Tamil Nadu
-
ఒంటరికై నా సిద్ధం!
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోటీకై నా వెనుకాడబోమని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ వ్యాఖ్యానించారు. అరుప్పుకోట్టై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యువజన నేత విజయప్రభాకరన్ పోటీ చేయాలని పార్టీ వర్గాలు విన్నవించుకోవడంతో ఆ దిశగా ఆయన దృష్టిపెట్టే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ నిర్వాహకులతో సమావేశాలకు డీఎండీకే ప్రధాన కార్యదర్శి నిర్ణయించారు. తొలిరోజున దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి, మదురై, విరుదునగర్, రామనాథపురం, తెన్కాశి జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి, బలోపేతం దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. కూటమిగా, ఒంటరిగానైనా సరే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తెలిసింది. అదే సమయంలో విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యువజన నేత విజయకాంత్ వారసుడు విజయ ప్రభాకరన్ పోటీ చేయాలన్న నినాదాన్ని నేతలు అందుకున్నారు. దీంతో ఆదిశగా కార్యక్రమాలపై దృష్టిపెట్టేందుకు విజయప్రభాకరన్ నిర్ణయించినట్టు సమాచారం. విరుదునగర్ లోక్సభకు పోటీ చేసిన సమయంలో ఇక్కడి అరుప్పుకోట్టై అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికన్నా అత్యధికంగా ఓట్లను విజయ ప్రభాకరన్ సాధించడంతోనే ఆయన్ను ఆ నియోజకవర్గం నుంచి పోటీచేయాలన్న ప్రతిపాదనను పార్టీ ముందు దక్షిణాది జిల్లాల నేతలు ముందు ఉంచినట్టు తెలిసింది. ఇక, ఈ సమావేశానంతరం మీడియాతో ప్రేమలత విజయకాంత్ మాట్లాడుతూ ప్రస్తుతం తాము ఏ కూటమిలోనూ లేమని, కూటమి నిర్ణయం జనవరిలో స్పష్టం చేస్తామన్నారు. ఒంటరిగానైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు వెనుకాడబోమన్నారు. -
మళ్లీ అధికారం తథ్యం
● రైతన్నలు మా వెంటే ● సీఎం స్టాలిన్ ధీమా ● ఈరోడ్లో వ్యవసాయ ప్రదర్శన ప్రారంభం ● నేడు కురువై సాగుకు కావేరి నీళ్లుసాక్షి, చైన్నె : రానున్న 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ద్రవిడ మోడల్ 2.ఓ అధికారంలోకి రావడం తథ్యమని సీఎం స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. రైతన్నలంతా తమ వెన్నంటే ఉన్నారని అన్నారు. ఈరోడ్లో వ్యవసాయ ప్రదర్శనను బుధవారం సీఎం స్టాలిన్ ప్రారంభించారు. వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ తరఫున ‘వ్యవసాయ ప్రదర్శన, సెమినార్–2025‘ ఉత్సవం బుధవారం ప్రారంభమైంది. ఈరోడ్ జిల్లాలోని పెరుందురై విజయమంగళంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను స్టాలిన్ ప్రారంభించారు. వ్యవసాయరంగంలో ఆధునిక సాంకేతికతలు, అధికదిగుబడిని ఇచ్చే కొత్త రకాల పంటలు, వ్యవసాయ పద్ధతులు, యంత్రాలు, విలువ ఆధారిత సాంకేతికతలపై రైతులు, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రదర్శనను ప్రారంభించిన స్టాలిన్ పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ, తమిళనాడు డెయిరీ ఉత్పత్తిదారుల సహకార నెట్వర్క్ (ఆవిన్), తమిళనాడు ఆహార ప్రాసెసింగ్ , వ్యవసాయ ఎగుమతి ప్రమోషన్ కార్పొరేషన్, సెరికల్చర్ అభివృద్ధి విభాగం, తమిళనాడు సహకార మార్కెటింగ్ నెట్వర్క్, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన సంస్థలు, సహకార సంస్థలు, తమిళనాడు వ్యవసాయ వర్సిటీ, తమిళనాడు వెటర్నరీ సైన్సెస్ విశ్వవిద్యాలయం, ఫిషరీస్ విశ్వవిద్యాలయం, బ్యాంకులు, పంట బీమా కంపెనీలు, నాబార్డ్ వంటి వివిధ సంస్థలు కొలువుదీర్చిన ప్రదర్శనలను వీక్షించారు. సూక్ష్మ నీటిపారుదల, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల తయారీ, విత్తన, బ్యాంకులు, పంటల బీమా కంపెనీలు, చక్కెర మిల్లులు ఈ ప్రదర్శనకు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. మంత్రులు ఏవీ వేలు, ఎంఆర్కే పన్నీరుసెల్వం, ఎస్.ముత్తుస్వామి, ఎం.పి. స్వామినాథన్, కయల్విజి సెల్వరాజ్, తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి విజయన్, ఎంపీలు అందియూరు సెల్వరాజ్, ప్రకాష్, హాజరయ్యారు. అలాగే, ఈరోడ్ జిల్లాలో పూర్తయిన 16 ప్రాజెక్టులను ప్రారంభించారు. మరో 11 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.25.41 కోట్ల విలువైన సంక్షేమ సహాయకాలను 4,524 మంది రైతులకు అందజేశారు.పొటో:34: వడపళణి బస్టాండ్ న్యూస్రీల్మద్దతుగా ఉండండి సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ అన్నదాతల వల్లే ఈ భూమి సుభిక్షంగా ఉందని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈరోడ్ విశిష్టత, ఇక్కడ సాగుబడి, సెలయేర్లు, రిజర్వాయర్లు, నదులను గుర్తుచేస్తూ, ఇది భారతదేశ ‘పసుపు నగరం’ అని, అందుకే ఈ సారి ప్రదర్శనకు వేదికగా ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని అందరం ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవశ్యం ఉందని సూచించారు. రైతుల ప్రగతి పయనం కొనసాగాలని , ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సారవంతమైన భూములు, పంటలమధ్య కలుపు మొక్కల వలే గత పాలకులు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారని, అన్నదాతలను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. కలుపు మొక్కలు మళ్లీ పెరిగే ప్రయత్నం చేస్తున్నాయని, వాటిని తొలగించేందుకు రైతాంగం సిద్ధం కావాలన్నారు. ద్రవిడ నమూనా ప్రభుత్వం అందిస్తూ వస్తున్న పథకాలు, సహకారం, తోడ్పాటు గురించి వివరిస్తూ మళ్లీ ద్రావిడ మోడల్ 2.ఓ రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా డెల్టా వర ప్రదాయిని మేట్టూరు జలాశయం నుంచి ఈ ఏడాది నిర్ణీత జూన్12 గురువారం డెల్టా జిల్లాల్లో కరువై సాగు నిమిత్తం నీటి విడుదల జరగనుంది. నీటిని విడుదల చేయడానికి సీఎం స్టాలిన్ సిద్ధమయ్యారు. -
ఆ పార్టీలు మాతో సంప్రదిస్తున్నాయి
● నైనార్ వ్యాఖ్యల చర్చసాక్షి, చైన్నె: తమతో డీఎంకే కూటమిలోని పార్టీలు సంప్రదిస్తున్నట్టు, ఓ పార్టీ అయితే, మరింత దగ్గరకు వచ్చినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కేంద్ర సహాయమంత్రి వేల్మురుగన్ వేర్వేరుగా ప్రకటించారు. ఇది కాస్త డీఎంకే కూటమిలో చర్చకు దారితీసింది. అదే సమయంలో కూటమిలో సీట్ల నినాదం తెరపైకి వస్తున్నది. తమకు ఈసారి ఎక్కువ సీట్లు కావాలని సీపీఎం నేత షణ్ముగం ప్రకటించిన విషయం తెలిసిందే. అదేసమయంలో బుధవారం వీసీకే నేత తిరుమావళవన్ మీడియాతో మాట్లాడుతూ, తాము కూడా అధిక సీట్లను ఆశిస్తున్నామని, ఆ దిశగా డీఎంకేను కోరుతామన్నారు. ఈ పరిస్థితుల్లో కూటమిలో గందరగోళం సృష్టించడం లేదా, చర్చను తెరపైకి తెచ్చే రీతిలో బుధవారం నైనార్ నాగేంద్రన్, ఎల్.మురుగన్ వేర్వేరుగా స్పందించడం గమనార్హం. డీఎంకే కూటమిలోని పార్టీలు తమ కూటమితో సంప్రదింపుల్లో ఉన్నట్టు, ఒక పార్టీ అయితే, మరీ దగ్గరగా వచ్చినట్టు వ్యాఖ్యానించారు. డీఎంకే కూటమిలో చీలిక తథ్యమని, బీజేపీ, అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి మరింత బలోపేతం కావడం తథ్యమని స్పష్టం చేశారు. ఇందుకు స్పీకర్ అప్పావు గట్టిగానే సమాధానం ఇస్తూ డీఎంకే కూటమి పార్టీలను వెనకేసుకొచ్చారు. అసలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ఎన్నికల సమయం వరకు బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తారా అనేది అనుమానమేనని వ్యాఖ్యానించారు. ఆయన తెలివిమంతుడు అని, తన దగ్గరకు వచ్చే ఆ పార్టీ ఎమ్మెల్యేలే పలువురు తాజా కూటమిపై పెదవి విప్పడం జరుగుతోందని, ముందుగా ఆ కూటమి పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందో చూసుకోమనండి అని నైనార్ నాగేంద్రన్కు అప్పావు కౌంటర్ ఇవ్వడం గమనార్హం. అయితే, బీజేపీకి దగ్గరగా వెళ్లిన డీఎంకే కూటమిలోని ఆ పార్టీ ఏదో అని ఆరా తీసే వాళ్లు పెరిగారు. -
● నేడు కీలక ప్రకటన ● చట్ట పరంగా చర్యలు తప్పదు ● తిలక బామాకు సయ్యద్ హెచ్చరిక
సాక్షి, చైన్నె : పీఎంకేలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గురువారం కీలక ప్రకటన చేయబోతున్నట్టుగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు చేసిన ప్రకటనతో అందరి చూపు తైలాపురం గెస్ట్ హౌస్ వైపు మళ్లింది. అదే సమయంలో ఇక కోశాధికారిగా చెప్పుకుని తిరిగితే చట్టపరంగా చర్యలు తప్పదని తిలక బామాకు పీఎంకే కోశాధికారిగా రాందాసు ద్వారా నియమితులైన సయ్యద్ మన్సుఫ్ హుస్సేన్ హెచ్చరించారు. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి రాందాసు మధ్య నెలకొన్న వివాదం ముదిరి పాకాన పడింది. తనకు మద్దతుగా ఉన్న జిల్లాల కార్యదర్శులతో సమాలోచనలకు అన్బుమణి పిలుపు నిచ్చిన నేపథ్యంలో రాందాసు మరో అడుగు ముందుకేశారు. గురువారం తైలాపురంలో మీడియా ముందుకు రానున్నట్టు, కీలక ప్రకటన చేయబోతున్నట్టు ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ వార్లో తనదే పై చేయి కావాలన్న నిర్ణయంతో ఉన్న రాందాసు ఎలాంటి ప్రకటన చేయబోతున్నారో? అని పీఎంకే వర్గాలు తైలాపురం వైపు దృష్టి పెట్టాయి.రాందాసు, అన్బుమణి చట్ట పరంగా..హెచ్చరిక పీఎంకేలో తనకు వ్యతిరేకంగా ఉంటూ, అన్బుమణికి మద్దతుగా ఉన్న పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులను పదవుల నుంచి రాందాసు తొలగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. పార్టీ అనుబంధ విభాగాలలోనూ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. అయితే, తానే అధ్యక్షుడ్ని అని, తాను సంతకం పెట్టకుండా ఎవరిని తొలగించ లేరని, అందరూ వారి వారి పదవుల్లో కొనసాగవచ్చని అన్బుమణి భరోసా ఇస్తూ వస్తున్నారు. అయితే తొలగించిన వారి స్థానంలో కొత్త వారు బాధ్యతలు చేపట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఏ పదవిలో ఎవరు ఉండాలో..? అన్న నిర్ణయించే అధికారం రాందాసుకు తప్ప మరొకరికి లేదని ఆ పార్టీ కోశాధికారిగా నియమితులైన సయ్యద్ మన్సూఫ్ హుస్సేన్ బుధవారం ప్రకటించారు. తొలగించిన వారంతా పదవుల్లో కొనసాగుతున్నట్టుగా గాని, ఆ పదవుల్ని అంటిపెట్టుకుని చెలామణి అవుతుంటే ఇక చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించడం గమనార్హం. పార్టీకి తానే కోశాధికారి అని, ఇకపై సత్యబామ తను కోశాధికారి అని చెప్పుకుని తిరిగిన పక్షంలో చట్ట పరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీలో పదవుల భర్తీ విషయంలో నియామక అధికారం అన్నది ఒక్క వ్యవస్థాపకుడు రాందాసుకు మాత్రమే ఉందని, ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించడం గమనార్హం. అదే సమయంలో రాందాసు ప్రకటన ఆధారంగా తన బలాన్ని చాటేలా పార్టీ సర్వ సభ్య సమావేశానికి పిలుపు నిచ్చే దిశగా అన్బుమణి సైతం వ్యూహాలకు పదును పెట్టారు. -
స్వయం సహాయక చిహ్నంగా ‘మధి’
సాక్షి, చైన్నె : స్వయం సహాయక సంఘాలకు చిహ్నంగా మధి పేరిట లోగోను బుధవారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఆవిష్కరించారు. మణి మేఘలై అవార్డులను ప్రదానం చేశారు. రూ. 3134 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. చైన్నెలోని కలైవానర్ అరంగంలో మహిళా సంక్షేమ విభాగం నేతృత్వంలో స్వయం సహాయక బృందాలకు మని మేఘలై అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33,312 స్వయం సహాయక సంఘాల్లోని 3,76,443 మంది సభ్యులకు రూ.3134.21 కోట్ల విలువైన బ్యాంక్ రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. చైన్నెలో 1,401 స్వయం సహాయక బృందాల్లోని 14,083 మంది సభ్యులకు రూ.123.65 కోట్ల విలువైన బ్యాంకు రుణాలను అందజేశారు. తమిళనాడులోని వివిధ జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 20 స్వయం సహాయక సంఘాలకు తలా రూ.లక్షతోపాటు అవార్డులు ప్రదానం చేశారు. ఐదు పంచాయతీ స్థాయి సంఘాలకు తలా మూడు లక్షలు, ఐదు గ్రామ సంఘాలకు తలా రూ. 5 లక్షల చెక్కులను అందజేశారు. దిండిగల్లో జిల్లా స్థాయిలోని రెడ్డియార్ చత్రం సంఘాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలతోపాటు మణి మేఘలై అవార్డు, సేలం జిల్లా సూర మంగళం నగర స్థాయి సంఘాలకు అవార్డులతో పాటు తలా రూ. ఐదు లక్షలు అందజేశారు. 2024–2025 సంవత్సరానికి గాను వివిధ సంఘాలకు మణిమేకలై అవార్డులతో మొత్తం రూ. 59.00 లక్షల విలువైన చెక్కులను డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ అందజేశారు. చైన్నెలోని నెహ్రూ పార్క్లో ఇటీవల స్వయం సహాయక సంఘాలకు రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఇందులో 20 సంఘాలకు అవార్డులు, రూ. 2.75 లక్షలు విలువైన చెక్కులను బహుమతిగా పంపిణీ చేశారు. మధి లోగో ఆవిష్కరణ స్వయం సహాయ బృందాలు రూపొందించిన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించారు. స్వయం సహాయక బృందాలకు చిహ్నంగా మధి పేరిట లోగోను విడుదల చేశారు. నాణ్యతతో కూడిన వేరుశనగ నూనెను పరిచయం చేశారు. ఈ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో మహిళా స్వయం సహాయక సంఘాలు రూపొందించిన వివిధ ఉత్పత్తులను కొలువు దీర్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శేఖర్ బాబు, చైన్నె మేయర్ ఆర్ ప్రియ, ఎంపీ దయానిధి మారన్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గగన్దీప్ సింగ్ బేడీ, మహిళా అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రేయ పి సింగ్, మహిళా స్వయం సహాయక బృందం సభ్యులు కె. విజయలక్ష్మి, ఎస్, శరణ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడుతూ డీఎంకేకు బలం మహిళా శక్తి అన్నారు. వారి మద్దతుతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రూ. 3,134 కోట్ల రుణాల పంపిణీ మణి మేఘలై అవార్డుల ప్రదానం -
వడపళని బస్ టెర్మినల్కు మోక్షం
● 12 అంతస్తుల భవనంగా నిర్మాణం సాక్షి, చైన్నె : వడపళని బస్టాండ్ పనులకు మోక్షం లభించింది. చైన్నె నగరం నడి బొడ్డున ఉన్న ఈ బస్టాండ్ స్థానంలో 12 అంతస్తులతో భవనంతోపాటు ఇంటి గ్రేటెడ్ బస్ టెర్మినల్ ఏర్పాటు చేయబోతున్నారు. చైన్నె నగరంలో వడపళణి అత్యంత ముఖ్య ప్రాంతం. నగరం నడి బొడ్డున ఈ ప్రాంతం ఉంది. ఈ పరిసరాలు మాల్స్, ఆస్పత్రులతో నిండి ఉంటాయి. ఇక్కడ ఆర్కాడ్రోడ్డులో 6.65 ఎకరాల విస్తీర్ణంలో వడపళణి బస్ డిపోతోపాటుగా ఎంటీసీ బస్సుల సేవల నిమిత్తం బస్టాండ్ ఉంది. ఇక్కడి నుంచి రోజుకు 158 బస్సులు 1,158 సర్వీసులుగా వచ్చి వెళుతుంటాయి. ప్రస్తుతం ఈ పరిసరాలను కలుపుతూ మెట్రో రైలు సేవలు ఒక జంక్షన్గా ఏర్పాటు కానున్నది. ఈ పరిస్థితుల్లో రెకుల షెడ్డును తలపించేలా ఉన్న ఈ బస్టాండ్ను ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్గా మార్చేందుకు చైన్నె మెట్రోరైలు, తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ దృష్టి పెట్టాయి. 12 అంతస్తులతో భవనంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టనున్నారు. కింది భాగం పూర్తిగా బస్ టర్మినల్ను తలపించేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇతర అంతస్తులలో వాణిజ్య సముదాయాలను తలపిస్తూ మాల్ రూపంలో ఏర్పాట్లకు సంబంధించిన నమూనాను తాజాగా సిద్ధం చేసి విడుదల చేశారు. రూ.481 కోట్లతో ఇక్కడ నిర్మాణాలకు అంచనా వ్యయంగా నిర్ణయించి ఉన్నారు. ఘనంగా బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవం కొరుక్కుపేట: చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్లో ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు . ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఐసీడబ్ల్యూఓ)తో కలిసి ఏవీఏ, జస్ట్ రైట్స్ఫర్ చిల్డ్రెన్, ఆర్పీఎఫ్, చైల్డ్ లైన్ సంయుక్తంగా బాల కార్మికుల నిర్మాలనపై అవగాహన కల్పించారు. పిల్లలను బడిబాట పట్టించాలని, పనులకు పంపొద్దు అంటూ ప్రత్యేక స్కిట్లతో అవగాహన తీసుకొచ్చారు. బాలకార్మికుల నిర్మూలనకు సంబంధించిచిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఇందులో ఐసీడబ్ల్యూఓ సెక్రటరీ ఏజే హరిహరన్, ఏవీఏ స్టేట్ కో– ఆర్డినేటర్ మాలిన్, రైల్వే పోలీసులు పాల్గొన్నారు. టీవీకే ఐటీ ఇన్చార్జ్లు సాక్షి, చైన్నె: తమిళ వెట్రి కళగం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) విభాగానికి రాష్ట్రవ్యాప్తంగా ఇన్చార్జ్లను నియమించింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ఇన్చార్జ్లు పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఈ ఇన్చార్జ్ల జాబితాను బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రకటించారు. ఐటీ బృందానికి రాష్ట్ర స్థాయిలో సమన్వయకర్తలుగా అస్మిత్, సైమన్ ఇమాన్యుయేల్, ఆండ్రూ, మహేశ్, వినోద్కుమార్, లోకేశ్వరన్, సజీష్, సౌమ్య వ్యవహరిస్తారని వివరించారు. అలాగే, జోన్ల వారిగా పదిమంది చొప్పున సమన్వయ కర్తలను, ఇన్చార్జ్లను రంగంలోకి దించారు. చైన్నె, వేలూరు, తిరుచ్చి, మదురై, కోయబత్తూరు, కడలూరు, తంజావూరు, రామనాతపురం, సేలం, తిరునల్వేలి జోన్లుగా ఈ నియామకాలు జరిగాయి. అలాగే, లీగల్ టీమ్ కో–ఆర్డినేటర్లను సైతం నియమించారు. బైక్ను ఢీకొన్న కారు భర్త కళ్లెదుటే భార్య మృతి తిరువళ్లూరు: బైక్ను కారు ఢీకొన్న ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య మృతి చెందిన సంఘటన తిరువళ్లూరులో చోటుచేసుకుంది. తిరువళ్లూరులోని ఇందిరనగర్కు చెందిన మురుగన్. ఇతను మంగళవారం సాయంత్రం భార్య సెల్వీతో కలిసి పోలీవాక్కంలోని అక్క ఇంటికి బైక్లో బయలుదేరాడు. పోలీవాక్కం సమీపంలో వెళుతుండగా బైక్ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో సెల్వి(45) అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన మురుగన్ను స్థాఽనికులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మనవాలనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫోటో:35: పోస్టర్లను ఆవిష్కరిస్తున్న హరిహరన్, పోలీసులు -
‘సెయింట్ ఆంథోనియార్’ వజ్రోత్సవం
● వేడుకలకు శ్రీకారం సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని ఆవడిలో ఉన్న సెయింట్ ఆంథోనియార్ మందిరం 75వ వార్షికోత్సవానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం రాత్రి జరిగిన పతకావిష్కరణతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఈనెల 15వ తేదీ వరకు అత్యంత వైభవంగా ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. రెవరండ్ జీజే నేతృత్వంలో జరిగిన ఈ వేడుకకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. 1943లో రెవరెండ్ జాన్ వెన్నార్డ్ ఆవడి పరిసరాల్లో క్రైస్తవ సామాజిక వర్గం కోసం ఈ మందిరం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఆవడి, కామరాజ్ నగర్, పట్టాభిరామ్, అంబత్తూర్ పరిసరాల్లో క్రైస్తవ సామాజిక వర్గం కోసం ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1950లో విద్యా కార్యక్రమాలతో సేవలకు శ్రీకారం చుట్టారు. 1958లో అప్పటి ఎక్సలెన్సీ లూయిస్ మథియాస్ కొత్త చర్చికి పునాది రాయి వేశారు. 1959 జూలై 5న చైన్నె ఆర్చ్ డియోసెస్ సహ బిషప్ హిజ్ ఎక్సలెన్సీ ఫ్రాన్సిస్ కార్వాల్హో ఈ చర్చిని ప్రారంభించారు. ఆవడిలోని సెయింట్ ఆంథోనియార్ చర్చిని 2010 నవంబర్ 21న చైన్నె ఆర్చ్ బిషప్ అయిన యు.ఎ. చిన్నప్ప ఒక పుణ్యక్షేత్రంగా ప్రకటించారు. సెయింట్ ఆంథోనీ ఆవిష్కరణలతో నిండిన ఈ పవిత్ర ప్రదేశానికి కులాలు, మతాలకతీతంగా వేలాది మంది తరలి వస్తున్నారు. ప్రస్తుతం 75వ వార్సికోత్సవం నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం రాత్రి జరిగిన జెండా ఆవిష్కరణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శాంతి పావురాలను ఎగుర వేశారు. ఈనెల 13వ తేదీన ఆరు గంటల నుంచి ప్రత్యేక వేడుకలు, 14వ తేదీన మరిన్ని కార్యక్రమాలతోపాటుగా తీర్థ తిరువిలా అంటూ 15వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. -
‘కీలడి’ ఆధారాలు నిరూపితం కాలేదు
● కేంద్ర మంత్రి షెకావత్ ● 11 సంవత్సరాలు స్వర్ణయుగం సాక్షి, చైన్నె: కీలడి పురావస్తు పరిశోధనల ఆధారాలు శాసీ్త్రయంగా, సాంకేతికంగా ఇంకా నిరూపితం కాలేదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. మదురై సమీపంలోని కీలడిలో మూడేళ్ల పాటు పురావస్తు శాస్త్రవేత్త అమర్నాథ్ రామకృష్ణన్ నేతృత్వంలో పురావస్తు పరిశోధనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిశోధనలలో తమిళ సంస్కృతి, నాగరికతకు సంబంధించిన ఎన్నో ఆధారాలు బయటపడ్డట్టుగా ప్రచారం జరిగింది. అదేసమయంలో ఈ పరిశోధనను కేంద్రం హఠాత్తుగా నిలుపుదల చేయడం చర్చకు దారి తీసింది. ఇక, తమిళ సంస్కృతి, సంప్రదాయాలు, పురాతనలపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి నిధులను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో 2016 నుంచి ఇక్కడ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక్కడ లభించిన వస్తువులను ఓపెన్ ఎగ్జిబిషన్లో ఉంచారు. అలాగే, ఇక్కడ బ్రహ్మాండ ఆడిటోరియం, ఎగ్జిబిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, ఈ పరిస్థితుల్లో మూడేళ్లు జరిగిన పరిశోధన అర్ధాంతరంగా ఆగడం, ఇందులో వెలుగు చూసిన అంశాలను బహిర్గతం చేయాలని కోరుతూ ధర్మాసనంలో పిటిషన్ సైతం విచారణలో ఉంది. ఈ పురావస్తు పరిశోధనలోని అంశాలను కేంద్రం నిరాకరించినట్టుగా చర్చ సైతం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చైన్నెకు వచ్చిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ టీ.నగర్లోని బీజేపీ ప్రధాన కార్యాలయం కమలాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ 11 సంవత్సరాల పాలనపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలడి పరిశోధనలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అమర్నాథ్ బృందం జరిపిన పురావస్తు పరిశోధనలోని అంశాలు శాసీ్త్రయంగా, సాంకేతికపరంగా నిరూపితం కాలేదని, మరిన్ని ఆధారాలు అవశ్యమని స్పష్టం చేశారు. 11 ఏళ్ల పాలన స్వర్ణయుగం ప్రధాని నరేంద్ర మోదీ నేత్వత్వంలో ఇప్పటివరకు 11 సంవత్సరాల పాటు సాగిన పాలన అమృత్కాల్(స్వర్ణయుగం) అని వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలన, పేద ప్రజల సంక్షేమంపై దృష్టి పెడుతూ కొత్త ప్రయాణం, అభివృద్ధి ప్రయాణం మరింత వేగం పుంజుకోనున్నట్టు వివరించారు. సర్వతోముఖాభివృద్ధి వైపు దేశం దూసుకెళ్తోందన్నారు. 11 సంవత్సరాలు ఈ దేశాన్ని ప్రగతి పథకంలో నడిపించారని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దేందుకు కట్టుబడి పనిచేస్తున్నామన్నారు. సరిహద్దుల్లో భద్రత పటిష్టంగా ఉందని, దేశంలో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పి, సాంకేతికతను బలోపేతం చేసి ప్రతి పౌరుడికి పథకాలు దరిచేర్చే విధంగా విస్తృత చర్యలతో ముందుకెళ్తున్నామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ నైనార్ నాగేంద్రన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. -
మిసెస్ అండ్ మిస్టర్ పోస్టర్ల ఆవిష్కరణ
అనంతన్కాడు చిత్రంలో ఆర్య తమిళసినిమా: పాత్రలో పస ఉంటేనే నటించడానికి సమ్మతించే నటి సాయిపల్లవి. నిరాకరించిన చిత్రాలు నిరాశపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. కథానాయకిగా తొలి చిత్రం ప్రేమమ్ నుంచి సమీప కాలంలో నటించిన తండేల్ వరకు వైవిధ్యభరితమైన కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్న సాయిపల్లవికి దక్షిణాది సినిమాల్లో కథానాయకిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇలా వరుస విజయాలతో తన ప్రత్యేకతను చాటుకుంటున్న కథానాయకి సాయిపల్లవి. ప్రస్తుతం బాలీవుడ్లో మకాం పెట్టారు. అక్కడ పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న రామా యణం చిత్రంలో సీతగా నటిస్తున్నారు. చిత్రాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేస్తున్న సాయిపల్లవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ముఖ్యంగా మీ బయోపిక్తో చిత్రం రూపొందితే దానికి టైటిల్ ఏమి పెట్టవచ్చు అన్న ప్రశ్నకు ఠక్కున బదిలిచ్చిన సాయి పల్లవి తన బయోపిక్ను రెడీ చేసి దానికి పేరేమి పెట్టాలని అడిగితే కచ్చితంగా 50 షేడ్స్ ఆఫ్ పల్లవి అని పెట్టాలని చెబుతానన్నారు. ఎందుకంటే ఒకరి వద్ద మనం ఒక్కోలా ఉంటామన్నారు. తాను అంతేనన్నారు. స్నేహితుల మధ్య ఉన్నప్పుడు ఒకరకంగానూ అదే ఇండస్ట్రీలో, షూటింగ్ సెట్స్లో ఉన్నప్పుడు వేరే విధంగా ఉంటామన్నారు. ఇక అమ్మ,నాన్న వద్ద ఉన్నప్పుడు ఇంకోలా ఉంటామన్నారు. అందుకే తన బయోపిక్తో చిత్రం చేస్తే, దానికి 50 షేర్స్ ఆఫ్ పల్లవి అనే టైటిల్ కరెక్ట్గా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. సాయిపల్లవి జీవిత చరిత్రతో చిత్రం రూపొందుతుందో లేదో గానీ ఆమె చెప్పిన ఈ టైటిల్ మాత్రం సూపర్గా ఉందని అంటున్నారు నెటిజన్లు. తమిళసినిమా: కోలీవుడ్లో గోల్డ్ అండ్ బ్యూటీఫుల్ అండ్ డేరింగ్ నటి వనితా విజయ్కుమార్. ఇంతకుముందు కథానాయకిగా నటించినా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. అలాంటిది ఈమె తాజాగా మెగాఫోన్ పట్టి మిసెస్ అండ్ మిస్టర్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. దీన్ని వనితా విజయకుమార్ వారసురాలు జోవిక నిర్మించడం విశేషం. బిగ్బాస్ రియాల్టీ షోలో పాల్గొని పాపులర్ అయిన ఈమె నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. వనిత ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై ఈమె నిర్మించిన ఈ చిత్రంలో రాబర్ట్ కథానాయకుడిగా నటించారు. కిరణ్ రాథోడ్, షకీలా ఆర్తిగణేష్, పవర్ స్టార్ శ్రీనివాసన్, ఫాతిమాబాబు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ దేవా సంగీతాన్ని, రాజాపాండి చాయాగ్రహణం అందించారు. పెళ్లి అయినన 40 ఏళ్ల సీ్త్ర సమాజంలో ఎదుర్కొనే సమస్యల సమహారమే ఈ చిత్ర కథ. ఆమెకు తన భర్త ఎలా అండగా నిలిచారు అనే పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన మిసెస్ అండ్ మిస్టర్ షూటింగ్ అధిక భాగం దుబాయ్, థాయిలాండ్లో జరుపుకోవడం విశేషం. ఈ చిత్రం జూలై 4న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు వనిత, నిర్మాత జోవిక మంగళవారం నటుడు రజనీకాంత్ను ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మిసెస్ అండ్ మిస్టర్ చిత్ర విడుదల తేదీ పోస్టర్లు ఆవిష్కరించారు. 50 షేడ్స్ ఆఫ్ సాయిపల్లవి -
కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్టు
తిరుత్తణి: ప్రేమ వివాహం చేసిన వ్యక్తి ఇంట్లో చొ రబడిన కిడ్నాపర్లు ఓ బాలుడి కిడ్నాప్ సంఘటనకు సంబంధించి ముగ్గురిని తిరువలంగాడు పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. తిరువలంగాడు సమీపం కలాంపాక్కం గ్రామానికి చెందిన యువరాజు అనే వ్యక్తి కుమారుడు ధను ష్(23) చైన్నెలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా డు. అతను ఇన్స్ట్రాగామ్ ద్వారా తేనికి చెందిన విజ యశ్రీ (21) అనే యువతిని ప్రేమించి, గత నెల 15 వ తేదీన కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నా డు. యువతి కుటుంబం పలుకుబడి ఉన్న కుటుంబం కావడంతో నూతన వధూవరులు ప్రాణ భ యంతో ఎవరి కంటా పడకుండా జీవిస్తున్నారు. వి షయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు మూడు రోజుల కిందట కలాంబాకంలోని ధనుష్ ఇంటికి వెళ్లి ఇంట్లోని అతని తమ్ముడు ఇంద్రచంద్(16) అనే బాలుడిని కిడ్నాప్ చేసి, తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ఇంద్రచంద్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాపర్లు బాలుడిని తీసుకొచ్చి వారి ఇంట్లో వదిలిపెట్టి వెళ్లారు. బాలు డిని కిడ్నాప్నకు సంబంధించి తిరువలంగాడు పో లీసులు కేసు నమోదు చేసి, తేనికి చెందిన వనరాజ(51),మణికండన్(44), గణేశన్ (47)ను అరెస్టు చేశారు. -
అధిక సీట్లు ఇవ్వాల్సిందే!
– సీపీఎం ప్రధాన కార్యదర్శి షణ్ముగం డిమాండ్ సాక్షి, చైన్నె : సీపీఎం ప్రధాన కార్యదర్శి షణ్ముగం వ్యాఖ్యలు డీఎంకే కూటమిలో మంగళవారం హాట్ టాపిక్గా మారాయి. ఈసారి తమకు అధిక సీట్లు ఇవ్వాల్సిందేనని, ఇందుకు డీఎంకే ముందుకు రా వాలని డిమాండ్ చేయడం చర్చకు దారి తీసింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఆరు స్థానాల్లో పోటీ చేసి, రెండు చోట్ల మాత్రమే గెలిచింది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి గెలిచింది. ఈ పరిస్థితుల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి నుంచి మరిన్ని సీట్లు రాబట్టాలన్న నిర్ణయానికి సీపీఎం తాజాగా వచ్చేసింది. ఇందుకు అనుగుణంగా మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షణ్ముగం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. మళ్లీ అధికారం దిశగా వ్యూహాలకు పదును పెట్టిన డీఎంకేను సీట్ల పేరిట ఇరకాటంలో పెట్టి, తమకు కావాల్సినవి దక్కించుకునే దిశగా కొన్ని పార్టీలు స్వరాన్ని అందుకుంటున్నాయి. ఇప్పటికే వీసీకే తమకు అధిక స్థానాలు అవశ్యం అన్న నినాదం అందుకోగా, ప్రస్తుతం సీపీఎం కూడా అదే బాణీలో పయనిస్తుండటం గమనార్హం. తమకు ఈ సారి ఎన్నికల్లో మరిన్ని అదనపు సీట్లు అవశ్యమని, ఇందుకు డీఎంకే ముందుకు రావాలని, కూటమి పార్టీ కోసం వారి సీట్లను తమకు అప్పగించాలని షణ్ముగం డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. -
కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
తిరువళ్లూరు: శ్మశానానికి దారి ఏర్పాటు విషయంలో ఒకే గ్రామానికి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్న క్రమంలో బయట వ్యక్తులు తమపై దాడులకు దిగారని ఆరోపిస్తూ దాదాపు వంద మంది కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా తిరువేళాంగాడు యూనియన్ వేణుగోపాలపురం పంచాయతీ పరిధిలో పరేశ్వరం గ్రామం ఉంది. ఈ గ్రామంలో శ్మశానం దారి విషయమై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇరువర్గాలు శ్మశాన దారి విషయమై ఘర్షణ పడగా తిరువేళాంగాడు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఇంత వరకు చర్యలు తీసుకోకపోగా, బయటి వ్యక్తులు కొందరు రాళ్లతో దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న తిరువళ్లూరు పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన పరేశ్వరం గ్రామానికి చెందిన బాధితులు కలెక్టర్ ప్రతాప్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ సైతం బాధితులకు న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. -
మెట్రో మాల్
● తిరుమంగళంలో 9 అంతస్తులతో నిర్మాణం ● రెండు అంతస్తుల్లో రైల్వేస్టేషన్ ● మరో రెండు అంతస్తుల్లో ట్రాక్ సాక్షి, చైన్నె: చైన్నెకు మరో ఐకానిక్గా నిలిచే రీతిలో మెట్రో రైల్వేస్టేషన్తో కూడిన మాల్ రూపదిద్దుకోనుంది. ఇందుకు సంబంధించిన నమూనాను మెట్రో రైలు యాజమాన్యం సిద్ధం చేసింది. తొమ్మిది అంతస్తులతో మూడు టవర్లుగా రూపుదిద్దుకునే ఈ మెట్రోమాల్ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. చైన్నెలో ఫేజ్–1లో రెండు మార్గాల్లో జరుగుతున్న మెట్రో రైలు సేవలకు రోజురోజుకు స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫేజ్–2లో మరో మూ డు మార్గాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మార్గాల్లో డ్రైవర్ రహిత మెట్రో సేవలకు కసరత్తులు చేసి, ట్రయల్రన్ విజయవంతంగా జరుగుతోంది. చైన్నె నగరం చుట్టూ మెట్రో రైలు సేవలు సాగే దిశగా భవిష్యత్తు కార్యాచరణను సైతం తీర్చిదిద్దారు. ఓ వైపు విమానాశ్రయం నుంచి శివారులోని కిలాంబాక్కం బస్ టెర్మినల్ వరకు, మరో వైపు పూందమల్లి నుంచి కాంచీపురం సమీపంలోని పరందూరు వైపు, ఇంకో వైపు కోయంబేడు నుంచి ఆవడి వైపు మెట్రో ప్రాజెక్టులకు రూపురేఖలు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్కు కూతవేటు దూరంలో సెంట్రల్ సూపర్ఫాస్ట్ రైళ్లు, మెట్రో, ఎలక్ట్రిక్, ఎంఆర్టీఎస్ సేవలను అనుసంధానించేలా బ్రహ్మాండంగా ఓ టవర్ నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేశారు. 15,884 చదరపు అడుగుల విస్తీర్ణంలో 27 అంతస్తులతో బ్రహ్మాండ స్క్వేర్ రూపంలో ఈ టవర్ను తీర్చిదిద్దే దిశగా మెట్రో యాజమాన్యం కసరత్తుల వేగాన్ని పెంచింది. ఈ పరిస్థితుల్లో కోయంబేడు–అన్నానగర్కు మధ్యలోని తిరుమంగళం వద్ద బ్రహ్మాండ మెట్రో రైల్వేస్టేషన్తో కూడిన మాల్ రూపకల్పనకు కార్యాచరణ సిద్ధం చేశారు. బ్రహ్మాండ మాల్ రూపంలో.. తిరుమంగళం వద్ద 6.85 లక్షల చదరపు అడుగుల స్థలంలో మెట్రో యాజమాన్యం నేతృత్వంలో బ్రహ్మాండ మాల్ రూపుదిద్దుకోనుంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే దేశంలోనే ప్రప్రథమంగా ఓ మాల్లోకి మెట్రో రైలు వెళ్లి వచ్చేలా, ఇక్కడే స్టేషన్ ఉండే దిశగా నిర్మాణాలు చేపట్టనున్నారు. పలు మార్గాలను అనుసంధానించేలా ఇక్కడ మెట్రో మార్గం, స్టేషన్ ఏర్పాటు కానున్నది. మొత్తం తొమ్మిది అంతస్తులతో ఏ,బీ,సీ పేర్లతో మూడు టవర్లుగా ఇక్కడ భవన నిర్మాణానికి నమూనా సిద్ధం చేశారు. ఇందులో రెండు అంతస్తులతో కూడినట్టుగా నాలుగో అంతస్తులో మెట్రో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఐదు, ఆరు అంతస్తుల్లో మెట్రో రైలు వచ్చి వెళ్లేందుకు ట్రాక్ ఏర్పాటు కానుంది. మిగిలిన అంతస్తులు, రైల్వే స్టేషన్ పరిసరాలన్నీ వర్తక వాణిజ్య కేంద్రాలు, ఇతర కార్యాలయాల ఏర్పాటుకు నిర్మాణాలు, ఇతర మరిన్ని ప్రత్యేకతలను చేపట్టనున్నారు. అలాగే, కింది భాగంలో రెండు అంతస్తులతో పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు. ఈ నమూనా ఆధారంగా త్వరలో టెండర్ల ప్రక్రియకు చర్యలు చేపట్టే దిశగా మెట్రో యాజమాన్యం ముందుకెళ్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
సనాతనం నుంచే తిరుక్కురల్
● గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలుసాక్షి, చైన్నె : సనాతన ధర్మంలోని ధర్మశాస్త్రం ఆధారంగానే తిరుక్కురల్ రూపుదిద్దుకున్నట్టు గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యాఖ్యానించారు. ఇది కాస్త వివాదానికి దారి తీసింది. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి తరచూ చేస్తూ వస్తున్న వ్యాఖ్యలను డీఎంకే కూటమి పార్టీలు, తమిళాభిమాన సంఘాలు తీవ్రంగా పరిగణిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సనాతన ధర్మం ప్రచారం అన్నట్టుగా గవర్నర్ ప్రతి వేదికపై చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టే వారు తమిళనాట ఎక్కువే. అయినా, గవర్నర్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా తమిళులు అత్యంత పవిత్రంగా భావించే తిరుక్కురల్ గ్రంథానికి సన్నాత ధర్మంలోని ధర్మశాస్త్రంతో ముడిపెట్టడం మరింత రచ్చకెక్కింది. గవర్నర్ ఏమన్నారంటే... చైన్నె వెస్ట్ మాంబళంలో తిరువళ్లువర్ తిరునాల్ (వేడుక) కార్యక్రమం సోమవారం సాయంత్రం జరిగింది. ఇందులో గవర్నర్ రవి ప్రసంగిస్తూ తిరుక్కురల్ నుంచే జాతీయ విద్యావిధానం ఆవిర్భవించిందన్నారు. తిరుక్కురల్లో పేర్కొన్న అంశాలనే ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్నారని తెలిపారు. తిరుక్కురల్కు ప్రధాని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కల్పిస్తున్నారని, ఇందులోని అంశాల నుంచి మూలాధారంగానే జాతీయ విద్యావిధానం ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. అదే సమయంలో సనాతన ధర్మం గురించి ప్రస్తావిస్తూ, ఇందులోని ధర్మశాస్త్రం ఆధారంగానే తిరుక్కురల్ రూపొందించినట్టు తెలిపారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన నేపథ్యంలో మంగళడవారం గవర్నర్ చేసిన ట్విట్ పుండుమీద కారంచల్లినట్లు అయ్యింది. తమిళ మహాకవి తిరువళ్లువర్ తమిళ క్యాలండర్ ప్రకారం వైకాసి అనుషం సందర్భంగా జన్మించినట్టు, అందుకే తిరువళ్లువర్ తిరునాల్ ఉత్సవం జరుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. సనాతన ధర్మం, తిరుక్కురల్ ధర్మ శాస్త్రం, నీతి శాస్త్రం సంగమం అని వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యాఖ్యలను వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా బీజేపీని తమిళనాట బలపరిచే బాధ్యతలను గవర్నర్ తీసుకున్నట్టుందని విమర్శించారు. అందుకే ఆయన ప్రస్తుతం తిరువళ్లువర్కు రంగులు దిద్దే పనిలో పడ్డారని మండిపడ్డారు. ఇదేవిధంగా డీఎంకే కూటమిలోని పలు పార్టీలు గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. -
రాజ్యసభకు ఆరుగురు ఏకగ్రీవం
సాక్షి, చైన్నె: రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఆరుగురు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అయితే, అధికారిక ప్రకటన ఈనెల 12న వెలువడనుంది. రాష్ట్రానికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం జూలైలో ముగియనున్న విషయం తెలిసిందే. వీరిలో డీఎంకేకు చెందిన విల్సన్, అబ్దుల్లా, షణ్ముగం, ఈ కూటమిలోని ఎండీఎంకేకు చెందిన వైగో ఉన్నారు. అలాగే, అన్నాడీఎంకేకు చెందిన చంద్రశేఖరన్, గతంలో ఈ కూటమి ద్వారా సీటు దక్కించుకున్న పీఎంకేకు చెందిన అన్బుమణి ఉన్నారు. ఈ ఆరు స్థానాల్లో ఎమ్మెల్యేల సంఖ్యా బలం మేరకు డీఎంకే కూటమికి నాలుగు, అన్నాడీఎంకేకు రెండు దక్కినట్లైంది. ఈ పదవుల భర్తీకి నామినేసన్ల ప్రక్రియ 2వ తేదీ నుంచి ఈనెల 9వ తేదీ వరకు జరిగింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమితులైన అసెంబ్లీ అదనపు కార్యదర్శి బి.సుబ్రమణియన్కు ఆశావహులు నామినేషన్లు సమర్పించారు. తొలుత ఎన్నికల వీరుడు పద్మరాజన్ సహా పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. అయితే, వీరికి ఎమ్మెల్యేల ప్రతిపాదన మద్దతు లేని దృష్ట్యా, మంగళవారం జరిగిన పరిశీలనలో తిరస్కరించారు. ఏకగ్రీవం.. ఈ ఎన్నికల నిమిత్తం ఆరు స్థానాల్లో నాలుగు డీఎంకే ఖాతాలోకి, రెండు అన్నాడీఎంకే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో డీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది విల్సన్, మాజీ ఎమ్మెల్యే సేలంకు చెందిన ఎస్ఆర్ శివలింగం, మహిళా రచయిత సల్మాను, ఈ కూటమి తరఫున మక్కల్ నీది మయ్యం నేత కమల్ ఉన్నారు. అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు ఇన్బదురై, ఎం.ధనపాల్ నామినేషన్ వేశారు. మంగళవారం జరిగిన పరిశీలనలో డీఎంకే, అన్నాడీఎంకే తరఫున దాఖలు చేసిన ఆరుగురి నామినేషన్లు ఆమోదం పొందాయి. స్వతంత్రుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికలు జరగకుండానే ఈ ఆరుగురి ఎంపిక ఏకగ్రీవమైనట్లైంది. అయితే, ఉపసంహరణకు 12వ తేదీ వరకు గడువు ఉన్న దృష్ట్యా, ఆ రోజున ఈ ఆరుగురి ఎంపికకు సంబంధించిన ఏకగ్రీవ ప్రకటన వెలువడనుంది. 12న అధికారిక ప్రకటన -
సీసీ టీవీ ఫుటేజీలు సమర్పించండి
● నీట్ పరీక్ష వ్యవహారంలో హైకోర్టు సాక్షి,చైన్నె: విద్యుత్ సరఫరా అంతరాయం విషయంలో పరీక్ష కేంద్రాల్లోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను సమర్పించాలని మద్రాసు హైకోర్టు ద్విసభ్య బెంచ్ ఆదేశించింది. గత నెల 4వ తేదీన 2025–26 సంవత్సరానికిగాను వైద్య కోర్సుల ప్రవేశ నిమిత్తం నీట్ యూజీ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. చైన్నెలో అకాల వర్షం కారణంగా అనేక పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో మూడు సెంటర్లలో పరీక్ష రాసిన 13 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా, ఫలితాల విడుదలకు స్టేను తొలుత విధించారు. తరువాత కేంద్రం తరఫున వాదన కోర్టుకు చేరడంతో దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్షల నిర్వహణ అసాధ్యంగా స్పష్టం చేసిన సింగిల్ బెంచ్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో విద్యార్థులు అప్పీలుకు వెళ్లగా మంగళవారం ద్వి సభ్య బెంచ్ విచారించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని, ఎలాంటి స్టే ఇవ్వలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అయితే, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన రోజున ఆయా పరీక్ష కేంద్రాల్లో నమోదైన సీసీ టీవీ కెమెరాల దృశ్యాలను కోర్టుకు సమర్పించాలని అధికారులను ఆదేశిస్తూ న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేశారు. కిలాంబాక్కంలో అదనపు బస్సులు సాక్షి, చైన్నె: కిలాంబాక్కం కలైంజ్ఞర్ కరుణానిధి శతజయంతి స్మారక సబర్బన్ బస్ టెర్మినల్లో ఇక అదనపు బస్సులను నిలుపుదల చేయడానికి రవాణా సంస్థ చర్యలు తీసుకుంది. చైన్నెకి దక్షిణ దిక్కులో కిలాంబాక్కం బస్ టెర్మినల్ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి దక్షిణ తమిళనాడులోని తిరుచ్చి, మదురై, తిరునల్వేలి, కన్యాకుమారి ఇతర నగరాలు, కొంగు మండలంలోని సేలం, ఈరోడ్, కోయంబత్తూరు నగరాలు, సముద్ర తీర జిల్లాలైనా కడలూరు, నాగపట్నం ఇతర జిల్లాలకు బస్సులు నడుస్తున్నాయి. అయితే ఇక్కడ ఆశించిన మేరకు బస్సుల సేవలు అందడంలేదని ప్రయాణికులు తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారాంతం లేదా వరుస సెలవులు, లేదా ముఖ్యపండుగల సమయాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. మిగిలిన సమయాల్లో సాధారణంగా నడిచే బస్సులు రోడ్డెక్కుతున్నాయి. అయితే, తరచూ ఇక్కడ బస్సులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో నిత్యం ప్రయాణికులు ఆందోళనకు దిగుతున్నారు. దీనిని గుర్తించిన రవాణా సంస్థ ఇక ప్రతిరోజూ కిలాంబాక్కం బస్టాండ్లో సాధారణంగా నడిచే బస్సులతోపాటు అదనంగా బస్సులను నిలుపుదల చేయాలని నిర్ణయించారు. ప్రయాణికుల సంఖ్యను ఆధారంగా పార్కింగ్లో సిద్ధంగా ఉంచిన బస్సులు ఆయా మార్గాల్లో నడిపేలా చర్యలు తీసుకునేందుకు రవాణా సంస్థ ఏర్పాట్లు చేపట్టింది. డాక్టర్ పళణి వేల్కు జేఏటీఎస్ పురస్కారం సాక్షి, చైన్నె : చైన్నెకి చెందిన డాక్టర్ సి. పళణివేలుకు విదేశీ గౌరవ సభ్యత్వం, జీవిత సాఫల్య పురస్కారాన్ని జపనీస్ అసోసియేషన్ ఫర్ థొరాసిక్ సర్జరీ(జేఏటీఎస్) ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 23 నుంచి 25వ తేదీ వరకు జపాన్లోని ఒసాకాలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. చైన్నె జెమ్ ఆస్పత్రి చైర్మన్గా ఉన్న డాక్టరి సి.పళణివేలు ల్యాప్రోస్కోపిక్, థొరాకోస్కోపిక్ చికిత్సలు, ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందారు. ల్యాప్రోస్కోపిక్ అన్నవాహిక శస్త్రచికిత్సలో ఆయన మార్గదర్శక కృషిని అభినందిస్తూ ఈ పురస్కారానికి జపనీస్ థొరాసిక్ సర్జరీ ఎంపిక చేసింది. తొలి థొరాకోస్కోపిక్ శస్త్ర చికిత్స చేసిన వారిలో డాక్టర్ పళణివేల్ ముందజలో ఉన్నారు. తనకు లభించిన ఈ అరుదైన గౌరవం గురించి పళణి వేలు మాట్లాడుతూ ఒక రైతు సర్జన్గా మారిన తర్వాత శస్త్రచికిత్సలనే ఒక మార్గంగా తాను చూస్తూ వచ్చినట్టు పేర్కొన్నారు. ల్యాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స ప్రధానంగా ఆంకాలజీలో ఫలితాలను మారుస్తుందన్నారు. మరణాలను తగ్గిస్తుందని, గణనీయంగా ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరుస్తుందని వివరించారు. తనకు జేఏటీఎస్ గుర్తింపు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని, త్వరలో జపాన్లో ఈ గౌరవాన్ని అందుకోనున్నట్టు ఆయన తెలిపారు. 16వ తేదీ వరకు వర్షాలు సాక్షి, చైన్నె: ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాలతో రాష్టంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 16వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం చైన్నె శివారులోని ఆవడి, పూందమల్లి, పట్టాభిరాం, చైన్నెలోని గిండి, సైదాపేట, విమానాశ్రయం పరిసరాల్లో మోస్తరు వర్షం కురిసింది. -
