Tamil Nadu
-
సుప్రీంకోర్టులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి షాక్
ఢిల్లీ: సుప్రీం కోర్టులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎంకే స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట దక్కింది. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులకు గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ వెంటనే ఆమోదం తెలపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.తమిళనాడు ఎంకే స్టాలిన్ ప్రభుత్వం పదిబిల్లులను ప్రతిపాదించింది. అయితే, ఆ బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలపలేదు. ఇదే అంశంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి తీరును సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. గవర్నర్ చట్టవిరుద్ధంగా వ్యవహించారనే అభిప్రాయం వ్యక్తం చేసింది. వెంటనే ప్రభుత్వం ప్రతిపాదించిన పది బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాలని స్పష్టం చేసింది. Key pointers from Supreme Court judgement in Tamil Nadu Governer RN Ravi case:➡️ Reservation of 10 bills for consideration by parliament after they were reconsidered by State assembly is illegal. ➡️Any consequential steps taken by President on the 10 bills is NON EST ➡️ Court… pic.twitter.com/1nlANNi7Gs— Bar and Bench (@barandbench) April 8, 2025గవర్నర్ పది బిల్లులను రిజర్వ్ చేయడం అనేది చట్ట విరుద్ధం. అందువల్ల, ఆ చర్యను రద్దు చేస్తున్నాం. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న పది బిల్లులకు క్లియరెన్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ బిల్లులు గవర్నర్కు సమర్పించిన తేదీ నుండి ఆమోదించబడినట్లుగా పరిగణించబడతాయి’ అని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై సీఎం డీఎంకే స్టాలిన్ హర్షంసుప్రీం కోర్టు తీర్పుపై తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు చారిత్రాత్మకమైందని’ అభివర్ణించారు. ఈ తీర్పు కేవలం ఒక్క తమిళనాడుకే కాదు. దేశంలోని అన్నీ రాష్ట్రాలకు గర్వ కారణం’ అని అన్నారు. 2021లో తమిళనాడు గవర్నర్గా ఆర్ఎన్ రవిసీబీఐలో పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎన్. రవి 2021లో తమిళనాడు గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వంతో అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు.బీజేపీ అధికార ప్రతినిధి అంటూ విమర్శలుఇదే అంశంపై డీఎంకే ప్రభుత్వం గవర్నర్ ఆర్ఎన్ రవిపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చింది. గవర్నర్ ఆర్ రవి బీజేపీ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మండి పడిందది. కావాలనే రాష్ట్ర శాసనసభ బిల్లులకు ఆమోదం తెలపకపోవడం , నియామకాలపై అనుమతి నిరాకరించారని ధ్వజమెత్తింది. అయితే, గవర్నర్ రవి మాత్రం తనకు రాజ్యాంగం అందించిన అధికారాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నానంటూ సర్థించుకున్నారు. అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ గవర్నర్ తన పదవిలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లోనూ వివాదాలు కొనసాగుతున్నాయి. గత ఏడాది, గవర్నర్ ప్రారంభపు ఉపన్యాసం సందర్భంగా జాతీయ గీతం పాడకపోవడంపై గవర్నర్ టీఎన్ రవి నిరసనగా సభనుంచి వెళ్లిపోయారు. తమిళనాడు అసెంబ్లీలో సాంప్రదాయం ప్రకారం ప్రసంగం ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వళ్తు' అనే రాష్ట్ర గీతం పాడడం, ముగింపులో జాతీయ గీతం పాడటం జరుగుతుంది. కానీ గవర్నర్ రవి మాత్రం ప్రారంభంలోను, ముగింపులోను జాతీయ గీతం తప్పనిసరిగా పాడాలని అభిప్రాయపడ్డారు.గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వంగా 2023లో, గవర్నర్ అసెంబ్లీకి రాసిన సంప్రదాయ ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించారు. ఎందుకంటే ఆ ప్రసంగంలో ఉన్న విషయాలు నిజానికి భిన్నంగా ఉన్నాయన్నారు. అంతకంటే ముందు ఏడాది, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, పేరియార్, సి.ఎన్. అన్నాదురై పేర్లు, ‘ద్రవిడ మోడల్’ అనే పదబంధం, రాష్ట్రంలోని చట్టం, శాంతి పరిపాలన గురించి మాట్లాడకుండా వదిలేశారు. ఇలా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య తరచూ వివాదాలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో ఇవాళ సుప్రీం కోర్టు తీర్పుతో గవర్నర్ విషయంలో తాము చేస్తున్న పోరాటానికి ఫలితంగా దక్కిందని ఆ రాష్ట్ర అధికార పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. -
కేర్ బేర్స్ బ్రోచర్ ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: చైన్నె నగరంలోని అంగన్ వాడీలు, కిండర్ గార్డెన్లలోని పిల్లలకు ఉచిత పీడియాట్రిక్ హెల్త్ చెకప్ ప్రోగ్రామ్ నిమిత్తం ‘కేర్ బేర్స్’ను ఏర్పాటు చేశారు. సిమ్స్ ఆస్పత్రి నేతృత్వంలో ఈ వైద్య సేవలు జరగనున్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 10,000 మంది పిల్లలకు వైద్య సేవలకు నిర్ణయించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం ‘ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనక భవిష్యత్తులు’ అనే ఇతివృత్తంతో అధునాతన ఆరోగ్య సంరక్షణ సేవలకు వడపళనిలోని సిమ్స్ హాస్పిటల్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘కేర్ బేర్స్ – నర్సరింగ్ ది ఫ్యూచర్’ అనే కార్యక్రమాన్ని నగర వ్యాప్తంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఉచితంగా పిల్లలకు ఆరోగ్య పరంగా హెల్త్ చెకప్ చేయనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ కళానిధి వీరాస్వామి హాజరయ్యారు. ప్రారంభోత్సవంలో సిమ్స్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజు శివస్వామి మాట్లాడుతూ ‘కేర్ బేర్స్’ ద్వారా, పిల్లలకు ఆరోగ్యకరమైన సేవలు అందించనున్నామన్నారు. హెల్త్ చెకప్, ఏదైనా రుగ్మతలు వంటి వాటి నివారణ, పిల్లల సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, శ్రేయస్సు విషయానికి వస్తే ఏ బిడ్డ కూడా వెనుకబడి ఉండకుడదని, అందుకే ‘కేర్ బేర్స్’ చైన్నె అంతటా అంగన్ వాడీ, కిండర్ గార్డెన్లలోని పిల్లలకు వైద్య సేవలను అందిస్తుందన్నారు. 2025 చివరి నాటికి 10,000 మంది పిల్లలకు వైద్య పరంగా సేవలు అందించనున్నామన్నారు. -
రియల్–టైమ్ ఇండోర్ మ్యాపింగ్ టెక్నాలజీ అభివృద్ధి
– ఐఐటీలో పరిశోధకుల ప్రతిభ సాక్షి, చైన్నె: యుబిక్ మ్యాప్ వైర్లెస్ ఇమేజింగ్ను ఉపయోగించి ఇండోర్ పరిసరాలలో దాదాపు ఖచ్చితమైన మ్యాప్లను రూపొందించే టెన్నాలజీని ఐఐటీ మద్రాసు పరిశోధకులు అభివృద్ధి చేశారు. తద్వారా ముందుగా అమర్చిన మౌలిక సదుపాయాలు లేదా పరిమిత భౌతిక ప్రాప్యతపై ఆధారపడి ప్రజా భద్రత లేదా శోధన, రెస్క్యూ కార్యకలాపాలలో ఖచ్చితమైన మ్యాప్ను అందించింది. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మద్రాస్ (ఐఐటీ మద్రాస్)లో ఒక వినూత్న రియల్–టైమ్ ఇండోర్ మ్యాపింగ్ సొల్యూషన్గా దీనిని అభివృద్ధి చేశారు. ఇది ఏదైనా లైటింగ్ లేదా పర్యావరణ పరిస్థితులలో, ముందుగా ఉన్న మౌలిక సదుపాయాలపై కనీస ఆధారపడటంతో కచ్చితమైన మ్యాప్లను రూపొందించగలదని నిరూపించారు. ప్రజా భద్రతా, అత్యవసర పరిస్థితుల్లో, విపత్తు సహాయ కార్యకలాపాల సమయంలో ఈ పురోగతి సాంకేతికత చాలా ముఖ్యమైన దని తేల్చారు ‘ఉబిక్ మ్యాప్’గా పిలవబడే ఈ తేలికపాటి సాంకేతికత, ‘రేడియో టోమోగ్రాఫిక్ ఇమేజింగ్’ లేదా ఆర్టీఐ సాంకేతికతను ఉపయోగించి ఇండోర్ వాతావరణాల వివరణాత్మక మ్యాప్లను రూపొందించడానికి రేడియో ఫ్రీక్వెన్సీ–ఆధారిత ఇమేజింగ్ను ఉపయోగించారు. ఆర్టీఐ వ్యవస్థలు సాంప్రదాయకంగా స్థిరమైన, తెలిసిన ప్రదేశాలలో మోహరించబడిన వైర్లెస్ ట్రాన్స్సీవర్ల నెట్వర్క్పై ఆధారపడతాయని, ఈ ట్రాన్స్సీవర్లు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, నిర్మాణాల ద్వారా అడ్డుకోబడినప్పుడు వైర్లెస్ సిగ్నల్ బలం బలహీనపడుతుందని, సిగ్నల్ శక్తిలో తగ్గింపు విశ్లేషించబడి, ఆ ప్రాంతం నిర్మాణ లేఅవుట్ లేదా ఫ్లోర్ మ్యాప్ను పునర్నిర్మించినట్టు పరిశోధకలు పేర్కొన్నారు. ఈ పరిశోధనకు ఐఐటీ మద్రాస్లోని కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అయాన్ చక్రవర్తి నాయకత్వం వహించారు. ఈ ప్రాజెక్టు పరిశోధన బృందంలో ఐఐటీ మద్రాస్లోని ఎంఎస్ విద్యార్థి అమర్త్య బసు, ఐఐటీ మద్రాస్లో ఎంటెక్ చదువుతున్న విద్యార్థి కుష్ జాజల్ ఉన్నారు. ఈ సాంకేతికతకు భారతీయ పేటెంట్ దాఖలు చేశారు. సాంకేతికత వివరాలు ఈ సాంకేతికత గురించి డాక్టర్ అయాన్ చక్రవర్తి పేర్కొంటూ, ప్రజా భద్రతా సంఘటనలు, ముఖ్యంగా శోధన , రెస్క్యూ కార్యకలాపాలు, ఖచ్చితమైన , నవీనమైన ఇండోర్ భవన ప్రణాళికలు లేకపోవడం వల్ల తరచుగా ఆటంకం కలిగిస్తాయన్నారు. మ్యాప్లు అందుబాటులో ఉన్నప్పటికీ, విపత్తుల సమయంలో సమర్థవంతమైన మిషన్ ప్రణాళికకు అవసరమైన నిజ–సమయ డైనమిక్లను సంగ్రహించడంలో అవి సాధారణంగా విఫలమవుతాయని గుర్తు చేశారు. దృశ్యమాన రేఖ లేదా విస్తృతమైన గణన వనరులపై ఆధారపడకుండా ఇండోర్ వాతావరణాలను చిత్రీకరించడానికి తమ సాంకేతికత మొదటి ప్రతిస్పందనదారులకు బలమైన, పోర్టబుల్ సాధనాన్ని అందిస్తుందన్నారు. ఇది సంక్లిష్టమైన, సమయ–క్లిష్టమైన సందర్భాలలో అమూల్యమైన ఆస్తిగా మారుతుందని ధీమా వ్యక్తంచేశారు. ఐఐటీఎం క్యాంపస్లోని కొన్ని రెసిడెన్షియల్ యూనిట్లలో నియంత్రిత సెటప్లో తాము టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించామని తెలియజేశారు. ఈ ట్రయల్స్ సిస్టమ్ కార్యాచరణను ధృవీకరించడానికి తమకు అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు. -
నిరుపేద గుడిసె.. కాంక్రీట్ ఇల్లుగా మారింది
– సాయం చేసిన విజయ్ తమిళసినమా: నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రారంభించి రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈయన తన పార్టీ తరఫున ప్రజలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిరుపేదలకు ఇళ్లు కటించనున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు తమకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సిందిగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంతో తమిళగ వెట్రి కళగం పార్టీ నిర్వాహకులు అధ్యక్షుడు విజయ్ ఆదేశాల మేరకు తమ ప్రాంతాల్లోని నిరుపేదలను గుర్తించి పార్టీ ప్రధాన కార్యాలయానికి సమాచారాన్ని చేరవేస్తున్నారు. వాటిని పార్తీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ పరిశీలించి నిరుపేదలకు వారి పేర్లను విజయ్కు పంపుతున్నారు. అలా రాష్ట్రంలోని పలువురు నిరుపేదలకు ఇళ్లు కట్టించే పనికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా చైన్నె, విల్లివాక్కం, సిడ్కో నగర్కు చెందిన గణపతి, ప్రేమ దంపతులు తమ కొడుకు రితిక్ రోషన్తో కలిసి గుడెసెలో జీవిస్తున్నారు. వారు తమిళగ వెట్రికళగం కార్యాలయానికి తమ పరిస్థితిని తెలుపుతూ వినతి పత్రాన్ని పంపారు. ఆ పత్రాన్ని బుస్సీ ఆనంద్ నటుడు విజయ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన గణపతి దంపతులకు కొత్త ఇంటిని కట్టించే విధంగా ఆదేశించారు. దీంతో నిరుపేద అయిన గణపతి గుడెసెను కాంక్రీట్తో నూతన ఇంటిని నిర్మించి వారికి అందించారు. అదే విధంగా ఆ ప్రాంతంలోని సుమారు 300 మందికి నిత్యావసర వస్తువులను అందించారు. -
ఆవడి పోలీసు కమిషనర్ కారుకు ప్రమాదం
– డ్రైవర్కు తీవ్ర గాయం – కమిషనర్ కాలుకు గాయం తిరువళ్లూరు: చోళవరం సమీపంలో ట్రాఫిక్లో ఆగి వున్న ఆవడి కమిషనర్ కారు ప్రమాదానికి గురి కావడంతో వాహనం పూర్తిగా దెబ్బతినింది. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, కమిషనర్ కాలుకు స్వల్ప గాయమైంది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని పెరుంజేరి ఆండాల్మఠం ప్రాంతంలో ఏప్రల్ 19న ముఖ్యమంత్రి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందజేయడంతోపాటు రోడ్షోను సైతం నిర్వహించనున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సభ జరగనున్న ప్రాంతం ఆవడి పోలీసు కమిషనర్ పరిధిలో ఉండడంతో గత రెండు రోజుల నుంచి ఆవడి కమిషనర్ శంకర్ నేతృత్వంలోని పోలీసులు భద్రత చర్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్బంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భద్రత, వాహనాల పార్కింగ్తో పాటు ఇతర చర్యలపై కమిషనర్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. సోమవారం సాయంత్రం మరోమారు సభ, రోడ్షో జరగనున్న ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ శంకర్, చోళవరం మీదుగా ఆవడికి బయల్దేరారు. చోళవ రం సమీపంలోని చెంబులివరం ప్రాంతం వద్ద వస్తున్న సమయంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కమిషనర్ కారు ట్రాఫిక్లో ఆగింది. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ టైర్ పేలడంతో అదుపు తప్పి కమిషనర్ కారుకు వెనుక ఆగి వున్న మరో లారీని ఢీకొట్టింది. దీంతో లారీ కమిషనర్ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా దెబ్బతినగా కమిషనర్ శంకర్ కాలుకు గాయమైంది. కమిషనర్ సహాయకుడు మారిసెల్వం, డ్రైవర్కు గాయాలయ్యా యి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు గాయపడ్డ కమిషనర్తోపాటు ఇతర సిబ్బందిని రక్షించి చికిత్స కోసం వైద్యశాలకు తరలించారు. -
త్యాగరాజ సన్నిధిలో రథోత్సవం
– భక్త జన సంద్రమైన తిరువారూర్ సాక్షి, చైన్నె: తిరువారూర్లోని త్యాగరాజ స్వామి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలలో భాగంగా సోమవారం రథోత్సవం వైభవంగా సాగింది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద రథోత్సవ వైభవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తిరువారూర్ వైపు పోటెత్తారు. రాష్ట్రంలోని పురాతన, ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో తిరువారూర్ జిల్లా కేంద్రంలో వెలిసిన త్యాగరాజ స్వామి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా మార్చిలో ఆలి రథోత్సవంతోపాటు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మూలవిరాట్గా త్యాగ రాజేశ్వర స్వామి, వన్నిగనాఽథర్ పేరిట పరమ శివుడు కొలువై ఉన్నాడు. ఇక్కడి ఉత్సవ మూర్తిని నిధి విడంగర్గా కూడా భక్తులు పిలుస్తుంటారు. తొమ్మిది రాజగోపురాలతో దేదీప్యమానంగా కనిపించే ఈ ఆలయంలోని రథం ఆసియా ఖండంలోనే అతి పెద్దది. 96 (29 మీటర్ల) అడుగుల ఎత్తుతో 350 టన్నుల బరువుతో ఈ రథం గాంభీర్యంగా భక్తులకు కనిపిస్తుంటుంది. ఈ రథాన్ని లాగుతున్నట్టుగా ఉండే నాలుగు గుర్రపు విగ్రహాలు ఒక్కొక్కటి 11 అడుగుల ఎత్తులో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంటాయి. తిరుచ్చి భెల్ సంస్థ ఆలి తేర్ రథాన్ని ఇటీవల ఆధునీకరించి హైడ్రాలిక్ బ్రేక్ను అమర్చింది. ఈ పరిస్థితులలో గత నెల 13వ తేదీ పంగుణి ఉత్సవం ఇక్కడ ప్రారంభమైంది. 15వ తేదీ ధ్వజారోహణం నిర్వహించారు. రథోత్సవ కోలాహలం వేకువ జాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఐదున్నర గంటలకు వినాయకుడు, సుబ్రమణ్య స్వామి రఽథాలు, ఆలి రథం ముస్తాబైంది. స్వామి వారు రథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. ఉదయం 9.10 గంటలకు కలెక్టర్ మోహన చంద్రన్, ఎస్పీ కరుణాకర్, ఎమ్మెల్యే కలైవాణన్, బీజేపీ సీనియర్ నేత హెచ్.రాజా తదితరులు రథాన్ని లాగారు. అనంతరం ఆలయ తూర్పు రథ వీధి వద్ద ప్రారంభమైన ఈ రథోత్సవం సోమవారం రాత్రి తిరిగి యథాస్థానానికి చేరుకుంది. ఆలి తేర్ రథం వెనుక అమ్మవారు, చండికేశ్వరర్ రథాలు కదిలాయి. వేలాదిగా భక్తులు తరలి వచ్చి రథాన్ని లాగారు. -
ఘనంగా అగ్నిగుండ వసంతోత్సవం
