breaking news
Karnataka
-
వర్క్ ఫ్రం సినిమా హాల్
సాక్షి బెంగళూరు: బెంగళూరులోని సినిమా హాల్లో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం యువతీయువకులు వృత్తి జీవితంలో విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు. తింటున్నా, ప్రయాణంలో ఉన్నా, చివరికి సినిమా థియేటర్లలో సినిమా ఎంజాయ్ చేస్తున్నా ఆఫీసు పని చేయక తప్పడం లేదు. బెంగళూరులోని స్థానిక థియేటర్లో ‘లోకా’ అనే కొత్త సినిమా ప్రదర్శితమవుతోంది. ఈ థియేటర్లో ఓవైపు సినిమా చూస్తూ ఇంకోవైపు ల్యాప్టాప్లో ఆఫీసు పని చేస్తూ ఒక యువతి కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. -
కర్ణాటకలో విషాదం.. గణేష్ నిమజ్జనం వేళ ఎనిమిది మంది మృతి
బెంగళూరు: కర్ణాటకలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, గణేష్ నిమజ్జన ఊరేగింపుపైకి ఓ లారీ దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉన్న మొసలె హోసహళ్లి రైల్వే గేటు సమీపంలో జరిగింది. మొసలె హోసహళ్లి, హిరెహళ్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినాయక నిమజ్జనం కోసం శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అతివేగంతో, నిర్లక్ష్యంగా వచ్చిన కార్గో లారీ.. అక్కడున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో మొదట ఓ బైక్ను ఢీకొట్టి, ఆ తర్వాత డివైడర్ను ఢీకొని, చివరకు ఊరేగింపులో ఉన్న భక్తులను చిదిమేసింది. ఈ ఘటనతో వేడుకలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడటంతో వారిని హసన్, హోళెనరసిపుర పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, లారీ డ్రైవర్ భువనేశ్ను బయటకు లాగి చితకబాదారు. ప్రస్తుతం అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. Visuals ⚠️ Horrific tragedy in Hassan, Karnataka: A speeding tanker truck rammed into a Ganesh festival procession on NH-373 near Mosalehosalli village.4 dead on the spot, 20+ seriously injured. Rescue ops underway. Intentions unknown!! pic.twitter.com/jipF27Frfi— महावीर जैन, ಮಹಾವೀರ ಜೈನ, Mahaveer Jain (@Mahaveer_VJ) September 13, 2025 -
కర్నాటకలో 22 నుంచి కుల గణన
బెంగళూరు: కర్నాటకలో సెప్టెంబర్ 22 నుంచి రాష్ట్ర కులగణన మొదలుకానుందని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. అక్టోబర్ 7వ తేదీ వరకు ఇది పూర్తి కానుందన్నారు. దీని కోసం సుమారు రూ.420 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వేగా పిలిచే ఈ సర్వేకు కర్నాటక రాష్ట్ర వెనుకబడిన కులాల కమిషన్ చైర్పర్సన్ మధుసూదన్ ఆర్ నాయక్ సారథ్యం వహించనున్నారన్నారు. ఇందులో శాస్త్రీయంగా రూపొందించిన 60 ప్రశ్నలతో రాష్ట్రంలోని ఏడు కోట్ల మంది ప్రజలు, 2 కోట్ల కుటుంబాల సామాజిక, విద్యాపరమైన స్థితిగతులను తెల్సుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్ కల్లా సర్వే నివేదిక అందే అవకాశాలున్నాయన్నారు. దసరా సెలవుల్లో సుమారు 1.75 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సర్వేను చేపడతారన్నారు. ఇందుకోసం శిక్షణ ఇస్తున్నారని, ఒక్కొక్కరికి 120–150 ఇళ్ల బాధ్యతలు అప్పగిస్తారని సీఎం చెప్పారు. వీరికి రూ.20 వేల పారితోషికం కూడా ఇస్తామన్నారు. -
అంత్యక్రియల దాఖలాల కోసం సిట్ దర్యాప్తు
బనశంకరి: ధర్మస్థలలో శవాలు పూడ్చి పెట్టిన కేసు దర్యాప్తు చేపడుతున్న సిట్ అధికారులు ధర్మస్థల గ్రామపంచాయతీ పరిధిలో మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన రికార్డులపై దృష్టి సారించి దర్యాప్తు చేపడుతున్నారు. ధర్మస్థల గ్రామ పంచాయతీ పరిధిలో మృతదేహాల అంత్యక్రియల్లో అక్రమాలు జరిగాయని, శవాలు పూడ్చిపెట్టడానికి ఫోర్జరీ రికార్డులు సృష్టించారని పోరాటదారుడు గిరీశ్ మట్టణ్ణవర్ ఆరోపిస్తూ సిట్ కార్యాలయానికి పలు దాఖలాలు అందజేశారు. దీంతో పంచాయతీ కార్యాలయంలో రికార్డుల పరిశీలనకు సిట్ సిద్ధమైంది. ప్రతి రోజూ ధర్మస్థల పంచాయతీ నుంచి రికార్డులు తెప్పించుకున్న సిట్, శవాలు పూడ్చిపెట్టిన వివరాలు, యూడీఆర్, రశీదుల సమాచారం సేకరిస్తోంది. 1987 నుంచి 2025 వరకు అన్ని రికార్డులు సేకరించిన సిట్ అధికారులు గిరీశ్మట్టణ్ణవర్ ఇచ్చిన రికార్డులు, పంచాయతీ రికార్డులను పరిశీలిస్తున్నారు. రికార్డుల్లో సంతకాలపై విచారణ శవాలు పూడ్చిపెట్టిన సమయంలో రికార్డుల్లో సంతకం పెట్టిన వ్యక్తులను విచారణ చేపట్టడంతో మాజీ అధ్యక్షులు, పీడీఓ, సిబ్బంది ప్రతిరోజు విచారణ చేపడుతోంది. దీంతో ధర్మస్థల పుర్రె కేసులో ఆరోపణలకు స్పష్టత ఇవ్వడానికి సిట్ సిద్ధంమైంది. తల పుర్రె కేసుకు సంబంధించి బంగ్లగుడ్డె రహస్యం వెలుగులోకి తీసుకురావడానికి సిట్ అధికారులు రహస్యంగా సోదాలు చేస్తున్నారు. గురువారం సాయంత్రం బంగ్లగుడ్డెలో సిట్ సీనియర్ అధికారి సైమన్ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. విఠల్గౌడ ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. విఠల్గౌడను బంగ్లగుడ్డెలో రెండు చోట్లకు సిట్ అధికారులు తీసుకెళ్లి పరిశీలించగా అక్కడ మూడు అస్థిపంజరాలు లభించాయి. రెండోసారి వెళ్లగా మృతదేహాల రాశి, చిన్నారి అస్థిపంజరం కనబడిందని విఠల్గౌడ తెలిపారు. మరోసారి మహేశ్శెట్టి తిమరోడి ఫిర్యాదు ధర్మస్థల ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టాలని సిట్ పోలీస్ స్టేషన్లో మహేశ్శెట్టి తిమరోడి కొత్తగా మరోసారి ఫిర్యాదు చేశారు. 2006 నుంచి 2010 వరకు ధర్మస్థలలోని గాయత్రి, శరావతి, వైశాలి వసతిగృహాల్లో అనేక అనుమానాస్పద మృతులు సంభవించాయి. కానీ గుర్తు తెలియని శవాలను అనాథ శవాలుగా ప్రకటించారని, తక్షణం గ్రామపంచాయతీ ద్వారా సమాధి చేశారని తెలిపారు. అతిథిగృహంలో వ్యక్తి సమాచారం వివరాలు తీసుకుంటారు కానీ అతిథుల వివరాలు ఉద్దేశపూర్వకంగా దాచిపెడతారని లేదా రికార్డులు నాశనం చేస్తారని తీవ్ర అనుమానం ఉందన్నారు. ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని తిమరోడి మనవి చేశారు. జయంత్, గిరీశ్మట్టణ్ణవర్పై ప్రశ్నల వర్షం జయంత్, గిరీశ్మట్టణ్ణవర్ను సిట్ అధికారులు విచారణ చేపట్టారు. గురువారం విచారణ పూర్తి చేసుకుని బయలుదేరిన సమయంలో మాట్లాడిన జయంత్ తనను సిట్ అధికారులు కొట్టలేదని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. నేను తప్పు చేసినట్లయితే కచ్ఛితంగా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని, దర్యాప్తులో నిజం వెలుగులోకి వస్తుందన్నారు. బంగ్లగుడ్డెకు వెళ్లి రెండుసార్లు స్థల పరిశీలన చేపట్టగా, శవాల రాశి కనబడింది. మూడు కళేబరాలు లభించాయని, చిన్నయ్య చెప్పింది నూటికి నూరు శాతం నిజమని తలపుర్రె కేసులో సౌజన్య మామ విఠల్గౌడ వీడియో విడుదల చేశారు. సిట్ కార్యాలయంలో తీవ్ర విచారణ తలపుర్రె కేసులో శుక్రవారం సిట్ అధికారులు పలు ప్రశ్నలతో గిరీశ్మట్టణ్ణవర్, జయంత్, యూట్యూబర్ ప్రదీప్లను బెళ్తంగడి సిట్ కార్యాలయంలో తీవ్ర విచారణ చేపట్టారు. చిన్నయ్య ఇచ్చిన సమాచారం ఆధారంగా పైముగ్గురు వ్యక్తులను విచారణ చేపట్టి సమాచారం సేకరించారు. ధర్మస్థల వద్ద అక్రమాలపైనే దృష్టి సమాచారం సేకరిస్తున్న అధికారులు -
సీఎం ఇంటి సమీపంలో క్యాబ్ దగ్ధం
శివాజీనగర: బెంగళూరులో సీఎం సిద్దరామయ్య నివాసం సమీపంలో క్యాబ్ దగ్ధం కాగా డ్రైవర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. శుక్రవారం ఓ వ్యక్తి యాప్లో కారు బుక్ చేయగా అతను చెప్పిన చోటుకు వాహనం బయల్దేరింది. సరిగ్గా సీఎం అధికార నివాసం సమీపంలోకి రాగానే ఇంజిన్లో పొగ వచ్చింది. డ్రైవర్ కిందకు దిగి పరిశీలిస్తుండగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అర్పారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. భార్య వదిలి వెళ్లిందని నదిలోకి దూకిన భర్త● గాలిస్తున్న పోలీసులు దొడ్డబళ్లాపురం: పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయిందనే మనస్తాపంతో భర్త నదిలోకి దూకి గల్లంతయ్యాడు. ఈ ఘటన బీదర్ జిల్లా భాల్కి తాలూకా హలసితూగాంవ్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ నివాసి ప్రభాకర్ సూర్యవంశి(38) భార్య భర్తతో గొడవపడి కొన్నేళ్లక్రితం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. పలుమార్లు అభ్యర్థించినా ఆమె ఇంటికి రాకపోవడంతో ప్రభాకర్ సూర్యవంశి మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం 30 అడుగుల బ్రిడ్జిపై నుంచి మాంజ్రా నదిలోకి దూకాడు. ఈ దృశ్యాలను కాస్త దూరంలో ఉన్న వారు మొబైల్లో వీడియో తీశారు. అగ్నిమాపకదళం సిబ్బంది, పోలీసులు వచ్చి గాలింపు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదు. -
అదుపు తప్పిన స్కూల్ బస్సు
దొడ్డబళ్లాపురం: అదుపుతప్పిన స్కూల్ బస్సు రోడ్డుపక్కకు దూసుకెళ్లడంతో 20 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.ఈ సంఘటన బెంగళూరు పణత్తూరు బళగరె వద్ద చోటుచేసుకుంది. శుక్రవారం విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా నీరు నిలిచిన రోడ్డు గుంతను తప్పించడంలో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒక వైపు ఒరిగిపోయింది. స్థానికులు వచ్చి విద్యార్థులను బయటకు తీశారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదు. పోతీస్ వస్త్రదుకాణాలపై ఐటీ దాడి బనశంకరి: కోట్లాది రూపాయల వంచనకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో తమిళనాడుకు చెందిన పోతీస్ వస్త్రదుకాణాలపై ఆదాయపన్ను(ఐటీ) శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. చైన్నె నుంచి వచ్చిన 30 మందికి పైగా ఐటీ అధికారులు శుక్రవారం ఉదయం నగరంలోని కే.జీ.రోడ్డులోని పోతీస్తో పాటు అనేక వస్త్రదుకాణాలపై ఐటీ అధికారులు దాడి చేసి ట్యాక్స్ వంచన కేసుకు సంబంధించిన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని వస్త్రదుకాణాలు తెరవక పోవడంతో ఐటీ అధికారులు ఫోన్ చేసి సమాచారం అందించి బలవంతంగా దుకాణాల తాళాలు తీసి పరిశీలించారు. మైసూరు రోడ్డులోని టింబర్ లేఔట్, గాంధీనగరలో అతి పెద్ద షోరూమ్పై దాడి చేశారు. టింబర్ లేఔట్లోని పోతీస్ దుకాణంపై 25 మందికి పైగా ఐటీ అధికారులు దాడి చేసి నగదు, ఆన్లైన్ కార్యకలాపాలు, దుస్తుల విలువతో పాటు దుకాణంలోని అన్ని రికార్డులు, ఫైళ్లను పరిశీలించారు. -
టీచర్పై అమానుష దాడి
● తరగతి గది నుంచి లాక్కొచ్చి దాడి చేసిన గ్రామస్తుడు ● కోలారు జిల్లాలో ఘటన మాలూరు : ఉపాధ్యాయురాలిని తరగతి గది నుంచి బయటకు లాక్కొని వచ్చి అమానుషంగా దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని టీకల్ ఫిర్కా క్షేత్రేనహళ్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగింది. ఉపాధ్యాయిని ఎస్.మంజుల విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా గ్రామానికి చెందిన చౌడప్ప వచ్చాడు. మీ అబ్బాయి రెండు రోజులుగా బడికి రాలేదని మంజుల తెలియజేయగా కోపోద్రిక్తుడైన చౌడప్ప ఆమెను గదిలోనుంచి లాక్కువచ్చి దాడి చేశాడు. దాడిలో మంజుల తలకు తీవ్ర గాయమైంది. ఆమెను మాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మాస్తి పోలీసు పోలీసులు పాఠశాలకు వచ్చి వివరాలు సేకరించారు. ఘటనను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఉపాధ్యాయుల సంఘం తీవ్రంగా ఖండించింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా దాడి పాల్పడిన చౌడప్ప కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉంది. -
మెట్రోలో గుండె తరలింపు
యశవంతపుర: జీవన్మృతుడి నుంచి సేకరించిన గుండెను మైట్రో రైలులో సకాలంలో మరో ఆస్పత్రికి తరలించి ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టారు వైద్యులు. బెంగళూరు నగరంలోని యశవంతపుర స్వర్శ ఆస్పత్రి నుంచి గురువారం రాత్రి 11.1 నిమిషాలకు జీరో ట్రాఫిక్ మధ్య అంబులెన్స్లో యశవంతపుర ఇండస్ట్రీయల్ మెట్రో స్టేషన్కు తరలించారు. అక్కడ నుంచి సంపిగె రోడ్డు మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో తరలించారు. అక్కడ నుంచి శేషాద్రిపుర సమీపంలోని అపోలో ఆస్పత్రికి 11.21 నిముషాల వ్యవధిలో తరలించారు. గుండె తరలింపులో మెట్రో భద్రత సిబ్బందితోపాటు రెండు ఆస్పత్రుల వైద్య సిబ్బంది ఎంతోగాను శ్రమించారు. కాగా మెట్రోలో గుండె తరలింపు ఇది రెండో పర్యాయం. అమెరికాలో కన్నడిగుడి హత్య యశవంతపుర: ఆమెరికాలోని టెక్సాస్ నగరంలో కన్నడిగుడు దారుణ హత్యకు గురయ్యాడు. సహ ఉద్యోగే అతన్ని పొట్టనబెట్టుకున్నాడు. చంద్రమౌళి బాబా చెన్నమల్లయ్య అనే వ్యక్తి డల్లాస్ డౌన్టవ్ సూట్స్ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. హోటల్ను శుభ్రం చేసే యంత్రం విషయంపై శుక్రవారం ఉదయంం సహ ఉద్యోగి యాడ్నినిస్ కోబోస్ మార్టినెజ్తో వాగ్వాదం జరిగింది. విచక్షణ కోల్పోయిన సహ ఉద్యోగి పదునైన ఆయుధంతో చంద్రమౌళిపై దాడి చేసి హత్య చేసి ఉడాయించాడు. ఈ దారుణం జరిగిన సమయంలో మృతుడి భార్య, పిల్లలు అక్కడే ఉన్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గతంలో ఒక కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. హత్య దృశ్యాలు హోటల్లో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బీడీసీసీ బ్యాంకు ఎన్నికల్లో గొడవదొడ్డబళ్లాపురం: బెళగావిలో బీడీసీసీ బ్యాంకు ఎన్నికల్లో గొడవ జరిగింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొని ఎన్నిక వాయిదా పడింది. శుక్రవారం కిత్తూరు పట్టణంలో బీడీసీసీ బ్యాంకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణకు విచ్చేసిన పీకేపీఎస్ కార్యదర్శిని కాంగ్రెస్ నాయకులు కారులో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీ తలపడ్డారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఎన్నికలు వాయిదా పడ్డాయి. శివాజీనగర మెట్రో స్టేషన్కు సెయింట్ మేరీ బసిలికాగా పేరు మార్పు శివాజీనగర: రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరానికి కేంద్ర బిందువుగా ఉన్న శివాజీనగర మెట్రో స్టేషన్కు శివాజీనగర సెయింట్ మేరీస్ బసిలికాగా నామకరణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇటీవల సెయింట్ మేరీ బసిలికాలో జరిగిన వార్షిక పండుగ సమయంలో ప్రజల విన్నపం మేరకు బెంగళూరులోని శివాజీనగర మెట్రో స్టేషన్ను సెయింట్ మేరీ బసిలికాగా నామకరణం చేయాలని తమ ప్రభుత్వం పరిగణించనున్నట్లు తెలిపారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షద్ మీడియాకు వివరించారు. మహారాష్ట్ర సీఎం వ్యతిరేకత శివాజీనగర మెట్రో స్టేషన్ పేరు మార్పునకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తీర్మానంపై విరుచుకుపడ్డారు. ఇది ఛత్రపతి శివాజీ మహారాజుకు చేసిన అవమానమని తెలిపారు. నెహ్రూ కాలం నుంచి కూడా కాంగ్రెస్ మరాఠా రాజులను అవమానించే సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ● రాచనగరి ధగధగ మైసూరు దసరా ఉత్సవాలకు రాచనగరి సిద్ధమవుతోంది. స్మారకాలు, ప్రముఖ సర్కిళ్లు, ప్రధాన రహదారులను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు. -
ఖరీఫ్లో 98 శాతం విత్తనం పూర్తి
సాక్షి బెంగళూరు: వ్యవసాయ శాఖ అంచనాలకు అనుగుణంగా ఖరీఫ్లో పంటల సాగయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆశించిన మేర వర్షపాతం నమోదవుతోంది. ఈ క్రమంలో ఈ రుతుపవన వర్షాకాలంలో విత్తన నాట్ల ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. సెప్టెంబర్ మొదటి వారం ముగిసే నాటికి రాష్ట్రంలో 80.76 లక్షల హెక్టార్లలో విత్తన నాట్లు పూర్తి అయ్యాయి. అయితే యూరియా, ఎరువుల కొరత కారణంగా కొన్ని చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్లో 82.50 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 80.76 లక్షల హెక్టార్లలో విత్తన నాట్లు పడ్డాయి. ఈ సారి మే చివరి నాటికి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించాయి. జూన్లో కరావళి, మలెనాడు జిల్లాల్లో మంచి వర్షపాతం నమోదైంది. అయితే పలు జిల్లాల్లో మాత్రం వర్షాలు పలకరించలేదు. ఈ నేపథ్యంలో జూన్లో రైతులు సాగుకు ముందడుగు వేసేందుకు జాప్యం చేశారు. విత్తననాట్లు జూన్లో ఆశించినమేర జరగలేదు. జూలై, ఆగస్టులో కొద్ది మొత్తంలో రాష్ట్రంలో వర్షాలు కురవడంతో రైతులు విత్తననాట్లకు ఆసక్తి కనబరిచారు. గతేడాది ఈ సమయానికి రాష్ట్రంలో 78.73 లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. ఈసారి అంతకంటే కొంచెం అధికంగా 80.76 లక్షల హెక్టార్లలో (98 శాతం) విత్తనం వేశారు. ప్రస్తుతం వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కోలారు, ఇతర ప్రాంత ప్రజలు దిగుబడిపై దిగులుపడుతున్నారు. చామరాజనగరలో 70 శాతం, కొడగులో 76 శాతం, శివమొగ్గలో 84 శాతం, చిక్కబళ్లాపురలో 85 శాతం, చిక్కమగళూరులో 88 శాతం, బెంగళూరు నగర జిల్లాలో 97 శాతం మేర విత్తన నాట్లు పడ్డాయి. మిగిలిన జిల్లాల్లో 100 శాతం మేర విత్తన ప్రక్రియ పూర్తయింది. సబ్సిడీ ధరలో విత్తనాలను కొనుగోలు చేసి రైతులు నాట్లు వేస్తున్నారు. అయితే సకాలంలో వర్షాలు రాని కారణంగా 50 శాతం పంటలు నాశనమయ్యాయి. మే నెలలో చెదురుమదురు వర్షాలు పలకరించడంతో ఉత్తర కర్ణాటకలోని పలు జిల్లాల్లో రైతులు పంటల సాగు ప్రారంభించారు. అయితే ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయండంతో పంటలు నాశనం అయ్యాయి. తాజాగా వర్షాలు ఆశించిన మేర కంటే అధికంగా రావడంతో రైతుల్లో జోష్ పెరిగింది. విత్తన నాట్లు వేసేందుకు రైతులు మళ్లీ ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో సబ్సిడీ ధరలో మరోసారి విత్తనాలను ఇవ్వాలని రైతులు మనవి చేస్తున్నారు. అయితే ఒక్కసారి సబ్సిడీ ధరలో విత్తనాలు పంపిణీ చేసిన తర్వాత తిరిగి మరోసారి ఇవ్వడం సాంకేతికంగా వీలుపడదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 80.76 లక్షల హెక్టార్లలో సాగు ప్రారంభం ఉత్తర కర్ణాటకలో భారీగా విత్తన ప్రక్రియ వేధిస్తున్న ఎరువుల కొరత లక్ష్యం 82.50 లక్షల హెక్టార్లు గత ఏడాది ఇదే సమయానికి.. రాయితీతో విత్తనాలు, ఎరువులు -
నాభర్తకు డిగ్రీలేదు, నేనే పోషిస్తున్నా.. నా తల్లి బంగారం కూడా తాకట్టు పెట్టా!
కన్నడ దర్శకనటుడు ఎస్ నారాయణ్ (S Narayan)పై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది. నారాయణ్ కుటుంబం వరకట్నం కోసం వేధిస్తోందంటూ ఆయన కోడలు పవిత్ర బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. తనకేదైనా జరిగితే భర్త, అత్తమామలదే పూర్తి బాధ్యత అని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు రమ్మని నారాయణ్, అతడి భార్య భాగ్యవతి, కుమారుడు పవన్కు నోటీసులు పంపారు.ఫిర్యాదులో ఏముందంటే?'నా భర్త పవన్ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. అతడికి ఎటువంటి ఉద్యోగం లేదు. దీంతో నేనే కుటుంబాన్ని చూసుకుంటున్నాను. ఓసారి అతడు కారు కొనాలంటూ నా దగ్గర రూ.1 లక్ష, నా తల్లి దగ్గరి నుంచి రూ.75 వేలు తీసుకున్నాడు. నా భర్త కుటుంబం కళా సామ్రాట్ ఫిలిం అకాడమీ స్థాపించినప్పుడు నేను నా తల్లి బంగారం కూడా తాకట్టు పెట్టి వారికి ఆర్థిక సాయం చేశాను. కానీ, ఆ అకాడమీ ఎంతోకాలం నడపలేదు, కొంతకాలానికి మూసివేశారు. నేను సంపాదించి పోషించా..తర్వాత మళ్లీ నన్ను డబ్బు అడగడం ప్రారంభించారు. రూ.10 లక్షలు లోన్ తీసుకునిచ్చాను. కొన్నినెలలు సరిగానే చెల్లించి తర్వాత ఆపేశారు. నా పెళ్లి సమయంలో నాన్న పవన్కు రూ.1 లక్ష విలువైన బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. మా పెళ్లి విషయంలో నారాయణ్ దంపతులు గొడవపడ్డారు. పెళ్లయిన కొన్ని నెలలకే ఇంట్లోంచి బయటకు వచ్చి ఓ అద్దెగదిలో ఉన్నాం. ఓ సంవత్సరం తర్వాత తిరిగి మళ్లీ అత్తింట్లో అడుగుపెట్టాం' అని పవిత్ర పేర్కొంది.సినిమాచైత్రద ప్రేమాంజలి (1992) కన్నడ సినిమాతో నారాయణ్ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. అనురాగద అలెగలు, మేఘ మాలె, తవరిన తొట్టిలు, బేవు బెల్ల, సూర్యవంశం, సింహాద్రియా సింహ, దక్ష, చంద్ర చకోరి, మనసు మల్లిగె.. ఇలా ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశాడు. తమిళంలో జై సినిమా తీశాడు. చైత్రద ప్రేమాంజలి, కురిగలు సార్ కురిగలు, హనీమూన్ ఎక్స్ప్రెస్, తిప్పరల్లి తర్లెగలు, ఓల్డ్ మాంక్ వంటి పలు చిత్రాల్లో నటించాడు.చదవండి: మద్యానికి, సిగరెట్కు గుడ్బై.. శాకాహారిగా మారిపోయిన రణ్బీర్! -
చినుకు పడితే చిత్తడే.!
రాయచూరు రూరల్: నగరంలో గురువారం భారీ వర్షం కురిిసింది. దీంతో ఎక్కడ చూసినా రహదారులు జలమయం అయ్యాయి. మున్నూరు వాడి, గాంధీ చౌక్, బసవన బావి చౌక్లో వర్షపు నీరు చొరబడ్డాయి. అంద్రూన్ కిల్లాలో వర్షపు నీరు ముందుకు ప్రవహించకుండా నిల్వ చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నగరంలోని టిప్పు సుల్తాన్ రోడ్డులోని దుకాణాలలోకి నీరు చేరాయి. ఏ వీధిలో చూసినా మురుగు కాలువల నుంచి వస్తున్న నీరు దుర్వాసన వెదజల్లింది. మోకాలి లోతున నీరు ప్రవహించాయి. మురుగు కాలువల్లో చెత్తా చెదారాలు పేరుకొని వర్షపు నీరు ముందుకెళ్లక ప్రజలను పలు ఇబ్బందులకు గురి చేశాయి. గురువారం ప్రభుత్వ పాఠశాలలకు తాలూకా విద్యా శాఖాధికారి ఈరణ్ణ సెలవు ప్రకటించారు. రాయచూరులో భారీ వర్షం జలమయంగా రహదారులు -
లాభాల ఆశ చూపి రూ.14 లక్షల వంచన
హుబ్లీ: ట్రేడింగ్ లాభాల ఆశ చూపి ఓ వ్యక్తి నుంచి ఆన్లైన్ కేటుగాళ్లు రూ.14 లక్షలను దోచుకున్నారు. గజేంద్రగడకు చెందిన, ప్రస్తుతం నేకార నగర నివాసి అకౌంటెంట్ నాగరాజ్కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఆశ పెట్టారు. నాగరాజ్ యూట్యూబ్లో షేర్ మార్కెట్ గురించి పరిశీలిస్తుండగా అక్కడ దొరికిన గుర్తు తెలియని వ్యక్తి రోహన్కుమార్ మొబైల్కు ఫోన్ చేశాడు. అతడు తాను 15 ఏళ్ల నుంచి షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నాను. ఇందులో డబ్బులు పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం కచ్చితంగా లాభాలు వస్తాయని నమ్మించి దశల వారీగా రూ.14 లక్షల మొత్తాన్ని తన బ్యాంక్ ఖాతాకు బదలాయించుకొని వంచించినట్లుగా బాధితుడు క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ఘటనలో గోకుల్ రోడ్డు వివేకానందనగర నివాసి శ్రేయస్కు అపరిచితుడు వాట్సాప్ సందేశం పంపించి వర్క్ ఫ్రం హోం ఆశ చూపించి లాభాలు ఇస్తానంటూ నమ్మబలికాడు. ఆ మేరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే ద్వారా ఆ కేటుగాడు తన బ్యాంక్ ఖాతాలకు రూ.4,65,820 బదలాయించుకొని వంచించినట్లు బాధితుడు గోకుల్ రోడ్డు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు శ్రీకారం రాయచూరు రూరల్: గ్రామాల్లో అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ పేర్కొన్నారు. గురువారం దేవదుర్గ తాలూకా ఖానాపూర్లో రహదారి, పాఠశాల, వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడానికి పాటు పడతామన్నారు. ప్రతి ఒక్కరూ విద్య, వైద్యం, ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలన్నారు. జెడ్పీ, టీపీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ మైత్రితో పోటీపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. విద్యుత్ తీగ తగిలి బాలుడి చేయి కట్సాక్షి,బళ్లారి: జెస్కాం అధికారులు, తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో విద్యుత్ తీగ తగలడంతో ఓ బాలుడు తన చేయిని పోగొట్టుకొన్న ఘటన చోటు చేసుకుంది. ఎవరో చేసిన తప్పిదానికి బాలుడి చేయి తెగిపోవడంతో అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిపైన విద్యుత్ లైన్ ఉండటంతో బాలుడు తెలిసో తెలియకో ఇనుప రాడ్డుతో విద్యుత్ తీగను తగిలించడంతో విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే చికిత్స కోసం బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే కాలిన గాయంతో బాలుడి చేయిని తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. పిడుగుపాటుకు గురై మత్స్యకారుడు మృతి రాయచూరు రూరల్: తాలూకాలో బుధవారం సాయంత్రం మెరుపులతో కురిసిన వానలకు పిడుగుపాటుకు గురై ఓ మత్స్యకారుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతుడిని తాలూకాలోని తుంగభద్ర గ్రామానికి చెందిన దేవప్ప(40)గా పోలీసులు గుర్తించారు. నదిలో చేపలు పట్టడానికి తెప్పపై వెళ్లిన దేవప్ప పిడుగు పడి మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు యరగేరా సీఐ నింగప్ప తెలిపారు. బార్ ఉద్యోగికి కత్తి పోట్లు హుబ్లీ: బార్ ఎదుట మద్యం తాగి పడుకున్న వ్యక్తిని బాబు ఇక్కడ పడుకోవద్దని హితవు చెప్పిన పాపానికి బార్లో పని చేస్తున్న ఉద్యోగిపై కత్తితో దాడి చేసిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద బార్ దగ్గర గోవాకు చెందిన జాన్ విలియం డేసి మద్యం తాగి పడుకున్నాడు. అతడిని లేపడానికి వెళ్లిన బార్ సిబ్బంది అజయ్ పాస్వాన్తో ఆ మందు బాబు ఘర్షణ పడ్డాడు. మాటమాటా పెరిగిన కోపంతో చాకుతో పొడిచాడు. దీంతో పాస్వాన్కు చిన్నపాటి గాయాలు కాగా కేఎంసీ ఆస్పత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రికి డీసీపీ మహనింగ నందగావి, సీఐ మహమ్మద్ రఫీక్ వెళ్లి బాధితుడిని పరామర్శించారు. హుబ్లీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో 874 గ్రాముల గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకొని గంజాయిని తరలిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంటూరు రోడ్డులోని ఇంతియాజ్ కాలేజీ బ్యాగ్లో గంజాయి పెట్టుకొని విక్రయిస్తుండగా బెండిగేరి పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివాహిత ఆత్మహత్యరాయదుర్గం టౌన్: మండలంలోని పల్లేపల్లికి చెందిన వివాహిత చాముండి(22) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. పల్లేపల్లిలో నివాసముంటున్న నాగమ్మకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు కాగా, రెండో కుమార్తె చాముండికి ఏడాదిన్నర క్రితం కర్ణాటకలోని బళ్లారి జిల్లా కురుగోడుకు చెందిన చిరంజీవితో వివాహమైంది. చిన్నపాటి విషయానికి భార్యతో గొడవపడేవాడు. అనుమానంతో ఆమెను వేధింపులకు గురిచేస్తుండేవాడు. ప్రస్తుతం చాముండి నాలుగు నెలల గర్భిణి. అనారోగ్యంతో బాధపడుతున్న తన అక్కను చూసేందుకు పది రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అనంతరం రెండు రోజుల క్రితం భర్త అత్తింటికి చేరుకున్నాడు. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. అనుమానంతో ఆమెను దూషించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చాముండి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
త్వరలో లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ
బళ్లారిఅర్బన్: పేద ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న నగర శివారులోని ముండ్రగి వద్ద రాజీవ్ గాంధీ టౌన్షిప్ పథకం ద్వారా ఇప్పటికే నిర్మాణం పూర్తయిన వెయ్యి ఇళ్లను సంబంధిత లబ్ధిదారులకు త్వరలోనే పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన సదరు ఇళ్లను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఆ ఇళ్ల నిర్మాణ తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాలికె కమిషనర్ మంజునాథ్తో పాటు పలువురు అధికారులు నారా భరత్రెడ్డికి ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల జాబితా గురించి వివరించారు. ఇళ్లను తీసుకోవడానికి ఇప్పటికే లబ్ధిదారులు ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులను చెల్లించారన్నారు. అయితే ఇళ్లను ఉచితంగా పంపిణీ చేయాలని ఇప్పటికే రాష్ట్ర గృహ వసతి శాఖ మంత్రి జమీర్ అహ్మద్ఖాన్తో చర్చించామని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వమే లబ్ధిదారుల డబ్బులను చెల్లించి నూరు శాతం ఉచితంగా ఇళ్లను పంపిణీ చేసే ఉద్దేశం కలిగి ఉందన్నారు. పూర్తి కాని ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తారన్నారు. తొలి విడతగా వెయ్యి ఇళ్లను ఒకేసారి పంపిణీ చేయాలని సంకల్పించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ల సమక్షంలో పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని, ఆ మేరకు త్వరలో కార్యక్రమం జరిపే తేదీని నిర్ణయించి ప్రకటిస్తామన్నారు. ప్రముఖులు చానాళ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి వెల్లడి బళ్లారిలోని నిరాశ్రయులకు శుభవార్త -
గుడిసాగరలో అతిసార విజృంభణ
హుబ్లీ: జిల్లాలోని నవలగుంద తాలూకాలోని గుడిసాగర గ్రామంలో అతిసారతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. 29 మందికి గాను 9 మంది చికిత్స తీసుకొని డిశ్చార్జి అయ్యారు. ఓ మహిళను కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. 19 మంది చికిత్స పొందుతున్నారు. గ్రామంలోని ఉపకేంద్రంలో క్లినిక్ తెరిచారు. ఆ గ్రామంలో ఇళ్ల సర్వే చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్హెచ్.కోనరెడ్డి, జిల్లాధికారి దివ్యప్రభు, సీఈఓ భువనేష్ పాటిల్, ఎస్పీ గుంజన్ ఆర్య తాలూకా ఆస్పత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. తాగునీటి చెరువు నుంచి ఈ అతిసార వ్యాపించిందని గ్రామస్తులు ఆరోపించారు. చెరువు అలాగే ఎగువ భాగాన ఉన్న జలాశయం ఇంటింటి కొళాయిల్లోని నీటిని సేకరించి పరీక్షకు పంపించారు. ఆ పరీక్షల నివేదికలు చేరాక చర్యలు తీసుకుంటారు. 30 మంది ఆశా సభ్యుల బృందం ఏర్పాటు చేసి గ్రామంలో ఇంటి సర్వే ప్రారంభించారు. చురుగ్గా ఇళ్ల సర్వే ఇప్పటి వరకు 600కు పైగా ఇళ్ల సర్వే చేపట్టి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నట్లు జిల్లాధికారి తెలిపారు. సదరు గ్రామంలో మూడు, పారిశుధ్య, తాగునీటి యూనిట్లు ఉండగా కొద్ది మేర మరమ్మతులకు గురయ్యాయి. ప్రస్తుతం ఒకదాని మరమ్మతు చేపట్టి నీటి సరఫరా చేస్తున్నారు. మిగిలిన వాటిని తక్షణమే మరమ్మతు చేయాలని సూచించానన్నారు. ఇప్పటి వరకు నవలగుంద నీలమ్మ చెరువు నుంచి రెండు ట్యాంకర్ల ద్వారా రక్షిత మంచి నీటిని గుడిసాగరకు సరఫరా చేస్తున్నట్లు జెడ్పీ సీఈఓ భువనేష్ పాటిల్ తెలిపారు. చెరువు చుట్టు కంచె లేదు. దీంతో పశువులు, పక్షులు, చెరువులోకి దాహార్తిని తీర్చుకునేందుకు వెళ్లడంతో నీరు కలుషితం అవుతోంది. చెరువు చుట్టు తీగలతో కంచె ఏర్పాటు చేయాలని, చెరువు నీటి శుద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. డీహెచ్ఓ ఎం.వనకేరి, వైద్యాధికారి డాక్టర్ రూపా, తహసీల్దార్ సుధీర్, ఈఓ భాగ్యశ్రీ, సీఐ రవి, ఆ జీపీ చైర్పర్సన్ రత్నమ్మ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వాంతులు విరేచనాలతో అస్వస్థత కిమ్స్ ఆస్పత్రిలో ఒకరి చేరిక -
ఉల్లి రైతు కంట కన్నీరు
రాయచూరు రూరల్: రాష్ట్రానికే తలమానికంగా ఉన్న రాయచూరు వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రంలో ఉల్లిగడ్డలకు ధరలు తగ్గగా, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1200 ఉండగా, మార్కెట్లో క్వింటాల్ ధర కేవలం రూ.500 పలుకుతోంది. గత కొన్నేళ్ల నుంచి జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొనడం, తుంగభద్ర ఎడమ కాలువలకు నీరందక పోవడం వల్ల మార్కెట్కు పంట దిగుబడి రావడం తగ్గింది. కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, విజయ నగర, బళ్లారి, ఉత్తర కర్ణాటకలోని బాగల్కోటె, విజయపుర జిల్లాల్లోని రైతులు పండించిన పంటలకు ధరలు లేక తల్లడిల్లిపోతున్నారు. ఈ ఏడాది కాలువలకు నీరందక ఉల్లి పంట దిగుబడి తగ్గింది. ప్రతి నిత్యం వేలాది బస్తాలు వ్యవసాయ మార్కెట్కు వచ్చి పడుతున్నా ధర మాత్రం రైతులకు ఆశాజనకంగా లేదు. కొనుగోలుకు మార్కెట్లో బస్తాలుగా సిద్ధంగా ఉన్నాయి. రైతులు తాము పండించిన ఉల్లికి మార్కెట్లో క్వింటాల్కు రూ.1200–1400 వరకు మాత్రమే ధర ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది క్వింటాల్కు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ధర పలికింది. ఏడు జిల్లాల్లో ఏటా 21 వేల హెక్టార్లలో ఉల్లిని పండించేవారు. అతిగా వర్షాలు కురవడంతో ఉల్లి పంటకు నష్టం సంభవించింది. తాజాగా విజయపురలో రైతులు ఉల్లిని రోడ్డు మీద పారబోసి నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఉల్లిగడ్డల బస్తాలు రాయచూరులోని వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రం నష్టాల బారిన జిల్లాలోని అన్నదాతలు మార్కెట్లో తరుగుతున్న క్వింటా ధర దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్న రైతులు -
కౌన్సిలర్ చొరవతో అంధుడికి వివాహం
రాయచూరు రూరల్: నగరంలో ఓ నగరసభ సభ్యుడు అంధుడికి వివాహం జరిపించిన ఘటన చోటు చేసుకుంది. బుధవారం యరమరస్లో కౌన్సిలర్ నరసారెడ్డి అంధుడు అనాథ రంగప్ప(33)కు కోలారుకు చెందిన నారాయణమ్మతో మూడు రోజుల క్రితం కోలారులో వివాహం చేయించారు. యరమరస్ వీరాంజనేయ కళ్యాణ మంటపంలో అంగరంగ వైభవంగా ఇద్దరికి అక్షతారోహణం చేశారు. రంగప్ప క్రైస్తవ మిషనరీలో ప్రచారకర్తగా విధులు నిర్వహిస్తున్నారు.కుక్క కాటుపై నిర్లక్ష్యం వద్దుబళ్లారిటౌన్: కుక్క కాటు వేసిన లేదా గోకిన వెంటనే వైద్యులను సంప్రదించాలని జిల్లా సర్వేక్షణ అధికారి డాక్టర్ మరియం బీ పేర్కొన్నారు. జిల్లా పాలన, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ సర్వేక్షణ శాఖల ఆధ్వర్యంలో కౌల్బజార్ ఆరోగ్య కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన జనజాగృతి కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. కుక్క కరచిన వెంటనే కరిచిన ప్రాంతంలో సబ్బు నీటితో శుభ్రంగా కడిగి వెంటనే వైద్యులను సంప్రదిస్తే రేబిస్ వ్యాధి నుంచి బయటపడవచ్చన్నారు. కుక్క కాటుకు రేబిస్ నిరోధక ఇంజెక్షన్ అందుబాటులో ఉందన్నారు. ఈ వ్యాధి సోకిన వారు నిర్లక్ష్యం చేస్తే మరణించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ రోగి నీరు తాగడం మానతారని, గాలి, వెలుగు పడితే భయపడతారని వివరించారు. అదే విధంగా పాము కాటు వేసినప్పుడు 108 అంబులెన్స్కు ఫోన్ చేసి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లాలన్నారు. కొంత మంది పాము కాటు వేసిన వెంటనే బ్లేడ్తో, చాకుతో కోస్తూ పసరు వైద్యాన్ని అందిస్తూ నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతారన్నారు. డిప్యూటీ మేయర్ డీ.సుకుం, వైద్యాధికారులు నజీబ్ అలీం, విశాలాక్షి, స్వప్న, జబీన్సాద్, శరత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.సైబర్ కేటుగాళ్లపై జాగ్రత్త అవసరం●గత ఏడాది రూ.70 కోట్లకు పైగా సైబర్ మోసాలుబళ్లారిటౌన్: గత ఏడాది బళ్లారిలో సైబర్ కేటుగాళ్ల వల్ల రూ.70 కోట్లకు పైగా ప్రజలు మోసపోయారని, దీనిపై జాగ్రత్త వహించాలని సైబర్ నేరాల డీఎస్పీ సంతోష్ చౌహాన్ పేర్కొన్నారు. గురువారం బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ బుధవారం స్టేడియం రోడ్డులోని బృందావన లాడ్జి హాల్లో ఏర్పాటు చేసిన బజాజ్ ఫైనల్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన డిజిటల్ వినియోగదారులకు అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నకిలీ ఓటీపీ, పిచింగ్, రుణ సౌకర్యాలు, పెన్షన్ వంటి ఆశలతో ప్రజలను మభ్యపెట్టి లోబరుచుకుంటు మోసాలు చేస్తున్నారని వివరించారు. ఓ సీనియర్ సిటిజన్ రూ.2 కోట్లకు పైగా పోగొట్టుకున్న కేసులు కూడా ఇటీవల తమ దృష్టికి వచ్చాయన్నారు. ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వృత్తి వైద్యులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు కూడా సైబర్ మోసగాళ్లకు బలి అవుతున్నారని వివరించారు. సామాజిక మాధ్యమంలో వచ్చే డిజిటల్ నకిలీ ప్రకటన చూసి మోసపోవద్దన్నారు. సైబర్ నేరగాళ్లకు మోసపోయిన వెంటనే 1930కి కాల్ చేసి సహాయం కోరాలని ఆయన వివరించారు. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ జోనల్ మేనేజర్ వెంకటేశమ్, రిటైర్డ్ డీఓఎస్పీ శ్రీధర్ దొడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ ఇళ్ల నిర్మాణాల్లో నకిలీ దాఖలాలు
●బాధ్యులైన ముగ్గురు అధికారుల సస్పెండ్ ●లింగసూగూరు నగరసభలో అవ్యవహారం రాయచూరు రూరల్: అక్రమంగా ఇళ్ల నిర్మాణాలకు నకిలీ రికార్డులు సృష్టించిన ముగ్గురు అధికారులు సస్పెన్షన్కు గురయ్యారు. బుధవారం లింగసూగూరు తాలూకా హులిగుడ్డ సర్వే నంబర్ 10–1–1, 10–2–1–, 10–1–13లో 9.32 సెంట్ల భూమిని ఉద్యానవనం, సీనియర్ సిటిజన్ కార్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని నకిలీ ఖాతా, రికార్డులను సృష్టించిన వివరాలను ఆధారంగా చేసుకోని విచారణ జరిపిన జిల్లాధికారి నితీష్, నగరసభ అధికారి రవి, రెవిన్యూ శాఖ అధికారులు ఫయాజ్, అశోక్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
చెట్లు కూలి ట్రాఫిక్ ఇబ్బందులు
● అనేక ప్రాంతాలలో చెట్లు విరిగిపోయాయి. జన సంచారం లేకపోవడంతో ప్రాణహాని తప్పింది. ● కామాక్షిపాళ్య బస్టాండు వద్ద చెట్టు కూలిపోవడంతో సుమనహళ్లి వైపునకు వెళ్లే వాహనాల సంచారం నిలిచిపోయింది. ● అండర్పాసుల్లో నీరు చేరడంతో వాహనదారులు అయోమయానికి గురయ్యారు. ● రాజాజీనగర 4 వ బ్లాక్ భారీ చెట్టు కూలిపోవడంతో ఐదుకార్లు, టాటా ఏస్, నాలుగు బైకులు దెబ్బతిన్నాయి. చంద్రమ్మ, పీటర్ అనే వారి ఇళ్లకు అడ్డుగా చెట్టు పడడంతో బయటికి రాలేకపోయారు. బీబీఎంపీ సిబ్బందికి కాల్ చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. విద్యుత్ వైర్లు కూడా తెగిపోయి కరెంటు పోయి ప్రజలు నానా బాధలు పడ్డారు. ● కృష్ణరాజపురం, హెబ్బాళ, జయనగర,శాంతినగర, మెజస్టిక్ తో పాటు అనేక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. ● గురువారం ఉదయం నుంచి రోడ్ల మీద వాననీటి వల్ల వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రామమూర్తినగర, కస్తూరి నగర, రాయసంద్ర జంక్షన్ వద్ద రోడ్లలో నీరు నిలిచిపోయింది. -
దర్శకుని ఇంట రచ్చ
శివాజీనగర: ఇంటింటి కథలను వెండితెరపై చూపే దర్శకుని ఇంటి కథ రచ్చకెక్కింది. కోడలిని కట్నం కోసం వేధించారని ప్రముఖ కన్నడ సినీ దర్శకుడు ఎస్.నారాయణ, కుటుంబం మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. బెంగళూరులొని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్లో నారాయణ, భాగ్యవతి, భర్త పవన్ మీద కోడలు పవిత్ర ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం.. 2021లో ఇద్దరికీ పెళ్లయింది. వివాహ సమయంలో బాగానే కట్నకానుకలు ఇచ్చారు. కానీ మరింత డబ్బు బంగారం తేవాలని సతాయిస్తున్నారు. భర్త పవన్ ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటాడు. ఆర్థిక ఇబ్బందులు రావడంతో పవిత్రనే ఉద్యోగం చేస్తోంది. పవిత్ర తల్లి బంగారు నగలను కుదవ పెట్టి కొంత సొమ్ముఇచ్చింది. దానిని భర్త పోగొట్టాడు. ఆ తరువాత పవిత్రనే రూ. 10 లక్షలు అప్పుచేసి భర్తకు ఇచ్చింది. చివరకు వేధించి, కొట్టి, తనను ఇంటి నుంచి గెంటివేశారని పవిత్ర వాపోయింది. ఆరోపణలు సాధారణమే నారాయణ స్పందిస్తూ ఏడాది కిందట కోడలు మా ఇంటి నుంచి వెళ్లిపోయింది. మనదేశంలో కట్న వేధింపులు అని అందరు మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు కదా అన్నారు. తాము మాట్లాడితే ఆమెకు అవమానం అవుతుందని, అందుకే మౌనంగా ఉన్నట్లు చెప్పారు. ఆమెకు సుఖం, సంతోషం ఎక్కడ లభిస్తుందో అక్కడికి వెళ్లారు, ఆమె వ్యక్తిత్వం అందరికీ తెలుసు అని హేళన చేశారు. కట్నం వేధింపుల కేసు పెట్టిన కోడలు -
డ్రగ్ పెడ్లర్గా జైలు వార్డర్
దొడ్డబళ్లాపురం: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో సిబ్బంది కుమ్మక్కు మరోసారి బయటపడింది. ఖైదీలకు పొగాకు, మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న జైలు వార్డర్ కళ్లప్పను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 100 గ్రాముల హషిష్ ఆయిల్ని స్వాధీనం చేసుకున్నారు. 2018లో కళ్లప్ప ఉద్యోగంలో చేరాడు. 7వ తేదీన సాయంత్రం తనిఖీ సిబ్బంది కళ్లప్పను ఎంట్రీ గేటు వద్ద చెక్ చేయగా పొగాకు, హషిష్ ఆయిల్ లభించాయి. ఖైదీలకు సరఫరా చేసి, పెద్దమొత్తంలో డబ్బులు గుంజేవాడినని ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.భర్త చేతిలో భార్య హతందొడ్డబళ్లాపురం: తాగిన మత్తులో భర్త, భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన హాసన్ జిల్లా చన్నరాయపట్టణ హిరిసావె గ్రామంలో జరిగింది. వివరాలు.. రేఖ (38), రఘు (40)కు 18 సంవత్సరాల క్రితం పెళ్లయింది. రఘు మద్యానికి బానిసై నిత్యం తాగివచ్చి భార్యతో గొడవపడేవాడు. బుధవారం సాయంత్రం ఇద్దరు పిల్లలు ట్యూషన్కి వెళ్లిన సమయంలో రగడకు దిగాడు, కై పులో కత్తి తీసుకుని భార్యను పొడిచి హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు హంతకుని కోసం శోధిస్తున్నారు.బిల్ కలెక్టర్, కొడుకు దాడి..● దళితుని నరికివేతతుమకూరు: తమకు తాగునీటి సౌకర్యం కల్పించాలని దళిత సముదాయంవారు కోరగా, వారితో గొడవ పడిన పంచాయతీ బిల్ కలెక్టర్, పంచాయతీ సభ్యడు కలిసి ఒకరిని హత్య చేశారు. ఈ దురాగతం హోంమంత్రి సొంత జిల్లా తుమకూరు జిల్లాలోని కొరటిగెరె తాలూకాలోని పోలెహళ్ళి గ్రామంలో జరిగింది. ఆనంద్ (40) హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన బిల్ కలెక్టర్ రామకృష్ణప్ప, అతని కుమారుడు, గ్రామ పంచాయతీ సభ్యుడైన నాగేష్, నాగమణి కొడవలితో నరికి బొలెరో తొక్కించి భయానకంగా చంపారు.గ్రామంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని, తమకు నీటి వసతి కల్పించాలని ఆనంద్ డిమాండ్ చేసేవాడు, గ్రామ పంచాయతీ ద్వారా బోరువేసి నీరివ్వాలని బిల్ కలెక్టర్ను కోరేవాడు. దీంతో అతని మీద కక్ష పెంచుకున్నారు. గురువారం గ్రామంలో రామకృష్ణ, అతని కుమారుడు నాగేష్, నాగమణి అనే మహిళ కలిసి ఆనంద్ మీద వేట కొడవలితో దాడి చేశారు. రోడ్డు మీదే నరికి, ఆపై బొలెరోతో తొక్కించారు. బాధితుడు నిమిషాల్లోనే మరణించాడు. గ్రామానికి చేరుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది, అల్లర్లు జరగకుండా బందోబస్తు ఏర్పాటైంది. -
దసరా పిటిషన్పై తొందరేల?