దివ్యాంగులకు వాహనాల పంపిణీ
తిరువళ్లూరు: నియోజకవర్గంలో అర్హులైన 16 మంది దివ్యాంగులకు పెట్రోల్ వాహనాలను స్థానిక ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ మంగళవారం ఉదయం అందజేశారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని దివ్యాంగులను ఎంపిక చేసి అర్హులైన వారికి పెట్రోల్ వాహనాలను అందజేస్తున్న విష యం తెలిసిందే. ఇందులోభాగంగా తిరువళ్లూరు నియోజకవర్గంలోని అర్హుల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. వారిలో అర్హులుగా 16 మందిని ఎంపిక చేసి రూ.16.28 లక్షల విలువ చేసే వాహనాలను ఎమ్మెల్యే, దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి శ్రీనివాసన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేంద్రన్ మాట్లాడుతూ డీఎంకే హయాంలో మాత్రమే దివ్యాంగులు, హిజ్రాలకు ప్రత్యేక గుర్తింపుతోపాటు ప్రోత్సాహకాలను అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు. లబ్ధిదారులు వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీఎంకే యూనియన్ కార్యదర్శులు గూలూరు రాజేంద్రన్, మహాలింగం, కొండంజేరి రమేష్, జిల్లా ఆర్గనైజర్ వీఎస్ నేతాజీ, యువజన విభాగం ఉపకార్యదర్శి మోతీలాల్, ఎన్ఆర్ఐ వింగ్ కార్యదర్శి జయకృష్ణ, యూనియన్ ఉప కార్యదర్శి కాంచీపాడి శరవణన్ తదితరులు పాల్గొన్నారు. -
ఐసీఎఫ్లో ఆటోమెటిక్ డోర్ ఈఎంయూ
సాక్షి, చైన్నె : ముంబై స్థానిక రైలు సేవల నిమిత్తం చైన్నె ఐసీఎఫ్లో ఆటోమెటిక్ డోర్లతో కూడిన ఈఎంయూ రైళ్లు తయారు చేయనున్నారు. ఈ వివరాలను మంగళవారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతీయ రైల్వేలోనే సరికొత్తగా, అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి రైళ్ల తయారీలో ఐసీఎఫ్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఐసీఎఫ్ చరిత్రలో ఎన్నో మైలు రాళ్లు చైన్నె నుంచి పట్టాలెక్కాయి. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీల్లో చైన్నె దేశానికే ఆదర్శంగా నిలుస్తూ, అగ్రస్థానాన్ని దక్కించుకుంటూ వస్తుంది. పలు అత్యాధునిక రైళ్లు, బోగీల నిర్మాణంలో ఐసీఎఫ్ ఘన కీర్తిని చాటుకుంది. స్వదేశీ పరిజ్ఞానంగా ఆధునిక సౌక ర్యాలతో సాగుతున్న ఐసీఎఫ్ నిర్మాణాలన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ వర్షన్ వరకు అన్నీ ప్రత్యేకత సంతరించుకున్నవే. ఈ పరిస్థితుల్లో ముంబై రైల్వే కోసం ఆటోమెటిక్ డోర్లతో కూడిన ఎలక్ట్రిక్ రైళ్లు చైన్నె ఐసీఎఫ్లో రూపదిద్దుకోనున్నాయి. ముంబైలో ఎలక్ట్రిక్ రైళ్లలో రద్దీ కారణంగా చోటుచేసుకుంటున్న ప్రాణ నష్టాల గురించి తెలిసిందే. సోమవారం కూడా పలువురు రద్దీ కారణంగా రైలు నుంచి పడి మరణించారు. దీంతో ముంబై ఎలక్ట్రిక్ రైళ్ల సేవల కోసం ఆటోమెటిక్ డోర్లతో, గాలి సౌకర్యం పుష్కలంగా ఉండేలా ఎలక్ట్రిక్ రైళ్ల తయారీ పనులను చైన్నె ఐసీఎఫ్కు అప్పగించారు. దీంతో ముంబైకు ఏసీ సౌకర్యం లేకుండా ఆటోమెటిక్ డోర్లతో రైళ్లను తీర్చిదిద్దబోతున్నారు. -
దేశానికే ఆదర్శం తమిళనాడు
● పలు పథకాల్లో దేశానికే ఇంజిన్ ● సీఎం స్టాలిన్ ● తరమణిలో గ్లోబల్ బిజినెస్ సెంటర్ ● సెంట్రల్ మెట్రోస్టేషన్లో బుక్ పార్క్ ఏర్పాటు సాక్షి,చైన్నె: దేశానికే ఆదర్శంగా తమిళనాడు ఉన్నట్టు సీఎం స్టాలిన్ అన్నారు. పథకాల అమల్లో దేశానికి రైలు ఇంజిన్లా మారినట్టు ధీమా వ్యక్తం చేశారు. చైన్నె తరమణిలో ప్రపంచ బ్యాంక్ నేతృత్వంలో గ్లోబల్ బిజినెస్ సెంటర్ను పునరుద్ధరించారు. 1,500 మంది ఉద్యోగులు 189కి పైగా బ్యాంకు కార్యాలయాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సేవలందించేందుకు ప్రధాన కేంద్రంగా దీనిని తీర్చిదిద్దారు. చైన్నెలో కీలక పాత్ర పోషించే విధంగా రూపుదిద్దుకున్న ఈ సెంటర్ను సీఎం స్టాలిన్ మంగళవారం ప్రారంభించారు. ఎంపీలు తమిళచ్చి తంగ పాండియన్, డాక్టర్ కనిమొళి సోము, ఎమ్మె ల్యేలు హసన్ మౌలానా, సోము, సీఎస్ మురుగానందం, ప్రపంచ బ్యాంక్ ఎండీ వేంకై జాంగ్, భారతదేశ కంట్రీ డైరెక్టర్ అగస్టే డానోగోమ్, చైన్నె సెంటర్ హెడ్ సునీల్కుమార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రజేంద్ర నవనీత్, వాణిజ్యశాఖ కార్యదర్శి వి.అరుణ్రాయ్ పాల్గొన్నారు. అత్యంత పట్టణీకరణ రాష్ట్రంగా తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ 1971లో ప్రపంచ బ్యాంకుతో తమిళనాడు భాగస్వామ్యం మొదలైనట్టు గుర్తు చేశారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, విపత్తు నిర్వహణ, పట్టణాభివృద్ధితో పాటు వివిధ రంగాల ప్రగతికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. 2022లో ఢిల్లీ తర్వాత చైన్నెలో మొదటి ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని, దీంతో దక్షిణ భారతదేశంతో ప్రపంచ బ్యాంకు సంబంధం మరింత బలపడిందన్నారు. పేదరికాన్ని నిర్మూలించడం, గ్రామీణ ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలు, ప్రాజెక్టులను సీఎం వివరించారు. మహిళలకు సాధికారత కల్పించడమే కాకుండా, రైతులకు స్థిరమైన ప్రగతి దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా తోళి పేరిట వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, త్వరలో చైన్నెలో ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులు మరిన్ని అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. దేశంలో అత్యంత పట్టణీకరణ చెందిన రాష్ట్రంగా తమిళనాడు మారుతోందని, 2030 నాటికి తమిళనాడు జనాభాలో 63 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లోనే నివశిస్తారని తెలిపారు. అందరికీ అన్నీ అనే నినాదంతో ముందుకెళ్తున్న తమకు అవసరమైన సామాజిక–ఆర్థిక అభివృద్ధి అవసరాల కోసం పెట్టుబడులకు ప్రపంచ బ్యాంకు సహాయం మరింతగా ఆశిస్తున్నామన్నారు.న్యూస్రీల్చైన్నె సెంట్రల్ మెట్రోస్టేషన్లో బుక్ పార్క్ ముందుగా చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్ వద్ద ఉన్న మెట్రో రైల్వేస్టేషన్లో రూ.1.85 కోట్లతో నిర్మించిన చైన్నె బుక్పార్క్ను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. అలాగే, రూ.29.80 కోట్లతో వివిధ ప్రాంతాల్లో నిర్మించిన 110 అదనపు లైబ్రరీ భవనాలను ప్రారంభించారు. పరమకుడి బ్రాంచ్ లైబ్రరీ భవనం, మరో 70 ప్రత్యేక లైబ్రరీలు ప్రారంభించారు. తమిళనాడు పాఠ్యపుస్తకాలు, విద్యాసేవలు విభాగం రూపొందించిన 84 వివిధ పుస్తకాలను ఆవిష్కరించారు. అలాగే, పుస్తకాల విక్రయానికి ఈ కామర్స్ సేవలతో వెబ్సైట్ను పరిచయం చేశారు. మంత్రులు శేఖర్బాబు, అన్బిల్ మహేష్ పొయ్యమొళి, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మేయర్ ఆర్.ప్రియ, పాల్గొన్నారు. -
అన్బుమణి వర్కింగ్ ప్రెసిడెంట్
● రాందాసు స్పష్టం సాక్షి, చైన్నె: అన్బుమణి పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు స్పష్టం చేశారు. అదే సమయంలో పీఎంకేను వీడి, బీజేపీలోకి చేరి మళ్లీ మాతృగూటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే రవిరాజ్కు పార్టీ ఉపాధ్యక్ష పదవిని రాందాసు కట్టబెట్టారు. పీఎంకేలో అధ్యక్ష వార్ తారా స్థాయిలో సాగుతున్న విషయం తెలిసిందే. దీనిని కొలిక్కి తెచ్చేలా బీజేపీ, అన్నాడీఎంకే పెద్దలు రంగంలోకి దిగినా ఫలితం శూన్యంగా మారింది. తానే అధ్యక్షుడ్ని అని రాందాసు ఓ వైపు, కాదు, కాదు తానే అంటూ అన్బుమణి పరస్పరం ప్రకటించుకుంటూ రావడంతో వివాదం మరింతగా ముదురుతోంది. అదే సమయంలో అన్బుమణికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పార్టీ ముఖ్యనేతలను పదవుల నుంచి తొలగించి తనకు అనుకూలంగా ఉన్న వారిని నియమించుకునే ప్రక్రియను రాందాసు వేగవంతం చేశారు. ఈ పరిస్థితుల్లో అన్బుమణి కేవలం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే అని రాందాసు మంగళవారం స్పష్టం చేశారు. అన్బుమణికి ప్రకటనకు చెక్ పెట్టేలా ఈ వ్యాఖ్యలు ఆయన చేయడం గమనార్హం. అలాగే, పీఎంకేను వీడి బీజేపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే రవిరాజ్ మళ్లీ మాతృగూటికి చేరారు. అన్బుమణిపై తీవ్ర వ్యతిరేకతతో ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లినట్టు ప్రచారం జరిగింది. తాజాగా రాందాసు ఇచ్చిన పిలుపుతో మళ్లీ రవిరాజ్ పీఎంకేలోకి వచ్చేశారు. ఆయనకు ఏకంగా పార్టీ ఉపాధ్యక్ష పదవిని రాందాసు అప్పగించారు. అన్బుమణికి మద్దతుగా ఉన్న వారిని తొలగిస్తూ, వ్యతిరేకంగా ఉన్న వారికి పదవులను రాందాసు కట్టబెడుతుండడంతో తండ్రి, తనయుడి మధ్య వార్ మరిన్ని ధారావాహికలుగా మున్ముందు సాగే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. కాగా బుధవారం మీడియాతో సమగ్ర వివరాలు పంచుకోనున్నట్లు రాందాసు ప్రకటించడంతో ఎలాంటి ప్రకటనలు చేస్తారో ఉన్న ఉత్కంఠ నెలకొంది. -
బ్రోకోడ్లో నలుగురు హీరోయిన్లు
తమిళసినిమా: ఇటీవల తరచూ వార్తల్లో ఉంటున్న నటుడు రవిమోహన్. ఆయన కథానాయకుడుగాను బిజీగానే ఉన్నారు. తాజాగా నిర్మాతగా అవతారమెత్తడం విశేషం. రవిమోహన్ నిర్మాతగా మారి రవిమోహన్ స్టూడియోస్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తూ కథానాయకుడిగా నటించనున్నారు. ఇందులో సూర్య మరో ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రానికి డిక్కిలోనా, వడక్కుపట్టి రామస్వామి చిత్రాల ఫేమ్ కార్తీక్యోగి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. దీనికి బ్రోకోడ్ అనే టైటిల్ను నిర్ణయించారు. కాలైసెల్వన్ శివాజీ చాయాగ్రహణం, యానిమల్, అర్జున్రెడ్డి చిత్రాల ఫేమ్ హర్షవర్దన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ ఈ కథను నటుడు రవి మోహన్కు చెప్పగా ఆయన ఎంతగానో ఆస్వాదించారన్నారు. వెంటనే చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారన్నారు. ఇది పూర్తి వినోదభరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో నలుగురు కథానాయికలు నటించనున్నారని వారు ఎవరన్నది త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ను సెప్టెంబర్లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం రవిమోహన్ సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి, గణేష్ కే బాబు దర్శకత్వంలో కరాటే బాబు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. దీంతో ఈయన నిర్మాతగా మారి నిర్మించనున్న చిత్రం పైనా, ఇందులో నటించే ఆ నలుగురు హీరోయిన్లు ఎవరనే విషయం పైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఆహార భద్రతపై సెమినార్
తిరువళ్లూరు: అంతర్జాతీయ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా తిరువళ్లూరు జిల్లా కొడువేళిలోని ఫుడ్ అండ్ డెయిరీ టెక్నాలజీ కళశాలలో ప్రపంచ ఆహారభద్రత దినోత్సవం సెమినార్ను నిర్వహించారు. సెమినర్ను రాష్ట్ర ప్రభుత్వ ఆహారభద్రత ఔషధ నియంత్రణ విభాగం కమిషనర్ లాల్వేన్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆహార ఉత్పత్తి ప్రారంభం నుంచి వినియోగదారునికి చేరే వరకు ఆహార ఉత్పత్తులను ఎలా నిర్వహించాలన్న అంశంపై అవగాహన కల్పించారు. పాలు, మాంసం ఇతర ఉత్పత్తులను సురక్షితంగా ఎలా నిల్వ ఉంచాలో అనే అంశంపై అవగాహన అవసరమన్నారు. దీంతోపాటు పాలు ఆధారిత ఆహారాన్ని పరిశుభ్రంగా అందిచడంతో పాటు ఆహార సంబంధిత వ్యాధుల నివారణ చర్యలపై సైతం సెమినార్లో మాట్లాడారు. విద్యార్థులకు ఆహారంలో కల్తీని గుర్తించే పరీక్ష పద్ధతులను ఆయన వివరించారు. ఈ సెమినార్లో ప్రిన్సిపల్ కుమరవేలు, తమిళనాడు వెటర్నరీ సైన్సు వర్సిటీ వైస్ చాన్స్లర్ నరేంద్రబాబు, జిల్లా ఆహారభద్రతా అధికారి కదిరవన్, ఇండియన్ బెయిరీ అసోసియేషన్ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కన్నన్, ప్రొఫెసర్ పుహళేంది, జీఎం శివకుమార్ పాల్గొన్నారు. -
తిరుత్తణి మపోసీ రోడ్డులో ఆక్రమణల తొలగింపు
తిరుత్తణి: తిరుత్తణి మపోసీ రోడ్డులో వాహన రాకపోకలు, మార్కెట్ దుకాణాలకు అడ్డంగా ఏర్పాటు చేసిన దుకాణాలను మంగళవారం అధికారులు తొలగించారు. తిరుత్తణి బస్టాండ్ సమీపంలోని మపోసీ రోడ్డులో ఇటీవల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతనంగా మార్కెట్ నిర్మించారు. ప్రస్తుతం ఆ మార్కెట్లో కూరగాయల వ్యాపారంతోపాటు వివిధ దుకాణాలు ఉంచి వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే మార్కెట్లో దుకాణాలకు ఎదురుగా హైవే రోడ్డును అక్రమించుకుని రోడ్డు వ్యాపారులు, చిరు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో వాహన రాకపోకలతోపాటు, మార్కెట్ వ్యాపారులకు వ్యాపారం దెబ్బతినడంతో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ప్రతాప్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, పోలీసులు, రెవెన్యూ, హైవే శాఖ అధికారుల బృందం సమక్షంలో రోడ్డుపై ఏర్పాటు చేసిన దుకాణాలు తొలగించారు. -
ఆవడి ఆర్మీ ఫ్యాక్టరీలో కరణ్బీర్ సింగ్ పరిశీలన
సాక్షి, చైన్నె : ఆవడిలోని ఆర్మీ వెహికల్స్ తయారీ కర్మాగారాన్ని దక్షిణ భారత ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ కరణ్బీర్సింగ్ బ్రార్ మంగళవారం సందర్శించారు. ఇక్కడ తయారవుతున్న ఉత్పత్తులను పరిశీలించారు. చైన్నె శివారులోని ఆవడిలో ఆర్ముర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ పేరిట కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో భారత సైన్యానికి అవసరమయ్యే యుద్ధ ట్యాంకర్లు, వివిధ ఆయుధాల ఉత్పత్తి జరుగుతున్న విషయం తెలిసిందే. భారత రక్షణ రంగంలో కీలక పాత్రను పోషిస్తున్న ఈ యుద్ధ ట్యాంకర్ల ఫ్యాక్టరీని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ కరణ్బీర్సింగ్ బ్రార్ సందర్శించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న వివిధ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. ఇక్కడ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడం, సకాలంలో సైన్యానికి సరఫరా చేసే దిశగా, స్వదేశీ టెక్నాలజీ ఉత్పత్తుల గురించి ఈ సందర్భంగా అధికారులతో కరణ్బీర్సింగ్ సమీక్షించారు. భవిష్యత్లో యుద్ధ అవసరాలు, రక్షణ రంగంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించాల్సిన అవసరాన్ని వివరించారు. ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు సాంకేతిక అంశాలు, ఏవీఎన్ఎల్లో అనుసరించాల్సిన సాంకేతికతను చెప్పారు. -
కేంద్రమంత్రి ప్రసంగానికి పవర్ కట్
సాక్షి, చైన్నె : పుదుచ్చేరిలో కేంద్ర సమాచార శాఖ సహాయమంత్రి ఎల్.మురుగన్ ప్రసంగానికి పవర్ కట్ సమస్య తప్పలేదు. అది కూడా ఆయన పుదుచ్చేరిని అన్నింటా ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఈ పవర్ కట్ సమస్య ఎదురు కావడం గమనార్హం. కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ మంగళవారం పుదుచ్చేరిలో పర్యటించారు. ఆ రాష్ట్ర హోం మంత్రి నమశ్శివాయంతోపాటు ముఖ్యనేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరి ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్టు తెలిపారు. విద్య, పర్యాటకపరంగా పుదుచ్చేరి ముందుకు దూసుకెళుతోందన్నారు. అలాగే ఒక చిన్న రాష్ట్రం వైద్యహబ్గా మారుతున్నట్టు, మెడికల్ టూరిజంగా సైతం పుదుచ్చేరి ప్రసద్ధి చెందినట్టు తెలిపారు. ఇక్కడ ఏకంగా తొమ్మిదికి పైగా వైద్య విద్యాసంస్థలు, ఆస్పత్రులున్నాయని పేర్కొన్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరిని అన్నింటా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్టు ఆయన వ్యాఖ్యానించగా, హఠాత్తుగా పవర్ కట్ సమస్య తప్పలేదు. కాసేపు విద్యుత్ సరఫరా ఆగడంతో మంత్రి మౌనం వహించాల్సి వచ్చింది. అనంతరం విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో మళ్లీ మీడియా సమావేశం కొనసాగించారు. పుదుచ్చేరి బెస్ట్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తుండగా పవర్ కట్ సమస్య రావడాన్ని పలు తమిళ మీడియాలు అస్త్రంగా చేసుకున్నాయి. సామాజిక మాధ్యమాలలో ఇదేనా బెస్ట్ అంటూ చమత్కారాలు హోరెత్తుతున్నాయి. -
ఉమ్మడి కోర్టు ఆవరణలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
తిరువళ్లూరు: ఉమ్మడి కోర్టు ఆవరణలో హఠాత్తుగా విద్యుత్ వైర్లులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగాయి. దీంతో న్యాయవాదులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తిరువళ్లూరు ఉమ్మడి కోర్టు ఆవరణలో తాగునీటి సదుపాయం కోసం మున్సిపాలిటీ అధికారులు జేసీబీతో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పది గంటల సమయంలో జేసీబీ తవ్వకాలు చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తగలడంతో తెగి, కిందపడి మంటలు వ్యాపించాయి. విద్యుత్ వైర్లు నుంచి హఠాత్తుగా చెలరేగిన మంటలతో న్యాయవాదులు, కోర్టుకు వచ్చిన ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో కోర్టు ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సరఫరా ఆపివేశారు. కాలిపోయిన వైర్లను తొలగించి కొత్త వైర్లు ఏర్పాటు చేసి, విద్యుత్ను పునరుద్ధరించారు. కాలిపోయిన విద్యుత్ తీగలు ఆందోళనకు గురైన ప్రజలు, న్యాయవాదులు -
రేషన్ దుకాణానికి భూమిపూజ
తిరుత్తణి: తిరుత్తణి యూనియన్ మద్దూరులో అన్నా గ్రామ మరుమలర్చి పథకం ద్వారా రూ.13.30 లక్షల వ్యయంతో రేషన్ దుకాణం నూతన భవనం నిర్మాణ పనులకు సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఇందులో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని, రేషన్ దుకాణం భవనం పనులను ప్రారంభించారు. గ్రామీణుల కోరిక మేరకు రేషన్ దుకాణానికి నూతన భవనం నిర్మించేందుకు వీలుగా నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు గ్రామీణులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంజినీరు ధర్మేష్, డీఎంకే మండల కార్యదర్శులు కృష్ణన్, విజయకుమార్, మీసై వెంకటేశన్ తదితరులు పాల్గొన్నారు. -
కేసరి పాఠశాలకు ఐదు స్మార్ట్ బోర్డులు
కొరుక్కుపేట: చైన్నె మైలాపూర్లో ఉన్న కేసరి మహోన్నత పాఠశాలకు రోటరీ క్లబ్ ఆఫ్ గిండి సహకారంతో ఐదు స్మార్ట్ బోర్డులను విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రోటేరియన్ కమిటీ సభ్యులు ఆర్.శ్రీరామన్ సంధానకర్తగా వ్యవహరించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ గాయకుడు కలైమామని ఉన్నికృష్ణన్ పాల్గొని స్మార్ట్ బోర్డులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ప్రయోజకులు కావాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రెసిడెంట్ రాధాకృష్ణన్, సెక్రటరీ కేఎస్వి ప్రసాద్, ప్రధానోపాధ్యాయిని గీతాంజలి, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో ఘనంగా జరిగింది. -
వైభవం.. వైఖాసి విశాఖ ఉత్సవం
తిరుత్తణి: సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సోమవారం వైఖాసి విశాఖ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుత్తణి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. భక్తులు క్యూలో వేచివుండి స్వామివారి దర్శనం చేసుకున్నారు. వేకువజామున మూలవర్లకు అభిషేక పూజలు చేసి, బంగారు కవచంతో అలంకరించి, మహాదీపారాధన పూజలు చేశారు. విశాఖ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుత్తణి కొండకు పోటెత్తారు. ఉదయం 8 గంటలకు షణ్ముఖర్కు విభూది, కదంబం, పాలు, పన్నీరు, పెరుగు, పంచామృతం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి, విశేషాలంకరణ చేశారు. ఇందులో భక్తులు పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో.. వేలూరు: తిరువణ్ణామలై, వేలూరు జిల్లాల్లోని పెరుమాళ్, మురుగన్ ఆలయాల్లో వైఖాసి విశాఖ ఉత్సవాలు సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వేలూరు సైదాపేట ఆర్కాడు రోడ్డులోని పయణి ఆండవర్ ఆలయంలో వైఖాసి ఉత్సవాన్ని పురష్కరించుకుని ఉదయం 6 గంటలకు నవ కలశ స్థాపన, వెండి పూజ చేశారు. అనంతరం ఆలయంలో శుత్రు సంహార యాగ పూజలు నిర్వహించారు. 11 గంటలకు మహా దీపారాధన పూజలు చేశారు. అలాగే తోటపాళెంలోని తిరుచెందూర్ అన్నదాన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుప్పుస్వామి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆరాధన నిర్వహించారు. అనంతరం తోటపాళెం ధర్మరాజ ఆలయ సమీపంలోని మైదానంలో సుమారు వెయ్యి మందికి అన్నదానం చేసి, నిరుపేదలకు పంచెలు, చీరలను అందజేశారు. ఉత్సవ కమిటీ నిర్వహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వైఖాసి విశాఖాన్ని పురష్కరించుకుని కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానంతో పాటు దుస్తులను అందజేస్తామని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యదర్శి విజిటి సుందర్, కోశాధికారి వీఎన్ రాజు, సభ్యులు బాలాజీ, షణ్మగం, వెర్టివేలన్, మేహనవేల్, తనిగవేల్, సురేష్ బాబు పాల్గొన్నారు. అలాగే తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని మురుగన్ సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధన పూజలు చేశారు. వైభవంగా బాలమురుగన్ రథోత్సవం వేలూరు: రాణిపేట జిల్లా ఆర్కాడు తాలుకాలోని రత్నగిరి బాల మురుగన్ ఆలయంలో వైఖాసి విశాఖ ఉత్సవాల్లో బాగంగా సోమవారం ఉదయం మహారథోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉదయం ఆలయ స్వామిజీ బాల మురుగన్ అడిగల్ స్వామిజీ, కలవై సచ్చిదానం స్వామిజీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, దీపారధనలు చేసి, రథంలో కొలువుదీర్చారు. అనంతరం పీఠాధిపతులు రథం దారానికి పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఈశ్వరప్పన్ కలుసుకుని రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు హరోం హర నామస్మరణాల నడుమ భక్తులు రథాన్ని లాగారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రథం ఆలయ కొండ చుట్టుకుని, ఆలయానికి మధ్యాహ్నం 2 గంటల సమయంలో చేరుకుంది. రథోత్సవాన్ని పురష్కరించుకుని ఆలయంలో గణపతి హోమం, పుణ్యాహవచనం, సుబ్రమణ్య హోమం, మొదటి కాల పూజ, విఘ్నేశ్వర పూజ, కాల యాగ పూజలు జరిపారు. ఈ రథోత్సవంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథంపై మిర్యాలు, బొరుగులు చల్లి రథాన్ని లాగి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకులతోపాటు పారిశ్రామిక వేత్తలు భక్తులకు అన్నదానం చేశారు. అలాగే భక్తులకు మజ్జిగ, తాగునీరు అందజేశారు. -
44 ఏళ్ల మహిళకు లంగ్స్ ట్రాన్స్ప్లాంట్
సాక్షి, చైన్నె: అవయవ మార్పిడి విధానం మేరకు రెలా ఆస్పత్రిలో 44ఏళ్ల వయస్సు కలిగిన మహిళకు లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ను విజయవంతం చేశారు. ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్న ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. గుండె వైఫల్యం నుంచి ఆమెను రక్షించారు. తేనికి చెందిన కవిత 2009 నుంచి శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. కృత్రిమ శ్వాస ద్వారా ఆమె కాలం నెట్టుకువచ్చారు. కరోనా తరువాత ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. శ్వాస సమస్య మరింత జఠిలం కావడం, కృత్రిమ శ్వాస మరింత ఎక్కువగా అందించాల్సిన పరిస్థితి రావడమే కాకుండా కండరాల బలాన్ని సైతం కోల్పోయారు. చివరకు చైన్నెలోని రెలా ఆస్పత్రికి తరలించారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్తో ఆమె బాధ పడుతున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇది తీవ్రమైన పల్మనరీ డిజార్డర్గా మారినట్టు తేల్చారు. ఊపిరితిత్తులు, గుండె వైఫల్యానికి పరిస్థితులు దారి తీయడంతో ఆమెను రక్షించేందుకు అవయవ దాత కోసం ఎదురు చూశారు. అదృష్టం కొద్ది బ్రెయిన్ డెడ్ రోగి కుటుంబం ముందుకు రావడంతో ఆమెకు రెండు ఊపిరితిత్తుల మార్పిడిని ఆధునిక విధానంతో విజయవంతం చేశారు. ఎక్మోకు పరిస్థితులు దారి తీయకుండా , గుండె వైఫల్యం కాకుండా పరిరక్షించారు. డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక పెద్ద సర్జరీ కావడంతో సుమారు 8 గంటలకు వైద్యులు శ్రమించారు. ఈ సంక్లిష్ట ప్రక్రియను పర్యవేక్షించడానికి హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీనాథ్ విజయశేఖరన్, క్లినికల్ లీడ్ ట్రానన్స్ప్లాంట్ పల్మోనాలజీ డాక్టర్ ఐశ్వర్య రాజ్కుమార్ నేతృత్వంలోని 30 మంది సభ్యుల బృందం శ్రమించింది. శస్త్రచికిత్స అనంతరం సంరక్షణ కూడా అంతే క్లిష్టమైన సవాలుతో కూడుకోవడంతో పాటుగా కండరాల బలాన్ని తిరిగి పొందేందుకు గాను ప్రత్యేక చికిత్సలు అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యవంతురాలు కావడంతో ఈ వివరాలను సోమవారం రెలా చైర్మన్ డాక్టర్ మహ్మద్ రెలా నేతృత్వంలో మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ రెలా మాట్లాడుతూ ప్రాణం కాపాడే ఈ ఎంపిక ఉందని మొదట్లో రోగి కుటుంబానికి తెలియదని, అందుకే కొన్ని సంవత్సరాల పాటుగా ఆక్సిజన్తో కాలం నెట్టుకొచ్చారని తెలిపారు. రోగికి రెండు ఊపిరితిత్తుల మార్పిడిని విజయవంతంగా నిర్వహించడం చాలా తృప్తికరంగా జరిగిందన్నారు. -
క్లుప్తంగా
వేడుకగా గరుడ సేవ తిరుత్తణి: తిరుత్తణి పట్టణ వీధుల్లో శ్రీవిజయరాఘవ పెరుమాళ్ గరుడ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. తిరుత్తణి పట్టణంలో కిరాణా వ్యాపారుల సంఘం, గరుడ సేవ ఉత్సవ క మిటీ సంయుక్తంగా ప్రతి ఏటా శ్రీవిజయరాఘవ పెరుమాళ్ గరుడ సేవ వేడుకలు నిర్వహించడం పరిపాటి. ఆ ప్రకారం సోమవారం ఉద యం నంది నదీతీరంలోని శ్రీవిజయరాఘవ పెరుమాళ్ ఆలయంలో మూలవర్లకు ప్రత్యేక అభిషేక పూజలు చేపట్టి పుష్పాలంకరణలో మహాదీపారాధన చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 8 గంటలకు ఉత్సవర్ల శ్రీవిజయరాఘవ పెరుమాళ్ను ఆభరణాలు పుష్పాలతో అలంకరించి, గరుడ వాహనంపై కొలువుదీర్చి పట్టణవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామికి కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి దర్శించుకున్నారు. సాయంత్రం స్వామివారు బస్టాండు సమీపంలోని సుందర వినాయకుడి ఆలయంలో కొలువుదీరి, అభిషేక పూజలు అందుకున్నారు. రాత్రి స్వామి వారు ఆలయానికి బయల్దేరారు. నా అనుమతి తీసుకోవడం లేదు తమిళసినిమా: గీత రచయిత వైరముత్తు సంగీత దర్శకుడు ఇళయరాజా మాదిరి మారుతున్నారా? అంటే ఈయన తా జాగా తన ఎక్స్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను చూస్తే అవునననే అనిపిస్తోంది. ఇళయరాజా తన పాటలను తన అనుమతి లేకుండా ఎవరైనా పాడితే వారిపై కేసులు వేస్తుండం తెలిసిందే. అలాగే గీత రచయితగా పేరు గాంచిన వైరముత్తు తాజాగా దర్శక నిర్మాతలపై ఆరోపణలు ఎక్కు పెట్టారు. ఈయన తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ తన పాటల్లోని పల్లవిలను, చరణాలను పలువురు సినిమా టైటిల్గా వాడుకుంటున్నారన్నారు. అలా ఇప్పటికి ఒకటా రెండా అనేక పాటల్లోని పల్లవులను చిత్రాలకు టైటిల్గా వాడుకున్నారన్నారు. అలా పొన్మాలై పొళుదు, కన్ సివందాల్ మణ్ సివక్కుమ్, ఇళయ నిలా, ఊరతెరింజికిట్టేన్, పణివిళుమ్ మలర్వనం, వెళ్లైపురా ఒండ్రు, పూవే పూచూడవా, ఈరమాన రోజావే, నిలావందాన్ కై యిల్ పుడిచ్చేన్, మౌనరాగం, మిన్సార కన్నా, కన్నాలనే, ఎన్నవళే, ఉయిరే, సండక్కోళి, పూవెల్లామ్ కేట్టుప్పార్ ఇలా అనేకం తన పాటల్లోని పల్లవులను, చరణాలను చిత్ర టైటిల్గా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకు తన అనుమతి తీసుకోవడం నాగరికం కాదా? అని ప్రశ్నించారు. కనీస మర్యాద కోసం అయినా అడగాలిగా అని అన్నారు. తానేమైనా వారిని పట్టి పీడిస్తున్నానా? కనిపించిన చోటల్లా అడుగుతున్నానా? ఇది సమాజంలో అందరికీ సొంతం అని వదిలేస్తున్నానని అన్నారు. ఆయన చేసిన ట్వీట్ సినీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. మయోపియా నియంత్రణ లక్ష్యంగా ఒప్పందాలు సాక్షి, చైన్నె: మెనికాన్, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ మధ్య కటింగ్–ఎడ్జ్ కాంటాక్ట్ లెన్స్లతో మయోపియా నియంత్రణ లక్ష్యంగా ఒప్పందాలు జరిగాయి. ఈ అవగాహన ఒప్పందం మయోపియా నియంత్రణ చికిత్సను అభివృద్ధి చేయడానికి, ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి ప్రయత్నాలు, నేత్ర వైద్యులు, ఆప్టోమెట్రిస్టులకు శిక్షణ ఇవ్వడం, చికిత్స గురించి అవగాహన పెంచడం, దేశంలోని ఇతర ప్రాంతాల్లో అనుకూలమైన విస్తరణ ప్రణాళికలకు దోహదకరంగా ఉంటుందని ప్రకటించారు. జపాన్ ప్రభుత్వ మద్దతుతో డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ , మెనికాన్, భారతదేశంలో దృష్టిని మెరుగుపరచడానికి రాత్రిపూట ధరించే ఆర్థో కెరాటాలజీ లెనన్స్ అయిన మెనికాన్ బ్లూమ్ నైట్ ఉపయోగించి క్లినికల్ అధ్యయనాలను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ అధ్యయనం పిల్లలకు ఆర్థోకెరాటాలజీ లెన్స్ సమర్థత, భద్రతను తనిఖీ చేయడం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. ఈ భాగస్వామ్యం గురించి డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్విన్ అగర్వాల్ మాట్లాడుతూ, 2050 నాటికి, మయోపియా కేసులు 50 శాతానికి చేరుకుంటాయని అంచనా వేసినట్టు వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మెనికాన్ సహకారంతో ముందు కెళ్లనున్నామన్నారు. మెనికాన్ ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ ఆఫీస్ రీజినల్ డైరెక్టర్ షున్సుకే యమగిషి మాట్లాడుతూ మయోపియాతో పెరుగుతున్న సవాళ్లను అధిగమించేలా డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్తో భాగస్వామ్యం కుదుర్చుకుని సమస్యను పరిష్కరించడంలో ముందడుగు వేయనన్నామని ప్రకటించారు. -
మామిడి రైతులను ఆదుకోవాలి
వేలూరు: తమిళనాడులోని మామిడి రైతులను ప్ర భుత్వం ఆదుకోవాలని తమిళనాడు మామిడి రైతు ల సంఘం ఆధ్వర్యంలో రైతులు కలెక్టర్ సుబ్బలక్ష్మి వినతి పత్రం అందజేశారు. సోమవారం ఉదయం వేలూరు కలెక్టరేట్లో గ్రీవెన్సెల్ జరిగింది. ఇందులో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించుకున్నారు. వినతి పత్రాలను స్వీకరించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు అందజేసి, వెంటనే విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు వేలూరు, కాట్పాడి, పరదరామి, కన్నియంబాడి, అనకట్టు, పేర్నంబట్టు, గుడియాత్తం తదితర ప్రాంతాల్లో పండించే మామిడిని విక్రయం చేసుకునే వారని, ప్రస్తుతం మామిడికి గిట్టుబాటు ధరలు లేక పోవడంతో మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు అతి తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుందని తమిళనాడు మామిడి రైతుల సంఘం ఆధ్వర్యంలో అందజేసిన వినతిపత్రంలో పేర్కొ న్నారు. మామిడికి గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆంధ్ర తరహాలో ఒక టన్ను మామిడికి ప్రభుత్వం ఇస్తున్న రూ.4 వేలను తమిళనాడు ప్రభుత్వం అందజేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తమిళనాడు రైతులు పండించిన మామిడిని కొనుగోలు చేసేలా చర్చలు జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరారు. వినతిని స్వీకరించిన కలెక్టర్ ప్రభుత్వానికి సిఫారసు చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
గ్రేటర్ చైన్నె పోలీసులోకి 11 శునకాలు
సాక్షి, చైన్నె : గ్రేటర్ చైన్నె పోలీసు కమిషనరేట్ పరిధిలోని డాగ్ స్క్వాడ్ యూనిట్లోకి 11 శునకాలను కొత్తగా తీసుకొచ్చారు. వీటికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ ఎ.అరుణ్ నేతృత్వంలో అదనపు కమిషనర్ పర్యవేక్షణలో డిటెక్టివ్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి కీల్పాకం డిటెక్టివ్ స్నిఫర్ డాగ్ రెజిమెంట్ పేరుతో మరొకటి సెయింట్ థామస్ మౌంటైన్ డిటెక్టివ్ స్నిఫర్ డాగ్ రెజిమెంట్గా పనిచేస్తున్నాయి. కీల్పాకం డిటెక్టివ్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ 16 శునకాలు ఉన్నాయి. ఇందులో 11 బాంబులును గుర్తించడంలో శిక్షణ పొంది ఉన్నాయి. మరో మూడు పలు నేరాల్లో కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించాయి. మరికొన్ని మాదక ద్రవ్యాల గుర్తింపులో ప్రత్యేక శిక్షణ పొందాయి. ఇక, సెయింట్ థామస్ ిడాగ్ స్క్వాడ్ 7 డిటెక్టివ్ స్నిఫర్ డాగ్లున్నాయి. ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని కమిషనర్ అరుణ్ నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్తగా 11 శునక పిల్లలను కొనుగోలు చేశారు. వీటిలో లాబ్రడార్, బెల్జియన్ మాలినోయిస్, డాబర్మాన్ ఉన్నాయి. ఇందులో ఆరింటిని బాంబుల గుర్తింపునకు , మరో నాలుగింటిని మాదకద్రవ్యాల గుర్తింపునకు, మరొకటి క్రిమినల్ కేసుల ఛేదనకు ఉపయోగపడేలా శిక్షణ ఇవ్వనున్నారు. చైన్నె మెట్రోపాలిటన్ అదనపు కమిషనర్ విజయేంద్ర బిధారి నేతృత్వంలో సోమవారం ఎగ్మూర్ రాజరత్నం స్టేడియంలో పోలీస్ స్నిఫర్ డాగ్ యూనిట్కు కొత్తగా చేరిన శునక పిల్లలను పరిచయం చేశారు. లాబ్రడార్, బెల్జియం, మాలినోయిస్, డాబర్మాన్, జర్మన్ షెప్పర్డ్ మూడు నెలల పిల్లలుగా ఉన్నాయి. ఇందులో 8 మగ, మూడు ఆడ శునకాలున్నాయి. వీటికి వెట్రి, విక్రమ్, నిత్ర, ముగిలన్, సిలంబన్, కురళి, కారి, కుగన్, వెంబా, ధీరన్, అలెగ్జాండర్ అని నామకరణం చేశారు. వీటికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పోలీసు విభాగంలో చేరికకు గాను ఈ శునక పిల్లలకు వాటి పేర్లతో కూడిన డాలర్లను సమర్పించారు. ● శిక్షణకు ఏర్పాట్లు -
పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రత్యేక సప్లిమెంటరీ
మంత్రి కోవి చెలియన్ సాక్షి, చైన్నె : పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని ఉన్నత విద్యాశాఖ మంత్రి కోవి చెలియన్ ప్రకటించారు. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ జీవితంలో తదుపరి స్థాయికి వెళ్లేందుకు, జీవితంలో పురోగతి సాధించాలన్న కాంక్షతో రెండో సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. వివిధ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు జూన్ లేదా జూలై – 2025 స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షను నిర్వహించనున్నామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పరీక్ష టైం టేబుల్ను సోమవారం విడుదల చేశారు. విద్య నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ఏప్రిల్– 2025లో జరిగిన డిప్లొమా పరీక్షల చివరి సెమిస్టర్, సబ్–సెమిస్టర్ పరీక్ష రాసిన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయ్యారని, మరికొన్ని సబ్జెక్టులు తప్పినట్టు తెలిపారు. వీరు తదుపరి స్థాయి ఉన్నత విద్యలో ప్రవేశంచ లేని పరిస్థితి ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఇక ప్రత్యేక సప్లిమెంటరీ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సప్లిమెంటరీ పరీక్షలో పెండింగ్ సబ్జెక్టులను విద్యార్థులకు రాసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు htt pr://-d-t-e.t n.g-o-v.i n లో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు త్వరితగతిన నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక సప్లిమెంటరీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు, దరఖాస్తు టైమ్టేబుల్ను విడుదల చేశారు. ఈనెల 18వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 23వ తేదీన హాల్ టికెట్లను అందజేయనున్నామన్నారు. ఈనెల 25వ తేదిన థియరీ పరీక్షలు జరుగుతాయని, ఈ నెల 30 నుంచి జూలై 16వ తేదీ వరకు ప్రాక్టికల్స్, జూలై 17 నుంచి 25వ తేదీ వరకు ఇతర సబ్జెక్టుల పరీక్షలు, 30వ తేదీన సప్లిపెంటరీ ఫలితాలను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. -
50 సీట్లు లక్ష్యం
● అమిత్ షా వ్యూహం ● మళ్లీ జూలైలో పర్యటన ● ఆరోపణలపై డీఎంకే ఎదురు దాడి సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే కూటమిలో 50 సీట్లను రాబట్టుకుని, వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టేలా బీజేపీ వర్గాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిశా నిర్ధేశం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ యాభై స్థానాల్లో కార్యక్రమాలు ఇక వేగవంతం చేయడమే కాకుండా, జూలైలో మరోమారు రాష్ట్ర పర్యటనకు ఆయన విచ్చేయాలని నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ ఏడాదిలో నెలకు ఒక పర్యాయం అమిత్ షా తమిళనాడుకు వచ్చి వెళుతున్న విషయం తెలిసిందే. మే నెలలో మాత్రం విరామం ఇచ్చినా జూన్ నెల పర్యటనగా గత రెండు రోజులు మదురైలో తిష్ట వేశారు. బీజేపీ సెంట్రల్ కమిటీతో భేటీ అయ్యారు. ఈ భేటీ అంతా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పట్టున్న అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్ట సాగింది. అలాగే, ఒత్తకడై బహిరంగ సభ వేదికగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. డీఎంకేను టార్గెట్ చేస్తూ, ఆయన తీవ్రంగానే విరుచుకు పడ్డారు. ఈ సభ అనంతరం ఢిల్లీ వెళుతూ ఆయన ఆదివారం రాత్రి పార్టీ వర్గాలతో మరో మారు చర్చించి, 50 స్థానాల్లో కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఆదేశించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. 50 స్థానాలలో పోటీ చేసి, విజయం సాధిస్తే, అధికారంలో వాటాకు సైతం అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తెరిగి పని చేయాలని పార్టీ వర్గాలకు సూచించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. జూలై పర్యటనకు వచ్చేలోపు ఆ యాబై స్థానాల జాబితాను సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించినట్టు సమాచారం. డీఎంకే ఎదురు దాడి బహిరంగ సభ వేదికగా అమిత్ షా తమను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలను డీఎంకే తీవ్రంగా పరిగణించింది. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ రాజ మాట్లాడుతూ అమిత్షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే కాకుండా, బాధ్యత గల హోం మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి సరైన అవగాహన, ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు వాగి వెళ్లడం శోచనీయమని విమర్శించారు. మత రాజకీయాలు, విభిన్న వర్గాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలతో బీజేపీ పయనం ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. డీఎంకేను చూసి పీఎం మోదీ, మంత్రి అమిత్ షా భయపడుతున్నారని, అందుకే తమిళనాడులో పాగా వేయడానికి విశ్వ ప్రయత్నాలతో, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం శాంతి వనంగా ఉంటే, శాంతి భద్రతలు విచ్ఛిన్నమైనట్టుగా ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. తమిళనాడులో ఎన్నికల కుట్రలు, వ్యూహాలకు పదును పెట్టినా, బీజేపీని నమ్మే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరన్నారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై మాట్లాడుతూ అమిత్ షా పాచికలు తమిళనాట పారబోవన్నారు. ఇది వరకు ఎదురైన పరాభావాలు మళ్లీ మళ్లీ వారికి పునరావృతం కావడం తథ్యమన్నారు. -
హరోం..హర..!