పళ్లిపట్టు: పొదటూరుపేటలో దండుమారియమ్మన్ ఆలయ అగ్నిగుండ వేడుకలు ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణతో అగ్నిగుండ ప్రవేశం చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. వేడుకల సందర్భంగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఘనంగా కుంభాభిషేకం తిరువొత్తియూరు: తిరువొత్తియూరు టోల్ గేట్ వద్ద వెలిసిన దేవి దండుమారియమ్మన్ ఆలయంలో సోమవారం కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఇందులో పలువురు భక్తులు పాల్గొన్నారు. తిరువొత్తియూరు సరిహద్దు దేవతగా జలం, భూమి, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాలై వెలిసిన దేవి దండు మారియిమ్మన్ ఆలయంలో జీర్ణోద్ధరణ పనులు పనులు పూర్తి చేసి హిందూ దేవదాయ శాఖ ఆధ్వర్యంలో 35 ఏళ్ల తర్వాత అష్టబంధన మహా కుంభాభిషేకం జరిగింది. ఆదివారం 6.04.2025 న ఉదయం గణపతి పూజ, గోపూజ, యాగశాల పూజలు ప్రారంభమయ్యాయి. 2 రోజైన సోమవారం సంకటహర హోమం, నవగ్రహ హోమం, మహాలక్ష్మీ హోమం పూర్తి చేశారు. దీపారాధన తరువాత అనంతరం మంగళ వాయిద్యం, శంఖనాథం మధ్య శివాచార్యులు కలశాలను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కలశాల్లోని నీటిని ఆలయ గోపురాలపై పవిత్ర జలంతో అభిషేకం చేశారు. 35 ఏళ్ల తర్వాత జరుగుతున్న కుంభాభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఓం శక్తి, పరాశక్తి అంటూ నినాదాలు చేసి భక్తి పారవశ్యంతో స్వామివారిని దర్శించుకున్నారు. బస్సు వసతి కల్పించాలని విద్యార్థినుల వినతి వేలూరు: బస్సు వసతి కల్పించాలని కోరుతూ విద్యార్థినులు పాఠశాలకు సెలవు పెట్టి యూనిఫాంతోనే కలెక్టరేట్కు చేరుకొని కలెక్టర్ సుబ్బలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సోమవారం ఉదయం వేలూరు కలెక్టరేట్లో ప్రజా విన్నపాల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. వినతులు అందుకున్న కలెక్టర్ వీటిపై విచారణ జరిపి వెంటనే బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కేవీకుప్పం సమీపంలోని వెల్లేరి గ్రామానికి చెందిన విద్యార్థులు అందజేసిన వినతిలో పేర్కొన్న విధంగా తమ గ్రామానికి గతంలో ప్రభుత్వ బస్సు వచ్చేదని అయితే తమ గ్రామం సమీపంలోని సెండ్రాంబల్లి గ్రామం వద్ద ఒక వ్యక్తి రోడ్డు పక్కన సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేశాడని దీంతో బస్సు వస్తే ట్యాంకు పూర్తిగా ధ్వంసమవుతుందని రాజకీయ నాయకుల చొరవతో బస్సును నిలిపి వేశారని వెంటనే గ్రామానికి బస్సు వసతి కల్పించి తమను ఆదుకోవాలని కోరారు. బస్సు లేక పోవడంతో తాము కాలి నడకన పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. వీటిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు కలెక్టర్ వద్ద కన్నీరు పెట్టుకున్నారు. దీనిపై విచారణ జరిపి వెంటనే బస్సు వసతి కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు వెనుదిరిగారు. -
పేరంబాక్కంలో వైభవంగా రఽథోత్సవం
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా పేరంబాక్కం గ్రామంలో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు సమేత సోలీశ్వరుడి ఆలయం ఉంది. ఆలయంలో ఏటా పంగణి ఉత్సవాలను పది రోజుల పాటు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈనెల 1వ తేదీన ఉత్సవాలు ద్వజారోహణంతో ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా రోజు ఉదయం సాయంత్రం ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకం, రాత్రి సమయంలో వాహనాలపై ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం రఽథోత్సవం నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుంచి 9 గంటల వరకు రధాన్ని లాగిన భక్తులు తమ మొక్కుబడిని చెల్లించుకున్నారు. కాగా రథం నుంచి కామాక్షి అమ్మవారు, సోలీశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు. -
కమనీయం.. రథోత్సవం
వఠారన్నేశ్వరర్ కమల రధోత్సవంలో పాల్గొన్న భక్తజనం వఠారన్నేశ్వరర్ ఆలయ కమల రథోత్సవం సోమవారం వేలాదిమంది భక్తజనం శివనామస్మరణ నడుమ కమనీయంగా సాగింది. రథంలో వండార్కుయళి సమేత సూమాస్కందర్ ఉత్సవర్లు కొలువుదీరారు. రథం వీధిలో వేలాది మంది భక్తులు గుమిగూడగా శివపార్వతుల వేషధారణలో కళాకారులు, శివభూత వాయిద్యాల నడుమ మధ్య రథం కదిలింది. ఈ సందర్భంగా భక్తులు రథం లాగి ఉప్పు, మిరియాలు వెదజెల్లి తమ మొక్కులు చెల్లించారు. భక్తులకు పలు ప్రాంతాల్లో మజ్జిగ, జ్యూస్, తాగునీరు సరఫరా చేశారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస పెరుమాళ్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు. తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో ఆలయ ట్రస్టీలు సురేష్బాబు, ఉషారవి ఏర్పాట్లను పర్యవేక్షించారు.– తిరుత్తణి -
సత్యరాజ్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో ‘మెడ్రాస్ మ్యాట్నీ’
తమిళసినిమా: నటుడు సత్యరాజ్, కాళీవెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మెడ్రాస్ మ్యాట్నీ. నటి రోషిణి, హరిప్రియన్, సెల్వి, విశ్వ, జార్జ్ మరియన్,అర్చన సంతోష్, సునిల్, సుగధ, శ్యామ్స్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ఇందులో నటుడు సత్యరాజ్ శాస్త్రవేత్తగా నటించారు. కార్తీకేయన్ మణి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెడ్రాస్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా అభిషేక్ రాజ్, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్రూసర్గా మూమెంట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత జీఏ హరికృష్ణన్ వ్యవహరించారు. కాగా దీనికి ఆనంద్ జీకే ఛాయాగ్రహణం, కేసీ.బాలస్వరంగన్ సంగీతాన్ని అందించారు. చిత్ర టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్లను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు పేర్కొన్నారు. ఫ్యామిలీ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇంతకు ముందు అరివి, జోకర్, ఖైదీ వంటి పలు విజయవంతమైన చిత్రాలను విడుదల చేసిన డ్రీమ్ వారియర్స్ సంస్థ తమిళనాడులో విడుదల చేయనుంది. కాగా ఈ చిత్రాన్ని మే నెలలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. -
సీనియర్ సినీ నిర్మాత రామనాధన్ కన్నుమూత
తమిళసినిమా: సీనియర్ సినీ నిర్మాత రామనాథన్(72) సోమవారం చైన్నెలో ఆనారోగ్యం కారణంగా కన్నుమూశారు. నటుడు సత్యరాజ్ వద్ద నిర్వాహకుడిగా పని చేసిన రామనాథన్ అనంతరం రాజ్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన నటుడు సత్యరాజ్ కథానాయకుడిగా వాద్దియార్ వీట్టి పిళ్లై, నడిగన్, వళ్లల్, తిరుమతి పళనీసామి, బ్రహ్మ, ఉడన్ పిరప్పు, విల్లాది విల్లన్ వంటి చిత్రాలను నిర్మించారు. అదే విధంగా నటుడు విజయ్కాంత్ హీరోగా భారతీరాజా దర్శకత్వంలో తమిళ్ సెల్వన్ చిత్రాన్ని నిర్మించారు. కాగా స్థానిక నుంగంబాక్కమ్, కొత్తారి రోడ్డులో నివశిస్తున్న రామనాథన్ ఆనారోగ్యం కారణంగా చైన్నెలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే వైద్యం ఫలించక సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈయనకు ప్రమిళ అనే భార్య, కారుణ్య, శరణ్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా విదేశాల్లో ఉన్న కూతుళ్లు చైన్నెకి తిరిగి చేరుకున్న తరువాత బుధవారం రామనాథన్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా నిర్మాత రామనాథన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చైన్నెలో సిటీ బస్సు డ్రైవర్లకు రోజూ బ్రీత్ అనలైజర్ టెస్ట్ ● ప్రమాదాల నివారణకు చర్యలు కొరుక్కుపేట: చైన్నెలోని సిటీ బస్సు డ్రైవర్లకు రోజూ మద్యం పరీక్షలు చేస్తున్నారు. ప్రమాదాల నివారణకు ఈ పద్ధతిని చేపట్టారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా వరకు మద్యం తాగి వాహ నాలు నడిపే వారి వల్లే జరుగుతున్నట్లు సమాచారం. దీంతో చైన్నె సిటీ బస్సు డ్రైవర్లకు కూడా మద్యం పరీక్షలు చేస్తున్నారు. వారు తమ పనిని ప్రారంభించే ముందు ఈ పరీక్ష ఆల్కహాల్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ద్వారా నిర్వహించనున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్లలో. రాష్ట్ర రహదారి భద్రతా మండలి ఈ పద్ధతిని రాష్ట్ర రవాణా సంస్థ, రాష్ట్ర ఎక్స్ప్రెస్ రవాణా సంస్థల్లో అమ లు చేయాలని సూచించింది. ఇందుకోసం మొత్తం 339 ఆల్కహాల్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేశారు. విల్లుపురం డివిజన్కు 70, సేలం డివిజనన్కు 39, కోయంబత్తూరు డివిజన్కు 82, కుంభకోణం డివిజన్కు 50, మధురై డివిజన్కు 58, తిరునల్వేలి డివిజన్కు 20 కిట్లు అందించారు. ప్రభుత్వ ర్యాపిడ్ ట్రాన్సిట్ కార్పొరేషన్కు 20 ఆల్కహాల్ టెస్టింగ్ కిట్లను అందించడం గమనార్హం. పాఠశాల వార్షిక పరీక్షలు ప్రారంభం తిరువొత్తియూరు: 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అయితే వేసవి తాపం కారణంగా 1 నుంచి 5 తరగతుల తుది పరీక్షల షెడ్యూల్ను ఏప్రిల్ 7 నుంచి 17 వరకు ముందుగానే నిర్వహించనున్నారు. దీని ప్రకారం 1 నుంచి 5వ తరగతుల చివరి టర్మ్ పరీక్ష సోమవారం ప్రారంభమైంది. తొలిరోజు సోమవారం తమిళం సహా భాషా పరీక్షలు జరిగాయి. 1, 2, 3 తరగతులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 4, 5 తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. 6 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు మంగళవారం (8వ తేదీ) ప్రారంభం అవుతాయి. ఇక పరీక్షల అనంతరం 1 నుంచి 3 తరగతులకు వేసవి సెలవులు ఏప్రిల్ 12న, 4, 5 తరగతులకు ఏప్రిల్ 18న, 6 నుంచి 9 తరగతులకు 25న ప్రారంభమవుతాయి. అయితే పాఠశాలలో చివరి పనిదినం వరకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధులకు రావాలని, వేసవి సెలవుల అనంతరం జూన్ మొదటి వారంలో పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సీఎం ఫార్మసీల్లో రాయితీపై మందులుకొరుక్కుపేట: తమిళనాడులో కేంద్ర ప్రభుత్వ పీపుల్స్ ఫార్మసీలు, ప్రైవేట్ ఫార్మసీల కంటే ము ఖ్యమంత్రి ఫార్మసీల్లో ధరలు తక్కువగా ఉన్నా యని సహకార శాఖాఽఽధికారులు వెల్లడించారు. దీంతో ప్రజలకు వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గాయి. 2024 ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రజలు మందులకు అధిక ధరలు చెల్లించాల్సి వచ్చింది. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు రోజూ మందు లు వాడాల్సి రావడంతో ప్రజలకు వైద్య ఖర్చు లు పెరుగుతున్నాయి. అందుకోసం సాధారణ మందులు, ఇతర మందులకు తక్కువ ధరకే సీఎం ఫార్మసీ అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి ఫార్మసీకి సాధారణ ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. దీన్నిబట్టి చూస్తే ప్రైవేట్ ఫార్మసీలే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ఫార్మసీలు కూడా వాటితో పోలిస్తే తక్కు వ ధరకే మందులను విక్రయిస్తున్నట్లు స్పష్టమవుతోంది. చైన్నెలోని స్థానిక ఫార్మసీల్లో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం మందులను పోల్చి చూ స్తే, సీఎం ఫార్మసీల్లో 30 శాతం చౌకగా ఉన్నా య ని తేలింది. మరో ప్రయోజనం ఏమిటంటే, జనరిక్ మందులు ఫార్మసీల్లో సులభంగా అందుబా టులో ఉంటాయి. 25 శాతం వరకు తగ్గింపుతో అందిస్తారు. ప్రస్తుతం సీఎం ఫార్మసీల్లో 206 రకాల మందులు విక్రయిస్తున్నట్లు సహకార శాఖ అధికారులు తెలిపారు. -
చివరి దశకు కుత్తంబాక్కం బస్టాండు నిర్మాణం
– త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం తిరువళ్లూరు: చైన్నెలో ట్రాఫిక్ను తగ్గించాలన్న ఉద్దేశంతో సుమారు రూ.336 కోట్లు వ్యయంతో కుత్తంబాక్కం వద్ద నిర్మిస్తున్న కొత్త బస్టాండు నిర్మాణపు పనులు దాదాపు 90 శాతం మేరకు పూర్తయిన క్రమంలో త్వరలో ప్రారంభించి అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. చైన్నెలో తరచూ ఏర్పడుతున్న ట్రాపిక్ను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు చర్యలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగానే పాండిచ్చేరి, తిరుచ్చి, కడలూరు, అరియలూరు, మధురై, సేలం, కల్లకురుచ్చి తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం కిలాంబాక్కం నూతన బస్టాండు నిర్మించి అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇదే విధంగా హోసూరు, వేలూరు, తిరుపతి, తిరుపత్తూరు, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్ళే బస్సులను కుత్తంబాక్కం బస్టాండు నుంచి రాకపోకలు సాగించాలని నిర్ణయించి సుమారు రూ. 336 కోట్లు వ్యయంతో కుత్తంబాక్కం వద్ద 2021లో నూతన బస్టాండు నిర్మాణపు పనులను ప్రారంభించారు. బస్టాండు విస్తీర్ణం సుమారు 5 లక్షల చదరపు అడుగులు. దీంతో పాటు బస్టాండుకు సమీపంలోనే మరో రెండు కోట్లు వ్యయంతో రోడ్డు సదుపాయం, పది కోట్లు వ్యయంతో బస్గ్యారేజీలను ఏర్పాటు చేశారు. ఈ పనులు దాదాపు 90 శాతం మేరకు పూర్తయ్యింది. వీటిని త్వరలోనే ప్రారంభించి అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. దీంతో పాటూ కుత్తంబాక్కం బస్టాండుకు మెట్రోను సైతం అనుసంధానం చేయనున్నారు. కాగా ఈ బస్టాండు నుంచి వేర్వేరు ప్రాంతాలకు ప్రభుత్వ 70 బస్సులు, మరో 30 ప్రైవేటు బస్సులు, 30 ఎంటీసీ బస్సులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగించనున్నాయి. వీటితో పాటూ బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు విశ్రాంతి గదులు, పలు దుకాణాలు, హోటల్స్, 200 వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. కాగా బస్టాండు అందుబాటులోకి వస్తే బెంగళూరు, హోసూరు, తిరుపత్తూరు తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచే బస్సులు నడవనున్నాయి. -
అజిత్కు ధనుష్ చెప్పిన కథ నచ్చిందట
తమిళసినిమా: నటుడు ధనుష్ ఇటీవల నటనపైనే కాకుండా దర్శకత్వంపైనా ఆసక్తి చూపుతున్నారనిపిస్తోంది. కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటిస్తూనే దర్శకత్వంపై కూడా మక్కువ చూపుతున్నారు. ఈయన ఇప్పటికి నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో మూడు చిత్రాల్లో ఆయనే కథానాయకుడిగా నటించారు. ఇటీవల ధనుష్ దర్శకత్వం వహించిన నిలావుక్కు ఎన్మేల్ ఎన్నడీ కోపం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, పర్వాలేదనిపించింది. కాగా ఇప్పుడు ఏకంగా అజిత్ వంటి స్టార్ హీరోనే డైరెక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. తాజాగా ఈయన నటుడు అజిత్ను కలిసి కథ చెప్పినట్లు ప్రచారం జోరందుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని పూర్తి చేసిన నటుడు అజిత్ కార్ రేస్పై దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే విదేశాల నుంచి చైన్నెకి తిరిగొచ్చిన అజిత్ చైన్నెలో రెండు రోజులు గడిపి మళ్లీ విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. కాగా ఆ రెండు రోజుల్లో ఒక రోజును కుటుంబ సభ్యులతో గడపగా, రెండో రోజున నటుడు ధనుష్ ఆయన్ని కలిసి కథ చెప్పినట్లు ,ఆ కథ అజిత్ను బాగా ఇంప్రెస్ చేసినట్లు టాక్ వైరల్ అవుతోంది. అంతేకాదు తాను మరో చిత్రం చేసిన తరువాత మీ దర్శకత్వంలో నటిస్తానని ధనుష్కు ఆయన చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అజిత్ నటుడు ధనుష్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా అజిత్ కథానాయకుడిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఈ నెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. -
ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆందోళన
తిరువళ్లూరు: ఏళ్ల తరబడి నివాసం వుంటున్న వారికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ మోరై గ్రామానికి చెందిన ప్రజలు సోమవారం ఉదయం కలెక్టర్ ప్రతాప్కు వినతి పత్రం సమర్పించారు. వివరాలు.. తిరువల్లూరు జిల్లా ఆవడి తాలుకా మోరై గ్రామంలోని కన్నిమానగర్ సుమారు 500 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం రేషన్కార్డులు, ఓటరు కార్డులు, ఆధార్కార్డులను అందజేసింది. ప్రస్తుతం ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులను చెల్లిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇంటి పట్టాలు అందజేయాలని ఏళ్ల తరబడి కలెక్టర్తో సహా ఉన్నత అధికారులకు వినతి పత్రం సమర్పించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఇప్పటికై నా అధికారులు స్పందించి తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి ఇంటి పట్టాలు మంజూరు చేయని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. -
మత్స్యకారులకు మహర్దశ
