breaking news
Karnataka
-
వైద్యులకు అంతఃకరణ శుద్ధి అవసరం
సాక్షి,బళ్లారి: వైద్యో నారాయణ హరీ.. అన్నారు పెద్దలు. అయితే ఆ వాక్యం రోజురోజుకు ప్రజలకు దూరం కావడంతో పాటు స్వాఽర్థ చింతనతో వైద్యులు పని చేస్తున్నారని, రోగాలను నయం చేసే వైద్యులే రోగగస్త్ర వ్యవస్థగా మారడం శోచనీయమని ప్రముఖ మేధావి డాక్టర్ రహమత్ తరీకెరె ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నగరంలోని బీపీఎస్సీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కన్నడ వైద్య రచయితల సంఘం, భారతీయ వైద్యకీయ సంఘం సహకారంతో కన్నడ వైద్య రచయితలు 6వ రాష్ట్ర సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ముందుగా ఆయుర్వేద రత్న డాక్టర్ తారానాథ పండిట్ను స్మరించుకున్నారు. ఇలాంటి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం కన్నడ భాషకు, సాహిత్యానికి ఉత్తమ కానుక అన్నారు. అంతేకాక వైద్యులు కూడా సాహితీవేత్తలుగా ఎదగడానికి దోహదం చేస్తుందన్నారు. వైద్య సాహిత్యం గురించి మాట్లాడుతూ సాహిత్యాన్ని మూడు ప్రకారాలుగా విభజించారన్నారు. వైద్యసాహిత్యం, వైద్యులు రచించిన సాహిత్యం, అలాగే వైద్యులు పాత్రధారులైన సాహిత్యం గురించి ఆయన మాట్లాడారు. ఆరోగ్య బాధలు, శారీరక నొప్పులు ఉన్న వారిని గట్టెక్కించడానికి వైద్యుల సేవలు అపూర్వమన్నారు. వ్యాపారమయంగా వైద్యరంగం అయితే కొందరు వైద్యులు వైద్య రంగాన్ని వ్యాపారమయం చేసుకుంటూ ప్రజల్లో చెడును రేకెతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాహిత్య రంగంలో వైద్యులను ఉన్నత స్థానంలో చిత్రీకరించారన్నారు. ఆ ఘనతను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులు ఆత్మశుద్ధి, అంతఃకరణ శుద్ధితో సేవలు చేయాలని సూచించారు. రచనలు చదవడమనే పద్ధతి నానాటికీ తగ్గుముఖం పట్టి వినడం వరకే మార్పు చెందుతున్న ప్రస్తుత సమాజంలో జానపద సాహిత్యం అత్యవసరం అన్నారు. డాక్టర్లు వృత్తిపరంగానే కాకుండా సామాజిక రంగంలో కూడా సేవలు అందించాలన్నారు. వైద్య రంగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. సామాజిక, ఆరోగ్యానికి వైద్య సాహిత్య వారధిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు చినివాలర్, ప్రముఖ డాక్టర్లు డాక్టర్ అరవింద్ పాటిల్, డాక్టర్ మాణిక్యరావు, డాక్టర్ దివాకర్ గడ్డి, డాక్టర్ యోగానందరెడ్డి, డాక్టర్ వీణా, డాక్టర్ సుమా గడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్యులే రోగగ్రస్త వ్యవస్థగా మారడం శోచనీయం ప్రముఖ మేధావి డాక్టర్ రహమత్ తరీకెరె ఆవేదన -
ధర్మస్థల రక్షణకు ధర్మయుద్ధం
చెళ్లకెరె రూరల్: ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం ఓ పవిత్ర పుణ్యక్షేత్రం, ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ధర్మయుద్ధం జరపాల్సి వస్తోందని చిత్రదుర్గ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కేటీ కుమారస్వామి తెలిపారు. ఆయన శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి మహిళలకు స్వయం ఉపాధి కల్పించే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినా హిందూ ధార్మిక విధానాలకు ఆటంకం కల్గించే విధంగా కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని చూసి ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. ప్రజలు, భక్తుల మనోభావాలను దెబ్బ తీయరాదన్నారు. ఆందోళనలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామదాసు, తాలూకా మండల అధ్యక్షుడు బీఎం సురేష్, జయపాలయ్య, శివపుత్రప్ప, సోమశేఖర్ మండిమఠ తదితరులు పాల్గొన్నారు. ధర్మస్థలపై దుష్ప్రచారం తగదు హొసపేటె: ధర్మస్థలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నగరంలో బీజేపీ కార్యకర్తలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీని వేణుగోపాల స్వామి ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం మీదుగా అంబేడ్కర్ సర్కిల్ వరకు నిర్వహించారు. అంబేడ్కర్ సర్కిల్లో కార్యకర్తలు మాట్లాడుతూ ధర్మస్థల పేరు ప్రతిష్టలను దిగజార్చుతున్నారని అన్నారు. ధర్మస్థల పవిత్రతకు భంగం కల్గిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. హిందువుల పవిత్ర స్థలమైన ధర్మస్థలలో విధ్వంసకర కార్యకలాపాలు సాగుతున్నాయని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్మస్థల పవిత్ర తపై అపప్రచారం అరికట్టాలని మండిపాటు నిందితులను శిక్షించాలని డిమాండ్ వాడవాడలా కదం తొక్కిన హిందూ సంఘాల నాయకులు, బీజేపీ శ్రేణులు -
ఎడమ కాలువలో పడి వ్యక్తి గల్లంతు
హొసపేటె: భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కునేందుకు కాలువలోకి దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో జారి పడి మృతి చెందిన ఘటన గంగావతి తాలూకా సణాపుర గ్రామం వద్ద రిజర్వాయర్కు సమీపంలోని గంగమ్మ గుడి(జంగ్లీ క్రాస్) వద్ద తుంగభద్ర ఎడమ కాలువ సమీపంలో జరిగింది. మృతుడిని గంగావతి జయనగరలోని ప్రతిష్టాత్మక ఇస్లాం పాఠశాల కార్యదర్శి రాజ్కిరణ్ (38)గా గుర్తించారు. స్నేహితులతో కలిసి భోజనం చేసిన రాజ్ కిరణ్ కారులో సణాపుర రిజర్వాయర్ వద్దకు వచ్చి జంగ్లీ క్రాస్ సమీపంలోని గంగమ్మ ఆలయ సమీపంలోని తుంగభద్ర ఎడమ గట్టు కాలువలో చేతులు కడుక్కోవడానికి దిగినట్లు తెలిసింది. ప్రమాదవశాత్తు కాలువలోకి జారిపడి నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడటానికి కారు డ్రైవర్, అతని సన్నిహితుడు ప్రయత్నించారు. అయితే వారు విఫలయ్యారని తెలిసింది. అగ్నిమాపక దళ అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఆ వ్యక్తి ఆచూకీ కోసం తెప్పల సాయంతో వెతికారు. కానీ ఇంతవరకు మృతదేహం దొరకలేదని పోలీసులు తెలిపారు. -
అరటి తోటలో కొండచిలువ
శివమొగ్గ: అరటి తోటలో భారీ కొండచిలువ కనపడింది. స్నేక్ కిరణ్ ఆ కొండచిలువను భద్రంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. శివమొగ్గ జిల్లా పురదాళు సమీపంలోని హనుమంతాపుర గ్రామంలో సుమారు 9 అడుగుల కొండచిలువ కనిపించింది. వెంటనే స్నేక్ కిరణ్కు స్థానికులు సమాచారం అందించడంతో ఆయన వెంటనే వచ్చి దాన్ని పట్టుకుని దూరంగా వదిలిపెట్టారు. రాగి ముద్దలో విషం పెట్టి అత్త హత్య యశవంతపుర: అక్రమ సంబంధాల మోజులో మానవత్వం మృగ్యమవుతోంది. ప్రియుని కోసం రాగి ముద్దలో విషం కలిపి అత్తను హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర తాలూకా తడగ గ్రామంలో జరిగింది. అశ్విని అనే వివాహిత తన అత్త దేవీరమ్మ (75) హతమార్చింది. వివరాలు.. అశ్వినికి ఆంజనేయ అనే వ్యక్తితో ఆక్రమ సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి అత్త ఆమెను తీవ్రంగా మందలించింది. ఇటీవల అశ్విని ఇంట్లో నగలను తీసుకుని ప్రియునికి అప్పగించింది. ఇది తెలిసి కోడలిని అత్త నిలదీసింది. తమకు అడ్డుగా ఉన్న దేవీరమ్మను అడ్డు తొలగించాలని అశ్విని నిశ్చయించుకుంది. గురువారం రాత్రి రాగిముద్దలో పురుగుల మందును కలిపి అత్తకు ఇచ్చింది. అది ఆరగించిన దేవీరమ్మ తెల్లవారినా నిద్రలేవలేదు. అనారోగ్యంతో ఆమె మృతి చెందినట్లు అశ్విని అందరికీ చెప్పింది. అయితే తల్లి చావుపై దేవీరమ్మ కూతురికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అశ్వినిని పిలిచి తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకొంది. ప్రియుడు ఆంజనేయను కూడా అరెస్టు చేశారు. 100 గ్రాముల బంగారం, రూ.50 వేల నగదును అశ్విని స్వాహా చేసిందని బంధువులు తెలిపారు. -
అచ్యుతం.. కేశవం
● వైష్ణవాలయాల్లో బెణక అమావాస్య పూజలు మండ్య: బెనక అమావాస్య కావడంతో శనివారం నగరంతో పాటు జిల్లాలోని అన్ని వైష్ణవ ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు జరిగాయి. నగరంలోని హనియంబాడి రోడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నెరవేర్చారు. మధ్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు. నగరంలోని లక్ష్మీ జనార్దనస్వామి ఆలయం, శ్రీనివాస ఆలయం, తాలూకాలోని కంబద నరసింహ స్వామి ఆలయాల్లో విశేష పూజలు జరిపించారు. భక్తులు ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మద్దూరు పట్టణంలోని ఉగ్రనరసింహ స్వామి ఆలయంలో, శ్రీరంగపట్టణలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన రంగనాథస్వామి ఆలయం, పాండవపుర తాలూకా మేలుకోటె చెలువ నారాయణస్వామి ఆలయం తదితరాలలో విశేష అర్చనలు సాగాయి. -
త్వరలో రెండో విడత సామాజిక సర్వే
సామాజిక సమీక్షలో మీటర్ రీడర్ల పాత్రఏ ఇల్లూ మిస్ కాకుండా సర్వే శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాల సామాజిక, విద్యా సమీక్షను 90 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో చేపట్టాం, రెండో విడత సర్వేను సెప్టెంబరు 22వ తేదీ నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహిస్తామని కమిషన్ అధ్యక్షుడు ఆర్.మధుసూదన్ నాయక్ చెప్పారు. విద్యుత్ శాఖలోని మీటర్ రీడర్లను కూడా ఇందులో భాగస్వాములను చేస్తామని తెలిపారు. శనివారం నుంచి కమిషన్ సన్నాహాలను ప్రారంభించినట్లు తెలిపారు. విద్యుత్ మీటర్ రీడర్లు అన్ని ఇళ్లను జియో ట్యాగింగ్ చేస్తారు. ఏ ఇల్లు తప్పిపోకుండా సర్వే జరుగుతుంది అని తెలిపారు. కరెంటు కనెక్షన్ ఆధారం రాష్ట్రంలో ఉన్న అన్ని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ ఉంది. మీటర్ నంబరు ఆధారంగా అన్ని ఇళ్లలోని కుటుంబాల సర్వే సాగిస్తామన్నారు. ఈసారి దసరా సెలవులు ఉన్నందున సర్వేకు అనుకూలమవుతుందని తెలిపారు. ఒక్క కుటుంబం కూడా తప్పిపోదన్నారు. సర్వే కోసం యాప్ను రూపొందించినట్లు చెప్పారు. ప్రతి ఇంటి మీటరు, ఇంటి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తారన్నారు. ప్రతి ఇంటికి ప్రత్యేకమైన నంబర్ ఇచ్చి, స్టిక్కర్ను అతికిస్తారని చెప్పారు. మీటర్ రీడర్లకు కూడా భాగస్వామ్యం -
మహోగ్ర కృష్ణా.. ప్రశాంత తుంగా
రాయచూరు రూరల్: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలు, నదీ పరివాహక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదితో పాటు ఉత్తర కర్ణాటకలోని దాని ఉప నదులు ప్రమాదకర స్థాయిలో ఉరకలెత్తుతున్నాయి. దీంతో ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్కోటె, విజయపుర, కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి, రాయచూరు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తర కర్ణాటకలోని నిప్పాణి తాలూకాలో బోజ–కున్నూర వద్ద వేదగంగా నదిపై నిర్మించిన కడకోళ వంతెన వరద నీట మునిగింది. ఆల్మట్టి డ్యాం గరిష్ట నీటిమట్టం 519.60 మీటర్లు కాగా ప్రస్తుతం 518.30 మీటర్ల మేర నీరు నిల్వ చేరాయి. ఎగువ నుంచి 2.96 లక్షల క్యూసెక్కుల నీరు వరద రూపంలో వస్తుండగా డ్యాం నుంచి 1.96 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ఈనేపథ్యంలో నదీ తీర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. లింగసూగూరు తాలూకా శీలహళ్లి వంతెనను తాకుతూ వరద నీరు పారుతున్నాయి. రాయచూరు తాలూకాలోని నదీ తీర ప్రాంతంలో రైతులు అమర్చిన పంప్సెట్లను తొలగించుకుంటు న్నారు. రాయచూరు, యాదగిరి జిల్లాల్లో 140 గ్రామాలకు వరద పోటు తాకింది. మణ్ణూరులో యల్లమ్మ దేవాలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కంప్లి వంతెనపై రాకపోకలు ప్రారంభం హొసపేటె: గత నాలుగు రోజుల నుంచి తుంగభద్రా జలాశయం నుంచి లక్ష క్యూసెక్కుల నీరు నదికి విడుదల చేయడంతో కంప్లి వంతెన జలావృతమైన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం నుంచి తుంగభద్రమ్మ శాంతించడంతో రోడ్డు వంతెన మీద వాహనాల రాకపోకలు యథావిధంగా ప్రారంభం అయ్యాయి. తుంగభద్ర నదిపై కంప్లి వద్ద నిర్మించిన ఈ వంతెన ప్రధానంగా బళ్లారి– గంగావతి పట్టణాలను అనుసంధానిస్తుంది. మలెనాడు ప్రాంతంలో నిరంతర వర్షపాతం కారణంగా జలాశయానికి 1.30 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. నాలుగు రోజుల పాటు కంప్లి వంతెన జలదిగ్బంధంలో ఉండి పోయింది. చివరికి నదిలో నీటి పరిమాణం క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో వంతెన మీద వాహనాల రాకపోకలను అనుమతించారు. కుంభవృష్టితో కృష్ణవేణికి పోటెత్తిన వరద కళ్యాణ కర్ణాటకలో 140 గ్రామాలకు దెబ్బ -
శాంతి భద్రతల దృష్ట్యా 22 మందికి సరిహద్దు బహిష్కరణ
● పోలీస్ కమిషనర్ శశికుమార్ హుబ్లీ: వినాయక చవితి ఉత్సవాలు, ఈద్ మిలాద్ పండుగల నేపథ్యంలో జంట నగరాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం నేరాల నేపథ్యం కలిగిన 22 మందిని సరిహద్దుల నుంచి బహిష్కరించినట్లు పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. వీరంతా సంఘటిత నేరాలు, ఎన్డీపీఎస్ కేసులతో పాటు ఇతర నేరాల్లో పాల్గొన్నారన్నారు. కలబుర్గి, బళ్లారి, మైసూరు, మంగళూరు, బెళగావి, బెంగళూరు, దావణగెరె జిల్లాల నిర్ధిష్ట పోలీస్ స్టేషన్ల పరిధి వరకు సరిహద్దుల నుంచి బహిష్కరించామన్నారు. పదేపదే నేరాలలో పాల్గొనే వారిపై బహిష్కరణ వేటు వేస్తామన్నారు. ఈ ఆదేశం 6 నెలల పాటు అమలులో ఉంటుందన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని హెచ్చరించారు. ఇంతవరకు 105 మందిపై వేటు 2025లో ఇప్పటి వరకు నేరాల నేపథ్యంలో భాగంగా 105 మందిని సరిహద్దుల నుంచి బహిష్కరించామన్నారు. తొలి దశలో 52 మంది, రెండవ దశలో 31, మూడవ దశలో 22 మందిని బహిష్కరించినట్లు తెలిపారు. 2023లో 22 మందిని, 2024లో 23 మంది బహిష్కరించామన్నారు. ఇక తాజాగా బెండిగేరి, కసబాపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో నలుగురు చొప్పున, పాత హుబ్లీలో ముగ్గురు, ధార్వాడ టౌన్, హుబ్లీ ఉపనగర స్టేషన్ పరిధిలో ఒక్కొక్కరిని సరిహద్దుల నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. హుబ్లీలో తాజాగా రౌడీల పరేడ్ నిర్వహించామన్నారు. 75 శాతం మంది రౌడీలు హాజరయ్యారు. ఈ రెండు పండుగల సందర్భంగా ఎటువంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలను చేపట్టామన్నారు. డీసీపీలు సీఆర్ రవీష్, మహానంద నందగావిలు పాల్గొన్నారు. -
మైక్రో వేధింపులకు మహిళ బలి
సాక్షి బళ్లారి: రాష్ట్రంలో మైక్రోఫైనాన్స్ వేధింపులతో ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంటోంది. శనివారం చిత్రదుర్గ జిల్లా కవాడిగర హట్టిలో మైక్రోఫైనాన్స్ వేధింపులతో నేత్ర(30) అనే మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మైక్రో ఫైనాన్స్ సంస్థలో రూ.50 వేలు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేక పోయింది. దీంతో వేధింపులకు గురి చేయడంతో సదరు మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై చిత్రదుర్గ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సిద్దారూఢ మఠానికి కానుకల వర్షం హుబ్లీ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న సిద్దారూఢ మఠంలోని కానుకల హుండీలో 34 రోజులకు రూ.53,92,080 ఆదాయం లభించింది. రూ.4,45,050 విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను భక్తులు సమర్పించారు. ఈ నెల 20న మఠంలోని కానుకల హుండీలను ఎస్బీఐ సిద్దారూఢ నగర శాఖ మేనేజర్, సంబంధిత సిబ్బంది, భక్తుల సమక్షంలో తెరిచి లెక్కించారు. పర్యవేక్షణ ట్రస్ట్ కమిటీ చైర్మన్ చెన్నవీర ముంగురవాడి, వైస్ చైర్మన్ వినాయక ఘోడ్కే, గౌరవ కార్యదర్శి రమేష్ బెళగావి, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఉత్తమ గ్రంథ పాలక అవార్డు ప్రదానం రాయచూరు రూరల్: రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ గ్రంథ పాలకుడిగా సతీశ్ కుమార్కు అవార్డు లభించింది. డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కేంద్ర గ్రంథాలయంలో 14 ఏళ్ల పాటు విధులు నిర్వహించిన సతీష్ కుమార్కు కలబుర్గిలో జరిగిన జాతీయ సమ్మేళనంలో ఆప్టిమైజేషన్ ఫ్రేమ్ వర్క్ ఆధారంగా ఉత్తమ గ్రంథ పాలక అవార్డును అందించి సన్మానించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు ● శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు సాక్షి బళ్లారి: గుప్త నిధుల కోసం శివలింగం వద్ద దుండగులు తవ్వి పక్కన పడేశారు. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా మడదికెరె ఫిర్కా పరిధిలోని సన్నకిట్టదహళ్లి గ్రామ శివార్లలో ఉన్న నింగప్పనగుడ్డలో వెలసిన ఈశ్వర ఆలయంలో గుప్త నిధులున్నాయని ఆశపడిన దుండగులు ఆలయంలోని శివలింగాన్ని తవ్వడం కలకలం రేపింది. చుట్టుపక్కల గ్రామాలకు ఆరాధ్యదైవమైన ఈశ్వరుని గుడిలో గుప్త నిధుల కోసం ఏకంగా శివలింగాన్ని తవ్వి పక్కన పెట్టడంతో శివభక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై హొసదుర్గ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టర్ల విడుదల రాయచూరు రూరల్ : నగరంలో ఉర్దూ అకాడమి ఆధ్వర్యంలో శుక్రవారం సాహిత్యం(ముశాయిరా)పై పోస్టర్లను విడుదల చేశారు. నగరంలోని శమీం భవనంలో కవితలు, సాహిత్యం గురించి మైనార్టీలకు వివరించడానికి ఉర్దూ అకాడమి ఆధ్వర్యంలో జరగనున్న ముశాయిరాను ఈనెల 24 నుంచి ఏర్పాటు చేశామని రాష్ట్ర ఉర్దూ అకాడమి అధ్యక్షుడు ముఫ్తి మహ్మద్ అలీ ఖాజీ అన్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో అధికంగా ఉన్న మైనార్టీలకు సాహిత్యం, కవిగోష్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇఫ్తికార్, ఇర్ఫాన్, ముబీన్, ఇజాజ్ పాషా, అనీస్ సిద్దికిలున్నారు. -
జానపద కళలపై ఆసక్తి పెంచుకోవాలి
రాయచూరు రూరల్: జానపద కళలపై ఆసక్తిని పెంచుకోవాలని మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి పిలుపు ఇచ్చారు. శనివారం ప్రైవేట్ మెడికల్ కళాశాలలో అంతర్జాతీయ జానపద దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో అంతరించి పోతున్న కళలను, కళాకారులకు అన్ని విధాలుగా లాభాలు చేకూర్చేలా కళలు కాలరాసి పోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. మొబైల్ రావడంతో పాత కాలం నాటి పదాలకు కవితలకు, సాహిత్యాభిరుచికి విలువ లేకుండా పోయిందన్నారు. విద్యార్థులకు విద్యార్జనకు తోడు జానపద పాటలపై ఉపాధ్యాయులు తమ వంతు బాధ్యతలు నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో శరణప్ప, బాలాజీ, అయ్యప్పయ్య, బాబురావు, ప్రతిభలున్నారు. -
శ్రామిక భవనం నిర్మించండి
బళ్లారి అర్బన్: జిల్లాలో కట్టడ తదితర నిర్మాణ కార్మికులు 55 వేల మందికి పైగా ఉన్నారని, అసంఘటిత రంగంలోని కార్మికులు 50 వేలకు మించి రవాణా సంబంధిత కార్మికులు మరో 15 వేల మంది ఉన్నారని, వారి కుటుంబాల సంక్షేమానికి శ్రామిక భవనం నిర్మించాలని కళ్యాణ కర్ణాటక కట్టడ కార్మికుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వారు సంఘం తరఫున కమిషనర్కు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. కార్మికులకు తమ బంధు మిత్రులు, కుటుంబ సభ్యుల వివాహాలు, ఇతర ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, కార్మిక శాఖలో కార్మికుల సౌకర్యాల గురించి జాగృతి అభియాన్, సంబంధిత శాఖ తదితర కార్యక్రమాలు, ఇతర వేడుకలు నిర్వహించుకోడానికి జిల్లా కేంద్రంలో శ్రామిక భవనం లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్మిక వర్గాల అనుకూలం కోసం కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మిక భవనాన్ని నిర్మించాలని కళ్యాణ కర్ణాటక కార్మిక సంఘం సంస్థాపక అధ్యక్షుడు ఎం.మల్లేష్ ఇటీవల దావణగెరె కార్మిక శాఖ ఏఎల్సీ కమిషనర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం పదాధికారులు తదితరులు పాల్గొన్నారు. బెళగావికి డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్టు ● 50 కేజీల గంజాయి, రూ.30 లక్షల విలువైన మత్తు పదార్థాల జప్తు సాక్షి,బళ్లారి: కుందానగరి బెళగావిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని సూత్రధారి ఇస్మాయిల్ సద్దాం సయ్యద్, తాజీర్ బస్తావాడే, రథమేషలాడ్, తేజస్ వాజరే, శివకుమార్ హసబే, రంజాన్ జమాదార, తాజీబ్ ముల్లా, అనురాధ అరెస్ట్ అయిన నిందితులు. బెళగావి సీఈఎన్ సీఐ బీఆర్ గడ్డేకర్ బృందం భారీ కార్యాచరణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. బెళగావిలో విద్యా సంస్థల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి, పెన్ని, హెరాయిన్ విక్రయించే దందాలో సదరు ముఠా సభ్యులు మునిగిపోయిన క్రమంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానం రాయచూరు రూరల్ : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపద, అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య సూచించారు. శనివారం నగరంలోని రక్తనిధి కేంద్రంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, రోటరీ క్లబ్, రిమ్స్ల ఆధ్వర్యంలో జరిగిన రెండో రోజు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తం పుట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. రక్తదానం చేయడంతో ఇతరులకు ఉపయోగపడుతుందన్నారు. రక్తం ఇవ్వడం వల్ల మనిషి దేహంలో కొత్త రక్తం పుడుతుందన్నారు. విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారి వెంకటేష్ నాయక్, డాక్టర్ శ్యామణ్ణ, వెంకటేష్ నాయక్, లక్ష్మీకాంతరెడ్డి, గిరీష్, రాజేంద్ర, నీలోఫర్లున్నారు. చెలరేగిన మహిళా దొంగలు ● కత్తులతో బెదిరించి దోపిడీ కణేకల్లు: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు వద్ద ఓ ప్రయాణికురాలిని మహిళా దొంగలు కత్తులతో బెదిరించి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు... కణేకల్లుకు చెందిన యశోద అనే మహిళ రెండ్రోజుల క్రితం తుమకూరు జిల్లా కుణిగల్లో ఉన్న కూతురు ఇంటికెళ్లింది. శనివారం స్వగ్రామానికి బయలుదేరింది. సాయంత్రం కళ్యాణదుర్గం–బళ్లారి బస్సు ఎక్కింది. కణేకల్లు క్రాస్లో ఈమె బస్సు దిగాల్సి ఉండగా... నలుగురు మహిళలు పక్కా ప్లాన్తో వారు కూడా దిగుతున్నట్లు బ్యాగులు సర్దుకొని దిగేలా నటించి బస్టాప్ దాటిపోయేలా చేశారు. పెట్రోల్ బంకు సమీపంలో ప్రయాణికురాలు బస్సు ఆపమనడంతో ఆమెతో పాటు నలుగురు మహిళలు ఊరి బయట బస్సు దిగారు. ఒంటరిగా ఉన్న యశోదను మహిళలు కత్తులు చూపించి నీ వద్ద ఉన్న డబ్బులు, ఆభరణాలను ఇవ్వాలని, లేకుంటే చంపుతామని బెదిరించడంతో భయపడింది. ఆమె తన హ్యాండ్బ్యాగులో ఉన్న సుమారు 11 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చేయగా తీసుకుని మహిళలు పరారయ్యారు. బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా దొంగల హల్చల్ స్థానికంగా కలకలం సృష్టించింది. -
కెమెరా దృశ్యకావ్యం
బనశంకరి: కెమెరా నేత్రం ఎన్నో అద్భుతాలకు ఆవిష్కారం, ఓ మంచి ఫోటో జీవితాంతం గుర్తుంటుంది. అందుకే ఫోటోగ్రఫీ కళ అంత ప్రాముఖ్యంగా మారింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాల సందర్భంగా బెంగళూరులోని చిత్రకళా పరిషత్లో యూత్ ఫోటోగ్రఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఛాయాచిత్ర ప్రదర్శన కళాప్రియులకు కనువిందు చేస్తోంది. పరిషత్లోని దేవరాజ్ అరస్ గ్యాలరీలో యూత్ ఫోటోగ్రఫిక్ సొసైటీ సభ్యులు, ఛాయాగ్రాహకులు తమ కెమెరాలలో బంధించిన పనోరమిక్ ఛాయాచిత్రాలు అబ్బురపరుస్తాయి. శనివారం నుంచి ప్రదర్శన ప్రారంభమైంది. నగరవాసులు, ఛాయాచిత్రప్రియులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఫోటోగ్రఫీ ఔత్సాహికులు కూడా పాల్గొని మెళకువలు తెలుసుకున్నారు. నేడు వినూత్న పోటీలు ప్రదర్శనలో విభిన్న రకాల ఛాయాచిత్రాలు కొలువుతీరాయి. ఫోటోలు, సెల్ఫీలు తీసుకుని జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాన్వాస్ ఛాయాచిత్ర ప్రదర్శన, ఫోటోబూత్– కుటుంబచిత్రాలను తీసి ఫ్రేమింగ్ చేయడం, షూట్, షేర్ అండ్ విన్ వంటి వివిధ పోటీలు జరుగుతాయి. ఔత్సాహిక, వృత్తిపరమైన ఫోటోగ్రాఫర్లు, ప్రజలు పాల్గొని బహుమతులు పొందవచ్చని తెలిపారు. చిత్రకళా పరిషత్లో ఛాయాచిత్ర మేళా ఆకర్షించే వైవిధ్య ఫొటోలు -
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ రైడ్స్.. నోట్ల కట్టలు.. నగల గుట్టలు
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) శనివారం అరెస్ట్ చేసింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై గ్యాంగ్టక్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. వీరేంద్ర పలు అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు నడుపుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఆయన సోదరుడు కేసీ తిప్పేస్వామి దుబాయ్లో మూడు సంస్థలు ద్వారా గేమింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. గ్యాంగ్టాక్లో కాసినో స్థలాన్ని లీజుకు తీసుకునే ప్రయత్నంలో ఉన్న సమయంలో వీరేంద్రను అరెస్ట్ చేశారు.ఈ బెట్టింగ్ రాకెట్ కార్యకలాపాలు దుబాయ్ కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ అరెస్టు క్రమంలో ముందుగా దేశవ్యాప్తంగా వీరేంద్రకు సంబంధించిన 30 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో దాడులు జరిపింది. 22, 23(శుక్ర, శని) తేదీల్లో సిక్కిం, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవాతో సహా పలు రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. గోవాలోని ఐదు ప్రముఖ కాసినోలపై కూడా దాడులు జరిగాయి. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదు, బంగారం బయటపడ్డాయి. ఈడీ సోదాల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.తనిఖీల్లో సుమారు రూ. 12 కోట్ల నగదు, రూ. 6 కోట్ల విలువైన గోల్డ్ ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన నగదులో దాదాపు కోటి రూపాయల విలువైన విదేశీ కరెన్సీని కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. నాలుగు ఖరీదైన వాహనాలను సీజ్ చేయడంతో పాటు వీరేంద్రకు చెందిన 17 బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. రెండు బ్యాంక్ లాకర్లను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. -
కాలభైరవ.. దేశీయ రిమోట్ యుద్ధ విమానం
బెంగళూరు: బెంగళూరుకు చెందిన ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్(ఎఫ్డబ్ల్యూడీఏ) సంస్థ మొట్టమొదటిసారిగా దేశీయంగా మీడియం అల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యురెన్స్(మేల్) రిమోట్ యుద్ధ విమానం ‘కాల భైరవ’ను సిద్ధం చేసింది. సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో సుహాస్ తేజస్కంద దీనిని శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. కాల భైరవుని స్ఫూర్తితో ఈ విమానం డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి దేశీయంగానే పూర్తి చేశామని వివరించారు. కాల భైరవ విమానం 3 వేల కిలోమీటర్ల దూరం 30 గంటలపాటు ఏకబిగిన ప్రయాణించగలదన్నారు. దక్షిణాసియాలోని ఒక దేశం నుంచి ఇప్పటికే 25 లక్షల డాలర్ల విలువైన ఒక ఆర్డర్ వచ్చిందని వివరించారు. అమెరికా నుంచి మన ప్రభుత్వం కొనుగోలు చేసే ఒక్కో రిమోట్ ప్రిడేటర్ విమానం ఖరీదు రూ.1,000 కోట్లు కాగా, అదే ఖర్చుతో 10 కాల భైరవలను దేశీయంగా సొంతం చేసుకోవచ్చని, ఇందులో ఒకటి దెబ్బతిన్నా లక్ష్య సాధనలో ఎటువంటి మార్పు ఉండదని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న విధానాలు, అమెరికా ప్రభుత్వ ఆంక్షల నడుమ భారత ప్రభుత్వం యుద్ధ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడరాదని ఆయన తెలిపారు. వేరే దేశాల వంక చూడటం వల్ల మన వ్యూహాత్మక స్వాతంత్య్రం దెబ్బతింటుందని, రహస్య సమాచారం లీకయ్యే ప్రమాదముందని సుహాస్ పేర్కొన్నారు. -
మారెమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
చెళ్లకెర రూరల్: మధ్య కర్ణాటక ఆరాధ్య దేవత గౌరసముద్ర మారెమ్మ దేవి జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఓబన్న తెలిపారు. శుక్రవారం జాతర జరిగే తుమ్మల ప్రదేశాన్ని అధికారులతో కలసి పరిశీలించారు. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరగడం వల్ల పార్కింగ్ వ్యవస్థ కోసం పోలీసుల సహకారం అవసరమన్నారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతర జరిగే తుమ్మల వద్ద అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రేహన్ పాషా, డీవైఎస్పీ టీటీ రాజన్న, సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతప్ప, గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. -
తగ్గని వరద ప్రవాహం
రాయచూరు రూరల్: కర్ణాటక ఎగువ భాగంలో నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఉత్తర, కళ్యాణ కర్ణాటకలో బెళగావి, విజయపుర, బాగల్ కోట, కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల్లో వరద ప్రవహిస్తోంది. శనివారం నారాయణ పుర డ్యాం నుంచి 2.65 లక్షల క్యూసెక్కుల నీటిని వదలారు. దేవదుర్గ తాలూకా కోప్పర రహదారి పూర్తిగా కొట్టుకుని పోయింది. దేవదుర్గ తాలుకా హువిన హడగలి, శహపూర తాలుకా కోళూరు వంతెనపై వరద నీరు ప్రవహించడంతో కలబుర్గికి రాకపోకలు స్థంభింపజేశారు. ప్రవాహ పరిస్థితిపై జిల్లాధికారి నీతిష్ అధికారులతో చర్చించారు. యాదగిరి జిల్లా సురుపురలో జిల్లాధికారి హరీష బోయర్, ఎస్పీ పృథ్వీ శంకర్ పరీశీలించారు. హువిన హడగలి వద్ద బసవేశ్వర దేవాలయం నీటి మునిగింది. తుంగభద్ర, కృష్ణా నది తీర ప్రాంతాల్లోకి నీటి ప్రవాహం రావడంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు సహకరించాలని జిల్లాధికారి నీతిష్ సూచించారు. శుక్రవారం కార్యాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు ఇచ్చారు. తుంగభద్ర తీరంలో మాన్వి, రాయచూరు, గిల్లేసూగురు, కృష్ణా నది తీరంలో దేవసూరు, దోంగ రాంపూర్, అత్కూర్, బూడిద పాడు, నారద గడ్డ దత్తాత్రేయ దేవాలయం ప్రాంతాల ప్రజల రక్షణకు ముందుండాలని సూచించారు. వాగులు, వంతెనలపై ప్రవహిస్తున్న నీరు నారాయణ పుర డ్యాం నుంచి 2.65 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన -
వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లు
హుబ్లీ: జిల్లాలో కురిసిన కుండపోత వర్షాలకు గత 24 గంటల్లో జిల్లాలోని వివిధ తాలూకాల్లో 34 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇందులో హుబ్లీ 10, కుందగోల 2, హుబ్లీ నగరం 9, కలగటిగి 7, నవలగుంద తాలూకాలో 6 ఇళ్లు ఉన్నాయి. మానవులు, జంతువులకు ఎటువంటి హాని జరగలేదని సంబంధిత అధికారులు నిర్వహించిన సంయుక్త సర్వే ప్రగతి పథంలో ఉందని జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గణపతి ఉత్సవాల్లో డీజేలపై నిషేధంరాయచూరు రూరల్: గణేశుడి ఉత్సవాల్లో డీజేలపై నిషేధం విధించినట్లు నగర సభ అధ్యక్షురాలు నరసమ్మ స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె నగరంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలో ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని తెలిపారు. 27న వినాయకులను ప్రతిష్టించి, 31న నిమజ్జనం చేయాలని సూచించారు. రాత్రి 10 గంటల తరువాత డీజేలను వినియోగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బైక్ చోదకుడి మృతి హుబ్లీ: బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో చోదకుడు ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటన హుబ్లీ తాలూకా కుసుగల్లు గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామ నివాసి పవన్ ఏనగి (20) మృతుడు. పని ముగించుకుని హుబ్లీ నుంచి కుసుగల్లు గ్రామానికి బైకులో వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఘటనలో పవన్ ఏనగికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు హుబ్లీ గ్రామీణ పోలీసులు తెలిపారు. పల్లకీలో ఊరేగిన శ్రీకృష్ణుడు రాయచూరు రూరల్: నగరంలో శుక్రవారం మహిళా సమాజ్ భక్తులు శ్రీకృష్ణుడికి పల్లకీ సేవ నిర్వహించారు. తొలుత కృష్ణుడి చిత్రపటాన్ని సుందరంగా అలంకరించిన పల్లకీలో కొలువుదీర్చి, పురవీధుల్లో ఊరేగించారు. త్రైత సిద్దాంత భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. హిందూ ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. ఆదికర్త ఆచార్య ప్రభోదాంనద యోగీశ్వరుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయుర్వేద పతంజలి సంచాలకులు సురేష్ పాల్గొన్నారు. హంపీ వీధుల్లో పోలీసుల కవాతు హొసపేటె: గణేష్, మిలాద్–ఉన్–నబీ పండుగల నేపథ్యంలో శుక్రవారం హంపీ, కమలాపుర్ పోలీసులు గురువారం వీధుల్లో కవాతు నిర్వహించారు. హంపీ, కద్దిరాంపుర, కమలాపురం, హోసమలపన గుడి, గాలేమ్మన గుడితో పాటు తదితర గ్రామాల్లో కవాతు కొనసాగింది. పండుగల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కన్నడ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి రాయచూరురూరల్: గడినాడు ప్రాంతాల్లో కన్నడ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ పాదంగళ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల మఠంలో ప్రథమ కన్నడ అంతరాష్ట్రీయ కన్నడ సాహిత్య సమేళనం ప్రారంభించారు. స్వామీజీ మాట్లాడుతూ.. భాషలో నేటికి తెలుగు, మరాఠీ, కన్నడ కలిపి వాఖ్యనించడం, మాట్లడటం జరుగుతోందన్నారు. భవిష్యత్తులో కన్నడ భాషకు అధిక ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. అన్యభాషలను గౌరవిస్తూ కన్నడకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, యువకులు కన్నడ భాషను ఇనుమడింప చేసేందుకు చేసిన పోరాటాలను గుర్తించాలన్నారు. 1980లో కన్నడ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆందోళన చేసిన విషయాన్ని ప్రస్తావించారు. -
‘రక్తదానంతో ప్రాణాలు కాపాడొచ్చు’
రాయచూరురూరల్: సమాజంలో ఆపద, అత్యవసర సయమంలో రక్తదానం చేయడానికి యువకులు ముందుకు రావాలని ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని ఎల్వీడి కళాశాల మైదానంలో ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం, జిల్లా పంచాయీఈ, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, రోటరీ క్లబ్, రిమ్ష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంచాలకురాలు స్మిత మాట్లాడుతూ.. రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తం ఉత్తత్తి అయ్యేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. రక్తదానంతో మరొకరి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇది స్ఫూర్తిదాయకం కావాలన్నారు. కార్యక్రమంలో డా.శ్యామణ, వెంకటేష్ నాయక్, లక్ష్మీకాంత రెడ్డి, గిరీష్, రవి, సుఖాణి, రాజేంద్ర, త్రివిక్రం జోషి, నీలోఫర్, శ్రీశైల అమరఖేడ, కేశవ రెడ్డి, రాజణ్ణ, నాగరాజ తదితరులు పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు రక్తదాన శిబిరాలు బళ్లారిటౌన్: స్థానిక పార్వతీ నగర్లో ఉన్న శివధ్యాన మందిరంలో శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కన్వీనర్ బీకే నిర్మల తెలిపారు. శుక్రవారం విశ్వవిద్యాలయ ఆవరణలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈనెల 25న రాజయోగిని దాది ప్రకాష్ మణిజి జ్ఞాపకంగా భారత రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో విశ్వబంధుత్వం దినోత్సవాన్ని జరుపుకున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా లక్ష మంది నుంచి రకాన్ని సేకరించేందుకు లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 65 ఏళ్లలోపు వారు రక్తదానం చేయవచ్చన్నారు. బళ్లారిలో 250 మంది నుంచి సేకరించిన రక్తాన్ని స్థానిక బీమ్స్ రక్త బంధనానికి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో విశ్వవిద్యాలయం నేతలు మంజుళ, రాజేశ్వరి, రష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘పంచ గ్యారెంటీలు’ ప్రచారం చేయాలి
రాయచూరురూరల్: గ్రామాల్లో సర్కార్ అమలు చేసిన పంచ గ్యారెంటీలను ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలని రాయచూరు వాల్మీకి మహర్షి విశ్వ విద్యాలయం సేనేట్ సభ్యుడు చెన్న బసవ తెలిపారు. శుక్రవారం తాలుకాలోని మన్సలాపూర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం అమలు చేసిన గ్యారెంటీల ద్వారా మహిళలు, విద్యార్థులు, యువకులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచ గ్యారెంటీల అధ్యక్షుడు పవన్ పాటిల్, మౌనేస్ నాయక్, వెంకటేష్ నాయక్, మంజునాథ్, ఈరమ్మ, దేవమ్మ, చెన్నమ్మ, శారద, మహేష్ గౌడ, లక్ష్మి, శరణే గౌడ తదితరులు పాల్గొన్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు అందజేత హొసపేటె: సీఐఈఆర్ పొన్సల్ ద్వారా విజయనగర జిల్లా కొట్టూరు పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కనుక్కునేందుకు ఆపరేషన్ చేపట్టారు. కొట్టూరు పోలీస్ స్టేషన్లో సీఐఈఆర్ పొన్సల్ ద్వారా నమోదైన కేసుల్లో దాదాపు రూ.4,25,000 విలువైన మొత్తం 25 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కూడ్లిగి డీవైఎస్పీ మల్లేష్, దొడ్డమణి సీఐ దురుగప్ప ఆధ్వర్యంలో పోగొట్టుకున్న మొబైల్స్ను ఫిర్యాదుదారులకు అందజేశారు. మొబైల్స్ కనుక్కునేందకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ను విజయనగరం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అరుణంగ్లుగిరి ప్రశంసించారు. ఖాస్ బావిలో శుభ్రత పనులు రాయచూరు రూరల్: నగరంలో పవిత్ర క్షేత్రమైన ఖాస్ బావి శుభ్రతకు అధికారులు శ్రీకారం చుట్టారు. శుక్రవారం సాయంత్రం నగర సభ కమిషనర్ జుబీన్ మోహ పాత్రో ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విగ్రహాల నిమజ్జనం, భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఖాస్ బావి వద్ద పరిశుభ్రత పనులు చేయించారు. జేసీబీతో బావిలో పూడిక తీయించారు. అలాగే రహదారిపై పడిన గుంతల్లో మట్టి వేయించి చదును చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అప్పు చెల్లించనందుకు ఉపాధ్యాయుడిపై దాడిరాయచూరురూరల్: తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించక పోవడంతో ఓ ఉపాధ్యాయుడిపై గ్రామ పంచాయతీ సభ్యుడు దాడి చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. లింగసూగురు తాలుకా ముదుగల్లో ప్రభుత్వ పాఠశాలలో హనుమంతు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అవసరం కోసం గ్రామ పంచాయతీ సభ్యుడు వీరణ్ణ వద్ద బంగారు అభరణాలు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పు చెల్లించాలని వీరణ్ణ పలుమార్లు ఉపాధ్యాయుడు హనుమంతును కోరారు. అయినా అప్పు చెల్లించకపోవడంతో దాడి చేశాడు. గాయపడిన ఉపాధ్యాయుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ రోటవేటర్కు చిక్కి కొండచిలువ మృతికోలారు: ట్రాక్టర్తో దున్నుతుండగా రోటవేటర్కు చిక్కి కొండచిలువ మరణించిన ఘటన తాలూకాలోని హెచ్.మల్లండహళ్లిలో జరిగింది. దేవరాజ్ అనే రైతు పొలంలో కొత్తిమీర సాగుకు రోటవేటర్తో భూమిని దున్నుతుండగా దానికి చిక్కి కొండచిలువ తీవ్రంగా గాయపడింది. వెంటనే గ్రామస్తులు స్నేక్ ఆనంద్కు సమాచారం ఇచ్చారు. అయితే తీవ్రంగా గాయపడిన కొండ చిలువ అంతలోనే మరణించింది. విషయం తెలిసి అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 4 ఏళ్ల వయస్సు, 10 అడుగుల పొడవు కలిగిన కొండచిలువను అటవీ సిబ్బంది, గ్రామస్తులు పూడ్చిపెట్టారు. కేంద్ర గ్రంథాలయం తనిఖీకోలారు: నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని జిల్లాధికారి డాక్టర్ ఎంఆర్ రవి సందర్శించారు. గ్రంథాలయంలోని రీడింగ్ రూం, పుస్తకాల గదులను పరిశీలించారు. గ్రంథాలయంలో లభిస్తున్న సౌకర్యాల గురించి పాఠకులను ఆరా తీశారు. పోటీ పరీక్షలను రాసే విద్యార్థులు గ్రంథాలయంలో లభించే పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రంథాలయంలో అంబేడ్కర్ కేంద్రాన్ని ప్రారంభించడానికి స్థలం గుర్తించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే గ్రంథాలయంలో చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తులో పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అవసరమైన మరిన్ని పుస్తకాలను తెప్పిస్తామన్నారు. గ్రంథాలయానికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ అధికారి ఎన్.గణేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
హొసపేటె: గౌరీ గణేష్, మిలాద్–ఉన్–నబీ పండుగలు ఒకే సమయంలో వచ్చాయి. పండుగలను సామరస్యంతో జరుపుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్ ఎంఎస్ దివాకర్ తెలిపారు. శుక్రవారం నగరంలోని ఇండోర్ స్టేడియంలో గౌరీ, ఈద్ మిలాద్ ఉత్సవాల సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించారు. జిల్లా మేజిస్ట్రేట్ ఎంఎస్ దివాకర్ మాట్లాడుతూ.. శాంతి, సామరస్యానికి ప్రసిద్ధి చెందిన విజయనగరం జిల్లాకు చెడ్డపేరు తీసుకుని రాకుండా.. అన్ని మతాల ప్రజలు కలిసి పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. పండుగ సందర్భంగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. ఆస్పత్రులు పాఠశాలలు సహా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని తెలిపారు. సింగిల్ విండో వ్యవస్థ కింద గణేష్ ప్రతిష్టకు అవసరమైన స్థలం, పెండల్, విద్యుత్ కనెక్షన్ కోసం సంబంధిత స్థానిక అధికారుల అనుమతి పొందాలని పేర్కొన్నారు. గణేష్ విగ్రహాల ఊరేగింపు సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. శాంతిభద్రతల ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మంజునాథ్, డీవైఎస్పీలు టి.మంజునాథ్, వెంకటప్ప నాయక్, అన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్లు వివిధ తాలుకాలకు చెందిన గణేష్ ప్రతిష్టాపన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు మరమ్మతు చేయాలని 25న ధర్నా
కోలారు: జిల్లాలో అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న కోలారు– శ్రీనివాసపురం రహదారిలో వీరాపుర గేట్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నారాయణగౌడ తెలిపారు. శుక్రవారం నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రహదారులు అధ్వాన స్థితిలో ఉండడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతుండటంతో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అమాయకుల ప్రాణాలు బలైపోతున్నాయన్నారు. కాంట్రాక్టర్లు రహదారులను నాణ్యత లేకుండా నిర్మిస్తుండటం వల్ల నిర్మించిన కొద్ది రోజులకే అవి గుంతలు పడుతున్నాయన్నారు. ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోగా మరెంతో మంది కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నారన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల బాధ్యతారాహిత్యం వల్లే ఇదంతా జరుగుతోందన్నారు. వర్షం వస్తే గుంతల్లో నీరు నిలిచి మరింత ప్రమాదకరంగా మారుతోందన్నారు. అధికారుల కళ్లు తెరిపించడం కోసం ధర్నా చేస్తున్నామన్నారు. జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్, రాష్ట్ర సంచాలకుడు బంగవాది నాగరాజు, తేర్నహళ్లి అంజినప్ప పాల్గొన్నారు. -
ఆక్రమిత నగరసభ స్థలం స్వాధీనం
కోలారు: నగరంలోని ఖాద్రిపుర సమీపంలోని 6.1 ఎకరాల నగరసభ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి నగరసభ అధికారులు శుక్రవారం స్థలానికి వెళ్లి ఆక్రమణలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. నగరసభ స్థలానికి అధికారులు రెండు నెలల క్రితం కంచె వేసి భద్రపరిచారు. అయితే ఈ మధ్య కొంతమంది కోర్టుకు వెళ్లామని ఆ స్థలంలో నామఫలకం వేశారు. నగరసభ అమర్చిన బోర్డును తొలగించి బెంగళూరు కోర్టులో దావా ఉందని తెలిపి మరో నామఫలకాన్ని ఉంచారు. దీనిని కొందరు నగరసభ దృష్టికి తేవడంతో కమిషనర్ నవీన్చంద్ర, అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ సిబ్బందితో స్థలానికి వెళ్లారు. ఆక్రమణలను, ఆక్రమణదారులు వేసిన నామఫలకాలను తొలగించారు. ఆ సమయంలో అక్కడికి చేరిన కొంతమంది ఈ స్థలం తమదని గొడవ చేశారు. మొదలు రికార్డులు తీసుకు రమ్మని, తరువాత పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. స్థలం వద్ద ట్రెంచ్ నిర్మించడానికి తెచ్చిన జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరసభకు చెందిన ఈ స్థలంలో వసతి రహితులకు ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. -
తెల్లవారుజామునే తలుపు తట్టిన ఈడీ