తిరుచెందూరులో భక్త జనంసందోహం సాక్షి, చైన్నె : వైఖాసి విశాఖం సందర్భంగా తమిళనాడులోని సుబ్రమణ్యస్వామి ఆలయాలు హరోం హర నామస్మరణతో మార్మోగాయి. తమిల్ కడవుల్ మురుగన్ను ధ్యానిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రసిద్ధి చెందిన తిరుచెందూరు, పళనిల్లోని ఆలయాల్లో మహోత్సవం మిన్నంటింది. తమిళ్ కడవుల్ (తమిళ దేవుడు) మురుగన్. ఆరుపడ వీడుల్లో ప్రసిద్ధి చెందిన మురుగన్ ఆలయాలు రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇందులో తిరుత్తణి, తిరుచెందూరు, పళని ప్రసిద్ధి చెందిన ఆలయాలు. ఈ ఆరుపడై వీడులలో తైపూసం, స్కంధ షష్టి ఉత్సవాలతోపాటుగా వైఖాస విశాఖ ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతాయి. తమ ఆరాధ్య దైవాన్ని తమిళులు సోమవారం దర్శించుకుని పునీతులయ్యారు. భక్తులతో మురుగన్ ఆలయాలు కిట కిటలాడాయి. అన్ని ఆలయాల్లో హరోం హర నామం మిన్నంటింది. ప్రసిద్ధి చెందిన తిరుచెందూరు సుబ్రమణ్య స్వామి ఆలయంలో వేకువ జామున ఒంటి గంట నుంచే పూజాది కార్యక్రమాలు మొదలయ్యాయి. 1.30 గంటలకు విశ్వ రూప దర్శనం, ఆరు గంటలకు ఉదయ మార్తాండ అభిషేకం పూజలు జరిగాయి. వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తి భావంలో మునిగాయి. సముద్ర తీరంలో స్నానం చేసిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సముద్ర తీరంలో జనం రద్దీ పెరగడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. దిండుగల్ జిల్లా పళనిలో దండాయుధ పాణి స్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.చైన్నెలోని వడ పళని మురుగన్ ఆలయం భక్తులతో కిట కిటలాడింది. సిరువాపురి మురుగన్ ఆలయాన్ని రాష్ట్రగవర్నర్ ఆర్ఎన్ రవి సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
● నాలుగు అంశాలకు ప్రాధాన్యత ● రాష్ట్ర ప్రణాళిక సంఘం రూపకల్పన ● ఆవిష్కరించిన సీఎం స్టాలిన్
సుస్థిర అభివృద్ధి.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం..పరిశోధన.. 2030 నాటికి ఎలక్ట్రానిక్ వాహన ఉత్పత్తిలో తమిళనాడు అగ్రస్థానం లక్ష్యంగా విజన్–2030 డాక్యుమెంట్ సిద్ధమైంది. వ్యవసాయేతర ఉపాధి, నైపుణ్యాల పెంపు తదితర అంశాలతో దీన్ని రూపకల్పన చేశారు. దీన్ని సీఎం స్టాలిన్ ఆవిష్కరించారు. సాక్షి, చైన్నె : రాష్ట్ర ప్రణాళిక సంఘం నేతృత్వంలో తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర ఉపాధి, సుస్థిర అభివృద్ధిని కాంక్షిస్తూ విజన్–2030 డాక్యుమెంట్ సిద్ధమైంది. ఆటో మోటివ్ పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుకు మార్గంగా నాలుగు అంశాలతో ఈ విజన్ రూపకల్పన చేశారు. దీనిని సోమవారం సచివాలయంలో సీఎం ఎంకే స్టాలిన్ విడుదల చేశారు. సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉన్నత స్థాయి సలహా కమిటీ తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రజా సంక్షేమ కార్యమ్రాలను పరిశీలించి, అందుకు తగిన మార్గదర్శకాలను సూచించడమే కాకుండా మూల్యాంకనం చేయడం, సమీక్షించడం, ప్రభుత్వ పాలనలో తలెత్తే కొత్త పరిణామాలను అధ్యయనం చేయడం, అవసరాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకోవడానికి సహకారం అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నివేదికలను కూడా తయారు చేసిన ప్రభుత్వానికి సమర్పిస్తూ వస్తున్నారు. ఆ దిశగా ప్రస్తుతం నాలుగు ముఖ్య అంశాలను పరిగణలోకి తీసుకుని రూపకల్పన చేసిన నివేదికను సచివాలయంలో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ విడుదల చేశారు. విజన్–2030 స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో విజన్–2030 రూపుదిద్దుకుంది. తమిళనాడు దార్శనికత ‘డాక్యుమెంట్‘గా, తమిళనాడు ప్రభుత్వ ప్రణాళిక, అభివృద్ధి శాఖ తరఫున దీనిని సిద్ధం చేశారు. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఆమోదించిన 2030 అజెండా మేరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కింద సంవత్సరానికి అభివృద్ధి ప్రణాళికను 17 అధ్యాయాలుగా విభజించారు. వివిధ సంక్షేమ, ప్రత్యేక కార్యక్రమాలు, విధాన పరిణామాలను ఇందులో ప్రత్యేకంగా పొందుపరిచారు. తమిళనాడులో ఆటోమోటివ్ (వాహన తయారీ) పరిశ్రమ భవిష్యత్తుకు గైడెన్స్ సంస్థ మార్గదర్శకాలను రూపొందించారు. ఆటో కార్ కంపెనీ నిపుణుల సహకారంతో ‘తమిళనాడులో ఆటోమోటివ్ (వాహన తయారీ) ‘ది ఫ్యూచర్ ఆఫ్ ది సెక్టార్’ అనే నివేదిక ప్రచురించారు. తమిళనాడు ఆటోమోటివ్ తయారీ రంగం అభివృద్ధి, ఎలక్ట్రిక్ హైబ్రిడ్, హైడ్రోజన్, సీఎన్జీ, డీజిల్తో సహా అనేక వాహనాలలో సాంకేతిక పరిజ్ఞానాలను మెరుగుపరచాల్సిన అవశ్యం గురించి, స్థానికీకరణ, ప్రభుత్వ విధాన రూపకల్పనను ప్రోత్సహించడం, బలోపేతం చేయడం లక్ష్యంగా కీలక సిఫారసులు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో 2030 నాటికి దేశంలోనే తమిళనాడు అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడం, రెండు లక్ష మందికి పైగా కార్మికులకు విద్యుత్ వాహన వ్యవస్థలు, బ్యాటరీ టెక్నాలజీ, ఆటోమేషన్లో నైపుణ్యాలను మెరుగు పరిచేలా సూచనలు చేశారు. ఈవీ క్లస్టర్ ఏర్పాటు, రోల్ ఆన్ ..రోల్ ఆఫ్ పోర్టులు, మల్టీమోడల్ రవాణా కేంద్రాలను అప్గ్రేడ్ చేయడం, నైపుణ్య కేంద్రాల ద్వారా పరిశోధన, అభివృద్ధిని విస్తరించడం వంటి సూచనలతో సిఫారసులు చేశారు. 2030 నాటికి తమిళనాడు ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్లు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికను సిద్ధం చేశారు. వాతావరణ అనుకూలతను, ఆవిష్కరణలకు కేంద్రం లక్ష్యంగా ఈ నివేదిక తమిళనాడు ప్రగతికి మార్గం సుగమం చేస్తుందని ప్రకటించారు. తమిళనాడును నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు తీర్చిదిద్దే మార్గంగా గైడెన్స్ తమిళనాడుకు బిజినెస్ స్టాండర్డ్ సహకారంతో ‘‘విజ్ఞాన ఆర్థిక వ్యవస్థ వైపు తమిళనాడు’’ అనే నినాదాన్ని సిద్ధం చేశారు.‘ది పాత్ టు డిజైన్‘ అనే నివేదికను ప్రచురించారు. ఇందులో గ్లోబల్ కాంపిటెన్న్స్ సెంటర్లు , తయారీ రంగం ప్రగతి, భవిష్యత్తుకు మార్గం సాంకేతికత, ఆవిష్కరణ, తయారీ రంగం ఆధారంగా స్థిరమైన అభివృద్ధి, ఎంఎస్ఎంఈల బలోపేతం , ఉద్యోగాల కల్పన, ఆర్థిక స్థిరత్వం వంటి ముఖ్య అంశాల గురించి విశదీకరించారు. ఈ నివేదిక, అందరికీ ప్రయోజనం చేకూర్చే ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్య నిర్వాహక ఉపాధ్యక్షుడు డాక్టర్ జె. జయరంజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, ప్రణాళిక, అభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ మీనా, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి టి.ఉదయచంద్రన్, రాష్ట్ర ప్రణాళిక సంఘం సభ్య కార్యదర్శి సుధా తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్సమీక్షలతో బిజీ.. అనంతరం జరిగిన కార్యక్రమంలో సచివాలయంలో పలు శాఖల అధికారులతో పథకాల తీరు తెన్నుల గురించి సీఎం స్టాలిన్ సమీక్షించారు. ముందుగా రహదారులు, మైనర్ పోర్టుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న రహదారుల పనులు, పోర్టుల నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర వివరాలను సీఎం ఆరా తీశారు. పనుల వేగం పెంచాలని ఆదేశించారు. అనంతరం సహకార, ఆహార భ భద్రత, వినియోగదారుల సంక్షేమల శాఖ అధికారులతో సమీక్షించారు. అలాగే, అసెంబ్లీలో చేసిన చట్టాలు, విద్యాబోర్డుకు సంబంధించిన అంశాలపై సంబంధిత అధికారులతో సీఎం చర్చించారు. జూలై నుంచి విద్యుత్ చార్జీల వడ్డన అన్న సమాచారాల నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకున్నట్టైంది. గృహాలకు ఈ సారి విద్యుత్ వడ్డనకు ఆస్కారం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమావేశాల్లో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రులు ఏవీ వేలు, పెరియకరుప్పన్, చక్రపాణి, శివశంకర్, తదితరులు పాల్గొన్నారు. చివరగా తమిళ హెరిటేజ్ ఫౌండేషన్ నేతృత్వంలో దక్షిణ కొరియలోని హుంకువర్సిటీ సహకారంతో తమిళ అధ్యయనాలపై రూపొందించిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, దక్షిణ కొరియాకు చెందిన రచయితలు, నిపుణులు, రాయబార కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.కార్మికులుగా.. తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు చేపట్టారు. ఈ అంశంపై అధ్యయనం చేసి తమిళనాడులో అత్యంత వ్యవసాయేతర , పరిమిత వ్యవసాయ పనులు ఉన్న జిల్లాలను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆరు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో వ్యవసాయ పనుల నుంచి, ఇతర రంగాలకు మారడం విస్తృతమైనట్టు వెలుగు చూసింది. నిర్మాణం, తయారీ వంటి రంగాల్లో కార్మికుల సంఖ్య పెరిగిందని, ప్రస్తుతం 75 శాతం కంటే అధికంగా పురుషులు, 50 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు కార్మికులుగా వ్యవసాయేతర రంగాల్లో ఉన్నట్టు ప్రకటించారు. 15 నుంచి 34 సంవత్సరాల వయస్సు ఉన్న వారు కార్మికులుగా మారి ఉన్నారని, ఇందుకు కారణం అధిక వేతనాలు, స్థిరమైన ఉపాధి అని పేర్కొంటూ, యువత అధికంగా నిర్మాణ, పరిశ్రమల వైపు ఉన్నట్టు, తయారీ రంగంలో మహిళలు అధికంగా ఉన్నట్టు వివరించారు. -
కమల్ సంస్థలో సూర్య?
తమిళసినిమా: కథానాయకుడిగా, నిర్మాతగా చిత్రాలు చేస్తున్న నటుడు కమలహాసన్. ఈయన ఇటీవల తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై శివకార్తికేయన్ కథానాయకుడిగా నిర్మించిన చిత్రం అమరన్. నటి సాయిపల్లవి నాయకిగా రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కాగా తాజాగా కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో మెడ్రాస్ టాకీస్తో కలిసి రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన థగ్లైఫ్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. తదుపరి కమలహాసన్ ప్రముఖ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించి, ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి. కాగా తాజాగా కమలహాసన్ మరో చిత్రం నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ఈయన ఇంతకు ముందు సిద్ధార్థ్ హీరోగా చిత్తా, విక్రమ్ కథానాయకుడిగా వీర ధీర శూరన్ వంటి సక్సెస్పుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా ఈ క్రేజీ చిత్రంలో నటించే హీరో ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రచారంలో ఉన్నా, చివరికి నటుడు సూర్య ఈ చిత్రంలో హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సూర్య ఇంతకు ముందు కమలహాసన్ కథానాయకుడిగా నటించి నిర్మించిన విక్రమ్ చిత్రంలో రోలెక్స్ అనే పాత్రలో అతిథిగా మెరిసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా సూర్య హీరోగా అరుణ్కుమార్ దర్శకత్వంలో నటించనున్న చిత్రం గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. కాగా ప్రస్తుతం సూర్య తన 45వ చిత్రం షూటింగ్ను పూర్తి చేసే పనిలో ఉంటూనే తన 46వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు సూర్య, కమలహాసన్ -
ఘనంగా అర్ధనారీశ్వరుడి రథోత్సవం
సేలం: నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్లోని అర్ధనారీశ్వరస్వామి వైకాసి విశాఖ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడు ప్ర త్యేక ఉత్సవాల్లో ఒకటైన వైకాసి విశాఖ రథోత్సవాలు ఈ నెల ఒకటో తేదీన ధ్వజారోహణంతో ప్రా రంభమయ్యాయి. కొండ గుడి నుంచి నగరానికి అ ధిరోహించిన అర్ధనారీశ్వరుడు తిరుత్తర వద్దకు వచ్చి భక్తులను అనుగ్రహించే వైకాసి విశాఖ రథోత్సవం 14 రోజుల పాటు వైభవంగా జరగనుంది. తిరుకల్యాణ ఉత్సవం, పరివార సమేతంగా తిరుత్తరాన్ని అధిరోహించే అర్ధనారీశ్వరుడు తొమ్మిదో రో జు వైభవంగా నిర్వహించారు. కైలాసనాథర్ ఆల యంలోని సొక్కప్ప ముదలియార్ ఆరంగంలో అర్ధనారీశ్వరుడు, సెంగొట్టు వేలవర్ల తిరుకల్యాణ ఉత్సవం, అనంతరం ప్రత్యేక దీపారాధనలు నిర్వహించారు. అంతకుముందు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. తిరుచెంగోడు అర్థనారీశ్వర ఆలయ కార్యనిర్వహణాధికారి రమణికాంతన్, తిరుచెంగోడు డిప్యూ టీ సూపరింటెండెంట్ కృష్ణన్, తిరుచెంగోడు అర్థనారీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ తంగముత్తు, ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు మేసనన్అన్పరస , ఉర్గౌండర్ రాజా, పురపాలక సంఘం సభ్యులు పాల్గొన్నారు. భక్తులకు పసుపు, కుంకుమ, తాడు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. -
దేశసేవకు అంకితం కావాలి
కొరుక్కుపేట: దేవసేవకు అంకితం కావాలని వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ శిక్షణ పూర్తి చేసిన పైలెట్లకు పిలుపునిచ్చారు. భారత నావికాదళానికి చెందిన అరక్కోణం హెలికాప్టర్ శిక్షణ పాఠశాల నుంచి 18 మంది పైలట్లు పట్టభద్రులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం అరక్కోణంలోని ఐఎన్ఎస్ రాజాలినావల్ బేస్లో గ్రాడ్యుయేషన్ పరేడ్లో మొత్తం 18 మంది క్యాడెట్లు విన్యాసాలతో ఆకట్టుకున్నారు. వీరంతా నేవీలో హెలికాప్టర్ పైలట్లుగా చేరారు. వారిలో సబ్ లెఫ్టినెంట్ సిద్ధి హేమంత్ దూబే అనే మహిళా అధికారి ఉన్నారు. ఐఎన్ఎస్ రాజాలిలోని ఇండియన్ నావల్ ఎయిర్ స్క్వాడ్రన్ 561 కింద పనిచేసే హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్లో 22 వారాల ఫ్లయింగ్, గ్రౌండ్ శిక్షణ పూర్తి చేసిన తరువాత వారు నేవీలో పైలట్లుగా చేరారు. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన తూర్పు ప్రాంత కమాండర్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ పాల్గొని, హెలికాప్టర్ పైలట్లుకు గోల్డెన్ వింగ్స్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ మాట్లాడుతూ 18 మంది యువ పైలట్లు భారత నావికాదళంలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆకట్టుకున్న పైలట్లు గ్రాడ్యుయేషన్ పరేడ్ -
వైభవంగా శ్రీమన్నిండీశ్వరాలయ మహా కుంభాభిషేకం
వేలూరు: జిల్లాలోని కాట్పాడి తాలుకా తలయారంబట్టు గ్రామంలో ఉన్న శ్రీమంగళనాయగి సమేత శ్రీ మన్నిండీశ్వరాలయ మహా కుంభాభిషేకం సోమవా రం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ధర్మకర్త చంద్రశేఖర్ అధ్యక్షతన వేద పండితులు ఆలయంలో యాగశాల పూజలు చేశారు. గణపతి హో మం, గజపూజ, అష్టబంధన పూజలు జరిపారు. అ లాగే ఆలయంలో శ్రీ చండికేశ్వరర్, శ్రీ భైరవర్, శ్రీ పెరుమాల్, శ్రీనవగ్రహాలు, శ్రీ శివనాయన్మార్లు వంటి పరిహార మూర్తుల విగ్రహాలను ఉంచి అష్టబంధనం చేశారు. అనంతరం ఆలయంలో స్వామి వారి విగ్రహాన్ని అమర్చి, వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేసి, వివిధ పుణ్యనదుల నుంచి తీసుకొచ్చిన పుణ్యజలాలను ఆలయ రాజ గోపురంపై సంప్రోక్షణ చేసి, హరోంహర నామ స్మరణాల న డుమ మహా కుంభాభిషేక చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. కాట్పాడి యూనియన్ వైస్చైర్మన్ శరవణన్, సర్పంచ్ రాజేష్కన్నన్ అమ్ము, ఏడో వార్డు సభ్యులు రాజకుమారి, మాజీ వార్డు సభ్యులు ఎస్ రమేష్ పాల్గొన్నారు. ఆలయంలో సాయంత్రం సంగీత విభావరి నిర్వహించారు. -
స్నేహితుడి భార్యకు అశ్లీల చిత్రాలు పంపిన యువకుడు..!
అన్నానగర్(తమిళనాడు): దిండుగల్కు చెందిన 23 ఏళ్ల యువతి పేరుతో అశ్లీల చిత్రాలను ఇన్స్ట్రాగామ్లో ప్రచారం చేశారు. ఇది చూసిన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు దిగ్భ్రాంతి చెందారు. ఆ యువతి పేరుతో నకిలీ ఖాతా సృష్టించి, దాని ద్వారా అశ్లీల చిత్రాలను విడుదల చేసినట్లు వెల్లడైంది. ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అశ్లీల చిత్రాలను షేర్ చేసిన వ్యక్తి విరుదునగర్ జిల్లా కరియాపట్టికి చెందిన విమల్(31) అని తేలింది. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ జరపగా, షాకింగ్ సమాచారం బయటపడింది. విమల్ ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అతను దిండుగల్ లో ఒక స్నేహితుడితో ఉంటున్నాడు. అతను తన స్నేహితుడిని సిమ్ కార్డ్ కొనమని అడిగాడు. అతని స్నేహితుడు తన పేరు మీద సిమ్ కార్డ్ కొన్నాడు. దీని ద్వారా విమల్ దిండిగల్కు చెందిన ఒక యువతి పేరుతో నకిలీ ఖాతాను ప్రారంభించి, ఇన్స్ట్రాగామ్లో వివిధ చిత్రాలను షేర్ చేశాడు. ఈ సమాచారం వెలుగులోకి రాగానే, షాక్ అయిన మహిళ అతనిని వివరాలు అడిగింది. ఈలోగా చదువు పూర్తి చేసుకున్న తర్వాత, విమల్ తన స్వస్థలం విరుదునగర్కు వెళ్లాడు. నకిలీ ఖాతా వివరాలు వెలుగులోకి రావడంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఆమె తన వద్ద ఉన్న వివిధ చిత్రాలు, వీడియోలను తొలగించింది. పోలీసులు విమల్ను అరెస్టు చేసినప్పుడు, వారు అతని సెల్ఫోన్ను శోధించారు. సిమ్ కార్డు కొనుగోలు చేసిన స్నేహితుడి భార్యకు విమల్ అశ్లీల చిత్రాలను పంపినట్లు చూసి వారు షాక్ అయ్యారు. విమల్కు 2 వారాల క్రితమే వివాహం జరిగింది. అతన్ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. -
సిద్ధ వైద్యం వల్లే ప్రముఖ నటుడు మృతి?
కోలీవుడ్ సీనియర్ నటుడు రాజేశ్ (Tamil actor Rajesh) (75) ఇటీవలే కన్నుమూశారు. మే 29న ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యంలోనే మరణించారు. చలనచిత్రపరిశ్రమలో 50 ఏళ్లకు పైగా రాణించిన ఆయన ఎప్పటికైనా ఓ సినిమా డైరెక్ట్ చేయాలని కల కన్నాడు. కానీ, అది నెరవరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే అధునాతన వైద్యాన్ని కాదని సిద్ధ వైద్యం తీసుకోవడం వల్లే రాజేశ్ చనిపోయాడని ప్రచారం జరిగింది. సిద్ధ వైద్యం తీసుకోవడం వల్లే?ఆస్పత్రిలో చేరడానికి ముందు సిద్ధ వైద్యుడితో నటుడు గంటల తరబడి గడిపాడని రాజేశ్ సోదరుడు చేసిన కామెంట్లతో ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రచారంపై నటుడు రాజేశ్ కూతురు దివ్య స్పందించింది. మా నాన్న ట్రీట్మెంట్ గురించి తప్పుడు ప్రచారం చేయడం ఇంతటితో ఆపండి. ఈ వదంతులు మమ్మల్ని మరింత బాధిస్తున్నాయి. దయచేసి ఈ సమయంలో మా కుటుంబాన్ని ప్రశాంతంగా వదిలేయండి.నిజమెంత?మా నాన్న సిద్ధ వైద్యమే కావాలని.. మరొకటి వద్దని మొండిగా వ్యవహరించాడని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. కాకపోతే ఓ సిద్ధ వైద్యుడు మా నాన్నను రెగ్యులర్గా చెక్ చేస్తుండేవాడు. ఆరోజు నాన్న శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని సిద్ధ వైద్యుడే గమనించి చెప్పాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాం. కానీ దారిలోనే కన్నుమూశాడు. దయచేసి ఏది నిజం? ఏది అబద్ధం? అనేది తెలుసుకుని మాట్లాడండి అని చెప్పుకొచ్చింది.ఎవరీ రాజేశ్?రాజేశ్ తమిళనాడు వాసి. దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అవల్ ఒరు తొడరకథై’ (అంతులేని కథ) చిత్రంతో రాజేశ్ సినీప్రస్థానం మొదలైంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాలు చేశారు. తెలుగులో బంగారు చిలక, చాదస్తపు మొగుడు, మా ఇంటి మహారాజు, రుద్రుడు సినిమాల్లో నటించారు. హీరో నుంచి క్యారెక్టర్ యాక్టర్ వరకు వివిధ పాత్రలు పోషించారు . 1985లో సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ఒక బంగ్లాను నిర్మించిన తొలి తమిళ నటుడిగా గుర్తింపు పొందారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా అలరించారు. కార్తిగై దీపం సీరియల్లో యాక్ట్ చేశారు. ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా! చదవండి: అఖిల్ రిసెప్షన్లో సింపుల్గా మహేశ్.. ఆ టీ షర్ట్ ధర లక్షల్లో..! -
ఆకట్టుకున్న దుర్యోధన వధ
తిరుత్తణి: ద్రౌపదీ దేవి ఆలయ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం దుర్యోధన వధ గ్రామీణులను అమితంగా ఆకట్టుకుంది. తిరుత్తణి సమీపం ఎస్.అగ్రహారం గ్రామంలో ద్రౌపదీదేవి ఆలయ తిరనాళ్లు మే 29న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 12 రోజులపాటు నిర్వహించిన వేడుకల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు చేపట్టి గ్రామ వీధుల్లో ఊరేగించారు. అగ్నిగుండ వేడుకలు సందర్భంగా భక్తులు కంకణాలు ధరించి, దీక్షలు చేపట్టారు. ఆదివారం ఉదయం దుర్యోధన వధ నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు ఎస్.అగ్రహారం చుట్టు పక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దుర్యోధనుడు, భీముడు వేషధారణ చేసిన కళాకారులు దుర్యోధన వధ నాటకాన్ని పాటలు ద్వారా ప్రదర్శించారు. చివరగా దుర్యోధనుడి మరణంతో గాంధారి జనులను చీపుర్లతో కొట్టే సన్నివేశం ప్రదర్శించారు. యువకులు, మహిళలు గాంధారి వేషధారణ చేసిన కళాకారుడితో చీపుర్లతో కొట్టించుకున్నారు. రాత్రి 7 గంటలకు అగ్నిగుండ వేడుకలు సందర్భంగా 500 మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించారు. సోమవారం ధర్మరాజుల పట్టాభిషేకంతో అగ్నిగుండ వేడుకలకు ముగింపు పలుకుతారు. -
శివకార్తికేయన్తో ఆ ఇద్దరు!
కయాడు లోహార్ కల్యాణి ప్రియదర్శిని శివకార్తికేయన్ తమిళసినిమా: వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన అమరన్ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న శివకార్తికేయన్ ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మదరాశి, అదే విధంగా సుధాకొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు భారీ బడ్జెట్లో రూపొందుతున్న చిత్రాలే. వీటిలో పరాశక్తి చిత్రం సెప్టెంబర్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతుందని సమాచారం. రవిమోహన్ ప్రతి నాయకుడిగా వైవిధ్యభరితమైన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా కన్నడ బ్యూటీ శ్రీలీల కథానాయక కోలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నారు. శివకార్తికేయన్ తాజాగా మరో చిత్రానికి పచ్చ జెండా ఊపారు. ఈయన వెంకట్ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని గురించి ఇంతకుముందే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. లేకపోతే ఇందులో శివకార్తికేయన్కు జంటగా ఇద్దరు బ్యూటీలు నటించనున్నట్లు తెలిసింది. అందులో ఒకరు క్రేజీ నటి కయాడులోహార్ కాగా, మరొకరు కల్యాణి ప్రియదర్శన్ అని సమాచారం. కాగా కల్యాణి ప్రియదర్శన్ ఇంతకుముందే శివకార్తికేయన్కు జంటగా హీరో చిత్రంలో నటించారన్నది గమనార్హం. కాగా శివకార్తికేయన్ వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కనున్న చిత్రం అత్యంత భారీ బడ్జెట్లో రూపొందనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
చంద్రప్రభపై గోవిందుడి వైభవం
తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన ఆదివారం రాత్రి చంద్రప్రభ వాహనంపై వెన్నకృష్ణుడి అలంకరణలో కొలువై ఊరేగుతూ శ్రీగోవిందరాజస్వామి భక్తులను కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, భక్తజన బృందాల కోలాటాలు, భజనల మధ్య స్వామివారి చంద్రప్రభ వాహన సేవ కోలాహలంగా సాగింది. దీనికి ముందు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు స్వామి వారు సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి విహరిస్తూ భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఎఫ్ఏఅండ్ సీఏఓ బాలాజీ, డెప్యూటీ ఈఓ వీఆర్ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, పలువురు శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. నేడు రథోత్సవం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం స్వామివారి రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 6.15 గంటల నుంచి రథంపై స్వామివారు కొలువై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తారు. అలాగే రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. -
గ్రీన్ రన్కు అనూహ్య స్పందన
కొరుక్కుపేట: పర్యావరణాన్ని ప్రోత్సహించే విధంగా పర్య జియో ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ రన్–2025కు అనూహ్య స్పందన లభించింది. చైన్నెలోని నందనంలోని వైఎంసీఏ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమానికి 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లుగా చేపట్టిన గ్రీన్ రన్ను మద్రాస్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్న్లోని ఐఆర్టీఎస్ డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్, ఎం.అశ్విన్, నటి పార్వతినాయర్ పాల్గొని జెండా ఊపి గ్రీన్రన్ను ప్రారంభించారు. చైన్నెలోని ఐటీ బినామీ నిషేధ యూనిట్ డిప్యూటీ కమిషనర్ అమ్ము, చైన్నెలోని గెయిల్ లిమిటెడ్ జోనల్ జనరల్ మేనేజర్ కె.అశోక్, వైఎంసీఏ జనరల్ సెక్రెటరీ పి.ఆసిర్ పాండియన్, అన్వేషి ఫౌండేషన్ నిర్వాహకులు స్వామి ప్రేమ్ అన్వేషిజీ, రంబోల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ గార్గ్ పాల్గొని పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. ముందుగా జియో ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ప్రియా జెమీమా మాట్లాడుతూ ప్రతీ ఏడాది అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ రన్ ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రన్లో పాల్గొన్న వారందరికీ మెడల్స్తో పాటు మొక్కలను పంపిణీ చేశారు. -
వైభవం.. మహాకుంభాభిషేకం
తిరుత్తణి: తిరుత్తణిలో కోదండరామస్వామి ఆలయ మహాకుంభాభిషేకం ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా చేపట్టి సీతారాముల కల్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. తిరుత్తణిలోని జ్యోతిస్వామి వీధిలో పురాతన సీతారాములు, లక్ష్మణ, హనుమాన్ సమేత కోదండరామస్వామి ఆలయం పునరద్ధరణ పనుల కోసం భక్తులు నుంచి విరాళాలు సేకరించి రూ.70 లక్షల వ్యయంతో ఆలయ గర్భగుడి గోపురం సర్వాంగసుందరంగా నిర్మించారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తికావడంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మహాకుంభాభిషేకం వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా భట్టాచార్యుల బృందం హోమగుండ పూజలు చేశారు. ఆదివారం ఉదయం మహాపూర్ణాహుతి హోమం అనంతరం మేళ తాళాలు నడుమ పవిత్ర పుణ్యతీర్థాల కలశాలు బయల్దేరి విమాన గోపుర కలశాలకు మహాకుంభాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద గుమిగూడిన భక్తజనం గోవిందనామస్మరణతో స్వామిని దర్శించుకున్నారు. భక్తులపై బట్టాచార్యులు పుణ్యతీర్థాలు వెదజల్లారు. అనంతరం స్వామివారికి అభిషేక పూజలు చేసి సీతారాముల కల్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. విద్యుత్షాక్తో వృద్ధురాలి మృతి అన్నానగర్: విద్యుత్షాక్తో ఓ వృద్ధురాలు మృతిచెందింది. చైన్నె వ్యాసార్పాడి సత్యమూర్తినగర్ 18వ బ్లాక్ ప్రాంతానికి చెందిన నిర్మలాదేవి (60) ఒంటిరిగా జీవిస్తూ అడయార్లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తోంది. ఈ స్థితిలో శనివారం రాత్రి నిర్మలాదేవి ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు అనుమానించారు. సమాచారం అందుకున్న వ్యాసార్పాడి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలం లోపలికి వెళ్లి పరిశీలించారు. నిర్మలాదేవి స్నానం చేయడం కోసం వాటర్ హీటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తో మరణించిందని పోలీసుల పరిశీలనలో తేలింది. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం స్టాన్లీ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీతా కల్యాణం వేడుకలో నిర్వాహకులు, పండితులుకొరుక్కుపేట: చైన్నె పెరంబూర్లోని శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. పెరంబూర్, పటేల్ రోడ్డులోని ఆనంద నిలయం వేదికగా ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభమైన వసంతోత్సవాల్లో భాగంగా ముగింపు కార్యక్రమంగా ఆదివారం సీతా కల్యాణ వైభవాన్ని ఆనంద్ భాగవతార్ బందం శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాగిన ఈ కల్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు సీతారాములను స్మరించుకుని తరించారు. ఆనంద భాగవతార్ బృందం, స్వాగత సస్సంగం బృందాల కళాకారులు రామనామ కీర్తనలతో భక్తిని చాటుకున్నారు. సమాజం అధ్యక్షుడు తమ్మినేని బాబు, కార్యదర్శి ఎస్.వెంకట రామన్, జాయింట్ సెక్రటరీలు అనంతరామన్, రవికుమార్, కోశాధికారులు పి.కోదండరామయ్య, హెచ్.వెంకట రమణులు, ట్రస్టీ రామచంద్రన్ పాల్గొన్నారు. -
ముగిసిన వేసవి వాలీబాల్ శిబిరం
తిరుత్తణి: వేసవి వాలీబాల్ పోటీలు నిర్వహించిన నిర్వాహకులు సర్టిఫికెట్లతో సత్కరించారు. తిరువళ్లూరు జిల్లా వాలీబాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తిరుత్తణి డాక్టర్ రాధాకృష్ణన్ ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాల క్రీడా మైదానంలో నెల రోజులపాటు వేసవి వాలీబాల్ శిక్షణా శిబిరం నిర్వహించారు. యువకులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్న శిబిరంలో వాలీబాల్ కోచ్ హేమనాథన్ ఆధ్వర్యంలో యువకులు, విద్యార్థులకు శిక్షణ తరగతులు చేపట్టారు. ఆదివారం శిక్షణ ముగింపోత్సవం నిర్వహించారు. ఇందులో జిల్లా వాలీబాల్ ఫెడరేషన్ కార్యదర్శి కుప్పుస్వామి పాల్గొని శిక్షణ పూర్తిచేసుకున్న యువకులు, విద్యార్థులకు సర్టిఫికెట్లతో సత్కరించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణన్ తనవంతుగా శిక్షణ పొందిన యువకులు, విద్యార్థులకు యూనిఫాం అందజేశారు. బీఎంసీ క్లబ్ అధ్యక్షుడు సుల్తాన్ పాల్గొన్నారు. -
క్లుప్తంగా
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య పళ్లిపట్టు: భార్య కాపురానికి రాలేదనే ఆవేదనతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పళ్లిపట్టు ప్రాంతంలో చోటుచేసుకుంది. పళ్లిపట్టు పోలీసుల కథనం మేరకు కొళత్తూరు దళితవాడకు చెందిన చిట్టిబాబు కుమారుడు సాము(23) పండ్లు వ్యాపారం చేసుకుని జీవిస్తున్నాడు. ఇతను కలైవాణి అనే యువతిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. దంతపులకు పాప, అబ్బాయి సహా ఇద్దరు చిన్న పిల్లలున్నారు. దంపతుల మధ్య చోటుచేసుకున్న విభేదాలతో రెండేళ్ల నుంచి భర్త నుంచి విడిపోయిన కలైవాణి పుట్టింట్లో ఉంటోంది. పలుసార్లు కాపురం రావాలని భార్యను సాము వేడుకున్నట్లు, అయితే అతని భార్య అంగీకరించకపోవడంతో ఆవేదనకు గురయ్యాడు. సాము శుక్రవారం రాత్రి ఇంట్లోని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం మేరకు పళ్లిపట్టు పోలీసులు మృతదేహం చేపట్టి పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుక్క దాడిలో చిన్నారికి గాయాలు తిరువొత్తియూరు: హొసూర్ సమీపంలోని తన ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని వీధి కుక్క కరిచింది. బాలుడు తీవ్ర గాయాలతో ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు. కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన ప్రతాప్ భార్య నందిని. వీరికి అర్జున్ అనే 3 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. వీరు హొసూర్ సమీపంలోని నాగొండపల్లిలో జరుగుతున్న ఆలయ ఉత్సవంలో పాల్గొనడానికి బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బాలుడు ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు. ఆ దారిలో వచ్చిన ఒక వీధి కుక్క బాలుడిని కరిచింది. బాలుడు కేకలు వేయడంతో ఇది విన్న పొరుగువారు పరిగెత్తుకుంటూ వచ్చి, వీధి కుక్కను తరిమివేశారు. బాలుడిని రక్షించారు. కుక్క దాడిలో బాలుడు అర్జున్ తల, చేతులు, కాళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు, బంధువులు చికిత్స కోసం హోసూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడికి అక్కడ 10 కుట్లు పడ్డాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని వీధికుక్క కరిచి, గాయాలు చేసిన సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. వీధికుక్కలను నియంత్రించడానికి కార్పొరేషన్ పరిపాలన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. సర్వ దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 88,257 మంది స్వామివారిని దర్శించుకోగా 45,068 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.68 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. వైభవం.. సాంస్కృతిక సంబరం చంద్రగిరి: తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. వారాంతపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం చైన్నెకి చెందిన శక్తిలయ నాట్యపల్లి ఆధ్వర్యంలో నాట్యాచార్యులు సతియ ఆనంద రెడ్డి పర్యవేక్షణలో శాసీ్త్రయ నృత్యాలను ప్రదర్శించారు. వారి అభినయానికి మంత్రముగ్ధులైన ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందనలు తెలిపారు. అనంతరం ఏఓ సుధాకర్ కళాకారులను సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. పళ్లికొండేశ్వర స్వామికి ప్రదోష పూజలు నాగలాపురం: మండలంలోని సురుటుపళ్లి గ్రామంలో ప్రదోష క్షేత్రంగా బాసిల్లుతున్న సర్వమంగళ సమేత పళ్లికొండేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ప్రదోష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేశన్ గురుక్కల్ ఆలయంలోని నందీశ్వర స్వామికి వాల్మికీశ్వర స్వామికి ఏకకాలంలో పూజలు నిర్వహించారు. -
వేల్ మురుగన్కుహరోహర
– కోలాహలంగా మహాకుంభాభిషేకం వేలూరు: వేలూరు సమీపంలోని పుదువసూరు గ్రామంలో తీర్థగిరి కొండపై వెలసిన వడివేల్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ కుంభాభిషేకం ఆదివారం ఉదయం కోలాహలంగా జరిగింది. ఆలయ ముందు భాగంలో కొండపై 92 అడుగుల ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని నిర్మించారు. విగ్రహాన్ని మలేషియాలోని బతిమలై మురుగన్ విగ్రహాన్ని నిర్మించిన తిరువావూరు శిల్పి రూపొందించారు. ఉత్తర, దక్షణ దిశకు ఎదురుగా ఉన్న ఈ మురుగన్ విగ్రహం కొండపై ఉండడంతో వేలూరు పట్టణం పూర్తిగా కనిపించే విధంగా కనిపిస్తుంది. విగ్రహనికి కుంభాభిషేకం నిర్వహించేందుకు మూడు హెలికాప్టర్లను రప్పించి విగ్రహంపై పుష్పాలు, పుణ్యజలాలను చల్లడంతో భక్తులు హరోహరా నామస్మరణలతో కొండ పూర్తిగా పులకించిపోయింది. కుంభాభిషేకం పురస్కరించుకుని యాగశాల పూజలు, మహాగణపతి హోమం, మంగళ వాయిద్యాలతో కూడిన వేద మంత్రాలు చదివి అష్టబంధన, దీపారాధన పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థగిరి మురుగన్కు, కుంభాభిషేకం, మూలవర్ పరివార దేవతలకు కుంభాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం స్వర్ణ కర్త గంగై అమరన్ బృందంచే సంగీత ప్రదర్శన జరిగింది. రాత్రి స్వామి వారిని భక్తుల దర్శనార్థం ఊరేగించారు. ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ శ్రీనివాసన్, వెంకటాపురం సర్పంచ్ బాబు, మాజీ చైర్మన్ శివకుమార్, ట్రస్ట్ ఉపాధ్యక్షుడు ఏలుమలై, రవికుమార్, సభ్యులు పయణి, కరుణాకరన్, పుదియనీది పార్టీ అధ్యక్షుడు ఏసీ షణ్మగం పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈ విగ్రహం ప్రపంచంలోనే మూడవ ఎత్తైన మురుగన్ విగ్రహమని ఆలయ నిర్వాహకులు తెలిపారు. -
పడైతలైవన్లో షణ్ముఖ పాండియన్
తమిళసినిమా: దివంగత ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ వారసుడు షణ్ముఖ పాండియన్ కథానాయకుడిగా నటించిన తాజాచిత్రం పడై తలైవన్. నటి యామిని చందర్ నాయకిగా నటించిన ఇందులో దర్శకుడు కస్తూరి రాజా, మునిష్కాంత్, గరుడ రామ్, ఏ.వెంకటేష్, ఎస్ఎస్.స్టాన్లీ, లోగో ఎన్పీకేఎస్ ముఖ్యపాత్రలు పోషించారు. వీజే కంబైన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను యూ.అన్బు నిర్వహించారు. కథనం, మాటలను పార్థిబన్ దేశింగు అందించారు. దీనికి ఇళయరాజా సంగీతాన్ని ఎస్సార్ సతీష్కుమార్ చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకున్న పాడై తలైవన్ ఈనెల 13వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ వినూత్న కథ, కథనాలతో పూర్తిగా అడవుల్లో చిత్రీకరణ జరుపుకున్న చిత్రం ఇదనీ, పలు ఆసక్తికరమైన అనూహ్య సంఘటనలతో సాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో రూపొందించినట్లు చెప్పారు. ఇది అడవి ప్రాంతంలోని ఏనుగుల సమూహం జీవన విధానం ఆ ప్రాంత ప్రజల జీవనాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇటీవల చేసిన చిత్ర ఆడియో, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని పేర్కొన్నారు. ఈ చిత్ర విడుదల హక్కులను కెప్టెన్ సినీ క్రియేషన్ ్స సంస్థ అధినేత ఎల్కే సుధీష్ పొంది రాష్ట్ర వ్యాప్తంగా 500 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు చెప్పారు. -
మద్యానికి వ్యతిరేకంగా కుయిలి
తమిళసినిమా: కుటుంబాలను కష్టాల కడలిగా మార్చే మద్యానికి వ్యతిరేకంగా ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. తాజాగా అలాంటి ఇతివృత్తంతో రూపొందిన చిత్రం కుయిలి. బియం. ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై వీవీ అరుణ్కుమార్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా మురుగస్వామి దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు బాలాజీ శక్తివేల్ శిష్యుడు కావడం గమనార్హం. ఈ చిత్రం జూలైలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల చైన్నెలో నిర్వహించారు. వీసీకే పార్టీ నేత తోల్ తిరుమావళవన్, దర్శకుడు బాలాజీ శక్తివేల్, నటుడు డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు కే.రాజన్ పాల్గొని కుయిలి చిత్ర ట్రైలర్, పాటలు బాగున్నాయని ప్రశంసించారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ మద్యానికి వ్యతిరేకంగా ఒక తల్లి చేసే పోరాటమే కుయిలి అని చెప్పారు. కన్న తండ్రి, కట్టుకున్న భర్త ఇద్దరు మద్యానికి బానిసలైతే ఆ మహిళ జీవితం ఏమైంది, ఆమె తన కొడుకును ఎలా పెంచింది? మద్యం కారణంగా తన లాగా ఇతర మహిళలు బాధింపునకు గురి కాకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటి వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం కుయిలి అని చెప్పారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించిన విజీ ఆంథోని చాలా అద్భుతంగా నటించారని, ఇది సహజత్వానికి దగ్గరగా రూపొందించిన కథా చిత్రమని, ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. -
నమ్మాళ్వార్ అవార్దుల ప్రదానం
సాక్షి, చైన్నె: వ్యవసాయంలో అద్భుత పరిశోధనలకుగాను ఉత్తమ రైతులకు నమ్మాళ్వార్ అవార్డులను ప్రదానం చేశారు. గవర్నర్ ఆర్ఎన్.రవి ఈ అవార్డులను ఉత్తమ రైతులకు అందజేశారు. పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఆదివారం స్థానికంగా ఉత్తమ రైతులకు సత్కార వేడుక జరిగింది. హరిత విప్లవం దిశగా రైతులు సహజ పద్ధతులను అనుసరిస్తూ సాగు విస్తీర్ణం పెంపునకు కృషిచేస్తుండడాన్ని పరిగణించి ఉత్తమ రైతులకు అవార్డుల ప్రదానోత్సవం చేశారు. ఇందులో గవర్నర్ పాల్గొని ఉత్తమ అవార్డులను అందజేశారు. ఈసందర్భంగా గవర్నర్ ఆర్ఎన్.రవి మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక అని పేర్కొంటూ, వారి సేవలు, త్యాగాలను ఎవ్వరూ మరచిపోకూడదన్నారు. వ్యవసాయ అభ్యున్నతికి నమ్మాళ్వార్ అందించిన కృషిని గుర్తుచేస్తూ, ప్రస్తుతం ఆ దిశగా పయనిస్తున్న రైతులకు ఆయన పేరిట అవార్డులను ప్రదానం చేయడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. -
● కష్టపడి పనిచేయండి ● పార్టీ శ్రేణులకు అమిత్షా పిలుపు
సాక్షి, చైన్నె : 2026లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తమిళనాడులో గెలుపు లక్ష్యం అని, అధికార పగ్గాలు చేపట్టే దిశగా ప్రతిఒక్కరూ మరింత గా శ్రమించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. మదురై పర్యటనకు వచ్చిన అమిత్షా ఆదివారం ఉదయం మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలను అమిత్షా నిర్వహించారు. ఆయనకు అన్న ప్రసాదాలను అర్చకులు అందజేశారు. ఈసందర్భంగా మదురై ఆధీనం జ్ఞాన సంబంధం దేశిక పరామాచార్యాస్వామి కాషాయం శాలువా కప్పి అమిత్షాను సత్కరించారు. అనంతరం తమిళనాడు బీజేపీ సెంట్రల్ కమిటీతో అమిత్షా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షుడు అన్నామలై, సీనియర్ నేతలు పొన్రాధాకృష్ణన్, హెచ్ రాజ, తమిళిసై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్తోపాటు నేతలు హాజరయ్యారు. పార్టీ బలోపేతం దిశగా పలు సూచనలు అమిత్ షా ఇచ్చారు. బూత్ కమిటీ నుంచి రాష్ట్ర స్థాయి కమిటీ వరకు చేయాల్సిన పనులు, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చేపట్టాల్సి కార్యక్రమాలను గురించి వివరించారు. 2026 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. బీజేిపీకి పట్టున్న నియోజకవర్గాలను గురించి ఈసందర్భంగా ఆయన దృష్టికి సమగ్ర వివరాలను నేతలు తీసుకెళ్లారు. ఈ నియోజకవర్గాల మీద మరింతగా దృష్టి పెట్టాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. -
కూటమిలోకి మరిన్ని పార్టీలు
సాక్షి,చైన్నె: 2026 ఎన్నికల సమయానికి అన్నాడీఎంకే కూటమిలోకి మరిన్ని పార్టీలు చేరనున్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి స్పష్టం చేశారు. ఆదివారం అరక్కోణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే హయాంలో రాష్ట్రంలో కొత్తగా 11 ఆస్పత్రుల, వైద్యకళాశాలలను తీసుకొచ్చామని వివరించారు. తాము అమలు చేసిన పథకాలను డీఎంకే ప్రభుత్వ తుంగలో తొక్కినట్టు గుర్తుచేశారు. మరికొన్ని పథకాలకు పేర్ల మార్పుచేశారని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టే దిశగా ప్రజావ్యతిరేక పాలన రాష్ట్రంలో సాగుతున్నట్టు ఆరోపించారు. సామాన్యుల కోసం తాము ఎన్నో పథకాలను తీసుకొస్తే, ప్రస్తుత పాలకులు వాటిని సంపన్నులకు ప్రయోజనకరంగా మార్చేశారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, ఇది కార్యరూపంలోకి రావడం తథ్యమని, మరిన్ని పార్టీలు ఎన్నికల సమయానికి తమ కూటమిలోకి చేరడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. -
పట్టణాభివృద్ధికి పెద్దపీట
● తాగునీటికి ప్రాధాన్యం ● ప్రభుత్వం నివేదిక ● పారిశుధ్య కార్మికులకు తోడ్పాటు సాక్షి,చైన్నె: పట్టణాభివృద్ధికి పెద్ద పీట వేసే విధంగా ప్రభుత్వ కార్యాచరణ ఉందని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు, 49 పట్టణ పంచాయతీలు, 10,565 గ్రామాల్లో రూ.9011.45 కోట్ల విలువైన 71 తాగునీటి ప్రాజెక్టులను 121.37 లక్షల మందికి ప్రయోజనం కలిగించే విధంగా అమలు చేశామని ప్రకటించారు. నాలుగు సంవత్సరాల డీఎంకే ప్రభుత్వ హయాంలో అమలు చేసిన తాగునీరు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదికను సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు ఆదివారం సమచారశాఖ ప్రకటించింది. ఈమేరకు 3 కార్పొరేషన్లు, 8 మున్సిపాలిటీల్లో రూ.1,777 కోట్లతో 6 టౌన్షప్లు, 17 భూగర్భ మురుగునీటిపారుదల ప్రాజెక్టుల గురించి సైతం వివరించారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో తాగునీటి పనులు, పార్కుల అభివృద్ధికి రూ.6,655.80 కోట్లు వెచ్చించినట్టు ప్రకటించారు. పోరూర్లో రూ. 4,276.44 కోట్లతో అతిపెద్ద సముద్రపు నీటి డీశాలినేషన్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయని, మరో 14 కార్పొరేషన్లలో రూ.3,360 కోట్లతో భూగర్భ మురుగునీటి పారుదల ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామని వివరించారు. రూ.1,120.29 కోట్లతో మున్సిపాలిటీలు పట్టణ పంచాయతీల్లో 99 కొత్త బస్టాండ్ల పనులు పూర్తిచేశామని వివరించారు. తాగునీటి సరఫరా మెరుగుదల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీలలో 1,652 కారుణ్య నియామకాలు ఇప్పటి వరకు జరిగినట్టు వివరించారు. కలైంజ్ఞర్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల మేరకు నగర పంచాయతీలకు రూ.5 వేల కోట్లు కేటాయించామని, అలాగే మనకు మనం పథకం మేరకు రూ.582 కోట్లు మాత్రమే కేటాయించామని గుర్తుచేశారు. రూ. 6,655.80 కోట్ల విలువైన అభివృద్ధి పనులు అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్నాయని గుర్తుచేస్తూ , దశల వారీగా రూ.6,655.80 కోట్ల అంచనా వ్యయంతో 446 భూగర్భ మురుగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టు పనులు, పార్కు అభివృద్ధి, నీటి వనరుల పునర్నిర్మాణం, నగరాల సుందరీకరణ వంటి పనులు విస్తృతం చేసినట్టు వివరించారు. అందరికీ గృహాలు.. అందరికీ గృహ నిర్మాణ పథకం కింద 14,669 గృహాలను పట్టణాలలో నిర్మించామని వివరించారు. ఈ సందర్భంగా సముద్రపు నీటి శుద్ధీకరణ పథకం గురించి వివరిస్తూ పోరూర్లో మరో కొత్త ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయ న్నారు. తమిళనాడులోని పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ప్రజలందరికీ అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను సృష్టించడంలో, మార్గదర్శక సూత్రాలు అనుసరించడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని వివరించారు. పారిశుధ్య కార్మికులను బలోపేతం చేసే విధంగా, వారిని యజమానులుగా మార్చే దిశగా కొత్త పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వారి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలతోపాటు వారికి తోడ్పాటుగా నిలుస్తున్నామని వివరించారు. కొత్త బస్టాండ్లు కార్పొరేషన్, మున్సిపాలిటీలలో 28 కొత్త బస్టాండ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు వివరించారు. తిరుచ్చి, నామక్కల్ మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.968.08కోట్లతో పనులకు ఆమోదించామన్నారు. -
పెరిగిన విదేశీ రోగుల సంఖ్య
– ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ సాక్షి,చైన్నె: రాష్ట్రంలో వైద్యచికిత్సల నిమిత్తం విదేశీ రోగుల సంఖ్య పెరిగిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ తెలిపారు. చైన్నె టీ.నగర్ పాండిబజార్లో అట్లాంటిస్ హెల్త్ సిటీ నేతృత్వంలో మల్లీ స్పెషాలిటీ ఈ ఆస్ప త్రిని ఏర్పాటు చేశారు. దీనిని ఆదివారం ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలు చైన్నెలో అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఆమేరకు అనేక ఆస్పత్రుల్లో వైద్యపరంగా సేవలు విస్తృతమయ్యాయని పేర్కొన్నారు. అట్లాంటిస్ హెల్త్ సిటీ ఆరోగ్యసంక్షణ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దినట్టు వివరించారు. 24 గంటల పాటు ఇక్కడ వైద్యసేవలు అందించేందుకు వైద్య నిపుణులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ఈ ప్రయాణంలో మరో మైలురాయిగా తిరుప్పూర్, చైన్నె ట్రిప్లికేన్లోనూ అట్లాంటిస్ హెల్త్ సిటీ సేవలకు చర్యలు తీసుకోవడం ఆహ్వానిస్తున్నామన్నారు. గత గణాంకాలను చూస్తే 25 శాతం విదేశీ రోగుతమిళనాడుకు వస్తున్నట్టు స్పష్టం అవుతున్నట్టు పేర్కొన్నారు. త్వరలో పొత్తు నిర్ణయం సాక్షి, చైన్నె : తమిళనాడులో ఎవరితో పొత్తు అన్నది రెండు లేదా మూడు నెలల్లో తాము స్పష్టతకు వస్తామని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు అన్నారు. పీఎంకేలో విభేదాల నేపథ్యంలో ఆదివారం ఆయన చైన్నెలో మీడియాతో మాట్లాడారు. ఎవరితో, ఎందుకు, ఎప్పుడు, ఎలా కూటమి అన్న విషయాన్ని స్పష్టం చేయడానికి కసరత్తులు చేస్తున్నామన్నారు. ఇందుకోసం రెండు లేదా మూడు నెలల సమయం పడుతుందన్నారు. అప్పుడే కూటమిపై స్పష్టతను తెలియజేస్తామన్నారు. కూటమి జాతీయ పార్టీతోనా లేదా రాష్ట్ట్రియ పార్టీతోనా అనేది తెలియజేస్తామన్నారు. ఇప్పటికిప్పుడే కూటమి గురించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇదిలాఉండగా బీజేపీకి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆడిటర్ గురుమూర్తి, రాందాసుతో భేటీ కావడం చర్చకు దారి తీసింది. విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగాలని బలోపేతం దిశగా అడుగులు వేయాలని రాందాసుకు గురుమూర్తి హితవు పలికినట్టు సమాచారం. ఇదిలాఉండగా రెండు రోజుల క్రితం రాందాసుతో గురుమూర్తి తైలాపురంలో భేటీ కావడం గమనార్హం. దుబాయ్ విమానంలో సాంకేతిక లోపం – తప్పిన పెనుప్రమాదం కొరుక్కుపేట: చైన్నె నుంచి దుబాయ్ వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో రన్వేపైనే దూసుకెళ్లింది. దీంతో పైలట్ చాకచక్యంతో రన్వేపై ఆపి వేయడంతో దుబాయ్కు వెళ్లాల్సిన 312 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆదివారం ఉదయం 9.50 గంటలకు చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం బయలుదేరింది. అందులో 312 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. విమానం స్టాండ్ నుంచి డి–1 ప్రాంతానికి రన్వే పై దూసుకుపోవడంతో విమానం ఇంజిన్లో సమస్య తలెత్తిందని పైలట్ గుర్తించాడు. పైలట్ వెంటనే విమానాన్ని ట్యాక్సీవే పై ఆపి చైన్నె విమానాశ్రయ కంట్రోల్రూమ్కు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది మరమ్మతులు చేశారు. ఈ సంఘటన చైన్నె విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేపింది. మహిళ అవయవాలు దానం వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన ఎత్తిరాజులు భార్య ఉషారాణి(58). ఈనెల 6వ తేదీన ఆంబూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమె తలకు తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆంబూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాణిపేటలోని సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఉషారాణికి ఆదివారం ఉదయం బ్రెయిన్డెడ్ అయ్యింది. దీంతో ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. దీంతో ఆమె అవయవాలను వేలూరు సీఎంసీ, రాణిపేట సీఎంసీ ఆస్పత్రితో పాటు చైన్నెలోని ప్రశాంత్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి అందజేసినట్లు సీఎంసీ ఆస్పత్రి పీఆర్ఓ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఎస్పీ బాలును మరువలేం
కొరుక్కుపేట: సంగీతం ఉన్నంత వరకు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంను మరువలేమని సినీ నటుడు, ఫ్లూటిస్టు అప్పారావుసతీష్ కొనియాడారు. ఈమేరకు ఎస్సీబీ 79వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్య కల్చరల్ ట్రస్ట్ భాగమైన డాక్టర్ ఎస్పీబీ మ్యూజికల్ కాన్సెర్ట్ ఆధ్వర్యంలో సింగర్స్ మీట్ పేరుతో ఎస్సీబీ పాటలతో ప్రత్యేక సంగీత విభావరిని ఆదివారం సాయంత్రం నిర్వహించారు .ట్రస్ట్ వ్యవస్థాపకులు కేఎం కొండయ్య టీటీఆర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి గాయనీ, గాయకులు పెద్దసంఖ్యలో పాల్గొని బాలు పాడిన తెలుగు, తమిళ పాటలను ఆలపించి అందరినీ అలరించారు. ప్లూటిస్టు అప్పారావు సతీష్, అమృత శ్రీ వర్షిణి సేవా సంస్థ నిర్వాహకులు, గాయకులు స్వరశ్రీ పి కొండలరావు పాల్గొని ముందుగా ఎస్పీ బాలు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు కేఎం కొండయ్య టీటీఆర్, సెక్రటరీ వైఏ విలియం, కోశాధికారి కె బాలాజీరావు కలిసి ఎస్పీబాలు పాటలతో వీనులవిందు చేశారు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన గాయనీ గాయకులు కృష్ణవేణి , తమిళ్సెల్వి, వరదరాజన్, శరవణన్, లక్ష్మీణ్, తనిగై, మదన్, యువరాజ్లను బెస్ట్ సింగర్ అవార్డులతో ఘనంగా సత్కరించారు. -
రైల్వేట్రాక్ లింక్ మధ్యలో సిమెంట్ రాయి కలకలం
తిరుత్తణి: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్ లింగ్ మధ్యలో సిమెంట్ రాయి ఉండగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుత్తణి రైల్వేస్టేషన్కు సమీపంలో శనివారం ట్రాక్ లింక్ మధ్యలో గులకరాయిలుండడంతో రైల్వే టెక్నికల్ కార్యాలయంలో సిగ్నల్ రావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబయి నుంచి చైన్నెకి వస్తున్న రైలు వేగాన్ని తగ్గించారు. వెంటనే రైల్వే అధికారులు తిరుత్తణి రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్ తనిఖీలు చేపట్టి లింక్కు మధ్యలో ఉన్న సిమెంట్ రాయిని గుర్తించి, తొలగించారు. అనంతరం ముంబయి మెయిల్ తిరుత్తణి రైల్వేస్టేషన్ దాటుకుని చైన్నెకి వెళ్లింది. ట్రాక్ లింక్ మధ్యలో రైలు వేగానికి అప్పుడప్పుడు చిన్న రాళ్లు పడడం జరుగుతుందని, అయితే సిమెంట్ రాయి ఎలా వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేపట్టనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్లో రాయి గుర్తింపు సంఘటనకు సంబంధించి రైల్వే అధికారులు సకాలంలో గుర్తించడంతో ప్రమాదం తప్పింది. దీంతో తిరుత్తణి మార్గంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల రాకపోకలు యథాప్రకారం సాగాయి. -
భక్తి శ్రద్ధలతో బక్రీద్
వేలూరు: ముస్లింలకు ముఖ్య పండుగైన బక్రీద్ పండుగను ముస్లింలు శనివారం ఉదయం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్బంగా వేలూరు ఈద్గా మైదానానికి ముస్లింలు ర్యాలీగా చేరుకుని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే విషారం, తిరుపత్తూరు, వాణియంబాడి, గుడియాత్తం, వాలాజ, ఆంబూరు, జోలార్పేటలోనే కాకుండా జిల్లాలో మొత్తం 150 ప్రాంతాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తిరువణ్ణామలై జిల్లాలో కూడా మసీదుల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ త్యాగానికి ప్రతీక అయినందున ముస్లింలు పేదలకు పశువులు, మేకలు, వస్తువులు దానం చేశారు. వేలూరు కోట మైదానంలో పలు సంవత్సర కాలంగా మూసి వేసిన మసీదును తెరవాలని ముస్లింలు పోరాటాలు చేస్తారనే ఉద్దేశంతో ముందుస్తుగా కోట ముందు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘనంగా బక్రీద్ వేడుకలు తిరువళ్లూరు: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ముస్లింలు శనివారం ఉదయం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం బక్రీద్ పండుగ కావడంతో తిరువళ్లూరులోని బడా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రధాన ఖాజీ బక్రీద్ వేడుకల ప్రత్యేకత వివరిస్తూ ప్రసంగించారు. కాగా ప్రాఽర్థనల అనంతరం తిరువళ్లూరులో ముస్లీం మత పెద్దల ఆధ్వర్యంలో నిరుపేదలకు మాంసం, దుస్తులు, బియ్యం తదితర వాటిని దానంగా అందజేశారు. అలాగే పేరంబాక్కం, పూందమల్లి, తామరపాక్కం, ఊత్తుకోట, రెడ్హిల్స్, మీంజూరు, పొన్నేరి, గుమ్మిడిపూండి, ఆవడితో పాటు పలు ప్రాంతాల్లోని మసీదులు, దర్గాలలోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
చిత్తూరోళ్లు బస్సు ఎక్కొద్దు..