● అర్జీదారులకు హైకోర్టులో నిరాశ శివాజీనగర: మైసూరు దసరా ప్రారంభోత్సవానికి ప్రముఖ రచయిత్రి బాను ముష్తాక్ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడాన్ని ప్రశ్నిస్తూ దాఖలు చేసిన పిటిషన్ అత్యవసరంగా విచారణకు హైకోర్టు గురువారం నిరాకరించింది. బెంగళూరుకు చెందిన పలువురు పౌరులు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. హిందూ భక్తుల మనోభావాలకు భంగం కలిగించరాదన్నారు. హిందూ ప్రముఖులతోనే దసరా నవరాత్రులను ప్రారంభించాలని పేర్కొన్నారు. కోర్టు ప్రారంభం కాగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బక్రు, న్యాయమూర్తి సీ.ఎం.జోషిలను పిటిషనర్ తరఫు వకీలు విన్నవించారు. ఈ నెల 22న దసరా మహోత్సవాలు ప్రారంభమవుతాయని, కాబట్టి వెంటనే విచారణ జరపాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ, అంత అర్జంటు ఏమీ లేదని, నాలుగు రోజుల్లో విచారణకు వస్తుందని స్పష్టంచేశారు. మరోవైపు మైసూరులో దసరా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ప్యాలెస్కు లైటింగ్, రంగుల పనులు జరుగుతున్నాయి. కాబోయే జంటకు నూరేళ్లు● బైక్ను ఢీకొన్న కారు, ఇద్దరూ మృతి శివమొగ్గ: ఆలయ దర్శనం కోసం బైక్పై బయలుదేరిన కాబోయే భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిన విషాద ఘటన జిల్లాలోని శికారిపుర తాలూకాలో బుధవారం జరిగింది. అంబారగొప్ప సమీపంలోని కుట్టళ్లి క్రాస్– శిరాళకొప్ప రోడ్డులోని కిత్తూరు రాణి చెన్నమ్మ పాఠశాల వద్ద బైక్ను కారు ఢీకొనింది. శికారిపుర తాలూకా మట్టికోటె గ్రామ నివాసి రేఖ (22), బసవనగౌడ (24) తీవ్ర గాయాలతో మరణించారు. గత శ్రావణ మాసంలో వీరిద్దరి వివాహ నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెలలో పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించారు. బుధవారం కాబోయే భార్య ఇంటికి వచ్చిన బసవనగౌడ బైక్లో ఆమెతో కలిసి సమీపంలోని గుడికి వెళుతున్నారు. ఈ సమయంలో మారుతీ ఎకో కారు ఢీకొనడంతో బైక్ ఎగిరి దూరంగా పడింది. తీవ్రంగా గాయపడిన జంట అక్కడే కన్నుమూసింది. పోలీసులు కారు డ్రైవర్పై కేసు నమోదు చేశారు. సమైక్యంగా నిమజ్జనం శివమొగ్గ: శివమొగ్గ నగరంలోని పలు ప్రాంతాలలో వినాయక మండపాల నుంచి బుధ, గురువారం గణేశుల నిమజ్జన యాత్ర మత సమైక్యతకు చిహ్నంగా సాగింది. వందలాది మంది హిందువులతో పాటు ముస్లింలు పాల్గొని సుహృద్భావాన్ని చాటుకున్నారు. దొడ్డపేటె పరిధిలోని వినాయకుల నిమజ్జనంలో స్థానిక ముస్లింలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. గణపతి పూలదండలు వేసి ఊరేగింపును స్వాగతించారు. తుంగా నగరలోని ఇందిరానగరలోనూ ముస్లింలు పాల్గొన్నారు. -
ప్రైవేటు బస్సులో డ్రైవర్ అకృత్యం
శివాజీనగర: బస్సులో ఒంటరిగా ప్రయాణించిన బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక డ్రైవర్కు బాలిక కుటుంబీకులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున బెంగళూరులో బసవేశ్వర సర్కిల్లో జరిగింది. వివరాలు.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రైవేటు స్లీపర్ బస్సు బయల్దేరింది. అందులో ఓ బాలిక (15) బెంగళూరుకు వస్తోంది. మొబైల్ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో చార్జింగ్ చేయాలని డ్రైవర్ను కోరింది. కొంతసేపటి తరువాత బాలిక మొబైల్ ఇవ్వాలని అడిగితే, ముద్దివ్వాలని డ్రైవర్ అరిఫ్ (41) బాలికను ఒత్తిడి చేశాడు. తరువాత బాలిక తన సీటు వద్దకు వెళ్లి నిద్రపోయింది, డ్రైవర్ బాలిక వద్దకు వెళ్లి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది తట్టుకోలేక బాలిక తల్లికి ఫోన్ చేసి చెప్పింది. బస్సు సిటీకి రాగానే బాలిక తల్లి, సోదరుడు నిలిపి డ్రైవర్ అరిఫ్ను ప్రశ్నించారు. డ్రైవర్ తప్పయిపోయిందంటూ చేతులెత్తి మొక్కి వేడుకున్నాడు. బాలిక కుటుంబీకులు అతని బట్టలను విప్పి చితకబాదారు. ఇంతలో పోలీసులు చేరుకొని వారిని అడ్డుకొని డ్రైవర్ని అరెస్ట్ చేశారు. బాలిక తల్లి మీడియాతో మాట్లాడుతూ డ్రైవర్ ఆమెను తీవ్రంగా సతాయించాడని, అతనిని వదిలిపెట్టేది లేదని స్పష్టంచేసింది. ఒంటరి బాలికపై లైంగిక వేధింపులు దేహశుద్ధి చేసిన కుటుంబీకులు -
అన్నభాగ్య బియ్యానికి రెక్కలు
సాక్షి బళ్లారి: అన్నభాగ్య బియ్యం ప్రస్తుతం రేషన్ షాపుల నుంచి, కార్డు దారుల నుంచి దేశ విదేశాలకు అక్రమంగా సరఫరా అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఉత్తర కర్ణాటక పరిధిలో యాదగిరి జిల్లాతో పాటు బళ్లారి, రాయచూరు, కొప్పళ, గదగ్ తదితర జిల్లాల్లో రేషన్ బియ్యం ప్రతి రోజు ఎక్కడో ఒక చోట పట్టుపడుతుండటం అక్రమంగా రేషన్ బియ్యం సరఫరా అవుతోందనడానికి సాక్ష్యంగా నిలుస్తోంది. యాదగిరి జిల్లాలో దాదాపు 4 వేల క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకోవడంతో పాటు రెండు లారీలు సీజ్ చేయడం, నలుగురు ట్రేడింగ్ కంపెనీల యజమానులపై కేసులు నమోదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రేషన్ బియ్యం ప్రతి నెల, ఒక్కొక్క కార్డు లబ్ధిదారుడికి 8 కేజీల చొప్పున సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు రెండు కేజీల జొన్నలు కూడా రేషన్ కార్డు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి సోనామసూరి బియ్యం కంటే మెరుగ్గా నిగనిగలాడే విధంగా తయారు చేసి ఎగుమతి చేస్తుండటం వెలుగులోకి వచ్చింది. పేదల నుంచి తక్కువ ధరకే కొనుగోలు లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకే కిలో రూ.8 లేదా రూ.10లకే కొనుగోలు చేసి వాటికి పాలిష్ చేసి బియ్యం సంచులకు కూడా కొత్త రకం బ్రాండ్లు పెట్టి వెలుగులోకి రావడంపై యాదగిరి జిల్లాలో గురుమఠకల్ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర, శ్రీలక్ష్మీద బాలాజీ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలపై అధికారులు మెరుపుదాడి చేసి రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి సోనామసూరి బియ్యం కంటే తెల్లగా ఉండేలా తయారు చేసి ప్రత్యేక బ్య్రాండ్లతో ఎగుమతి చేస్తుండటంపై అధికారులు సంబంధిత వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేశారు. ఒక్క యాదగిరి జిల్లాలోనే కాకుండా ఈ అక్రమ బియ్యం ఎగుమతి చేస్తుండటం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొనసాగుతోందనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కార్డు లబ్ధిదారుడికి 5 కేజీల నుంచి 10 కేజీల బియ్యాన్ని పెంచిన సంగతి తెలిసిందే. మాయమాటలు చెప్పి మోసగిస్తూ.. పేదల కడుపు నింపాల్సిన ఈ బియ్యాన్ని తినడానికి పనికి రావని కొందరు డీలర్లు మాయమాటలు చెప్పి ప్రతి నెల డబ్బులు ఇస్తామని తమకే బియ్యాన్ని ఇవ్వాలని చెబుతూ లబ్ధిదారుల నుంచి నేరుగా తీసుకుని పాలిష్ చేసే రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యానికి మరింత మెరుగులు దిద్ది కొత్త బ్రాండ్లలోకి మార్చి అధిక ధరలకు బియ్యం అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాల్లో కర్ణాటక అన్నభాగ్య రేషన్ బియ్యానికి 25 కేజీల ప్యాకెట్ను ఏకంగా రూ.7 వేలకు పైగా విక్రయాలు సాగిస్తున్నారు. అక్రమంగా సేకరించిన ఈ బియ్యం ఆర్గానిక్ అని చెబుతూ బహిరంగ మార్కెట్లో ఉన్నదాని కంటే ధర పెంచి సొమ్ము చేసుకుంటున్నట్లు చర్చ నడుస్తోంది. గత కొన్నేళ్లుగా వివిధ జిల్లాల నుంచి రేషన్ బియ్యం డీలర్ల నుంచి, కార్డు లబ్దిదారుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి అక్రమంగా సరఫరా చేస్తున్నప్పటికీ తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నారే కానీ ప్రతి నెల రేషన్ డీలర్ల నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కట్టడి చేయకపోవడంతో పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం బస్తాలు పాలిష్ చేసిన తర్వాత వివిధ బ్రాండ్లతో సిద్ధం చేసిన బియ్యం ప్యాకెట్లుయథేచ్ఛగా దేశ విదేశాలకు అక్రమ సరఫరా పాలిష్ చేసి ప్రత్యేక బ్రాండ్లతో దేశ, విదేశాలకు ఎగుమతి పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్న వైనంఒక్కొక్క కుటుంబంలో నలుగురు లేదా ఐదు మంది ఉంటే ఆ కుటుంబానికి 40 కేజీల నుంచి 50 కేజీల వరకు రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం లబ్ధిదారులకు ప్రతి నెల సరఫరా చేస్తున్నామని ప్రభుత్వ పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ ఆ బియ్యం పేదలు నిజంగా ఉపయోగిస్తున్నారా లేదా అక్రమంగా రేషన్ షాపు డీలర్లు, సంబంధిత ఉన్నతాధికారులు కలిసి కట్టుగా కుమ్మకై ్క రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నారా? అన్నది కూడా పట్టించుకోకపోవడంతో రేషన్ బియ్యం యథేచ్ఛగా దేశ విదేశాలకు అక్రమంగా సరఫరా అవుతుండటం గమనార్హం. విమానాల్లో, సముద్ర మార్గం గుండా కూడా ఎగుమతులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ముంబై తదితర ప్రాంతాలకు ఎగుమతి చేయడంతో పాటు అక్కడి నుంచి సింగపూర్, అరబ్ దేశాలకు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. దీంతో కర్ణాటక నుంచి అన్నభాగ్య రేషన్ బియ్యం పెద్ద స్థాయిలో అక్రమంగా బియ్యం వ్యాపారం చేసే దళారీల వద్ద రూ.కోట్లాది మేర చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. -
హాలబావిలో ప్రబలిన డెంగీ
● 300 మందికి సోకిన వ్యాధి ● హడలెత్తుతున్న గ్రామస్తులు రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా హాలబావిలో 300 మందికి డెంగీ వ్యాధి సోకడంతో గ్రామస్తులు బెదిరి పోతున్నారు. గ్రామంలో అధికారులు, పంచాయతీ సభ్యులు స్వచ్ఛతను చేపట్టకుండా నిర్లక్ష్యం వహించడంతో వ్యాధి సోకిందన్నారు. ఆనెహొసూరు, ఈచనాళ, లింగసూగూరు సర్కారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 20 రోజుల క్రితం తాలూకా స్థాయి అధికారులు గ్రామాన్ని సందర్శించి పీడీఓలకు, సభ్యులకు అదేశాలు జారీ చేశారు. గ్రామంలో పారిశుధ్యం, మురుగు కాలువల స్వచ్ఛత, వీధుల పరిశుభ్రతను చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయి అధికారుల నిర్లక్ష్యమే డెంగీ వ్యాధి సోకడానికి కారణమైంది. గ్రామానికి అంబులెన్సు సౌకర్యం లేకపోవడం, గ్రామానికి కి.మీ.దూరం ప్రధాన రహదారి ఉండడం తాలూకా ఆరోగ్య అధికారి స్పందించక పోవడంతో ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. లింగసూగూరు తహసీల్దార్ సత్యమ్మ హుటాహుటిన హాలబావిలో పర్యటించి ప్రజలకు సత్వర సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆత్మహత్యల నియంత్రణ అందరి బాధ్యత రాయచూరు రూరల్: ఆత్మహత్యల నివారణ మనందరి కర్తవ్యమని రాయచూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి స్వాతిక్ పిలుపు ఇచ్చారు. బుధవారం జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడకుండా వారిలో చైతన్యం కల్పించాలన్నారు. నిత్య జీవితంలో పలు విధాలుగా మానవుడు కష్టాల పాలై ఆత్మహత్యకు సిద్ధపడకుండా నివారణకు ముందుండాలన్నారు. జాతాలో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు సురేంద్రబాబు, గణేష్, షాకీర్, మనో వైద్య విభాగాధికారిణి యశోధ, మనోహర్ పత్తార్, సరోజలున్నారు. సైబర్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త రాయచూరు రూరల్: ప్రజలు సైబర్ నేరాలు, వంచనల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని రిటైర్డ్ డీఎస్పీ శ్రీధర్ దొడ్డి అన్నారు. బుధవారం నగరంలోని ప్రైవేట్ హోటల్లో సైబర్ నేరాల నియంత్రణపై ప్రజలకు, యువకులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో రోజుకు 7 వేల సైబర్ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు 700 కేంద్రాల్లో సైబర్ నేరాల నియంత్రణపై ప్రచారాన్ని రాయచూరు నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలు పోలీసులతో సహకరిస్తే సైబర్ నేరాలను అరికట్టవచ్చన్నారు. ప్రజలకు బజాజ్ ఫైనాన్స్ బ్యాంకు అధికారులు, పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సదర్ బజార్ సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, బజాజ్ ఫైనాన్స్ బ్యాంకు అధికారులు వెంకటేష్, రేవణ్ణ హెగ్డేలున్నారు. చాకుతో పొడిచిన ఇద్దరు అరెస్ట్ హుబ్లీ: వ్యక్తిగత కక్షతో ఓ వ్యక్తిని చాకుతో పొడిచిన కేసులో ఇద్దరు నిందితులను అశోక్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. దేవాంగ పేట చమన్సాబ్, యూనుస్ నాయక్ వ్యక్తిగత కక్షతో భీమరాజ్పై దేవాంగపేటలో చాకుతో దాడి చేశారు. అలాగే డివైడర్ ఢీకొన్న ఫలితంగా గాయపడి కేఎస్ఆర్పీ పోలీస్ సిబ్బంది చికిత్స ఫలించక మంగళవారం మృతి చెందారు. కమలాపుర నివాసి దినేష్ వాడ్కర్ మృతుడు. 10 రోజుల క్రితం జేఎస్ఎస్ కళాశాల వద్ద రోడ్డులో డివైడర్కు తన బైక్ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన చికిత్స ఫలించక మృతి చెందినట్లు ధార్వాడ ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. గంజాయి విక్రేత అరెస్టు గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తి స్థానిక కేశ్వాపుర సుళ్య రోడ్డు హోటల్ సమీపంలో కేశ్వాపుర పోలీసులు అరెస్ట్ చేశారు. గణేష్ పేట నివాసి సునీల్ బళ్లారి 250 గ్రాముల గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేశ్వాపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో యువకుడిని కిడ్నాప్ చేసి దాడి చేసినట్లుగా కేసు నమోదైంది. ప్రియురాలితో వెళుతున్న యువకుడిని ముగ్గురు, నలుగురితో ఉన్న ఆటోలో కిడ్నాప్ చేసి కార్వాడ రోడ్డు ఏసిగిమడ్డి వద్ద బయలు ప్రదేశానికి తీసుకెళ్లి ప్రాణాలు తీస్తామని బెదిరించిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. యువతి ఆమె ఊరిలో వదలిపెట్టాలని తీసుకెళుతున్న క్రమంలో మలికా జాన్, పత్తేష్ తదితర మరో ఇద్దరు కలిసి నువ్వు ప్రేమించేదానికి వేరెవారు దొరకలేదా? అని బాగా కొట్టి కత్తి చూపించి తనను చంపేస్తామని బెదిరించారని బాధితుడు మణికంఠ పాత హుబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాధితుడిని కేఎంసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
సామాజిక సమస్యగా ఆత్మహత్యలు
హుబ్లీ: ప్రపంచంలో ప్రతి సెకనుకు లక్ష మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధార్వాడ డీమ్హాన్స్ ఆస్పత్రి మాజీ డైరెక్టర్, కేసీఎం మానసిక విభాగం హెచ్ఓడీ డాక్టర్ మహేష్ దేశాయి పేర్కొన్నారు. ఆయన ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా కేఎంసీ ఆస్పత్రి ఆవరణలోని 15వ మానసిక ప్రత్యేక వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు ఈ ఏడాది మానసిక రోగులను చైతన్య పరిచే దిశలో ప్రతి ఏటా సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మనోవ్యాధికి మందులేదన్నది పూర్వకాలం నాటి ఈ సందర్భంలోను చెప్పిన మాట అయితే ఆధునిక వైద్య శాస్త్రంలో వివిధ రకాలైన మనోవ్యాధులకు చక్కటి కౌన్సిలింగ్తో పాటు అత్యాధునిక ఔషధాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 10 లక్షల మంది ఒక ఏడాదిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అలాగే 40 సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. చాలా మంది ఇప్పటికీ మనోవ్యాధిపై మూఢ నమ్మకాలతో ఆ వ్యాధి ముదిరిపోయేలా చేసి పిచ్చిపిచ్చి అంటూ లేనిపోని అపార్థాలు, అనర్థాలతో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు. వివిధ కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందే కానీ తగ్గడం లేదన్నారు. వ్యాధులపై అవగాహన అవసరం అక్షరాస్యులు కాని నిరాక్షరాసులు కాని మనోవాధ్యులపై చక్కటి అవగాహన పెంచుకొని తమ సమీపంలోని ఆశా వర్కర్ లేదా అంగన్వాడి కార్యకర్త, ప్రాథమిక సముదాయ వైద్య చికిత్స కేంద్రాలతో పాటు తాలూకా ఆరోగ్య కేంద్రం, ప్రతి జిల్లా ఆస్పత్రిలోను మనోవాధ్యులకు సంబంధించిన ప్రత్యేక విభాగం 24 గంటల పాటు పని చేస్తుందని ఆయన వివరించారు. సంబంధిత సహాయవాణి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి మనోవ్యాధితో బాధపడే వ్యక్తిని సకాలంలో మనో వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లాలని డాక్టర్ మహేష్ దేశాయి సూచించారు. సాధారణంగా మద్య వ్యసని చికిత్స అందించే సమయంలో ఫిరిటోనిన్ అనే ఔషధాన్ని ఇచ్చి ఆ వ్యసనం నుంచి క్రమేణ మనసుకు విరక్తి కలిగేలా చేస్తామన్నారు. తాను డిమ్హాన్స్ ఆస్పత్రి డైరెక్టర్గా ఉన్న సమయంలో మద్య వ్యసన పరులకు చక్కగా వైద్యం అందించాక వారిలో మద్యవ్యసనం నుంచి విముక్తి పొందాక అలాంటి వారి చేతే ఎందరో మద్యవ్యసనపరులకు కౌన్సిలింగ్ చేయించి మద్యపానం వల్ల కలిగే సామాజిక, ఆర్థిక నష్టాలు, గౌరవ మర్యాదలకు భంగం ముఖ్యంగా శారీరక, మానసిక ఇబ్బందులను ఆయన వివరించారు. ఆయా విభాగాల మనోవైద్య నిపుణులు, పీజీ డాక్టర్లు, హౌస్ సర్జన్ వైద్యులతో పాటు సదరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మద్యవ్యసన పరులు, ఇతర మానసిక సమస్యల బాధితులు పాల్గొన్నారు. -
ఆరోగ్యం, భద్రత కాపాడుకోవాలి
హొసపేటె: నిర్మాణ పనుల ప్రారంభానికి అనేక అడ్డంకులు ఉన్నా మాజీ ఎమ్మెల్యే ఎన్.వై.గోపాలకృష్ణ కృషి వల్ల అనేక పాఠశాల భవనాలు నిర్మించామని, ఇప్పుడు మరిన్ని భవనాలు అవసరమని విజయనగర జిల్లా కూడ్లిగి అసెంబ్లీ ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నగరంలో ప్రాథమిక సౌకర్యాలను అందించడానికి తాను చొరవ తీసుకుంటానని ఆయన అన్నారు. తాలూకాలోని హిరేహెగ్డాల్ గ్రామంలో కిత్తూరు రాణి చెన్నమ్మ పీయూ కాలేజీ విద్యార్థులకు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. విద్యార్థులు తమ చదువు మీద శ్రద్ధ పెట్టి ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలన్నారు. తహసీల్దార్ వీకే.నేత్రావతి, పట్టణ పంచాయతీ అధ్యక్షుడు కావళ్లి శివప్ప నాయక్, మాజీ అధ్యక్షుడు ఉదయ్ ఎస్.జన్ను, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.గురుసిద్దనగౌడ, ప్రిన్సిపాల్ శోభ, తాలూకా సాంఘిక సంక్షేమ అధికారి జగదీష్ దిడగూరు, తాలూకా ఎస్పీ అధికారి మహబూబ్ బాషా, టీజీ మల్లికార్జునగౌడ్, నాయకులు కందగల్లు పరసప్ప, జింకల్ నాగమణి, డాని రాఘవేంద్ర, హిరే హెగ్డాల్ గ్రామాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ వెల్లడి ఫస్టియర్ పీయూసీ విద్యార్థులకు స్వాగతం -
టమాటా రైతులకు పరిహారం అందించాలి
శ్రీనివాసపురం: చీడపీడలు, నకిలీ విత్తనాలతో పంట నష్టపోయిన టమాట రైతులకు ఎకరాలకు రూ. 2 లక్షలు చొప్పున పరిహారం అందించాలని రైతు సంఘం పదాధికారులు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం రైతు నారాయణగౌడ తోటలో తెగుళ్లతో నష్టపోయిన పంటను పరిశీలించారు. నాయకులు మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో రైతులు పంటలు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంచాలకుడు బంగవాది నారగరాజగౌడ, తా అధ్యక్షుడు తేర్నహళ్లి అంజినప్ప, చిక్క మునివెంకటప్ప , నాగరాజు పాల్గొన్నారు. -
కంది పంటకు సీడీ వ్యాధి
హొసపేటె: గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వర్షాకాలంలో విత్తిన జొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశనగ సహా వివిధ పంటలు దెబ్బతిన్నాయి. అయితే గ్రామ లెక్కాధికారి, వ్యవసాయ అధికారులు నష్టాన్ని చూసి పట్టించుకోకపోవడం, దెబ్బతిన్న పంటలను పరిశీలించక పోవడం రైతులను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఈ సంవత్సరం విజయనగర జిల్లాలో కూడ్లిగి, హగరి బొమ్మనహళ్లి, హరపనహళ్లి, హడగలి తాలూకాల పరిధిలోని వివిధ గ్రామాల్లో వర్షాకాలంలో విత్తిన పంటలు నీటితో నిండిపోయాయి. దీని వల్ల జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశెనగ సహా వివిధ పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా కుళ్లిపోతున్న, మార్కెట్లో మంచి ధర లభించని జొన్న, పొద్దుతిరుగుడు పంటల పరిస్థితి తక్కువగా ఉండటంతో రైతులు బాధపడుతున్నారు. వివిధ పంటల గురించి రైతులు సోమలింగప్ప, కాళిదాసు, సిద్దయ్య తదితరులు మాట్లాడుతూ మేం అప్పులు చేసి బీన్స్, జొన్న, పొద్దుతిరుగుడు పువ్వులు, నువ్వులు, వేరుశెనగ మొదలైన వివిధ పంటలను విత్తాం. విత్తిన తర్వాత పంటలు బాగా పెరిగాయి. అయితే నిరంతర వర్షాల కారణంగా పంట నష్టం ఆందోళనకు గురి చేస్తోంది. దెబ్బతిన్న పంటలను పరిశీలించి న్యాయం చేయాలని వివిధ గ్రామాల రైతులు సంబంధిత గ్రామ అకౌంటెంట్లు, వ్యవసాయ అధికారులకు విజ్ఞప్తి చేశారు. చేతికి వచ్చిన పంటకు దెబ్బ తీవ్ర కష్టనష్టాల్లో అన్నదాత -
ఒపెక్ ఆస్పత్రిలో న్యాయమూర్తి తనిఖీ
రోగులతో మాట్లాడుతున్న జడ్జి స్వాతిక్ప్రత్యేక అధికారి రమేష్ సాగర్తో జడ్జి స్వాతిక్రాయచూరు రూరల్: ఒపెక్ ఆస్పత్రిని రాయచూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి స్వాతిక్ సందర్శించారు. బుధవారం ఒపెక్ ఆస్పత్రిలో ప్రతి వార్డును పరిశీలించి రోగుల నుంచి వివరాలు సేకరించారు. వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అనే అంశాలపై సుదీర్ఘంగా వారితో మాట్లాడారు. మరో వైపు శిక్షణ పొందుతున్న వైద్యులను పిలిచి రోగులకు ఎలా చికిత్స చేస్తున్నారో ఆరా తీశారు. ఒపెక్ ఆస్పత్రి ప్రత్యేక అధికారి రమేష్ సాగర్ను పిలిచి వివిధ విభాగాల్లో రోగులకు సమానంగా చికిత్స జరిగేలా చూడాలని సూచించారు. -
భార్యను హతమార్చి.. దృశ్యం సినిమా
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పలుచోట్ల వైవాహిక సంబంధాలు పక్కదారులు పట్టి అవహేళనకు గురవుతున్నాయి. భార్య, లేదంటే భర్త పరాయి మోజులో పడి హత్యలకు వెనుకాడడం లేదు. ఇలా కుటుంబాలు వీధిన కూడా పడుతున్నాయి. ఆరు నెలల గర్భిణి అయిన భార్యను హతమార్చిన లాయర్.. ప్రమాదంలో చనిపోయిందని ప్రచారం చేసుకున్నాడు. దృశ్యం సినిమాను తలపించే ఈ హత్యోదంతం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉగార్ బీకే గ్రామంలో చోటుచేసుకుంది. చైతాలి (23)ని ఆమె భర్త ప్రదీప్ (28) హత్య చేశాడు. కారు యాక్సిడెంట్ అని.. జిల్లా ఎస్పీ భీమాశంకర్ గుళేద్ తెలిపిన వివరాల మేరకు... 7వ తేదీ రాత్రి ప్రదీప్ కాగవాడ పోలీస్స్టేషన్కి ఫోన్ చేసి తమ కారుకు యాక్సిడెంట్ జరిగిందని, భార్య చైతాలి చావుబతుకుల మధ్య ఉందని, వెంటనే రావాలని, భార్యను కాగవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసికెళ్తున్నానంటూ చెప్పాడు. పోలీసులు ఆ ఆస్పత్రికి వెళ్లి చూడగా అక్కడ ఎవరూ లేరు. ప్రదీప్కి ఫోన్ చేయగా తన భార్యను మహారాష్టలోని మీరజ్ ఆస్పత్రికి తీసుకువచ్చానని, అయితే చనిపోయిందని చెప్పాడు. అందరికీ అదే మాట చెప్పసాగాడు. అతని తీరు మీద పోలీసులకు అనుమానం వచ్చింది. ప్రమాదస్థలికి వెళ్లి చూడగా ఎలాంటి ఘటన జరగలేదని తేలింది. ప్రియురాలి కోసమే దీంతో పోలీసులు ప్రదీప్, అతని మిత్రులు సద్దాం అక్బర్ ఇమాందార్, రాజన్ గణపతి కాంబ్లేను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం కక్కారు. ప్రదీప్, చైతాలిది ప్రేమ వివాహం. అయితే ప్రదీప్కి ఇటీవల మరో యువతితో çసంబంధం ఏర్పడింది. భార్య చైతాలిని అడ్డు తొలగించుకోవాలని కారులో తీసికెళ్లి తలపై కొట్టి హత్య చేశాడు. ఇందుకు స్నేహితులు సహకరించారు. తరువాత మృతదేహాన్ని తరలించి యాక్సిడెంట్ అని ప్రచారం చేశారు. పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేశారు. -
మద్దూరు.. నిమజ్జన హోరు
మండ్య: జిల్లాలోని మద్దూరు పట్టణంలో ఆదివారం రాత్రి గణేష్ విగ్రహ ఊరేగింపు వేళ రాళ్లురువ్వడంతో చెలరేగిన ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతున్నాయి. నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి, దీనిని అనువుగా మార్చుకునేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. బుధవారం వినాయక నిమజ్జనోత్సవం జరిగింది, బెంగళూరు నుంచి బీజేపీ సీనియర్ నేతలందరూ పాల్గొని సిద్దరామయ్య సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు. కాషాయ కోలాహలం నిమజ్జనం సందర్భంగా మద్దూరు కాషాయమయం అయింది. ముందు జాగ్రత్తగా పట్టణ వ్యాప్తంగా వేలాది మంది పోలీసులను మోహరించారు. గణేష్ విగ్రహాలకు అర్చనలు చేసి ఉదయం 11 గంటలకు ఊరేగింపునకు శ్రీకారం చుట్టారు. ఊరేగింపు సాగే రోడ్డులో ప్రార్థనాలయాల ముందు గట్టి పోలీసు బందోబస్తు కల్పించారు. ఊరేగింపునకు ఇరు వైపులా పహారా కాశారు. డీజే శబ్దాల మోతతో సాగిన ఊరేగింపులో విపక్ష నాయకుడు ఆర్.అశోక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, సీఎన్ అశ్వత్థ నారాయణ, ఎమ్మెల్సీ సీటీ రవి కాషాయ జెండాలను పట్టుకుని ముందుకు సాగుతూ హిందూ సంఘాల కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కార్యకర్తలు నాయకులను భుజాలకెత్తుకుని నృత్యం చేశారు. దారి పొడవున భారీగా బాణసంచా పేల్చారు. మద్దూరు నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హిందూ సంఘాల కార్యకర్తలు, జానపద కళాబృందాలు తరలివచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ అతిథిగృహం సర్కిల్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు పేటె వీధి గుండా సాగింది. అనంతరం ఎంసీ రోడ్డు, కొల్లి సర్కిల్ గుండా హొళె ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు కొన్ని గణేష్ విగ్రహాలు చేరుకోగా, అక్కడి నుంచి 5 కిమీ దూరంలోని ఉప్పినకెరె చెరువులో నిమజ్జనం చేశారు. తుగ్లక్ దర్బార్ నడుస్తోంది విజయేంద్ర శివాజీనగర: మద్దూరులో పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైందనేది స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర అన్నారు. ఆయన బెంగళూరులో, మద్దూరులో మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ దర్బార్ నడుస్తోంది, నిజాముల పాలనను గుర్తుకు తెస్తున్నారు, ముఖ్యమంత్రి, హోం మంత్రి వారి ధోరణిని సరిచేసుకోని పక్షంలో శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా మారుతాయని అన్నారు. నిమజ్జనంలో కాషాయ శాలువాను వేసుకుని డ్యాన్స్ చేసిన ఓ ఎస్ఐను ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు తెలిసింది, మనమేమైనా పాకిస్తాన్లో ఉన్నామా? అని ప్రశ్నించారు. రోజురోజుకు పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతోంది. శాంతిభద్రతలు నాశనమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇటువంటి దుర్భుద్ధి వచ్చింది. ఈ ప్రభుత్వానికి హిందువులు ఏమి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఉద్రిక్తత, నిషేధాజ్ఞల మధ్య ఊరేగింపు తరలివచ్చిన బీజేపీ నాయకులు సిద్దరామయ్య ప్రభుత్వంపై ధ్వజం సిద్దు.. పాకిస్తాన్కు వెళ్లిపో బీజేపీ పక్ష నేత అశోక్ మండ్య: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని, కాంగ్రెస్ వారికి దమ్ము ఉంటే గణేష్ విగ్రహ ఊరేగింపుపైకి రాళ్లు విసిరిన వారిపై గూండా చట్టం కింద కేసులు నమోదు చేయాలని బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ డిమాండ్ చేశారు. నిమజ్జన ఊరేగింపులో ఆయన ప్రసంగించారు. ఈ ఘటనను మరిస్తే మనకు ఉనికి లేదన్నారు. సీఎం సిద్దరామయ్యను పాకిస్తాన్కు పంపేయాలని, కర్ణాటకను ఇటలీ, అఫ్ఘనిస్థాన్ కానివ్వబోమన్నారు. కాంగ్రెస్ వారిని ఇలానే వదిలేస్తే రాబోయే రోజుల్లో గణేష్ పండుగనే బ్యాన్ చేస్తారని అన్నారు. సిద్దరామయ్య ముల్లా టోపీ వేసుకుని హిందూలకు టోపీ వేస్తున్నారు. ధర్మస్థలకు వ్యతిరేకంగా అపప్రచారం చేశారు. ముస్లింలపై కేసులను వాపసు తీసుకుంటారు కానీ హిందువులపై కేసులను రద్దు చేయరు అని ఆరోపించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి డీసీ తమ్మణ్ణ, మాజీ ఎంపీ సుమలత అంబరీష్, ఎమ్మెల్యే హెచ్టీ మంజు, పెద్దసంఖ్యలో నేతలు పాల్గొన్నారు. -
అనర్హుల రేషన్ కార్డులకు మంగళం
● అధికారులకు సీఎం ఆదేశం శివాజీనగర: రాష్ట్రంలో అనర్హులు కలిగి ఉన్న బీపీఎల్ రేషన్ కార్డులను తక్షణం రద్దు చేయాలని సీఎం సిద్దరామయ్య అధికారులను ఆదేశించారు. అయితే అర్హత కలిగిన కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దన్నారు. నివాస కార్యాలయం కృష్ణాలో ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. ఇప్పటికే గుర్తించిన 3,65,614 రేషన్కార్డులను రద్దు చేసినట్లు చెప్పారు. అన్నభాగ్య పథకం కింద బియ్యంతో పాటుగా పౌష్టిక ధాన్యం, ఆహార వస్తువులతో కూడిన కిట్ అందజేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు రేషన్ డీలర్షిప్లను పంపిణీ చేయాలన్నారు. ఆహార ధాన్యాలను తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకర్లను అమర్చి నిఘా పెట్టాలన్నారు. పురోగమనంలో ఇళ్ల నిర్మాణం వివిధ వసతి పథకాల క్రింద నిర్మించబడుతున్న ఇళ్లను పూర్తి చేయాలని సీఎం తెలిపారు. పీఎం ఆవాస్ కింద 13,303 ఇళ్లు దాదాపుగా పూర్తయ్యాయి. 25,815 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇళ్ల లబ్ధిదారులకు అనువుగా రుణ సదుపాయాలను కల్పించాలని సూచించారు. స్లంబోర్డు కింద 42 వేల ఇళ్లు, అంబేడ్కర్ వసతి పథకం కింద 94,939 ఇళ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. సమావేశంలో మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్, అధికారులు పాల్గొన్నారు. బీదర్ వర్సిటీ స్కాం.. లోకాయుక్త దాడులు బనశంకరి: బీదర్లోని పశు, మత్స్య యూనివర్శిటీలో భారీగా నిధుల స్కాం నేపథ్యంలో లోకాయుక్త అధికారులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 69 చోట్ల దాడులు నిర్వహించారు. బీదర్ లోకాయుక్త కార్యాలయంలో బెంగళూరువాసి వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణకు నాంది పలికారు. వర్శిటీ అధికారులు, సిబ్బంది ఆఫీసులు, నివాసాలలో తనిఖీలు నిర్వహించారు. బీదర్జిల్లాలో 24 చోట్ల, బెంగళూరులో 31, కొప్పళ 2, చిక్కమగళూరు జిల్లాలో 2, హాసన్, రామనగర, కోలారు, ఉడుపితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 69 చోట్ల సోదాలు నిర్వహించారు. రూ.35 కోట్ల నిధులను స్వాహా చేశారని ఫిర్యాదిదారు వెంటకరెడ్డి ఆరోపించారు. లోకాయుక్త తనిఖీలు చేయగా రూ.22 కోట్లు కై ంకర్యం చేసినట్లు వెలుగుచూసింది. యూనివర్శిటీ కంట్రోలర్ సురేశ్ సహోదరుడు మల్లికార్జున్ చిక్కమగళూరు ఇంటిలో తనిఖీలు చేశారు. లోకాయుక్త డీఎస్పీ తిరుమలేశ్, సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ గనుల కేసులకు కొత్త చట్టం ఆమోదంబనశంకరి/ హుబ్లీ: కర్ణాటక అక్రమ గనుల కేసుల్లో ఆస్తిపాస్తులు జప్తు కోసం రూపొందించిన చట్టానికి గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ బుధవారం ఆమోదం తెలిపారు. గనుల అక్రమాల వ్యవహారంలో నిందితుల ఆస్తులను జప్తు చేయడం, వసూలు చేయడానికి సిద్దరామయ్య ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లు ఇటీవల అసెంబ్లీలో ఆమోదం పొంది రాజ్భవన్కు వెళ్లింది. కమిషనర్ నియామకం: మంత్రి అక్రమ గనుల కేసుల్లో సొత్తులను, ఆస్తుల జప్తు కోసం ఓ ప్రత్యేక కమిషనర్ను నియమించడానికి గవర్నర్ ఆమోదం ఇచ్చారని, ఈ చట్టం 9 నుంచి అధికారికంగా అమల్లో వచ్చిందని రాష్ట్ర న్యాయ, అసెంబ్లీ మంత్రి హెచ్కే పాటిల్ తెలిపారు. గదగ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని మైనింగ్ రంగంలో లెక్కలేనంత సంఖ్యలో కాంట్రాక్టర్లు, రవాణదారులు, నిలువ చేసేవారు, కొనుగోలుదారులతో పాటు దళారులు ఉన్నారన్నారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకోవడానికి ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. -
రిజర్వేషన్లను పెంచకుంటే యుద్ధమే
శివాజీనగర: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో తమకు అన్యాయం జరిగిందని, నాగమోహన్దాస్ నివేదికను రద్దు చేయాలని బంజార, కొరమ, కొరచ, భోవి సామాజిక వర్గపు జనం, నాయకులు భారీఎత్తున ధర్నా చేపట్టారు. బుధవారం బెంగళూరు ఫ్రీడం పార్కులో జరిగిన ఈ ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలవచ్చారు. కొందరు అక్కడే గుండు గీయించుకొని, నోర్లు కొట్టుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. కొందరు టైర్లకు నిప్పు పెట్టారు. గురువారం జరిగే కేబినెట్ భేటీలో నాగమోహన్దాస్ నివేదికను రద్దుచేసి, తమ వర్గాలకు శాసీ్త్రయంగా రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేశారు. ఆయా సముదాయాల నాయకులు ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. తమ వర్గాలకు ప్రత్యేకంగా 5 శాతం అంతర్గత రిజర్వేషన్ను ఇవ్వాలి అని పలు డిమాండ్లను వినిపించారు. వాస్తవ జనసంఖ్య ఆధారంగా కేటాయించాలన్నారు. సీఎం, డీసీఎంలు నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బంజార, కొరమ, బోవి వర్గాల ధర్నా -
టెన్త్ బాలికపై ర్యాగింగ్, లైంగిక దాడి
బనశంకరి: సిలికాన్ సిటీలో దారుణ ఘటన వెలుగుచూసింది. పదో తరగతి చదివే బాలికపై పీయూసీ చదివే అబ్బాయి వికృత చర్యలకు పాల్పడి, లైంగిక దాడికి ఒడిగట్టిన ఘటన వెలుగుచూసింది. బన్నేరుఘట్టలోని ఓ ప్రైవేటు విద్యాలయం హాస్టల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బాధిత బాలిక కొత్తగా ఈ పాఠశాల, హాస్టల్లో చేరింది. అయితే కొందరు విద్యార్థులు క్లాసులో తనను ర్యాగింగ్ చేస్తున్నారని వార్డెన్, ప్రిన్సిపాల్కు ఆమె ఫిర్యాదు చేసింది. మాపైనే ఫిర్యాదు చేస్తావా అని కొందరు టెన్త్ , పీయూసీ విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు బాలికపై ఓ పీయూసీ విద్యార్థి బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇనుప హ్యాంగర్ తో చితకబాదాడు, దుస్తులు విప్పించి నృత్యం చేయించి వికృతంగా ప్రవర్తించారు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఐదుమంది విద్యార్థులు, ప్రిన్సిపాల్, వార్డెన్ మీద బన్నేరుఘట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కామాంధునికి 30 ఏళ్ల జైలు దొడ్డబళ్లాపురం: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కామాంధునికి 30 ఏళ్ల జైలు శిక్ష,రూ.10 వేల జరిమానా విధిస్తూ బెళగావి జిల్లా చిక్కోడి కోర్టు తీర్పు చెప్పింది. చిక్కోడి తాలూకా నిప్పాణి నివాసి ఆకాశ్, ఆరేళ్ల కిందట బాలిక మీద అఘాయిత్యం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నిప్పాణి పోలీసులు దర్యాప్తు చేసి చార్జ్షీట్ సమర్పించారు. సెషన్స్ కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో 30 ఏళ్ల కారాగారవాసం, జరిమానా విధించింది. బాధిత బాలికకు ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఈడీ కస్టడీకి ఎమ్మెల్యే సతీశ్ బనశంకరి: ఇనుప ఖనిజం చోరీ, అక్రమ తరలింపు కేసులో, అక్రమ నగదు బదిలీ ఆరోపణలతో కార్వార– అంకోలా కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్సైల్ ని ఈడీ అరెస్టు చేసింది, ఆయనను బుధవారం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి సంతోష్ గజాననభట్ ఈ నెల 12 వరకు ఈడీ కస్టడీకి ఆదేశించారు. ఉత్తరకన్నడ జిల్లా బెలేకేరి ఓడరేవులో సీబీఐ సీజ్ చేసి ఉంచిన వేలాది టన్నుల ఐరన్ ఓర్ను అక్రమంగా ఎగుమతి చేశారనే కేసులో సతీశ్ సైల్ కు ప్రజాప్రతినిధుల కోర్టు 7 ఏళ్లు జైలుశిక్షను విధించడం తెలిసిందే. ఆయన హైకోర్టులో అప్పీల్ చేయగా, కోర్టు శిక్షను నిలుపుదల చేయడంతో భారీ ఊరట దక్కింది. ఇంతలోనే ఈడీ రంగంలోకి దిగింది. గత నెలలో ఇళ్లలో సోదాలు చేసి రూ.13 కోట్ల విలువచేసే డబ్బు, బంగారం తదితరాలను సీజ్ చేసింది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఈడీ ఆఫీసుకు విచారణకు పిలిచి అరెస్టు చేశారు. వీరేంద్ర పప్పి, సైల్ వంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఈడీ వరుస దాడులతో వారిలో కలవరం నెలకొంది. నేపాల్ నుంచి తరలిస్తాం: సీఎం శివాజీనగర: నేపాల్లో రాజకీయ సంక్షోభం, అల్లర్లు పెచ్చుమీరాయి. కర్ణాటక నుంచి వెళ్లిన పర్యాటకులు, ఇతరులు అక్కడ ఇరుక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఖాట్మండ్ విమానాశ్రయంలో చిక్కుకొన్న 39 మంది కన్నడిగులను క్షేమంగా రాష్ట్రానికి తీసుకొస్తామని సీఎం సిద్దరామయ్య చెప్పారు. కన్నడిగులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. -
భార్యను హతమార్చి.. దృశ్యం సినిమా
దొడ్డబళ్లాపురం: పలుచోట్ల వైవాహిక సంబంధాలు పక్కదారులు పట్టి అవహేళనకు గురవుతున్నాయి. భార్య, లేదంటే భర్త పరాయి మోజులో పడి హత్యలకు వెనుకాడడం లేదు. ఇలా కుటుంబాలు వీధిన కూడా పడుతున్నాయి. ఆరు నెలల గర్భిణి అయిన భార్యను హతమార్చిన లాయర్.. ప్రమాదంలో చనిపోయిందని ప్రచారం చేసుకున్నాడు. దృశ్యం సినిమాను తలపించే ఈ హత్యోదంతం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉగార్ బీకే గ్రామంలో చోటుచేసుకుంది. చైతాలి (23)ని ఆమె భర్త ప్రదీప్ (28) హత్య చేశాడు. కారు యాక్సిడెంట్ అని.. జిల్లా ఎస్పీ భీమాశంకర్ గుళేద్ తెలిపిన వివరాల మేరకు... 7వ తేదీ రాత్రి ప్రదీప్ కాగవాడ పోలీస్స్టేషన్కి ఫోన్ చేసి తమ కారుకు యాక్సిడెంట్ జరిగిందని, భార్య చైతాలి చావుబతుకుల మధ్య ఉందని, వెంటనే రావాలని, భార్యను కాగవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసికెళ్తున్నానంటూ చెప్పాడు. పోలీసులు ఆ ఆస్పత్రికి వెళ్లి చూడగా అక్కడ ఎవరూ లేరు. ప్రదీప్కి ఫోన్ చేయగా తన భార్యను మహారాష్టలోని మీరజ్ ఆస్పత్రికి తీసుకువచ్చానని, అయితే చనిపోయిందని చెప్పాడు. అందరికీ అదే మాట చెప్పసాగాడు. అతని తీరు మీద పోలీసులకు అనుమానం వచ్చింది. ప్రమాదస్థలికి వెళ్లి చూడగా ఎలాంటి ఘటన జరగలేదని తేలింది. ప్రియురాలి కోసమే దీంతో పోలీసులు ప్రదీప్, అతని మిత్రులు సద్దాం అక్బర్ ఇమాందార్, రాజన్ గణపతి కాంబ్లేను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం కక్కారు. ప్రదీప్, చైతాలిది ప్రేమ వివాహం. అయితే ప్రదీప్కి ఇటీవల మరో యువతితో సంబంధం ఏర్పడింది. భార్య చైతాలిని అడ్డు తొలగించుకోవాలని కారులో తీసికెళ్లి తలపై కొట్టి హత్య చేశాడు. ఇందుకు స్నేహితులు సహకరించారు. తరువాత మృతదేహాన్ని తరలించి యాక్సిడెంట్ అని ప్రచారం చేశారు. పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేశారు. అరైస్టెన ఇతర నిందితులు లాయర్ ఘాతుకం బెళగావి జిల్లాలో కిరాతకం -
కాఫీ సీమలో పసిడి వేట!