బనశంకరి/చెళ్లకెర రూరల్: గతంలో ఈడీ దాడులు ఎదుర్కొన్న చిత్రదుర్గ ఎమ్మెల్యే, నటుడు దొడ్డణ్ణ అల్లుడు కేసీ.వీరేంద్ర(పప్పి) ఇళ్లు, కంపెనీలపై మరోసారి ఈడీ పంజా విసిరింది. అక్రమ నగదు బదిలీ ఆరోపణలతో శుక్రవారం వేకువజామునే ఈడీ అధికారులు బెంగళూరు, చిత్రదుర్గతో పాటు 17 చోట్ల దాడులు నిర్వహించారు. బెంగళూరు, చెళ్లకెరె, చిత్రదుర్గ, గోవాతో పాటు 17 చోట్ల దాడులు చేసి సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు ఫైళ్లను పరిశీలించారు. బెంగళూరు వసంతనగరలోని ఎమ్మెల్యే వీరేంద్ర ప్రైవేటు అపార్టుమెంట్, సహకారనగరలోని ఇళ్లపై దాడి చేశారు. చెళ్లకెరెలో ఎమ్మెల్యే నివాసంతో పాటు అతడి సోదరులైన కేసీ.నాగరాజ్ , కేసీ.తిప్పేస్వామి నివాసాల్లో 10 మంది ఈడీ అధికారుల సోదాలు చేపట్టారు. వీరేంద్ర యాజమాన్యంలో అనేక కంపెనీలను టార్గెట్గా చేసుకుని దాడి చేసిన ఈడీ అధికారులు రత్నా గేమింగ్ సొల్యూషన్స్, రత్నా గోల్డ్ కంపెనీ, రత్నా మల్టీస్టోర్స్ కంపెనీ, పప్పి టెక్నాలజీస్ కంపెనీ, పప్పి టూర్స్ అండ్ ట్రావెల్స్, పప్పి స్పేర్ బాక్స్ కంపెనీలపై దాడి చేశారు. ఎమ్మెల్యేకు చెందిన ఇళ్లలో కిలోకు పైగా బంగారం లభ్యమైంది. సిక్కిం పర్యటనలో ఉన్న వీరేంద్రను కోల్కతా ఈడీ బృందం అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకు వస్తుండగా ఎలాంటి సమయంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. చిత్రదుర్గ, చెళ్లకెరెలో గేమింగ్ యాప్నకు సంబంధించి నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం. గోవా రాజధాని పనాజీలో మెజిస్టిక్ ప్రైడ్ అనే క్యాసినో నిర్వహిస్తున్న హవాలా కుంభకోణం కింగ్పిన్ సుమందర్సింగ్ హుబ్లీ దేశపాండే నగరలోని కామాక్షీ అపార్టుమెంట్పై ఈడీ అధికారులు దాడి చేశారు. కర్ణాటక, గోవా, సిక్కింతో పాటు మొత్తం 17 చోట్ల ఒకే సారి ఈడీ అధికారులు దాడి చేసి కీలక ఫైళ్లు, పత్రాలు, బ్యాంక్ లావాదేవీలు, స్దిరచరాస్తుల ఆచూకీని కనిపెట్టారు. గతంలో 2016 డిసెంబరు 11 తేదీన కేసీ.వీరేంద్ర ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. బాత్రూమ్లో రూ.5 కోట్లకు పైగా నగదు, 30 కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర ఇళ్లు, కంపెనీలపై దాడులుకాంగ్రెస్ నాయకురాలి ఇంటిలో.. 2023 శాసనసభ ఎన్నికల్లో రాజరాజేశ్వరినగర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ నాయకురాలు కుసుమా హనుమంతరాయప్ప ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేశారు. వీరేంద్రపప్పితో ఆర్థిక వ్యవహారాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. అన్నపూర్ణేశ్వరినగర ముద్దనపాళ్య నివాసం, చంద్రా లేఔట్లోని కార్యాలయంపై ఈడీ అధికారులు దాడి చేసి ఫైళ్లను పరిశీలించారు. -
శోకసంద్రమైన రంజోళ గ్రామం
● హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి చేరిన మృతదేహాలు దొడ్డబళ్లాపురం: కలబుర్గి జిల్లా సేడం తాలూకా రంజోళ గ్రామం శోకసంద్రలో మునిగిపోయింది. గ్రామానికి ఐదు మంది హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకోగా వారి మృతదేహాలు శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్నాయి. నరసింహ(60), భార్య వెంకటమ్మ(55) వీరి కుమారుడు అనిల్(32), కుమార్తె కవిత(24), మనవడు అప్పు(2)లు హైదరాబాద్లోని మియాపూర్లో మృతిచెందారు. ఆర్థిక సమస్యలతో సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అయితే వారి మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమగ్రంగా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. మృత దేహాలకు గ్రామస్తులు చందాలు వేసుకుని దహనసంస్కారాలు నిర్వహించారు. పొట్టకూటి కోసం వెళ్లి విగతజీవులుగా వచ్చిన వారిని చూసి మృతుల బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. విచారణ కోసం ధర్మస్థలకు రాలేను ● పోలీసులకు సమీర్ లేఖ ● మరో కేసు నమోదు శివాజీనగర: ధర్మస్థల గురించి అపప్రచారం చేసిన ఆరోపణల కేసులో అరెస్ట్ భయాన్ని ఎదుర్కొంటున్న యూట్యూబర్ సమీర్కు మంగళూరులో జిల్లా సెషన్స్ న్యాయస్థానం గురువారం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం సమీర్కు వ్యతిరేకంగా చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. అరెస్ట్ భయంతో ఉన్న యూట్యూబర్ ఎండీ.సమీర్ బెళ్తంగడి సర్కిల్ ఇన్స్పెక్టర్కు లేఖ రాశాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంఽధించి లేఖ రాస్తున్నాను. తాను ధర్మస్థల స్టేషన్కు రావటానికి సాధ్యం. అయితే తన స్నేహితుడిపై ప్రాణాంతకమైన దాడి జరిగింది. టార్గెట్ చేసి యూట్యూబర్ స్నేహితుడిపై దాడి చేశారు. తనకు ప్రాణబెదిరింపు ఉంది. ప్రమాదముందని తెలుసుకొని తాను సెషన్ న్యాయస్థానంలో బెయిల్కు అప్లై చేశానని తెలిపారు. ఒకవేళ తాను ధర్మస్థల పోలీస్ స్టేషన్కు వస్తే తనకు భద్రత కల్పించండి. తాను కేసుకు సంబంధించి మీతో వీడియో కాల్ ద్వారా విచారణకు, అన్ని విధాలుగా తనిఖీకి సహకరిస్తాను. తనిఖీకి సహకరించేందుకు చిరునామా, తేదీ, తన భద్రత గురించి తెలియజేస్తే వస్తాను. 15 రోజుల గడువులోగా మీ ముందు హాజరవుతానని, దయచేసి తనకు భద్రత కల్పించాలని లేఖలో తెలియజేశారు. బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య బొమ్మనహళ్లి: ఆనేకల్ తాలూకా జిగణి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న హారగద్దె వి.ఎస్.ఎస్.ఎన్.బ్యాంకు మేనేజర్ ప్రకాశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన కొన్ని సంవత్సరాలుగా మేనేజర్గా పనిచేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. గురువారం సాయంత్రం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జిగణి పోలీసులు వెళ్లి పరిశీలించగా ఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. కొంతమంది వ్యక్తులు తనను బెదిరించి అక్రమంగా రుణాలు తీసుకున్నారని, తిరిగి చెల్లించాలని కోరితే వేధింపులకు పాల్పడుతున్నారని, గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకాష్ అందులో పేర్కొన్నట్లు ఉందని పోలీసులు తెలిపారు. ఎవరెవరు అక్రమంగా రుణాలు తీసుకున్నారనే పేర్లు కూడా అందులో పేర్కొన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
నేటి నుంచి యూత్ ఫొటోగ్రఫీ
బనశంకరి: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నేటి నుంచి బెంగళూరులోని చిత్రకళా పరిషత్లో యూత్ ఫొటోగ్రఫిక్సొసైటీ ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శన శనివారం నుంచి నగరవాసులను సందడి చేయనుంది. ఫొటోగ్రఫీపై ఆసక్తి కలిగిన ఔత్సాహికులు తమ ప్రతిభ కనబరచడానికి జాతీయ, అంతర్జాతీయ వేదికలో గుర్తింపు పొందడానికి ఆ సంస్థ ఈ వేదికను ఏర్పాటు చేసింది. యూత్ ఫొటోగ్రఫిక్ సభ్యులు తమ కెమెరాల్లో బంధించిన పనోరమ ఛాయాచిత్రాలను ప్రదర్శన ఉంటుంది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు కాన్వాస్ ఛాయాచిత్రాల ప్రదర్శన. ఫొటోబూత్–కుటుంబ చిత్రాలను తీసి ఫ్రేమింగ్ చేసే అవకాశం, షూట్, షేర్ అండ్ విన్, క్రీడా స్థలాల్లో కెమెరా, మొబైల్ వినియోగించి తీసిన చిత్రాలను ప్రదర్శించి బహుమతులు గెలుపొందవచ్చు. ప్రతి ఒక్కరూ హాజరుకావచ్చని సంస్థ అధ్యక్షుడు మంజు వికాస్ శాస్త్రి, గిరీశ్అనంతమూర్తి,ప్రేమ్కాకడే తెలిపారు. -
మండ్య జిల్లాలో షూటౌట్
మండ్య: నగల దుకాణాన్ని లూటీ చేయడంతోపాటు వృద్ధుడిని హతమార్చిన ఉదంతంలో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. ఈఘటన శుక్రవారం మళవళ్లి తాలూకా బీమనహళ్లిలో జరిగింది. మండ్య జిల్లా మళవళ్లి తాలూకా కిరుగావలులో మహాలక్ష్మి బంగారు నగల దుకాణం ఉంది. ఈనెల 16న రాత్రి దుండగులు గ్యాస్ కట్టర్తో షట్టర్ తొలగించి 110 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి చోరీ చేశారు. అదే సమయంలో దుకాణం పక్కన హోటల్ నిర్వహిస్తున్న మహదేవప్ప(65) దొంగలను చూశాడు. తమ నేరాన్ని ఎక్కడ బయట పెడతాడోనని దుండగులు అతన్ని గొంతు నులిమి హత్య చేశారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులు భీమనహళ్లిలో తలదాచుకున్నట్లు పక్కా సమాచారంతో సీఐ శ్రీధర్ తన సిబ్బందితో కలిసి వెళ్లాడు. లొంగిపోవాలని హెచ్చరికలు చేయగా నిందితుల్లో ఒకరైన కిరణ్ చాకుతో పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో సీఐ తన రివాల్వర్తో కాల్పులు జరపగా ఒక తూటా కిరణ్ కాలులోకి దూసుకెళ్లింది. గాయపడిన ఈచగెరె గ్రామానికి చెందిన నిందితుడు కిరణ్(24), కొత్తత్తి గ్రామానికి చెందిన ఆనంద్, శరత్, శ్రీనివాస్, కృష్ణాచారిని అరెస్ట్ చేశారు. కిరణ్ను మిమ్స్కు తరలించారు. దోపిడీదారులపై పోలీసుల కాల్పులు ఒకరికి గాయాలు ఐదుగురి అరెస్ట్ -
వీడియో: డిప్యూటీ సీఎం చర్యతో షాకైన ఎమ్మెల్యేలు
నిన్నగాక మొన్న ఆరెస్సెస్పై తీవ్ర విమర్శలు గుప్పించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. హఠాత్తుగా స్వరం మార్చారు. ఆరెస్సెస్ గీతాన్ని.. అదీ అసెంబ్లీలో సభ్యులందరి సమక్షంలో ఆలపించారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు బళ్లలు చరుస్తూ ఆయన్ని ప్రొత్సహించగా.. ఊహించని ఈ పరిణామంతో కాంగ్రెస్ సభ్యులు మౌనంగా చూస్తూ ఉండిపోయారు.కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారం అసెంబ్లీలో ఆరెస్సెస్ గీతాన్ని ఆలపించారు. బెంగళూరు ఆర్సీబీ వేడుకల్లో తొక్కిసలాట ఘటనపై చర్చ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రకరకాల కామెంట్లు, సెటైర్లు కనిపిస్తున్నాయి.చిన్నస్వామి తొక్కిసలాట ఘటనకు శివకుమారే బాధ్యుడంటూ బీజేపీ సభ్యులు అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు. అయితే బెంగళూరు ఇంచార్జి మంత్రిగా, కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ సభ్యుడి హోదాలో ఆర్సీబీ జట్టును కేవలం ప్రొత్సహించడానికే వెళ్లానని ఆయన వివరణ ఇచ్చారు. ప్లేయర్లను అభినందించి కప్ను ముద్దాడాక అక్కడితో తనతోనే తన పని అయిపోయిందని అన్నారాయన. అదే సమయంలో ఇలాంటి ఘటనలు వేరే రాష్ట్రాల్లోనూ జరిగాయని గుర్తు చేశారు.VIDEO | Karnataka Deputy CM DK Shivakumar (@DKShivakumar) recited the RSS’ Sangha Prarthana, ‘Namaste Sada Vatsale Matribhume’, while addressing the Assembly yesterday.(Source: Third party)(Full VIDEO available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/2CNsemZaq4— Press Trust of India (@PTI_News) August 22, 2025దీంతో.. ఆ సమయంలో, ప్రతిపక్ష నేత ఆర్. అశోక గతంలో డీకే శివకుమార్ ఆరెస్సెస్ చెడ్డీ (RSS యూనిఫాం) వేసుకున్నానని చేసిన వ్యాఖ్యను గుర్తు చేశారు. దీనికి స్పందనగా శివకుమార్ ఆరెస్సెస్ గీతం “నమస్తే సదా వత్సలే మాతృభూమే…” పాడారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ జోక్యం చేసుకుని.. ‘‘ఈ లైన్లు రికార్డుల నుంచి తొలగించవద్దని ఆశిస్తున్నా’’ అని అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఎలా స్పందిస్తారు?.. ఇదే పని వేరే ఎవరైనా చేసి ఉంటే ఈ పాటికే కాంగ్రెస్ చర్యలు తీసుకునేదేమో అని ఒకరు కామెంట్ చేస్తే.. అర్జంట్గా డీకేఎస్కు సీఎం పీఠం అప్పజెప్పకపోతే కాంగ్రెస్ చీలిపోయే ప్రమాదం ఉందని మరొకరు.. ఇది నిజంగానే షాకింగ్ రాజకీయ పరిణామమని ఇంకొకరు కామెంట్ చేశారు. అయితే.. చర్చ తీవ్రతరం కావడంతో డీకే శివకుమార్ తన చర్యపై స్పందించారు.నేను జన్మతః కాంగ్రెస్ వాదిని. ఒక రాజకీయ నేతగా స్నేహితులు, ప్రత్యర్థులు ఎవరో తెలుసుకోవడం నాకు అవసరం. నేను వాళ్లను అధ్యయనం చేశాను. బీజేపీతో చేతులు కలపడం అనే ప్రశ్నే లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం.. నాయకత్వం వహిస్తాను. జీవితాంతం కాంగ్రెస్లోనే కొనసాగుతాను అని స్పష్టత ఇచ్చారాయన.ఇదిలా ఉంటే.. పంద్రాగస్టు ఎర్రకోట ప్రసంగంలో ఆరెస్సెస్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు స్పందించగా.. డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ ఒక సంస్థగా ఉన్నా, దాని నైతికతను ప్రశ్నించాల్సిన అవసరం లేదని అన్నారు.అయితే కాంగ్రెస్కు సుదీర్ఘ చరిత్ర ఉందని.. ఆరెస్సెస్తో పోల్చలేనిదని పేర్కొన్నారు. ఈ క్రమంలో.. ఆరెస్సెస్ చాలా కాలం జాతీయ జెండాను ఎగురవేయలేకపోయిందని, వాజ్పేయి ముందడుగు వేసిన తర్వాతే అది సాధ్యమైంది వ్యాఖ్యానించారు. -
అతడొక దుర్మార్గుడు: ముసుగు మనిషి భార్య
కర్ణాటక : డబ్బుల కోసం ఆశపడి ఎవరో అన్నమాటలను పట్టుకొని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల పేరుకు మాయని మచ్చ తెచ్చేలా తన మాజీ భర్త ప్రవర్తించాడని ఫిర్యాదిదారు, ముసుగుమనిషి ఒకప్పటి భార్య ఆరోపించింది. అతనితో విడాకులు తీసుకున్న మండ్య జిల్లా నాగమంగళకు చెందిన మహిళ తన మాజీ భర్త గురించి మీడియాతో మాట్లాడారు. అతనిది కూడా మండ్య జిల్లానే. 25 ఏళ్ల కిందట మేం పెళ్ళి చేసుకున్నాం, అతడు నేత్రావతి స్నానాల ఘాట్లను శుభ్రం చేసే పనిలో ఉండేవాడు. 7 సంవత్సరాలపాటు కలిసి ఉన్నాం, మాకు ఒక మగ, ఒక ఆడ పిల్ల ఉన్నారు, కుమార్తెకు పెళ్లయింది. నా మాజీ భర్త నా మీద నిత్యం అనుమానంతో గొడవపడేవాడు, అతని బాధలు పడలేక విడాకులు తీసుకున్నా. అతడు ధర్మస్థల గురించి చెప్పేవన్నీ అబద్ధాలే అని మండిపడింది. ఆ మాటలే వినలేదు ధర్మస్థలలో అత్యాచారాలు జరిగేవని, నది పక్కన శవాలు పాతిపెట్టారని, నగలు దోచుకునేవారని నేను ఎప్పుడూ వినలేదు. నాతో భర్త ఎప్పుడూ అలా చెప్పలేదు. జరిగే ప్రచారమంతా అబద్ధం అని ఆమె పేర్కొంది. ఆ పుణ్యక్షేత్రం మీద ఏదో చేయడానికి కుట్రతో ఇలా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. తాము విడిపోయిన తరువాత అతడు మరొకరిని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. భరణం కోసం కోర్టుకు వెళ్తే, నాకు జీతమే రాదు, భోజనం మాత్రమే పెడతారు, ఏమీ ఇవ్వలేను అని కోర్టులో చెప్పాడన్నారు. పుట్టింటిలో తల్లి, పిల్లలతో కలిసి ఉంటున్నట్లు తెలిపింది. -
వితంతువుకు నిలువునా మోసం
చిక్కబళ్లాపురం: అండగా ఉంటానని వితంతువును పెళ్లి చేసుకొని గర్భిణిని చేసిన వ్యక్తి మరో వివాహం చేసుకున్నాడు. న్యాయం చేయాలని వెళ్లిన మొదటి భార్యపై కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈఘటన జిల్లా కేంద్రంలో జరిగింది. చిక్కబళ్లాపురం నగరంలో నివాసముంటున్న కీర్తి భర్త 2022లో మృతి చెందాడు. ఈ దంపతులకు కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం ఆమె ఓ ప్రైవేటు కంపెనీలో పనులకు వెళ్లేది. అక్కడ అంబిగానహళ్లికి చెందిన సునీల్తో పరిచయమైంది. అనంతరం ఇద్దరూ గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. రిజి్రస్టార్ కార్యాలయంలో వివాహాన్ని నమోదు చేయించారు. కొద్ది రోజులు వీరి కాపురం సవ్యంగా సాగింది. అనంతరం సునీల్ గొడవ పడుతుండగా పంచాయితీ పోలీస్స్టేషన్కు చేరింది. పోలీసులు మందలించడంతో కీర్తిని బాగా చూసుకుంటానని హామీ పత్రం రాసిచ్చాడు. ప్రస్తుతం కీర్తి ఎనిమిది నెలల గర్భిణి. అయితే సునీల్ మరో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి అంబిగానహళ్లిలోని సునీల్ ఇంటికి వెళ్లగా అతని తల్లిదండ్రులు దాడి చేశారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి కీర్తిని ఆస్పత్రికి తరలించారు. -
భూ వివాదం.. తండ్రీ తనయులపై దాడి
కోలారు : భూ వివాదం నేపథ్యంలో తండ్రీకొడుకులపై కొందరు వ్యక్తులు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన బంగారుపేట తాలూకా దాసరహొసహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. దాసరహొసహళ్లి గ్రామానికి చెందిన తండ్రీ కుమారులు మంజునాథ్, నవీన్కుమార్లకు అదే గ్రామానికి చెందిన కొందరితో ఎనిమిది గుంట్ల స్థలంపై వివాదం ఉంది. గురువారం తండ్రీ కొడుకులు పొలం నుంచి వస్తుండగా మురళి, సతీష్గౌడ, గిరీష్గౌడ, నారాయణప్పలు దాడి చేశారు. ఈమేరకు బాధితులు ఆస్పత్రిలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ప్రాణాలకు ముప్పు వస్తే వీరే కారణమన్నారు. బంగారుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ప్రతిభా వికాసానికి వేదిక అవసరం
హుబ్లీ: చిన్నారుల్లో ప్రతిభ వికాసానికి వేదిక అవసరం అని గౌతమబుద్ధ ఫౌండేషన్ కోశాధికారి లక్ష్మణ నాగరాళ అన్నారు. ఆయన గురువారం హక్కిహోండా ప్రభుత్వ ఆదర్శ కన్నడ బాలికల పాఠశాలలో క్విజ్, చిత్రలేఖన పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఆ ఫౌండేషన్ అధ్యక్షుడు మహంతేష్ దొడ్డమనె మాట్లాడుతూ పిల్లల్లోని ప్రతిభ వికాసానికి తగిన వేదిక కల్పించాలన్నారు. దీనివల్ల పిల్లల్లో జ్ఞానాభివృద్ధి వికసిస్తుందన్నారు. పాఠాలతో పాటు పాఠ్యేతర కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను చాటాలన్నారు. పిల్లలను పోటీ ప్రపంచానికి సిద్ధం చేయాలని సూచించారు. ఎటువంటి పరీక్షలైనా సులభంగా రాసి నెగ్గుకురావడానికి వీలవుతుందన్నారు. ఫౌండేషన్ ప్రముఖులు అక్షయ్ కుమార్, ఆనంద్ పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానం హుబ్లీ: ప్రమాదాలు, తీవ్రమైన రోగాల బారిన పడిన వ్యక్తికి రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి కృషి చేయాలని శిగ్గాంవి తాలూకా కాంగ్రెస్ నేత ఎం.ఎం.యాసిర్ అహమ్మద్ఖాన్ పటాన్ తెలిపారు. గురువారం ఆయన పట్టణంలోని ఓ సభామందిరంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని మాట్లాడారు. యాసిర్ అహమ్మద్ఖాన్ పటాన్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొని పండ్లు, ఫలహారాలు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో మంచి స్పందన లభించింది. అధికారం, అంతస్తులు, సంపద ఎప్పటికీ శాశ్వతం కాదని, దొరికిన అధికార అవధిలో మంచి పనులు చేస్తే ఆ పరోపకారం పదికాలాల పాటు నిలుస్తుందన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుందన్నారు. చిన్న చిన్న పనులకు కష్టపడి పొట్ట నింపుకునే పేదలకు సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీటి పథకాల పనులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. నేటి నుంచి మైసూరు శాండిల్ సోప్ల ప్రదర్శన రాయచూరు రూరల్: నగరంలో శుక్రవారం నుంచి మైసూరు శాండిల్ సోప్ల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు కర్ణాటక సోప్స్ డెవలప్మెంట్ బోర్డు జనరల్ మేనేజర్ రంగప్ప పేర్కొన్నారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రారష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని మైసూరు సోప్స్ గ్రూ్ప్ ఆధ్వర్యంలో ఈ నెలాఖరు వరకు నగరంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. వంద ఏళ్ల చరిత్ర గల మైసూరు శాండిల్ సోప్లకు మార్కెట్లో మంచి ఆదరణ ఉందన్నారు. 2023–24లో రూ.1571 కోట్ల లావాదేవీలు జరిపి రూ.362 కోట్ల లాభాలు గడించినట్లు తెలిపారు. హైదరాబాద్లో మైసూరు సబ్బుల మాదిరిగా నకిలీ ఉత్పత్తులు తయారు చేసిన కంపెనీపై ఫిర్యాదు చేశామని, కోర్టులో కేసు విచారణ సాగుతోందన్నారు. కేరళ నుంచి కూడా ఇలాంటి కేసు రావడంతో దానిపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కళ్యాణ కర్ణాటక భాగంలో శ్రీగంధం చెట్లు పెంచుతున్న రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. -
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
కేజీఎఫ్: విద్యార్థులకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తును ఉజ్వలం చేసుకోవాలని తిమ్మయ్య ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ ఆరిఫ్ సూచించారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో భాగంగా ఆ కళాశాల ఆధ్వర్యంలో పోలీస్ శాఖ గురువారం ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కుతూహలం, స్నేహితుల ఒత్తిడి, లేదా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతోందన్నారు. ఈ వ్యసనం అనేక రకాలైన సమస్యలకు దారితీస్తుందన్నారు. ఆరోగ్యంపై దుష్పరిణామం చూపిస్తుందన్నారు. యువత శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. వీటిని పరిగణలోకి తీసుకొని డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. ప్రిన్సిపాల్ డా శణై, సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ రహదారిలో గుంతలకు మరమ్మతు
● సైదాపూర్ కర్ణాటక డ్రైవర్ల చేయూత రాయచూరు రూరల్: గత 15 రోజుల నుంచి కురుస్తున్న వానలకు జాతీయ రహదారి నిండా గుంతలు పడ్డాయి. దాని మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమల కేంద్రం, జాతీయ రహదారి అధికారులు ముందుకు రాని ఘటన యాదగిరి జిల్లాలో నెలకొంది. రాయచూరు–సైదాపూర్–యాదగిరి మధ్య జాతీయ రహదారిలో వాహన సంచారానికి వీలు లేకుండా పోయింది. ఇది గమనించిన సైదాపూర్ కర్ణాటక డ్రైవర్లు అండగా నిలబడి రహదారిలో ఉన్న గుంతలను పూడ్చడానికి నడుం బిగించారు. స్వంత ఖర్చుతో సిమెంట్, కాంక్రీట్, కంకర, ఇసుకను తీసుకొచ్చి రహదారిలో పడిన పెద్ద పెద్ద గుంతలను పూడ్చి మానవత చాటుకున్నారు. -
ఏబీసీడీ వర్గీకరణ అమలు హర్షణీయం
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయడం హర్షణీయమని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి సంచాలకుడు రవీంద్రనాథ్ పేర్కొన్నారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణకు కాంగ్రెస్ సర్కార్కు జస్టిస్ నాగ మోహన్ దాస్ నివేదికను అందించినందున అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం ప్రకటించారన్నారు. ఎస్సీలకు సంబంధించి సమావేశాలు నిర్వహించకుండా కాలయాపన చేశారని, ఈ విషయంపై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశామన్నారు. నైరుతీ రైల్వే పండుగ ప్రత్యేక రైళ్లు హుబ్లీ: వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నైరుతీ రైల్వే సిద్దారూడ హుబ్లీ– మంగళూరు సెంట్రల్ స్టేషన్ల మధ్య ఒక ట్రిప్ చొప్పున ప్రత్యేక రైలు సంచారం ప్రారంభిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నెల 26న హుబ్లీ నుంచి బయలుదేరి మరుసటి రోజు 11:45 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్కు చేరుకుంటుందని తెలిపారు. తిరిగి 27న మధ్యాహ్నం 2.15 గంటలకు మంగళూరు సెంట్రల్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:45 గంటలకు హుబ్లీకి చేరుకుంటుందని తెలిపారు. ఈ రైలు హావేరి, హరిహర, అరసికెరె, తుమకూరు, యశ్వంత్పూర్, చెన్నరాయపట్టణ, హాసన, సకలేశపుర మీదుగా మంగళూరు చేరుకుంటుందని, ఈ రైలుకు 17 బోగీలు ఉంటాయని తెలిపారు. ఒక ఏసీ టూటైర్, ఒక ఏసీ త్రీటైర్, 10 స్లీపర్, మరో మూడు జనరల్ సెకండ్ క్లాసు బోగీలు, రెండు సెకెండ్ క్లాస్ లగేజీ కం బ్రేక్ వ్యాన్లు ఉంటాయన్నారు. జనరల్ కంపార్ట్మెంటు కూడా ఉంటుందన్నారు. బకాయి వేతనాలు చెల్లించాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని కర్ణాటక సంయుక్త హాస్టల్ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. గురువారం జిల్లా పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు అయ్యాళప్ప మాట్లాడారు. సాంఘీక సంక్షేమ, వెనుక బడిన వర్గాల శాఖల హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల మూడు నెలల వేతనాలు చెల్లించాలన్నారు. ఈ విషయంలో ఏజెన్సీ చేస్తున్న తప్పిదాలను అరికట్టి బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. పోరాట అనుభవాల కథాంశాలే చరిత్ర హుబ్లీ: దేశ ఉజ్వల భవిత నిర్మాణంలో విద్యార్థులకు చరిత్ర ప్రజ్ఞ అవసరం అని, ఇలాంటి పోరాట అనుభవాలు కథలుగా మారాయని ధార్వాడ జూనియర్ కళాశాల విద్యా శాఖ డీడీ డాక్టర్ నారాయణకర్ అన్నారు. గురువారం ధార్వాడ కర్ణాటక విద్యావర్ధక సంఘంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అఖండ ధార్వాడ జిల్లా పోరాట స్వాతంత్య్ర సమరయోధులు అనే గ్రంథాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. జిల్లాధికారి సూచనల మేరకు అఖండ జిల్లాలోని 77 జూనియర్ కళాశాలల్లోని 45 మంది లెక్చరర్లతో స్వాతంత్య్ర సమరయోధులు, యశోగాధలను స్మరించే ఉపన్యాసాలను పుస్తకంలో ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకించి సైన్స్ చదివే విద్యార్థులకు ఇతిహాసంపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు ఉదయ్ నాయక్, డాక్టర్ బసవరాజు అక్కి, డాక్టర్ సంజీవ కులకర్ణి పాల్గొన్నారు. పేదలకు భూమి, ఇళ్లు కేటాయించాలి రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక భాగంలో అధికంగా గ్రామీణ ప్రాంతాల్లోని నివసిస్తున్న పేదలకు భూమి, ఇళ్లు కేటాయించాలని ఇళ్లు భూ పోరాట సమితి అధ్యక్షుడు మారెప్ప పేర్కొన్నారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధీనంలో సాగు చేస్తున్న భూములు సన్నకారు రైతులకు అవకాశాలున్న అదికారులు రైతులపై కేసు నమోదు చేస్తుండడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను బలవంతంగా అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కుతో వాటిని లాక్కొంటున్నట్లు ఆరోపించారు. పేదలకు గూడు, కూడు, గుడ్డ అనే సామెతకు తిలాంజలి పలుకుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు భూమి, ఇళ్ల పట్టాలను అందించాలన్నారు. -
ఆయకట్టులో రెండో పంట లేనట్లేనా?
సాక్షి బళ్లారి: తుంగభద్ర జలాశయంలోని 33 గేట్లు శిథిలావస్థలో ఉన్నందున అన్నింటిని మార్పు చేయాలని నిపుణుల కమిటీ నివేదించింది. డ్యాం నిర్మాణం చేపట్టి 75 సంవత్సరాలైంది. దీంతో అన్ని గేట్లు ఖచ్చితంగా మార్చాల్సిందే. నిపుణుల కమిటీ ఈ నివేదిక ఇచ్చి ఏడాది గడిచింది. అయితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో మూడు రాష్ట్రాలకు చెందిన తుంగభద్ర ఆయకట్టు రైతులకు రెండో పంటకు నీరు లేకుండా పోయే దయనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తుంగభద్ర డ్యాంలోకి తగినంత నీరు చేరనప్పుడు రెండో పంటకు నీరు ఇవ్వలేమని చెప్పడం పరిపాటి. అయితే ఈఏడాది తుంగభద్ర డ్యాంలోకి సకాలంలో నీరు రావడంతో పాటు డ్యాం నుంచి దాదాపు 200 టీఎంసీల నీరు నదికి వదిలారు. చావు కబురు చల్లగా చెప్పిన మంత్రి ఇలాంటి అతివృష్టి సమయంలో పాలకుల నిర్లక్ష్యంతో చావు కబురు చల్లగా చెప్పినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి డీకే.శివకుమార్ గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం 33 క్రస్ట్గేట్లు మార్చడానికి టెండర్ల ప్రక్రియ జరుగుతోందని, ఇప్పటికే గేట్ల తయారీ కూడా చురుకుగా సాగుతోందని చెప్పారు. ఈనేపథ్యంలో తుంగభద్ర డ్యాంలో గేట్లు పూర్తిగా మార్చడానికి తదితర సమస్యల పరిష్కారానికి ఆయకట్టు కింద రెండో పంటకు నీటి సరఫరా నిలుపుదల చేస్తేనే సాధ్యమవుతుందని ప్రకటించారు. దీంతో తుంగభద్ర ఆయకట్టు పరిధిలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర జిల్లాల పరిధితో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. రెండవ పంటకు నీరు అందించలేమని చెప్పడంతో రైతుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. టీబీ డ్యాం క్రస్ట్గేట్ల మార్పుతో నీరు ఇవ్వలేమని మంత్రి వెల్లడి ఎవరి నిర్లక్ష్యం వల్ల నీరివ్వడం లేదు? అని రైతుల మండిపాటు ఆందోళనలో ఆయకట్టు రైతులు గత ఏడాది తుంగభద్ర డ్యాం వద్ద 19వ నంబరు క్రస్ట్గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో నిపుణుల సలహా సూచనలతో తాత్కాలికంగా స్టాప్లాగ్ గేటు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో పలువురు నిపుణులు పూర్తిగా పరిశీలించిన తర్వాత 33 గేట్లను మార్చాలని తుంగభద్ర బోర్డుకు నివేదికను అందజేశారు. అయితే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ పాలన యంత్రాంగం కానీ, కర్ణాటక ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ సరైన రీతిలో స్పందించకపోవడంతో గేట్ల తయారీ ప్రక్రియ ఆలస్యమైందని రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు. నిపుణుల కమిటీ సూచించిన తర్వాత వెంటనే గేట్లను తయారు చేయించి నీరు నిలుపుదల చేసిన తర్వాత గత వేసవిలో నాలుగు నెలల పాటు డ్యాం ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు కొత్త గేట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. డ్యాం గరిష్ట నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80 టీఎంసీలకే నీటి నిల్వను కుదించి ఒకే పంటకు నీరు అందించడానికి చర్యలు తీసుకోవడంతో రబీలో లక్షలాది ఎకరాలు బీడుగా మారే ప్రమాదముందని, తమకు భారీ నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
మరో 50 టీఎంసీలు కాపాడుకోవాలి
సాక్షి బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాగు, సాగు నీటిని అందించే తుంగభద్ర జలాశయం నుంచి మరో 50 టీఎంసీల నీటిని కాపాడుకునేందుకు గట్టి చర్యలు చేపట్టాలని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన తుంగభద్ర డ్యాంలోని సమస్యలు, వాటి నివారణపై సుదీర్ఘంగా చర్చించారు. క్రస్ట్గేట్ల మరమ్మతులకు కర్ణాటక ప్రభుత్వం నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది క్రస్ట్గేట్ల ఏర్పాటు, డ్యాంలో సమస్యల పరిష్కారానికి రబీలో నీరందించేందుకు సాధ్యం కాదని ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్ అసెంబ్లీలో ప్రకటించడంపై ఆయన స్పందించారు. ఉత్తర కర్ణాటక పరిధిలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర జిల్లాలకు జీవనాడిగా పేరొందిన తుంగభద్ర ఆయకట్టు రైతులకు రబీలో నీరు ఇవ్వడం సాధ్యం కాదని ప్రకటించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందే పరిస్థితి నెలకొందన్నారు. సమస్యల శాశ్వత పరిష్కారం అవసరం డ్యాంలోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకొని రైతులను శాంతింపజేయాలన్నారు. తుంగభద్ర జలాశయ పరిధిలో ఏటేటా పూడిక చేరుకోవడం వల్ల నష్టపోయిన నీటిని తిరిగి పొందేందుకు 50 టీఎంసీల నీటి నిల్వను కాపాడుకునేందుకు మూడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని అక్కడ సీఎం రేవంత్రెడ్డితో చర్చించాలని, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి నేత, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నారని, ఆయనతో ప్రతిపక్ష నాయకుడు కేఆర్.అశోక్, బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర, తాను కూడా వెళ్లి కలిసి చర్చించి ఆయన్ను ఒప్పిస్తామనే నమ్మకం ఉందన్నారు. సీఎంలు సమన్వయంతో పని చేయాలి మూడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సమన్వయంతో పనిచేసి నవలి జలాశయం, సమాంతర కాలువల నిర్మాణాలు పూర్తి చేస్తే 50 టీఎంసీల నీటిని కాపాడుకునే అవకాశం ఉందన్నారు. దీంతో మూడు రాష్ట్రాలకు చెందిన రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రతి ఏటా నవలి జలాశయానికి రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తున్నారని, ఆ కార్యాచరణ పూర్తి కావాలంటే మూడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల చర్చ, సమావేశం జరగాల్సిన అవసరముందని గుర్తు చేశారు. తుంగభద్ర సమస్యలు పరిష్కరిస్తే ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందన్నారు. క్రస్ట్గేట్ల అమరికకు కర్ణాటక ప్రభుత్వం నిధులను సమకూర్చడం వల్లే కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి దోహద పడిందని గుర్తు చేశారు. నవలి రిజర్వాయర్ను నిర్మించాలి తెలంగాణ, ఏపీ సీఎంలతో చర్చించాలి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి -
వీడిన విద్యార్థిని హత్య కేసు మిస్టరీ
● ప్రియుడే కాలయముడై హత్య చేసిన వైనం సాక్షి బళ్లారి: ప్రేమించిన తర్వాత పెళ్లి జరగకపోతే లేదా పెద్దలు ఒప్పకోక పోయినా ప్రేమికులు ఆత్మహత్య చేసుకొన్న ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. అయితే ప్రేమించిన యువతిని ప్రియుడు నమ్మించి మోసం చేసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. చిత్రదుర్గ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వర్షిత(19) అనే యువతిని ప్రేమికుడే విలన్గా మారి కిరాతకంగా హత్య చేశాడు. ఈనెల 14న కనిపించకుండా పోయినా వర్షితను ఆమె ప్రియుడు చేతన్ దారుణంగా హత్య చేసినట్లు తేలింది. చిత్రదుర్గ జిల్లా గోసరహళ్లిలో మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయగా సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తీసుకున్న చేతన్ అనే యువకుడు పథకం ప్రకారం వర్షితను హత్య చేయాలని నిర్ధారించుకొని సదరు యువతిని పిలుచుకొని కొంత దూరం వచ్చిన సీసీటీవీ పుటేజ్లు లభ్యమయ్యాయి. వర్షితతో కలిసి వచ్చి ఎవరూ లేని ప్రదేశంలో కొట్టి చంపి పెట్రోల్ పోసి హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు పూర్తి దర్యాప్తు చేయగా చేతన్ తాను హత్య చేసిన విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకోవడంతో అనుమానాస్పదంగా మృతి చెందిన యువతి మిస్టరీని పోలీసులు చేధించారు. -
అతడొక దుర్మార్గుడు
మండ్య: డబ్బుల కోసం ఆశపడి ఎవరో అన్నమాటలను పట్టుకొని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల పేరుకు మాయని మచ్చ తెచ్చేలా తన మాజీ భర్త ప్రవర్తించాడని ఫిర్యాదిదారు, ముసుగుమనిషి ఒకప్పటి భార్య ఆరోపించింది. అతనితో విడాకులు తీసుకున్న మండ్య జిల్లా నాగమంగళకు చెందిన మహిళ తన మాజీ భర్త గురించి మీడియాతో మాట్లాడారు. అతనిది కూడా మండ్య జిల్లానే. 25 ఏళ్ల కిందట మేం పెళ్ళి చేసుకున్నాం, అతడు నేత్రావతి స్నానాల ఘాట్లను శుభ్రం చేసే పనిలో ఉండేవాడు. 7 సంవత్సరాలపాటు కలిసి ఉన్నాం, మాకు ఒక మగ, ఒక ఆడ పిల్ల ఉన్నారు, కుమార్తెకు పెళ్లయింది. నా మాజీ భర్త నా మీద నిత్యం అనుమానంతో గొడవపడేవాడు, అతని బాధలు పడలేక విడాకులు తీసుకున్నా. అతడు ధర్మస్థల గురించి చెప్పేవన్నీ అబద్ధాలే అని మండిపడింది. ఆ మాటలే వినలేదు ధర్మస్థలలో అత్యాచారాలు జరిగేవని, నది పక్కన శవాలు పాతిపెట్టారని, నగలు దోచుకునేవారని నేను ఎప్పుడూ వినలేదు. నాతో భర్త ఎప్పుడూ అలా చెప్పలేదు. జరిగే ప్రచారమంతా అబద్ధం అని ఆమె పేర్కొంది. ఆ పుణ్యక్షేత్రం మీద ఏదో చేయడానికి కుట్రతో ఇలా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. తాము విడిపోయిన తరువాత అతడు మరొకరిని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. భరణం కోసం కోర్టుకు వెళ్తే, నాకు జీతమే రాదు, భోజనం మాత్రమే పెడతారు, ఏమీ ఇవ్వలేను అని కోర్టులో చెప్పాడన్నారు. పుట్టింటిలో తల్లి, పిల్లలతో కలిసి ఉంటున్నట్లు తెలిపింది. ధర్మస్థలకు చెడ్డపేరు తెచ్చేలా కుట్ర ముసుగుమనిషి మాజీ భార్య ఆరోపణ -
అయ్య బాబోయ్..ఆర్థిక పరిస్థితి!
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. అప్పుల భారం పెరిగిపోతున్నా కొత్త రుణాల కోసం వెంపర్లాడుతోంది. ఫలితంగా ఆర్థికంగా సంక్లిష్ట స్థితిలో చిక్కుకున్నట్లు కేంద్ర ఆర్థిక గణాంకాల సంస్థ కాగ్ వెల్లడించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న గ్యారెంటీ పథకాల ద్వారా ఆర్థిక వనరులకు కొరత ఏర్పడుతోందని కాగ్ తెలిపింది. కాగ్ నివేదికతో రాష్ట్ర ఖజానా పరిస్థితిపై తీవ్ర చర్చకు తెరలేసింది. ఆర్థిక అస్థిరత, పలు లోపాలను కాగ్ నొక్కిచెప్పింది. ఐదు గ్యారెంటీ పథకాలు.. ఆర్థిక ఆరోగ్యం మీద పెనుభారం మోపుతున్నాయని హెచ్చరించింది. కాగ్ నివేదిక మీద అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ నేతలు విడుదల చేసి రాష్ట్ర ఆర్థిక స్థితిని పరిచయం చేశారు. పెరుగుతోన్న రెవెన్యూ లోటు 2023–24 ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ఖర్చు 15 శాతంగా ఉండగా, అది ఏటికేడాది పెరుగుతూ పోతోందని కాగ్ తెలిపింది. రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం గతేడాది కంటే 1.86 శాతం పెరిగితే, ఖర్చులు మాత్రం 12.64 శాతం హెచ్చాయని కాగ్ తెలిపింది. తద్వారా రాష్ట్రం ప్రస్తుతం రూ. 9,271 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కొంటోంది. ప్రభుత్వ పథకాల అమలు, వాటి వల్ల కలిగే ఆర్థిక భారాన్ని భరించేందుకకు బహిరంగ మార్కెట్లో రూ. 63 వేల కోట్ల మేర అప్పులను తీసుకుంది. ఇది గతేడాది నికర రుణం కంటే 26 వేల కోట్లు అధికం కావడం గమనార్హం. మున్ముందు ఈ అప్పుల భారానికి తోడు వడ్డీలు కూడా పెరిగి భరించలేని మోతగా మారనుంది. గ్యారెంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాల కోసం ఏటా రూ. లక్ష కోట్లను ఖర్చు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారమే చెప్పడం తెలిసిందే. కాగ్ నివేదికపై ప్రభుత్వం మౌనాన్ని పాటిస్తోంది.అప్పుల భారం, దివాళా: బీజేపీ రాష్ట్ర మౌలిక వసతుల కల్పన కోసం కేటాయించిన పెట్టుబడులను గ్యారెంటీ పథకాలకు బదలాయించడం వల్ల ఆర్థిక గందరగోళం ఏర్పడుతోందని బీజేపీ ఆరోపించింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాగ్ హెచ్చరిక రాష్ట్రానికి మాయని మచ్చ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక ఏడాదిలో మౌలిక వసతుల కల్పన కింద పెట్టుబడుల ఖర్చులో సుమారు రూ 5,299 కోట్లను గ్యారెంటీ పథకాలకు బదలాయించడాన్ని కాగ్ తప్పు పట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమతుల్యత లేని ఆర్థిక నిర్వహణ వల్ల అప్పుల భారం పెరిగి రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వస్తోందని హెచ్చరించారు. కానీ సీఎం సిద్ధరామయ్య ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని దూషిస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంపై విపరీతంగా రుణ భారం ఎడాపెడా అప్పులు చేస్తున్న సర్కారు సిద్దు ప్రభుత్వానికి కాగ్ మొట్టికాయలు -
రాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు
మైసూరు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 1వ తేదీన మైసూరులోని అఖిల భారత వాక్ శ్రవణ సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలో పాల్గొనేందుకు మైసూరుకు విచ్చేయనున్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లాధికారి జీ.లక్ష్మీకాంతరెడ్డి ఆదేశించారు. గురువారం జెడ్పీ సభాంగణంలో సమీక్ష జరిపారు. ప్రోటోకాల్లో ఎలాంటి లోపాలు లేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రపతి రాడిసన్ బ్లూ హోటల్లో బస చేస్తారని, అక్కడ భద్రత, ఇతరత్రా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రపతి సంచరించే రోడ్లను పూర్తిగా మరమ్మతు చేయాలన్నారు. రింగ్ రోడ్డు, ఆయుష్ నుంచి రాడిసన్ బ్లూ వరకు రోడ్లు శుభ్రంగా ఉండేలా నగర పాలికె, ముడా, హైవే శాఖల అధికారులు బాధ్యత స్వీకరించాలన్నారు. మైసూరు పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్, జెడ్పీ సీఈఓ ఎస్.యుకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బంగారంతో షరాబు పరారీ మైసూరు: ఆభరణాలను చేయించి ఇస్తానని యజమాని నుంచి బంగారు బిస్కెట్లను తీసుకున్న షరాబు పరారైన ఘటన మైసూరులో జరిగింది. లష్కర్ ఠాణా పరిధిలోని కుంబారగేరికి చెందిన శ్రీకృష్ణ గోల్డ్స్మిత్ యజమాని సుఖాంత్ షరాబు రహమాన్ చేతిలో వంచనకు గురయ్యాడు. పశ్చిమ బెంగాల్లో ఉద్దాన్కు చెందిన నిందితుడు గత రెండేళ్లుగా షాపులో నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. సుఖాంత్ నుంచి బంగారాన్ని తీసుకుని నగలు చేసిచ్చేవాడు. ఇటీవల 200 గ్రాములకు పైగా బంగారాన్ని తీసుకుని ఉడాయించాడు. బాధితుడు ఠాణాలో ఫిర్యాదు చేశాడు. డీఆర్ఐ విచారణకు డీజీపీ బనశంకరి: కేజీల కొద్దీ బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్య రావ్ కేసులో దర్యాప్తు సాగిస్తున్న డీఆర్ఐ అధికారులు ఆమె పెంపుడు తండ్రి, డీజీపీ రామచంద్రరావ్ ను గురువారం విచారించారు. నోటీస్ ఇవ్వడంతో డీఆర్ఐ ఆఫీసులో హాజరయ్యారు. కర్ణాటక రాష్ట్ర చరిత్రలో డీజీపీని విచారించిన మొదటి కేసు కావడం విశేషం. బంగారం దొంగరవాణాలో ఆయన పాత్ర గురించి ప్రశ్నించారు. చిక్కలో ప్రజలకు నమ్మ కాప్ సేవలు చిక్కబళ్లాపురం: జిల్లా పోలీస్ శాఖ మన కాప్ 24 ఇన్టు 7 అనే వాట్సాప్ సేవలను ప్రారంభించింది, ప్రజలకు పోలీసు సేవలను సులభతరం చేస్తోంది అని జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి తెలిపారు. నగరంలోని కన్నడ భవనంలో నమ్మ కాప్ సేవలను ఆరంభించి మాట్లాడారు. ఇందులో ఎమర్జెన్సీ సేవలు, భద్రత, సైబర్ క్రైంల జాగృతి తదితర వివరాలు లభిస్తాయన్నారు. కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో లభ్యమని తెలిపారు. మొబైల్ నంబరు 9480802538, జిల్లా పోలీస్ ఇలాఖా వాట్సాప్ నంబరు 9480802518 లను మొబైల్లో సేవ్ చేసుకుని హాయ్ అని పంపితే సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. 24 గంటలూ ఈ నంబర్లు పని చేస్తాయన్నారు. ఈ సందర్భంగా ఈ సేవలకు సహకరించిన పలువురిని సన్మానించారు. -
జపాన్లో గజరాజుల జల్సా
బొమ్మనహళ్ళి: బెంగళూరు శివార్లలోని బన్నేరుఘట్ట జూ పార్క్ నుంచి జపాన్లోని హిమేజీ సెంట్రల్ పార్క్కు వెళ్లిన నాలుగు కన్నడనాడిన ఏనుగులు అక్కడి పరిసరాలకు, వాతావరణానికి అలవాటు పడ్డాయి. వాటితో పాటు జూపార్క్ నుంచి సిబ్బంది, అటవీ అధికారులు వెళ్లిన మావటీలు, అధికారులు తిరిగొచ్చారు. వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్లోని వాతావరణానికి ఇంత త్వరగా అలవాటు పడటం సంతోషంగా ఉందని తెలిపారు. 15 రోజులు ఉండి, మచ్చిక చేసి.. జపాన్తో జంతు వినిమయం కింద జూలై 24వ తేదీన బన్నేరుఘట్ట జూ నుంచి సురేష్, తులసి, గౌరి, శృతి అనే ఏనుగులను ప్రత్యేక విమానంలో జపాన్కు పంపించారు. అక్కడ కొన్నిరోజులు చూసుకోవడానికి బన్నేరుఘట్ట నుంచి మావటీలు, వైద్యులు, నిపుణులు కలిసి 8 మంది వెంట వెళ్లారు. అక్కడ హిమేజీ జూపార్క్లో గజరాజులను ఉంచారు. వారు 15 రోజులపాటు ఉండి ఏనుగులు జపాన్ వాతావరణంలో ఇమిడిపోయేలా చూసుకున్నారు. చిన్నపిల్లలకు చెప్పినట్లు గజరాజులకు బుద్ధిమాటలు చెబుతూ తర్ఫీదునిచ్చినట్లు తెలిపారు. అలాగే ఏనుగులతో ఎలా నడచుకోవాలో మెళకువలను హిమేజీ సెంట్రల్ పార్క్ సిబ్బందికి కూడా శిక్షణనిచ్చారు. నిత్యం ఏనుగులకు రాగి ముద్ద, చెరుకులు వంటి కన్నడనాడ జనాదరణ పొందిన ఆహారాన్ని పెట్టారు. చివరకు ఏనుగులు అక్కడ కుదురుకున్నాయని నిర్ధారించుకుని బన్నేరుఘట్ట జూ పార్క్ సిబ్బంది ఆగస్టు 10వ తేదీన బెంగళూరుకు తిరిగి వచ్చారు. ఎంతో ప్రేమగా సాకిన గజరాజులను వదిలి వస్తోంటే ఆనందభాష్పాలు ఆగలేదని అధికారులు సూర్యసేన్, సురేష్, ఐశ్వర్య సాక్షికి తెలిపారు. జూలో సంచారం కొత్త వాతావరణానికి అలవాటు పడటంతో పాటు అక్కడి క్వారెంటైన్లో గడిపిన ఏనుగులకు ఏ సమస్యా లేదని జపాన్ పశువైద్యులు పేర్కొనడంతో హిమేజీ సెంట్రల్ పార్క్లోకి వదిలారు. జూలో సందడిగా సంచరిస్తున్నాయి. పార్క్లో గణపతి పూజ నిర్వహించి ఏనుగులను వాటి వాటి స్థలాల్లోకి వదిలారు. ఆగస్టు 9వ తేదీ నుంచి పర్యాటకులకు కూడా అనుమతించారని మావటి కార్తీక్ తెలిపాడు. అధికారి సూర్యసేన్ మాట్లాడుతూ అత్యంత దూరంగా ఉన్న దేశంలో మన ఏనుగులను వదిలి రావడం బాధగా ఉందని అన్నారు. అవి అక్కడ చాలా బాగా ఉన్నాయని, సిబ్బంది శ్రద్ధగా చూసుకోవడం సంతోషంగా ఉందని కార్తీక్ చెప్పాడు.ఏనుగుల కోసం రాగిముద్దను తయారు చేస్తున్న జపాన్ జూ సిబ్బంది జపాన్ జూపార్క్లో గజరాజులు కర్ణాటకలో ఏనుగులు ఎలాంటి ఆహారం తినేవో, ఇకనుంచి ఎలాంటి తిండి పెట్టాలో జపాన్ జూ సిబ్బందికి నేర్పించారు. ప్రతి ఏనుగుకు రోజూ 150 కేజీల ఆహారం ఇవ్వాలని సూచించారు. అందులో పండ్లు, రాగిముద్ద, బెల్లంతో పాటు చెరుకులు, కూరగాయలు, వరి అన్నం ఉండాలని బోధించారు. రాగి ముద్ద అంటే తెలియని జపాన్ జూ పార్క్ సిబ్బంది దానిని తయారు చేయడం నేర్చుకున్నారు. చివరి నాలుగు రోజులు వారే రాగి ముద్ద వండి ఏనుగులకు తినిపించారని తెలిపారు. ఏనుగుల యోగక్షేమాలను తరచూ తెలుసుకుంటూ ఉంటామని చెప్పారు. జూలైలో బన్నేరుఘట్ట నుంచి వెళ్లిన 4 ఏనుగులు అక్కడి పరిసరాలతో మమేకం తిరిగి వచ్చిన జూపార్క్ సిబ్బంది జపనీయుల రాగి ముద్ద -
రీల్స్ కోసం ప్రాణం పణం
యశవంతపుర: మినీ ట్రాక్టర్ను నడుపుతూ రీల్స్ చేయబోయిన యువకుడు ప్రాణం పోగొట్టుకున్న ఘటన హాసన్ జిల్లా అరకలగూడు తాలూకా కబ్బళ్లిగెరె గ్రామంలో జరిగింది. బీజీ కొప్పలువాసి కిరణ్కుమార్ ట్రాక్టర్ తీసుకుని కబ్బళ్లిగెరె కొండకు వెళ్లాడు. స్నేహితులు వీడియో తీస్తుండగా ట్రాక్టర్తో ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తూ అదుపుతప్పి మలుపులో పల్టీలు కొట్టాడు. ట్రాక్టర్ కింద చిక్కుకున్న యువకుడు క్షణాల్లో మరణించాడు. కోణనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మహదేశ్వరునికి కాసుల వర్షం మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు తాలూకా మలెమహదేశ్వర బెట్టలోని మహదేశ్వరునికి 33 రోజుల అవధిలో భక్తుల నుంచి రూ.2.20 కోట్ల కానుకలు లభించాయి. బెట్ట బస్టాండ్ వద్ద గల వాణిజ్య సంకీర్ణంలో సాలూరు బృహన్మఠం అధ్యక్షుడు శాంత మల్లికార్జున స్వామి సమక్షంలో ఆలయ హుండీలను తెరిచి లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ సెలవు రోజు, అమావాస్య, జాతర మహోత్సవంతో పాటు పెద్దసంఖ్యలో మహిళా భక్తులు దర్శించుకోవడంతో కానుకలు పెరిగాయి. నగదుతో పాటు 55 గ్రాముల బంగారు, 1627 వెండి వస్తువులు లభించాయి. 30 దేశాల కరెన్సీ నోట్లు హుండీలలో లభ్యమయ్యాయి. చలామణిలో లేని రూ.2 వేల నోట్లు 7 వచ్చాయి. బోర్ల నీటిపై పరిమితులు ● అసెంబ్లీలో చట్టం ఆమోదం బనశంకరి: భూగర్బ జలాల సంరక్షణ, అభివృద్ధికి పెద్దపీట వేసేలా కర్ణాటక భూగర్భ జలాల (అభివృద్ధి, నిర్వహణ వినిమయ) సవరణ బిల్లు గురువారం విధానపరిషత్లో అమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం, ఇకపై రోజుకు నిర్ణయించిన ప్రమాణంలోనే బోర్వెల్ నుంచి నీటిని వాడుకోవాలి. ప్రాధికార అనుమతి తీసుకోకుండా బోర్లను తవ్వరాదు. ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు నీరు తోడటానికి ఎన్ఓసీ తప్పనిసరిగా పొందాలి. ప్యాకెట్ తాగునీరు తయారీదారులకు 1 నుంచి 25 వేల లీటర్ల వరకు ఎలాంటి శుల్కం ఉండదని మినహాయింపునిచ్చారు. గనులు, పరిశ్రమలతో పాటు ఇతర మౌలిక సౌకర్యాల కోసం 25 వేల లీటర్ల నుంచి 2 లక్షల లీటర్ల నీటిని వాడితే ప్రతి వెయ్యి లీటర్లకు రూ.1000 మేర సుంకం చెల్లించాలి. అపార్టుమెంట్లలో నిర్ణీత మొత్తం కంటే బోర్ల నుంచి నీటిని ఉపయోగించరాదు. బెంగళూరుతో సహా రాష్ట్రంలో విచ్చలవిడిగా భూగర్భ జలాలను వాడుతుండడంతో అడ్డుకోవడానికి సర్కారు ఈ చట్టాన్ని తెచ్చినట్లు తెలిసింది. -
భర్తకు దూరంగా వివాహిత.. తన ప్రేమకు అడ్డుచెప్పిందని..
