంలో అర్థం లేదన్నారు. నాగేంద్ర రౌడీయిజం చేసినట్లు ఏమైనా మీదగ్గర ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తమ సమాజానికి చెందిన శ్రీరాములు, నాగేంద్ర, సురేష్ బాబును రాజకీయంగా అణదొక్కాలని ప్రయత్నించడం సరికాదన్నారు. మూడు నెలలు క్రితం శ్రీరాములును కూడా మీరు విమర్శించ లేదా అని ప్రశ్నించారు. మా నాయకుడు నాగేంద్ర మీతో గౌరవంగా మాట్లాడారని.. అయితే మీరు నాగేంద్రను విమర్శించడాన్ని ఖండిస్తున్నామన్నారు. శ్రీరాములును తమ లీడర్గా ఒప్పుకున్నామని.. కులాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదని హితవు పలికారు. ధూళుతో పోల్చడం ఎంతవరకు సమంజసమన్నారు. అదే ధూళు మిమ్మల్ని ఎన్నికల్లో ఓడించారని.. వచ్చే ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వాల్మీకి సమాజ ప్రముఖులు ముద్దు మల్లికార్జున, వండ్రప్ప, శిరనాథ్, నరేంద్ర, ఎల్.మారెన్న, గోవిందు, సోమణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఏనుగులున్నాయ్.. జాగ్రత్త
కెలమంగలం: కెలమంగలం–రాయకోట రోడ్డులో నాగదోణై వద్ద ఏనుగులు మకాం వేశాయి. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కర్ణాటక రాష్ట్రం బన్నేరుగట్ట అటవీ ప్రాంతం నుంచి వలస వచ్చిన ఏనుగులు గుంపులుగా విడిపోయాయి. ప్రస్తుతం జవుళగిరి, డెంకణీకోట, ఉడేగదుర్గం అటవీ ప్రాంతాల్లో మకాం వేశాయి. ఇప్పటికే 40 ఏనుగులను అటవీ శాఖ అధికారులు కర్ణాటక వైపు మళ్లించారు. ఈ నేపథ్యంలో ఉడేదుర్గం అటవీ ప్రాంతంలో మకాం వేసిన ఏనుగుల మంద కెలమంగలం–రాయకోట రోడ్డులోని నాగదోణి వద్ద అటవీ శాఖకు సంబంధించిన నర్సరీ సమీపంలో మకాం వేశాయి. ఈ ఏనుగులు ఎప్పుడైనా రోడ్డును దాటేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఏనుగుల మందను చూసి సెల్పీలకు ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. కొంత మంది సిబ్బంది ఘటనా స్థలంలో ఏనుగుల సంచారంపై నిఘా పెట్టారు. -
కర్ణాటకలో అద్భుతం : ఇది ‘మామూలు చిరుత’ కాదు
కర్ణాటకలో మరో అరుదైన చిరుతపులి దర్శనమిచ్చింది. కర్ణాటకలోని విజయనగర జిల్లాలో, హోలేమట్టి నేచర్ ఫౌండేషన్ (HNF) వన్యప్రాణి శాస్త్రవేత్త సంజయ్ గుబ్బి, బృందం తొలిసారిగా అత్యంత అరుదైన చిరుతపులిని గుర్తించారు. చేశారు. హోలేమట్టి నేచర్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్న సంజయ్ గుబ్బి అన్వేషణకు సంబంధించి ఇది కర్ణాటకలో తొలి రికార్డు. ట్రాప్ కెమెరాకు చిత్రాల ఆధారంగా పరిశోధకులు చిరుతపులిని నిర్ధారించారు.అంతర్జాతీయంగా దీన్ని స్ట్రాబెర్రీ చిరుత ( strawberry leopard) అని పిలుస్తారు. సాధారణ చిరుతపులిలా ముదురు నల్ల రంగు మచ్చలు కాకుండా అసాధారణమైన లేత గోధుమ రంగు మచ్చలు లేత ఎరుపు గులాబీ రంగు కోట్, గంధపు చెక్కరంగును పోలిన చర్మంతో ఉంది. ఇది చాలా అరుదైన అద్భుతమైన చిరుత అని, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి చాలా తక్కువ ఉన్నాయని చెబుతున్నారు. అంతర్జాతీయంగా దీనిని 'స్ట్రాబెర్రీ చిరుత’గా చెబుతున్నప్పటికీ సంజయ్ గుబ్బి దీనికి 'గంధపు చిరుత' (sandalwood leopard) అని పేరు ప్రతిపాదించారు. కర్ణాటక గంధపు చక్కలకు ప్రసిద్ధి కాబట్టి, ఈ పేరు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, ప్రాంతీయ పరిరక్షణ ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుందని ఆయన అభిప్రాయం.అరుదైన రంగు-శాస్త్రీయ కారణాలుజన్యు మార్పు కారణంగా వాటికి రంగు వస్తుందని శాస్త్రవేత్తల విశ్లేషణ. ఇది ఎరిథ్రిజం (Erythrism) లేదా హైపోమెలనిజం అనే జన్యుపరమైన స్థితి వల్ల సంభవిస్తుంది. దీనివల్ల శరీరంలో ఎరుపు వర్ణద్రవ్యం (Red pigment) పెరిగి, నలుపు వర్ణద్రవ్యం తగ్గుతుంది.ఇటువంటి లక్షణాలు అడవి క్షీరదాలలో సహజంగా సంభవిస్తాయి. దీని ఖచ్చితమైన స్థితిని తెలుసుకోవడానికి DNA పరీక్షలు, విశ్లేషణ అవసరమని గుబ్బి భావిస్తున్నారు.శాస్త్రవేత్తలు ఫోటోగ్రాఫిక్ మరియు దృశ్య ఆధారాలపై ఆధారపడతారు కనుక ఈ చిరుతపులిని అరుదైన మార్ఫ్గా వర్ణించారు.వయస్సు , లింగం : కెమెరా ట్రాప్ చిత్రాల ద్వారా ఇది 6 ఏళ్ల వయస్సున్న ఆడ చిరుత అని నిర్ధారించారు.భారతదేశంలో ఇంతకు ముందు ఇలాంటి చిరుతపులి ఒకటి మాత్రమే నమోదైంది. 2021 నవంబరులో రాజస్థాన్లోని రణక్పూర్ ప్రాంతంలో ఇలాంటి చిరుత కనిపించింది. ఇప్పుడు కర్ణాటకలో కనిపించడం ఇది రెండోసారి. దక్షిణాఫ్రికా , టాంజానియా వంటి దేశాల్లో మాత్రమే అక్కడక్కడా ఇవి కనిపించాయి.ఈ ప్రాంతం కళ్యాణ కర్ణాటకలో ఉంది. హోలేమట్టి నేచర్ ఫౌండేషన్ ఈ డాక్యుమెంటేషన్కు నాయకత్వం వహించింది. ఈ బృందంలో సంజయ్ గుబ్బి, సందేశ్ అప్పు నాయక్, శ్రావణ్ సుతార్, పూర్ణేష హెచ్.సి. రుమా కుందార్కర్, రవిచంద్ర వెలిప్ పాల్గొన్నారు.చదవండి: ధర్మశాలలో ర్యాగింగ్ భూతం : పోరాడి ఓడిన 19 ఏళ్ల పల్లవిచిరుతపులుల సంఖ్యను లెక్కించడం, గుర్తించడం వీరి లక్ష్యం. ఇది కీలకమైన పరిరక్షణ ప్రకృతి దృశ్యాలను కూడా గుర్తిస్తుంది. ఈ ప్రాంతం భారతీయ బూడిద రంగు తోడేలు వంటి జాతులకు కేంద్రం. చారల హైనా, బెంగాల్ ఫాక్స్ కూడా నివసిస్తాయి. కర్ణాటకలో దాదాపు 2,500 చిరుతపులులు ఉన్నాయని ఫౌండేషన్ అంచనా వేసింది. ఇలాంటి ఆవిష్కరణలు నాలెడ్జ్ గ్యాప్ను హైలైట్ చేస్తాయని, అడవులపై పరిరక్షణ అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.ఇదీ చదవండి: రూ. 25 వేలకే అమ్మాయిలు : మంత్రి భర్త వ్యాఖ్యలు వీడియో వైరల్ -
బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం
బెంగళూరు: బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు. తుముకూరులో నిద్ర మాత్రలు మింగారు ఐపీఎస్ అధికారి పవన్ నిజ్జూర్. బళ్లారి అల్లర్ల వ్యవహారంలో ఎస్పీ పవన్ నిజ్జూర్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తుముకూరులోని ఓ ఫాం హౌస్ లో ఆత్మహత్య యత్నం చేసిన ఎస్పీ పవన్ నిజ్జూర్. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంలో తలెత్తిన వివాదం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో రణరంగానికి దారితీసింది. గంగావతి ఎమ్మెల్యే.. మాజీమంత్రి గాలి జనార్దన్రెడ్డి, బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి వర్గీయుల మధ్య ఈ వివాదం చెలరేగింది. ఇది చినికి చినికి గాలివానగా మారి చివరకు కాల్పులకు దారితీసింది. కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో 144 సెక్షన్ విధించగా.. ఇవాళ జరగాల్సిన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా వేశారు.ఈ ఘటనకు బాధ్యుడ్ని చేస్తూ బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ సస్పెన్షన్ వేటు వేసింది కర్ణాటక ప్రభుత్వం. కాల్పుల్లో ఒకరు మరణించడం.. మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండడం.. వెరసి సకాలంలో కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రభుత్వం ఆయనపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అయితే గురువారమే ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించగా.. ఛార్జ్ తీసుకున్న కొన్ని గంటల్లోనే సస్పెండ్ కావడంపై పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.మరోవైపు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన పరిణామాలపై ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డిపైనా కేసు నమోదు అయ్యింది. భరత్తో పాటు 40 మంది కాంగ్రెస్ కార్యకర్తలపైనా కేసు నమోదు అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో గాలి జనార్దన్తో పాటు 11 మంది బీజేపీ నేతలపైనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం సిద్ధరామయ్య.. సమగ్ర విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో ఎస్పీ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేయడం చర్చనీయాంశమైంది. -
బళ్లారి గన్ ఫైట్ ఎపిసోడ్లో ట్విస్టులు.. ఎస్పీపై వేటు