సాక్షి, బెంగళూరు: పసిడి ధరలు భగ్గుమంటున్న సమయంలో కర్ణాటకలో పలుచోట్ల బంగారు ఖనిజ నిక్షేపాల ఉన్నట్లు గుర్తించారు. కాఫీ తోటలకు, ప్రకృతి సౌందర్యంతో టూరిజానికి ప్రసిద్ధిగాంచిన చిక్కమగళూరు జిల్లాలోని తరీకెరె తాలూకా పరిధిలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి బంగారం నిక్షేపాలపై పరిశోధనలు జరిపేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర అటవీ శాఖకు ఒక ప్రైవేటు కంపెనీ లేఖ రాసింది. కేంద్రం అనుమతులు జారీ చేస్తే బంగారం మైనింగ్కు అడుగులు పడతాయి. 10 వేల ఎకరాలలో.. తరీకెరె తాలూకాలోని హోసూరు, సింగనమనె, తుంబాడిహళ్లి, గోణిబీడు, హోన్నుహట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తెలిసింది. అక్కడ పది వేల ఎకరాల అటవీ ప్రాంతంలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు, ప్రతి టన్ను మట్టి నుంచి 19 నుంచి 80 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉందని సదరు కంపెనీ అంచనా వేసింది. అయితే 10,082 ఎకరాల ప్రాంతంలో 5,600 ఎకరాలు అటవీ ప్రాంతం పరిధిలో ఉంది. అందులో అభయారణ్యం వ్యాపించింది. 3,600 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీంతో అడవులలో పరిశోధనలకు, తవ్వకాలకు అనుమతి కోసం కేంద్రానికి విన్నవించింది. కేంద్రానికి వినతి గుర్తించిన ప్రాంతంలో ఒక టన్ను మట్టిలో ఎంత బంగారం లభిస్తుందనేది నిర్ధారణకు అనేక చోట్ల డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుందని లేఖలో పేర్కొంది. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రిల్లింగ్, తవ్వకాలు చేపడుతామని కేంద్రానికి హామీనిచ్చింది. సదరు ప్రాంతం భద్రా అభయారణ్యం సమీపంలో ఉండడంతో పరిశోధనకు కేంద్ర అటవీ శాఖ అనుమతిస్తుందా అనే అనుమానాలు లేకపోలేదు. ఒకవేళ అనుమతులు లభిస్తే మాత్రం తరీకెరె భవిష్యత్తులో బంగారానికి ప్రసిద్ధిగా మారే అవకాశం లేకపోలేదు. కాగా, తాలూకాలోని బిద్దకల్లప్పన గుడ్డలో బంగారం నిక్షేపాల కోసం ఇటీవల కొన్నేళ్ల క్రితం పరిశోధనలు జరిగాయని స్థానికులు తెలిపారు. అలాగే కోగమల్లప్పన బెట్టలో కొన్నేళ్ల క్రితం ప్రయోగాలు చేసినట్లు తెలిసింది. సిద్ధరహళ్లి గ్రామం వద్ద ఉన్న దూపదయ్యనమట్టిలో బ్రిటిషర్ల కాలంలో పరీక్షలు నిర్వహించారని సమాచారం. తరీకెరెలోని ప్రకృతి అందాలు తరీకెరె తాలూకాలో బంగారం నిక్షేపాలు పరిశోధనలకు అనుమతుల కోసం కేంద్రానికి ప్రైవేటు సంస్థ లేఖ -
మంత్రి ముందే.. భర్తకు భార్య దేహశుద్ధి
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): బీడీసీసీ బ్యాంకు ఎన్నికల పేరుతో తన భర్త మంత్రి సతీష్ జార్కిహొళి అనుచరులతో కలిసి వారంపాటు ఇంటికి రాకుండా, ఫోన్ చెయ్యకుండా తిరుగుతున్నాడని ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ భర్త కనిపించగానే దాడి చేసింది. ఈ విచిత్ర సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా మదిహళ్లి గ్రామంలో జరిగింది. బెళగావి బీడీసీసీ బ్యాంకు ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. అభ్యర్థులు ఓటర్లు జారిపోకుండా శిబిరాలకు తరలించాయి. పీకేపీఎస్ సభ్యుల్లో ఒకడైన మారుతి అనే వ్యక్తి వారం రోజుల నుంచి కనబడకుండాపోయాడు. సోమవారం మధ్యాహ్నం హఠాత్తుగా జార్కిహొళి సభకు హాజరయ్యాడు, అక్కడే ఉన్న అతని భార్య వారం నుండి ఎక్కడికి పోయావంటూ కాలర్ పట్టుకుని లాగి కొట్టింది. కిందపడేసి పిడిగుద్దులు గుద్దింది. ఇదంతా మంత్రి సతీష్ జార్కిహొళి కళ్ల ముందే జరుగుతున్నా భార్యభర్తల గొడవతో నాకేం పని అనుకుని చూస్తుండిపోయారు. కొందరు జనం ఆమెను శాంతపరిచారు, బాధితుడు మళ్లీ మంత్రి అనుచరులతో కలిసి వెళ్లిపోయాడు. -
వివాహేతర సంబంధం.. భర్త మర్మాంగాలపై దాడి చేసిన భార్య..!
సాక్షి, బళ్లారి/ రాయచూరు రూరల్: పరాయి మగవాని మోజులో మునిగిపోయి, భర్తను అంతమొందించడానికి ఆమె రాక్షసిగా మారింది. గొంతు పిసికి, మర్మాంగాలపై దాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించింది, అయితే భర్త తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన విజయపుర జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లా ఇండి అక్కమహాదేవి కాలనీలో బీరప్ప పూజారి, సునంద దంపతులు జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సునందకు సిద్దప్ప అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. తమ సంతోషానికి బీరప్ప అడ్డుగా ఉన్నాడని ఇద్దరూ అనుకున్నారు. దీంతో ఏకంగా హత్య చేయాలని కుట్ర చేశారు. సోమవారం రాత్రి బీరప్ప నిద్రపోతుండగా.. సునంద భర్త ఎద మీద కూర్చుని గొంతు నులమడంతో పాటు మర్మాంగాలపై కొట్టి ప్రాణాలు తీయాలని చూసింది. సిద్దప్ప కూడా ఆమెకు సహకరించినట్లు సమాచారం. అయితే బీరప్ప మేలుకుని కాళ్లతో ఎయిర్కూలర్ని గట్టిగా కొడుతూ కేకలు వేశాడు. ఇంటి యజమాని, బీరప్ప ఎనిమిదేళ్ల కుమారుడు తలుపులు తెరవడంతో సునంద అఘాయిత్యం బయటపడింది. బీరప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సునందతో పాటు ప్రియుడు సిద్దప్పను ఇండి పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
నిప్పులా మద్దూరు
మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు పట్టణంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనం మీద రాళ్ల దాడి, ఆపై సోమవారం హిందూ సంఘాల నిరసనలు, వారి మీద పోలీసుల లాఠీచార్జీతో అక్కడ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. మంగళవారం కూడా నిషేధాజ్ఞలను కొనసాగించారు. పట్టణమంతా షాపులు, విద్యాలయాలు మూతపడ్డాయి. జనసంచారం కరువై బంద్ నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాలలో జనం బిక్కుబిక్కుమంటున్నారు. పరిసర జిల్లాల నుంచి కూడా భారీగా పోలీసు బలగాలను రప్పించి బందోబస్తు ఏర్పాటుచేశారు. నేడు కూడా నిమజ్జనం, భద్రత: ఐజీ ఈ నేపథ్యంలో స్థానిక ఐజీ బోరలింగయ్య మంగళవారం పరిస్థితిని సమీక్షించారు. నిమజ్జనం సమయంలో కొంతమంది దుండగులు రాళ్ళతో దాడి చేయడంతో, రెండు గుంపులు దాడులు చేసుకున్నాయి. గొడవలు పెరగకుండా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది, సోమవారం మద్దూరు పట్టణంలో బంద్ జరిగింది. బుధవారం ఉదయం వరకు మద్దూరు పట్టణం మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సుమారు వెయ్యిమందికిపైగా పోలీసులు బందోబస్తులో ఉన్నారని తెలిపారు. బుధవారం కూడా వినాయకుల నిమజ్జనం ఉన్నందున భద్రతను మరింత పెంచుతామని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 22 మందిని అరెస్టు చేసినట్లు, కొందరు ముఖ్యులు పరారీలో ఉన్నారని ఎస్పీ మల్లికార్జున బాలదండి చెప్పారు. వారి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. రాళ్ళ దాడిలో సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా మొత్తం 26 మంది నిందితులను గుర్తించామని చెప్పారు. మంగళవారం మద్దూరు పట్టణంలో బంద్ వాతావరణంతప్పుచేసినవారిపై చర్యలు: సీఎం సిద్దు బనశంకరి: మద్దూరులో గణేశ్ నిమజ్జనం సమయంలో గొడవ కేసులో 22 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశామని, ఎలాంటి కులమత భేదాన్ని ప్రభుత్వం పరిగణిందని, తప్పుచేసిన వారిపై చట్టరీత్యాచర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. మద్దూరుకు బీజేపీ నేతలు పాదయాత్ర చేపట్టడంపై మండిపడ్డారు. విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమాజంలో శాంతికి భంగం కలిగించడమే బీజేపీ పని. మద్దూరులో బంద్ కు పిలుపునిచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్ర హోం శాఖ మంత్రికి బీజేపీ ఫిర్యాదు చేసిందనే దానిపై సిద్దరామయ్య స్పందిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల జవాబుదారీ రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్రం మీద పోరాటంలో అనేకమంది రైతులు చనిపోతే, మణిపూర్లో హింస జరిగితే బీజేపీ నేతలు ఎందుకు నోరు ఎత్తడం లేదని ప్రశ్నించారు. మణిపూర్లో ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు పర్యటించలేదని అన్నారు. రాష్ట్రంలో అస్తవ్యస్తం కేంద్ర హోంమంత్రికి బీజేపీ ఫిర్యాదు శివాజీనగర: కన్నడనాట శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా ఉన్నాయని రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో అమిత్షాను కలిసి ఫిర్యాదు అందజేశారు. కోట్లాదిమంది హిందువుల పుణ్యక్షేత్రాల మీద కుట్రలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాని వివరించామని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బతికేందుకు సాధ్యపడని పరిస్థితి వచ్చింది, నిత్యం దాడులు జరగుతున్నాయి. మంగళూరు, కొప్పళ సహా అనేకచోట్ల హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు జరుగుతున్నాయన్నారు. మతతత్వ శక్తుల అట్టహాసం అధికమైంది. పోలీస్ స్టేషన్లపై దాడి జరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల చేతులు కట్టిపడేసిందన్నారు. మద్దూరులో దాడులను ఖండిస్తూ వీధుల్లోకి వచ్చిన ప్రజలపై పోలీసులు లాఠీలతో దాడులు చేశారన్నారు. మైనారిటీల పేరుతో తప్పిదస్తుల మీద ఉదాసీనంగా ఉంటున్నారన్నారు. శాంతిభద్రతల స్థాపనకు చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని కోరినట్లు చెప్పారు. -
దర్శన్కు ఉపశమనం
శివాజీనగర: రేణుకాస్వామి హత్య కేసులో నిందితులు నటుడు దర్శన్, ఇతర నలుగురు ముద్దాయిలు సమర్పించిన పిటిషన్లను బెంగళూరు 64వ సెషన్స్ కోర్టు విచారించి వారికి ఊరటనిచ్చేలా ఆదేశాలిచ్చింది. వారిని పరప్పన అగ్రహార జైలు నుంచి ఇతర జిల్లాల్లోని చెరసాలకు తరలించాలనే జైలు అధికారుల పిటిషన్ను జడ్జి ఐపీ నాయక్ డిస్మిస్ చేశారు. దర్శన్ సెలబ్రిటీ, ఇక్కడే ఉంటే సమస్య అవుతుందని అధికారులు తెలిపారు. బళ్లారితో సహా ఏ జిల్లా జైలుకు తరలించరాదని, ఇక్కడే ఉంటే విచారణకు సులభమవుతుందని దర్శన్ న్యాయవాది పేర్కొన్నారు. కాగా, జైల్లో కనీస సదుపాయాలను కల్పించాలనే దర్శన్ వినతి మేరకు, నిబంధనలను బట్టి వసతులను కల్పించాలని కూడా జడ్జి ఆదేశించారు. చెరసాలలో కష్టకర జీవితం ● రేణుకాస్వామి హత్య కేసులో నటీనటులు పవిత్ర, దర్శన్ రెండవసారి అరెస్టు కావడం తెలిసిందే. వీరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. ప్రత్యేక సదుపాయాలను కల్పించరాదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో జైలు అధికారులు కఠినంగా ఉన్నట్లు సమాచారం. ● సినీ స్టార్గా విలాసవంతమైన జీవితం గడిపే దర్శన్, ప్రస్తుతం జైలులో సాధారణ ఖైదీలతో పాటుగా ఉంటున్నారు ●జైలులో పెట్టే ఆహారం సహించడం లేదు. బరువు కూడా తగ్గినట్లు తెలిసింది. ● సరైన నిద్ర లభించక మనశ్శాంతి కరువైందని సమాచారం. ఎవరినీ కలవనివ్వకపోవడంతో ఒంటరితనం ఆవరించింది ● బ్యారక్ల ఎక్కువసేపు ఒంటరిగా గడపుతున్నారు. సిబ్బంది ఆయనను బయటకు కూడా పంపడం లేదని తెలిసింది. ● వారానికి రెండుసార్లు కుటుంబ సభ్యులు కలుస్తున్నారు. జైలు బదిలీ అర్జీ కొట్టివేత సౌకర్యాల కల్పనకు ఆదేశం -
దాస్ నివేదికను తిరస్కరించాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిస్టిస్ నాగమోహన్దాస్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను తిరస్కరించాలని కర్ణాటక మాదిగ, ఉప కులాల ఎస్సీ వర్గీకరణ సమితి సంచాలకుడు విరుపాక్షి డిమాండ్ చేశారు. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణలో కాంగ్రెస్ సర్కార్ వర్గీకరణకు జిస్టిస్ నాగమోహన్ దాస్ నివేదికను అందించారన్నారు. కమిటీలో ఎస్సీ వర్గాలకు చెందిన వారిని నియమించకుండా అగ్ర వర్ణాల వారిని కమిషన్ అధ్యక్షుడిగా నియమించడంతో లోపాలు ఏర్పడ్డాయన్నారు. ఆది కర్ణాటక, ద్రావిడ ఇతర ఉప కులాలను చేర్చడంలో లోపాలున్నాయని, వాటిని సవరించాలన్నారు. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్పను స్థానభ్రంశం చేయాలని, అధికారులు మణివణ్ణన్, రాకేష్ కుమార్, వెంకటయ్యలను బదలీ చేయాలని కోరారు. -
టెలిమానస్తో ఒత్తిడి నివారణ
రాయచూరు రూరల్: నేటి సమాజంలో పనుల ఒత్తిడి వల్ల మానసికంగా ధైర్యాన్ని కోల్పోతున్నట్లు, దీని వల్ల కొంత మంది అత్మహత్యలు చేసుకున్న అంశాలను గురించి మానసిక ఆరోగ్య పథకం సంచాలకుడు సంతోష్ కుమార్ పేర్కొన్నారు. హరిహరలోని సీ్త్రశక్తి భవనంలో ప్రపంచ ఆత్మహ్యతల నివారణ దినోత్సవాలు, అంగన్వాడీ కార్యకర్తలకు టెలిమాసన్ మానసిక ఆరోగ్య విద్య శిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. ప్రతి 40 సెకెండ్లకు ఓకరు అత్మహత్య చేసుకుంటున్నారన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలన్నారు. బాల్య వివాహాల నియంత్రణ, బాల కార్మిక పద్ధతి వంటి వాటికి స్వస్తి పలకాలన్నారు. కార్యక్రమంలో ప్రియా, ఇతరులు పాల్గొన్నారు. -
సన్రూఫ్కు నో చెప్పండి
దొడ్డబళ్లాపురం: కారు సన్రూఫ్ లో విలాసంగా తలపెట్టి బయటకు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారా? ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారా.., అయితే ప్రమాదాలు జరగడంతో పాటు జైలు శిక్ష కూడా పడవచ్చు. ఇటీవల యలహంక సమీపంలో విద్యారణ్యపురంలో ఓ బాలుడు కారు సన్రూఫ్ నుంచి తల బయటకుపెట్టి ప్రయాణిస్తుండగా బారియర్ తగిలి తల తీవ్ర గాయమై ఆస్పత్రిలో ఉన్నాడు. దీనిపై యలహంక ట్రాఫిక్ పోలీసులు బీఎన్ఎస్ చట్టం కింద సెక్షన్ 125(ఏ), 281 కింద సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. చట్టాలు ఏం చెబుతున్నాయి? ● సన్రూఫ్ కారణంగా నిర్లక్ష్యం లేదా, అనుకోకుండా జరిగిన ఇలాంటి ప్రమాదం వల్ల గాయపడడం, ఇతరులకు ముప్పు కలిగితే బీఎన్ఎస్ 125 (ఏ)కింద మూడు నెలల వరకూ జైలు శిక్ష,రూ.2500 జరిమానా విధిస్తారు. అదే తీవ్ర గాయాలయితే మూడేళ్ల వరకూ జైలుశిక్ష, రూ.10వేల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ● బీఎన్ఎస్ సెక్షన్ 281 బహిరంగ ప్రదేశాల్లో నిర్లక్ష్యంగా వాహనాలు నడపడాన్ని నిషేధించడం జరిగింది. ● ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే నెల రోజులు జైలు శిక్ష, రూ.1000లు జరిమానా విధించడం జరుగుతుంది. ● ఆటోమొబైల్ నిపుణుల ప్రకారం సన్రూఫ్లో నిలబడడం చట్టరీత్యా నేరం, భద్రతకు కూడా మంచిది కాదు. ● సెక్షన 177, 184 కింద నేరంగా పరిగణిస్తారు. కాబట్టి సన్రూఫ్ నుంచి బయటకు వస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. లేదంటే ప్రమాదాలు, కేసులు తప్పవు పోలీసులు, రవాణారంగ నిపుణుల హెచ్చరిక -
దురలవాట్లకు దూరంగా ఉండాలి
బళ్లారి రూరల్ : యువత మద్యం, మాదకద్రవ్యాల వ్యసనాలకు దూరంగా ఉండాలని దావణగెరె జెడ్పీ సీఈఓ గిత్తమాధవ విఠలరావు తెలిపారు. మంగళవారం జెడ్పీలోని ఎస్.ఎస్.సభాభవన్లో ఏర్పాటు చేసిన మాదక ముక్త కర్ణాటక కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. యువత ఆరంభంలో కుతూహలంగా మద్యాన్ని, మాదక ద్రవ్యాలను సేవించి తరువాత వాటికి బానిసలై జీవితాలను, భవిష్యత్తును నాశనం చేసుకొంటున్నారన్నారు. మద్యం, మాదక ద్రవ్యాలను సేవించడం వల్ల శారీరక, మానసిక అనారోగ్యంతో మరణాలకు చేరువవుతున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు, రవాణాల అడ్డుకట్టకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చట్టాలను తీసుకొచ్చిందన్నారు. అధికారులు పాఠశాలలు, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల వద్ద గట్టినిఘాలు ఏర్పాటుచేయాలని తెలిపారు.ఈ సందర్భంగా జెడ్పీ యోజన సంచాలకులు రేష్మా కౌసర్ యువత వ్యసనాలను వీడాలన్నారు. కార్యక్రమంలో డీహెచ్ఓ డాక్టర్ డి.రాఘవన్, టీటీపీ ఐ.కొట్రేశ్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఆభరణాల చోరీ.. నిందితుల అరెస్ట్
హుబ్లీ: ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి రూ.లక్షలాది విలువ చేసే బంగారు ఆభరణాలు, అలాగే నగదు దోచుకున్న ముగ్గురు ఘరానా ముఠా సభ్యులను విద్యానగర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రాజస్తాన్ను చెందిన శ్యాంసింగ్(28), కవర్పాల్(24), ప్రతాప్సింగ్(33)గా గుర్తించారు. వీరి నుంచి సుమారు రూ.15.37 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను జప్తు చేశారు. గత ఆగస్టు 30న విద్యానగర నివాసి రంగనాథ్ అనే వ్యక్తి ఇంటి ఇంటర్లాక్ను పగలగొట్టి లోనికి వెళ్లిన దుండగులు బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసి పరారయ్యారు. ఆ మేరకు ఈ నెల 1న బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన వేళ చోరీ వెలుగులోకి వచ్చింది. ఘటనపై విద్యానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఎన్ఆర్ఐ కోటా రద్దుకు డిమాండ్
హొసపేటె: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో అందిస్తున్న ఎన్ఆర్ఐ కోటాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కన్వీనర్ జేపీ రవికిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటుకు రూ.25 లక్షల చొప్పున భారీ రుసుముతో 15 శాతం ఎన్ఆర్ఐ కోటాను ప్రవేశపెట్టాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను ఏఐడీఎస్ఓ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ చర్య వైద్య కళాశాలలకు డబ్బు తెస్తుందని ప్రభుత్వం చెప్పినా వాస్తవానికి ఈ విధానంతో పేద, మధ్య తరగతి విద్యార్థుల విలువైన ప్రభుత్వ సీట్లను ధనవంతులకు వేలం వేసి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అర్హులైన, ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాల్సిన చోట ధనిక ఎన్ఆర్ఐ విద్యార్థులకు సీట్లను రిజర్వ్ చేయడం ద్వారా, వైద్యులుగా సమాజానికి సేవ చేయాలనుకునే కార్మిక, పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం అవకాశ ద్వారాలను మూసివేస్తోందన్నారు. అందువల్ల ప్రభుత్వ కళాశాలలను ప్రైవేట్ సంస్థల మాదిరిగా లాభదాయక కేంద్రాలుగా మార్చే నిర్ణయాన్ని వెంటనే విడనాడాలని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేస్తోందన్నారు. అనంతరం తహసీల్దార్ శృతికి వినతిపత్రాన్ని అందజేశారు. సభ్యురాలు ఉమాదేవి, విద్యార్థులు ఆదిత్య, గౌతమ్, సుమ పాల్గొన్నారు. రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలో ఎన్ఆర్ఐ కోటాను అమలు చేయాలని నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సంఘం అధ్యక్షుడు బసవరాజ్ మాట్లాడుతూ బెళగావి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటాను 10 శాతం ఇవ్వడానికి మంత్రివర్గం ితీర్మానం చేసిందన్నారు. దీని వల్ల పేద విద్యార్ధులకు అన్యాయం చేసినట్లు అవుతుందన్నారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటాను అమలు చేశారన్నారు. రాష్ట్ర సర్కార్ ఎన్ఆర్ఐ కోటాలో నిధులు పోగు చేసుకోవడానికి ఇది ఏడవ గ్యారెంటీ అనే విషయాన్ని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రతి సీటుకు రూ.25 లక్షల చొప్పున ఫీజులున్నాయన్నారు. 15 శాతం సీట్లు ఎన్అర్ఐకి కేటాయించడంతో పేద విద్యార్థులకు సీట్లు లభించడం కష్టమనే విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం ప్రకటించిన ఎన్ఆర్ఐ కోటాను రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు స్థానికాధికారి ద్వారా వినతి పత్రం సమర్పించారు. -
పరప్పన జైలుకు ఎమ్మెల్యే పప్పి
హుబ్లీ: కోట్లాది రూపాయల అక్రమ బెట్టింగ్ల నిర్వహణ కేసులో చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పి ని ఈడీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ రిమాండు ముగియడంతో బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో ఆయనను హాజరు పరిచారు. కోర్టు జుడిషియల్ రిమాండు విధించడంతో పరప్పన అగ్రహార కారాగారానికి తరలించారు. హైకోర్టులో భార్య పిటిషన్ ఇక బెట్టింగ్ కేసులో భర్తని అరెస్ట్ చేయడం చట్ట వ్యతిరేకమంటూ వీరేంద్ర భార్య ఆర్డీ.చైత్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ గురించి 2022 జూలై 6న హారోహళ్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. అందులో ఎవరి పేరును పేర్కొనలేదు. ఈ కేసు ఆధారంగా ఈడీ ఆగస్టు 23న తన భర్తను తొలి నిందితునిగా పేర్కొంటూ అరెస్టు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఈ అరెస్ట్ దురుద్దేశంతో కూడిందని అన్నారు. దీంతో సమాచారం ఇవ్వాలని ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీచేసింది. నేటి నుంచి మైసూరు దసరా క్రీడా పోటీలు మైసూరు: 2025–26వ సంవత్సరంలో మైసూరు జిల్లా స్థాయి దసరా క్రీడా కూటమి బుధ, గురువారాల్లో మైసూరు చాముండి విహార క్రీడాంగణంలో జరుగనుంది. మైసూరు జిల్లాలోని 9 తాలూకాల్లో జరిగిన తాలూకా స్థాయి దసరా క్రీడా కూటమి వ్యక్తిగత పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాలు, గ్రూప్ పోటీల్లో ప్రథమ స్థానం పొందినవారు మైసూరు జిల్లా స్థాయి దసరా క్రీడా పోటీలకు ఎంపికవుతారు. పురుషుల అథ్లెటిక్స్లో 100 మీ, 200 మీ, 400 మీ, 800 మీ, 1500 మీ, 5 వేలు, 10 వేల మీటర్ల పరుగు పందెం, హైజంప్, లాంగ్జంప్, షాట్పుట్, ట్రిపుల్ జంప్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, 110 మీటర్ల హర్డిల్స్, 400 మీటర్ల రిలే, 4000 మీటర్ల రిలే ఉంటాయన్నారు. వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో, కబడ్డీ, బాస్కెట్బాల్, కుస్తీ, బాడ్మింటన్, హాకీ, హ్యాండ్బాల్, టేబుల్ టెన్నిస్, త్రోబాల్, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయన్నారు. -
కరిమారెమ్మ గుడికి విరాళం
బళ్లారిఅర్బన్: ఇన్ఫ్యాంట్రీ రోడ్డు దయా కేంద్రం సమీపంలోని కరిమారెమ్మ ఆలయానికి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి రూ.60 వేల విరాళం అందజేశారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం సదరు ఆలయ అర్చకులకు ఆయన తన సహాయకుల ద్వారా ఈ కానుక అందించారు. ఈ సందర్భంగా రెడ్డి స్నేహితులు నాగలకెరె గోవింద్, బెళగల్ రోడ్డు, రవి పాల్గొన్నారు. హత్య మిస్టరీ చేధించిన పోలీసులు ● రూ.300లకే మర్డర్ చేసిన వైనం ● కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ సాక్షి,బళ్లారి: తాగిన మైకంలో రూ.300లకే హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం నగరంలోని ఏపీఎంసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ శోభారాణి, డీఎస్పీ, సీఐలు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి మూడు రోజుల్లో మిస్టరీని పోలీసులు చేధించారు. హనుమాన్ నగర్కు చెందిన బాలరాజు (22), కూలీ పనులు చేసే హనుమంతు (20) అనే ఇద్దరు తాగిన మైకంలో గుర్తు తెలియని వ్యక్తితో డబ్బుల కోసం గొడవ పడి హత్య చేశారని దర్యాప్తులో తేలింది. చాతుర్మాస దీక్షల విరమణరాయచూరు రూరల్: మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు చాతుర్మాస దీక్షలకు విరామం పలికారు. సోమవారం మంత్రాలయ మఠంలో విశేష పూజలతో నెలరోజుల పాటు చేపట్టిన దీక్షకు భక్తులు సహకరించారన్నారు. హాస్టల్లో ఆకస్మిక తనిఖీహొసపేటె: తాలూకాలో తిమ్మలాపుర గ్రామంలోని మొరార్జీ దేశాయి సైన్స్ ప్రీ–యూనివర్సిటీ రెసిడెన్షియల్ కళాశాలకు ఊహించని రీతిలో సోమవారం రాత్రి విజయనగర జిల్లాధికారి దివాకర్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో పంపిణీ చేసిన ఆహారం నాణ్యత, ఆహార సరఫరా, మరుగుదొడ్లు, తాగునీరు, భోజనాల గదిలో శుభ్రతను పరిశీలించారు. ప్రాథమిక సౌకర్యాల గురించి పిల్లలను ఆరా తీశారు. ఆ సమయంలో మరుగుదొడ్ల శుభ్రత, ఆహార నాణ్యతపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న ప్రిన్సిపాల్, వార్డెన్లకు నోటీసులు అందించాలని అధికారులను ఆదేశించారు. గత 3 నెలలుగా పిల్లలకు శుభ్రత కిట్లు పంపిణీ చేయలేదని ఆయన అధికారులను హెచ్చరించారు. స్టోర్ రూమ్లో ఉన్న కిట్లను అక్కడికక్కడే పిల్లలకు పంపిణీ చేశారు. అప్రమత్తతతో అంటువ్యాధులకు చెక్రాయచూరు రూరల్: అంటువ్యాధుల బారి నుంచి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా ఆరోగ్యాధికారి సురేంద్రబాబు సూచించారు. మంగళవారం ఆర్టీసీ విభాగంలో ఆర్టీసీ ఉద్యోగులకు చికిత్స శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలన్నారు. బీపీ, షుగర్, జింక్ ఆహార పదార్థాలు, మద్యపానం, ధూమపానం వంటివి అధికం కావడంతో నూతన వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయన్నారు. వారం రోజుల పాటు జరిగే శిబిరంలో 2510 మంది ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్టీసీ డీసీ చంద్రశేఖర్, డాక్టర్ గణేష్, చంద్రశేఖర్, శ్రీనివాస్, శ్వేతాంబరి, అశ్రఫ్, మేఘారెడ్డి, బసయ్య, మహంతేష్, పర్వతయ్యలున్నారు. విద్యాభివృద్ధికి తోడ్పాటుబళ్లారి రూరల్ : ఇంజినీరింగ్ కళాశాలలో అకడమిక్ విద్య, ఏర్పాట్లపై విద్యార్థులు పరస్పరం పరిచయమై విద్యాభివృద్ధికి తోడ్పడుతుందని ఆర్వైఎంఈసీ వి.వి.సంఘ ఉపాధ్యక్షుడు, కళాశాల పరిపాలనాధికారి జానేకుంట బసవరాజ్ తెలిపారు. సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ సిద్దత 2025–26 కార్యకర్రమంలో పాల్గొని మాట్లాడారు. సహజంగా నిర్థిష్ట సమయంలో అభ్యసిస్తారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల శిక్షణ వ్యవస్థ సఫలీకృతమవుతుందని తెలిపారు. విద్యార్థులు సామాజిక, భావనాత్మక కౌశ్యాభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. కళాశాల ప్రిన్స్పాల్ డాక్టర్ టి.హనుమంతరెడ్డి, శిక్షణ కార్యక్రమాల విశిష్టతను వివరించారు. -
విజయనగర జిల్లాధికారిణిగా కవితా ఎస్.మణికేరి
హొసపేటె: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన పనిని మరింత వేగవంతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రణదీప్కు గ్రామీణ తాగునీరు, పారిశుధ్య శాఖ అదనపు కమిషనర్గా బాధ్యతలు అప్పగించారు. రిజర్వ్లో ఉన్న కవితా ఎస్.మణికేరిని విజయనగర జిల్లా కమిషనర్గా నియమించగా, ఇప్పటి వరకు ఇక్కడ పని చేస్తున్న ఎంఎస్.దివాకర్ను ప్రభుత్వం బదిలీ చేసింది. నూతన జిల్లాధికారికి జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పుష్ప గుచ్ఛాన్ని అందించి అభినందించారు. పోలీసు శాఖకు బ్యారికేడ్ల వితరణహుబ్లీ: కేఎల్ఈ ఆస్పత్రి, వైద్య పరిశోధన కేంద్రం, జేజీఎంఎం వైద్య కళాశాల ఆధ్వర్యంలో మెడికో లీగల్ కేసుల గురించి సదస్సును నిర్వహించారు. నిపుణులుగా హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్, డాక్టర్ శారద, డాక్టర్ సునీల్, డాక్టర్ సమీర్, డాక్టర్ భరత్, డాక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. ట్రాఫిక్ సజావుగా సాగడానికి వీలుగా పోలీస్ శాఖకు వంద బ్యారికేడ్లను కేఎల్ఈ సంస్థ వితరణ చేసింది. ఆ సంస్థ పాలక మండలి సభ్యుడు శంకరణ్ణ మునవళ్లి బ్యారికేడ్లను పోలీస్ శాఖకు అందజేశారు. గబ్బూరు సమీపంలో నిర్మిస్తున్న కేఎల్ఈ ఆస్పత్రి ఆ ప్రాంత రోగులకు ఎంతో అనుకూలం కానుందని, అలాగే ఈ ప్రాంతం అందాన్ని రెట్టింపు చేసిందని అన్నారు. పేదలకు ఇళ్లు పంపిణీ చేపట్టండి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని పేదలకు ఇళ్లు పంపిణీ చేపట్టాలని రాయచూరు మురికి వాడల క్రియా వేదిక సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అద్యక్షుడు జనార్దన్ మాట్లాడారు. దశాబ్దం నుంచి నగరంలో వాజ్పేయ్ నగర నివాసంలో సర్వే నంబర్– 58 1, 929, 726, 727లలో ఇళ్లు నిర్మించారన్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని అరోపించారు. ఇళ్లకు సంబంధించి పట్టాలిచ్చారని, ఇళ్లు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. చౌక డిపో డీలర్ల కమీషన్ పెంచాలిరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహిస్తున్న ఆహార పౌర సరఫరాల శాఖ చౌక డిపో డీలర్లకు కమీషన్ పెంచాలని రాష్ట్ర చౌక డిపో డీలర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణప్ప డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి ఈకేవైసీ నిధులు రాలేదన్నారు. గూగల్ మ్యాప్ను అలవర్చితే ఆహార పదార్థాల పంపిణీలో లోపాలు జరగకుండా ఉంటాయని తెలిపారు. భారత్ బియ్యం, బ్యాళ్లు, గోధుమలు, మంచి నూనె వంటి వాటి పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విమోచనోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న జరప తలపెట్టిన కళ్యాణ కర్ణాటక ఉత్సవాల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాధికారి భవనంలో ఏర్పాటు చేసిన అధికారులతో సమావేశంలో మాట్లాడారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నియమాలను తప్పకుండా పాటించాలని నిర్లక్ష్యం వహించిన అదికారులపై చ ర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కళ్యాణ కర్ణాటక ఉత్సవాలకు ముఖ్యమంత్రి కలబుర్గిలో పాల్గొంటున్న తరుణంలో ఎలాంటి లోటు పాట్లు జరగకుండా కట్టుదిట్టంగా ఉత్సవాలను చేపట్టాలన్నారు. సర్దార్ వల్లభ్ బాయి పటేల్ సర్కిల్లో అలంకరణలు, మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో జరిగే కార్యక్రమాలను కట్టుదిట్టంగా చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్, అదనపు ఎస్పీ కుమార స్వామి, డీఎస్పీ పరమానంద, నగరసభ కమీషనర్ జుబిన్ మహాపాత్రో ఏసీ గజానన బళి, సంతోష్ రాణి, ఈరణ్ణలున్నారు. పేరుకే బిసిల సమీక్షలు రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిన వర్గాల సమీక్షలను త్వరిత గతిన పూర్తి చేయాలని తీసుకున్న నిర్ణయాలను పున పరిశీలించాలని పలు సంఘాలు అందోళనలు చేపట్టిన ప్రభుత్వం హుటా హుటిన సమీక్షలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది. ఇంటి యజమానులు అనుమతి లేకుండా ఎవరు స్టిక్కర్లు అంటించారనే ప్రశ్న మీమాంసగా మారింది. -
కట్టుకున్నోడిని కాటికి పంపాలని..
సాక్షి, బళ్లారి/ రాయచూరు రూరల్: పరాయి మగవాని మోజులో మునిగిపోయి, భర్తను అంతమొందించడానికి ఆమె రాక్షసిగా మారింది. గొంతు పిసికి, మర్మాంగాలపై దాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించింది, అయితే భర్త తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన విజయపుర జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లా ఇండి అక్కమహాదేవి కాలనీలో బీరప్ప పూజారి, సునంద దంపతులు జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సునందకు సిద్దప్ప అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. తమ సంతోషానికి బీరప్ప అడ్డుగా ఉన్నాడని ఇద్దరూ అనుకున్నారు. దీంతో ఏకంగా హత్య చేయాలని కుట్ర చేశారు. సోమవారం రాత్రి బీరప్ప నిద్రపోతుండగా.. సునంద భర్త ఎద మీద కూర్చుని గొంతు నులమడంతో పాటు మర్మాంగాలపై కొట్టి ప్రాణాలు తీయాలని చూసింది. సిద్దప్ప కూడా ఆమెకు సహకరించినట్లు సమాచారం. అయితే బీరప్ప మేలుకుని కాళ్లతో ఎయిర్కూలర్ని గట్టిగా కొడుతూ కేకలు వేశాడు. ఇంటి యజమాని, బీరప్ప ఎనిమిదేళ్ల కుమారుడు తలుపులు తెరవడంతో సునంద అఘాయిత్యం బయటపడింది. బీరప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సునందతో పాటు ప్రియుడు సిద్దప్పను ఇండి పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిద్రిస్తుండగా భార్య హత్యాయత్నం విజయనగర జిల్లాలో దాష్టీకం -
విపత్తుల నిర్వహణకు రూ.25 కోట్లు సిద్ధం
బళ్లారి రూరల్: దావణగెరె జిల్లాలో విపత్తు నిర్వహణ కోసం రూ.25.9 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నట్లు దావణగెరె జిల్లాధికారి జీ.ఎం.గంగాధరయ్య స్వామి తెలిపారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన విపత్తు నిర్వహణ ప్రాధికార సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. గత జూన్ నెలలో కురిసిన భారీ వానలకు హొన్నాళి తాలూకాలో ఇళ్లల్లోకి నీరు చేరిన 26 కుటుంబాలకు తలా రూ.2500 అందించినట్లు తెలిపారు. మొత్తం రూ.65 వేలు బాధిత కుటుంబాలకు ఇచ్చినట్లు తెలిపారు. పిడుగులు పడి 5 పశువులు మృతి చెందగా, ఆ కుటుంబ సభ్యులకు రూ.1,87,500 అందజేసినట్లు తెలిపారు. తుంగభద్ర నదిలో వరద ప్రవాహం పెరగడంతో హొన్నాళి బాలరాజ్ ఘాట్ వాసులను సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు తెలిపారు. హరిహర తాలూకాలోని రాజనహళ్లి, రామతీర్థ, హొసహళ్లిలో 45 హెక్టార్లలో మొక్కజొన్న పంటనష్టం వాటిల్లినట్లు నివేదిక అందిందని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఏఓ మాధవ విఠ్ఠల రావ్, ఏడీసీ శీలవంత శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈనెల 6 వరకు జిల్లాలో 395 మి.మీ.ల వర్షపాతం నమోదు దావణగెరె జిల్లాధికారి జీ.ఎం.గంగాధరయ్య స్వామి వెల్లడి -
కొత్త బస్టాండ్కు హైటెక్ హంగులు
హుబ్లీ: ఉత్తర కర్ణాటక ప్రముఖ వాణిజ్య నగరి హుబ్లీకి వ్యాపార వ్యవహారాలు, ఆరోగ్యం, విద్యా రంగాల్లో సాయం కోసం వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది ఇక్కడకు వచ్చి పోతుంటారు. దీంతో ప్రయాణికుల అనుకూలం కోసం హుబ్లీ గోకుల్ రోడ్డులోని కేంద్ర కొత్త బస్టాండ్లో ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆ మేరకు త్వరలోనే ఈ సౌకర్యాలు ప్రయాణికులకు లభించనున్నాయి. రూ.23 కోట్ల వ్యయంతో సదరు పనులు ప్రారంభం అయ్యాయి. ప్రాథమిక దశలోనే ఈ బస్టాండ్ ప్రస్తుతం స్మార్ట్గా కనిపిస్తోంది. ఎన్నో సౌకర్యాలు కల్పించడంతో ప్రయాణికులు సంతృప్తి చెందుతున్నారు. ఈ బస్టాండ్ భవనం నిర్మించి 23 ఏళ్లయింది. రాష్ట్రేతర, అలాగే జిల్లా నుంచి పొరుగు జిల్లాలకు వెళ్లే బస్సులు ఇక్కడికి వచ్చి వెళుతుంటాయి. అరకొరగా మౌలిక సౌకర్యాలు అయితే ఇక్కడికి వచ్చే ప్రయాణికులు కూర్చొనేందుకు అవసరమైన కుర్చీలు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు సరిగా ఉండేవి కావు. మొత్తానికి అక్కడ ఆధునిక సౌకర్యాలకు మెరుగులద్దుతూ చూడముచ్చటగా వసతుల ఏర్పాటుతో ప్రయాణికులను అలరించనుంది. ఈ విషయమై వాయువ్య కేఆర్టీసీ ఎండీ ఎం.ప్రియాంక మాట్లాడుతూ సదరు బస్టాండ్ అభివృద్ధి పనులు చురుగ్గా సారుగుతున్నాయి. డల్ట్ సహకారంతో, సంస్థ ఆర్థిక నిధులతో ఈ పనులు చేపట్టాం. ఇందుకు రూ.23 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. సిటీ బస్సుల రాకపోకలకు ప్లాట్ఫాం నిర్మాణ ప్రక్రియ ముగిసిందన్నారు. రెండు చోట్ల ఆ బస్సులు నిలిపేలా ప్లాట్ఫాం అభివృద్ధి చేశామన్నారు. బస్టాండ్ ఎదుట సౌందర్యీకరణకు ప్రాధాన్యతను ఇచ్చామన్నారు. ఆ మేరకు అక్టోబర్ చివరి కల్లా పనులన్నీ పూర్తి చేసి బస్టాండ్ ప్రారంభించడానికి కృషి చేస్తామని ఆమె వివరించారు. రూ.23 కోట్ల వ్యయంతో వివిధ సౌకర్యాలు చురుగ్గా సాగుతున్న ఆధునికీకరణ పనులు -
ప్రియాంక బెయిల్ను రద్దు చేయాలి
హొసపేటె: నగరంలోని ప్రియాంక మహిళా పరపతి సహకార సంఘం అధ్యక్షురాలు ప్రియాంక జైన్కు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేసి, ఆమెను పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. మోసానికి ప్రేరణగా నిలిచిన తాయమ్మ మహిళా శక్తి సంఘ అధ్యక్షురాలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఒత్తిడి చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోర్డు సభ్యుడు యూ.బసవరాజ్ మంగళవారం ప్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 300 మందికి పైగా మహిళలకు రూ.కోట్లాది మేర మోసం చేసిన ప్రియాంక జైన్ బెయిల్ రద్దు చేయాలి, ఫిర్యాదుదారులకు తగిన చట్టపరమైన జీవిత రక్షణ కల్పించాలి, సబ్సిడీ రుణాల పేరుతో ముందస్తుగా ఇచ్చిన రూ.పది కోట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి. బాధిత మహిళలు పద్మ, వాణి, మేఘ, చైత్ర తదితరులు మాట్లాడుతూ తాయమ్మ సంస్థ అధ్యక్షురాలిని నమ్మి తాము రుణాలు తీసుకొని ప్రియాంక పరపతి సంఘానికి రూ.లక్షలాది చెల్లించామని, తమను మోసం చేశారని చెప్పారు. కవితా సింగ్పై ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు ఫిర్యాదును స్వీకరించడం లేదన్నారు. తమకు న్యాయం కావాలని వారు పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్.భాస్కర్రెడ్డి, నాయకులు ఏ.కరుణానిధి, మరడి జంబయ్య నాయక్, ఈడిగర మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
బోనులో అటవీ సిబ్బంది బందీ
మైసూరు: గత రెండు నెలలుగా తమకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న పులి, చిరుతలను బంధించడంలో విఫలమయ్యారంటూ ముఖ్య అటవీ అధికారి కార్యాలయ సిబ్బందిని బోనులో కట్టివేశారు గ్రామస్తులు. ప్రజలు మూకుమ్మడిగా తిరగబడడంతో అటవీ అధికారులు అచేతనులయ్యారు. ఈ సంఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా బొమ్మలాపురలో మంగళవారం జరిగింది. వివరాలు.. కొంతకాలంగా చిరుతల దాడులతో పశువులను కోల్పోతున్న గ్రామస్తులు, రైతులు చిరుతలను బంధించాలని అటవీ అధికారులకు మొర పెట్టుకున్నారు. బొమ్మలాపుర గ్రామానికి చెందిన గంగప్ప పొలంలో బోను ఏర్పాటు చేశారు. గ్రామ శివార్లలో మళ్లీ చిరుతపులి మళ్లీ కనిపించిందంటూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అటవీ అధికారులు, సిబ్బంది ఆలస్యంగా రావడంతో కోపోద్రిక్తులైన ప్రజలు, రైతులు కలిసి గార్డ్, వాచర్తో సహా ఏడుగురిని అదే బోనులో పెట్టి తాళం వేశారు. వెంటనే పులి, చిరుతల పట్టివేతకు చర్యలు చేపట్టాలని, లేకుంటే అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించి వారిని బోను నుంచి విడుదల చేశారు. గ్రామస్తుల నిరసన చర్య -
ఐటీ సిటీలో రూ.1.5 కోట్ల డ్రగ్స్ సీజ్
బనశంకరి: ఐటీ సిటీలో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇద్దరు విదేశీయులతో పాటు 9 మంది డ్రగ్స్ విక్రేతలను మంగళవారం సీసీబీ పోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ.1.5 కోట్ల విలువచేసే డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్కమిషనర్ సీమంత్కుమార్ సింగ్ తెలిపారు. కుమారస్వామి లేఔట్, ఆవలహళ్లి, అమృతహళ్లి, హెబ్బగోడి, మైకో లేఔట్, రామమూర్తి నగర పోలీస్స్టేషన్ల పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్నారని తెలిసి వారిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 506 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్, 50 ఎల్ఎస్డీ పట్టీలు, 85 గ్రాముల కొకై న్, కొంత గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కుమారస్వామి లేఔట్లో శాసీ్త్రనగరలో ఎల్ఎస్డీతో దొరకడం గమనార్హం. అలాగే ఇద్దరు ఆఫ్రికన్ మహిళలను అరెస్ట్చేసి, కొకై న్ని సీజ్ చేశారు. హుడీలో బేకరి పెట్టుకుని డ్రగ్స్ అమ్ముతున్న కేరళ వాసిని అరెస్టు చేసి రూ.36 లక్షల విలువచేసే 300 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్ స్వాదీనం చేసుకున్నారు. హెబ్బగోడిలో మొబైల్ షోరూంలో పనిచేసే మరో కేరళ వాసి కూడా విలాసాల కోసం డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. వినాయక లేఔట్లో విదేశీ పౌరున్ని అరెస్టు చేశారు. 9 మంది పట్టివేత -
సెకండాఫ్లో సీఎం పోస్టు.. ఆ ఆశ ఇంకా సజీవంగానే!