● 576 కోట్లతో పథకాలు ● రూ. 150 కోట్లతో తంగచ్చి మఠంలో హార్బర్ సాక్షి,చైన్నె: మత్స్యకారుల సంక్షేమాన్ని, జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని సీఎం ఎంకే స్టాలిన్ అసెంబ్లీ వేదికగా ప్రత్యేక ప్రకటన చేశారు. రూ. 576 కోట్లతో పథకాలను ప్రకటించారు. రూ. 150 కోట్లతో తంగచ్చి మఠంలో హార్బర్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీలో సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఇందులో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. మంత్రి పొన్ముడి మాట్లాడుతూ, గ్రీన్ తమిళనాడు ఇయక్కం ద్వారా 33 శాతం మేరకు పచ్చదనాన్ని నింపినట్టు వివరించారు. మొక్కల పెంపకాన్ని విస్తృతం చేశామన్నారు. మంత్రి ఏవీ వేలు మాట్లాడుతూ, చైన్నె హార్బర్ టూ సెయ్యారు సిప్ కాట్ వరకు జరుగుతున్న రోడ్డు పనులను తిరువణ్ణామలై వరకు పొడిగించనున్నట్టు ప్రకటించారు. కులితలై ఆస్పత్రికి కలైంజ్ఞర్ కరుణానిధి పేరు పెట్టేందుకు పరిశీలిస్తామని మంత్రి ఎం సుబ్రమణియన్ తెలిపారు. చైన్నెలోని పోరూర్ చెరువును అభివృద్ధి పరిచేందుకు రూ. 63 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించామని మంత్రి దురై మురుగన్ పేర్కొన్నారు. ప్రత్యేక ప్రకటన తమిళనాడు మత్స్యకారుల సంక్షేమం గురించి శాసనసభ నిబంధనలు 110 మేరకు సీఎం స్టాలిన్ ప్రత్యేక ప్రకటన చేశారు. శ్రీలంక నావికాదళం జరుపుతున్న దాడులు, తమిళ జాలర్ల అరెస్టు వంటి అంశాలను ప్రస్తావించారు. మత్స్యకారుల సమస్యపై గతవారం సభలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. వీరి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడానికి కచ్చదీవులను మళ్లీ స్వాధీనం చేసుకోవడం ద్వారానే సాధ్యమని వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ తమిళ జాలర్ల సంక్షేమంపై ఎలాంటి చిత్తశుద్ధిని కనబరచక పోవడం శోచనీయమన్నారు. తమిళ జాలర్ల విషయంగా ఎలాంటి ప్రస్తావన ఈ పర్యటనలో లేక పోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. జాలర్ల సమస్యకు విముక్తి కల్పించే కచ్చతీవు గురించి చర్చ కూడా లేక పోవడం శోచనీయమని విమర్శించారు. తమిళ జాలర్ల డిమాండ్లను ప్రధాని నరేంద్రమోదీ విస్మరించారని మండి పడ్డారు. ఈపరిణామాలు మత్స్యకారుల జీవనోపాధిని ప్రమాదంలోకి నెడుతోన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మత్స్యకారుల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం,అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడం వంటివి అంశాలను పరిగణించి ప్రస్తుతం వివిధ కొత్త ప్రాజెక్టుల అమలుకు నిర్ణయించామని ప్రకటించారు. తమిళనాడు తీర ప్రాంతాలు ముఖ్యంగా మన్నార్ గల్ఫ్ పరిధిలో ఉన్న జిల్లాలు, రామనాథపురం, నాగపట్నం, తూత్తుకుడి, పుదుక్కోట్టై, తిరువారూర్, తంజావూరు మత్స్యకారుల సంక్షేమం పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామాన్నరు. ఈ ప్రాంతాల నుండి చేపల వేటకు వెళ్లే జాలర్లు ఎదుర్కొంటున్న కష్టాలు,నష్టాలు పరిగణించామన్నారు. మన్నార్ గల్ఫ్ పరిసరాల నుంచి మత్స్యకారులు లోతైన సముద్రంలో చేపల వేట కోసం దక్షిణం వైపు వెళ్తున్నారని గుర్తు చేశారు. దీనిని మరింత సులభతరం చేసే విధంగా వీరు హిందూ మహాసముద్రంలోకి వెళ్లేందుకు వీలుగా ఫ్రత్యేక చర్యలు చేపట్టామని వివరించారు. ఇందులో భాగంగా తంగచ్చి మఠంలో రూ.150 కోట్లతో ఫిష్షింగ్ హార్బర్ నిర్మించనున్నామని ప్రకటించారు. పాంబన్ ప్రాంతంలో అంచనా రూ.60 కోట్ల అంచనా వ్యయంతో, కుందగల్ ప్రాంతంలో రూ. 150 కోట్లతో ఫిష్షింగ్ హార్బర్ పనులు చేపట్టనున్నామన్నారు. ఇది మన్నార్ గల్ఫ్ ప్రాంతంలోని మత్స్యకారుల జీవనోపాధిని నిర్ధారించడానికి మార్గంగా ఉంటుందన్నారు. ప్రాజెక్టులు.. సముద్రపు పాచి పెంపకం, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, అమ్మకాలకు సంబంధించిన ఉద్యోగాలకు సాంకేతిక శిక్షణ అవసరం అని పేర్కొన్నారు. సుమారు 7 వేల మంది లబ్ధిదారులకు రూ. 52 కోట్లతో అవసరమైన సాంకేతిక సంబంధిత పరికారాలను అందించనున్నామన్నారు. . చేపలు, మట్టి పీతల బోను పెంపకం, ప్రాసెసింగ్, అమ్మకాలకు సంబంధించిన వ్యాపారాలను చేపట్టడానికి మత్స్యకారులలో 25 మందిని ఎంపిక చేయనున్నామని, సంబంధిత సేవల కోసం రూ. 82 కోట్లు ప్రకటించారు. చేపల ప్రాసెసింగ్, చేపల ఎండబెట్టడం సాంకేతికతలు, సాంకేతిక పరికరాలు శిక్షణను అందించే ప్రాజెక్టుకు నిర్ణయించామన్నారు. ఈ మేరకు 2,500 మత్స్యకార కుటుంబాలకు చెందిన లబ్ధిదారులకు రూ. 9 కోట్ల 90 లక్షలలతో పథకం అమలు చేయనున్నామన్నారు. సుమారు 15,300 మంది మత్స్యకారులకు, చేపలు చచేపల సంబంధిత అంశాలపై సాంకేతిక శిక్షణను రూ. 55 కోట్లతో అందించనున్నామన్నారు. మత్స్య పరిశ్రమపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధిలో వల నేయడం, మరమ్మతు, పడవల నిర్మాణ పరిశ్రమ, పడవల మరమ్మత్తు, వడ్రంగి తయారీ, రంగురంగుల చేపల ట్యాంకులను తయారు చేయడం, పడవ డ్రైవింగ్ శిక్షణ, సముద్రపు గవ్వల అలంకరణ, తయారీకి రూ. 54 కోట్లు కేటాయించామన్నారు. ఉపాధి అవకాశాలను సృష్టించడం, పుట్టగొడుగుల పెంపకం, పర్యాటక బోటింగ్, చేతిపనుల తయారీ, ఇంట్లోనే మసాలా పొడి తయారీ, చిరు ధాన్యపు ఆహారం తయారీ వంటి వాటిపై దృష్టి సారించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందు కోసం రూ. 53 కోట్లు కేటాయించామన్నారు. ఫిష్షింగ్ హార్బర్లకు రూ. 360 కోట్లు.ఇతర ప్రత్యామ్నాయ అంశాలకు రూ. 216 కోట్లు అంటూ మొత్తంగామత్స్యకారుల కోసం రూ. 576 కోట్లతో ప్రాజెక్టులను అమలు చేయన్నామన్నారు. ఆర్థికంగా మత్స్య కారులను బలోపేతం చేయడం, వారికి ప్రయోజనం కల్పించే ప్రత్యామ్నాయం మార్గం మీద విస్తృత చర్యలు ఉంటాయని ప్రకటించారు.అనంతరం సభలో ఎంఎస్ఎంఈ శాఖకు నిధుల కేటాయింపు ప్రక్రియ గురించి మంత్రి అన్బరసన్, గృహ నిర్మాణ పథకాలకు నిధుల కేటాయింపు గురించి మంత్రి ముత్తుస్వామి, హిందూ ధర్మాదాయ శాఖ వైభవాన్ని చాటేందుకు కేటాయించిన నిధుల గురించి మంత్రి శేఖర్బాబు సభలో వివరాలను ప్రకటించారు. -
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
చెన్నైకి చెందిన టెక్ బిలియనీర్, రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్(Prasanna Sankar) దంపతులు వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడిపిస్తోందని ప్రసన్న శంకర్.. తన భర్తే పెద్ద కా*పిశాచి అని దివ్యా శశిథర్(Dhivya Sashidhar) పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో విడాకులు, భరణం, కొడుకు కస్టడీ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ప్రసన్న శంకర్, దివ్య తొలిసారిగా 2007లో కలుసుకున్నారు. 2013లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రసన్న శంకర్, దివ్యల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. భరణం కింద తనకు నెలకు రూ. 9 కోట్ల రూపాయలు ఇవ్వాలని దివ్య డిమాండ్స్తోంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ప్రసన్నపై దివ్య సంచలన ఆరోపణలకు దిగింది. ది శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్త కేవలం తనను సెక్స్ కోసమే అన్నట్లు చూసేవాడని తెలిపింది. ‘‘కోరిక తీర్చకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ప్రసవ సమయంలో నొప్పి అనుభవిస్తున్నప్పుడు కూడా నాతో బలవంతంగా సెక్స్ చేశాడు. అతడు వేశ్యలతో సంబంధాలు పెట్టుకునేవాడు. బాత్రూంలో కెమెరాలతో నిఘా పెట్టేవాడు. రోజూవారీ కార్యకలాపాల సమయంలో చిత్రీకరించేవాడు. సంపదపై పన్నులు పడొద్దని నన్ను, నా కొడుకును మరో దేశానికి ఈడ్చుకెళ్లాడు. .. ఒక వేళ నాతో శృంగారంలో పాల్గొనకుంటే, బయటకు వెళ్లి దానిని పొందాలనుకుంటున్నట్లు చెప్పేవాడు. తన స్నేహితులతోనూ పడుకోవాలని ఒత్తిడి చేసేవాడు. అనూప్తో తనకు ఉన్న సంబంధం గురించి ప్రసన్న చెప్పేవి అన్ని కల్పితమైనవే. అతడితో నా సంబంధం లైంగికమైనది కాదు. భావోద్వేగమైనది మాత్రమే’’ అని ఆ ఇంటర్వూ్యలో తెలిపారామె. అయితే భర్త ప్రసన్న శంకర్ ఆమెవన్నీ ఆరోపణలే అని ఖండించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వీరి కేసు కాలిఫోర్నియా కోర్టులో విచారణలో ఉంది. -
రామా...శ్రీరామ...!
●తెలుగింట నవమి సంబరాలు ●కనుల పండువగా సీతారామ కల్యాణ మహోత్సవం ●భక్తిభావాన్ని చాటిన తెలుగు సంఘాల వేడుకలు ఆస్కాలో ... ఆంథ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను ఆదివారం జరిగింది. ఆస్కా అధ్యక్షుడు కె. సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈవేడుకల్లో సీతారాములను విశేషంగా అలంకరింపజేసి వేదపండితులు కల్యాణోత్సవాన్ని జరిపించారు. సీతారాములకు విశేషంగా పూజలను చేసి ఆశీస్సులు అందుకున్నారు . ఈవేడుకల్లో ఆస్కా సభ్యులు వారి కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొని సీతారాముల కృపకుపాత్రులయ్యారు. సాక్షి, చైన్నె: రామా..శ్రీరామా...జయ జయ రామా నామస్మరణ ఆదివారం తెలుగింట మిన్నంటింది. శ్రీరామనవమి సంబరాలను తెలుగు వారు అధికంగా ఉండే ప్రాంతాలలో ఘనంగా జరుపుకున్నారు. తెలుగు సంఘాల నేతృత్వంలో భక్తి భావాన్నిచాటే విధంగా పూజాది కార్యక్రమాలు, వేడుకలు జరిగాయి. సీతారామ కల్యాణ మహోత్సవం నిర్వహించారు. చైన్నెతో పాటూ రాష్ట్రంలోని పలు నగరాలలో ఉన్న తెలుగు వారు గత వారం ఉగాది సంబరాలను అత్యంత వేడుకగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో ఆదివారం శ్రీరామనవి పర్వదినాన్ని భక్తి భావంతో నిర్వహించారు. సీతారాములకు పూజాది కార్యక్రమాలు, వడపప్పు, పానకం వంటి ప్రసాదాలను తయారు చేసి ఇంటిళ్లి పాదికే కాకుండా ఇరుగు పొరుగు వారికి పంచి పెట్టారు. తెలుగు సంఘాల నేతృత్వంలో వేర్వేరుగా అత్యంత వేడుకగా జరిగిన సీతారామ కల్యాణ మహోత్సవ వేడుకలో భక్తులకు ప్రసాదాలను అందజేశారు. టినగర్లోని శ్రీవారి ఆలయంలో టీటీడీ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలతో నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని శ్రీరాముడి ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. చైన్నె తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో: చెన్నె తెలుగు అసోసియేషన్ (సీటీఏ) ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు చైన్నె పోరూరు, ఆర్కాట్ రోడ్లోని రాజలక్ష్మి మహల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేడుకలు జురిగాయి. వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజలతో సీతారామ కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు కల్యాణాన్ని తనివితీరా తిలకించారు. వీరికి ప్రసాదాలు, తలంబ్రాలు అందజేశారు. అందరికీ కల్యాణ విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీటీఏ అధ్యక్షుడు కె.గోపాలకృష్ణ రెడ్డి, కార్యదర్శి బి.వెంకయ్య నాయుడు, ఉపాధ్యక్షులు గాడిపర్తి సురేష్, విజయేంద్రరావు, కోశాధికారి నాగరాజు, కల్చరల్ సెక్రటరీ డాక్టర్ ఏవీ శివకుమారి, జాయింట్ సెక్రటరీలు రామయ్య, శ్రీనుబాబు, కమిటీ సభ్యులు మదుకర్, వెంకట రమణయ్య, రామ్ ప్రసాద్, అడ్వైజరీ కమిటీ సభ్యులు చలపతి, పి.వి.రవికుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆంధ్ర కళా స్రవంతిలో.. చైన్నె కొరట్టూరు అగ్రహారంలోని శ్రీ ఆంధ్ర కళాస్రవంతి తెలుగు సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో 36వ వార్షిక శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరిగింది. సీతారాముల కల్యాణాన్ని తిలకించిన భక్తులు భక్తి పరవశంలో మునిగిపోయారు. ఉదయం 9 గంటలకు సీతారాముల కల్యాణోత్సవ తంతు ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి దీపారాధన, అర్చనతో భక్తుల సందర్శనం కల్పించారు. పండితుడు కుటుంబశాస్త్రి ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ వేడుకగా కల్యాణోత్సవం జరిపించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన శ్రీరామభజన కార్యక్రమం జరిగింది. ఆంధ్ర కళాస్రవంతి అధ్యక్షులు జేఎం నాయుడు, సలహాదారుడు ఎంఎస్ మూర్తి, ప్రధాన కార్యదర్శి జె. శ్రీనివాస్, కోశాధికారి జీవీ రమణ పర్యవేక్షణలో నిర్వహించిన కల్యాణోత్సవాల్లో ఉపాధ్యక్షులు వీఎన్ హరినాథ్, కేఎన్ సురేష్ బాబు, పి సరస్వతి తదితరులు తగిన ఏర్పాటు చేశారు. సీతారామనగర్లో.. మూలకడై సమీపంలోని సీతారామనగర్లోని సీతారామనగర్ తెలుగుప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 28వ వార్షిక శ్రీసీతారాముల కల్యాణమహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. సంఘ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ వేడుకల్లో తెలుగు సంప్రదాయాలకు అద్దంపడుతూ దైవదంపతులు సీతారాములను భక్తులు రామ నామస్మరణ, మేళతాళాల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. అధ్యక్షులు బి.సురేష్ బాబు, కార్యదర్శి పి.లక్ష్మణ రావు, కోశాధికారి డి.పిచ్చేశ్వరరావుతోపాటూ ఎస్.చంద్రశేఖర్రెడ్డి, కె.శ్రీనివాసకుమార్, బి.శ్రీధర్ పి. బాలాజీ, డి.సాంబశివరావు, సీఎస్.జయకుమార్, ఎన్. సతీష్, జె.మధుసూధన్, పి.సుబ్బరాజు, టి. నాగరాజు, డి.వినోద్కుమార్లతో పాటు వంజరపు శివయ్య తదితరులు పాల్గొన్నారు. ట్రిప్లికేన్ రామనగర్లో.. తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్న ట్రిఫ్లికేన్లోని రామనగర్లోని శ్రీ కోదండరామ భక్తజన మందిరం వద్ద శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాములను అలంకరించి ప్రత్యేక పూజలు అనంతరం మాంగల్యాధారణ చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. అనంతరం సహపంక్తి భోజన కార్యక్రమం జరిగింది. సీతారాముల ఊరేగింపు కనుల పండువుగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామనగర్ ఆది ఆంధ్ర సంక్షేమ సంఘం, శ్రీ కోదండ రామభక్తజన బృందం, శ్రీరామదాసాంజనేయ స్వామి ఆలయ కార్యవర్గ సభ్యులు , పెద్దలు , యువకులు అందరూ కలసి జయప్రదం చేశారు. ఎస్కేపీడీలో.. ఎస్కేపీడీలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 17వ తేదీ వరకు జరుగుతాయి. చైన్నె జార్జిటౌన్లోని 300 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం(ఎస్కేపీడీ)లో శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం సీతారాములకు ప్రత్యేక పూజలు జరిగాయి. హంస వాహనం ఉంచి పూజలు చేశారు. కమనీయం..కల్యాణం తిరుత్తణి: శ్రీ రామనవమి వేడకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తిరుత్తణి సమీపంలోని చత్రంజయపురంలో శ్రీరామనవమి సందర్భంగా రామభజన మందిరంలో ఆలయ మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో యాగశాలలు ఏర్పాటు చేసి నిత్యహోమ గుండ పూజలు చేశారు. ఉదయం ఆలయ గోపురానికి పవిత్ర పుణ్యతీర్థాలతో మహాకుంభాభిషేకం చేశారు. అనంతరం సీతారాముల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణోత్సవం తిలకించి పునీతులయ్యారు. సాయంత్రం స్వామివారిని గ్రామ వీధుల్లో ఊరేగించారు. వేలంజేరిలోని శ్రీరామ భజన ఆలయంలో ఉదయం స్వామికి అభిషేక పూజలు చేశారు. సాయంత్రం స్వామివారి ఊంజల్ సేవ జరిగింది. అనంతరం స్వామివారు గ్రామ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. తిరుత్తణిలోని ఆనుమంతపురంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమైయ్యాయి. ఘనంగా శ్రీరామనవమి వేడుకలు వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో శ్రీరామనవమిని పురష్కరించిని ఆదివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేలూరు రంగాపురంలోని కోదండరాముడి ఆలయంలోని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వాలాజలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో పీఠంలో ప్రతిష్టించిన పట్టాభిషేక రాముడికి మహా అభిషేకం, పుష్పాలంకరణచేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేదపండితులు మంత్రాలు చదివి పూజలు చేసి దేశ క్షేమం కోసం ప్రత్యేక యాగ పూజలు చేశారు. అదేవిధంగా తిరువణ్ణామలై జిల్లాలోని రాముడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. -
బైకు ఢీకొని మేస్త్రీ మృతి
పళ్లిపట్టు: బైకు ఢీకొన్న ఘటనలో తాపీమేస్త్రికి సకాలంలో వైద్యసేవలు అందకపోవడంతో మృతి చెందారు. ఆగ్రహించి గ్రామీణులు శనివారం రాత్రి రాస్తారోకో చేశారు. పొదటూరుపేటకు సమీపంలోని ఈచ్చందోప్పు గ్రామానికి చెందిన కుమార్(45) తాపీమేస్త్రి. శనివారం సాయంత్రం ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు నడిచి వెళ్లాడు. ఆ సమయంలో అటువైపు వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. ఈ ఘటనలో కుమార్కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ అతన్ని పొదటూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లు లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక తాపిమేస్త్రి మృతిచెందాడు. ఆగ్రహించిన మృతుని కుటుంబీకులు, బంధువులు, గ్రామీణులు ప్రభుత్వాస్పత్రికి సమీపంలోని ప్రదాన రోడ్డులో రాస్తారోకో చేశారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు రాస్తారోకో తో ఆస్పత్రి ప్రాంతంలో ఉ ద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకుని చర్చలు జరిపి రాస్తారోకో విరమింపజేశారు. -