సాక్షి, బళ్లారి: ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంలో తలెత్తిన వివాదం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో రణరంగానికి దారితీసింది. గంగావతి ఎమ్మెల్యే.. మాజీమంత్రి గాలి జనార్దన్రెడ్డి, బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి వర్గీయుల మధ్య ఈ వివాదం చెలరేగింది. ఇది చినికి చినికి గాలివానగా మారి చివరకు కాల్పులకు దారితీసింది. కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో 144 సెక్షన్ విధించగా.. ఇవాళ జరగాల్సిన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా వేశారు. అయితే.. ఈ ఘటనకు బాధ్యుడ్ని చేస్తూ బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ సస్పెన్షన్ వేటు వేసింది కర్ణాటక ప్రభుత్వం. కాల్పుల్లో ఒకరు మరణించడం.. మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండడం.. వెరసి సకాలంలో కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రభుత్వం ఆయనపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అయితే గురువారమే ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించగా.. ఛార్జ్ తీసుకున్న కొన్ని గంటల్లోనే సస్పెండ్ కావడంపై పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన పరిణామాలపై ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డిపైనా కేసు నమోదు అయ్యింది. భరత్తో పాటు 40 మంది కాంగ్రెస్ కార్యకర్తలపైనా కేసు నమోదు అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో గాలి జనార్దన్తో పాటు 11 మంది బీజేపీ నేతలపైనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం సిద్ధరామయ్య.. సమగ్ర విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖను ఆదేశించారు. వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం.. నారా భరత్రెడ్డి పేరుతో సిటీలో ఫ్లెక్సీలో వేశారు. గురువారం రాత్రి గాలి జనార్దన్రెడ్డి ఇంటి ముందు కూడా బ్యానర్ కట్టాలని భరత్రెడ్డి అనుచరుడు, కాంట్రాక్టరు సతీశ్రెడ్డి మరికొందరు వెళ్లారు. అయితే గాలి అనుచరులు వాళ్లను అడ్డుకున్నారు. ఇదే విషయాన్ని జనార్ధన్రెడ్డి కూడా వారికి చెప్పి గంగావతికి వెళ్లిపోయారు. కానీ, సతీష్రెడ్డి అక్కడే ఉండి బ్యానర్ కట్టాలని తన అనుచరులను ఆదేశించాడు. ఇది తెలిసి మాజీమంత్రి శ్రీరాములు అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. పెద్దఎత్తున జనం చేరడంతో గాలి జనార్దన్రెడ్డి రాత్రికి మళ్లీ బళ్లారికి తిరిగి వచ్చారు. బీజేపీ–కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరడంతో పరిస్థితి వేడెక్కింది. అంతలోనే ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. సతీష్రెడ్డి తన ప్రైవేటు గన్మెన్ వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో జనం చెల్లాచెదురు కావడంతో ఘర్షణ పరిస్థితి తలెత్తింది. ఇరు వర్గాలను అదుపుచేసేందుకు పోలీసులు ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందగా.. సతీష్రెడ్డికి బుల్లెట్ గాయంతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై గాలి జనార్దన్రెడ్డి, నారా భరత్రెడ్డి పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు.పోలీసులు గాలి జనార్దన్రెడ్డి, శ్రీరాములు, గాలి సోమశేఖరరెడ్డికి ఉన్న మొత్తం ఏడుగురు గన్మెన్లను పిలిపించి విచారణ జరిపారు. ఈ కాల్పులు జరిపింది ప్రభుత్వం నియమించిన గన్మెన్లు కాదని తేల్చారు. అక్కడ ప్రైవేటు వ్యక్తి జరిపిన కాల్పులవల్లే రాజశేఖర్రెడ్డి మృతిచెందినట్లు ఇన్చార్జి ఎస్పీ రంజిత్ బండారి వెల్లడించారు. -
హత్య కేసులో ముద్దాయిల అరె్స్ట్కు డిమాండ్
రాయచూరు రూరల్: ధార్వాడ జిల్లా హుబ్లీలో జరిగిన పరువు హత్య కేసులో ముద్దాయిలను అరె్స్ట్ చేయాలని అఖిల భారత జనవాది మహిళా విభాగం జిల్లాధ్యక్షురాలు శాంత డిమాండ్ చేశారు. శుక్రవారం హట్టి పోస్టాఫీస్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆమె మాట్లాడారు. ఎస్సీ వర్గానికి చెందిన వివేకానంద ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న ఆరోపణలపై ఏడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా మాన్య పాటిల్ను తల్లిదండ్రులు హత్య చేయడాన్ని ఖండించారు. ఈ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి, వివేకానంద కుటుంబానికి పోలీస్ భద్రత కల్పించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో రమేష్, దురుగమ్మ, జయమ్మ, లక్ష్మి, సుమంగల, నాగరాజ్, రజియా, వహీదా బేగం, అంబమ్మలున్నారు. -
గూండా ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి
సాక్షి,బళ్లారి: నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి గూండాగిరి చేసి, రాళ్లు రువ్వి తమ నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆయన నగరంలోని గాలి జనార్దనరెడ్డి ఇంటి ముందు బ్యానర్లు వేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున గొడవ, కాల్పులు జరిగి ఒకరు మృతి చెందడంతో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడిన నేపథ్యంలో వారిని శుక్రవారం అరుణోదయ ఆస్పత్రిలో పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సతీష్రెడ్డి అనే వ్యక్తికి చెందిన ప్రైవేటు గన్మెన్లను ఉపయోగించుకుని కాల్పులు జరిపించారన్నారు. నగరంలో అనుమతి లేకుండా బ్యానర్లు వేసుకుని, గుండాగిరి చేశారన్నారు. గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు, గాలి సోమశేఖరరెడ్డి వంటి పార్టీ నాయకులకు బెదిరించాలని నగర ఎమ్మెల్యే భరత్రెడ్డి చూస్తున్నారన్నారు. దీనిని తాము సహించేది లేదన్నారు. మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై గూండాగిరి చేశారన్నారు. 25 ఏళ్ల క్రితమే బళ్లారిలో తమ పార్టీకి చెందిన శ్రీరాములు, గాలి జనార్దనరెడ్డి మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారన్నారు. అధికారం ఉందని నిజాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, మాజీ మంత్రులు శ్రీరాములు, ఆనంద్సింగ్, మాజీ ఎమ్మెల్యేలు గాలి సోమశేఖరరెడ్డి, టీ.హెచ్.సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు. అఽధికార పార్టీ ఎమ్మెల్యే సమాధానం ఇవ్వాలి ఎమ్మెల్యే నేతృత్వంలోనే గుండాగిరి జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర ఆరోపణ -
బడ్జెట్ కసరత్తు లేదేమిటీ?
కారణాలు ఏమిటి శివాజీనగర: పూర్తికాలం నేనే ముఖ్యమంత్రిని, నేనే ఈసారి బడ్జెట్ను కూడా సమర్పిస్తా అని సీఎం సిద్దరామయ్య చెబుతున్నారు. కానీ ఆయన ఇప్పటివరకు బడ్జెట్ సన్నాహాక సమావేశాలను ఆరంభించకుండా తటస్థంగా ఉండటంపై పలు అనుమానాలు పుట్టుకొచ్చాయి. ఆర్థికశాఖను కూడా చూస్తున్న సిద్దరామయ్య ప్రతి సంవత్సరం డిసెంబర్ నాటికే బడ్జెట్ తయారీ గురించి ఐఏఎస్లతో సమావేశాలకు శ్రీకారం చుట్టేవారు. అయితే ఈసారి ఆ సమావేశాల జోలికి వెళ్లకపోవడం ఆశ్చర్యకారకమైంది. ఇటీవల హోం మంత్రి జీ.పరమేశ్వర్ మాట్లాడుతూ బడ్జెట్ సమీపిస్తోంది. పార్టీలో గొడవలపై కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా ఒకరు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది, అయితే అది ఎవరనేది స్నష్టంగా తెలియజేయాలని చెప్పడం గమనార్హం. డిప్యూటీ సీఎం సమీక్షలు? డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్, ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుబడుతున్నారు. ఆయన బడ్జెట్ రూపకల్పన గురించి ఆర్థిక శాఖ అధికారులతో అనధికారికంగా చర్చించారని ప్రచారంలో ఉంది. ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చి మొదట్లో రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రకటితమవుతుంది. ప్రతిశాఖ అవసరాలు, గతంలో కేటాయించిన నిధుల వాడకం, కొత్త అంశాల గురించి బడ్జెట్ తయారీ సమావేశాల్లో చర్చించడం ఆనవాయితీ. ఇది ఆర్థికమంత్రి, సీఎం కలిసి చేస్తారు. సీఎం వద్దే ఆర్థికశాఖ ఉండడంతో సిద్దరామయ్యే ఆ పనిచేస్తారు. ఈసారి అలాంటి సమావేశాల జాడ లేదు. ఇటీవల కేరళకు వెళ్లి వచ్చిన సిద్దరామయ్య అక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్తో చర్చలు జరిపారు. నిర్లిప్తంగా సీఎం సిద్దరామయ్య సీఎం కుర్చీ వివాదమే కారణమా?రెండు అల్పాహార భేటీల తరువాత డీకే శివ వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉన్నారు. హైకమాండ్ ఆదేశాలను పాటిస్తానని సీఎం సిద్దరామయ్య చెబుతున్నారు. హైకమాండ్ నుంచి సిగ్నల్స్ రావడంతో బడ్జెట్ కసరత్తు అవసరం లేదని సిద్దరామయ్య భావిస్తున్నారా? అనే వాదనలు ఊపందుకున్నాయి. ఏదేమైనా వారంరోజుల్లో ఏదో ఒకటి తేలిపోనుంది. ఇప్పటికే 16 బడ్జెట్లను ప్రవేశపెట్టి 17వ బడ్జెట్ ద్వారా కొత్త రికార్డు సృష్టించేందుకు సిద్దరామయ్య సిద్ధమయ్యారు. ఈ దశలో ముఖ్యమంత్రి సీటు తగాదాలు అయోమయ స్థితిని కల్పించాయా? అనే సందేహాలున్నాయి. అనేకమంది కాంగ్రెస్ నాయకుల మదిలోనూ ఇదే ప్రశ్న మెదులుతోంది. -
‘గాలి’ ఇంటి వద్ద బ్యానర్ వేయలేదు
సాక్షి,బళ్లారి: గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారని, ఆయన ఇంటి వద్ద తమ కార్యకర్తలు బ్యానర్ వేయలేదని, రోడ్డుపైన వేస్తే తప్పేమిటని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండున్నరేళ్లలో నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. వాల్మీకి పేరు చెప్పుకుని రాజకీయాల్లో ముందుకు వచ్చిన వీరు వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే అడ్డుకునే కుట్ర చేశారన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా త్వరలో ఘనంగా వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తామన్నారు. రోడ్డుపై మాత్రమే వేశారు ద్వేష రాజకీయాలకు యువకుడు బలి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ధ్వజంమృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం కాల్పుల్లో మృతి చెందిన రాజశేఖరరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం నుంచి, తన వ్యక్తిగతంగా కూడా సాయం చేస్తామన్నారు. మహర్షి వాల్మీకిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నానికి, వారు వేయి రెట్లు తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. తుచ్ఛమైన, నీచమైన రాజకీయాలు చేస్తుండటంతో తన రక్తం ఉడికిపోతోందన్నారు. తాను యువకుడినైనా శాంతియుతంగా ఉన్నానని, లేకపోతే వారేం తనకు లెక్కకాదన్నారు. తమ వద్ద కూడా అన్ని విధాలుగా శక్తి ఉందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతిభ భద్రతలకు విఘాతం కల్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. బుల్లెట్ తగిలి తగిన తమ పార్టీకి చెందిన యువకుడు మృతి చెందడంతో చాలా బాధ కలుగుతోందన్నారు. ఈ కుట్రలు చేసిన వారి కథ చూస్తానని హెచ్చరించారు. -