చిత్తూరు రూరల్(కాణిపాకం): తమిళనాడులోని వేలూరు బస్టాండ్లో శుక్రవారం అర్ధరాత్రి చిత్తూరు ప్రయాణికులకు అవమానం చోటు చేసుకుంటోంది. రాత్రి పూట తిరుపతి–వేలూరు బస్సుల్లో చిత్తూరు ప్రయాణికులను వేలూరు బస్టాండులో ఎక్కించలేదు. చాలామంది చైన్నె, బెంగళూరు నుంచి వేలూరు మీదుగా చిత్తూరుకు వస్తుంటారు. ఈ క్రమంలో చిత్తూరుకు వచ్చే ప్రయాణికులను ఆర్టీసీ బస్సు కండక్టర్లు, డ్రైవర్లు అక్కడ ఛీకొడుతున్నారు. వాళ్లను బస్సు ఎక్కనివ్వడం లేదు. బస్సు దిగేయండంటూ వారిని నిర్దాక్షిణ్యంగా దింపేస్తున్నారు. దీంతో ప్రయాణికులు, ఆర్టీసీ కార్మికుల మధ్య గొడవ చోటు చేసుకుంటోంది. ఇదే మాదిరిగా తిరుపతి ప్రయాణికులను కూడా ఎక్కనివ్వకుండా ఓ బస్సు కండక్టర్ ఇబ్బందులకు గురిచేశాడు. తిరుమలకు వెళ్లే బస్సులో మాత్రమే ఎక్కనిచ్చి.. మిగిలిన వాళ్లను ఎక్కించుకోలేదు. దీంతో గంటల తరబడి బస్టాండులో నిరీక్షించాల్సి వచ్చింది. ఈ ఏడాది కాలంలో వేలూరు బస్టాండులో చిత్తూరు వాళ్లను ఎక్కించడం లేదని పలుమార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని చిత్తూరు వాసులు మండిపడుతున్నారు. ఆదాయం పేరుతో కొందరు ఆర్టీసీ ఉద్యోగులు ఇలా అత్యుత్సాహం చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలానే కొనసాగితే చిత్తూరు మీదుగా వేలూరుకు ఆర్టీసీ బస్సులను తిరగనివ్వమని స్పష్టం చేస్తున్నారు. తమిళనాడు వేలూరు బస్టాండ్లో చిత్తూరు ప్రయాణికులకు అవమానం ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి, చిత్తూరు ప్రయాణికులను ఎక్కించుకోని వైనం ఎవడికి చెబుతారో చెప్పుకోడంటూ ప్రయాణికులపై కండక్టర్ చిందులు శాఖ అధికారులకు ఫిర్యాదు -
తీర్థగిరి కొండపై పూజలు
వేలూరు: వేలూరు సమీపం పుదువసూరులోని తీర్థగిరి వడివేల్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మహా యాగశాల పూజలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం జరగనున్న మహాకుంభాభిషేకానికి ఆలయంలోని స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, దీపారాధన పూజలు నిర్వహించారు. పుదుయనీది పార్టీ అధ్యక్షుడు ఏసీ షణ్ముగం హాజరై పూజలు చేశారు. అనంతరం కుంభిభిషేక ఏర్పాట్లను ఆయన తనఖీ చేశారు. ఆ సమయంలో ఆలయ సంప్రదాయం ప్రకారం ఆయనకు ఆలయ నిర్వహకులు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ శ్రీనివాసన్, గ్రామ సర్పంచ్ బాబు, వేలూరు ప్రియ టెక్స్టైల్స్ యజ మాని సురేష్, ఆలయ నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి
● కుమారుడికి తీవ్రగాయాలుతిరువళ్లూరు: ఇంటి వద్ద అనుమతి లేకుండా 30 అడుగుల మేరకు బావి తవ్వుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడిన కుమారుడిని రక్షించడానికి యత్నించిన తండ్రి మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన కొడుకును రక్షించిన బంధువులు చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరువళ్లూరు జిల్లా మప్పేడు సమీపంలోని ముదుకూరు ప్రాంతానికి చెందిన జ్యోతి(61) తన ఇంటికి సమీపంలో మూడు అడుగుల వెడల్పుతో 30 అడుగుల లోతు బావి తవ్వకం పనులు చేపట్టాడు. బావి తవ్వతున్న సమయంలో జ్యోతిరామన్ కుమారుడు సంతోష్కుమార్(35) ప్రమాదవశాత్తు బావిలో పడి పోయాడు. విషయాన్ని గుర్తించిన జ్యోతి అలియాస్ జ్యోతిరామన్ కొడును రక్షించే క్రమంలో అతను సైతం బావిలోకి దిగే క్రమంలో పడిపోయాడు. ఇద్దరు బావిలో పడిపోయిన విషయాన్ని గుర్తించిన స్థానికుడు బాలాజీ గ్రా మస్తుల సాయంతో సంతోష్, జ్యోతిని బావిలో నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం తిరువళ్లూరు వైద్యశాలకు తరలించగా అప్పటికే అత డు మరణించినట్టు వై ద్యులు నిర్ధారించారు. తీవ్రం గాయపడిన సంతోష్కుమార్కు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న తహసీల్దార్ రజినీకాంత్, మప్పేడు రెవెన్యూ ఇన్పెక్టర్ భారతీప్రియ, వీఏఓ గుణ స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అనుమతి లేకుండా తవ్వకాలు చేపట్టిన బావిని పరిశీలించి వివరాలను సేకరించారు. మృతుడి బఽంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు
వేలూరు: పట్టణంలో సబ్వేలు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి ఏవా వేలు అన్నారు. వేలూరు పట్టణంలో రూ.150 కోట్ల వ్యయంతో 250 పడకల వసతితో కూడిన ప్రభుత్వ పెండ్ల్యాండ్ ప్రభుత్వాస్పత్రి నిర్మా ణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన మంత్రి తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో అన్ని జిల్లాలోను సబ్వేలు ఏర్పాటు పనులు చేయడం జరిగిందన్నారు. అలాగే అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం వేలూరు పట్టణంలో నిర్మిస్తున్న ఆస్పత్రిని త్వరలోనే ముఖ్యమంత్రి చే తుల మీదుగా ప్రారంభించి, ప్రజలకు అందుబా టులో తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. ప్రస్తుతం ఏడు అంతస్తులతో ఆస్పత్రిని నిర్మించి, రోగులకు అవసరమైన అన్ని వసతులను సిద్ధం చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తమకు ఎటువంటి నిధులు కేటాయించడం లేదన్నారు. పలు మార్లు నిధుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఉపాధి హామి పథకం, విద్యాశాఖకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు కేటాయించలేదన్నారు. గతంలో తుపాను బాధితులను ఆదుకోవాలని సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఎటువంటి స్పందన లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్, విల్వనాథన్, జెడ్పీ చైర్మన్ బాబు, మేయర్ సుజాత, కార్పొరేషన్ డివిజన్ చైర్మన్ వీనస్ నరేంద్రన్, యూసిఫ్కాన్, చీఫ్ ఇంజనీర్ మణివణ్ణన్, ఇంజినీర్ మణిగండన్ పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్కు 50వేల దరఖాస్తులు అదనం
కొరుక్కుపేట: ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా భారీ సంఖ్యలో విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్న్లైన్న్లో నమోదు చేసుకున్న వారి సంఖ్య 3 లక్షలు దాటింది. శుక్రవారం దరఖాస్తుల గడువు ముగిసింది. 2,49,883 మంది దరఖాస్తు రుసుము చెల్లించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దరఖాస్తులు సమర్పించడానికి 9వ తేదీ వరకు గడువు ఉన్నందున, 2 వేలకు పైగా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ ఏడాది, గత సంవత్సరం కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి, 50వేల మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరం 2 లక్షల 6 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గత 6–7 సంవత్సరాల తర్వాత ఇంజినీరింగ్ కోర్సులపై ఆసక్తి పెరిగింది అనుమానాస్పద స్థితిలో జాలరి మృతి అన్నానగర్: సముద్రంలో అనుమానాస్పద స్థితిలో ఓ జాలరి మృతిచెందాడు. తూత్తుకుడిలోని థ్రెస్పురానికి చెందిన మత్స్యకారుడు పరిమళం (47). ఇతను తీరం నుంచి జగన్న్కు చెందిన పడవలో మరో ఏడుగురితో కలిసి సముద్రంలోకి వెళ్లాడు. శనివారం ఉదయం సముద్రం మధ్యలో పరిమళం, అతని తోటి మత్స్యకారుల మధ్య వివాదం చెలరేగింది. ఈ స్థితిలో, పరిమళం సముద్రంలో పడి మరణించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆమేరకు కోస్ట్ గార్డ్ ఇన్న్స్పెక్టర్ పేచ్చిముత్తు నేతృత్వంలోని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం తిరువొత్తియూరు: క్లోరిక్ యాసిడ్ తీసుకొస్తున్న లారీ ఢీకొని ఇద్దరు వాచ్మన్లు దుర్మరణం చెందారు. పుదుచ్చేరి నుంచి చైన్నెకి శనివారం ఉదయం క్లోరిక్ యాసిడ్ తీసుకొస్తున్న ట్యాంకర్ లారీ ఈస్ట్కోస్ట్ రోడ్డులో వెళుతోంది. ఉదయం 7.30 గంటలకు కల్పాకం సమీపం వయలూరు ఈస్ట్కోస్ట్ రోడ్డులో వెళుతుండగా హఠాత్తుగా లారీ వెనక చక్రం లారీ నుంచి విడిపోయింది. దీంతో అదుపుతప్పిన లారీ రోడ్డు పక్కన సైకిల్ పై వెళుతున్న వయలూరుకు చెందిన దురై (57), మదురైకి చెందిన కన్నన్ (60) ఢీకొంది. ఈ సంఘటనలో దురై, కన్నన్ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న రంగపట్టినం పోలీసులు ఆక్కడికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణలో మృతులు ప్రైవేట్ సంస్థలో వాచ్మన్లుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. హత్య కేసులో ఐదుగురి అరెస్ట్ తిరువొత్తియూరు: మద్యం బాటిల్ గొడవలో రౌడీని హత్య చేసిన మహిళ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె, పెరియమేడు స్టింగర్స్ వీధికి చెందిన ప్రేమ్కుమార్ రౌడీ. శుక్రవారం రాత్రి ఇతనిపై ఐదుగురు కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడివున్న అతన్ని స్థానికులు చైన్నె రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రేమ్కుమార్ మృతి చెందాడు. దీనికి సంబంధించి ప్రేమ్కుమార్ తల్లి అమ్ములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేపేరి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రౌడీని హత్య చేసిన అదే ప్రాంతానికి చెందిన విజయనారాయణ, జీవ, దీనా, కన్నదాసన్, సుమతి, అనే ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 కత్తులు, కారు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పాఠశాలకు ఒకే ఒక్కడు అన్నానగర్: నీలగిరి జిల్లాలోని కూడలూర్ సమీపం పాండియార్లో ఒక ప్రభుత్వ టీ ఎస్టేట్, ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. వారి పిల్లల విద్య కోసం పాండియార్లోని ప్రభుత్వ టీఎస్టేట్లోని గిడ్డంగి ప్రాంతంలో దండి నిర్వహణలో 1993లో ఒక ప్రాథమిక పాఠశాల ప్రారంభించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గిరిజనులు, తోటల కార్మికుల పిల్లలు పెద్ద సంఖ్యలో ఇక్కడ చదువుకునేవారు. గత కొన్ని సంవత్సరాలుగా, విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గింది. ప్రస్తుతం ఆ పాఠశాలలో ఒక విద్యార్థి మాత్రమే 5వ తరగతి చదువుతున్నాడు. కూడలూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు అతనికి అదనపు పాఠాలు చెప్పడానికి వెళుతున్నారు. -
క్లుప్తంగా
నేపాలి మహిళ ఆత్మహత్య అన్నానగర్: కుటుంబ కలహాలతో ఓ నేపాలి మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చైన్నెకు చెందిన అర్జీన్ బహదూర్ (33) నేపాలి. ఇతను ఆ ప్రాంతంలోని ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఇతని భార్య రీటాదేవి (29). వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. రీటాదేవి మద్యం తాగడం అలవాటు ఉండడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో శుక్రవారం మద్యం తాగిన రీటాదేవి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కీల్పాకం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణం తీసిన రోలర్ అన్నానగర్: రోడ్డు రోలర్ కిందపడి ఓ ఇంజినీర్ మృతి చెందాడు. మదురైలోని మేలమడై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. విరుదునగర్ జిల్లా కారియాపట్టి దులుక్కన్కులం గ్రామానికి చెందిన కరుప్పసామి (28) ఇక్కడ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం కరుప్పసామి యథావిధిగా పనికి వచ్చాడు. ఆసమయంలో ఎండ ఎక్కువగా ఉండడంతో అక్కడ నిలిపి ఉన్న రోడ్డు రోలర్ కింద కరుప్పసామి కూర్చున్నాడు. ఈక్రమంలో అసోం రాష్ట్రానికి చెందిన ఆపరేటర్ రెహమాన్ రోడ్డురోలర్ను కదిలించాడు. దాని కింద ఉన్న కరుప్పసామి తల ను జ్జునుజ్జయి దుర్మరణం పాలయ్యాడు. విష యం తెలిసి మాట్టుతవాని పోలీసులు సంఘట న స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. ప్రమా దానికి కారణమైన ఆపరేటర్ రెహమాన్ తెప్పకుళం పోలీసులకు లొంగిపోయాడు. మృతుడు కరుప్పసామికి ఇంకా వివాహం కాలేదు. సెల్ కొనివ్వలేదని బాలిక బలవన్మరణం తిరువళ్లూరు: తల్లిదండ్రులు కొత్త సెల్ఫోన్ కొనివ్వలేదని ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కొప్పూరు గ్రామానికి చెందిన చంద్రన్. ఇతను భవన నిర్మాణ రంగంలో కార్మికుడు. ఈక్రమంలో ఇతని కుమార్తె దివ్యదర్శిని(15). ఈమె మనవాలనగర్లోని ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈక్రమంలో దివ్యదర్శిని సెల్ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కో రింది. తల్లిదండ్రులు నిరాకరించడంతో మనస్తా పం చెంది ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న బాలికను కిందకు దింపి వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు బాలికను పరిశీలించగా అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనవాలనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. 12న కొత్త టోల్ గేట్ ప్రారంభం కొరుక్కుపేట: తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని తంజావూరు–విక్రవాండి జాతీయ రహదారిపై కుంభకోణం సమీపంలోని మనంబాడి వద్ద కొత్తగా నిర్మించిన టోల్ ప్లాజాను ఈ నెల 12వ తేదీన ప్రారంభించనున్నారు. తంజావూరు–విక్రవాండి జాతీయ రహదారి నిర్మా ణం మూడు విభాగాలుగా జరుగుతోంది. విక్రవాండి నుంచి సేథియాథోపు వరకు, సేథియాథోపు నుంచి చోళపురం వరకు, చోళపురం నుంచి తంజావూరు వరకు సాగుతుంది. మొదటి దశలో హైవేలోని చోళపురం–కుంభకోణం–తంజావూరు విభాగం పూర్తయింది. ఇది జనవరి 20న ప్రారంభమైంది. చోళపురం నుంచి సేథియాతోపు వరకు 50 కిలోమీటర్ల పొడవైన హైవే రెండో దశ పూర్తయింది. దీని తరువాత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనిని ప్రజల ఉపయోగం కోసం తెరవాలని నిర్ణయించింది. దీని ప్రకారం, చోళపురం–సేథియాతోపు మార్గానికి టోల్ వసూలు చే యడానికి మనంపాడి వద్ద టోల్ బూత్ ఏర్పాటు చేశారు. దీన్ని 12వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్ల నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తమిళనాడులో ప్రస్తుతం 52 టోల్ బూత్లు పనిచేస్తున్నాయి. మనంబాడి టోల్ బూత్ కూడా ప్రారంభమైతే, మొత్తం సంఖ్య 53కి పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. సుసి ఈము పౌల్ట్రీ కంపెనీ సీఈఓకు పదేళ్ల జైలు –రూ.7 కోట్ల జరిమానా కొరుక్కుపేట: తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 385 మంది పెట్టుబడిదారుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసినందుకు సుసి ఎముకోజి కంపెనీ యజమాని గురుస్వామికి పదేళ్లు జైలుశిక్ష , రూ.7 కోట్ల జరిమానా విధిస్తూ కోయంబత్తూరు కోర్టు తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. 2010లో ఈరోడ్ జిల్లాలోని పెరుందురైలో ప్రధాన కార్యాలయం కలిగిన సుసి ఈము ఫామ్స్ అనే కంపెనీ, ఆస్ట్రేలియన్ పక్షి అయిన ఈము కోళ్లను పెంపకంతో భారీ లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంటూ ఒక ఆకర్షణీయమైన ప్రకటన చేసింది. దీనిని నమ్మి, తమిళనాడు నుంచి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఆ కంపెనీ హామీ ఇచ్చినట్లుగా పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి ఇవ్వలేదు. వారి నుంచి రూ.కోట్లు వసూలు చేసి, మోసం చేసింది. దీనిపై 10 కేసులు కొనసాగుతున్నాయి. ఇందులో 385 మంది నుంచి డబ్బు తీసుకుని మోసం చేసినందుకు సేలంలో నమోదైన కేసు శుక్రవారం కోయంబత్తూరు ఇన్వెస్టర్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో సుసి ఈము ఫామ్ యజమాని గురుస్వామికి పదేళ్లు జైలుశిక్షతోపాటు రూ.7.89 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అప్పీలు గడువు ముగిసిన తర్వాత ఈ జరిమానా మొత్తాన్ని 385 మంది పెట్టుబడుదారులకు పంచాలని కోర్టు ఆదేశించింది. -
జూలై 7న మహాకుంభాభిషేకం
తిరువొత్తియూరు: తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జూలై 7వ తేదీ ఉదయం 6.15 గంటల నుంచి 6.50 గంటల వరకు మహాకుంభాభిషేకం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఆరుపడైవీడుగల్(ఆరు ముఖ్య క్షేత్రాల)లో 2వ స్థానమైన తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జూలై 7న కుంభాభిషేక ఏర్పాట్లు జరుగుతున్నాయి దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ జ్ఞానశేఖర్ ఇచ్చిన ప్రకటనలో తిరుచెందూరు ఆలయంలో 12 ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేక ఉత్సవాలు జూలై 1 నుంచి 7వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. మహాకుంభాభిషేకం జూలై 7వ తేదీ ఉదయం నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
పరమశివన్ ఫాతిమకు ప్రశంసలు
తమిళసినిమా: నటుడు విమల్, ఛాయాదేవి జంటగా నటించిన చిత్రం పరమశివన్ ఫాతిమ. ఎంఎస్.భాస్కర్, మనోజ్కుమార్, శ్రీరంజని, ఆదిరా, అరుల్దాస్, కాదల్ సుకుమార్, కూల్ సురేష్, వీరసమరన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా చాయాగ్రహకుడు సుకుమార్ ప్రతినాయకుడిగా పరిచయం అయ్యారు. లక్ష్మీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఇసక్కీ కార్వనన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఇది మూడు మతాల ప్రజల మనోభావాలను ఆవిష్కరించే కథాంఽశంతో రూపొందింది. హిందువులు, క్రిష్టియన్లు, ఇస్లామిన్లు మధ్య జరిగే పోరాటాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హిందువులు, క్రిష్టయన్ల వీధుల్లో జరిగే పెళ్లిళ్ల సమయంలో పెళ్లి కొడుకులు అకస్మాత్తుగా అదృశ్యమై ఆ తరువాత హత్యకు గురవుతారు. ఈ హత్యలకు కారణం ఏమిటన్నది ఛేదించడానికి పోలీసులు రంగప్రవేశం చేస్తారు. అయితే ఈ కేసులు పోలీసులకే సవాల్గా మారతాయి. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? అందుకు కారణం ఏమిటీ? పోలీసులు విచారణలో తేలిన విస్మయం చెందే సంఘటనలు ఏమిటి వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం పరమశివన్ ఫాతిమ. ఇందులో విమల్, ఛాయాదేవి వేర్వేరు మతాలకు చెందిన ప్రేమికులుగా నటించారు. వారి ప్రేమకు మతాలు ఆటంకంగా మారుతాయి. మరి వారి ప్రేమ సుఖాంతం అయ్యిందా లేదా అన్నదే ఈ చిత్రం. ఈచిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని చూసిన నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ మంచి కథా చిత్రంగా ప్రశంసించారు. దర్శకుడు ఇసక్కీ కార్వనన్కు అభినందనలు తెలిపారు. -
● మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు ● ఖుర్బానీలు..పేదలకు పంపిణీ
సాక్షి, చైన్నె: త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శనివారం రాష్ట్రంలోని ముస్లింలు భక్తిద్ధలతో జరుపుకున్నారు. మసీదులు, ఈద్గా మైదానాలలో, సముద్ర తీరాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇళ్ల వద్ద ఖుర్బాని ఇచ్చారు. ఈ మాంసాన్ని మూడు భాగాలుగా చేసిన పేదలు, బంధుమిత్రులకు పంచి పెట్టారు. భక్తి భావాన్ని చాటే రంజాన్ పర్వదినం తర్వాత అత్యంత ప్రధాన పండుగ బక్రీద్ను ముస్లింలు జరుపుకుంటారు. త్యాగ నిరతిని చాటే ఈ పండుగను ఈదుల్ జుహా, ఈదుజ్జుహా అని కూడా పిలుస్తారు. ఈ పండుగ వెనుక త్యాగాన్ని చాటే కథ ఉందని చెప్పవచ్చు. ఆ మేరకు దైవ ప్రవక్తల్లో ఒకరైన హజ్రత్ ఇబ్రహీం తాను నిద్రిస్తున్న సమయంలో వచ్చిన కలను సాకారం చేసుకునేందుకు నిర్ణయిస్తారు. ఆ కలను అల్లా ఆదేశంగా భావించిన ఆయన తన తనయుడు ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి సిద్ధపడతారు. బలి ఇచ్చే సమయంలో వీరి భక్తికి మెచ్చిన అల్లా ఇస్మాయిల్ స్థానంలో ఓ గొర్రెను ఉంచుతారు. అప్పటి నుంచి వీరి త్యాగాన్ని స్మరిస్తూ ముస్లింలు బక్రీద్ పండగను జరుపుకుంటూ వస్తున్నారు. అలాగే ఇస్లాం సూచించిన ఐదు సూత్రాల్లో ఒకటైన హజ్ యాత్ర కూడా ఈ మాసంలోనే నిర్వహిస్తారు. బక్రీద్ పర్వదినాన మక్కాలో నమాజు చేసే అవకాశం దక్కడంతో ఈ ఏడాది రాష్ట్రం నుంచి వేలాది మంది హజ్ యాత్రకు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో శనివారం బక్రీద్ పర్వదినం కావడంతో రాష్ట్రంలో ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో భక్తిభావం మిన్నంటింది. త్యాగానికి ప్రతీక బక్రీద్న్యూస్రీల్ప్రత్యేక ప్రార్థనలు..ఖుర్బానీ బక్రీద్ పర్వదినాన ప్రార్థనే కాదు..ఖుర్బానీ ఇవ్వడం ముఖ్యం. హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరిస్తూ ప్రతిఇంటా గొర్రె లేదా ఒంటెను ఖుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ దిశగా శనివారం ఇళ్ల వద్ద ఖుర్బానీ ఇచ్చే కార్యక్రమాలు జరిగాయి. ఖుర్బానీ ఇచ్చిన గొర్రె లేదా ఒంటె మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి, ఒక భాగం తమ కుటుంబానికి, రెండో భాగం బంధుమిత్రులకు, మూడో భాగం పేదలకు పంచి పెట్టారు. విందులతో సందడి చేశారు. ముందుగా ఉదయాన్నే ప్రత్యేక ప్రార్థనలు మసీదులు, ఈద్గా మైదానాలలో జరిగాయి. కొత్త బట్టలను ధరించి తమ ప్రాంతంలోని మసీదులు, ఈద్గా మైదానాలకు ముస్లింలు కుటుంబాలతో కలిసి కదిలారు. అల్లాను సమ్మరిస్తూ ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రదేశాల్లో సందడి వాతావరణం నెలకొంది. జట్లు జట్లుగా మసీదులు, ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనల్లో లీనమయ్యారు. మత గురువులు బక్రీద్ పండుగ విశిష్టను వివరిస్తూ ఉపదేశం చేశారు. అందరి చేత ప్రార్థనలు చేయించారు. ప్రార్థనల అనంతరం ఒకరిని మరొకరు ఆలింగనం చేసుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చైన్నె, శివారు జిల్లాలు, మదురై, రామనాథపురం, నాగపట్నం, తిరునల్వేలి, తెన్కాశి, జిల్లాల్లో ఉదయం ఎనిమిది, ఎనిమిదిన్నర గంటలకే ప్రార్థనలు ముగించారు. మరికొన్ని చోట్ల ఎనిమిదిన్నర, తొమ్మిది, తొమ్మిదిన్నర గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లతో వ్యవహరించారు. నాగూర్లో సముద్రతీరంలో ప్రత్యేక ప్రార్థన జరిగింది. పుదుచ్చేరిలో సముద్రతీరంలోని గాంధీ విగ్రహం ఎదురుగా ప్రత్యేక ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. పేద, ధనవంతుడు, అధికారి, రాజకీయ నాయకుడు అన్న భేదాలు లేకుండా అందరూ మసీదులు, ఈద్గా మైదానాలలో ఒకే వరుసలో నిలబడి ప్రత్యేక ప్రార్థనలతో అల్లా కృపను పొందేవిధంగా ముందుకు సాగారు. -
సామరస్యం అంటే ఏమిటో?