సాక్షి, బెంగళూరు: ప్రేమ నిరాకరించినందుకు వివాహితను దారుణంగా హత్య చేశాడో కిరాతకుడు. సినీ ఫక్కీలో కారులో ఉంచి చెరువులోకి నెట్టేయడంతో ఆమె జలసమాధి అయ్యింది. ఈ సంచలన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మృతిరాలిని హాసన్ జిల్లా బేలూరు తాలూకా చందనహళ్లి గ్రామానికి సమీపంలో బేలూరుకు చెందిన శ్వేత (32)గా గుర్తించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్వేత కొంతకాలం కిందట భర్తను వదిలేసి పుట్టింటిలో ఉంటోంది. ఆమె హాసన్లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు రవి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తన భార్యను విడిచిపెట్టి వస్తానని, తనను పెళ్లాడాలని ఆమెను సతాయించేవాడు. అయితే, అతడి ప్రపోజల్ను ఆమె తిరస్కరించింది. దీంతో, ఆవేశానికి గురైన రవి శ్వేతను హతమార్చాలని నిర్ణయించుకున్నారు.అనంతరం, ఆమెను బయటకు తీసుకెళ్లే క్రమంలో కారులో ఎక్కించుకుని వచ్చాడు. చందనహళ్లి చెరువు వద్దకు రాగానే కారును ఆపి.. కారులోనే శ్వేతను ఉంచి చెరువులోకి తోసేశాడు. తర్వాత.. కారు అనుకోకుండా చెరువులో పడిందని , అందులో స్నేహితురాలు ఉందని, తాను ఎలాగోలా ఈత కొట్టుకుంటూ బయటపడ్డాడనని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అరేహళ్లి పోలీసులు అనుమానంతో ప్రశ్నించగా.. రవి నిజం ఒప్పుకున్నాడు. తానే ఆమెను హత్య చేసినట్టు తెలిపాడు. -
డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం.. ఆనవాళ్లు లేకుండా కాల్చేసి!
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టించింది. తనిఖీలో భాగంగా ఆమైపె అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా కోవేరహట్టి గ్రామానికి చెందిన వర్షిత (19) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. ఆమె పట్టణంలోని ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం బీఏ డిగ్రీ చదువుతూ ఇక్కడ ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో ఉంటోంది. అయితే, వర్షిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. గుర్తుతెలియని దుండగులు ఆమెను దారుణంగా హత్య చేసి గుర్తించడానికి వీలు లేకుండా పెట్రోలు పోసి దహనం చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో వర్షం మొదలవడంతో మంటలు ఆరిపోగా మృతదేహం సగం కాలిపోయింది.అనంతరం, హత్యకు గురైన యువతి మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో యువతి చేతికి వేయించుకొన్న టాటూ ఆధారంగా వర్షితగా గుర్తించారు. ఇక, ఈ కేసులో ఆమెతో స్నేహంగా ఉంటున్న చేతన్ అనే యువకుడిని అరెస్టు చేశారు. పూర్తి విచారణ తర్వాత మాత్రమే అసలు విషయాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. తమ కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు కాగా బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.కర్ణాటకలో నిరసనలు..మరోవైపు.. యువతి హత్యను ఖండిస్తూ చిత్రదుర్గలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. వివిధ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి పట్టణ వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. -
వైద్యుల పల్లె బాట
బనశంకరి: సర్కారీ వైద్యులు, సిబ్బంది నగరం, లేదా పట్టణ ప్రదేశాల్లోనే ఉద్యోగం చేస్తుంటారు. పల్లెలకు వెళ్లడం అరుదుగా మారింది. దాని వల్ల గ్రామాల్లో సరిగా వైద్య సేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలో నగర ప్రదేశాల్లో అనేక ఏళ్లపాటు సేవలందించిన ప్రభుత్వ వైద్యులు, నర్సులతో పాటు ఇతర వైద్యశాఖ సిబ్బంది ఇకపై తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లోనూ విధులు నిర్వహించాలని కర్ణాటక రాష్ట్ర సివిల్ సేవల నియంత్రణ సవరించిన బిల్లు బుధవారం విధానసభలో ఆమోదం పొందింది. సవరించిన బిల్లును సభలో ప్రవేశపెట్టి మాట్లాడిన ఆరోగ్యశాఖమంత్రి దినేశ్ గుండూరావ్ నగర ప్రదేశాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, డీ గ్రూప్ సిబ్బంది దీర్ఘకాలం వరకు ఒకేచోట పనిచేస్తున్నారని తెలిపారు. పారదర్శకత తీసుకురావడం కోసం వీరిని బదిలీచేస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారు, దీంతో గ్రామీణ ప్రాంత ఆసుపత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత తలెత్తింది. దీనిని సరిదిద్దడానికి చట్టాన్ని సవరించి అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. అనేక ఏళ్లుగా నగరాలు, పట్టణాల్లో పనిచేసిన సిబ్బంది తప్పనిసరిగా పల్లెల్లోనూ సేవలందించాలని స్పష్టంచేశారు. ఇప్పటికే 5,500 మంది డాక్టర్లు, సిబ్బందిని కౌన్సెలింగ్ ద్వారా బదిలీచేశామని తెలిపారు. అతివృష్టి వల్ల పంటల నష్టం మలెనాడు, హాసన్, బెళగావి, కలబుర్గితో పాటు రాష్ట్రంలో తలెత్తిన అతివృష్టితో పంటల నష్టం పట్ల రెవెన్యూ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సమీక్ష చేస్తామని వ్యవసాయ మంత్రి ఎన్.చలువరాయస్వామి విధానసభలో తెలిపారు. జీరో అవర్లో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అధిక వర్షాలు పడటంతో వివిధ పంటలు దెబ్బతిన్నాయని, రెవెన్యూ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సర్వే చేసిన తరువాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం పరిహారం అందిస్తామని తెలిపారు. ఏప్రిల్, మే నెల నుంచి ఎక్కువ వర్షాలు కురిశాయన్నారు. కలబుర్గి జిల్లాలో పెసర్లు, ఉద్దులతో పాటు అనేక పంటలు దెబ్బతిన్నాయి, గుల్బర్గా జిల్లాకే రూ. 650 కోట్లకు పైగా పంట బీమా పరిహారం అందుతుందని చెప్పారు. అంతర్గత రిజర్వేషన్లకు ఓకే ఎస్సీల అంతర్గత రిజర్వేషన్ కు సంబంధించి 19వ తేదీన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నాగమోహన్దాస్ కమిటి సిపార్సులను కొన్ని మార్పులతో అంగీకరించామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. మార్పులు అవసరమైతే వాటిని జాతీయ కులగణనలో అంశాలు ఆధారంగా సవరించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. నాగమోహన్దాస్ కమిషన్ రాష్ట్రంలో 101 ఎస్సీ కులాలను అధ్యయనం చేసింది, 1,05,09,871 మంది ఎస్సీ కులాల వారి వివరాలు సేకరించారని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ పోరాటదారులపై ఉన్న కేసులను రద్దు చేస్తామని తెలిపారు. చచ్చినా.. డయాలసిస్ దందా యశవంతపుర: సినిమాలలో కొందరు వైద్యులు శవానికి వైద్యం చేసి భారీగా ఫీజులు గుంజుతారు. నిజజీవితంలోనూ అలాంటివి జరిగాయి. అదే మాదిరిగా ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి డయాలసిస్ చేస్తున్నట్లు డబ్బులు కొట్టేశారని బీజేపీ ఎమ్మెల్యే చన్నబసప్ప విధానసభాలో ఆరోపించారు. బిజాపుర జిల్లా ముద్దేబీహళ ఆస్పత్రిలో ఉచిత డయాలసిస్ వసతి ఉంది. డయాలసిస్ చేసే ఏజెన్సీ ఫిబ్రవరి 15న మరణించిన వ్యక్తి పేరున ఫిబ్రవరి 24 తరువాత డయాలసిస్ చేసినట్లు లెక్కలు చూపించి డబ్బులు తీసుకున్నట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. ఇలా రూ.20, 30 లక్షలు కొట్టేసిందని చెప్పారు. మంత్రి శివానంద పాటిల్ సీరియస్గా విచారించి కఠిన చర్యలు తీసుకొంటామని హామీనిచ్చారు. నగరాలు, పట్టణాల్లో పనిచేసినవారికి బదిలీలు తప్పనిసరి విధానసభలో కొత్త బిల్లు పరిషత్లో సర్కారుకు ఎదురుదెబ్బ కర్ణాటక సౌహార్ద సహకార సవరించిన బిల్లు విధాన పరిషత్లో తిరస్కరణకు గురికావడంతో ప్రభుత్వానికి ముఖభంగమైంది. సౌహార్ద సహకార బిల్లు కు వ్యతిరేకంగా 26 ఓట్లు, అనుకూలంగా 23 ఓట్లు వచ్చి తిరస్కరణకు గురైంది. మంగళవారం విధానసభలో ఆమోదం పొంది బుధవారం ఎగువసభకు వెళ్లింది. పలు కారణాల వల్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీల సంఖ్య తగ్గిపోయింది. దీంతో బిల్లు నెగ్గలేకపోయింది. -
బెళగావికి ముంపు బెంగ
శివాజీనగర: బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల రాష్ట్రంలో పలు జిల్లాల్లో వరుణ ఆర్భాటం కొనసాగుతోండగా, ముంపు ప్రమాదం ఏర్పడింది. బెళగావి జిల్లా రామదుర్గ పట్టణం నింగాపురపేటలో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం వల్ల ఇంటి కప్పు కూలిపోయి వామనరావు బాపు పవార్ అనే వృద్ధుడు చనిపోయాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది శిథిలాలను తొలగించి మృతదేహాన్ని వెలికితీశారు. గోకాక్ పట్టణం, పరిసరాల్లో పలుచోట్ల లోతట్టు ప్రదేశాలు నీటమునిగాయి. గోకాక్ వద్ద లోలాసుర్ వంతెన నీటమునగడంతో పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. ముంపు ప్రదేశాల నుంచి బాధితులను గోకాక్లోని వసతి కేంద్రానికి తరలించారు. కనీస వసతుల్లేవని వారు మండిపడ్డారు. ఉత్తర కర్ణాటకలో.. బాగలకోట, ఉత్తర కన్నడ, ధారవాడ జిల్లాల్లో జడివానలు పడుతున్నాయి. బీదర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. కారంజి జలాశయం భర్తీ అయింది. బాల్కి తాలూకాలోని కట్టితుంగావ్ గ్రామంలో మల్లికార్జున దేవాలయం జలావృతమైంది. హావేరి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల ప్రభుత్వ పాఠశాల గదులు నీళ్లు కారి దుస్థితికి చేరాయి. విద్యార్థులు వరండాలలో కూర్చున్నారు. కొప్పళ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాలు బురదమయ్యాయి. బాగలకోట, విజయపుర జిల్లాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఆల్మట్టి డ్యాం కి ఇన్ఫ్లో పెరిగింది. 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నదికి అటు ఇటు ఉన్న ప్రాంతాల ప్రజలు ముంపు భయంతో జీవిస్తున్నారు. వెంటాడుతోన్న కుంభవృష్టి వంతెనలు, జనావాసాలు జలమయం ఇల్లు కూలి ఒకరు మృతి -
కుండపోత వానలు.. నదుల పరవళ్లు
రాయచూరు రూరల్: నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తడంతో ఉత్తర, కళ్యాణ కర్ణాటకలోని బెళగావి, విజయపుర, బాగల్కోటె, యాదగిరి, రాయచూరు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఎగువన ఆల్మట్టి డ్యాం నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా మంగళవారం నారాయణపుర డ్యాం నుంచి 2,08,860 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో దేవదుర్గ తాలూకాలోని కొప్పర రహదారి పూర్తిగా నీట మునిగింది. దేవదుర్గ తాలూకా హువిన హెడగి వంతెనపై వరద నీరు రావడంతో యాదగిరి, కలబుర్గి జిల్లాలకు రాకపోకలు స్తంభించాయి. చిక్కోడి తాలూకాలో 8 రోడ్డు వంతెనలు నీట మునగడంతో 18 గ్రామాలకు రాకపోకల సంబంధాలు తెగిపోయాయి. వరద పరిస్థితిపై ఆయా జిల్లాధికారులు అధికారులతో చర్చించారు. హువిన హెడగి వద్ద బసవేశ్వర ఆలయం నీట మునిగింది. కృష్ణా నదీ తీరంలో దేవసూగూరు, దొంగ రాంపూర్, ఆత్కూర్, బూడిదపాడు, నారదగడ్డ దత్తాత్రేయ ఆలయం వద్ద ప్రజల రక్షణకు ముందుండాలని అధికారులకు సూచించారు. తుంగభద్రకు వరద పోటు గత వారం రోజుల నుంచి టీబీడ్యాంకు ఎగువన మల్నాడు ప్రాంతంలోని శివమొగ్గ, దావణగెరె తదితర జిల్లాల్లో విస్తారంగా వానలు కురుస్తుండడంతో తుంగభద్ర నదికి వరద పోటెత్తింది. నదికి సుమారు రెండు లక్షల క్యూసెక్కుల మేర నీరు వదలడంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు ఎదురైంది. దీంతో రాయచూరు, కొప్పళ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదీ తీరంలో మాన్వి తాలూకాలోని దాసరకట్ట, రాయచూరు తాలూకా ఎలెబిచ్చాలి వద్ద రాయల ఏక శిలా బృందావనం, జపం కట్ట, ఉగ్ర నరసింహ స్వామి, బిచ్చాలమ్మ దేవాలయం, నాగ దేవత కట్ట, శివలింగం జలావృత్తం అయ్యాయి. నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముంచెత్తుతున్న వర్షాలు హొసపేటె: విజయనగర జిల్లాలో వర్షాల జోరు యథావిధిగా కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం హొసపేటె నగరంలో కురిసిన భారీ వర్షానికి నగరంలో అనేక ప్రధాన రహదార్లు జలమయం అయ్యాయి. వర్షం నీరు రహదార్లలో నిలిచి జలమయంగా మారడంతో విద్యార్థులకు, వాహనదారులకు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు. ఇక విజయనగర కాలేజీ రహదారిలో వర్షం నీరు ఏరులా పారింది. నగరంలోని ఆర్టీఓ కార్యాలయ ఆవరణ బురదమయంగా మారడంతో కార్యాలయానికి వాహన లైసెన్సులు చేయించుకోడానికి వచ్చే వారు ఈ బురదలో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఏడాది ఆర్టీసీ కార్యాలయానికి లక్షలాది మేర లాభాలు వస్తున్నా అధికారులు మాత్రం ఈ మట్టి రహదారిలో వర్షాకాలంలో కనీసం గరుసు మట్టి(గ్రావెల్) కూడా వేయించలేక పోతున్నారని, పని మీద కార్యాలయానికి వచ్చే వారు అధికారులపై శాపనార్థాలు పెట్టారు. కద్ర నుంచి 6 గేట్ల ద్వారా నీటి విడుదల హుబ్లీ: కాళీ నది డెల్టా ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో కద్ర డ్యాం నుంచి 6 గేట్లను తెరిచి నీటిని బయటకు వదులుతున్నారు. జోయిడా, కార్వాడ, కాళీ డెల్టా ప్రాంతంలో విపరీతంగా వానలు పడటంతో కద్ర జలాశయానికి నీటి చేరిక ప్రమాణం పెరిగింది. అంతేగాక ఎగువ భాగంలోని కొడసళ్లి అరణ్య ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే నీరు మాత్రం కద్ర జలాశయంలోకి చేరుతుంది. మంగళవారం 6 గేట్లను తెరిచి మొత్తం 51 వేల క్యూసెక్కుల నీటిని కద్ర డ్యాం నుంచి బయటకు వదిలారు. కద్ర కేపీసీ విద్యుత్ కేంద్రం ద్వారా ప్రజలకు జలాశయం నుంచి నీటి విడుదలపై కద్ర డెల్టా ప్రాంతంలోని చుట్టు పక్కల మల్లాపుర, దేవళమక్కి, కేరవడి, ఘోటేగాలి గ్రామాల ప్రజలను భద్రతపై హెచ్చరించారు. ఉత్తర, కళ్యాణ కర్ణాటకల్లో ముంపు వరద గుప్పెట వాగులు, వంతెనలు ఆల్మట్టి నుంచి కృష్ణా నదికి 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు విడుదల -
మృత్యువులోనూ వీడని బంధం
కోలారు: బైక్ను ఇన్నోవా కారు ఢీకొని అన్నా చెల్లెళ్లు ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన మంగళవారం సాయంత్రం నగర సమీపంలోని శ్రీనివాసపురం రోడ్డులో వీరాపుర గేట్ వద్ద చోటు చేసుకుంది. కోలారు తాలూకా కొండేనహళ్లి గ్రామానికి చెందిన హర్షిత్ సింగ్ (20), యశస్విని బాయి (16) చనిపోయిన అన్నా చెల్లెళ్లు.ఎలా జరిగిందివివరాలు.. వీరి తల్లిదండ్రులు కూలి పని చేసుకుని జీవిస్తూ పిల్లలు ఇద్దరిని చదివిస్తున్నారు. కూతురు ఇంటర్లో చేరగా, కొడుకు డిగ్రీ చదువుతున్నాడు. నిత్యం ఇద్దరు బస్సులోనే వెళ్లేవారు , అయితే చెల్లెలు ఇటీవల టెన్త్ పాసై పీయూసీలో చేరింది, కాలేజీలో అడ్మిషన్ కావలసిన కొన్ని సర్టిఫికెట్లు ఇంట్లోనే ఉన్నాయని అన్నకు ఫోన్ చేసి చెప్పగా బైక్లో వెళ్లి ఇచ్చాడు. తరువాత ఇద్దరూ బైక్లోనే తిరిగి గ్రామానికి వెళుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఓ ఇన్నోవా కారు ఢీకొట్టడంతో అన్నాచెల్లికి తీవ్ర గాయాలయ్యాయి. హర్షిత్సింగ్ ఘటనాస్థలంలోనే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలికను కోలారు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించింది. ఇద్దరు పిల్లలను పొగొట్టుకుని అనాథలమయ్యామని పోషకుల ఆక్రందన హృదయవిదారకంగా ఉంది. కోలారు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వీరు చాలా ఏళ్ల కిందటే ఉత్తరాది నుంచి వలస వచ్చినట్లు తెలిసింది.హెల్మెట్ లేనందునే: ఎస్పీహెల్మెట్ ధరించకపోవడం వల్లనే మరణం సంభవించిందని జిల్లా ఎస్పీ బి.నిఖిల్ తెలిపారు. ద్విచక్రవాహనాలలో వెళ్లేవారు తప్పకుండా తలకు హెల్మెట్ ధరించాలన్నారు. -
23 నుంచి వైద్య రచయితల సమ్మేళనం
బళ్లారి రూరల్ : ఆగస్టు 23, 24 తేదీల్లో రెండు రోజులపాటు బళ్లారి ఐఎంఏ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వైద్య రచయితల సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు కన్నడ వైద్యరచయితల సమితి అధ్యక్షుడు డాక్టర్ గడ్డి దివాకర్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఐఎంఏ హాలులో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్యుల్లోను రచయితలు, సాహితీవేత్తలు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నడ వైద్య సాహిత్యంపై ముధోళ్ కుబసద ఆసుపత్రికి చెందిన డాక్టర్ శివానంద కుబసద ప్రసంగించనున్నారు. ఈ సమ్మేళనంలో వైద్యులైన రచయితలు, సాహితీవేత్తలు పాల్గొననున్నట్లు తెలిపారు. సమ్మేళనంలో సాహిత్యంపై చర్చాగోష్టిలో ప్రముఖులు ఉపన్యసించనున్నట్లు తెలిపారు. బసవరాజేశ్వరీ పాఠశాల సభాంగణంలో రెండు రోజుల పాటు జరిగే సమ్మేళనంలో రాష్ట్రం నుంచి పలువురు వైద్యులు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్యులైన రచయితలు పాల్గొననున్నట్లు తెలిపారు. పత్రికా సమావేశంలో బళ్లారి ఐఎంఏ ప్రముఖులు డాక్టర్ మాణిక్యరావు కులకర్ణి, డాక్టర్ పరసప్ప, డాక్టర్ అరవింద పాటిల్, డాక్టర్ సుమ గుడి తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల ముఖ హాజరుకు మేధావుల విముఖం
సాక్షి, బెంగళూరు: ప్రైవేటు రంగమే కాదు ప్రభుత్వ రంగంలోనూ ఐటీ సాంకేతికత విస్తృతంగా వాడుకలోకి వస్తోంది. కర్ణాటక పాఠశాల విద్యా శాఖ కూడా విద్యార్థుల హాజరును ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ (ఎఫ్ఆర్ఏ) ద్వారా రికార్డు చేయాలని తీర్మానించింది. పాఠశాలలో ఒక పరికరాన్ని అమర్చుతారు, అందులో ముఖం చూపిస్తే హాజరు నమోదవుతుంది. 2025–2026 ఏడాదిలోనే దీన్ని ప్రయోగాత్మక ప్రాజెక్టుగా కొన్ని పాఠశాలల్లో అమలు చేయాలని నిర్ణయించినా ఇంకా అమలుకు నోచుకోలేదు. ఆదిలోనే హంసపాదు పలువురు విద్యా నిపుణులు, పౌర సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అభ్యంతరాలు ఏమిటి ● బడుల్లో పిల్లల హాజరును ఫేషియల్ రికగ్నేషేన్ ద్వారా రికార్డు చేసి దాన్ని స్టూడెంట్ అచీవ్మెంట్ ట్రాకింగ్ సిస్టమ్ (శాట్స్)లో అప్లోడ్ చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ● 31 మంది నిపుణులతో కూడిన బృందం ఎఫ్ఆర్ఏని వ్యతిరేకిస్తూ సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ప్రయోజనాలు సరే, ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. ● విద్యార్థుల వివరాలు, ఫోటోలతో కూడిన సమాచారాన్ని ఎవరైనా దుర్వినియోగం చేవయచ్చని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది కలగవచ్చునని హెచ్చరించారు. ● శాట్స్లో విద్యార్థుల ఫోటోలు మాత్రమే కాకుండా పిల్లల అభిరుచులు, ఆసక్తి తదితర వివరాలను తెలుసుకోవచ్చని, ఈ సమాచారం ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం ఉందని, ఎవరైనా దుర్వినియోగం చేయవచ్చునని అభ్యంతరం వ్యక్తం చేశారు. ● ఇలా అవాంతరాలు రావడంతో ప్రభుత్వం ఫేషియల్ విధానం అమలుపై మీనమేషాలు లెక్కిస్తోంది. విద్యార్థుల సమాచారం దుర్వినియోగం కావచ్చని హెచ్చరిక -
ఎస్సీ వర్గీకరణకు సర్కారు ఆమోదం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో దశాబ్ధాలుగా పెను దుమారంగా మారిన ఎస్సీ ఏబీసీడీ అంతర్గత రిజర్వేషన్ వివాదానికి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపింది. మంగళవారం రాత్రి మంత్రివర్గం ముఖ్యమైన తీర్మానం చేసింది. ఎస్సీల్లో ఎడమ, కుడి అనే రెండు వర్గాలకు చెరో ఆరు శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మిగిలిన కులాలను మూడో వర్గంగా చేర్చి వారికి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఇలా మొత్తం మూడు వర్గాలుగా ఎస్సీలను విభజించి రిజర్వేషన్ పంచాలని నిర్ణయించింది. ● గతంలో నాగమోహన్దాస్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎస్సీ సముదాయాన్ని ఐదు వర్గాలుగా వర్గీకరణ చేశారు. ● మొదటి వర్గంలో అత్యంత వెనుకబడినవర్గాలకు 10 శాతం రిజర్వేషన్, ఆ తర్వాత ఎస్సీ ఎడమ వర్గానికి 6 శాతం, మూడో కుడి వర్గానికి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సిఫారసులు చేసింది. ● నాలుగో వర్గంలో బంజార, భోవి, కురచ, కోరమలకు 4 శాతం, ఇక ఐదో వర్గంలో ఆది కర్ణాటక, ఆది ద్రావిడ, ఆది ఆంధ్రకు 1 శాతం రిజర్వేషన్ కల్పించాలని సూచించింది. ● అయితే సీఎం సిద్ధరామయ్య, మంత్రివర్గం ఐదు వర్గాలుగా కాకుండా మూడు వర్గాలుగా ఎస్సీలను విభజించి రిజర్వేషన్లను ప్రకటించింది. కమిషన్ లెక్కల ప్రకారం ఎస్సీ కులాలు, వాటి జనసంఖ్య ● వర్గం ఏ– మొత్తం 59 ఉప కులాలు ఉన్నాయి ఈ వర్గంలో మొత్తం 5,22,099 మంది ప్రజలు ఉన్నారు. ● వర్గం బీ (ఎడమ) – 18 ఉప కులాలు ఉన్నాయి. 36,69,246 మంది ప్రజలు ఉన్నారు. ● వర్గం సీ (కుడి) – 17 ఉప కులాలు ఉన్నాయి. మొత్తం జనాభా 30,08,633 ● వర్గం డీ – నాలుగు ఉప కులాలు ఉన్నాయి. మొత్తం జనాభా 28,34,939 ● వర్గం ఈ – మూడు ఉప కులాలు (ఆది కర్ణాటక, ఆది ద్రావిడ, ఆది ఆంధ్ర). జనాభా 4,74,954 హర్షం.. అసంతృప్తి ఈ నేపథ్యంలో విధానసౌధలో సీఎం సిద్ధరామయ్యను దళిత సంఘాల నేతలు సన్మానించారు. ఫ్రీడం పార్కులో దళిత సముదాయ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. అయితే మూడో వర్గం అయిన ఇతర ఎస్సీ కులాల నేతలు అసంతృప్తితో ఉన్నారు. కుడి, ఎడమ వర్గాలకు 6 శాతం చొప్పున రిజర్వేషన్లు మూడో వర్గంలోని కులాలకు 5 శాతం కేబినెట్ తీర్మానం ఎడమ వర్గం దళిత కులాలు ఏవంటే.. భాంబి, అసదరు, అసోడి, చమడియా, చమర్, చంబర, చమగార, హరళయ్య, హరళి, ఖాల్ప, మచిగార, మోచిగార, మాదర, మాదిగ, మోచి, ముచ్చి, తెలుగు మోచి, కామతి మోచి, రాణిగార్, రోహిదాస్, రోహిత్, సమ్గర్, హక్కళయ దోర్క హలస్వర, హస్ల, కడయ్యన్, కెప్మరిన్, కొలుపుల్వండియు, కుటుంబన్, మావిలన్, మోగేర్, పంచమ, పన్నియాండి, పరయ్యన్, పరయ, సమగార, సాంబన్ కుడి వర్గం దళిత కులాలు అణముక్, అరరెమాళ, అరవ మాళ, బలగై, ఛలవాది, చెన్నయ్య, పల్లన్, హోలయ, హోలెయ, మహ్యవంశీ, దేడ్, వంకర్, మారు వంకర్, మాళ, మలహణ్ణాయి, మాళ జంగమ, మాళ మాస్తి, మల మారాట, నెట్కణి, మహార్, తరళ్, ధేళు, దేగుల, ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, ఆది కర్ణాటక. -
సెప్టెంబరు 1న మైసూరుకు రాష్ట్రపతి రాక
మైసూరు: నగరంలో జరిగే అఖిల భారత వాక్ శ్రవణ సంస్థ సిల్వర్ జూబ్లి వేడుకలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 1న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాచనగరికి విచ్చేయనున్నారు. ఆ రోజు మైసూరులోని ఐష్లో జరుగనున్న జూబ్లి వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొంటారని ఢిల్లీ నుంచి అధికారిక సమాచారం వెలువడింది. ఆరోజు రాష్ట్రపతి బెంగళూరుకు విచ్చేసి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మైసూరుకు వస్తారని సంస్ఢ డైరెక్టర్ ఎం.పుష్పావతి తెలిపారు. రాష్ట్రపతి ముర్ము మైసూరులో చేస్తున్న రెండో పర్యటన ఇది, 2022 సెప్టెంబర్ 22న మైసూరు దసరా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్ల గురించి జిల్లాధికారి జీ.లక్ష్మీకాంత్రెడ్డి జెడ్పీ సభాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి భద్రతా లోపాలు దొర్లకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళా లెక్చరర్ దుర్మరణంకోలారు: స్కూటర్పై వెళుతున్న మహిళా అధ్యాపకురాలు డివైడర్కి ఢీకొన్న ప్రమాదంలో మరణించిన ఘటన ముళబాగిలు సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. ముళబాగిలు డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలు స్వప్న (40) మృతురాలు. ఆమె ముళబాగిలు సూల్ చంద్ లే అవుట్లో నివాసం ఉంటున్నారు. భర్త ఎన్ రామప్రసాద్. స్వప్న పని మీద కోలారు ఉత్తర విశ్వవిద్యాలయ ఆఫీసుకు వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో స్కూటర్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆమె ఘటనాస్థలంలోనే కన్నుమూశారు. ప్రమాదం జరగకుంటే కొంతసేపట్లోనే కాలేజీకి చేరుకునేవారే. ముళబాగిలు పోలీసులు మృతదేహాన్ని ముళబాగిలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెద్దసంఖ్యలో విద్యార్థులు, కాలేజీ సిబ్బంది నివాళులర్పించారు. -
రేపటి నుంచి రక్తదాన శిబిరాలు
రాయచూరు రూరల్ : నగరంలో ఈనెల 22 నుంచి ఐదు రోజుల పాటు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. మంగళవారం విశ్వవిద్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తం పుట్టుకొస్తుందన్నారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహనకు ఇలాంటి శిబిరాలు దోహదపడతాయన్నారు. 22న ఎల్వీడీ కళాశాల మైదానంలో, 23న ఐఎంఏ హాలులో, 24న టాగూర్ పాఠశాలలో, 25న మడ్డిపేటలో, 26న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్ శ్యామణ్ణ, వెంకటేష్ నాయక్, లక్ష్మీకాంతరెడ్డి, గిరీష్, రాజేంద్ర, త్రివిక్రం జోషి, నీలోఫర్లున్నారు. కలబుర్గి ఎయిర్పోర్టుకు ఆ పేరు పెట్టాలి హుబ్లీ: కళ్యాణ కర్ణాటకలోని ప్రముఖ కేంద్ర స్థానం కలబుర్గి వినామానాశ్రయానికి శరణులు, అన్న, జ్ఞాన, విద్య, సేవా ప్రదాత శ్రమయేవ జయతే అని చాటి చెప్పిన మహా పురుషుడు శరణ బసవేశ్వరుని పేరు పెట్టాలని ఆ జిల్లా రెడ్డి సమాజం అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత ఎస్వీ.కామిరెడ్డి ప్రభుత్వానికి ఓ పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో అన్నదాన పద్ధతిని ప్రారంభించి దరిద్రనారాయణులను తృప్తి పరిచారన్నారు. అంతేగాక శ్రమయేవ జయతేని ఆచరించి చూపారన్నారు. అలాంటి మహాపురుషుడి ఆలయం కలబుర్గిలో ఉంది. ఇక్కడ ప్రతి ఏటా భారత్లోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేస్తారు. ఇక్కడ శిల్పకళ అమోఘం అని, ఈ ప్రాంతం కళ్యాణ కర్ణాటక శ్రద్ధా కేంద్రం అన్నారు. శరణ బసవేశ్వరుని రథోత్సవం ఘనంగా జరుగుతుందన్నారు. ఆ జాతరకు లక్షలాదిగా ప్రజలు హాజరవుతారన్నారు. ఈ ప్రాంత ప్రజల అరాధ్య దైవమైన శరణ బసవేశ్వరుడి పేరును విమానాశ్రయానికి పెట్టాలని ఆయన కోరారు. -
సామాజిక విప్లవ సారధి అరసు
హొసపేటె: మాజీ ముఖ్యమంత్రి, వెనుకబడిన వర్గాల సంక్షేమ సారధి దేవరాజ అరసు సామాజిక సమానత్వం తేవడానికి కృషి చేశారని జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ అన్నారు. బుధవారం తన కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన దేవరాజ అరసు 110వ జయంతికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. అందరికీ సమానత్వానికి, సమాజంలో అణగారిన చిట్టచివరి వ్యక్తికి కూడా గౌరవం కల్పించడానికి ఆయన అనేక పథకాలను అమలు చేశారన్నారు. ఇదే సందర్భంగా జిల్లా స్థాయిలో ఎస్ఎస్ఎల్సీ, పీయూసీలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, జిల్లా స్థాయిలో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, క్రీడా పోటీలు, చర్చాగోష్టుల విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణప్ప, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి జి.శశికళ, జెడ్పీ డిప్యూటీ సెక్రటరీ కే.తిమ్మప్ప, జిల్లా మైనార్టీ అధికారి జావిద్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అరసు ఆదర్శాలు అనుసరణీయం రాయచూరు రూరల్: వెనుక బడిన వర్గాల అభివృద్ధికి దేవరాజ్అరసు ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అదనపు జిల్లాధికారి శివానంద సూచించారు. మంగళవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో దేవరాజ్ అరసు 110వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దేవరాజ అరసు చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. రాష్ట్రాన్ని పాలించిన సమయంలో వెనుక బడిన వర్గాల ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా మంచి పాలన అందించారన్నారు. భూ సంస్కరణల చట్టంలో లోపాల సవరణకు తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. ప్రజల కోసం జారీ చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలకు గుర్తున్నాయన్నారు. నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఏఎస్పీ కుమారస్వామి, శాంతప్ప, పాగుంటప్ప, సాంఘీక సంక్షేమ శాఖాధికారులు తిప్పారెడ్డి, సునీతలున్నారు. డీసీసీ కార్యాలయంలో.. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్గాంధీ 81వ, దేవరాజ్ అరసు 110వ జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. మంగళవారం నగరాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇరువురు నేతల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. దేశానికి వారు చేసిన సామాజిక సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అమరేగౌడ, శివమూర్తి, రాణి రిచర్డ్, శ్రీదేవి, ఆంజనేయ, మరిస్వామి, యల్లప్ప, నిర్మల, మాల, హేమలత, ప్రేమలత, లక్ష్మి, ఈరణ్ణలున్నారు. చెళ్లకెరెలో.. చెళ్లకెరె రూరల్: వెనుకబడిన వర్గాల ప్రగతికి, దళితులు, అణగారిన వర్గాల వారికి సామాజిక న్యాయాన్ని కల్పించిన మాజీ ముఖ్యమంత్రి డీ.దేవరాజ అరసు ప్రజల మన్ననలు పొందారని నగరసభ అధ్యక్షురాలు శిల్ప తెలిపారు. ఆమె నగరంలోని దేవరాజ అరసు వసతి పాఠశాలలో ఏర్పాటు చేసిన దేవరాజ అరసు 110వ జయంతిలో పాల్గొని మాట్లాడారు. జీత పద్ధతి నిర్మూలన, దున్నేవాడిదే భూమి, వృద్ధాప్య, వితంతు వేతనం వంటి పథకాలను అమలు చేసి ప్రజల ముఖ్యమంత్రిగా పేరొందారన్నారు. నగరసభ ఉపాధ్యక్షురాలు కవిత, సభ్యులు జైతున్బీ, మల్లికార్జున, గద్దిగె తిప్పేస్వామి, తహసీల్దార్ రెహాన్ పాషా, టీపీ ఈఓ శశిధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏ తల్లి కన్నబిడ్డో.!
● రోడ్డు పక్కనే పసికందు లభ్యం రాయచూరు రూరల్ : ఏ తల్లి కన్నబిడ్డో కాని రోడ్డు పక్కనే పసికందును వదిలివెళ్లిన ఘటన తాలూకాలోని కల్మల గ్రామంలో కలకలం రేపింది. మంగళవారం ఉదయం వాహ్యాళికి వెళ్లిన గ్రామస్తులకు ఈ పసికందు లభించింది. రోడ్డు పక్కన వదిలి వెళ్లిన చిన్నారి రోదిస్తుండగా గమనించిన పాదచారులు పసికందును తీసుకొచ్చి ఆరోగ్య కేంద్రంలో అప్పగించారు. సమాచారం అందగానే గ్రామీణ పోలీసులు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో ఎస్ఐ మృతి హొసపేటె: రాజస్థాన్లో విధులకు వెళ్లిన హొసపేటె రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హాలప్ప బుధవారం గుండెపోటుతో మరణించారు. ఆయన ఈనెల 17న హొసపేటె నుంచి రాజస్థాన్లోని జోథ్పూర్కు బయలుదేరి వెళ్లారు. అక్కడ విధుల్లో ఉండగా ఆకస్మికంగా ఛాతీలో నొప్పి వచ్చింది. అతనిని వెంట ఉన్న పోలీస్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఉత్తమ సేవలు అందించారు. ఆయన మృతి పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సంచార జాతుల అభివృద్ధే లక్ష్యం హొసపేటె: సంచార గిరిజన వర్గాలను సామాజిక, విద్యా, రాజకీయ, వృత్తిపరంగా ముందంజలోకి తీసుకురావడమే ధ్యేయం అని రాష్ట్ర సంచార వర్గాల అభివృద్ధి మండలి అధ్యక్షురాలు పల్లవి తెలిపారు. కన్నడ విశ్వవిద్యాలయంలోని పంపా ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన సదస్సును ఆమె ప్రారంభించి మాట్లాడారు. దేశంలో మొట్టమొదటి సంచార, సెమీ సంచార అభివృద్ధి సంస్థ కర్ణాటకలో స్థాపితమైందన్నారు. ఈ వర్గాల సర్వతోముఖాభివృద్ధే కార్పొరేషన్ లక్ష్యం అన్నారు. గుడిసెలు, గుడారాలలో నివసించే సంచార, పేద వర్గాలకు శాశ్వత ఇళ్లు కల్పించాలన్నారు. గుడారాలు లేని రాష్ట్రాన్ని నిర్మించడమే కార్పొరేషన్ ప్రాధాన్యత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లోని 26 తాలూకాలోని సంచార, గిరిజనుల స్థావరాలను సందర్శించిన తర్వాత చాలా సంచార వర్గాలకు ఓటరు గుర్తింపు కార్డులు వంటి అసలు పత్రాలు లేవని తాను తెలుసుకున్నానని ఆమె అన్నారు. ముందుగా వారికి అసలు పత్రాలను అందించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం సంచార వర్గాలకు అందించే పథకాల ప్రయోజనాలను లబ్దిదారులకు నేరుగా అందించడానికి ఆన్లైన్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కన్నడ విశ్వవిద్యాలయ గిరిజన అధ్యయన విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఏఎస్.ప్రభాకర్, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కేఎం.మైత్రి, డాక్టర్ మాధవ పెరాజే పాల్గొన్నారు. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం ● మాన్వి సీఐ మెరుపు దాడులు ● 14 ఇసుక టిప్పర్లు స్వాధీనం రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కొరడా ఝళిపించారు. తుంగభద్ర, కృష్ణా నదీ తీర ప్రాంతాల నుంచి రోజుకు వందలాది టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతున్న విషయం తెలుసుకున్న అధికారులు దాడి జరిపారు. జిల్లాలోని మాన్వి, రాయచూరు, దేవదుర్గ తాలూకాల్లో అక్రమంగా సాగుతున్న ఇసుక రవాణా అరికట్టే దిశలో మాన్వి సీఐ కెంచరెడ్డి సోమవారం దాడి జరిపి 14 టిప్పర్లు, హిటాచీలను స్వాధీనం చేసుకున్నారు. స్టాక్ యార్డులకు నది నుంచి ఇసుకను దొంగచాటుగా తరలించి నిల్వ చేసుకునేందుకు నదిలో యంత్రాలతో భారీగా గోతులు పడేలా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రెండు ట్రిప్పులకు రాయల్టీని పొంది మిగిలిన వాహనాలకు లేకుండా తరలిస్తున్న వందలాది టన్నులను ఇసుక టిప్పర్లను స్వాధీన పరుచుకున్నారు. మాన్వి తాలూకా మద్లాపుర వద్ద తుంగభద్ర నదీ తీరంలో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా సీఐ కెంచరెడ్డి తమ సిబ్బందితో కలిసి దాడి చేసి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఎడతెగని వర్షం.. మిరపకు నష్టం
సాక్షి,బళ్లారి: గత 15 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మిర్చి పంటపై తీవ్ర ప్రభావం చూపిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరు జల్లులతో కూడిన వర్షం, కమ్ముకున్న కారుమబ్బులతో, పంటకు సూర్యభగవానుడి ప్రతాపం దూరంమై జనజీవనం అస్తవ్యస్తం కావడంతో పాటు, సాగు చేసిన పంటలు చేతికందుతాయో లేదో అన్న భయాందోళన వెంటాడుతోందని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు బాగా కురవడంతో తుంగభద్ర డ్యాం కూడా నిండుకుండలా తొణికిసలాడుతుండటం వల్ల తుంగభద్ర ఆయకట్టు పరిధిలో రైతులు సకాలంలో పంటలు సాగు చేశారు. వరినాట్లతో పాటు ప్రధానంగా మిర్చి పంట కూడా సాగు చేశారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలో తుంగభద్ర ఆయకట్టు కింద బళ్లారి, కంప్లి, సిరుగుప్ప, హొసపేటె నియోజకవర్గాల పరిధిలో దాదాపు ఒకటిన్నర లక్షల ఎకరాలకు పైగా మిర్చి నాట్లు వేయగా, అందులో దాదాపు 40 శాతం పైగా మిర్చి నాట్లు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందారు. ఎకరాకు రూ.40 వేలకు పైగా పెట్టుబడి బళ్లారి తాలూకా శంకరబండకు చెందిన మిర్చి రైతు ఎర్రిస్వామి సాక్షితో మాట్లాడుతూ తాను 20 ఎకరాల్లో మిర్చినాటానన్నారు. ఒక్కో మిర్చినారు ఒక రూపాయి చొప్పున ఒక ఎకరాకు 20 వేలకు పైగా మిర్చినారుకు, నాట్లు వేయడానికి ఇతర ఖర్చులు దాదాపు రూ.10 వేలు, సేద్యం పనులకు మరో రూ.5 వేలు చొప్పున ఖర్చు చేశానన్నారు. ఇప్పటికే మిర్చి నాట్లు వేసి 15 నుంచి 20 రోజులైందన్నారు. ఎకరాకు దాదాపు రూ.40 వేలకు పైగా ఖర్చు చేశానన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మిర్చిపైరు నాటిన తర్వాత వేరులో పురుగులు రావడంతో పాటు కుళ్లిపోతున్నాయన్నారు. వర్షాలు ఆగిపోయిన తర్వాత కుళ్లిన నారు స్థానంలో మళ్లీ నాటక తప్పదని అన్నారు. ఇలా జిల్లాలో మిర్చినాటిన ప్రతి రైతు కన్నీటి వ్యధ ఉంది. వర్షాలు కురస్తుండటం, చల్లని వాతావరణానికి నారు కుళ్లిపోతోందని, పైరు ఏపుగా పెరగకుండా, ఆకుపచ్చగా ఉండాల్సిన మొక్క ఎర్రబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చినాటడానికి అష్టకష్టాలు పడ్డామని, ఇతర ప్రాంతాల్లోని నర్సరీల్లో నుంచి మిర్చినారు తెచ్చి, నాట్లు వేశామన్నారు. మిర్చినారు కుళ్లిన చోట కనిపిస్తున్న ఖాళీ భూమి కుళ్లిపోయిన మిర్చివేర్లను చూపుతున్న రైతు ఒక ఎకరాకు రూ.30 వేలకు పైగా నష్టం మిర్చినారు కుళ్లుతున్నట్లు రైతుల ఆవేదన నిరంతరాయ వర్షాలతో తీవ్ర నష్టాలు నాటిన రోజు నుంచి వర్షం చిరు జల్లులతో మొదలై నిరంతరాయంగా కురవడం వల్ల తీవ్ర నష్టాలు ఏర్పడే అవకాశాలున్నాయని మిర్చి రైతులు అంటున్నారు. గత మూడేళ్లుగా మిర్చి సాగు చేసిన రైతులు ఏదో రకంగా నష్టపోతున్నారని, గిట్టుబాటు ధర లేక ఇప్పటికీ ఎంతో మంది రైతుల ఉత్పత్తులు కోల్డ్స్టోరేజీల్లో ఉంచి అప్పులు పాలైన నేపథ్యంలో గోరుచుట్టుపై రోకటి పోటులా, ఆదిలోనే హంసపాదు అన్న చందంగా పరిస్థితి మారిందంటున్నారు. మిర్చినాట్లు వేసిన తర్వాత నిరంతరాయంగా వర్షాలు కురవడంతో ఈ ఏడాది కూడా మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని వాపోతున్నారు. మిర్చినాట్లు కుళ్లిపోయి, ఎర్రబారిపోవడంతో అక్కడక్కడ నారును పీకేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. కుళ్లిన మిర్చి మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలంటే మళ్లీ రెట్టింపు పెట్టుబడి అవుతుందని రైతులు కన్నీరు పెడుతున్నారు. ఓ వైపు రోగాల బెడద, మరో వైపు నాటిన మిర్చి మొక్క పెరగకుండా వర్షం దెబ్బకు కుళ్లిపోవడంతో ప్రారంభంలోనే మిర్చి రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్న తరుణంలో మిర్చి సాగు చేసిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
కలెక్టరేట్లో విధేయతా ప్రతిజ్ఞ స్వీకారం
హొసపేటె: సద్భావన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లాధికారి కార్యాలయ ఆడిటోరియంలో అదనపు డిప్యూటీ కమిషనర్ ఈ.బాలకృష్ణప్ప జిల్లాధికారి కార్యాలయ సిబ్బందితో ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లాధికారి కార్యాలయ సిబ్బంది కులం, మతం, ప్రాంతం, మతం లేదా భాషతో సంబంధం లేకుండా భారతదేశంలోని ప్రజలందరి ఐక్యత, సామరస్యత కోసం కృషి చేస్తామని, ఎలాంటి హింసకు పాల్పడకుండా సంప్రదింపులు, రాజ్యాంగ చర్యల ద్వారా వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా అన్ని విభేదాలను పరిష్కరించకుంటామని కూడా వారు ప్రతిజ్ఞ చేశారు. -
జోరు జోరుగా జోగ్.. క్యూ కడుతున్న టూరిస్టులు
కర్ణాటకలోని మల్నాడ్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు జోగ్ జలపాతం అద్భుత దృశ్యంతో అలరారుతోంది. భారీ వర్షాల తర్వాత జోగ్ జలపాతం అద్భుతంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సాగర్ తాలూకాలోని షరావతి నదిపై నిర్మించిన లింగనమక్కి ఆనకట్ట గేట్లను ఆగస్టు 19న తెరిచారు. కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల తర్వాత అదనపు నీటిని విడుదల చేశారు.ఈ ఉత్కంఠభరితమైన దృశ్యాలను చూడటానికి చుట్టు పక్కల గ్రామాలనుంచి ప్రజలు క్యూ కట్టారు. సోషల్ మీడియాలో జోగ్ అందాల వీడియోలు తెగ సందడి చేస్తున్నాయి.JOG Falls, India's 2nd highest , 830 ft Mega water fall, is at its peak now.Near Shivamogga, #Karnataka.pic.twitter.com/sMd2mBT8nq— Mahesh.BR (@Maheshbr4U) August 20, 2025 కర్ణాటకలోని జోగ్ జలపాతాన్ని పర్యాటకులు తరలివస్తున్నారు. పొగమంచులా కనిపిస్తున్న జలదృశ్యాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారు. రిజర్వాయర్,ఆనకట్టను నిర్వహించే కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కెపిసిఎల్) అధికారులు ఉదయం 10 గంటల ప్రాంతంలో గేట్లను తెరవడం ప్రారంభించారు. Time to visit #JogFalls !As linganamakki dam is filled & all crest gates are opened on Aug-19thVC: Madhu gowda pic.twitter.com/espIGjmQqY— Karnataka Development Index (@IndexKarnataka) August 20, 2025 మొత్తం 11 గేట్లను తెరిచారు. ఆనకట్టలో నీటి మట్టం ఇన్ఫ్లో పెరగడంతో పాటు 15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆగస్టు 19 ఉదయం నాటికి, జలాశయం పూర్తి స్థాయి 1,819 అడుగుల నీటి మట్టం ఉండగా, నీటి మట్టం 1,816.2 అడుగులుగా ఉంది. -
నైట్ డ్యూటీకి భర్త.. ప్రియుడితో భార్య..