గురు దక్షిణామూర్తయే నమః
కోలారు: నగరంలో అమాని చెరువు గట్టుపై వెలసిన శ్రీ గురు దక్షిణామూర్తి దేవాలయంలో స్వామి వారికి నూతన సంవత్సరం మొదటి శుక్రవారం సందర్భంగా విశేష పూజలను నిర్వహించారు. శెనక్కాయలు, జొన్న కంకులు, అనపకాయలతో స్వామివారిని అలంకరించారు. అర్చకులు సోమశేఖర దీక్షిత్ నేతృత్వంలో పూజలు జరిగాయి. పెద్దసంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. అధికారులకు కుల పక్షపాతం వద్దు: సీఎం శివాజీనగర: ప్రభుత్వ అధికారులంతా కుల రహితంగా పనిచేయాలని, అలా జరిగినప్పుడే సమ సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని సీఎం సిద్దరామయ్య తెలిపారు. శుక్రవారం విధానసౌధ సభా మందిరంలో కేఏఎస్ అధికారుల సంఘం క్యాలెండర్, డైరీని విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో పేదలు, దళితులు, మైనారిటీల శ్రేయోభివృద్ధికి నూతన ఉత్సాహంతో శ్రమించాలని అధికారులకు సూచించారు. అసమానత తొలగకుండా, సమాజంలో శాంతి నెలకొనడం అసాధ్యమన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు గడిచినా కూడా ఇప్పటికీ కుల పద్ధతి పోలేదని అన్నారు. మీకు కుల పక్షపాతం ఉండకూడదన్నారు. తహశీల్దార్, అసిస్టెంట్ కమిషనర్తో పాటుగా వివిధ స్థాయిల్లోని అధికారులు విధులకు న్యాయం చేకూర్చేందుకు నిజాయితీగా ప్రయత్నించాలని సీఎం తెలిపారు. కేఏఎస్ అధికారుల భవన నిర్మాణానికి నిధులతో పాటు డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చారు. స్లీపర్ బస్సుకు ప్రమాదం, నలుగురికి గాయాలు దొడ్డబళ్లాపురం: దేవనహళ్లి వద్ద గురువారం రాత్రి బెంగళూరు– హైదరాబాద్ 44వ హైవేలో టోల్ ప్లాజాను ప్రైవేటు స్లీపర్ కోచ్ బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వస్తున్న ట్రాన్స్ ఇండియా స్లీపర్ కోచ్ బస్సు అతి వేగం కారణంగా అదుపుతప్పి టోల్ప్లాజా బూత్ను ఢీకొంది. బూత్తో పాటు బస్సు ముందు భాగం ధ్వంసమైంది. అయితే ఈ టోల్ప్లాజా పనిచేయడం లేదు, అందువల్ల అక్కడ సిబ్బంది ఎవరూ లేనందున ప్రాణనష్టం తప్పింది. అయితే బస్సు డ్రైవర్,క్లీనర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఫోన్లు, లగేజీలు చోరీ ప్రమాదంతో ప్రయాణికులు తీవ్రంగా గాభరా పడ్డారు. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు సాయం చేయడానికని వచ్చి ముగ్గురు ప్రయాణికుల వద్ద ఉన్న మూడు ఐఫోన్లను ఎత్తుకొని వెళ్లారు. లగేజీలు, ఇతర వస్తు సామగ్రిని దోచుకున్నారు. పోలీసులు,ఫైర్ సిబ్బంది చేరుకుని బాధితులను కాపాడి సమీప ఆస్పత్రులకు తరలించారు. దేవనహళ్లి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డిజిటల్ అరెస్ట్.. రూ.1.61 కోట్ల వసూలు ● కార్వార వద్ద రిటైర్డు ఉపాధ్యాయునికి మోసం యశవంతపుర: ముంబై పోలీసుల పేరిట వీడియో కాల్ చేసి సైబర్ వంచకులు కార్వార జిల్లా ముండగోడిలోని టిబెటన్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయున్ని డిజిటల్ అరెస్ట్ చేసి రూ.1.61 కోట్లను వసూలు చేశారు. ఎలా జరిగింది బాధితుడు పాల్డెన్ (72)కు వాట్సాప్ కాల్ చేసిన మోసగాడు.. తాను ముంబైలోని కొలాబా పోలీసుస్టేషన్ ఎస్ఐనని చెప్పుకున్నాడు. ముంబైలో అరెస్ట్ చేసిన ఉగ్రవాది వద్ద దొరికిన ఏటిఎం కార్డుల్లో మీ పేరు వచ్చినట్లు నమ్మించి బెదిరించాడు. మీ అకౌంట్ నుంచి కోట్ల రూపాయలు బదిలీ కావటంతో మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైనట్లు చెప్పాడు. ఇదంతా నిజమేనని నమ్మిన పాల్డెన్ భయపడ్డాడు. మీ వద్దనున్న డబ్బునంతా ప్రభుత్వ ఖాతాలోకి బదిలీ చేయాలని మోసగాడు ఒత్తిడి చేశాడు. ఇది నమ్మిన పాల్డెన్ వివిధ బ్యాంక్ ఖాతాలలో ఉన్న ఎఫ్డి డబ్బులు, బంధువుల వద్ద నుంచి అప్పులు తెచ్చి సుమారు రూ.1.61 కోట్లను పలు విడతలుగా వంచకుల ఖాతాలకు పంపించాడు. చివరకు మోసం జరిగిందని తెలుసుకున్న పాల్డెన్ కార్వార సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నేటి నుంచి అంబామఠం జాతర
రాయచూరు రూరల్: జనవరి 3 నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాలోని సింధనూరు తాలూకా అంబామఠంలో అంబాదేవి జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. సింధనూరులో రూ.400 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన అంబాదేవి జాతర మహోత్సవాలను సాయంత్రం 5 గంటలకు ముఖ్య అతిథులు ప్రారంభిస్తారు. జానపద జాతర, నృత్యం, హాస్య సంజె, దేవి పల్లకీ సేవలు, నాటకాలు, కుంభోత్సవాలు జరుగుతాయి. సింధనూరు తాలూకాలో సిద్ద పర్వతంగా పేరొందిన అంబా మఠం చరిత్ర మరువరానిది. అవధూతకు బాల్యంలోనే దేవి దర్శనం 1857లో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని తాలూకా పెద్ద హరివాణంలో జన్మించిన చిదానంద అవధూత బాల్యంలోనే దేవి దర్శనం పొందారు. పేదరికంలో మగ్గుతున్న చిదానందకు ఊరి బయట ఇంటిలో దెయ్యం ఉందని గ్రామ పెద్ద గౌడ చెప్పడంతో అదే నివాసంలో చిదానంద కుటుంబ సభ్యులు నివాసం ఉన్నారు. ఇంటి దేవుడు వీర నారాయణకు పూజలు చేసే ముందు నైవేద్యం తీసుకెళ్లి పూజలు చేసే వరకు భోజనం చేయరాదని తండ్రి చిదానందను ఆజ్ఞాపిస్తూ స్తంభానికి కట్టేసి ఆలయానికి వెళ్లిపోతారు. దేవి ప్రత్యక్షమై కట్టలను విప్పి చిదానందతో భోజనం చేయిస్తుంది. తల్లిదండ్రులు చిదానందకు చీవాట్లు పెడతారు. దేవి చేసిన మేలుకు తోడు నివాసంలో దెయ్యం కాదు, తానే వెలశానని చెప్పి మాయమైంది. ఉత్సవాల్లో సింధనూరు శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి, తహసీల్దార్ అరుణ్ దేశాయి, టీపీ ఈఓ చంద్రశేఖర్, ఖాజీ, మాలిక్లు పాల్గొంటారు. -
మద్యం, బీర్ల నూతన రికార్డు
శివాజీనగర: ఊరికే వేడుకలు చేసుకుంటే ఏం బాగుంటుంది, కొంచెం చుక్క పడితే మరింత హుషారొస్తుంది అని జనం అనుకోవడంతో.. కొత్త సంవత్సరం సంబరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కళకళలాడింది. మద్యం విక్రయాలు నింగినంటడంతో గత తొమ్మిది రోజుల్లో సుమారు రూ.1,319 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే 10 శాతం అధికమని తెలిసింది. బెంగళూరుతో సహా రాష్ట్రంలో అన్నిచోట్ల బీర్, మద్యం వినియోగం భారీగా సాగింది. మామూలు రోజుల్లో ప్రభుత్వానికి రూ. 65 – 70 కోట్ల రాబడి వస్తుంది. అయితే డిసెంబరు 30న ఒక్కరోజే రూ.261 కోట్ల ఆదాయం వచ్చింది. విక్రయాలు ఇలా.. డిసెంబరులో 63.71 లక్షల బాక్సుల మద్యం, 36.14 లక్షల బాక్సుల బీర్లను తాగేశారు. అయితే మద్యం కంటే బీర్ల వాడకం ఎక్కువగా ఉంది. బెంగళూరులో కూడా : బెంగళూరు నగర జిల్లాలో మద్యం, బీర్లను ఎగబడి ఖాళీ చేశారు. చివరి మూడు రోజుల్లో రూ.247 కోట్ల మద్యం అమ్మకమైంది. ఇందులో శాఖకు రూ.181 కోట్ల ఆదాయం చేరింది. 2.48 లక్షల బాక్సుల ఐఎంఎల్, 2.20 లక్షల బాక్సుల బీర్లు అమ్ముడయ్యాయి. న్యూ ఇయర్ వేడుకల్లో భారీగా వినియోగం సర్కారుకు రూ.1,319 కోట్ల ఆదాయం -
వార్డులో సమస్యలు తీర్చండి
రాయచూరు రూరల్: నగరంలోని 26వ వార్డులో పేరుకున్న సమస్యలను పరిష్కరించాలని ఏఐఎంఎం డిమాండ్ చేసింది. నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఫారూక్ షేక్ మాట్లాడారు. సామాన్యులు సంచరించే ప్రదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిన మురుగు కాలువల నుంచి దుర్వాసన వెదజల్లుతోందన్నారు. పేరుకున్న పూడికను తొలగించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో ఖాజావలి, హాజీ అఫ్తాబ్ హుసేన్, తన్వీర్, అల్తాఫ్, రహీం, అజీజ్, రఫీ, జలాల్లున్నారు. నేడు విగ్రహ ప్రతిష్టాపన బళ్లారిటౌన్: నగరంలోని వాల్మీకి సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం 5 గంటల నుంచి తమ సముదాయం ఆధ్వర్యంలో వైభవంగా జరుపుకుంటామని ఆ సముదాయం నేత బీ.రాంప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్రతో పాటు రాష్ట్రంలోని పలు తమ సముదాయాల నేతలు కూడా పాల్గొంటారన్నారు. వాయిదా?? కాగా గొడవల నేపథ్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కాంగ్రెస్ కార్యాలయం నుంచి సమాచారం అందింది. స్పిన్నింగ్ మిల్లు భూమి విక్రయించొద్దు రాయచూరు రూరల్: తాలూకాలోని యరమరస్ వద్ద ఉన్న ప్రభుత్వ స్పిన్నింగ్ మిల్లు భూమిని ప్రైవేట్ వారికి విక్రయించడం తగదని సామాజిక ఆందోళనకారుడు శివకుమార్ ఆరోపించారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పిన్నింగ్ మిల్లుకు చెందిన 40.25 ఎకారాల భూమిని ప్రైవేట్ భాగస్వామ్యానికి విక్రయించే ముందు కార్మికులకు దక్కాల్సిన బకాయి వేతనాలు, ఇతర బిల్లులు చెల్లించాలన్నారు. 