● రాందాసు చమత్కారం ● పార్టీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టం ● చైన్నెలో తిష్ట సాక్షి, చైన్నె: సామరస్యం అంటే ఏమిటో అని మీడియా ప్రశ్నకు చమత్కారంతో కూడిన సమాధానాన్ని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఇచ్చారు. అన్బుమణి విభేదాల రూపంలో పార్టీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్య నెలకొన్న విభేదాల గురించి తెలిసిందే. గురువారం అన్బుమణి తైలాపురం గెస్ట్హౌస్కు వెళ్లి రాందాసును కలిసి నిరాశతో వెళ్లారు. అధ్యక్ష పదవిని వదలుకునే స్థితిలో తాను లేనని అన్బుమణి స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే, అధ్యక్ష పదవిని కూడా తానే చూసుకుంటానని రాందాసు తేల్చిచెప్పినట్టు చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాందాసు పార్టీలో ఎవరెవరు తన వెన్నంటి ఉన్నారో అని తెలుసుకునే దిశగా భేటీలు విస్తృతం చేశారు. ఈ పరిస్థితుల్లో శనివారం రాందాసు మీడియా దృష్టిలో పడ్డారు. మీడియా ప్రతినిధులు వేసిన పలు ప్రశ్నలకు ఆయన డొంక తిరుగుడు సమాధానాలు ఇచ్చారు. పరిస్థితులు పార్టీలో చక్కబడ్డట్టేనా అని మీడియ ప్రశ్నించగా ఏ పరిస్థితులు అని ఎదురు ప్రశ్న వేశారు. అన్బుమణితో సయోధ్య కుదిరినట్టేనా, అంతా సామరస్యమేనా అని ప్రశ్నించగా సామరస్యం అంటే ఏమిటో అని సమాధానం ఇచ్చారు. కాంప్రమైజ్ అయ్యారా అని ప్రశ్నించగా, అంటే ఎమిటో తనకు తెలియనప్పుడు ఎలా సమాధానం ఇవ్వాలని వ్యాఖ్యలు చేశారు. అన్బుమణితో విభేదాల కారణంగా పార్టీకి నష్టం లేదా అని ప్రశ్నించగా ఎలాంటి నష్టం లేదని, పార్టీ బలంగా ఉందని స్పష్టం చేశారు. అన్బుమణితో భేటీ వివరాలను తర్వాత తెలియజేస్తాననని వ్యాఖ్యానించారు. చైన్నెలో తిష్ట గత కొన్ని నెలలుగా రాందాసు విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని తైలాపురం గెస్ట్హౌస్లోనే ఉన్నారు. అక్కడి నుంచే అన్ని వ్యవహారాలు సాగించారు. వివాదాలు కూడా ఇక్కడి నుంచే బయలుదేరాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని నెలల అనంతరం ఆయన తైలాపురం గెస్ట్హౌస్ నుంచి బయటకు వచ్చారు. చైన్నెకు చేరుకున్న ఆయన అన్బుమణి నివాసం ఉంటున్న పనయూరు శ్యామలా గార్డెన్కు పక్క వీధిలో ఉన్న తన కుమార్తె గాంధీమతి ఇంటికి వెళ్లారు. అక్కడే ఆయన ఉంటారు. ఆయన్ను అన్బుమణి, ఇతర కుటుంబసభ్యులు కలిసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. -
ప్రైవేటు వైద్యశాల సీజ్
తిరువళ్లూరు: నిబంధనలను అతిక్రమించి వైద్యం చే స్తున్న ప్రయివేటు వైద్యశాలకు ఆరోగ్యశాఖ అధికా రులు శనివారం ఉదయం సీల్ వేశారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సిందలకుప్పంలో ఆల్పా అనే ప్రైవేటు వైద్యశాల ఉంది. ఈ వైద్యశాలకు వచ్చే రోగుల కు కాలం చెల్లిన మందులను ఇవ్వడం, ఫీజుల పేరిట భారీగా వసూళ్లకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందా యి. దీంతో ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ అంబిక నేతృత్వంలోని అధికారుల బృందం వైద్యశాలను తని ఖీ చేసింది. తనిఖీల్లో నిబంధనలను అతిక్రమించినట్టు నిర్ధారణ కావడంతో వైద్యశాలకు సీల్ వేశారు. లారీ ఢీకొని ఎస్ఐకి గాయాలు తిరుత్తణి: వాహన తనిఖీలు చేస్తున్న ఎస్ఐని లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తిరుత్తణి ట్రా ఫి క్ ఎస్ఐ దివాకర్ సిబ్బందితో కలిసి శుక్రవారం అరక్కోణం రోడ్డులో వల్లియమ్మపురం వద్ద వాహన తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో అరక్కోణం నుంచి తిరుత్తణికి వెళుతున్న లారీ తనిఖీ లు నిర్వహిస్తున్న ఎస్ఐ దివాకర్ను ఢీకొంది. ప్రమాదంలో దివాకర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ శ్రీనివాసన్ను(50) అరెస్టు చేశారు. -
ఘనంగా స్పైకాన్–2025
సాక్షి, చైన్నె : సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్, కార్నెగీ మెల్లన్ వర్సిటీ నేతృత్వంలో శనివారం స్థానికంగా స్పైకాన్ 2025 ఘనంగా జరిగింది. స్పిన్నింగ్ జెన్ ఏఐ థీమ్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగిన ప్రీమియర్ సమావేశంలో 30 సంవత్సరాల సేవల ఆవిష్కరణ గురించి నిర్వాహకులు వివరించారు. స్పిన్ చైన్నె జ్ఞాపకార్థం వాట్స్ హంప్రీ అవార్డులు అందజేశారు. స్పిన్ చైన్నె అధ్యక్షుడు డాక్టర్ రాజారామ్ వెంకటరామన్, కమిటీ చైర్మన్ రాజమాణిక్యం, ఐఐటీ మద్రాసులోని సెంటర్ ఫర్ రెస్సాన్సిబుల్ ఏఐ చీఫ్ డాక్టర్ శివరామకృష్ణన్, హైదరాబాద్లోని టి హబ్కు చెందిన డాక్టర్ శ్రీకాంత్ సుందరరాజన్, ప్రతినిధులు రమేష్ కృష్ణమూర్తి, అన్బళగన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్త డిజిటల్ యుగం, డీప్ టెక్ల గురించి ఈ సమావేశంలో చర్చించారు. అలాగే సలోని మల్హోత్రా, ఆస్తా అహ్లువాలియా రచించిన ప్లిప్ ది స్టోరీ గురించి వివరించారు. స్పైకాన్ 2025 ముఖ్యోద్దేశాన్ని వివరిస్తూ రూపొందించిన సావనీర్ను ఆవిష్కరించారు. అలాగే, ప్లిప్ది స్టోరీ పుస్తకాన్ని విడుదల చేశారు. -
తిరుక్కురళ్ ఆడియో ఆవిష్కరణ
తమిళసినిమా: ఇంతకుముందు కామరాజర్ జీవిత చరిత్రతో కామరాజ్, మహాత్మగాంధీ జీవిత చరిత్రతో వెల్కమ్ బ్యాక్ గాంధీ వంటి చిత్రాలను రూపొందించిన ఏజే.బాలకృష్ణన్ తాజాగా స్వీయదర్శకత్వంలో రమణ కమ్యూనికేషన్ పతాకంపై తెరకెక్కించిన చిత్రం తిరుక్కురళ్. ఇందులో తిరువళ్లువర్గా కలైచోళన్, వాసుకిగా ధనలక్ష్మీ నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఈనెల 27న తెరపైకి రానుంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో జరిగింది. దర్శక నిర్మాత ఏజే.బాలకృష్ణన్ మాట్లాడుతూ ఒక చెత్త కథనంతో మంచి చిత్రాన్ని చేయలేమని కురోచోవా చెప్పారన్నారు. చిత్ర నిర్మాణానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడలేదన్నారు. విడుదలై చిరుతైగళ్ పార్టీ నేత తోల్ తిరుమావళవన్ మాట్లాడుతూ తిరుక్కురల్ను తెరపై ఆవిష్కరించడాన్ని అభినందిస్తున్నానన్నారు. ఇకపోతే ఇటీవల కమలహాసన్ చెప్పిన తమిళం నుంచే కన్నడ భాష ఉద్భవించిందన్న విషయాన్ని కన్నడిగులు వ్యతిరేకిస్తున్నారని, అయితే 1812లో బ్రిటీష్ పాలనలోనే ఎల్వీస్, 1852లో హెన్రీ హయసింగ్టన్ అనే బ్రిటీష్ పౌరులు తమిళ భాషపై పరిశోధనలు చేశారన్నారు. దక్షిణ భాషల్లో ప్రధాన భాష తమిళం అని నిర్ధారించారన్నారు. కాగా తిరువళ్లువర్ రాసిన సూక్తులతో రూపొందిన తిరుక్కురళ్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూడాల్సిన చిత్రం అని చెప్పారు. తిరుక్కురల్ ఆడియోను ఆవిష్కరిస్తున్న తోల్ తిరుమావళవన్తో యూనిట్ సభ్యులు -
బూత్కు 30 శాతం ఓటర్ల నమోదు లక్ష్యం
● సభ్యత్వ నమోదుపై స్టాలిన్ ● ఎన్నికల పనుల వేగానికి ఆదేశాలు ● జిల్లాల నేతలతో కాన్ఫరెన్స్ సాక్షి, చైన్నె : ఒక పోలింగ్ బూత్కు 30 శాతం ఓటర్లు డీఎంకే సభ్యులుగా ఉండే రీతిలో నమోదు ప్రక్రియ సాగాలని పార్టీ వర్గాలకు సీఎం స్టాలిన్ ఆదేశించారు. సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇంటింటా వెళ్లి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. 2026 ఎన్నికల్లో మళ్లీ అధికారమే లక్ష్యంగా సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టిన పెట్టిన విషయం తెలిసిందే. పార్టీ వర్గాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, వారి ద్వారా కార్యక్రమాలు విస్తృతం చేయిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో 200 స్థానాలలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరుగుతాయన్న సమాచారం వెలువడుతున్న నేపథ్యంలో కార్యక్రమాలను మరింత వేగవంతం చేయించేందుకు సిద్ధమయ్యారు. మదురైలో జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశంలో సభ్యత్వ నమోదు గురించి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే, పార్టీ అనుబంధ విభాగాల్లో కొత్తగా మరో రెండింటిని ఏర్పాటు చేయడానికి స్టాలిన్ నిర్ణయించారు. నేతలతో భేటీ సభ్యత్వ నమోదు, అనుబంధ విభాగాల పనితీరును మరింత వేగవంతం చేయించడం, పార్టీ నేతలు, ముఖ్యులు ఇంటింటా వెళ్లి ప్రజలతో మమేకం అయ్యే దిశగా శనివారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జిల్లాల కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ పర్యవేక్షకులు ఈ సమావేశానికి తమ తమ నివాసాలు, కార్యాలయాల నుంచి హాజరయ్యారు. చైన్నెలోని తన నివాసం నుంచి సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. పార్టీ నిర్వాహక కార్యదర్శి ఆర్ఎస్ భారతీ పార్టీ కార్యాలయం నుంచి సమావేశానికి హాజరైన వారి వివరాలను అధ్యక్షుడు స్టాలిన్ దృష్టికి తీసుకొస్తూ స్వాగతోపన్యాసం చేశారు. జిల్లా, నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీల పనితీరు, సభ్యత్వ నమోదు గురించి ముందుగా చర్చించారు. ఒక్కో పోలింగ్ బూత్లో 30 శాతం ఓటర్లు డీఎంకేలో సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్టాలిన్ ఆదేశించారు. గతంలో సభ్యత్వ నమోదును విజయవంతం చేసి ఉన్నారని గుర్తుచేస్తూ, దీనిని తలదన్నే రీతిలో సభ్యత్వ నమోదు తాజాగా జరగాలని ఆదేశించారు. ప్రతి నేత, ముఖ్య ప్రముఖులు ఇంటింటా వెళ్లి ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. బూత్ కమిటీలు మరింత అలర్ట్గా ఉండాలని, స్థానికంగా ఉన్న ప్రజలను తరచూ కలుస్తూ ప్రభుత్వ పరంగా వారికి కావాల్సిన సహకారం అందించాలని, ప్రభుత్వ పథకాలు దరిచేరాయా.? అని ఆరా తీయడం, అవసరమైతే దగ్గరుండి పనులు చేయించాలని, పథకాలు రాని వారినికి దరిచేర్చాలని సూచించారు. ఇంటింటికీ తరచూ వెళ్లడం, ప్రజలకు స్థానికంగా అందుబాటులో ఉండడం బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. ఒక్కో పోలింగ్ బూత్లో కనీసం 30 శాతం ఓటర్లు డీఎంకేలో సభ్యులుగా ఉండేలా సభ్యత్వ నమోదు జరగాలని, పనుల వేగం పెంచాలని ఆదేశించారు. -
షూటింగ్లో చాలా ప్రమాదాలు
తమిళసినిమా: షట్టర్ ఫ్రేమ్స్ పతాకంపై బిపిన్ మిట్టాదిల్ నిర్మించిన చిత్రం హోలోకాస్ట్. నటుడు జయకృష్ణన్, షర్మిళ, నందన్ ఉన్ని, తన్వీ వినోద్, మితున్ వెంపలక్కల్, ప్రీతీ జినో, నజ్రిన్ నజీర్ ముఖ్యపాత్రలు పోషించిన చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను విష్ణు చంద్రన్ నిర్వర్తించారు. విపిన్రాజ్ చాయాగ్రహణం, శ్యామ్మోహన్ ఎం సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఈనెల 13న తెరపైకి రానుంది. కాగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన హిస్టారికల్ హర్రర్ కథా చిత్రమని చెప్పారు. 6 రోజుల్లో జరిగే ఈ చిత్ర కథ ఇన్సిడియల్, ఈవిల్ డెత్ వంటి హర్రర్ చిత్రాల తరహాలో సాగే ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగించే చిత్రంగా ఉంటుందన్నారు. సాధారణంగా ఇలాంటి హారర్ కథా చిత్రాల షూటింగ్ సమయంలో పలు అమానుష సంఘటనలు జరిగినట్లు వింటుంటామన్నారు. అయితే ఆ చిత్ర కథను రాయడం ప్రారంభించినప్పుడే పలు రకాల ఆటంకాలను ఎదుర్కొన్నానని చెప్పారు. వాటిని అధిగమించి షూటింగ్కు సిద్ధమయ్యామని చెప్పారు. ఈ చిత్రంలో ఎలీషా కథా పాత్ర చాలా ముఖ్యమైనదని, ఈ పాత్రను చిత్రీకరిస్తున్నప్పుడు బలమైన గాలీవాన వచ్చిందన్నారు. నిజంగానే తాము ఆ సన్నివేశాలను రెయిన్ ఎఫెక్ట్లో చిత్రీకరించాలని భావించామని, అయితే బడ్జెట్ అధికం అవుతుందని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నామని తెలిపారు. కేరళలో షూటింగ్ను నిర్వహించి పూర్తిచేసినట్లు చెప్పారు. ఈ నెల 13న తెరపైకి రానున్న హోలోకాస్ట్ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు పేర్కొన్నారు. -
మదురై వేదికగా అమిత్షా వ్యూహం
సాక్షి, చైన్నె: మదురై వేదికగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. ఆదివారం జరిగే బీజేపీ సెంట్రల్ కమిటీ భేటీకి హాజరు కానున్నారు. సాయంత్రం ఒత్తకడైలో జరిగే బహిరంగసభకు హాజరవుతారు. ముందుగా పలు పార్టీల నేతలు అమిత్షాను కలిసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఫిబ్రవరి, మార్చి నెలలో అమిత్షా రాష్ట్ర పర్యటనకు అధికారిక కార్యక్రమాల నిమిత్తం హాజరయ్యారు. ఏప్రిల్లో చైన్నెకు వచ్చిన ఆయన తన వ్యూహాలకు పదునుపెట్టి అన్నాడీఎంకేను దారిలోకి తెచ్చుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలో కూటమి అని ప్రకటించి వెళ్లారు. నెలన్నర తర్వాత మళ్లీ రాష్ట్ర పర్యటనకు అమిత్షా వచ్చారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి మదురైకు వచ్చిన ఆయనకు పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. పలు పార్టీలకు ఆహ్వానం మదురై నుంచి రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేసే విధంగా ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈనెల 22న మురుగన్ భక్తుల మహానాడుకు చర్యలు తీసుకున్నారు. ఇది కాస్త చర్చకు దారి తీసిన నేపథ్యంలో శనివారం కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ స్పందిస్తూ, ఇది బీజేపీ , సంఘ్ పరివార్ కార్యక్రమం కాదు అని, భక్తుల కార్యక్రమం అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో తాజాగా అమిత్షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం మదురైలో బీజేపీ సెంట్రల్ కమిటీలోని ప్రతినిధులు, పార్టీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, ఇతర నేతలు పొన్ రాధాకృష్ణన్, రాజా, కర్పు మురుగానందనం, చక్రవర్తి, వానతీశ్రీనివాసన్, తమిళిసై సౌందరరాజన్ సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ బలోపేతం, పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాలు, అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కమిటీకి అమిత్షా వివరించనున్నారు. సాయంత్రం ఒత్తకడైలో జరిగే బహిరంగ సభ వేదిక నుంచి కేడర్ను పలకరించనున్నారు. అంతకుముందుగా అమిత్షాను ఎన్డీఏ కూటమిలో ఇదివరకు ఉన్న పలు పార్టీలకు చెందిన నాయకులు కలిసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. అన్నాడీఎంకే , బీజేపీ కూటమి ఏర్పడినానంతరం జరగనున్న తొలి బహిరంగసభ కావడంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత పళణిస్వామితో పాటు ముఖ్యనేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో ఎన్డీఏ కూటమిలో లోక్ సభ ఎన్నికల్లో కొనసాగిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ను అమిత్షాతో భేటీ కానున్నారా అని ప్రశ్నించగా ఏమి చేయాలో తెలియడం లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసును కదిలించగా, ఆలోచనేలేదని, తమకు ఎలాంటి ఆహ్వానం లేదని స్పష్టం చేశారు. నేడు బీజేపీ సెంట్రల్ కమిటీ భేటీ బహిరంగసభకు ఏర్పాట్లు కూటమి పార్టీల నేతల భేటీకి చర్యలు -
రచయితలను ప్రభుత్వం ప్రోత్సహించాలి
వేలూరు: కొత్త పుస్తకాలు రచించే రచయితలను, కవులను ప్రభుత్వం ప్రొత్సహించాలని కవి లక్ష్మిపతి అన్నారు. వేలూరులోని ప్రయివేటు మండపంలో టీచర్ జోసఫ్ అన్నయ్య రచించిన శ్రీనేటి విద్యా విధానంలో మార్పుశ్రీ అనే అంశంపై రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించి కొనుగోలు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి వ్యక్తి చేతిలో సెల్ఫోన్ ఉండడం వల్ల ఎవరూ పుస్తకాలు చదవడానికి ఆశక్తి చూపడం లేదన్నారు. మన రాష్ట్రంలోనే అనేక మంది కవులు, రచయితలు ఉన్నప్పటికీ వారి రాసే పుస్తకాలు, కవితలు బయట ప్రపంచానికి తెలియడం లేదన్నారు. తరచూ సెల్ఫోన్లో ఇమిడి ఉండడం వల్ల పుస్తకాలు చదివే వారి సంఖ్య పూర్గి తగ్గి పోయిందన్నారు. అదేవిధంగా గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదివే వారు కూడా కనుమరుగు అయ్యారన్నారు. దీంతోనే రచయితలకు తగిన గుర్తింపు రావడం లేదని చెప్పారు. రచయితలు, కవులను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోటరీ క్లబ్ గవర్నర్ పాండియన్, లైబ్రరియన్ రవి, రచయితలు పన్నీర్సెల్వం,జయపాల్, శ్రీధర్, రాజన్బాబు, తమిళనాడు ప్రాథమిక పాఠశాల టీచర్ల కూటమి ఆర్గనైజర్ మణిమేగలై పాల్గొన్నారు. -
ముస్తాబు
బక్రీద్● నేడు పండుగ ● మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు ● ముస్లీంలకు నేతల శుభాకాంక్షలు నేడు బక్రీద్ నేతల శుభాకాంక్షలు దిండుగల్ మసీదు మదురై మసీదు సాక్షి, చైన్నె: త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శనివారం జరుపుకునేందుకు రాష్ట్రంలోని ముస్లింలు సిద్ధమయ్యారు. ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు, ఈద్గా మైదానాలు సిద్ధమయ్యాయి. బక్రీద్ పురస్కరించుకుని ముస్లింలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి శుభాకాంక్షలు తెలిపారు. భక్తిభావం మిన్నంటే పండుగ ‘రంజాన్’ అనంతరం ముస్లింలు జరుపుకునే మరో పండుగ బక్రీద్. ఈ పండుగను ఈదుల్ జుహా, ఈదుజ్జుహా అని కూడా పిలుస్తారు. దైవ ప్రవక్తల్లో ఒకరైన హజ్రత్ ఇబ్రాహీం త్యాగాన్ని స్మరిస్తూ ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ మాసంలోనే ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తారు. బక్రీద్ పర్వదినాన మక్కాలో నమాజు చేయడానికి అత్యధికులు ఇష్టపడతారు. ఈ ప్రార్థన కోసం ఇప్పటి నుంచే రాష్ట్రం నుంచి హజ్ కమిటీ ద్వారా పలు బృందాలు చైన్నె నుంచి హజ్ యాత్రకు వెళ్లాయి. బక్రీద్ పర్వదినాన ప్రార్థనే కాదు, ఖుర్బానీ ఇవ్వడం అత్యంత ముఖ్య ఘట్టం. ఖుర్బానీ ఇచ్చిన గొర్రె మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి కుటుంబీకులు, బంధుమిత్రులు, పేదలకు పంచి పెట్టనున్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లింలకు రాజకీయ పక్షాల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలుపుతూ, త్యాగాన్ని చాటే విధంగా బక్రీద్ను జరుపుకునే ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇస్లాం మతంలో రెండు ప్రధాన పండుగల్లో బక్రీద్ కూడా ఒకటి అని గుర్తుచేస్తూ, ముస్లింలకు ద్రావిడ మోడల్ ప్రభుత్వ సహకారం, సేవలు, పథకాలను గుర్తుచేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వం, తమిళగ వెట్రి కళగంనేత విజయ్, డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, మనిద నేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. శనివారం బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రదేశాల్లో శుక్రవారం నుంచే సందడి వాతావరణం నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగే జుమా నమాజు అనంతరం బక్రీద్ పండుగ ఏర్పాట్లపై ముస్లింలు దృష్టిపెట్టారు. కొత్త బట్టల కొనుగోళ్లను ఇప్పటికే పూర్తిచేశారు. ఖుర్బానీకి గొర్రెల్ని సిద్ధం చేశారు. పండుగ రోజున ప్రత్యేక ప్రార్థనల కోసం టోపీలు, అత్తరు, బిర్యానీ, తీపి పదార్థాల తయారీకి ఉపయోగించే వస్తువుల కొనుగోళ్ల నిమిత్తం షాపింగ్ సెంటర్లకు తరలివచ్చారు. అలాగే, బక్రీద్ ప్రార్థనలకు రాష్ట్రంలోని మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఉదయం ఏడున్నర గంటలు, ఎనిమిది గంటలకు, మరికొన్ని చోట్ల ఎనిమిదిన్నర, తొమ్మిది గంటలకు ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు జరిగాయి. ఖుర్బాని నిమిత్తం గొర్రెలు, మేకల వ్యాపారం ఈసారి కూడా కోట్లలో జరిగింది. ఒక్కో మేక, గొర్రె ధర రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు పలికింది. తమ స్థోమతకు తగ్గట్టుగా మేకలు, గొర్రెలను కొనుగోలు చేసిన వారు కొందరు అయితే, మరి కొందరు కలిసికట్టుగా తలా కొంత మొత్తాన్ని చెల్లించుకుని ఉమ్మడి ఖుర్బానికి ఏర్పాట్లు చేసుకున్నారు. న్యూస్రీల్ -
జమాబందీలో 1,225 వినతులు
● 190 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ తిరువళ్లూరు: తిరువళ్లూరు తాలుకా పరిధిలో 16 రోజులపాటు నిర్వహించిన జమాబందీలో 1,225 వినతులు వచ్చాయి. వాటిలో 190 మంది అర్హులను గుర్తించి వారికి పట్టాలను పంపిణీ చేశారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా జమాబఽందీ ప్రారంభమైంది. తిరువళ్లూరు తాలుకా పరిధిలో నిర్వహించిన జమాబందీలో డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ హాజరై వినతులను స్వీకరించారు. మొత్తం 16 రోజలుపాటు నిర్వహించిన జమాబందీలో 1,225 వినతులు రాగా వాటిలో 270 వినతులకు పరిస్కారం చూపారు. చివరి రోజైన శుక్రవారం లబ్ధిదారులకు పట్టాలు అందజేసే కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, కృష్ణస్వామి హాజరై సహాయకాలను పంపిణీ చేశారు. తహసీల్దార్ రజనీకాంత్, స్పెషల్ తహసీల్దార్ పరమశివం, డిప్యూటీ తహసీల్దారులు కలైసెల్వి, దినేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉదయకుమార్, సుకన్య, పొన్మలర్ గ్రామ నిర్వాహణ అధికారులు భారతి, కృష్ణన్, కుమరన్ సర్వేయర్ హెడ్ ధనశేఖర్, డీఎంకే నేతలు పొన్పాండ్యన్, నేతాజీ, ఎత్తిరాజ్ పాల్గొన్నారు. -
● నామినేషన్ల దాఖలు ● ఏకగ్రీవమైనట్టే
పళణిస్వామి సమక్షంలో నామినేషన్ దాఖలు చేస్తున్న ధనపాల్ సీఎం స్టాలిన్, ఎంపీ కనిమొళితో కలిసి నామినేషన్ వేస్తున్న సల్మా సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధితో కలిసి నామినేషన్ దాఖలు చేస్తున్న కమలహాసన్ సాక్షి, చైన్నె: రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఆరుగురు అడుగు పెట్టనున్నారు. ఇందులో ఐదుగురు కొత్త వారు కావడం విశేషం. డీఎంకే, అన్నాడీఎంకేకు చెందిన ఈ అభ్యర్థులు శుక్రవారం తమ నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం స్టాలిన్ సమక్షంలో మక్కల్ నీది మయ్యం నేత కమల హాసన్ నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రానికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం జూలైలో ముగియనున్న విషయం తెలిసిందే. వీరిలో డీఎంకేకు చెందిన విల్సన్, అబ్దుల్లా, షణ్ముగం, ఈ కూటమిలోని ఎండీఎంకేకు చెందిన వైగో ఉన్నారు. అలాగే, అన్నాడీఎంకేకు చెందిన చంద్రశేఖరన్, గతంలో ఈ కూటమి ద్వారా సీటు దక్కించుకున్న పీఎంకే చెందిన అన్బుమణి ఉన్నారు. ఈ ఆరు స్థానాల్లో ఎమ్మెల్యేల సంఖ్యా బలం మేరకు డీఎంకే కూటమికి నాలుగు, అన్నాడీఎంకేకు రెండు దక్కినట్లైంది. ఈ పదవుల భర్తీకి నామినేసన్ల ప్రక్రియ 2వ తేదీ నుంచి ఈనెల 9వ తేదీ వరకు జరగనుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమితులైన అసెంబ్లీ అదనపు కార్యదర్శి బి. సుబ్రమణియన్కు ఆశావహులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నికల వీరుడు పద్మరాజన్సహా పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. అయితే, వీరికి ఎమ్మెల్యేల ప్రతిపాదన మద్దతు లేని దృష్ట్యా, తిరస్కరణకు గురి కావడం తథ్యం. అసెంబ్లీ ఆవరరణలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది. ఆరుగురు ఏకగ్రీవం ఆరు స్థానాల్లో నాలుగు డీఎంకే ఖాతాలోకి, రెండు అన్నాడీఎంకే ఖాతాలోకి చేరిన విషయం తెలిసిందే. డీఎంకే తరపున సీనియర్ న్యాయవాది విల్సన్కు మళ్లీ అవకాశం కల్పించారు. ఇక, మాజీ ఎమ్మెల్యే సేలంకు చెందిన ఎస్ఆర్ శివలింగం, మహిళా రచయిత సల్మాను రాజ్యసభ అభ్యర్థులుగా డీఎంకే ఎంపిక చేసింది. అలాగే, తమ కూటమిలోకి మక్కల్ నీది మయ్యం కట్చి నేత కమల్కు అవకాశం కల్పించడంతో ఆయన కూడా తొలిసారిగా రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నలుగురు అభ్యర్థులు శుక్రవారం తమ నామినేషన్లను ఎన్నికల అధికారికి సమర్పించారు. సీఎం స్టాలిన్ సమక్షంలో వీరంతా నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి, డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ నేత సెల్వ పెరుంతొగై, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావలవన్, సీపీఎం నేత షణ్ముగం, మనిదనేయమక్కల్ కట్చి నేత జవహరుల్లా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తరఫున మాజీ ఎమ్మెల్యే అబూబక్కర్, డీఎంకే ఎంపీ, కోశాధికారి టీఆర్ బాలు, మంత్రి ఏవీ వేలు హాజరయ్యారు. ఇక, అన్నాడీఎంకే అభ్యర్థులుగా ఎంపికై న మాజీ ఎమ్మెల్యేలు ఇన్బదురై, ఎం.ధనపాల్ సైతం కొత్త ముఖాలే. పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి సమక్షంలో ఈ ఇద్దరు తమ నామినేషన్లు ఎన్నికల అధికారికి అందజేశారు. కార్యక్రమానికి అన్నాడీఎంకే నేతలు కేపీ మునుస్వామి, దిండిగల్ శ్రీనివాసన్, ఎస్పీ వేలుమణి, సెంగోట్టయన్, నత్తం విశ్వనాథన్ హాజరయ్యారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు చెందిన ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ పత్రాలతోపాటు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు ప్రమాణ పత్రాన్ని సమర్పించారు. ఈ ఆరుగురికి మాత్రమే ఎమ్మెల్యేల మద్దతు ఉన్న దృష్ట్యా, వీరంతా ఏకగ్రీవంగా ఎంపికయ్యే అకకాశాలు ఎక్కువే. శని, ఆదివారాలు సెలవు తర్వాత సోమవారం నామినేషన్లకు చివరి రోజు. ఈనెల 12న ఉప సంహరణ ప్రక్రియ ముగియనుంది. అదే రోజున ఏకగ్రీవ ఎంపిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. రాజ్యసభకు ఆరుగురు! -
త్వరలో అన్నీ సర్దుకుంటాయి!
సాక్షి, చైన్నె: పీఎంకేలో నెలకొన్న పరిణామాలన్నీ త్వరలో సర్దుకుంటాయని ఆపార్టీ గౌరవాధ్యక్షుడు జీకే మణి అన్నారు. రాందాసును అన్బుమణి కలవడం శుభ పరిణామం అని వ్యాఖ్యానించారు. పీఎంకేలో నెలకొన్న అధికార సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గురువారం తైలాపురం గెస్ట్హౌస్లో పార్టీ వ్యవస్థాపకుడు, తండ్రి రాందాసును అన్బుమణి రాందాసు కలిసి వెళ్లారు. అయితే, అధ్యక్ష పదవిని వదలుకునే పరిస్థితుల్లో అన్బుమణి లేదన్నట్టు తెలిసింది. ఈవిషయంలోనే పార్టీలో వివాదం జరుగుతోంది. అదే సమయంలో రాందాసు సైతం మెట్టు దిగకపోవడంతో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని కేడర్ ఎదురుచూస్తోంది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం పార్టీ ముఖ్యనేత, కేంద్ర మాజీ మంత్రి ఏవీ వేలుతో పాటు పలువురు నేతలు రాందాసుతో భేటీ అయ్యారు. సీనియర్లు అందరూ రాందాసును కలిసి వెళ్తుండడంతో త్వరలో కీలక ప్రకటన వెలువడవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో శుక్రవారం రాందాసును కలిసేందుకు వచ్చిన జీకే మణి మీడియాతో మాట్లాడుతూ త్వరలో అన్నీ సర్దుకుంటాయని స్పష్టం చేశారు. రాందాసును అన్బుమణి కలవడం శుభపరిణామమని త్వరలో మంచి నిర్ణయం వెలువడుతుందని వ్యాఖ్యానించారు. అదేసమయంలో ఈనెల 8న మదురైకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్షాను రాందాసు, అన్బుమణి కలుస్తారా అనే చర్చ పీఎంకేలో ఊపందుకుంది. -
పునర్విభజనను వ్యతిరేకిస్తాం
సాక్షి,చైన్నె: రాష్ట్రంలోని నియోజకవర్గాల సంఖ్య మీద ప్రభావం పడే విధంగా ఉంటే లోక్సభ పునర్విభజన ప్రక్రియను వ్యతిరేకించేందుకు సిద్ధమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి అన్నారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం కుట్రలు చేస్తున్నట్టు, ఈ కారణంగా రాష్ట్రంలో అనేక స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉందని డీఎంకే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకే ఈ వ్యవహారంలో మౌనం వహిస్తుండడాన్ని సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంటే మౌన మేళ అంటూ ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చే విధంగా శుక్రవారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి స్పందించారు. నియోజకవర్గ పునర్విభజనలో తమిళనాడు హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఒక వేళ తమిళనాడుకు ఏదేని తీవ్ర అన్యాయం జరుగుతున్నట్టు వెలుగులోకి వస్తే, వ్యతిరేకించే వారిలో తొలివ్యక్తిగా తాను ఉంటానని స్పష్టం చేశారు. తమకు కూటమితో సంబంధం లేదని, తమిళనాడు ప్రయోజనాలు ముఖ్యమని పేర్కొంటూ, స్టాలిన్ పేర్కొంటున్నట్టుగా ఇక్కడ ఎలాంటి ప్రక్రియ ఇంతవరకు మొదలు కాక పోవడం ఆలోచించ తగ్గ విషయంగా పేర్కొన్నారు. అదిగో పులి..ఇదిగో పులి అని స్టాలిన్ రాజకీయ స్వలాభం కోసం పునర్విభజనను ప్రస్తుతం చేతిలోకి తీసుకున్నారని, తమిళనాడులో లోక్సభ నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ, హిందీ వ్యవహారంలో తాము స్పష్టమైన అభిప్రాయంతోనే ఉన్నామని అన్నారు. -
క్లుప్తంగా
విద్యార్థుల పాత్ర కీలకం ● ఆవడి పోలీస్ కమిషనర్ శంకర్ కొరుక్కుపేట: మత్తు పదార్థాల నిర్మూలనలో విద్యార్థుల ప్రాత కీలకమని ఆవడి పోలీస్ కమిషనర్ కే శంకర్ అన్నారు. చైన్నె పట్టాభిరామ్లోని డీఆర్బీసీసీసీ హిందూ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా చేరిన విద్యార్థులకు ఉన్నత విద్య గురించి అవగాహన కల్పించడానికి నిర్వహించే విద్యార్థి అవగాహన కార్యక్రమంలో శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పలు సూచనలు చేశారు. సోషల్ మీడియాలో మీ సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. కళాశాల సంచాలకులు డాక్టర్ ఎన్, రాజేంద్రనాయుడు అతిథిని ఘనంగా సత్కరించారు. రైతులకు సాంకేతిక తోడ్పాటు సాక్షి, చైన్నె: రైతులకు ఉత్పాదకత, శ్రేయస్సు లక్ష్యంగా తర్వాత తరం సాంకేతికతను ముందుకు తీసుకొచ్చేందుకు మరింత శక్తివంతంగా ముందుకెళ్లనున్నామని ఇంటర్నేషనల్ ట్రాక్టర్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ తెలిపారు. 2026 ఆర్థిక సంవత్సర ప్రయాణంలో మే నెలలో 14,213 సోనాలిక ట్రాక్టర్ల అమ్మకాలతో తాము నమోదు చేసిన కొత్త మైలురాయి గురించి శుక్రవారం స్థానికంగా ఆయన ప్రకటించారు. రైతులకు అద్భుత ఫలితాలను అందించే విధంగా ఆవిష్కరణలు జరుగుతున్నాయని వివరించారు. రైతుల కోసం సోనాలికా జూన్ డబుల్ జాక్పాట్ ఆఫర్ను ప్రకటించామన్నారు. కోవైలో అరుదైన శస్త్రచికిత్స సాక్షి, చైన్నె: బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన మూత్ర పిండాలను 44 ఏళ్ల వ్యక్తికి అరుదైన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సను కోయంబత్తూరు వైద్యులు విజయవంతం చేశారు. కోయంబత్తూరులోని ఎఫ్ఐఎంఎస్ ఆస్పత్రి ఐఓఆర్టీఏ విభాగంలో జరిగిన ఈ శస్త్ర చికిత్స గురించి శుక్రవారం స్థానికంగా మీడియాకు డాక్టర్ ప్రభుకాంచి వివరించారు. వివేక్ అనే 44 ఏళ్ల రోగి మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతూ 2023 నుంచి డయాలసిస్ చేయించుకుంటూ వచ్చారని వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన మరింత సంక్లిష్ట పరిస్థితులు నెలకొనడంతో అవయవ మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యమైనట్టు పేర్కొన్నారు. అవయవ మార్పిడి కోసం గత నెల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 43 ఏళ్ల వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలను యాక్సెస్ చేయడం, శస్త్ర చికిత్స చేయడం, పునరుజ్జీవం పోయడం అంశాలు చక చకా జరిగినట్టు వివరించారు. శస్త్ర చికిత్సతో రోగి కోలుకున్నట్టు తెలిపారు. ప్రతిభావంతులకు స్కాలర్ షిప్లు సాక్షి, చైన్నె: ప్రతిభావంతులైన విద్యార్థులకు అబండెన్స్ విద్య కోసం స్కాలర్ షిప్లను పొందే అవకాశాన్ని ఎట్ సన్ రైస్ గ్లోబల్ చెఫ్ అకాడమీ కల్పించింది. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఎట్ సన్ రైస్ గ్లోబల్ చెఫ్ అకాడమీ సెలబ్రిటీ చెఫ్ రాజు కార్తికేయన్, ప్రాంతీయ మేనేజర్ వినయ్ జామి, డైరెక్టర్ ఆఫ్ రిక్రూట్మెంట్ సుమన్ సుబ్బయ్యన్, వ్యవస్థాపకురాలు ఎర్లిండే కాస్ట్రోటనేడో స్థానికంగా ప్రకటించారు. బ్రాండ్ విజిబిలిటీ, ఔట్రీచ్ను బలపేతంచేసే లక్ష్యంగా స్కాలర్ సిఫ్ టెస్ట్ను నిర్వహించనున్నామని వివరించారు. ప్రతిభావంతు లైన విద్యార్థులకు అబండైన్స్ విద్యకోసం ఈ సాల్కర్ షిప్లు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. జూలై 2025 ఇన్టేక్ కోసం స్కాలర్షిప్లు లభించనున్నాయని తెలిపారు. నైల్లెలో ఇరువర్గాల ఘర్షణ ● 13 మందికి కత్తిపోట్లు తిరువొత్తియూరు: నైల్లెలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. 13 మంది కత్తిపోట్లకు గురయ్యారు. నైల్లె టౌన్, పేట్టై చేరన్మహాదేవి రోడ్డులో రైల్వేగేట్ ప్రాంతంలో సుగాలీ కాలనీ ఉంది. ఇక్కడ వందకు పైగా సుగాలీలు నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో గురువారం రాత్రి అక్కడ నివసించే భాగ్యరాజ్ కుమారుడు ఆది (21) బైక్లో వేగంగా వెళ్లాడు. ఇది చూసిన అదే ప్రాంతానికి చెందిన మాయ (22) అతన్ని ఆపి మందలించాడు. ఆసమయంలో అక్కడ ఉన్న వారు ఇరువర్గాలగా ఏర్పడి ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు కొడవళ్లు, కట్టెలు వంటి ఆయుధాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో 13 మంది గాయపడ్డారు. గాయపడ్డ అందరినీ నైల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తుండు బీడీలో దక్షణ్ విజయ్
తమిళసినిమా: కథ, కథనాలు కొత్తగా ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఈ చిత్రాలను ఆదరిస్తారు. అలాంటి కథతో తెరకెక్కిన తాజా చిత్రం తుండు బీడీ. ఈ టైటిల్ చూడగానే ఆసక్తిని రేకెత్తిస్తోంది కదూ. చిత్రం కూడా కొత్తగా ఉంటుందని నిర్మాత సి.బ్యూలామగిళ్ అంటున్నారు. ఈయన మగిళ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో దక్షణ్ విజయ్ కథానాయకుడిగా నటించారు. ఈయన ఇంతకుముందు కబాలీకరమ్, ఐ యామ్ వెయిటింగ్, మలయాళంలో ఇత్తికార కొంబన్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. నటుడు తలైవాసల్ విజయ్, సాయి దీనా, వనిత, వేల రామమూర్తి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ మాదక ద్రవ్యాలు విక్రయించే ఒక వ్యక్తి వల్ల బాధింపునకు గురైన ఇద్దరు యువకులు అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారని, వారి ప్రయత్నంలో విజయం సాధించారా లేదా అనే పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం తుండుబీడీ అని చెప్పారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు థ్రిల్లింగ్గా ఉంటాయని తెలిపారు. చిత్రం ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందన్నారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈచిత్రానికి ఆర్.ప్రదీప్ చాయాగ్రహణం, సంజీవ్నాయుడు సంగీతాన్ని అందించినట్లు పేర్కొన్నారు. దక్షణ్ విజయ్ రంభ -
విద్యా ఉపకరణాల పంపిణీ
తిరువళ్లూరు: తిరునిండ్రవూర్ సమీపం కసువ గ్రామంలోని సేవాలయ విద్యాసంస్థలో చదువుతున్న 2,200 మంది విద్యార్థులకు విద్యా ఉపకరణాలను ఉచితంగా రిటైర్డ్ న్యాయమూర్తి పీఎన్. ప్రకాష్ అందజేశారు. తిరువళ్లూరు జిల్లా కసువ గ్రామంలో సేవాలయ స్వచ్ఛంద సంస్థ వుంది. సంస్థలో రెండు వేలకు పైగా విద్యార్థులకు ఉచితంగా విద్యను గత 35 సంవత్సరాలుగా అందిస్తున్నారు. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సేవాలయ సంస్థలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, బ్యాగుతో పాటు ఇతర ఉపకరణాలను ఉచితంగా అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది పాఠశాలలోని 2,200 మందికి ఉచిత విద్యా ఉపకరణాలను అందజేసే కార్యక్రమం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మురళీధరన్ శుక్రవారం ఉదయం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రకాష్ హాజరై ఉపకరణాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ సేవాలయంలోని విద్యార్థులకు తమ వంతు సహకారాన్ని అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ఆలయానికి వచ్చినట్టు సంతృప్తి కలుగుతుందని తెలియజేశారు. విద్యార్థులకు సేవ చేయడం ఆత్మసంతృప్తిని కలిగిస్తుందన్నారు. సేవాలయంలోని ఉపాధ్యాయులు సేవాభావంతో పనిచేయాలని సూచించారు. అబ్దుల్కలాం ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు ఉన్నత స్థితికి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేవాలయ ట్రస్టీలు అమిత్చంద్జైన్, అన్నపూర్ణ, కింగ్స్టన్ తదితరులు పాల్గొన్నారు. -
మత్తు రహితంగా తీర్చిదిద్దాలి
వేలూరు: యువతతోపాటు విద్యార్థులు మత్తుకు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మత్తుకు దూరంగా ఉండడంతపై అవగాహన, విద్యార్థులతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని యువత అధిక భాగం మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నార ని వాటి నుంచి బయట పడాలన్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోని యువకులే అధికంగా మత్తుకు బానిసలవుతున్నారన్నారు. ఒకసారి మత్తు పదార్థాలను వాడడంతో తరచూ వాడాలనిపిస్తుందని, వాటికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలన్నారు. మత్తుకు యువత బాని స కాకుండా ఉండేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వేలూరు కార్పొరేషన్లోని అన్ని వార్డుల్లో మత్తు పదార్థాలను విక్రయించకూడదని, ఇప్పటికే అన్ని దుకాణాలకు, గోడౌన్ యజమానుల కు జిల్లా యంత్రాంగం నోటీసులు జారీ చేసిందదన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు తదితర 234 పాఠశాలల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ సీఈఓ దయాళన్, విద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు. -
కార్పొరేషన్ పాఠశాలల అభివృద్ధికి చర్యలు
వేలూరు: వేలూరు కార్పొరేషన్లోని పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కార్తికేయన్ అన్నారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలోని మకాన్ వద్ద ఉన్న అంబేడ్కర్ నగర్లోని కార్పొరేషన్ పాఠశాలలో అదనపు గదులను ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్లోని అన్ని పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అదే విధంగా ఇప్పటికే పలు పాఠశాలల్లో అదనపు గదులు అవసరమని తమ దృష్టికి తీసుకొచ్చారని వీటిపై ప్రత్యేక నిధులు కేటాయించి నిర్మిస్తామన్నారు. అదే విధంగా పాఠశాలలకు తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ విద్యావేత్తలు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత, కార్పొరేటర్ కాంచన క్రిష్ణమూర్తి, మాజీ కార్పొరేటర్ దురై అరసన్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. -
తిరుత్తణి ఆలయంలో పెళ్లి సందడి
తిరుత్తణి: శుభ ముహూర్త దినం సందర్భంగా తిరుత్తణి కొండ ఆలయంలో శుక్రవారం సందడి నెలకొంది. వైశాఖ మాసంలో శుభ ముహూర్త దినం సందర్భంగా శుక్రవారం తిరుత్తణి కొండ ఆలయంలో 72 జంటలకు వివాహాలు నిర్వహించారు. ఇందుకోసం వధూవరుల బంధువులు, కుటుంబీకులు గురువారం రాత్రి తిరుత్తణి కొండ ఆలయం చేరుకున్నారు. శుక్రవారం వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు కొండ ఆలయంలో కల్యాణ మండపాలు, ఆలయ ఆర్సీ మండపంలో వరుస క్రమంలో వివాహాలు జరిగాయి. దీంతో మంగళ వాయి ద్యాలు, వధూవరుల సందడి నెలకొంది. వివాహం పూర్తి చేసుకున్న చేతులతో వధూవరులు నేరుగా స్వామి దర్శనానికి వెళ్లారు. అలాగే వారి బంధువులు, వివాహానికి హాజరైన వారు స్వామి దర్శనం కోసం క్యూలైన్లో రెండు గంటలపాటు వేచివుండి దర్శనం పొందారు,. వివాహాల సందర్భంగా కొండ ఆలయం కిటకిటలాడింది. వాహనాలు పోటెత్తడంతో కొండ ఆలయ ఘాట్రోడ్డులో ట్రాఫిక్ సమ స్య తలెత్తింది. పోలీసులు పరిస్థితి చక్కదిద్దారు. -
లక్ష్మీ మూవీ మేకర్స్ చిత్రం ప్రారంభం
తమిళసినిమా: ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ తాజాగా తన 27వ చిత్రాన్ని పూజాకార్యక్రమాలతో ప్రారంభించింది. హాస్య నటుడు పుగళ్ కథానాయకుడిగా, రవిమరియ ప్రతినాయకుడిగానూ నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజ్ఞానయన్ నాయకిగా పరిచయం అవుతున్నారు. విన్సెంట్ అశోకన్, కుంకీ అశ్విన్, దిడియన్ ఇందిరన్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను సజో సుందర్ నిర్వహిస్తున్నారు. ఎం.శ్రీవత్సన్, ఎం.గోకుల్కృష్ణన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీకే.మురుగేశన్, తిరుపూర్ జియో.ఏ, ఎన్.సెల్వరాజ్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యూకే.సెంథిల్కుమార్ చాయాగ్రహణం, సుభాష్ మునిరత్నం సంగీతాన్ని అందిస్తున్నారు. శుక్రవారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ముహూర్తం షాట్కు నిర్మాత, నటుడు చిత్రాలక్ష్మణన్ క్లాప్ కొట్టగా, నిర్మాత హెచ్.మురళి, చాయాగ్రాహకుడు శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇది వినోదంతో కూడిన థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్ర షూటింగ్ నేటి నుంచి జరుగుతుందని ఆయన తెలిపారు. -
ఫుడ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
తిరుత్తణి: తిరుత్తణిలోని దుకాణాల్లో ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్లు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నాణ్యత లోపించిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని నాశనం చేశారు. ఆధ్యాత్మిక పట్టణం తిరుత్తణికి ప్రతిరోజూ వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రయాణికులు వస్తుంటారు. భక్తులు, ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని హోటళ్లు, టీ దుకాణాలు, పండ్లు, సహా ఇతర ఆహార వస్తువుల దుకాణాల్లో నాణ్యత లోపించిన వస్తువులు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులతో జిల్లా కలెక్టర్ ప్రతాప్ ఆదేశాల మేరకు ఫుడ్ కంట్రోల్ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. అధికారి దుర్గాదేవి ఆధ్వర్యంలోని బృందం తిరుత్తణి బస్టాండు, సన్నిధి వీధి, అరక్కోణం రోడ్డు మార్గాల్లోని హోటళ్లు, టీ దుకాణాలు, ఫాస్ట్ఫుడ్ దుకాణాలు, కూల్డ్రింక్స్, పండ్లు దుకాణాల్లో తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా మాంసంలో రసాయనాల మిశ్రమం, ఫాస్ట్ఫుడ్లో రంగులు, కూల్ డ్రింక్స్లో ప్రమాదకరమైన రసాయనాలు కలపినట్లు, టీ పొడి నాణ్యత లేక పోవడం, మందులతో పండ్లు పండించినట్లు గుర్తించారు. దాదాపు పది కేజీల మాంసం, ఫాస్ట్ఫుడ్, పండ్లు స్వాధీనం చేసుకుని నాశనం చేశారు. ఆహారం ఉత్పత్తుల్లో నాణ్యత లోపించడంపై ఫుడ్ కంట్రోల్ నెంబర్ 9444042322లో ఫిర్యాదు చేయాలని కోరారు. -
ఇల్లు కూల్చేస్తారని వ్యక్తి ఆత్మహత్య
● బంధువుల రాస్తారోకో వేలూరు: ఇల్లు కూల్చేస్తారని ఓ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేలూరు సమీపంలోని కొనవట్టంలోని దేవినగర్లో వందకు పైగా కుటుంబాలు నివశిస్తున్నాయి. ప్రస్తుతం సదుప్పేరి చెరువును పర్యాటక స్థలంగా మార్చేందుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో చెరువు కట్ట కింద ఉన్న ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకుని ఉన్న వారిని ఖాళీ చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఆ ప్రాంత ప్రజలు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వినతిలో తాము మూడు తరాలుగా ఈ ప్రాంతంలో నివశిస్తున్నామని తమ ఇళ్లను కూల్చొద్దని తెలిపారు. ఈ నేపథ్యంలో దేవినగర్ ప్రాంతానికి వచ్చిన విద్యుత్ శాఖ అధికారులు ఈనెల 19వ తేదీ నుంచి ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తామని చెప్పి వెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మణి(72)గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిని ఖాళీ చేయించాలని చెప్పడంతోనే మణి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ బందువులు, ఆ ప్రాంత వాసులు మణి మృతదేహాన్ని తీసుకోకుండా రాస్తారోకో చేశారు. విషయం తెలిసి సబ్ కలెక్టర్ సెంథిల్కుమార్, తహసీల్దార్ వడివేల్, టౌన్ డీఎస్పీ పృథ్వీరాజ్, సీఐ శ్రీనివాసన్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింపజేశారు. -
● ఒకరు దుర్మరణం ● మరో ముగ్గురికి తీవ్రగాయాలు
లారీని ఢీకొన్న కారు సేలం: లారీని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ధర్మపురి జిల్లాలో చోటుచేసుకుంది. మలయాళ నటుడు చింతమ్ సాఖో (41) తన కుటుంబంతో కలిసి కేరళలోని కొచ్చిన్ నుంచి శుక్రవారం బెంగళూరుకు కారులో తండ్రి సిబిసాచో (70), తల్లి మరియం కార్లోస (60), సోదరుడు జోకో సాచో (36)తో కలిసి బయలుదేరారు. కేరళలోని త్రిసూర్కు చెందిన అనిస్ (42) కారు నడుపుతున్నాడు. ధర్మపురి జిల్లాలోని పాలకోడ్ సమీపంలోని పరియూర్ జాతీయ రహదారి సమీపంలో వెళుతుండగా కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో సిబిసాచో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ తప్ప మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సిబిసాచో మృతదేహాన్ని శవపరీక్ష కోసం ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మదురై లేదా కన్యాకుమారి నుంచి ప్రజా పయనం
– విజయ్ పరిశీలన సాక్షి, చైన్నె: జూలై మొదటి వారం నుంచి విజయ్ పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. ఆయన తొలి బహిరంగ సభకు వేదికగా మదురై లేదా కన్యాకుమారిని పరిశీలిస్తున్నారు. విజయ్ ప్రజల్లోకి తమిళగ వెట్రి కళగంను విస్తృతంగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. బూత్ కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ వరకు అన్ని ముగించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ తరచూ పార్టీ జిల్లాల కార్యదర్శులతో సమావేశం అవుతూ వస్తున్నారు. ముఖ్య నిర్వాహకులను పిలిపించి సూచనలు ఇస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో విజయ్ బర్త్డే ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా సేవల రూపంలో నిర్వహించేందుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో జూలై మొదటి వారం నుంచి విజయ్ పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారనున్న దృష్ట్యా, ఆయన తొలి పర్యటనకు వేదికగా మదురై లేదా కన్యాకుమారిని ఎంపిక చేసే పనిలో భుస్సీ ఆనంద్ నిమగ్నమయ్యారు. ఇక్కడ జరిగే బహిరంగ సభ అనంతరం విజయ్ ప్రజల్లోకి నియోజకవర్గాల బాట పట్టనున్నారు. ఈ పరిస్థితులలో శుక్రవారం కన్యాకుమారిలో పర్యటించిన భుస్సీ ఆనంద్ వేదిక ఎంపికపై కసరత్తులో నిమగ్నమయ్యారు. శనివారం మదురైలో పర్యటించినానంతరం వేదికను ఖరారు చేయబోతున్నారు. విజయ్ తన బర్త్డే రోజున రాజకీయ కార్యాచరణ, నియోజకవర్గ బాట, ప్రజాక్షేత్ర పర్యటన వివరాలను వెల్లడించే అవకాశాలున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీనికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా విజయ్కు మద్దతుగా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారాన్ని విస్తృతం చేయడానికి నిర్వాహకులు రెడీ అయ్యారు. -
విడాకులు కోర్టులో ఉండగా హీరో పెళ్లి? అసలు విషయమిదే!