కర్ణాటక: మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత నమ్మకం, విశ్వాసం అనే వారధిపై జీవితాంతం సుఖంగా సాగాల్సిన దాంపత్య ప్రయాణానికి మధ్యలోనే బ్రేకులు పడుతున్నాయి. అగ్నిగుండం సాక్షిగా కలిసి ఏడడుగులు నడిచినప్పుడు చేసుకున్న బాసలు చెదిరిపోతున్నాయి. భవిష్యత్ కోసం కన్న కలలు చెదిరిపోతున్నాయి. కుటుంబ కలహాలు, అనైతిక సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి. ఫలితంగా ఆ కుటుంబంలోని చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ తాలుకాలో గడిచిన ఐదు నెలల కాలంలో చిన్నచిన్న విషయాలు, అనైతిక సంబంధాల అనుమానాలతో ఏడుగురు మహిళలు తమ భర్తల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. తల్లులు హత్యకు గురవ్వడం, తండ్రులు జైలుకు వెళ్లడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. 2025 జనవరి నుంచి జూన్ వరకు ఆనేకల్ తాలూకా సూర్యాసిటీ, ఆనేకల్, ఎల్రక్టానిక్సిటీ, హెబ్బగోడిల పోలీస్స్టేషన్ల పరిధిలో ఒక్కో హత్య చోటు చేసుకోగా ఆత్తిబెలి పోలీసు స్టేషన్ పరిధిలో రెండు హత్యలు జరిగాయి. వివిధ ప్రాంతాలనుంచి ఉపాధి కోసం ఆనేకల్ తాలూకాకు వలస వచ్చి ఉంటున్న కుటుంబాల్లో ఈ దారుణాలు జరిగాయి. అక్రమ సంబంధాలు, భార్యలపై అనుమానాలు, మద్యం సేవనం తదితర కారణాలతో ఈ హత్యోదంతాలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. భార్య తల నరికి స్టేషన్కు వెళ్లిన భర్త ఆనేకల్ తాలూకా చందాపుర సమీపంలోని హిలలీగ గ్రామంలో జూన్ 8న ఓ వ్యక్తి తన భార్య తలను నరికి దానిని కవరులో పెట్టుకోని సూర్యా సిటీ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. భార్య మరోవ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో కడతేర్చినట్లు అంగీకరించాడు. నిందితుడు హెబ్బగోడిలోని పారిశ్రామిక వాడలోని ప్రైవేటు కంపెనిలో పని చేస్తూ ఐదేళ్ల క్రితం ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. తాను రాత్రి విధులకు వెళ్లిన సమయంలో భార్య మరొకరితో గడిపేదని, ఈ ఘటనను జీర్ణించుకోలేక భార్యను కడతేర్చినట్లు భర్త పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఏప్రిల్ 5న ఎల్రక్టానిక్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో బాగేపల్లికి చెందిన మహిళను భర్త అనుమానంతో హత్య చేశాడు. మార్చి 28వ తేదిన ఆనేకల్ తాలుకా జిగణి పోలీసు స్టేషన్పరిధిలో మహిళ హత్యకు గురైంది. జనతా కాలనీకి చెందిన మహిళకు ఓ వ్యక్తితో వివాహమైంది. కుటుంబ కలహాలతో ఆమె పుట్టినింటికి చేరింది. భర్త వెళ్లి కాపురానికి రావాలని భార్యను కోరగా ఆమె నిరాకరించింది. దీంతో చాకు తీసుకొని భార్య గొంతు కోసి హత్య చేసి అనంతరం తానూ ఆత్మహత్యా యత్నం చేశాడు. మార్చి 18వ తేన అత్తిబెలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న రాచమానహళ్లిలో భార్య శీలంపై అనుమానంతొ భర్త బార్యను హత్య చేశాడు. మార్చి 4న ఆనేకల్ పోఈసు స్టేషన్ పరిధిలోని గుడ్నళ్లిలో మహిళ హత్యకు గురైంది. దంపతులు మద్యం మత్తులో వాదులాడుకున్నారు. ఓ దశలో భర్త భార్యను హత్య చేశాడు.పిబ్రవరి 16న సర్జాపుర సమీపంలో తిగళ చౌడదేనహళ్లి గ్రామంలో మానసిక దివ్యాంగురాలు హత్యకు గురైంది. భర్త తన భార్యను నిర్మాన దశలోఉన్న భవనంపైకి తీసుకెళ్లి కిందకు తోసి హత్య చేశాడు.ఫిబ్రవరి 6న హెబ్బగోడి పోలీసు స్టేషన్ పరిధిలో బిడ్డ కళ్ల ముందు ఓ వ్యక్తి తన భార్యను చాకుతో పొడిచి హత్య చేశాడు. భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లి హత్యకు గురవ్వడం, తండ్రి జైలుకు వెళ్లడంతో వారి సంతానం అనాథగా మారింది. కౌన్సిలింగ్ కేంద్రాలు, మహిళా పోలీస్స్టేషన్లు అవసరం ఆనేకల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలనుంచి ప్రజలు ఉపాధి కోసం ఇక్కడకు వలస వస్తుంటారు. ఇటీవల దంపతుల మధ్య గోడవలు, అక్రమ సంబంధాలతో హత్యలు రుగతున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా వివాదాల పరిష్కారానికి కౌన్సెలింగ్ కేంద్రాలు, మహిళా పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
మెట్రో రైలులో బ్యాగులకు చలానా
బెంగళూరు: బెంగళూరు మెట్రో రైలులో 30 కేజీల బ్యాగును తీసుకెళ్లిన ప్రయాణికునికి సిబ్బంది రూ.30 రుసుము విధించారు. దీంతో అతడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఆగ్రహం వ్యక్తంచేశాడు. రూ.30 ఫీజు చెల్లించాలని చెప్పడంతో దిగ్భ్రాంతి చెందాను. బెంగళూరు నమ్మ దేశంలోనే అత్యంత ఖరీదైనది. బ్యాగ్ ఫీజులు చెల్లించాలంటే మరింత భారమవుతుంది. ప్రజలు రాకుండా మెట్రో అధికారులే అడ్డుకొంటున్నారు అనేందుకు ఇదే ఉదాహరణ అని మండిపడ్డాడు. మెట్రో లగేజీ నియమాలు ఇలా నమ్మ మెట్రోలో ఓ వ్యక్తి 15 కేజీల లోపు బ్యాగ్ను ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఎక్కువ బ్యాగులు, బరువు ఉంటే ప్రతి బ్యాగ్కు రూ.30 చెల్లించి టికెట్ పొందాలి. ఈ లగేజ్ టికెట్ను వినియోగదారుల సేవా కేంద్రంలో కొనుగోలు చేయవచ్చని సిబ్బంది తెలిపారు. అదనపు బ్యాగ్కు టికెట్ కొనుగోలు చేయకపోతే రూ.250 జరిమానా విధించబడుతోంది. ఆ ప్రయాణికున్ని రైలు నుంచి బయటకు పంపించే అధికారం కూడా ఉంటుంది. -
పబ్లో సీఐ రచ్చ.. సస్పెండ్
కర్ణాటక: పబ్లో మద్యం కైపులో ఆయిల్ పోసి గొడవ చేసినందుకు సిసిబి ఇన్స్పెక్టర్ మోహన్కుమార్ను పోలీస్ కమిషనర్ సీమా లట్కర్ సస్పెండ్ చేశారు. చాముండి హిల్స్ దిగువన ఉన్న జేసీ నగరలోని ఒక పబ్కు వెళ్లిన మోహన్కుమార్ తాగిన మత్తులో సిబ్బందితో గొడవపడ్డాడు. వారి మీదకు వెళ్తూ, గట్టిగా అసభ్యంగా తిడుతూ హల్చల్ చేశాడు. నూనె బాటిల్ను తీసుకుని ఒలకబోశాడు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. సీఐ అరాచకం అంతటా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద అతనిని కమిషనర్ సస్పెండ్ చేశారు. ಮೈಸೂರಿನ ಪಬ್ನಲ್ಲಿ ಸಿಸಿಬಿ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಅವತಾರ ನೋಡಿ!#mysorepub #ccbinspector #MohanKumar #mysore #mysorecrime #Pub #ccbinspectorsuspend #navasamajanews #KannadaNews pic.twitter.com/sKviRf40La— August 19, 2025 -
పోక్సో చట్టం.. అందరికీ సమానమే!
బెంగళూరు: లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ(పోక్సో) చట్టం–2012 కేవలం బాలికలకే కాకుండా బాలురకు సైతం సమానంగా రక్షణ కల్పిస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు స్పష్టంచేశారు. పురుషులతోపాటు మహిళలు సైతం లైంగిక నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, దోషులెవరైనా సరే ఈ చట్టం కింద శిక్ష అనుభవించాలని తేల్చిచెప్పింది. పోక్సో చట్టం పురుషులకు, మహిళలకు సమానంగా వర్తిస్తుందని తెలియజేసింది. కర్ణాటకలో 48 ఏళ్ల ఉపాధ్యాయురాలు తన ఇంటికి పొరుగున ఉండే 13 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించినట్లు పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. తనపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న ఇటీవల విచారణ చేపట్టారు. కేసు కొట్టివేసేందుకు నిరాకరించారు. పోక్సో చట్టం లింగ వివక్ష చూపదని పేర్కొన్నారు. నిందితులు పురుషులా? లేక మహిళలా? అనేది అనవసరమని, నేరం జరిగిందా? లేదా? అనేదే ముఖ్యమని ఉద్ఘాటించారు. పోక్సో చట్టానికి 2019లో చేసిన సవరణ ప్రకారం.. ఈ చట్టం లింగ పరంగా తటస్థంగా మారినట్లు తెలిపారు. ఈ చట్టంలోని సెక్షన్ కింద ఉన్న ‘పర్సన్’ అనే దానికి అర్థం పురుషులు మాత్రమే అని కాదని స్పష్టతనిచ్చారు. బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలితే పురుషులైనా, మహిళలైనా శిక్షార్హులేనని న్యాయమూర్తి వివరించారు. లైగింక నేరాలను కేవలం పురుషులకే అంటగట్టలేమని జస్టిస్ నాగప్రసన్న తెలిపారు. 2007 నాటి ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. లైంగిక వేధింపులకు గురవుతున్నవారిలో 54.4 శాతం మంది బాలురు, 45.6 శాతం మంది బాలికలు ఉంటున్నారని వెల్లడించారు. ఐపీసీలోని అత్యాచార చట్టం తరహాలోనే పోక్సో చట్టంలోనూ పురుషులను మాత్రమే నిందితులుగా గుర్తించాలన్న నిందితురాలి తరఫు లాయర్ వాదనలను న్యాయమూర్తి తిరస్కరించారు. పోక్సో ప్రకారం ‘లైంగిక వేధింపులు’ అనే దానికి విస్తృతమైన అర్థం ఉందన్నారు. ఇది ఐపీసీలోని ‘అత్యాచారం’ లాంటిది కాదని చెప్పారు. 13 ఏళ్ల బాలుడు ఒక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకోలేడని, అతడికి అంత సామర్థ్యం ఉండదన్న వాదనను కూడా న్యాయమూర్తి తిప్పికొట్టారు. బాధితుడికి కలిగిన మానసిక క్షోభ సంగతి ఏమిటని ప్రశ్నించారు. ఈ దర్యాప్తును ట్రయల్ కోర్టుకు అప్పగించారు. సాక్ష్యాధారాల ప్రకారం నిందితురాలిపై దర్యాప్తు కొనసాగించి, శిక్షించాలని ఆదేశించారు. -
మృతురాలు హిందూపురం వాసి
హిందూపురం: చిక్కబళ్లాపురం జిల్లా మంచేనహళ్లి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళ ఆచూకీ లభ్యమైంది. ఆమెను శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురానికి చెందిన వడ్డే అర్చన (26)గా పోలీసులు గుర్తించారు. ఆమె 16న ఇంటినుంచి బయటకు వెళ్లి రాకపోవడంతో భర్త నాగరాజు హిందూపురం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచేనహళ్లిలో గుర్తు తెలియని మహిళ శవమై తేలినట్లు సమాచారం అందడంతో పోలీసులు నాగరాజును పిలుచుకొని వెళ్లగా మృతురాలు అర్చనగా తేలింది. అయితే ఈమె అక్కడికి ఎలా చేరింది, ఏమి జరిగిందనేది పూర్తిగా తెలియరాలేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కానిస్టేబుల్ వేధింపులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
యశవంతపుర: పోలీసుల వేధింపులు తాళలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా కళస తాలూకా బస్తిగద్దె గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నాగేశ్(32) ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఇతను డెత్నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు వచ్చి పరిశీలించారు. కుదురెముఖ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ సిద్దేశ్ వేధిస్తున్నాడని, దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పరారీలో ఉన్న సిద్దేశ్ను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరచగా రిమాండ్కు ఆదేశించారు. కాగా సిద్ధేశ్పై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు, ప్రగతిపర సంఘల నాయకులు పోలీసుస్టేషన్ వద్ద అందోళన చేశాయి. -
ట్రావెల్స్ బస్సు పల్టీలు
కెలమంగలం: కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ స్లీపర్ ట్రావెల్స్ బస్సు హోసూరు సమీపంలోని కరుకనహళ్లి వద్ద బోల్తాపడిన ఘటనలో 40 మందికి తీవ్ర గాయాలేర్పడిన ఘటన మంగళవారం ఉదయం రాయకోట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాల మేరకు కోయంబత్తూరు నుంచి 40 మంది ప్రయాణికులతో బెంగళూరుకు మంగళవారం వేకువజాము 2 గంటలకు బస్సు బయల్దేరింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో రాయకోట సమీపంలోని కరుకనహళ్లి వద్ద వెళుతుండగా డ్రైవరు నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి పక్కన సర్వీసు రోడ్డులోకి పడిపోయింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందోనని గట్టిగా కేకలు వేశారు. గమనించిన స్థానికులు రాయకోట పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను రక్షించి అంబులెన్స్ల ద్వారా హోసూరు, క్రిష్ణగిరి ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. 40 మందికి తీవ్ర గాయాలు -
పచ్చని కాపురాల్లో కలహాల చిచ్చు
బొమ్మనహళ్లి : మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత నమ్మకం, విశ్వాసం అనే వారధిపై జీవితాంతం సుఖంగా సాగాల్సిన దాంపత్య ప్రయాణానికి మధ్యలోనే బ్రేకులు పడుతున్నాయి. అగ్నిగుండం సాక్షిగా కలిసి ఏడడుగులు నడిచినప్పుడు చేసుకున్న బాసలు చెదిరిపోతున్నాయి. భవిష్యత్ కోసం కన్న కలలు చెదిరిపోతున్నాయి. కుటుంబ కలహాలు, అనైతిక సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి. ఫలితంగా ఆ కుటుంబంలోని చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ తాలుకాలో గడిచిన ఐదు నెలల కాలంలో చిన్నచిన్న విషయాలు, అనైతిక సంబంధాల అనుమానాలతో ఏడుగురు మహిళలు తమ భర్తల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. తల్లులు హత్యకు గురవ్వడం, తండ్రులు జైలుకు వెళ్లడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. 2025 జనవరి నుంచి జూన్ వరకు ఆనేకల్ తాలూకా సూర్యాసిటీ, ఆనేకల్, ఎలక్ట్రానిక్సిటీ, హెబ్బగోడిల పోలీస్స్టేషన్ల పరిధిలో ఒక్కో హత్య చోటు చేసుకోగా ఆత్తిబెలి పోలీసు స్టేషన్ పరిధిలో రెండు హత్యలు జరిగాయి. వివిధ ప్రాంతాలనుంచి ఉపాధి కోసం ఆనేకల్ తాలూకాకు వలస వచ్చి ఉంటున్న కుటుంబాల్లో ఈ దారుణాలు జరిగాయి. అక్రమ సంబంధాలు, భార్యలపై అనుమానాలు, మద్యం సేవనం తదితర కారణాలతో ఈ హత్యోదంతాలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. భార్య తల నరికి స్టేషన్కు వెళ్లిన భర్త ఆనేకల్ తాలూకా చందాపుర సమీపంలోని హిలలీగ గ్రామంలో జూన్ 8న ఓ వ్యక్తి తన భార్య తలను నరికి దానిని కవరులో పెట్టుకోని సూర్యా సిటీ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. భార్య మరోవ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో కడతేర్చినట్లు అంగీకరించాడు. నిందితుడు హెబ్బగోడిలోని పారిశ్రామిక వాడలోని ప్రైవేటు కంపెనిలో పని చేస్తూ ఐదేళ్ల క్రితం ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. తాను రాత్రి విధులకు వెళ్లిన సమయంలో భార్య మరొకరితో గడిపేదని, ఈ ఘటనను జీర్ణించుకోలేక భార్యను కడతేర్చినట్లు భర్త పోలీసుల ఎదుట అంగీకరించాడు. ● ఏప్రిల్ 5న ఎలక్ట్రానిక్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో బాగేపల్లికి చెందిన మహిళను భర్త అనుమానంతో హత్య చేశాడు. ● మార్చి 28వ తేదిన ఆనేకల్ తాలుకా జిగణి పోలీసు స్టేషన్పరిధిలో మహిళ హత్యకు గురైంది. జనతా కాలనీకి చెందిన మహిళకు ఓ వ్యక్తితో వివాహమైంది. కుటుంబ కలహాలతో ఆమె పుట్టినింటికి చేరింది. భర్త వెళ్లి కాపురానికి రావాలని భార్యను కోరగా ఆమె నిరాకరించింది. దీంతో చాకు తీసుకొని భార్య గొంతు కోసి హత్య చేసి అనంతరం తానూ ఆత్మహత్యా యత్నం చేశాడు. ● మార్చి 18వ తేన అత్తిబెలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న రాచమానహళ్లిలో భార్య శీలంపై అనుమానంతొ భర్త బార్యను హత్య చేశాడు. ● మార్చి 4న ఆనేకల్ పోఈసు స్టేషన్ పరిధిలోని గుడ్నళ్లిలో మహిళ హత్యకు గురైంది. దంపతులు మద్యం మత్తులో వాదులాడుకున్నారు. ఓ దశలో భర్త భార్యను హత్య చేశాడు. ● పిబ్రవరి 16న సర్జాపుర సమీపంలో తిగళ చౌడదేనహళ్లి గ్రామంలో మానసిక దివ్యాంగురాలు హత్యకు గురైంది. భర్త తన భార్యను నిర్మాన దశలోఉన్న భవనంపైకి తీసుకెళ్లి కిందకు తోసి హత్య చేశాడు. ● ఫిబ్రవరి 6న హెబ్బగోడి పోలీసు స్టేషన్ పరిధిలో బిడ్డ కళ్ల ముందు ఓ వ్యక్తి తన భార్యను చాకుతో పొడిచి హత్య చేశాడు. భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లి హత్యకు గురవ్వడం, తండ్రి జైలుకు వెళ్లడంతో వారి సంతానం అనాథగా మారింది. కౌన్సిలింగ్ కేంద్రాలు, మహిళా పోలీస్స్టేషన్లు అవసరం ఆనేకల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలనుంచి ప్రజలు ఉపాధి కోసం ఇక్కడకు వలస వస్తుంటారు. ఇటీవల దంపతుల మధ్య గోడవలు, అక్రమ సంబంధాలతో హత్యలు రుగతున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా వివాదాల పరిష్కారానికి కౌన్సెలింగ్ కేంద్రాలు, మహిళా పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. హత్యలకు దారితీస్తున్న అనుమానాలు ఆనేకల్ పరిధిలో ఐదునెలల్లో 7 హత్యలు అనాథలవుతున్న పిల్లలు -
మైసూరు దసరా ఉత్సవాలకు కొత్త గజరాజులు
మైసూరు: ఈసారి అట్టహాసంగా జరుగనున్న విశ్వవిఖ్యాత నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవంలో మూడు కొత్త ఏనుగులు పాల్గొన్నాయి. శ్రీకంఠ దత్త నరసింహరాజ ఒడెయర్ అనే మగ ఏనుగు, 11 ఏళ్ల హేమావతి, రూపా ఏనుగులు పాల్గొంటుండటంతో దసరా పండుగకు మరింత శోభ చేకూరనుంది. ఏనుగుల శిబిరాల్లో చాలా వరకు ఆడ ఏనుగుల వయస్సు 50 దాటినందున వన్యజీవి చట్టాల ప్రకారం వాటిని దసరాకు పిలుచుకొచ్చేందుకు వీలు కాని నేపథ్యంలో ఈసారి మూడు కొత్త ఏనుగులను ఎంపిక చేశారు. గత ఏడాది పాల్గొన్న రోహిత్, హిరణ్య, వరలక్ష్మి ఏనుగుల బదులుగా ఆజానుబాహు శ్రీకంఠ, రూప, హేమావతి ఏనుగులను ఈసారి దసరాకు పరిచయం చేస్తున్నారు. ఈ మూడు కొత్త ఏనుగులు గజపడె కెప్టెన్ అభిమన్యు నేతృత్వంలో మైసూరులోని రాజ వీధుల్లో కదం తొక్కేందుకు సన్నద్ధం చేశారు. రెండో దశ ఏనుగులను సిద్ధం చేసే ఉద్దేశంతో శిక్షణకు అటవీ శాఖ సిద్ధమైంది. -
రైతులకు లబ్ధి చేకూర్చడమే ధ్యేయం
గౌరిబిదనూరు: వ్యవసాయ ఉత్పత్తులకు సహకార శాఖ మార్కెటింగ్ ద్వారా గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఇందులో భాగంగా టీఏపీసీఎంఎస్(తాలూకా వ్యవసాయదారుల ఉత్పత్తి సహకార మార్కెటింగ్ సోసైటీ)లో రైతు బజార్ ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి, డాక్టర్ హెచ్ఎన్ ప్రాధికార అధ్యక్షుడు ఎన్హెచ్ శివశంకరరెడ్డి అన్నారు. పట్టణంలోని ఎంజీ రోడ్డులో కొత్తగా నిర్మించిన టీఏపీసీఎంఎస్ భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తాను ఉపసభాపతిగా ఉన్న సమయంలో డీసీసీ బ్యాంకు పునశ్చేతనానికి సిద్దరామయ్య ఎంతో సహకారమందించారన్నారు. 2013లో బ్యాంకు ప్రగతి పథంలో నడిచిందన్నారు. తాలూకాలో 4వేల సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించామన్నారు. కార్యక్రమంలో అపెక్స్ బ్యాంకు డైరెక్టర్ బ్యాలహళ్ళి గోవిందేగౌడ,సహకార సంఘం అధ్యక్షుడు నాగరాజు,నసీమ,టిఎపిసిఎంఎస్ అధ్యక్షుడు మరళూరు హనుమంత రెడ్డి,ఉపాధ్యక్షుడు రమేశ్ నాయక్,రవిచంద్రారెడ్డి, ప్రమీలాబాలాజీ, సతీశ్కుమార్, కాంట్రాక్టర్ నాగరాజు, ప్రకాశరెడ్డి, తారానాథ్ పాల్గొన్నారు. -
క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు నిబ్ కౌన్సిల్ అండ
శివాజీనగర: భారత రాజ్యాంగం క్రైస్తవులకు కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు, క్రైస్తవులు, చర్చిలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా శాంతియుతంగా పోరాటం చేస్తున్నట్లు నేషనల్ ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ (నిబ్–కౌన్సిల్) సంస్థాపక అధ్యక్షుడు రైట్ రెవరెండ్ డాక్టర్ మార్టిన్ కాట్రగడ్డ తెలిపారు. నగరంలోని మిల్లర్స్ రోడ్డులో ఉన్న యునైటెడ్ థియోలాజికల్ కాలేజీలో మంగళవారం నిర్వహించిన దక్షిణ భారత సేవకుల, సంఘ పెద్దల సదస్సులో ఆయన పాల్గొని ఆయన మాట్లాడారు. క్రైస్తవులు క్రమ శిక్షణతో సమాజంలో జీవనం కొనసాగిస్తున్నారన్నారు. అలాంటి క్రైస్తవులకు అన్యాయం జరిగితే నిబ్ పోరాటం చేస్తుందన్నారు. ఏసుక్రీస్తు ప్రకటించిన సువార్తను అందించే సేవకులు ధనాపేక్షలేనివారై జీవితాలను గడుపుతూ కళంకం లేకుండా జీవించాలన్నారు. బిషప్ గుడివాడ జాషువా మాట్లాడుతూ దైవ సేవకులు విశ్వాసంగా సేవలు అందించాలన్నారు. నిబ్ కౌన్సిల్ ద్వారా ఆర్చ్ బిషప్గా సీనియర్ పాస్టర్ పండు మద్దలను నియమించి అభిషేకించారు. 5 మందికి బిషప్గా, 6 మందికి గౌరవ డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేశారు. దేవుడి సేవకు ఆసక్తి కలిగిన కొంతమందికి పాస్టర్లుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం డాక్టర్ రెవరెండ్ మార్టిన్ కాట్రగడ్డ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నిబ్ కౌన్సిల్ కర్ణాటక కన్వీనర్ బిషప్ ఎం.బెంజమిన్, కేబీఎస్ఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి రెవరెండ్ ఎం.దానియేల్, నిబ్ కౌన్సిల్ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ జయకుమార్ దానియేల్, కేటీసీఎంఎఫ్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ ఎన్.ప్రేమానందం, నిబ్ కౌన్సిల్ నాయకులు రెవరెండ్ వీ.డీ.క్రిష్టపర్, రెవరెండ్ రత్నకుమార్, రెవరెండ్ ఎం.బీ.మోజస్, డాక్టర్ ఎన్.ఎస్.అరుణ్కుమార్, రెవరెండ్ విజయకుమార్ పాల్గొన్నారు. నిబ్ కౌన్సిల్ సంస్థాపక అధ్యక్షుడు రైట్ రెవరెండ్ డాక్టర్ మార్టిన్ కాట్రగడ్డ -
లింగనమక్కికి వాయనం ఇవ్వరే?
శివమొగ్గ: రాష్ట్రంలోనే అతిపెద్ద జలాశయం. ఇది శరావతి నదిపై ఉంది. విద్యుదుత్పత్తితో రాష్ట్రానికి, దేశానికి వెలుగులిస్తోంది. ఆసియాలోనే అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ను ఉత్పత్తి చేసేది అయిన సాగర్ తాలూకాలోని లింగనమక్కి డ్యాం ఈ ఏడాది కూడా నిండి కళకళలాడుతోంది. దీంతో మంగళవారం ఉదయం 11 గేట్లను ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్ప్లో 48,393 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం సామర్థం 151 టీఎంసీలు అయితే 142 టీఎంసీలు నీళ్లున్నాయి. చేసిన పాపమేమిటి? రాష్ట్రంలోని తుంగభద్ర, ఆల్మట్టి, కేఆర్ఎస్ వంటి ప్రధాన ఆనకట్టలు నిండినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు డ్యాంకు వచ్చి వాయనం సమర్పించి పూజలు చేస్తారు. కానీ ఇటీవలి సంవత్సరాలలో సీఎం, మంత్రులు ఎవరూ లింగనమక్కి ముఖం చూడడం లేదు. అధికార ప్రముఖులు ఈ ఆనకట్టకు వాయనం ఇవ్వడానికి ఇష్టపడరు అని స్థానికులు ఆవేదన చెందారు. లింగనమక్కి చేసిన పాపం ఏమిటో చెప్పాలని పాలకులను ప్రశ్నించారు. సీఎం, మంత్రులు ఈసారైనా లింగనమక్కిని గౌరవించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అటువైపు చూడని పాలకులు ప్రజల ఆవేదన -
బెంగళూరులో భారీగా డ్రగ్ పెడ్లర్ల అరెస్టు
●రూ.5.88 కోట్ల ఎండీఎంఏ, గంజాయి సీజ్ బనశంకరి: బెంగళూరు నగరంలో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ముగ్గురు విదేశీయులతో పాటు 8 మంది డ్రగ్స్ పెడ్లర్లను నగర పోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ.5.88 కోట్ల విలువచేసే ఎండీఎంఏ , గంజాయి స్వాదీనం చేసుకున్నామని పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను పరిశీలించి మాట్లాడారు. ఎండీఎంఏ క్రిస్టల్ను విక్రయిస్తున్న కాంగో దేశానికి చెందిన జోయల్ కాంబోగ్, మిస్జాయ్ సండే అనే ఇద్దరిని అరెస్ట్చేసిన పోలీసులు రూ.5 కోట్ల విలువచేసే 2 కిలోల 150 గ్రాముల ఎండీఎంఏని సీజ్ చేశారు. మిస్జాయ్సండే తక్కువ ధరతో ఎండీఎంఏ క్రిస్టల్ కొనుగోలుచేసి కాలేజీ విద్యార్థులు, ఐటీ బీటీ ఉద్యోగులకు అధిక ధరతో విక్రయిస్తూ సంపాదనకు పాల్పడుతోందని తెలిపారు. దక్షిణాఫ్రికా వాసి.. మరో ఘటనలో ఆవలహళ్లి మరియప్పరోడ్డులే ఔట్లోని ఇంట్లో నివాసం ఉండే దక్షిణాఫ్రికావాసి డెకో స్టాజాన్ ను అరెస్ట్చేసి ఇతడి వద్ద నుంచి రూ.40 లక్షల విలువచేసే 255 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వేర్వేరు రకాల వీసాలతో భారత్కు వచ్చి బెంగళూరుకు చేరుకున్నారు. సులభంగా ధన సంపాదనకు డ్రగ్స్ విక్రయాలకు దిగారు. 22 కేజీల గంజాయి సీజ్ ● హెచ్ఎస్ఆర్.లేఔట్ పోలీసులు త్రిపుర రాష్ట్రానికి చెందిన సుబ్బీర్ దేవ్వర్మ అనే డ్రగ్ పెడ్లర్ని అరెస్ట్చేసి రూ.13.50 లక్షల విలువచేసే 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ● సంపిగేహళ్లి పోలీసులు శ్రీరామపుర మెయిన్రోడ్డు ఖాళీ స్థలంలో తోట వద్ద ఎండీఎంఏ క్రిస్టల్ను విక్రయిస్తున్న బీబీఎం విద్యార్థి వాసీం అక్రమ్ ను అరెస్ట్చేసి రూ.3.40 లక్షల విలువచేసే ఎండీఎంఏ క్రిస్టల్ని స్వాధీనం చేసుకున్నారు. ● యలహంక పోలీసులు ఎంబీఏ ఆటోమొబైల్, బీకాం చదువుతున్న ముగ్గురు విద్యార్థులను అరెస్ట్చేసి రూ.15 లక్షల విలువచేసే 117 గ్రాముల ఎండీఎంఏ, కారు, మూడుమొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరు కేరళ నుంచి వచ్చినవారని తెలిసింది. మొబైళ్ల దొంగ పట్టివేత మొబైల్ చోరీలకు పాల్పడుతున్న బాపూజీనగర మహమ్మద్ తౌసిఫ్ను అరెస్ట్చేసిన కోరమంగల పోలీసులు ఇతడి వద్ద నుంచి రూ.16 లక్షల విలువచేసే 48 మొబైల్స్ను సీజ్ చేశారు. అలాగే కోరమంగలలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్చేసిన పోలీసులు వీరి వద్ద నుంచి కొంత గంజాయిని పట్టుకున్నారు. మొబైల్స్ను సొంతదారులను కనిపెట్టి అప్పగిస్తామని కమిషనర్ తెలిపారు. -
నా కుమార్తె అస్థికలు ఇవ్వండి
దొడ్డబళ్లాపురం: కుమార్తె అనన్య భట్ ఏమైందో తెలియదు, ఆమె అస్థికలు ఇవ్వండి అని కొన్నినెలలుగా ధర్మస్థలలో అందరినీ అడుగుతున్న వృద్ధురాలు సుజాత భట్ మీడియాతో మాట్లాడారు. తాను నకిలీ ఫోటోలు ప్రదర్శించడం లేదని, కుమార్తె అస్థికలు ఇవ్వండి అని అడుగుతున్నానన్నారు. అపరిచిత వ్యక్తి చెప్పడంతో తవ్వకాలు చేస్తున్నారు కదా, నా కుమార్తె అస్థికలు దొరికితే ఇవ్వాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. తాను చూపించిన ఫోటోలో ఉన్నది నిజంగా తన కుమార్తె అని, అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, అవి ఎక్కడ ఎవరికి ఇవ్వాలో ఇస్తానన్నారు. తాను బెంగళూరులోని రిప్పన్పేటలో ప్రభాకర్తో కలిసి జీవించానని, అయితే అతడిని వివాహం చేసుకోలేదన్నారు. కలిసి జీవించరాదని చట్టం లేదుగా అని ప్రశ్నించారు. రిప్పన్ పేట నుంచి కోల్కతాకు వెళ్లి వచ్చేదాన్ని, ఎవరికీ తెలీకుండా నా కుమార్తెను పెంచి పెద్ద చేశాను, నా తండ్రి, కుటుంబ సభ్యుల నుంచి ప్రాణభయం ఉండేదని, అందువల్ల అనిల్ భట్ అనే వ్యక్తిని రహస్యంగా వివాహం చేసుకున్నట్లు చెప్పారు. ఓ రకంగా సుజాతా, అనన్యభట్ కేసు వల్ల కూడా ధర్మస్థల ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. యూట్యూబర్లు ఈ కథనాన్నే ఎక్కువగా వాడుకున్నారు. నేను అబద్ధాలు చెప్పడం లేదు వృద్ధురాలు సుజాతా భట్ వినతి దుష్ప్రచారం బాధాకరం: ధర్మాధికారి హెగ్డే ధర్మస్థలంలో సిట్ దర్యాప్తును ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే స్వాగతించారు. అపరిచితుని సమాచారం మేరకు పోలీసులు తవ్వకాలు జరపడం గురించి ఆయన మొదటిసారి మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను సీబీఐ దర్యాప్తు సమయంలో కూడా పూర్తిగా సహకరించానన్నారు. ధర్మస్థలం విషయంలో అనవసరంగా దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. సోషల్ మీడియా, టీవీ చానళ్లలో కల్పిత వార్తలు వస్తుండడం బాధపెడుతోందని వాపోయారు. సిట్ పై తనకు విశ్వాసం ఉందని, నిజాలు వెలుగు చూడాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ధర్మస్థలలో తవ్వకాలు నిలిచిపోయాయి. అస్థికలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి నివేదికల కోసం వేచిచూస్తున్నారు. -
పంచ పాలికెలకు త్వరలో ఎన్నికలు
బనశంకరి: గ్రేటర్ బెంగళూరు ప్రదేశ పరిధిలో ఐదు నగర పాలికెలను ఏర్పాటు చేసి సరిహద్దులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సజావుగా ఎన్నికలు నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ చెప్పారు. మంగళవారం విధానసభ సమావేశాల్లో గ్రేటర్ బెంగళూరు పాలక బిల్లు– 2025 ను సవరించి ప్రవేశపెట్టారు. దీనిపై మాట్లాడిన శివకుమార్.. గ్రేటర్ బెంగళూరు ప్రాధికార గురించి స్పష్టత ఇవ్వడానికి సవరణలు అవసరమయ్యాయి. నగర పాలికెలు పాలనాత్మక చర్యలు, నిర్వహణ అధికారాలను చలాయించడం అంటే దీని అర్థం గ్రేటర్ బెంగళూరు మినహా వేరే పాలికె, నగరసభలపై పెత్తనం చెలాయించడం కాదన్నారు. రాజ్యాంగ విరుద్ధం: బీజేపీ బీజేపీ ఎమ్మెల్యే అశ్వత్నారాయణ మాట్లాడుతూ సిటీ కార్పొరేషన్లను ఎలా చేరుస్తారనేది వివరించాలని కోరారు. గందరగోళం వద్దని, సరిదిద్దుతామని డీసీఎం తెలిపారు. గ్రేటర్ అనేది రాజ్యాంగానికి వ్యతిరేకమని, సీఎంకు అధికారం ఎందుకు ఇచ్చారని అశ్వత్ ఆరోపించారు. ఇది స్థానిక సంస్థల అథోగతికి కారణం అవుతుందని దుయ్యబట్టారు. గ్రేటర్ బదులు సర్కారుకు కన్నడ పేరు దొరకలేదా అని బీజేపీ పక్ష నేత అశోక్ వ్యంగ్యమాడారు. చర్చ తరువాత స్పీకర్ యుటీ ఖాదర్ గ్రేటర్ బెంగళూరు బిల్లును ఆమోదించినట్లు ప్రకటించారు. మహానగర పాలికెలో కట్టడ నిర్మాణానికి మంజూరు, పన్నులు విధించడం పై పాలికెలకు అవకాశం కల్పించే కర్ణాటక నగర పాలికె సవరణ బిల్లును ఆమోదించారు. డీసీఎం శివకుమార్ వెల్లడి గ్రేటర్ బెంగళూరు సవరణకు ఆమోదం -
ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్
దొడ్డబళ్లాపురం: పాఠశాల గోడ కూలి విద్యార్థి గాయపడ్డ సంఘటనకు సంబంధించి బీదర్ తాలూకా బగదల్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మడయ్యస్వామిని అధికారులు సస్పెండ్ చేశారు. ఈనెల 7న పాఠశాలో 6వ తరగతి చదువుతున్న రోహన్ రాబర్ట్ అనే విద్యార్థి భోజనం చేస్తుండగా గోడకూలి గాయపడ్డాడు. ముఖ్యోపాధ్యాయుడిని బాధ్యుడిని చేస్తూ అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ప్లాస్టిక్ విక్రయాలపై దాడులు మండ్య: ప్లాస్టిక్ విక్రయాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. హొసహళ్లి రోడ్డులోని కొన్ని అంగళ్లపై అధికారులు దాడి జరిపి ప్లాస్టిక్ సంచులు స్వాధీనం చేసుకున్నారు. స్థాయీ సమితి అధ్యక్షుడు రవి మాట్లాడుతూ ప్లాస్టిక్ విక్రయించిన ప్రతి అంగడి యజమానికి రూ.11 వేలకు పైగా జరిమానా విధించామన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ ఇది పునరావృతం అయితే ఎక్కువ ప్రమాణంలో జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. నగరసభ పర్యావరణ విభాగం రుద్రేగౌడ, ఆరోగ్య ఇన్స్పెక్టర్ చెలువరాజు, సిబ్బంది అశ్విన్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. సిటీ బస్కు బైకిస్టు బలి యశవంతపుర: బీఎంటీసీ బస్సు ఢీకొన్న ఘటనలో బైకుదారుడు మరణించిన ఘటన బెంగళూరు సంజయనగరలో జరిగింది. చిన్నారికి టిఫిన్ తీసుకురావడానికి బైకుపై బయటకు వెళ్లిన వ్యక్తిని బీఎంటీసీ బస్సు ఢీకొంది. సంజయనగరకు చెందిన రోషన్ను బస్సు ఢీకొనగా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్సలు అందించేలోపే చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించి బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేశారు. భార్యతో భర్త గొడవ●మత్తులో తండ్రిని కత్తితో పొడిచిన తనయుడు ● తీవ్ర గాయలతో మృతి యశవంతపుర: తల్లితో తండ్రి గొడవ పడుతుండగా మత్తులో ఉన్న తనయుడు కత్తి పొడవటంతో అతను తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. ఈ ఘటన చిక్కమగళూరు తాలూకా అల్దూరు సమీపంలోని గుప్తశెట్టిహళ్లిలో జరిగింది. గ్రామంలో మంజునాథ్(51) అనే వ్యక్తి తన కుటుంబంతో జీవిస్తున్నాడు. ఈయనకు రంజన్(21) అనే కుమారుడు ఉన్నాడు. మంజునాథ్ ఈనెల 16న తన భార్యతో వాగ్వాదం చేస్తుండగా మద్యం మత్తులో వెళ్లిన రంజన్ సర్దిచెప్పేందుకు వెళ్లాడు. ఓ దశలో తన తండ్రిని కత్తితో పొడిచాడు. గాయంపై భార్య పసువుపొడి వేసింది. అధిక రక్తస్త్రావం కావాటంతో మంజునాథ్ ప్రాణం విడిచాడు. అయితే తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందినట్లు రంజన్ స్థానికులను నమ్మించాడు. కొడవలి తగిలి గాయమైందని మరికొందరి వద్ద చెప్పాడు. మంజునాథ్ మృతిపై అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంజన్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం బయట పెట్టాడు. రంజన్ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. ఓట్ల చోరీని అరికట్టాలి మైసూరు: దేశంలో భారీగా ఓట్ల చౌర్యం జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా సాంస్కృతిక నగరి మైసూరులో స్వాప్ ఓట్ చోరీ అభియాన్ను ప్రారంభించింది.సెంట్రల్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్టీసీ బస్సులకు స్టిక్కర్లను అతికించి స్వాప్ ఓట్ చోరీ అభియాన్ను ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ను దుర్వినియోగపరచుకుని బీజేపీ ఓట్ల చౌర్యానికి పాల్పడుతోందన్నారు. వెంటనే ఓట్ల చౌర్యాన్ని అరికట్టి న్యాయసమ్మతంగా ఎన్నికలను నిర్వహించాలని ఒత్తిడి చేశారు. కేపీసీసీ ప్రతినిధి ఎం.లక్ష్మణ్, కాంగ్రెస్ జిల్లాధ్యక్షుడు విజయకుమార్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
పబ్లో సీఐ రచ్చ.. సస్పెండ్
మైసూరు: పబ్లో మద్యం కై పులో ఆయిల్ పోసి గొడవ చేసినందుకు సిసిబి ఇన్స్పెక్టర్ మోహన్కుమార్ను పోలీస్ కమిషనర్ సీమా లట్కర్ సస్పెండ్ చేశారు. చాముండి హిల్స్ దిగువన ఉన్న జేసీ నగరలోని ఒక పబ్కు వెళ్లిన మోహన్కుమార్ తాగిన మత్తులో సిబ్బందితో గొడవపడ్డాడు. వారి మీదకు వెళ్తూ, గట్టిగా అసభ్యంగా తిడుతూ హల్చల్ చేశాడు. నూనె బాటిల్ను తీసుకుని ఒలకబోశాడు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. సీఐ అరాచకం అంతటా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద అతనిని కమిషనర్ సస్పెండ్ చేశారు. సైకియాట్రీ పీజీ మెడికో ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: మానసిక వైద్యశాస్త్రంలో పీజీ చేస్తున్న వైద్యురాలు మనోవ్యాధితో ప్రాణాలు తీసుకుంది. హాస్టల్లో మెడికల్ పీజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెళగావిలో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన డా.ప్రియా కార్తీక్ (27) మృతురాలు. వివరాలు.. ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసి, బిమ్స్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో సైకియాట్రీలో పీజీ కోర్సు చేస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు వార్డుల్లో సేవలందించి, హాస్టల్ గదికి చేరుకుంది. రాత్రి 9 గంటల సమయంలో ప్రియ అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. భోజనానికి రాలేదని స్నేహితులు వెళ్లి చూడగా అచేతనంగా పడి ఉంది. ఈమె కొన్ని రోజుల క్రితం కూడా చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిందని, డిప్రెషన్తో బాధపడుతూ ఔషధాలను తీసుకుంటోందని బిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ డా.అశోక్శెట్టి తెలిపారు. పోలీసులు పరిశీలించి పోస్టుమార్టం కోసం తరలించారు. కస్టమ్స్ పేరుతో దోపిడీ యశవంతపుర: కస్టమ్ అధికారులమంటూ బంగారం వ్యాపారిని బెదిరించి 350 గ్రాముల బంగారాన్ని దోచిన ఐదు మంది దుండగులను మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. 13న ఉదయం బంగారం వ్యాపారి భానుదాస్ హరిథోరట్ మంగళూరు సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలోని కై రాలి హోటల్ వద్ద ఉండగా, కస్టమ్ అధికారులమంటూ ఆరుమంది చుట్టుముట్టి తనిఖీ చేశారు. కారులో ఎక్కించుకొని కుమటా తాలూకా శిరసి వద్ద దించేసి రూ.35 లక్షల విలువగల 350 గ్రాముల బంగారాన్ని లాక్కుని పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గాలింపు జరిపి ఐదుమందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు డీసీపీ మిథున్ తెలిపారు. పాఠశాల ముందు కొట్లాట చిక్కబళ్లాపురం: తాలూకా పరిదిలోని లింగశెట్టిపురం గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో త్వరలో ఆటల పోటీలు జరపాలని స్వసహాయ సంఘం అద్యక్షురాలు క్రిష్ణవేణి జేసీబీని రప్పించి స్వచ్ఛతా పనులు చేస్తుండగా వివాదం నెలకొంది. జీపీ సభ్యుడు మంజునాథ్ వచ్చి నాకు చెప్పకుండా ఎందుకు పనులు చేస్తున్నావు అని ఆమె మీద మండిపడ్డాడు. దీంతో ఇరువర్గాల మధ్య గలాటా జరిగింది. దీంతో క్రిష్ణవేణి అంబేడ్కర్ చిత్రపటంతో నిరసన నిర్వహించింది. మరోసారి ఇరువర్గాలు కొట్టుకోవడంతో క్రిష్ణవేణికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
నగలు కొంటామంటూ చోరీ.. అరెస్టు
కేజీఎఫ్: బంగారం కొనాలంటూ వచ్చి ఆభరణాలను దొంగతనం చేసుకుని వెళ్లిన 5 మంది మహిళలు, ఒక పురుషున్ని బంగారుపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 30 లక్షల విలువ చేసే 305 గ్రాముల బంగారు నగలు, ఓ ఆటో, రూ. 7.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఈ నెల 14వ తేదీన బంగారుపేట నివాసి శ్రీనివాసగుప్త తన జ్యూవెలరీ షాపునకు బుర్కా ధరించిన ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు వచ్చారని, నగలు కొంటామని చెప్పారన్నారు. లాకర్ రూంలో ఉన్న బంగారు నగలు కలిగిన ప్లాస్టిక్ బాక్సును దొంగిలించుకుని వెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించి నిందితులను గుర్తించారు. కోలారు నగరానికి చెందిన నగీనా, నవీనా, ముబీన్తాజ్, నగ్మా, జరీనా తాజ్, నజీర్పాషా అనేవారిని నిర్బంధించి జైలుకు తరలించారు. -
అలరించిన రాధాకృష్ణులు
బొమ్మనహళ్లి : బొమ్మనహళ్లి నియోజకవర్గం హెచ్ఎస్ఆర్ లేఔట్ సామసంద్రపాళ్యలో ఉన్న శ్రీసాయిరామ్ విద్యాసంస్థల ఆవరణలో కృష్ణాష్టమిని ఘనంగా నిర్వహించారు. నర్సరీ నుంచి ఏడవ తరగతి వరకు చదివే చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు. విద్యాసంస్థల అధ్యక్షుడు నితిన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ నాగేశ్వరావు, వైస్ ప్రిన్సిపాల్ థామస్ప్రాన్సిస్, మేనేజర్ ప్రదీప్కుమార్ పాల్గొన్నారు. బైక్లు ఢీ.. ఒకరి మృతి మైసూరు : చామరాజ్నగర్ జిల్లా కొళ్లేగాళ తాలూకా నారిపుర బైపాస్ రోడ్డులో రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. తెల్లనూరు గ్రామానికి చెందిన సిద్దశెట్టి(50) తన భార్య మంగళమ్మతో కలిసి బైక్పై వెళ్తుండగా నారిపుర వద్ద మరో బైక్ ఎదురైంది. బైక్లు పరస్పరం ఢీకొని సిద్దశెట్టి గాయపడగా మైసూరులోని జేఎస్ఎస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి మైసూరు : చామరాజ్నగర్ జిల్లా కేల్లొగాల్ తాలూకాలోని కెంపనపాళ్య గ్రామంలో బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందింది. మరకణించినదికొల్లేగాల్ తాలూకాలోని కంచనగల్లి గ్రామానికి చెందిన శివరుద్రమ్మ(35) కరలకతెదొడ్డి గ్రామం నుంచి స్వస్థలమైన కంచలగల్లికి ద్విచక్రవాహనంపై వస్తుండగా కెంపనపాళ్య గ్రామబైపాస్ రోడ్డుపై అదుపుతప్పి పడిపోయింది. తీవ్ర గాయాలైన ఆమెను మైసూరులోని కే.ఆర్. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కొళ్లేగాళ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అంతర్గత రిజర్వేషన్లపై గళం విప్పండిగౌరిబిదనూరు: ఎస్సీవర్గీకరణకు సంబంధించి అంతర్గత రిజర్వేషన్ల అమలుకు శాసనసభలో ప్రస్తావించాలని కర్ణాటక దళిత సంఘర్ష సమితి నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మంగళవారం ఎమ్మెల్యే పుట్టస్వామిగౌడను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. నేతలు మాట్లాడుతూ జనసంఖ్యకు అనుగుణంగా, వారి జాతుల ఆధారంగా రిజర్వేషన్లను జారీ చేయవచ్చని జస్టిస్ నాగమోహనదాస్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఏడాది గడిచినా అమలు జరగలేదన్నారు. అంశంపై సభలో గళం విప్పాలని కోరారు. హుదుగూరు నంజుండప్ప, మధుకుమార్, గంగాధరప్ప, వెంకటప్ప, కృష్ణప్ప, రామకృష్ణ, సనంద కుమార్, తదితరులు పాల్గొన్నారు. వాహనం ఢీకొని కూలీ మృతిదొడ్డబళ్లాపురం: అపరిచిత వాహనం ఢీకొని వలస కూలీ మృతిచెందిన సంఘటన దొడ్డ పట్టణ పరిధిలోని రైల్వేస్టేషన్ సర్కిల్లో చోటుచేసుకుంది.ఆంధ్రప్రదేశ్లోని చోళసముద్రం నివాసి బాలాజీ(40) స్థానికంగా ఉన్న ఒక తోటలో కూలిపనికి వచ్చినట్టు తెలిసింది. రైల్వేస్టేషన్ సర్కిల్లో నిలబడి ఉండగా అపరిచిత వాహనం ఢీకొంది. ప్రమాదంలో బాలాజీ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. దొడ్డ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. రమ్య కేసులో ఇద్దరు అరెస్టు యశవంతపుర: నటి రమ్యకు అనుచితమైన సందేశాలు పంపిన కేసుల్లో మరో ఇద్దరు నిందితులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉడుపివాసి ఆదర్శ్, సంజయ్లు నిందితులు. ఇప్పటివరకు ఈ కేసుల్లో 9 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదర్శర్, సంజయ్ నటుడు దర్శన్ అభిమానులుగా చెప్పుకొంటూ అనేక సందేశాలు పెట్టారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ సీమంతకుమార్ సింగ్ తెలిపారు. తిమ్మరోడిపై బీజేపీ ఫిర్యాదు యశవంతపుర: సామాజిక మాధ్యమాలలో ద్వేషపూరిత ఆరోపణలు చేసిన మహేశ్శెట్టి తిమ్మరోడిపై ఉడుపి జిల్లా కోటె, బ్రహ్మవర పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ శంకర్పై ఫేస్బుక్లో అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఉడుపి జిల్లాలో ఇది కలకలం రేకెత్తించింది. ఓ మతాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోటె, బ్రహ్మవర పోలీసులు తిమ్మరోడిపై కేసు నమోదు చేశారు. తిమ్మరోడి ధర్మస్థల మీద, సీఎం సిద్దరామయ్య మీద కూడా వివాదాస్పద ప్రకటనలు చేశాడు. -
అల్పపీడనం.. అధిక వర్షం
శివాజీనగర: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మలెనాడు, కరావళి, ఉత్తర కర్ణాటక భాగాల్లో విస్తారంగా వర్షం కురుస్తోంది. వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. రోజుల తరబడి వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. చిక్కమగళూరు జిల్లాలో కొండేకాన్ పర్యాటక ప్రాంతంలో భూమి కుంగిపోయి వాహనాలు చిక్కుకొన్నాయి. ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ జిల్లాల్లో బడులకు సెలవులు ధారవాడలో వర్షానికి కోర్టు సర్కిల్ బృందావన హోటల్ వద్ద చెట్టు కూలిపోవటంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. బెళగావి జిల్లాలోని బైలహొంగల, కిత్తూరు, ఖానాపుర, సవదత్తి, రామదుర్గ తాలూకాలోని పాఠశాల, కాలేజీలకు సెలవు ఇచ్చారు. ఉడుపి జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించి విద్యాలయాలను మూసివేశారు. బెళగావి, కొడగు, ఉత్తర కన్నడ, ధార్వాడ, బీదర్, చిక్కమగళూరులోనూ సెలవులే. మరోవైపు హాసన్లో కూడా వర్షం తీవ్రం కావడంతో విద్యాలయాలను మూసివేశారు. బెళగావిలో జలదిగ్బంధం ఎడతెగని వానలతో అపారమైన పంట నష్టం జరిగింది. తీర జిల్లాల్లో 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తుండగా, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు తెలిపారు. తీర, మధ్య కర్ణాటకలో మరో రెండు రోజులు కుంభవృష్టి కొనసాగుతుంది. మహారాష్ట్ర నుంచి వరద రావడంతో బెళగావి జిల్లాలో నదులు పోటెత్తాయి. 8 వంతెనలు జలావృతమయ్యాయి. 16 గ్రామాలకు సంబంధాలు కట్ అయ్యాయి. వేదగంగా, దూద్గంగా, కృష్ణా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కావేరి ఉధృతం మండ్య జిల్లాలో కేఆర్ఎస్ ఆనకట్ట నుంచి 91 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన వంతెనలు మునిగే అవకాశముంది. ప్రజలు నదిలోకి దిగరాదని అధికారులు చాటింపు వేశారు. శ్రీరంగపట్టణంలో 221 ఏళ్ల పురాతనమైన బ్రిటిష్ కాలపు వెల్లస్లీ వంతెన మునిగిపోయేలా నది ప్రవహిస్తోంది. వంతెనపై సంచారాన్ని బంద్ చేశారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కుండపోత ఉప్పొంగుతున్న కృష్ణా, కావేరి నదులు -
యాపిలా.. మజాకా.. జస్ట్ 1,000 కోట్లు!