550 మంది పని చేసిన స్పిన్నింగ్ మిల్లులో కార్మికులకు పునర్వసతి కల్పించాలన్నారు. మూతపడిన యరమరస్ స్పిన్నింగ్ మిల్లును తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ‘నీ వల్లే తుపాకీ సంస్కృతి’ ● మాజీ బుడా అధ్యక్షుడు ప్రతాప్రెడ్డి బళ్లారిటౌన్: నగరంలో గన్మెన్ల సంస్కృతి 2008లో బీజేపీ ప్రభుత్వ హయాంలో జనార్దనరెడ్డి నుంచే ప్రారంభమైందని మాజీ బుడా అధ్యక్షుడు ఎన్.ప్రతాప్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. బళ్లారి నగర ఎమ్మెల్యే భరత్రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి, గాలి జనార్దనరెడ్డి సహించలేక పోతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నారా కుటుంబాల గురించి జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ నాయకులు, మేయర్ గాదెప్ప, ముండ్రిగి నాగరాజు, కుబేర, జగన్, సమీర్, సిద్దేశ్, ఎల్.మారెన్న, సూరి, మానయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్త పైపులైన్లు ఏర్పాటు చేయరూ రాయచూరు రూరల్: నగరంలోని లాల్ బహుద్దూర్ శాస్త్రి నగరలో కొత్త తాగునీటి పైపులైన్లను ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఎండీ గౌస్ మాట్లాడారు. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి పైపులైన్ల అమర్చాలన్నారు. ఈ విషయంలో అధికారులు మౌనం వహించడం తగదన్నారు. అల్లమ ప్రభు కాలనీ నుంచి పాత ఆస్పత్రి వరకు ఉన్న పాత పైపులైన్లను తొలగించి కొత్త పైపులైన్లను ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. అయ్యప్ప స్వామి ఊరేగింపు కెలమంగలం: తాలూకా కేంద్రం డెంకణీకోటలో ధర్మస్థల అయ్యప్ప భక్తమండలి ఆధ్వర్యంలో మండల పూజ ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అయ్యప్ప స్వామి ఆలయంలో మూలవిరాట్కు అభిషేకం చేసి, అలంకరించారు. అనంతరం అయ్యప్ప స్వామిని రథంపై కొలువుదీర్చి పట్టణ వీధుల్లో ఊరేగించారు. కొంత మంది భక్తులు పంపా వాయుద్యాలతో నృత్యం చేశారు. అయ్యప్ప మాలధారుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి 12 గంటల్లో చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన ఘటన శుక్రవారం జరిగింది. హరపనహళ్లి పట్టణంలోని బనగేరిలో నివాసముంటున్న ఉపాధ్యాయిని షహనాజ్ బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. గురువారం ఉదయం డ్యూటీపై పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయిని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లో ఉంచిన సుమారు రూ.18.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎవరో దొంగిలించారని కనుగొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే హరపనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుల ఆచూకీ కోసం హరపనహళ్లి సీఐ మహంతేష్ సజ్జన్, ఎస్ఐ శంభులింగ హిరేమట్, రవి, సిబ్బంది ఆధ్వర్యంలోని బృందం నిందితులను అరెస్టు చేసి వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలు, రూ.3 లక్షల నగదు, రూ.1 లక్ష విలువైన ఆటోతో సహా మొత్తం రూ.22.60 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రూ.22.60 లక్షల విలువైన ఆభరణాలు, నగదు, ఆటో స్వాధీనం -
అగ్నిమాపక వాహనం ప్రారంభం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలోని పర్యాటక శాఖ కార్యాలయ ఆవరణలో శుక్రవారం కొత్త అగ్నిమాపక యంత్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.టీ.శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాలూకా అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించినప్పుడు అక్కడి అధికారులు తమ అగ్నిమాపక కేంద్రానికి కొత్త వాహనం అవసరమని, దానిని అందించాలని కోరడంతో ఆ మేరకు అగ్నిమాపక యంత్రాన్ని అందించామన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు ఈ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కానాహొసహళ్లి ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో కొత్త ప్రాంతీయ అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అత్యున్నత స్థాయిలో ఇప్పటికే ఆమోదం లభించిందన్నారు. ప్రాంతీయ అగ్నిమాపక అధికారి కే.తిమ్మారెడ్డి, బళ్లారి జిల్లా అగ్నిమాపక అధికారి వలి ఎస్.ప్రమోద్, తహసీల్దార్ కే.నేత్రావతి, అగ్నిమాపక కేంద్రం ఇన్చార్జి అధికారి సీపీ కెంగప్ప, డీఎస్పీ మల్లేష్ దొడ్డమని తదితరులు పాల్గొన్నారు. -
మార్చురీ వద్ద పోలీసుల మోహరింపు
బళ్లారి రూరల్ : నగరంలో గంగావతి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గాలి జనార్థనరెడ్డి నివాసం ముందు గురువారం రాత్రి జరిగిన ఘర్షణలో మృతి చెందిన కాంగ్రెస్ కార్యర్త రాజశేఖర్రెడ్డి మృతదేహాన్ని బీఎంసీఆర్సీ మార్చురీకి తరలించారు. గురువారం అర్థరాత్రి నుంచే మార్చురీ వద్ద పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. అటు వైపు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. శుక్రవారం ఉదయం దావణగెరె ఐజీ రవికాంతేగౌడ, జిల్లా ఎస్పీ పవన్, అధికారులు రాజశేఖర్రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్రెడ్డి, చానాల్ శేఖర్, కాంగ్రెస్ ప్రముఖుడు రవి తదితరులు మృతదేహాన్ని పరిశీలించి మృతుడి బంధువులను పరామర్శించారు. బందోబస్తు మధ్య అంత్యక్రియలు సాక్షి,బళ్లారి: మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణకు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేస్తున్న బ్యానర్ల గొడవల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్రెడ్డి ప్రైవేటు వ్యక్తి గన్మెన్ ద్వారా జరిపిన కాల్పుల్లో మరణించడంతో ఆయన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బళ్లారి మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ సెంటర్(బీఎంసీఆర్సీ) ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం నుంచి ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున జనం చేరారు. పోలీసు ఉన్నతాధికారులు వర్తిక కటియార్, రంజిత్ కుమార్, పవన్ నెజ్జూర్ తదితరులతో పాటు కాంగ్రెస్ నేతలు, బీఎంసీఆర్సీ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీసు బందోబస్తు మధ్య మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, గణేష్లతోపాటు మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్రెడ్డి కూడా పాడె మోశారు. కార్యకర్త రాజశేఖర్రెడ్డి మృతదేహానికి పోస్ట్మార్టం మృతదేహాన్ని పరిశీలించిన ఐజీ రవికాంతేగౌడ, ఎస్పీ పవన్ నెజ్జూరు -
ఆలయాల్లో జంతు బలిని అరికట్టండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో జంతు బలిని నియంత్రించాలని, కేంద్ర ప్రభుత్వం గోమాంసం విక్రయంపై నిషేధానికి చర్యలు చేపట్టాలని విశ్వవాణి కల్యాణ మండలి, బసవ ధర్మ జ్ఞాన పీఠం సంచాలకుడు దయానంద స్వామీజీ పేర్కొన్నారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రెంటూ ఒకే బాటను అనుసరిస్తున్నాయని విమర్శించారు. పశు వధ చట్టాలను రుద్దడం తగదన్నారు. కార్పొరెట్ రంగాలకు మద్దతు పలికే సర్కార్లకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనంలో 36 వేల ఆలయాలున్నాయన్నారు. వాటిలో పశువులు, గొర్రెలు, మేకలు తదితర జంతువులను బలివ్వడం సరికాదన్నారు. సింధనూరు తాలూకా సోమలాపుర వద్ద అంబా మఠంలో వారం రోజుల పాటు జరగనున్న జాతరలో 10 వేలకుపైగా జంతువులు, పశువుల బలిని అరికట్టేలా, హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించకుండా జిల్లాధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. -
మా పార్టీకి చెడ్డ పేరు తేవాలనే కుట్ర
బళ్లారిటౌన్: నగరంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే భరత్రెడ్డికి చెడ్డ పేరు తేవాలనే బీజేపీ నేత గాలి జనార్ధన్రెడ్డి కుట్ర పన్నారని బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర ఆరోపించారు. శుక్రవారం స్థానిక ఓ హోటల్లో సిటీ ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే గణేష్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సంఘటనలో తమ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను కోల్పోయామన్నారు. ప్రాణ త్యాగం చేసిన కార్యకర్తల విలువ కట్టలేమన్నారు. జనార్ధన్రెడ్డి తన వయస్సుకు తగట్టుగా నడుచుకోవాలన్నారు. ఇటీవల రాజకీయాల్లో గుర్తింపు పొందుతున్న నారా భరత్రెడ్డిపై లేని పోని ఆరోపణలు చేయడం, ఆయన తండ్రి సూర్యనారాయణరెడ్డిపై కూడా ఆరోపణలు చేయడం సరి కాదన్నారు. ముండ్రగి నాగరాజు, మానయ్య తదితర నేతలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయండి రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువత ముందుండాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించారు. శుక్రవారం బెంగళూరులో ఖర్గే రాయచూరు జిల్లా వెనుక బడిన వర్గాల విభాగం ఉపాధ్యక్షుడు మారెప్పను సన్మానించి మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. -