ఆటిజం అవగాహనకు వాకథాన్
సాక్షి, చైన్నె: ఆటిజంపై అవగాహన కల్పించే విధంగా వాకథాన్లో వైద్యులు, తల్లిదండ్రులు, ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు కలిసి అడుగులు వేశారు. ఐక్యత, కరుణను శక్తివంతంగా ప్రదర్శించే క్రమంలో చైన్నెలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నేతృత్వంలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని బెసెంట్ నగర్ బీచ్లో ఈ వాకథాన్ను ఆదివారం నిర్వహించారు. రెయిన్బో హాస్పిటల్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధన్ర్యంలో జరిగిన ఈ కార్యక్రమం, ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిని ఒకచోట చేరారు. సమ్మిళిత, సహాయక సమాజాన్ని నిర్మించడానికి సమష్టిగా నిబద్ధతతో ముందడుగు వేశారు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ గురించి అవగాహన పెంచడం , ఆటిజం ఉన్న వ్యక్తులకు ముందస్తు రోగ నిర్ధారణ, గుర్తింపు, వైద్య పరంగా మద్దతును ప్రోత్సహించడంపై ఈ వాకథాన్ దృష్టి పెట్టారు. ఆటిజంతో బాధపడుతున్న పిల్లలను శక్తివంతం చేయడంలో సానుభూతి, ముందస్తు జోక్యం, సమాజ మద్దతు, ప్రాముఖ్యతను ఆస్పత్రి సీనియర్ వైద్యుల స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్లోని చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, డెవలప్మెంటల్ అండ్ బిహేవియరల్ పీడియాట్రిక్స్ కన్సల్టెంట్ డాక్టర్ పెరుమాళ్ సత్య ఎస్తో పాటు పెద్ద సంఖ్యలో వైద్యులు తమసందేశాలను ఇచ్చారు. -
ఉన్నత విద్యలో తమిళనాడుకు అగ్రస్థానం
–మంత్రి కోవి. చెజియన్ కొరుక్కుపేట: ఉన్నత విద్యలో తమిళనాడు రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం గర్వంగా ఉందని ఉన్నత విద్యా శాఖమంత్రి కోవి చెలియన్ అన్నారు. తంజై కుందవై నాచియార్ ప్రభుత్వ మహిళా ఆర్ట్స్ కళాశాల స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో అతిథిగా పాల్గొన్న మంత్రి విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేసి మాట్లాడుతూభారతదేశంలో ఉన్నత విద్యలో తమిళనాడు అగ్రస్థానంలో ఉందన్నారు మొత్తం భారతదేశంలో ఉన్నత విద్యలో నమోదు రేటు 28 శాతం. 2035 నాటికి 50 శాతానికి చేరుకుంటామని కేంద్ర మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. కానీ తమిళనాడులో ప్రస్తుతం ఉన్నత విద్యలో 48 శాతం ఉందన్నారు. 2025 నాటికి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన 50 శాతం సాధించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టానిల్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వైద్య గుణం కలిగిన 1.5 టన్నుల కూరై కత్తాలై చేపలు లభ్యం తిరువొత్తియూరు: చైన్నె కాశిమేడు సముద్రంలో జాలరి చేపల పడుతున్న సమయంలో అతని వలలో అరుదైన వైద్య గుణం కలిగిన 1.5 కూర కత్తాలై అనే చేపలు చిక్కాయి. వీటి ధర ఒక కిలో రూ. 5,000 నుంచి 10,000 వరకు పలుకుతాయని జాలర్లు తెలిపారు. కాశిమేడు ప్రాంతానికి చెందిన దేవరాజు జాలరి. ఇతను గత కొన్ని రోజుల క్రితం సముద్రంలో చేపలు పట్టడానికి ఫైబర్ పడవలో వెళ్లాడు. ఆ సమయంలో అతని వలలో సుమారు ఒకటిన్నర టన్నుల వైద్య గుణం కలిగిన చేపలు చిక్కాయి. ఆ చేపలతో దేవరాజు వడ్డుకు తిరిగి వచ్చాడు. ఈ చేపలు గుండె నొప్పి నివారణ, ఎముకల బవలం వంటి వైద్య గుణం కలిగి పనిచేస్తుందని జాలర్లు తెలిపారు. అలాగే కూర కత్తాలై చేపలు ఎక్కువ ధర పలుకుతుందని తెలిపారు. దీని గురించి దేవరాజు మాట్లాడుతూ ఈ చేపలు రూ. 28 లక్షల వరకు వేలంలో అమ్ముడైనట్లు పేర్కొన్నారు. లంక చెర నుంచి 14 మంది జాలర్ల విడుదల సేలం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేడుకోలుకు అనుగుణంగా తమిళ జాలర్లు 14 మంది శ్రీలంక ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. ప్రధాన నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయనకు ఆ దేశ ప్రధాని ఘన స్వాగతం పలికారు. శ్రీలంక రాజధాని కొలంబోలు జరిగిన కార్యక్రమంలో ప్రధాని అనురా కుమార దిసనాయకోవై ప్రధాని మోదీని ప్రత్యేకంగా సమావేశమైయ్యారు. ఆ సమయంలో జాలర్ల సమస్య గురించి శ్రీలంక ప్రధానితో మోదీ చర్చించారు. ఆ సమయంలో తమిళ జాలర్లను విడుదల చేయాలని మోదీ కోరారు. ఈక్రమంలో వారి చర్చ అనంతరం శ్రీలంక ప్రభుత్వం ఆదివారం 14 మంది జాలర్లను జైలు నుంచి విడుదల చేసింది. వారిని త్వరలో తమిళనాడుకు తిరిగి వస్తుండడంతో అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. అదే సమయంలో సీజ్ చేసిన రూ. లక్షల విలువ చేసే మర పడవలను త్వరలో విడుదల చేసి అప్పగిస్తారని తమిళ జాలర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐపీఎల్ టిక్కెట్లు అదనపు ధరకు విక్రయం – 11 మంది అరెస్టు తిరువొత్తియూరు: చైన్నె–ఢిల్లీ ఐపీఎల్ మ్యాచ్ కోసం టికెట్లను బ్లాక్లో ఎక్కువ ధర కు విక్రయిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 34 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. చైన్నెలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో చాలా మంది టిక్కెట్లను అదనపు ధరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సీఎస్కే–ఢిల్లీ జట్ల మధ్య జరిగిన పోటీ సమయంలో అదనపు ధరకు విక్రయిస్తున్న 11 మందిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 34 టిక్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 25 మందితో ఎన్టీకే జాబితా సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాను నామ్ తమిళర్ కట్చి ఆదివారం ప్రకటించింది. ఆ పార్టీ కన్వీనర్ సీమాన్ 25 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో సాధించిన ఓటు బ్యాంకుతో కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపును నామ్ తమిళర్ కట్చి దక్కించుకున్న విషయం తెలిసిందే. తమకు బలం ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసి అభ్యర్థులను ప్రకటించే పనిలో ఆ పార్టీ కన్వీనర్ సీమాన్ నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా 25 మందితో జాబితాను ప్రకటించారు. తిరువళ్లూరులో సెంథిల్కుమార్, గుమ్మిడిపూండిలో శ్రీధర్, చైన్నె థౌజండ్లైట్స్లో కలైంజియం పోటీ చేస్తారని ప్రకటించారు. -
పాంబన్ వంతెన.. ఓ అద్భుతం
సాక్షి, చైన్నె: ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన రామనాథపురం జిల్లా రామేశ్వరంలో శ్రీరామ నవమి రోజైన ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. మదురై విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మండపానికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్రవి, కేంద్ర సహాయమంత్రి ఎల్మురుగన్, రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఆహ్వానం పలికారు. మండపం, రామేశ్వరం పరిధిలో గాల్లో హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టి సమయంలో రాముడు నిర్మించిన వంతెన (రామసేతు)ను ప్రధాని వీక్షించారు. అనంతరం రామేశ్వరం రోడ్డు మార్గం వంతెన మీద నుంచి రూ. 550 కోట్లతో వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా పాంబన్లో రూపుదిద్దుకున్న సముద్ర రైల్వే మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ సాయంతో ప్రారంభించారు. ఈ వంతెన వద్ద నౌకలు సముద్రంలో ప్రయాణించేందుకు వీలుగా నిర్మించిన ప్రత్యేక గేట్లను రిమోట్ ద్వారా తెరిచారు. ఈసమయంలో భారత నావికాదళం, కోస్టుగార్డు నౌకలు ఆ కొత్త వంతెన కింది భాగంలో సముద్రం వైపుగా అటు ఇటూ దూసుకెళ్లాయి. అలాగే, రామేశ్వరం టూ తాంబరం రైలు సేవకు జెండా ఊపారు. రామ పాలనే ఆదర్శంగా.. ఈ వేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తమిళంలో యన్ తమిళ్ అన్బు సొందంగలే ( నా ప్రియ తమిళ ఆప్తులారా)అంటూ ప్రసంగాన్ని మొదలెట్టారు. పవిత్ర శ్రీరామ నవమి వేళ గత ఏడాది తాను ఇక్కడకు వచ్చినట్టు, ఆ తర్వాత అయోధ్యకు వెళ్లి రామాలయం ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్నట్టు గుర్తు చేశారు. శ్రీ రాముడి జీవితం, శ్రీరాముడి పాలనలోని మంచి ఉద్వేగ భరిత అంశాలు భారత దేశ నిర్మాణానికి ఆధారంగా, ఆదర్శకంగా ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారు. తమిళ సంగ కాల సాహిత్యంలో శ్రీరాముడి గురించి పే ర్కొన్నారని వివరిస్తూ, రామేశ్వరం పవిత్ర భూమి అంటూ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. పాంబన్ వంతెనను ఒకప్పుడు గు జరాతీ ఒకరు నిర్మించినట్టు, ఇప్పుడు అదే గుజరాత్కు చెందిన తాను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. రామేశ్వరం భారత రత్న అబ్దుల్ కలాం భూమి అని, ఇది విజ్ఞాన, ఆథ్యాత్మిక మేళవింపు అంటూ, ప్రస్తుతం పాంబన్ వంతెన ఆధునిక సాంకేతికత, పారంపర్య మేళవింపుగా రూపుదిద్దకున్నట్టు వివరించారు. దేశంలోనే ఇది తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి ఇది అని పేర్కొంటూ, వివిధ రాష్ట్రాలలో వున్న ప్రముక భారీ వంతెనల గురించి ప్రస్తావించారు. రామేశ్వరం టూ చైన్నెకు మాత్రమే కాదు, దేశంలోని పలు నగరాలకు రైలు సేవలను విస్తరిస్తామన్నారు. తద్వారా తమిళనాడు పర్యాటకంగా, ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందన్నారు. పదేళ్లల్లో నిధుల వరద.. తమిళనాడుకు గత పది సంవత్సరాలలో రైలు, రోడ్డు, హార్బర్, విమాశ్రయాలు, విద్యుత్, నీళ్లు, గ్యాస్ పైప్ లైన్లు అంటూ ఎన్నో ప్రగతి ప్రాజెక్టులకు నిధులను హోరెత్తించామన్నారు. వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్ల ఆధునీకరణ, బుల్లెట్ రైలు సేవల కసరత్తులు వేగం పెంచామన్నారు. దేశంలో అన్ని ప్రాంతాల మధ్య కనెక్టివిటీ లక్ష్యంగా, అభివృద్ధికి మార్గం బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు. విక్షిత్ భారత్ వైపు సాగుతున్న ప్రయాణంలో దేశ ప్రగతికి తమిళనాడు కీలక భాగస్వామ్యంగా ఉందని వివరించారు. తమిళనాడు సామర్థ్యం పెరిగిందని, అభివృద్ధి వేగవంతమైందని, తమిళనాడు ఆర్థిక ప్రగతి, పారిశ్రామిక పగతికి తోడ్పాటు రెట్టింపు అయిందని వివరించారు. దేశ ప్రగతిలో తమిళనాడు పాత్ర కీలకం అని పేర్కొంటూ, అందుకే కేంద్రం ప్రత్యేక దృష్టితో నిధులను కేటాయిస్తూ వస్తోందన్నారు. గత పది సంవత్సరాలలో వివిధ పథకాలు, ప్రాజెక్టులకు జరిగిన నిధుల కేటాయింపును గురించి వివరించారు. అయితే ఇందుకు భిన్నంగా కొందరు కన్నీళ్లు కారుస్తున్నారని, ఏడ్చే వాళ్లు ఎడవ నీయండి అంటూ డీఎంకే పాలకును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తమిళంలో వైద్య కోర్సులు అందరికీ నాణ్యమైన, ఉన్నత మైన వైద్యం దిశగా చర్యలు విస్తృతం చేశామని ప్రస్తావిస్తూ, తమిళనాడులోని విద్యార్థులు వైద్య కోర్సును వారి మాతృ భాషలోనే చదువుకునే విధంగా ప్రత్యేక ప్రయత్నం జరుగుతున్నదన్నారు. తమిళంలో పాఠ్యాంశాల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. జాలర్ల సంక్షేమం లక్ష్యం అని, వారి భద్రతకు భరోసా ఇస్తున్నట్టు పేర్కొంటూ, ఇప్పటి వరకు శ్రీలంక చెర నుంచి తాము విడుదల చేయించిన వారి వివరాలను వెల్లడించారు. మత్స్య సంపద పెంపునకు చేపట్టిన విస్తృత చర్యలను ప్రస్తావించారు. అలాగే, ఈ రాష్ట్రం నుంచి తనకు ఆంగ్లంలో లేఖలు వస్తుంటాయని, అయితే, ఇందులో సంతకం మాత్రం ఆంగ్లంలో ఉండటం విస్మయానికి గురి చేస్తున్నదన్నారు. తమిళ స్వరం, గళం అనే వారు తమిళంలో సంతకం పెట్టరూ? అంటూ పరోక్షంగా సీఎం స్టాలిన్కు హితవు పలికారు. తమిళ సంస్కృతి. సంప్రదాయం, భాష ప్రపంచ దేశాలలో విరాజిల్లాలన్న కాంక్షతో తన ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఇదే రోజు అని ప్రస్తావిస్తూ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజలకు సుపరిపాలన అందించే అవకాశం తమకు దక్కిందని, తమ పాలన తీరును ప్రజలు పరిశీలిస్తున్నారని, దేశ ప్రయోజనాల మీద దృష్టి పెడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. చివరగా తమిళనాడు ప్రగతి పథకాలకు సంపూర్ణ సహకారం, మద్దతు , శుభాకాంక్షలు అంటూ మీండూం సంధిప్పోం ( మళ్లీ కలుద్దాం) అన్న తమిళ వ్యాఖ్యతో ప్రసంగాన్ని ముగించారు. దేశానికి అంకితం చేసిన ప్రధాని మోదీ రైలు సేవకు శ్రీకారం దేశ ప్రగతిలో కీలకంగా తమిళనాడు సంతకాలు తమిళం పెట్టాలని నేతలకు సూచన రాష్ట్రానికి గత పదేళ్లల్లో భారీగా నిధులిచ్చామని స్పష్టీకరణ -
సత్యభామలో ఘనంగా అచీవర్స్ దినోత్సవం
– 91.87 శాతం మందికి ప్లేస్మెంట్స్ సాక్షి, చైన్నె : సత్యభామ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 91.87 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేశారు. సంవత్సరానికి గరిష్టంగా రూ.41.20 లక్షల జీతంతో విద్యార్థులను వివిధ సంస్థలు ఎంపిక చేశాయి. సత్యభామ అచీవర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025లో బెస్ట్ ప్లేస్మెంట్ క్యాంప్లో ఎంపికై న విద్యార్థులకు ఉద్యోగ నియామక ఉత్తర్వుల ప్రదానోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. శనివారం రాత్రి ఈ కార్యక్రమం చైన్నెలోని ఓఎంఆర్ రోడ్డులో ఉన్న సత్యభామ డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగింది. ఈ విద్యాలయం చాన్స్లర్ డాక్టర్ మరియాజీనా జాన్సన్, అధ్యక్షురాలు డాక్టర్ మరియా జాన్సన్, ఉపాధ్యక్షులు అరుల్ సెల్వన్, మరియా బెర్నాడెట్ తమిళరసి, మరియా కేథరీన్ జయప్రియ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ఉద్యోగ నియామక శిబిరంలో ఎంపికైన విద్యార్థులకు ఉద్యోగ ఉత్తర్వులను అందజేసి సత్కరించారు. ఉద్యోగం కోసం పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులలో 91.87 శాతం మంది అధిక జీతాలతో వివిధ రంగాలలో అవకాశాలు దక్కించుకున్నట్టు ఈసందర్బంగా ప్రకటించారు. 2025లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కన్సల్టింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ప్రాసెసింగ్, అమ్మకాలు , ప్రకటనలు వంటి వివిధ రంగాల నుంచి 300 కంటే ఎక్కువ ప్రైవేట్ కంపెనీలు తమ వర్సిటీని సందర్శించాయని వివరించారు. ఈ సంవత్సరం మొత్తం 3,120 మందికి ఉద్యోగ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఈసందర్భంగా వివరించారు. సత్యభామ డీమ్డ్ విశ్వవిద్యాలయం ఉన్నత విద్య సలహా కమిటీ ద్వారా చదివిన 216 మంది విద్యార్థులు అమెరికా, లండన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్ భారతదేశం సహా విదేశాలలో ఉన్నత విద్య కోసం ఎంపిక చేసినట్టు ఈసందర్భంగా ప్రకటించారు. వివిధ కళాశాలలో చదువుకోవడానికి ఎంపికై న వారికి సర్టిఫికెట్లు అందజేసి ప్రోత్సహించారు. విద్యార్థులు పొందుతున్న అత్యధిక జీతం సంవత్సరానికి 41.20 లక్షలుగా ప్రకటించారు. -
రామనాథ స్వామి ఆలయంలో పూజలు
పట్టు పంచె, జరిగ చొక్కా ధరించి ప్రధాని నరేంద్ర మోదీ రామేశ్వరం రామనాథ స్వామి ఆలయానికి వెళ్లారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధగంట పాటూ ఆలయంలోనే ఉన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూల మాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. తమిళ సంప్రదాయం ఉట్టి పడే రీతిలో ప్రధాని వస్త్ర ధారణ కనిపించడం గమనార్హం. పూజల అనంతరం ఆలయం ప్రాకారాలను ప్రధాని చుట్టి వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రామేశ్వరం ఆలయం మైదానానికి వెళ్లారు. ఈ మార్గంలో 2.50 కి.మీ దూరం మోదీ రోడ్ షో జరిగింది. రోడ్డుకు ఇరువైపులా బీజేపీ కార్యకర్తలు, జనం పెద్ద సంఖ్యలో నిలబడి ఆహ్వానం పలికారు. వారికి అభివాదం తెలుపుతూ కాన్వాయ్ ముందుకు సాగింది. ఆలయం మైదానం వేదిక నుంచి రూ.8,300 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇందులో వాలాజా పేట – రాణిపేటను కలుపుతూ ఆంధ్రా సరిహద్దుల వరకు 28 కి.మీ దూరం ఫోర్ వే, విల్లుపురం – పుదుచ్చేరి మధ్య 29 కి.మీ దూరం ఫోర్ వే, పూండియన్ కుప్పం – చట్టనాథపురం మధ్య 59 కి.మీ దూరం పోర్వే, చోలవరం – తంజావూరు మధ్య 48 కి.మీ దూరం పోర్ వే రోడ్డు పనులు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సహాయమంత్రి ఎల్. మురుగన్, సీఎం స్టాలిన్ హాజరు కాని నేపథ్యంలో ఆయన ప్రతినిధులుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు తంగం తెన్నరసు, రాజకన్నప్పన్ హాజరయ్యారు. -
కార్తీ లేకుండా సీక్వెల్ ఉండదు!