బెంగళూరు: యాపిల్ ఫోన్ల రేట్లే కాదు.. యాపిల్ ఆఫీసుల రెంట్లు, లీజులు కూడా ఓ రేంజులో ఉంటాయి. తాజాగా బెంగళూరులో 2.7 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్ నుంచి యాపిల్ పదేళ్లపాటు లీజుకు తీసుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఎంబసీ జెనిత్ భవనంలోని మొత్తం 9 అంతస్తుల్లో (5 నుంచి 13వ అంతస్తు వరకూ) యాపిల్ కార్యాలయం పనిచేస్తుంది. దీని రెంట్, పార్కింగ్, మెయింటెనెన్స్ చార్జీలతో కలుపుకుని పదేళ్లకు రూ.వెయ్యి కోట్లకు పైనే చెల్లించనుంది. 2025 ఏప్రిల్ 3 నుంచి ఈ లీజు అమల్లోకి వచ్చింది. ఒప్పందంలో భాగంగా సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.31.57 కోట్లను యాపిల్ ఇప్పటికే చెల్లించింది. -
కట్న వేధింపులకు నవ వివాహిత బలి
కర్ణాటక: ఎన్నో ఆశలతో మెట్టినింటికి వెళ్లిన యువతి కొన్ని నెలలకే శవమైంది. కన్నవారికి తీరని కడుపు కోత మిగిలింది. వరకట్న వేధింపులను భరించలేక యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఘటన ఉద్రిక్తతను కలిగించింది. 40 తులాల బంగారం ఇచ్చి.. వివరాల మేరకు.. డెంకణీకోట తాలూకా కూటురు గ్రామానికి చెందిన గోపాలప్ప కూతురు గాయత్రితో హోసూరు గోకుల్నగర్కు చెందిన మురుగేషన్ కొడుకు కదిరేషన్తో గత 11 నెలల క్రితం పెళ్లి జరిగింది. మురుగేషన్ హోసూరులోని పారిశ్రామిక శిక్షణా కేంద్రంలో సహాయక ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడు. వధువు తల్లిదండ్రులు పెళ్లి సమయంలో 40 తులాల బంగారం, రూ. 6 లక్షల నగదును కట్నంగా అందజేశారు. ఈ నేపథ్యంలో ఇంకా కట్నం తీసుకురావాలని భర్త ఇంటివారు తీవ్రంగా వేధించడంతో గాయత్రి కొన్నిరోజుల కిందట పుట్టింటికి చేరుకుంది. భర్త ఆమెకు మాయమాటలు చెప్పి బెంగళూరులో కాపురం పెట్టాడు. 13వ తేదీన గాయత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్న రీతిలో శవమై తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని భర్తను అరెస్ట్ చేశారు. తమ కూతురిని బలిగొన్న గోపాల్, అతని కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని గాయత్రి తల్లిదండ్రులు సబ్కలెక్టర్ ఆక్రితి శెట్టికి కు వినతిపత్రం అందజేశారు. -
ధర్మస్థళ కేసులో ట్విస్ట్.. తవ్వకాల నిలిపివేత
ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. వందల మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు మాట మార్చాడు. తనతో బలవంతంగా ఈ ప్రకటన చేయించారని సిట్ ఎదుట మరో ప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో.. ఆ వ్యక్తిని మరోసారి ప్రశ్నించడంతోపాటు తవ్వకాలను ఆపేయాలని సిట్ నిరణయించింది. ‘నాకు ఒకరు పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారు. న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారు. నేను 2014 నుంచి తమిళనాడులోనే ఉంటున్నా’ అని సోమవారం ఆ వ్యకతి ప్రకటించాడు. దీంతో ముసుగు వ్యక్తిని ప్రేరేపించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్ నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతీ తెలిపారు. మరోవైపు.. భీమా, చిన్నయ్యగా కన్నడ మీడియా పిలుస్తున్న ముసుగు మనిషికి లై డిటెక్టర్ పరీక్షలు చేయించాలని కర్ణాటక విధానసభలో బీజేపీ సభ్యులు సోమవారం డిమాండ్ చేశారు. అతడు చూపించిన అన్ని ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు జరిపారని, ఒక ప్రదేశంలో మినహా మరెక్కడా కళేబరాలు, అస్థిపంజరాలు లభించలేని హోంమంత్రి పరమేశ్వర్ ప్రకటించారు. యూట్యూబర్లు ఇకపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే.. సిట్ తవ్వకాలు నిలిచిపోవడంపైనా ఆయన స్పందించారు. ఇప్పటిదాకా తవ్వకాల్లో దొరికిన అవశేషాల విశ్లేషణ పూర్తై.. ఆ నివేదిక వచ్చేదాకా సిట్ తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారాయన. అయితే.. అది పూర్తిగా సిట్ సొంత నిర్ణయమని, ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పారాయన. -
తుంగభద్ర వరద ఉగ్రరూపం
హొసపేటె: తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాచ్చింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల రైతుల జీవనాడి అయిన తుంగభద్ర డ్యాం నిండుకుండలా తొణికిసలాడుతోంది. సోమవారం డ్యాం వద్ద ఎగువ నుంచి జలాశయంలోకి 75 వేలకు పైగా క్యూసెక్కుల వరద నమోదైంది. అధికారుల లెక్కల ప్రకారం సాయంత్రానికి జలాశయంలోకి మరింత వరద పెరిగే అవకాశం ఉంది. డ్యాం వద్ద 26 క్రస్ట్ గేట్లలో 9 గేట్లను 2 అడుగులు 3 గేట్లను 3 అడుగులు, 12 గేట్లను 5 అడుగులు, ఒక గేటు 4 అడుగులు, మరో ఒక గేటు 3.5 అడుగుల మేర పైకెత్తి నదికి నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1624.96 అడుగులు, నీటినిల్వ 76.35 టీఎంసీలు ఉందని మండలి అఽధికారులు తెలిపారు. కంప్లి రోడ్డు వంతెనపై నిలిచిన రాకపోకలు తుంగభద్ర డ్యాం నుంచి నదికి లక్ష క్యూసెక్కుల మేర వరద నీటిని సోమవారం విడుదల చేయడంతో చిక్కజంతకల్ సమీపంలో ఉన్న కంప్లి రోడ్డు వంతెన పైకి నీటి ప్రవాహం చేరింది. దీంతో నదిలో తీవ్ర వరద పరిస్థితి తలెత్తింది. ఈ రహదారి గుండా వాహన రాకపోకలను నిషేధిస్తూ ప్రజా రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. హంపీలో నీట మునిగిన స్మారకాలు తుంగభద్ర జలాశయం నుంచి లక్షకు పైగా క్యూసెక్కుల వరకు నీరు విడుదల చేయడంతో హంపీ వద్ద నది తీరంలో ఉన్న స్మారకాలు నీట మునిగాయి. తుంగభద్ర పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హంపీ సమీపంలోని పురంధర మంటపం ఇప్పటికే పూర్తిగా మునిగింది. అనేక మంటపాల్లోకి సగం వరకు నీరు చేరింది. మరో వైపు కోదండరామ ఆలయానికి వెళ్లే దారి పూర్తిగా జలమయంగా మారింది. పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర డ్యాం నీరు నిండుకుండలా తొణికిసలాడుతున్న జలాశయం డ్యాంకు ఎగువ నుంచి 75 వేలకు పైగా క్యూసెక్కుల రాక డ్యాం వద్ద 26 క్లస్ట్ గేట్ల నుంచి దిగువకు నీరు విడుదల -
హనుమ భక్తుల మహాబైక్ ర్యాలీ
సాక్షి,బళ్లారి: నగరంలో హనుమ మాలధారులు చేపట్టిన బైక్ ర్యాలీ నగర వాసులను ఆకట్టుకుంది. సోమవారం సాయంత్రం మరూరు ఆభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న మాదిరిగానే ఈ ఏడాది కూడా హనుమ మాలధారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా హనుమ మాల ధరించడంతో ఆయన ఇచ్చిన పిలుపుతో వేలాది మంది హనుమ మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై వీరాంజనేయ, జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ తమ భక్తిని చాటారు. ముందుగా నగరంలో కూల్కార్నర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, మాజీ లోక్సభ సభ్యుడు సన్న పక్కీరప్ప, బెస్ట్ స్కూల్ అధినేత కోనంకి రామప్ప, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కే.ఎస్.దివాకర్, మాజీ బుడా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్, కార్పొరేటర్లు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, కే.ఎస్.అశోక్ తదితరులు పాల్గొని వేదికపై ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి బైక్ ర్యాలీని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న హనుమ భక్తులు బైక్పై ఆంజనేయ స్వామి ఉన్న కాషాయ జెండాను కట్టుకుని, మెడలో వేసుకుని నగరంలో నినాదాలు చేస్తూ హోరెత్తించారు. గత పదేళ్లుగా కొనసాగుతున్న ఈ బైక్ ర్యాలీ ఈసారి విజయవంతం కాగా ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోందని, అదంతా ఆంజనేయ స్వామి మహిమ అని కొనియాడారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న హనుమ మాలధారులు -
పండ్లు, కూరగాయల మార్కెట్లను తరలించాలి
బళ్లారి అర్బన్: ఏపీఎంసీలోని పండ్లు, కాయగూరల మార్కెట్లను వేరే చోటకు తరలించాలని బళ్లారి ఏపీఎంసీ ట్రేడర్స్ అసోసియేషన్ జిల్లాధ్యక్షుడు మెణసిన ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. ఆయన ఏపీఎంసీ శాఖ మంత్రి శివానంద పాటిల్కు రాసిన వినతిపత్రాన్ని జిల్లాధికారి కార్యాలయంలో అధికారికి అందజేసి మాట్లాడారు. ఏపీఎంసీ మార్కెట్ ఉన్నది రైతుల వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికని అన్నారు. అయితే స్థలాభావం వల్ల రైతులు తమ ఉత్పత్తులను రోడ్డులో వేయడం వల్ల ఆటోలు, లారీలు వాటి మీదుగా వెళ్లడంతో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. పండ్లు, కూరగాయల మార్కెట్ పశువుల సంతలా మారాయని, తక్షణమే వేరే చోటకు తరలించాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి వసంత్ కుమార్, ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు పాలన్న, అరవిందం, కన్ని శివమూర్తి, ప్రహ్లాద్, విజయ్కుమార్, మనోజ్కుమార్, నరసింహులు, వినోద్కుమార్, పదాధికారులు పాల్గొన్నారు. -
ఈ రోడ్ల పనులకు మోక్షమెన్నడో?
బళ్లారిటౌన్: నగర శివార్లలోని వాజ్పేయి లేఅవుట్ వెనుక భాగంలోని దొడ్డబసవేశ్వర లే అవుట్ నుంచి స్టాండర్డ్ ఇన్ఫ్రా లేఅవుట్ వరకు రోడ్లన్ని పూర్తిగా ధ్వంసమై, అడుగు తీసి అడుగు వేయలేని విధంగా మారాయి. ఈ ప్రాంతంలో వందలాది ఇళ్ల నిర్మాణం జరిగింది. గత ఐదేళ్లుగా ప్రారంభం నుంచి స్థానికులే గ్రావెల్ వేసుకుని రోడ్డు నిర్మాణం చేసుకున్నారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఈ రోడ్లన్ని బురదమయంగా మారాయి. మూడేళ్ల క్రితం రూరల్ ఎమ్మెల్యే నాగేంద్రను కలిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆయన్ను కోరారు. 2022 నుంచి ఇక్కడ అభివృద్ధి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. రోడ్ల అభివృద్ధికి రూ.3.5 కోట్లు నిధులు కావాలని నివేదకను కూడా పంపారు. గత ఏడాది ఆగస్టులో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయి. అయితే ప్రస్తుతం వశిష్ట కళాశాల వరకు కేవలం ఒక సీసీ రోడ్డు నిర్మాణ పనులు మాత్రమే ప్రారంభించారు. మిగిలిన రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం చేయాల్సి ఉండగా, ఈ రోడ్లను మూడేళ్లలో దశల వారీగా నిర్మించే యోచనలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న చిత్తడి నేల పరిస్థితి చూసి అయినా ఈ పనులు త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
గృహిణి అనుమానాస్పద మృతి
హుబ్లీ: కాళ్లపారాణి ఆరక ముందే ఓ గృహిణి గోకుల్ రోడ్డు పోలీసు స్టేషన్ పరిధిలోని నందగోకుల లేఅవుట్లో అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతురాలు జయశ్రీ బడిగేర్(31) ఆమె ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈమె స్వగ్రామంలో గదగ్ జిల్లా హొళెఇటిగి కాగా హుబ్లీ నివాసి శివానందతో గత మే 21న వివాహం జరిగింది. ఉరి వేసుకున్న స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైందని, ఆమె ఆత్మహత్య చేసుకొలేదని, హత్య చేసి ఇలా నాటకం ఆడుతున్నారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా భర్త శివానందను ఈ కేసులో అరెస్ట్ చేశారు. పెళ్లికి ముందు శివానంద తన ప్రేమ వ్యవహారాన్ని దాచి పెట్టారని, ఇదే విషయమై తరచు ఘర్షణలు, వేధింపులకు పాల్పడే వారని మృతురాలి బంధువులు ఆరోపించారు. జయశ్రీ మృతదేహాన్ని కిమ్స్ మార్చురీకి తరలించారు. ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువులు కన్నీరుమున్నీరైన వైనం చూపరులను కలిచి వేసింది. దుష్ప్రచారకులపై చర్యలు తీసుకోండి హుబ్లీ: ధర్మస్థలపై భారీ స్థాయిలో కుట్ర జరుగుతోందని, దుష్ప్రచారం చేసే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వరూరు నవగ్రహ తీర్థ క్షేత్రం గుణధర నంది మహారాజ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం మంచిదేనని, దీని వల్ల సత్యాలు బయటకు వస్తాయి. అయితే ఈ విషయంతో పాటు కుట్రలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి ఉగ్రవాది అయినా 300 హత్యలు చేయడం అసాధ్యం అని, ఈ నేపథ్యంలో పలువురిపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసిన వారి వ్యతిరేకంగా కూడా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. దుష్ప్రచారమే ధ్యేయంగా పని చేస్తున్న కొందరు యూట్యూబర్లపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా వాటి నియంత్రణకు తగిన నియమావళి రూపొందించాలని ఆయన సూచించారు. పైకప్పు పెచ్చులూడిన బస్టాండ్ రాయచూరు రూరల్: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. గత కొన్ని రోజుల నుంచి వానలు కురుస్తుండడంతో సోమవారం అకస్మాత్తుగా పెచ్చులూడి పడ్డాయి. త్రుటిలో ప్రయాణికులు ప్రమాదం నుంచి బయట పడ్డారు. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు బస్సుల కోసం వేచి ఉన్న సమయంలో పెచ్చులూడడంతో పిల్లలతో పాటు పెద్దలు భయభ్రాంతులకు గురయ్యారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి రాయచూరు రూరల్: సమాజంలో మార్పులకు అనుగుణంగా పురాతన కాలం నాటి సంస్కృతిని, ఆచారాలను అలవర్చుకొనేలా రాసిన పుస్తకాలకు, సీనియర్ సాహితీవేత్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆది కవి వాల్మీకి మహర్షి విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ శివానంద పేర్కొన్నారు. కన్నడ భవనంలో జిల్లా, తాలుకా కన్నడ సాహిత్య పరిషత్, కళా సంకుల సంస్థల ఆధ్వర్యంలో రేఖా బడిగేర్ రాసిన ఉద్దో యల్లమ్మ పుస్తకం విడుదల చేసి మాట్లాడారు. సాహితీవేత్త రాసిన పుస్తకాలు ప్రజల మన్ననలను పొందాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రంగణ్ణ పాటిల్, తాలూకా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు వెంకటేష్ బేవినబెంచి, రావుత్రావ్, వీరహనుమాన్లున్నారు. -
టీబీ డ్యాం క్రస్ట్గేట్ల నిర్వహణలో విఫలం
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం టీబీ డ్యాం క్రస్ట్గేట్ల నిర్వహణలో విఫలమైందని, జిల్లా ఇన్చార్జి, కన్నడ సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగిని మంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ జిల్లాధ్యక్షుడు వీరనగౌడ డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీబీ డ్యాం పరిధిలోకి వచ్చే రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాల్లోని కాలువలకు రెండవ పంటకు నీరు ఇవ్వడం కుదరదని మంత్రి పేర్కొనడాన్ని ఖండించారు. బెంగళూరులో జరిగిన సమావేశంలో మంత్రి ప్రస్తావించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. కేంద్ర జలవనరుల శాఖ అధికారులు క్రస్ట్గేట్లను మరమ్మతు చేయాలని ఆదేశించినా సర్కార్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. క్రస్ట్గేట్లు పని చేయని వైనంపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రశ్నించినా జవాబివ్వక పోవడం సరికాదన్నారు. రైతులకు ఎకరాకు రూ.లక్ష పరిహారం అందించాలని కోరారు. సిద్దనగౌడ, శంకరరెడ్డి, వీపీ రెడ్డిలున్నారు. -
పీఓపీ వినాయక విగ్రహాలు స్వాధీనం
హుబ్లీ: ధార్వాడ జిల్లా కుందగోళ పట్టణంలో తహసీల్దార్ రాజు నేతృత్వంలో ఆకస్మిక దాడి చేసిన టాస్క్ఫోర్స్ బృందం 10 పీఓపీ వినాయక విగ్రహాలను స్వాధీనం చేసుకుంది. ఆ విగ్రహాలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విక్రయ కేంద్రాలపై దాడి చేశారు. ఈ మేరకు కిల్లా వీధిలో విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న విగ్రహాలను పట్టణ పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచామన్నారు. విగ్రహాలను పరీక్షించి నివేదిక వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దాడిలో పట్టణ పంచాయతీ ముఖ్యాధికారి సీవీ కులకర్ణి, ఎస్ఐ ఇమ్రాన్ పఠాన్, ఆరోగ్య అధికారిణి జానకి బళ్లారి తదితరులు పాల్గొన్నారు. 26న వీరభద్రేశ్వర జయంతి ఉత్సవాలు రాయచూరు రూరల్: దేశ వ్యాప్తంగా ఈ నెల 26న వీరభద్రేశ్వర జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జాతీయ వీరశైవ సంఘం వేదిక సలహా సభ్యుడు జీజీ మనోహర్ తెలిపారు. ఆయన ఈమేరకు సోమవారం నగరంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో సెప్టెంబర్ 15న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో వీరభద్రేశ్వర అవార్డును అందజేస్తారన్నారు. 2021 నుంచి వీరభద్రేశ్వర అవార్డును ప్రకటించామన్నారు. 2021లో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు, 2022లో బెళగావి ప్రభాకర్ కోరేకు, 2023లో ఇస్రో చైర్మన్ మనోహర్కు, 2024లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సోమన్నకు, 2025లో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడకు ఇవ్వాలని తీర్మానించినట్లు తెలిపారు. చదువుతో పాటు క్రీడలూ అవసరమే బళ్లారిఅర్బన్: చదువుతో పాటు ఆటపాటల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని ఎస్ఎల్ఎన్ సేవా సంస్థ అధ్యక్షుడు, శ్రీధరగడ్డ జెడ్పీ ప్రముఖులు వై.షణ్ముఖ తెలిపారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు యూనిఫాంలను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. గాంధీనగర డివిజన్ స్థాయి ఈ క్రీడా పోటీల్లో సంస్థ తరపున ఉచితంగా విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశామన్నారు. ఆటల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా దృఢంగా తయారవుతారని, విజేతలుగా నిలిచి తమ ఊరికి పేరు తేవాలని ఆయన క్రీడాకారులకు సూచించారు. ఆ పాఠశాల ప్రముఖులు ఎన్.వీరేష్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయిని సరస్వతి, మాలగడ్డ బాబు, పీఈటీ రాఘవేంద్ర, ఉమామహేశ్వరి శెట్టితో పాటు క్రీడాకారులు, విద్యార్థులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. గణేష్ మంటపాలకు స్థల పరిశీలన రాయచూరు రూరల్: నగరంలో ప్రశాంతంగా గణేష్ పండుగ ఆచరణ దిశగా నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో మంటపాలకు స్థల పరిశీలన చేశారు. సోమవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంచరించి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈనెల 27న వినాయకులను ప్రతిష్టాపించాలని 31న నిమజ్జనం చేయాలన్నారు. డీజేల ఏర్పాటును పూర్తిగా నిషేధించామన్నారు. రాత్రి 10 గంటల తరువాత డీజేలను వినియోగిస్తే కఠిన చర్యలు చేపడతామన్నారు. అదనపు ఎస్పీ కుమార స్వామి, డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ కాంబ్లేలున్నారు. స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలి రాయచూరు రూరల్ : సమాజంలో బతుకు తెరువుకు, జీవనోపాధికి, స్వయం ఉపాధిపై విద్యార్థులు దృష్టి సారించాలని హైదరాబాద్ కర్ణాటక విద్యా సంస్థల ఉపాధ్యక్షుడు రాజా భీమళ్లి పిలుపునిచ్చారు. సోమవారం కలబుర్గిలోని హైదరాబాద్ కర్ణాటక విద్యా సంస్థ, వీరమ్మ గంగసిరి మహిళా జూనియర్ కళాశాలలో అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంస్కారాలతో పాటు జీవిత విలువలను అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి ఉదయ్ కుమార్, ఎన్ఎస్ఎస్ అధికారి మహేష్, ప్రిన్సిపాల్ రాజేంద్ర కొండా, వీణా, మోహన్రాజ్, సుష్మా, ఉమా, రేణుకలున్నారు. -
ఏకధాటి వర్షాలు.. అధ్వానంగా వీధులు
రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో భారీ వర్షం కురిిసింది. సోమవారం మధ్యాహ్నం గోడ గడియారం, బస్టాండ్ రహదారిలో వర్షపు నీరు ఏరులై పారింది. ఎక్కడ చూసినా రోడ్లు నీటి గుంతలుగా మారాయి. అంబేడ్కర్ సర్కిల్, టిప్పు సర్కిల్, కసబా లింగసూగూరు, గాంధీ చౌక్, పోలీస్ స్టేషన్ చౌక్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చొరబడ్డాయి. వాటిని తొలగించుకోడానికి మహిళలు నానా తంటాలు పడ్డారు. బైరూన్కిల్లా, నీరుబావికుంట, మున్నూరు వాడి, గాంధీ చౌక్, మహావీర్ చౌక్, బంగికుంట, కూరగాయల మార్కెట్లోకి వర్షపు నీరు చొరబడ్డాయి. రాయచూరు నగరసభ పరిధిలోని ప్రధాన రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. నగరసభ ఇంజినీర్లు ముందు చూపు లేకుండా ఇష్టానుసారంగా రోడ్లను నిర్మించడంతో ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలున్నాయి. పూడికతో నిండిన మురుగు కాలువలు మురుగు కాలువల్లో చెత్తను సక్రమంగా ఎత్తివేయక పోవడంతో కాలువలు నిండిపోయి రహదారుల పైకి మురుగు నీరు ప్రవహిస్తున్నాయి. కాలువ మీద నిర్మించిన వంతెనల వద్ద పూడిక నిండిపోతోంది. నగరసభ అధికారులు, ఇంజినీర్లు ఇప్పటికై నా స్పందించి కాలువలో పూడికతీతకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలో రహదారులు అధ్వానంగా మారాయి. చిన్నపాటి వానలకు గుంతలు పడిన రహదారులను పూడ్చడంలో నగరసభ మౌనం వహించింది. ఆదివారం సాయంత్రం బోళమానుదొడ్డి రహదారిలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా అదుపు తప్పి కిందపడి గాయపడిన యువకుడిని అంబులెన్సు ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఇక యాదగిరి జిల్లాలోనూ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు నీటి గుంతలుగా మారిన వైనం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు -
తిరుమల యాత్రలో ఘోర విషాదం
తనకల్లు: ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల వెంకన్నస్వామిని దర్శించుకుని ఇళ్లకు సంతోషంగా తిరుగుముఖం పట్టినవారి మీద మృత్యువు పంజా విసిరింది. ఈ ఘోరంలో నలుగురు చనిపోగా కొందరు గాయపడడంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం తాండవిస్తోంది. సోమవారం ఉదయం ఏపీఎస్ ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు, రెండు టూరిస్ట్ మినీబస్సులు ఢీకొన్నాయి. తనకల్లు మండలం మండ్లిపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో టూరిస్ట్ బస్సుల్లోని అనసూయమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ మణికంఠ (41), నాగేంద్రప్ప (45), జాహ్నవి (4) చికిత్స పొందుతూ మరణించారు. మృతులంతా కర్ణాటకవాసులే. ఎలా జరిగిందంటే.. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందిన భక్తులు రెండు టూరిస్ట్ మినీబస్సుల్లో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం బళ్లారికి తిరుగు పయనమయ్యారు. మార్గంమధ్యలో మండ్లిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న మలుపు వద్ద కదిరి నుంచి మదనపల్లి వెళుతున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టూరిస్ట్ బస్సు ఢీకొంది. ఆ వెనుకనే వస్తున్న మరో టూరిస్ట్ బస్సు ముందున్న టూరిస్ట్ బస్సును ఢీకొట్టింది. ఒకదానికొకటి బలంగా ఢీ కొనడంతో ముందున్న టూరిస్ట్ బస్సు నుజ్జునుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న అనసూయమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నారి జాహ్నవి, డ్రైవర్ మణికంఠ, నాగార్జున, కుమార్స్వామి, భార్గవి, రిత్విక, నాగేంద్రప్ప, గోవిందమ్మ, గోవిందప్ప, రాకేష్, చిన్నమ్మ, అంజినమ్మ తీవ్రంగా గాయపడ్డారు. భీతావహం వెంటనే స్థానికులు బాధితుల్ని తమ అంబులెన్స్లో తనకల్లు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తరువాత జాహ్నవి, నాగేంద్రప్ప, మణికంఠ, నాగార్జున, రిత్విక, భార్గవిలను కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో డ్రైవర్ మణికంఠ, నాగేంద్రప్ప, జాహ్నవి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వీరు చనిపోయారు. తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల ఆర్తనాదాలతో ఘటనాస్థలి మార్మోగింది. రెండు టూరిస్టు మినీ బస్సులు, ఆర్టీసీ బస్సు ఢీ ఏపీలో కదిరి వద్ద దుర్ఘటన నలుగురు మృతి, 9 మందికి గాయాలు బాధితులు బళ్లారి ప్రాంతవాసులు -
టీచర్ని బదిలీ చేయరాదని ధర్నా
శ్రీనివాసపురం: తాలూకాలోని శెట్టిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు వరలక్ష్మిని వేరే ప్రాంతానికి బదిలీ చేసిన ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు సోమవారం బీఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి రామచంద్రప్ప మాట్లాడుతూ పాఠశాలలో వరలక్ష్మి టీచర్ ఎన్నో యేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కేవలం 15 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను వరలక్ష్మి టీచర్ వచ్చిన తరువాత 150 మంది అయ్యారు. ఉత్తమ టీచర్గా పేరు గడించారు. ఇలాంటి టీచర్ను అదనపు టీచర్ జాబితాలో చూపించి బదిలీ చేయడం ఎంతవరకు సమంజసమని వాపోయారు. కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు పంపి వరలక్ష్మి టీచర్ను ఇక్కడే కొనసాగించాలన్నారు. ధర్నాలో ఎస్డీఎంసీ అధ్యక్షుడు నవీన్, ఉపాధ్యక్షురాలు సుమిత్రమ్మ, గ్రామస్తులు చైత్ర, నవీన్కుమార్ తదితరులు ఉన్నారు. -
మల్నాడు జిల్లాల్లో వాన హోరు
మండ్య జిల్లాలో కేఆర్ఎస్ డ్యాం నుంచి కావేరి పరుగుచిక్కమగళూరులో జల్లులు శివమొగ్గ: మల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీని కారణంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. శివమొగ్గ జిల్లాలోని ప్రధాన జలాశయాలైన తుంగ, భద్ర, లింగనమక్కిలకు ఇన్ఫ్లో గణనీయంగా పెరిగింది. ఆగస్ట్ 18 ఉదయం నాటికి గజనూరులోని తుంగా రిజర్వాయర్ ఇన్ఫ్లో 73,415 క్యూసెక్కులు ఉంటే, 76,656 కూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీంతో శివమొగ్గ నగరం గుండా తుంగా నది నిండుగా ప్రవహిస్తోంది. నీటి విడుదల మరింత పెరిగితే నగరంలోని నదికి అటు ఇటు ఉన్న ప్రాంతాలు మునిగిపోతాయనే భయం నెలకొంది. ప్రమాదకరంగా భద్ర మరో వైపు భద్ర డ్యాం ఇన్ప్లో 43,430 క్యూసెక్కులకు పెరిగింది. 39,245 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రావతి వద్ద నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. కొత్త వంతెన మునిగిపోవడంతో వాహనాలను నిషేధించారు. కలువగుండి ప్రాంతంలో కొన్ని ఇళ్లలోకి వాన నీరు ప్రవేశించింది. వారికి కమ్యూనిటీ హాల్లో ఆశ్రయం కల్పించారు. లింగనమక్కి ఆనకట్ట నిండుగా ఉంది. చిక్కమగళూరులో మూడురోజులుగా జోరువాన కురుస్తూనే ఉంది. విద్యార్థులు, చిరువ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. మండ్య జిల్లాలో కృష్ణరాజసాగర జలాశయం నిండిపోవడంతో భారీ మొత్తంలో నీటిని వదిలేస్తున్నారు. శివమొగ్గలో కుండపోత శివమొగ్గ జిల్లాలో హొసానగర తాలూకాలోని పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురిశాయి. మణిలో 238 మిల్లీమీటర్లు, యాదూర్ 200 మిల్లీమీటర్లు, హులికల్ 220 మిల్లీమీటర్లు, మస్తికట్టె 204, చక్ర 150, సావెహక్లు ప్రాంతంలో 179 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ చేసింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తుంగ, భద్ర నదులు ఉధృతం -
సంద్రంలో అలజడి.. ఒడ్డుకు పిల్ల డాల్ఫిన్లు
యశవంతపుర: అరేబియా సముద్రం వెంబడి భారీగా వానలు పడుతున్నాయి. సముద్రంలో గాలులు వీస్తూ పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, ఆ అలజడికి డాల్ఫిన్ పిల్లలు ఒడ్డుకు వస్తున్నాయి. కార్వార సమీపంలో సోమవారం జంగిల్ లాడ్జెస్ రిసార్ట్ వద్ద ఒడ్డుకు రాగా స్థానికులు వాటిని మళ్లీ సముద్రంలో వదిలారు. తుఫాన్ కారణంగా తల్లీ పిల్లలు వేరైనట్లు తెలుస్తోంది. రిసార్టులో ఉన్న పర్యాటకులు ఆ జలచరాలను ఆసక్తిగా వీక్షించి ఫోటోలు వీడియోలు తీశారు. రేబీస్కు చిన్నారి బలి దొడ్డబళ్లాపురం: నాలుగు నెలల క్రితం వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక రేబీస్కు గురై ప్రాణాలు వదిలింది. ఈ విషాద సంఘటన దావణగెరెలోని శాస్త్రి కాలనీలో చోటుచేసుకుంది. ఖదీరా బాను (4) అనే బాలిక నాలుగు నెలల క్రితం ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా టీకాలు వేశారు. అయితే గాయాలు తీవ్రంగా ఉండడంతో క్రమంగా బాలికకు రేబీస్ వ్యాధి సోకింది. పరిస్థితి విషమించడంతో బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న చిన్నారి ఆదివారం రాత్రి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కిరాతక భర్త చేతిలో భార్య హత్య మైసూరు: పొలాన్ని అమ్మి డబ్బులు తీసుకోవాలని భర్త, పొలం అమ్మరాదని భార్య పట్టుదల. చివరకు భార్య హత్యకు దారితీసింది. ఈ సంఘటన మైసూరు సిటీలోని విజయనగర ఠాణా పరిధిలోని మహాదేశ్వర లేఔట్లో జరిగింది. పాపన్న (56) చేతిలో గాయత్రి (45) హత్యకు గురైంది. వివరాలు.. పాపన్న గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు, నష్టాలు వచ్చాయని అప్పులు చేసి మద్యానికి బానిసయ్యాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉండగా ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు అయ్యాయి. కుమార్తెకు పెళ్లి చేయాల్సి ఉంది. కొడుకులు కష్టపడి తండ్రి అప్పులు తీర్చేపనిలో ఉన్నారు. అయినా నిత్యం డబ్బులు కావాలని భార్యా పిల్లలను సతాయించసాగాడు. సాహుకారహుండిలో ఉన్న పొలాన్ని అమ్మేద్దామని చెప్పడంతో భార్య వద్దని వారిస్తోంది. ఆదివారం కూడా గొడవ జరిగింది. ఆగ్రహం పట్టలేని పాపన్న కొడవలిలో భార్యను నరికి చంపాడు. ఇంటికి తాళం వేసి రక్తపు మరకలతో పారిపోతూ ఉండగా కొడుకు చూశాడు. ఇంటికి వెళ్లి చూడగా తల్లి మృతదేహం కనిపించింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలించి నిందితున్ని అరెస్టు చేశారు. -
పుష్పరాశులకు ఇక సెలవు
● లాల్బాగ్ ఫ్లవర్ షో సమాప్తం బనశంకరి: స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా బెంగళూరు లాల్బాగ్లో గత 11 రోజులుగా నిర్వహిస్తున్న వీరనారి రాణి కిత్తూరు చెన్నమ్మ, క్రాంతివీర సంగోళ్లి రాయణ్ణ థీమ్ ఫల పుష్ప ప్రదర్శన సోమవారం సాయంత్రంతో సమాప్తమైంది. ఆదివారం నాటికి 5.80 లక్షల మందికి పైగా వీక్షించారు. టికెట్ల ద్వారా రూ.2.50 కోట్లపైగా వసూలైంది. గత మూడు రోజులుగా సెలవులు రావడంతో లాల్బాగ్ కిటకిటలాడింది. అప్పుడప్పుడు వర్షాల వల్ల కొద్దిగా సందడి తగ్గింది. పుష్ప సౌందర్యాలను ఫోటోలు తీస్తూ సందడి చేశారు. మళ్లీ పుష్ప ప్రదర్శన గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జనవరిలో జరుగుతుంది. -
శనీశ్వరస్వామి వైభవం
తుమకూరు: శ్రావణ మాసంలో భాగంగా నగరంలోని శనీశ్వర ఆలయంలో విశేష పూజలు జరిగాయి. వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. సోమవారం పూల పల్లకీలో స్వామివారి ఊరేగింపు సంభ్రమం సాగింది. వీరభద్ర కునిత సహా జానపద కళాకారుల ప్రదర్శనలు రంజింపజేశాయి. ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఉత్సవం నగరంలోని ప్రధాన రహదారుల గుండా కదిలింది. ఆలయ ప్రధాన పూజారి రాజన్న, వందలాది భక్తులు పాల్గొన్నారు. ఫ్లై ఓవర్ ర్యాంపు ప్రారంభం శివాజీనగర: బెంగళూరులో ట్రాఫిక్పరంగా ఎంతో ముఖ్యమైన హెబ్బాళ జంక్షన్లో కే.ఆర్.పురం వైపు నుంచి మేఖ్రీ సర్కిల్ వైపు సంచరించేందుకు నిర్మించిన ఫ్లై ఓవర్ ర్యాంప్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ర్యాంపుపై కాలేజీ రోజుల్లోని పాత యజ్డీ బైక్ మీద డీసీఎం డీ.కే.శివకుమార్ రైడ్ చేశారు. ప్రారంభోత్సవం తరువాత ప్రజల వాహనాలను అనుమతించారు. ప్రపంచంలో గుర్తింపు పొందిన బెంగళూరు నగరానికి కొత్త రూపాన్ని ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని డీకేశి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు నటి రమ్యా పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు దొడ్డబళ్లాపురం: మహిళపై అత్యాచారం చేశాడని మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ ఎమ్మెల్యే భగవాన్ శర్మపై బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ (40) ఫిర్యాదు చేసింది. వివాహం చేసుకుంటానని నమ్మించి ఎయిర్పోర్టు హోటల్కి తీసికెళ్లి అఘాయిత్యం చేశాడు, చిత్రదుర్గలో కూడా లైంగిక దాడి చేశాడు, పెళ్లి మాత్రం చేసుకోలేదు, వీడియోలు తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు పేర్కొంది. పోలీసులు కేసు విచారణ చేపట్టారు. -
‘ధర్మస్థళ తవ్వకాల’ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ
సామూహిక ఖననాల నేపథ్యంలో తవ్వకాలు జరిపిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. కర్ణాటక ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వనుందా? అనే ఆసక్తి నెలకొంది. అదే సమయంలో.. తవ్వకాలపై ప్రభుత్వం తరఫున కర్ణాటక అసెంబ్లీలో మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువనుండగా.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ధరస్థళ తవ్వకాల వ్యవహారం.. కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతోంది. ధర్మస్థళ పుణ్యక్షేత్రంపై భారీ కుట్ర జరుగుతోందని, క్షేత్ర ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సిట్ విచారణలో వాస్తవాలు బయటపడతాయని, ఆరోపణలు ఉత్తవేనని తేలితే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు. ఈ క్రమంలో.. ఇదే తరహా ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష బీజేపీ.. డీఎకేఎస్ కామెంట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూస్తోంది.ధర్మస్థళ తవ్వకాలను బీజేపీ మొదటి నుంచి ఖండిస్తోంది. దివారం సుమారు 20 మంది చట్టసభ్యులు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రతో కలిసి ధర్మస్థళ పెద్దలను కలిశారు. వాళ్లు కలిసిన వాళ్లలో ఆలయ ధర్మకర్త, రాజ్యసభ ఎంపీ వీరేంద్ర హెగ్డే కూడా ఉన్నారు. ఆధ్యాత్మిక పట్టణం విషయంలో జరుగుతున్న విషప్రచారాన్ని అడ్డుకోవడంలో సీఎం సిద్ధరామయ్య విఫలమయ్యారని, తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని వాళ్లంతా డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం శివకుమార్ నిజమైన మంజునాథుడి భక్తుడే అయితే.. జరిగిన ఆ కుట్ర ఏంటో, దానివెనక ఎవరున్నారో బయటపెట్టాలి అని డిమాండ్ చేశారు.అదే సమయంలో ఇప్పటిదాకా జరిగిన సిట్ తవ్వకాలపై మధ్యంతర నివేదికను బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎవరో.. ఏదో చెప్పారని.. ప్రభుత్వం తవ్వకాలు చేయించడం ఏంటి?. పోనీ ఇప్పటిదాకా జరిగిన తవ్వకాల్లో ఏమైనా బయటపడ్డాయా? అంటే అదీ లేదు. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి.. పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. నిజాలు.. నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది అని బీజేపీ అంటోంది. ఈ క్రమంలో.. శాసనసభ ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ సంచలన ఆరోపణలకు దిగారు.వామపక్ష భావజాలం ఉన్న ఓ అర్బన్ నక్సల్స్ గ్యాంగ్.. ధర్మస్థళపై తప్పుడు ప్రచారానికి దిగింది. హిందువులకు, ధర్మస్థళకు వ్యతిరేకంగా విషప్రచారం చేస్తోంది. ఆ దండుపాళ్య ముఠా చేసిన ప్రచారానికి ప్రభుత్వం తలొగ్గింది. దీనంతటికి సీఎం సిద్ధరామయ్యే కారణం. ఆయన అధికారంలోకి రాకముందు.. వాళ్లంతా అడవుల్లో తిండి కోసం కష్టాలు పడేవారు. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ధర్మస్థళ ఆలయంపైకే జేసీబీలను నడిపిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. సౌజన్య కేసులోనో.. సిట్ దర్యాప్తునకో మేం అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. కానీ, ఏవరో ఏదో చెప్పారని సీఎం సిట్ను ఏర్పాటు చేయించడమే ఇక్కడ విడ్డూరంగా ఉంది. ఇధి ధర్మస్థళ ప్రతిష్టను దెబ్బ తీసే చర్యనే. అందుకే దానినే మేం వ్యతిరేకిస్తున్నాం అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ధర్మస్థళ వ్యవహారంలో సిట్ మధ్యంతర నివేదికను బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే హోం మంత్రి పరమేశ్వర మాత్రం ఈ వ్యవహారంలో పూర్తి స్వేచ్ఛ సిట్కే ఉందని తేల్చి చెప్పారు. ‘‘ఈ వ్యవహారంలో మధ్యంతర, తుది నివేదిక ఇవ్వడమనేది సిట్ చేతుల్లోనే ఉంది. మేం ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోం’’ అని అన్నారు. మరికాసేపట్లో ఆయన అసెంబ్లీలో తవ్వకాల వ్యవహారంపై ప్రకటన చేయబోతున్నారు.1995-2014 మధ్య వందలాది హత్యలు జరిగాయని, వాటి మృతదేహాలను తానే ఖననం చేశానంటూ గతంలో ధర్మస్థళ క్షేత్రంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన ఓ వ్యక్తి(61) ఆరోపణలకు దిగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆలయ పెద్దల ఆదేశాల మేరకు తాను ఆ పని చేశానంటూ చెప్పుకొస్తున్నాడా వ్యక్తి. ఈ క్రమంలో.. 2022లో ట్రిప్ కోసం ధర్మస్థళకు వెళ్లిన తన 22 ఏళ్ల కూతురు తిరిగి రాలేదంటూ బెంగళూరుకు చెందిన సుజాత భట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేగు(విజిల్ బ్లోయర్ ) ఆరోపణలు, సుజాత ఫిర్యాదు నేపథ్యంలో.. కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక బృందంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తోంది. ఆ వ్యక్తి తొలుత చూపించినట్లు 13 చోట్ల మాత్రమే కాకుండా.. ఆపై గుర్తించిన మరో నాలుగు చోట్ల కూడా సిట్ తవ్వకాలు జరిపించింది. అత్యాధునిక సాంకేతికత సాయం తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో రెండు చోట్ల మాత్రమే అస్థిపంజరాల అవశేషాలు బయటపడినట్లు తెలుస్తోంది. అయితే పశ్చిమ కనుమల్లో పుట్టిన నేత్రావతి నదీ.. గత దశాబ్దంన్నరకాలంగా తీవ్ర వరదలతో ప్రభావితం అయ్యింది. దీంతో తీర ప్రాంతం కోతకు గురై సమూలంగా మారిపోయిందని, బహుశా ఆ అవశేషాలు కొట్టుకుపోయి ఉంటాయని చెబుతున్నాడతను. మరోవైపు.. సుజాత తన కూతురు అనన్య ఫొటోను తొలిసారిగా మీడియాకు విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో ఈ కేసు మిస్టరీ ఎలా ముగుస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. -
టెకీకి భారీ ఊరట, కంపెనీకి షాకిచ్చిన కోర్టు
బెంగళూరు టెక్నీషియన్ ఉగాండాలో ఒంటరిగా వదిలేసినందుకు యజమానిపై కేసు వేసి, రూ.3 లక్షలకు పైగా గెలుచుకున్నాడు. టెక్నికల్ కన్సల్టెంట్ - కంపెనీ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంలో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అతని బకాయిలు, ఇతర పత్రాలను ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసిందన్న ఐటీ ఉద్యోగి వాదనను సమర్ధించిన కోర్టు రూ. 3 లక్షల బకాయిలు, 6 శాతం వార్షిక వడ్డీ, రిలీవింగ్ లెటర్ ,అతని ఒరిజినల్ విద్యా సర్టిఫికెట్లను అతనికి తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం పాపారెడ్డిపాళ్యంలోని ఐటీఐ లేఅవుట్లో నివసించే రక్షిత్ ఎంవీ, సెప్టెంబర్ 2016లో లోకస్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో చేరారు. డిసెంబర్ 2019లో ఉగాండాలోని కంపాలాలో ఒక క్లయింట్ ప్రాజెక్ట్ కోసం రక్షిత్ను నియమించారు. ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. అయితే పదే పదే అభ్యర్థించినప్పటికీ అతనికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వకుండా కంపెనీ నిర్లక్ష్యం చేసింది. పైగా పొడిగించిన స్టే సమయంలో తన జీత భత్యాలను ఏకపక్షంగా సగానికి తగ్గించిందనీ, నెలకు చెల్లించాల్సిన పీఎఫ్ రూ.3,600 రూపాయలు జమ చేయలేదని వాదించారు. అలాగే దేశీయ ప్రయాణం,ఇతర ఛార్జీలు మొత్తం రూ. 3 లక్షలతో సహా అదనపు ఖర్చులను కూడా చెల్లించలేదు. దీంతో జూలై 2020 వరకు తాను అక్కడ చిక్కుకుపోయానని రక్షిత్ ఆరోపించారు. చివరికి2020 ఆగస్టులో రాజీనామా చేశానని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జీతం కోత , పొడిగించిన స్టేతో సహా అన్ని నిర్ణయాలను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అధికారిక ఇమెయిల్ కమ్యూనికేషన్ లేకుండా మౌఖికంగా తెలియజేశారని, అందువల్లే తనకు వ్రాతపూర్వక రుజువు లేకుండా పోయిందని రక్షిత్ చెప్పారు.రాజీనామా చేసిన తర్వాత, రక్షిత్ 2021లో కంపెనీకి లీగల్ నోటీసు పంపాడు. ఆ తర్వాత 2022 జనవరిలో తన బకాయిల చెల్లింపు, తనకు సంబందించిన సర్టిఫికెట్లను, ఇతర పత్రాలను విడుదల చేయాలని కోరుతూ సివిల్ దావా వేశాడు.ఇదీ చదవండి: ఉద్యోగాన్ని వదలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుఎండీ రోహిత్ కుడుకులి ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీ రక్షిత్ ఆరోపణలను ఖండించింది. రక్షిత్ ప్రాజెక్ట్ మధ్యలో పరారయ్యాడని వాదించింది. కానీ, న్యాయమూర్తి శివానంద్ మారుతి జిపారే అధ్యక్షతలోని అదనపు సిటీ సివిల్ మరియు సెషన్స్ కోర్టు రక్షిత్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 6 శాతం వార్షిక వడ్డీతో రూ. 3 లక్షలు బకాయిలు చెల్లించాలని, అతని సర్టిఫికెట్లను విడుదల చేయాలని ఆదేశించింది. కపెంనీ తన చర్య ద్వారా బాధితుడికి కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని వ్యాఖ్యానించింది. కరీర్ను ప్రమాదంలో పడేసేలా, బకాయిలు, ఇతర పత్రాలను నిలిపివేయడానికి కోర్టు తప్పుబట్టింది. -
హెబ్బాళ ఫ్లై ఓవర్ ర్యాంప్ నేడు షురూ
శివాజీనగర: బెంగళూరులోని హెబ్బాళ కొత్త ఫ్లై ఓవర్ ర్యాంప్ సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. దీనిద్వారా హెబ్బాళలో ట్రాఫిక్ ఒత్తిడి 30 శాతం తగ్గే అవకాశముంది. ర్యాంప్పై రెండు రోజుల ట్రయల్ రన్ చేశారు. 700 మీటర్ల పొడవైన హెబ్బాళ ర్యాంపు సుమారు రూ.80 కోట్ల ఖర్చుతో నిర్మించారు. కే.ఆర్.పురం వైపు నుంచి మేఖ్రీ సర్కిల్ను కలుపుతుంది. 2023లో పనులు ఆరంభమై ఇటీవల ముగిశాయి. నాగవార నుంచి వచ్చే వాహనాలు ర్యాంప్ మీద నుంచి వెళ్లిపోవచ్చు. దీని వల్ల మేఖ్రీ కూడలికి సులభంగా చేరుకుని అక్కడ వాహన రద్దీ రెట్టింపు అవుతుందని విమర్శలు వస్తున్నాయి. ఇతర రోడ్లపై ఒత్తిడి ట్రయల్ రన్ సమయంలో మేఖ్రీ కూడలిలో ట్రాఫిక్ పెరిగినట్లు గుర్తించామని పోలీసు అధికారులు తెలిపారు. ఇది ఇతర రోడ్లపై ప్రభావం చూపుతోందన్నారు. మేఖ్రీ సర్కిల్ వద్ద రోడ్డును విస్తరించాలని సూచించారు. ఇందుకోసం బీబీఎంపీ ఇప్పటికే రక్షణ శాఖకు చెందిన స్థలాన్ని గుర్తించింది. రోడ్డు విస్తరణ జరిగితే ఆర్.టీ.నగర, జయమహల్, వసంతనగర వైపు వెళ్లే వాహనాలు మేఖ్రీ సర్కిల్లో ఫ్రీ లెఫ్ట్ తీసుకోవచ్చు. దీనిద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. బాప్టిస్ట్ ఆసుపత్రి వద్ద మళ్లీ రద్దీ ఇబ్బంది కలుగుతుంది. ఆసుపత్రి వద్ద ఉన్న బస్టాప్లను మార్చే అవకాశముంది. అయితే రెండు వారాల పాటు ట్రాఫిక్ని గమనించిన తరువాత నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అక్కడ ట్రాఫిక్ రద్దీ తగ్గి.. మేఖ్రీ కూడలిలో ఇబ్బంది! -
క్రికెటర్ శ్రీనాథ్ తల్లి కన్నుమూత