కోలీవుడ్ జంట రవి (Jayam Ravi)- ఆర్తి విడాకులు దాదాపు ఖరారైనట్లే! మూడో వ్యక్తి ప్రమేయం వల్లే విడిపోవాల్సి వస్తోందని ఆర్తి భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ మూడో వ్యక్తి మరెవరో కాదని, సింగర్ కెనీషా అన్న ప్రచారం మొదలైంది. రవి.. సింగర్ కెనీషా (Keneeshaa)తో ప్రేమలో ఉన్నాడని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరిద్దరూ పూలదండలతో ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. పూలదండలతో కోలీవుడ్ జంటఇది చూసిన నెటిజన్లు అదేంటి? అప్పుడే వీరి పెళ్లి జరిగిపోయిందా? అని షాకవుతున్నారు. అసలు విషయమేంటంటే.. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న కుండ్రతుర్ మురుగన్ దేవాలయాన్ని రవి, కెనీషా సందర్శించారు. దర్శనం అనంతరం అర్చకులతో కలిసి ఇలా ఫోటో దిగారు. జయం సినిమాతో రవి విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ చిత్రంతోనే అతడు జయం రవిగా స్థిరపడిపోయాడు. కానీ ఇటీవలే తనను జయం రవి అని పిలవొద్దని కేవలం రవి అని మాత్రమే పిలవాలని సూచించాడు. 15 ఏళ్ల బంధానికి ఫుల్స్టాప్!ఇకపోతే ఇతడు నిర్మాత సుజాత విజయకుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో నడుస్తోంది. తనకు భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం కావాలని డిమాండ్ చేస్తోంది.చదవండి: 'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది..: హీరో -
విజయ్
పౌరసత్వం కోసం పోరాడే ఇరవుపరవైకొడుకు విజిత్ బచ్చన్తో తంగర్ బచ్చన్ ఇరవు పరవై చిత్రంలో నటి నందిని తమిళసినిమా: శ్రీలంక తమిళుల ఇతివృతంతో ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. అలా ఇటీవల తెరపైకి వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా అలాంటి నేపథ్యంలో శ్రీలంక శరణార్థులను మరో కోణంలో ఆవిష్కరించిన చిత్రం ఇరవుపరవై. శ్రీలంకకు చెందిన ఒక చిన్న కుటుంబం తండ్రి, ఇద్దరు కూతుళ్లు అక్కడ పేదరికంతో జీవితం గడపలేక అనధికారికంగా తమిళనాడుకు చేరుకుంటారు. అలా ఇద్దరు ఆడపిల్లలతో తమిళనాడులోని కడలూరు ప్రాంతానికి చేరుకున్న వ్యక్తి కన్ను మూస్తాడు. దీంతో ఉన్న ఓకే ఒక్క దిక్కును కోల్పోయిన ఆ ఇద్దరు ఆడపిల్లల జీవితం అనే పడవ ప్రయాణం ఏ తీరం చేరిందీ? వారు మనుగడ కోసం ఎలా ముందడుగు వేశారు? తమలాంటి వారి బతుకులు బాగు పడడానికి పౌరసత్వ హక్కుల కోసం వారు చేసిన పోరాటం ఫలించిందా? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం ఇది. తమిళ్ తిరై చానల్ పతాకంపై వీటీ.రాజా, ఆర్ పాండియన్ కలిసి నిర్మించారు. సత్య, నందిని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నిళల్ గళ్ రవి, శివ, డాక్టర్ ఆర్.పాండిరన్ ,సెల్వకుమారన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. దీనికి కథా, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను వేదాజీ పాండియన్ నిర్వహించారు. శ్రీలంక నుంచి తమిళనాడుకు చేరుకున్న ఒక అబల భారతీయ పౌరసత్వం కోసం పోరాటం చేసి తమిళనాడు ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం అందించి దాన్ని ఎలా సాధించిందన్నదే ఈ చిత్రం కథ అని దర్శకుడు చెప్పారు. దీనికి భగవతీ బావ చాయాగ్రహణంను, ఆల్విన్ కలై భారతి పాటలను, సంగీతం అందించారని చెప్పారు. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను డాక్టర్ ఆర్.పాండియన్ ప్రొడక్షన్స్ సంస్థ పొంది, ఈ నెల 27వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 150కి పైగా తియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ అధినేత ఆర్.పాండియన్ చెప్పారు. తమిళసినిమా: నటుడు విజయ్. ఇక ఈ పేరు సినిమా రంగంలో ట్రెండింగ్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో జననాయకన్ తన చివరి చిత్రమని ఆయనే స్వయంగా ప్రకటించారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి గ్రిప్పింగ్స్ ఇప్పటికే విడుదలై చిత్ర అంచనాలను పెంచేశాయి. కాగా జననాయకన్ చిత్ర టీజర్ను విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 22న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా చిత్ర ఓటీటీ హక్కులను ఒక సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పొంగల్ సందర్భంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా జననాయకన్ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులందరికీ బిరియానీ విందును ఇచ్చిన విజయ్ భావోద్రేకానికి గురైనట్లు సమాచారం. అప్పట్లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఎంజీఆర్ నటించిన చివరి చిత్రం మదురై మీట్ట సుందరపాండియన్. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. జననాయకన్ చిత్రం విజయ్ జీవితాన్ని ఎలా మారుస్తుందో అనే ఆసక్తి ఇరాన్ అభిమానుల్లో నెలకొంది. దీపావళి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నామ్ తమిళసినిమా: చాయాగ్రాహకుడు సినీ పయనాన్ని ప్రారంభించిన తంగర్ బచ్చన్ ఆ తరువాత దర్శకుడిగా, కథానాయకుడిగా పలు చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా తాజాగా ఈయన వారసుడు విజిత్ బచ్చన్ పేరంబుమ్ పేరుంగోపం చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. నటి శాలి వివేకాస్ నాయకిగా నటించిన ఇందులో మైమ్ గోపి, అరుళ్ దాస్, విజయ్ టీవీ దీప, గీత కై లాసం, సుభద్ర రాబర్ట్, ఎల్పీకేఎస్ లోగు, సాయి వినోద్, వలీన, హరిత, భవ చల్ల దురై తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా శివ ప్రకాష్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈయన బాలు మహేంద్ర శిష్యుడు అన్నది గమనార్హం. ఇళయరాజా సంగీతం, జేపీ దినేష్ కుమార్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం 5 ఎంటర్టైన్మెంట్ పతాకంపై కామాక్షి జయకృష్ణన్ నిర్మించారు. కాగా మత విభేదాల నేపథ్యంలో సాగే సామాజిక స్పృహతో రూపొందిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు విజిత్ బచ్చన్ తండ్రి, నటుడు, దర్శకుడు చాయాగ్రాహకుడు, నిర్మాత అయిన తంగర బచ్చన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ‘‘ సినీ రంగ ప్రవేశం చేసిన నేను గత 40 ఏళ్లుగా ఎదురీదుతూనే ఉన్నాను. తమిళ సమాజం గురించిన సాహిత్యం, సినిమా, సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న విషయం మీ అందరికీ తెలిసిందే. పేరంబుమ్ పేరుంగోపం చిత్రం ద్వారా నా వారసుడు విజిత్ బచ్చన్ కథానాయకుడిగా పరిచయం అయ్యారు. బలమైన సందేశంతో కూడిన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రాన్ని గత దీపావళి నుంచి విడుదల చేయడానికి పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యాం. చివరికి ఇప్పుడు విడుదల చేసే అవకాశం కలిగింది. మంచి కథ చిత్రాలను ప్రేక్షకులు విస్మరించరు. ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను’అని తంగర్ బచ్చన్ పేర్కొన్నారు. -
క్లుప్తంగా
17 ఎలక్ట్రిక్ రైళ్ల రద్దు కొరుక్కుపేట: గుమ్మిడిపూండి–కవరపైట్టె మధ్య రైల్వే నిర్వహణ పనులు జరుగుతున్న నేపథ్యంలో గురువారం ఉదయం 9.40 నుంచి ఈనెల 7వ తేదీ వరకు చైన్నె మార్గంలో మొత్తం 17 సబర్బన్ ఎలక్ట్రిక్ రైళ్లను రద్దు చేశారు. అదనంగా, చెంగల్పట్టు–గుమ్మిడిపూండి, గుమ్మిడిపూండి – తాంబరం ఎలక్ట్రిక్ రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేశారు. అలాగే సెంట్రల్ నుంచి పొన్నేరికి ఉదయం 10.30 గంటలకు, సెంట్రల్ నుంచి మీంజూర్కు ఉదయం 11.35 గంటలకు, చైన్నె బీచ్ నుంచి పొన్నేరికి మధ్యాహ్నం 12.40 గంటలకు, పొన్నేరి నుంచి సెంట్రల్కు మధ్యాహ్నం 1.18, మధ్యాహ్నం 3.33 గంటలకు, మీంజూర్ నుంచి సెంట్రల్కు మధ్యాహ్నం 2.59 గంటలకు ప్రత్యేక రైళ్లను నడిపారు. వారం రోజులు ఎలక్ట్రిక్ రైళ్లను రద్దు చేయడంతో, గుమ్మిడిపూండి, మీంజూర్, పొన్నేరి సహా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వారు బస్సు సర్వీసుపై ఆధారపడాల్సి వచ్చింది. దీని కారణంగా బస్సులు రద్దీగా ఉన్నాయి. రౌడీ దారుణ హత్య అన్నానగర్: చైన్నెలో ఓ రౌడీ దారుణ హత్యకు గురయ్యాడు. చైన్నెలోని తిరువొత్తియూర్ నార్త్ రైల్వేరోడ్కు చెందిన జయ కుమారుడు ఆకాష్కుమార్ (22). రౌడీ అయిన ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. బుధవారం రాత్రి జయ ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లింది. ఆ సమయంలో, అక్కడ ఉన్న గుర్తుతెలియని ముగ్గురు జయ ఇంటికి వెళ్లి, అక్కడే తాళం తీసుకొని, తలుపు తెరిచి లోపలకి వెళ్లారు. నిద్రిస్తున్న ఆకాష్కుమార్ను కత్తులతో నరికారు. ఆకాష్కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. దుకాణం నుంచి తిరిగి వచ్చిన తల్లి, తన కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి కేకలు వేసింది. ఆమె కేకలు విని ఇరుగుపొరుగు గుమిగూడారు. సమాచారం అందుకున్న తిరువొత్తియూర్ సీఐ రజనీష్ నేతృత్వంలోని పోలీసులు అక్కడికి వెళ్లి స్థలానికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం చైన్నెలోని ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాలను పరిశీలించి, అదే ప్రాంతం నుంచి ఐదుగురిని విచారణ కోసం పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. నగలు, నగదు అపహరణ కేసులో ముగ్గురి అరెస్టు తిరువొత్తియూరు: అవినాసి సమీపం పెరుమానల్లూరులో యువతి, యువకుడితో ఉల్లాసంగా ఉంటున్నట్లు నటించారు. దీనిని వీడియో తీసి యువకుడిని బెదిరించి నగదు, నగలు అపహరించారు. ఈ కేసులో మహిళతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపూర్ జిల్లా అవినాసి సమీపం పెరుమానల్లూరుకు చెందిన కృతిక (19) ఈరోడ్ జిల్లా అరచలూరు కుమరపాలయానికి చెందిన జగదీష్ (27), ఇతను బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో కృత్తిక అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అతన్ని ఉల్లాసానికి రమ్మని కృత్తిక జగదీష్ను పిలిచింది. దీంతో జగదీష్ పెరుమానల్లూరు వద్ద ఉన్న తట్టాంకోట ప్రాంతంలోకి వచ్చారు. అక్కడ ఒక ఇంట్లో ఇద్దరు ఉల్లాసంగా ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన మరో ఇద్దరు యువకులు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని జగదీష్ను బెదిరించారు. అతడి వద్ద 2 సవర్లు నగలు, నగదు అపహరించారు. జగదీష్ ఈవిషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. ఇందులో ధర్మపురి నగరానికి చెందిన అరుణ్ (33), ఈరోడ్కు చెందిన పళనిస్వామి (51) అనే ఇద్దరు కృతికను జగదీష్తో నటించమని చెప్పి, నగదు అపహరించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అరుణ్, పళనిస్వామి, కృతికను బుధవారం రాత్రి అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు పరిచి జైలులో పెట్టారు. వైభవంగా కుంభాభిషేకం కొరుక్కుపేట: తిరువేర్కాడులోని ఆది కరుమారియమ్మన్ ఆలయ కుంభాభిషేకం గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం కరుమారియమ్మన్కు ప్రత్యేక పూజలు, ప్రత్యేక హోమం, దీపారాధన చేశారు. అనంతరం ఉదయం 10 గంటలకు వేదశివాగమ విద్యాభూషణం స్థానికర్ చంద్రశేఖర శివం ఆధ్వర్యంలో శివాచార్యులు గోపుర కలశంపై పవిత్ర జలం పోసి కుంభాభిషేకం జరిపారు. ఆ సమయంలో భక్తులపై పవిత్ర జలాన్ని చల్లారు. భక్తులకు ఆదికరుమారియమ్మన్ను దర్శనం చేసుకున్నారు. భక్తులకు అన్నదానం చేశారు. కాంగ్రెస్ జిల్లా కమిటీ మాజీ అధ్యక్షుడు లయన్ రమేష్, తిరువేర్కాడు నగర్ మండ్రం ఉపాధ్యక్షుడు ఆనంది రమేష్, డి.జయకుమార్ పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్ శాండీ పి.సెల్వరాజ్, ఎ.కుందబిసురుమయ్యనన్, పి.గోవిందస్వామి, కె.చందూరు, ఎ.ఆర్. బాలసుబ్రమణ్యం, డి. బాబుశేఖర్ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. లారీ ఢీకొని కృష్ణజింక మృతి తిరుత్తణి: లారీ ఢీకొని కృష్ణజింక మృతిచెందిన ఘటన తిరువలంగాడు ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. బుధవారం తిరువళ్లూరు–అరక్కోణం హైరోడ్డుకు సమీపంలోని వ్యాసపురం వద్ద నీటికోసం వచ్చింది. ఈసమయంలో కృష్ణజింకను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందింది. వాహనదారులు ఇచ్చిన సమాచారం మేరకు తిరువలంగాడు పోలీసులు తిరుత్తణి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తిరుత్తణి రేంజర్ విజయసారధి జింక కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం పశుసంర్థక వైద్య కేంద్రానికి తరలించి విచారణ చేస్తున్నారు. -
పుస్తకాల పఠనంపై ఆసక్తి పెరగాలి
సాక్షి, చైన్నె: పుస్తకాలు చదవడంపై ప్రతిఒక్కరిలోనూ ఆసక్తి పెరగాలని వక్తలు వ్యాఖ్యానించారు. రచయిత, నిర్మాత, దర్శకుడు, చిత్ర కారుడు లెస్లీ కార్వాల్హో రాసిన ‘స్మోక్ ఆన్ ది బ్యాక్ వాటర్స్’ నవల విడుదల, విశ్లేషణ కార్యక్రమం స్థానికంగా గురువారం జరిగింది. ప్రముఖ ప్రసార జర్నలిస్ట్ జెన్నిఫర్ అరుల్తో సంభాషణలో పుస్తకం నుంచి కొన్ని భాగాలను ఆంగ్ల సాహిత్యంలో పండితురాలు బ్రిటినీ కేథరిన్ బారెన్ చదవి వినిపించారు. మద్రాస్ బుక్ క్లబ్ సహకారంతో జరిగిన ఈ పుస్తక విశ్లేషణలో రచయిత లెస్లీ కార్వాల్హో బెంగళూరులో పుట్టి పెరిగి కళాశాల జీవితాన్ని ముగించినట్టు తెలిపారు. జర్మనీలో ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడమేకాకుండా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ అభ్యసించారు. విద్యార్ధి దశలో చెరిష్– ఐ అనేక అవార్డును గెలుచుకున్నారు. తొలి ఫీచర్ సినిమాగా ‘ది ఔట్హౌస్’ను రచించి, నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఉత్తమ నూతన దర్శకుడిగా ‘అరవిందన్ పురస్కారం’, ‘ది గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు’ను గెలుచుకున్నట్టు వివరించారు. ‘ఎ ఉమెన్ టూ మెనీ’ అనే లఘు చిత్రానికి రచయితగా నిర్మాతగా, దర్శకుడిగా కూడా వ్యవహరించిన రచయిత పలు పుస్తకాలను రూపొందించి ప్రస్తుతం ‘స్మోక్ ఆన్ ది బ్యాక్ వాటర్స్’ ఆయన తొలి నవలను తీర్చిదిద్దారని వివరించారు. పుస్తకాల రచనలపై ఆసక్తి ప్రతిఒక్కరిలోనూ పెరగాలని, అదే విధంగా వివిధ పుస్తకాలను చదవి అందులోని భావాలను సంగ్రహించే విధంగా పఠనాశక్తి ప్రతిఒక్కరిలోనూ పెరగాలని ఈసందర్భంగా వక్తలు వ్యాఖ్యానించారు. -
వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు?
తమిళసినిమా: ఏ రంగంలోనైనా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు అయినా ఊహించనవి జరగడమే జీవితం అంటారు. అందుకు సినిమా రంగం అతీతం కాదు. ఈ రంగంలో శుక్రవారం ఒకరికి జాతకం మారుతుంది అంటారు. ప్రస్తుతం శింబు పరిస్థితి ఇలాగే ఉంది అని చెప్పవచ్చు. గత రెండేళ్లకు పైగా చిత్రం చేయని ఈయన తాజాగా కమలహాసన్తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో థగ్లైఫ్ చిత్రంలో నటించారు. ఈచిత్రం గురువారం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం వరుసగా చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దేశింగు పెరియస్వామి దర్శకత్వంలో ఒక చిత్రం, పార్కింగ్ చిత్రం రాంకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం, అశ్వద్ మారి ముత్తు దర్శకత్వంలో ఇంకో చిత్రం, అంతేకాకుండా ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నిర్మించే చిత్రంలోనూ నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరో చిత్రాన్ని శింబు కమిట్ అయినట్లు తెలిసింది. జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీన్ని వి.క్రియేషన్న్స్ సంస్థ నిర్మించినట్లు, క్రేజీ చిత్ర షూటింగ్ జూలైలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం. మరో విషయం ఏమిటంటే ఇదే చిత్ర నిర్మాణ సంస్థలో దర్శకుడు వెట్రిమారన్, సూర్య కథానాయకుడిగా వాడివాసల్ చిత్రం చేయడానికి చాలా కాలం సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. ఈచిత్రంతోపాటు శింబు కథానాయకుడిగా నటించే చిత్రాన్ని ప్రారంభిస్తారా అనేది తెలియాల్సి ఉంది. -
తిరుచ్చిపై సూర్యనారాయణుడి వైభవం
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వెలసిన శ్రీసూర్యనారాయణ స్వామి వారు గురువారం సాయంత్రం బంగారు తిరుచ్చి వాహనంపై భక్తులను కటాక్షించారు. స్వామివారి జన్మనక్షత్రమైన హస్త సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు చేపట్టారు. అనంతరం స్వామివారిని వజ్రవైఢూర్యాలు, మరకత మాణిక్యాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆశీనులై నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్లుప్తంగా
కండక్టర్తో ఘర్షణ.. పరస్పర దాడి ● ముగ్గురికి గాయాలు తిరువొత్తియూరు: బన్రూట్టి సమీపంలో ప్రభుత్వ బస్సులో చిల్లర తీసుకోవడంపై కండక్టర్ కు ప్రయాణకుల మధ్య ఏర్పడిన ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందులో కండక్టర్, బస్సులో ప్రయాణం చేస్తున్న తండ్రి కుమారుడితో సహా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని పైతం పాడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మహేంద్రన్ (39). ఇతనికి కుమారుడు అజయ్ (14) ఉన్నాడు. కుమారుడిని పాఠశాలలో తొమ్మిదో తరగతి చేర్చడానికి ప్రభుత్వ బస్సు ఎక్కారు. ఆ సమయంలో ఆటో డ్రైవర్ మహేంద్రన్ కండక్టర్కు రూ.500 నోటు ఇచ్చి, రెండు టికెట్లు ఇవ్వమని కోరాడు. కండక్టరు 2 టికెట్లకు నగదు తీసుకుని, తర్వాత టికెట్, తక్కిన చిల్లర నగదును వారికి ఇచ్చాడు. నగదు ఇచ్చే సమయంలో ప్రయాణికుడు మహేందరన్ సెల్ఫోన్లో మాట్లాడుతుండడంతో అతను నగదును సరిచూసుకోమని కండక్టర్ చెప్పాడు. కానీ దీనిని చెవిలో వేసుకోకుండా మహేంద్రన్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. కొద్ది సమయం తర్వాత కండక్టర్ మహేంద్రన్తో నగదు సరిచూసుకోమని చెప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన ప్రయాణికుడు మహేందరన్ కండక్టర్తో వాగ్వివాదం చేసి, ఒక దశలో ఒకరిపై ఒకరు ఇద్దరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఇందులో ప్రయాణికుడు మహేంద్రన్ అతని కుమారుడు అజయ్, కండక్టర్ ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురిని బన్రూట్టి ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పుదుపుపేటై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బాలుడికి లైంగిక వేధింపులు ●కార్మికుడి అరెస్టు తిరువొత్తియూరు: చైన్నె టీనగర్లో జుట్టు కత్తిరించుకోవడానికి వచ్చిన 15 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన కార్మికుడిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె టీనగర్ లోని ప్రముఖ సెలూన్ దుకాణానికి అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలుడు కటింగ్ కోసం వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న దుకాణం ఉద్యోగి జాన్ అనే వ్యక్తి బాలుడిని ప్రత్యేక గదికి తీసుకువెళ్లి మసాజ్ చేశాడు. తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలుడు ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు తెలిపాడు. దిగ్భ్రాంతి చెందిన బాలుడి తల్లిదండ్రులు సెలూన్ దుకాణం యజమాని స్టెల్లారాణితో ఫోన్లో సంప్రదించారు. ఈ విషయమై మాంబలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సెలూన్ ఉద్యోగి జాన్ను అరెస్టు చేశారు. ఫార్మసిస్టుల నిర్లక్ష్యం శువు ప్రాణాలకు ముప్పు అన్నానగర్: చైన్నెలోని ఫార్మసిస్టు నిర్లక్ష్యం కారణంగా రెండు నెలల శిశువు ప్రాణాలకు ముప్పు ఉందని ఆ శిశువు తల్లిదండ్రులు ఆరోపించారు. చైన్నెలోని బీసెంట్ నగర్ నివాసి మోసెస్ ఒక ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి రెండు నెలల బిడ్డ ఉంది. ఆ శిశువు పుట్టినప్పటి నుంచి కామెర్లు బారిన పడింది. దీంతో అతడు కేకే నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నాడు. వైద్యులు రాసిన మందులను అతడు 2 నెలలుగా తాను నివసిస్తున్న బీసెంట్ నగర్ రెండో ప్రధాన రోడ్డులోని అపోలో హాస్పిటల్స్ అనే పెద్ద ప్రైవేట్ ఫార్మసి నుంచి మందులు తీసుకుంటున్నాడు. ఆ మందు తీసుకుంటున్న పిల్లవాడు అసాధారణంగా అలసిపోయాడు. చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు, సూచించిన దానికంటే శక్తివంతమైన మందును ఆ బిడ్డకు ఇచ్చారని వైద్యులు అతనికి తెలిపారు. వెంటనే ఫార్మసీలో దీని గురించి విచారించగా, వారు సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ విషయమై బాధిత బిడ్డ తల్లిదండ్రులు చైన్నె బీసెంట్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థిరమైన భవిష్యత్తు నిర్మాణం లక్ష్యం సాక్షి, చైన్నె: ఐదు కీలక రంగాలపై దృష్టి సారిస్తూ సమగ్రమైన , స్థిరమైన భవిష్యత్తును నిర్మించడం లక్ష్యంగా తమ ప్రయత్నాలు విజయవంతంగా సాగినట్టు ఓపో ప్రకటించింది. గురువారం ఓపో 2024 సస్టైనబిలిటీ నివేదికను నిర్వాహకులు విడుదల చేశారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల అవగాహన కార్యక్రమంగా జనరేషన్ గ్రీన్ ద్వారా విద్యా సంస్థల్లో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాల ద్వారా 10,339 కిలోల ఈ– వ్యర్థాలను సేకరించామన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కార్యాలయంలో వాతావరణ పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ వ్యవస్థ, ఉద్యోగుల సంరక్షణ వంటి అంశాలను చాటేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తద్వారా ‘మేక్ యువర్ మూమెంట్’ అనే బ్రాండ్ పునరుద్ధరణ ద్వారా ముందుకు సాగనున్నట్టు ప్రకటించారు. పర్యావరణ అనుకూల ఆవిష్కరణలు , బాధ్యతాయుతమైన సాంకేతికత ద్వారా స్థిరత్వాన్ని ప్రోత్సహించనున్నట్టు తెలిపారు. -
మెట్రో–2 కోసం డ్రైవర్ రహిత రైళ్లు
● రూ.1,538 కోట్లతో ఒప్పందాలుసాక్షి, చైన్నె: మెట్రో ఫేజ్–2 కోసం 32 డ్రైవర్ రహిత రైళ్లను కొనుగోలు చేయడానికి చైన్నె మెట్రో యాజమాన్యం చర్యలు తీసుకుంది. గురువారం రూ.1,538 కోట్లతో ఒప్పందాలు జరిగాయి.చైన్నెలో ఫేజ్–1 పనులు ముగియడంతో విమానాశ్రయం నుంచి కోయంబేడు మీదుగా సెంట్రల్కు, సెయింట్థామస్ మౌంట్–ఆలందూరు–సెంట్రల్ మీదుగా విమ్కోనగర్కు మెట్రోరైలు సేవలు జరుగుతున్నాయి. ఈ సేవలకు అమిత స్పందన రావడంతో ఫేజ్–2లో మరోమూడు మార్గాలుగా మాధవరం–సిరుచ్చేరి, మాధవరం– షోళింగనల్లూరు, పూందమల్లి– లైట్ హౌస్లను ఎంపిక చేసి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈమార్గంలో డ్రైవర్ రహిత మెట్రో రైలు నడిపేందుకు అధికారులు కసరత్తులు చేపట్టారు. ఇందులో భాగంగా తమిళనాడు సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలో ఉన్న శ్రీసిటీ నుంచి మూడు బోగీలతో కూడిన రెండు డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు చైన్నె పూందమల్లి వర్క్షాపునకు ఇప్పటికే చేరాయి. పూందమల్లి నుంచి పోరూర్ వరకు 9కి.మీ దూరం మెట్రో పనులు ముగియడంతో ఈమార్గంలో డ్రైవర్ రహిత మెట్రో ట్రయల్ రన్ జరుగుతోంది. 32 రైళ్లకు ఒప్పందాలు ఫేజ్–2 ప్రాజెక్ట్ కింద డ్రైవర్ రహిత మెట్రో రైలు మూడు బోగీలను కలిగి ఉంటుంది. 32 మెట్రో రైళ్ల తయారీకి చైన్నె మెట్రో రైల్ కార్పొరేషన్ ఆల్ స్టోమ్ ట్రాన్న్స్పోర్ట్ ఇండియాకు రూ.1,538.35 కోట్ల విలువైన కాంట్రాక్టును అప్పగించింది. ఈ ఒప్పందంపై చైన్నె మెట్రోరైల్ కార్పొరేషన్ డైరెక్టర్ (సిస్టమ్స్ అండ్ ఆపరేషన్న్స్) మనోజ్ గోయల్, ఆల్స్టోమ్ ట్రాన్స్పోర్ట్ ఇండియా కార్పొరేషన్ డైరెక్టర్ పరాగ్ నందలాల్ గోయల్ గురువారం సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, 2027లో చైన్నె మెట్రోరైలు కార్పొరేషన్న్కు ఈ సంస్థ తొలి రైలును అప్పగించనుంది. అన్ని మెట్రోరైళ్లను సెప్టెంబర్ 2027 నుంచి మే 2028 వరకు దశల వారీగా చైన్నె మెట్రోరైల్ కార్పొరేషన్న్కు అప్పగించనున్నారు. -
ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి
వేలూరు: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం పరిధిలోని పుత్తూరు గ్రామ పంచాయతీలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చెట్లును నాటడంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఆరోగ్యమైన గాలి పీల్చేందుకు అవకాశం ఉందన్నారు. వీటిని జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అలాగే విద్యార్థులందరూ విధిగా ఒక మొక్కను నాటాలనే ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుందన్నారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయులందరూ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలతో పాటు రోడ్డుకిరువైపులా మొక్కలు నాటడంతో రానున్న తరానికి ఆరోగ్య కరమైన గాలిని పీల్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. వీటికి అటవీశాఖ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు సంయుక్తంగా కంకణం కట్టుకోవాలన్నారు. అటవీశాఖలో ఒక చెట్టు కూలితే పది మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందకుమార్, జెడ్పీ చైర్మన్ బాబు, యూనియన్ చైర్మన్ భాస్కరన్, అటవీ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం కాట్పాడి నియోజక వర్గంలోని సేవూరు గ్రామ పంచాయతీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
మృతదేహం బంధువులకు అప్పగింత
తిరువళ్లూరు: మార్చురీలో ఉంచిన వృద్దుడి మృతదేహం మాయమైన వ్యవహరంలో పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని బిహార్కు తీసుకెళ్లిన మృతదేహాన్ని వెనక్కి తీసుకువచ్చి, బంధువులకు అప్పగిచడంతో కథ సుఖాంతమైంది. తిరువళ్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ రాజేంద్రన్(61) తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందగా మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు మార్చురీలో ఉంచారు. అయితే మార్చురీలో ఉంచిన మృతదేహం బుధవారం హఠాత్తుగా మాయమైంది. పోలీసుల విచారణలో అనారోగ్యంతో మృతి చెందిన బిహార్కు చెందిన వ్యక్తిగా భావించి రాజేంద్రన్ మృతదేహాన్ని బిహార్కు తరలించారు. రాజేంద్రన్ బంధువులకు బిహార్కు చెందిన వ్యక్తి మృతదేహాన్ని అప్పగించి తీసుకెళ్లాలని వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో బంధువుల ఆందోళనకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బిహార్కు మృతదేహాన్ని తీసుకెళుతున్న ఆంబులెన్స్ డ్రైవర్ను ఫోన్లో సంప్రదించారు. విషయాన్ని వివరించి మృతదేహాన్ని వెనక్కి తీసుకుని రావాలని ఆదేశించారు. దీంతో మృతదేహం గురువారం మధ్యాహ్నం తిరువళ్లూరుకు చేరింది. అనంతరం రాజేంద్రన్ కుటుంబ సభ్యులను పిలిపించి, మృతదేహాన్ని అప్పగించడానికి యత్నించారు. అయితే రాజేంద్రన్ బంధువుల మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించి గురువారం ఆందోళన చేపట్టారు. మృతదేహాన్ని చూడకుండా నిర్లక్ష్యంగా బిహార్కు పంపిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులతో చర్చించి వారిని సముదాయించి మృతదేహాన్ని అప్పగించారు. -
బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ
తిరుత్తణి: తిరుత్తణి–పొదటూరుపేట రాష్ట్ర రహదారిలో నంది నదిలో వరద ప్రవాహం సందర్భంగా రాకపోకలకు ఇబ్బందులు పరిష్కరించే విధంగా రూ.7.40 కోట్లతో హైవే బ్రిడ్జి నిర్మాణానికి గురువారం భూమి పూజతో పనులు ప్రారంభమయ్యాయి. తిరుత్తణి నుంచి పొదటూరుపేటకు వెళ్లే రాష్ట్ర రహదారిలో తెక్కళూరు వద్ద నంది నది ప్రవహిస్తుంది. వర్షాకాలంలో వరద నీటి ప్రవాహంతో రాకపోకలు స్తంభించి 60 గ్రామాల ప్రజలు ఇబ్బందులు చెందేవారు. నంది నదిపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామీణులు కోరుతున్నారు. ఈక్రమంలో జాతీయ రోడ్ల అభివృద్ధి నిధుల పథకం ద్వారా రూ.7.40 కోట్లు కేటాయించి హైవే బ్రిడ్జి నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని భూమిపూజ చేశారు. తిరుత్తణి మండల కార్యదర్శి కృష్ణన్ పాల్గొన్నారు. -
బెంగళూరులో ఉడుమలై ఇంజినీర్ మృతి
సాక్షి, చైన్నె: ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో ఉడుమలైకు చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీరు మరణించారు. ఆమె భౌతిక కాయాన్ని గురువారం మధ్యాహ్నం స్వగ్రామానికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, ఆప్తులు శోక సంద్రంలో మునిగారు. ఐపీఎల్ టోర్నీని 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం బెంగళూరు చిన్నస్వామి మైదానంలో జరిగిన విజయోత్సవం సందర్భంగా తొక్కిసలాటకు దారి తీసింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన స్టాఫ్ట్వేర్ ఇంజినీరు కూడా బలి అయ్యారు. విషాదంలో కుటుంబం తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో వివేకానంద విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఉంది. ఈ స్కూల్ ప్రిన్సిపల్గా మూర్తి (65) వ్యవహరిస్తున్నారు. మూర్తి, ఆయన భార్య రాజలక్ష్మి(60) ఈ విద్యాసంస్థను నడుపుతున్నారు. వీరి కుమార్తె కామాక్షి దేవి(27) ఐదేళ్లుగా బెంగళూరులోని ఓ ప్రముఖ సంస్థలో మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. స్నేహితులతో కలిసి కామాక్షి దేవి బెంగళూరు స్టేడియానికి వెళ్లి తొక్కిసలాటలో మరణించారు. కామాక్షి దేవి మరణ సమాచారంతో కుటుంబ సభ్యులు, ఆప్తులు తీవ్ర విషాదంలో మునిగారు. ఆమె మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం 2 గంటల అంబులెనన్స్లో ఉడుమలైపేటకు తీసుకొచ్చారు. ఆమె మృత దేహానికి వివేకానంద విద్యాలయ పాఠశాలలో ఉంచారు. ఏకై క కుమార్తెను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతంగా మారింది. తమకు వయస్సు మీద పడడంతో ఇక, విద్యాసంస్థను నడిపించాలని కుమార్తెకు మూర్తి ఇటీవల సూచించినట్టు ఆప్తులు చెబుతున్నారు. త్వరలో బాధ్యతలు చేపడతానని చెప్పుకుంటూ వచ్చిన కామాక్షి దేవి కానరాని లోకాలకు వెళ్లడం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకంలో ముంచింది. కాగా, ఈ విషాదంలో బెంగళూరులో ఉంటున్న తమిళులు అక్షిత అనే మహిళతో పాటుగా ఓ బాలిక సైతం మరణించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. -
చికెన్రైస్ తిని బాలుడి మృతి
తిరువళ్లూరు: చికెన్రైస్ తిని ఓ బాలుడు మృతిచెందిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా పెద్దపాళ్యం ప్రాంతానికి చెందిన సురేందర్ విద్యుత్శాఖలో అధికారి. ఇతని కుమారుడు భరత్(13) స్థానికంగా వున్న ప్రయివేటు పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఈక్రమంలో భరత్ తండ్రి సమీపంలోని ఫాస్ట్పుడ్ సెంటర్కు వెళ్లి చికెన్రైస్, చికెన్గ్రేవీ తీసుకొచ్చాడు. భరత్ చికెన్రైస్, చికెన్ తినడంతో బుధవారం రాత్రి హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే భరత్ను సమీంపలోని ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చిక్సిత అనంతరం పెద్దపాళ్యం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ బాలుడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. విషయం తెలిసి పెద్దపాళ్యం పోలీసులు మృతదేహాన్ని శవపరిక్ష నిమిత్తం తిరువళ్లూరు జిల్లా వైద్యకేంద్రానికి తరలించారు. చికెన్రైస్, చికెన్ తినడం వల్లే మృతిచెందాడని తల్లిదండ్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.5లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
వేలూరు: వేలూరు శ్రీపురంలోని బంగారుగుడి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది రూ.5లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని బంగారుగుడి డైరెక్టర్ సురేష్బాబు అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేలూరు గ్రీన్ సర్కిల్ వద్ద విద్యార్థులతో అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వాహనదారులకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి సురేష్బాబు హాజరై వాహనదారులకు, విద్యార్థులకు మొక్కలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ నారాయణి పీఠం, ఎక్స్నోరా సంయుక్తంగా చెత్తను ఎరువు చేసే పథకాన్ని ప్రారంభించాయన్నారు. ఆ సమయంలో పథకాన్ని చాలా మంది నిర్లక్ష్యంగా మాట్లాడినప్పటికీ, ప్రస్తుతం ఈ పథకం దేశ వ్యాప్తంగా విజయవంతం అయిందన్నారు. శక్తిఅమ్మ ఆశీస్సులతో సాగర్ పథకాన్ని తీసుకొచ్చి జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే పథకాన్ని ప్రారంభిస్తామదన్నారు. ఆశక్తి గల విద్యార్థులు, అటవీశాఖ సిబ్బందితోపాటు స్వచ్ఛంద సంస్థలకు కూడా ఉచితంగా మొక్కలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఐ శ్రీనివాసన్, విద్యార్థులు పాల్గొన్నారు. -
గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
వేలూరు: వానియంబాడిలోని ఓ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలో శెట్టియప్పనూరు గ్రామానికి చెందిన కుప్పన్ పుదూరు ప్రాంతంలో పాత వస్తువులు విక్రయ, కొనుగోలు దుకాణం నడుపుతున్నాడు. అదేవిధంగా దుకాణం సమీపంలో పాత కార్ల కొనుగోలు, కారు విడి బాగాల గోడౌన్ నడుపుతున్నాడు. ఈక్రమంలో గురువారం ఉదయం గోడౌన్లో కార్మికులు పనుల్లో ఉండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన కార్మికులు వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో వానియంబాడి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అప్పటికే కార్లు, ఆటో, కారు విడి బాగాల వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వానియంబాడి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
వ్యర్థాల రీసైక్లింగ్పై అధ్యయనం
● అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సాక్షి, చైన్నె : వివిధ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి, విడిగా సేకరణ పనులపై జిల్లా అధికారులతో గురువారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమీక్షించారు. ఆయా పనులు, పరిశోధనలను వీడియో కాన్పరెన్స్ ద్వారా అధ్యయనం చేశారు. తీవ్ర జ్వరంతో విశ్రాంతిలో ఉన్న డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గురువారం చైన్నె కార్పొరేషన్ భవనం రిప్పన్ బిల్డింగ్కు వచ్చారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ తమిళనాడులో మొదటి అడుగుగా సచివాలయంతో సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేయడానికి చర్యలు చేపట్టారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, లోహ వ్యర్థాలు, కాగితపు వ్యర్థాలు, గాజు వ్యర్థాలు, ఉపయోగించలేని కలప, లాజిస్టిక్స్ వంటి వివిధ రకాల వ్యర్థాలను సేకరించి, రీసైక్లింగ్ దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రీసైక్లింగ్ కోసం ప్రత్యేక సేకరణ వంటి అంశాలతో తీర్చిదిద్దిన వీడియోను వీక్షించారు. స్వచ్ఛ తమిళనాడు నినాదంతో స్వచ్ఛమిషన్ ప్రాజెక్టును ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ఉదయ నిధి స్టాలిన్ ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులో మొదటి అడుగుగా రాష్ట్రంలోని 38 జిల్లాల కలెక్టర్లు, ఇతర కార్యాలయాలు, సుమారు1,100 ప్రభుత్వ కార్యాలయాల్లో చేపట్టాల్సిన పనులను వివరించారు. ఈ సమావేశంలో గ్రేటర్ చైన్నె మేయర్ ఆర్. ప్రియ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, అదనపు ముఖ్య కార్యదర్శి, ప్రదీప్ యాదవ్, డిప్యూటీ మేయర్ ఎం. మహేష్కుమార్,తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి పరిశోధనలపై ఐఐటీ మద్రాసు ఒప్పందం
సాక్షి, చైన్నె : టాంజానియా ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, సర్టిఫికేషన్ కార్యక్రమాలను అందించడానికి, ఉమ్మడి పరిశోధనలను నిర్వహించడానికి , సాంకేతిక సంప్రదింపు ప్రాజెక్టులను అందించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ జీఆర్ఐడీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీ మద్రాసు జాంజిబార్ ద్వారా ఆఫ్రికాలో చురుకై న ఉనికితో, స్థిరమైన శక్తి కోసం ప్రపంచ భాగస్వామ్యాలను నిర్మించడానికి తద్వారా కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న కంపెనీ అయిన గ్రిడ్–ఇండియా, భారతదేశ విద్యుత్ గ్రిడ్లో నమ్మకమైన, సురక్షితమైన నిర్వహణకు బాధ్యత వహించే జాతీయ వ్యవస్థ ఆపరేటర్గా ఉన్నట్టు తెలిపారు. ఈ అవగాహన ఒప్పందంపై ఐఐటీ మద్రాస్ క్యాంపస్ డీన్ (ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ అండ్ స్పాన్సర్డ్ రీసెర్చ్) ప్రొఫెసర్ మను శాంతానం, గ్రిడ్–ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హెచ్ఆర్) శ్రీ సూరజిత్ బెనర్జీ సంతకం చేశారు. దరఖాస్తులు ఐఐటీఎం ప్రవర్తక్ ఆన్లైన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అండ్ సేల్స్ ఫోర్సు బీ2సీ కామర్స్ క్లౌడ్ కోర్సులకు ఐఐటీ మద్రాసు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కోర్సులు విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, నిపుణులను అత్యాధునిక నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తాయని ప్రకటించారు. ఈ వివరాలను ఐఐటీఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీ వీర రాఘవన్ ప్రకటించారు. జూన్ 13వ తేదీలోపు ఆసక్తి గల వారు దరఖాస్తులుచేసుకోవాలని సూచించారు. జూన్ 14 నుంచి 60 గంటల ఆన్లైన్ కోర్సుగా విద్యాభాస్యం చేయడం జరుగుతుందన్నారు. 7న ఎమ్మెల్యేలతో భేటీ సాక్షి, చైన్నె: డీఎంకే ఎమ్మెల్యేలతో ఈనెల 7వ తేదీ అన్నా అరివాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం ఎంకే.స్టాలిన్ సమావేశం కానున్నారు. సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఆదేశించారు. అలాగే, జిల్లాల కార్యదర్శులతోనూ స్టాలిన్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల పనులపై సమీక్షించనున్నారు. కారు ఢీకొని కానిస్టేబుల్కు తీవ్రగాయాలు తిరుత్తణి: కారు ఢీకొని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్కు తీవ్రగాయాలయ్యాయి. తిరుత్తణిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ విగ్నేష్(28) విధులు నిర్వహిస్తున్నారు. గురువారం పొన్పాడి చెక్పోస్టులో వాహన తనిఖీ విధులు నిర్వరిస్తున్నారు. ఈసమయంలో వేగంగా వస్తున్న కారును అడ్డుకుని ఆపుతుండగా, వెనుక వైపు నుంచి వచ్చిన మరోకారు ఆగివున్న కారును ఢీకొంది. ఈప్రమాదంలో విఘ్నేష్కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ అతన్ని అక్కడున్న వారు తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరుత్తణి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కన్నతండ్రి గొంతు కోశాడు! అన్నానగర్: రెండో పెళ్లికి ప్రయత్నించిన తండ్రి గొంతు కోసిన సంఘటన కలకలం రేపింది. సేలం, సూరమంగళం హైవే పక్కన ఉన్న మాణిక్వాసాగర్ వీధికి చెందిన సెల్వకుమార్ (65) తమిళనాడు అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజర్గా ఉద్యోగ విరమణ చేశారు. ఇతనికి భార్య షణ్ముగవల్లి, ఇద్దరు కుమారులు తమిళగన్ (23), గిరి వెంకటేష్ (17) ఉన్నారు. ఒక ప్రైవేట్ కళాశాలలో బి.కాం పూర్తి చేసిన తమిళగన్, కొండలాంపట్టిలో వాహన విడిభాగాలను విక్రయించే దుకాణాన్ని నడుపుతున్నాడు. ఆయన రెండో కుమారుడు గిరి వెంకటేష్, ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్లస్ టూ చదువుతున్నాడు. షణ్ముగవల్లి మానసిక అనారోగ్యంతో బాధపడతున్నారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినప్పటికీ, ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఈ స్థితిలో రెండేళ్ల క్రితం షణ్ముగవల్లి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత సెల్వకుమార్ తన ఇద్దరు కుమారులతో ఉంటున్నాడు. ఈ స్థితిలో సెల్వకుమార్ రెండో వివాహం గురించి ఒక వార్తా పత్రికలో ప్రకటన ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పెద్ద కుమార్తె తమిళగన్ తన తండ్రిని అడిగాడు. గురువారం ఉదయం, వారు ఇంట్లో ఉన్నప్పుడు, తండ్రి, కొడుకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సెల్వకుమార్ తన కుమారుడు తమిళగన్ను కొట్టాడు. దీంతో ఆగ్రహించిన తమిళగన్ కూడా ప్రతిగా దాడి చేశాడు. సెల్వకుమార్ తలపై తీవ్ర గాయమైంది. కూరగాయలు కోసేందుకు ఉపయోగించే కత్తితో అతను మెడను కూడా కోశాడు. సెల్వకుమార్ అరుపులు విన్న ఇరుగుపొరుగువారు అతన్ని రక్షించి సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన సెల్వకుమార్కు చికిత్స అందిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సూర మంగళం పోలీసులు తమిళగన్ అరెస్టు చేసి. దర్యాప్తు చేస్తున్నారు. -
ఐఐటీ మద్రాసులోకి గిరిజన విద్యార్థిని
● సీఎం అభినందన ● విద్యా ఖర్చులన్నీ మాదేనని ప్రకటన సాక్షి, చైన్నె: కల్వరాయన్ మలై అటవీ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని విద్యలో ప్రతిభ కనబరిచి, ఐఐటీ మద్రాసులో సీటు దక్కించుకుంది. ఈ సమాచారంతో సేలం నగరానికి చెందిన రాజేశ్వరి అనే విద్యార్థినిని సీఎం ఎంకే స్టాలిన్ అభినందించారు. ఉన్నతవిద్య ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఐఐటీ మద్రాసులో సీటు దక్కాలంటే వివిధ పోటీ పరీక్షల్లో టాపర్ల జాబితాలో ముందు వరసులో చోటు దక్కించుకుని ఉండాలి. జాతీయ స్థాయిలోని విద్యా సంస్థల్లో గత తొమ్మిదేళ్లుగా తొలి స్థానాన్ని కై వశం చేసుకుంటూ వస్తున్న ఐఐటీ మద్రాసులో సీటు దక్కించుకునేందుకు ప్రతిభావంతులైన విద్యార్థులు ఎగబడుతుంటారు. ఆ దిశగా ఓ గిరిజన విద్యార్థిని ప్రతిభ కనబరిచి, ఐఐటీ మద్రాసు దరి చేరింది. సేలం జిల్లా కల్వరాయన్ మలై అటవీ ప్రాతంలోని కరుమందురై గ్రామానికి చెందిన ఆండి, కవిత దంపతులకు కుమార్తెలు జగదీశ్వరి, రాజేశ్వరి, పరమేశ్వరి, కుమారుడు గణేషన్ ఉన్నారు. ఆండి టైలర్ వృత్తిని కొనసాగిస్తూ వచ్చాడు. పెద్ద కుమార్తె జగదీశ్వరి సంగగిరిలోని ఓ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి చైన్నెలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన గణేషన్ తండ్రికి సహకారంగా టైలరింగ్ వృత్తిని ఎంచుకున్నాడు. గత ఏడాది హఠాత్తుగా ఆండి మరణించాడు. తండ్రి మరణించిన పుట్టెడు శోకంతో రాజేశ్వరి ప్లస్టూ పబ్లిక్ పరీక్షలకు సిద్ధమైంది. ఐఐటీలో సీటు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 438 మార్కులు సాధించిన రాజేశ్వరి, ప్లస్టూలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 600 మార్కులకు గాను 521 మార్కులు దక్కించుకుంది. ఇంజినీరింగ్ చదవాలన్న ఆశతో పెరుంతురై ప్రభుత్వ శిక్షణ కేంద్రంలో జేఈఈ శిక్షణ పొంది పరీక్ష రాసింది. రాజేశ్వరికి జాతీయ స్థాయిలో 417వ ర్యాంకు జేఈఈలో లభించింది. ఈ ర్యాంకు ఆధారంగా ఐఐటీ మద్రాసు ప్లేస్ మెంట్ సంపాదించుకుంది. ఐఐటీ మద్రాసులో సీటు దక్కించుకున్న కల్వరాయన్ కొండల్లోని అటవీ ప్రాంతానికి చెందిన గిరిజన విద్యార్థిని రాజేశ్వరి ఆ జాబితాలోకి చేరింది. ఈ సమాచారంతో ఆ విద్యార్థినిని పలువురు అభినందిస్తున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ ఆనందం వ్యక్తం చేస్తూ రాజేశ్వరిని అభినందించారు. తండ్రిని కోల్పోయినప్పటికీ, ఆయన కలను సాకారం చేసేలా రాజేశ్వరి చదువుల తల్లిగా మారడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ బోర్డింగ్ స్కూల్ విద్యార్థిని విజయానికి సెల్యూట్ అని వ్యాఖ్యానించారు. రాజేశ్వరి ఉన్నత విద్యకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. -
సయోధ్య కుదిరినట్టేనా?