డీకే శివకుమార్ (DK Shivakumar) వరుస ప్రకటనలతో కర్ణాటక రాజకీయాల్లో గందరగోళం కొనసాగుతూనే వస్తోంది. గతకొంతకాలంగా ‘సీఎం మార్పు’ అంశంపై రాజకీయం ఎంతకీ తెగట్లేదు. అలాగే రాజకీయ భవిష్యత్తుపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రినని సిద్ధరామయ్య చెబుతున్నా.. తన చేతుల్లో ఏమీ లేదని డీకే శివకుమార్ అంటున్నా అక్కడి రాజకీయాల్లో మాత్రం సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే.. తాజాగా డిప్యూటీ సీఎం శివకుమార్ దీనిపై మరోసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారాయన. ప్రపంచంలో ఏ మనిషైనా ఆశతోనే బతుకుతారని... ఆ ఆశే లేకుంటే జీవితమే లేదు. మీరడిగిన ప్రశ్నకు నేను కాదు.. కేవలం కాలమే దీనికి సమాధానం చెబుతుంది అని అన్నారాయన. ఇండియా టుడే కంక్లేవ్ సౌత్ 2025లో ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. సీఎం పదవి నిర్ణయం పార్టీ హైకమాండ్దేనని డీకే మరోసారి కుండబద్ధలు కొట్టారు. నేను.. నా నాయకత్వం, నేను.. నా పార్టీ, నేను .. సిద్ధరామయ్య. ఎవరైనా.. ఏ విషయంలో అయినా మా పార్టీ హైకమాండ్దే సంపూర్ణ అధికారం. వారు చెప్పినదానికే మేం కట్టుబడి ఉంటాం. మేము కర్ణాటక ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని హామీ ఇచ్చాం. అదే మా ముఖ్య లక్ష్యం. అందుకోసం అందరం కలసి పని చేస్తాం అని అన్నారాయన.కాంగ్రెస్ ప్రభుత్వ బలం.. ఏ శివకుమార్ మీదో, సిద్ధారమయ్య మీదో, మరెవరి మీదో ఆధారపడి ఉండదు. అది ఐక్యత మీద ఆధారపడి ఉంటుంది. అది నిరంతర సమిష్టి విజయం. ప్రజలు మమ్మల్ని నమ్మారు. ఆ ఐక్యతే మాకు బలం అని అన్నారాయన. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2023 మే 20న అధికారంలోకి వచ్చింది. అంటే, ఇప్పటివరకు సరిగ్గా 1 సంవత్సరం 3 నెలలు (2025 సెప్టెంబర్ 9 నాటికి) పూర్తయ్యాయి. రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్నే విశ్వసిస్తున్నారు.ఈ ప్రచారాన్ని సిద్ధరామయ్య మొదటి నుంచి తోసిపుచ్చుతున్నారు. అయితే తాను ముఖ్యమంత్రిని (Karnataka CM) కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదంటున్న డీకే శివకుమార్.. అందుకు పార్టీ పెద్దల ఆశీర్వాదం కూడా ఉండాలంటున్నారు. -
సిట్ అదుపులో కుట్ర నిందితులు
బనశంకరి: ధర్మస్థల మీద దుష్ప్రచారం కుట్ర కేసు దర్యాప్తు తీవ్రతరం చేసిన సిట్ అధికారులు గిరీశ్ మట్టణ్ణవర్, జయంత్ను విచారిస్తున్నారు. జయంత్ చెప్పడం వల్లే యూట్యూబ్లో వీడియోలను ప్రసారం చేసినట్లు యూట్యూబర్ అభిషేక్ చెప్పాడు. వారి కాల్ డేటాను తీసుకున్నారు. మాస్క్మ్యాన్ చిన్నయ్య తీసుకువచ్చిన పుర్రె వీడియోను ప్రసారం చేసిన కేరళ కోజికోడ్వాసి మనాఫ్ ను కూడా సోమవారం ఆధారాలతో రావాలని ఆదేశించారు. పుర్రెను తెచ్చి చిన్నయ్యకు ఇచ్చిన సౌజన్య మామ విఠల్గౌడ సిట్ అదుపులోనే ఉన్నాడు. అభిషేక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి యూట్యూబర్ అయ్యాడు, ధర్మస్థల కుట్రదారులు తిమరోడి, జయంత్లతో పరిచయం ఏర్పడింది. తమ కుమారునికి ఎలాంటి సంబంధం లేదని అభిషేక్ తల్లిదండ్రులు చెప్పారు. అవశేషాలు లభ్యం ధర్మస్థల వద్ద బండ్లగుడ్డె అడవిలో మానవ అవశేషాలు దొరికాయి. విఠల్గౌడ ఇచ్చిన సమాచారం ఆధారంగా వెతగ్గా అస్థిపంజర భాగాలు దొరికాయని తెలిసింది. అతడే హత్యాచారం చేశాడు సౌజన్య అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి మైసూరు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారంనాడు బెళ్తంగడిలో మీడియాతో మాట్లాడుతూ, ధర్మస్థలలో 2012 ఆగస్టు 9న విద్యార్థిని సౌజన్యపై అత్యాచారం, హత్య చేసింది ఆమె మామ విఠల్గౌడ అని చెప్పారు. అతనికి నార్కో అనాలిసిస్ చేయిస్తే నిజాలు వెలుగు చూస్తాయన్నారు. ధర్మస్థల కేసులో రోజురోజుకూ కొత్త పేర్లు -
కొడుకుపై డీజిల్ పోసి నిప్పు
యశవంతపుర: రోజూ మద్యం తాగి సతాయిస్తున్నాడని తల్లిదండ్రులే హంతకులుగా మారారు. కొడుకుపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన దుర్ఘటన బాగలకోట జిల్లా జమఖండి రాలూకా బిదరి గ్రామంలో జరిగింది. హతుడు అనిల్ పరప్ప కానట్టి (32), కాగా తల్లిదండ్రులు పరప్ప, శాంత, మృతుని అన్న, ఆర్మీ జవాన్ బసవరాజ కానట్టి కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అనిల్ తాగుడుకు బానిస కావడంతో పాటు ఆన్లైన్ బెట్టింగ్, జల్సాల కోసం రూ.20 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పుల వాళ్లు ఇంటికి వస్తూ ఉండడంతో తల్లిదండ్రులే తీర్చారు. మళ్లీ తనకు రూ. 5 లక్షలు డబ్బులు కావాలని ఒత్తిడి చేయటం ప్రారంభించాడు. లేదంటే పొలాన్ని పంచి ఇవ్వాలని గొడవ చేసేవాడు. ఆస్తిలో వాటా ఇస్తే అమ్మేస్తాడనే భయంతో తల్లిదండ్రులు తిరస్కరించారు. కాళ్లు చేతులు కట్టేసి ఇటీవలే సెలవు పెట్టి ఇంటికి వచ్చిన జవాన్ బసవరాజ కూడా సోదరునికి నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ఆస్తి ఇవ్వాల్సిందేనని కొన్నిరోజులుగా నిత్యం తాగి వచ్చి రభస చేయసాగాడు. ఉన్మాదిగా మారి చేతికి దొరికిన వస్తువుతో దాడి చేసేవాడు, దీంతో 5వ తేదీన అనిల్ను తల్లిదండ్రులు, అన్న బసవరాజ కలిసి చేతులు కాళ్లు కట్టేసి చితకబాది, ఒంటిపై డీజిల్ పోసి నిప్పు పెట్టారు. ఇరుగుపొరుగు గమనించి ఆస్పత్రికి తరలించగా ఆదివారం చనిపోయాడు. సావళగి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సహకరించిన మరో సోదరుడు బాగలకోట జిల్లాలో దారుణం -
సిటీ బస్సుల్లో రణరంగమే
సాక్షి, బెంగళూరు: రాజధాని బెంగళూరులోని బీఎంటీసీ బస్సులు నగరం నలుమూలలా సంచరిస్తూ ప్రజలను గమ్యం చేరుస్తుంటాయి. ఆ బస్సులే లేకపోతే ఎంతటి ఇబ్బందులు వస్తాయో చెప్పలేము. ఇది నాణేనికి ఒకవైపు అయితే మరోవైపు డ్రైవర్లు, కండక్లర్లతో ప్రయాణికుల వాగ్వాదాలు, కొన్నిసార్లు కొట్టుకోవడాలు పరిపాటిగా మారాయి. బీఎంటీసీ బస్సుల్లో గొడవలు పెరిగిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బీఎంటీసీ డ్రైవర్లు, కండక్టర్ల ప్రవర్తన బాగా లేదంటూ ప్రయాణికులు, ఇతర వాహనదారులు బీఎంటీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలా వస్తున్న ఫిర్యాదులు వేల సంఖ్యలో ఉంటున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటివరకు 10వేలకు పైగా ఫిర్యాదులు బీఎంటీసీకి అందాయి. అయితే ఆ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన బీఎంటీసీ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సగం ఫిర్యాదులు వారి మీదే ● గడిచిన 8 నెలల కాలంలో 10,609 ఫిర్యాదులు బీఎంటీసీకి అందాయి. ఇందులో 4,093 ఫిర్యాదులు కేవలం డ్రైవర్లు, కండక్టర్ల అనుచిత ప్రవర్తనలపైనే నమోదవ్వడం విశేషం. ఈ ఏడాది ముగిసే నాటికి ఈ ఫిర్యాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ● గతేడాది ప్రయాణికుల నుంచి 11,412 ఫిర్యాదులు అందాయి. అందులో 5,494 ఫిర్యాదులు డ్రైవర్లు, కండక్టర్ల అతి పైనే వచ్చాయి. ● ఇప్పటికే బీఎంటీసీ బస్సు ప్రమాదాల వల్ల తరచూ ప్రాణనష్టం జరుగుతోంది. అనుచిత ప్రవర్తన ద్వారా మరింత అప్రతిష్ట వస్తోందనే ఆరోపణలున్నాయి. ● ఉచిత బస్సు వసతి తరువాత రద్దీ అధికమైంది. పని ఒత్తిడి లేదా మరే కారణమో తెలియదు చిన్న చిన్న విషయాలకే ప్రయాణికులపై కోపపడుతూ, ఒక్కోసారి దాడులకు కూడా తెగబడుతున్నారు. తరచూ గొడవలకు దిగుతున్న డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికుల బెంబేలు బీఎంటీసీ సిబ్బందిపై ఫిర్యాదుల వెల్లువ ఇప్పటికే 10 వేల దాఖలు కొన్ని ఉదాహరణలు దేవనహళ్లి నుంచి మెజిస్టిక్కు బీఎంటీసీ బస్సు వెళుతోంది..ఒక స్థానికేతర ప్రయాణికుడు బస్సు ఎక్కి టికెట్ ఇవ్వాలని కండక్టర్ను కోరాడు. అయితే కండక్టర్ వినిపించుకోలేదు. ఇంతలో తనిఖీ సిబ్బంది వచ్చి ప్రయాణికునికి జరిమానా విధించారు. ఈ కారణంగా కండక్టర్ను అతడు ప్రశ్నించడం, గొడవ జరిగి చెంప దెబ్బ కొట్టే వరకూ వెళ్లింది. మెజిస్టిక్ నుంచి జయనగరకు బీఎంటీసీ బస్సు వెళుతోంది. లాల్బాగ్ బస్టాప్లో ఎక్కిన విద్యార్థిని ఒకరు ఆధార్కార్డు చూపించి తాను వెళ్లే స్టాప్ పేరు చెప్పి టికెట్ ఇవ్వాలని కండక్టర్ను కోరింది. అయితే కండక్టర్ ఎందుకో ఆ యువతిని అసభ్యంగా దూషించారు. ఇది సరికాదని తోటి ప్రయాణికులు హెచ్చరిస్తున్నా వారి మీద కూడా కేకలేశాడు. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులతో సైతం రగడలు జరుగుతుంటాయి. -
అలల్లో ఆపసోపాలు
● 5మంది విద్యార్థుల రక్షణ యశవంతపుర: ప్రమాదకరమైన చోట సముద్రంలో ఈతకు వెళ్లిన విద్యార్థులు అలల్లో కొట్టుకుపోసాగారు. ఇంతలో స్థానిక జాలర్లు వారిని సాహసం చేసి రక్షించారు. ఈ సంఘటన ఉడుపి జిల్లా కుందాపుర తాలూకా గోపాడి చక్రికాడు వద్ద అరేబియా సముద్ర తీరంలో జరిగింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన 10 మంది కాలేజీ విద్యార్థులు శనివారం సాయంత్రం ఉడుపిలోని కుంబాశికి వెళ్లి ఓ లాడ్జిలో దిగారు. రాత్రి సముద్ర తీరం తిరగసాగారు. అలా తిరగరాదని పోలీసులు హెచ్చరించి లాడ్జికి పంపారు. ఆదివారం ఉదయం 7:30 గంటలకు గోపాడి చక్రికాడు వద్ద సముద్రపు నీటిలోకి వెళ్లారు, మధ్యాహ్నం వరకూ ఈత కొడుతూ ఉన్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కొందరు మునిగిపోతున్నామని కేకలు వేయసాగారు, జాలర్లు ఈశ్వర్ మలై, మహేశ్, మరికొందరు పరుగులు తీసి ఇద్దరిని, మరోసారి ముగ్గురిని రక్షించారు. అందరూ క్షేమంగా బయటపడడంతో హమ్మయ్య అనుకున్నారు. విద్యార్థులను బెంగళూరుకు పంపించారు. క్రెడిట్ పెంపు అని రూ.21 లక్షల టోపీ మైసూరు: తన క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచాలని వచ్చిన సందేశాన్ని నమ్మి ఒక వృద్దుడు రూ. 21 లక్షలను పోగొట్టుకొన్నాడు. మైసూరులోని యాదవగిరి వివేకానంద రోడ్డుకు చెందిన గౌస్ (76) బాధితుడు. రెండు రోజుల క్రితం గౌస్ మొబైల్ఫోన్కు మీ క్రెడిట్కార్డు పరిమితిని పెంచుతున్నట్లు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. గౌస్ దానిని నమ్మి తన ఈమెయిల్, క్రెడిట్ కార్డు నంబర్ పుట్టిన తేది, వివరాలను అందించాడు. కొంతసేపటికి కార్డును ఉపయోగించి రూ. 1.48 లక్షలు ఖర్చు చేసినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే ఈ విషయం బ్యాంకుకు తెలియజేసి కార్డును బ్లాక్ చేశాడు. కానీ దొంగలు అతని బ్యాంకు ఖాతా నుంచి రూ. 20 లక్షలు కూడా డ్రా చేశారు. కంగుతిన్న గౌస్ సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. సజావుగా నిమజ్జనం శివమొగ్గ: శివమొగ్గ నగరంలో, సొరబ పట్టణంలోను గణేశమూర్తి నిమజ్జనం వేడుకలు మత సామరస్యంతో సాగాయి. సోమవారం శివమొగ్గలో నిమజ్జనోత్సవం జరిగింది. హిందువులతో పాటు ముస్లింలు కూడా పాల్గొన్నారు. తుంగా నగర నుంచి నిమజ్జనం వెళ్తుండగా టిప్పు నగర చానల్ వద్ద వద్ద ముస్లింలు కలిసి స్వాగతం పలికారు. భక్తులకు మజ్జిగ, పానకం అందజేశారు. సొరబ పట్టణంలో ఈద్ ఊరేగింపులో హిందువులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పురసభ వద్దకు చేరుకున్న సమయంలో పానకం అందజేసి సౌహార్దతను చాటుకున్నారు. -
5.20 లక్షల హెక్టార్లలో పంటనష్టం
బనశంకరి: రాష్ట్రంలో అతివృష్టితో తలెత్తిన నష్టం, పంట నష్టాల పరిహార చర్యలు గురించి సీఎం సిద్దరామయ్య సోమవారం నివాస కార్యాలయమైన కృష్ణాలో జిల్లాకలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ ఏడాది 23 శాతం అధిక వర్షం కురిసిందన్నారు. దెబ్బతిన్న పంటలు, ఇళ్లకు పూర్తిస్థాయిలో పరిహారం అందించాలన్నారు. 111 మంది మృత్యువాత ● పంట నష్టం సమీక్షను త్వరగా పూర్తిచేసి పరిహార పంపిణీ చేపట్టాలని సీఎం తెలిపారు. రాష్ట్రంలో అతివృష్టితో 4,80256 హెక్టార్లలో పంటలు, 40,407 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. మొత్తం 5,20,663 హెక్టార్లలో పంటలు పాడైనట్లు తెలిపారు. ● వర్షాల వల్ల ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 111 మంది చనిపోయారు, వారి కుటుంబాలకు రూ.5.55 కోట్లు పరిహారం అందించామని తెలిపారు. ● వర్షంతో 651 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, 9087 ఇళ్లు కొంతమేర దెబ్బతిన్నాయన్నారు. ఇళ్ల యజమానులకు పరిహారం అందించడంతో పాటు ఇళ్లు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నీటి మట్టం తగ్గింది రాష్ట్ర ప్రముఖ జలాశయాల్లో నీటిమట్టం గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం కొంచెం తక్కువగా ఉంది. ప్రధాన డ్యాముల్లో 840 టీఎంసీల నీరు ఉందని చెప్పారు. గతేడాది కంటే ఇది 16 టీఎంసీలు తక్కువని తెలిపారు. తుంగభద్ర ఆనకట్ట గేట్లను మార్చడం తుంగభద్ర బోర్డు పని అని, మొదటి పంటకు నీరు ఇచ్చి మరమ్మతులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అతివృష్టిపై సీఎం సిద్దు సమీక్ష సర్వే చేసి పరిహారం అందించాలి -
చల్లని తల్లీ.. ఆరోగ్యమాత
యశవంతపుర: బెంగళూరు శివాజీనగరలోని సెయింట్ మేరీ బెసిలికా చర్చిలో ఆరోగ్యమాత మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 29న ఉత్సవాలు ప్రారంభం కావడం తెలిసిందే. ఆ రోజు నుంచి సోమవారం వరకు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. బాధల్లో ఉన్నవారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలని, కష్టాలను కడగండ్లను కడతేర్చాలని భక్తులు, రోగులు, దీనులు ఆరోగ్యమాతను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. దేశంలో ప్రజలందరూ శాంతి, సుఖం, నెమ్మదితో జీవనం సాగించాలని ప్రార్థనలు చేసినట్లు శివాజీనగర చర్చి ప్యారిష్ ప్రీస్ట్ రెవరెండ్ ఫాదర్ ఆరోక్య స్వామి సెబాస్టియన్ తెలిపారు. సోమవారం ఉదయం నుంచి వేల సంఖ్యలో క్రైస్తవులు విశేష పూజలు, ప్రార్థన, జాగరణ విధి విధానాలను నిర్వహించారు. అన్ని మతాల వారు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. సాయంత్రం నుంచి రాత్రి వరకూ అమ్మవారి విగ్రహాన్ని తేరులో ఉంచి చర్చి పరిసరాలలో వైభవంగా రథోత్సవం నిర్వహించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పాల్గొన్నారు. కరావళి తీరంలో ఉత్సవాలు ఉడుపి, మంగళూరు నగరాల్లోనూ వివిధ చర్చల్లో మేరీ మాత ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉడుపిలో ఫాదర్ జెరాల్డ్ లోబో పవిత్ర బలి పూజలు చేశారు. మంగళూరులో క్రైస్తవులు మేరీ మాత ఉత్సవాలలో భాగంగా మోంతి పండుగను ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు ఊరేగింపుగా చర్చిలకు తరలివచ్చారు. సెయింట్ బసిలికాలో రథోత్సవం తరలివచ్చిన భక్త సాగరం -
యుద్ధభూమిగా మద్దూరు
మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవంలో తీవ్ర రభస చెలరేగింది. కొందరు నిమజ్జనం మీద రాళ్లు విసరడంతో గొడవలు జరిగాయి. పోలీసులు లాఠీచార్జి చేశారు. మంగళవారం ఉదయం వరకు నిషేధాజ్ఞలను ప్రకటించడంతో పట్టణం నిర్మానుష్యంగా మారింది. ఏం జరిగిందంటే.. వివరాలు.. మద్దూరు పట్టణంలోని సిద్దార్థ నగరలోని 5వ క్రాస్లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం నిమజ్జనానికి తరలించారు. ఊరేగింపు సాగుతుండగా రామ్రహీమ్ నగరలో కొందరు అల్లరిమూకలు ఇళ్ల పై నుంచి రాళ్లు విసరసాగారు. దీంతో పోలీసులు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఈ దాడిలో నలుగురు హోంగార్డులతో పాటు మొత్తం 10 మందికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన యువకులు, హిందూ సంఘాల నాయకులు కాషాయ జెండాలు పట్టుకుని సోమవారం ఉదయం 10 గంటలకు నాలా సర్కిల్ వద్ద ధర్నాకు దిగారు. న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఎస్పీ మల్లికార్జున బాలదండి, పోలీసులు భారీగా చేరుకున్నారు. షాపులను మూసివేయించారు. స్థానిక మహిళలు మాట్లాడుతూ రాత్రయితే చాలు కత్తులు, రాడ్లు పట్టుకుని తిరుగుతున్నారు, మరో పాకిస్తాన్ చేయాలనుకుంటున్నారా అని మండిపడ్డారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి జనాలను చెదరగొట్టారు. ఎవరూ బయటకు రావద్దని నిషేధాజ్ఞలను విధించారు. దీంతో సోమవారం అంతా బంద్ అయ్యింది. దాడి కేసులో 21 మందిని అరెస్టు చేశాం, పరిస్థితి అదుపులో ఉందని ఎస్పీ తెలిపారు. గణేశ నిమజ్జనంపై రాళ్ల దాడి నిరసనగా ఆందోళన పోలీసుల లాఠీచార్జీ -
ముగిసిన జోకుమార ఉత్సవాలు
హొసపేటె: గణపతి నవరాత్రుల తర్వాత వచ్చే జోకుమార స్వామికి పూజలు చేస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఉత్తర కర్ణాటకలోని విజయనగరంతో సహా వివిధ జిల్లాల్లో 7 రోజుల పాటు జరుపుకునే పండుగ సోమవారం ముగిసింది. ఇందులో భాగంగా మహిళలు బుట్టలో జోకుమార స్వామిని అలంకరించుకుని ఇంటింటికీ తీసుకెళ్లారు. ఓ జోకుమారా అని పాడుతూ వచ్చే మహిళల బుట్టలోకి భక్తులు ఆహారం, ధాన్యం, డబ్బు అందజేశారు. ఈ ఉత్సవాల్లో మహిళలు భక్తిగీతాలు పాడుతూ స్వామికి విశేష పూజలు చేశారు. వర్షం, పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. కాగా.. పట్టణ ప్రాంతాల్లో ఇటువంటి ఆచారం కనుమరుగవుతోంది. సీ్త్రలు మాత్రమే కాకుండా రైతు సమాజం కూడా జోకుమార స్వామిని భక్తితో పూజిస్తారు. హోస్పేట్ నగరంలో ఇటువంటి ఆచారం కనిపించడం విశేషం. -
నేత్రదానంపై ప్రచారం అభినందనీయం
రాయచూరు రూరల్: మరణానంతరం ప్రతి ఒక్కరూ అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావాలని కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు సూచించారు. సోమవారం హుబ్లీ ఎంఎం జోషి నేత్ర కేంద్రం ఆధ్వర్యంలో నేత్రదానం పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్రదానంపై జన జాగృతి జాతాను ప్రారంభించారు. అనంతరం అంబేడ్కర్ సర్కిల్లో జాతాను ఉద్దేశించి శాంతమల్ల శివాచార్యులు మాట్లాడారు. గత నెల 25 నుంచి రక్తదానం మాదిరిగా నేత్రదానంపై ప్రచారం చేపట్టడం అభినందనీమయని కొనియాడారు. నేత్రదానం చేసి మరొకరికి చూపు ప్రసాదించాలని సూచించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో జాతా అభియాన చేపట్టి ప్రచారం నిర్వహించారు. కళ్లకు నల్లబట్ట కట్టుకుని అంధ నడక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత, డాక్టర్ రియాజుద్దీన్, సరోజ, ఎంఎం జోషి నేత్ర కేంద్రం సంచాలకురాలు సుధా పాటిల్ రాజేంద్ర, శ్రీరాజ్ అలిపతి, షోయబ్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. టార్పాలిన్లకు దరఖాస్తు చేసుకోండి హొసపేటె: 2025–26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి విజయనగరం జిల్లాలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంచార సమాజం సహా అర్హులైన లబ్ధిదారులకు టార్పాలిన్లు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వైఏ కాలే తెలిపారు. జిల్లాలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంచార జాతులకు చెందిన అర్హత కలిగిన లబ్ధిదారులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవసరమైన పత్రాలను దరఖాస్తుకు జత చేసి ఈనెల 15వ తేదీలోపు కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలు రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక భాగంలో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంతెనలు నీటితో నిండి ప్రవహించాయి. 16 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కలబుర్గి జిల్లాలో పెసలు, కంది, ఉద్దు, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. కలబుర్గి జిల్లా చించోళి, షేడమ్లో మల్లా మారి పథకంలో నాగరాళ జలాశయం నుంచి నీరు దిగువకు వదిలారు. వాగులో నీరు అధికంగా ప్రవహించాయి. సోమవారం వరద పీడిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మౌనేష్ ముద్గిల్, జిల్లాధికారి శిల్పా శర్మ తదితరులు పర్యటించారు. ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలపై ఆరా తీశారు. పంట నష్ట పరిహారం కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నివేదికలు సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు. బైక్ ఢీకొని వ్యక్తి మృతి రాయదుర్గం టౌన్: మిత్రులతో సరదాగా గడిపేందుకు వచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని దావణగెర జిల్లా తొలహునిసె గ్రామానికి చెందిన శివ (40) అవివాహితుడు. రాయదుర్గంలోని తన మిత్రులు రాము, మల్లికార్జునను కలిసేందుకు ఆదివారం మధ్యాహ్నం వచ్చాడు. అదే రోజు రాత్రి రాత్రి 10 గంటల సమయంలో వాల్మీకినగర్లోని మిట్టపై రోడ్డు దాటుతున్న శివను రాయదుర్గం నుంచి మెచ్చిరి గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళుతున్న భాస్కర్, కృష్ణ ఢీకొన్నారు. ఘటనలో గాయపడిన ముగ్గురినీ స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో శివ చికిత్స పొందుతూ చనిపోయాడు. బసవన్న ఆశయసాధనకు కృషి రాయచూరు రూరల్: బసవన్న ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ సూచించారు. లండన్లో బసవేశ్వర విగ్రహం ఆవిష్కరించి దశాబ్దం పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం రాత్రి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు సహాయ సహకారాలు అందించి అందరి మనస్సులు గెలవాలన్నారు. లండన్లో 2015 నవంబర్ 14న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విగ్రహావిష్కరణ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో జరిగే ఉత్సవాలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ వచ్చేలా చూడాలని మంత్రులకు ఆహ్వాన పత్రికలు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్, విధాన పరిషత్ సభ్యుడు మంజునాథ భండారీ తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు
మాలూరు: తాలూకా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులను అందిస్తోందని ఎమ్మెల్యే కేవై నంజేగౌడ తెలిపారు. తాలూకాలోని మిరపనహళ్లి గ్రామంలో దాత ప్రకాష్ ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం సిద్ధ్దరామయ్య ఈనెల 31వ తేదీన జిల్లాకు విచ్చేస్తున్నారని, ఈ సందర్భంగా రూ.2,500 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాపుర కిట్టణ్ణ, డీసీసీ బ్యాంకు మాజీ సభ్యుడు చెన్నరాయప్ప, పీఎల్డీ బ్యాంకు అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇదే సమయంలో దాత ప్రకాష్ మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. -
పంచ గ్యారెంటీలు సక్రమంగా అందించాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అమలు పరచిన పంచ గ్యారెంటీ పథకాలను సక్రమంగా అందేలా చూడాలని జిల్లా పంచ గ్యారెంటీల కమిటీ అధ్యక్షుడు పామయ్య మూరారి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పంచాయతీ జల నిర్మల సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గృహలక్ష్మి, అన్నభాగ్య, శక్తి, గ్రహ జ్యోతి, యువ నిధి పథకాలను ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. బ్యాంక్ అధికారులు గ్రహలక్ష్మి పథకం ద్వారా నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని సూచించారు. గృహజ్యోతి పథకం గురించి మారుమూల గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని జెస్కాం అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో గ్యారెంటీల పదాధికారులు నాగేంద్ర, హన్మంతు, గపూర్, శేఖర్ గౌడ, లక్ష్మణ్, వెంకటరావ్, బసవరాజ, పవన పాటిల్, అధికారులు రోణ, పాండప్ప, చంద్రశేఖర్, నవీన్ కుమార్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. -
నారాయణ గురు ఆశయాలు ఆదర్శం
కోలారు: అస్పృశ్యత నివారణ కోసం బ్రహ్మశ్రీ నారాయణ గురు కృషి చేశారని తహసీల్దార్ సుధీంద్ర అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పండుగల ఆచరణ సమితి, తాలూకా ఆర్య ఈడిగర సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ నారాయణగురు జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించి ప్రజలను చైతన్యపరిచారన్నారు. నారాయణ గురు చూపిన మార్గంలో నడవాలన్నారు. కార్యక్రమంలో సముదాయ ప్రముఖుడు గోపినాథ్, తాలూకా అధ్యక్షుడు ఉదయ కుమార్, బీఈఓ మునిలక్ష్మయ్య, పురసభ అధ్యక్షుడు భాస్కర్, కోముల్ డైరెక్టర్ మంజునాథ్ పాల్గొన్నారు. -
నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి
రాయచూరు రూరల్: జిల్లాలో నిరక్షరాస్యత నిర్మూలనకు అందరూ పాటుపడాలని జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఈశ్వర్ కుమార్ సూచించారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని పేర్కొన్నారు. అనంతరం అక్షరాస్యత దినోత్సవంపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మల్లికార్జున, గిరియప్ప, చంద్రశేఖర్ భండారి, రోణ, సిద్ధప్ప, వెంకోబ, జీవన్ సాబ్, రాజేంద్ర, రావుత్రావ్, శివమ్మ, శరణప్ప, సునీత, నాగరాజ్, అరిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థినికి ఆర్థికసాయం రాయచూరు రూరల్: ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు చదువుకునేందుకు అండగా నిలుస్తామని రవి పాటిల్ ఫౌండేషన్ అధ్యక్షుడు రవి పాటిల్ తెలిపారు. రాయచూరు తాలుకా గణమూరు ఆటో డ్రైవర్ నరసింహులు కుమార్తె కావేరి ఇటీవల ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఆటో డ్రైవర్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో కావేరి ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతోంది. విషయం తెలుసుకున్న రవి పాటిల్ ఫౌండేషన్ ఆదుకునేందుకు ముందుకొచ్చింది. సోమవారం కావేరికి రూ.50 వేల ఆర్థికసాయాన్ని రవి పాటిల్ అందజేశారు. పుస్తకాలు, ఇతర ఖర్చులకు సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం రాయచూరు రూరల్: నగర ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని గురు మిఠ్కల్ శాసన సభ్యుడు శరణే గౌడ కందకూరు పేర్కొన్నారు. సోమవారం యాదగిరి జిల్లా గురు మిఠ్కల్లో మినీ విధానసౌధ, వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో నగర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని తెలిపారు. కార్యక్రమంలో నగర సభ అధ్యక్షుడు జయశ్రీ పాటిల్, ఉపాధ్యక్షురాలు రేణుక పడిగే, అంబిగర చౌడయ్య మండలి అధ్యక్షుడు బాబురావు, చించినసూర్ నగర సభ ముఖ్య అధికారి భారతి దండోతి తదితరులు పాల్గొన్నారు. గణపతి నిమజ్జనంరాయచూరు రూరల్: నగరంలోని బలరామ పాఠశాల మహాగణపతి నిమజ్జనం వైభవంగా జరిగింది. ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వినాయకుడి ఊరేగింపు.. అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగింది. తీన్ కందిల్ నుంచి సూపర్ మార్కెట్, పేట్లా బురుజు మీదుగా ఖాస్ బావి వరకూ వినాయకుడిని ఊరేగించారు. యువత డప్పుచప్పుళ్ల మధ్య నృత్యం చేస్తూ సందడి చేశారు. రంగులు చల్లుకుంటూ అలరించారు. పలువురు భక్తులు భక్తిగీతాలు ఆలపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం వినాయకుడిని నిమజ్జనం చేశారు. పాటుకాటుతో మహిళ మృతి హొసపేటె: గంగావతి తాలూకాలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన నింగమ్మ (37) పాముకాటుతో సోమవారం మృతి చెందింది. నింగమ్మ ఎప్పటిలాగే రాంపూర్ సీమలోని పొలంలో పనికి బయలుదేరింది. ఆమె కాలిపై నాగుపాము కాటు వేసింది. నాగుపామును చూసి తనతో ఉన్న మహిళలకు పారిపోవాలని చెప్పింది. గమనించిన తోటి మహిళలు ఆమెను వెంటనే వైద్య చికిత్సల కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. -
వ్యక్తి అదృశ్యం
హొసపేటె: నగరంలోని చిత్తవాడ్గికి చెందిన ఈరన్న అనే 43 ఏళ్ల వ్యక్తి పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిత్తవాడ్గి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈరన్న గురించి ఏదైనా సమాచారం తెలిస్తే చిట్టవాడ్గి పోలీస్ స్టేషన్ పీఐ మొబైల్ నంబర్లకు (9490905733, 9480805757) సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. లోక్ అదాలత్పై అవగాహన కోలారు: లోక్ అదాలత్ సేవలపై జిల్లా కానూను సేవల ప్రాధికార కార్యదర్శి, సివిల్ న్యాయమూర్తి ఆర్.నటేష్ సోమవారం నగరంలోని కేఎస్ ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులకు అవగాహన కల్పించారు. రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకొని సమయం, డబ్బు ఆదా చేసుకోవాలని సూచించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎల్ఏడీసీ ఉప ప్రధాన కానూను అరివు అధ్యక్షుడు సతీష్, తదితరులు పాల్గొన్నారు. రెడ్క్రాస్ సేవలు ప్రశంసనీయం కోలారు: భారతీయ రెడ్క్రాస్ సంస్థ దివ్యాంగులకు సహకారం అందించాలని డిప్యూటీ కలెక్టర్ మంగళ సూచించారు. భారతీయ రెడ్ క్రాస్ సంస్థ అందజేసిన కిచన్ కిట్లను సోమవారం ఆమె తన కార్యాలయంలో పేదలకు పంపిణీ చేసి మాట్లాడారు. రెడ్క్రాస్ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. సంస్థ జిల్లా సభాపతి గోపాలకృష్ణగౌడ, రాష్ట్ర పాలక మండలి సభ్యుడు శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందీష్, శ్రీనివాసన్ పాల్గొన్నారు. -
నారాయణ గురుకు ఘన నివాళి
హొసపేటె: బ్రహ్మశ్రీ నారాయణ గురు ఆలోచనాపరుడు. విద్య, సమానత్వం, సామాజిక సంస్కరణల సందేశాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేశారని నగర అసిస్టెంట్ కమిషనర్ పి.వివేకానంద తెలిపారు. జిల్లా పరిపాలన, జిల్లా పంచాయతీ, కన్నడ, సాంస్కృతిక శాఖ సహకారంతో ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ హాలులో నారాయణ గురు జయంతి నిర్వహించారు. తొలుత నారాయణ గురు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ.. నారాయణ గురు సమాజంలో పాతుకుపోయిన అంటరానితనం, కుల వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేశారని తెలిపారు. ప్రపంచంలో ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే సూత్రాన్ని సమర్థించారని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు దేవాలయాల్లోకి ప్రవేశం లేనప్పుడు దేవాలయాలను నిర్మించారన్నారు. విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి విద్యా సంస్థలను నిర్మించారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ నారాయణ గురు సూత్రాలు, ఆదర్శాలను తమ జీవితాల్లో స్వీకరించి అనుసరించాలని సూచించారు. కన్నడ, సాంస్కృతిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సిద్దలింగేష్ రంగన్నవర్ మాట్లాడుతూ.. నారాయణ గురు సూత్రం ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్నారు. వెనుకబడిన తరగతులందరూ తాము ఒక్కటే అనే వైఖరిని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్య ఈడిగ సంఘం జిల్లా అధ్యక్షుడు కే.చంద్రశేఖర్, నాయకుడు ఎర్రిస్వామి, ఆఫీస్ బేవర్లు, జిల్లా స్థాయి అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
వనమూలికల విక్రయాలపై దాడులు
కోలారు: అనుమతులు లేకుండా రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ టెంట్లపై తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్ నారాయణ స్వామి నేతృత్వంలో అధికారులు సోమవారం దాడులు చేసి సీజ్ చేశారు. తాలూకాలోని చిక్కహసాళ గేట్, కోలారులోని పవన్ కాలేజ్ వద్ద, ఖాజికల్లహళ్లి గేట్ వద్ద, తాలూకాలోని కెందట్టి గేట్ వద్ద కొంతమంది వ్యక్తులు టెంట్లు వేసి ఔషధ మూలికల మందులు విక్రయిస్తున్నారు. వనమూలికలు విక్రయించే వారికి ఎలాంటి విద్యార్హత లేకపోయినా ఆయుర్వేద మందులు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో దాడులు నిర్వహించారు. జిల్లా ఆయుష్ అధికారి రాఘవేంద్ర శెట్టిగార్ మాట్లాడుతూ.. ఆయుర్వేద చికిత్స అందించే వారు కనీస విద్యార్హత కలిగి ఉండాలన్నారు. అయితే ఎలాంటి విద్యార్హత లేకపోయినా టెంట్లు వేసి వివిధ రోగాలకు మందులు ఇస్తామని బ్యానర్లు ఏర్పాటు చేశారన్నారు. దీంతో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఎవరైనా ఆయుర్వేద, హోమియోపతి చికిత్స పొందాలనుకుంటే అధికారంగా ఉన్న చికిత్సాలయాలకు వెళ్లాలన్నారు. దాడుల్లో యునాని వైద్యురాలు డాక్టర్ గీత, తాలూకా కార్యక్రమ వ్యవస్థాపకుడు మంజునాథ్ పాల్గొన్నారు. -
విద్యాప్రగతికి తల్లిదండ్రుల సహకారం అవసరం
కోలారు: పిల్లల విద్యా ప్రగతికి తల్లిదండ్రుల సహకారం ఎంతో ముఖ్యమని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పరశురాం అన్నారు. నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన ప్రథమ పోషకుల సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పిల్లల విద్యాభివృద్ధికి పోషకులు తమ అమూల్యమైన సలహాలు అందించాలన్నారు. నిత్యం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సీఈటీ, నీట్, కౌశల్య పరీక్షలపై విశేష తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ పిల్లల కోసం పోషకులు ప్రతినిత్యం గంటసేపు కేటాయించాలన్నారు. విద్యార్థులు అతిగా మొబైల్ ఫోన్లు వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపన్యాసకులు పార్వతమ్మ , రుక్మిణి, పద్మ, కృష్ణప్ప, ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కరాటే పోటీల్లో బంగారు పతకం కోలారు : నగరంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 2వ అంతర్ రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో బంగారుపేటకు చెందిన వి. సుశాంత్ కుమత బంగారు పతకం సాధించాడు. నగరంలోని గల్పేట పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటాచలపతి కుమారుడు సుశాంత్.. బంగారుపేటలోని జైన్ గ్లోబల్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. కరాటేలో ఉత్తమ శిక్షణ పొంది అండర్–10 విభాగం పోటీల్లో సత్తా చాటి పతకం సాధించాడు. ప్రతిభ చూపిన సుశాంత్ను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. -
భార్య అశ్లీల వీడియో ఫోన్లో పెట్టుకున్నాడని సహచరుడిని చంపేశాడు..!
కర్ణాటక: తన భార్య అశ్లీల వీడియోను సేకరించిన సహ కార్మికున్ని ఇనుప రాడ్ కొట్టి చంపాడో వలస కార్మికుడు. మంగళూరు నగరంలో సూరత్కల్లో ఈ ఘోరం జరిగింది. వివరాలు.. పశ్చిమ బెంగాల్ చెందిన ముఖేశ్ మండల్ (27) హతుడు. ఇతడు లక్ష్మణ్ అలియాస్ లఖన్ (30) భార్య అశ్లీల వీడియోను తీసుకొని తన ముబైల్ ఫోన్లో పెట్టుకున్నాడు. ఈ విషయం లక్ష్మణ్కు తెలిసింది. ' దీంతో జూన్ 24న రాత్రి ఇద్దరూ బాగా మద్యం తాగారు. మత్తులో ఉండగా ఇనుప రాడ్ బాది హత్య చేసి, శవాన్ని ఓ సెప్టిక్ ట్యాంకులో పడేశాడు. ఆగస్ట్ 21న మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో పోలీసులు కనుగొన్నారు. హంతకుడు లక్ష్మణ్ తమిళనాడులో దాగి ఉండగా సూరత్కల్ పోలీసులు వెతికి పట్టుకున్నారు. -
ప్రియురాలు ఫోన్ నంబర్ బ్లాక్ చేయడంతో..!
కర్ణాటక: ఫోన్ నంబర్ను లవర్ బ్లాక్ చేయడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెరేసంద్ర గ్రామంలోని ప్రైవేట్ కాలేజ్ హాస్టల్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కేరళ మూలానికి చెందిన మహమ్మద్ షబ్బీర్ (26) పెరేసంద్ర గ్రామంలో ఓ ప్రైవేట్ కాలేజ్లో సైన్స్ కోర్సు చదువుతున్నాడు. ఇటీవల షబ్బీర్ ఫోన్ నంబర్ను యువతి బ్లాక్ చేసింది. పలుమార్లు ఫోన్ చేసినా యువతి ఫోన్ నంబర్ను బ్లాక్ లిస్ట్ నుంచి తీయలేదు. దీంతో మనస్థాపం చెందిన షబ్బీర్.. హాస్టల్ రూమ్లో టవల్తో ఉరేసుకుని మృతి చెందాడు. కాగా.. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నువ్వు నాతో ఎప్పడు ఉంటావు.’ అంటూ షబ్బీర్ డెత్నోట్లో రాశాడు. -
సన్రూఫ్ సరదా.. ఆస్పత్రిపాలు
కర్ణాటక రాష్ట్రం: కారు సన్రూఫ్ నుంచి నిలబడి షికార్లు చేయడం కొందరు గొప్పగా భావిస్తారు. కానీ అందులో ప్రమాదం ఉందని ఊహించలేరు. అదే మాదిరిగా ఓ బాలుడు ఆస్పత్రిపాలయ్యాడు. నగరంలో విద్యారణ్యపురలో శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో జికెవికె రోడ్డులో కారు సన్రూఫ్ నుంచి ఓ బాలుడు నిలబడి ప్రయాణిస్తున్నాడు. భారీ వాహనాలను నియంత్రించడానికి వేసిన హైట్ రిస్ట్రిక్షన్ రాడ్ అతని తలకు తగిలింది. దీంతో కేకలు వేస్తూ కారులోకి కూలబడ్డాడు. బలమైన గాయాలు కావటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు వెనుక వస్తున్న ఎవరో దీనిని వీడియో తీయడంతో వైరల్ అయ్యింది. ఘటనపై సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బెంగళూరు ఉత్తర విభాగం ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కారును గుర్తించిన ఆర్టీనగర పోలీసులు యజమానిని స్టేషన్కు పిలిపించి విచారించారు. పిల్లలతో కలిసి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పాడు. ఇలాంటి సన్రూఫ్ జాలీ రైడ్ ప్రమాదాలు నగరంలో తరచూ జరుగుతున్నాయి. May the child heal soon..Also Sunroof is an European Concept to let the sunlight come inside car. We take it as a style statement Most useless feature https://t.co/dgvU5imFWS— Phoenix (@oasis97277547) September 7, 2025 -
జైలు లైబ్రరీ క్లర్క్గా ప్రజ్వల్.. రోజు వేతనం ఎంతంటే?