తమిళసినిమా: నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన చిత్రం ఆయిరత్తిల్ ఒరువన్. నటి రీమాసేన్, ఆండ్రియా కథానాయకిలుగా నటించిన ఇందులో పార్థిబన్ ముఖ్యపాత్రలు పోషించారు. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో విడుదలై అందరికీ మంచి పేరు తెచ్చి పెట్టింది. కాగా ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు సెల్వరాఘవన్ అప్పుడే ప్రకటించారు. అయితే అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. కాగా 2021లో ధనుష్ కథానాయకుడిగా ఆయిరత్తిల్ ఒరువన్కు సీక్వెల్ చేస్తానని దర్శకుడు పేర్కొన్నారు. అది జరగలేదు. తాజాగా దర్శకుడు సెల్వరాఘవన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఆయిరత్తిల్ ఒరువన్కు సీక్వెల్ చేయాలని తనకు బలంగా ఉందన్నారు. అయితే ఆ చిత్రాన్ని చేయాలంటే పెద్ద నిర్మాణ సంస్థ ముందుకు వస్తేనే సాధ్యం అవుతుందని అన్నారు. అలా రూపొందే చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్రను పోషిస్తారని అయితే కార్తీ లేకుండా ఈ చిత్రానికి రెండవ భాగం రూపొందదని పేర్కొన్నారు. ఈ ఇద్దరు హీరోలు ఏడాది పాటు ఈ చిత్రానికి కాల్షీట్స్ కేటాయించాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం కార్తీ, ధనుష్ ఉన్న పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా అనే అనుమానం ప్రేక్షకులకు కచ్చితంగా కలుగుతుంది. కాగా ప్రస్తుతం దర్శకుడు సెల్వరాఘవన్ తాను ఇంతకుముందు తెరకెక్కించిన 7జీ.రెయిన్బో కాలనీ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికీ 50 శాతం పూర్తి చేసుకుందని సమాచారం. -
జీవీ హీరోగా ఇడిముళక్కం
తమిళసినిమా: సంగీత దర్శకుడు, కథానాయకుడు, నిర్మాత, గాయకుడు ఇలా బహు ముఖాలు కలిగిన నటుడు జీవీ ప్రకాష్కుమార్. ఈయన సంగీత దర్శకుడిగా సక్సెస్ఫుల్గా సెంచరీ కొట్టారు. నిర్మాతగా ఇటీవలే కింగ్స్టన్ చిత్రంతో తొలి అడుగు వేశారు. అయితే కథానాయకుడుగా పలు చిత్రాల్లో నటించినా, ఇంకా సరైన సక్సెస్ కోసం పోరాడుతూనే ఉన్నారని చెప్పవచ్చు. తాజాగా జీవీ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇడి ముళక్కం. దీనికి శీను రామస్వామి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు తెన్మేర్కు పరువకాట్రు, నీరంతా పరవై, ధర్మదురై, మామణిధన్ వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారన్నది గమనార్హం. అదేవిధంగా ఇటీవల ఈయన దర్శకత్వం వహించిన కోళిపన్నై సెల్లదురై చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టినా, ఓటీటీలో మంచి ఆదరణ పొందింది. తాజాగా శీను రామస్వామి దర్శకత్వం వహిస్తున్న ఇడి మీళుక్కం జీవీ, శీను రామస్వామి కాంబోలో రూపొందుతున్న తొలి చిత్రం ఇది. ఇంతకుముందు కుటుంబ కథా చిత్రాలను తరకెక్కించిన శీను రామస్వామి తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న యాక్షన్, సస్పెన్న్స్ కథా చిత్రం ఇది కావడం విశేషం. ఉత్కంఠ భరితంగా సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంలో గాయత్రి నైతిక నటించారు. ఎన్ఆర్ రఘునందన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని స్కై మాన్ ఫిలిమ్స్ పతాకంపై కలైమగన్ ముబారక్ నిర్మించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేశారు. చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు. ఈ చిత్రం అయినా జీవీకి మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. -
అవన్నీ ఎప్పటికీ జరగవు
వేలూరు: ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ఒకే భాష, ఒకే దేవుడు అనేవి ఎప్పటికీ జరగవని రాష్ట్ర మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గంలోని కార్పొరేషన్ ఒకటవ డివిజన్ పరిధిలోని కాంగనల్లూరు ప్రాంతంలో కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన రూ.1.20 కోట్ల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ ఇక్కడి ప్రజల చిరకాల కోరిక మేరకే ప్రస్తుతం పీహెచ్సీని ప్రారంభిస్తున్నామన్నారు. కాట్పాడి నియోజకవర్గంలోని ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే ఎన్నికల వ్యవహారంలో తండ్రి అడుగుజాడల్లో సీఎం స్టాలిన్ నడుచుకోవడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం సరికాదన్నారు. ఒక కేంద్ర మంత్రి మాట్లాడాల్సిన మాటలు ఇవి కావని ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ఒకే దేవుడు, ఒకే ఆహారం అనేవి ఎప్పటికీ జరగవన్నారు. ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్, అములు, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్కుమార్, కార్పొరేషన్ కమిషనర్ జానకి, కార్పొరేటర్ రమేష్ పాల్గొన్నారు. -
రెడ్క్రాస్ సేవలు విస్తరింపజేయాలి
వేలూరు: రెడ్క్రాస్ సేవలు పట్టణ ప్రాంతాలకే అంకితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేసి ప్రజలకు సేవ చేసేందుకు ముందుకురావాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్స్లర విశ్వనాథన్ అన్నారు. వేలూరు ఇండియన్ రెడ్క్రాస్ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాసన్ సేవలను అభినందించి రాష్ట్ర ప్రభుత్వం గత వారంలో తమిళ్ సేవా అవార్డును సీఎం స్టాలిన్ చేతులమీదుగా అందజేశారు. దీంతో కాట్పాడిలోని ప్రయివేటు కల్యాణ మండపంలో రెడ్క్రాస్ సభ్యులు అభినందన సమావేశం జిల్లా కార్యదర్శి జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీఐటీ చాన్స్లర్ హాజరై శ్రీనివాసన్కు జ్ఞాపికను అందజేసి ప్రసంగించారు. గత కరోనా కాలంలో రెడ్క్రాస్ సభ్యులు వేలూరు జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. నేటికి రక్తదానం, వైద్యశిబిరాలు వంటి సేవలు చేయడం అభినందనీయమన్నారు. నిజమైన పేదలను ఆదుకునేందుకే రెడ్క్రాస్ సంఘాన్ని ప్రారంభించారని వీటిలో మరిన్ని సభ్యులను చేర్చి సేవా కార్యక్రమాలను విస్తరింపజేయాలని కోరారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు దీనబంధు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్కుమార్, కుమరన్ ఆస్పత్రి చైర్మన్ మయిలాంబిగై కుమరగురు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఇక్రమ్, నారాయణ ట్రేడర్స్ యజమాని తంగవేలు, రెడ్క్రాస్ జాయింట్ కార్యదర్శి విజయకుమారి పాల్గొన్నారు. -
వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
వేలూరు: దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం, మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేలూరు అన్నారోడ్డులో ఆందోళన చేశారు. ఆందోళనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు టీకా రామన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం, మైనారిటీలపై కక్ష సాధింపు కోసమే కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తోందన్నారు. ఒక మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలాల్లో ఇతరులు పెత్తనం చేసే విధంగా చట్టాలు తీసుకు రాకుండా చూడాలన్నారు. దేశ వ్యాప్తంగా ముస్లింలు ఆందోలన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్య క్రమంలో పార్టీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి చిత్తరంజన్, జిల్లా ఉపాధ్యక్షుడు పీపీ చంద్రప్రకాష్, మాజీ కార్పొరేటర్ జయప్రకాష్, మైనా రిటీ విభాగం జిల్లా కార్యదర్శి వాహీద్బాషా, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘నీట్’ మినహాయిస్తేనే పొత్తు
● బీజేపీని డిమాండ్ చేసే ధైర్యం ఉందా? ● అన్నాడీఎంకేకు స్టాలిన్ సూటి ప్రశ్న ● నీలగిరిలో విస్తృతంగా పర్యటన సాక్షి, చైన్నె : నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు కల్పిస్తేనే కూటమి అని బీజేపీతో ఖరాఖండిగా తేల్చి చెప్పే ధైర్యం ఉందా? అని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి సీఎం స్టాలిన్ సవాల్ విసిరారు. ఆదివారం నీలగిరి ప్రగతిని కాంక్షిస్తూ ఊటీలో జరిగిన కార్యక్రమంలో సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. భారీ ఆస్పత్రిని ప్రారంభించారు. నీలగిరుల ప్రగతికి ఆరు కొత్త పథకాలను ప్రకటించారు. నీలగిరి జిల్లా కేంద్రం ఊటిలో రూ. 143.69 కోట్లతో బ్రహ్మాండ ఆస్పత్రిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. 700 పడకలతో అత్యవసర, అత్యాధునిక వైద్య చికిత్స విభాగాలతో రూపొందించిన ఈ ఆస్పత్రిని ఆదివారం సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఆస్పత్రిలోని శస్త్ర చికిత్స విభాగాలు, ఔట్ పేషంట్ విభాగం, ఇతర వైద్య సంబంధిత విభాగాలు, అక్కడి పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నీలగిరి జిల్లాలోని గిరిజన ప్రజలు తమ సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో సీఎంకు ఆహ్వానం పలికారు. ఈ ఆస్పత్రిలో 230 మంది వైద్యులు, 330 మంది నర్సులు, 5 మంది ప్రాథమిక ఫార్మసిస్ట్లు, 13 మంది ఫార్మసిస్ట్లు, 13 మంది ప్రయోగశాల సాంకేతిక నిపుణులు, 13 మంది రేడియేషన్ టెక్నీషియన్లు, 5 మెడికల్ రికార్డు సిబ్బంది సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఏవీ వేలు, స్వామినాథన్, ఎం. సుబ్రమణియన్ , ఎంపీ రాజా, హిందూ గ్రూప్ అధ్యక్షులు ఎన్. రామ్, నీలగిరి జిల్లా కలెక్టర్ లక్ష్మీభవ్య తదితరులు పాల్గొన్నారు. నీలగిరులకు ఆరు ప్రాజెక్టులు.. అనంతరం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో రూ. 727 కోట్లతో పూర్తి చేసిన 1703 ప్రాజెక్టులను సీఎం స్టాలిన్ ప్రారంభించారు.56 కొత్త ప్రాజెక్టుల పనులకు శంకు స్థాపన చేశారు. 15,634 మంది లబ్ధిదారులకు రూ. 102 కోట్లు విలువైన సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. అలాగే కొత్తగా ఆరు ప్రాజెక్టులను సీఎం ప్రకటించారు. ఇందులో నీలగిరులలోని పేదలకు కూడలూరులో రూ. 26 కోట్లతో 300 గృహాలను నిర్మించి కొత్తగా కలైంజ్ఞర్ నగర్ను ఏర్పాటు చేయనున్నారు. అటవీ గ్రామాల ప్రజల జీవనాధారం పెంపే లక్ష్యంగా ఇక్కడి పరిస్థితులు, వీరి కళాత్మకం, వృత్తి, తదితర అంశాలతో డాక్యుమెంటరీ రూపకల్పనతో పాటూ పరిశోధనకు రూ. 10 కోట్లు ప్రకటించారు. తద్వారా ఎగ్జిభిషన్, పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. నీలగిరుల అందాలను వీక్షించేందుకు వీలుగా పర్యాటకుల కోసం హ్యాపి..అండ్ హ్యాపి..హ్యాపి నినాదంతో రూ. 5 కోట్లతో కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నారు. ఊటిలో ట్రాఫిక్రద్దీని క్రమబద్దీకరించేందుకు మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. గిరిజన ప్రాంతాలలో రూ. 5 కోట్లతో 23 కమ్యూనిటీ హాల్స, పట్టణాలలోని గిరిజనుల కోసం రూ. 10 కోట్లతో 200 గృహాలు నిర్మించేందుకు నిర్ణయించారు. ఆ ధైర్యం ఉందా..? సంక్షేమ పథకాల పంపిణీ సభలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, నీలగిరులు, ఊటీ ప్రగతి గురించి వివరించారు. తేయాకు తోటలలోని కార్మికు సంక్షేమం, అటవీ గ్రామాల ప్రజలకు జీవనోపాధి గురించి ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా త్రిభాషా విధానం, లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంలో కేంద్రం తీరును ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో ప్రధానిని కలిసేందుకు అనుమతి కోరి ఉన్నామని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రామేశ్వరం పర్యటన గురించి పేర్కొంటూ, ఇక్కడికి తాను రావాల్సి ఉండటంతో అక్కడికి వెళ్లలేదన్నారు. తమిళనాడు ప్రజల నెలకొన్న ఆందోళనలను తొలగించే విధంగా ప్రధాని ప్రకటన చేస్తారని ఎదురు చూసినట్టు వ్యాఖ్యానించారు. వక్ఫ్ చట్ట సవరణ ప్రజాస్వామ విరుద్ధంగా జరిగిందన్నారు. అయితే, ఈ వ్యవహారాలలో అన్నాడీఎంకే తీరును ప్రస్తావిస్తూ, ఈ బిల్లు పై సుప్రీంకోర్టులో డీఎంకే న్యాయ పోరాటంచేస్తుందన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఆమోదం పొందిన నీట్ మినహాయింపు ముసాయిదాను కేంద్రంపాలకులు వెనక్కి పంపించారని పేర్కొంటూ, ఇది విచారకరంగా పేర్కొన్నారు. నీట్ విషయంలో, ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామిని ఈసందర్భంగా తాను ప్రశ్నిస్తున్నానని,సవాల్ విసురుతున్నానంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన రూపంలోనే నీట్ అన్నది తమిళనాడులోకి ప్రవేశించినట్టు గుర్తుచేస్తూ, బీజేపీతో పొత్తు ప్రయత్నాలు చేస్తున్న ఆయనకు నిజంగా తమిళనాడు విద్యార్థులపై చిత్త శుద్ది అన్నది ఉంటే ఓ కీలక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు కల్పిస్తేనే పొత్తు అని బీజేపీ అధిష్టానం వద్ద ధైర్యంగా చెప్పగలరా? అని ప్ర శ్నిస్తూ సవాల్ విసిరారు. నీట్ మినహాయింపు ఇస్తేనే పొత్తు అది స్పష్టం చేయగలరా? ఈ ప్రకటనకు సిద్ధంగా ఉన్నారా? అన్న ప్రశ్నలను సంధించారు. ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా తమిళనాడును తాకలేరని, ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ తమిళనాడును ఓడి పోనివ్వడని, ఈ పోరాటంలో గెలుపు తమిళనాడుదే అని ధీమా వ్యక్తం చేశారు. -
‘ద్రోహి’వ్యాఖ్యలు.. బాంబే హైకోర్టులో కునాల్ కమ్రా క్వాష్ పిటిషన్
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై (Eknath Shinde) నోరు పారేసుకున్న స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా (kunal kamra) బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను సవాలు చేస్తూ కోర్టులో క్వాష్ పిటిషన్ (quash petition) దాఖలు చేశారు. ‘నయా భారత్’ అనే స్టాండప్ కామెడీ షోలో కునాల్ కమ్రా డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ‘గద్దార్’ (ద్రోహి)గా పేర్కొంటూ ఓ పేరడీ పాటను ఆలపించారు. దీనిపై వివాదం చెలరేగింది. డిప్యూటీ సీఎంపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముర్జీ పటేల్ ఫిర్యాదు మేరకు కునాల్ కమ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా కార్యక్రమ వేదికపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. అతడిని అరెస్టు చేయాలంటూ డిమాండ్లు చేశారు.అయితే, ఈ తరుణంలో ఇవాళ శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ ఫిర్యాదు ఆధారంగా మార్చి 24న ఖార్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కమ్రా బాంబే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు.అంతకుముందు, తాను చేసిన వ్యాఖ్యలపై అంతేకాదు చట్ట బద్ధంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అదే సమయంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మార్చి 27న మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. షరతులతో ఏప్రిల్ 7 వరకు గడువిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.న్యాయ స్థానం బెయిల్ ఇచ్చిన తర్వాత ఏప్రిల్ 1న నమోదైన మూడు ఎఫ్ఐఆర్లపై ఖార్ పోలీస్స్టేషన్కు విచారణకు హాజరు కావాలని కునాల్ కమ్రాను పోలీసులు కోరారు. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. అయినప్పటికీ స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. -
తమిళనాట ట్విస్ట్ .. మంత్రి నెహ్రు ఇంట్లో ఈడీ సోదాలు
చెన్నై: తమిళనాడులో రాజకీయం హీటెక్కింది. మంత్రి కేఎన్ నెహ్రు, ఆయన కుమారుడు, లోక్సభ సభ్యుడు అరుణ్ నెహ్రూకు సంబంధించిన నివాసాల్లో తాజాగా ఈడీ సోదాలు నిర్వహించింది. దీంతో, ఇరు నేతల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వారి ఇళ్ల వద్దకు చేరుకున్నారు.వివరాల ప్రకారం.. తమిళనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేఎన్ నెహ్రూ ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామునే ఈడీ అధికారులు.. నెహ్రుకు సంబంధించిన నివాసాలకు చేరుకున్నారు. అయితే, మంత్రి నెహ్రూ సోదరుడు ఎన్. రవిచంద్రన్ చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ట్రూ వాల్యూ హోమ్స్(టీవీహెచ్)లో ఆర్థిక అవకతవకలకు జరిగినట్టు ఈడీ అధికారులు తెలిపారు. దానికి సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి. టీవీహెచ్ 1997లో స్థాపించబడింది. రాష్ట్రంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థగా గుర్తింపు ఉంది.#WATCH | Tamil Nadu | ED (Enforcement Directorate) searches underway in Chennai on True Value Homes (TVH) Builders. TVH has alleged connection with state minister KN Nehru. Searches at multiple locations started early this morning: Sources(Visuals from the residence of… pic.twitter.com/tpXXEJpgGP— ANI (@ANI) April 7, 2025 -
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబి ఎన్నిక