సాక్షి, చైన్నె: మామిడి పండు చిహ్నంగా కలిగిన పీఎంకేలో తండ్రి, తనయుల మధ్య రచ్చకెక్కిన అధికార వార్కు ముగింపు పలికే విధంగా కమలం, రెండాకులు రంగంలోకి దిగాయి. బీజేపీకి చెందిన వ్యక్తిగా ముద్రపడ్డ ఆడిటర్ గురుమూర్తి, అన్నాడీఎంకే సీనియర్లలో ఒకరైన ౖసైదె దురైస్వామి గురువారం ఉదయాన్నే తైలాపురంలో ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో అక్కడికి అన్బుమణి సైతం రావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నట్లైంది. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య బయలు దేరిన అధికార వార్ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. తండ్రి, తనయుడి మధ్య అధ్యక్షుడు ఎవరో అనే విషయంగా జరుగుతున్న ఈ వివాదంలో పార్టీకి చెందిన ముఖ్య నేతలు నలిగిపోతున్నారు. కేడర్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ద్విత్రీయ, తృతీయ శ్రేణి నేతలు రెండుగా చీలారు. ఈ వివాదం రోజురోజుకు చిలికి చిలికి గాలివానగా మారుతుండడాన్ని బీజేపీ, అన్నాడీఎంకే పరిగణించినట్టున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 8న మదురైకు రానున్న నేపథ్యంలో ఆలోపు తండ్రి, తనయుడి మధ్య వివాదానికి ముగింపు పలికేందుకు చర్యలు తీసుకున్నారు. మదురై వేదికగా కూటమి కసరత్తులు, కూటమిలోకి వచ్చే పార్టీల నేతలతో సంప్రదింపునకు సన్నద్ధం అవుతున్న సమయంలో పీఎంకే నేతలను అమిత్షా ముందు కూర్చోబెట్టే దిశగా వ్యూహాలకు పదును పెట్టినట్టున్నారు. రంగంలోకి గురు, ౖసైదె..: విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని తైలాపురం గెస్ట్హౌస్లో గురువారం ఉదయాన్నే బీజేపీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు అత్యంత సన్నిహితుడైన ఆడిటర్ గురుమూర్తి, అన్నాడీఎంకే సీనియర్ ౖసైదె దురైస్వామి ప్రత్యక్షమయ్యారు. ఈ ఇద్దరు మూడు గంటలపాటు రాందాసుతో సమావేశం అయ్యారు. ఆయన్ను బుజ్జగించే విధంగా, పార్టీలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దుకునే విధంగా సయోధ్య ప్రయత్నాలు చేపట్టినట్టు చర్చ ఊపందుకుంది. అదేసమయంలో అన్బుమణి రాందాసు 25 రోజుల తర్వాత తైలాపురం గెస్ట్హౌస్కు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అన్బుమణితో పాటు రాందాసు పెద్దకుమార్తె గాంధిమతి కూడా రావడం గమనార్హం. గురుమూర్తి, ౖసైదెదురై స్వామి బయటకు వచ్చినానంతరం, రాందాసుతో అన్బుమని, గాంధిమతి గంటపాటు సమావేశం కావడం గమనార్హం. అయితే, సమావేశానంతరం అన్బుమణి మౌనంగా బయటకు వెళ్లడంతో చర్చల ఫలితాలపై ఆసక్తి పెరిగింది. ఇక, తాము ఓపని నిమిత్తం ఇటు వచ్చామని, తన మిత్రుడైన రాందాసును మర్యాదపూర్వకంగా కలిసినట్టు గురుమూర్తి పేర్కొన్నారు. అన్బుమణి అక్కడకు వస్తున్న విషయం తనకు తెలియదని దాట వేశారు. ఏకంగా మూడు గంటల పాటు వీరి భేటీ సాగడం చూస్తే, పీఎంకేలో నెలకొన్న పరిణామాలను చక్కదిద్దేందుకు బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకే తైలాపురానికి వచ్చి వెళ్లినట్టుగా చర్చ జరుగుతోంది. అదేసమయంలో అన్బుమణి తైలాపురానికి వచ్చి వెళ్లడంతో పార్టీలో నెలకొన్న పరిస్థితులు మరికొద్ది రోజుల్లో సరిదిద్దుకుంటాయి అనే ఆశలో పీఎంకే వర్గాలు ఉన్నాయి. రంగంలోకి కమలం, రెండాకులు తైలాపురంలో ఆడిటర్ గురుమూర్తి, ౖసైదె దురైస్వామి రాందాసుకు బుజ్జగింపు అన్బుమణి రాకతో ప్రాధాన్యం -
మేడవాక్కంలో బిగ్ లేక్ పునరుద్ధరణకు చర్యలు
● గ్రీన్ ఎకోలాజికల్ ఫారెస్టు లక్ష్యం సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని మేడవాక్కంలో ఉన్న వెల్లక్కల్ బిగ్ లేక్ పునరుద్ధరణ, బ్లూ–గ్రీన్ ఎకోలాజికల్ ఫారెస్ట్ రూపకల్పనకు రోటరీ క్లబ్ చర్యలు తీసుకుంది. 2014 నుంచి గ్రేటర్ చైన్నెలోని ఈ అతిపెద్ద చెరువును పునరుద్ధరించడానికి, పరిరక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ కలను సాకారం చేసే దిశగా ఓ ప్రాజెక్టును మేడవాక్కం పంచాయతీ అధ్యక్షుడు టి శివభూషణం రవి, యూనియన్ కౌన్సిలర్ బి.రవి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సినీ నటుడు ఆర్య, జిల్లా 3233 రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహావీర్ బోత్రా హాజరయ్యారు. భూగర్భజల స్థాయి పెంచడం, స్థానికంగా మొక్కల పెంపకంతో దట్టమైన బ్లూ–గ్రీన్ ఎకోలాజికల్ ఫారెస్ట్ రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ ఒక్క రోజున పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో భాగంగా 3 వేలకు పైగా మొక్కలను నాటారు. రూ. 25 లక్షల విరాళంతో ఈప్రాజెక్టును తొలి విడతగా చేపట్టారు. చైన్నె క్యాపిటల్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఆర్టీఎన్ హేమంత్ ఖండేల్వాల్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కేవలం చెట్లను నాటడం లేదా సరస్సును పునరుద్ధరించడం గురించి మాత్రమే కాదని, వాతావరణ సమస్యలకు పరిష్కారం అని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె క్యాపిటల్, రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ మిడ్టౌన్, రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె సెంట్రల్ ఎలైట్, చైన్నె రోటరీ క్లబ్ స్నేహం సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్పై దృష్టి పెట్టినట్టు తెలిపారు. -
కాయిదే మిల్లత్కు నివాళి
● ఘనంగా జయంతి వేడుక సాక్షి, చైన్నె: ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వ్యవస్థాపకుడు కాయిదే మిల్లత్ మహ్మద్ ఇస్మాయిల్ 130వ జయంతి వేడుకను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ట్రిప్లికేన్లోని పెద్ద మసీదు ఆవరణలోని ఆయన సమాధి వద్దకు వివిధ పార్టీల నేతలు తరలివచ్చారు. సీఎం స్టాలిన్, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం అధికారిక నివాళులర్పిస్తూ సమాధి వద్ద చాదర్ను సమర్పించారు. అలాగే, టీఎంసీ నేతలు జీకే వాసన్, జీఆర్ వెంకటేష్ అంజలి ఘటించారు ప్రతిఏటా కాయిదే మిల్లత్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ట్రిప్లికేన్లోని పెద్ద మసీదు వద్ద ఉన్న ఆయన సమాధి పరిసరాలను ఉదయాన్నే సుందరంగా తీర్చిదిద్దారు. పెద్ద ఎత్తున ముస్లిం సంఘాల నేతలు, రాజకీయ పార్టీ నాయకులు అక్కడికి తరలి రావడంతో ఆ పరిసరాలు కిక్కిరిశాయి. ముస్లిం పెద్దలు ప్రత్యేక పాత్యహా నిర్వహించారు. సీఎం స్టాలిన్ నివాళి ఉదయాన్నే సీఎం స్టాలిన్, మంత్రుల నాజర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మేయర్ ప్రియ సమాధి వద్ద పుష్పాంజలితో నివాళులర్పించారు. సమాధిపై మల్లెపూలతో సిద్ధం చేసిన చాదర్ను సీఎం సమర్పించారు. అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి తరఫున ఆ పార్టీ ప్రతినిధులు అన్వర్ రాజ, జయకుమార్తో కూడిన బృందం పలు పుష్పాలతో సిద్ధం చేసి చాదర్ను సమాధిపై కప్పి నివాళులర్పించారు. అలాగే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేతలు ఖాదర్ మొహిద్దీన్ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. జీకే వాసన్, ప్రధాన కార్యదర్శి జీఆర్ వెంకటేష్ పుష్పాంలి ఘటించారు. తమిళగ వెట్రి కళగం నేత విజయ్ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్తో కూడిన ప్రతినిధులు నివాళులర్పించారు. అలాగే ముస్లిం సంఘాలు, పార్టీల నాయకులు వేర్వేరుగా తరలి వచ్చి నివాళులర్పించారు. ఈసందర్భాన్ని పురస్కరించుకుని సీఎం స్టాలిన్ మాట్లాడుతూ కాయిదే మిల్లత్ సేవల్ని గుర్తుచేశారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన పాత్రను గుర్తు చేస్తూ ఆయన గొప్ప దేశ భక్తుడని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని మతాల మధ్య భేదం అన్నది లేకుండా సోదరత్వం పెంపునకు మిల్లత్ కృషిచేశారని తెలిపారు. -
● సీఎం ఎంకే స్టాలిన్ ● రూ. 44 కోట్ల కాలుష్య నియంత్రణ బోర్డు అభివృది ● 14 తీర జిల్లాలో వలల సేకరణ కేంద్రాలు ● ధనుష్కోటిలో పక్షుల అభయారణ్యం
సాక్షి,చైన్నె: పర్యావరణ పరిరక్షణను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లనున్నామని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. రూ.44 కోట్లతో కాలుష్య నియంత్రణ బోర్డు, పరిశోదన కేంద్రాన్ని గిండిలో అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలోని 14 సముద్ర తీర జిల్లాల్లో నిరుపయోగంగా ఉన్న చేపల వలల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.ఽ చైన్నె నందంబాక్కం ట్రేడ్ సెంటర్లో గురువారం రాష్ట్ర పర్యావరణ, వాతావరణ మార్పు, అటవీశాఖ నేతృత్వంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఇందులో చైన్నెలోని గిండిలో నిర్మించనున్న తమిళనాడు కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిశోధన అభివృద్ధి లక్ష్యంగా తమిళనాడు మారిటైమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా ఈకేంద్రం ఏర్పాటుకు శంకు స్థాపన చేశారు.14 సముద్ర తీర జిల్లాల్లో నిరుపయోగ చేపల వలల సేకరణ కేంద్రాలను ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. రామనాథపురం జిల్లా ధనుష్కోటిని పక్షుల అభయారణ్యంగా ప్రకటించారు. అలాగే, 1,400 ఫారెస్ట్ గార్డ్ పోస్టులకు ఎంపికై న వారికి నియామక ఉత్తర్వులను సీఎం అందజేశారు. అటవీ సంరక్షణలో ఉత్తమ సేవలను అందించిన జిల్లా స్థాయి అధికారులు, నీటి సంరక్షణలో ఉత్తమ సేవలను అందించిన స్వచ్ఛంద సేవకులకు అవార్డులను సీఎం ప్రదానం చేశారు. గ్రేటర్ ఫ్లెమింగో పక్షుల అభయారణ్యం ధనుష్కోటిని ప్రకటించారు. ఈ అభయారణ్యంపై రూపొందించిన లఘు చిత్రాన్ని విడుదల చేశారు. మన్నార్ గల్ఫ్ బయోస్పియర్ రిజర్వ్ 524.78 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండడం, రామేశ్వరం దీవుల్లో చిత్తడినేల ఉండడం వంటి అంశాలను పరిగణించి ఈ అభయారణ్యం వలస పక్షులకు నిలయం మార్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ అభయారణ్యంలో 55 జాతుల పక్షులు ఉన్నటు, మరో 73 రకాల పక్షులు వలస జాతులుగా ఉన్నట్టు వివరించారు. భవిష్యత్తే లక్ష్యం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితులు ఈ భూమికి మాత్రమే కాదు, భావితరాల భవిష్యత్తు ప్రణాళికలను ప్రశ్నార్థకం చేసే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈతరమే కాదు, రానున్న తరాలు సైతం స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా గ్రీన్ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గత నాలుగు సంవత్సరాలలో గ్రీన్ తమిళనాడు నినాదంతో ముందడుగు వేశామని వివరించారు. ఏనుగులు, పులులు, వంటి వన్య ప్రాణులను సంరక్షిస్తూనే, అంతరించిపోతున్న జాతులను సైతం కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అవార్డుల ప్రదానం విజయం మీ చేతుల్లోనే 2021లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి తాము మంజాపై (పసుపు) సంచి ప్రాజెక్టును ప్రారంభించామని గుర్తుచేస్తూ, ఇది కేవలం ఒక ప్రణాళికగా ఉంటే సరిపోదు అని, ఒక ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవశ్యం ఉందన్నారు. ఇంటి నుంచి బయలు దేరే సమయంలో చేతిలో సంచి, నీటితో బాటిల్ను తీసుకుని రావడం అలవాటు చేసుకోవాలని సూచించారు. భారతదేశం అమెరికా, జపాన్, యూరప్లా మారాలంటే ప్రజల్లో స్వీయ క్రమశిక్షణ ముఖ్యం అని సూచించారు. సామాజిక న్యాయంకోసం మాత్రమే కాకుండా, పర్యావరణ న్యాయం కోసం కూడా ప్రభుత్వం ముందుకెళుతోందని, ఈ ఉద్యమానికి ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను సీఎం స్టాలిన్ అందజేశారు. జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు అత్యుత్తమ కృషి చేసినందుకు కృష్ణగిరి జిల్లా కలెక్టర్ సి. దినేష్కుమార్, తేని జిల్లా కలెక్టర్ రంజిత్, తిరుచ్చి జిల్లా కలెక్టర్ ఎం.ప్రదీప్కుమార్, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఎం ప్రతాప్లకు గ్రీన్ అవార్డులను సీఎం అందజేశారు. అటవీ పరిరక్షణలో విస్తృత సేవలు అందించిన విల్లుపురం, కరూర్, చైన్నె, కోయంబత్తూర్, తిరువారూర్ జిల్లాలకు ఉత్తమ అటవీ సంరక్షణ అవార్డులను అందజేశారు. ఈమేరకు ఐదుగురు ఉత్తమ అటవీ రేంజర్లు అవార్డులను అందుకున్నారు. అన్ని జిల్లాలు నీటి సంరక్షణలో కీలక పాత్ర, సేవలు అందించిన 38 మందికి జల సంరక్షణ అవార్డులు, ఒక్కొక్కరికి రూ.లక్షను సీఎం అందజేశారు. అలాగే, పరిశ్రమలకు స్వచ్ఛంద గ్రీన్ రేటింగ్ అవార్డుల ప్రదానం చేశారు. మంత్రులు తంగం తెన్నరసు, అన్బరసన్, ఆర్ఎస్ రాజకన్నప్పన్, ఎమ్మెల్యే కరుణానిధి, పర్యావరణం శాఖ ప్రధాన కార్యదర్శి సుప్రియాసాహు, డైరెక్టర్ ఎ.ఆర్.రాహుల్నాథ్, అటవీ సంరక్షణాధికారి శ్రీనివాస్రెడ్డి, వన్యప్రాణి సంరక్షణ అధికారి రాకేష్ కుమార్ డోగ్రా, కాలుష్య నియంత్రణ బోర్డు ర్మన్ డాక్టర్ ఎం. జయంతి, బ్రిటీషు డిప్యూటీ హైకమిషనర్ అలీమా హాలండ్, వివిధ దేశాల రాయబారులు పాల్గొన్నారు. -
ఇరుంగాట్టు కోట్టైలో రోబోట్స్
సాక్షి, చైన్నె: కాంచీపురం జిల్లా ఇరుంగాట్టు కోట్టైలో అజైల్ రోబోట్స్ పరిశ్రమ రూ. 300 కోట్లతో ఏర్పాటైంది. 300 మందికి ఉపాధి కల్పించే విధంగా ఏర్పాటైన ఈ పరిశ్రమంలో కృత్రిమ మేధస్సు ఆధారంగా రోబోట్స్ తయారీకి సంబంధించిన విడి భాగాలను ఉత్పత్తి చేయనున్నారు. అలాగే రాణిపేటలో రూ.175 కోట్ల పెట్టుబడితో ఎస్ఓఎల్ ఇండియా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎయిర్ సెపరేషన్ ప్లాంట్ ఏర్పాటైంది. వీటిని సీఎం స్టాలిన్ బుధవారం ప్రారంభించారు. భారతదేశంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంగా తమిళనాడు, వివిధ రంగాల్లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. పెట్టుబడులను ఆకర్షించడంలో, మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో దూసుకెళుతోంది. 2024–25 ఆర్థిక సర్వే మేరకు తమిళనాడు 9.69 శాతం వృద్ధిని సాధించింది. గత పదేళ్లలో అత్యధిక వృద్ధి రేటుతో భారతదేశంలో మొదటి స్థానంలో తమిళనాడు నిలిచింది. 2030 నాటికి ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల వృద్ధిని సాధించడం లక్ష్యంగా ముందుకెళ్తున్న తమిళనాడు ప్రభుత్వానికి బలాన్ని చేకూర్చే విధంగా అనేక విదేశీ సంస్థలు పెట్టుబడులను విస్తృతంగా పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఇందులోభాగంగా కాంచీపురం జిల్లా ఇరుంగాట్టు కోట్టైలో అజైల్ రోబెట్స్ కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేస్తూ, దాని ఆధారంగా రోబోటిక్స్కు అవసరమయ్యే అన్ని రకాల విడి భాగాల తయారీ, ఆటోమేషన్ పరిష్కారాలను అందించే దిశగా పరిశ్రమను ఏర్పాటైంది. ఇక్కడి అన్ని రకాల నిర్మాణాలు పూర్తి చేసిన ఉత్పత్తి ప్రక్రియ మీద దృష్టి పెట్టారు. 300 మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పించారు. 2019 ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఎస్ఓఎల్ ఇండియా ఎయిర్ సెపరేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఏడాదిన్నర క్రితం ఈ పనులకు శంకుస్థాపన చేయగా, ప్రస్తుతం నిర్మాణాలు పూర్తిచేసుకుంది. రూ.175 కోట్లతో ఏర్పాటైన ప్లాంట్లను సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయం నుంచి ఉదయం ప్రారంభించారు. అజైల్లో ఇంటర్న్షిప్ చేయడానికి వివిధ కళాశాలల నుంచి ఎంపికై న ఆరుగురు అభ్యర్థులకు సీఎం స్టాలిన్ సర్టిఫికెట్లను అందజేశారు. పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా, ప్రధాన కార్యదర్శి మురుగానందం, పరిశ్రమల శాఖ కార్యదర్శి వి.అరుణ్రాయ్, తమిళనాడు కెరీర్ గైడెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలర్మేల్ మంగై పాల్గొన్నారు. కాగా, నాగపట్నంలో మినీ టైడల్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర పరిశీలన నివేదిక సమర్పణకు కమిటీని నియమిస్తూ సీఎం ఆదేశాలు ఇచ్చారు. పరందూరు పనులపై సమీక్ష... అనంతరం సచివాలయంలో చైన్నెలో రెండవ విమానాశ్రయం కోసం ఎంపిక చేసిన పరందూరు పరిసరాల్లో సాగుతున్న స్థల సేకరణపై సీఎం స్టాలిన్ అధికారులతో సమీక్షించారు. కాంచీపురం జిల్లా పరందూరులో ఈ విమానాశ్రయం 20 గ్రామాలను కలుపుతూ నిర్మించనున్న విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ఏకనాపురం వేదికగా నిరసన ఉద్యమం సాగుతోంది. పదికి పైగా గ్రామాల ప్రజలు విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో స్థలసేకరణ వేగవంతంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్న స్థల సేకరణ పనులు, ఆతర్వాత చేపట్టాల్సిన ఇతర పనులు, అనుమతులకు సంబంధించి అధికారులతో సీఎం స్టాలిన్ సమీక్షించారు. సీఎంకు అధికారులు సమగ్ర వివరాలను తెలియజేశారు. విమానాశ్రయానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం, ఆ గ్రామాల్లో చేపట్టాల్సిన స్థల సేకరణ అంశాల గురించి సీఎంకు అధికారులు వివరించారు. అలాగే, చెంగల్పట్టు జిల్లా కదంబూర్ గ్రామంలో ఏర్పాటు చేయనున్న ప్రపంచస్థాయి జీవవైవిధ్య పరిరక్షణ ఉద్యానవనం గురించి సీఎం ప్రత్యేకంగా సంబంధిత అధికారులతో సమీక్షించి, పలు సూచనలు ఇచ్చారు. మంత్రులు తంగం తెన్నరసు ,రాజకన్నప్పన్ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలను విచారించే లోకాయుక్త న్యాయరంగానికి సంబంధించి సభ్యుడి నియామకం నిమిత్తం కమిటీ సమావేశం జరిగింది. ఇందులో సీఎం స్టాలిన్, స్పీకర్ అప్పావు పాల్గొనగా, ప్రధాన ప్రతి పక్షనేత పళనిస్వామి గైర్హాజరయ్యారు. కాగా, రష్యా పర్యటన ముగించుకుని చైన్నెకు డీఎంకే ఎంపి కనిమొళి చేరుకున్నారు. ముందుగా ఆమె సీఎం స్టాలిన్ను కలిసి తన పర్యటన గురించి వివరించారు. ఈనెల 11,12 తేదీల్లో సేలం, ఈరోడ్ జిల్లాలో పర్యటనకు సీఎం స్టాలిన్ సిద్ధమవుతున్నారు. న్యూస్రీల్ ఏఐతో విడిభాగాల తయారీ పరిశ్రమ రూ.300 కోట్లతో ఏర్పాటు రాణిపేటలో రూ.175 కోట్లతో ఎయిర్ సెపరేషన్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం స్టాలిన్ లోకాయుక్త కమిటీతో సమావేశం -
ఆర్ట్స్ అండ్ సైన్స్కు డిమాండ్
● కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీకి శ్రీకారం ● ఐదు కళాశాలలకు లక్షన్నర దరఖాస్తులు ● సీట్ల పెంపునకు విజ్ఞప్తి సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ప్రత్యక్ష కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీకి ఆయా కళాశాలలో బుధవారం శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని ఐదు కళాశాలలకు ఏకంగా లక్షన్నర దరఖాస్తులు రావడంతో సీట్లకు పోటీ పెరిగినట్లైంది. గత నెల ప్లస్టూ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్లోని కీలకం మినహా తక్కిన కోర్సులపైన మక్కువ తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులకు డిమాండ్ మరింతగా పెరిగినట్లైంది. రాష్ట్రంలో కొత్తగా గత నెల ఏర్పాటు చేసిన 11 కళాశాలతో పాటు మొత్తం 180 ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో డిగ్రీ కోర్సులకు సంబంధించి లక్షా 25 వేల సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించగా 2.25 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో లక్షా 84 వేల 762 మంది దరఖాస్తు రుసుం సైతం చెల్లించారు. వీటిలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఏ తమిళ్, బీకాం, బీఏ ఇంగ్లిషు, బీబీఏ, బీఎస్సీ కెమిస్ట్రీ కోర్సులకు డిమాండ్ మరింత పెరిగింది. బుధవారం ఉదయం నుంచి ఆయా కళాశాలలో విద్యార్థుల మెరిట్ ఆధారంగా సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఐదు కళాశాలలకు 60 శాతం దరఖాస్తులు రాష్ట్రంలో 180 కళాశాలలు ఉండగా, ఐదు కళాశాలల ఖాతాలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం దరఖాస్తుల సంఖ్యలో 60 శాతం పడింది. చైన్నెలో రాజధాని కళాశాల జాబితాలో ముందంజలో ఉంది. ఈ కళాశాలలో 2,380 సీట్లు ఉన్నాయి. వీటి కోసం 40,167 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడం విశేషం. ఆ తర్వాత కోయంబత్తూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఉంది. ఇక్కడ 1,727 సీట్లు ఉండగా 33,705 మంది దరఖాస్తు చేసుకున్నారు. చైన్నె నందనం కళాశాలలో 1,430 సీట్లు ఉండగా 29, 376, వ్యాసార్పాడి అంబేడ్కర్ కళాశాలలో 1,086 సీట్లు ఉండగా 29, 275, తిరుచ్చి తందైపెరియార్ ఆర్ట్స్ కళాశాలలో 1,600 సీట్లు ఉండగా 24, 396 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఐదు కళాశాల్లో చేరడానికి లక్షన్నర మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడం విశేషం. ఈ ఐదు కళాశాల్లో సీట్లకు డిమాండ్ రెట్టింపుగా మారింది. ఇక, ఇతర కళాశాలలోనూ సీట్ల కన్నా ఎక్కువగానే దరఖాస్తులు వచ్చిన దష్ట్యా, సీట్లను పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని ఉన్నత విద్యాశాఖకు వినతులు చేరుతున్నాయి. -
8న మదురైకు అమిత్షా
● ఏర్పాట్లలో బీజేపీ వర్గాలు ● సంప్రదింపులకు నేతల ముందస్తు ప్రయత్నాలు సాక్షి, చైన్నె: కేంద్ర హోంమంత్రి అమిత్షా ఈనెల 8న మదురై రానున్నారు. ఒత్తకడైలో జరిగే బీజేపీ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో అమిత్షా రాష్ట్ర పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో కోయంబత్తూరులోనూ, మార్చిలో అరక్కోణంలోనూ జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఏప్రిల్లో ఆయన చైన్నెలో రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టి అన్నాడీఎంకే నేతృత్వంలో రాష్ట్రంలో కూటమి ఏర్పాటు ప్రకటన చేసి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో నెల రోజుల విరామం తర్వాత ఈనెల 8న అమిత్షా మళ్లీ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మదురై ఒత్తకడైలో బీజేపీ నేతృత్వంలో కార్యక్రమం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు అమిత్షా రానున్నారు. మదురైలో ఈనెల 22వ తేదీ మురుగన్ భక్తుల మహానాడుకు బీజేపీ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జరగనున్న కార్యక్రమానికి అమిత్ షా హాజరు కానుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్షాతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి భేటీకి అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అదేసమయంలో తాము ఎన్డీఏ కూటమిలో ఉన్నామని అన్నాడీఎంకే బహిష్కృత నేతలు మాజీ సీఎం పన్నీరుసెల్వం, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నేతలతో పాటు కూటమిపై దృష్టి పెట్టే దిశగా ఉన్న మరికొన్ని పార్టీల నేతలు అమిత్షాను కలిసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. అదేసమయంలో అమిత్షా రానున్న నేపథ్యంలో తమ కూటమిలోకి చేరేందుకు పార్టీలు ముందుకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ పిలుపునివ్వడం గమనార్హం. ప్రధానంగా డీఎండీకే, పీఎంకేలతోపాటు మరికొన్ని పార్టీలను ఆయన ఆహ్వానించారు. రెండు ఇగువానాలు స్వాధీనం అన్నానగర్: కౌలాలంపూర్ నుంచి అరుదైన ఇగువానాలను(పెద్దబల్లులు) అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్న్స్ యూనిట్ అధికారులకు సమాచారం అందింది. మంగళవారం రాత్రి కౌలాలంపూర్ నుంచి ‘బాటిక్ ఎయిర్‘ విమానం తిరుచ్చికి వచ్చి చేరింది. కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను, వస్తువులను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఒక ప్రయాణికుడి సూట్కేస్లో నల్లటి సంచుల్లో రెండు ఇగువానాలు ఉన్నట్టు గుర్తించారు. వాటి నోళ్లు, కాళ్లు టేప్తో చుట్టిఉన్నాయి. కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని, ప్రయాణికుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్లను అప్రమత్తం చేసే ఏఐ సాక్షి, చైన్నె : రాత్రి వేళలో బస్సులు నడిపే సమయంలో నిద్ర మత్తులోకి జారుకునే డ్రైవర్లను అప్రమత్తం చేసే దిశగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అత్యాధునిక విధానాన్ని అనుసరించేందుకు రాష్ట్ర రవాణా సంస్థ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.2 కోట్లతో 500 బస్సులో కెమెరాలు, స్కానర్, అలర్ట్ అలారంతో కూడిన ప్రత్యేక పరికరాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు చైన్నె నుంచి సుదూర ప్రాంతాలకు రాత్రివేళలో అఽత్యధికంగా వెళుతుంటాయి. డ్రైవర్ల నిద్ర మత్తులోకి జారుకున్న పక్షంలో ప్రమాదాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో రవాణా సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రైవర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా చర్యలు చేపట్టేందుకు రెడీ అయ్యింది. తొలిదశలో 500 సుదూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఈ ఆధునిక పరికరాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు బస్సులో నాలుగు కెమెరాలను ఆమర్చనున్నారు. రెండు కెమెరాలు ప్రయాణికుల కోసం, మరో కెమెరా డ్రైవర్ కోసం, ఇంకో కెమెరా రోడ్డును సూచించేలా ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాలకు ఏఐ టెక్నాలజీ ఆధారంగా ప్రత్యేక స్కానర్ను పొందు పరచనున్నారు. డ్రైవర్ సీటుకు సమీపంలో ఉండే ఈ స్కానర్ డ్రైవర్ అతడి ముఖ కవళికలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుంటుంది. నిద్రమత్తులోకి జారిన, ఆవులించినా లేదా, అలసటతో ఉన్నట్టు తేలినా తక్షణం అప్రమత్తం చేసేలా అలారంతో కూడిన హెచ్చరికలను ఏఐ టెక్నాలజీ చేస్తుంది. అదే సమయంలో ఎవరైనా మద్యం సేవించి డ్రైవర్ బస్సు నడిపినా, ఈ టెక్నాలజీ ఇట్టే పసిగట్టేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. త్వరలో సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులలో ఈ విధానం అమలులోకి రాబోతున్నట్టు రవాణా సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. -
క్లుప్తంగా
వేలూరులో ఈవీఎంల తనిఖీ వేలూరు: వేలూరు జిల్లాలో వివిధ ఎన్నికల కోసం వినియోగించిన ఈవీఎంలను వేలూరు కలెక్టరేట్ వెనుక వైపున ఉన్న గోడౌన్లో భద్రపరిచారు. ఈ గోడౌన్కు సీల్ వేసి పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆధ్వర్యంలో కలెక్టర్ సుబ్బలక్ష్మి గోడౌన్లో ఉంచిన ఈవీఎంలను తనిఖీ చేశారు. అనంతరం ఈవీఎంలు సక్రమంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతనిధుల ఆధ్వర్యంలో తనిఖీ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఎన్నికల ప్రత్యేక తహసీల్దార్ సత్యమూర్తి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చంద్రప్రకాష్, రఘు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యుత్షాక్తో బీమా అధికారి మృతి అన్నానగర్: విద్యుత్షాక్కు గురై ఓ బీమా అధికారి మృతిచెందాడు. సేలం జిల్లాలోని వాళపాడికి చెందిన ప్రకాష్రాజ్ (35). ఇతను కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ బీమా కంపెనీలో మేనేజర్. ఈ పరిస్థితిలో, అతను ఇంటర్న్షిప్ కోసం చైన్నె సమీపం కోడంబాక్కంలోని బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లాడు. బుధవారం అతను వల్లువర్కోట్టం సమీపంలోని దుకాణంలో టీ తాగుతున్నాడు. ఆ సమయంలో, అతను అక్కడ ఉన్న ప్రకటన బోర్డుపై చేయి పెట్టాడు. విద్యుత్షాక్కు గురై మృతిచెందాడు. నుంగంబాక్కం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని మహిళ దుర్మరణం అన్నానగర్: కారు ఢీకొని ఓ మహిళ దుర్మరణం చెందింది. చైన్నెలోని ఓల్డ్ వాషర్మన్న్పేట ప్రాంతానికి చెందిన వలర్మతి (45). ఆమె తిరువల్లికేణిలోని భారతిసాలైలోని పుస్తక దుకాణంలో పనిచేస్తుంది. ఈమె మంగళవారం రాత్రి 9 గంటలకు పనిముగించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. కలైవానర్ అరంగం ఎదురుగా ఉన్న వాలాజాసాలైను దాటుతుండగా అటుగా వస్తున్న కారు ఆమెను ఢీకొంది. ఈప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అన్నా సదుక్కం పోలీసులు కేసు నమోదు చేసి కారు నడుపుతున్న అశోక్కుమార్ (70)ను అరెస్టు చేశారు. ఇతను చింతాద్రిపేట రిచ్ స్ట్రీట్లో ఎలక్ట్రానిక్స్ దుకాణం నడుపుతున్నాడు. 2018 నుంచి తమిళనాడు అనే పదం లేదు తిరువొత్తియూరు: 2018 నుంచి రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల ముందు భాగంలో తమిళనాడు అనే పదాన్ని ప్రస్తావించలేదని అన్నా కార్మిక సంఘం యూనియన్ కార్యదర్శి కమలకన్నన్ తెలిపారు. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ అనేది మన రాష్ట్ర ప్రభుత్వ బస్సులకు గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి, రవాణా సంస్థ బస్సులపై పట్టణం ,ఊరు పేరు ఉన్నందున చాలా సంవత్సరాలుగా తమిళనాడు పేరు ప్రస్తావించలేదని, 2018లో కొత్త బస్సులను కొనుగోలు చేసిన సమయంలో కూడా, తమిళనాడు అనే పేరు లేకుండా ఊరు పేరు ప్రస్తావించినట్లు తెలిపారు. ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‘ అనే పేరు పెద్దగా ఉంటుందని రాయలేదు తప్ప, వేరే కారణం లేదన్నారు. ఇప్పుడు దాన్ని తొలగించారని ఆరోపించడం తప్పిదమే అవుతుందని తెలిపారు. 1,608 అదనపు బస్సులు కొరుక్కుపేట: బక్రీద్ పండుగతోపాటు ముహుర్తాలు ఉన్న నేపథ్యంలో రవాణా శాఖ 1608 అదనపు బస్సులను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం బక్రీద్ పండుగ, అలాగే శని, ఆదివారాలు, 7, 8 తేదీలు వారాంతపు సెలవు దినాల్లో చైన్నె, ఇతర ప్రాంతాల నుంచి అదనపు ప్రత్యేక బస్సులు నడపాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం చైన్నెలోని కీలంబాక్కం నుంచి తిరువణ్ణామలై, తిరుచ్చి, కుంభకోణం, మధురై, తిరునెల్వేలి, నాగర్కోయిల్, కన్యాకుమారి, తూత్తుకుడి, కోయంబత్తూర్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్కు 520 బస్సులు, శనివారం 550 బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే శుక్రవారం చైన్నెలోని కోయంబేడు నుంచి తిరువన్నామలై, నాగపట్నం, వేలంకన్ని, హోసూర్, బెంగళూరుకు 100 బస్సులు నడుస్తాయన్నారు. తరువాత రోజు శనివారం 90 బస్సులు నడుస్తాయన్నారు. ఇంకా, మాధవరం నుంచి శుక్ర, శనివారాల్లో 24 బస్సులు, బెంగళూరు, తిరుప్పూర్, ఈరోడ్ , కోయంబత్తూర్ నుంచి వివిధ గమ్యస్థానాలకు 300 బస్సులతో మొత్తం 1,608 అదనపు ప్రత్యేక బస్సులు నడపాలని యోచిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. -
పక్షులను భయపెట్టే థండర్ బూమ్స్
● విమానాశ్రయంలో చర్యలుసాక్షి, చైన్నె: విమానాశ్రయం పరిసరాల్లో ఎగిరే కాకులు, ఇతర పక్షులను కట్టడి చేసేందుకు థండర్ బూమ్స్ను సిద్ధం చేశారు. వీటి నుంచి వెలువడే శబ్దం వాటిని భయపెట్టే విధంగా ఉంది. చైన్నె మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు నాలుగు వందలకు పైగా విమానాల సేవలు ఇక్కడ జరుగుతున్నాయి. విమానాశ్రయం రన్వేకు కూతవేటు దూరంలోని పరిసరాల్లో దట్టమైన పొదళ్లతో నిండిన ప్రదేశం, కొండ ప్రాంతం, అడయార్ నదీ తీరం ఉన్నాయి. ఇక్కడ కాకులు ఇతర పక్షులు అనేకం ఉన్నాయి. ఇవి విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో తీవ్ర సమస్యగా మారాయి. ల్యాండింగ్, టేకాఫ్కు ముందుగా వీటిని భయపెట్టే విధంగా గాల్లో ఫైర్ చేయడం లేదా, బాణసంచాను గాల్లో పేల్చడం చేస్తున్నారు. ఈ కారణంగా పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నట్టు తెలిసింది. అంతేకాదు బాణసంచాల రూపంలో నిప్పురవ్వల రూపంలో చిన్నచిన్న ప్రమాదాలు తప్పడం లేదు. దీంతో పర్యావరణానికి హానీ కలిగించకుండా కాకులు, పక్షులు రన్వేలోకి రాకుండా బెదిరించే విధంగా కొత్త బాటను ఎంపిక చేశారు. ఇందులోభాగంగాఽ థండర్ బూమ్స్ పేరిట సిద్ధం చేసిన ఈ పరికరం నుంచి వెలువడే శబ్దం, ఇందులో నుంచి వెలువడే వెలుతురు వర్షం పడే సమయంలో ఉండే ఉరుములు, మెరుపులను తలపించే విధంగా ఉండడం గమనార్హం. వీటిని బుధవారం విమానాశ్రయం రన్వే పరిసరాల్లో ఏర్పాటు చేశారు. వీటిని అధికారులు పరిశీలించారు. 30 పరికరాలను సిద్ధం చేశారు. పర్యావరణ కాలుష్యానికి ఆస్కారం ఇవ్వకుండా, నిప్పు రవ్వులు బయటకు రాకుండా ఉండే రీతిలో ఈ థండర్ బూమ్స్ ద్వారా భయపెట్టే పక్షులను పనిలో పడ్డారు. అలాగే, రన్వేలో దూసుకెళ్లేందుకు వీలుగా టిప్ పింక్ కార్డ్ వాహనాలను సైతం రంగంలోకి దించారు. -
డీఎంకే వైపు డీఎండీకే చూపు
సాక్షి, చైన్నె : రానున్న 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి వైపు ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే చూపు పడ్డట్టు తెలిసింది. తమను పదే పదే అన్నాడీఎంకే మోసం చేసిన దృష్ట్యా, ఈ సారి వారికి గుణపాఠం చెప్పే దిశగా డీఎంకేకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. అందుకే దివంగత డీఎంకే నేత కరుణానిధిని పొగడ్తలతో ముంచెత్తినట్టు చర్చ జరుగుతోంది. దివంగత నేత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్టీ ఆవిర్భావంతో ఎదుర్కొన్న రెండవ ఎన్నికల్లోనే ప్రధాన ప్రతిపక్ష నేతగా విజయకాంత్ అవతరించారు. అయితే, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలితతో వైరం ఆయన్ను, ఆయన పార్టీని డీలా పడేలా చేసింది. 2016లో తన నేతృత్వంలో మెగా కూటమిని ఏర్పాటు చేసినా జయలలిత హవా ముందు పాచికలు పారలేదు. ఆతర్వాత క్రమంగా పతనం వైపు సాగినా, దృడ సంకల్పంతో పార్టీని నడిపించారు. ప్రస్తుతం విజయకాంత్ జీవించి లేరు. ఆయన మరణం తర్వాత 2024 లోక్సభ ఎన్నికలను డీఎండీకే ఎదుర్కొంది. అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికల్లోకి వెళ్లి, కొన్నిచోట్ల డీఎంకే కూటమికి గట్టి పోటీ ఇచ్చింది. తమ కంటూ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఉందని, విజయకాంత్పై ఆ మేరకు అభిమానం ఉందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ తరచూ చాటుకుంటూ వస్తున్నారు. ఈ సారి రూటు మార్చే దిశగా గతంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను నమ్ముకుని రాజ్యసభ వ్యవహారంలో గానీ, కేంద్రం పదవులపరంగా తమకు అన్యాయం జరిగిందన్న వాదనను డీఎండీకే వర్గాలు తరచూ వెలుగులోకి తెస్తుంటారు. దివంగత జయలలిత హయంలో గానీ, ప్రస్తుతం పళణి స్వామి రూపంలోగానీ అన్నాడీఎంకే ద్వారా సైతం తమకు అన్యాయం జరగడంతో ఈసారి ఎన్నికల్లో రూట మార్చే దిశగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ఉన్నట్టు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అన్నాడీఎంకే, బీజేపీలకు వ్యతిరేకంగా ఈ సారి డీఎంకే కూటమిలోకి చేరి, వారు ఇచ్చే సీట్లతో సర్దుకుని ఎన్నికలను ఎదుర్కొనే దిశగా వ్యూహరచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇచ్చిన వాగ్దానం, నమ్ముకున్న కూటమిలోని వారికి డీఎంకే న్యాయం చేస్తూ ముందుకెళ్తున్న దృష్ట్యా, వారినే నమ్ముకోవడం మంచిదన్న సూచనను ఇప్పటికే పలువురు నేతలు ప్రేమలతకు తెలియజేసినట్టు సమాచారం. ఇక డీఎంకేను పల్లెత్తి మాట అనకుంట జాగ్రత్తగా అడుగులు వేయాలని నేతలకు సంకేతాలు పంపించినట్టు డీఎండీకేలో చర్చ జరుగుతోంది. ఒక వేళ డీఎంకే తలుపులు తెరుచుకోని పక్షంలో ప్రత్యామ్నాయం మీద దృష్టి పెట్టే విధంగా విజయ్ టీవీకే వైపు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయా అనేది వేచిచూడాల్సిందే. ● ప్రేమలత రూటు మార్చేనా? -
ఘనంగా సత్వచ్చారి గంగమ్మ జాతర
వేలూరు: వేలూరు సత్వచ్చారిలోని గంగమ్మ జాతర బుధవారం ఉదయం కోలాహలంగా జరిగింది. ముందుగా అమ్మవారి శిరస్సును మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి శిరస్సు పూజలు నిర్వహించి పుష్ఫాలంకరణలు చేసిన రథంలో ఆశీనులు చేశారు. అనంతరం రథం ఊరేగింపుగా సత్వచ్చారిలోని పురవీధుల్లో వచ్చింది. భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని అమ్మవారి రథాన్ని లాగారు. అదేవిధంగా రథంపై భక్తులు బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు చెల్లించుకున్నారు. సంతానంలేని మహిళా భక్తులు తడిబట్టలతో వచ్చి అమ్మవారికి కర్పూర హారతులు పట్టారు. అనంతరం అమ్మవారి రథాన్ని ఆలయం వద్దకు తీసుకొచ్చి ఆలయంలోని విగ్రహంపై శిరస్సును ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణలు నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు పొంగుల్లు పెట్టి వివిధ వేషధారణలు ధరించి అమ్మవారికి అంబలి, పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలాఉండగా భక్తులకు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మధ్యాహ్నం అన్నదానంతోపాటు నీరు, మజ్జిగ వంటి వాటిని అందజేశారు. అదేవిధంగా సత్వచ్చారిలోని ప్రయివేటు కల్యాణ మండపంలో వారాహి స్వామిజీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఇందులో దేవదాయశాఖ చైర్మన్ అశోకన్, వార్డు కార్పొరేటర్ మనోహరన్, భక్తులు పాల్గొన్నారు. -
ఎయిర్ఫోర్స్ కాలేజీ సందర్శన
కొరుక్కుపేట: కోయంబుత్తూరులోని ఎయిర్ఫోర్స్ కాలేజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో సీనియర్ ఎయిర్ఫోర్స్ ట్రైనింగ్ కమాండ్ ఆఫీసర్ ఎయిర్మార్షల్ పీకే ఘోష్ ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు మూడురోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ఆయనకు కళాశాల కమాండెంట్ వికాస్ వాగి ఘనస్వాగతం ఫలికారు. కళాశాల ప్రాంగణంలో గౌరవ వందనం సమర్పిస్తూ ఎయిర్ మార్షల్ ఘోష్ను ఆహ్వానించారు. ఆ తరువాత కళాశాల పనితీరు గురించి ఆయనకు వివరించారు. శిక్షణ కోర్సులు, కీలక విభాగాలను పరిశీలించిన ఎయిర్ మార్షల్ ఘోష్ దేశ గగన తల భద్రత గురించి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని వైమానికదళ అధికారులను కోరారు. భవిష్యత్ సవాళ్లను భారత వైమానిక దళం తర్వాత తరం ఫైలట్లను సిద్ధం చేయడానికి కళాశాల పరిపాలన కృషిని కొనసాగించాలని ఆయన కోరారు. -
తండ్రి మరణ వార్త తెలియకముందే..