ఆ సర్వేతో మా ప్రభుత్వానికి సంబంధమే లేదు
మెజారిటీ ప్రజలు ఈవీఎంలకు వ్యతిరేకంగా లేరని.. పక్కాగా పని చేస్తాయని నమ్ముతున్నారని కర్ణాటక నుంచి ఒక సర్వే విడుదలైంది. అయితే.. ఈ ఫలితం ఆధారంగానే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విరుచుకుపడుతోంది. ఇంతకాలం కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదనే విషయం ప్రజాభిప్రాయంతోనే బయటపడిందని ఎద్దేవా చేస్తోంది. ఈ తరుణంలో ఆ సర్వేకు తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక కాంగ్రెస్ ట్విస్ట్ ఇచ్చింది.2024 లోక్సభ ఎన్నికలపై నిర్వహించిన ఈ సర్వేలో.. 83.61 శాతం మంది ఈవీఎంలు విశ్వసించదగినవేనని వెల్లడించారు. కచ్చితమైన ఫలితాలను ఇస్తాయని 69.39 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ అథారిటీ దీనిని నిర్వహించింది. అయితే.. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అనుమతితో తాము సర్వే నిర్వహించినట్లు సదరు సంస్థ ప్రకటించుకుంది. అయితే..ఈ సర్వేతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ఐటీ మంత్రి ప్రిియాంక్ ఖర్గే తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదని, నిర్వహించాలని ఆదేశించమూ లేదని పేర్కొన్నారు. పైగా సర్వేపై ఆయన అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ‘‘మొదటగా చెప్పేది ఏంటంటే.. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది కాదు. రెండోది.. ఈ సర్వేను కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ఎన్జీవో సమన్వయంతో నిర్వహించింది. అయితే..ఆ ఎన్జీవోను నడిపే వ్యక్తి.. ప్రధాని కార్యాలయానికి దగ్గరగా పనిచేసే వ్యక్తి. ప్రధాని కోసం అతగాడు ఓ పుస్తకం కూడా రాశాడు. వీటికి తోడు.. సుమారు 110కి పైగా నియోజకవర్గాల్లో కేవలం 5,000 మందిని మాత్రమే సర్వే చేసినట్లు చెబుతున్నారు. అలాంటప్పుడు ఈ డేటాను ఎంత నమ్మొచ్చు?.. ఇంతకు మించి ఏం ఆశించొచ్చు’’ అని ప్రశ్నించారాయన. ఈ సర్వేను విశ్వసనీయంగా భావించడం లేదని.. దీని వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఉందని అన్నారాయన.ఈ ఫలితం ఆధారంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న బీజేపీ.. కలబుర్గి, అలంద్ ప్రాంతాల్లో జరిగిన ఓటు చోరీపై మాత్రం ఇప్పటిదాకా సమాధానం ఇవ్వలేదని ప్రియాంక్ ఖర్గే మండిపడ్డారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికల ముందు ఈసీ, బీజేపీలు కలిసి కలిసి పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపులు చేశారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఓట్చోరీ రాజకీయం ప్రదానంగా కర్ణాటక నుంచే నడుస్తోంది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ఎన్నికల సంఘంతో కలిసిపోయి ఎన్నికల్లో ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకుంటోందని విమర్శిస్తున్నాయి. అలాగే ఎన్నికల ముందు నిర్వహిస్తున్న సర్వేపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈసీ పారదర్శకతను శంకించాల్సిన పని లేదని బీజేపీ.. కాంగ్రెస్ చేస్తున్నవి ఉత్త ఆరోపణలేనని ఈసీ ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇస్తూ వస్తున్నాయి.ఒక్క ఓటు తొలగిస్తే రూ.80!కర్ణాటకలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై అక్కడి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో.. ఓ డేటా ఎంట్రీ టీమ్కు లక్షల్లో రూపాయలు చెల్లించి ఓటర్లను తొలగించే పని అప్పగించారని అనుమానాలు నెలకొన్నాయి. ఆరుగురు వ్యక్తుల ముఠా ఈ స్కామ్ నడిపించిందని.. ఒక్క ఓటర్ను తొలగించడానికి రూ.80 ఛార్జ్ చేశారని.. అలా 2023 రాష్ట్ర ఎన్నికల ముందు సుమారు 7,000 ఓటర్లను తొలగించమని అభ్యర్థనలు వచ్చాయని అక్టోబర్ నాటి దర్యాప్తులోనే వెల్లడైంది.తాజా ‘సర్వే లొల్లి’ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. మేము ఎప్పటినుంచో చెబుతున్నదే నిజమని తేలింది. 2023 ఎన్నికల ముందు అలంద్ నియోజకవర్గంలో 6,000కి పైగా నిజమైన ఓటర్లను డబ్బు చెల్లించి తొలగించారు అంటూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. -
రాష్ట్రంలో కన్నడిగులపైనే దాడులు
మండ్య: కన్నడ ఉద్యమ నేత వాటాల్ పార్టీ వాటాల్ నాగరాజ్ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. కన్నడ సంఘాల నేతలు, కార్మికులు నగరంలోని జె.సి. సర్కిల్కు చేరుకుని రాష్ట్ర ప్రభుత్వ కన్నడ వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. వాటాల్ మాట్లాడుతూ, కన్నడ భూమిలో కన్నడిగులపై దారుణాలు పెరిగాయని అన్నారు. ప్రతి జిల్లాలో, మాతృభాష కానివారు, బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు చేరుకున్నారు. వారు కన్నడిగులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో హిందీని అనుమతించకూడదు, కేంద్ర ప్రభుత్వానిది సవతి తల్లి వైఖరి అని ఆరోపించారు. కన్నడిగుల ఉద్యోగాల కోసం మేము నిరంతరం పోరాడుతున్నాము. కేరళలో, కన్నడిగులను బానిసల్లా చూస్తున్నారు. రాష్ట్రంలో కేరళీయులు ఇబ్బందుల్లో ఉంటే, వారు తీవ్రంగా మాట్లాడతారని దుయ్యబటటారు. ఇది సరైనది కాదు. భవిష్యత్తులో మలయాళీలు కన్నడిగులపై దౌర్జన్యాలు చేస్తే, మలయాళీలు కర్ణాటకను విడిచి వెళ్లాలని ఆందోళనలు చేస్తామని చెప్పారు. సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డి.కె. శివకుమార్ గతంలో మేకెదాటు ప్రాజెక్టు కోసం పోరాడారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు ఏమీ చేయడం లేదని అన్నారు. ముస్లింలను బీజేపీ వ్యతిరేకించడం సరైనది కాదన్నారు. కళసా బండూరి ప్రాజెక్టు కోసం జనవరి 18న హుబ్లీలో కిత్తూరు రాణి చెన్నమ్మ విగ్రహం ముందు పోరాటం చేస్తామని తెలిపారు. కన్నడిగుల కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధమని అన్నారు. సీఎం, డీసీఎం వైఖరి సరికాదు వాటాల్ నాగరాజు ధ్వజం -
నేనే బడ్జెట్ సమర్పిస్తా: సీఎం
బనశంకరి: ఈ ఏడాది కూడా నేనే బడ్జెట్ను ప్రవేశపెడతానని, ఈ నెల నుంచి సన్నాహాలు చేపడతామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. విధానసౌధలో ఉన్నతాధికారులు సీఎంను కలిసి నూతన ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం సిద్దు విలేకరులతో మాట్లాడుతూ కన్నడ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈదఫా కూడా మీరే బడ్జెట్ను సమర్పిస్తారా? అని విలేకరులు ఆయనను ప్రశ్నించారు. ఇందుకు సమాధానమిస్తూ ఈ నెల నుంచి బడ్జెట్ తయారీకి కసరత్తు చేపడతానన్నారు. దీనిని బట్టి సీఎం మార్పు ఇప్పట్లో ఉండదని పరోక్షంగా ప్రకటించారు. మామూలుగా ఫిబ్రవరి చివరి వారం, లేదా మార్చి మొదట్లో బడ్జెట్ను సమర్పిస్తారు. అత్యధికసార్లు బడ్జెట్ను ప్రకటించిన ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యకు ఇదివరకే పేరు ఉంది. -
ప్రైవేటు ఉద్యోగాలలో కన్నడిగులకు వాటా
శివాజీనగర: రాష్ట్రంలో ప్రైవేట్ కర్మాగారాలు, కంపెనీలలో కన్నడిగులకే ఉద్యోగ ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని జారీచేసేందుకు సిద్ధమైంది. గతంలో ఇలాంటి బిల్లును సిద్ధం చేసినా కూడా ముందుకు కదలలేదు. ఇప్పుడు మళ్లీ దుమ్ము దులిపి చట్టం చేయాలని సిద్దరామయ్య సర్కారు నిశ్చయించినట్లు తెలిసింది. శుక్రవారం జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ప్రైవేటు రంగంలో కన్నడిగులకు ఉద్యోగ రిజర్వేషన్ బిల్లుపై చర్చించి ఆమోదించే అవకాశముంది. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లును ప్రవేశపెట్టవచ్చు. కన్నడిగులకు ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వని సంస్థలు, పరిశ్రమల మీద చర్యలు తీసుకునే అధికారం సర్కారుకు ఉంటుంది. ఎవరు అర్హులంటే.. ఈ బిల్లు ప్రకారం కర్ణాటకలో జన్మించినవారు గానీ, కర్ణాటకలో 15 ఏళ్లు నివాసమున్నవారు, కన్నడ చదివేందుకు, రాసేందుకు మాట్లాడేందుకు వచ్చేవారిని కన్నడిగులుగా పరిగణిస్తారు. ఒకవేళ కర్ణాటకలో 15 ఏళ్లు జీవించినా, కన్నడ చదవడం, రాయడం రాకపోతే నోడల్ ఏజెన్సీ నిర్వహించే కన్నడ పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి. ఈ బిల్లు అమలైతే రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ప్రైవేట్ ఉద్యోగాలను కొట్టేస్తున్నవారికి చెక్ పడుతుందని, మాకు ఉద్యోగాలు లేవు అనే కన్నడిగుల ఫిర్యాదులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాలు ఇతర ప్రాంతాల వారి పరమవుతున్నాయని కొన్ని సంవత్సరాలుగా కన్నడ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది నుంచి వస్తున్న వలస కార్మికులు చిరుద్యోగాలను కైవసం చేసుకుంటున్నారని అసంతృప్తి ఉంది. బిల్లు తీసుకువస్తున్న సర్కారు నేటి కేబినెట్ భేటీలో చర్చ -
రౌడీషీటర్ల అరెస్ట్