సాక్షి, యశవంతపుర: అత్యాచారం కేసులో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. సాధారణ ఖైదీగా ఉంటున్న ప్రజ్వల్ మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఆయనకు అధికారులు జైలులోని గ్రంథాలయ క్లర్కుగా బాధ్యతలు అప్పగించారు.ఈ క్రమంలో ఖైదీలకు పుస్తకాలు ఇవ్వడం, వాటిని నమోదు చేయడం ప్రజ్వల్ పని. రోజువారీ వేతనంగా రూ.522 లభిస్తుంది. న్యాయవాదులతో చర్చలు జరపడం, కోర్టు వాయిదాల కారణంగా లైబ్రరీకి పూర్తి సమయాన్ని ఆయన కేటాయించడం లేదని జైలు అధికారులు తెలిపారు. జీవిత ఖైదు అనుభవించే వారికి నైపుణ్యం, ఆసక్తి ఆధారంగా పనులను కేటాయిస్తారు. వాటన్నిటినీ పూర్తి చేస్తే రోజుకు రూ.522 లభిస్తాయి. వారానికి మూడు రోజుల వంతున నెలకు కనీసంగా 12 రోజుల పాటైనా వీరు పనిచేయాల్సి ఉంటుంది. -
కారు, స్కూటర్, లారీ ఢీ
మైసూరు: వేగంగా వచ్చిన కారు, స్కూటర్, లారీ ఢీకొన్న దుర్ఘటనలో వెళ్తున్న నలుగురు బాలలు దుర్మరణం చెందారు. చామరాజనగర తాలూకాలోని గాలిపుర లేఔట్లో ఉన్న బైపాస్ రోడ్డులో ఈ విషాద ఘటన జరిగింది.వివరాలు.. చామరాజనగరలోని కేపీ మొహల్లాకు చెందిన మహ్మద్ రెహాన్ (14), గాలిపుర లేఔట్లో మెహరాన్ (13), అద్నాన్ పాష (9), ఫైసల్ (9) అనే బాలలు శనివారం సాయంత్రం స్కూటర్ మీద గాలిపుర లేఔట్ నుంచి కరివరదనాయక బెట్టకు సరదాగా వెళుతున్నారు. బైపాస్ రోడ్డును దాటుతున్న సమయంలో సత్యమంగళం వైపు నుంచి వచ్చిన కారు స్కూటర్ని ఢీకొట్టింది. ఈ గందరగోళంలో ఎదురుగా వస్తున్న లారీ మోపెడ్ మీద ఎక్కి కారును ఢీకొట్టింది. మధ్యలో స్కూటర్, బాలలు చిక్కుకున్నారు. ఈ దుర్ఘటనలో మెహరాన్ అక్కడే చనిపోగా, మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు, బాలలను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించారు. ట్రాఫిక్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇప్పుడే వస్తామంటూ వెళ్లిన చిన్నారులు శవాలయ్యారని తెలిసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.బూత్ స్థాయి నుంచి ఎదగాలి: డీకేశివాజీనగర: బూత్ స్థాయిలో నాయకులుగా ఎదిగి మీ సామర్థ్యం ప్రదర్శిస్తే రాజకీయాల్లో ముందడగు వేస్తారని కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. ఆదివారం కేపీసీసీ ఆఫీసులో యువజన కాంగ్రెస్ సమావేశం జరిగింది. డీకే మాట్లాడుతూ రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయనకు విరుద్ధంగా పోరాటం చేసినందుకు తనకు సాతనూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. తరువాత జడ్పీ ఎన్నికలలో పోటీ చేశాను, తనకు సంఘటితం చేసే సామర్థ్యం చాలా చక్కగా ఉండేది. యువ నాయకునిగా పార్టీని కింది స్థాయి నుంచి తీసుకొచ్చాను. ఎన్నికలకు డబ్బు ముఖ్యం కాదు. మీ సంఘటనా సామర్థ్యం ముఖ్యం. వేగంగా వెళ్లాలంటే ఒక్కడే వెళ్లాలి. మీరు నాయకుల వెనుక తిరిగితే ప్రయోజనం లేదు. మీరే నాయకులుగా ఎదగాలి అని పేర్కొన్నారు. బెంగళూరులో కొత్తగా ఐదు కార్పొరేషన్లను ఏర్పాటు చేసినందున సుమారు 500కు పైగా కొత్త నాయకులు సిద్ధం కానున్నారని అన్నారు.డీసీఎం బైక్ సవారీశివాజీనగర: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన పాత బైక్లో నగరంలో విహరించినట్లు తెలిపారు. తమ ఇంటి నుండి కేపీసీసీ కార్యాలయం వరకు తానే బైక్ నడపుకొంటూ వెళ్లానని వీడియోను ఉంచారు. ఆదివారం కూడా తీరిక లేదు, నా కాలేజీ రోజులను మళ్లీ అనుభవించేందుకు నగర వీధుల్లో బైక్ సవారీ చేశానని రాశారు. ప్రజలు ఎదుర్కొంటున్న గుంతల సమస్యలను, ఇతర సమస్యలను నేరుగా వీక్షించేందుకు ఇదొక అవకాశమన్నారు.మా కష్టం ఎవరికి చెప్పాలి?బెంగళూరు ప్రజలు ఈ పోస్టుపై తలోరకంగా స్పందించారు. సార్ పీణ్య వైపు ఓసారి రండి, వర్తూరు వైపు రండి, వైట్ఫీల్డ్ రోడ్లు ఆధ్వాన్నంగా ఉన్నాయి.. అని కొందరు కామెంట్ చేశారు. మీరు తిరిగే రోడ్లలో గుంతలు లేవు ట్రాఫిక్ సమస్య సైతం ఉండదు. మా కష్టం ఎవరికి చెప్పుకోవాలని కొందరు వాపోయారు.ఆనేకల్లో ఓనం సంబరాలుబొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్లో ఆదివారం ఓనం పండుగ వేడుకలను కేరళ కుటుంబాలవారు సంప్రదాయరీతిలో నిర్వహించారు. అందరూ సంప్రదాయం ఉట్టిపడేలా కొత్త దుస్తులు ధరించి తమ ఇళ్ళలో రంగు రంగుల పూల ముగ్గులను తీర్చిదిద్దారు. రంగవల్లుల చుట్టూ దీపాలను వెలిగించి పాటలు పాడుతూ నృత్యం చేశారు. ఆనేకల్లో పెద్దసంఖ్యలో కేరళ కుటుంబాలు స్థిరపడ్డాయి. దీంతో ఇక్కడ ఓనం పర్వదినం ఘనంగా జరుగుతుంది.నలుగురికి ఎమ్మెల్సీ పదవులుశివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం కేపీసీసీ మీడియా విభాగం అధ్యక్షుడు రమేశ్బాబుతో పాటుగా నలుగురిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. చిక్కమగళూరువాసి డాక్టర్ ఆరతి కృష్ణ, ఎఫ్.హెచ్.జక్కప్పనవర్, మైసూరు పాత్రికేయుడు శివకుమార్, కే. రమేశ్బాబును పరిషత్కు నామినేట్ చేస్తున్నట్లు గెజెట్ను విడుదల చేసింది. వీరిలో మొదటి ఇద్దరు హస్తం హైకమాండ్, చివరి ఇద్దరు సీఎం సిద్దరామయ్య కోటాలో పదవులను పొందారు. -
ఆ పుర్రె తెచ్చింది విఠల్
బనశంకరి: ధర్మస్థల మీద దుష్ప్రచారం చేయడానికి చూపిన పుర్రె కేసులో సిట్ అధికారుల దర్యాప్తులో అనేక అంశాలు బయటపడ్డాయి. వృద్ధురాలు సౌజన్యభట్ మామ విఠల్గౌడకు తలపుర్రె ఐడియా గిరీశ్ మట్టణ్ణవర్ ఇచ్చినట్లు తేలింది. సిట్ విచారణలో విఠల్గౌడ తలపుర్రె గురించి చెప్పాడు. అడవిలో ఓ పుర్రె ను గాలించి తీసుకురావాలని గిరీశ్ చెప్పాడన్నాడు. ఏడాది కిందట బంగ్ల గుడ్డె నుంచి విఠల్గౌడ పుర్రె గాలించి తీసుకురాగా, కారుడ్రైవరు ప్రదీప్గౌడ సాయంచేశాడు. బెంగళూరుకు వచ్చి గిరీశ్, జయంత్లకు అందజేశాడు. వారు ఉజిరెలోని ఇంట్లో మహేశ్ తిమరోడికి పుర్రెను అప్పగించారు. అక్కడే గ్యాంగ్ చిన్నయ్య కు పుర్రెను అందించినట్లు విఠల్గౌడ నోరువిప్పాడు. చిన్నయ్యను నమ్మించారు సౌజన్యకు న్యాయం చేయాలని ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేను కలవగా స్పందించలేదని విఠల్గౌడ విచారణలో చెప్పాడు. బంగ్లగుడ్డలో అనేక శవాలు ఉన్నాయి, అక్కడ తవ్వితే బయటపడతాయని తాను, మిగతావారు చిన్నయ్యను నమ్మించినట్లు తెలిపాడు. పుర్రె లభించిన స్థలాన్ని 11ఏ గా గుర్తించారు. విఠల్, ఇతర ముఠా సభ్యులు చెప్పడంతోనే చిన్నయ్య ఎస్పీ, జడ్జి ముందుకు వచ్చి ధర్మస్థలలో అత్యాచారం, హత్యకు గురైన వందలాది శవాలను చుట్టుపక్కల పూడ్చిపెట్టానని తెలిపాడు. ఈ కుట్రకు పాల్పడిన వారి కోసం సిట్ గాలిస్తోంది. శనివారం అర్ధరాత్రి వరకు గిరీశ్ మట్టణ్ణవర్, జయంత్, యూట్యూబర్ అభిషేక్లను విచారించి సమాచారం సేకరించారు. మరో ముగ్గురు నిందితులతో కలిసి కుట్ర ధర్మస్థల కుట్ర కేసులో విఠల్గౌడ అరెస్టు -
పెళ్లి పేరిట.. వంచన పర్వం
బనశంకరి: వివాహ సంబంధాల పేరుతో అంతులేని మోసాలు జరుగుతున్నాయి. దానికి ఇంటర్నెట్లో పుట్టుకొచ్చిన మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు మరింత ఆజ్యం పోస్తున్నాయి. నకిలీ సమాచారం ఉంచి అమాయక యువతులు, మహిళలను మోసగించే వంచకులకు స్వర్గధామంలా మారింది. ఇటువంటి నేరాలు రాష్ట్రంలో రోజురోజుకు విస్తరిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం కేసుల్లో బెంగళూరులో 60 శాతం నమోదు అవుతున్నాయి. 2021 నుంచి 2025 వరకు బెంగళూరులో 381 కేసులు వచ్చాయి. మోసగాళ్లు వైద్యులు, ఐటీ ఇంజినీర్లు, సంపన్నులం అని అందమైన ప్రొఫైల్స్ను ఉంచి వల వేస్తారు. తమను సంప్రదించిన యువతులకు మాయమాటలతో నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని వంచనకు పాల్పడుతున్నారు. కొన్నిసార్లు పెళ్లి చేసుకున్న తరువాత బండారం బయటపడుతోంది. వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన ఫిర్యాదులు కొన్ని కేసుల్లో రాజీ ద్వారా పోలీస్స్టేషన్లలో పరిష్కారమౌతున్నాయి. కానీ చాలా ఘటనల్లో బాధితులు చెప్పుకుంటే మర్యాద పోతుందని ఠాణాల వరకు రావడం లేదు. పోలీసులు, కోర్టుల చుట్టూ తిరగాలని, తమకు ఎవరూ అండగా లేరనే కారణంతో చాలామంది యువతులు ఫిర్యాదు చేయడం లేదు. దీంతో మోసగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. రెండో పెళ్లికి నమోదు చేసుకుంటే.. బాగల్కోటె జిల్లాలో రెండో వివాహం కోసం మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో ఓ మహిళ నమోదు చేసుకుంది. నైజీరియా పౌరుడు ఆమె నుంచి రూ.5.50 లక్షలు వసూలు చేశాడు. అలీవర్ ఒకిచికువు అనేది మోసగాని పేరు కాగా, సత్య అమిత్ అనే పేరుతో వెబ్సైట్లో తన ప్రొఫైల్ను ఏర్పాటు చేసుకున్నాడు. మహిళతో పరిచయం పెంచుకున్నాడు. లండన్లో ఉంటాను, కోటి యుఎస్ డాలర్లు తీసుకువచ్చాను. ఢిల్లీలో కస్టమ్స్ అధికారులు నా డబ్బును సీజ్ చేశారు. దీనిని విడిపించుకోవడానికి తక్షణం చెల్లించాలని సదరు మహిళకు కాల్ చేసి చెప్పాడు. అలా ఆమె నుంచి రూ.5.50 లక్షలను తన అకౌంట్కు జమ చేసుకున్నాడు. మహిళ ఫిర్యాదు మేరకు అతన్ని ఇటీవల ఢిల్లీలో అరెస్ట్చేశారు. ఇలా రాష్ట్రంలో అనేకమంది యువతులు, సీ్త్రలు వంచనకు గురి అవుతున్నారు. విజృంభిస్తున్న మ్యాట్రిమోనియల్ మోసగాళ్లు నకిలీ ప్రొఫైల్స్తో ఎర చెప్పుకోలేక కుమిలిపోతున్న బాధితులు తుమకూరులో బడా వంచకుడు తుమకూరు: తల్లిదండ్రులు, సోదరులు లేని యువతులను పెళ్లి చేసుకుని, వారి నుంచి డబ్బులు, నగలు దొంగిలించే మోసగాళ్ల కుటుంబం గుట్టురట్టయింది. తుమకూరు జిల్లా మధుగిరి నివాసి ఎంబీ వినయ్, అతని తల్లిదండ్రులు బసవరాజు– శాంతికుమారి, సోదరి శోభ ఈ మోసగాళ్లు. వీరు, బసవన్న ఆలయం సమీపంలో ఐస్ ఫ్యాక్టరీని నడుపుతున్నారు. వారు 7 మందికి పైగా యువతులను మోసం చేసి బంగారు ఆభరణాలు, కోట్ల నగదును కొట్టేశారని ఫిర్యాదులు వచ్చాయి. కర్ణాటక, చైన్నె పోలీస్ట్షన్లలో కేసులు అయ్యాయి. ఓ ఎస్సీ మహిళను మోసం చేసిన కేసులో తుమకూరు సెషన్స్ కోర్టు నిందితుడు వినయ్కు రిమాండు విధించగా, 3 నెలలు జైల్లో ఉంచి విడుదలయ్యాడు. ఇతన్ని వరునిగా చూపించేవారు. మంచి విద్యావంతుడు, ఆస్తిపరుడని చెప్పుకుని ఒంటరి యువతులు, వితంతు మహిళలను నమ్మించేవారు. వారి నుంచి పెద్దమొత్తంలో బంగారం, డబ్బు కట్నంగా తీసుకుని ముఖం చాటేసేవారు. వినయ్, అతని కుటుంబంపై వివిధ జిల్లాలలో బాధితులు కేసులు పెట్టారు. తాజా ఓ బాధితురాలు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. -
సన్రూఫ్ సరదా.. ఆస్పత్రిపాలు
● బారియర్ తగిలి బాలునికి తీవ్రగాయాలు యశవంతపుర: కారు సన్రూఫ్ నుంచి నిలబడి షికార్లు చేయడం కొందరు గొప్పగా భావిస్తారు. కానీ అందులో ప్రమాదం ఉందని ఊహించలేరు. అదే మాదిరిగా ఓ బాలుడు ఆస్పత్రిపాలయ్యాడు. నగరంలో విద్యారణ్యపురలో శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో జికెవికె రోడ్డులో కారు సన్రూఫ్ నుంచి ఓ బాలుడు నిలబడి ప్రయాణిస్తున్నాడు. భారీ వాహనాలను నియంత్రించడానికి వేసిన హైట్ రిస్ట్రిక్షన్ రాడ్ అతని తలకు తగిలింది. దీంతో కేకలు వేస్తూ కారులోకి కూలబడ్డాడు. బలమైన గాయాలు కావటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు వెనుక వస్తున్న ఎవరో దీనిని వీడియో తీయడంతో వైరల్ అయ్యింది. ఘటనపై సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బెంగళూరు ఉత్తర విభాగం ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కారును గుర్తించిన ఆర్టీనగర పోలీసులు యజమానిని స్టేషన్కు పిలిపించి విచారించారు. పిల్లలతో కలిసి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పాడు. ఇలాంటి సన్రూఫ్ జాలీ రైడ్ ప్రమాదాలు నగరంలో తరచూ జరుగుతున్నాయి. -
ఏబీసీడీ వర్గీకరణ అమలుపై హర్షం
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయడం హర్షణీయమని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి సంచాలకుడు అంబణ్ణ అరోలి పేర్కొన్నారు. ఆదివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద మాజీ మంత్రి ఆంజనేయ చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణకు జస్టిస్ నాగమోహన్దాస్ అందించిన నివేదికపై కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం ప్రకటించారన్నారు. ఈ సందర్భంగా విరుపాక్షిరాజు, అనిల్కుమార్, జనార్దన్లున్నారు.ఆర్టీసీలో నియామకాలకు ప్రతిపాదనలురాయచూరు రూరల్: రాష్ట్రంలోని నాలుగు ఆర్టీసీ డివిజన్లలో ఖాళీగా ఉన్న నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. శనివారం కలబుర్గిలో విలేఖర్లతో మాట్లాడారు. ఆళందలో నూతన బస్టాండ్ నిర్మాణానికి భూమిపూజ చేశామన్నారు. నాలుగు ఆర్టీసీ డివిజన్లలో ఖాళీగా ఉన్న 2,736 మంది అధికారులు, ఉద్యోగుల నియామకాలకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే నియామకాలు చేస్తామన్నారు. 2016 నుంచి 2023 వరకు నియామకాలు చేయక పోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతానికి రెండేళ్లలో 1031 ఎక్స్ప్రెస్ బస్సులు, కేఎస్ఆర్టీసీకి 900, వాయువ్య కర్ణాటక విభాగానికి 700, కేకేఆర్టీసీకి 400 బస్సులను కేటాయించామన్నారు.నమ్మ క్లినిక్ ఆస్పత్రి ప్రారంభంహొసపేటె: నగరంలోని 2వ వార్డు 88–ముద్లాపురలో ఆదివారం నమ్మ క్లినిక్ ఆస్పత్రిని ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వం నమ్మ క్లినిక్ ఆస్పత్రులను ప్రారంభించడంతో పేద ప్రజలకు ఎంతో అనుకూలంగా మారిందన్నారు. ఈ ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రస్తుత, మాజీ సభ్యులు, గ్రామంలోని సీనియర్ నాయకులు, ప్రభుత్వ నామినేటెడ్ సభ్యుడు, పార్టీ నాయకులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.పీఎంఏఎస్ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలనరాయచూరు రూరల్: నగర పరిధిలో ప్రధానమంత్రి అవాస్ పథకం కింది నిర్మాణాలు జరుగుతున్న భవన నిర్మాణాలను జిల్లా స్థాయి అధికారులు పరిశీలించారు. శనివారం సాయంత్రం చిక్కసూగురు పంచాయతీ పరిధిలోని ఏగనూరు వద్ద జిప్లస్ త్రి, ఏహెచ్పి 2419 ఇళ్ల నిర్మాణాల గురించి జిల్లాధికారి నితీష్ కాంట్రాక్టర్ ఈరణ్ణతో కలిసి చర్చించారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజల నివాసానికి అవకాశం కల్పించాలన్నారు. తాగు నీరు, రహదారి, మురుగు కాలువలు, విద్యుత్ స్తంభాలు, దీపాలు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లాధికారి వెంట ఏసీ గజానన బాళే, నగరభ కమిషనర్ జుబీన్ మహాపాత్రో, అధికారులు సంతోష్ రాణి, ఈరణ్ణ, హంపమ్మలున్నారు.కాంట్రాక్ట్ ఉద్యోగులనియామక బాధ్యత తగదురాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిపై వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల నియామక ప్రక్రియను సహకార సంఘానికి ఇవ్వడం తగదని కాంట్రాక్ట్ పద్దతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాధికారి కార్యాలయ భవనంలో ఆందోళన చేపట్టి మాట్లాడారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నియమాలను తప్పకుండా పాటించాలన్నారు. నూతనంగా సహకార సంఘానికి ఇచ్చిన ఆదేశాలను ఉప సంహరించుకోవాలని కోరుతూ జిల్లాదికారి నితీష్కు వినతిపత్రం సమర్పించారు. -
పేరుకే సూపర్.. వైద్యం పాపర్
సాక్షి,బళ్లారి: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 15 సంవత్సరాలకు పైగా ఆస్పత్రి నిర్మాణం మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు ప్రస్తుతం దాదాపుగా 95 శాతం పైగా పూర్తి కావడంతో ఎట్టకేలకు సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు నామమాత్రంగా ప్రారంభమయ్యాయి. బెంగళూరు, హైదరాబాద్ తదితర మహానగరాల్లో అందించే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు బళ్లారిలో కూడా పేదలకు ఉచితంగా అందించాలనే సంకల్పంతో 15 ఏళ్ల క్రితం తొలిసారి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గాలి జనార్దనరెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డిల కృషితో నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించేందుకు దాదాపు రూ.120 కోట్లకు పైగా నిధులతో శ్రీకారం చుట్టారు. అయితే అనంతరం బీజేపీ ప్రభుత్వంలో పనులు పూర్తి కాలేదు. కాంగ్రెస్ సర్కారులో ప్రారంభం కాని సేవలు బీజేపీ ప్రభుత్వం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆస్పత్రి సేవలు అందుబాటులోకి రాలేదు. మళ్లీ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇలా ప్రభుత్వాలు మారినా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం ఆస్పత్రి పనులు దాదాపు పూర్తి కానుండటంతో ముందుస్తుగా వారం రోజుల నుంచి బయట నుంచి వచ్చే రోగులకు పరీక్షలు ప్రారంభించారు. ప్రతి రోజు 100 మందికి పైగా రోగులు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఒక్క బళ్లారి జిల్లా ప్రజలకే కాకుండా విజయనగర, కొప్పళ, రాయచూరు తదితర జిల్లాల నుంచి, పొరుగున ఉన్న ఆంఽధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు కూడా ఇక్కడ వైద్య సేవలు పొందనున్నారు. అత్యాధునిక వైద్య సేవలందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, కార్డియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ తదితర అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. పట్టిపీడిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత ఎంతో అద్భుతంగా నిర్మించిన నూతన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిపుణులైన అన్ని విభాగాలకు చెందిన డాక్టర్లతో పాటు నర్సులు, డీ గ్రూపు సిబ్బంది తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పేరుకు తగ్గట్టుగా ఇక్కడ వైద్య సేవలు అందించేందుకు వీలవుతుందని వైద్యుల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం బయట రోగులకు పరీక్షలు మాత్రమే చేస్తుండటంతో మరో నాలుగు నెలల్లో పూర్తిగా చికిత్సలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ గంగాధరగౌడ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపామన్నారు. సిబ్బంది కొరత కూడా ఉందని, సిబ్బందికి సంబంధించిన సమస్యలపై కూడా నివేదికలు అందించామన్నారు. మరో రూ.20 కోట్లతో వివిధ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. పరికరాలు కూడా అవసరం ఉందని, అవి కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడే ఆపరేషన్లు చేసేందుకు కూడా వీలవుతుందన్నారు. ఆస్పత్రికి సిబ్బంది నియాయకం ఎన్నడో మరి? ప్రతి రోజూ 100 మందికి పైగా రోగులకు పరీక్షలు మరో నాలుగు నెలల్లో పూర్తి సేవలు అందుబాటులోకిసీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు బెంగళూరు తరహాలో అత్యాధునికంగా తీర్చిదిద్దిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యసేవలు నామమాత్రంగా ప్రారంభమైనప్పటికీ ఇంకా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అయిన వెంటనే, పరికరాలు సమకూర్చిన తర్వాత ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేతుల మీదుగా ఆర్భాటంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు ప్రారంభించనున్నారు. అయితే పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటు అందుకు సంబంధించిన సిబ్బంది నియామకంపై కూడా పాలకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నగరంలో విమ్స్ ఆస్పత్రిలో పని చేసే వైద్యులే ప్రస్తుతం ఇక్కడ సేవలు అందిస్తున్నారు. విమ్స్ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు ట్రామాకేర్, ఓపీడీ, ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్సలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. -
అన్నీ నకిలీ ప్రొఫైల్సే
● బెంగళూరు సిటీలో 2021లో 105 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 2022లో 135 కేసులు, 2023లో 61 కేసులు, 2024లో 60 కేసులు, 2025 మే వరకు 30 కిపైగా కేసులు నమోదయ్యాయి. ● సోషల్ మీడియా, వివిధ వెబ్సైట్లలో వివాహ సంబంధాల కోసం మొదటి, రెండవ పెళ్లికి వివరాలు అప్లోడ్ చేస్తున్నవారి కోసమే మోసగాళ్లు వేచి చూస్తుంటారు. ● ఒకటే కులం, పెద్ద ధనవంతులం, పెళ్లికి సిద్ధమని చెప్పగానే నిజమని నమ్మేయడం, మోసపోవడం మామూలుగా మారింది. ● కన్నడ మాట్రిమోనియల్ వెబ్సైట్లను పరిశీలిస్తే, ఢిల్లీ, రాజస్థాన్, బిహార్, మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల వ్యక్తులు తప్పుడు ఆధార్, పాన్ కార్డు, అడ్రస్లతో స్థానికులని నమోదు చేసుకుంటున్నారు. వారి నకిలీ ప్రొఫైల్స్ని నమ్మి అమాయక వనితలు బలైపోతున్నారు. -
గ్రహణం.. కావాలి శుభదాయకం
బనశంకరి: ఆదివారం రాత్రి చంద్రగ్రహణం సంభవించడంతో రాష్ట్రంలోని వివిధ దేవస్థానాల్లో ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది. గ్రహణం సందర్భంగా కొన్ని ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. బెంగళూరు బసవనగుడిలోని దొడ్డ గణపతి ఆలయంలో పూజలు జరిగాయి. పెద్దఎత్తున భక్తులు పాల్గొని దర్శనాలు చేసుకున్నారు. అన్ని విఘ్నాలు తొలగిపోవాలని లంబోదరునికి వేడుకున్నారు. ప్రతిరోజు రాత్రి 8.30 గంటలకు మూసివేసే ఆలయాలు సాయంత్రమే మూతపడ్డాయి. గ్రహణం రోజున దర్శించుకుంటే మంచి కలుగుతుందని ఉదయం నుంచి భక్తులు గుడులకు క్యూ కట్టారు. రక్తవర్ణ గ్రహణం గ్రహణ కారణంతో నగరంలోని గవి గంగాధరేశ్వర ఆలయం, చిక్కబళ్లాపుర నందిగ్రామంలోని భోగనందీశ్వర దేవస్థానం, నందిగిరిపైనుండే యోగనందీశ్వర ఆలయంతో పాటు అనేక మందిరాలను సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి సోమవారం ఉదయం తెరుస్తారు. ఈ దఫా రక్తవర్ణ చంద్ర గ్రహణం వచ్చినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుడు పూర్తిగా ఎరుపురంగులోకి తిరుగుతాడు, దీనిని రక్తచంద్ర అని పిలుస్తారని పండితులు తెలిపారు. గ్రహణం వేళలో ప్రజలు వారి వారి సంప్రదాయాల ప్రకారం ఆచారాలను పాటించారు. సాయంత్రం నుంచి హంపీలో నిర్మానుష్యమైన విరూపాక్ష ఆలయం చిక్కబళ్లాపురలోని భోగనందీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ ఆలయాలలో విశేష పూజలు దొడ్డ గణపతి దేవస్థానంలో రద్దీ సాయంత్రం నుంచి మూసివేత -
టీబీ డ్యాం క్రస్ట్గేట్లను మరమ్మతు చేస్తాం
హొసపేటె: బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాల రైతుల జీవనాడి తుంగభద్ర జలాశయం క్రస్ట్గేట్ల మరమ్మతుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. శనివారం సాయంత్రం కొప్పళ జిల్లాలోని గిణిగేరా సమీపంలోని ఎంఎస్పీఎల్ ఎయిర్స్ట్రిప్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. తుంగభద్ర జలాశయం పాతది కావడంతో గేట్లతో కూడా సమస్య ఉందన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే జలాశయం గేట్లను మరమ్మతు చేస్తామని ఆయన అన్నారు. కొప్పళ జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహిస్తామని ఆయన విలేకరుల ప్రశ్నలకు బదులిచ్చారు. కొప్పళ వార్తా శాఖకు కొత్త బస్సును ఇవ్వాలని మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రిని అభ్యర్థించగా, త్వరలో కొత్త ప్రెస్ వాహనం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. టీబీ డ్యాంపై ఏపీ సీఎంతో చర్చిస్తాం అనంతరం ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్ మాట్లాడుతూ తుంగభద్ర జలాశయంపై చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని సమయం కోరాను. అవకాశం లభిస్తే నవలి సమాంతర జలాశయం, ఇతర జలాశయాలను ప్రతిపాదిస్తాం అన్నారు. తుంగభద్ర గేట్ల మరమ్మతు పనులు వీలైనంత త్వరగా పూర్తవుతాయి. ప్రజలు తమతో సహకరించాలని అన్నారు. భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్, ముఖ్యమంత్రి మీడియా సలహాదారు కేవీ.ప్రభాకర్, కొప్పళ ఎంపీ కే.రాజశేఖర్ హిట్నాల్, ఎమ్మెల్యేలు కే.రాఘవేంద్ర హిట్నాల్, హెచ్ఆర్.గవియప్ప, మాజీ ఎంపీ కరడి సంగణ్ణ, మాజీ ఎమ్మెల్యే బసవరాజ హిట్నాల్, కొప్పళ మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు అమ్జద్ పటేల్, జిల్లా హామీ పథకం అమలు అథారిటీ చైర్మన్ రెడ్డి శ్రీనివాస్, బళ్లారి రేంజ్ ఐజీపీ వర్తికా కటియార్, కొప్పళ జిల్లా కమిషనర్ డాక్టర్ సురేష్ బి.హిట్నాల్, జిల్లా ఎస్పీ డాక్టర్ రామ్ ఎల్.అరిసిద్ద, సబ్డివిజనల్ ఆఫీసర్ కెప్టెన్ మహేష్ మాలగిత్తి పాల్గొన్నారు. సీఎం సిద్దరామయ్య -
రాష్ట్రాభివృద్ధిలో మఠాల పాత్ర కీలకం
ప్రారంభిస్తున్న స్వామీజీలు, చిత్రంలో మాజీ ఎమ్మెల్యేలు తదితరులుకార్యక్రమంలో మాట్లాడుతున్న నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి సాక్షి,బళ్లారి: రాష్ట్రాభివృద్ధిలో వీరశైవ లింగాయత్ మఠాల పాత్ర అపారమని, బళ్లారి జిల్లాతో పాటు ఉత్తర కర్ణాటకతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వీరశైవ మఠాలు తమదైన శైలిలో పేదలకు సేవ చేస్తూ, బసవణ్ణ తత్వ సిద్ధాతాలను ముందుకు తీసుకెళుతుండటం హర్షణీయమని నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన నగరంలోని బసవ భవన్లో బసవ సంస్కృతి అభియాన్ వేదికలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వానికి దీటుగా పాఠశాలలు, కళాశాలలు నడుపుతూ పేదలకు విద్యనందిస్తున్నారని కొనియాడారు. బసవణ్ణ తత్వ సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని మోకా రోడ్డులో రూ.2 కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా బసవణ్ణ విగ్రహం ఏర్పాటు చేస్తామని, అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పలువురు స్వామీజీలు మాట్లాడుతూ నగరంలో బసవ సంస్కృతి అభియాన్ ఉత్సవం ఏర్పాటు చేసి బసవణ్ణ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో మఠాధీశులు గదగ్ తోంటధార్య జగద్గురువు సిద్దరామ స్వామి, బసవప్రభు మహాస్వామి, నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి, లింగాయత్ సమాజ ప్రముఖులు మహంతేష్, రవిశంకర్, సిరిగేరి పన్నారాజ్, బసవరాజు తదితరులు పాల్గొన్నారు. పేదలకు వైద్యం, విద్య కల్పనలో ముందంజ నగరంలో రూ.2 కోట్లతో బసవణ్ణ విగ్రహం నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వెల్లడి -
బీసీల సమీక్షకు సిద్ధం కావాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిన వర్గాల సమీక్షను త్వరితగతిన పూర్తి చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని పురస్కరించుకొని అధికారులు సమీక్షకు సిద్ధంగా ఉండాలని జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాధికారి కార్యాలయ భవనంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నియమాలను తప్పకుండా పాటించాలన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవన్నారు. కుల వర్గీకరణ సమీక్షలో సాంఘీక, ఆర్థిక, విద్యా పరంగా డాటాను పొందుపరచాలన్నారు. 2024 సర్వే ప్రకారం జిల్లాలో 65 మంది మాస్టర్ ట్రైనర్లు, 150 ఇళ్లకు ఒక సర్వే అధికారి, 20 మందికి సూపర్వైజర్లను నియమించామన్నారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 7 వరకు సమీక్షను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఏసీ గజానన బళి, తిమ్మప్పలున్నారు. రేషన్ కార్డుల పంపిణీలో అక్రమాలు ● 12.68 లక్షల అనుమానాస్పద కార్డుల గుర్తింపు హుబ్లీ: రాష్ట్రంలో రేషన్ కార్డుల్లో అర్హులు కాని 12.68 లక్షల కుటుంబాలు ఏపీఎల్, బీపీఎల్, అంత్యోదయ కార్డులను తీసుకున్నారు. చనిపోయిన వారి పేరున కూడా రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ వివరాలు ఆహార పౌర సరఫరాల శాఖ జరిపిన సమీక్షలో వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఎంఎన్సీలు జాతీయ స్థాయి ఉన్నత ఉదోగ్యాలు, ఆదాయ పన్నులు చెల్లించే వారు కూడా నియమాలను ఉల్లంఘించి శ్రీమంతులు కూడా రేషన్ కార్డులు తీసుకున్నారు. పలువురి ఫిర్యాదు మేరకు సమీక్షించిన సంబంధించిన శాఖ 12 విభాగాలలో అనర్హులైన రేషన్ కార్డుల కుటుంబాలను గుర్తించారు. తమిళనాడు, ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తదితర కొన్ని రాష్ట్రాల్లో 57,864 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేశారు. వీటిలో 73,859 మంది లబ్ధిదారులు ప్రతి నెల బియ్యం, గోధుమలతో పాటు ఇతర ధాన్యాలను చౌక డిపోలలో పొందుతున్నారు. కొళాయిల్లో కలుషిత నీరు సరఫరా రాయచూరు రూరల్: నగరంలో నగరసభ అధికారులు కొళాయిలకు కలుషిత నీటిని సరఫరా చేశారు. ఆదివారం వివిధ ప్రాంతాలకు కృష్ణా నది నీటిని సరఫరా చేశారు. కొళాయిల్లో మురుగు నీరు, వాన నీరు కలుషితం కావడంతో నురగతో కూడిన నీటిని పంపింగ్ చేశారు. ప్రజలు వేరే గత్యంతరం లేక అవే నీటిని పట్టుకున్నారు. నేరుగా నది నుంచి నీరు వదలడంతో ఒండు వచ్చింది. ప్రజలు అధికారుల పనితీరు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. -
ఏకదంతాయ.. వక్రతుండాయ
నీటి టబ్లో నింపిన నీరుహొసపేటె: ఒక వైపు ధర్మస్థల సమస్యకు సంబంధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున అనుకూల, వ్యతిరేక చర్చ జరుగుతోంది. మరో వైపు విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలో 11వ రోజు గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ధర్మస్థల మంజునాథ స్వామి, ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే చిత్రపటంతో భారీ ఊరేగింపు జరిగింది. నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక వడకరాయ ఆలయ సమీపంలో హిందూ మహా గణపతి నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఈ దృశ్యం కనిపించింది. 11వ రోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా పెద్ద సంఖ్యలో గుమిగూడిన హిందూ భక్తులు డీజే సౌండ్కు అనుగుణంగా నృత్య ప్రదర్శన చేశారు. దీంతో పాటు జామియా మసీదు ముందు ఉన్న శ్రీ గణేష్ విగ్రహాన్ని చూడటానికి పది వేల మందికి పైగా ప్రజలు ఊరేగింపులో పాల్గొన్నారు. నగరంలో సుమారు తొమ్మిది గణేష్ విగ్రహాలను నగరంలో రైల్వే రహదారిలో ఉన్న తుంగభద్ర పవర్ కెనాల్లో నిమజ్జనం చేశారు. గణేష్ నిమజ్జనం ఊరేగింపులో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: నగరంలో వైభవంగా 11వ రోజు 48 వినాయక విగ్రహాల నిమజ్జనాలు జరిగాయి. శనివారం రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమైన వినాయకుల ఊరేగింపు ఆదివారం 11 గంటల వరకు కొనసాగింది. తీన్ కందిల్ నుంచి సూపర్ మార్కెట్, మహావీర్ చౌక్, మహాబళేశ్వర చౌక్, షరాఫ్ బజారు, పేట్లా బురుజు మీదుగా ఖాస్ బావి వరకు డీజే శబ్దాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ గణనాథులను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పూజలు చేశారు. ప్రశాంతంగా 11వ రోజు గణేష్ నిమజ్జనం గట్టి బందోబస్తు నిర్వహించిన పోలీసులు -
మహా మానవతావాది నారాయణ గురూ
బళ్లారి రూరల్: నారాయణ గురూ మహా మానవతావాది అని మాయకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కె.ఎస్.బసంతప్ప తెలిపారు. ఆదివారం దావణగెరె జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన నారాయణ గురూ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నారాయణ గురూ నాటి సమాజంలో అసమానతలు, మూఢాచారాలకు విరుద్ధంగా గళమెత్తారన్నారు. అస్పృశ్యతను నివారించడానికి దళితులకు ఆలయాల్లో ప్రవేశాలను కల్పించారన్నారు. సమానతలను సాధించడానికి అక్షరాస్యత అవసరమని రాత్రి బడులను ప్రారంభించి సాక్షరత శాతాన్ని పెంచారని తెలిపారు. ఈసందర్భంగా ఏడీసీ శీలవంత శివకుమార్ మాట్లాడుతూ నారాయణ గురూ జయంతిని నిర్వహించడమే కాకుండా ఆయన తత్వాలను సిద్ధాంతాలను ఆచరించాలని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా శ్రీనారాయణగుర చిత్రపటానికి పూలమాలలు వేశారు. కన్నడ సంస్కృతి శాఖ సహాయక సంచాలకుడు రవిచంద్ర, జెడ్పీ సహాయక కార్యదర్శి బసవరాజు, ఈడిగ సమాజ గౌరవాధ్యక్షుడు హెచ్.శంకర్, కార్యదర్శి దేవేంద్రప్ప, ఉపాధ్యక్షుడు శాంతారామ్ పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ నారాయణ గురూజీ జయంతి రాయచూరు రూరల్: నగరంలో బ్రహ్మశ్రీ నారాయణ గురూజీ జయంతిని సరళంగా ఆచరించారు. ఆదివారం మహిళా సమాజ్, రంగమందిరంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, సాంఘీక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖ, రాయచూరు జిల్లా ఆర్య ఈడిగ సంఘం ఆధ్వర్యంలో జరిగిన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణ గురూజీ చిత్రపటానికి రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ దద్దల్, ఎమ్మెల్సీ వసంత కుమార్ పూలమాలలు వేసి మాట్లాడారు. సమాజానికి గురువులు చేసిన సేవలు, అందించిన మార్గదర్శనాల గురించి వివరించారు. సమావేశంలో నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, జిల్లా ఆర్యఈడిగ సంఘం అధ్యక్షుడు వీరనగౌడ, సతీష్, అశోక్, తాయన్న గౌడ, సురేష్, నరసన గౌడ, పంపన గౌడ, శాంతప్ప, నాగన గౌడ, లక్ష్మి రెడ్డి, శ్రీనివాస రెడ్డిలున్నారు. -
ఆస్పత్రుల్లో వైద్యుల హాజరు తప్పనిసరి
హొసపేటె: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు, వైద్య సిబ్బంది విధి నిర్వహణలో ఆస్పత్రిలో ఉండాలని జిల్లాధికారి దివాకర్ కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. సీనియర్ అధికారులు విధి నిర్వహణాలో ఉన్నప్పుడు వైద్యులు, వైద్య సిబ్బంది సమావేశాలకు కాల్ చేయకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు రోగులకు అందుబాటులో ఉండాలి. అత్యవసర పరిస్థితి ఏర్పడింది. మరో మాటలో చెప్పాలంటే జూమ్ సమావేశాలు, ఆస్టిన్ ద్వారా సమావేశాలు నిర్వహించాలని సీనియర్ అధికారులకు సూచించారు. భౌతికంగా హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటే మధ్యాహ్నం 3 గంటలకు తర్వాత సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాధికారి అనేక సందర్భాల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు ఊహించని విధంగా వచ్చిన సమయంలో కొన్ని ఆస్పత్రులలో వైద్యులు, వైద్య సిబ్బంది సమావేశాల కోసం జిల్లా, తాలూకా ఆస్పత్రులకు వెళ్లిన నేపథ్యంలో సాకు వినిపిస్తోంది. దీని వల్ల రోగులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని గ్రహించిన జిల్లాధికారి, ప్రతిరోజు ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు అవసరం అన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది విధి నిర్వహణలో ఆస్పత్రిలో తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు. -
పెళ్లి కాకుండా IVF.. విషాదంలో నటి భావన
ప్రముఖ కన్నడ నటి, నృత్యకారిణి భావన రామన్న ఇటీవల ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చి కవల పిల్లలకు జన్మనివ్వడం తెలిసిందే. అలా ఆమె మాతృత్వ ఆనందాన్ని చవిచూస్తున్న తరుణంలో విషాద సంఘటన జరిగింది. కవల పిల్లల్లో ఒకరు కన్నుమూశారు. 40 ఏళ్ల భావన ఒంటరి మహిళగానే ఉన్నారు. అయితే మాతృత్వానికి అది అడ్డంకి కాదని చాటాలనే లక్ష్యంతో ఐవీఎఫ్ విధానంలో గర్భం చేసినట్లు ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించడంతో పాటు ఫోటోలను కూడా అప్లోడ్ చేశారు.దీంతో అభిమానులు, స్త్రీవాదులు హర్షం వ్యక్తంచేశారు. రెండు వారాల క్రితం ఒకే కాన్పులో కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరు అడ పిల్లలు జన్మించగా ఒక శిశువు శనివారంనాడు అస్వస్థతతో మృతి చెందినట్లు తెలిసింది. ఒక శిశువు అరోగ్యవంతురాలిగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 20, 30 ఏళ్లలో తాను తల్లి కావడం గురించి ఆలోచించలేదని, కానీ 40లలో ఆ భావన వెంటాడిందని ఆమె చెప్పేవారు. అందుకే పిల్లల కోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆమె విషాదంలో మునిగిపోయారు. -
పెళ్లి రద్దు.. కాంట్రాక్టు ఉద్యోగిని ఆత్మహత్య
కర్ణాటక రాష్ట్రం: ఇటీవలే నిశ్చితార్థం జరిగింది, త్వరలో పెళ్లయి సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువతి.. ప్రాణాలు తీసుకుంది. పెళ్లి రద్దు కావడమే దీనికి కారణం. మండ్య జిల్లాలోని కేఆర్పేటె తాలూకాలోని కిక్కేరిలో ఈ విషాదం జరిగింది. వివరాలు.. స్థానిక వ్యవసాయ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిని కావ్య (28)కు, 15 రోజుల క్రితం హాసన్కు చెందిన కరణ్ అనే యువకునితో పెద్దలు నిశి్చతార్థం జరిపించారు.కరణ్ డిగ్రీ పూర్తి చేసి ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పాడు. యువతి కుటుంబీకుల పరిశీలనలో ఇది అబద్ధమని తేలింది. దాంతో పనీపాటా లేని వ్యక్తితో పెళ్లి వద్దని కావ్య తండ్రి తేలి్చచెప్పాడు. మరోవైపు పెళ్లి ఖరారైందని స్నేహితులకు, సహోద్యోగులకు చెప్పుకొన్న కావ్య ఈ పరిణామంతో విరక్తి చెందింది, 4వ తేదీన కిక్కేరిలో వ్యవసాయ ఆఫీసులో పురుగుల మందు తాగిపడిపోయింది. సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసి బిజీఎస్ ఆస్పత్రికి తరలించగా ఆమె శనివారం కన్నుమూసింది. పెళ్లి వాయిద్యాలు మోగాల్సిన ఇంట విషాదం తాండవించింది. -
హోటళ్ల సమస్యలను పరిష్కరించాలి
బళ్లారి అర్బన్: అన్నదాతలైన హోటల్ యజమానులను ప్రభుత్వం గుర్తించాలని కర్ణాటక రాష్ట్ర హోటళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీకే శెట్టి పేర్కొన్నారు. శనివారం స్థానిక బళ్లారి జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో రాష్ట్ర హోటళ్ల, బేకరీల సంఘం సమావేశాన్ని ఉడిపి జిల్లా కాపు ఎమ్మెల్యే గురుమే సురేష్ శెట్టి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాల్లో హోటళ్ల సంఘం ఆధ్వర్యంలో ఎందరికో ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. యజమానులు జీఎస్టీ, విద్యుత్, తాగునీరు, ఎక్సైజ్ తదితర ఎన్నో సమస్యలను ఎదుర్కొని సేవలు అందిస్తున్నామన్నారు. తమ సేవలను ప్రభుత్వం గురించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. జీఎస్టీ పన్నుల భారం అధికంగా ఉన్నప్పటికీ ఇటీవల జీఎస్టీ పన్నులు తగ్గడంతో ఉపశమనం అయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉడిపి జిల్లా కాపు ఎమ్మెల్యే సురేష్ శెట్టి, రాష్ట్ర హోటళ్ల సంఘం అధ్యక్షుడు జీకే.శెట్టి, కార్యదర్శి మధుకర్ శెట్టి, మయూర మధుసూధన్, విక్రమ్ పోలా, యశ్వంత్రాజ్ నాగిరెడ్డి, సీకే.బాబు, ఆవార్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ వైద్యులపై దాడులు