మైసూరు: భారత జట్టు మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి భాగ్యలక్ష్మి (88) కన్నుమూశారు. కొంతకాలంగా వయోసహజ అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మైసూరు కువెంపు నగరలోని నివాసంలో శనివారం కన్నుమూశారు. ఆదివారం చాముండి కొండ తప్పలిలోని శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. రూ.లక్ష లంచం.. సీఐ, ఎస్ఐ అరెస్టు బనశంకరి: లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ సీఐ, ఎస్ఐతో పాటు ముగ్గురు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బెంగళూరు రామమూర్తినగర పోలీస్స్టేషన్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ రుమాన్ బాషా, ప్రైవేటు వ్యక్తి ఇమ్రాన్బాబు దొరికిపోయినవారు. వివరాలు.. తనకు తెలియకుండా తన భార్య బంగారు నగలు, నగదు తీసుకుందని, న్యాయం చేయాలని గోపీనాథ్ అనే వ్యక్తి రామమూర్తినగర ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేయాలంటే రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని సీఐ, ఎస్ఐలు డిమాండ్ చేశారని బాధితుడు లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో లోకాయుక్త బెంగళూరు ఎస్పీ కే.వంశీకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు వల పన్నారు. ఆదివారం గోపీనాథ్ నుంచి సీఐ, ఎస్ఐ, బ్రోకరు ఇమ్రాన్బాబు రూ. లక్ష లంచం తీసుకుంటూ ఉండగా దాడి చేసి పట్టుకున్నారు. అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
కారెక్కిన కొండచిలువ
శివమొగ్గ: ఎవరికై నా కారులో దూసుకెళ్లాలని ఉంటుంది, ఓ కొండచిలువ కూడా అలాగే అనుకుంది ఏమో మరి.. కారులోకి ఎక్కేసింది. ఈ సంఘటన శివమొగ్గ నగరంలోని స్వామి వివేకానంద లేఔట్లోని ఎ బ్లాక్లో శనివారం సాయంత్రం జరిగింది. శ్వేతా బండి అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్న కారులోకి సుమారు 7 అడుగుల పొడవైన కొండచిలువ రోడ్డు మీద నుంచి పాకుతూ వెళ్లింది. ఈ దృశ్యాలను చూసిన కొందరు కారు యజమానికి చెప్పడంతో ఆయన స్నేక్ కిరణ్కు ఫోన్ చేశారు. స్నేక్ కిరణ్ చేరుకుని ఎంతసేపు ప్రయత్నించినా కొండచిలువ బయటకు రాలేదు. చివరకు మెకానిక్ను పిలిపించి కొన్ని భాగాలను విప్పి దానిని బయటకు తీశారు. తరువాత దూరంగా వదిలిపెట్టారు. గోవధ కేసులో ఇద్దరి అరెస్టు దొడ్డబళ్లాపురం: కిరాతకంగా ఆవుల గొంతుకోసి హత్య చేసి కళేబరాలను రోడ్డుపై విసిరేసిన ఇద్దరు దుండగులను నెలమంగల గ్రామీణ పోలీసులు అరెస్టు చేసారు. ఇమ్రాన్ (30), సయ్యద్ నవాజ్ (35) అరైస్టెన నిందితులు. నెలమంగల తాలూకా అరళసంద్ర గ్రామంలో ఇటీవల రెండు ఆవులను ఇలా వధించారు. ఈ సంఘటనపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కేరళకు జీవాలను తరలిస్తున్న ముఠా సభ్యులను పట్టుకుని విచారించగా నిందితులు రెండు ఆవులు మాంసానికి పనికిరావని తెలిసి కోపంతో వాటిని గొంతుకోసి హత్య చేసి కళేబరాలను విసిరేసి వెళ్లిపోయినట్టు తెలిపారు. వారి సమాచారం మేరకు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఉన్మాద ప్రేమికుడు ఆస్పత్రిపాలు మైసూరు: మైనర్ బాలికను ప్రేమించాలని వెంటపడ్డాడు, ఆమె తిరస్కరించడంతో దాడి చేయబోయి, తానే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యా చేసుకున్నాడో పాగల్ ప్రేమికుడు. ఈ సంఘటన చామరాజనగరలో జరిగింది. వివరాలు.. సాణెగాలకు చెందిన ప్రదీప్ అనే యువకుడు గ్రామంలోనే ఓ బాలికను ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. చామరాజనగరలో కేఎస్ ఆర్టీసీ బస్టాండు వద్ద బస్సు ఎక్కుతున్న బాలికను అతడు ప్రేమించాలని అడిగాడు, బాలిక అతనిపై మండిపడింది. దీంతో బాలిక మీద కత్తితో దాడి చేయబోగా ఆమె తప్పించుకుంది. తర్వాత తన కడుపులోనే పొడుచుకున్నాడు. కొందరు పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి స్థానిక సిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ కోలారు: తాలూకాలోని వేమగల్ – కురుగల్ పట్టణ పంచాయతీ ఎన్నిక ఆదివారం శాంతియుతంగా ముగిసింది. 92.56 శాతం పోలింగ్ జరిగింది. వార్డు నెంబర్ 6లో అత్యధికంగా 98.52 శాతం ఓటింగ్ సాగింది. పట్టణ పంచాయతీలో మొత్తం 17 వార్డులు ఉండి, వివిధ పార్టీల నుంచి 51 మంది పోటీ పడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఎంఆర్ రవి, డిప్యూటీ కలెక్టర్ మంగళ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. వేమగల్ – కురుగల్ పట్టణ పంచాయతీ అయిన తరువాత మొదటిసారి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ – జేడీఎస్ మరోవైపు పోటీలో ఉన్నాయి. బుధవారం కౌంటింగ్ జరుగుతుంది. -
విహారయాత్రలో ప్రమాదం, ఒకరు మృతి
శివమొగ్గ: విహారయాత్రకు వెళ్తూ ఉండగా పికప్ వాహనం, మారుతీ ఓమ్ని కారును ఎదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓమ్నిలోని ఒకరు మరణించగా, 8 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకా బలెగారు గ్రామంలో జరిగింది. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్ పుర తాలూకాకు చెందినవారు ఓమ్ని కారులో జోగ్ జలపాతం చూడడానికి వెళ్తున్నారు. ఈ సమయంలో పికప్ వ్యాన్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. రెండు వాహనాలు దూరంగా ఎగిరిపడ్డాయి. ఓమ్ని కారులో ఉన్న శేఖర్ అనే చనిపోగా, మరో 8 మందికి గాయాలతో ఆర్తనాదాలు చేశారు. ఓమ్ని మొత్తం నుజ్జయింది. స్థానికులు, పోలీసులు కలిసి బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ పరిశీలించారు. సాగర గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇరుకై న స్థలంలో కిక్కిరిసిన భవనాలు
శివాజీనగర: బెంగళూరులో హలసూరు ఠాణా పరిధిలోని నగర్తపేటెలో శనివారం తెల్లవారుజామున 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి ఐదుగురు మరణించిన దుర్ఘటనలో భవన యజమానులైన బాలకృష్ణయ్య శెట్టి, సందీప్ శెట్టి లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు మదన్కుమార్ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. అశాసీ్త్రయంగా భవన నిర్మాణం, భద్రతా చర్యలు లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు తెలిపారు. భవనం నేల అంతస్థులో ఉన్న ప్లాస్టిక్ మ్యాట్ గోదాములో మొదట అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పై వరకూ విస్తరించాయి. మంటలు ఎలా పుట్టాయనేది ఇంకా నిర్ధారణ కాలేదు. డిప్యూటీ సీఎం పరిశీలన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనం, ఇరుగు పొరుగున ఉండే కట్టడాలు బలహీనపడ్డాయి. వీటికి యజమానులు మరమ్మత్తులు చేయించాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొంటామన్నారు. ఆయన ఘటనాస్థలిని పరిశీలించి మాట్లాడారు. రెండు అంతస్థుల భవనం కట్టాల్సిన చోట 7– 8 అంతస్తులను నిర్మించారు. లోపలకు వెళ్లడానికి స్థలం చాలా ఇరుకుగా ఉందని చెప్పారు. ఉపాధి కోసం రాజస్థాన్ నుంచి బెంగళూరుకు వచ్చి ఐదు మంది చనిపోయారని వాపోయారు. బీబీఎంపీ కమిషనర్ మహేశ్వరరావు, నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్లు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు కారణాలు అగ్ని ప్రమాద ఘటనలో ఇద్దరు అరెస్టు -
గజరాజుల తాలీముకు నాంది
మైసూరు: ప్రఖ్యాత మైసూరు దసరా వేడుకలలో పాల్గొనడానికి వచ్చిన గజరాజుల బృందం తాలీముకు శ్రీకారం చుట్టింది. శనివారం, ఆదివారం తాలీమును సాగించాయి. మైసూరు ప్యాలెస్ నుంచి బన్నిమంటపం వరకు సుమారు నాలుగు కిలోమీటర్లకు పైగా నడుస్తూ వెళ్లి మళ్లీ తిరిగి వచ్చాయి. పాదయాత్ర సజావుగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏనుగుల మందగమనాన్ని నగరవాసులు, పర్యాటకులు ఉత్సాహంగా వీక్షించారు. తరువాత ప్యాలెస్ ఆవరణలో ఆదివారం ఉదయం గజరాజులు ఫుట్బాల్ ఆడుతూ సేదదీరాయి. మావటీలు, కాపలాదారులు పిల్లలతో సరదాగా ఫుట్బాల్ ఆడాయి. బన్నిమంటప వరకు నడక -
భారీ వర్షాలు.. కూలిన కొండచరియలు
● హాసన్ జిల్లాలో సంఘటన ● బెంగళూరు– మంగళూరు మార్గంలో రైళ్లు బంద్యశవంతపుర: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం, రుతు పవనాల వల్ల హాసన్ జిల్లావ్యాప్తంగా భారీగా వానలు కురుస్తున్నాయి. సకలేశపుర సమీపంలోని ఎడకుమారి వద్ద రైలు పట్టాలపై కొండ చరియలు విరిగి పడ్డాయి. దీనితో బెంగళూరు– మంగళూరు మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశారు. మంగళూరు నుంచి విజయవాడకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలును బంట్వాళలో నిలిపేశారు. విపరీతమైన వానలు కొనసాగే అవకాశం ఉన్న కారణంగా మట్టి చరియలను తొలగించిన తరువాత రైళ్ల సంచారానికి అనుమతిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం ఉదయానికల్లా సుగమం చేస్తామని చెప్పారు. శిరాడి ఘాట్లో తీవ్ర ఇబ్బందులు బెంగళూరు – మంగళూరును కలిపే శిరాడిఘాట్ మార్గంలో కుండపోత వర్షాల వల్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. మారనహళ్లి వద్ద మట్టి చరియలతో పాటు చెట్లు కూలిపోయాయి. వాహనాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వారాంతం కావటంతో శిరాడి, సకలేశపుర, మంగళూరు మార్గం స్థానికులు, టూరిస్టుల వాహనాలతో నిండిపోయింది. రెండు వైపుల నుంచి వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. చెట్లు, మట్టి తొలగింపు పనులు జరుగుతున్నాయి. చలిలో వర్షాలకు వాహనదారులు తడిసిపోయారు. తాము చెప్పేవరకు వాహనాలను కదిలించవద్దని అధికారులు తెలిపారు. జిల్లాల్లో వర్షాలు వివిధ జిల్లాల పరిధిలో భారీగా వానలు పడుతున్నాయి. బెంగళూరులో ఆకాశం మేఘావృతమై అప్పుడప్పులు జల్లులు పడుతున్నాయి. చలి తీవ్రత పెరిగింది. ప్రజలు గొడుగులు పట్టుకుని బయటకు వచ్చారు. శివమొగ్గ, చిక్కమగళూరు, ఉత్తర కర్ణాటకలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బెళగావి జిల్లాలో నదులు, జలపాతాలు జోరందుకున్నాయి. కావేరి నది పరవళ్లు మండ్య: మండ్య జిల్లాలో ఉన్న కావేరి జలాశయం ఎగువన భారీ వర్షాలు పడుతుండటంతో నది ఉరకలు వేస్తోంది. కృష్ణరాజసాగర జలాశయంలోకి వరదనీరు వెల్లువెత్తుతోంది. ఆదివారం డ్యాం నుంచి 50 వేల క్యూసెక్కుల నీటిని వదిలివేశారు. నది ప్రవాహం ఉధృతంగా మారింది. ముందుజాగ్రత్తగా నది పరిసరాల్లోకి ప్రజలు, పశువులు రాకూడదనని, లోతట్టు గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రకటించారు. డ్యాం దాదాపుగా నిండిపోయింది. -
పంటలు నీటిపాలు.. అన్నదాతలు కుదేలు
రాయచూరు రూరల్: వారం రోజలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా అన్నదాతలకు అపార నష్టం కలిగింది. పలుచోట్ల ఇంటి గోడలు కూడా పేదలు నిరాశ్రయులుగా మారారు. కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి, కలబుర్గి, రాయచూరు, బీదర్ జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెసలు, కంది, ఉల్లి, మొక్కజొన్న పంట పొలాల్లో నీరు చేరింది. తేమ ఎక్కువ కావడంతో పంటలు కుళ్లిపోతున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, వర్షాలతో పంటలు చేతికందే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కలబుర్గి జల్లా అప్జల్ పూర్ తాలుకా బోస్కలో ఇంటి గోడ కూలి లక్ష్మీ బాయి(55) అనే మహిళ మృతి చెందింది. బెళగావి జిల్లా సవదత్తి యల్లమ్మ ఆలయంలోకి వరద నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
మానవీయ విలువలు పెంచేలా బోధన
రాయచూరు రూరల్: విద్యార్థుల్లో మానవీయ విలువలు పెంచేలా బోధన చేయాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్, ఎమ్మెల్యే శివరాజ పాటిల్లు ఉపాధ్యాయులకు సూచించారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందరింలో అవోపా సంఘం ఏర్పాటు చేసిన ప్రతిభాపురస్కార ప్రదానోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. అనంతరం టెన్త్, పీయూసీలో ప్రతిభ చాటిన విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేశారు. అవోపా రాష్ట్ర అధ్యక్షుడు కోర వెంకటేష్, పురుషోత్తం, లక్ష్మిపతి, జగదీష్, హనుమేష్, తిప్పయ్య , కిశోర్, దత్తాత్రేయ, భీమాశంకర్, శశిరాజ్ పాల్గొన్నారు. సంగీత, సాహిత్య కళలను పోషించాలి రాయచూరు రూరల్: సంగీత, సాహిత్య కళలను సైకళా సంసకుల సంస్థ పోషిస్తుండటం అభినందనీయమని మాజీ మంత్రి శివనగౌడ నాయక్ అన్నారు. పండిత సిద్దరామ జంబల దిన్ని రంగమందిరంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సాహిత్యం, సంగీతం, కళలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. సమాజానికి సేవలు అందించేవారిని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో విధానపరిషత్ సభ్యుడు వసంత కుమార్, సంస్థకు చెందిన మారుతీ, రేఖ, శ్రీదేవి, శరణ బసవ, చెన్న బసవ, అస్లాం పాషా, అబ్దుల్ ఖరీం, నిజాముుద్దీన్, జాపర్ అలీ పటేల్ పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు రాయచూరురూరల్: శరణ పరంపరకు చెందిన శరణ బసవేశ్వర ఆలయ 8 వ పీఠాధిపతి శరణ బసవప్ప అప్ప అంత్య సంస్కారాలు శుక్రవారం కలబురిగిలో ప్రభుత్వ లాంచనాలతో వీరశైవ లింగాయత్ విధివిధానాల మధ్య నిర్వహించారు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరై శరణ బసవప్ప అప్పకు నివాళులర్పించారు. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వాలి రాయచూరురూరల్: సమాచార హక్కు చట్టం కింద ప్రజలు కోరిన సమాచారం ఇవ్వకపోతే ఆయా శాఖలు అర్జీదారులకు జరిమానా చెల్లించాల్సి వస్తుందని రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ అధికారులు రుద్రణ, రాజశేఖర్ అన్నారు. శనివారం జెడ్పీ కార్యాలయంలో జరిగిన సభలో ప్రజలనుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు అందించిన అర్జీలకు సరైన సమాధానం ఇవ్వాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రతి రోజు జరిమాన కింద రూ.వంద నుండి 250 వరకు అర్జిదారుడికి చెల్లించాల్సి వస్తు ందన్నారు. మరింత జాప్యం చేస్తే రూ.25 వేల వరకు జరిమానా పడుతుందన్నారు. అదనపు జిల్లాధికారి శివానంద పాల్గొన్నారు. చిన్నప్పటినుంచే సంస్కారం నేర్పాలి రాయచూరు రూరల్: సమాజంలో మానవుడికి సంస్కారం నేర్చుకోవడానికి లింగ దీక్ష ఆవశ్యమని కిల్లే బృహన్మఠం మఠాధిపతి శాంత మల్లశివాచార్యులు అన్నారు. మఠంలో ఆదివారం జంగమ వటులకు లింగ దీక్ష చేయించారు. చిన్నప్పటినుంచే సంస్కారం, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాలన్నారు. రూ.20 కోట్లతో చిక్క తిరుపతికి హంగులు మాలూరు: తాలూకాలోని చిక్కతిరుపతి శ్రీ ప్రసన్న వేంకటరమణస్వామి దేవాలయాన్ని రూ. 20 కోట్లతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే కైవె నంజేగౌడ తెలిపారు. దేవాలయం వద్ద నిర్మిస్తున్న 108 అడుగుల రాజగోపుర నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ దేవాలయం రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిందని, వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సౌకర్యాల కొరత ఉందని, దేవదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి సహకారంతో భక్తులకు సౌలభ్యాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. బ్రహ్మ రథోత్సవం నాటికి రథం వీధిని రూ. 2.5 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తామన్నారు. స్నానఘట్టాలు, శౌచాలయాలను నిర్మిస్తామన్నారు. 50కి పైగా విశ్రాంతి గృహాలను, 150 దుకాణాలను నిర్మాణం చేపడుతున్నామన్నారు. రామమూర్తి, ఎంఎ కృష్ణారెడ్డి , దేవాలయం ఈఓ టి సెల్వమణి తదితరులు పాల్గొన్నారు. -
యత్నాళ్ వ్యాఖ్యలపై నిరసన
సాక్షి,బళ్లారి: ముస్లిం యువతులను పెళ్లి చేసుకునే హిందూ యువకులకు రూ.5 లక్షల ప్రోత్సహం ధనం ఇస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే బసవన్నగౌడ పాటిల్ యత్నాళ్ వ్యాఖ్యలపై ముస్లిం యువకులు మండిపడ్డారు. విజయపుర జిల్లా హాలమేళ పట్టణంలో నల్లవస్త్రాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సదరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే యత్నాళ్ వాహనం ర్యాలీగా వెళుతుండగా బైక్లో వచ్చిన ముస్లిం యువకులు నల్లజెండాలు ప్రదర్శించి ఆక్రోషం వెల్లగక్కారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో ముస్లిం మహిళలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. -
ఆగని ఆన్లైన్ కేటుగాళ్ల దోపిడీ
● ఇద్దరి వ్యక్తులనుంచి రూ.లక్షలు వసూలు హుబ్లీ: సైబర్ నేరాలపై పోలీస్, సైబర్ క్రైం విభాగాలు, ఆర్బీఐ తదితర సంస్థలు ఎంత చైతన్య పరచినా ప్రజలు మోసాలకు గురవుతూనే ఉన్నారు. ఆన్లైన్ కేటుగాళ్ల దోపిడికి అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా నగరంలో ఇద్దరి నుంచి కేటుగాళ్లు లక్షల రూపాయలు దోచుకున్నారు. నగరంలోని రియాజ్ అహ్మద్ ముల్లాకు కేటుగేళ్లు ఫోన్ చేసి స్మార్ట్ మైడ్ అలయన్స్ గ్రూప్–62లో పెట్టుబడులు పెడితే బాగా లాభాలు వస్తాయంటు నమ్మించారు. వాట్సాప్ గ్రూపులో ఆయన్ను చేర్పించి కొన్ని కంపెనీల పేరు చెప్పి రూ.9.70 లక్షలు పెట్టుబడి పెట్టించారు. అయితే నగదును డ్రా చేసుకునేందుకు యత్నించగా అవి నకిలీ కంపెనీలని తేలింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా లోన్లు ఇప్పిస్తామని నగరానికి చెందిన ఖాజాసాబ్ నదాప్ అనే వ్యక్తి నుంచి కేటుగాళ్లు రూ.6.14 లక్షలు తీసుకొని వంచించారు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి పాన్, ఆధార్కార్డు తీసుకొని నగదును బదిలీ చేయించకున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్సును అడ్డుకొని డ్రైవర్, కండక్టర్పై దాడి హుబ్లీ: కేఎస్ ఆర్టీసీ బస్సును ఓ వ్యక్తి అడ్డుకొని డ్రైవర్, కండక్టర్పై దాడికి పాల్పడ్డాడు. ఈఘటన కేశ్వపుర పోలీస్స్షేషన్ పరిధిలో జరిగింది. గదగ్ నుంచి హుబ్లీకి వస్తున్న ఆర్టీసీ బస్సు గదగ్ రోడ్డు వద్దకు చేరగానే ఓ వ్యక్తి బైక్ను రోడ్డుకు అడ్డంగా నిలిపాడు. బస్సు ఆగిన వెంటనే అద్దాలు బద్దలు కొట్టి డ్రైవర్ మల్లికార్జున, కండక్టర్ యల్లప్పపై దాడి చేశాడు. ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ వ్యక్తి ఉడాయించాడు. ఈ ఘటనపైడ్రైవర్, కండక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పండుగలను శాంతియుతంగా ఆచరించాలి రాయచూరురూరల్: జిల్లాలో ఈద్మిలాద్, గణేష్ పండుగలను ప్రజలు శాంతియుతంగా ఆచరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాధికారి నీతీస్ ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన అధికారులతో సమావేశమై మాట్లాడారు. 27న వినాయక విగ్రహాలను ప్రతిష్టాపించాలని, 31 న నిమజ్జనం చేయాలన్నారు. వినాయక చవితి, ఈద్ మిలాద్ను హిందూ ముస్లింలు కలిసిమెలసి నిర్వహించుకోవాలన్నారు. డీజేలను వినియోగిస్తే చర్యలు చేపడుతామన్నారు. ప్లాస్టిక్ను వినియోగించరాదన్నారు. నగరసభ కమిషనర్ జుబీన్ మోహపా త్రో, అదనపు ఎస్పీ హరీష్, కుమార స్వామి, రవీంద్ర పాల్గొన్నారు. నిరంతర నీటి సరఫరాకు శ్రీకారం హొసపేటె: కొట్టూరు తాలూకా కందగల్లు గ్రామం, హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని కల్లహళ్లి గ్రామంలో జేజేఎం పథకం కింద 24గంటలపాటు నీటి సరఫరాకు జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మొహమ్మద్ అలీ అక్రమ్ షా శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ నీరు చాలా విలువైనదని, నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృథా చేయరాదని సూచించారు. ఆయా గ్రామాల్లో వంద శాతం గృహాలకు నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వ్యక్తికీ రోజుకు 55 లీటర్ల నీటిని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ పథకాన్ని నిర్వహించడం గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, పంచాయతీ అధికారుల బాధ్యత అని తెలిపారు. తాలూకా పంచాయతీ కార్యనిర్వహక అధికారి లక్ష్మీకాంత్, గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్య విభాగం ఏఈ దీపా ఎస్, ఏఈఈ కూడ్లిగి ప్రసన్న బీఆర్, కందగల్లు గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు జయమ్మ ఏఎం.గాధరయ్య పాల్గొన్నారు. -
కేఎస్ఆర్టీసీ బస్సు– లారీ ఢీ
సాక్షి,బళ్లారి: కేఎస్ ఆర్టీసీ బస్సు– లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఈఘటన సిరుగుప్ప తాలూకాలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి రాయచూరు నుంచి సిరుగుప్ప మీదుగా బెంగళూరుకు బయల్దేరిన కేఎస్ ఆర్టీసీ బస్సు సిరిగుప్ప తాలూకా సిరిగేరి పోలీసు స్టేషన్ పరిధిలో బైరాపురం క్రాస్ బీదర్– శ్రీరంగపట్టణ రాష్ట్ర రహదారిలోకి రాగానే లారీ ఎదురైంది. పరస్పరం వాహనాలు ఢీకొనడంతో బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రమాదంలో బస్సులో ఉన్న మండ్యజిల్లా మళవళ్లికి చెందిన శ్వేత(38), చెన్నపట్టణానికి చెందిన బాలానాయక్(42)మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. జిల్లా ఎస్పీ శోభారాణి, పోలీసు అధికారులు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బైక్ను ఢీకొన్న ట్రాక్టర్.. ఒకరి మృతి సిరుగుప్ప తాలూకాలో జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సిరుగుప్ప బాగేవాడి గ్రామానికి చెందిన డిష్ అయ్యప్ప(50) అనే వ్యక్తి బైక్లో వెళ్తుండగా సిరుగుప్ప తాలూకా ఇబ్రహీంపుర గ్రామ సమీపంలోని దౌలాసాబ్ రైస్ మిల్ వద్ద ట్రాక్టర్ ఢీకొంది. దీంతో బైకిస్టు అదుపు తప్పి రోడ్డు పక్కన వరి పొలంలోకి పడిపోయి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. ఇద్దరి మృతి 12 మందికి పైగా గాయాలు -
తుంగభద్ర గేట్ల ఏర్పాటులో అంతులేని నిర్లక్ష్యం
సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల పరిఽధిలో పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయంలో గేట్ల ఏర్పాటు విషయంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరించడం ఈ ప్రాంత రైతులకు శాపంగా మారిందని రైతు సంఘం నేతలు హనుమనగౌడ, మాధవరెడ్డి విరుచుకుపడ్డారు. నగరంలోని పత్రికా భవన్లో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది తుంగభద్ర 19వ క్రస్ట్ గేటు కొట్టుకుపోయిందన్నారు. తాత్కాలిక గేటు ఏర్పాటుతో పంటలు చేతికందాయన్నారు. అయితే మిగతా 32 గేట్లు దుస్థితిలో ఉన్నాయని, వాటిని మార్చాలని నిపుణులు కమిటీ సూచించినప్పటికీ పాలకులు, అధికారులు జాప్యం చేశారన్నారు. ఫలితంగా ఆ గేట్లు ఇప్పుడు మొరాయిస్తున్నాయని, పైకి ఎత్తితే దించడానికి, దించితే ఎత్తడానికి రాని దుస్థితి నెలకొందన్నారు. మూడు రాష్ట్రాల పాలకుల నిర్లక్ష్యం వల్ల కొత్త గేట్ల అమరికలో విపరీతమైన జాప్యం జరిగిందన్నారు. డ్యాంలో ఏటేటా పెరిగిపోతున్న ౖపూడిక గురించి ఆలోచించడం లేదన్నారు. డ్యాంలో ప్రస్తుతం 30 టీఎంసీల మేర పూడిక చేరిందన్నారు. దీంతో దామాషా ప్రకారం రైతులకు నీరు తగ్గించేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఓ వైపు పూడిక వల్ల 30 టీఎంసీలు తగ్గిపోగా, కొత్త గేట్ల అమరికలో జాప్యం వల్ల ఈ ఏడాది మరో 20 టీఎంసీల నీటి నిల్వ తగ్గిందన్నారు. 80 టీఎంసీలకు నీటి నిల్వ పరిమితం చేశారన్నారు. తుంగభద్ర ఆయకట్టు పరిధిలో రైతులు సమస్యలు తరుపున గట్టి పోరాటం చేస్తామని, అధ్వానంగా ఉన్న గేట్లును వెంటనే మార్చాలని, పూడిక తీత గురించి గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండిపడిన రైతు సంఘం నేతలు -
తుంగభద్రకు పోటెత్తిన వరద
● లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు హొసపేటె: కర్ణాటక, ఏపీ, తెలంగాణ, రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు సాగునీరందించే తుంగభద్ర జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువుతట్టు ఉన్న మొరాళి తీర్థహళ్లి, శివమొగ్గ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆదివారం సాయంత్రానికి 80 వేలకు పైగా క్యూసెక్కుల వరద చేరింది. 16 గేట్లను మూడున్నర అడుగులు, మిగితా 6 గేట్లకు రెండున్నర అడుగులు పైకెత్తి 80 వేల క్యూసెక్కులు దిగువుకు విడుదల చేసినట్లు మండలి అధికారులు తెలిపారు. 24 గంటల్లో లక్షకు పైగా క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హంపీ స్మారకాలు, కంప్లి వద్ద వంతెనకు వరద ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 1625.57 అడుగులు, నీటినిల్వ 78.327 టీఎంసీలు ఇన్ఫ్లో 43253 క్యూసెక్కులు ఉందని మండళి వర్గాలు తెలిపారు. పర్యాటకులతో డ్యాం కిటకిట ఆదివారం పర్యాటకుల సందడితో కిటకిట లాడింది. గేట్ల నుంచి దిగువకు ప్రవహిస్తున్న నీటి అందాలను వీక్షించి పర్యాటకులు సంతోషంగా గడిపారు. -
ధర్మస్థాపనకే శ్రీకృష్ణ అవతారం
హొసపేటె: ధర్మస్థాపనకే శ్రీ కృష్ణుడు అవతరించారని కన్నడ, సాంస్కృతిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సిద్దలింగేష్ రంగన్నవర్ అన్నారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మానవ జీవితంలోని అన్ని అంశాలలో శ్రీకృష్ణుడి సహకారం ఉంటుందన్నారు. మార్గదర్శిగా, స్నేహితుడిగా, అన్నయ్యగా, గురువుగా, కుమారుడిగా , వీరుడిగా దర్శనమిస్తాడని తెలిపారు. హోస్పేట తాలూకా యాదవ, గొల్లర సంఘం గౌరవాధ్యక్షుడు గోని బసప్ప, నాయకులు బి.ఈరన్న, జి.శ్రీనివాసులు, వైబి.మధుసూధన్, మారుతితో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఘనంగా కృష్ణాష్టమి హుబ్లీ: కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం కూడా నగరంలో పలుచోట్ల ఉట్టి కొట్టే కార్యక్రమాలు సందడిగా సాగాయి. గోకుల్ రోడ్డు అక్షయ పార్క్ మైదానంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే పోటీలను నిర్వహించగా యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఉట్టి కొట్టడాన్ని వీక్షించారు. తెలుగు పాత హుబ్లీ అరవింద నగర్లో హుబ్లీ సవితా సమాజం ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సవితా సమాజ బాంధవులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పద్మవతి ఆలయంలో ప్రత్యేక పూజలను నెరవేర్చారు. హుబ్లీ: స్థానిక ఆనంద్ నగర్ చెందిన పలువురు తెలుగింటి ఆడపడుచులు తమ మెట్టినిల్లు తెలంగాణలోని నారాయణపేట జిల్లా ధనువాడలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు రాధాకృష్ణుడు వేషధారణ వేయించి మురిసిపోయారు. -
పెళ్లై పిల్లలున్నా కొనసాగిన బంధం.. ప్రేయసిని దారుణంగా చంపేసిన ప్రియుడు
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ప్రేమించుకున్న ఆ జంట ఏ కారణం చేతనో ఒక్కటి కాలేకపోయింది. వేర్వేరు వ్యక్తులతో వారికి వివాహాలు అయ్యాయి. అయినా వారి మధ్య ప్రేమ కొనసాగి చివరకు ఇద్దరినీ బలి తీసుకుంది. ప్రియురాలిని కత్తితో హత్య చేసిన ప్రియుడు అదే కత్తితో తానూ పొడచుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా బీడి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆనంద్ సుతార్(35), రేష్మ(29)లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే రేష్మకు మరో వ్యక్తితో వివాహం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆనంద్కు వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెళ్లయి పిల్లలు ఉన్నా ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. ఈ విషయం రేష్మ భర్తకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఆనంద్ను పిలిపించి హెచ్చరించి వదిలేశారు. ఆగ్రహంతో ఉన్న ఆనంద్ రేష్మను నిర్జనప్రదేశానికి పిలిపించుకుని కత్తితో పొడిచి హత్య చేశాడు.అదే కత్తితో తానూ పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నందగడ పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
అగ్నికీలల్లో భవనం
బనశంకరి: బెంగళూరులో బృహత్ విస్ఫోటం జరిగి భవనం కూలిన దుర్ఘటనను మరువక ముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. కేఆర్ మార్కెట్ నగర్తపేటేలో నాలుగు అంతస్తుల కట్టడంలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, మరొకరు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన హలసూరుగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో సంభవించింది. మృతులు వ్యాపారి మదన్కుమార్ (38), భార్య సంగీత (33), వారి పిల్లలు మితేశ్ (8), విహాన్ (5), మరో అంతస్తులో సురేశ్ (36). తెల్లవారుజామున.. సందీప్, బాలకృష్ణ అనే ఇద్దరికి చెందిన నాలుగు అంతస్తుల భవనంలో అనేక కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులోనే ప్లాస్టిక్ వస్తువుల తయారీ యూనిట్లు కూడా ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున 3.30 సమయంలో అగ్ని ప్రమాదం మొదలైంది. భవనం గ్రౌండ్ ఫ్లోర్తో పాటు రెండో అంతస్తులో ప్లాస్టిక్ గోదాములు, తయారీ యూనిట్లు ఉండగా, మొదటి అంతస్తులో ఉన్న ముగ్గురు కార్మికులు మంటలు వ్యాపించగానే బయటికి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మూడో అంతస్తులో వ్యాపారి మదన్కుమార్ కుటుంబం నివాసం ఉంటోంది. మదన్ ఇంటికి బయటి నుంచి తాళం వేసుకుని, గ్రౌండ్ఫ్లోర్లో తన యూనిట్లో పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం జరగ్గా మదన్ మంటల్లో చిక్కాడు. పై అంతస్తులో కుటుంబం.. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేయగా శ్రమించారు. రెండుగంటలపాటు ఏకధాటిగా నీళ్లు చిమ్మి ఆర్పివేశారు. 3వ అంతస్తులోని మదన్ ఫ్లాటు తాళాన్ని పగలగొట్టి వెళ్లి చూడగా అతని భార్య, ఇద్దరు పిల్లలు వేడి, పొగ తాకిడికి చనిపోయి ఉన్నారు. వీరు రాజస్థాన్ నుంచి వలసవచ్చి వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. పై అంతస్తులోని ఫ్లాటులో సురేష్ అనే వ్యక్తి మరణించాడు. సిలిండర్ పేలుడా.. కరెంటు వైర్లా? భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ప్లాస్టిక్ మ్యాట్లను తయారీ కేంద్రంలో మంటలు రేగి కట్టడం మొత్తం వ్యాపించినట్లు అనుమానాలున్నాయి. గ్యాస్ సిలిండర్ లీకై , లేదా కరెంటు వైర్ల నుంచి మంటలు వచ్చి ఉంటాయని చెబుతున్నారు. ఇరుకై న సందులో భవనం ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. దట్టమైన పొగ వ్యాపించడంతో నివాసితులకు దిక్కుతోచలేదు. ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, 6 ఫైరింజన్లతో శ్రమించారు. మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతులు మదన్కుమార్, భార్య సంగీత, పిల్లలు (ఫైల్) సురేశ్ (ఫైల్) ఓ కుటుంబం, మరొకరు మృత్యువాత బెంగళూరులో నగర్తపేటెలో ఘోర ప్రమాదం ప్లాస్టిక్ యూనిట్లో మంటలే కారణం! విచారణ సాగుతోంది: కమిషనర్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చునని నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్ సింగ్ తెలిపారు. ఘటనాస్థలిని ఆయన పరిశీలించారు. ఫైర్ అధికారులు, విద్యుత్ ఇంజినీర్లు తనిఖీ చేస్తున్నారని, అందులో కచ్చితమైన కారణం తెలుస్తుందని చెప్పారు. ఓ ఇంటికి తాళం వేసి ఉండడంతో వారిని కాపాడడం ఇబ్బందిగా మారిందని అన్నారు. -
బాధిత కుటుంబానికి పరిహారం పంపిణీ
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా యరగేరలో వారం రోజుల క్రితం పిడుగుపాటుకు గురై మృతి చెందిన భవాని కుటుంబానికి శనివారం రాయచూరు రూరల్ శాసన సభ్యులు బసనగౌడ దద్దల్ రూ.5 లక్షల పరిహార ధనం చెక్ను అందించారు. పల్లెల్లో పచ్చదనం పెంపొందించండిరాయచూరు రూరల్: గ్రామాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని గ్రామీణ సీఐ నింగప్ప పేర్కొన్నారు. శనివారం తాలూకాలోని ఆదికవి వాల్మీకి మహర్షి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్ఎన్ఎస్ శిబిరంలో ఆయన మాట్లాడారు. యువకులు నేరాలు, వ్యసనాలు, మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండి మంచి ప్రవర్తనతో విద్యాభ్యాసం చేసి ఉన్నత శిఖరాలకు చేరాలని పిలుపునిచ్చారు. గ్రామాలను పచ్చని చెట్లతో కళకళలాడేలా తీర్చిదిద్ది పచ్చని పల్లెలుగా మార్చాలన్నారు. కార్యక్రమంలో ఎన్ఎన్ఎస్ అధికారిణి పద్మజ, బజారప్ప, రేణుక, బుజ్జమ్మ, శివరాజ్, నాగవేణి, విజయ్లున్నారు. సంగొళ్లి రాయణ్ణ ఆశయాలు అలవర్చుకోవాలిరాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో అణగారిపోతున్న ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని జిల్లాధికారి నితీష్ అన్నారు. జిల్లాధికారి కార్యాలయంలో జిల్లా పాలనా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, సాంఘీక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో జరిగిన క్రాంతివీర సంగొళ్లి రాయణ్ణ జయంతిని పురస్కరించుకొని చిత్ర పటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. దేశంలో కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. ఏడీసీ శివానంద, తహసీల్దార్ సురేష్ వర్మ, నాసీర్ అహ్మద్లున్నారు. -
మైసూరులో నిరసన
మైసూరు: ధర్మస్థల మీద, ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేపై మీద కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ జైన సమాజం ఆధ్వర్యంలో శనివారం నగరంలో శాంతియుత మౌన నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరంలోని గాంధీ సర్కిల్లో దిగంబర జైన్ సామాజీకులు బైఠాయించారు. అపప్రచారం చేయరాదని, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోపణలకు తగిన సాక్ష్యాలను ఇవ్వాలని, జైన ధర్మాన్ని కాపాడాలని, రత్నగిరిని రక్షించడం మన బాధ్యత అని అన్నారు. శ్రీక్షేత్ర రక్షణకు ఎలాంటి త్యాగాలకై నా సిద్ధమన్నారు. ధర్మస్థల గౌరవాన్ని కాపాడుతాం ● డీసీఎం శివకుమార్ శివాజీనగర: ధర్మస్థల కేసులో తనిఖీ కోసం సిట్ను నియమించినప్పుడే బీజేపీవారు ఎందుకు మాట్లాడలేదు, గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదు చేసినప్పుడు కూడా ప్రశ్నించలేదు. ఇప్పుడు రాజకీయం కోసం ధర్మస్థల జాతా చేస్తున్నారని డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ ఆరోపించారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, ధర్మస్థల గౌరవాన్ని కాపాడటమే తమ లక్ష్యమన్నారు. ఎవరు తప్పు చేసినా కూడా చర్యలు తీసుకొంటాం, ఎవరినీ కాపాడే ఉద్దేశం లేదు. గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. అది అబద్ధమో, నిజమో తెలియదు. జడ్జి ముందు కూడా వాంగ్మూలం ఇచ్చాడు, ఇంత జరిగిన తరువాత తనిఖీ జరపకపోతే బీజేపీవారే ప్రశ్నించేవారు. విచారణ చేస్తే రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ధర్మస్థలకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని తాను భావిస్తున్నానన్నారు. సిట్లో నేను వేలు పెట్టలేదు, హోం మంత్రి చూసుకొంటారు. తనకు తెలిసిన వారి నుంచి సమాచారం తెలుసుకొంటున్నా. ఎవరికీ అన్యాయం జరగనివ్వం అని అన్నారు. ధర్మస్థల మీద అప ప్రచారం చేసే వారి మీద చర్యలు తీసుకొంటామని పార్టీ నాయకులకు సీఎం భరోసా ఇచ్చారని తెలిపారు. -
జనావాసాల్లో ఎలుగుబంటి సంచారం
హొసపేటె: హొసపేటె నగర పరిధిలో సండూరు రోడ్డులోని అంబేడ్కర్నగర్లో శుక్రవారం సాయంత్రం ఎలుగుబంటి సంచారం కాలనీ వాసులకు భయాందోళన కలిగించింది. ఓ ఇంటి ఆవరణలో ఎలుగుబంటి అతిథిగా కనిపించింది. అది ఇంటి చుట్టూ తిరుగుతుండటం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఆ సమయంలో పెంపుడు కుక్క ఇంటి బయట నిద్రిస్తుండగా భయపడి ఇంటి ఆవరణలోకి పరుగెత్తింది. ఆహారం కోసం వచ్చిన ఎగులుబంటి ఇంటి ఆవరణలోకి వచ్చింది. ఈ సంఘటన ఇంటి సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇది చూసిన ఇంటి యజమాని, స్థానికులు షాక్కు అయ్యారు. ఇటీవల రోజుల్లో నగరంలో, పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంట్ల సంచారం పెరగడంతో ప్రజల్లో భయం నెలకొంది. అదేవిధంగా అనేక గ్రామాలు, పొలాలు, కొండలు, ఇళ్ల చుట్టూ ఎలుగుబంట్లు చాలా సార్లు కనిపించినా హొసపేటె ప్రాంతంలో ఇప్పటి వరకు మనుషులపై దాడులు జరిగిన కేసులు నమోదు కాలేదు. అయితే భవిష్యత్తులో అటవీ శాఖ అత్యవసర చర్యలు తీసుకోకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖాధికారులు ఎలుగుబంటి కదలికలను పర్యవేక్షించి తక్షణమే పట్టివేతకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. హొసపేటె నగర శివార్లలో కలకలం ప్రజలు భయాందోళనకు గురైన వైనం -
అగర వెంకన్నకు విశేష పూజలు
బొమ్మనహళ్లి: శ్రావణ శనివారం సందర్భంగా బెంగళూరు బొమ్మనహళ్ళిలోని అగరలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ఉదయమే స్వామివారికి పంచామృత అభిషేకం, అలంకారం గావించారు. వందలాదిగా భక్తులు దర్శించుకున్నారు. చెరువు కబ్జాదారులకు చుక్కెదురు శివాజీనగర: చెరువు ఆక్రమణల గురించి ఐదుగురికి బీబీఎంపీ ఇచ్చిన షోకాజ్ నోటీసులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నగరంలోని కే.ఆర్.పురం సమీపంలో విభూతిపురం చెరువును ఆక్రమించారని, ఆ స్థలాన్ని ఖాళీ చేయిస్తామని ఐదుగురికి పాలికె అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులను రద్దు చేయాలని జీ.వీ.మంజునాథ్, తమిళరసి, పళనిమ్మాళ్, ఎన్.సుందరమూర్తి, జే.శివరామన్ అనేవారు హైకోర్టును ఆశ్రయించారు. భూకబ్జా నిషేధ చట్టం, చెరువు పరిరక్షణ చట్టాల కింద నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. పిటిషన్దారుల వాదన సమర్థనీయం కాదని జడ్జి కొట్టివేశారు. ప్రైవేటు స్కూలు బస్సు పల్టీ శివమొగ్గ: ప్రైవేట్ స్కూలు బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన శనివారం జిల్లాలోని హొసనగర తాలూకా రిప్పన్పేటె పోలీసు స్టేషన్ పరిధిలోని కానుగోడు గ్రామం వద్ద జరిగింది. వివరాలు.. గర్తికెరెలోని ప్రైవేట్ పాఠశాల బస్సు 12 మంది నర్సరీ విద్యార్థులతో బయల్దేరింది. తమ్మడికొప్ప–మూగుడి మార్గంలో బస్సు డ్రైవర్ నియంత్రణ తప్పడంతో పొదల్లోకి దూసుకెళ్లింది. ఘటనలో ఒక బాలునికి స్వల్ప గాయాలు కాగా మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు చేరుకుని పిల్లలకు బయటకు తీసుకొచ్చారు. టేకాఫ్ అయిన వెంటనే ల్యాండింగ్ దొడ్డబళ్లాపురం: బెళగావి నుంచి ముంబైకి బయలుదేరిన స్టార్ ఎయిర్ ప్రయాణికుల విమానంలో ఇంజిన్లో యాంత్రిక లోపం తలెత్తడంతో బెళగావిలోనే అత్యవసరంగా దిగిపోయింది. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. బెళగావి విమానాశ్రయ అధికారుల వివరాల ప్రకారం.. విమానం 48 మంది ప్రయాణికులతో ఉదయం 7:50కి ముంబైకి బయలుదేరింది. కొంతదూరం ప్రయాణించగానే ఇంజిన్లో సమస్య కనిపించడంతో పైలట్ తిరిగి బెళగావిలో ఎయిర్పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులను మరో విమానం ఏర్పాటు చేసి పంపించినట్లు తెలిపారు. కొందరు ప్రయాణికులు ప్రయాణం రద్దు చేసుకున్నారు. -
నాగమోహన్ దాస్ నివేదికను తిరస్కరించాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిస్టిస్ నాగమోహన్ దాస్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను తిరస్కరించాలని అంబేడ్కర్ ఎస్సీ వర్గీకరణ సమితి సంచాలకుడు మహేంద్ర కుమార్ మిత్ర పేర్కొన్నారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణకు కాంగ్రెస్ సర్కార్కు జిస్టిస్ నాగమోహన దాస్ నివేదికను అందించారన్నారు. అందులో ఎస్సీ వర్గాల వారిని నియమించకుండా అగ్ర వర్ణాల వారిని కమిషన్ అధ్యక్షుడిగా నియమించడంతో పాటు ఆది కర్ణాటక, ద్రావిడ, ఇతర ఉప కులాలను చేర్చడంలో లోపాలు ఏర్పడ్డాయన్నారు. ఆ లోపాలను సవరించి ఆమోదించాలన్నారు. -
ధర్మస్థలపై త్వరలో సిట్ నివేదిక
యశవంతపుర: ప్రముఖ దేవస్థానం ధర్మస్థల పరిసరాలలో వందలాది మంది శవాలను పాతిపెట్టారని మాజీ పారిశుధ్య కార్మికుడు ఫిర్యాదు చేయడంతో సిట్ పోలీసులు గాలింపు చేపట్టడం తెలిసిందే. గత 20 రోజుల నుంచి ఫిర్యాదుదారు చెప్పిన చోటల్లా తవ్వకాలు చేశారు. తోడిన గుంతల్లో మట్టిని నింపకుండా అలాగే వదిలేశారు. ఆధారాలు దొరకని కారణంగా ఎక్కడ తోడినా ఇంక ప్రయోజనం లేదని సిట్ అధికారులు అనుకుంటున్నారు. ఈ కేసులో సిట్ రెండు రోజుల్లో పూర్తి నివేదికను సర్కారుకు ఇవ్వనుంది. అపరిచితునికి గుబులు గట్టి ఆధారాలు దొరకని కారణంగా పోలీసులు మట్టిని తోడే పనిని నిలిపేశారు. అస్థిపంజరాలున్నట్లు చెప్పిన అపరిచితునికి ఇప్పుడు భయం ఏర్పడింది. మునుముందు నా పరిస్థితి ఏమవుతుందోనని అతడు గుబులుతో ఉన్నారు. తనకు జీవితకాలం భద్రతను కల్పించాలని కోరుతున్నాడు. కోర్టును, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించాడని విమర్శలు వస్తున్నాయి. నార్కో పరీక్షలు? అపరిచిత వ్యక్తి చెప్పిన జాగాలను సిట్ పరిశీలించింది. అతడు ఎస్పీ, కోర్టు ముందు చెప్పినట్లు భారీ సంఖ్యలో మృతదేహాల జాడలు ఎక్కడా బయటపడలేదు. అతడు చెప్పినదంతా అబద్ధం అని, ఎందుకు అలా చెప్పాడో తెలుసుకోవడానికి నార్కో పరీక్షలను జరిపి నిజం కక్కించాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఎంతోమంది వ్యయ ప్రయాసలకోర్చి గుంతలు తవ్వారు, దీనికి డబ్బు కూడా భారీగా ఖర్చయినట్లు సమాచారం. అపరిచితునికి కోర్టు అనుమతులు తీసుకుని సత్యశోధన పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి సిట్ నివేదిక, నార్కో పరీక్షల మీదే నిలబడింది. ధర్మస్థలతోనే సర్కారు: మంత్రి రాష్ట్ర ప్రభుత్వం ధర్మస్థలతోనే ఉంటుందని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కార్ అన్నారు. ఆమె ఉడుపిలో విలేకరులతో మాట్లాడారు. కొందరూ పవిత్రమైన ధర్మస్థలపై మసి పూసి మారేడుకాయ చేయాలని చూశారని అన్నారు. ఇప్పుడు కొండను తోడి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు. ధర్మస్థల మీద అపప్రచారం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని మానాలని ఆమె అన్నారు. 20 చోట్ల తవ్వినా ఏమీ దొరకనట్లే గాలింపు నిలిపివేత -
మృత్యు శకటాలైన బస్సులు