రాయచూరు రూరల్: విజయపురలో ఇద్దరు రౌడీషీటర్లను అరెస్ట్ చేసి కలబుర్గి జైలుకు పంపడం జరిగిందని ఎస్పీ లక్ష్మణ నింబరిగి వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుండా చట్టం కింద ఫరహన్అహ్మద్, సిద్దప్ప మూడలిగిని అరెస్ట్ చేశామన్నారు. ఫరహన్ అహ్మద్పై 9 కేసులు, సిద్దప్ప మూడలిగిపై 12 కేసులు ఉండటంతో గుండా చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించామన్నారు. నియామకం రాయచూరు రూరల్: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యదర్శిగా రాయచూరు జిల్లాకు చెందిన శ్రీదేవిని నియమిస్తూ ఆ పార్టీ కార్యదర్శి వేణు గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. దేవదుర్గ తాలూకా 2023 విధాన సభ ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీదేవి ఓడిపోయారు. పార్టీ సభ్యత్వ నమోదులో ముందు ఉండటంతో ఆమెను కార్యదర్శిగా నియించారు. కాగా.. శ్రీదేవి మాజీ ఎంపీ వెంకటేష్ నాయక్ కోడలు కావడం విశేషం. బోరు బావులు తవ్వించేందుకు చర్యలు రాయచూరు రూరల్: రాష్ట్రంలో 6,622 మంది ఎస్సీ, ఎస్టీ రైతుల పొలాల్లో బోరు బావులు తవ్వించేందుకు చర్యలు చేపట్టినట్లు చిన్ననీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం బెంగళూరు విధాన సౌధలో అధికారులతో చర్చించారు. 2025–26లో వారికి సౌలభ్యాలను ఒనగూర్చాలన్నారు. పట్టణాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని పైప్లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు మహర్దశ కల్పించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. రూ.365 కోట్లతో 3,388 ఎస్సీ కుటుంబాలు, 1,983 ఎస్టీ కుటుంబాలకు ఆర్థికసాయం చేయాలన్నారు. చెక్ డ్యాం నిర్మాణాలు, సాముహిక ఎత్తిపోతల పథకాలపై చర్చించాలని సూచించారు. కాషాయమయమైన బళ్లారి ● రేపు మహార్షి వాల్మీకి విగ్రహావిష్కరణ సాక్షి బళ్లారి: నగరంలోని ఎస్పీ సర్కిల్ వద్ద ఈనెల 3వ తేదీ (శనివారం) వాల్మీకి మహార్షి విగ్రహావిష్కరణ జరగనుంది. నాలుగు రోజుల క్రితం మహిళలు పూర్ణ కుంభాలతో ఉరేగింపుగా వచ్చి మహార్షి వాల్మీకి విగ్రహాన్ని ఎస్పీ సర్కిల్కు చేర్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఎస్పీ సర్కిల్ వద్ద భారీగా ఫ్లెక్సీలు, కాషాయ జెండాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు, నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాల్మీకి విగ్రహావిష్కరణ చేస్తున్న నేపథ్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో ఎస్పీ సర్కిల్ వద్ద గతంలో బీజేపీ నేతల ఆధ్వర్యంలో వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు మరో విగ్రహాన్ని పక్కనే ఏర్పాటు చేస్తుండటంతో సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. పథకాలతో మహిళా వికాసం కోలారు: ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది, వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని విధానపరిషత్ మాజీ ఉప సభాపతి వి ఆర్ సుదర్శన్ తెలిపారు. గురువారం తాలూకాలోని వేమగల్ శ్రీ ద్రౌపతాంభ ధర్మరాయస్వామి సముదాయ భవనంలో శ్రీ క్షేత్ర ధర్మస్థల గ్రామీణాభివృద్ధి పథకం బిసి ట్రస్టు మహిళా జ్ఙాన వికాస కార్యక్రమంలో మాట్లాడారు. నేడు ప్రభుత్వం శక్తిపథకం, గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్నభాగ్య, యువనిధి వంటి వినూత్న పథకాలను తీసుకు వచ్చిందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. కార్యక్రమంలో శ్రీ క్షేత్ర ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లా డైరెక్టర్ శివానంద ఆచార్య, జ్ఙాన వికాస సమన్వయ అధికారి శిల్ప తదితరులు పాల్గొన్నారు. -
‘రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దు’
రాయచూరు రూరల్: కోప్పళ్లో రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దు అని స్థానికులు డిమాండ్ చేశారు. గురువారం కోప్పళ్ నగర సభ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. రసాయన పరిశ్రమల ఏర్పాటుతో ప్రజలు, మూగజీవాలకు ముప్పు వాటిల్లుతుందని కోప్పళ ఎంపీ రాఘవేంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ ప్రాంతంలో విష పదార్థాలను వెదజల్లే పరిశ్రమలు స్థాపించి మానవుల జీవితాలను అనారోగ్యం పాలు చేయడం తగదని ఆదోళనకారులు వివరించారు. బల్దోట, కిర్లోస్కర్, కళ్యాణ స్టీల్, ముక్కుంది సుమి, ఏక్సో ఇండియా కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పితే తుంగభద్ర జలాలు కలుషితం అవుతాయని పేర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి చేసి పరిశ్రమలు ఏర్పాటు కాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో అల్లమ ప్రభు బెటదూరు, మంజునాథ్, మదరి, హన్మంతప్ప, మల్లికార్జున, గురునాథ్ గౌడ, విరుపణ్ణ, వీరభద్రప్ప, పుష్పలత, నాగరాజ్ భరమన్న పాల్గొన్నారు. -
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
జలోత్సవంలో రాయల ఊరేగింపురాఘవేంద్ర స్వామి దర్శనం కోసం క్యూలో నిలబడిన భక్తులుమూల విరాట్కు పూజలు చేస్తున్న శ్రీపాదంగళ్ బీఎంసీఆర్సీలో న్యూఇయర్ సందడి బళ్లారి రూరల్: బీఎంసీఆర్సీలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పరిపాలనా భవన్లో డీన్ డాక్టర్ గంగాధర గౌడ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అధికారులు, సిబ్బంది, ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కార్యక్రమంలో దంత వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భారతి, వైద్యులు, డాక్టర్ బసవరాజు, డాక్టర్ ధనుజ, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ నయన, డాక్టర్ గీత, డాక్టర్ ఉమాశంకర్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రచన, డాక్టర్ పూర్ణిమ, బీఎంసీఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. కొళగల్లు రైతు పూజారి దొడ్డబసప్ప మంత్రాలయంలో మాదిరిగా రోగులకు తనవంతు సేవలందిస్తున్నారు. గత మూడు నెలలుగా ప్రతి గురువారం 200 మందికి పాయిసం, అన్నం, సాంబారు, రసంతో కూడిన అన్న సంతర్పణ చేస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా యువకులు తిప్పేస్వామి, డొడ్డబసప్ప, సోమప్ప, సన్నరద్రప్పతో కలసి బీఎంసీఆర్సీ ఆవరణలో రోగులు, వారి బంధువులకు అన్నదానం చేశారు. హొసపేటె: విజయనగర జిల్లా వ్యాప్తంగా గురువారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 2025కు వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు. మహిళలు ఇళ్ల మందు న్యూఇయర్ ముగ్గులు వేసి సందడి చేశారు. సమీపంలోని దేవాలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. నగరంలో అమరావతిలో వెలసిన వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అంతకుముందు వేంకటేశ్వరుడిని అర్చకుడు రామానుజాచార్యులు ఆధ్వర్యంలో పూలమాలలతో విశేషంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అదే విధంగా పాఠశాలల్లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మంత్రాలయంలో భక్తుల కోలాహలం రాయచూరు రూరల్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధిలో భక్తుల కోలాహలం నెలకొంది. రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలో బారులుదీరారు. రాఘవేంద్ర స్వామి మూల విరాట్కు మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ శ్రీ పాదంగల్ ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు మఠం భవనాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఆన్లైన్ బుకింగ్లో కూడా గదులు లభించక పోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. హోటళ్లు, దుకాణాల్లో వ్యాపారం జోరందుకుంది. హుబ్లీ: జంట నగరాల్లోని వివిధ ప్రార్థన మందిరాల్లో బుధవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు నిర్వహించారు. 12 గంటలకు కేక్ కట్ చేసి, బాణాసంచా పేల్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ధార్వాడ కళ్యాణ నగర శ్రీ శారద వృద్ధాశ్రమంలో భక్తి గీతాలు ఆలపించారు. చిత్రదుర్గ సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా డీడీ విజయ్ కుమార్, సంబంధిత కార్యాలయ సిబ్బందితో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో అధికారి గంగప్ప, ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా పోలీసులు పర్యవేక్షించారు. -
శ్రీగంధం తోటలను కాపాడుకోవాలి
శ్రీనివాసపురం: సమాజంలో జనాభా పెరుగుతున్న కొద్ది నేరాలు కూడా అధికం అవుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి గాను ప్రజల సహకారంతో కూడిన ఒక రక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని సిఐ ఎంబి గొరవనహళ్లి తెలిపారు. గురువారం యల్దూరు గ్రామంలో శ్రీగంధం ఉత్పాదన, రక్షణ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. శ్రీగంధం చెట్లు ఎంతో విలువైనవి కావడం వల్ల వాటిని దొంగిలించే ప్రయత్నాలు జరుగుతాయి. వాటి రక్షణ కోసం రైతులు శ్రీగంధం తోటల చుట్టూ కంచె ఏర్పాటు చేసుకోవాలి. సీసీ కెమెరాలను అలవర్చుకోవాలన్నారు. జి వెంకటప్ప, బెల్లం శ్రీనివాసరెడ్డి, యల్దూరు మణి తదితరులు పాల్గొన్నారు. -