మదురై: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన సీనియర్ నేత మరియమ్ అలెగ్జాండర్(ఎంఏ) బేబి ఎన్నికయ్యారు. తమిళనాడులోని మదురైలో ఆదివారం జరిగిన సీపీఎం 24వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లో ఈ ఎన్నిక జరిగింది. కొందరు నేతలు ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ ధవాలేను ఈ పదవికి బలపరిచారు. మెజారిటీ సభ్యుల మద్దతుతో బేబి ఎన్నికైనట్లు ప్రకటించారు. కొత్తగా ఏర్పాటైన 18 మందితో కూడిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి పొలిట్ బ్యూరో ఎంఏ బేబిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. అదేవిధంగా, 85 మందితో కూడిన సెంట్రల్ కమిటీలోకి 20 శాతం మంది మహిళలను తీసుకున్నట్లు ఆ పార్టీ ‘ఎక్స్’లో తెలిపింది. 2023 సెప్టెంబర్లో అనారోగ్య కారణాలతో సీతారాం ఏచూరి కన్నుమూయడంతో ప్రధాన కార్యదర్శి పోస్టు ఖాళీ అయింది. అప్పటి నుంచి ప్రకాశ్ కారత్ తాత్కాలిక సమన్వయకర్తగా ఆ బాధ్య తలను నిర్వర్తిస్తున్నారు. కాగా, పొలిట్ బ్యూరో నుంచి సీనియర్ నేతలు ప్రకాశ్ కారత్, బృందా కారత్ వైదొలిగారు. వీరిద్దరితోపాటు మణిక్ సర్కార్ను పార్టీ కేంద్ర కమిటీకి ప్రత్యేక ఆహ్వాని తులుగా ప్రకటించినట్లు సమాచారం.విద్యార్థి దశ నుంచే..కేరళలోని ప్రక్కులంలో 1954లో జన్మించిన ఎంఏ బేబి విద్యార్థి దశలోనే సీపీఎం పట్ల ఆ కర్షితుడయ్యారు. కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యుడయ్యారు. కొల్లమ్లోని ఎస్ఎన్ కాలేజీలో బీఏలో చేరినా చదువు కొనసాగించలేకపో యారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐల్లో పలు పదవులు చేపట్టారు. 1986–98 మధ్య కాలంలో రాజ్యసభ ఎంపీగా, 2006–16 మధ్య ఎమ్మెల్యేగా కొనసా గారు. కేరళ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2012 నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. -
దేశానికే తలమానికం: ప్రధాని మోదీ
తమిళనాడుకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదు. 2014 కంటే ముందు పదేళ్లతో పోలిస్తే గత పదేళ్లలో మూడురెట్లు ఎక్కువ నిధులు తమిళనాడుకు ఇచ్చాం. తమిళనాడుకు రైల్వే బడ్జెట్ ఏడు రెట్లు పెంచాం. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తమిళనాడులో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారు. అయినా నిధుల విషయంలో కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. సాక్షి, చెన్నై: తమిళనాడులోని రామేశ్వరంలో నూతన పంబన్ రైల్వే వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా రికార్డుకెక్కిన ఈ వంతెనను జాతికి అంకితం చేశారు. ఈ వంతెన దేశానికే తలమానికం అని వ్యాఖ్యానించారు. అలాగే రామేశ్వరం–తాంబరం (చెన్నై) కొత్త రైలుకు పచ్చజెండా ఊపారు. వర్టికల్ బ్రిడ్జి గుండా రాకపోకలు సాగించే కోస్ట్గార్డ్ షిప్ను సైతం ప్రారంభించారు. అనంతరం సభలో పాల్గొన్నారు. ఈ కీలకమైన కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ గైర్హాజరయ్యారు. ఆదివారం ఉదకమండలంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండడంతో తాను రాలేకపోతున్నట్లు ముందుగానే సమాచారం ఇచ్చారు. నియోజకవర్గాల పునరి్వభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపట్ల ఆగ్రహంతో ఉన్న స్టాలిన్ ప్రధాని మోదీ కార్యక్రమానికి వ్యూహాత్మకంగానే దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. డీలిమిటేషన్పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని ఆయన ఇప్పటికే ప్రధానమంత్రిని కోరారు. తమిళంలో సంతకాలు చేయలేరా? తమిళనాడులో రూ.8,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాముడు అందించిన సుపరిపాలన మన దేశ నిర్మాణానికి పునాది అని చెప్పారు. రాముడితో తమిళనాడుకు ఎంతో అనుబంధం ఉందంటూ సంగమ శకం నాటి సాహిత్యాన్ని ప్రస్తావించారు. శ్రీలంక నుంచి గత పదేళ్లలో 3,700 మంది తమిళ జాలర్లను వెనక్కి తీసుకొచ్చామని తెలిపారు. వీరిలో 600 మందిని గత ఏడాది కాలంలోనే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. తమిళ మాధ్యమంలో వైద్య విద్య అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల పేదలకు లబ్ధి కలుగుతుందన్నారు. తమిళనాడుకు ఇటీవల 11 నూతన మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు వివరించారు. తమిళ భాషను, సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వాన్ని ప్రపంచంలో అన్ని మూలలకూ తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తమిళనాడు నాయకుల నుంచి తనకు లేఖలు వస్తుంటాయని, కానీ, వాటిపై తమిళ భాషలో సంతకాలు ఉండడం లేదని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. కనీసం తమిళ భాషలో సంతకాలు చేయాలని కోరారు. నిధుల కేటాయింపులో వివక్ష లేదు తమిళనాడు మత్స్యకారులు కష్టపడి పనిచేస్తారని ప్రధానమంత్రి ప్రశంసించారు. ‘పీఎం మత్స్య సంపద యోజన’ కింద తమిళనాడుకు గత ఐదేళ్లలో భారీగా నిధులు కేటాయించామని చెప్పారు. మత్స్యకారులకు ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సీవీడ్ పార్కులు, ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్ల కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఉద్ఘాటించారు. తమిళనాడుకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదని తేల్చిచెప్పారు. 2014 కంటే ముందు పదేళ్లలో కేటాయించిన దాని కంటే గత పదేళ్లలో మూడురెట్లు ఎక్కువ నిధులు తమిళనాడుకు ఇచ్చామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి ఈ నిధులు ఎంతగానో తోడ్పడ్డాయని అన్నారు. నిధుల విషయంలో కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తమిళనాడులో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారని స్పష్టంచేశారు. తమిళనాడుకు రైల్వే బడ్జెట్ ఏడు రెట్లు పెంచామన్నారు. రాష్ట్రంలో 2014 కంటే ముందు రైలు ప్రాజెక్టులకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు ఏటా రూ.6,000 కోట్లు ఇస్తున్నామని తెలియజేశారు. 2014 తర్వాత రాష్ట్రంలో కేంద్ర నిధులతో 4,000 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. రామనాథ స్వామి ఆలయంలో పూజలు ప్రధాని మోదీ రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ వ్రస్తాలు ధరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు శ్రీలంక నుంచి రామేశ్వరం చేరుకున్న ప్రధానమంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఆయనకు అభివాదం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. నూతన పంబన్ వంతెనను ప్రారంభించిన అనంతరం మోదీ రామనాథస్వామి ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.ఇది దైవిక యాదృచ్ఛికం హిందూ మహాసముద్రంలోని ప్రాచీన రామసేతును దర్శించుకోవడం ఒక గొప్ప ఆశీర్వచనంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘కొద్ది సేపటి క్రితమే శ్రీలంక నుంచి హెలికాప్టర్లో వస్తూ రామసేతును దర్శించుకున్నాను. ఇదొక గొప్ప ఆశీర్వచనంగా భావిస్తున్నా. అయోధ్యలో బాలరాముడికి ఆదిత్యుడు తిలకం దిద్దిన సమయంలోనే ఇక్కడ రామసేతు దర్శనం కావడం దైవిక యాదృచి్ఛకం. రెండింటినీ ఒకేసారి దర్శించుకోవడం గొప్ప విషయం. శ్రీరాముడు మనందరినీ ఐక్యంగా కలిపి ఉంచే ఒక బలమైన శక్తి. ఆయన ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలన్నదే నా ఆకాంక్ష’’ అని మోదీ అన్నారు.ఇంజనీరింగ్ అద్భుతం రామేశ్వరంలో పంబన్ వర్టికల్ సీ–లిఫ్ట్ బ్రిడ్జిని రూ.550 కోట్లతో నిర్మించారు. పొడవు 2.08 కిలోమీటర్లు. 99 స్పాన్లు ఉన్నాయి. మధ్యలో 72.5 మీటర్ల పొడవైన వర్టికల్ లిఫ్ట్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వంతెన కిందినుంచి భారీ నౌకల రాకపోకలకు వీలుగా ఇది 22 మీటర్ల ఎత్తువరకు పైకి వెళ్లగలదు. నౌకలు వెళ్లిపోయిన తర్వాత యథాతథ స్థితికి చేరుకుంటుంది. ఎప్పటిలాగే రైళ్లు ప్రయాణం సాగించవచ్చు. ప్రధాన భూభాగంలోని మండపం రైల్వేస్టేషన్ను రామేశ్వరం దీవితో ఈ వంతెన అనుసంధానిస్తుంది. అత్యాధునిక ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఈ బ్రిడ్జి ఒక ఉదాహరణ. దీర్ఘకాలం మన్నికగా ఉండేలా నిర్మాణంలో స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించారు. హై–గ్రేడ్ రక్షణ పెయింట్ వాడారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వంతెనపై రెండు రైల్వే ట్రాక్లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. భక్తులు రామేశ్వరం ఆలయానికి చేరుకోవడం ఇక మరింత సులభతరం కానుంది. ప్రధాన భూభాగం–రామేశ్వరం దీవి మధ్య 1914లో బ్రిటిష్ పాలకుల హయాంలో రైల్వే వంతెన నిర్మించారు. శతాబ్దం పాటు సేవలందించిన ఈ వంతెన గడువు తీరిపోవడంతో అదేచోట కొత్త వంతెన నిర్మాణానికి 2019లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా, ఆదివారం పంబన్ వంతెనను ప్రారంభించిన తర్వాత గంట సేపట్లో సాంకేతిక సమస్య నెలకొంది. కోస్ట్గార్డు నౌక కోసం వంతెనను 17 అడుగుల మేర పైకి ఎత్తారు. తిరిగి కిందకు దించే సమయంలో 10 అడుగుల వద్ద సాంకేతిక సమస్య ఏర్పడింది. రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించారు. -
కొందరు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు.. స్టాలిన్కు మోదీ కౌంటర్
రామేశ్వరం: కొంతమందికి కారణం లేకుండానే ఎప్పుడూ ఏడ్చే అలవాటు ఉంటుందంటూ తమిళనాడు సీఎం స్టాలిన్పై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన బహిరంగ సభ వేదికగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం స్టాలిన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు భారీగా నిధులు కేటాయిస్తోందని, గతంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చామని తెలిపారు.త్రిభాషా విధానంపై స్టాలిన్ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్ ఇస్తూ.. తమిళ నాయకులు నాకు లేఖలు రాస్తుంటారు. ఒక్కరు కూడా మాృతభాష తమిళంలో సంతకం చేయరు. తమిళ భాషను గౌరవించండి.. తమిళంలో సంతకం చేయండి. చాలా రాష్ట్రాల్లో మాృతభాషలో వైద్య విద్యా బోధన జరుగుతోంది. తమిళనాడులోనూ తమిళంలో వైద్య విద్యను అందించాలి. గత దశాబ్దంలో తమిళనాడు అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించాం. రైల్వే ప్రాజెక్టులకు నిధులు గణనీయంగా పెంచాం’’ అని మోదీ చెప్పారు.‘‘తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. 2014 నుంచి అధికంగా తమిళనాడుకు ఇచ్చాం. 2014కు ముందు రైల్వే ప్రాజెక్టుకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే వచ్చేవని, ఈ ఏడాది తమిళనాడు రైల్వే బడ్జెట్ రూ.6,000 కోట్లకు పైగా ఉందన్నారు. అభివృద్ధి చెందిన భారత్లో తమిళనాడు పాత్ర చాలా గొప్పదన్న మోదీ.. ఈ రాష్ట్రం ఎంత బలంగా ఉంటే మన దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. -
పోక్సో చట్టం కింద యువకుడి అరెస్టు
తిరువొత్తియూరు: ప్లస్–2 విద్యార్థిని, ప్రేమించి వివాహం చేసుకుంటానని గర్భవతిని చేసిన యువకుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. తిరువణ్ణామలై జిల్లా, వెంబక్కం ప్రాంతానికి చెందిన మణికంఠన్(26) చెన్నైలోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ పనికి వెళ్లి ఊరి నుంచి తిరిగి వస్తున్నాడు. సెయ్యూరు తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల ప్లస్–2 విద్యార్థినితో ప్రేమ వ్యవహారం జరిగింది. ఇద్దరూ ఉల్లాసంగా ఉంటున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో విద్యార్థిని అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించగా విద్యారి్థని 3 నెలల గర్భవతి అని తేలింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు విద్యారి్థనికి జరిగిన విషయాన్ని తెలియజేశారు. దీనిపై సెయ్యూర్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మణికంఠన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతన్ని అరెస్టు చేశారు -
దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన.. ప్రారంభించిన మోదీ
సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటించారు. పర్యటనలో భాగంగా రామేశ్వరంలో దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వేసీ బ్రిడ్జిని ప్రారంభించారు. సముద్రంలో బ్రిడ్జి కింద నౌకలు రాకపోకలు సాగేలా ఈ వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జీ నిర్మాణం జరిగింది. సముద్రమట్టానికి 22 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ బ్రిడ్జీ పొడవు 2.2 కిలోమీటర్లు. దీని వ్యయం రూ. 535 కోట్లు. 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) పనులు చేపట్టి, నాలుగేళ్లలో పూర్తిచేసింది.Rameswaram, Tamil Nadu: PM Narendra Modi inaugurates New Pamban Bridge - India’s first vertical lift sea bridge and flags off Rameswaram-Tambaram (Chennai) new train service, on the occasion of #RamNavami2025 pic.twitter.com/6ts8HNdwqy— ANI (@ANI) April 6, 2025దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభమైంది. సముద్రంలో నిర్మించిన తొలి వ ర్టీకల్ లిఫ్ట్(Vertical Lift) (నిలువునా పైకి లేచే) వంతెనను అందుబాటులోకి వచ్చింది.శ్రీరామనవమి పర్వదినాన ప్రధాని మోదీ తొలి వర్టీకల్ లిఫ్ట్ను ప్రారంభించారు.భారీ పడవలు వెళ్లటానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవటం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీనిని నిర్మించారు. 111 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవటంతో దాని పక్కనే ఈ కొత్త వంతెనను నిర్మించారు. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దీనిని జాతికి అంకితం చేశారు. దూర ప్రయాణాన్ని తగ్గించేందుకు.. 1914లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తమిళనాడులోని మండపం (సముద్రం ప్రారంభమయ్యే ప్రాంతం) నుంచి పంబన్ (రామేశ్వరం దీవి ప్రారంభ చోటు) వరకు రైలు వంతెనను నిర్మించింది. ఆ సమయంలోనే వంతెన మధ్యలో పడవలకు దారిచ్చేందుకు రోలింగ్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. మధ్య భాగంలో వంతెన స్పాన్లు విడిపోయి ఉంటాయి. సిబ్బంది వాటికి ఏర్పాటు చేసిన చట్రంలో ఇనుప కమ్మీలతో తిప్పగానే ఆ రెండు భాగాలు రోడ్డు లెవల్ క్రాసింగ్ రైలు గేటు తరహాలు పైకి లేస్తాయి.దీంతో పడవలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత మళ్లీ మూసి విడిపోయిన రైలు పట్టాలు కలిసిపోయేలా చేస్తారు. సముద్రపు నీటి ప్రభావంతో ఈ వంతెన తుప్పుపట్టి బలహీనపడింది. దీంతో రోలింగ్ లిఫ్ట్కు బదులుగా వ ర్టీకల్ లిఫ్ట్తో కొత్త వంతెనను నిర్మించారు. వంతెన మధ్యలో ఈ లిఫ్ట్ లేకపోతే నౌకలు రామేశ్వరం దాటిన తర్వాత ఉన్న మనదేశ చిట్టచివరి భూభాగం ధనుషో్కడి ఆవలి నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది. దీనివల్ల 150 కి.మీ. అదనపు దూరాభారం అవుతుంది. వంతెన ప్రత్యేకతలు..వంతెన నిర్మాణ వ్యయం రూ.540 కోట్లు. పొడవు 2.10 కి.మీ.పిల్లర్లతో కూడిన పైల్స్ సంఖ్య 333సముద్రగర్భంలో సగటున 38 మీటర్ల లోతు వరకు పిల్లర్లు. వీటికోసం వాడిన స్టెయిన్లెస్ స్టీలు 5,772 మెట్రిక్ టన్నులు (రీయిన్ఫోర్స్మెంట్), స్ట్రక్చరల్ స్టీల్ 4,500 మెట్రిక్ టన్నులు.సిమెంటు వినియోగం 3.38 లక్షల బస్తాలు. 25,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పైకి లేచే భాగం బరువు 660 మెట్రిక్ టన్నులు. స్పెయిన్ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు. ఆ దేశానికి చెందిన టిప్స సంస్థను కన్సల్టెన్సీగా నియమించుకుని వంతెనను డిజైన్ చేయించారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ప్రపంచంలో సముద్రపు నీరు, ఉప్పు గాలి ప్రభావంతో ఇనుము అతి వేగంగా తుప్పుపట్టే ప్రాంతం మియామీ. ఆ తర్వాత పంబన్ ప్రాంతమే. దీంతో కొత్త వంతెన తుప్పు బారిన పడకుండా జింక్, 200 మైక్రాన్ల ఆప్రోక్సీ సీలెంట్, 125 మైక్రాన్ల పాలీ సిలోక్సేన్తో కూడిన రంగు డబుల్ కోట్ వేశారు. కనీసం 35 సంవత్సరాల పాటు ఈ పొర తుప్పును అడ్డుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ పూస్తే మరికొంతకాలం తప్పు పట్టదు.పాత వంతెనలో 16 మంది సిబ్బంది 45 నిమిషాల పాటు చట్రం తిప్పితే రెండు భాగాలు రెక్కాల్లా పైకి లేచేవి. కొత్త వంతెనలో కేవలం 5.20 నిమిషాల్లో 660 టన్నుల బరువున్న 72 మీటర్ల భాగం 17 మీటర్ల ఎత్తుకు లేస్తుంది. ఈ వంతెనపై రైళ్లను గంటకు 80 కి.మీ. వేగంతో నడిపే వీలుంది. కానీ, రైల్వే సేఫ్టీ కమిషనర్ 74 కి.మీ. వేగానికి అనుమతించారు. పాత వంతెనపై గరిష్ట వేగం గంటకు 10 కి.మీ. మాత్రమే. నిర్మాణ పనులు 2019లో మొదలయ్యాయి. కొవిడ్ వల్ల కొంతకాలం ఆలస్యమైనా, మొత్తంగా 2 సంవత్సరాల్లోనే పూర్తిచేశారు. 2022 డిసెంబర్లో పాత వంతెనపై రైళ్ల రాకపోకలు నిలిపేశారు. అప్పట్లో రోజుకు 18 ట్రిప్పుల రైళ్లు తిరిగేవి. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే మరిన్ని రైళ్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లిఫ్టు టవర్లకు 310 టన్నుల బరువు తూగే భారీ స్టీల్ దిమ్మెలు రెండు వైపులా కౌంటర్ వెయిట్స్గా ఏర్పాటు చేశారు. కరెంటు శక్తితో వంతెన భాగం పైకి లేవటం మొదలుకాగానే కౌంటర్ వెయిట్స్ మరోవైపు దిగువకు జారటం ద్వారా వంతెన భాగం పైకి వెళ్లేలా చేస్తాయి. దీంతో 5 శాతం కరెంటు మాత్రమే ఖర్చవుతుంది. లిఫ్ట్ టవర్ పైభాగంలో ప్రత్యేకంగా స్కాడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) సెంటర్ ఏర్పాటు చేశారు. వంతెన భాగంలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. అక్కడి భారీ కంప్యూటర్లో లోపాలను చూపుతుంది. రైల్వేలో సీనియర్ ఇంజనీర్, విజయనగరం జిల్లాకు చెందిన నడుకూరు వెంకట చక్రధర్ ఈ వంతెన నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం దాని ఇన్చార్జిగా ఉన్నారు. 1964 డిసెంబర్ 22న పెను తుఫాను కారణంగా 25 అడుగుల ఎత్తులో ఎగిసిపడ్డ అలలు, బలమైన గాలులతో పంబన్ వంతెన ధ్వంసమైంది. రాత్రి 11.50 సమయంలో వంతెన మీదుగా వెళ్తున్న 653 నంబర్ రైలు కొట్టుకుపోయి అందులోని 190 మంది ప్రయాణికులు మృతి చెందారు. కానీ, వంతెనలోని షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ భాగం మాత్రం కొట్టుకుపోకుండా నిలిచింది. మెట్రో మ్యాన్గా పిలుచుకుంటున్న ఈ. శ్రీధరన్ ఆధ్వర్యంలో 46 రోజుల్లోనే వంతెనను పునరుద్ధరించారు.Delighted to be in Rameswaram on the very special day of Ram Navami. Speaking at the launch of development works aimed at strengthening connectivity and improving 'Ease of Living' for the people of Tamil Nadu. https://t.co/pWgStNEhYD— Narendra Modi (@narendramodi) April 6, 2025 -