హొసపేటె: తాలూకాతో పాటు కమలాపుర పట్టణంలో నకిలీ వైద్యులపై ఆరోగ్య శాఖ అధికారులు శనివారం దాడులు చేశారు. కమలాపురలో అస్లాం బాషా అనే నకిలీ వైద్యుడికి చెందిన సఫా క్లినిక్పై జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ శంకర్నాయక్, జిల్లా ఆయుష్ అధికారులు, తాలూకా ఆరోగ్య అధికారుల నేతృత్వంలోని అధికారుల బృందం దాడి చేసింది. పరారీలో ఉన్న అస్లాం బాషా, అతనికి ఆశ్రయం ఇచ్చిన విజయనగర మెడికల్ షాప్ యజమానికి ఫోన్లో పలు సార్లు సంప్రదించినా వారు కాల్కు స్పందించడానికి నిరాకరించారు. వెంటనే కర్ణాటక ప్రైవేట్ వైద్య సంస్థల(కేపీఎంఈ–2007) చట్టం కింద కమలాపుర పోలీస్ స్టేషన్ సిబ్బందితో సఫా క్లినిక్ను సీజ్ చేశారు. అదేవిధంగా డాక్టర్ సుహాస్ అనే వైద్యుడు కూడా కేపీఎంఈలో నమోదు చేసుకోకుండా, హోమియోపతికి లైసెన్స్ పొందకుండా అల్లోపతి సేవలను అందించినందుకు నోటీసు జారీ చేశారు. పట్టణంలోని మరో క్లినిక్ను తనిఖీ చేసినప్పుడు అక్కడ డాక్టర్ మనోహర్ క్లినిక్లోని బయో మెడికల్ వ్యర్థాలను సరిగ్గా నిర్వహించనందుకు నోటీసు జారీ చేసినట్లు జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ శంకర్ నాయక్ తెలిపారు. ఈద్ విందుకు ఎమ్మెల్యే బళ్లారిఅర్బన్: స్థానిక ముస్లిం నేత ఖాజిగులాం మహమ్మద్ సిద్దిఖి నివాసంలో ఈద్ మిలాద్ విందు నిర్వహించగా, ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ముస్లిం ప్రముఖులు ఘనంగా సన్మానించారు. హుమాయూన్ ఖాన్, ప్రభంజన్కుమార్, ప్రముఖులు జబ్బార్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సంచార జాతులకు గౌరవధనం అందించాలిరాయచూరు రూరల్: సంచార జాతులకు గౌరవధనం అందించాలని ఆ జాతుల సాంస్కృతిక సాహిత్య పరిషత్ డిమాండ్ చేసింది. శనివారం కలబుర్గిలోని మినీ విధానసౌధ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు దొడ్ల పండరి మాట్లాడారు. రాయచూరు, కలబుర్గి, యాదగిరి, బళ్లారి, విజయనగర, బీదర్ జిల్లాల్లోని సంచార జాతులకు గౌరవధనం పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఏడాదిలో ఏడు రోజులు మాత్రమే ఊరూరా తిరిగి జోకుమారను బుట్టలో పెట్టుకొని భిక్షం అడిగే వారికి సర్కార్ గౌరవధనం ఇచ్చేలా చూడాలని కోరుతూ జిల్లాధికారిణి ఫౌజియ తరన్నుమ్కు వినతిపత్రం అందించారు. ఆందోళనలో జయశ్రీ,రాజ్, అర్జున్, శరణప్ప, సూర్యకాంత్, సాబణ్ణ, ఇందుబాయి, హెన్నమ్మ, రవిలున్నారు. సాంస్కృతిక రాయబారి బసవణ్ణ రాయచూరు రూరల్: సాంస్కృతిక రాయబారి బసవణ్ణ అని సాణేహళ్లి పండితారాధ్య శివాచార్య మహాస్వామీజీ అన్నారు. శుక్రవారం రాత్రి గంజ్ కళ్యాణ మంటపంలో బసవ సంస్కృతి అభియాన్ ముగింపు సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. బసవణ్ణ ఆదర్శాలను, ఆశయాలను ప్రతి ఒక్కరూ జీవితంలో అలవరచుకోవాలన్నారు. ప్రపంచంలో అశాంతి విలయ తాండవం చేస్తోందన్నారు. దానిని శాంతింప చేయడానికి అందరూ ఏకం కావాలన్నారు. పుణ్యంతో కూడిన పనులు చేపట్టడానికి అనుభవ మంటపం ప్రధానమని అభిప్రాయపడ్డారు. పేదలకు సహాయ సహకారాలు అందించి అందరి మనస్సులను గెలవాలన్నారు. లింగాయత మఠాధిపతులు వేదిక ఆధ్వర్యంలో జరిగే బసవ సంస్కృతి అభియాన్కు అందరి సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో బసవలింగ పట్టదేవరు, తోంటద సిద్దరామ, సిద్దలింగ, గురు బసవ, మహాలింగ స్వామీజీ, చంద్రశేఖర్, నాగరాజ్, శరణ భూపాల్ నాడగౌడ, నాగనగౌడ, లలితలున్నారు. సహకార సంఘం వార్షిక సమావేశంబళ్లారిఅర్బన్: స్థానిక పార్వతి ఫంక్షన్ హాల్లో శనివారం వరద వినాయక క్రెడిట్ సహకార సంఘం 14వ వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు జేఎస్ నేపాక్షప్ప, ఆ సంఘం ప్రముఖులు ఎన్.అయ్యప్ప, సీనియర్ న్యాయవాదులు, డైరెక్టర్లు, సంస్థ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో గత ఏడాది నివేదికను వివరించారు. 2024–25వ సంవత్సరంలో సంఘం మొత్తం రూ.1.06 కోట్ల నికరలాభం సాధించిందన్నారు. ఆ మేరకు సంఘం సభ్యులకు 24 శాతం లాభాలు ఇస్తామని ప్రకటించారు. సంఘం మొత్తం ప్రణాళిక వివరాలను సమావేశం ఆమోదించింది. సమావేశంలో సంఘం ప్రముఖులు వీకే.భాస్కరరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా బీజేపీ నేత, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి, డైరెక్టర్లు ఉడేద బసవరాజ్, వీ.ఆంజనేయులు, బాలనగౌడ, సురేఖ పాటిల్, సుమారాణి, పుష్పవతి, జ్యోతి, దొడ్డమహేష్, ఈరప్ప, ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో మునిగి బాలుడు దుర్మరణం
రాయచూరు రూరల్: వాలీబాల్ ఆడిన ఓ బాలుడు చెరువులో మునిగి దుర్మరణం పాలైన ఘటన నగరంలో చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం క్రిష్ణగిరి కాలనీలో ఆటలాడుతున్న గౌతమ్(15) కాలు జారి చెరువులో పడి మరణించినట్లు అనుమానిస్తున్నారు. గౌతమ్ స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడుతూ విశ్రాంతి కోసం చెరువు గట్టుపై కూర్చొన్నట్లు స్నేహితులు చెబుతున్నారు. రాజస్థాన్కు చెందిన గౌతమ్ తల్లిదండ్రులు ఇడ్లీ బండిలో ఇడ్లీలు విక్రయించేవారు. సాయంత్రం 5 గంటలకు అగ్ని మాపక అధికారులు, సిబ్బంది వచ్చి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. పశ్చిమ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మోకా నాగరాజ్ తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. ఎస్ఐ సస్పెండ్హుబ్లీ: విజయపుర జిల్లా భీమా తీరంలో గ్రామ పంచాయతీ అధ్యక్షుడు భీమనగౌడ బిరాదార్ హత్య కేసు నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఆధారంగా చడచణ ఎస్ఐ ప్రవీణ్ను జిల్లా ఎస్పీ లక్ష్మణ్ నింబరిగి సస్పెండ్ చేశారు. ఈ నెల 3న ఉదయం చడచణ తాలూకా దేవరనింబరిగిలో భీమనగౌడను దారుణంగా తుపాకీతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆరోజు ఉదయం కటింగ్ సెలూన్కు వచ్చిన భీమనగౌడ కళ్లలో కారం చల్లి నలుగురు దుండగులు తుపాకీలతో కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో ప్రదీవుల్లా, వసీమ్, ఫిరోజ్షేక్, మౌలానాబాద్ అనే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చురుగ్గా చేపట్టినట్లు ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. బీసీ వర్గాల సమీక్షకు గడువు ఇవ్వాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిన వర్గాల సమీక్షలను త్వరిత గతిన పూర్తి చేయాలని, తీసుకున్న నిర్ణయాలను పునః పరిశీలించాలని కల్యాణ కర్ణాటక బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు జగన్నాథ్ కులకర్ణి పేర్కొన్నారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోిపించారు. కుల వర్గీకరణ సమీక్షలో బ్రాహ్మణ అని రాయించాలన్నారు. సాంఘీక, ఆర్థిక, విద్యా పరంగ డాటాను పొందడానికి సమయం కావాల్సి ఉందన్నారు. సర్కార్ 2026 డిసెంబర్ వరకు సర్వేలు చేయడానికి వీలు కల్పించి 2027లో నివేదికలను సమర్పించడానికి అవకాశం ఇవ్వాలన్నారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలి రాయచూరు రూరల్: గ్రామాల్లో అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర చిన్నపరిశ్రమల శాఖ మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్, యాదగిరి శాసన సభ్యుడు చెన్నారెడ్డి తన్నూరు పేర్కొన్నారు. శనివారం వడగేరలో మినీ విధానసౌధ, వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో గ్రామాలను మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి పాటు పడతామన్నారు. ప్రతి ఒక్కరూ విద్య, వైద్యం, ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో అంబిగర చౌడయ్య మండలి అధ్యక్షుడు బాబూరావ్ చించనసూరు, జిల్లాధికారి హర్షల్ బోయర్లున్నారు. జైజై గణేశా.. బైబై గణేశా ● ఘనంగా వినాయక నిమజ్జనం హొసపేటె: నగరంలోని చిత్రకేరిలో కూర్చొండబెట్టిన గణేష్ విగ్రహాన్ని ఎంతో ఉత్సాహంగా నిమజ్జనానికి తరలించారు. యువకులు 11 రోజుల పాటు ప్రతిష్టించి గణేష్కు ప్రత్యేక పూజలు చేశారు. నిమజ్జనం సందర్భంగా యువత నృత్యం చేసి సంబరాలు చేసుకున్నారు. నగర వీధుల్లో గణేష్ విగ్రహాల ఊరేగింపు ఎంతో ఉత్సాహంగా సాగింది. -
గురువులకు ప్రామాణికత అవసరం
రాయచూరు రూరల్ : సమాజంలో ఉపాధ్యాయులు ప్రామాణికత, నిజాయితీతో విధులు నిర్వహించాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. శనివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఏర్పాటు చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు, ఉన్నత విద్యనభ్యసించేందుకు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు నిష్ట, ప్రామాణికత, దక్షతతో విధులు నిర్వహించి ఉన్నత విద్యను బోధించాలన్నారు. 10 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. సమావేశంలో నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, సిండికేట్ సభ్యుడు చెన్నబసవ, జిల్లా విద్యాశాఖాధికారి బడిగేర్, విద్యా శాఖ అధికారులు ఈరణ్ణ, చంద్రశేఖర్, ఉపాధ్యాయుల సంఘం పదాధికారులు చంద్రశేఖర్రెడ్డి, యంకప్ప, మొయిన్ ఉల్ హక్, యంకప్ప, రమేష్, జయంతిరావ్, శివమూర్తిలున్నారు. -
పరువు నష్టం దావాలకు భయపడను
సాక్షి,బళ్లారి: బెదిరింపులకు తాను భయపడేది లేదని, నిజాలు ఉంటేనే మాట్లాడతానని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ, వ్యాపార జీవితంలో ఈ నమ్మ కన్నడ నాడు పత్రిక పెట్టినప్పుడు, అనంతరం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నెన్నో పరువు నష్టం దావాలు ఎదుర్కొన్నానన్నారు. మహామహులపై కూడా ఆధారాలతో సహా మాట్లాడినప్పుడు తనపై పరువునష్టం దావా కేసులు వేశారన్నారు. అలాంటి సందర్భంలో కూడా తాను భయపడలేదన్నారు. ఽప్రస్తుతం తమిళనాడుకు చెందిన లోక్సభ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కూడా పరువు నష్టం దావా కేసు వేయడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. కోట్లాది మంది పూజించే, కర్ణాటకలోనే కాకుండా యావత్ దేశం, ప్రపంచంలోనే భక్తులను కూడగట్టుకున్న సాక్షాత్తు శివుడు కొలువు దీరిన ధర్మస్థలపై కుట్రలు చేయడాన్ని తాను సహించబోనన్నారు. మతానికి మచ్చ తేవాలని చూస్తున్నారు హిందూ మతానికి మాయని మచ్చ తేవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ధర్మస్థలకు వెళ్లే భక్తులు, ప్రజలను భయపెట్టాలని ప్రయత్నించిన వారి కుట్రలు బహిర్గతం అయ్యాయన్నారు. అయితే వారి కుట్రల వెనుక ఎవరు ఉన్నారో బయటకు రావాలని పోరాటం చేస్తుమన్నారు. కర్ణాటకలో పలు జిల్లాల్లో జిల్లాధికారిగా పని చేసిన సెంథిల్ ఇక్కడ రాజీనామా చేసి అక్కడ రాజకీయాల్లోకి వెళ్లారన్నారు. తమిళనాడు నుంచి లోక్సభ సభ్యుడుగా గెలుపొందారన్నారు. ధర్మస్థలపై కుట్రల వెనుక సెంథిల్ హస్తం ఉందనే ఆరోపణలు నూటికి నూరుపాళ్లు నిజం అని గుర్తు చేశారు. సిట్ ద్వారా కాకుండా సీబీఐ, ఎన్ఐఏ ద్వారా సమగ్ర దర్యాప్తు చేపడితే ముసుగు వీరులు బయటకు వస్తారన్నారు. సెంథిల్కు నిజంగా నిజాయితీ ఉంటే తనపై పరువు నష్టం దావా కేసు వేసే బదులు సీఎం, డీసీఎంలను కలిసి ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరి ఉంటే బాగుండేదన్నారు. అప్పుడే ఆయన నిజాయితీ బయట పడేదన్నారు. సోనియా, రాహుల్ కూడా బెయిల్పై ఉన్నారు అలాంటిదిపోయి నిజాలు, వాస్తవాలు మాట్లాడిన తనపై పరువు నష్టం దావా కేసు వేస్తే ప్రయోజనం ఉండదన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు కూడా బెయిల్పై బయట తిరుగుతున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ధర్మస్థలపై అపప్రచారం చేసిన యూట్యూబ్ చానల్ వారికి కూడా ఎవరి అండదండలు ఉన్నాయో తేలాలన్నారు. శశికాంత్ సెంథిల్ బళ్లారికి అఽధికారిగా వచ్చినప్పుడు తనతో విభేదాలు ఉన్నాయన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆయన ఇక్కడకు పని చేసేందుకు వచ్చినప్పటి కంటే ముందే సీబీఐ తనను అరెస్ట్ చేసిందని గుర్తు చేశారు. ఈసందర్భంగా మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ, మాజీ బుడా అధ్యక్షుడు దమ్మూరు శేఖర్, కార్పొరేటర్ హనుమంతు, బీజేపీ నాయకులు ఉమారాజ్, హుండేకర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ధర్మస్థలపై కుట్రల వెనుక ఎవరెవరు ఉన్నారో తెలియాలి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి వెల్లడి -
పరిహారం కోసం రైతులు కోర్టుకు వెళ్లొద్దు
సాక్షి, బళ్లారి: కృష్ణా ప్రాజెక్ట్లకు సంబంధించి మూడవ దశ పనులకు వారంలోపు సమావేశం నిర్వహించి రైతులకు పరిహారం అందజేస్తామని, ఏ ఒక్క రైతు కోర్టుకు వెళ్లకూడదని, అలా జరిగితే పరిహారం అందించేందుకు ఆలస్యం అవుతుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. శనివారం ఆయన విజయపుర జిల్లాలో ఆల్మట్టి డ్యాంకు ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్తో కలిసి వాయనం సమర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా పథకానికి సంబంధించి రైతు నాయకుల పోరాటంతో గతంలో బెళగావిపై అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చ జరిగిందన్నారు. అందరి ఏకాభిప్రాయంతో నిర్ణయం అక్కడ అందరూ ఒప్పుకున్నారని, ప్రభుత్వం కూడా రైతుల డిమాండ్లను అంగీకరించిందన్నారు. ఉపముఖ్యమంత్రి కూడా ఈ ప్రాంత రైతులు, ఎమ్మెల్యేలతో చర్చించారని, అందరి ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి వచ్చామని గుర్తు చేశారు. కృష్ణా నదిపై నిర్మించిన అల్మట్టి డ్యాం ఎత్తును మూడో దశలో 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచడం వల్ల 130 టీఎంసీల నీటిని ఉపయోగించుకొనేందుకు వీలవుతుందన్నారు. అలాగే 173 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవాలని తీర్మానించడానికి యోచిస్తున్నామన్నారు. నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులతో డీసీఎం చర్యలు ఆల్మట్టి ఎత్తు పెంపుపై సంబంధించి కేంద్ర మంత్రి, ప్రధానమంత్రులతో కూడా ఉపముఖ్యమంత్రి కలిసి చర్చించారన్నారు. రైతులకు మేలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడతామన్నారు. 2025–26వ సంవత్సర బడ్జెట్లో బాగలకోటె, మంగళూరు, కోలారు తదితర జిల్లాల్లో మెడికల్ కాలేజీలను స్థాపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ స్థాపించి మరిన్ని వైద్య సీట్లు భర్తీ చేస్తామన్నారు. బాను ముస్తాక్ చేతుల మీదుగా దసరా ఉత్సవాలు ప్రారంభం దసరా ఉత్సవాలను బుకర్ ప్రైజ్ గ్రహీత బాను ముస్తాక్ చేతుల మీదుగానే నిర్ణీత తేదీల్లో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఈ విషయంలో బీజేపీ వ్యతిరేకించడం సరికాదన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో వ్యతిరేకించడం తగదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు పరిహారం అందజేస్తాం ఆల్మట్టి డ్యాం వద్ద ముఖ్యమంత్రి సిద్దరామయ్య -
మహనీయుల సిద్ధాంతాలు అనుసరణీయం
సాక్షి,బళ్లారి: మహనీయుల తత్వ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని వీరశైవ సమాజ ప్రముఖులు అన్నారు. శనివారం నగరంలోని అల్లం సుమంగళమ్మ మహిళా విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ పండితారాధ్య శివాచార్య మాట్లాడుతూ విద్యార్థులతో ముఖాముఖి సంవాదం చేశారు. 12వ శతాబ్ధంలో జన్మించిన బసవణ్ణ ఒక వ్యక్తి కాదు శక్తి అని, ఆయన నడిచిన దారి, చూపిన మార్గం యావత్ ప్రపంచం అనుసరిస్తోందన్నారు. భాల్కి హిరేమఠ బసవలింగ పట్టెద స్వామీజీ మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం బసవణ్ణ ఆదర్శాలు, తత్వసిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఉరవకొండ కరిబసవ రాజేంద్ర స్వామి, సండూరు విరక్తమఠం ప్రభుస్వామి, వీరశైవ సమాజ ప్రముఖులు పాల్గొన్నారు. అంతకు ముందు బసవ సంస్కృతి అభియాన్ ఉత్సవ రథానికి నగరంలో ఘనస్వాగతం పలికారు. మోకా రోడ్డులోని కేఆర్ఎస్ ఫంక్షన్ హాల్ నుంచి బసవ సంస్కృతి ఉత్సవ రథాన్ని వీరశైవ సమాజ ప్రముఖులు పాల్గొని స్వాగతించారు. విధాన పరిషత్ సభ్యుడు వై.ఎం.సతీష్, వీరశైవ సమాజ ప్రముఖులు మీనళ్లి చంద్రశేఖర్, తిమ్మనగౌడ, అల్లం ప్రశాంత్ తదితరులు పాల్గొని రథోత్సవంలో ఉంచిన బసవణ్ణ చిత్రపటానికి పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా, ద్విచక్ర వాహనాల్లో పెద్ద సంఖ్యలో వీరశైవ సమాజ ప్రజలు పాల్గొని ర్యాలీ నిర్వహించారు. -
ఈ ఏడాది 3,530 కేసులు..
● బెంగళూరుతో పాటు రాష్ట్రంలో 2024లో 4188 కేసులు నమోదు చేసి 2243 మంది డ్రగ్స్పెడ్లర్లను అరెస్ట్ చేసి రూ.165 కోట్ల విలువ చేసే 5,743 కిలోలు గంజాయి, 289 కేజీల సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ● 2025 జూలై వరకు 3,530 కేసులు నమోదు చేసి 980 మంది డ్రగ్స్పెడ్లర్లను అరెస్ట్చేసి రూ.135 కోట్ల విలువచేసే 2,582 కిలోల గంజాయి, 330 కిలోల సింథటిక్ డ్రగ్స్ని సీజ్ చేశారు. వీటిలో కొకైన్, ఎండీఎంఏ క్రిస్టల్, హెరాయిన్, తదితరాలు ఉన్నాయి. యాప్, సహాయవాణి.. ప్రజల నుంచి ఫిర్యాదులకు డ్రగ్స్ ఫ్రీ కర్ణాటక అనే మొబైల్ యాప్ విడుదల చేసి, 1042 సహాయవాణిని ఏర్పాటు చేశారు. డ్రగ్స్ గురించి తెలిస్తే వీటికి ఫిర్యాదు చేయవచ్చు. మత్తు పదార్థాలకు అడ్డుకట్టే తమ లక్ష్యమని, ప్రజలు డ్రగ్స్ గురించి సమాచారం అందించాలని నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్ సింగ్ తెలిపారు. -
నవ దంపతుల ఆదర్శం
● నేత్రదానానికి హామీ మైసూరు: పదేళ్ల పాటు ప్రేమించుకున్న ఓ జంట దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టింది. మైసూరు నివాసి చందన్, లావణ్య శనివారం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గుడిలో సరళరీతిలో మనువాడారు. ఈ సందర్భంగా తామిద్దరు మరణానంతరం నేత్రదానం చేస్తామని ఓ కంటి ఆస్పత్రికి ప్రమాణపత్రం రాసిచ్చారు. చందన్ మాట్లాడుతూ పెళ్లి రోజున సమాజానికి కానుకగా జ్ఞాపకంగా ఉండాలని వర నటుడు డాక్టర్ రాజ్కుమార్ చూపిన మార్గంలో నేత్రదానానికి అంగీకరించామని చెప్పారు. నవ దంపతులు అందరి ప్రశంసలకు పాత్రులయ్యారు. -
అనంత పద్మనాభ వ్రతం
కోలారు: భాద్రపద మాసం చతుర్థి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని శనివారం పలువురు తమ నివాసాలలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా అన్ని తాలూకాలల్లో వ్రతాన్ని ఆచరించారు. గౌరీ గణపతి పూజల 9 రోజుల తరువాత వచ్చే అనంత పద్మనాభ స్వామి వ్రతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సత్యనారాయణ వ్రతంతో సమానంగా భావించి ఆదిశేషునిపై శయనించిన మహా విష్ణువును పూజిస్తారు. కొన్ని కుటుంబాలు 14 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే, మరికొందరు జీవితాంతం ఏటేటా జరుపుతారు. ఐకమత్యమే ఓనం ఆశయం చిక్కబళ్లాపురం: ముద్దేనహళ్లి సత్యసాయి గ్రామంలో జరుగుతున్న ఒక జగత్తు – ఒక కుటుంబం సాంస్కృతిక వేడుకల్లో ఓనం ఉత్సవాలు కనువిందుగా సాగాయి. సద్గురు మధుసూదన్సాయి కేరళ ఓనం పండుగ ప్రాశస్త్యాన్ని వివరించారు. ఆధ్యాత్మిక మనోభావంతో నేను, నాది అనేది అహంకారం వదిలివేయాలన్నారు. ఆ భావాలు లేకుండా పండుగను ఐకమత్యంగా ఆచరించడమే ఓనం పండుగ ఆశయమని చెప్పారు. ఈ సందర్భంగా కేరళ కళాకారిణుల మోహినియాట్టం నృత్యం, చండె వాయిద్యాల ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. విషాద... భావన ● కవల కూతుళ్లలో ఒకరు మృతి యశవంతపుర: ప్రముఖ కన్నడ నటి, నృత్యకారిణి భావన రామన్న ఇటీవల ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చి కవల పిల్లలకు జన్మనివ్వడం తెలిసిందే. అలా ఆమె మాతృత్వ ఆనందాన్ని చవిచూస్తున్న తరుణంలో విషాద సంఘటన జరిగింది. కవల పిల్లల్లో ఒకరు కన్నుమూశారు. 40 ఏళ్ల భావన ఒంటరి మహిళగానే ఉన్నారు. అయితే మాతృత్వానికి అది అడ్డంకి కాదని చాటాలనే లక్ష్యంతో ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చినట్లు ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించడంతో పాటు ఫోటోలను కూడా అప్లోడ్ చేశారు. దీంతో అభిమానులు, సీ్త్రవాదులు హర్షం వ్యక్తంచేశారు. రెండు వారాల క్రితం ఒకే కాన్పులో కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరు అడ పిల్లలు జన్మించగా ఒక శిశువు శనివారంనాడు అస్వస్థతతో మృతి చెందినట్లు తెలిసింది. ఒక శిశువు అరోగ్యవంతురాలిగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 20, 30 ఏళ్లలో తాను తల్లి కావడం గురించి ఆలోచించలేదని, కానీ 40లలో ఆ భావన వెంటాడిందని ఆమె చెప్పేవారు. అందుకే పిల్లల కోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆమె విషాదంలో మునిగిపోయారు. -
బూటులో సర్పం.. ఆదమరిస్తే ప్రమాదం
శివమొగ్గ: చెప్పులు, బూట్లు వేసుకుంటున్నారా.. అయితే ఒక్క క్షణం వాటిలో ఏమైనా ఉన్నాయా అని పరిశీలించడం మంచిది. ఇటీవల బెంగళూరులో చెప్పులో దూరిన పాము కరిచి టెక్కీ మరణించడం తెలిసిందే. అదే మాదిరిగా ఇంటి చెప్పుల స్టాండ్లో షూలోకి పాము చేరిన ఘటన శివమొగ్గ నగరంలోని విద్యానగర కంట్రీ క్లబ్ రోడ్డులో జరిగింది. వివరాలు.. వెంకటేష్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోని చెప్పుల స్టాండ్ వద్ద వదిలిన షూలోకి క్యాట్ స్నేక్ రకానికి చెందిన ఓ పాము చేరింది. అది చూసిన ఇంటివారు వెంటనే ఉరగ సంరక్షకుడు స్నేక్ కిరణ్కు సమాచారం అందించారు. కిరణ్ దానిని సురక్షితంగా బంధించారు. ఇది అరుదైన క్యాట్ స్నేక్ అని, విషరహిత వర్గానికి చెందినదని తెలిపారు. వర్షాకాలంలో పాములు ఇలా వెచ్చని చోటు కోసం వెదుక్కొని వస్తాయన్నారు. ఇంటి బయట వదిలిన షూలను వేసుకునే సమయంలో కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు. డిప్యూటీ సీఎం ఇంటిలో... శివాజీనగర: బెంగళూరులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధికారిక నివాసంలో శనివారం నాగుపాము పిల్ల కనిపించింది. కంగారు చెందిన సిబ్బంది తక్షణమే వన్యజీవి పరిరక్షకుడు ప్రసన్నకుమార్కు సమాచారం అందించారు. ఆయన వచ్చి పాము పిల్లను పట్టుకున్నారు. ఈ సమయంలో డీకే ఆ ఇంటిలో లేరు. శివమొగ్గలో మరో ఘటన -
ధర్మస్థల కుట్ర వెనుక కేరళ ఎంపీ?
బనశంకరి: ధర్మస్థల చుట్టుపక్కల వందలాది శవాలను పూడ్చిపెట్టారని దుష్ప్రచారం చేసిన కుట్ర వెనుక కొందరు ఎంపీలు, యూట్యూబర్లు, సామాజిక కార్యకర్తలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సిట్ అధికారులు చిన్నయ్యను అరెస్ట్ చేసి సుమారు రెండు వారాలుగా విచారిస్తున్నారు, కొందరు ప్రముఖ వ్యక్తుల హస్తం ఉన్నట్లు అతడు నోరువిప్పాడు. చిన్నయ్య మకాం పెట్టిన ఇళ్లు , అపార్టుమెంట్లలో సైతం గాలించి సమాచారం సేకరించారు. పుర్రె తీసుకొచ్చిన ముఠా.. చిన్నయ్యతో కేరళ ఎంపీని కలిసి సహాయం అడిగినట్లు విచారణలో తెలిసింది. తమిళనాడు ఎంపీ పేరు సైతం ఈ కేసులో వెలుగులోకి రాగా, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఓ కేరళ ఎంపీ పేరు వచ్చింది. దీంతో ఆ దిశగా సిట్ అధికారులు విచారణ సాగిస్తున్నారు. ధర్మస్థల కేసులో ఏ ఆధారంతో తనపై ఆరోపణలు చేస్తున్నారో గంగావతి బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి సమాధానం చెప్పాలని తమిళనాడు ఎంపీ, మాజీ ఐఏఎస్ శశికాంత్ సెంథిల్ డిమాండ్ చేశారు. జనార్దనరెడ్డి పై పరువునష్టం కేసు వేయడానికి శనివారం బెంగళూరు నగర సిటీసివిల్ కోర్టుకు ఆయన వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ ఏదో వాట్సాప్ మెసెజ్ చూసి మాస్టర్మైండ్ అని తనపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. పదేళ్లు కర్ణాటకలో పనిచేశానంటూ జనార్దనరెడ్డిపై పలు ఆరోపణలు గుప్పించారు. మాస్కుమ్యాన్ చిన్నయ్యకు తలపుర్రెను ఇచ్చింది వృద్ధురాలు సౌజన్యభట్ మామ విఠల్గౌడ అని సిట్ విచారణలో వెలుగుచూసింది. దీంతో ఏక్షణంలోనైనా విఠల్గౌడ ను అరెస్ట్చేసే అవకాశం ఉంది. విఠల్గౌడ, చిన్నయ్య కు పాత స్నేహం ఉంది. విఠల్ నేత్రావతి నది తీరంలో చిన్న హోటల్ను నడుపుతున్నాడు. ఈ కుట్రలో అతడు కూడా భాగమైనట్లు సిట్ అనుమానిస్తోంది. నిందితుడు చిన్నయ్యకు కోర్టు జుడీషియల్ కస్టడీని విధించింది. చిన్నయ్యకు 15 రోజుల సిట్ కస్టడీ ముగియడంతో శనివారం ధర్మస్థల దగ్గర ఉండే బెళ్తంగడి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో చిన్నయ్యను శివమొగ్గ కేంద్ర కారాగారానికి తరలించారు. సిట్ విచారణలో చెప్పిన మాస్క్మ్యాన్ శివమొగ్గ జైలుకు చిన్నయ్య.. ఎంపీ సెంథిల్ పరువు నష్టం కేసు.. పుర్రె తెచ్చింది విఠల్గౌడ.. -
బాలికపై వీధికుక్కల దాడి
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో కుక్కల దాడులు పెరిగిపోయాయి. ప్రశాంతంగా రోడ్డు మీద కూడా వెళ్లే అవకాశం ఇవ్వడం లేదు. బాలికపై వీధి కుక్కలు దాడి చేసిన సంఘటన బెంగళూరు రూరల్లోని హొసకోటలో చోటుచేసుకుంది. గోకుల్ డైరీ రోడ్డు వద్ద బాలిక నడుచుకుంటూ వెళ్తుండగా ఐదు వీధికుక్కలు దాడి చేసి కరిశాయి. బాలిక భయాందోళనతో కేకలు వేసింది. స్థానికులు కుక్కల్ని తరిమికొట్టి బాలికను కాపాడరు. అయితే ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పట్టణంలో కుక్కల గోల విపరీతంగా ఉందని, మున్సిపల్ అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ప్రేమ కోసమని కత్తులతో బాలల రగడ దొడ్డబళ్లాపురం: ఒక బాలికతో ప్రేమ వ్యవహారంలో ఇద్దరు బాలురు ఘర్షణపడ్డ సంఘటన బెళగావిలో జరిగింది. బెళగావి పట్టణంలోని రాయల్ స్కూల్ వద్ద ఇద్దరు బాలలు తామిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నామని వాగ్వాదానికి దిగి కొట్టుకున్నారు. పైగా పరస్పరం కత్తులతో పొడుకున్నారు. వీరి గొడవలో తలదూర్చిన మరో ఇద్దరు మైనర్లు కూడా గాయపడ్డారు. ఓ బాలున్ని బిమ్స్ ఆస్పత్రికి తరలించగా, మరొకరిని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. బెళగావి ఏపీఎంసీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలల పెడధోరణిని చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. చిన్నారిని చిదిమిన స్కూల్ బస్సు దొడ్డబళ్లాపురం: స్కూల్ బస్సు దిగుతుండగా డ్రైవరు బస్సును నడపడంతో బాలిక బస్సు కిందపడి మృతిచెందిన సంఘటన బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా ఎక్కంబా గ్రామంలో జరిగింది. కావేరి ఆకాశ్ (6) మృతురాలు. కావేరిని ఇంటి వద్ద స్కూల్ బస్సు దిగుతుండగా బాలిక లోపే డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో చిన్నారి కిందకు పడిపోగా, బస్సు చక్రాలు ఆమె మీద నుంచి వెళ్లాయి. తీవ్ర గాయాలైన బాలిక అక్కడే కన్నుమూసింది. స్కూలు నుంచి తిరిగి వస్తుందని చూసిన తల్లిదండ్రులు విగతజీవిగా మారిన కూతురిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. బస్సు డ్రైవర్పై ఔరాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు. పాము కాటుకు మహిళా రైతు బలి దొడ్డబళ్లాపురం: సర్పం కాటువేయడంతో మహిళా రైతు అసువులు బాసిన సంఘటన కనకపుర తాలూకా హలసూరు గ్రామంలో జరిగింది. గ్రామవాసి శోభ (43) మృతురాలు. ఈమె శుక్రవారం తమ పొలంలో టమాటా చెట్ల నుంచి కాయలు కోస్తూ ఉండగా చెట్ల మధ్య ఉన్న పాము కాటువేసింది. 20 నిమిషాల్లోనే ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు సాతనూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించి కనకపుర ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో మరణించింది. కాంట్రాక్టరుకు రూ.18 లక్షల మస్కా మైసూరు: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు పొందవచ్చనే ఆశతో విద్యుత్ కాంట్రాక్టర్కు సైబర్ నేరగాళ్లు రూ.18.42 లక్షలను టోపీ వేశారు. మైసూరులోని విశ్వేశ్వరయ్యనగర నివాసి అయిన విద్యుత్ కాంట్రాక్టర్కు వాట్సాప్ ద్వారా సందేశం పంపిన దుండగులు షేర్ మార్కెట్ గురించి వివరించారు. డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు గడించవచ్చని ఆశ పుట్టించారు. వారి మాటలను నమ్మిన కాంట్రాక్టర్ దశల వారీగా రూ.18.42 లక్షలను దుండగులు చెప్పిన ఖాతాకు బదిలీ చేసి మోసపోయాడు. వంచనను గ్రహించి సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పెళ్లి రద్దు.. కాంట్రాక్టు ఉద్యోగిని ఆత్మహత్య మండ్య: ఇటీవలే నిశ్చితార్థం జరిగింది, త్వరలో పెళ్లయి సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువతి.. ప్రాణాలు తీసుకుంది. పెళ్లి రద్దు కావడమే దీనికి కారణం. మండ్య జిల్లాలోని కేఆర్పేటె తాలూకాలోని కిక్కేరిలో ఈ విషాదం జరిగింది. వివరాలు.. స్థానిక వ్యవసాయ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిని కావ్య (28)కు, 15 రోజుల క్రితం హాసన్కు చెందిన కరణ్ అనే యువకునితో పెద్దలు నిశ్చితార్థం జరిపించారు. కరణ్ డిగ్రీ పూర్తి చేసి ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పాడు. యువతి కుటుంబీకుల పరిశీలనలో ఇది అబద్ధమని తేలింది. దాంతో పనీపాటా లేని వ్యక్తితో పెళ్లి వద్దని కావ్య తండ్రి తేల్చిచెప్పాడు. మరోవైపు పెళ్లి ఖరారైందని స్నేహితులకు, సహోద్యోగులకు చెప్పుకొన్న కావ్య ఈ పరిణామంతో విరక్తి చెందింది, 4వ తేదీన కిక్కేరిలో వ్యవసాయ ఆఫీసులో పురుగుల మందు తాగిపడిపోయింది. సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసి బిజీఎస్ ఆస్పత్రికి తరలించగా ఆమె శనివారం కన్నుమూసింది. పెళ్లి వాయిద్యాలు మోగాల్సిన ఇంట విషాదం తాండవించింది. -
కుటుంబాన్ని వదిలి.. ప్రియుడితో కదిలి..
బెంగళూరు: భర్త, ముగ్గురు పిల్లలను వదిలి మహిళ ఒకరు తన ప్రియుడితో కలిసి పారిపోయిన ఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని బన్నేరుఘట్ట సమీపంలో ఉన్న బసవనపుర గ్రామంలో గత నెల 31వ తేదీన జరిగింది. మహిళ తన ప్రియుడితో వెళ్లిపోవడంతో తల్లి లేక ముగ్గురు పిల్లలు, భార్య పోయిన బాధలో భర్త కన్నీరుమున్నీరవుతున్నారు.మంజునాథ్, లీలావతి దంపతులు 11 ఏళ్ల క్రితం పరస్పరం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి కుటుంబంలోకి సంతోష్ అనే వ్యక్తి చొరబడి చిచ్చురేపాడు. లీలావతి సంతోష్తో వివాహేతర సంబంధం పెట్టుకొని గత నెల 31వ తేదీన ఇంటిలో నుంచి వెళ్లిపోయింది. లీలావతి భర్త మంజునాథ్ బన్నేరుఘట్ట పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యను తనకు అప్పగించాలని భోరున విలపిస్తున్నాడు. పిల్లలను చూసుకునేవారు లేరు ముగ్గురు పిల్లలు కూడా చిన్నవారని, వారిని చూసుకునే వారు ఎవరూ లేరని, తన భార్య తనకు కావాలని మంజునాథ్ బోరుమంటున్నాడు. లీలావతి వెళ్లిపోయి ఆరు రోజులైనా పిల్లలకు ఒక ఫోన్ కూడా చేయలేదు. దీంతో తమకు అమ్మ కావాలని చిన్నారులు విలపిస్తున్నారు. -
సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్
బెంగళూరు: కర్ణాటకలోని మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూ కేటాయింపుల కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరట లభించింది. ఈ వ్యవహారంలో సీఎం సిద్దరామయ్య, ఆయన కుటుంబ సభ్యులకు కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. ముడా కేసులో వచ్చిన ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి, అసత్యమైనవే అని జస్టిస్ పీ.ఎన్. దేశాయ్ నేతృత్వంలోని ఏకసభ్య విచారణ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు కమిషన్ నివేదిక సమర్పించింది. దీంతో, సిద్దరామయ్యకు ఉపశమనం లభించింది.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని ముడా భూముల వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, కుటుంబ సభ్యులకు.. భూములు అక్రమంగా కేటాయించారన్న ఆరోపణలు వచ్చాయి. మొత్తం 14 స్థలాలు అక్రమంగా కేటాయించారని తీవ్ర విమర్శలు బయటకు వచ్చాయి. అయితే, విచారణలో ఈ ఆరోపణలకు ఏ మాత్రం ఆధారాలు లేవని, కనీసం చట్ట ఉల్లంఘన కూడా జరగలేదని పీ.ఎన్. దేశాయ్ కమిషన్ నివేదికలో పేర్కొంది. డీ-నోటిఫై అయిన భూములను ముడా తిరిగి వినియోగించుకున్నందుకు భూమి యజమానులకు పరిహారంగా స్థలాలు కేటాయించడమైందని, ఇది చట్ట ప్రకారమే జరిగిందని నివేదిక స్పష్టం చేసింది.దీంతో, ముడా కేసులో సీఎం సిద్దరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, నిరాధారమని విచారణ కమిషన్ స్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా ఇంతకుముందు ఈ కేసును పరిశీలించిన కర్ణాటక లోకాయుక్త కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా తెలిపింది. సరైన ఆధారాలు లేకపోవడం వల్లనే క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసినట్లు వెల్లడించింది. ఇక, తాజాగా ఈ విషయాన్ని న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్.కె. పాటిల్ వెల్లడించారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం విధాన సౌధలో మీడియాతో పాటిల్ మాట్లాడుతూ.. జస్టిస్ పీ.ఎన్. దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ సమర్పించిన నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదం తెలిపిందని చెప్పారు.The commission headed by retired judge P.N. Desai gives a clean chit to the family of Chief Minister Siddaramaiah in the MUDA 'scam'.@nagarjund with more details.#MUDAScam #ITVideo #Karnataka pic.twitter.com/IWfF00GVRc— IndiaToday (@IndiaToday) September 5, 2025ఇదిలా ఉండగా.. కొందరు ముడా అధికారుల పనితీరుపై కమిషన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2020 నుంచి 2024 మధ్య పనిచేసిన కొంతమంది కమిషనర్లు నిబంధనలకు విరుద్ధంగా, తమకు ఇష్టమొచ్చినట్లు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించారని పేర్కొంది. ఈ అక్రమాలపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో, ప్రభుత్వం చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. -
లంచం తీసుకుంటూ.. ఎస్ఐ, పోలీసుల పరారీ
దొడ్డబళ్లాపురం: లంచం తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త అధికారులు దాడి చేయగా ఠాణా నుంచి కానిస్టేబుల్, మహిళా ఎస్సై పరారైన సంఘటన దేవనహళ్లిలో చోటుచేసుకుంది. పోక్సో కేసులో అనుకూలంగా చార్జ్షిట్ తయారు చేస్తామని, ఇందుకు రూ.70 వేలు ఇవ్వాలని దేవనహళ్లి పోలీస్స్టేషన్ మహిళా ఎస్సై జగదేవి, ఇద్దరు కానిస్టేబుళ్లు డిమాండు చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. దీంతో బాధితుడు లోకాయుక్తను ఆశ్రయించాడు. అతని నుంచి రూ.50 వేలు లంచంగా తీసుకుంటుండగా బుధవారం సాయంత్రం లోకాయుక్త పోలీసులు దాడి చేశారు. కానిస్టేబుల్ అమరేశ్ పట్టుబడగా మరో కానిస్టేబుల్ మంజునాథ్, ఎస్సై జగదేవి ఇద్దరూ కాలికి బుద్ధిచెప్పారు. లోకాయుక్త ఎస్పీ వంశీకృష్ణ ఆధ్వర్యంలో దాడి జరిగింది. ఠాణాలో సోదాలు చేసి పలు రికార్డులను సీజ్ చేశారు. పరారైన వారి కోసం గాలింపు సాగుతోంది. ఈ సంఘటన తీవ్ర సంచలనం కలిగిస్తోంది. \లైన్మ్యాన్కు షాక్ మీటర్ మార్చడానికి రూ.10 వేలు లంచం డిమాండు చేసిన బెస్కాం లైన్మ్యాన్ లోకాయుక్తకు చిక్కిన సంఘటన చెన్నపట్టణలో చోటుచేసుకుంది. చెన్నపట్టణ తాలూకా బేవూరు బెస్కాం సబ్ డివిజన్ లైన్మ్యాన్ రమేశ్ను హనుమంతయ్య అనే వ్యక్తి కలిసి ఇంటి పాత మీటర్ మార్చి కొత్త మీటర్ అమర్చాలని కోరాడు. ఇందుకు రూ.10వేలు లంచం అడిగాడు. ఆ లంచం తీసుకుంటుండగా లోకాయుక్త సిబ్బంది దాడి చేసి రమేశ్ని పట్టుకున్నారు. -
స్థానిక ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే
బనశంకరి: రానున్న జిల్లా పరిషత్, గ్రామ, తాలూకా పంచాయతీ తదితర స్థానిక సంస్థల ఎన్నికలను ఓటింగ్ యంత్రాలకు బదులు బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి మంత్రివర్గం ఆమోదించింది. ఈవీఎంలను పక్కనపెట్టాలని సిద్దరామయ్య సర్కారు నిర్ణయించడం గమనార్హం. 37 కిలోమీటర్ల మెట్రో కారిడార్ గురువారం సీఎం సిద్దరామయ్య అధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం జరిగింది, అందులో పలు ముఖ్య నిర్ణయాలను తీసుకున్నారు. మంత్రి హెచ్కే.పాటిల్ విలేకరులకు భేటీ వివరాలను వెల్లడించారు. బెంగళూరు మెట్రో ఎలివేటెడ్ కారిడార్కు మంత్రివర్గ ఆమోదం తెలిపింది. మెట్రో మూడో స్టేజ్ జేపీ నగర 4 వ స్టేజ్ నుంచి హెబ్బాళ వరకు, హొసహళ్లి నుంచి మాగడిరోడ్డు మార్గంగా కడబగరె వరకు 37.12 కిలోమీటర్లు పొడవు డబల్డెక్కర్ రైలుమార్గం నిర్మాణానికి అనుమతించారు. ● మైసూరులో ముడా స్థలాల కుంభకోణం గురించి పీఎన్.దేశాయి కమిషన్ ఇటీవల నివేదికను అందజేసింది. సీఎం సిద్దరామయ్య కుటుంబంపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని నివేదిక పేర్కొన్నారని మంత్రి హెచ్కే.పాటిల్ తెలిపారు. కేబినెట్ భేటీలో సర్కారు నిర్ణయం ఈవీఎంల వాడకానికి నో మెట్రో ఎలివేటెడ్ కారిడార్కు ఓకే ఈవీఎంలు వద్దని సిఫార్సు త్వరలో రాష్ట్రంలో జరగబోయే అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ల ఓటింగ్ పద్ధతిని పాటించాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశాం. ఈవీఎంలపై ఎంతోమంది అనుమానాలు, ఫిర్యాదులు చేస్తున్నారు. సర్కారు సిఫార్సును ఈసీ పాటించేలా అన్ని చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. అలాగే ఆ ఎన్నికల కోసం ఓటరు జాబితాలను సవరించాలని ఈసీకి సూచిస్తామని చెప్పారు. -
బెట్టింగ్ కింగ్ ఆటకట్టు?