వినాయకునికి వెన్నాభిషేకం
మండ్య: నూతన సంవత్సరం సందర్భంగా మండ్యలోని విద్యానగర్ లేఔట్లోని శ్రీ గణపతి ఆలయంలో స్వామివారికి గురువారం వెన్నతో అలంకరించారు. ఉదయాన్నే జలా భిషేకం చేసి వెన్నతో అలంకరించారు. వందలాది మంది భక్తులు విఘ్ననాథున్ని దర్శించుకుని పూజలు చేశారు. కారు పల్టీలు కొట్టి బైక్ను ఢీ● భార్య మృతి, భర్త పిల్లలకు గాయాలు దొడ్డబళ్లాపురం: నూతన ఏడాది సమయంలో విషాదం సంభవించింది. కారు బోల్తాపడి బైక్ను ఢీకొన్న ప్రమాదంలో భార్య మరణించగా, భర్త, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డ సంఘటన మాగడి తాలూకా లక్కేనహళ్లి వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. బుధవారం రాత్రి కుణిగల్ నుంచి నెలమంగల వైపు వస్తున్న కారు అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొంది. దీంతో బైక్ ధ్వంసమైంది, అందులో ప్రయాణిస్తున్న రమేశ్ (34) తీవ్రంగా గాయపడగా భార్య అశ్విని (29) చనిపోయింది. యువన్ (11), కుమార్తె సాన్వి (7) కూడా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను నెలమంగల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న వారు బాగా తాగి ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. గానవి బంధువులపై కేసు యశవంతపుర: బెంగళూరులో నవ దంపతులు గానవి, సూరజ్లు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్న ఘటన అలజడి కొనసాగుతోంది. గానవి కుటుంబం వల్లే సూరజ్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని వదిన విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. గానవి తల్లి రాధా, బాబుగౌడ, కార్తీక్, మహదేవ్, గగన్, శశికుమార్, రుక్మిణి, అభిలాష్, అభిషేక్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గానవి హర్ష అనే యువకున్ని ప్రేమించిందని, అందువల్లే సంసారంలో గొడవలు జరిగాయని సూరజ్ బంధువులు ఆరోపించారు. మత్తులో అల్లరిమూకల దాడి బనశంకరి: న్యూ ఇయర్ పార్టీలో మద్యం మత్తులో గొడవ తారాస్థాయికి చేరుకుంది. నడిరోడ్డులో క్యాబ్డ్రైవరు పై 10 మందికి పైగా అల్లరిమూకలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సిటీలో కార్పొరేషన్ సర్కిల్లో జరిగింది. అల్లరి మూకల కారు క్యాబ్ను తగలడంతో ఎందుకు ఢీకొట్టారని క్యాబ్ డ్రైవర్ ప్రశ్నించాడు. కానీ యువకులు మద్యం మత్తులో దూషించడంతో పాటు చుట్టుముట్టి చితకబాదారు. అక్కడే ఉన్న క్యాబ్, కారుడ్రైవర్లు విడిపించడానికి యత్నించగా రభస మరింత పెరిగింది. యువకులను కొందరు చితకబాదడంతో ఉద్రిక్తత నెలకొంది. దాడిలో గాయపడిన క్యాబ్డ్రైవరును ఆసుపత్రికి తరలించారు. హలసూరు గేట్ పోలీసులు వచ్చి గొడవను అదుపు చేశారు. -
పాదయాత్రకు సహకరించాలి
రాయచూరు రూరల్: కర్ణాటకలో తుంగభద్ర నదిని కాలుష్య రహితంగా ఉంచడానికి, దాని పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్మల తుంగ అభియానకు శ్రీకారం చుట్టారు. గురువారం మాన్వి తాలుకా పోత్నాళ్లో జరిగిన సభలో ఉటకనూర్ మరి బసవలింగ స్వామి, తోటంద్ర స్వామి మాట్లాడారు. నిర్మల తుంగభద్ర అభియాన, జాల జాగృతి పాదయాత్రకు అందరూ సహకరించాలని కోరారు. డిసెంబర్ 27న గంగావతి తాలూకా కిష్కింద నుంచి ప్రారంభమైన యాత్ర 2026 జనవరి 4వ తేదీన మంత్రాలయం చేరుకుంటుందని పేర్కొన్నారు. తుంగభద్ర నది నీటిని వినియోగించుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో నిర్మల తుంగ అభియాన సంచాలకులు మహిమ పాటిల్, బసవ రాజ్ పాటిల్, మాజీ ఎంపీ బి.వి.నాయక్, మాజీ శాసన సభ్యులు రాజా వెంకటప్ప నాయక్, బసన గౌడ, గంగాధర నాయక్, హనుమాన గౌడ, ఉదయ కుమార్, శ్రీధర్ స్వామి, అనిత పాల్గొన్నారు. కోరేగావ్ ఆశయ సాధనకు కృషిరాయచూరు రూరల్: కోరేగావ్లో బ్రిటిష్ కంపెనీని ఎదురించి పోరాటి చేసిన వీరుడు భీమా కోరేగావ్ అని పలువురు కొనియాడారు. గురువారం నగరంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కోరేగావ్ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. విశ్వనాథ్ పట్టి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. భీమా కోరేగావ్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రజలను రక్షించిన కోరేగావ్ స్మరణార్థం పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించి ప్రార్థనలు జరిపారు. హంపీలో ఆర్ఎస్ఎస్ ప్రచారకులుహొసపేటె: హంపీ సమీపంలోని ఆనెగొందిలో అంతర్జాతీయ ప్రచారకుల సమావేశం నిర్వహించారు. దత్తాత్రేయ హోసబాలే నేతృత్వంలో 23 దేశాల నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం విదేశీ ప్రచారకులు యునెస్కో వారసత్వ ప్రదేశమైన హంపీలోని విఠల ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంధ సేవకులు హంపీలోని కట్టడాలను ఆసక్తిగా తిలకించారు. మూడు రోజుల మేధోమథన కార్యక్రమంలో భాగంగా హంపీలోని పురాతన ప్రదేశాలను సందర్శించినట్లు వారు తెలిపారు. హంపీలో అక్క క్యాంటీన్ ప్రారంభంహొసపేటె: రాష్ట్రంలో తొలిసారిగా హంపీలోని ప్రపంచ ప్రఖ్యాత విజయ విఠల్ ఆలయం ముందు మొబైల్ సిస్టర్ క్యాంటీన్ను జిల్లా పంచాయతీ డిప్యూటీ సెక్రటరీ కె.తిమ్మప్ప బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ప్రజలు, పర్యాటకులకు భోజనం దొరకడం కష్టమని తెలిపారు. జగజ్యోతి గ్రామ పంచాయతీ స్థాయి సంఘం– హంపీ ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవి మహిళా స్వయం సహాయక బృందం మహిళలు వంటలను తయారు చేసి క్యాంటీన్ ద్వారా విక్రయిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు ఉమేష్, ఆలంబాషా, నాగరాజ్, ప్రసన్న, కళావతి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అడవి పిల్లిని రక్షించిన అధికారులు మైసూరు: చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట తాలూకా బరగి గ్రామంలోకి అడవి పిల్లి చొరబడింది. దానిని చూసిన గ్రామస్తులు చిరుత పిల్లగా భావించారు. తల్లి చిరుత ఇక్కడకు సమీపంలోనే ఉంటుందని భయాందోళనకు గురయ్యారు. అయితే అది అడవి పిల్లి అని గుర్తించి అటవీ శాఖకు సమాచారం అందించారు. స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది అడవి పిల్లిని పట్టుకొని సురక్షితంగా అడవిలో వదిలారు. -
కొత్త సంతోషాల సాగరం
బుధవారం అర్ధరాత్రి బెంగళూరులో బ్రిగేడ్ రోడ్డులో ఉత్సాహంబనశంకరి: భారత సిలికాన్ వ్యాలీలో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని తాకాయి. 2025 ఏడాదికి వీడ్కోలు చెబుతూ ఎన్నో ఆకాంక్షలతో 2026 కు విందులు, చిందులతో యువత, ప్రజలు ఘన స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం నుంచే టపాసులు కాల్చుతూ, పార్టీలు చేసుకుంటూ మజాగా గడిపారు. గురువారం తెల్లవారుజాము వరకూ ఉత్సవ వాతావరణం నెలకొంది. ఈ రోజు మిస్సయితే మరో సంవత్సరం వరకూ ఆగలేమంటూ స్థోమత కొద్దీ ఎంజాయ్ చేశారు. ఇక్కడ మామూలు రద్దీ కాదు నగరంలో వేడుకలకు పేరుపొందిన ఎంజీ రోడ్డు, బ్రిగేడ్రోడ్డు, చర్చ్ స్ట్రీట్, కోరమంగల, ఇందిరానగర, వైట్ఫీల్డ్ తదితర ప్రాంతాల్లో అట్టహాసం నెలకొంది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. ఎంజీ రోడ్డు, చర్చ్ స్ట్రీట్ యువ జంటలతో నిండిపోయింది. విద్యుద్దీప కాంతుల్లో రోడ్లపై మ్యూజిక్ వింటూ నృత్యాలు చేశారు. రాత్రి 12 గంటలు కాగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ 2026 ఏడాదికి ఘనస్వాగతం పలికారు. కేక్లు, మిఠాయిలు తినిపించుకుని ఆలింగనాలతో మైమరచిపోయారు. అట్టహాసంగా పార్టీలు బెంగళూరులో హోటళ్లు, రిసార్టులు, పబ్లలో పెయిడ్ పార్టీలు హోరెత్తాయి. భారీ టికెట్ల ధరలను లెక్కచేయకుండా శ్రీమంతులు, టెక్కీలు పాల్గొన్నారు. తెల్లవారుజాము వరకు మ్యూజిక్, మద్యం, విందు చిందులతో ఆడిపాడారు. ఫంక్షన్ హాళ్లు, ఫాంహౌస్లలోనూ పార్టీలు హోరెత్తాయి. సెలబ్రిటి డీజే సంగీతం, ఫ్యాషన్ షోలు, బెల్లీ డ్యాన్స్, మిడ్నైట్ ఫైర్ షో ఇలా ఎన్నో వైరెటీ థీమ్లు ఆహూతులను హుషారెత్తించాయి. టపాసులు మిరుమిట్లు గొలిపాయి. 200 కు పైగా స్టార్హోటల్స్లో డీజే.మ్యూజిక్, నృత్యాలు, అన్లిమిటెడ్ డ్రింక్స్ పార్టీలు నిర్వహించారు. ఆర్టిస్టుల డ్యాన్సులు, లేజర్ షోలతో ఆర్భాటం ఉట్టిపడింది. హాట్స్పాట్గా కోరమంగల సిటీలో ఈసారి సంబరాలకు కేంద్రబిందువుగా కోరమంగల నిలిచింది. ఎంజీ.రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు ను కాదని ఇక్కడ ఎక్కువమంది జనం వచ్చారు. యువత, జనం కిలోమీటర్ల మేర చేరడంతో అదుపుచేయడం పోలీసులకు సవాల్గా మారింది. సిలికాన్ సిటీలో మిన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు -
శుభప్రదం.. ఆలయ దర్శనం