రేసులో ఎంఎ బేబి, అశోక్ ధవాలే
మదురై(తమిళనాడు): దేశంలోనే అతిపెద్ద వామపక్ష పార్టీగా కొనసాగుతున్న సీపీఎం పార్టీకి నూతన ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్న నేపథ్యంలో ఆ పదవిలో ఎవరు కూర్చోబోతున్నారన్న చర్చ మొదలైంది. పార్టీ పగ్గాలు ప్రధానంగా ఎంఏ బేబీ, అశోక్ ధవాలేల్లో ఒకరికి దక్కే వీలుందని వార్తలు వినవస్తున్నాయి. ఎంఏ బేబీ గత 13 సంవత్సరాలుగా పార్టీ పాలిట్బ్యూరో సభ్యునిగా సేవలందిస్తున్నారు. ఎంఏ బేబికి ముఖ్యంగా కేరళ రాష్ట్ర నాయకత్వం నుంచి దాదాపు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత విస్తరించాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా రైతాంగ సమస్యలు దేశవ్యాప్తంగా పతాక శీర్షికలకెక్కాయి. ముఖ్యంగా పంటలకు కనీస మద్దతు ధర అంశంపై రైతు ఉద్యమం ఉధృతంగా కొనసాగిన నేపథ్యంలో ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ ధవాలేను తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటే పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బలపడుతుందని ముఖ్యనేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార బీజేపీ విధానాలపై పోరాటంలో భాగంగా వామపక్ష పార్టీల మధ్య సఖ్యత సాధించే, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను ఏకతాటి మీదకు తెచ్చే బలమైన నేతను పార్టీ ప్రధాన కార్యదర్శి పీఠంపై కూర్చోబెట్టాలని పార్టీ ముఖ్యులు యోచిస్తున్నారు. ధవాలేకు పశ్చిమబెంగాల్ ప్రాంతం నుంచి బలమైన మద్దతు ఉంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లగల సత్తా ధవాలేకు ఉందని తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా తాజా లోక్సభ ఎన్నికల వేళ విపక్షాలు ‘ఇండియా’కూటమిగా ముందుకొచ్చి ఘోర వైఫల్యాన్ని చవిచూసిన నేపథ్యంలో మళ్లీ పార్టీల మధ్య సఖ్యత సాధించడంలో కాంగ్రెస్తో సత్సంబంధాలు కొనసాగించడంలో నిష్ణాతుడైన నేత కోసం పార్టీ వేట మొదలెట్టడం తెల్సిందే. తెరమీదకు బీవీ రాఘవులు పేరు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యంత సీనియర్ పోలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సైతం ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫైర్బ్రాండ్ నాయకురాలు బృందా కారత్ను జనరల్ సెక్రటరీగా చూడాలని మరికొందరు నేతలు భావిస్తున్నారు. 75 ఏళ్లు దాటిన నేతను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోకూడదనే నిబంధనను పార్టీ అమల్లోకి తెచ్చింది. అయితే అరుదైన, అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనను పక్కనబెట్టే వీలుందని తెలుస్తోంది. అగ్రనేతను ఎన్నుకునే క్రమంలో గతంలో కేరళ, పశ్చిమబెంగాల్ వర్గాల నుంచి గట్టి పోటీ ఎదురైంది. 1996లో పశ్చిమబెంగాల్ నుంచి జ్యోతిబసు ప్రధానమంత్రి పదవికి అర్హుడని భావించినవేళ కేరళ వామపక్ష వర్గం ఈ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించింది. 2007లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయంలోనూ పార్టీలో ఈ రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యపడలేదు. 2015లో సీతారాం ఏచూరిని ప్రధా న కార్యదర్శిగా ఎన్నుకుంటే ఆనాడు కేరళ ముఖ్యనేతలు ఎస్ఆర్ పిళ్లైకు మద్దతు పలికారు. తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్టీ 24వ మహాసభలు మదురైలో జరుగుతున్న తరుణంలో ఆదివా రం పార్టీ కేంద్ర కమిటీ తదుపరి పార్టీ ఎన్నికల కోసం అభ్యర్థుల పేర్లను ప్రకటించే వీలుంది. -
వేడుకగా పెరియ మారియమ్మన్ ఉత్సవాలు
సేలం: ఈరోడ్లో శనివారం పెరియ మారియమ్మన్ దేవాలయంలో స్తంభం లాగడం, పసుపు స్నానం చేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా పెరియ మారియమ్మన్ సోదరీమణులు చిన్న మారియమ్మన్, కరైవాక్కల్ మారియమ్మన్ ఆలయాలు ఈరోడ్ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందినవి. ఈ దేవాలయాలలో వార్షికోత్సవం సందర్భంగా రథోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం పండుగ గత నెల 18న పుష్పయాగంతో ప్రారంభమైంది. తదనంతరం గత నెల 22వ తేదీ రాత్రి మూడు ఆలయాల్లో స్తంభాలను నాటారు. ఈ స్తంభాలకు చుట్టు పక్క గ్రామాల ప్రజలు ప్రతిరోజు కావేరి నది నుంచి పాల కూజాలు, తీర్థ కూజాలను ఊరేగింపుగా తీసుకుని మూడు దేవాలయాలలోని స్తంభాలపై పవిత్ర జలాన్ని పోసి ముగ్గురు దేవతలను పూజిస్తారు. ఈ పండుగ చివరి ఘట్టమైన పెరియ మారియమ్మన్, చిన్న మారియమ్మన్, కరైవాక్కల్ మారియమ్మన్ స్తంభం ఎత్తే కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు ఆలయాల్లో నాటిన స్తంభాలను కూల్చివేసి సంబంధిత ఆలయ పూజారులు స్తంభాలను భుజాలపై మోసుకెళ్లారు. ఈ ఆలయ స్తంభాన్ని పన్నీర్సెల్వం పార్కు ద్వారా, చిన్న మారియమ్మన్ ఆలయ స్తంభాన్ని అగ్రహారం రోడ్డు ద్వారా, కరైవాక్కల్ మారియమ్మన్ ఆలయ స్తంభాన్ని కచేరి రోడ్డు ద్వారా విడివిడిగా ఊరేగింపుగా తీసుకెళ్లారు. మూడు స్తంభాలను క్లాక్ టవర్ ప్రాంతంలో ఒకే చోట చేర్చారు. తరువాత క్లాక్ టవర్, పెరియార్ రోడ్, మరపాలెం మండపం రోడ్, ఆర్కెని మీదుగా పట్టణ పోలీసు స్టేషన్, అగ్రహారం రోడ్డు మీదుగా రాత్రి కార్ల డ్రెయిస్కు చేరుకుని మూడు ఆలయాల స్థంభాలను కాలువోనే వదిలేశారు. పసుపు స్నానం: పెరియ మారియమ్మన్ ఆలయం, చిన్న మారియమ్మన్ ఆలయం, కరైవాక్కల్ మారియమ్మన్ ఆలయాల్లో నాటి స్తంభాలను పెకలించిబడిన తరువాత ఈరోడ్ నగరం, పరిసర ప్రాంతాలలో పసుపు స్నాన వేడుక జరిగింది. స్నాన మాచరించిన తరువాత పెళ్లి అయిన మహిళలు తన తాళి దారం మార్చుకున్నారు. -
19న తిరువళ్లూరుకు సీఎం
తిరువళ్లూరు: జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉన్న క్రమంలో అన్ని శాఖలకు చెందిన అధికారులతో మంత్రి నాజర్ శనివారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాజర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే పూర్తయిన పనుల వివరాలను సేకరించారు. ముగింపు దశలో ఉన్న నిర్మాణాలు పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి, ఇప్పటికే పూర్తయిన పనులను ముఖ్యమంత్రి చేతుల మీధుగా ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బెల్ట్ ఏరియాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉన్న వారికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిన క్రమంలో లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరగకుండా చూడాలని ఆదేశించారు. వివాదాలకు తావు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. దీంతో పాటు జిల్లాకు అవసరమైన నిధులపై ముఖ్యమంత్రిని కోరాలని, అందుకు అవసరమైన పూర్తి నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయారిటీ, అత్యవసర పనులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని కోరారు. ఈ సమావేశంలో కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, తిరుత్తణి చంద్రన్, పూందమల్లి కృష్ణస్వామి, మాధవరం కారపాక్కం గణపతి, ఎస్పీ శ్రీనివాసపెరుమాళ్, ఆవడి కార్పొరేషన్ కమిషనర్ కందస్వామి, మేయర్ ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అర్జున్, ఐశ్వర్య రాజేష్ జంటగా ‘తీయవర్ కులై నడుంగ’
తమిళసినిమా: యాక్షన్ కింగ్ అర్జున్, నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న చిత్రం తీయవర్ కులై నడుంగ. బిగ్బాస్ అభిరామి, రామ్ కుమార్, జీకే రెడ్డి, లోగో, వేల రామమూర్తి, తంగదురై, ఫ్రాంక్లిన్ స్టార్ రాహుల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సన్ మూన్ యూనివర్సల్ పిక్చర్స్ పతాకంపై డా.రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రానికి దినేష్ ఆశీవగన్ దర్శకత్వం వహించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ కథాచిత్రంగా ఉంటుందని చెప్పారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను, సింగిల్ సాంగ్ ను విడుదల చేసినట్లు చెప్పారు. భరత్ ఆశీవగన్ సంగీత బాణీలు కట్టిన మెలోడీ సాంగ్ కు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. సరవణన్ అభిమన్యు ఛాయాగ్రహణంను అందించిన ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం వివరాలను, విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చెప్పారు.ఇది నటుడు అర్జున్, నటి ఐశ్వర్య రాజేష్ల కాంబోలో రూపొందిన తొలి చిత్రం అని, దీంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. -
త్వరితగతిన ఆక్రమణలను తొలగించాలి
తిరువళ్లూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన శిరువాపురి మురుగన్ ఆలయానికి సమీపంలో వున్న ఆక్రమణలను తొలగించి భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ ప్రతాప్ అధికారులను ఆదేశించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శిరువాపురి ఆలయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అభివృద్ధి పనులపై అన్ని శాఖలకు చెందిన అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమన్వయ కమిటీ సమావేశానికి ఎస్పీ శ్రీనివాసపెరుమాల్తో పాటూ రెవెన్యూ, దేవదాయశాఖ, విద్యుత్, రోడ్లు భవనాలశాఖకు చెందిన అధికారులు హాజరైయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ శిరువాపురి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం పలువురు అన్నదానం చేస్తున్నారు. తద్వారా అక్కడ రాకపోకలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాృతృత్వం చేయాలని భావించే సంస్థలు ఆహార భద్రతాశాఖ అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందిన తరువాతే అన్నదానం చేయాలన్నారు. భక్తులకు నాణ్యమైన భోజనాన్ని మాత్రమే అందించాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు భారికేడ్లు ఏర్పాటు, ట్రాఫిక్కు సమస్యలు రాకుండా పార్కింగ్ ప్రదేశం నిర్ణయం, ఆలయం చుట్టూ వున్న ఆక్రమణల తొలగింపుతో పాటూ ఇతర చర్యలను వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు విశ్రాంతి గది, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటూ భక్తులకు ఇబ్బందుల లేకుండా ప్రసాధం కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ దేవదాయశాఖ వేలూరు రీజినల్ డిప్యూటీ కమిషనర్ అనిత, ఆర్డీఓ కనిమెళి, పీఏజీ వెంకట్రమణ పొన్నేరి తాహసీల్దార్ సోమసుందరం పాల్గొన్నారు. -
ఆడిషన్లో రిజెక్ట్ అయ్యాను..!
తమిళసినిమా: అవమానాలు, ఆవేదనలు ప్రతి మనిషి జీవితంలోనూ కచ్చితంగా భాగం అవుతాయి. అయితే వాటిని సహనంతో అధిగమించినప్పుడే విజయ తీరాలను చేరుకోవడం సాధ్యం అవుతుంది. ఇందుకు నటి పూజా హెగ్డే దీనికి అతీతం కాదు. ఈ విషయాన్ని ఆమెనే పేర్కొన్నారు. నటిగా ఈమె పయనం దశాబ్దం దాటింది. కోలీవుడ్లో ముఖముడి చిత్రంతో కథానాయికిగా తన పయనాన్ని ప్రారంభించిన పూజా హెగ్డేను తొలి చిత్రంతోనే అపజయం పలకరించింది. అయితే ఒక మార్గం మూసుకుంటే మరో మార్గం తెరుచుకుంటుందంటారు. నటి పూజా హెగ్డే విషయంలోనూ ఇదే జరిగింది. టాలీవుడ్ ఈమెకు ఎర్ర తివాచీ పరిచింది. అక్కడ స్టార్ హీరోలతో జత కట్టి క్రేజీ కథానాయకిగా వెలిగారు. ఐయితే టాలీవుడ్ లోనూ కొన్ని చిత్రాలు నిరాశ పరిచడంతో ఐరన్ లెగ్ ముద్ర వేశారు. దీంతో అక్కడ అవకాశాలు పిలిచి బడ్డాయి. అలాంటి ఇప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరోలతో జత కడుతూ ఫుల్ బిజీగా ఉన్నారు. నటుడు సూర్య సరసన నటించిన రెట్రో చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే ఒకటిన తెరపైకి రానుంది. ప్రస్తుతం నటుడు విజయ్కు జంటగా జననాయకన్ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటూ నటుడు రాఘవ లారెన్స్కు జంటగా కాంచన 4 చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.అదే విధంగా వరుణ్ ధావన్కు జంటగా ఒక హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈమె ఓ భేటీలో పేర్కొంటూ తాను సమీప కాలంలో ఒక చిత్ర ఆడిషన్ కోసం వెళ్లి నిరాకరణకు గురైనట్లు చెప్పారు. ఆ చిత్రంలోని పాత్రకు తన వయసు చాలదని చెప్పి వేరే సీనియర్ హీరోయిన్ను ఎంపిక చేశారని చెప్పారు. అయినా దాన్ని అవమానంగా భావించలేదని, మళ్లీ మళ్లీ ఆడిషన్స్కి వెళ్లడానికి తాను రెడీ అని పేర్కొన్నారు. ఎప్పుడూ ప్రతిభకు ఇగోను అంటనీయకండి అని అన్నారు. చాలా మందికి ఆడిషన్స్లో పాల్గొనే అవకాశమే రాదన్నారు. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలన్నారు. చాలా మంది ప్రముఖ హీరో హీరోయిన్లు ఇప్పటికీ ఆడిషన్స్లో పాల్గొంటూనే ఉన్నారని నటి పూజా హెగ్డే పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడి దుర్మరణం
పళ్లిపట్టు: రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుత్తణి సమీపం సింగరాజుపురం గ్రామానికి చెందిన చంద్రమౌళి(45) పంచాయతీలో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహించేవారు. బుధవారం పొదటూరుపే సమీపంలో బంధువుల ఇంటి అశుభ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి బైకులో పయనించాడు. పొదటూరుపేట ప్రభుత్వ బస్సు డిపో వద్ద వెళ్తుండగా బైకు అదుపు తప్పి కింద పడడంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. అతన్ని అక్కడున్న వారు కాపాడి 108 అంబులన్స్ సాయంతో తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స పొందుతూ వచ్చాడు. ఈక్రమంలో శుక్రవారం చికిత్స ఫలించక చంద్రమౌళి మృతి చెందాడు. పొదటూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సినీ వివాదం
● నిర్మాతల మండలి–ఫెఫ్సీకి మధ్య ముదిరిన వివాదం తమిళసినిమా: తమిళ నిర్మాతల మండలికి దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య(ఫెఫ్సీ)కి కొంతకాలంగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. అది తాజాగా మరింత తీవ్ర రూపం దాల్చింది. తమిళ నిర్మాతల మండలి కొత్తగా తమిళనాడు సినీ కార్మికుల సమాఖ్యను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలే ఒక ప్రకటన చేశారు. అదే విషయాన్ని శనివారం మరోసారి చైన్నెలోని ఫిలిం ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పునరుద్ఘాటించారు. దక్షిణాది భారత సినీ కార్మికుల సమాఖ్య(ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అందులో తాము మొదటి నుంచి అనే విషయాల్లో నిర్మాతల మండలికి శాయశక్తులా సహకరిస్తూనే ఉన్నామన్నారు. అదే సమయంలో ఫెఫ్సీ అధ్యక్షుడిగా తమ సభ్యుల శ్రేయస్సు తమకు ముఖ్యం అన్నారు. తమిళ నిర్మాతల మండలికి, యాక్టివ్ నిర్మాతల మండలికి మధ్య సమస్యలను పరిష్కరించుకోలేక తమపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు. నిర్మాత క్రియేషన్కు నటుడు ధనుష్కు మధ్య సమస్యకు కూడా తమపైనే నిందలు వేస్తున్నారన్నారు. తాము యాక్టివ్ నిర్మాతల మండలికి సహకరించడం తమిళ నిర్మాతల మండలికి ఇష్టం లేదన్నారు. తమకు కార్మికుల పరిరక్షణ ముఖ్యం అన్నారు. తాము శనివారం తమిళ నిర్మాతల మండలి రాసిన లేఖలో కూడా తమ సహకారం పూర్తిగా ఉంటుందని స్పష్టం చేశామన్నారు. అయినప్పటికీ వాళ్లు తమిళ సినీ కార్మికుల సమాఖ్యను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని, అందువల్ల తమ సమాఖ్యను అణచివేయాలని భావించే తమిళ నిర్మాతల మండలితో ఇకపై కలిసి పని చేయబోమని ప్రకటించారు. -
కాలువ మరమ్మతు పనులు పూర్తి చేయండి
వేలూరు: వేలూరు కార్పొరేషన్లోని 60 వార్డుల్లో డ్రైనేజీ కాలువ మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేసి పూడికతీత పనులు చేపట్టాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం వేలూరు కార్పొరేషన్ పరిధిలోని ముల్లైనగర్లో జరుగుతున్న డ్రైనేజీ కాలువ పనులను తనఖీ చేశారు. అనంతరం తాగునీటి ట్యాంకు నిర్మాణ పనులు, పైపులైన్ పనులను తనఖీ చేసి వర్షా కాలం రాక ముందే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో డ్రైనేజి కాలువల్లోని పూడిక తీత పనులు చేపట్టాలన్నారు. డ్రైనేజి నీరు వర్షా కాలంలో రోడ్డుపైకి రాకుండా కాలువలో వెళ్లే విధంగా చూడాలన్నారు. అనంతరం సత్వచ్చారి సమీపంలో ఉన్న నెల్సన్ కాలనీలో రోడ్డుపై పేరుకు పోయిన డ్రైనేజి నీటిని తనిఖీ చేసి వెంటనే ఇక్కడ మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. పట్టణంలో భూగర్భ డ్రైనేజీ పనులను మరో మాసంలో పూర్తి చేయాలని, వర్షాకాలం వస్తే పనులు చేయలేమన్నారు. తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలని అధికారులు తరచూ తాగునీటి సరఫరాపై తనిఖీలు చేపట్టాలన్నారు. కలెక్టర్తోపాటు కార్పొరేషన్ కమిషనర్ జానకి, ఆరోగ్యశాఖ అధికారి శివకుమార్, తాగునీటి సరఫరా చీఫ్ ఇంజినీర్ నిత్యానందం, అసిస్టెంట్ కమిషనర్ సతీష్కుమార్, అసిస్టెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. -
రూ. 7.50 కోట్ల విలువైన ఆలయ ఆస్తులు స్వాధీనం