● అప్పుల బాధతో కుమారుడు ఆత్మహత్య సేలం: నామక్కల్– తిరుచెంగోడ్లో అప్పులు చేసి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన మెడికల్ ఏజెన్సీ యజమాని విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మరణ వార్తను తెలియజేయడానికి ప్రయత్నిస్తుండగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్లోని నిరాశ్రయులైన కాలనీలో నివసిస్తున్న గోవిందన్ (68) కు భార్య పూంగోడి, కుమార్తె కీర్తిక, కుమారుడు బాలమురుగన్ (36) ఉన్నారు. ఇద్దరూ వివాహితులు. గోవిందన్ దంపతులు కుమారుడితో నివసిస్తున్నారు. గోవిందన్ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. మంగళవారం రాత్రి తండ్రి మరణవార్తను తెలియజేయడానికి పళనికి వెళ్లిన బాలమురుగన్కు బంధువులు ఫోన్ చేయగా, అతను ఫోన్ తీయలేదు. అనుమానం వచ్చిన బంధువులు సంగకిరి రోడ్డులోని బాలమురుగన్ మెడికల్ ఏజెన్సీ దుకాణానికి వెళ్లి చూడగా దుకాణం లోపలి నుంచి తాళం వేసి ఉంది. తలుపు పగులగొట్టి చూడగా బాలమురుగన్ నోటి నుంచి నురగలు కారుతూ చనిపోయి కనిపించాడు. ఆన్న్లైన్ ట్రేడింగ్, స్టాక్ మార్కెట్లో నష్టాలు రావడంతో అతను రుణం తిరిగి చెల్లించలేకపోయాడని చెబుతున్నారు. అప్పుల బాద భరించలేక బాలమురుగన్ పళనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. దుకాణంలోని విషపూరిత మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. విషయం తెలిసి సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం తిరుచెంగోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. ఒకే కుటుంబంలో అప్పుల సమస్యల కారణంగా తండ్రి గుండెపోటుతో మరణించగా, కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆత్మహత్య చేసుకున్న బాలమురుగన్కు భార్య తమిళరసి, ఏడేళ్ల కుమారుడు, రెండున్నరేళ్ల కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సినీ జ్ఞాని మణిరత్నం
తమిళసినిమా: కమలహాసన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం థగ్లైఫ్. నటుడు శింబు, త్రిష, నాజర్ జోజు జార్జ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని కమలహాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, మణిరత్నం కు చెందిన మెడ్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని, రవి కే.చంద్రన్ చాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య గురువారం కర్ణాటక మినహా ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చైన్నెలోని ఒక నక్షత్ర హోటల్లో మీడియాతో ముచ్చటించారు. కమలహాసన్ మాట్లాడుతూ తాము సినిమాలో ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నామని అన్నారు. అలాంటి మరో వినూత్న ప్రయత్నమే థగ్లైఫ్ అన్నారు. నాయగన్ చిత్ర సమయంలో తాను చూసిన యువ మణిరత్నం ఇప్పుడు సినీ జ్ఞాని అని పేర్కొన్నారు. షూటింగ్లో ఒక్క క్లోజప్ షూట్ చేయడానికి 50 మంది సాంకేతిక వర్గం పనిచేస్తుందన్నారు. ఈ చిత్రంలో పలువురు అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పని చేశారని, వారి అభినందనలు పొందే విధంగా మన సాంకేతిక వర్గం పనిచేశారని కమల్ తెలిపారు. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు యూనిట్ కళ్లలో సంతోషం కనిపించిందన్నారు. అదే సంతోషం చిత్రం చూసిన తరువాత మీకు కలుగుతుందే నమ్మకం ఉందన్నారు. తనకు అండగా నిలిచిన తమిళనాడుకు ధన్యవాదాలు అని కమలహాసన్ అన్నారు. శింబు, నాజర్, అశోక్ సెల్వన్, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
మార్చురీలో మృతదేహం మాయం
తిరువళ్లూరు: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధుడి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించాలని మార్చురీలో వుంచిన క్రమంలో బుధవారం వృద్ధుడి మృతదేహం అదృశ్యమైంది. తిరువళ్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ రాజేంద్రన్(61). ఇతను కడుపునొప్పి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. తిరువళ్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేంద్రన్ మృతి చెందాడు. మృతదేహానికి పంచనామ నిర్వహించాల్సిన క్రమంలో బాధితులు పోలీస్స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీని తీసుకుని రావడానికి మంగళవారం వెళ్లారు. అక్కడ అనుమతి కాపీ తీసుకుని బుధవారం మధ్యాహ్నం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు. అక్కడ రాజేంద్రన్ మృతదేహానికి బదులు వేరే వ్యక్తి మృతదేహాన్ని బంధువులకు అప్పగించి తీసుకెళ్లాలని కోరారు. దీంతో రాజేంద్రన్ బంధువులు షాక్కు గురైయ్యారు. సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మార్చురీ వద్ద ఆందోళన చేశారు. పోలీసుల దర్యాప్తులో రెండు రోజుల క్రితం వెంగళ్ సమీపంలో ఎల్అండ్టీ సంస్థ రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న బిహార్ రాష్ట్రం నలంద జిల్లాకు చెందిన మనోజ్ మంజీ(55) అనారోగ్యంతో మృతి చెందినట్టు గుర్తించారు. అతడి మృతదేహాన్ని సైతం మార్చురీలో వుంచిన క్రమంలో శవపరీక్ష నిర్వహించిన తరువాత రాజేంద్రన్ మృతదేహాన్ని మంజీగా భావించి బిహార్కు తరలించినట్టు నిర్ధారించారు. వెంటనే నాగపూర్ వద్ద వెళుతున్న వాహనాన్ని వెనుక్కి తీసుకుని రావాలని ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం మృతదేహం తిరువళ్లూరుకు చేరే అవకాశం వుందని పోలీసులు తెలిపారు. పోలీసుల హామీతో బంధువులు ఆందోళననూ విరమించారు. మృతదేహాన్ని మార్చి బిహార్కు తరలింపు సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో కలకలం -
రాజ్యసభ అభ్యర్థులకు మద్దతు
● 20 మంది చొప్పున ఎమ్మెల్యే సంతకాలు ●మదురై నుంచి పళణి టూర్సాక్షి, చైన్నె : తమ పార్టీ తరఫున పోటీ చేయనున్న రాజ్యసభ అభ్యర్థులకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. వీరి నామినేషన్లను ప్రతిపాదిస్తూ 20 మంది చొప్పున ఎమ్మెల్యేలు బుధవారం సంతకాలు చేశారు. రాజ్యసభ నామినేషన్ల పర్వం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నికల వీరుడు పద్మరాజన్, సామాజిక కార్యకర్త అగ్ని ఆళ్వార్లు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. వీరికి ఎమ్మెల్యేల మద్దతు లేని దృష్ట్యా, తిరస్కరణకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇక డీఎంకే తరఫున విల్సన్, సల్మా, ఎస్ఆర్ శివలింగం అభ్యర్థులుగా ఎంపికయ్యారు. ఈ కూటమి తరపున నటుడు కమల్కు అవకాశం కల్పించారు. వీరంతా నామినేషన్లు దాఖలు చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. గురువారం వీరు నామినేషన్లు దాఖలు చేయవచ్చన్న సమాచారం వెలువడింది. అదే సమయంలో అన్నాడీఎంకే తరఫున న్యాయవాది, మాజీ ఎమ్మెల్యే ఇన్బదురై, మాజీ ఎమ్మెల్యేఽ ఎం ధనపాల్ ఎంపిక అయ్యారు. వీరికి ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తూ నామినేషన్ పత్రంలో ప్రతిపాదన సంతకాలు బుధవారం చేశారు. రాయపేటలోని పార్టీ కార్యాలయంలో ఉదయం ఎమ్మెల్యేలతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి సమావేశమయ్యారు. అభ్యర్థులకు మద్దతుగా 20 మంది చొప్పున ఎమ్మెల్యే సంకతాలు చేశారు. ఇన్బదురై, ధనపాల్ అభ్యర్థిత్వానికి తమ మద్దతుతో ప్రతిపాదించారు. ఈ ఇద్దరు కూడా గురువారం నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఎమ్మెల్యేల సమావేశంలో పళణి స్వామి రాష్ట్ర పర్యటన గురించి చర్చ జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. జూలై మొదటి వారం నుంచి పళణి స్వామి నియోజకవర్గాల వారీగా పర్యటించనున్నట్టు, ఇందుకు సంబంధించిన రూట్మ్యాప్ సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యేలతో పళనిస్వామి చర్చించి పలు సూచనలు చేసినట్టు చెబుతున్నారు. తొలుత కోయంబత్తూరు నుంచి ప్రారంభించాలని నిర్ణయించినా, తాజాగా మదురై నుంచి తన పర్యటనకు పళణి రూట్మ్యాప్ను సిద్ధం చేసుకున్నట్టు ఓ నేత పేర్కొన్నారు. ఎమ్మెల్యేలందరూ స్థానిక సమస్యలపై పట్టు సాధించాలని, ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని పళణి స్వామి ఆదేశించినట్టు తెలిసింది. -
వైభవంగా అర్ధనారీశ్వర తీర్థోత్సవాలు
సేలం: నామక్కల్–నమక్కల్ జిల్లా తిరుచెంగోడులోని ప్రసిద్ధ అర్ధనారీశ్వర ఆలయంలో వైకాసి విశాఖ తీర్థోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం భూదేవి శ్రీదేవి సమేత ఆదికేశవపెరుమాళ్ ఆలయంలో ధ్వజారోహణం వైభవంగా జరిగింది. నాల్గవ పండుగలో నాల్గవ రోజును ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అర్ధనారీశ్వరుడు దేవతల పరివారంతో కలిసి పర్వతం నుంచి బయలుదేరి నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా పర్వత మార్గంలోని మండపాల్లో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు మండప కట్టలను నిర్వహించారు. ఆలయ కార్యదర్శులు, హిందూ, ధార్మిక దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రమణి కాంతన్, ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ తంగముత్తు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. -
సహకార దుకాణానికి అనుమతి
తిరువళ్లూరు: పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో నూతనంగా సహకార శాఖ ఆధ్వర్యంలో దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతినిస్తూ సహకార శాఖ మండల జాయింట్ రిజిస్ట్రార్ షణ్ముగవళ్లి ఉత్తర్వులను అందజేశారు. తిరువళ్లూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటు వైద్యశాల అనుబంధంగా పనిపనిచేస్తోంది. మెడికల్ కళాశాల ఆవరణలో నూతనంగా సహకార శాఖ ఆధ్వర్యంలో దుకాణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే దుకాణం ఏర్పాటుకు సంబందించిన ఉత్తర్వులను మెడికల్ కళాశాల అధికారులకు మండల జాయింట్ రిజిస్ట్రార్ షణ్ముగవళ్లి అందజేశారు. డిప్యూటీ రిజిస్ట్రార్లు శ్రీనివాసన్, అముద, కమిల, మెడికల్ కళాశాల అధికారి ప్రసన్న పాల్గొన్నారు. -
ఉద్యోగం పేరుతో రూ.4లక్షల మోసం
వేలూరు: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4 లక్షలు మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వేలూరు ఎస్పీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం ఎస్పీ మదివాణన్ అధ్యక్షతన ప్రత్యేక గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతులు ఇచ్చారు. వినతులపై వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆయా పోలీస్స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పొయిగైలోని మారియమ్మన్ ఆలయం వీధికి చెందిన తమిళ్సెల్వన్ ఇచ్చిన వినతిలో పేర్కొన్న విధంగా తమ ప్రాంతానికి చెందిన ఒకరు తాను వేలూరు కలెక్టరేట్లో పనిచేస్తున్నానని అతని నకిలీ గుర్తింపు కార్డును చూపించి తమకు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మ బలికి గత ఫిబ్రవరిలో రూ.4 లక్షలు తీసుకున్నారని, ఇంతవరకు ఉద్యోగం ఇప్పించలేదన్నారు. విచారణ జరిపి తాము చెల్లించిన నగదును తిరిగి ఇప్పించాలని కోరారు. అదేవిధంగా వేలూరు ప్రజా సంక్షేమ సంఘం ప్రతినిధి జగదీశన్ ఇచ్చిన వినతిలో పేర్కొన్న విధంగా ఊసూరు, అనకట్టు ప్రాంతంలో రాత్రుల్లో కొంతమంది యువకులు ఆటో, బైకుల్లో రేసింగ్ చేస్తున్నారన్నారు. వినతులను స్వీకరించిన ఎస్పీ విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. డీఎస్పీ సుందరేశన్, పోలీసులు పాల్గొన్నారు. -
● నేతలతో సుదీర్ఘ చర్చ ● ఉద్వాసనలు
సాక్షి, చైన్నె: పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఏమాత్రం తగ్గడం లేదు. తనయుడు అన్బుమణికి మద్దతుగా ఉన్న వాళ్లను పార్టీ నుంచి బయటకు పంపించే పనులను వేగవంతం చేశారు. తనతో కలిసి వచ్చే నేతలతో బుధవారం సుదీర్ఘ సమావేశంలో మునిగారు. పీఎంకేలో అన్బుమణి, రాందాసు మధ్య సాగుతున్న సమరం గురించి తెలిసిందే. ఎవరి బలం ఎంత అన్నట్టుగా ఇద్దరు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో తనకు వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాళ్లను గుర్తించిన రాందాసు పదవుల నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. తాజాగా సేలం, తిరునల్వేలి జిల్లాలకు చెందిన కార్యదర్శులు, నిర్వాహకులను తొలగించారు. దీంతో పదవులను కాపాడుకునే దిశగా కార్యదర్శులు, నేతలు రామన్న నివాసం ఉన్న తైలాపురం గెస్ట్హౌస్ వైపు పరుగులు తీస్తున్నారు. పలు జిల్లాల నుంచి బుధవారం వచ్చిన నేతలు రాందాసుతో సుదీర్ఘంగా సమాలోచనలో పడ్డారు. పార్టీ పరంగా అన్ని అధికారాలు తనకే ఉన్నాయని, అన్బుమణికి ఎలాంటి అధికారాలు లేవని రాందాసు ఈసందర్భంగా స్పష్టం చేసినట్టు తెలిసింది. తన వద్దకు ఏ మేరకు నేతలు వస్తారో, వారందరికి అభయం ఇచ్చి, మిగిలిన వారిని పార్టీ నుంచి తొలగించే విషయంలో తగ్గేది లేదన్నట్టుగా దూకుడు పెంచే దిశలో రాందాసు ఉండడం గమనార్హం. తగ్గని రామన్న! -
కమలహాసన్ ఒంటరయ్యారా?
తమిళసినిమా: నటుడు కమలహాసన్కు సమస్యలు కొత్తేమీ కాదు. ఇంతకుముందు చాలా సమస్యలను ఎదురొడ్డి పోరాడి గెలిచారు. ముఖ్యంగా విశ్వరూపం చిత్రం విడుదల సమయంలో పెద్ద పోరాటమే చేశారు. ఆ సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన కమలహాసన్ తాను వేరే దేశానికి వెళ్లిపోతాను అని చెప్పారు. తాజాగా ఆయన మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం థగ్లైఫ్. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఇటీవల బెంగళూరులో తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందని చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కన్నడ భాష సంఘాలు కమలహాసన్ క్షమాపణ చెప్పాలని, లేకుంటే థగ్లైఫ్ చిత్ర విడుదలను కర్ణాటకలో అడ్డుకుంటామని హెచ్చరించారు. కర్ణాటక రాష్ట్ర రాజకీయ నేతలు కమలహాసన్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. దీంతో కమలహాసన్ కర్ణాటక రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. విశేషం ఏమిటంటే అక్కడ న్యాయమూర్తి కన్నడ ప్రజల మనోభావాలను గాయపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కమలహాసన్కు క్షమాపణ చెప్పడానికి ఈగో ఎందుకు అని ప్రశ్నించడం గమనార్హం. కమలహాసన్ దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి ద్వారా తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే విధంగా లేఖను కోర్టుకు పంపించారు. అయినప్పటికీ న్యాయస్థానం ఆ లేఖను పరిగణనలోకి తీసుకోకుండా క్షమాపణ చెప్పేవరకు థగ్లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో విడుదలను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో తమిళనాడులో కమలహాసన్కు నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్, తమిళం వాళ్ ఉరిమై పార్టీ నేత వేల్ మురుగన్, విడుదలై చిరుతైగళ్ పార్టీ నేత తోల్ తిరుమావళవన్ మద్దతుగా నిలిచారు. ఈ ముగ్గురు మినహా ఇతర పార్టీ నేతలు, సినీ ప్రముఖులు మౌనం వహించడం గమనార్హం. ఇకపోతే కర్ణాటకలో విడుదల కాకపోతే థగ్లైఫ్ చిత్రం రూ.70 కోట్ల ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి. అయినప్పటికీ భాషపై అభిమానం, తాను తప్పు చేయలేదన్న భావన కారణంగా డబ్బును వదులు కోవడానికే కమలహాసన్ సిద్ధపడుతున్నారు. దీంతో పలువురు ఆయన్ని అభినందిస్తున్నారు. అయితే తమిళ భాష విషయంలో కమలహాసన్ ఒంటరి అయ్యారా అనే చర్చ సినీ, రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇకపోతే థగ్లైఫ్ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆటల ప్రదర్శనకు అనుమతినిచ్చింది. ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు రోజుకు 6 ఆటల ప్రదర్శనకు అనుమతినిచ్చింది. -
మనుషీ కోసం కోర్టుకు..
తమిళసినిమా: దర్శకుడిగా, నిర్మాతగా వెట్రిమారన్ చిత్రాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆడుగళం చిత్రం నుంచి ఇటీవల రూపొందించిన విడుదలై–2 వరకు గమనిస్తే ఆయన చిత్రాల్లో సామాజికపరమైన అంశాలే చోటుచేసుకుంటాయి. ఆ తరహాలో దర్శకుడు వెట్రిమారన్ తన గ్రాస్ రూట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం మనుషీ. ఇంతకుముందు నయనతార ప్రధాన పాత్రలో నటించిన అరమ్ చిత్రాన్ని తెరకెక్కించిన గోపినయినార్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం మనుషీ. ఇదికూడా ఉమెన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందిన చిత్రమే. ఇందులో ఆండ్రియా ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రం సెన్సార్ కత్తెరలో చిక్కుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. అందుకు కారణం మనుషీ చిత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ఉండడమేనని సమాచారం. అంతేకాకుండా కమ్యునిస్ట్ పార్టీ లక్ష్యాలను తికమక పెట్టే విధంగా సన్నివేశాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్ర నిర్మాత వెట్రిమారన్ సెన్సార్ సర్టిఫికెట్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్లో సెన్సార్ బోర్డు చెప్పిన అభ్యంతక సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించడానికి సిద్ధమని, చిత్రాన్ని మరోసారి సెన్సార్ చేసే విధంగా ఆదేశించాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై త్వరలో న్యాయస్థానం విచారణ జరపనుంది. కాగా చిత్రాల సర్టిఫికెట్ కోసం దర్శక, నిర్మాతలు కోర్టును ఆశ్రయించడం అరుదైన విషయమే. అదేవిధంగా దర్శక, నిర్మాత వెట్రిమారన్ తొలిసారిగా తాను నిర్మించిన మనుషీ కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిపై తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
నిర్మాతగా రవిమోహన్
తమిళసినిమా: నటుడు రవిమోహన్కు ఇప్పుడు మంచి హిట్ చాలా అవసరం. ఆయన సక్సెస్ను చూసి చాలా కాలమైంది. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన ఇరైవన్, కాదలిక్క సైరన్, నేరమాల్లై వంటి చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. ప్రస్తుతం జీనీ, పరాశక్తి చిత్రాల్లో నటిస్తున్నారు. సుధాకొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి చిత్రంలో రవిమోహన్ ప్రతినాయకుడిగా వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించిన రవిమోహన్, యోగిబాబు హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈయన నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందుకోసం సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇది ఇద్దరు హీరోల కథా చిత్రంగా ఉంటుందని, ఇందులో రవిమోహన్తో పాటు ఎస్ జే.సూర్య మరో హీరోగా నటించనున్నట్లు తెలిసింది. ఇదే నిజమైతే వీరిద్దరూ కలిసి నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రానికి డిక్కిలోనా, వడక్కుపట్టి రామస్వామి చిత్రాల ఫేమ్ కార్తీక్ యోగి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలిసింది. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవిమోహన్ అందుకోసం తనే నిర్మాతగా రంగప్రవేశం చేయనున్నారన్నమాట. -
ఉపాధ్యాయులతో కలెక్టర్ చర్చలు సఫలం
● ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటన తిరువళ్లూరు: ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసే సమయంలో తిరుత్తణిలో ఉపాధ్యాయులను కించ పరిచేలా కలెక్టర్ వ్యవహరించారని ఆరోపిస్తూ గత రెండు నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులతో కలెక్టర్ నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సోమవారం నుంచి ప్రత్యక్ష ఆందోళన నిర్వహించాలని ప్రకటించిన ఉపాధ్యాయులు ఆందోళన వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఉపాద్యాయుల ఆందోళన హెచ్చరిక తీవ్ర ప్రభావం చూపుతుందని భావించిన సీఈఓ మోహన జోక్యం చేసుకుని కలెక్టర్తో చర్చలకు ఉపాధ్యాయులను ఆహ్వానించారు. ఈ చర్చలు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై 8.30 గంటల వరకు జరిగాయి. ఉపాధ్యాయుల వివరణ విన్న కలెక్టర్ సైతం సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ భవిషత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు ఉపాధ్యాయ సంఘాలకు వివరించారు. కలెక్టర్ ప్రతాప్ విచారం వ్యక్తం చేసిన క్రమంలో సోమవారం నుంచి పిలుపునిచ్చిన ఆందోళనను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. -
వారు మాస్కులు ధరించాలి
సాక్షి, చైన్నె : గర్భిణులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు, పౌష్టికాహర లోపంతో బాధపడుతున్న వారు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరిస్తే మంచిదని ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్ సూచించారు. ప్రజలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలని, అయితే, ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కేసుల్లో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఆరోగ్యశాఖ నేతృత్వంలో బుధవారం జరిగిన పల్మనరీ డిసీజ్, ఫ్యాటీ లివర్ వ్యాధి అవగాహన కార్యక్రమంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆరోగ్య మంత్రి ఎంసుబ్రమణియన్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా కేసుల్లో మరణం అన్నది లేదని, త్వరితగతిన కోలుకుంటున్న వారే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. మరణించిన వారికి ఇతర సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని, జ్వరం వంటి సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గర్భిణులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలున్న వారు, పౌష్టికాహార లోపం ఉన్న వారు ఇంటి నుంచి జన సంచార ప్రాంతాలకు వస్తే మాస్కులు ధరించడం మంచిదని సూచించారు. అలాగని అందర్నీ మాస్కులు ధరించమని ఆదేశించడం లేదన్నారు. కాగా, కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో మాస్కులను ధరించే విషయంగా విద్యామంత్రి అన్బిల్ మహేశ్ మాట్లాడుతూ ఆరోగ్య శాఖ సమాచారాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, వారు ఇచ్చే సూచనలకు అనుగుణంగా అవశ్యమైతే విద్యార్థులకు మాస్కులు తప్పని సరి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. -
నన్ను ప్రేమించి.. మరో వ్యక్తితో చాటింగ్ చేస్తావా?
అన్నానగర్: పొల్లాచ్చిలో మంగళవారం పట్టపగలు ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని ప్రియుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. కోయంబత్తూరు జిల్లా, పొల్లాచ్చి సమీపంలోని వడుగపాళయంలోని పొన్ముత్తునగర్కు చెందిన కన్నన్. ఇతను కార్ వర్క్షాప్లో ఉద్యోగి. ఇతని భార్య వనిత. వీరికి అశ్విక (19) సహా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అశ్విక కోవైలోని ఒక ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదేవిధంగా పొల్లాచ్చి–ఉడుమలై రోడ్డులోని అన్నామలైకు చెందిన రాజన్ కుమారుడు ప్రవీణ్కుమార్ (23). ఇతను ఒక ప్రైవేట్ ఆర్థిక సంస్థలో ఉద్యోగి. ఈక్రమంలో అశ్విక, ప్రవీణ్కుమార్ ప్రేమించుకుంటున్నారు. అశ్విక కొన్ని రోజులుగా ప్రవీణ్కుమార్తో మాట్లాడడం మానేసిందని తెలిసింది. ఆగ్రహించిన ప్రవీణ్కుమార్ సోమవారం మధ్యాహ్నం అశ్విక ఒంటిరిగా ఉందని తెలిసి ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి పారిపోయాడు. గమనించిన ఇరుగుపొరుగు వెంటనే కుటుంబసభ్యులకు, పొల్లాచ్చి తాలూకా పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి రక్తపుమడుగులో పడివున్న అశ్వికను పొల్లాచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు గాలిస్తున్నారని తెలిసి ప్రవీణ్కుమార్ పొల్లాచ్చి సిటీ వెస్ట్ పోలీస్స్టేన్లో లొంగిపోయాడు. పోలీసుల విచారణలో అశ్విక మరొక స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోను ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసినట్లు తెలిసింది. ఇది చూసిన ప్రవీణ్కుమార్ అశ్వికను ప్రశించాడు. దీంతో ఆమె ప్రవీణ్కుమార్తో మాట్లాడడం మానేసింది. దీంతో ఆగ్రహించిన ప్రవీణ్కుమార్ అశ్వికను హతమార్చినట్లు తెలిసింది. -
ఆన్లైన్ గేమ్లకు ఆధార్ లింక్ తప్పనిసరి
కొరుక్కుపేట: తమిళనాడులో ఆన్లైన్ గేమ్లను నియంత్రించడానికి ఆన్లైన్ గేమ్ల నియంత్రణ చట్టం– 2022 ప్రకారం నియమాలు ప్రకటించారు. ఆన్లైన్ గేమ్లు ఆడడానికి ఆధార్ లింక్ను తప్పనిసరి చేస్తూ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ఎవరూ ఆటలు ఆడడానికి అనుమతించకూడదని సమయ పరిమితులను విధించాయి. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ప్లే గేమ్స్ 24 ప్లస్ 7 ప్రైవేట్ లిమిటెడ్, హెడ్ డిజిటల్ వర్క్స్, ఎస్పోర్ట్ ప్లేయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇతరుల తరఫున మద్రాసు హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఈ కేసులను విచారించిన జస్టిస్ ఎస్.ఎం.సుబ్రమణ్యం, జస్టిస్ కె.రాజశేఖర్లతో కూడిన ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు చెల్లుబాటు అవుతాయని తీర్పునిచ్చింది.రమ్మీ, పోకర్ వంటి జూదం ఆటలు ప్రజలకు ముప్పు కలిగిస్తున్నందున ఆన్లైన్ ఆటలను నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తీర్పులో పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వ నియమాలు కేంద్ర ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా లేవు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఆన్లైన్ గేమ్ల ప్రతికూల ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ నియంత్రణ నియమాలు తక్షణ అవసరంగా మారాయని తెలిపింది. అలాగే ఆన్లైన్ గేమ్స్కు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి అని హైకోర్టు ఆదేశించింది. -
చదువు పేరుతో సహజీవనం..!
సాక్షి, చెన్నై: సహజీవనం చేస్తూ వచ్చిన ఓ జంట మధ్య వివాదం ప్రేమోన్మాదానికి దారి తీసింది. రక్తగాయాలతో ప్రియురాలి మృతిచెందగా, ఉరి వేసుకున్న స్థితిలో ప్రియుడి మృతదేహం బయట పడింది. ఐసీఎఫ్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. చెన్నై ఐసీఎఫ్ సమీపంలోని రాజీవ్గాందీ నగర్లో కొంత కాలంగా ఓ జంట చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. తామిద్దరం భార్యభర్తగా వీరు పరిసర వాసులకు చెప్పుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో సోమవారం అర్ధరాత్రి కిటికీ వద్ద ఆ ఇంట్లోని యువకుడి మృతదేహం ఉరివేసుకుని శవంగా వేలాడుతుండడాన్ని పొరుగున ఉన్న వారు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లోపల గడియపెట్టి ఉన్న ఇంటి తలుపులు పగులగొట్టారు. లోనికి వెళ్లి చూడగా రక్తగాయాలతో యువతి మరణించి ఉండడం, అక్కడే యువకుడు కిటికీకి ఉరి వేసుకుని మృతిచెంది ఉండడం వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా మంగళవారం ఉదయం కలకలం రేపింది. ఆ ఇంట్లో లభించిన గుర్తింపు కార్డులు, ఇతర కార్డుల ఆధారంగా ఆ ఇద్దరి వివరాలను పోలీసులు సేకరించారు. ఈకేసును సవాల్గా తీసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు మృతదేహాలను కీల్పాకం మార్చురీకి తరలించారు. చదువు పేరుతో సహజీవనం మృతులు ఇరువురు చదువుకుంటూ ప్రాజెక్టు వర్క్ పేరిట వచ్చి ఇక్కడ సహజీవనం చేస్తుండడం వెలుగులోకి వచ్చింది. విల్లుపురం అన్నా ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న ఆకాశ్, అభినయగా గుర్తించారు. అభినయ ఇంగ్లిష్ లిటరేచర్లో బీఏ, ఆకాష్ బీఎస్సీ చదువుతున్నారు. కళాశాలలో ప్రేమించుకుంటూ వచ్చిన ఈ ఇద్దరు ఒక ప్రాజెక్టు వర్క్ పేరిట చెన్నైకు వెళ్తున్నట్టు తల్లిదండ్రులకు చెప్పి వచ్చేశారు. ఐసీఎఫ్ ఆవరణలో ఇంటిని అద్దెకు తీసుకుని భార్యాభర్తలా సహజీవనం చేస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా అప్పుడప్పుడు ఇంటికి, కళాశాలకు వెళుతూ వచ్చినట్టు విచారణలో వెలుగు చూసింది. గత పది రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండడం ఇరుగు పొరుగు గమనించారు. అయితే గొడవ ఎందుకు జరిగింది, అందుకు గల కారణాలు బయటకు రాలేదు. సోమవారం కూడా వీరు గొడవపడినట్టు తెలిసింది. ఆవేశంలో అభినయను కొట్టి చంపేసి, ఆ తర్వాత భయంతో ఆకాశ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు నిర్ధారించారు. ఈ సమాచారం అందుకున్న ఆకాశ్, అభినయ బంధువులు, కుటుంబసభ్యులు షాక్కు గురయ్యారు. ఇరు తరఫు బంధువులను, స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు చదువుల్లో రాణిస్తూ ఉండడంతోనే ప్రాజెక్టు కోసం చెన్నైకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టుగా కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. అయితే, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ జంట సహజీవనం పేరిట ముందుకు సాగి చివరకు ఉన్మాదంతో కూడిన వివాదం రూపంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. -
సముదాయ భవన నిర్మాణానికి భూమిపూజ
తిరువళ్లూరు: చోళవరంలో సుమారు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సముదాయ భవనం నిర్మాణానికి రాష్ట్ర మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్ తదితరులు భూమిపూజ చేశారు. తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్ పంజెట్టి ప్రాంతంలో పొన్నేరి ఎమ్మెల్యే దురై చంద్రశేఖర్ నిధుల నుంచి సముదాయ భవనం నిర్మాణం కోసం రూ.50 లక్షల రూపాయలను కేటాయించారు. ఈ నిధులతో నిర్మించనున్న సముదాయ భవన నిర్మాణానికి మంగళవారం ఉదయం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతాప్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి నాజర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాజర్ మాట్లాడుతూ పనులు నాణ్యతగా ఉండడంతో పాటు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సముదాయ భవనం ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. అనంతరం చోళవరంలోని పాడియనల్లూరు ప్రభుత్వ పాఠశాల తనిఖీ చేశారు. చోళవరంలో రేషన్ దుకాణాలలోని వస్తువులను మంత్రి నాజర్, కలెక్టర్, ఎమ్మెల్యేలు పరిశీలించారు. -
కోలాహలంగా కరుణానిధి జయంతి
తిరువళ్లూరు: మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 102వ జయంతి వేడుకలను తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానం, రక్తదానం, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని కరుణానిధి విగ్రహానికి, వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఆవడిలో మంత్రి నాజర్, తిరువళ్లూరులో ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్, పూందమల్లిలో ఎమ్మెల్యే కృష్ణస్వామి, మధురవాయల్లో ఎమ్మెల్యే కారపాక్కం గణపతి, గుమ్మిడిపూండిలో ఎమ్మెల్యే టీజేఎస్ గోవిందరాజన్, పొన్నేరీలో పార్టీ ఇన్చార్జ్ రమేష్రాజ్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తిరువళ్లూరులో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఉదయమలర్, కౌన్సిలర్లు అరుణ, జాన్, థామస్, సుమిత్ర, ప్రభాకరన్, తిరువేళాంగాడు యూనియన్ ఉప కార్యదర్శి కాంచీపాడి శరవణన్, ఎన్ఆర్ఐ విభాగం జిల్లా కార్యదర్శి జైకృష్ణ, వర్తక విభాగం కార్యదర్శి నేతాజీ, న్యాయవిభాగం కార్యదర్శి బికే నాగరాజ్, యూనీయన్ కార్యదర్శులు గూలూరు రాజేంద్రన్ పాల్గొన్నారు. తిరుత్తణిలో.. తిరుత్తణి: మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు దివంగత కరుణానిధి 102వ జయంతి వేడుకలు మంగళవారం కోలాహలంగా నిర్వహించారు. తిరుత్తణిలోని డీఎంకే జిల్లా కార్యదర్శి కార్యాలయంలో అలంకరించిన కరుణాఽనిధి చిత్రపటానికి జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే చంద్రన్ నివాళులర్పించారు. పేదలకు అన్నదానం చేశారు. నగర కార్యదర్శి వినోత్కుమార్, సీనియర్ న్యాయవాది కిషోర్రెడ్డి, నగర నాయకులు గణేశన్, అశోకన్ పాల్గొన్నారు. తిరుత్తణి తూర్పు మండల డీఎంకే కార్యదర్శి ఆర్తి రవి ఆధ్వర్యంలో వేలంజేరి, పట్టాభిరామాపురం, కాశీనాథపురం సహా 8 గ్రామాల్లో కరుణానిధి జయంతి వేడుకలు జరుపుకున్నారు. వేడుకల్లో ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని, పేదలకు అన్నదానం చేశారు. పళ్లిపట్టు సౌత్ మండల కార్యదర్శి జి.రవీంద్ర అధ్యక్షతన కీచ్చళం, నొచ్చిలి, జంగాళపల్లె, సొరకాపేట, పెరుమానళ్లూరు తదితర గ్రామాల్లో కరుణానిధి జయంతి వేడుకలు నిర్వహించి, పేదలకు సహాయకాలు పంపిణీ చేశారు. యూనియన్ నాయకులు గోపి, గోవిందస్వామి.భారతి, అచ్చుదన్, మోహన్ పాల్గొన్నారు. అలాగే పళ్లిపట్టు, ఆర్కేపేట, తిరుత్తణి, తిరువలంగాడు మాండలాల్లో కరుణానిధి జయంతి వేడుకలు జరుపుకున్నారు. వేలూరులో.. వేలూరు:మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 102వ జయంతి వేడుకలను వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు, తిరువణ్ణామలై జిల్లాలో కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో చేరుకుని ఘనంగా జరుపుకున్నారు. వేలూరులోని డీఎంకే పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నందకుమార్ అధ్యక్షతన కరుణానిధి చిత్ర పటానికి పూల మాల వేసి, నివాళులర్పించారు. అనంతరం వెయ్యి మందికి బిర్యానీ దానం చేశారు. అలాగే సత్వచ్చారిలోని 21వ వార్డులో వార్డు ప్రతినిధి వల్లలార్ రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ కదీర్ ఆనంద్ పాల్గొని, నిరుపేద మహిళలకు దుస్తులు, నిత్యావసర వస్తువులు పంపిణీతోపాటు అన్నదానం చేశారు. అనంతరం పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం కాట్పాడిలోని చిత్తూరు బస్టాండ్లో కరుణానిధి చిత్ర పటానికి పూల మాల వేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా డీఎంకే కార్యకర్తలు డీఎంకే పార్టీ కార్యాలయంలో కరుణానిధి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. సేనూరులో డీఎంకే యూనియన్ కౌన్సిలర్ ప్రభు అధ్యక్షతన యూనియన్ వైస్ చైర్మన్ శరవణన్, మాజీ సర్పంచ్ పంజాచరం, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని, కరుణానిధి చిత్ర పటానికి పూల మాల వేసి, నిరుపేదలకు బిర్యాని దానంగా అందజేశారు. తిరువణ్ణామలై జిల్లాలోను మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీధరన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు కరుణానిధి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. -
6.5 టన్నుల గుట్కా స్వాధీనం
తిరువళ్లూరు: ఆంధ్రా నుంచి లారీలో తరలిస్తున్న నిషేధిత గుట్కాపాటు 21 కిలోల గంజాయి, గోడౌన్లో నిల్వ వుంచిన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనలో ప్రమేయం వున్న నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు అక్రమ రవాణాకు ఉపయోగించిన లారీని సైతం సీజ్ చేశారు. తిరువళ్లూరు జిల్లా చోళవరం సమీపంలో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన ఐచర్ లగేజ్ వ్యాన్ ఆపి పోలీసులు తనిఖీ చేశారు. అందులో 3.5 టన్ను ల గుట్కా, 21 కిలోల గంజాయి వున్నట్టు నిర్ధారించిన పోలీసులు వాటిని లారీ సహా సీజ్ చేశారు. అనంతరం లారీడ్రైవర్ క్లీనర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. పట్టుబడిన డ్రైవర్ తూత్తుకుడి జిల్లా కురుంబూర్ ప్రాంతానికి చెందిన పెరుమాల్ కుమారుడు మణివణ్ణన్(27), క్లీనర్ అదే ప్రాంతానికి చెందిన రాజీ(62)గా గుర్తించారు. వీరు ఆంధ్రా నుంచి గుట్కాను తరలించి అంబత్తూరు వద్ద గోడౌన్లో నిల్వవుంచి విక్రయిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించి అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. గోడౌన్లో మరో మూడు టన్నుల గుట్కాను గుర్తించి స్వాఽధీనం చేసుకున్నారు. గోడౌన్లో పనిచేసే తెనాకాశీ జిల్లాకు చెందిన రామచంద్రన్(25), పొన్నుస్వామి(42)సహా మరో ఇద్దరితో కలిపి మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. 6.5 టన్నుల గుట్కా, 21 కిలోల గంజాయి తో పాటు నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు లారీ ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నలుగురిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. నలుగురి అరెస్టు 21 కిలోల గంజాయి సైతం సీజ్ లారీ స్వాధీనం -
తెలుగు పాఠశాలలో చేరితే టేబుల్ ఫ్యాన్ ఉచితం
● గ్రామీణులను ఆకట్టుకుంటున్న ప్రధానోపాధ్యాయుడు పళ్ళిపట్టు: తెలుగు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేరే విద్యార్థులకు అత్తిమాంజేరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం భూపతి టేబుల్ ఫ్యాన్ ఉచితంగా పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను ఆదేశించింది. దీంతో పళ్లిపట్టు మండలంలోని అత్తిమాంజేరి ప్రభుత్వ తెలుగు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలుగు మీడియం పాఠశాలలో విద్యార్థులను చేర్పించే లక్ష్యంతో ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత విద్యా సామగ్రి అందజేయడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు విద్య, ఉపాధిలో ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అలాగే తెలుగు మీడియంలో అడ్మిషన్లు పొందిన వారికి రూ.750 విలువైన టేబుల్ ఫ్యాన్ ఉచితంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో వేసవి సెలవులు తరువాత పాఠశాల తెరిచిన తొలిరోజు ఐదుగురు బాల, బాలికలు ఒకటో తరగతిలో అడ్మిషన్లు పొందారు. వారిని బడిలో చేర్పించుకున్న హెచ్ఎం భూపతి ప్రభుత్వ పాఠ్యప్తుకాలు, నోటు పుస్తకాలు, యూనిపామ్, బ్యాగ్, షూతోపాటు హెచ్ఎం నిధుల నుంచి టేబుల్ ఫ్యాన్ సైతం అందజేశారు. -
పర్యాటకులకు వేదికగా షెరటాన్ గ్రాండ్
సాక్షి,చైన్నె: చైన్నె మహాబలిపురం పరిసరాలలో తీర ప్రాంత పర్యాటకులు, విహా ర యాత్రకు బ్రహ్మాండ వేదికగా షెరటాన్ గ్రాండ్ను తీర్చిదిద్దారు. ఈ వివరాలను మంగళవారం స్థానికంగా నిర్వాహకులు ప్రకటించారు. మహాబలిపురం అంటే, సముద్ర తీరానికి, శిల్ప సంపదలకు ప్రసిద్ధి చెందిందిగా గుర్తుచేశారు. ఈ తీరంలో షెరటాన్ గ్రాండ్ బ్రహ్మాండ రిసార్ట్గా విహారయాత్రకు వేదికగా ఉన్నట్టు వివరించారు. మారియట్ బోన్వాయ్, విహారయాత్రకు వచ్చే వారికి ప్రత్యేక రాయితీలను సైతం ఇవ్వనున్నారు. జూలై 31వ తేదీ లేదా అంతకుముందు షెరటాన్లో నమోదు చేసుకున్న వారికి ప్రత్యేక రాయితీలలో అవకాశం కల్పిస్తున్నామన్నారు. బంగాళాఖాతంలో సుందరమైన తీరాల వెంబడి, మహాబలిపురం వద్ద ఆధునిక సౌకర్యాలతో, ప్రత్యేక ఆకర్షణ, ప్రశంసల చిహ్నంగా, వీక్షకులకు ఉన్నత సేవలను అందించే విధంగా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. -
విజయ్ బర్త్డేకు సిద్ధం కండి
● కేడర్కు భుస్సీ ఆనంద్ లేఖ ● జూలై నుంచి పూర్తిస్థాయి రాజకీయ నేతగా సాక్షి, చైన్నె: సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ జూలై నుంచి పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారనున్నారు. ఈనెల 22న ఆయన బర్త్డే తర్వాత రాజకీయంగా కీలక ప్రకటనలు, కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి. ఇందులోభాగంగా ఆయన బర్త్డేకు సన్నద్ధం కావాలని కేడర్కు పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావంతో ప్రజల్లోకి ఒకటి రెండుసార్లు మాత్రమే విజయ్ బయటకు వచ్చారు. పరందూరు విమానాశ్రయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి తన మద్దతు తెలియజేయడానికి బయటకు వచ్చారు. ఆ తర్వాత కోయంబత్తూరులో జరిగిన బూత్ కమిటీ మహానాడు, మదురై మీదుగా కొడైకెనాల్కు జనగనాయగం చిత్రం షూటింగ్ నిమిత్తం వెళ్తుండగా అభిమానులు ఆయనకు నీరాజనాలు పలికారు. పార్టీ కార్యక్రమాలు, పార్టీ రూపురేఖలు అంటూ ముందుకు సాగిన విజయ్ ప్రస్తుతం పది, ప్లస్టూలో టాపర్లుగా నిలిచిన వారిని నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసి సత్కరిస్తున్నారు. తొలి విడత కార్యక్రమం గత నెలాఖరులో జరిగింది. బుధవారం మలి విడత కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. మహాబలిపురంలో 500 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కలవనున్నారు. అదేసమయంలో జననాయగంకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ముగియడంతో జూలై నుంచి పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈనెల 22న విజయ్ బర్త్డేను రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామనా సేవలతో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. విజయ్ బర్త్డేకు సిద్ధం కావాలని, సేవలకు ఏర్పాట్లు చేసుకోవాలని పార్టీ ప్రధాన భుస్సీ ఆనంద్ లేఖ రాయడం గమనార్హం. తన 51వ బర్త్డే వేళ విజయ్ రాజకీయ పర్యటనలు, ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్లే దిశగా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. -
శ్రీరామ్ హనుమాన్ను డైరెక్ట్ చేశారా?
తమిళసినిమా: ఆరంజ్ పిక్చర్స్ పతాకంపై రాజేష్ పద్మనాభన్, సుజాత రాజేష్ కలిసి నిర్మించిన చిత్రం వానరన్. ‘టూ’ చిత్రం ఫేమ్ శ్రీరామ్ పద్మనాభన్ కథ, కథనం, మాటలు రాసి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా ప్రఖ్యాత దివంగత నటుడు నాగేష్ మనవడు, బిజేశ్ కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. నటి అక్షయ నాయకిగా నటిస్తున్న ఇందులో లొల్లు సభ జీవ, దీపా శంకర్, ఆదేశ్ బాల, నాంజిల్ విజయన్, ఎస్ఎల్ బాలాజీ, బేబీ వర్ష, వెంకట్ రాజ్, శివగురు, రామ్ రాజ్, వెడికన్నన్, రంగస్థలం నటు లు నామక్కల్ విజయకాంత్, జూనియర్ టీఆర్ ముఖ్యపాత్రలు పోషించారు. నీరన్ చందర్ చాయాగ్రహణం, షాజహాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. ఇందులో మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, దర్శకుడు పేరరసు, నటి కస్తూరి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిత్ర ఆడియోను ఆవిష్కరించిన తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ ఈ సినీ వేదిక తనకు అరుదు అని, రాజకీయ వేదిక ఆశ అయినదని పేర్కొన్నారు. అయినా తమిళిసై లేకుండా సినిమాలు లేవన్నారు. చాలా కాలం తర్వాత ఒక సినిమా ఆడి యో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చానని పేర్కొన్నారు. రాజేష్ పద్మనాభన్, సుజాత రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించాలని, వారు ఈ చిత్రాలు ఎలా నిర్మించారు? అని ఆలోచించినప్పుడు వారు ఉండేది రామాపురం అని, రా మాపురం నుంచి వచ్చిన రాజేష్ పద్మనాభన్, సుజాత రాముని భక్తుడైన హనుమాన్ ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషమన్నారు. ఈ వేడుకకు తాను రాజకీయ నాయకురాలిగాను, మాజీ గవర్నర్ గాను రాలేదని, హనుమంతుని భక్తురాలిగా వచ్చాన ని పేర్కొన్నారు. కానీ కార్యక్రమానికి రప్పించిన ఆ హనుమంతుడే ఈ చిత్రానికి మంచి విజయా న్ని అందించాలని వేడుకుంటున్నాన న్నారు. ఈ చిత్రం దర్శకుడు పేరు శ్రీరామ్ అని శ్రీరాముని భక్తుడైన హనుమాన్ను ఈయన దర్శకత్వం వహించారా? లేక హనుమంతుడే శ్రీరామన్ డైరెక్ట్ చేశారా? అన్నది తెలియదు గానీ, ఈ చిత్రం మాత్రం సరైన డైరెక్షన్లో రూపొందిందని తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. -
రాందాసు వెన్నంటే ఉంటా!
● అన్బుమణికి మద్దతుదారుడిని ● వడివేల్ రావణన్ సాక్షి, చైన్నె: తాను అన్బుమణి మద్దతుదారుడైనప్పటికీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని, ఆయన వెన్నంటే ఉంటానని పీఎంకే ప్రధాన కార్యదర్శి వడివేల్ రావణన్ స్పష్టం చేశారు. పీఎంకేలో తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య సాగుతున్న అధికార సమరం గురించి తెలిసిందే. ఈ సమరంలో పార్టీలోని ముఖ్యనేతలు, సీనియర్లు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. అంతేకాదు కేడర్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్టీ గౌరవాధ్యక్షుడు జీకే మణి అయితే, తండ్రి, తనయుడి మధ్య సఖ్యతకు తీవ్రప్రయత్నాలు చేస్తూ, తనలో తాను మదన పడుతున్నారు. చివరకు మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి ప్రధాన కార్యదర్శి వడివేల్ రావణన్ ఈ పరిణామాలపై మౌనంగా ఉంటూ వచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను అన్బుమణికి తీవ్ర మద్దతుదారుడిని అని గుర్తు చేశారు. అదే సమయంలో పార్టీ వ్యవస్థాపకుడు రాందాసుకు కట్టుబడి ఉంటానని వ్యాఖ్యలు చేశారు. తండ్రి, కుమారుల మధ్య సమస్య లేదని, వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోవచ్చని పేర్కొన్నారు. వారి మధ్య ఏదేని సమస్య, వివాదం ఉంటే ఎవరైనా కలుగచేసుకోవచ్చని, అయితే, అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఇద్దరు పార్టీ బలోపేతం దిశగా ముందుకెళ్తున్నారని, నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించారు. తాను రాందాసు వెన్నంటే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, తండ్రి, కుమారుల మధ్య ఎలాంటి సమస్యే లేదంటూ పలు ప్రశ్నలకు ఆయన డొంక తిరుగుడు సమాధానం ఇవ్వడం గమనార్హం. -
రగ్బీ ప్రీమియర్ లీగ్కు చైన్నె బుల్స్
సాక్షి, చైన్నె: ముంబై వేదికగా జరగనున్న రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ పోటీలకు చైన్నెబుల్స్ జట్టు ఎంపికై ంది. ఇందులో భాగంగా అఽధికారిక జెర్సీతోపాటు ప్రత్యేక పాటను బుల్స్ కోసం చైన్నెలో ఆవిష్కరించారు. మద్రాసు క్రికెట్ క్లబ్లో మంగళవారం జరిగిన చైన్నెబుల్స్ జట్టుతో పాటు ప్రాంఛైజీల పరిచయం, జెర్సీ, ప్రత్యేక పాట ఆవిష్కరణ కార్యక్రమానికి రగ్బీ ఇండియా కోశాధికారి సెంథిల్ వి.త్యాగరాజన్, బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ,) తమిళనాడు ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు–ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున, చైన్నెబుల్స్ నాయకత్వ బృందం నుంచి అక్షిత్శర్మ, ఫ్రాంచైజీ ప్రధాన కోచ్ బెన్ గొల్లింగ్స్, సినీ నటుడు మాజీ భారత రగ్బీ ఆటగాడు వినయ్రాయ్ హాజరయ్యారు. ఈసందర్భంగా త్యాగరాజన్ మాట్లాడుతూ భారతదేశంలో రగ్బీ అనేది చాలా ఇష్టపడి ఆడే క్రీడ అని, దేశ వ్యాప్తంగా ఇందుకు పుష్కలంగా అవకాశాలు, ఆసక్తి ఉన్నట్టు వివరించారు. రగ్బీ ఇండియా జీఎంఆర్ స్పోర్ట్స్ మద్దతుతో ఆర్పీఎల్లో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. చైన్నెబుల్స్ రగ్బీ ప్రీమియర్ లీగ్ ప్రయాణంలో భాగం కావడం తమిళనాడులోని యువతరాలకు స్ఫూర్తిగా మారిందన్నారు. ఆదవ్ అర్జున మాట్లాడుతూ జాతీయ ఆటగాళ్లను ఉన్నత స్థాయి పోటీ, విభిన్న అంతర్జాతీయ ఆట శైలిలో పరిచయం చేయడం భారతదేశ రగ్బీ, ఒలింపిక్ ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో ఇది కీలకడుగు అని వివరించారు. రగ్బీ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్న్ జూన్ 15 నుంచి 29 వరకు ముంబైలోని అందేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరగనున్నట్టు, ఇందులో బుల్స్తోపాటు ఆరుజట్లు పోటీ పడనున్నాయని వివరించారు. చైన్నె బుల్స్ స్క్వాడ్లో హన్నెస్ అడ్లెర్, హాకోన్ ఓయిస్, నికియాస్ లోహె, కెన్నెడీ, జోసెవా తలకోలో, రాటుసౌతు రాగా, జోక్విన్ పెల్లండిని, అలెగ్జాండర్ డేవిస్, వల్లభ్ పాటిల్, షానవాజ్ అహ్మద్, వినాయక్ హరిరాజ్, మహ్మద్ జాసిమ్ ఎపి, వినయ్ వంటి క్రీడాకారులు ఉన్నారని ప్రకటించారు. -
వానియంబాడిలో డెంటల్ ఆస్పత్రి సీజ్
వేలూరు: వానియంబాడిలో ఓ డెంటల్ ఆస్పత్రిని సీజ్ చేశారు. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి కచ్చేరి రోడ్డులో డెంటల్ ఆస్పత్రిని అరివరసన్ నడుపుతున్నాడు. గత 2023వ సంవత్సరంలో ఇతని వద్ద పలువురు చికిత్స తీసుకున్నారు. చికిత్స పొందిన న్యూటౌన్ ప్రాంతానికి చెందిన ఇంద్రాని, వరదన్, కోనమేడు గ్రామానికి చెందిన నర్మదలతో పాటు ఎనిమిది మంది అనారోగ్యం కారణంగా మృతిచెందినట్లు తెలసింది. దీనిపై ప్రయివేటు డెంటల్ ఆస్పత్రిని తిరుపత్తూరు జిల్లా ఆరోగ్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మీనాక్షి, వానియంబాడి ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి శివసుబ్రమణ్యం నేరుగా వెళ్లి విచారణ జరిపారు. అధికారులు డాక్టర్ అరివరసన్ను నిలదీయగా ఈ సంఘటన రెండేళ్ల క్రితం జరిగిన విషయమని, ఇది తనకు తెలియదన్నారు. పంటి నొప్పితో ఆస్పత్రిలో వచ్చే వారికి సరైన చికిత్స చేయకపోవడంతోనే మృతిచెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. వీటిపై ఆరోగ్యశాఖ అధికారులకు పూర్తి నివేదికను అందజేసి పోలీసుల బందోబస్తు నడుమ డెంటల్ ఆస్పత్రిని సీజ్ చేశారు.