సాక్షి బళ్లారి: చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ.వీరేంద్ర పప్పి మీద ఈడీ దాడులు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ సర్కారుతో పాటు ప్రజాప్రతినిధులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఆయనతో సంబంధాలు ఉన్నవారు ఇప్పుడు ఈడీ పిలుపు వస్తుందని వణికిపోవడం గమనార్హం. ఆగస్టు 23వ తేదీ నుంచి చిత్రదుర్గ ఎమ్మెల్యే వీరేంద్ర, సన్నిహితుల ఇళ్లు, ఆఫీసులు, క్యాసినో కేంద్రాల్లో ఈడీ విస్తృత తనిఖీలు చేపట్టింది. చిత్రదుర్గ, చెళ్లకెరె, గోవా, ముంబై తదితర ప్రాంతాల్లో ఆయన జూద వ్యాపారాలు విస్తరించాయి. ఖరీదైన కార్లు, నగదు సీజ్ బెంగళూరు, చిత్రదుర్గ, చెళ్లకెర తదితర ప్రాంతాల్లో ఆయన నివాసాల్లో అత్యంత ఖరీదైన కార్లు, భారీగా నగదు ఉన్నట్లు వెలుగు చూసింది. విలాసవంతమైన ఐదు కార్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. తొమ్మిది బ్యాంక్ ఖాతాలలో ఉండిన రూ.55 కోట్ల నగదును జప్తు చేసినట్లు సమాచారం. బెట్టింగ్, క్యాసినోలు తదితర వ్యాపారాల ద్వారా వచ్చే నగదు నిర్వహణకు ఏకంగా 262 బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేసుకొన్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. వీరేంద్ర సోదరుడైన కేసీ.తిప్పేస్వామి, కొందరు సన్నిహితులు గోవా, ముంబై నుంచి కథ నడిపేవారు. అంతే కాకుండా వీరేంద్ర కింగ్ పేరుతో 567, రాజా 567, లయన్ 567 లాంటి వెబ్సెట్ల ద్వారా ఆన్లైన్ పందేల ద్వారా రెండుచేతులా ఆర్జించారని ఈడీ ఆరోపిస్తోంది. మరోవైపు వీరేంద్ర పప్పి ఈడీ కస్టడీని బెంగళూరు కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. గురువారం కోర్టులో హాజరుపరిచి విచారణ కొనసాగించాల్సి ఉందని ఈడీ న్యాయవాదులు కోరగా కోర్టు అనుమతించింది. పప్పి వకీళ్ల వాదనలు వీగిపోయాయి. ఈడీ గుప్పిట్లో చిత్రదుర్గ ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి విలాసవంత కార్లు, నగదు సీజ్ కొనసాగుతున్న ఈడీ కస్టడీ -
గుంతల రోడ్లు ఉండరాదు
● కేంద్ర పాలికె కమిషనర్ బనశంకరి: కేంద్ర నగర పాలికె పరిధిలో వాహన సంచారం, సురక్షత, మౌలిక సౌకర్యాలను మెరుగుపరచాలి. గుంతలు రహిత, బ్లాక్స్పాట్ రహిత, ఆక్రమణ రహిత ఫుట్పాత్ మార్గాల నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆ పాలికె కమిషనర్ రాజేంద్రచోళన్ తెలిపారు. గురువారం కేంద్రనగర పాలికె కార్యాలయాన్ని సందర్శించి ఇంజినీర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రమాదాలు సంభవించకుండా ముందుజాగ్రత్తచర్యలు తీసుకోవాలన్నారు. గుంతల రోడ్లకు మరమ్మతులు చేయాలన్నారు. కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పగించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గుంతల రోడ్లపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. సీబీడీ రోడ్డు, టెండర్షూర్ రోడ్లు, వైట్ టాపింగ్ రోడ్లు, హైడెన్సిటి కారిడార్ రోడ్లుగా రహదారులను విభజించి ఆదర్శ రోడ్లుగా తీర్చిదిద్దాలని పాలికె ఇంజినీర్లకు సూచించారు. మెట్రో పిల్లర్లకు హంగులు, రోడ్లు పక్కన పచ్చదనం కోసం మొక్కలు నాటడం, అవసరమైనచోట వీధి దీపాలను అమర్చాలని తెలిపారు. ప్రతివారం ఒక రోడ్డులో ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించి స్వచ్ఛతా అభియాన చేపట్టాలన్నారు. రౌడీ బిక్లు హత్య కేసులో కస్టడీ యశవంతపుర: బెంగళూరు కేఆర్ పురకు చెందిన రౌడీషీటర్ బిక్లు శివకుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు జగదీశ్ను ఐదు రోజుల పాటు విచారణ నిమిత్తం కోర్టు సీసీబీ కస్టడీకీ అనుమతించింది. బిక్లు శివ హత్య కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న జగదీశ్ను సీఐడీ పోలీసులు ఢిల్లీ విమానాశ్రయంలో ఇటీవల బంధించారు. అతనిపై కోకా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ హత్యకు కారణాలు విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఓ బీజేపీ ఎమ్మెల్యే కూడా నిందితునిగా ఉండడంతో అందరి కళ్లు ఈ కేసు మీదే ఉన్నాయి. -
మైసూరు ఉత్సవాలకు రారండి
మైసూరు: మైసూరు దసరా మహోత్సవాలు ప్రారంభం కావడానికి ముందుగా జరిగే యువ సంభ్రమ వేడుకలు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మైసూరు మానస గంగోత్రిలోని బయలు రంగమందిరంలో జరుగుతాయి. యువత కోసం జరిగే ఈ ఉత్సవాలలో కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు రంజింపచేయబోతున్నాయి. కన్నడ చిత్ర నటుడు అయిన యువ రాజ్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని నాంది పలుకుతారు. 8 రోజులపాటు సంబరాల సందడి అంబరాన్ని దాటనుంది. ఈసారి 14 థీమ్స్లో భాగంగా వివిధ కాలేజీలకు చెందిన 400 నుంచి 500 బృందాలు నృత్య కళా ప్రదర్శనలతో అలరిస్తాయి. రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యువ సంభ్రమ సందడి కొనసాగుతుంది. మంత్రి మహాదేవయ్య, జిల్లాధికారి, ఇతర అధికారులు గురువారం సాయంత్రం బెంగళూరుకు చేరుకుని సీఎం సిద్దరామయ్యకు మైసూరు దసరా ఉత్సవాలకు ఆహ్వానం పలికారు. -
శిశు విక్రయం.. ముగ్గురు అరెస్టు
యశవంతపుర: అత్యాచారం వల్ల జన్మించిన శిశువును అమ్మిన ముగ్గురు సభ్యుల ముఠాను ఉడుపి పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళూరుకు చెందిన వైద్యుడు డాక్టర్ సోమేశ్ సొలొమన్, మధ్యవర్తి విజయలక్ష్మీ, అత్యాచార నిందితుడు నవనీత్ నారాయణలను అరెస్ట్ చేశారు. వివరాలు.. అత్యాచారానికి గురైన యువతి గర్భం దాల్చగా, అంగన్వాడీ నుంచి పోషణ్ అభియాన కింద ఆహార పదార్థాలు తీసుకునేది. కాన్పు అయిన తరువాత శిశువు ఆమె వద్ద లేదని బయట పడింది. పోలీసుల దర్యాప్తులో శిశువును రూ. 4 లక్షలకు అమ్మేసినట్లు బయట పడింది. నవనీత్ నారాయణ మానసిక వైకల్యం గల యువతిపై అత్యాచారం చేశాడు. యువతికి శిశువు జన్మించిన తరువాత ఉడుపి దంపతులకు ఆస్పత్రిలోనే అమ్మేశారు. ఇందులో డాక్టర్ సోమేశ్ సోలోమన్, మధ్యవర్తి పాత్ర ఉంది. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే శిశువును కొన్న దంపతులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. యువతి మృతి.. ప్రభుత్వ ఆస్పత్రిపై దాడిమండ్య: చికిత్సకు తీసుకువచ్చిన యువతి చనిపోయిందని వైద్యులు చెప్పడంతో పెద్ద గొడవ జరిగింది. జిల్లాలోని మళవళ్ళి పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. కొళ్లేగాలకు చెందిన ద్వితీయ పియుసి విద్యార్థిని షిఫా అనే యువతి హలగూరులో తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో షిఫాకు అనారోగ్యంగా ఉండడంతో హలగూరులోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో మళవళ్లిలోని తాలూకా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యాధికారి మురళి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆమె మరణించింది అని చెప్పడంతో కొందరు యువకులు రభస చేశారు. వైద్యునిపై దాడి చేసి కొట్టారు. అద్దాలను, బెంచీలను ధ్వంసం చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి దుండగులను అడ్డుకున్నారు. ఈ దాడితో వైద్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వారికి సంప్రదాయం తెలుసా? ● సర్కారుపై మంత్రి సోమణ్ణ ధ్వజం మైసూరు: చాముండి కొండ భక్తికి, నమ్మకానికి చరిత్రకు మరో పేరని, ఈసారి దసరా వేడుకలను ప్రారంభించే వారికి కన్నడనాడిన శక్తిమాత చాముండేశ్వరి దేవి చరిత్రను, గొప్పదనాన్ని తెలిసేలా చేయాలని కేంద్ర మంత్రి వి.సోమణ్ణ అన్నారు. గురువారం మైసూరు అతిథి గృహంలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. దసరా ఉత్సవాలను ప్రారంభించే వారికి సంప్రదాయం గురించి తెలియాలని పరోక్షంగా రచయిత్రి బాను ముష్తాక్ను ఎంపిక చేయడం గురించి విమర్శించారు. కార్యక్రమంలో పాల్గొనేవారికి ఏమి చేస్తున్నారు, దాని గురించి తెలుసా, లేదా, ఆ అర్హత ఉన్నదా లేదా అని కూడా చర్చ జరగాలని అన్నారు. ఎవరైనా గానీ సంప్రదాయాలను కాపాడాలి తప్ప తప్పుడు నిర్ణయాలను తీసుకోరాదని రాష్ట్ర సర్కారుపై మండిపడ్డారు. ప్రభుత్వం ఎవరిని సంతోషపెట్టడానికి దసరా ప్రారంభకులను ఎంపిక చేసిందో అర్థం కావడం లేదని విమర్శించారు. -
కంటి చికిత్సల పథకం
● ఆశాకిరణ పథకం అన్ని జిల్లాల్లో అమలు చేయడానికి రూ.52.85 కోట్లు నిధుల మంజూరు. ఈ పథకం ద్వారా ప్రజలకు కంటి పరీక్షలను నిర్వహించి అంధత్వ నివారణ చర్యలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. ● బెంగళూరు దక్షిణ జిల్లా కనకపుర తాలూకా రాయసంద్ర గ్రామంలో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు. ఇందుకు కర్ణాటక గృహమండలి నుంచి రూ.65 కోట్లతో 25 ఎకరాల భూమి కొనుగోలు చేయడానికి పాలనాత్మక ఆమోదం. ● రైతులు, కన్నడపరపోరాటదారులపై ఉన్న 60 కేసుల మాఫీకి అనుమతి ● వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ సమితుల శుల్కం మార్పు చేశారు. మార్కెట్ శుల్కం 41 పైసలు నుంచి 42 పైసలకు పెంచారు. -
మళ్లీ ముంచెత్తిన వానలు
బొమ్మనహళ్లి/ శివాజీనగర: బెంగళూరు నగరంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది. బొమ్మనహళ్ళి నియోజకవర్గంలోను కుండపోత వాన కురిసి లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయంగా మారాయి. హెచ్ఎస్ఆర్ లేఔట్, బొమ్మనహళ్ళి, గారెబావిపాళ్య, హొంగసంద్ర, అరికెరె, బిళ్ళెకళ్ళి, కొడిచిక్కనహళ్ళిలో పరిధిలోని లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయంగా మారాయి. ముఖ్యంగా అరికెరె వార్డు పరిధిలోఉన్న న్యానప్పనహళ్ళి, హులిమావులోని అనేక పల్లపు ప్రాంతాల్లోకి వాననీరు చేరింది జలమయంగా మారాయి. రోడ్లుపైన కూడా వాననీరు ప్రవహించడంతో చెరువులను తలపించాయి. మాజీ కార్పొరేటర్ పురుషోత్తమ్, మురళీధర్లు వర్ష బాధిత ప్రాంతాలలో పర్యటించి అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని కోరారు. రాజ్భవన్ రోడ్డులో గాలీవానకు పెద్ద చెట్టు కూలిపోయింది. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో ఎవరికీ హాని కలగలేదు. అనేక కూడళ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. రాష్ట్రంలో వారంపాటు వర్షాలు రాష్ట్రంలో ఈ వారాంతం వరకు కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం అధికమైంది. రాష్ట్రంలో కరావళి, కళ్యాణ కర్ణాటక భాగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతీయ వాతావరణ శాఖ బెంగళూరు కేంద్ర డైరెక్డర్ సీ.ఎస్.పాటిల్ తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల 7 వరకు యాదగిరి, కొప్పళ, బీదర్, కల్బుర్గి జిల్లాల్లో విస్తారంగా, కొన్నిచోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపారు. కరావళి జిల్లాలైన ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలకు కుండపోత అవకాశముంది. మలెనాడు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షం, ఉత్తర, దక్షిణ ఒళనాడు జిల్లాల్లో చెదురు మదురు వానలు కురిసే ఆస్కారముంది. బెంగళూరు, చుట్టుప్రక్కల జిల్లాల్లో ఆకాశం మబ్బులు కమ్ముకుని ఉంటుంది, బెంగళూరులో కుండపోత మరికొన్ని రోజులు వర్షసూచన కారుపై పడిన కొమ్మ శివమొగ్గ: కారు వెళుతున్న సమయంలో భారీ చెట్టు కొమ్మ విరిగి పడటంతో కారు స్వల్పంగా దెబ్బతింది. ఈ సంఘటన శివమొగ్గ తాలూకాలోని ఆయనూరు వద్ద చిన్నమనె గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. స్విఫ్ట్ కారు వెళ్తుండగా ఈదురుగాలులు వీచాయి, హఠాత్తుగా చెట్టు కొమ్మ విరిగి కారుపైన పడింది. కారులో ఉన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. -
డ్యాం గేట్ల మార్పుపై సర్కార్ నిర్లక్ష్యం
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాం గేట్ల మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ ఆరోిపించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది 19వ నంబరు క్రస్ట్గేట్ తెగిపోవడంతో శాస్త్రవేత్తలు మిగిలిన 30 గేట్లు కూడా అధ్వాన స్థితికి చేరుకున్నందున మార్చాలని నివేదిక ఇచ్చినా సర్కార్ వారి సూచనను పెడచెవిన పెట్టిందన్నారు. 2025–26లో రబీ సీజన్లో వరి పంటను పండించుకోవడానికి వీలు లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య గేట్ల అమరికకు చర్యలు చేపట్టడంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారన్నారు. డ్యాంలో 30 శాతం పూడిక పేరుకుందన్నారు. డ్యాం పరిధిలో సిబ్బంది కొరత ఉందన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్తో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. జిల్లాలో ఎరువుల కొరత అధికంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై ఈనెల 8న టీబీ డ్యాం వద్ద ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. 8న టీబీ డ్యాం వద్ద ఆందోళన -
అనుమానాస్పద రీతిలో నక్సలైట్ అరెస్ట్
రాయచూరు రూరల్: బిహార్కు చెందిన మనోజ్ సాదా(28) అనే ప్రముఖ నక్సలైట్ను బుధవారం నగరంలో అనుమానాస్పద రీతిలో గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. యరమరస్లోని బియ్యం మిల్లులో పని చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న బిహార్లోని ఖగారియా జిల్లా అలౌలి పోలీసులు రాయచూరు గ్రామీణ పోలీసుల సహకారంతో దాడి చేసి మనోజ్ సాదాను అరెస్ట్ చేశారు. ఎయిమ్స్ ఏర్పాటుకు వినతి రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థాపకులు రవిశంకర్ గురూజీని కోరారు. గురువారం బెంగళూరులో రాయచూరు ఎయిమ్స్ పోరాట సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించి రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రిలకు రాసిన లేఖలను చూపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించి రాయచూరుకు ఎయిమ్స్ను కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని గురూజీ అన్నారు. పోరాట సమితి అధ్యక్షుడు బసవరాజ్ కళస, అశోక్ కుమార్ జైన్, గుండూరావ్, గవిసిద్దప్ప, బేరి, శివబసప్ప, జగదీష్, ఉదయ కుమార్లున్నారు. నాగమోహన్దాస్ నివేదిక ఆమోదించొద్దు రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తరుణంలో జిస్టిస్ నాగమోహన్ దాస్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను తిరస్కరించాలని అఖిల భారత బంజార సేవా సమితి డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు నారాయణప్ప మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణపై కాంగ్రెస్ సర్కార్కు జిస్టిస్ నాగమోహన్ దాస్ అందించిన నివేదిక రూపకల్పనలో ఎస్సీ వర్గాల వారిని నియమించకుండా అగ్ర వర్ణాల వారిని నియమించారన్నారు. కమిషన్ అధ్యక్షుడిగా అగ్రవర్ణాల వారినే నియమించడంతో లోపాలు ఏర్పడ్డాయన్నారు. ఆది కర్ణాటక, ద్రావిడ, ఇతర ఉప కులాలను చేర్చడంలో ఉన్న లోపాలను సవరించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. రోగులకు పౌష్టికాహారం ఏదీ? రాయచూరు రూరల్: పేద రోగులకు రిమ్స్లో మంచి ఆహార పదార్థాలను అందించకుండా పురుగులు పడిన ఆహారాన్ని అందిస్తున్నారని దళిత సేనా సమితి ఆరోపించింది. గురువారం రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) వైద్య కళాశాల ఆస్పత్రి పరిశోధన కేంద్ర కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు భరత్ మాట్లాడారు. రిమ్స్లో రోగులకు పంపిణీ చేసే ఆహార పదార్థాల్లో పురుగులతో కూడిన అన్నం పంపిణీ చేయడాన్ని తప్పుబట్టారు. నాణ్యతతో కూడిన ఆహారాన్ని పంపిణీ చేయాలని కోరుతూ రిమ్స్ అధికారి రమేష్కు వినతిపత్రం సమర్పించారు. సహకార రంగంపై ప్రచారం అవసరం రాయచూరు రూరల్: నేటి పోటీ యుగంలో విద్యార్థులు సహకార రంగం గురించి ప్రచారం చేయాలని సహకార మహా మండలి జిల్లాధ్యక్షుడు విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో జరిగిన సహకార రంగ విద్యార్థులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి వెలిగించి మాట్లాడారు. సమాజంలో మహిళలు, యువతులు సహకార రంగంలో స్పందించాలన్నారు. సమావేశంలో కల్లయ్య స్వామి, తిమ్మారెడ్డి, విద్యాసాగర్లున్నారు. కేంద్రం జీఎస్టీ తగ్గింపుపై హర్షం రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ విధించిన జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపుపై ఎల్ఐసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. గురువారం ఎల్ఐసీ డివిజన్ కార్యాలయం వద్ద ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శరణగౌడ, కార్యదర్శి రవి మాట్లాడారు. ఎల్ఐసీ ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై విధించిన జీఎస్టీని తగ్గించాలని చేపట్టిన ఆందోళనలపై స్పందించి నేడు కేంద్రం జీఎస్టీని తగ్గించడం హర్షణీయమన్నారు. -
ఫయాజ్ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ
హుబ్లీ: నగరంలో జరిగిన నేహా హిరేమఠ హత్య కేసుకు సంబంధించి నిఽందితుడు ఫయాజ్ ధార్వాడ హైకోర్టు పీఠానికి సంబంధించి బెయిల్ పిటిషన్ను బుధవారం ఉపసంహరించుకున్నారు. బీవీబీ కళాశాల ఆవరణలో 2024 ఏప్రిల్ 18న నేహా హత్య జరగగా, ఈ కేసులో నిందితుడు ఫయాజ్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫయాజ్కు బెయిల్ ఇవ్వడానికి హుబ్లీ 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ధార్వాడ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్ శెట్టితో కూడిన ధర్మాసనం పిటిషన్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఫయాజ్ తరపున న్యాయవాదులు పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని విద్యార్థిని నేహా హిరేమఠ తండ్రి, కార్పొరేటర్ నిరంజనయ్య హిరేమఠ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. న్యాయం కోసం తాను చేస్తున్న పోరాటం ఆగదని, నిందితుడికి బెయిల్ దొరకకుండా పోరాటాన్ని కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. మౌలిక సౌకర్యాల కోసం ధర్నా రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా హేరూరు విద్యార్థులకు మౌలిక సౌకర్యాలను కల్పించాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. గురువారంే హేరూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాశాల వద్ద చేపట్టిన ఆందోళన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూపా నాయక్ మాట్లాడారు. హేరూరులో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేవన్నారు. ఉన్న గదుల పైకప్పు పెచ్చులూడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో సక్రమంగా భోజనాలు కూడా పెట్టడం లేదన్నారు. గళగి హులకొప్ప పీడీఓ సస్పెండ్ హుబ్లీ: ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై గళగి హులకొప్ప గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి(పీడీఓ) అబ్దుల్ రజాక్ మణియార్ను సస్పెండ్ చేస్తూ జెడ్పీ సీఈఓ భువనేష్ పాటిల్ ఆదేశాలు వెల్లడించారు. ప్రభుత్వ నియమాలు, శాఖ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఎన్నో ఖాతాల నుంచి ప్రైవేట్ వ్యక్తుల ఖాతాలకు డబ్బు జమ చేసి విధుల్లో లోపానికి పాల్పడి, నిధులను దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణకు వచ్చిన సీఈఓ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సమర్పించిన ప్రతిపాదనను పరిగణించి సస్పెండ్ చేశారు. కాగా సదరు బాధ్యుడు పైఅధికారుల ముందస్తు అనుమతి లేకుండా కేంద్ర స్థానం వదలరాదని ఆయన తమ ఆదేశాల్లో వెల్లడించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టండి రాయచూరు రూరల్: జిల్లాలోని గ్రామాల్లో విధులు నిర్వహించే పంచాయతీ అధికారులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ సూచించారు. జెడ్పీ సభాభవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారు(పీడీఓ)లకు సలహాలు అందించారు. తాగునీరు, స్వచ్ఛత, వీధి దీపాలు, ఇతర అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు సమావేశానికి సరైన సమాచారం అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో పంచాయతీ అధికారులపై ఫిర్యాదులు వస్తే అలాంటి వారిపై కఠిన నిర్ణయాలు తీసు కుంటామన్నారు. సమావేశంలో రోణ, శరణ బసవ, విజయ్ శంకర్లున్నారు. కాంగ్రెస్వి రైతు వ్యతిరేక విధానాలుకోలారు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, అందువల్లనే ఇటీవల జరిగిన వేమగల్– కురుగల్ పట్టణ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు జేడీఎస్–బీజేపీ మైత్రి అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించడం ద్వారా పట్టణ పంచాయతీలో అధికారంలోకి తీసుకు వచ్చారని జేడీఎస్ నాయకుడు సీఎంఆర్ శ్రీనాథ్ తెలిపారు. గురువారం నగరంలోని తన కార్యాలయంలో తాలూకాలోని దొడ్డహసాళ ఏపీఎంసీ డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులను అభినందించి మాట్లాడారు. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించి అవినీతి ఆరోపణల్లో కూరుకు పోయిందన్నారు. దీని వల్ల ప్రజలు విసిగి పోయి కాంగ్రెస్ను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులమతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. గ్యారెంటీ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఖజానా ఖాళీ అయి అభివృద్ధి పనులు కుంటు పడుతున్నాయన్నారు. పాల ఉత్పత్తిదారులకు ఇస్తున్న సహాయ ధనాన్ని కూడా తగ్గించిందన్నారు. ప్రభుత్వం దివాళా అంచునకు చేరడమే దీనికంతా కారణమన్నారు. కోలారు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్లో జరుగుతున్న గ్రూపు తగాదాల వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటు పడిందన్నారు. జేడీఎస్ జిల్లా కార్యాధ్యక్షుడు బణకనహళ్లి నటరాజ్, దింబ నాగరాజ్, టీపీ మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
రాజ్యాంగం గురించి ఎమ్మెల్యే తెలుసుకోవాలి
మాలూరు : అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, ఈ విషయం, రాజ్యాంగం గురించి ఎమ్మెల్యే కేవై నంజేగౌడ మొదట తెలుసుకోవాలని స్వాభిమాని పార్టీ సంస్థాపక అధ్యక్షుడు హూడి విజయకుమార్ అన్నారు. గురువారం తాలూకాలోని మాస్తి గ్రామంలో యువక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశోత్సవ కార్యక్రమంలో పాల్గొని వినాయకునికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం రసమంజరి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. తాలూకాలో గత ఎన్నికలలో ప్రజలు తనకు 50 వేల ఓట్లు ఇచ్చారు. తాను చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి తనకు అత్యధిక ఓట్లు అందించారన్నారు. ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తానన్నారు. ఓటమితో తాను ఇంటికే పరిమితం కాలేదన్నారు. మరింత ఉత్సాహంతో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నానన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నానన్నారు. మాలూరు తాలూకాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు పెచ్చుమీరి అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. ఇదే సమయంలో వివిధ రంగాల్లో సాధన చేసిన వారిని అభినందించారు. కార్యక్రమంలో పార్టీ తాలూకా అధ్యక్షుడు ఆర్.ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి అంబరీష్ రెడ్డి, టీపీ మాజీ అధ్యక్షుడు మాస్తి చంద్రప్ప పాల్గొన్నారు. -
వంతెనల నిర్మాణానికి మోక్షమెన్నడో?
రాయచూరు రూరల్ : 2021 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు పలు వాగులపై నిర్మించిన రోడ్డు వంతెనలు తెగిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు నిత్యం నగరానికి రావడానికి పలు ఇబ్బందులకు గురవుతున్నారు. కురిసిన భారీ వర్షాలకు రాయచూరు తాలూకాలోని జంబలదిన్ని–మల్దొడ్డి, మాన్వి తాలూకాలోని దోతరబండి– ఉటకనూరు మధ్య భాగంలో బ్యాగవాట వద్ద వంతెన కొట్టుకొని పోయింది. ప్రజా పనుల శాఖ అధికారులు నేటి వరకు వంతెన తెగిపోయిన విషయంపై విచారించక పోవడం విడ్డూరంగా ఉంది. దోతరబండి, ఉటకనూరు, బ్యాగవాట గ్రామాల ప్రజలు వంతెనపై రాకుండా 25 కి.మీ.దూరం చుట్టూ తిరిగి మాన్వికి ప్రయాణించాల్సి వస్తోంది. పల్లెలు అభివృద్ధికి ఆమడదూరం అనడానికిి రెండు ప్రధాన సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల రహదారులు, వంతెనల మరమ్మతు పనుల పేరుతో నిధులను కాంట్రాక్టర్లు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకాలో మణ్ణూరు, జాగీర్ పన్నూర్, యడివాళల మధ్య ఉన్న ముస్టూరు వంతెన ఐదేళ్ల కిందట కురిసిన వర్షాలకు రూపు కోల్పోయి వంకర టింకరగా మారింది. ప్రజలు సంచరించే వంతెన నిర్మాణ విషయంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజజు మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్ అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నిత్యం ఇబ్బందులు పడుతున్న ప్రజలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు -
విద్యతో పాటు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి
బళ్లారిటౌన్: విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులు విద్యతో పాటు పరిశుభ్రత కాపాడుకోవడంపై దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. గురువారం విజయనగర శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ స్థాయిలో విద్యా సంస్థల నిర్మాణాలకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. యూనివర్సిటీలను శ్రేష్టమైన సంస్థలుగా చేసేందుకు లక్ష్యాన్ని ఎంచుకోవాలన్నారు. 21వ శతాబ్దంలో అవసరమైనవి డిజిటల్ సాక్షరత, కొత్త కొత్త ఆలోచనలు జాగతిక దృష్టికోణం సామాజిక బాధ్యతపై జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద 2047 కల్లా అభివృద్ధి పొందిన భారత్గా యువకులు తమ ప్రతిభను చాటుకొని సమాజానికి కొత్త నాంది పలకాలన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన సాధకులు వసుంధర భూపతి, బీ.నాగనగౌడ, ఇర్ఫాన్ రజాక్లను గౌరవ పట్టాలనిచ్చి సత్కరించారు. అనంతరం ప్రతిభావంత విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. న్యూఢిల్లీ అంతర్ విశ్వవిద్యాలయ వేగవర్ధక కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ అవినాష్ చంద్ర పాండే, వైస్ చాన్సలర్ ఎన్.మునిరాజు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ సూచన సందడిగా వీఎస్కేయూ 13వ స్నాతకోత్సవం -
వాటర్ ఫిల్టర్ యూనిట్కు మరమ్మతులేవీ?
కోలారు : నగరంలోని అమ్మవారిపేట సర్కిల్ వార్డు నెంబర్–9 ఫకీర్వాడిలో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ చెడిపోయి ఏళ్లు గడుస్తున్నా మరమ్మతు చేయలేదని, వెంటనే వాటర్ ఫిల్టర్ యూనిట్కు మరమ్మతులు చేసి ప్రజల ఉపయోగంలోకి తేవాలని అబ్దుల్ కలాం సోషల్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు సగీర్ పాషా డిమాండ్ చేశారు. ఫకీర్వాడిలోని మటన్ మార్కెట్ పక్కన 2018–19వ సంవత్సరంలో వాటర్ ఫిల్టర్ యూనిట్ను ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ కేవలం కొద్ది నెలలు మాత్రమే పని చేసి అనంతరం మూతపడింది. చెడిపోయిన వాటర్ ఫిల్టర్ యూనిట్ను మరమ్మతు చేయడానికి నగరసభ అధికారులు ముందుకు రాలేదు. వార్డుకంతా ఒకటే యూనిట్ ఉండడం వల్ల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ యూనిట్కు మరమ్మతు చేయాలని పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చినా ఫలితం లభించలేదు. ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, నగరసభ అధికారులు సమస్యను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరారు. -
అతిథి అధ్యాపకులను నియమించండి
హొసపేటె: ప్రభుత్వ శంకర్ ఆనంద్సింగ్ కళాశాలలో వెంటనే అతిథి ఉపన్యాసకులను నియమించాలని డిమాండ్ చేస్తూ ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో గురువారం కళాశాల ముందు ధర్నా చేపట్టారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఏఐడీఎస్ఓ విజయనగర జిల్లా సమన్వయకర్త రవికిరణ్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కోర్సుల తరగతులు ప్రారంభమై నెల రోజులు గడిచినా కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లు లేరన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు గెస్ట్ లెక్చరర్లపై ఆధారపడి ఉన్నాయి. ఇప్పటి వరకు తరగతులు సరిగ్గా నిర్వహించడం లేదు. ఇది విద్యార్థులను చాలా ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఇది వారి విద్యా భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టేస్తోందన్నారు. డిగ్రీ విద్యార్థుల మొదటి అంతర్గత పరీక్షలు వచ్చే నెలలో జరగాల్సి ఉండగా తరగతులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ఇటువంటి పరిస్థితిలో విద్యాభ్యాసం సజావుగా సాగేలా, గందరగోళాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రిన్సిపాల్కు వినతిపత్రాన్ని అందజేశారు. సంఘం నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మహిళలపై దౌర్జన్యాలు అరికట్టాలి
బళ్లారిటౌన్: మహిళలపై దౌర్జన్యాలు, అశ్లీలత, మద్యపాన దాడులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా బళ్లారి నగరంలో కూడా ఏఐఎంఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం జిల్లాధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఎస్ఎస్ జిల్లాధ్యక్షురాలు ఈశ్వరి మాట్లాడుతూ నేటి సమాజంలో అశ్లీల సినిమాలు, సాహిత్యాలు, ప్రకటనలు వెబ్సైట్ల వల్ల యువత చెడు దారి పడుతోందన్నారు. మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలను నియంత్రించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత 2024–25 సంవత్సర అవధిలో 700కు పైగా బాల్య వివాహాలు జరిగాయన్నారు. గత మూడేళ్లుగా 80 వేలకు పైగా బాల్య వివాహాలు, మైనర్ గర్భిణీ కేసులు బయట పడ్డాయని జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పేర్కొన్నారు. అనంతరం తమ వినతిపత్రాన్ని స్థానిక అధికారికి సమర్పించారు. ప్రముఖులు విద్యావతి, గిరిజ, సౌమ్య, అభిలాష, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
దంపతులకు శిరోముండనం
మండ్య(కర్ణాటక): చిన్న కారణానికి భార్యాభర్తలు గొడవ పడటంతో గ్రామ పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. ఆ దంపతులకు గుండు గీయించిన ఘటన జిల్లాలోని మళవళ్లి తాలూకా ద్యావపట్టణ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గతనెల 17న ఉదయం 6 గంటల సమయంలో మహిళ, ఆమె పిల్లలు తన భర్తతో తాగుడు విషయంపై గొడవ పడ్డారు. భార్య గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది. నీతో పాటు నీ భర్తకు తలా రూ.5 వేల జరిమానా, ఇద్దరు గుండు గీయించుకోవాలని రచ్చబండ వద్ద తీర్పు చెప్పారు. అంతేకాకుండా దగ్గరుండి ఇద్దరికీ శిరోముండనం చేయించారు. దీంతో బాధితురాలు లబోదిబోమంది. గ్రామంలో తిరగలేకపోతున్నానని, న్యాయం కోరితే ఇలా అవమానం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెళకవాడి ఎస్ఐ ప్రకాష్ ఆ గ్రామంలో విచారించి నాగణ్ణ, మహాదేవ, కుమార్, సోమణ్ణ, మల్లయ్యలతో సహా ఐదుగురిపై కేసు నమో -
బాధితురాలే.. నిందితురాలు
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కేరళ పూజారిపై బెంగళూరు మహిళ లైంగికదాడి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పుడు మలుపు చోటుచేసుకుంది. చివరకు హనీట్రాప్గా మారి బాధిత మహిళే నిందితురాలు అయ్యింది. కేరళలోని త్రిస్సూరులోని ప్రసిద్ధ పెరింగొట్టుకర దేవాలయంలో ఓ పూజారిగా పని చేస్తున్న ఉన్ని దామోదరన్ పై బెంగళూరు బెళ్లందూరు పోలీస్స్టేషన్లో ఒక మహిళ అత్యాచారం, బ్లాక్మెయిలింగ్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్లో ఇది జరిగింది. తన భర్త చనిపోయి తాను కష్టాల్లో ఉండగా, పూజారిని కలిసి పరిష్కారం కోరానని, క్షుద్రపూజలు చేయిస్తానని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. పోలీసులు త్రిస్సూరుకు వెళ్లి పూజారి దామోదరన్, ఆలయం ఉద్యోగి అరుణ్ని అరెస్టు చేశారు. హోంమంత్రికి కుటుంబం ఫిర్యాదు... పూజారి కుటుంబ సభ్యులు హోంమంత్రి పరమేశ్వర్ని కలిసి ఇదంతా కట్టుకథ అని, అకారణంగా అబద్దపు కేసు నమోదు చేశారని, హనీ ట్రాప్ కుట్ర అని ఫిర్యాదు చేయగా, విచారణ చేయాలని ఆయన పోలీసులకు ఆదేశించారు. దర్యాప్తు చేసిన పోలీసులు మహిళ ఇచ్చింది అబద్ధపు ఫిర్యాదుగా పేర్కొన్నారు. పూజారిని అప్రతిష్టపాలు చేయడంతో పాటు కేసు వెనక్కు తీసుకోవాలంటే రూ.2 కోట్లు ఇవ్వాలని బెదిరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
కేజీఎఫ్ గనుల్లో బంగారం లేదు
కేజీఎఫ్: కోలారు జిల్లాలోని ప్రఖ్యాత కోలారు గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) గనుల పునఃప్రారంభంపై స్థానిక ఎంపీ చేదు కబురు చెప్పారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన బిజిఎంఎల్ సంస్థ పునః ప్రారంభం అనుమానమేనని కోలారు ఎంపీ ఎం.మల్లేష్ బాబు తెలిపారు. బుధవారం ఉరిగాంలో స్వర్ణభవన కార్యాలయాన్ని సందర్శించి విలేకరులతో మాట్లాడారు. బిజిఎంఎల్ భాగంలో ఇంకా బంగారు నిక్షేపాలు ఉన్నాయా అనేదానిని సర్వే చేయడానికి ప్రైవేటు ఏజెన్సీకి కాంట్రాక్టు ఇచ్చారు, సర్వే చేసిన ఆ ఏజెన్సీ ఇక్కడ ఎలాంటి బంగారు నిక్షేపాలు లేవని నివేదిక సమరి్పంచింది. అందువల్ల బిజిఎంల్ సంస్థ పునః ప్రారంభం కావడం అనుమానమేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ గనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినా పునః తవ్వకాలు సాధ్యం కాదు. సైనైడ్ దిబ్బల వేలం.. అయితే గతంలో కేజీఎఫ్లో గనుల నుంచి తవ్వి తీసిన సైనైడ్ మట్టి దిబ్బల వేలం ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. రెండు నెలల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, కుమారస్వామిలు కేజీఎఫ్కు వచ్చి, పునరావాస పథకం కింద గని కారి్మకులకు ఇళ్ల స్థలాల పట్టాలను అందజేస్తారని ఎంపీ చెప్పారు. ఏపీలో మదనపల్లిలో వాన నీటిని నిల్వ చేయడానికి నిర్మించిన డ్యాం నుంచి వానాకాలంలో వృథాగా వెళుతున్న నీటిని కోలారు జిల్లాలోని చెరువులకు అందించడం గురించి అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. -
కర్ణాటక రాజకీయం.. మహిళా ఎస్పీపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటకలో ఓ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. మహిళా పోలీస్ ఉన్నతాధికారిపై సదరు ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళా ఎస్పీని ఉద్దేశించి ఆమె కాంగ్రెస్ నేతల ఇంట్లో ‘పెంపుడు కుక్క’లా వ్యవహరిస్తున్నారు అని సంచలన ఆరోపణలు గుప్పించారు. దీంతో, ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై పోలీసు ఉన్నతాధికారులు మండిపడుతున్నారు.వివరాల ప్రకారం.. హరిహర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే బీపీ హరీశ్ మంగళవారం దావణగెరెలో రిపోర్టర్స్ గిల్డ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని. ప్రజలు నన్ను గెలిపించారు. కానీ, నాపై పట్ల పోలీసులు వైఖరి భిన్నంగా ఉంది. దావణగెరె జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్ నన్ను ఏదైనా కార్యక్రమంలో చూస్తే ముఖం చిట్లించుకుంటున్నారు. అదే కాంగ్రెస్కు చెందిన షామనూరు కుటుంబ సభ్యుల కోసం మాత్రం గేటు వద్ద పడిగాపులు కాస్తున్నారు. అచ్చం వాళ్లింట్లోని పోమరేనియన్ కుక్కలా ఆమె ప్రవర్తన ఉంది అంటూ తీవ్ర వ్యాఖ్యలతో విమర్శలు చేశారు.అంతటితో ఆగకుండా.. కొన్ని సంఘటనలను ఉదాహరణగా చూపుతూ హరిహర నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్పీ తనను పట్టించుకోకుండా, అగౌరవ పరిచారని అన్నారు. గాంధీ భవన్ వద్ద మండుటెండలో ఎంపీ ప్రభా మల్లికార్జున్ కోసం ఎస్పీ గంటల తరబడి ఎదురుచూశారు. నేనూ ప్రజాప్రతినిధినే, ఆమె కూడా ప్రజాప్రతినిధే. మరి ఈ వివక్ష ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవారి అండ చూసుకుంటే మంచిదని ఎస్పీ భావిస్తున్నారని, కానీ ఇదంతా తాత్కాలికమేనని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో, అక్కడున్న వారు, పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు.అనంతరం, ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. బీజేపీ ఎమ్మెల్యే హరీశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వయంగా ఎస్పీ ఉమా ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం దావణగెరెలోని కేటీజే నగర్ పోలీస్ స్టేషన్లో హరీశ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా.. షామనూర్ కుటుంబానికి దావణగెరెలో రాజకీయ పలుకుబడి ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షమనూర్ శివశంకరప్ప ఎమ్మెల్యేగా ఉండగా.. ఆయన కుమారుడు ఎస్ఎస్ మల్లికార్జున్ సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వంలో గనులు, భూగర్భ శాస్త్రం, ఉద్యానవన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కోడలు ప్రభా మల్లికార్జున్ పార్లమెంటు సభ్యురాలుగా(ఎంపీగా) కొనసాగుతున్నారు. -
6న బసవ సంస్కృతి అభియాన్
బళ్లారిటౌన్: నగరంలోని బసవ భవనంలో ఈ నెల 6న సాయంత్రం 6 గంటలకు బసవ సంస్కృతి అభియాన్ను ఏర్పాటు చేసినట్లు అభియాన్ సమితి జిల్లాధ్యక్షుడు ఎంజీ బసవరాజప్ప తెలిపారు. బుధవారం పత్రికాభవనంలో సమితి నేత సిరిగేరి పన్నారాజు తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందులో భాగంగా రాయచూరు నుంచి వస్తున్న బసవ జ్యోతి రథయాత్రకు ఆ రోజు ఉదయం 9.30 గంటలకు మోకా రోడ్డులోని కేఆర్ఎస్ ఫంక్షన్ హాల్ వద్ద స్వాగతం పలికి మోటర్ బైక్ల ద్వారా నగరంలో ప్రధాన వీధుల్లో ఊరేగింపు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం గాంధీనగర్లోని అల్లం సుమంగళమ్మ కళాశాలలో విద్యార్థులకు, ప్రజలకు సంవాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు కిత్తూరు రాణి చెన్నమ్మ హైస్కూల్ ప్రాంగణం నుంచి బసవ భవన్ వరకు పథ సంచలన ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విరక్త మఠం మహంత ప్రభు స్వామితో పాటు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశంలో సమితి నేతలు చంద్రమౌళి, శంకర్, లేపాక్షప్ప, సంగనకల్లు హిమంతరాజు, యోగిరాజ్, సురేష్, కేణిబసప్ప, చెన్నబసయ్య, మీనళ్లి చంద్రశేఖర్, శరణగౌడ పాల్గొన్నారు. -
బెంగళూరు రహదారులు రక్తసిక్తం
శివాజీనగర: బెంగళూరు నగర రహదారులు రక్తమోడాయి. 24 గంటల వ్యవధిలో కుమారస్వామి లేఔట్, చిక్కజాల, తలఘట్టపుర, యశ్వంతపుర, యలహంక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో ప్రమాదాలు సంభవించగా టెక్కీ సహా ఐదుగురు అసువులు బాశారు. బస్సు ఢీకొని స్కూటరిస్టు... నజరగనహళ్లి వంతెన పిల్లర్ నంబర్ 77 వద్ద బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో కేఎస్ ఆర్టీసీ బస్సు స్కూటర్ను ఢీకొంది. ప్రమాదంలో సారక్కి నివాసి గంగాధర్ (70) మృతి చెందాడు. కుమారస్వామి లేఔట్ పోలీసులు బస్సు డ్రైవర్ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. క్యాంటర్ ఢీకొని.. ఒడిశాకు చెందిన జయప్రతాప్(36) వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఈయన విధులు ముగించుకొని బైక్లో వెళ్తుండగా తలఘట్టపురం వద్ద మినీ క్యాంటర్ ఢీకొని మృతి చెందాడు. తలఘట్టపుర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని క్యాంటర్ డ్రైవర్ను అరెస్ట్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి.. చిక్కజాల చప్పరదకల్లు రోడ్డు వద్ద మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్లో వెళుతున్న యువకుడు (25) మృతి చెందాడు. ఇతని వివరాలు తెలియరాలేదు. బైక్ ఏపీలో నమోదైనట్లు ఉంది. చిక్కజాల ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బైకిస్టు దుర్మరణం.. యశ్వంతపుర పీణ్య పై వంతెన వద్ద బుధవారం ఉదయం 6 గంటల సమయంలో బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొని రాజు (26) అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతను ఓ కంపెనీలో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యశ్వంతపుర ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఐదు రోడ్డు ప్రమాదాలు టెక్కితో సహా ఐదుమంది మృతి అనూహ్యంగా ఐటీ ఉద్యోగి.. యలహంక బళ్లారి మెయిన్ రోడ్డు పాలహళ్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం అనూహం్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కిరణ్ వర్మ(32) అనే టెక్కీ మృతి చెందాడు. ఇతను ప్రైవేట్ బస్సు దిగి కాలినడకన వెళ్తుండగా బైక్ ఢీకొంది. కిందపడిన కిరణ్ వర్మపై బొలెరో దూసుకెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. యలహంక ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పాత కక్షలతో వ్యక్తి హత్య
● తండ్రి మృతికి ప్రతీకారం తీర్చుకున్న పుత్రుడు రాయచూరు రూరల్: 17 ఏళ్ల క్రితం తండ్రిని హత్య చేసిన వ్యక్తిని చంపుతానని శపథం చేసిన కొడుకు హత్య చేసిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం కలబుర్గి తాలూకా సీతనూరు శివరాయ మాలి పాటిల్(55)ను లక్ష్మికాంత్(29) మారణాయుధంతో దాడి చేసి హతమార్చాడు. 2008లో శివరాయ లక్ష్మికాంత్ తండ్రి నాగేంద్రప్పను హత్య చే శాడనే ఆరోపణల మేరకు ఈ హత్య చేశాడని కలబుర్గి పోలీస్ కమిషనర్ శరణప్ప తెలిపారు. నాగేంద్రప్ప అన్న భార్యతో శివరాయ పాటిల్ అక్రమ సంబంధం కలిగి ఉన్న విషయం తెలుసుకున్న నాగేంద్రప్పను అడ్డు తొలగించుకునేందుకు శివరాయ హత్య చేశాడన్నారు. పాత కక్షలు మనస్సులో పెట్టుకొని శివరాయను నాగేంద్రప్ప కొడుకు లక్ష్మీకాంత్ హత్య చేసినట్లు తెలిపారు. కలబుర్గి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పాము కాటుతో రైతు మృతి రాయచూరు రూరల్: పాము కాటుకు గురై ఓ రైతు మృతి చెందిన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. దేవదుర్గ తాలూకా నవిలుగుడ్డలో హొన్నప్ప(40) అనే వ్యక్తి మరణించాడు. పొలంలో పని చేస్తుండగా పాము కరవడంతో చికిత్స నిమిత్తం రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల పరిశోధన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స ఫలించక మంగళవారం రాత్రి మరణించాడు. గుండెపోటుతో అన్నదమ్ముల మృతి రాయచూరు రూరల్: తమ్ముడికి గుండెపోటు వార్త విన్న అన్న కూడా గుండెపోటుతో మరణించిన ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం సురపుర తాలూకా కెంబావిలో ఇర్ఫాన్ పేష్మామ్(38) అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా సోదరుడు శంశుద్దీన్న్పేష్మామ్(42) కూడా అదే వాహనంలో యాదగిరికి వెళుతుండగా మార్గమధ్యంలో ఇద్దరు అసువులు బాసారు. ఈ ఘటనపై కెంబావి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విద్యాభివృద్ధి పనులకు నిధులు మంజూరు రాయచూరు రూరల్: నగరంలో విద్యారంగ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ వసంత్ కుమార్ శ్రీకారం చుట్టారు. బుధవారం ఎల్వీడీ కళాశాలలో పలు నిర్మాణ పనులకు రూ.30 లక్షల నిధులను మంజూరు చేశామన్నారు. కళాశాలలో మంచి క్రమశిక్షణతో కూడిన విద్య, అన్ని విధాలుగా సౌకర్యాలతో కళాశాలలో విద్యనభ్యసిస్తే విద్యార్థులు ఉన్నత పదవులను అలంకరిస్తారన్నారు. ఈ సందర్భంగా సుఖాణి, రజాక్ ఉస్తాద్, పవన్ కుమార్, అరుణ, శ్రీనివాస్లున్నారు. పైగంబర్ జీవిత చరిత్ర అభియాన్ ప్రారంభంబళ్లారిటౌన్: పైగంబర్ మహ్మద్పై ఈ నెల 28 వరకు జిల్లా వ్యాప్తంగా జీవిత చరిత్ర అభియాన్ను ప్రారంభించినట్లు అభియాన్ సమితి ప్రముఖుడు సయ్యద్ నిజాముద్దీన్ తెలిపారు. బుధవారం పత్రికా భవన్లో పైగంబర్ మహ్మద్ జీవిత చరిత్రపై పుస్తకావిష్కరణ చేసి మాట్లాడారు. బళ్లారి, విజయనగర జిల్లాల్లో నెల రోజుల పాటు అభియాన్ను చేపట్టినట్లు తెలిపారు. పైగంబర్ మహ్మద్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలకు వ్యాసరచనలను ఈనెల 15 లోగా అందజేయాలని తెలిపారు. ముగింపు కార్యక్రమాన్ని ఆరోజు సాయంత్రం 6.30 గంటలకు జోళదరాశి దొడ్డనగౌడ మందిరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సయ్యద్ నాసీర్ అలీ, లతీఫ్ అహ్మద్, మెహదబీన్, సుల్తాన, ఫర్వీన్ తదితరులు పాల్గొన్నారు. -
అంజనాద్రి బెట్టకు కొత్త రూపు: సీఎం