యశవంతపుర: ఆర్టీసీ బస్సులు యమశకటాలుగా మారాయి. రెండుచోట్ల నిలిచి ఉన్న లారీలను ఢీకొట్టడంతో ముగ్గురు చొప్పున 6 మంది చనిపోయారు. వివరాలు.. గొర్రెలు, మేకలతో నిలిచిన లారీని కేఎస్ ఆర్టీసీ బస్ ఢీకొనగా ముగ్గురు చనిపోయిన ఘటన బెంగళూరు గ్రామాంతర జిల్లా నెలమంగల తాలూకా గుండేనహళ్లి వద్ద శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు జరిగింది. ప్రమాదంలో లారీ క్లీనర్, ఏపీలోని మడకశిరకు చెందిన శ్రీనివాసులు (50), డ్రైవర్ ఆనంద (26), నజీర్ అహ్మద్ (36) అనే వ్యాపారి మరణించారు. వీరు బెంగళూరులో ఉండేవారు, బాగలకోట జిల్లా ముధోళకు వెళ్లి మేకలు, గొర్రెలను కొని లారీలో బెంగళూరుకు వస్తున్నారు. ఘటనాస్థలంలో లారీ పంచరు కావడంతో రోడ్డుపక్కన నిలిపి టైరు మారుస్తున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు లారీ ముందుభాగాన్ని ఢీకొంది. లారీ డ్రైవర్ ఆనంద, శ్రీనివాసులు, నజీర్లు తీవ్ర గాయాలతో మరణించారు. బస్సులోని కొందరికి గాయాలు తగిలాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యల్లాపురలో ముగ్గురు.. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర మావళ్లి క్రాస్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి మరో దుర్ఘటన జరిగింది. బాగలకోట నుంచి మంగళూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన నిలిపిన కేరళకు చెందిన లారీని వెనుక నుంచి ఢీకొంది. బస్సు డ్రైవర్ ఓవర్టేక్ చేయబోయి ప్రమాదం జరిగినట్లు తెలిసింది. బస్సులోని నీలప్ప హరదొళ్లి (40), గిరిజప్పా బూదన్నవర (30) మరో వ్యక్తి (40) చనిపోగా, 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. మృతులు బాగలకోట నుంచి కూలి పనుల కోసం మంగళూరుకు వలస వెళుతున్నట్లు తెలిసింది. బస్సు డ్రైవర్, కండక్టర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నెలమంగల, ఉత్తర కన్నడలో నిలిచిన లారీలను ఢీ 6 మంది దుర్మరణం -
శ్రీకృష్ణ ఆదర్శాలు అనుసరణీయం
రాయచూరు రూరల్: అణగారిపోతున్న నేటి ఆధునిక సమాజంలో శ్రీకృష్ణ పరమాత్ముని ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని లోక్సభ సభ్యుడు కుమార నాయక్ అన్నారు. శనివారం శ్రీకృష్ణ యాదవ భవనంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, సాంఘీక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. దేశంలో కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు ప్రథమ ప్రాధాన్యత కల్పించారన్నారు. నగరేశ్వర ఆలయం నుంచి శ్రీకృష్ణ భగవాన్ చిత్రపటానికి భెమ్మెల్సీ వసంత్ కుమార్ జాతాను ప్రారంభించారు. కార్యక్రమంలో నగరసభ మాజీ అధ్యక్షుడు తిమ్మప్ప నాడగౌడ, శరణప్ప, బిచ్చన్న, భీమన్న, హనుమంతప్ప, చెన్నారెడ్డిలున్నారు. -
గోపాలా.. గోవింద.. దీవించరావ
శనివారం ధార్వాడలో కృష్ణాష్టమి సంబరాల్లో బాలలు బెంగళూరు ఇస్కాన్ దేవస్థానంలో భక్తులుబనశంకరి: మానవాళికి భగవద్గీత ద్వారా గీతోపదేశం చేసిన శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినరోజును శనివారం కన్నడనాడు అంతటా ఆనందోత్సాహాలతో ఆచరించారు. బాలలు నల్లనయ్య, గోపికల మాదిరిగా అలంకరించుకుని మురిపించారు. ఆలయాలలో విశేష వేడుకలు జరిగాయి. బెంగళూరు రాజాజీనగర ఇస్కాన్ ఆలయంలో వేకువజాము నుంచి అర్చకులు రాధాకృష్ణుల విగ్రహాలకు వివిధ అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వందలాదిగా భక్తులు తరలివచ్చి వెన్నదొంగను దర్శించుకున్నారు. బెంగళూరులోని శ్రీకృష్ణ ఆలయాలు హరే రామ హరే కృష్ణ నినాదాలతో మారుమోగాయి. రాధా కృష్ణ వేషధారణతో పిల్లలతో వేడుకలు ఆకట్టుకున్నాయి. ఉడుపి శ్రీకృష్ణ మఠంలో కృష్ణజయంతి వేడుకలు నిర్వహించారు. ఉట్టి కొట్టే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ధార్వాడలో కృష్ణ గోపికల రూపాల్లో బాలలు అలరించారు. రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రాధాకృష్ణుల వేషాల్లో బాలల సందడి -
కన్నుల పండువగా కృష్ణాష్టమి
ఊరేగింపులో డోలు వాయిద్య కళాకారుల ప్రదర్శన హొసపేటెలో రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులు శ్రీకృష్ణుడికి పూజ చేస్తున్న ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్ తదితరులు సాక్షి,బళ్లారి: సాక్షాత్తు విష్ణు స్వరూపుడు, మహాభారత యుద్ధంలో పాండవుల్లో ఒకరైన అర్జునుడికి రథసారథిగా ఉండి పాండవుల(ధర్మం) వైపు నిలబడి వారి విజయానికి సహకరించిన మహానుభావుడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో బళ్లారి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కన్నుల పండువగా ఆచరించారు. ముఖ్యంగా నగరంలో జిల్లా యంత్రాంగం, గొల్లర సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఊరేగింపు చేపట్టారు. శ్రీకృష్ణుని విగ్రహానికి పూజలు చేసిన తర్వాత నగరంలోని అండర్ బ్రిడ్జి, రాయల్ సర్కిల్ గుండా బీడీఏఏ మైదానం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం బీడీఏఏ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి మాట్లాడుతూ గొల్ల యాదవ సమాజ ప్రజల కోరిక మేరకు సముదాయ భవన నిర్మాణానికి రూ. 25 లక్షల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అధర్మానికి వ్యతిరేకంగా యుద్ధంలో పాండవులకు సహకారం అందించి ధర్మాన్ని కాపాడిన శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడని అన్నారు. మానవ రూపంలో పుట్టిన దేవుడు శ్రీకృష్ణుడని కొనియాడారు. భగవద్గీత మనందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందంటే అది శ్రీకృష్ణ భగవానుడు అందించిన పరమ పవిత్రమైన గ్రంథం అని గుర్తు చేశారు. గ్యారెంటీ పథకాల అమలు ప్రాధికార జిల్లాధ్యక్షుడు చిదానందప్ప, మేయర్ నందీష్, గొల్లర సంఘం అధ్యక్షుడు, కార్పొరేటర్ గాదెప్ప తదితరులు పాల్గొన్నారు. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు హొసపేటె: నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. టీబీ డ్యాం పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో శనివారం తల్లిదండ్రులు తమ పిల్లలకు శ్రీకృష్ణుడి వేషధారణలు చేసి మురిసిపోయారు. కృష్ణజన్మాష్టమి నాడు పిల్లలను అలంకరించడం వల్ల పిల్లల్లో మతం, సంస్కృతి పట్ల గౌరవం పెరుగుతుంది. ఇంట్లోని తమ పిల్లలకు శ్రీకృష్ణ, రాధ వేషధారణ చేసి చూడాలనుకునే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. కృష్ణజన్మాష్టమి ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేయడానికి శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. సరళంగా శ్రీకృష్ణాష్టమి రాయచూరు రూరల్: నగరంలో శ్రీకృష్ణుని జన్మాష్టమిని సరళంగా ఆచరించారు. ఉప్పారవాడి లక్ష్మీవేంకటేశ్వరాలయంలో శ్రీకృష్ణుని జన్మాష్టమి కార్యక్రమంలో ప్రత్యేక పూజలు జరిపి బాలలతో శ్రీకృష్ణుని పాత్రలు వేయించారు. విఠల్ రుక్మిణి మందిరంలో విశేష కార్యక్రమాలను నెరవేర్చారు. ఇస్కాన్ మందిరంలో ప్రత్యేక పూజలు, అలంకరణలు చేశారు. శ్రీకృష్ణుడికి ఊయల సేవలు జరిపారు. వేడుకగా నల్లనయ్య జయంతి హుబ్లీ: జంట నగరాలతో పాటు జిల్లా వ్యాప్తంగా గోకుల అష్టమి శుభవేళ అన్ని చోట్ల బాలకృష్ణుని జయంతి వేడుకలను ఆయా ఆలయాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులు జరుపుకొన్నారు. ముఖ్యంగా రాయాపుర ఇస్కాన్, కేశవపుర గీతా మందిరతో పాటు ధార్వాడలోని కృష్ణ మందిరాల్లో, అలాగే జిల్లాలోని వివిధ చోట్ల నల్లనయ్య జయంతి వేడుకల సందర్భంగా తెల్లవారు జాము నుంచే ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది. ముఖ్యంగా ఇస్కాన్లో శుక్రవారం నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. విశేషంగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా మంటపాలు నిర్మించి కృష్ణయ్య దర్శనం చేయించారు. కేశవపుర గీతా మందిరంలో శనివారం ఉదయం పరమాత్ముడికి వెన్న అలంకారంతో పూజలు నిర్వహించారు. నగరంలోని వివిధ మహిళా మండళ్ల సభ్యులతో భజనలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 7 గంటలకు రామచంద్రాచార్య దాసవాణి కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం, ఊయల పూజలు, మహామంగళ హారతి తదితర వేడుకలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. ఇక విద్యా సంస్థల్లో అయితే చిన్నారుల చిట్టిపొట్టి వేషాలతో బాలకృష్ణులను తనివితీరా చూడాల్సిందే. ఫ్యాన్సీ డ్రస్సులతో ముద్దు మురిపాలతో తమ పిల్లలను బాలకృష్ణుడి వేషభూషణాలతో తీర్చిదిద్ది ప్రతి విద్యా సంస్థల్లోను ఈ బాలల కృష్ణవేషధారణ సందడి విశేషంగా కనిపించింది. ఇంకా అదివారం రోజు కూడా ప్రత్యేక కార్యక్రమాలను వివిధ ఆలయాల్లో ఏర్పాటు చేశారు. ఆరోజు కృష్ణుడి విగ్రహానికి విశేష పంచామృతాభిషేకం, భజనలు, పారాయణం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాజవీధిలో వైభవంగా రథోత్సవాన్ని ఏర్పాటు చేశామని కేశవపుర గీతా మందిరం ధర్మ కన్వీనర్ వెంకటేష్ ఆచార్, జాగీర్దార్, ఆ మందిరం మేనేజింగ్ ట్రస్టీ కేశవ్ దేశాయ్ ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలో శ్రీకృష్ణుని విగ్రహం ఊరేగింపు యాదవ సముదాయ భవనం నిర్మిస్తాం నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి వెల్లడి -
తుంగభద్ర వరద యథాతథం
●డ్యాం వద్ద 11 గేట్ల నుంచి నీటి విడుదల హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర జలాశయానికి ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు యథావిధిగా కొనసాగుతుండటంతో డ్యాంకు వరద పోటెత్తుతోంది. శనివారం డ్యాంలో నీటి నిల్వ 80.003 టీఎంసీలు ఉండగా డ్యాం వద్ద 11 క్రస్ట్గేట్లను పైకెత్తి దిగువకు సుమారు 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంకు వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. డ్యాంలో నీటిమట్టం 1626.06 అడుగులు, ఇన్ఫ్లో 40 వేల క్యూసెక్కులు ఉందని బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. సర్వోత్తమ సేవా అవార్డుల ప్రదానం రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో ప్రభుత్వ సేవల్లో కొలువు దీరిన అధికారుల సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సర్వోత్తమ సేవా అవార్డులను మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ చేతుల మీదుగా అందించారు. ఆగస్టు 15న మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో రాయచూరు తహసీల్దార్ సురేష్ వర్మ, స్టాటికల్ ఉద్యోగి సంతోష్ నందిని, సిరవార సీడీపీఓ అధికారి నాగరత్న, జిల్లా ఖజానా లెక్కాధికారి వెంకటాచల, మాన్వి ఆయుష్ వైద్యాధికారి రాజేంద్ర, విద్యా శాఖ ఉద్యోగి హనుమంతరాయ, సింధనూరు గ్రంథాలయం ఉద్యోగి యల్లప్ప, మిస్కి ఉద్యోగి గురునాథ్, దేవదుర్గ టీపీ ఎఫ్డీసీ హమీదా బేగం, మాన్వి వ్యవసాయ శాఖ అధికారి యంకణ్ణ యాదవ్లను మంత్రి సన్మానించారు. ట్రామా కేర్ యూనిట్కు శ్రీకారంరాయచూరు రూరల్: రాయచూరులో ట్రామా కేర్ యూనిట్కు రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ శ్రీకారం చుట్టారు. శనివారం ఒపెక్ ఆస్పత్రిలో ఉంచిన ట్రామా కేర్ పరికరాల గురించి ప్రత్యేక అధికారి బాలాజీ వివరించారు. ప్రజలకు ఉత్తమ రీతిలో వైద్య సేవలు అందించాలన్నారు. కళ్యాణ కర్ణాటకలోని జిల్లాల్లో ప్రజలు వ్యవసాయంపై ఆధార పడ్డారన్నారు. వ్యాధులు సక్రమించినప్పుడు స్పందించి చికిత్స అందించాలని సూచించారు. రూ.10 కోట్లతో ట్రామా కేర్ యూనిట్, క్యాన్సర్ యూనిట్లను ప్రారంభించామన్నారు. సమావేశంలో లోక్సభ సభ్యుడు కుమార నాయక్, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసనగౌడ, ఎమ్మెల్సీ వసంత కుమార్, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, రిమ్స్ అధికారి రమేష్, గురుసిద్దయ్య హిరేమఠలున్నారు. ఉజ్జిని సబ్స్టేషన్ జలమయంహొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి సమీపంలోని ఉజ్జిని గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా కూడ్లిగి రోడ్డులోని 66/11 కేవీ విద్యుత్ పంపిణీ సబ్స్టేషన్లోకి పెద్ద మొత్తంలో నీరు ప్రవేశించింది. నీటి ప్రవాహాన్ని ఆపడానికి శాఖ సిబ్బంది తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ ప్రాంతం పూర్తిగా మునిగింది. కార్యాలయం కాంపౌండ్ పక్కన గ్రామ మార్కెట్ నుంచి ప్రవహించే బాహ్యడ్రైనేజీ కాలువ నుంచి నీరు సబ్స్టేషన్లోకి చేరుతోంది. గ్రామ పంచాయతీ వెంటనే ఈ సమస్యపై దృష్టి పెట్టాలని ఉద్యోగులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. అవయవదానానికి మంత్రి అంగీకారం హుబ్లీ: అవయవదాన వాగ్దాన పత్రంపై న్యాయ, పర్యాటక శాఖ మంత్రి హెచ్కే.పాటిల్ సంతకం చేశారు. రాజకీయ రంగంలో సుదీర్ఘంగా 46 ఏళ్ల పాటు క్రియాశీలుడైన ఆయన తన 72వ జన్మదిన వేళ ఈ ఆదర్శ కార్యానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ అవయవదానంలో ఆయన పేరు నమోదు చేయించారు. గుండె, కిడ్నీలు, కళ్లతో పాటు ఇతర అవయవదానాన్ని ఆయన ప్రకటించారు. తద్వారా తన జన్మదినాన్ని విశిష్టంగా ఆచరించారు. హెచ్కే.పాటిల్ సేవా బృందం చేపట్టిన ఈ అభియాన్లో శుక్రవారం వరకు 1440 మంది అవయవదాన పత్రాలను నమోదు చేయించుకున్నారు. -
పని లేక యంత్రాల మూగ నోము
హుబ్లీ: కొప్పళ, విజయనగర, బళ్లారి జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రోణ తాలూకాకు వచ్చిన వరి కోత యంత్రాల యజమానులు, కార్మికులు పని లేక పస్తులతో గడపాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తాలూకాలో ఎక్కువగా పండించే పెసలు కోత కోయడానికి వేలాది యంత్రాలు వచ్చాయి. అయితే కుండపోత వర్షాలతో పొలాల్లో నీరు నిలవడటంతో యంత్రాలు ముందుకు వెళ్లలేక మొరాయిస్తున్నాయి. దీంతో గత 10 రోజుల నుంచి సదరు యంత్రాలకు పని లేక యజమానులు, కార్మికులు రోజు వారి కడుపు తిప్పల కోసం అగచాట్లు పడుతున్నారు. రోణ, సూడి, నరేగల్ తదితర గ్రామీణ ప్రాంతాల్లోని పొలాల్లో ప్రస్తుతం యంత్రాలదే హోరు. ఎక్కడ పడితే అక్కడ అవి కనిపిస్తున్నాయి. అయితే కొన్ని రోజుల నుంచి కార్మికులు రోడ్డు పక్కన బతుకు వెళ్లదీస్తున్నారు. జూలై చివరి వారంలో వచ్చిన ఈ యంత్రాలు ఊరి శివారులో టికానా వేశాయి. జూలైలో కొన్ని భాగాల్లో పెసలు కోత చేసి రాశులు చేసేవారు. అనంతరం పంట చేతికొస్తుందని అనుకునేంతలోనే వానలు నిరంతరంగా కురవడంతో సదరు యంత్రాల యజమానులకు ఇక్కట్లు ఓ వైపు కాగా అన్నదాతలకు మరో రకంగా బాధలు తప్పడం లేదు. ఖరీఫ్ సీజన్లో పండించే పెసలు, మొక్కజొన్న, రబీ సీజన్లో శెనగకు ఈ యంత్రాలే ఆసరా. వ్యవసాయ కూలీల కొరత వల్లే ఈ యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. పెసల కోత, ఉల్లి కలప, నిర్వహణ కలిసి రావడంతో కూలీల కొరత కనిపిస్తోంది. దీంతో కూలీలు దొరికిన రోజుకి ఒక్కరికి రూ.400 కూలీ చెల్లించాలి. ఒక ఎకరాకు 15 మంది కూలీలు అనుకున్నా రూ.6000 కూలి చెల్లించాలి. దీనికి బదులుగా భారీ యంత్రం ద్వారా కోతలు చేస్తే రూ.1500 ఖర్చు అవుతుంది. దీంతో ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ యంత్రాలను వాడటం అనివార్యం అని రైతన్న సంతోష్ కమతర్ తెలిపారు. గత 10, 15 రోజులుగా రోణ తాలూకాలో పూర్తిగా పెసల పంట కోతలు చేసి రైతులకు అండగా నిలిచే వారమని, అయితే నిరంతర వానలతో ఖాళీగా ఉండాల్సి వస్తోందని సదరు యంత్రాల యజమానులు, కూలీలు వాపోతున్నారు. వేలాది రూపాయలు ఖర్చులు చేసి దూరం నుంచి వచ్చామని ప్రస్తుతం పని లేక డబ్బు, సమయం రెండు వృథా అవుతున్నాయని బళ్లారికి చెందిన సదరు యంత్రం యజమాని రమేష్ చిక్కగౌడ్ర తన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు తప్పని కడుపు తిప్పలు పస్తులతో గడపాల్సిన దైన్య స్థితులు -
ప్రతి మదిలో ఉప్పొంగిన దేశభక్తి
బనశంకరి: స్వాతంత్య్ర దిన వేడుకలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వాడవాడలా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. జాతి నేతల త్యాగాలను స్మరిస్తూ నేతల ప్రసంగాలు ప్రజల్లో ఉత్తేజాన్ని నింపాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, మహనీయుల వేషధారణలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెంగళూరులోని మానెక్షా పరేడ్ మైదానంలో కర్ణాటక పోలీస్ బ్రాండ్ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హరొహళ్లి పాలికె పీయూ కళాశాలకు చెందిన విద్యార్థులు స్వాతంత్య్ర ఘట్టానికి సంబంధించిన వీర కన్నడతి పేరుతో నృత్య రూపకం ప్రదర్శించారు. ఐదు గ్యారంటీ పథకాలకు సంబంధించి విద్యార్థులతో ప్రదర్శనలు ఇప్పించారు. రాజేశ్, నిర్మల డీఆర్బృందం నాడగీతం, రైతుగీతం, డొళ్లుకుణిత తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కలబుర్గి, ధార్వాడ, మైసూరు తదితర నగరాల్లో స్వాతంత్య్ర దిన వేడుకల సంబరాలు మిన్నంటాయి. -
ట్రేడింగ్ పేరిట వంచన
హుబ్లీ: ఫేస్బుక్లో పరిచయమైన మహిళ ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా డబ్బులను సంపాదించవచ్చని ధార్వాడకు చెందిన వ్యక్తిని నమ్మించి ఏకంగా రూ.22 లక్షలు బదలాయించుకొని మోసగించింది. వివరాలు.. ప్రకాష్గౌడ అనే వ్యక్తిని మధుశ్రీ అనే మహిళ మోసగించింది. పరిచయం అయిన ఆ మహిళా ట్రేడింగ్ వ్యవహారం, డబ్బు సంపాదన గురించి వివరించింది. ఈక్రమంలో ముందుగా లాభాలు వచ్చినట్లు నమ్మించి ఆ మేరకు వైసీఎం అనే యాప్లో లాభాలను చూపించి రూ.22 లక్షలను తన ఖాతాలోకి బదలాయించుకొని వంచించినట్లు బాధితుడు సైబర్క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా జేబు దొంగతనానికి యత్నించిన వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన వెలుగు చూసింది. ఉప నగర పోలీస్టేషన్ పరిధిలో మీరజ్నగర్ పెట్రోల్బంకు వద్ద బస్టాప్లో నిలిబడి ఉన్న బస్సు ప్రయాణికుడి వద్ద జేబు దొంగతనానికి ప్రయత్నించిన సెటిల్మెంట్ నివాసి గణేష్(27)ని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వైభవంగా రథోత్సవం రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా కురిడి గుండూరు భీమేష్ తాత రథోత్సవం వైభవంగా జరిగింది. గురువారం రాత్రి వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. భీమేష్ తాతకు ప్రత్యేక పూజలను కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య నెరవేర్చారు. రథోత్సవంలో రాయచూరు, మాన్వి, సింధనూరు, బళ్లారిల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్లాస్టిక్రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం బళ్లారి రూరల్: జిల్లాలో ప్లాస్టిక్ రహిత నేల, నీరు, పర్యావరణం, పరిసరాల సంరక్షణ ఆవశ్యకమని దావణగెరె జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి తెలిపారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో అధికారులకు, రైతులకు పర్యావరణం, పరిసరాల పరిరక్షణపై ఏర్పాటు చేసిన జాగృతి కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గతనెల 18న అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు, పీడీఓలకు, గ్రామాధికారులకు, రైతు సంఘాలకు, సంఘ సంస్థలతో వెబినార్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరిసరాల పరిరక్షణ మహత్తరమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, మొక్కలను పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శబ్ద, వాయు, జల కాలుష్యాలను అరికట్టాలన్నారు. జెడ్పీ సీఈఓ గిత్తెమాధవ విఠలరావ్, అదనపు జిల్లాధికారి శీలవంత శివకుమార్, రైతు ప్రముఖులు బల్లూరు రవికుమార్, వసంత్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి అదృశ్యం హొసపేటె: కిర్లోస్కర్ ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పని చేసే శ్రీనాథ్ అనే వ్యక్తి పనికి వెళ్లి తిరిగి రాకపోవడంతో మరియమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో వ్యక్తి అదృశ్యం కేసు నమోదైంది. తప్పిపోయిన వ్యక్తి 5.5 అడుగుల ఎత్తు, పలుచని శరీరాకృతి, నలుపు రంగు శరీరఛాయ కలిగి, కుడి చేతిపై ఎస్పీ అనే ఆంగ్ల అక్షరాలను టాటూగా వేయించుకొన్నాడు. అతను బూడిద రంగు ప్యాంట్, నీలం చారల కాటన్ చొక్కా ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, కన్నడలో మాట్లాడగలడని, ఈ వ్యక్తి ఆచూకీ గురించి ఏదైనా సమాచారం ఉంటే మరియమ్మనహళ్లి పోలీస్స్టేషన్ లేదా ఎస్ఐ సెల్: 9480805769కు సమాచారం అందించాలని ఓ ప్రకటనలో కోరారు. ఎయిమ్స్ కోసం కేంద్ర మంత్రితో భేటీ రాయచూరు రూరల్: రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామని వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాన మంత్రికి లేఖ రాశారన్నారు. ప్రజా ప్రతినిధులు జిల్లా నేతలతో కలసి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిపై ఒత్తిడి తెస్తామన్నారు. కలబుర్గి, మైసూరు, బెళగావిలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఒపెక్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలకు చర్యలు చేపట్టామన్నారు. రూ.40 కోట్లతో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కన్వెన్షన్ భవనం, రూ.10 కోట్లతో ట్రామా కేర్, క్యాన్సర్ యూనిట్లను ప్రారంభించామన్నారు. లోక్సభ సభ్యుడు కుమార నాయక్, గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్, ఎమ్మెల్సీ వసంత కుమార్, జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్లున్నారు. ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు హుబ్లీ: నగరంలో గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి 454 గ్రాముల గంజాయితో పాటు బైకును స్వాధీనం చేసుకొన్నారు. మంటూరు రోడ్డు నివాసి అఽథన్ జుబేద్, సంకేశ్వరకు చెందిన హబీబ్ను అరెస్టు చేసి హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
అన్నదాసోహ సేవాకర్త కన్నుమూత
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో శరణ పరంపర, విద్యా క్రాంతి, అన్నదాసోహ సేవాకర్త కలబుర్గి శరణ బసవేశ్వర ఆలయం 8వ పీఠాధిపతి శరణ బసవప్ప అప్ప(90) గురువారం రాత్రి ఇహలోకాన్ని త్యజించారు. గత 10 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయనను గురువారం సాయంత్రం వారి నివాసానికి తీసుకొచ్చారు. ఆయనకు భార్య దాక్షాయణి, ఏడుగురు కుమార్తెలు, 9వ పీఠాధిపతి దొడ్డప్ప అప్ప అనే కుమారుడున్నారు. 1914 నవంబర్ 14న దొడ్డప్ప అప్ప, గోదుతాయి దంపతులకు జన్మించారు. ఆధ్యాత్మిక, ధార్మిక, ధర్మ చింతన, తత్వ జ్ఞానం కలిగి ఉన్నారు. రాజకీయ రంగం నుంచి దూరంగా ఉండడానికి 13వ ఏట షోలాపూర్కు వెళ్లి త్రికాల పూజలో నిమగ్నులయ్యారు. 14వ ఏట ముగుళగాన గవిసిద్ద లింగ శివాచార్యతో ధార్మిక విద్యనభ్యసించారు. ప్రాథమిక విద్యా స్థాయి నుంచి బీఏ వరకు కలబుర్గిలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ధార్వాడ వర్సిటీ నుంచి ఎంఏ పట్టా ధార్వాడ విశ్వవిద్యాలయం నుంచి 1953లో ఎంఏ తత్వజ్ఞానంలో పరిణతి పొందారు. బుద్ధ, బసవ, మహావీర, శరణ, దాస పరంపరను అనుసరించారు. 1972–74 మధ్య కాలంలో హైదరాబాద్ కర్ణాటక విద్యా సంస్థలకు అధ్యక్షుడిగా పని చేశారు. 1957లో హావేరి శివప్ప అనూర్ శెట్టి కుమార్తె కోమలను వివాహమాడారు. ఆమెకు డాక్టర్ గంగాబిక, నీలాంబిక, ముక్తాంబిక, ఉమా, గోదావరిలు జన్మించారు. ముక్తాంబిక చిన్న వయసులోనే మరణించింది. కలబుర్గిలోని కేంద్రీయ విశ్వ విద్యాలయంలో పీజీ కోర్సుల ప్రారంబానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి భూములను మంజూరు చేయించారు. 1983లో కలబుర్గి శరణ బసవేశ్వర దేవాలయం 8వ పీఠాధిపతిగా శరణ బసవప్ప అప్ప బాధ్యతలు స్వీకరించారు. యాదగిరి జిల్లా సురపురలో ఇంజినీరింగ్ కళాశాల, యాదగిరి, బీదర్, కలబుర్గిలో జూనియర్ కళాశాలలను ప్రారంభించారు. కలబుర్గి శరణ బసవేశ్వర అప్ప దేవాలయాన్ని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సందర్శించారు. సంతాపం ప్రకటించిన మంత్రులు: కలబుర్గి శరణ బసవప్ప అప్ప మరణంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, ప్రియాంక్ ఖర్గే, శరణ బసప్ప దర్శనాపూర్, ఈశ్వర్ ఖండ్రేలు సంతాపం వ్యక్తం చేశారు. కలబుర్గి శరణ బసవప్ప అప్ప అంత్యక్రియలను వీరశైవ లింగాయత విధివిధానాలతో దేవాలయం ముందు భాగంలో జరిపారు. వందలాది మంది స్వామీజీలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కళ్యాణ కర్ణాటకలో విద్యావేత్తగా గుర్తింపు 60కి పైగా విద్యా సంస్థలు నెలకొల్పిన వైనం -
మహనీయుల త్యాగాలు మరువకూడదు
సాక్షి,బళ్లారి: తెల్లదొరల పాలనను అంతమొందించేందుకు, భారత దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు ఎందరో మహానుభావులు త్యాగ, బలిదానాలు చేశారని, వారిని మనందరం మరవకూడదని రాష్ట్ర పురపాలక, హజ్ శాఖ మంత్రి రహీంఖాన్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని, మూడు రంగుల జెండాను ఎగరవేసిన తర్వాత మాట్లాడారు. నగరంలో బీఎంసీఆర్సీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పోలీసులు, విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రవి అస్తమించని బ్రిటిష్ సామాజ్య్రాన్ని కూకటివేళ్లతో పెకలించడానికి ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేశారన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ అహింసా నినాదంతో ఎంతో శ్రమించారన్నారు. జవహర్లాల్ నెహ్రు, బాలగంగాధర తిలక్, సర్దార్ వల్లబ్భాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ వంటి మహనీయులు తమ అపారమైన ప్రతిభతో దేశాన్ని ముందుకు నడిపించి బ్రిటిష్ వారిని దేశం విడిచిపెట్టేలా చేశారన్నారు. ఆగస్టు 15వ తేదీ మనందరికి పండుగ రోజు అని అన్నారు. ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, మేయర్ నందీష్, జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా, ఎస్పీ శోభారాణి, ప్రముఖులు ముండ్రిగి నాగరాజు, జే.ఎస్. ఆంజనేయులు పాల్గొన్నారు. అభివృద్ధి దిశగా బళ్లారి బళ్లారి నగరంతో పాటు నగరసభలు, పురసభలు, పట్టణ పంచాయతీలు, అన్ని గ్రామాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయని మంత్రి రహీంఖాన్ తెలిపారు. ఆయన శుక్రవారం నగరంలో స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆకట్టుకున్న స్వాతంత్య్ర దిన వేడుకలు 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలా జరుపుకున్నారు. గవియప్ప సర్కిల్ వద్ద 150 అడుగుల ఎత్తైన స్తంభంలో వెలసిన జెండాను ఎగరవేశారు. జిల్లాధికారి కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి, గాంధీభవన్లోని గాంధీజీ విగ్రహానికి, గాంధీజీ చితాభస్మానికి పూల మాలలు వేసి పూజలు చేశారు. జిల్లాధికారి కార్యాలయ ఆవరణలో జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా జెండా ఎగరవేశారు. జిల్లా క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలో రిహార్సల్స్, నృత్యాలు, దేశభక్తి గీతాలకు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఆర్వైఎంఈసీలో.. నగరంలోని ఆర్వైఎంఈ కళాశాలలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కళాశాల చైర్మన్ జానేకుంటె బసవరాజు, ప్రిన్సిపాల్ హనుమంతరెడ్డి తదితరులు పాల్గొని జెండా ఎగరవేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని కొనియాడారు. ఎస్జీటీలో కళాశాలలో.. బళ్లారి అర్బన్: కేంద్ర సమాచార శాఖ, శ్రీగురు తిప్పేరుద్ర జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఆ సంస్థ డైరెక్టర్ మంజుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యా సంస్థ కార్యదర్శి జీ.నాగరాజు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల బలిదాన ఫలితంగా మనకు స్వాతంత్య్రం లభించిందన్నారు. అలాంటి మహానేతలను ఈసందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించి గౌరవించాలన్నారు. సమాచార శాఖ అధికారి రామకృష్ణ, ఎస్జీటీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రీనారెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శారద, హైస్కూల్ విభాగం హెచ్ఎం ఇలియాస్, లెక్చరర్లు కృష్ణప్ప, పద్మావతి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర బళ్లారి రూరల్ : క్విట్ ఇండియా ఉద్యమంలో దావణగెరె జిల్లావాసులు ప్రాణత్యాగం చేసిన చరిత్ర దావణగెరెకు ఉందని జిల్లా ఇన్చార్జి, గనులు విజ్ఞాన, ఉద్యానవన శాఖ మంత్రి ఎస్.ఎస్.మల్లికార్జున తెలిపారు.స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా శుక్రవారం దావణగెరెలో జాతీయజెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. 1947 ఆగస్టు 15కు మునుపు నుంచి అనేక మంది సమరయోధుల పోరాటంతో బ్రిటీషు వారి నుంచి స్వాతంత్య్ర సిద్ధించిందన్నారు. మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్, సరోజినీనాయుడు, లాలా లజపతిరాయ్, టిప్పుసుల్తాను, కిత్తూరు రాణిచెన్నమ్మ తదితర అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులను మనం స్మరించుకోవాలన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రరూపం దాల్చిన సమయంలో ఆ ఉద్యమాన్ని బలపరచడానికి దావణగెరెలోను స్థానికులు ఉద్యమం చేశారన్నారు. ఆ సమయంలో హళ్లూరు నాగప్ప, అక్కసాలి విరూపాక్షప్ప, బిదిరికుంతి నింగప్ప, హమాలి తిమ్మణ్ణ, నింగప్ప, మాగానహళ్లి హనుమంతప్ప తదితరులు బ్రిటీషువారి తుపాకీ గుళ్లకు బలయ్యారని తెలిపారు. దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభామల్లికార్జున, జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హొసపేటె: దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీర యోధులందరినీ స్మరించుకోవడం మన ప్రాథమిక కర్తవ్యమని విజయనగర జిల్లా ఇన్చార్జ్, గృహ నిర్మాణ, వక్ఫ్, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి బీ.జెడ్.జమీర్ అహ్మద్ఖాన్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాల వల్ల మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. నాడు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన రాష్ట్రపిత మహాత్మాగాంఽధీ, సర్దార్ వల్లబ్భాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్చంద్రబోస్, అబ్దుల్కలాం ఆజాద్, భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖ్దేవ్ వంటి వేలాది మంది ధైర్య యోధులను మనం స్మరించుకోవాలన్నారు. రెండేళ్లకు పైగా సాగుతున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇచ్చిన ఐదు హామీలను ఒకే నెలలో అమలు చేశామని గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు నిర్మించడానికి, ముఖ్యంగా పేదలు, నిరాశ్రయులకు ఇళ్లను అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మొత్తం 2,30,000 ఇళ్లను రాబోయే రోజుల్లో దశల వారీగా మంజూరు చేస్తామన్నారు. నిరాశ్రయులకు ఇప్పటికే 36,799 ఇళ్లు అందించామన్నారు. ఇందుకోసం రూ.500 కోట్లు విడుదల చేశామన్నారు. 2026 చివరి నాటికి లబ్ధిదారులకు పూర్తి ఆశ్రయం కల్పించే దిశగా ఈ పథకానికి నిధులు కేటాయిస్తామని సీఎం సిద్దరామయ్య హామీ ఇచ్చారన్నారు. గ్యారెంటీ పథకాలతో పేదలు, మధ్య తరగతికి చాలా లబ్ధి కలిగిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ పథకాలను నిలిపివేయబోమన్నారు. ఈ పథకాలతో ప్రజల ఆర్థికస్థితి మెరుగుపడిందన్నారు. జిల్లాధికారి కార్యాలయంలో.. హొసపేటెలోని జిల్లాధికారి కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాధికారి ఎం.ఎస్.దివాకర్ జాతీయ జెండాను ఎగరవేశారు. జిల్లా పంచాయతీ సీఈఓ నోంగ్జోయ్ మహ్మద్ అక్రమ్ అలీ షా, అదనపు డిప్యూటీ కమిషనర్ ఈ.బాలకృష్ణప్ప, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, రెవిన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా వారు ఆ శాఖ అధికారులతో కలిసి హొసపేటెలోని జోళదరాశి కొండపై జెండాను ఎగరవేశారు. దేశాభివృద్ధికి కంకణబద్ధులు కావాలి రాయచూరు రూరల్: భారత దేశ ఐక్యతకు, అభివృద్ధికి నేటి యువత కంకణబద్ధులు కావాలని జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ క్రీడాంగణంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగుర వేసి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని మననం చేసుకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదలకు ఐదు గ్యారెంటీ పథకాలను అమలు చేశామన్నారు. ప్రజా స్నేహి పాలనకు శ్రీకారం చుట్టామన్నారు. ఎమ్మెల్యేలు శివరాజ్ పాటిల్, బసనగౌడ దద్దల్, జిల్లాధికారి నితీష్, ఏడీసీ శివప్ప, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ పుట్టమాదయ్య, ఏపీఎంసీ అధ్యక్షులు బసనగౌడలున్నారు. కలబుర్గిలో.. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మహానేత మహాత్మ గాంధీజీ అని కలబుర్గి ఇన్చార్జి మంత్రి ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. శుక్రవారం కలబుర్గి సర్దార్ వల్లబ్భాయి పటేల్ క్రీడా మైదానంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. నాడు సాధించిన స్వాతంత్య్రం వల్ల నేడు మనం దానిని రక్షించుకోవడానికి ముందుండాలన్నారు. వెనుక బడిన కళ్యాణ కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేకంగా ఈ ఏడాది రూ.5000 కోట్లుకేటాయిుంచారన్నారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి, రాజ్యాంగంలోని ఆర్టికల్–371(జే) ఉప కార్యాలయం కలబుర్గిలో ఏర్పాటు చేస్తామన్నారు. శాసన సభ్యులు బీఆర్ పాటిల్, అల్లమ ప్రభు, తిప్పణప్ప, ఖనీజా ఫాతిమాలున్నారు. యాదగిరిలో.. యాదగిరిలోని క్రీడా మైదానంలో గురువారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను రాష్ట్ర చిన్న పరిశ్రమల శాఖ మంత్రి శరణ బసప్ప దర్శనాపుర ధ్వజారోహణ చేసి ప్రారంభించారు. జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ముందుండాలన్నారు. కాంగ్రెస్ సర్కార్లో పేదలకు ఐదు గ్యారెంటీ పథకాలను అమలు చేశామన్నారు. వరదలు ఎక్కువగా ఉన్నందున పరిహారం, ఇతర కార్యక్రమాలను చేపట్టాలన్నారు. చెళ్లకెరెలో.. చెళ్లకెరె రూరల్: ఎందరో మహానుభావుల త్యాగ బలిదానాలతో దేశానికి స్వాతంత్య్రం లభించిందని, అలాంటి మహనీయుల ఆదర్శాలను యువత అలవర్చుకోవాలని హొయ్సళ బ్యాంక్ జనరల్ మేనేజర్ వీరేష్ తెలిపారు. ఆయన శుక్రవారం బ్యాంక్ కార్యాలయం ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. బ్యాంక్ డైరెక్టర్లు సీ.వీరభద్ర బాబు, ఇంజినీర్ రవి, ప్రహ్లాద్, సిద్ధార్థ, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్య్ర ఫలాలను మనందరం అనుభవిస్తున్నాం రాష్ట్ర పురపాలక, హజ్ శాఖ మంత్రి రహీంఖాన్ ఆకట్టుకున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా త్రివర్ణ పతాక రెపరెపలు హుబ్లీ: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జంట నగరాలతో పాటు జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. జిల్లా వ్యాప్తంగా దేశభక్తి పరిమళించింది. ప్రధాన కార్యక్రమం ఆర్ఎన్.శెట్టి మైదానంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సంతోష్లాడ్ పతాకావిష్కరణ గావించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యాక్రమాల గురించి సమగ్రంగా వివరించారు. అంతకు ముందు వివిధ దళాలచే గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాధికారి దివ్యప్రభు, జిల్లా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అలాగే హుబ్లీలోని ప్రముఖ ఈద్గా మైదానంలో పాలికె ఆధ్వర్యంలో పతాకావిష్కరణ గావించారు. మేయర్ వీణా, కమిషనర్ రుద్రప్ప గాళి, డిప్యూటీ మేయర్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఈద్గా మైదానంలో తగిన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంకా హుబ్లీలోని నెహ్రూ మైదానంలో కూడా అధికారులు పతాకావిష్కరణ చేశారు. ఇంకా జంట నగరాలతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల్లో కూడా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు అన్ని విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు తదితరాలతో పాటు దాదాపు అన్ని చోట్ల జాతీయ పతాకాన్ని అక్కడి ఉద్యోగులు ఎగరవేసి ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకొన్నారు. అలాగే స్టేషన్ సమీపంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని దళిత నాయకులు ఆవిష్కరించారు. తాలూకా కేంద్రాలల్లో ఎమ్మెల్యేలు, తహసీల్దార్ తదితరులు పాల్గొని 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ఆచరించారు. మొత్తం మీద సర్వత్రా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత దేశభక్తితో ఉత్సాహంగా ప్రజలు జరుపుకొన్నారు. -
పోలీసుల అదుపులో అక్రమ వలసదారులు
కోలారు: అక్రమ వలసదారులుగా అనుమానిస్తున్న ఇద్దరు బంగ్లాదేశీయులను కోలారు జిల్లా శ్రీనివాసపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ బీ నిఖిల్ స్టేషన్ వెళ్లి పరిశీలన జరిపారు. వీరిద్దరు శ్రీనివాసపురం పట్టణ సమీపంలోని బయలు ప్రదేశంలో షెడ్ వేసుకుని నివాసం ఉంటున్నారు. వీరితో పాటు ఇంకా నలుగురు పిల్లలు, నలుగురు మహిళలు కలిపి మొత్తం 12 మంది ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని బెంగుళూరులోని డిటెన్షన్ కేంద్రానికి తరలించనున్నారు. వీరు దేశంలోకి ఎప్పుడు చొరబడ్డారు, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు. వీరితో పాటుఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో బల్లి ● 22 మంది విద్యార్థులకు అస్వస్థత హోసూరు: మధ్యాహ్న భోజనంలో బల్లి పడి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బేరికె సమీపంలోని కాటినాయకనదొడ్డి గ్రామంలో జరిగింది. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. గురువారం పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనం తింటుండగా ఓ విద్యార్థికి ఆహారంలో బల్లి కనిపించింది. వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. అంతలోపే 22 మందికి పైగా విద్యార్థులు భోజనం చేశారు. విషయం తెలుసుకొన్న ఉపాధ్యాయులు వండిన ఆహారాన్ని పడేశారు. కొద్ది సేపటికే భోజనం తిన్న 22 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వీరిని బేరికె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కవాతులో విద్యార్థులకు అస్వస్థత శివమొగ్గ: శివమొగ్గ నగరంలో నెహ్రూ స్టేడియంలో శుక్రవారం ఉదయం జిల్లా యంత్రాంగం నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ కవాతులో అపశృతి చోటు చేసుకుంది. కవాతు నిర్వహిస్తుండగా ఒక బాలిక, ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ డాక్టర్ ధనంజయ సర్జీ అంబులెన్స్లో బాలికను తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందజేశారు. బాలిక కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని డాక్టర్ ధనుంజయ సర్జీ అన్నారు. మరో ఇద్దరు పిల్లలకు సపర్యలు చేశారు. చాలా సేపు నిశ్చలంగా నిలబడి నీళ్లు తాగకపోవడంతో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయన తెలిపారు. -
రూ.కోట్లాది నగదు, కేజీల చొప్పున బంగారు లభ్యం
● ఎమ్మెల్యే సతీశ్ సైల్ ఇంట్లో ఈడీ జరిపిన సోదాలతో వెలుగులోకి శివాజీనగర: ఉత్తర కన్నడ జిల్లా కార్వారకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ సైల్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రెండు రోజుల నుంచి ముమ్మర సోదాలు చేపట్టారు. తనిఖీల్లో కోట్లాది రూపాయల నగదు, కేజీల కొద్దీ బంగారం స్వాధీనం చేసుకొన్నారు. ఎమ్మెల్యే సతీశ్ సైల్ ఇల్లు, బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.1.68 కోట్ల నగదు, సుమారు రూ.6,20,45,319 విలువ చేసే 6.75 కేజీల బంగారాన్ని అధికారులు జప్తు చేసుకొన్నారు. చరాస్తి, స్థిరాస్తితో పాటు మొత్తం రూ.14.13 కోట్ల విలువ చేసే ఆస్తిని స్వాధీనం చేసుకొన్నారు. ఈడీ అధికారులు 2 పెట్టెల్లో బంగారు, నగదు, ఆధారాలు తీసుకెళ్లారు. ఈడీ సోదాల సమయంలో ఆర్థికత, దోషారోపణ ఆధారాలు, ఈ–మెయిల్, ఇతర ఆధారాలు లభించాయి. దర్శన్ @7314 యశవంతపుర : రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహర జైలుకు వెళ్లిన నటుడు దర్శన్, పవిత్రాగౌడలకు జైలు అధికారులు నంబర్లు ఇచ్చారు. ఏ1 పవిత్రాగౌడకు–7313, ఏ–2దర్శన్కు 7314 నంబర్లను ఇచ్చారు. ఇదే కేసులోని నిందితులు ప్రదోశ్కు 7317, నాగరాజుకు 7315, లక్ష్మణ్కు 7316 నంబర్ కేటాయించారు. నేడు కుటుంబసభ్యులు భేటీ? దర్శన్, పవిత్రాగౌడ కుటుంబసభ్యులు శనివారం జైలుకు వెళ్లి ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. దర్శన్తో పాటు మరో ముగ్గరిని ఒకే బ్యారక్లో ఉంచారు. పవిత్రాగౌడను క్యారంటైన్లో ఉంచారు. ఆమెను ముఖ్యమైన బ్యారక్లోకి పంపే అవకాశం ఉందని జైలు అధికారులు తెలిపారు. కాగా గురువారం రాత్రి దర్శన్ రాత్రి నిద్రపోలేదు. సహచరులతో కలిసి మాట్లాడుతూ గడిపారు. దుష్ప్రచారకులపై చర్యలు తీసుకోండి మైసూరు : ధర్మస్థలలో మృతదేహాలు పూడ్చి పెట్టారనే కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ వెంటనే మధ్యంతర నివేదికను సమర్పించాలని మైసూరు, కొడగు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మైసూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ధర్మస్థలలో మృతదేహాలను ఖననం చేసినట్లు చెబుతున్న కేసులపై సిట్ దర్యాప్తు జరుపుతోందన్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై మధ్యంతర నివేదిక విడుదల చేయాలన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫాంలు, యూట్యూబర్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మోకా ఎస్ఐ భార్య ఆత్మహత్య
సాక్షి,బళ్లారి: తాలూకాలోని మోకా పోలీసు స్టేషన్ ఎస్ఐ కాళింగ భార్య చైత్ర(34) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. ఉదయం మోకాలోని పోలీసు క్వార్టర్స్లోని ఇంట్లో ఆమె తలుపులు వేసుకుని బలవన్మరణానికి పాల్పడడం కలకలం సృష్టించింది. భర్త ఎస్ఐ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కుమారుడితో పాటు పోలీసు స్టేషన్లో మూడు రంగుల జెండాను ఎగరవేశారు. రెండు రోజుల క్రితం తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని వచ్చారు. గత శుక్రవారం ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ కూడా చేయించుకుని సంతోషంగా గడుపుతున్న సమయంలో ఆమె ఉన్నఫళంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్ఐ భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియగానే జిల్లా ఎస్పీ శోభారాణి, ఏఎస్పీ రవికుమార్ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. మోకా పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు సంతానం ఉన్నారు. గత రెండేళ్లుగా ఇదే పోలీసు స్టేషన్లో కాళింగ విధులు నిర్వహిస్తున్నారు. మృతురాలు మానసిక వ్యాధితో బాధపడుతుండేవారని సమాచారం. -
ఉదయమే ఉలికిపాటు