మైసూరు/ శివాజీనగర: గత ఏడాది కంటే కొత్త సంవత్సరంలో మరింత మంచి జరగాలని, అన్నీ కలసిరావాలని కోరుకుంటూ ప్రజలు ఆలయాల బాట పట్టారు. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా గురువారం తెల్లవారుజాము నుంచే బెంగళూరు, మైసూరు వంటి నగరాలతో పాటు పట్టణాలు, గ్రామాలలో ఆలయాలు, దేవస్థానాలు భక్తజనంతో కిటకిటలాడాయి. టెంకాయలు, పూలు, పండ్లకు విపరీతమైన గిరాకీ నెలకొంది. బెంగళూరులో హలసూరు సోమేశ్వరాలయం, బసవనగుడి దొడ్డ గణపతి మందిరం, బనశంకరీదేవి ఆలయం వంటి ప్రసిద్ధ ఆలయాలలో విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా విశేష అలంకారాలు గావించారు. నగరం నలుమూలల నుంచి భక్తులు వచ్చి దేవీ దేవతలను దర్శించుకుని పూజలు చేశారు. రద్దీ ఉండడంతో సుదీర్ఘంగా బారులు తీరారు. మైసూరులో చాముండి కొండపై భక్తసంద్రం కొత్త సంవత్సరం తొలిరోజున మందిరాలు కిటకిట ఏడాదంతా మంచి జరగాలని జనం పూజలు చాముండి గిరుల వైభవం మైసూరులో చాముండి గిరుల మీద చాముండేశ్వరి దేవి సన్నిధిలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. మైసూరుతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు రావడంతో కొండ నిండిపోయింది. తెల్లవారుజామునే తల్లి చాముండేశ్వరికి విశేష పూజలు నిర్వహించారు. అలంకారం, అభిషేకం, మంగళారతి సేవలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. శక్తి దేవత సన్నిధికి కేరళ, తమిళనాడు వంటి బయటి రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చారు. నూతన సంవత్సరంలో తొలిరోజు అమ్మవారి దర్శనం ఎంతో శుభప్రదమని నమ్ముతారు. చాముండేశ్వరికి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి, ఆమెను వివిధ పువ్వులు, విల్లో ఆకులతో చేసిన దండతో అలంకరించారు. రుద్రాక్ష మంటపంలో ప్రతిష్టించిన చాముండేశ్వరి విగ్రహ ప్రత్యేక అలంకరణ చూసి భక్తులు తరించిపోయారు. ఆలయం మొత్తం మనోహరంగా సింగారించారు. పొగమంచు, చలి తీవ్రతను కూడా లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే కొండపైకి భక్తులు క్యూలు కట్టారు. ఆలయంలో పూజల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి బయట ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ నటీనటులు దర్శనానికి వచ్చారు. -
నూతన ఎస్పీల నియామకం
సాక్షి బళ్లారి: జిల్లా ఎస్పీగా పని చేస్తున్న శోభారాణి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో నియమితులైన పవన్ నెజ్జూర్ గురువారం బాధ్యతలు తీసుకున్నారు. నగరంలోని ఎస్పీ కార్యాలయంలో పలువురు పోలీసు అధికారులు స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. అంతకుముందు బళ్లారి నుంచి బదిలీ అయిన ఎస్పీ శోభారాణికి వీడ్కోలు పలికారు. ఎస్పీ బంగ్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ రవికుమార్, డీవైఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్ల నుంచి వచ్చిన పోలీసు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఏడాదిన్నర నుంచి ఆమె చేసిన సేవలను కొనియాడారు. నూతన ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న పవన్ నెజ్జూర్ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతలు పర్యవేక్షణ, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా ఎస్పీగా అరుణాంగుష్ గిరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పుట్ట మాదయ్యను కలబుర్గి పోలీస్ శిక్షణ కేంద్రంలో డీఐజీగా నియమించింది. ఇక బెళగావి ఎస్పీగా ఉన్న బీమా శంకర్ గుళేదగుడ్డను బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎస్పీగా రామరాజన్ను నియమించారు. -
జిల్లాకు ఎత్తినహొళె నీరు
కోలారు: ఏడాదిన్నరలోగా కోలారు జిల్లాకు ఎత్తినహొళె నీటిని అందిస్తామని రాష్ట్ర సౌరసరఫరాల శాఖా మంత్రి కెహెచ్ మునియప్ప తెలిపారు. గురువారం తన నివాసంలో విలేకరుల సమవేశంలో మాట్లాడారు. దేవనహళ్లి సమీపంలోని కుందాణ వద్ద నీటిని సంగ్రహించి మూడు లైన్ల ద్వారా నీటిని కోలారు, చిక్కబళ్లాపురం, బెంగుళూరు రూరల్ జిల్లాలకు సరఫరా అవుతుందన్నారు. బెంగుళూరులోని కోగిలు కాలనీలో బాధితులకు ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందన్నారు. సిరిధాన్యాల కిట్ల వల్ల 4.5 కోట్ల మంది రేషన్ కార్డులు కలిగిన వారు లబ్ధి కలుగుతోందన్నారు. శ్రీనివాసపురం వద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 1200 ఎకరాల స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, అయితే కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమణ్ణ దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదన్నారు. -
పరువు హత్యల నివారణకు చర్యలు
హుబ్లీ: పరువు హత్యల నివారణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్ప స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని తెలిపారు. గురువారం ఇనాం వీరాపుర గ్రామంలో మాన్య పాటిల్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. రూ.16 లక్షల చెక్కును బాధితులకు అందజేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఇది పౌర సమాజానికి, మానవత్వానికి తీరని కలంకం అన్నారు. మాన్య అనే యువతి కులాంతర ప్రేమ వివాహం చేసుకుందన్న అక్కసుతో దారుణంగా హత్య చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ కేసులో నిందితులను వారిని ప్రోత్సహించిన వారిపై జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుందన్నారు. ఇలాంటి పని చేసే వారు, వారికి మద్దతు ఇచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధలా అండగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి సూచించడం జరిగిందన్నారు. ఆ కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం, హోం మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీసీ దివ్యప్రభు తదితరులు పాల్గొన్నారు. -
హెబ్బాళ నుంచి సొరంగమార్గం నిర్మిస్తాం: డీకే
బనశంకరి: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానం కల్పించే మార్గంలో ట్రాఫిక్ను తగ్గించడానికి హెబ్బాళ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల పొడవు సొరంగమార్గం రహదారిని నిర్మిస్తామని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ తెలిపారు. దీనికి మేక్రి సర్కిల్ వద్ద కుడి, ఎడమవైపు వాహనాల సంచారానికి పై వంతెన నిర్మాణంతో అనుసంధానం కల్పిస్తామని తెలిపారు. గురువారం హెబ్బాళ లో బీడీఏ నిర్మించిన ఫ్లై ఓవర్ లూప్ని డీసీఎం ప్రారంభించారు. 120 కిలోమీటర్ల కు పైగా పొడవు గల పెరిఫెరల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే రైతులనుంచి భూస్వాధీనం చేసుకుంటున్నామని, తగిన పరిహారం చెల్లిస్తామని తెలిపారు. 12 ఉపనగరాల నిర్మాణానిక పథకం రూపొందించామని తెలిపారు. జీబీఏ పాలికెతో పాటు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ఈ ఏడాది నిర్వహిస్తామని డీసీఎం తెలిపారు. ఊహించని రీతిలో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో బైక్కు నిప్పు దొడ్డబళ్లాపురం: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా పోలీసుల ముందే ఒక యువకుడు బైక్కి నిప్పంటించి పరారైన సంఘటన బెంగళూరులోని మైసూరు రోడ్డులో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి బ్యాటరాయనపుర ట్రాఫిక్ పోలీసులు కవిక జంక్షన్ వద్ద వాహనదారులను తనిఖీలు చేస్తున్నారు. బైక్పై వచ్చిన ఒక యువకుడు బ్రీత్ అనలైజర్ పరీక్షకు నిరాకరించాడు. పోలీసులు బలవంతం చేయడంతో గొడవ పెట్టుకున్నాడు. మత్తులో విచక్షణ కోల్పోయి తన బైక్కి నిప్పంటించి పరారయ్యాడు. పోలీసులు మంటలను ఆర్పివేశారు. బైకిస్టుని బీటీఎం లేఔట్ నివాసి వెంకటేశ్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వెంకటేశ్ కోసం గాలిస్తున్నారు. -
లంచం డిమాండ్ చేసిన సంక్షేమ శాఖాధికారిణి అరెస్ట్
హోసూరు: ఓ మహిళ నుంచి లంచం డిమాండ్ చేసిన సంక్షేమ శాఖాధికారిణిని లంచ నిరోధక శాఖ (అవినీతి నిరోదక శాఖ) పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. క్రిష్ణగిరి జిల్లా నాగరసంబట్టి సమీపంలోని కనవాయ్పట్టి గ్రామానికి చెందిన వనజకు 15 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. కొద్ది సంవత్సరాలకే కోర్టులో విడాకులు తీసుకుంది. పెళ్లి సమయంలో కట్నంగా అందజేసిన నగదు, నగలను తన భర్త నుంచి ఇప్పించాలని కోర్టులో కేసు దాఖలు చేసింది. అదే విధంగా రెండు నెలల క్రితం జిల్లా కేంద్రం క్రిష్ణగిరి కలెక్టరేట్లోని సామాజిక సంక్షేమ శాఖాధికారిణి మార్తకు వినతిపత్రం అందజేసింది. కట్నంగా అందజేసిన నగలు, నగదును రికవరీ చేసి ఇచ్చేందుకు రూ.3 వేలు లంచం ఇవ్వాలని సామాజిక సంక్షేమ శాఖాధికారిణి మార్త డిమాండ్ చేసింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని వనజ ఈ విషయాన్ని లంచ నిరోదక శాఖ పోలీసుల దృష్టి తీసుకెళ్లింది. పథకం ప్రకారం లంచ నిరోధక శాఖ అధికారులు అందజేసిన రసాయం కలిపిన నోట్లను మార్తకు అందజేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సామాజిక సంక్షేమ శాఖాధికారిణి మార్తను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