శివాజీనగర: ప్రముఖ పర్యాటక కేంద్రం హంపీకి సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న అంజనాద్రి బెట్టను పర్యాటకంగా, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తెలియజేసే తరహాలో అభివృద్ధిపరచాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. అంజనాద్రి క్షేత్ర అభివృద్ధి గురించి బుధవారం బెంగళూరులో సీఎం నివాసంలో భేటీ జరిగింది. సీఎం మాట్లాడుతూ అంజనాద్రి పర్వతంపై సౌకర్యాలను కల్పించాలి, ప్రదక్షిణ మార్గం నిర్మించాలి, మెట్ల సదుపాయం, సముదాయ భవనం తదితర నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. బెట్ట వద్ద పనులకు భూమి కొరత ఉందని, భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. కొన్ని పనులకు అటవీశాఖ ఆమోదం తీసుకోవాలన్నారు. అంజనాద్రి కొండతో పాటుగా రాష్ట్రంలో 11 పర్యాటక కేంద్రాలకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రోప్ వేలను నిర్మించనున్నట్లు తెలిపారు. మంత్రికి సొమ్ముల కేసులో లోకాయుక్త తనిఖీ శివాజీనగర: అక్రమ సంపాదన కేసులో గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్కు లోకాయుక్త షాక్ ఇచ్చింది. ఇటీవల ఆయనతో లావాదేవీలు కలిగిన వ్యక్తులపై దృష్టి సారించింది. మంత్రి జమీర్ అహ్మద్కు 2013లో బడా వ్యాపారి, కాంగ్రెస్ నేత కేజీఎఫ్ బాబు రూ.3.70 కోట్లు అప్పు ఇచ్చారని గతంలో చెప్పారు. ఆ కేసులో లోకాయుక్త అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. మంత్రికి డబ్బులు ఇచ్చిన కేసులో నటి రాధికా కుమారస్వామిని కూడా లోకాయుక్త పోలీసులు ఇటీవలే విచారించారు. దంపతులకు శిరోముండనం ● గ్రామపెద్దల దాష్టీకం మండ్య: చిన్న కారణానికి భార్యాభర్తలు గొడవ పడటంతో గ్రామ పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. ఆ దంపతులకు గుండు గీయించిన ఘటన జిల్లాలోని మళవళ్లి తాలూకా ద్యావపట్టణ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గతనెల 17న ఉదయం 6 గంటల సమయంలో మహిళ, ఆమె పిల్లలు తన భర్తతో తాగుడు విషయంపై గొడవ పడ్డారు. భార్య గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది. నీతో పాటు నీ భర్తకు తలా రూ.5 వేల జరిమానా, ఇద్దరు గుండు గీయించుకోవాలని రచ్చబండ వద్ద తీర్పు చెప్పారు. అంతేకాకుండా దగ్గరుండి ఇద్దరికీ శిరోముండనం చేయించారు. దీంతో బాధితురాలు లబోదిబోమంది. గ్రామంలో తిరగలేకపోతున్నానని, న్యాయం కోరితే ఇలా అవమానం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెళకవాడి ఎస్ఐ ప్రకాష్ ఆ గ్రామంలో విచారించి నాగణ్ణ, మహాదేవ, కుమార్, సోమణ్ణ, మల్లయ్యలతో సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఎర్రచందనం పట్టివేత దొడ్డబళ్లాపురం: ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోట తాలూకా కట్టిగెహళ్లికి ఎర్రచందనాన్ని తరలించిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఎర్రచందనం దుంగలను అక్కడి నుంచి మళ్లీ హరియానాకు తరలిస్తుండగా దాడి చేసిన పోలీసులు రూ.25 లక్షల విలువైన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎజాజ్ షరీఫ్, ఫయాజ్ షరీఫ్, సాదిక్ ఖాన్ అనే ముగ్గురిని హొసకోట పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. -
4న వీఎస్కేయూ స్నాతకోత్సవం
బళ్లారిటౌన్: నగర శివార్లలోని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(వీఎస్కేయూ) 13వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 4న ఉదయం 11 గంటలకు యూనివర్సిటీ బయలు రంగమందిరం ఆవరణలో ఏర్పాటు చేసినట్లు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎం.మునిరాజు తెలిపారు. బుధవారం యూనివర్సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ స్నాతకోత్సవంలో వివిధ రంగాల్లో సాధన చేసిన ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్, న్యూఢిల్లీ ఇంటర్ యూనివర్సిటీ ఎక్సలేటర్ డైరెక్టర్ అవినాష్ చంద్రపాండే, ఉన్నత విద్యా శాఖ మంత్రి ఎంసీ సుధాకర్ పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈసారి వివిధ రంగాల్లో సేవలందించిన ఇర్ఫాన్ రజాక్, డాక్టర్ వసుంధర భూపతి, బావిహళ్లి నాగనగౌడలకు గౌరవ డాక్టరేట్ అందిస్తున్నట్లు తెలిపారు. అంతేగాక 42 మంది విద్యార్థులకు 51 బంగారు పతకాలను, వివిధ విభాగాల్లో పరిశోధన చేసిన 59 మందికి డాక్టరేట్ పట్టాలను, అన్ని విభాగాల్లో స్నాతకోత్సవ పట్టాలు పొందిన 80 మంది విద్యార్థులకు కలిపి మొత్తం 155 మంది విద్యార్థులకు ర్యాంక్ ప్రమాణ పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఎన్.హంస అనే విద్యార్థిని నాలుగు బంగారు పతకాలు, రాజేశ్వరి అనే విద్యార్థిని మూడు పతకాలు సాధించినట్లు వివరించారు. రిజిస్ట్రార్లు నాగరాజు, ఎన్ఎం సాలి పాల్గొన్నారు. -
గ్రామాలకు రక్షిత తాగునీరు అందించండి
● అధికారులకు జెడ్పీ సీఈఓ సూచన హొసపేటె: జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నందున గ్రామీణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసేందుకు ముందు పరీక్షలు తప్పనిసరి చేయాలని జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహ్మద్ అక్రమ్ అలీ షా అన్నారు. నగరంలోని జెడ్పీ కార్యాలయ హాలులో బుధవారం జరిగిన జిల్లా నీరు, పారిశుధ్య మిషన్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాటారు. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా, రక్షిత తాగునీటి యూనిట్, జలజీవన్ మిషన్(జేజేఎం) ద్వారా సరఫరా చేసిన నీటిని తాగడం తప్పనిసరి అని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నిరంతరం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేసే ముందు పరీక్షించడం తప్పనిసరి అన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ఎఫ్టీకే కిట్ల ద్వారా నీటిని పరీక్షించి, నివేదిక సమర్పించాలన్నారు. నీటి కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా, తాగునీటి స్వచ్ఛతపై శ్రద్ధ వహించాలన్నారు. జేజేఎం ప్రాజెక్ట్ కింద పూర్తయిన పనులను హర్ ఘర్ జల్గా ప్రకటించడం ద్వారా నిరంతర నీటి సరఫరా గ్రామాలుగా మార్చడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతర నీటి సరఫరాకు చర్యలు తీసుకోండి జిల్లాలోని కూడ్లిగి తాలూకా రామదుర్గ, కక్కుప్పి, కొట్టూరు తాలూకాలోని కందగల్లు, రాంపుర, చిరబి, హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని కల్లహళ్లిలను నిరంతర నీటి సరఫరా గ్రామాలుగా ప్రకటించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, నివాస పాఠశాలలకు నీటిని పరీక్షించి సరఫరా చేయాలన్నారు. జిల్లా ఆస్పత్రి, తాలూకా ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేసే సిబ్బంది పరిశుభ్రతను పాటించాలన్నారు. రామదుర్గ జీపీ అధ్యక్షుడు రాజప్ప, బైలువద్దిగేరి అధ్యక్షురాలు జే.లక్ష్మిదేవి, హంపీ జీపీ అధ్యక్షురాలు రజనీ షణ్ముకగౌడ, జిల్లా సర్వేయర్ డాక్టర్ షణ్ముఖ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.దీపా, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ముదకప్ప, పట్టణాభివృద్ధి కోశ జిల్లా నోడల్ అధికారి మనోహర్, ప్రభుత్వ విద్యా శాఖ ఉప సంచాలకులు రాజశేఖర్, జేజేఎం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సీఎం మహేశ్వరి, ఇంజినీర్లు రుద్రముని, నరేష్, శివారెడ్డి, స్వచ్ఛ భారత్ మిషన్ రేణుక తదితరులు పాల్గొన్నారు. -
బ్లాక్లో యథేచ్ఛగా యూరియా దందా
సాక్షి,బళ్లారి: యూరియా కంపెనీలు, వ్యాపారులు సిండికేట్గా మారి అన్నదాతను నిలువునా ముంచుతున్నారు. ఈ సారి తుంగభద్ర ఆయకట్టు కింద బళ్లారి జిల్లాతో పాటు రాయచూరు, కొప్పళ, విజయనగర నాలుగు జిల్లాల్లో సకాలంలో వరినాట్లతో పాటు పత్తి, మిర్చి నాట్లు కూడా పూర్తి చేశారు. లక్షలాది ఎకరాల్లో వరి నాట్లు పూర్తి చేసి నెల రోజులు కావస్తోంది. వరి నాట్లు వేసిన తర్వాత రైతులకు యూరియా అత్యవసరం. తుంగభద్ర ఆయకట్టు కింద ఈ సారి ఖరీఫ్ పంట మాత్రమే పండించుకునేందుకు అవకాశం కల్పించారు. డ్యాం గేట్లకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్నందున రబీ పంటకు నీరందించలేమని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో ఈ సారి ఒకే పంటతో రైతులు సరిపెట్టుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. పాలకుల తప్పిదం, నిర్లక్ష్యంతో డ్యాంలోకి నీరు పుష్కలంగా వస్తున్నప్పటికీ గేట్లను సరైన సమయంలో మార్చక పోవడం వల్ల రైతులకు ఒక పంట కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. రైతన్నలకు అష్టకష్టాలు ఈ తరుణంలో ఖరీఫ్లో సాగు చేసిన పంటలనైనా దక్కించుకుందామని కోటి ఆశలతో రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. పెట్టిన పంటలకు సరైన పోషకాలు అందించే ఎరువులను అందించాల్సిన పాలకులు, వ్యాపారులు రైతుల సమస్యలు పట్టించుకోక పోగా సందట్లో సడేమియా అన్న చందంగా యూరియా కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీంతో రైతులు అప్పులు చేసి అధిక ధరకు యూరియా కొనుగోలు చేస్తున్నారు. ఈసారి ఒక్క బళ్లారి జిల్లాకే 50 వేల టన్నుల యూరియా అవసరం ఉండగా కేంద్ర ప్రభుత్వం నుంచి 45 వేల టన్నుల యూరియా సరఫరా చేశామని, అందులో రైతులకు 41 వేల టన్నులు విక్రయించామని చెబుతున్నారు. వాస్తవంగా అందులో సగం అంటే 20 వేల టన్నులు కూడా రైతులకు అందలేదనే విమర్శలు ఉన్నాయి. నెల రోజులుగా ఎరువు కొరత స్పిక్, మంగళ ,క్రిబ్కో తదితర 8 యూరియా కంపెనీల నుంచి నేరుగా 250 మంది డీలర్లు, 450 ఫర్టిలైజర్స్ షాపులు, 80 సహకార సంఘాలకు సరఫరా చేయడంతో ఆయా వ్యాపారులు రైతులకు యూరియా అమ్మకాలు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి యూరియా కొరత కంపెనీలు సృష్టించాయా లేక వ్యాపారులు సృష్టించారో తెలియదు కానీ గత నెల రోజుల నుంచి యూరియా కొరత ఉందని ఫర్జిలైజర్స్ షాపులు, సహకార సంఘాలు, డీలర్లు చెబుతూ ఆయా షాపుల్లో యూరియా లేదంటూ చేతులెత్తేశారు. అయితే యూరియా కొరత సృష్టించిన వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో ఒక బస్తా యూరియాను రూ.500 నుంచి రూ.600 వరకు యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తుండటంతో రైతులకు గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది. గత్యంతరం లేక పెట్టిన పంటలు పెట్టుబడులకు కూడా దక్కకుండా పోతాయనే భయంతో యూరియాను కొనుగోలు చేస్తున్నారు. రైతుల్ని నట్టేట ముంచుతున్నారు ఈ సందర్భంగా తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తంగౌడ మాట్లాడుతూ బళ్లారి జిల్లాకు 50 వేల టన్నులు, రాయచూరు, విజయనగర, కొప్పళ జిల్లాలకు కూడా వేలాది టన్నుల యూరియా అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా కంపెనీలు యూరియా సరఫరా చేశామని చెబుతున్నారే కానీ డీలర్లు, వ్యాపారులు కుమ్మకై ్క యూరియా కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముతూ రైతులను నట్టేటా ముంచుతున్నారన్నారు. వ్యవసాయ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో పాటు పాలకులు కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో యూరియా వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో యూరియాను అమ్ముతున్నారన్నారు. బుధవారం రోజు ఏకంగా ఒక బస్తా యూరియా రూ.600 వరకు లోలోపల అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. రైతులకు కూడా ప్రస్తుతం యూరియా ఎరువు అవసరం ఉన్నందున బ్లాక్ మార్కెట్లోనే యూరియాను కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఎరువుల వ్యాపారులు బస్తా ధర రూ.275 వరకు అమ్మాలని నిబంధన నల్లబజారులో రూ.600 ధర వరకు విక్రయం -
గజరాజులకు బరువు పరీక్ష
మైసూరు: ప్రఖ్యాత నాడహబ్బా మైసూరు దసరా మహోత్సవాలలో పాల్గొనే గజరాజులకు తాలీమును తీవ్రతరం చేశారు. ముఖ్య ఏనుగు కెప్టెన్ అభిమన్యుకు బుధవారం బరువు మోసే పరీక్ష నిర్వహించారు. అంబావిలాస్ ప్యాలెస్లోని కోడి సోమేశ్వర దేవాలయం వద్ద అభిమన్యుతో పాటు ఇతర ఏనుగులు కావేరి, హేమావతికి సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, వాటిపై ఇసుక బస్తాలను బిగించి కట్టారు. సుమారు 500 కేజీల భారాన్ని మోస్తూ సాగిన అభిమన్యును, ఇతర ఏనుగులు అనుసరించాయి. భారీగా బందోబస్తు ఏర్పాటైంది. గజబృందం చామరాజేంద్ర సర్కిల్, కేఆర్ సర్కిల్, సయ్యాజీరావ్ రోడ్డు, ఆయుర్వేదిక్ ఆస్పత్రి సర్కిల్ తదితరాల గుండా సాగుతూ ఉంటే ప్రజలు, పర్యాటకులు ఉత్సాహంగా వీక్షించారు. బరువు పరీక్ష సజావుగానే ముగిసింది. సజావుగా సాగిన ఏనుగులు -
హుబ్లీ పాత బస్టాండ్ పునరారంభం
హుబ్లీ: ప్రధాన చెన్నమ్మ సర్కిల్ పైవంతెన పనుల నేపథ్యంలో నాలుగున్నర నెలల క్రితం బంద్ చేసిన ఉపనగర కేంద్ర బస్టాండ్ బుధవారం నుంచి పునరారంభమైంది. ఉదయం నుంచే బస్సులు చెన్నమ్మ సర్కిల్ నుంచి బసవనం వరకు రాక పోకలు ప్రారంభించాయి. పైవంతెన గత నెల ఏప్రిల్ 20వ తేదీ నుంచి బస్టాండ్తో పాటు ఎదుట ఉన్న రోడ్డు అలాగే చెన్నమ్మ సర్కిల్ నుంచి పాత కోర్టు వరకు రోడ్డును బంద్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు ముగిసిన నేపథ్యంలో బస్టాండ్ కార్యకలాపాలు చాలా వరకు ప్రారంభం అయ్యాయి. ఈ విషయమై కేఎస్ఆర్టీసీ వాయువ్య విభాగం ఎండీ ఎం.ప్రియాంక్ మాట్లాతుతూ ఫ్లై ఓవర్ పనుల నుంచి జిల్లాధికారి సూచనల మేరకు కొన్ని నెలలుగా బస్టాండ్ను బంద్ చేశామన్నారు. ప్రస్తుతం బస్టాండ్ పరిసర పనులు ముగిశాయి. దీంతో జిల్లా ఆర్టీసీ డీసీ సంబంధిత హైవే అధికారులు, ఇంజినీర్లు స్థల పరిశీలన చేసి బస్సుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. యథావిధిగా నగర రవాణా సంచారం దీంతో బుధవారం నుంచి యథావిధిగా బస్సుల సంచారం ప్రారంభించామన్నారు. యథావిధిగా నగర రవాణా, ప్రాంతీయ రవాణా, బీఆర్టీఎస్ నగర రవాణా సంచారం జరగనుంది. అంతేగాక గదగ్ నుంచి వచ్చే బస్సుల్లో ప్రయాణికులకు మాత్రం ఈ బస్టాండులో దిగడానికి అవకాశం కల్పించామన్నారు. గత నాలుగున్నర నెలల నుంచి బంద్ అయిన బస్టాండ్ నుంచి ఎటువంటి చోరీలు జరగలేదు. సిబ్బంది కాపలా ఉన్నారు. స్థానికులు బస్టాండ్ ప్రారంభం కావాలని డిమాండ్ చేశారు. దీంతో తిరిగి బస్టాండ్ను ప్రారంభిమన్నారు. మొత్తం మీద బస్టాండ్కు కొత్త కళ సంతరించుకుంది. గత కొన్ని నెలల పాటు వ్యాపారస్తులు వ్యాపారాలు లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. బస్టాండ్ ప్రారంభంతో అంగళ్లన్నిటిని ఎప్పటిలాగే తెరిచి తమ వ్యాపారాలను పునరారంభించారు. నాలుగున్నర నెలలుగా మూతపడిన వైనం ఎప్పటిలానే తిరిగి తెరుచుకున్న అంగళ్లు -
వినాయక నిమజ్జన కోలాహలం
సాక్షి,బళ్లారి: నగరంలోని వినాయక విగ్రహాల నిమజ్జనాలు పూర్తయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలో వాడవాడలా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు పూజలు చేసిన అనంతరం మంగళవారం రాత్రికి వినాయక విగ్రహాల నిమజ్జనాలు దాదాపు పూర్తి చేశారు. నగరంలోని అనంతపురం రోడ్డులోని సెంటినరీ హాలు వద్ద అంతర్జాతీయ హిందూ పరిషత్(ఏహెచ్పీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హిందూ మహాగణపతి ఊరేగింపును వేడుకగా నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమానికి వేలాది మంది జనం పాల్గొనడంతో రాజకీయ పార్టీలకతీతంగా నేతలందరూ హాజరై హిందూ మహా గణపతి ఊరేగింపులో పాల్గొని నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. వివిధ రకాల వేషధారణలు వేసుకుని దారి పొడవునా కళాకారాలు నృత్యాలతో హోరెత్తించారు. హిందూ మహాగణపతి బృహత్ శోభాయాత్ర నగరంలోని పురవీధుల గుండా వేడుకగా చేపట్టారు. కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, మాజీ మేయర్ మోదుపల్లి రాజేశ్వరీ, కార్పొరేటర్లు, ఏహెచ్పీ ప్రముఖులు, రాష్ట్ర భజరంగ్దళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన వినాయకుని విగ్రహాల నిమజ్జనాలు ఆకట్టుకున్న హిందూ మహాగణపతి శోభాయాత్ర -
భీమా తీరంలో కాల్పుల మోత
● జీపీ అధ్యక్షుని హత్య హుబ్లీ: భీమా నది తీరంలో మళ్లీ కాల్పు మోత మోగింది. పట్టపగలే గ్రామ పంచాయతీ అధ్యక్షుడు భీమనగౌడ బిరాదర (46)పై దుండగులు కాల్పులు జరిపి చంపారు. విజయపుర జిల్లా దేవర నింబరిగి గ్రామంలో బుధవారం ఈ ఘోరం జరిగింది. ఈయన మహాదేవ బైర గొండన పరమాత్మకు కుడి భుజంగా ఉండేవాడు. కటింగ్ సెలూన్ వద్ద ముసుగులు ధరించిన ముగ్గురు నలుగురు వ్యక్తులు భీమనగౌడ తల, శరీరంపై కాల్పులు జరపడంతో అక్కడే మరణించాడు. కంట్లోకి కారం చల్లి దాడి చేశారు. స్థానికులు ఆయన్ను విజయపురలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కాగా ఈ దారుణ హత్యతో ఆ గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. భీమా తీర గ్రామాల్లో దశాబ్దాల నుంచి ముఠాల మధ్య కక్షలు రగులుతున్నాయి. ఈ హత్యాకాండల గురించి సినిమాలు కూడా వచ్చాయి. మరో బాలుడు మృత్యువాత దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణ పరిధిలోని ముత్తూరులో గత శుక్రవారంనాడు వినాయక నిమజ్జనం ఊరేగింపులో ప్రమాదవశాత్తు టపాసుల పెట్టె పేలిన సంఘటనలో యోగేశ్ (15) అనే మరో బాలుడు మరణించాడు. గత శుక్రవారం సాయంత్రం ముత్తూరు గ్రామంలో నిమజ్జనం ఊరేగింపులో టపాసుల పెట్టె విస్ఫోటం చెందింది. ఆ దుర్ఘటనలో ధనుష్ రావ్ (15) అనే బాలుడు తీవ్రగాయాలై అక్కడే మృతిచెందాడు, ఒక పోలీసులతో పాటు 9మంది గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యోగేశ్ మంగళవారంనాడు పరిస్థితి విషమించి కన్నుమూశాడు. -
ఆస్తి కోసం.. తండ్రి వీడియోలు వైరల్
కర్ణాటక: ఆస్తి కోసం సొంత కుమారుడే తండ్రిని అశ్లీల చిత్రాలతో బ్లాక్మెయిల్ చేసిన ఘటన జిల్లాలోని మద్దూరులో జరిగింది. వివరాలు.. మద్దూరులో రాణి ఐశ్వర్య డెవలపర్స్ పేరిట హెచ్ఎల్ సతీష్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ కోట్లాది రూపాయలను గడించారు. అందులో రూ.6 కోట్ల ఆస్తులను సతీష్ తన కుమారుడు ప్రణామ్ సతీష్ పేరిట రాశారు. అయితే జూదం, సినిమా పిచ్చి పట్టిన కుమారుడు రూ.2 కోట్ల ఆస్తులను నాశనం చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి సతీష్ మిగతా ఆస్తులను అమ్మకుండా స్టే తెచ్చాడు. దీంతో తండ్రిపై కక్ష పెంచుకున్న ప్రణామ్ తనకు తెలిసిన వళగెరెహళ్లి గ్రామానికి చెందిన మహేష్ అలియాస్ గుండ, మద్దూరు హళే ఒక్కలిగర వీధి ఈశ్వర్, ఆనెదొడ్డి గ్రామానికి చెందిన ప్రీతమ్లతో కలిసి కుట్ర చేశాడు. తండ్రి, ఓ మహిళ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు, సంభాషణలను సేకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో బాధితుడు మద్దూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి ప్రణామ్తో సహా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
కర్ణాటక కాంగ్రెస్లో బిగ్ ట్విస్ట్.. బీజేపీలోకి కీలక నేతలు!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పలువురు కీలక నేతలు అధికార కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరుతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంలోనే నేతలు వ్యతిరేక గళం వినిపిస్తున్నారని తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గీయుల రాజకీయాలు యూటర్న్ తీసుకుంటున్నాయి. ఇరువురి మద్దతుదారులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే హెచ్సీ బాలకృష్ణ మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేఎన్ రాజన్న బీజేపీలో చేరబోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి రాజన్న పార్టీ మారుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ రాజేంద్ర రాజన్న తీవ్రంగా స్పందించారు.ఈ క్రమంలో ఎమ్మెల్సీ రాజేంద్ర మాట్లాడుతూ.. బీజేపీలో చేరే బృందంలో బాలకృష్ణ ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం పదవి కోసం పాకులాడుతున్న నేత(డీకే శివకుమార్) వెంట వెళ్లబోతున్నారని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు ప్రస్తావించకుండానే రాజేంద్ర పలు విమర్శలు చేశారు. తన తండ్రికి వ్యతిరేకంగా ఆయన కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తాము సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితులం కాబట్టే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. రాజన్న పదవి పోవడం వెనక కొందరి ‘రహస్య హస్తం’ ఉంది. కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ వల్లే పదవి దక్కింది. చివరివరకు అందులోనే కొనసాగుతాము అని వెల్లడించారు. ఇదే సమయంలో రాజన్న అసెంబ్లీలో ఆరెస్సెస్ గీతం పాడలేదని, చిన్నప్పటి నుంచి ఆయనకు ఆరెస్సెస్ శాఖల గురించి తెలియదని పరోక్షంగా డీకేకు చురకలంటించారు. రాజన్న సొంత భావజాలంతో పని చేసే వ్యక్తి అని కొనియాడారు.డీకే శివకుమార్ విధేయుడు హెచ్సీ బాలకృష్ణ ఇటీవల మాట్లాడుతూ.. మంత్రిగా రాజన్న ప్రవర్తన, వాడిన భాష ఆయన పతనానికి కారణమని విమర్శించారు. పదవి పోవడం వెనక ఎలాంటి కుట్ర లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వేరే పార్టీలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. బీజేపీకి దరఖాస్తు కూడా పెట్టుకున్నారు అని సంచలన ఆరోపణలు చశారు. -
స్వాగతం.. సుస్వాగతం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం మైసూరు ప్యాలెస్కు విచ్చేసిన దృశ్యం. ఆమెకు రాజవంశీకులు ప్రమోదాదేవి, యదువీర్ ఒడెయర్ల స్వాగతం త్వరలో సంచలనాలు: సమీర్ దొడ్డబళ్లాపురం: ధర్మస్థల పుణ్యక్షేత్రంపై దుష్ప్రచారం చేస్తున్నాడనే కేసులో విచారణను ఎదుర్కొంటున్న యూట్యూబర్ బళ్లారి సమీర్ ధర్మస్థలంలో అస్థిపంజరాల గురించి సంచలన విషయాలు చెబుతానని అన్నాడు. ఓ టీవీ చానెల్తో మాట్లాడిన సమీర్ సిట్ నుంచి తనకు ఇప్పటి వరకూ ఎటువంటి నోటీసు రాలేదన్నాడు. బెళ్తంగడి పోలీసులు మాత్రమే నోటీసులు ఇచ్చారని, అందువల్ల విచారణకు వెళ్లానన్నారు. విదేశాల నుండి నీకు డబ్బులు వచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి కదా, అని ప్రశ్నించగా.. దాని గురించి ఇప్పుడే మాట్లాడబోనన్నాడు. ఇందులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నాడు. అనన్య భట్ గురించి త్వరలో తన యూట్యూబ్ చానల్లో పూర్తి సమాచారం ఇస్తానన్నాడు. ఆస్పత్రుల్లో పౌష్టికాహార పంపిణీ బనశంకరి: ప్రభుత్వాసుపత్రుల్లోని రోగులకు ఇస్కాన్ సంస్థచే పౌష్టికాహారం అందిస్తామని రాష్ట్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు. మంగళవారం ఇందిరానగరలోని సీవీ.రామన్నగర జనరల్ ఆసుపత్రిలో రోగులకు మంత్రి భోజనం అందించి ఈ పథకాన్ని ప్రారంభించారు. నగరంలో కేసీ.జనరల్ ఆసుపత్రి, జయనగర జనరల్ ఆసుపత్రి, సీవీ.రామన్నగర జనరల్ ఆసుపత్రుల్లో ఇస్కాన్ భోజనం లభిస్తుందని తెలిపారు. బాలింతలు, రోగులను బట్టి ఐదు రకాల పౌష్టికాహారం అందిస్తామన్నారు. బెళగావి, బళ్లారి, ధారవాడ, మైసూరులో కొన్ని ఆస్పత్రుల్లోనూప్రారంభిస్తామని చెప్పారు. గుండె చికిత్సల కోసం మంగళూరు, హొసకోటేలో కూడా క్యాథ్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తామన్నారు.రూ.కోట్లు వృథాయేనా?దొడ్డబళ్లాపురం: హాసన్ తాలూకా అగిలె గ్రామం వద్ద మున్సిపల్ శాఖ కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న చెత్త డంపింగ్ సెంటర్ మంగళవారంనాడు కుప్పకూలింది. షెడ్డులో కార్మికులు పని చేస్తుండగానే అది పడిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. ఇటీవలే కోట్ల ఖర్చుతో నిర్మాణం చేపట్టారు. నాసిరకంగా నిర్మించడం వల్లే షెడ్ కూలినట్టు తెలుస్తోంది.కూలిన బతుకులు● పునాదులు పడి ఇద్దరు దుర్మరణం యశవంతపుర: కట్టడ నిర్మాణం కోసం పునాదులు తీస్తుండగా మట్టి చరియలు పడి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన బెంగళూరులోని యలహంకలో జరిగింది. కార్మికులు శివ (35), మధుసూదన్రెడ్డి (48)లు చనిపోయారు. సోమవారం సాయంత్రం ఎంబసీ గ్రూప్కు చెందిన భారీ భవనానికి కి పునాదులు తవ్వుతుండగా పెద్ద ప్రమాణంలో మట్టి, బుదర వారి మీద కూలిపోయింది. అందులో చిక్కుకుని శివ అక్కడే చనిపోగా, మధుసూదన్రెడ్డిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. కొన్నిరోజుల నుంచి వర్షాలు రావడంతో మట్టి వదులుగా మారడమే కారణమని ఇతర కార్మికులు తెలిపారు. యలహంక పోలీసులు కట్టడ యజమానిపై కేసు నమోదు చేశారు. మృతులు అనంతపురం జిల్లాకు చెందినవారుగా పోలీసులు తెలిపారు. ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చి కూలీ పనులు చేసేవారు.హోం మంత్రితో సిట్ చీఫ్ భేటీ శివాజీనగర: ధర్మస్థల కేసుల గురించి తనిఖీ జరుపుతున్న సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతి మంగళవారం హోం మంత్రి జీ.పరమేశ్వర్ను కలిశారు. బెంగళూరు సదాశివనగరలో ఉన్న హోంమంత్రి ఇంటికి వెళ్లి భేటీ చేసిన ప్రణబ్ మొహంతి ఇప్పటి వరకు దర్యాప్తులో తేలిన అంశాలను వివరించారు. నిందితుడు చిన్నయ్య కుట్ర కోసం ఎక్కడెక్కడ పర్యటించాడు, ఎవరెవరిని కలిశాడు, అతనికి ఆర్థిక సహాయం చేసినవారు ఎవరు తదితర సమాచారాన్ని తెలిపారు. కేసులో ప్రధాన బిందువైన పుర్రె గురించి సేకరించిన సమాచారాన్ని హోంమంత్రికి వివరించారని తెలిసింది. -
చిరస్థాయిగా వైఎస్సార్ సంక్షేమ పథకాలు
బనశంకరి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, ఆరోగ్యశ్రీ ప్రదాత, అపర భగీరథుడు, బావితరాలకు దార్శనికుడు డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి అందించిన సేవలు అపారమని అభిమానులు కొనియాడారు. వైఎస్సార్ వర్ధంతిని సిలికాన్ సిటీలో అభిమానులు, పార్టీ నాయకులు సేవా తత్పరతతో నిర్వహించారు. మంగళవారం హెచ్ఎస్ఆర్ లేఔట్లోని సమర్థనం ట్రస్ట్లో డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ బెంగళూరు అధ్యక్షుడు బోయిళ్ల రమణారెడ్డి, కార్యాధ్యక్షుడు బాబూరాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో మహానేత వర్ధంతిని నిర్వహించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు చిరస్థాయిగా ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఫీజు రీఇంబర్స్మెంట్ తో కోట్లాదిమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగునింపారని తెలిపారు. రైతుల కోసం ఉచిత విద్యుత్ను అందించిన ఘనత వైఎస్సార్ కు దక్కుతుందన్నారు. రైతు, మహిళా, విద్యార్థి, కార్మిక, కర్షక పక్షపాతిగా అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడిన మహోన్నత నేత అన్నారు. జలయజ్ఞం పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక భారీ నీటిప్రాజెక్టులు నిర్మించిన ఘనత రాజశేఖర్రెడ్డి కే దక్కుతుందని తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థులకు పండ్లు పంచి, అన్నదానం చేశారు. ముత్యాలనారాయణరెడ్డి, బీ.వెంకట్రామిరెడ్డి, కేఎల్.వెంకటరెడ్డి, భూమిరెడ్డి వెంకటరెడ్డి, కొండపరెడ్డి రమణారెడ్డి, పవన్, కల్లూరి పీరయ్య, చిన్నపీరయ్య, బుజ్జీ బ్రదర్స్ రమేశ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. కొనియాడిన అభిమానులు బెంగళూరులో మహా నేత వర్ధంతి కార్యక్రమాలు -
అధ్యాపకులు లేక బోధన బంద్
చిక్కబళ్లాపురం: రాష్ట్రంలోని ప్రభుత్వ పీయూ కాలేజీలు ప్రారంభమై నెలలు గడిచాయి, కానీ లెక్చరర్లు లేక బోధన సాగడం లేదు, వెంటనే లెక్చరర్లు, గెస్ట్ లెక్చరర్లను నియమించాలని నగరంలోని శిడ్లఘట్ట సర్కిల్ లో ఏఐడిఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. అధ్యాపకుల కొరత వల్ల విద్యార్థులు పాఠ్యాంశాలకు దూరమవుతున్నారని తెలిపారు. వచ్చే నెలలో విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు ఉన్నాయి, కానీ పాఠాలు జరగలేదు, యుజిసి కొత్త నియమాలు కోర్టులో ఉన్నందున గెస్టు లెక్చరర్ల నియామకం జరగడం లేదని అధికారులు చెబుతున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిష్కరించాలని, లేదంటే ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు వీధిన పడతారని అన్నారు. తరువాత కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.ఆస్తి గొడవలో పైశాచికత్వం ● అన్నను నరికిన తమ్ముడు ● వదిన, తండ్రిపైనా దాడి మైసూరు: ఆస్తి గొడవలో ఉన్మాదిగా మారిన ఓ తమ్ముడు.. అన్నను మచ్చుకత్తితో నరికి చంపిన ఘటన మైసూరు తాలూకా బోరె ఆనందూరులో జరిగింది. గ్రామానికి చెందిన కృష్ణగౌడ కుమారుడు మహేష్ (45) సోదరుడు రవి చేతిలో హత్యకు గురయ్యాడు. వివరాలు.. కృష్ణగౌడకు ఆనందూరులో పొలం ఉంది. దానిని పంపకాలు చేయాలని రవి తరచుగా ఒత్తిడి చేస్తుండేవాడు. పలుమార్లు పంచాయతీలు జరిగాయి. గొడవలు పడి ఇలవాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. కక్ష పెంచుకున్న రవి మంగళవారం అన్న మహేష్, వదిన ఉన్న పంప్సెట్ ఇంటికి వచ్చాడు. అక్కడ రగడ పడి వెంట తెచ్చుకున్న మచ్చుకత్తితో మహేష్ తలపై నరికాడు, దీంతో మహేష్ తల సగానికి తెగింది. అడ్డు వచ్చిన వదిన లక్ష్మిపై కూడా దాడి చేశాడు. పొలం వద్ద ఉన్న తండ్రి కృష్ణగౌడపై కూడా రవి దాడి చేశాడు. సుమారు అర గంట పాటు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడిన మహేష్ ఇంటిలోనే మరణించాడు. కృష్ణగౌడ, లక్ష్మిలను గ్రామస్తులు చికిత్స కోసం మైసూరులోని కేఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై ఇలవాల పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడు రవిని పోలీసులు అరెస్టు చేశారు.ఇద్దరు విదేశీ మహిళల అరెస్టు దొడ్డబళ్లాపురం: వీసా గడువు ముగిసినా నిబంధలకు విరుద్ధంగా బెంగళూరులో నివసిస్తున్న ఇద్దరు విదేశీ మహిళలను సీసీబీ పోలీసులు నిర్బంధించారు. ఇద్దరు విదేశీ మహిళలు భారత్కు వచ్చి వీసా గడువు ముగిసినా నిబంధనలకు విరుద్ధంగా బెంగళూరులో నివసిస్తున్నారు. సమాచారం అదుకున్న సీసీబీ మహిళా రక్షణ దళం సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని పరప్పన అగ్రహార పోలీసులకు అప్పగించారు. వారి డాక్యుమెంట్లను పరిశీలించకుండా, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఇల్లు అద్దెకు ఇచ్చిన ఇంటి యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసారు. ఇంటి యజమాని పరారీలో ఉన్నాడు. ఎమ్మెల్యే వకీలుకు ఈడీ నోటీసులపై వాదనలు శివాజీనగర: చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే వీరేంద్ర పప్పి అక్రమ బెట్టింగ్ దందా కేసుల్లో ఈడీ అరెస్టు చేయడం తెలిసిందే. అతడు ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్నాడు. అతని ఆప్తులపై దృష్టి సారించింది. ఈ కేసులో కొన్ని ఆధారాలు సమర్పించాలని ఈడీ ఇచ్చిన సమన్స్ ప్రశ్నిస్తూ బెంగళూరు ఆర్.ఆర్. నగరకు చెందిన హనుమంతరాయప్ప కుమారుడు అనిల్గౌడ సమర్పించిన పిటిషన్ను హైకోర్టు విచారించి 8కి తీర్పును రిజర్వు చేసింది. తీర్పు వచ్చేవరకు అనిల్గౌడ మీద బలవంతపు చర్యలు తీసుకోరాదని ఈడీకి ధర్మాసనం సూచించింది. పిటిషన్దారు వృత్తిపరంగా న్యాయవాది, కేసీ వీరేంద్రకు సలహాలను ఇచ్చారు, ఆ మాత్రానికే ఈడీ విచారణకు గురిచేయటం సబబు కాదని ఆయన న్యాయవాది పేర్కొన్నారు. ఈడీ న్యాయవాదులు స్పందిస్తూ, అనిల్గౌడ, కే.సీ.వీరేంద్ర కంపెనీలలో భాగస్వాములయ్యారు. అక్రమంగా సొమ్ము పెట్టుబడి పెట్టినట్లు తీవ్ర ఆరోపణ ఉంది. అందుకే సమన్లు ఇచ్చామని పేర్కొన్నారు. సుదీర్ఘ వాద–ప్రతివాదనలు ఆలకించిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. -
ఆర్డీఎస్ పరవళ్లు
రాయచూరు రూరల్: బళ్లారి, రాయచూరు జిల్లాల్లో పైభాగంలో భారీగా కురిసిన వర్షాలకు జిల్లాలోని మాన్వి తాలూకాలో రాజోలిబండ వద్ద తుంగభద్ర నదిపై నిర్మించిన రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) జలాశయం నీటితో నిండి పరవళ్లు తొక్కుతోంది. తుంగభద్ర నదికి అడ్డంగా రాజోలిబండ వద్ద 31 అడుగులు ఎత్తున నిర్మించిన డ్యాంకు జలకళ వచ్చింది. జలాశయం నీటి సామర్థ్యం 473.120 మీటర్లు కాగా నిండటంతో ఇన్ఫ్లోగా ఉన్న 500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతున్నట్లు ఆర్డీఎస్ ఇంజినీర్ మహ్మద్ తెలిపారు. ఆయకట్టులో రైతులు నారుమళ్లు వేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆర్డీఎస్ నుంచి తురకనడోణ, గిల్లేసూగూరు, గాణదాళ, గద్వాల, శాంతినగర్, ఆలంపూర్, మంత్రాలయం, గాజువాక, రచ్చుమర్రి గ్రామాలకు సాగు, తాగు నీటిని అందించే అవకాశం ఉంది. ఊరిస్తున్న రాయితీ సదవకాశం● ఒకే వ్యక్తి రూ.9 వేల జరిమానా చెల్లింపు ● 36 ట్రాఫిక్ ఉల్లంఘన కేసుల నుంచి ఉపశమనం పొందిన వైనం హుబ్లీ: ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనకు సంబంధించి చెల్లించాల్సిన జరిమానాపై 50 శాతం రాయితీ అవకాశం కల్పించడంతో ధార్వాడ తాలూకా నరేంద్ర గ్రామ నివాసి కరియప్ప కాళి తనపై ఉన్న 36 కేసులకు సంబంధించి రూ.9 వేల జరిమానా చెల్లించి ట్రాఫిక్ కేసుల నుంచి ఉపశమనం పొందారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడపడం తదితర నియమాల ఉల్లంఘనలపై ఈ–చలాన్లో కరియప్పపై 36 కేసులు దాఖలు చేశారు. మొత్తం రూ.18 వేల జరిమానా చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన రాయితీ ఆదేశాల మేరకు 50 శాతం జరిమానా సొమ్ము చెల్లించి కేసుల నుంచి విముక్తి పొందినట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. నియమాలను ఉల్లంఘించడంపై కెమెరాలో రికార్డు అయింది. నియమాల ఉల్లంఘన కేసుల జరిమానా బకాయి ఉన్న వారికి ఫోన్ చేసి వివరాలు తెలియజేస్తున్నాం. ఆ మేరకు పలువురు జరిమానా చెల్లించి తమ కేసుల నుంచి ఉపశమనం పొందుతున్నారన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు తగదు హుబ్లీ: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజల జేబులకు చిల్లు పెడుతోందని అసెంబ్లీలో విపక్ష ఉపనేత, ఎమ్మెల్యే అరవింద బెల్లద ఆరోపించారు. ధరల పెరుగుదలతో ఇప్పటికే అల్లాడి పోతున్న ప్రజలకు ఇప్పుడు మరొక తీరని శరాఘాతం తగిలిందని ఆయన ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సిద్దరామయ్య సర్కారు ఎటువంటి ముందు సూచనలు ఇవ్వకుండా ఆస్తుల నమోదు శుల్కాన్ని ఉన్నఫళంగా రెట్టింపు చేసిందన్నారు. జీవితమంతా శ్రమించి అప్పులు చేసి సొంత ఇల్లు నిర్మించుకొనే కల కంటున్న పేదలు, మధ్య తరగతి వర్గాలపై ఇప్పుడేమో 7.6 శాతం రిజిస్ట్రేషన్, ప్రింటింగ్ ఫీజుల భారం మోపిందన్నారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయం వల్ల సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కన్న వారికి కాంగ్రెస్ నిరాశ కలిగించిందన్నారు. అవినీతిలో మునిగిన ఈ సర్కారు తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేవలం సామాన్యుల రక్తాన్ని పీల్చిపిప్పి చేస్తోందని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ ఈ ప్రజావ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పి రిజిస్ట్రేషన్ ఫీజులను గతంలో మాదిరిగా యథావిధంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్కులను అభివృద్ధి చేయండి ● బుడా అధ్యక్షుడికి స్థానికుల వినతి సాక్షి,బళ్లారి: నగరంలోని ఎంఆర్వీ లేఅవుట్, హరిప్రియ నగర్ లేఅవుట్, వాజపేయి లేఅవుట్ తదితర కాలనీల్లో ఉన్న పార్కులు రోజురోజుకు అధ్వానంగా మారుతున్నాయని, ఆయా పార్కులను అభివృద్ధి చేయాలని కాలనీ వాసులు బుడా అధ్యక్షుడు జేఎస్ ఆంజనేయులుకు వినతిపత్రం అందించారు. మంగళవారం నగరంలోని బుడా కార్యాలయంలో ఆయా కాలనీవాసులు నాగేశ్వరరావు, రవికుమార్ తదితరులు అధ్యక్షుడిని కలిసి పార్కుల దుస్థితి గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న పార్కులను అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని, బుడా తరపున పార్కులను బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. నైరుతి రైల్వేకు రూ.755 కోట్ల ఆదాయం హుబ్లీ: నైరుతి రైల్వే ప్రస్తుత ఏడాది ఆగస్ట్ నెలలో రూ.755 కోట్ల ఆదాయం గడించింది. 42 లక్షల టన్నుల సరుకులను రవాణా చేయడం ద్వారా రికార్డు స్థాయిలో ప్రగతి సాధించింది. 1.45 కోట్ల మంది ప్రయాణికులు ప్యాసింజర్ రైళ్లలో సంచరించారు. రూ.305 కోట్ల ఆదాయం లభించింది. సరుకు రవాణా చార్జీల కింద రూ.418 కోట్లు, అలాగే కోచింగ్ సేవల ద్వారా రూ.24 కోట్లు, పార్సిల్ ట్రాఫిక్ కింద రూ.13.5 కోట్లు, టిక్కెట్ల పరిశీలన ద్వారా రూ.4.16 కోట్లు, జరిమానా రూపంలో రూ.59 లక్షలు, వాణిజ్య వనరుల ద్వారా రూ.3.18 కోట్లు, అలాగే వివిధ మార్గాల ద్వారా రూ.8.3 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సాధనకు శ్రమించిన అధికారులు, సిబ్బందిని రైల్వే ప్రధాన వ్యవస్థాపకులు ముకుల్ శరణ్ మాథుర్ అభినందించారు. -
మహమ్మద్ పైగంబర్ బోధనలపై అభియాన్
కోలారు : మహమ్మద్ పైగంబర్ బోధనలపై జిల్లా జమాతె ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 14 వరకు 10 రోజుల జన సందేశ అభియాన్ను నిర్వహిస్తామని జమాతె ఇస్లామి హింద్ మాజీ అధ్యక్షుడు ముబారక్ బాగ్దాన్ తెలిపారు. మంగళవారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. అభియాన్ సందర్భంగా విచార గోష్టులు, రక్తదాన శిబిరాలు, ప్రబంధ పోటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ అందజేస్తామన్నారు. మైనారిటీ సముదాయ ప్రముఖుడు అన్వర్ పాషా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త న్యాయ, మానవత సందేశాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలన్నారు. విలేకరుల సమావేశంలో జమాతె ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఆలి, తాలూకా అధ్యక్షుడు అజ్మల్ ఖదీర్, కోశాధికారి రుహుల్లా బేగ్ పాల్గొన్నారు. -
ఎరువుల కొరత తలెత్తనీయొద్దు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్రాయచూరు రూరల్: రైతులకు ఎరువులు, క్రిమిసంహారక మందుల కొరత రాకుండా వ్యవసాయ శాఖాధికారులు చర్యలు చేపట్టాలని గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్ అధికారులకు సూచించారు. ఆయన మంగళవారం తాలూకా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పథకాల పనుల ప్రగతిపై జరిగిన కేడీపీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు 2.29 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా అయ్యాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అధికారులు, కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. వానాకాలం కావడంతో డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. తోటల పెంపకానికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. విద్యుత్ మీటర్ లేదు, బిల్ కట్టలేదంటూ విద్యుత్ సరఫరాను కట్ చేయరాదన్నారు. అక్రమంగా ఇసుక రవాణా నియంత్రణకు అధికారులు ముందుండాలన్నారు. పీడీఓలు గ్రామాల్లో పర్యటించి సమస్యలపై స్పందించాలని సూచించారు. సమావేశంలో మల్లికార్జున గౌడ, జయంతిరావ్, పవన్ పాటిల్, అధికారులు సురేష్ వర్మ, శరణ బసవ, చంద్రశేఖర్, సభ్యులు పల్లవి, ఈరేశ, రామప్ప, శ్రావణి, తిమ్మప్ప, చెన్నబసవ నాయక్, ఫారూక్, జిలానిలున్నారు. అధికారులకు గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్ సూచన -
కనువిందుగా శోభాయాత్ర
సాక్షి,బళ్లారి: వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన హిందూ మహాగణపతి వినాయక విగ్రహాన్ని కన్నుల పండువగా శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేశారు. నగరంలోని సెంటినరీ హాల్ వద్ద వారం రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం విశ్వ హిందూ పరిషత్, రాష్ట్ర భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరేగింపు అనంతరం కోలాహలంగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. నగరంలో వినాయక విగ్రహాలు మూడవ రోజు, 5వ రోజు నిమజ్జనం జరగగా, సెంటినరీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన హిందూ మహాగణపతిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సవ సమితి నిర్వాహకులు ఊరేగించారు. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షంలోనే భారీ జనసందోహం తరలిరావడంతో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి గట్టి బందోబస్తు నిర్వహించారు. నగరంలోని సెంటినరీ హాల్ నుంచి రాయల్ సర్కిల్, బ్రూస్పేట్ పోలీస్ స్టేషన్, మోతీ సర్కిల్, తేరు వీధి తదితర ప్రధాన రహదారులలో వినాయక శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. శోభయాత్రలో మేళాలు, డప్పులు కొడుతూ సందడి చేశారు. డ్యాన్స్లు, నృత్యాలు చేయడంతో పాటు కాషాయ జెండాలు పట్టుకొని గణపతి ముందు ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపులో మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ వైఎం సతీష్, కార్పొరేటర్లు మోత్కూర్ శ్రీనివాస్, బాలా హోటల్ యజమాని పోలా రాధాకృష్ణ, వీహెచ్పీ, భజరంగదళ్ సభ్యులు పాల్గొన్నారు. వర్షంలోనూ భారీగా తరలి వచ్చిన భక్తులు ఆకట్టుకున్న హిందూ మహా గణపతి విగ్రహం -
రోడ్ల మరమ్మతు కోసం వినూత్న నిరసన
రాయచూరు రూరల్: జిల్లాలో ఇటీవల కురిసిన వానలకు అధ్వాన స్థితికి చేరుకున్న రహదారుల మరమ్మతు చేపట్టాలంటూ మొక్కలు నాటి నిరసన ప్రదర్శన చేశారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అఖిల భారత క్రాంతికారి విద్యార్థి సంఘం, యువజన వేదికల జిల్లాధ్యక్షుడు అజీజ్ జాగీర్దార్ మాట్లాడారు. నగరంలో నడవడానికి వీలు కాని పరిస్థితులు నెలకొన్నాయని, మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో మారెప్ప, ప్రకాష్, అబ్బాస్, రవిచంద్రన్, హుచ్చరెడ్డి, నిరంజన్లున్నారు. స్వచ్ఛ మంత్రాలయకు శ్రీకారంరాయచూరు రూరల్: మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠంలో మంగళవారం స్వచ్ఛతకు శ్రీకారం చుట్టారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగల్ ఈ కార్యక్రమానికి శుభం పలికారు. మంత్రాలయ మఠంలో భక్త సమూహంతో మూడు ప్రాంతాల్లో స్వచ్ఛ, సుందర, స్వర్ణహరిత మంత్రాలయంగా ప్రతి ఒక్కరూ తీర్చిదిద్దాలని స్వామీజీ సూచించారు. మహదేవపుర మాజీ శాసన సభ్యుడు అరవింద లింబావళి వెయ్యి మంది వాలంటీర్లతో శ్రమదానం చేయించారు. జెస్కాం ఇంజినీర్ అనుమానాస్పద మృతి రాయచూరు రూరల్: రాయచూరు జెస్కాం విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న గాయత్రి(34) అనుమానాస్పదంగా మరణించారు. మంగళవారం తెల్లవారు జామున ఇంటిలో కింద పడి మరణించినట్లు భర్త బసవరాజ్ తెలిపారు. ఈ విషయంపై పశ్చిమ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అందడంతో ఎస్ఐ మంజునాథ్ మృతదేహాన్ని పంచనామా కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయత్రి మృతదేహాన్ని భర్త బసవరాజ్ బళ్లారికి తరలించి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమవుతుండగా అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయత్రి, భర్త బసవరాజ్ పరస్పరం ప్రేమించుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు సమాచారం. కాగా గాయత్రి చెల్లెలు వచ్చిన తర్వాత మృతదేహాన్ని బళ్లారికి తీసుకెళ్లారు. భక్తులకు ప్రసాదం పంపిణీ రాయచూరు రూరల్: నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణపతుల వద్ద మంగళవారం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. కిల్లే మఠం వద్ద తొమ్మిది రోజుల పాటు జరిగిన పూజల్లో భాగంగా కిల్లే మఠం పీఠాధిపతి శాంతమల్ల శివాచార్య, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, సభ్యుడు దరూర్ బసవరాజ్, పురుషోత్తం ఇన్నాణి, శివమూర్తి, భీమన్న, కాశీ విశ్వనాథ్, శాలం, వెంకటేష్, శరణమ్మ, శివ కుమార్, రవి, సంతోష్, కేసరి గజానన కార్యకర్తలు ప్రత్యేక పూజలు జరిపారు. అజాద్నగర్, మడ్డిపేట, బెస్తవారపేటలో అన్నదానం చేశారు. విద్యార్థులకు క్రీడలూ అవసరంహొసపేటె: విద్యార్థులకు పాఠ్యేతర కార్యకలాపాలు అవసరం ని విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే నేమిరాజ్ నాయక్ తెలిపారు. మంగళవారం జి.నాగలాపుర గ్రామంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. శారీరక శ్రమ ఉంటే శరీరంలో తేజస్సు ఉంటుంది. శరీరం శక్తివంతంగా ఉండటానికి శారీరక కార్యకలాపాలు ముఖ్యం. శరీరం ఎల్లవేళలా చురుగ్గా ఉండాలంటే జీవశక్తి ఉండాలి. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. క్రీడలను ఉత్సాహంగా ఆడాలని ఆయన పిలుపుపిచ్చారు. నియోజకవర్గంలోని 201 పాఠశాలలకు క్రీడా పరికరాలు, 81 పాఠశాలలకు విజ్ఞాన ప్రయోగశాల పరికరాలు పంపిణ చేశామన్నారు. రెండున్నరేళ్లలో విద్యా రంగానికి రూ.81 కోట్ల గ్రాంట్ ఇచ్చామన్నారు. పిల్లలు తల్లిదండ్రుల కోరిక మేరకు బాగా చదువుకోవాలన్నారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించాలని ఆయన పిల్లలకు సూచించారు. ఈ సందర్భంగా నాగలాపుర గురు ఒప్పత్తేశ్వర మఠానికి చెందిన జీ.నిరంజన్ ప్రభు మహాస్వామి, బీఎంఎం ఇస్పాత్ అధికారులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.