బనశంకరి: ఉదయమే నిద్రలేచిన నగరవాసులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా భారీ శబ్ధంతో కూడిన పేలుడు ఉలికిపాటుకు గురి చేసింది. కిలోమీటర్ల మేర వినిపించిన శబ్దానికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనుమానాస్పద స్థితిలో పేలుడు చోటు చేసుకొని బాలుడు మృతి చెందగా, 12 మంది గాయపడిన ఘటన బెంగళూరు నగరంలోని ఆడుగోడి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. విల్సన్గార్డెన్ ఆడుగోడి చిన్నయ్యనపాళ్య, శ్రీరామ కాలనీలో నివాసం ఉంటున్న కస్తూరమ్మ అనే మహిళ ఇంట్లో పేలుడు సంభవించింది. పక్కింటిలో ఉంటున్న ముబారక్(8) అనే బాలుడు మృతి చెందగా కస్తూరమ్మ, సరసమ్మ, సబ్రీనా బాను, సుబ్రమణి, షేక్నజీబ్ ఉల్లా, 8 ఏళ్ల బాలిక ఫాతిమాతో పాటు 12 మంది గాయపడ్డారు. కస్తూరమ్మ కుమార్తె ఖయాల్కు కాలిన గాయాలు కావడంతో వీక్టోరియా ఆస్పత్రికి, మిగిలినవారిని సంజయ్ గాంధీ, జయనగర ఆసుపత్రులకు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటిలో ఇంటిపైకప్పు సమేతంగా ధ్వంసం కాగా మొదటి అంతస్తు పూర్తిగా దెబ్బతింది. 8 ఇళ్లకు పైగా దెబ్బతిన్నాయి. ఆడుగోడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు.బెంగళూరు నగరంలో విస్ఫోటం ఆడుగోడి చిన్నయ్యనపాళ్య పరిధిలోని శ్రీరామ కాలనీలో ఘటన బాలుడు మృతి, 12 మందికి గాయాలు మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి సిద్దరామయ్యపేలుడు ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం సిద్దరామయ్య శ్రీరామ కాలనీలో పేలుడు సంభవించిన ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య, నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్సింగ్ పరిశీలించారు. ఉదయం 7.30 గంటలకు పేలుడు సంభవించిందని, ఇది ఎలా జరిగిందనేది ఘటనాస్థలానికి సుకో టీమ్, ఎఫ్ఎస్ఎల్ బృందాలు చేరుకుని పరిశీలిస్తున్నాయని కమిషనర్ తెలిపారు. పేలుడు జరిగిన ఇంటిలో శకలాలు తొలగించి సాంకేతిక బృందం అందించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపడతామని కమిషనర్ తెలిపారు. సిలెండర్ పేలితే మంటలు వచ్చేవన్నారు. మంటలు రాకున్నా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని, కరెంట్ షాక్తో ఇలా జరిగిందా లేక మెట్రో పనులు ఇక్కడ చేపడుతుండటంతో ప్రమాదం సంభవించిందా? అని తెలియడంలేదని స్దానికులు అనుమానం వ్యక్తం చేశారు.పనులకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డ ప్రజలు శ్రీరామ కాలనీలో చాలా మంది ఉదయం లాల్బాగ్లో పనులకు వెళ్లారు. ఆ సమయంలో పేలుడు జరిగింది. లేని పక్షంలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు తెలిపారు. పేలుడుతో ఆ ప్రాంత నివాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఉదయం 8 గంటలకు భారీ పేలుడు జరిగిందని, పేలుడు జరిగిన ఇంటికి, తమ ఇంటికి నాలుగు అడుగుల దూరం అని, పరిస్థితి భయానకంగా ఉందని స్థానికులు తెలిపారు. -
దంచి కొట్టిన వానలు.. జలమయంగా వీధులు
హొసపేటే: నగరంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారుల్లో వర్షం నీరు ఏరులా ప్రవహించింది. గత నాలుగైదు రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. సాయంత్రం పాఠశాలల నుంచి విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయంలో వర్షాలు సాయంత్రం 3 గంటల నుంచి ఏకధాటిగా సుమారు ఆరు గంటల పాటు భారీ వర్షం కురియడంతో నగరంలోని ప్రధాన మోర్ రోడ్డు, పవర్ ప్లాజా వద్ద ఉన్న రహదారిలో వర్షం నీరు భారీగా చేరడంతో వాహన సంచారానికి తీవ్ర ఇబ్బంది కలిగింది. ఈ రోడ్లలో మోకాలి లోతున వర్షం నీరు ప్రవహించడంతో కొద్ది సేపటి వరకు వాహనాలు నిలిచి పోయాయి. ఇందిరా నగర్ కాలనీలో వర్షం నీటితో వీధులు జలమయంగా మారడంతో పాటు ఇళ్లలోకి వర్షం నీరు ప్రవహించింది. దీంతో కాలనీ ప్రజలు వర్షం నీటిలోనే గడప వలసి వచ్చింది. జిల్లా క్రీడా మైదానం రహదారిలో కూడా వర్షం నీటితో నిండిపోయింది. నగరంలో చిత్తవాడిగి, నెహ్రు కాలనీ, బసవేశ్వర బడావణె, మృత్యుంజయ నగర్, చప్పరదహళ్లి, అమరావతి, రాజీవ్నగర్, ఎంపీ ప్రకాష్ నగర్, రాణి పేట్, పటేల్ నగర తదితర చోట్ల వర్షం నీరు నిలిచింది. కుండపోత వర్షాలు రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శుక్రవారం కూడా జోరు వాన కురిసింది. పలు జిల్లాల్లో ఎక్కడ చూసినా వంతెనలు నీట మునిగాయి. రాత్రంతా కురిసిన వానతో అక్కడక్కడ వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కలబుర్గి జిల్లా సేడం తాలూకాలో రాత్రి భారీ వర్షం కురవడంతో కాగిణ నదిలో వరద ముంచెత్తింది. వంతెన నీట మునగడంతో వాహన రాకపోకలు పూర్తి స్థాయిలో స్తంభించాయి. రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా మస్కి వద్ద ఉన్న జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో హిరేహళ్లలో నీరు అధికంగా ప్రవహించింది. రైతు హన్మంతప్ప ఎద్దులబండి నీటిలో చిక్కుకుంది. హన్మంతప్పను ప్రజలు రక్షించారు. ఒక ఎద్దు ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకోగా మరో ఎద్దుతో పాటు బండి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. పాదచారులకు నరకయాతన వాహన రాకపోకలకు పాట్లు -
ధర్మస్థళ తవ్వకాలపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారిన సామూహిక ఖననం కేసుపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించారు. ధర్మస్థళ పుణ్యక్షేత్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, త్వరలోనే నిజం నిలకడ మీద తెలుస్తుందని అన్నారాయన.ధర్మస్థళలో రెండు దశాబ్దాల కిందట.. హత్యలు, అత్యాచారాలు జరిగాయని, వందల సంఖ్యలో మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారని ఓ వ్యక్తి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్షేత్రంలో మాజీ పారిశుద్ధ్య కార్మికుడిగా చెబుతున్న ఆ 61 ఏళ్ల వ్యక్తి ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయించి అతను చూపించిన చోటల్లా తవ్వకాలు జరిపిస్తోంది. అయితే.. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు, ఆరోపణలకు దిగడంతో.. డిప్యూటీ సీఎం శివకుమార్ స్పందించారు. సిట్ దర్యాప్తుపై తనకు నమ్మకం ఉందని, త్వరలోనే ధర్మస్థళపై జరుగుతున్న కుట్ర బయటకు వస్తుందని, ఆ ఆరోపణలు రుజువుకాని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తనతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని శివకుమార్ వెల్లడించారు. అయితే.. ‘‘నేను ఇప్పటికీ ధర్మస్థళ మంజునాథస్వామి భక్తుడినే. ధర్మస్థల వీరేంద్రహెగ్డే చేసిన సేవలను గౌరవిస్తాం. భక్తునికి– దేవునికి ఉన్న సంబంధానికి మనం భంగం కలిగించరాదు. అలాగని నేనేం ధర్మస్థళకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో మాట్లాడడం లేదు. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఒకవేళ ధర్మస్థళపై నిజంగా కుట్ర జరిగి ఉంటే విచారణలో బయటపడుతుంది. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించకతప్పదు. ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో.. ఈ అంశంపై హోం మంత్రి పరమేశ్వర సోమవారం కర్ణాటక అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేస్తారు’’ అని శివకుమార్ వెల్లడించారు. గురువారం ధర్మస్థళ తవ్వకాలపై అసెంబ్లీలో హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడారు. ‘‘ఫిర్యాదు ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఆ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు జూన్ 19 సిట్ ను ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించాం. ఇది పూర్తి కావడానికి కాలపరిమితి ఉంటుంది. ఈలోపు సిట్ దర్యాప్తునకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని భావిస్తున్నాం’’ అని అన్నారాయన. 1995-2014 మధ్య తాను పని చేస్తున్న సమయంలో ధర్మస్థళ ఆలయ నిర్వాహకుల ఆదేశాల మేరకు తానే స్వయంగా ఆ మృతదేహాలను పాతిపెట్టినట్లు సదరు వ్యక్తి చెబుతున్నాడు. అందులో మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలు అధికంగా ఉన్నాయని, కొందరిపై లైంగిక దాడి జరిగినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయని మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ముసుగు ధరించిన ఆ వేగు(Whistleblower)ను.. ‘భీమా’.. ‘చిన్నయ్య’.. అని కర్ణాటక మీడియా వ్యవహరిస్తోంది. విక్టిమ్ ప్రొటెక్షన్ కింద సిట్ అతనికి రక్షణ కల్పిస్తోంది కూడా. ఇప్పటిదాకా నేత్రావతి నదీ తీరం వెంబడి అతను చూపించిన చోట్లలో సిట్ తవ్వకాలు జరిపింది. అందులో రెండు చోట్ల మాత్రమే అస్తిపంజరాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు ఆ వ్యక్తి. ఇదీ చదవండి: ఆలయ నిర్వాహకులే పూడ్చాలని.. సిట్ నన్ను నమ్మడం లేదుఇదిలా ఉంటే.. తీవ్ర చర్చకు దారితీసిన ధర్మస్థలలో మృతదేహాల కోసం తవ్వకాల కేసులో గురువారం విధానసభ దద్దరిల్లింది. ధర్మస్థల మీద అసత్య ప్రచారం చేస్తున్న ప్రభుత్వం కూకటి వేళ్లతో కూలిపోతుందని బీజేపీ, జేడీఎస్ నాయకులు శాపాలు పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే సునీల్కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి 10, 15 ఏళ్ల క్రితం ధర్మస్థల లో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పడం ద్వారా పవిత్ర ధర్మక్షేత్రానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా కుట్ర జరుగుతోంది. అస్థికల కోసం తవ్వకాలంటూ హిందూ ధార్మిక కేంద్రాలపై జరుగుతున్న అసత్య ప్రచారం సహించడం సాధ్యం కాదు. ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రజలు ఆవేశం చెంది పోరాటం చేసే స్థితి తీసుకురాకూడదు.. .. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది దర్యాప్తా, హిందూ పుణ్యక్షేత్రంపై జరుగుతున్న కుట్రలో అసత్య ప్రచారంలో కాంగ్రెస్ యూట్యూబర్లు, ఇతర మతస్తుల చేతిలో కీలుబొమ్మగా మారుతోందా?’’ అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో సిట్ దర్యాప్తు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అలాగని ధర్మస్థళను టార్గెట్ చేయడం సరికాదన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మాటలు విని గుంతలు తవ్వే పనిచేస్తున్నారని, ధర్మస్థల పవిత్రతను కాపాడటానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్ని రోజులు ఎన్ని గుంతలు తవ్వారు, ఎన్ని అస్థిపంజరాలు దొరికాయి అనేది చెప్పాలని సునీల్కుమార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. -
దొంగ ఓట్లదారులూ.. దిగిపోండి
సాక్షి,బళ్లారి: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ సర్కార్ దొంగ ఓట్లతో అఽధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. నగరంలోని రాయల్ సర్కిల్ సమీపంలోని గాంధీ భవన్లో మహాత్మాగాంధీజీ ప్రతిమకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత మహాత్మా మీరైనా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అంటూ కొవ్వొత్తులతో ర్యాలీ, నిరసన ప్రకటించారు. తర్వాత అక్కడ నుంచి రాయల్ సర్కిల్ వరకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీ చేశారు. ఓట్ల దొంగతనం చేసిన నేతలు తక్షణం తమ అధికారాన్ని వదులుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. నిష్పక్ష పాతంగా ఎన్నికలు జరిపించాలని కేపీసీసీ మీడియా ప్రతినిధి వెంకటేశ్ హెగ్డే డిమాండ్ చేశారు. సమగ్ర తనిఖీ చేసి దొంగ ఓట్లదారులకు తగిన శిక్ష వేయాలన్నారు. నేడు పెద్ద ఎత్తున నిరసన దేశంలో కేంద్రంలో దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని కాపాడాలని, ప్రజాప్రభుత్వానికి గొడ్డలిపెట్టుగా మారిన దొంగ ఓట్లపై తనిఖీ చేయాలనే ఉద్దేశ్యంతో నగరంలోని గవియప్ప సర్కిల్ నుంచి 150 మీటర్ల పొడవైన జాతీయ జెండాను పట్టుకుని నగరంలో ర్యాలీ చేపడతామని, ప్రజాస్వామ్యవాదులందరూ ఏకం కావాలని సూచించారు. ఈ కార్యక్రమానికి మంత్రి రహీంఖాన్తో పాటు డీసీసీ నాయకులు, కార్యకర్తలు, నగర వాసులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు హుమయూన్ఖాన్, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజ్, గ్యారెంటీ సమితి జిల్లాధ్యక్షుడు చిదానందప్ప, డీసీసీ కార్యాధ్యక్షుడు బోయపాటి విష్ణువర్ధన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో వరుసగా మూడు సార్లు బీజేపీకి అధికారం ఓట్ల చౌర్యంతోనే మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్డీఏ సర్కార్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనాగ్రహం -
యువకుడు దుర్మరణం
గుమ్మఘట్ట: రాయదుర్గం పరిధిలోని గుమ్మఘట్ట మండలంలోని గలగల గ్రామానికి చెందిన హర్షద్ (17) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వివరాల మేరకు.. గ్రామానికి చెందిన హుస్సేన్, షాహినా దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు హర్షద్ ఉన్నారు. కర్ణాటకలోని బట్రళ్లి గ్రామంలో తన మేనమామ దగ్గర టైల్స్ పని నేర్చుకునేందుకు హర్షద్ వెళ్లేవాడు. బుధవారం రాత్రి పని ముగించుకుని స్వగ్రామానికి బైక్లో వస్తూ ఉండగా కోనసాగర వద్ద ఏదో వాహనం ఢీకొని వెళ్లిపోయింది. హర్షద్ తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియచేసి సమీపంలోని రాంపుర ఆసుపత్రికి తరలించారు. ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బళ్లారి విమ్స్కు తరలించగా అక్కడ మరణించాడు. ఒక్కగానొక్క కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. చర్చి పాస్టర్గా బాధ్యతల స్వీకరణ హుబ్లీ: నవనగర్లోని ఈసీఐ చర్చి కొత్త పాస్టర్గా కొప్పళ ఈసీఐ చర్చిలో చాన్నాళ్లుగా పని చేస్తున్న రాయచూరు వాస్తవ్యులు, తెలుగు ప్రముఖులు రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొప్పళలో దైవ సేవలతో పాటు నిర్భాగ్యులు, నిరాశ్రయులకు బైబిల్ బోధనలు అనుసారంగా పరిచర్యలు చేశానన్నారు. హుబ్లీ నవనగర్లో కూడా నిర్భాగ్యులు, నిరాశ్రయుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు, పరిచర్యలు నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా సమాజంలో పెరిగిపోయిన అసంతృప్తి, యువత చెడుమార్గం పట్టడం పెరిగిపోతున్నాయని, బైబిల్ వ్యాఖ్యల అనుసారంగా అందరినీ శాంతి, సమాధాన బాటలో నడపడానికి కృషి చేస్తానని రవికుమార్ తెలిపారు. వ్యవసాయ పనిముట్ల సంఘానికి ఎన్నికసాక్షి,బళ్లారి: కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ పనిముట్ల డీలర్ల సంఘం రాష్ట్ర కోశాధికారిగా బళ్లారికి చెందిన తిమ్మనగౌడ ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం సంఘం కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లోకికెరె నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు బసవనగౌడ మాలిపాటిల్, ప్రధాన కార్యదర్శి మహంతేష్ తదితర ఆఫీస్ బేరర్లు సమావేశం నిర్వహించి బళ్లారికి చెందిన తిమ్మనగౌడను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని రైతుల సమస్యల పరిష్కారానికి తన పరిధిలో ఉన్న అధికారులను ఉపయోగించుకుని రైతులకు మేలు చేస్తానని హామీ ఇచ్చారు. మౌలిక సౌకర్యాలు కల్పించండిరాయచూరు రూరల్: జిల్లాలోని అంగన్వాడీల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాలూకా, గ్రామ స్థాయిల్లో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాల కొరత అధికంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాల నియంత్రణకు అధికారులు కృషి చేయాలన్నారు. 14–18 ఏళ్ల లోపు యువతులకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పౌష్టికాహారం, పోషణ్ ట్రాక్, పోషణ్ అభియాన్ వంటి అంశాలపై పర్యవేక్షణ చేయాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి నవీన్ కుమార్, టీపీ ఈఓ చంద్ర శేఖర్ పవార్, నందిత, బడిగేర, గిరిజా, భాగ్యవతి, పార్వతిలున్నారు. 17న మా మసీదును సందర్శించండిబళ్లారి అర్బన్: నగరంలోని కౌల్బజార్ జాగృతి నగర్లో వెలసిన మసీదులో ఈనెల 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అన్ని మతాల వారికి సందర్శన ఏర్పాటు చేశామని, ఈనేపథ్యంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ చైర్మన్ సౌహిద్బాషా తెలిపారు. ఆయన గురువారం పత్రికా భవన్లో విలేకరులతో మాట్లాడారు. మానవ స్ఫూర్తిని నిలబెట్టేలా సందర్శన, పరస్పర ప్రేమ, సోదర సందేశాన్ని వ్యాప్తింపజేసే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.పురుషులకు, మహిళలకు కూడా సందర్శన ఉంటుందన్నారు. సమాజంలో శాంతి, సౌహార్ధతను కాపాడేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మసీదులో జరిగే ఈ కార్యక్రమానికి సామరస్య ఐక్యత సృష్టించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వచ్ఛందంగా పాల్గొని మతసామరస్యాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో నిసార్ అహమ్మద్, మునీర్ అహమ్మద్, ఇలియాస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
డిమాండ్లు పరిష్కరించరూ
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10 వేల చొప్పున వేతనం చెల్లించాలని ఆశా కార్యకర్తల సంఘం జిల్లాధ్యక్షుడు అయ్యాళప్ప డిమాండ్ చేశారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద మానవహారంగా ఆందోళన చేపట్టి మాట్లాడారు. వేతనం, అదనపు ఇన్సెంటివ్ భత్యాలు చెల్లిస్తామని చెప్పి 8 నెలలు గడుస్తున్నా నేటికీ సర్కార్ స్పందించక పోవడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.వెయ్యి పెంచి ఆశా కార్యకర్తలకు పెంచక పోవడాన్ని తప్పుబట్టారు. కేంద్రం ఇచ్చే ఇన్సెంటివ్ భత్యాలు, రాష్ట్ర ప్రభుత్వం అందించే వేతనం, పదవీ విరమణ చేసిన వారికి రూ.50 వేలు పింఛను చెల్లించాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. -
ఖాదీ పతాకాలకు ఆదరణ ఏదీ?
హుబ్లీ: ఆగస్టు నెల వచ్చిందంటే చాలు హుబ్లీలోని దేశంలో ఏకై క బీఐఎస్ ప్రామాణీకృత ఖాదీ త్రివర్ణ పతాకాల ఉత్పత్తి కేంద్రంలో రాత్రింబగళ్లు జాతీయ జెండాలను కుట్టే పనిలో మహిళా ఉద్యోగినులు మునిగి పోయే వారు. అయితే ఈ ఏడాది ఆ కళ సందడి కనిపించడం లేదు. కార్మికుల సంఖ్య కూడా తగ్గిపోయింది. జాతీయ పతాకాలను తయారు చేసే హుబ్లీలోని బెంగేరి కర్ణాటక గ్రామోద్యోగ సంయుక్త ఈ ఏడాది తన లాభాల్లో 75 శాతం తగ్గిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతోంది. స్వాతంత్య్ర దినోత్సవం ముందు రోజు సంఘం సుమారు రూ.2.7 కోట్లను గడించేది. అయితే కేవలం రెండు, మూడు రోజులు మిగిలి ఉండగా రూ.49 లక్షలు విలువ చేసే ఆర్డర్లను పొందడం గమనార్హం. 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా పాలిస్టర్ పతాకాలను ఎగరవేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటి నుంచి సంఘం నష్టాలను అనుభవిస్తోంది. పాలిస్టర్ కంపెనీలకు లాభాలు గత రెండేళ్ల నుంచి మార్కెట్లలో గుజరాత్ పాలిస్టర్ కంపెనీలు భారీగా లాభాలను ఆర్జిస్తున్నాయి. కేంద్రం జాతీయ పతాక నియమావళిని సవరించడంతో వివిధ ప్రభుత్వ కట్టడాలు, సంస్థలు కూడా పాలిస్టర్ పతాకాలను ఎగరవేస్తున్నాయి. ఎక్కువ ఖరీదు చేసే ఖాదీ పతాకాలు సహజంగానే విక్రయాలకు దూరం అయ్యాయి. ఖాతీ పతాకాలు సుదీర్ఘకాలం మన్నిక కలిగి ఉన్నా కూడా వాటి డిమాండ్ కోల్పోతుంది. కేంద్రం జాతీయ పతాక నియమాలను మార్చడమే మన హుబ్లీ సుప్రసిద్ధ జాతీయ పతాక యూనిట్లోని యంత్రాలు కళావిహీనం అవుతున్నాయి. సంఘం ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం ఆర్డీపీఆర్ మంత్రి ప్రియాంక్ ఖర్గేకు లేఖ రాసి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల్లో ప్రభుత్వ సంస్థలు ఖాదీ త్రివర్ణ పతాకాలను ఎగరవేసేలా సూచించాలని సంఘం విజ్ఞప్తి చేసిందని హుబ్లీ ఖాదీ సమాఖ్య కార్యదర్శి శివానంద మఠపతి తెలిపారు. ఉద్యోగాల కల్పనకు బ్రేక్ నియమావళిలో మార్పులతో తయారీ కేంద్రంపై ఆధారపడిన కార్యకర్తలపై తీవ్రమైన ప్రభావం చూపిందన్నారు. తమకు తక్కువ ఆర్డర్ ఉన్నందు వల్ల ఈ సారి పలువురికి ఉద్యోగాలు ఇవ్వడానికి సాధ్యం కాలేదు. బెంగేరి జాతీయ పతాక తయారీ కేంద్రంలో మహిళా కార్మికులను మాత్రమే నియమించుకొని ఈ సీజన్లో పలువురికి పని లేదని చెప్పడం ఆవేదన కలిగించే విషయం. ఇలాగే కొనసాగితే సమాఖ్య, ఖాదీని ఆదరించే ప్రయత్నాలకు వెనుకబాటు తప్పదని చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశం ఉన్నా కూడా అనేక ప్రభుత్వ సంస్థలు ఇంకా జాతీయ పండుగలకు ఖాదీ పతాకాలను సిద్ధం చేసుకోలేదు. ఖాదీ పతాకాలను తప్పని సరిగా వాడాలని ప్రభుత్వ సంస్థలకు జీఓ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా ఈ యూనిట్లో జాతీయ పతాకాలతో పాటు ప్రస్తుతం సంచులు ఇతర రెడీమేడ్ దుస్తులు, రగ్గులు వంటి ఖాదీ వస్తువుల తయారీతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. తయారీ కేంద్రానికి 75 శాతం మేర పతనమైన లాభాలు హుబ్లీలోని జాతీయ జెండాల తయారీ యూనిట్ వెలవెల -
హర్ ఘర్ తిరంగా ర్యాలీకి శ్రీకారం
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా జాలహళ్లిలో హర్ ఘర్ తిరంగాకు దేవదుర్గ తాలూకా బీజేపీ అధ్యక్షుడు శరణ బసవ పాటిల్ శ్రీకారం చుట్టారు. గురువారం పార్టీ కార్యాలయం నుంచి బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ప్రజలకు తిరంగా ప్రాముఖ్యత గురించి వివరించారు. హుబ్లీ–రామేశ్వరం రైలు గడువు పొడిగింపు హుబ్లీ: దక్షిణ రైల్వేలోని కార్యాచరణ నిర్బంధాల వల్ల హుబ్లీ–రామేశ్వరం–హుబ్లీ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలు సంచారం గడువు విస్తరించడానికి రైల్వే మండలి అనుమతి ఇచ్చిందని నైరుతి రైల్వే పేర్కొంది. అయితే ఈ రైలు రామేశ్వరానికి బదులు రామనాథపురం వరకు మాత్రమే సంచరిస్తుంది. గతంలో ఈనెల 30 వరకు సంచారానికి సూచించినా ఈ రైలును ప్రస్తుతం సెప్టెంబర్ 27 వరకు నాలుగు ట్రిప్పుల మేరకు పొడిగించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత కల్పించండిరాయచూరు రూరల్: నగరంలో స్వచ్ఛతకు ప్రాధాన్యత కల్పించాలని నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో పేర్కొన్నారు. గురువారం నగరసభ కార్యాలయంలో అధ్యక్షురాలు నరసమ్మ అధ్యక్షతన జరిగిన స్వసహాయ మహిళా సంఘాలకు ఏర్పాటు చేసిన సమావేశంలో స్వచ్ఛ భారత్–2 పథకం కింద స్వచ్ఛత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. సహకార సంఘాల ద్వారా ఎంపికై న మహిళలకు గుర్తింపు కార్డులను అందించారు. నగరసభ పరిధిలో బకాయి ఉన్న ఇంటి పన్ను, నీటి పన్ను వసూళ్లలో ముందుండాలన్నారు. స్వచ్ఛతకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ముందుకు రావాలన్నారు. సమావేశంలో సంతోష్ రాణి, జైపాల్, కృష్ణ కట్టిమనిలున్నారు. వైద్య పరీక్ష శిబిరం రాయచూరు రూరల్: నగరంలోని నిజలింగప్ప కాలనీ ఉద్యానవనంలో లయన్స్ క్లబ్ అధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పరిటాల రాము నేతృత్వంలో 80 మంది సీనియర్ సిటిజన్లకు ఉచితంగా వైద్య సేవలందించారు. వైద్యుడు నాగభూషణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో గోవిందరాజులు, గురురాజ్లున్నారు. ఠాణాలో రౌడీ హల్చల్ మైసూరు: తనపై బనాయించిన రౌడీషీట్ను తొలగించాలని మైసూరు నగరంలోని విజయనగర ఠాణాలోనే ఒంటిపై డీజిల్ పోసుకుని రౌడీషీటర్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన జరిగింది. మైసూరు బోగాది నివాసి ఎస్.స్వామిపై పలు కేసులు ఉండడంతో విజయనగర పోలీసు స్టేషన్లో రౌడీషీట్ను తెరిచారు. రానున్న గణేష్ పండుగ, దసరా పండుగల నేపథ్యంలో రౌడీషీటర్ల నుంచి హామీ పత్రాలు రాయించుకోవాల్సిన నిబంధనలు ఉన్న నేపథ్యంలో పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. దీంతో ఆగ్రహించిన స్వామి డీజిల్ తీసుకుని ఠాణాకు వచ్చాడు, తనపై ఉన్న రౌడీషీట్ను తీసేయాలని హంగామా చేస్తూ పోలీసుల ఎదుటే ఒంటిపై పోసుకున్నాడు. పోలీసులు అతనిని అడ్డుకున్నారు. ఇలా ప్రవర్తించి పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించాడని స్వామిపై మరో కేసును నమోదు చేశారు. -
పరిశ్రమల స్థాపనతో పురోగతి
హొసపేటె: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రాసెసింగ్ పరిశ్రమలు ప్రారంభిస్తే పురోగతి సాధ్యమని జిల్లాధికారి ఎంఎస్.దివాకర్ అభిప్రాయపడ్డారు. నగరంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రధానమంత్రి చిన్న ఆహార ప్రాసెసింగ్ సంస్థల నియంత్రణ పథకంపై జిల్లా స్థాయి సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. రైతుల తక్కువ భూమిలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. పండించిన పంటను సంరక్షించడంలో ప్రాసెసింగ్ ఒక సవాలుగా మారింది. ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద చిన్న ఆహార ప్రాసెసింగ్ సంస్థల అభివృద్ధికి రైతులకు అవకాశాలు కల్పించారన్నారు. ఈ పథకం కింద 50 శాతం లేదా గరిష్టంగా రూ.15 లక్షల సబ్సిడీ పొందే అవకాశం ఉందన్నారు. రైతులు పండించిన పంటలను ప్రాసెస్ చేయడానికి, వారి స్వంత బ్రాండ్ ద్వారా మార్కెట్కు చేరుకోవడానికి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. రైతులు పండించే పంటలకు మంచి బ్రాండింగ్, మార్కెట్ అందించడంలో ప్రాసెసింగ్ ముఖ్యమైందని అన్నారు. జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహ్మద్ అక్రమ్ అలీషా, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ డీటీ మంజునాథ్, కేపీఈసీ అసిస్టెంట్ అగ్రికల్చర్ డైరెక్టర్ చంద్రకుమార్, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నయీం పాషా, లీడ్ బ్యాంక్ మేనేజర్ కే.వీరేంద్రకుమార్, నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి విజయకుమార్, అసిస్టెంట్ అగ్రికల్చర్ డైరెక్టర్ మనోహర్గౌడ, హగరి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డైరెక్టర్ శిల్పా తదితరులు పాల్గొన్నారు. -
నిరంతర వర్షాలు.. తప్పని తిప్పలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో మూడు గంటల పాటు నిరంతర వర్షాలు కురిశాయి. గురువారం జడి వాన కురిసింది. జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు బురదమయంగా మారాయి. కురిసిన వానలకు రంగ మందిరం వెనుక, జహీరాబాద్ కాలనీలో పెద్ద చెట్లు కూలిపోవడంతో విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూరగాయల మార్కెట్ బురదమయం కావడంతో పాటు నీరు చేరడంతో కాయగూరలు తడిసి పోయాయి. విద్యా భారతి రైల్వే వంతెన కింద వాన నీరు నిలబడడంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. విజయపురలో రాత్రి భారీ వర్షం కురువడంతో దేవర హిప్పరిగి తాలూకా యళవాడ వద్ద వాగు వంతెనపై భారీగా నీరు ప్రవహించగా టెంపో వ్యాను కూడా వరద నీటిలో వాగును దాటడం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. బురదమయంగా రోడ్లు చెట్లు కూలి విద్యుత్ కోత -
గడువులోగా పనులు పూర్తి చేయండి
సాక్షి, బళ్లారి: నిర్ణీత గడువులో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి రహీంఖాన్ పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో అధికారుల సమక్షంలో ప్రగతి పరిశీలన సమావేశం నిర్వహించారు. నగరంలో వివిధ అభివృద్ధి పనుల కోసం నాలుగో దశలో రూ.65 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ఇందులో రూ.31 కోట్లు ఖర్చు కాగా మిగిలిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసి నగరాభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు. కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు అధికారులు సమావేశం నిర్వహించుకొని వారికి దిశానిర్ధేశం చేయాలన్నారు. నగరంలో మంజూరైన 104 అభివృద్ధి పనుల్లో 48 ప్రగతిలో ఉన్నాయని, మిగిలిన పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. టెండర్ ప్రక్రియ చూసుకొని సంబంధిత కాంట్రాక్టర్లతో చర్చించాలన్నారు. కాంట్రాక్టర్లను కార్యాలయం చుట్టూ తిప్పుకోకూడదన్నారు. జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ మహానగర పాలికె పరిధిలో అభివృద్ధి పనులతో పాటు మంచినీటి పనులకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. -
మువ్వన్నెల గజరాజులు
● మైసూరులో స్వచ్ఛత, త్రివర్ణ ర్యాలీ మైసూరు: 79వ స్వాతంత్య్ర దినోత్సవం, ఇంటింటా మువ్వన్నెల జెండా యాత్ర సందర్భంగా గురువారం మైసూరులో మహానగర పాలికె, దసరా గజపడె ఆధ్వర్యంలో స్వచ్ఛతపై జాగృతి జాతా నిర్వహించారు. ఏనుగుల మీద త్రివర్ణ పతాకాలను పట్టుకుని సాగుతూ ఉంటే నగరవాసులు ఆశ్చర్యంగా వీక్షించారు. ప్యాలెస్ కోటె ఆంజనేయ స్వామి గుడి నుంచి బయల్దేరి కేఆర్ ఆస్పత్రి సర్కిల్ వరకు సాగి తిరిగి ప్యాలెస్కు చేరుకున్నాయి. గజపడెతో పాటు పాలికె, అటవీ, పోలీసు సిబ్బంది, ప్రజలు త్రివర్ణ పతాకాలతో పాల్గొన్నారు. -
వారికి శిక్ష పడాల్సిందే
● రేణుకాస్వామి భార్య సహన బనశంకరి: ఎవరు తప్పు చేసినా వారికి శిక్ష పడాలని, చట్ట ప్రకారం జరగాలని హత్యకు గురైన రేణుకాస్వామి భార్య సహన డిమాండ్ చేశారు. నటుడు దర్శన్ తో పాటు 7 మందికి సుప్రీంకోర్టు బెయిల్ను రద్దు చేయడం గురించి చిత్రదుర్గలో తన ఇంట్లో సహన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. రేణుకాస్వామి చిన్నాన్న షడక్షరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్టు త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పు ఇచ్చింది, వారి బెయిలును రద్దు చేయడం హర్షణీయమన్నారు. న్యాయం దక్కింది: తల్లి తమ కుమారుని హత్య కేసులో న్యాయం లభించిందని, చట్టం పై నమ్మకం ఉందని రేణుకాస్వామి తల్లి రత్నమాల అన్నారు. గురువారం తీర్పు వస్తుందని తమకు తెలియదని, మంచి తీర్పు వచ్చిందని, కుమారుని ఆత్మకు శాంతి లభించాలని ఆమె చెప్పారు. ఇంటిదేవునికి అభి షేకం చేయడానికి వెళుతున్నామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుద్వారా నిందితులకు తగిన గుణపాఠం జరిగింది. రేణుకాస్వామి భార్య సహన పిన్న వయస్కురాలు, ఆమెకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని తల్లి డిమాండ్ చేశారు. -
దర్శన్, పవిత్ర మళ్లీ జైలుకు
తీర్పునకు ముందు పవిత్ర పోస్టు.. నిందితురాలు పవిత్రాగౌడ సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందే సత్యం అన్నింటికంటే శక్తిశాలి, న్యాయం అందిస్తుందని పవిత్రాగౌడ పోస్ట్పెట్టారు. ఈ ప్రపంచంలో అన్నింటి కంటే అధిక శక్తి సత్యానికి ఉంటుంది. ఎంత సమయం తీసుకున్నప్పటికీ న్యాయం ఎప్పుడూ తన దారి చూపుతుందని ప్రస్తావించారు. ఆమె తీర్పు అనుకూలంగా వస్తుందని ఊహించి ఈ పోస్టు పెట్టారని భావిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన బెయిలును రద్దు చేసిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పోరాట ఫలితం ఆగమేఘాలపై నిందితుల అరెస్టు, పరప్పనకు తరలింపు టాప్ హీరోని వీడని రేణుకాస్వామి హత్య కేసు బనశంకరి: క్రైం థ్రిల్లర్ సినిమాలను మించిన మలుపులు ప్రముఖ నటుడు దర్శన్ జీవితంలో జరుగుతున్నాయి. చిత్రదుర్గవాసి రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్ తూగుదీప, ఆయన ప్రియురాలు, నటి పవిత్రగౌడ, తదితర 15 మంది నిందితులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వారి బెయిలు రద్దు కావడంతో మళ్లీ చెరసాల దర్శనం ఎదురైంది. గురువారం ఏం జరిగింది? దర్శన్ టీంకి హైకోర్టు ఇచ్చిన బెయిలును సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నటుడు దర్శన్ ను బెంగళూరులో హొసకెరెహళ్లి వద్ద సతీమణి విజయలక్ష్మీ నివాసం ఉండే ప్రెస్టీజ్ సౌత్రిడ్జ్ అపార్టుమెంట్లో గురువారం సాయంత్రం 4 గంటలప్పుడు కామాక్షిపాళ్య, బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు మఫ్టీలో గాలిస్తూ అపార్టుమెంటు వద్దకు వచ్చారు. అపార్టుమెంట్ వద్ద ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోగా, గొడవలు జరగకుండా దర్శన్ను పోలీసులు తీసుకెళ్లారు. దర్శన్ను అన్నపూర్ణేశ్వరినగర పోలీస్స్టేషన్ కు తీసుకెళ్లారు. దర్శన్ తో పాటు 7 మందిని నిర్బంధించారు. దర్శన్ ఆప్తుడు ఏ 14 ప్రదోశ్, ఏ11 నాగరాజు, కారుడ్రైవరు ఏ12 లక్ష్మణ ఉన్నారు. ఏ1 నిందితురాలు పవిత్రాగౌడను ఆర్ఆర్ నగరలోని ఆమె ఇంటిలో అరెస్ట్ చేశారు. తరువాత సాయంత్రం వారిని జడ్జి నివాసంలో ప్రవేశపెట్టగా, ఆ మేరకు ఆదేశాలతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో పోలీసులు సుమారు 4 వేల పేజీలతో చార్జిషీటును ఇదివరకే సమర్పించారు. కొడగు టూర్లో ఉన్న దర్శన్ సుప్రీం తీర్పు వినగానే బెంగళూరుకు వచ్చేశాడని తెలిసింది. అందరూ సమానమే: రమ్యా పోస్ట్ బెయిల్ రద్దుకాగానే నటి రమ్యా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చట్టం ముందు అందరూ సమానం అనే స్పష్టమైన సందేశం వచ్చింది. మన పని మనం చేయాలి. చివరిలో ఆశ, వెలుగు ఉంటుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు, న్యాయం అందరికీ లభిస్తుంది అని రేణుకాస్వామి కుటుంబానికి మద్దతుగా పేర్కొన్నారు. రేణుకాస్వామి హత్య కేసు వివరాలు... 2024 జూన్ 8న చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి బెంగళూరులో పట్టణగెరెలోని ఓ షెడ్డులో హత్య 2024 జూన్ 11న హత్య ఆరోపణలపై దర్శన్, పవిత్రగౌడ, ఇతరులు అరెస్ట్ దర్శన్ స్నేహితురాలు పవిత్రా గౌడకు రేణుకాస్వామి అశ్లీల మెసేజ్లు పంపించడం వల్ల ఆమె ప్రోద్బలంతో దర్శన్, అనుచరులు హత్య చేసినట్లు ఆరోపణ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు నిందితుల తరలింపు ఆ జైల్లో దర్శన్ కు రాచమర్యాదలు కల్పించినట్లు ఆరోపణలు. అక్కడి నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు దర్శన్ తరలింపు వెన్నునొప్పి కారణంతో గతేడాది అక్టోబరు 30 నుంచి 6 వారాల పాటు మధ్యంతర బెయిల్ డిసెంబరులో దర్శన్ తో పాటు ఇతర నిందితులకు హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు ఈ తీర్పును ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది -
ధర్మస్థలలో మరిన్ని చోట్ల తవ్వకాలు
యశవంతపుర: ధర్మస్థలలో మృతదేహాలను పాతిపెట్టారనే కేసులో ఫిర్యాదుదారు (ముసుగు మనిషి) ఎస్ఐటీ అధికారులకు మరో జాగాను చూపించాడు. ధర్మస్థల కన్యాడి సమీపంలో కొత్త ప్రదేశాన్ని చూపడంతో అక్కడ గురువారం తవ్వకం చేపట్టారు. నేత్రావతి నది పక్కలోని ప్రైవేట్ వ్యక్తుల వక్క తోటలో ఈ ప్రదేశముంది. మరో పక్క అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పాతి పెట్టినట్లు ముసుగుమనిషి చెప్పగా, అక్కడా గాలింపు జరుగుతోంది. పుత్తూరు సబ్ కలెక్టర్ సైల్లా వర్గీస్, సిట్ ఎస్పీ జితేంద్ర కుమార్ దయామ నేతృత్వంలో తవ్వకాలు నిర్వహించినా సాయంత్రం వరకు ఏమీ దొరకలేదు. కీచక అధ్యాపకుడు ● 17 ఏళ్ల విద్యార్థినితో పరారీ దొడ్డబళ్లాపురం: విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ అధ్యాపకుడు కీచకునిగా మారాడు. విద్యార్థినిని ప్రేమపేరుతో మభ్యపెట్టి కిడ్నాప్ చేసి తీసికెళ్లిన అతన్ని దొడ్డ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని కొంగాడియప్ప కళాశాలలో కన్నడ లెక్చరర్గా గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రవీణ్ (45) నిందితుడు. ప్రవీణ్కి 10 ఏళ్ల క్రితం పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో భార్య పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరోవైపు కాలేజీలోనే చదివే విద్యార్థినితో (17) ప్రేమాయణం సాగించిన ప్రవీణ్ ఆమెను 2వ తేదీన తీసికెళ్లిపోయాడు. ఢిల్లీలో కొన్ని రోజులు ఉండి తరువాత నంజనగూడుకు వచ్చారు. విద్యార్థిని తల్లిదండ్రులు, ప్రవీణ్ భార్య ఫిర్యాదుల మేరకు పోలీసులు గాలించి ప్రవీణ్ని అరెస్టు చేశారు. పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. -
పుణ్యక్షేత్రాలకు మసి పూయొద్దు
బనశంకరి: రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసిన ధర్మస్థలలో మృతదేహాల కోసం తవ్వకాల కేసులో గురువారం విధానసభ దద్దరిల్లింది. ధర్మస్థల మీద అసత్య ప్రచారం చేస్తున్న ప్రభుత్వం కూకటి వేళ్లతో కూలిపోతుందని బీజేపీ, జేడీఎస్ నాయకులు శాపాలు పెట్టారు. 69వ నిబంధన కింద చర్చ సాగింది. బీజేపీ ఎమ్మెల్యే సునీల్కుమార్ మాట్లాడుతూ ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి 10, 15 ఏళ్ల క్రితం ధర్మస్థల లో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పడం ద్వారా పవిత్ర ధర్మక్షేత్రానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అస్థికల కోసం తవ్వకాలంటూ హిందూ ధార్మిక కేంద్రాలపై జరుగుతున్న అసత్య ప్రచారం సహించడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్త వహించాలని, ప్రజలు ఆవేశం చెంది పోరాటం చేసే స్థితి తీసుకురాకూడదన్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది దర్యాప్తా, హిందూ పుణ్యక్షేత్రంపై జరుగుతున్న కుట్రలో అసత్య ప్రచారంలో కాంగ్రెస్ యూట్యూబర్లు, ఇతర మతస్తుల చేతిలో కీలుబొమ్మగా మారుతోందా అని ధ్వజమెత్తారు. సిట్ దర్యాప్తు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ధర్మస్థలను టార్గెట్ చేయడం సరికాదన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మాటలు విని గుంతలు తవ్వే పనిచేస్తున్నారని, ధర్మస్థల పవిత్రతను కాపాడటానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్ని రోజులు ఎన్ని గుంతలు తవ్వారు, ఎన్ని అస్థిపంజరాలు దొరికాయి అనేది చెప్పాలని సునీల్కుమార్ డిమాండ్ చేశారు. 15–16 గుంతలు తవ్వినప్పటికీ ఏమీ లభించలేదని తెలిసింది. ప్రభుత్వం దీనికి ముగింపు పలకాలని కోరారు. మరికొందరు ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వాన్ని తప్పుపడుతూ మాట్లాడారు. మంజునాథుని భక్తున్ని: డీసీఎం నేను ఇప్పటికీ ధర్మస్థల మంజునాథస్వామి భక్తున్ని, భక్తునికి– దేవునికి ఉన్న సంబంధానికి మనం భంగం కలిగించరాదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ధర్మస్థల వీరేంద్రహెగ్డే చేసిన సేవలను గౌరవిస్తామని చెప్పారు. దర్యాప్తు జరుగుతోంది: హోంమంత్రి హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ అందిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఆ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు జూన్ 19 సిట్ ను ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించామని తెలిపారు. ఇది పూర్తి కావడానికి కాలపరిమితి ఉంటుందని, సిట్ కు సభలో ఇబ్బందికలిగేలా చర్చ జరపవద్దని సూచించారు. ధర్మస్థలలో తవ్వకాలంటూ అసత్య ప్రచారం మీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది విధానసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల ధ్వజం -
బస్టాండులో నగల చోరీ
మైసూరు: బస్సు ఎక్కేటప్పుడు ఓ మహిళ వ్యానిటీ బ్యాగ్లోని రూ.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను దొంగలు దోచేశారు. ఈ ఘటన మైసూరు సిటీలోని గ్రామీణ బస్టాండ్లో జరిగింది. నగరంలోని అగ్రహార నివాసి ఎస్జీ వీణా 7న సాయంత్రం సాలిగ్రామలోని తమ పుట్టినింటికని బయల్దేరింది. వరమహాలక్ష్మి పండుగ రోజున పూజ చేసేందుకు 90 గ్రాముల బంగారు నగలను బాక్సులో పెట్టి వ్యానిటీ బ్యాగ్లో ఉంచింది. రూరల్ బస్టాండ్లో రద్దీ తోపులాటలో అలాగే బస్సు ఎక్కింది. తర్వాత బ్యాగ్ చూడగా దాని జిప్ తెరిచి ఉంది, నగల పెట్టె కనబడలేదు. బాధితురాలు వెంటనే లష్కర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులకు మెడల్స్ బనశంకరి: రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి ఎస్.బదరీనాథ్ రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. పోలీస్శాఖలో ఉత్తమ సేవలు అందించినందుకు ఆయనతో పాటు మొత్తం 20 మంది వివిధ మెడల్స్కు ఎంపికయ్యారు. ఇందులో ముగ్గురు ఫైర్ సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎస్పీ నుంచి పోలీసు కానిస్టేబుల్ వరకూ ఉన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా అవార్డులను ప్రకటించారు. చెరసాలలో ప్రజ్వల్ దిగులు యశవంతపుర: ధనవంత కుటుంబీకునిగా, పార్లమెంటు సభ్యునిగా సకల రాజభోగాలను అనుభవించిన హెచ్డీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో బెంగళూరు పరప్పన జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. ఆ బాధతో అతడు తీవ్ర మనోవ్యాకులతకు గురైనట్లు తెలిసింది. కారాగారంలో ఎవరితోను మాట్లాడటం లేదు. సరిగా తిండి తినడం లేదు. దీంతో రెండు రోజులకు ఒక్కసారి వైద్యులు ఆయనకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ శిక్షే ఫైనల్ కాదు, ఇంకా హైకోర్టు, సుప్రీంకోర్టులున్నాయి. పెరోల్ వచ్చి విడుదల కావచ్చు అని ఊరడించే మాటలు చెబుతున్నారు. బీటెక్ చదివిన ప్రజ్వల్ జైల్లో ఏదైనా సాంకేతిక విభాగంలో పనిచేయాలని వైద్యులు సూచించారు. వ్యవసాయం, లైబ్రరీ నిర్వహణ, బేకరీ, గార్మెంట్స్ పని, జైలు ఫైళ్ల శాఖలో పని చేయడం తదితరాలను సూచించారు. పనిలో మునిగిపోతే బాధను మరిచిపోయి హుషారుగా ఉండవచ్చని తెలిపారు. జాడ లేని ఎమ్మెల్యే సతీష్ యశవంతపుర: అక్రమ గనులు, ఆస్తుల కేసులో కార్వార కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ సైల్ ఇంటిపై బుధవారం ఈడీ అధికారులు దాడి చేసిన తరువాత ఆయన ఆచూకీ లేదు. మొబైల్ ఫోన్ స్విచాఫ్ అయి ఎవరికీ అందుబాటులో లేరు. ఈడీ అధికారులు ఇంటిలో సోదాలు చేసి అనేక రికార్డులను సీజ్ చేశారు. ఆయన అజ్ఞాత స్థలంలో ఉన్నట్లు తెలిసింది. ఈడీ అధికారులు కూడా ఆయన కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం వరకు సోదాలు సాగాయి. నకిలీ పసిడితో టోకరా శివమొగ్గ: ఓ వ్యక్తికి నకిలీ బంగారం ఇచ్చి లక్షలాది రూపాయల మేర వంచించిన ఇద్దరిని భద్రావతి తాలూకా హొళెహొన్నూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. డీఎస్పీ నాగరాజ్ మార్గదర్శనంలో ఇన్స్పెక్టర్ శివప్రసాద్, ఎస్ఐ రమేష్ గాలింపు జరిపి శివమొగ్గ తాలూకా హాడోనహళ్లి గ్రామ నివాసి యల్లప్ప(48), కరిబసప్ప(48)లను అరెస్టు చేసి వారి నుంచి రూ.5.05 లక్షల నగదును స్వాధీనపరచుకున్నారు. నిందితులు బెళగావి జిల్లా రాయభాగ తాలూకా ముగళఖోడకు చెందిన మారుతీ భీమ్శ్రీ అనే డ్రైవర్కు కాల్చేసి తమ వద్ద బంగారం ఉందని, తక్కువ ధరకే ఇస్తామని చెప్పారు. దీంతో మారుతికి ఆశ పుట్టింది. వారిని కలవగా లక్షలాది రూపాయలను తీసుకుని నకిలీ బంగారాన్ని ముట్టజెప్పి పరారయ్యారు. బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు విచారణ చేపట్టారు.