తిరుత్తణి : తిరువలంగాడు ఆలయానికి వీలునామా రాసి ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి తన ఆదీనంలో వుంచుకోవడంతో గుర్తించిన తిరుత్తణి ఆలయ అధికారులు, రూ.7.50 కోట్లు విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి అనుసంధానంలోని తిరువలంగాడు వడారన్నేశ్వరర్ ఆలయానికి చైన్నెకు చెందిన మునియమ్మ అనే మహిళ చైన్నెలోని సూలైమేడు ప్రాంతంలోని రెండిళ్లు తన ఆస్తులను వీలునామా రాసి ఇచ్చారు. తన కాలం అనంతరం తన ఆస్తులను ఆలయం అధికారులు స్వీకరించి అందులో వచ్చే ఆదాయాన్ని ఆలయ కై ంకర్యాలకు వినియోగించుకోవాలని సూచించారు.అయితే మునియమ్మ మరణం అనంతరం ఆమె బంధువులు రెండు ఇళ్లను స్వాధీనం చేసి ప్రైవేటు వ్యక్తికి 98 సంవత్సరాలకు లీకుకు ఇచ్చారు. ఈ క్రమంలో తిరుత్తణి ఆలయ ఆస్తులుకు సంబంధించి తనిఖీలో చైన్నె సూలైమేడులోని ఆస్తి గుర్తించారు. అక్కడి వెళ్లి చూడగా ప్రైవేటు వ్యక్తి తన కనుసున్నల్లో వినియోగించుకున్నట్లు గుర్తించారు. ఈ విషయమై తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్ హిందు దేవదాయ శాఖ కమిషనర్ శ్రీధర్కు సమాచారం ఇచ్చారు. కమిషనర్ ఆదేశాల మేరకు తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్ రమణి, తన సిబ్బందితో శుక్రవారం చైన్నెకు వెళ్లి తిరువలంగాడు ఆలయ ఆస్తులను పోలీసుల సహాకారంతో స్వాధీనం చేసారు. ఆ ప్రాంతంలో తిరువలంగాడు ఆలయ ఆస్తులుగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. చైన్నెలోని ఆలయ ఆస్తులు రక్షించే బాధ్యతలను తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్కు అప్పగిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. -
అక్టోబర్కు వెళ్లి పోయిన ‘ఇడ్లీ కడై’ సినిమావార్త
తమిళసినిమా: నటుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ఇడ్లీ కడై. నటి నిత్యా మీనన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని నటుడు ధనుష్కు చెందిన వండర్ బార్ ఫిలిమ్స్, ఆకాశ్ భాస్కర్కు చెందిన డాన్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. దీనికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇంతకు ముందు ప్రకటించారు. కాగా నటుడు అజిత్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని నిర్మాతలు ఇదే ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అజిత్, ధనుష్ చిత్రాల ద్వారా పోటీ అనివార్యంగా మారింది. కాగా తాజాగా అజిత్ చిత్రం అనుకున్న ప్రకారం ఏప్రిల్ 10న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అయితే ధనుష్ నటిస్తున్న ఇడ్లీ కడై చిత్రం విడుదల మాత్రం సుమారు ఆరు నెలలు వెనక్కి వెళ్లిపోయింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ ఒకటవ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తాజాగా అధికారికంగా ప్రకటించారు. కారణం ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. దీంతో అజిత్, ధనుష్ చిత్రాల మధ్య పోటీ తప్పింది. ఇకపోతే ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం కుబేర. ద్విభాషా చిత్రం ( తెలుగు, తమిళం) గా రూపొందుతున్న ఇందులో టాలీవుడ్ స్టార్ నాగార్జున ప్రధాన పాత్రను పోషిస్తుండగా , నటి రష్మిక మందన్న నాయకిగా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. దీంతో ఇడ్లీ కడై చిత్రం కంటే కుబేర చిత్రం ముందుగా తెరపైకి రానుందన్నమాట. నటుడు ధనుష్, నటి నిత్యామీనన్ -
మండేలాకు.. ఐదేళ్లు
దర్శకుడు మడోన్న అశ్విన్తో యోగిబాబు తమిళసినిమా: నటుడు యోగిబాబు కథానాయకుడిగా నటించిన చిత్రం మండేలా. నటి షిలా రాజ్కుమార్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని వైనాట్ ఫిలిం స్టూడియోస్ పతాకంపై శశికాంత్ నిర్మించారు. మడోనా అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యస్త్రాలు సంధించిన కథాంశంతో రూపొందింది. ముఖ్యంగా ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయ నాయకులు పడే పాట్లు, అధికారం కోసం పడే ఆరాటం వంటి అంశాలను వినోదభరితంగా చూపించిన చిత్రం మండేలా. చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించడంతో విశ్లేషకుల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రం విడుదలై ఐదేళ్ల పూర్తి అయ్యింది. దీంతో ఇందులో కథానాయకుడిగా నటించిన నటుడు యోగిబాబు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నటుడిగా తన జీవితంలో పలు ముఖ్యమైన మలుపులకు కారణమైన చిత్రం మండేలా అని పేర్కొన్నారు. నువ్వులను, సామాజిక పరమైన ఆలోచనలను, పలు వాస్తవాలను అందించిన చిత్రం మండేలా అన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు శశికాంత్, బాలాజీ మోహన్ను ధన్యవాదాలు తెలుపుకంటున్నానన్నారు. సహోదరుడు, ఈ చిత్ర దర్శకుడు మడోనా అశ్విన్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను అని నటుడు యోగిబాబు పేర్కొన్నారు. చక్కని సంగీతం, అందమైన ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరింత బలాన్నిచ్చిందన్నారు. ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే మండేలా చిత్రంలో తాను చిన్న భాగం అయినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. -
పట్టుదల ఉంటే విజయం తథ్యం
● సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుందరేష్ వేలూరు: విద్యార్థులు కృషి, పట్టుదల, అంకితభావం ఉంటే ఉన్న శిఖరాలకు చేరుకోవచ్చని సుప్రీంకోర్టు జడ్జి సుందరేష్ అన్నారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీ 40 వార్షికోత్సవం, క్రీడా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, బంగారు పథకాలు పంపిణీ చేసే కార్యక్రమం వీఐటీ చాన్స్లర్ విశ్వనాథన్ అధ్యక్షతన శనివారం ఉదయం వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా హాజరైన ఆయన బంగారు పథకాలు, సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. క్రీడలు విద్యలో ఓ భాగమని వైఫల్యాలను అంగీకరించగలగాలని, అపజయాల నుంచి మంచి అనుభవం లభిస్తుందన్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తుందని నేడు మూడు తరాల తాత, కొడుకు, మనవడు కలిసి కూర్చుని క్రికెట్ చూస్తున్నారన్నారు. మార్టిన్ లూథర్కింగ్ ఏ పనిచేసినా సమర్థవంతంగా చేయాలని అని అంటారు. అలాగే విద్యార్థులు నైపుణ్యంతో ముందుకు సాగాలన్నారు. వీఐటీ చాన్స్లర్ విశ్వనాథన్ మాట్లాడుతూ ప్రస్తుతం క్రీడా పోటీల్లో 3,400 మంది విద్యార్థులు వివిద క్రీడల్లో విజయం సాధించారని వారికి రూ. 1.4 కోట్ల విలువైన బహుమతులు, స్కాలర్షిప్లు అందజేస్తున్నామన్నారు. విద్యార్థులు వందశాతం హాజరు ఉండాలన్నారు. వీఐటీని మొదట్లో 15 ఫ్రొఫెసర్లతో ప్రారంభించి అప్పట్లో వారికి నెల వారి ఖర్చు రూ. లక్ష మాత్రమే అన్నారు. రైతు, బడుగు మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్య ఓ కలగా మారిందన్నారు. విద్యపై అధిక వ్యయం చేస్తున్న దేశాల కంటే భారత దేశం వెనుక బడి ఉందన్నారు. ఉన్నత విద్యకు అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో బిహార్ ఆఖరి స్థానంలో ఉండగా తమిళనాడు అగ్రస్థానంలోనూ, కేరళ రాష్ట్రం రెండవ స్థానంలో ఉందన్నారు. ఉన్నత విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించాలన్నారు. మనది అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉందని ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసిస్తే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. జనాభా పరంగా చూస్తే చైనా కంటే మనం ముందున్నామన్నారు. ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. బిలియనర్ల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో చైనా రెండవ స్థానంలోనూ, ఇండియా మూడవ స్థానంలో ఉందన్నారు. వీఐటీలో మొత్తం 70 దేశాలకు చెందిన మొత్తం 44 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్, శేఖర్, మేనేజింగ్ డైరెక్టర్ సంద్య పెంటారెడ్డి, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కాదంబరి విశ్వనాథన్, వైస్ చాన్స్లర్ కాంచన, అసోసియేట్ వైస్ చాన్స్లర్ పార్థసారథి మల్లిక్, రిజిస్టార్ జయభారతి, విద్యార్థులు పాల్గొన్నారు. -
జోయాలుక్కాస్ లో కృష్ణ లీల కలెక్షన్స్
సాక్షి, చైన్నె: ప్రముఖ ఆభరణాల విక్రయ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జోయాలుక్కాస్ సరికొత్తగా కృష్ణ లీల బ్రైడల్ కలెక్షనన్స్ను అందుబాటులోకి తెచ్చింది. శనివారం సాయంత్రం చైన్నె టి.నగర్ లోని ప్రశాంత్ గోల్డ్ టవర్స్ లోని జోయాలుక్కాస్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సినీ నటి అలియా మానస, నటుడు ప్రశాంత్ , ఆ సంస్థ గ్రూప్ చైర్మన్ జాయ్ అలుక్కాస్ తదితరులు హాజరై కృష్ణ లీల బ్రైడల్ కలెక్షన్స్ ను లాంఛనంగా ప్రారంభించారు. సరికొత్త ఆభరణాల డిజైన్లను పరిచయం చేశారు. అలాగే ఈ ఆభరణాలను మాడల్స్ ధరించి ప్రదర్శించారు. -
తాంబరం – తిరువనంతపురం రైలు నెల పొడిగింపు
తిరువొత్తియూరు: దక్షిణ జిల్లాల్లో నడుస్తున్న రైళ్లను ప్రయాణికుల కోరిక మేరకు రైలు సేవలు పొడిగింపు చేయడం జరుగుతుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. తాంబరం–తిరువనంతపురం నార్త్ ప్రత్యేక రైలు చెంగల్పట్టు, మేల్మరువత్తూరు, విల్లుపురం, విరుదాచలం, అరియలూరు, శ్రీరంగం, తిరుచ్చి, దిండుక్కల్, మదురై, విరుదునగర్, శివకాశి, శ్రీవిల్లిపుత్తూరు, రాజపాళ్యం మీదుగా నడుస్తుంది. నందపురం (కొచ్చువేలి)తాంబరం–తిరువనంతపురం నార్త్ ప్రత్యేక రైలు సేవ (నెం.06035) సేవ శుక్రవారం 4వ తేదీతో పూర్తయింది. దీంతో ఈ రైలు సర్వీసును మరో నెలపాటు పొడిగించాలని రైల్వే శాఖ నిర్ణయించారు. దీని ప్రకారం ఈ రైలు సర్వీసును ఈనెల 11వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు పొడిగించనున్నారు. అవతలి వైపు నుంచి తిరువనంతపురం–తాంబరం వారాంతపు ప్రత్యేక రైలు (నెం.06036) సర్వీసు ఆదివారం 6వ తేదీతో పూర్తవుతుంది. దక్షిణ రైల్వే ఈ రైలు సర్వీసును ఈ నెల 13 నుంచి మే 4 వరకు పొడిగించింది. ఈ ప్రత్యేక రైళ్లు ప్రతి శుక్రవారం తాంబరం నుంచి ప్రతి ఆదివారం తిరువనంతపురం నుంచి బయలుదేరుతాయి. రెండు మార్గాల్లో రైళ్ల సర్వీసులను మరో నెల రోజులు పొడిగించడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కస్టమ్స్లో బదిలీ చర్చ ●పది మంది అధికారులపై వేటు సాక్షి, చైన్నె : చైన్నె విమానాశ్రయం కస్టమ్స్ విభాగంలో శనివారం బదిలీల పర్వం చర్చ జోరందుకుంది. ఒకే రోజు పది మంది అధికారులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఇందులో కస్టమ్స్ ప్రధాన కమిషనర్ రామ్ వత్ శ్రీనివాస నాయక్ పేరు కూడా ఉండటం గమనార్హం. చైన్నె విమానాశ్రయంలోని కస్టమ్స్ విభాగం నిత్యం వార్తలలో ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ విభాగంలోకి అధికారులపై ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ప్రధాన కమిషనర్ సహా పదిమందిపై బదిలీ వేటు వేశారు. కస్టమ్స్ చీఫ్ కమిషనర్గా రామ్ వత్ శ్రీనివాస నాయక్ 2023లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను హఠాత్తుగా ఇక్కడి నుంచి బదిలీ చేశారు. ఆయన స్థానంలో పదోన్నతిపై తమిళ్వలవన్ను నియమించారు. శ్రీనివాస నాయక్ను జీఎస్టీ విభాగానికి మార్చారు. అలాగే అదననపు కమిషనర్లు శరవణన్ , అశ్వత్ బాజ్, బాబుకుమార్ జే బాగ్, అజయ్ పీటర్, సుధాకర్తో సహా అధికారులను మూకుమ్మడిగా బదిలీ చేశారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించారు. అలాగే చైన్నె సెంట్రల్ రెవెన్యూ విభాగం అసిస్టెంట్ కమిషనర్ పూనమ్ను నాగ్పూర్కు, మరో అధికారి గౌరి శంకర్ జీఎస్టీ విభాగానికి బదిలీ చేశారు. ఒకే రోజు ఇంత పెద్దసంఖ్యలో విమానాశ్రయం కస్టమ్స్ విభాగంలో బదిలీలు జరగడం చర్చకు దారి తీసింది. క్రీడా నగరం కసరత్తు చైన్నె శివారులో గ్లోబల్ స్పోర్ట్స్ సిటీ( ప్రపంచ స్థాయి క్రీడా నగరం) ఏర్పాటుకు సీఎం స్టాలిన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కసరత్తులపై డిప్యూటీ సీఎం, క్రీడల మంత్రి ఉదయ నిధి స్టాలిన్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా శనివారం సచివాలయంలో మంత్రి టీఆర్బీ రాజ, సీఎస్ మురుగానందం, క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ, సభ్య కార్యదర్శి జె. మేఘనాథరెడ్డితో పాటూ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. – సాక్షి, చైన్నె రేపు రథోత్సవం తిరువొత్తియూరు: తిరువారూర్లో వెలిసిన శ్రీత్యాగరాజస్వామి ఆలయంలో పంగుణి ఉత్తరం ఉత్సవాలలో భాగంగా సోమవారం ఘనంగా రథోత్సవం నిర్వహించనున్నారు. తిరువారూరులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శ్రీత్యాగరాజ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శైవమతం ప్రధానంగా ఉంది. ఈ ఆలయ రథాన్ని ఆసియా ఖండంలోనే అతిపెద్ద రథంగా పిలుస్తారు. ఈ ఆలయ ఉత్సవాల్లో పంగుణి ఉత్తరం ఉత్సవాలు ప్రత్యేకత కలిగి ఉంది. ఈ ఆలయంలో మహా రథోత్సవం సోమవారం(7వ తేదీ) జరగనుంది. రథానికి కొయ్య గుర్రాలను అలంకరించే పనులు, కొబ్బరి చెట్టుకు అమర్చే పనులు, చెక్క వస్తువులను తయారు చేసే పనులు ముమ్మరంగా జరిగాయి. ఈ పనులు శుక్రవారంతో పూర్తయ్యాయి. రథంలో చెక్క గుర్రాలు అమర్చబడి రథోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. తిరువారూరులో రథోత్సవం సందర్భంగా స్థానికంగా సెలవు ప్రకటించారు. -
నిఘా నీడలో
నేడు పీఎం మోదీ రాక సాక్షి, చైన్నె: ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన రామనాథపురం జిల్లా రామేశ్వరంలో శ్రీరామ నవమి రోజున బ్రహ్మాండ వేడుక జరగనుంది. మండపం నుంచి పాంబన్ మీదుగా రామేశ్వరానికి రైలు ప్రయాణం పునరుద్ధరించనున్నారు. 110 సంవత్సరాల చరిత్ర కలిగిన పాత వంతెనకు పక్కనే కొత్తగా నేటి సాంకేతికతకు అనుగుణంగా రూ. 550 కోట్లతో సముద్రంలో బ్రహ్మాండ వంతెన రూపుదిద్దుకుంది. 140 పిల్లర్స్లను ఈ వంతెన కోసం సముద్రంలో ఏర్పాటు చేశారు. అలాగే వంతెన మార్గం 20 మీటర్ల ఎత్తులో ఉండగా, 22 మీటర్ల ఎత్తులతో నౌకలు వచ్చే సమయంలో వంతెన రెండుగా తెరచుకునే రీతిలో నిర్మాణాలు జరిగాయి. ఆధునిక యుగంలోని భారతీయ ఇంజినీర్ల ప్రతిభకు దర్పణంగా నిలిచే విధంగా దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా రూపుదిద్దుకున్న ఈమార్గంలో ట్రయల్ రన్ పలుమార్లు విజయవంతం చేశారు. అన్ని ప్రక్రియలు ముగియడంతో మండపం నుంచి రామేశ్వరం వైపుగా సముద్ర మార్గంలోని పాంబన్ వంతెన సాయంతో రైలు దూసుకెళ్లేందుకు సర్వం సిద్ధం చేశారు. చైన్నె తాంబరం నుంచి రామేశ్వరానికి కొత్త రైలు సేవలకు అన్ని ఏర్పాట్లు చేశారు. కొందరికే అనుమతి.. పీఎం మోదీని కలిసేందుకు కొందరికే అనుమతి ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. మదురై నుంచి ఉదయం 10.40 గంటలకు మోదీ రామేశ్వరం బయలు దేరనున్నారు. పీఎం మోదీకి తమిళనాడు ప్రభుత్వం తరపున ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు ఆహ్వానం పలకనున్నారు. 11.50 –12.25 గంటల సమయంలో పాంబన్ వంతెనను ప్రారంభించనున్నారు. రైలు సేవలకు జెండా ఊపుతారు. 12.40 గంటలకు రామేశ్వరం రామనాథ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆలయం నుంచి బయటకు వచ్చి తమిళనాడు టూరిజం మైదానంకు చేరుకుని, ఇక్కడి నుంచి పలు ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 2.55 గంటలకు మదురైకు బయలు దేరనున్నారు. విమానాశ్రయంలో కాసేపు ఉంటారు. ఈ సమయంలో ఆయన్ను కలిసేందుకు పలువురు అనుమతి కోరి ఉన్నారు. మాజీ సీఎం పన్నీరుసెల్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ ప్రధానిని కలవనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే పీఎంను కలిసేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ముందు నిర్ణయించినా, తాజాగా పన్నీరు, టీటీవీ దినకరన్ సైతం కలవనున్నడంతో తన మనస్సు మార్చుకున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీని పళణి స్వామి కలిసే అవకాశాలు లేవని ఆ పార్టీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. నేడు జాతికి పాంబన్ వంతెన అంకితం ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ సముద్ర గస్తీలో కోస్టుగార్డు ఈ రైల్వే మార్గాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రామేశ్వరం రానున్నారు. గత ఏడాదే ప్రారంభోత్సవం అని ఏర్పాటు చేసినా, రైల్వే మార్గంలో చిన్న చిన్న సాంకేతిక మార్పుల దృష్ట్యా, వాయిదాల పర్వంతో ముందుకు సాగింది. ప్రస్తుతం అన్ని రకాల పనులు ముగియడంతో మండపం నుంచి పాంబన్ దీవుల మీదుగా రామేశ్వరంలోకి కొత్త రైలు సేవకు అన్ని చర్యలు తీసుకున్నారు. పాంబన్ వంతెనతో పాటూ కొత్త రైలు సేవలను, మరికొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రామేశ్వరం రానున్నారు. ఢిల్లీ నుంచి మధురైకు వచ్చే ప్రధాని నరేంద్రమోదీ హెలికాప్టర్లో రామేశ్వరం వెళ్లనున్నారు. మండపంలోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రామేశ్వరం వెళ్లారు. ఇక్కడి ఓ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుంచి పాంబన్ వంతెనను ప్రారంభించి దేశానికి అంకితం ఇవ్వనున్నారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. -
ఐదుగురితో జాబితా!
● బీజేపీలో అధ్యక్ష ఎంపిక కసరత్తు సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కసరత్తులను అధిష్టానం మొదలెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఐదుగురు నేతలతో జాబితాను సిద్ధం చేసి ఢిల్లీకి పంపించి ఉన్నారు. ఇందులో ఒకరి పేరును పరిగణించి చైన్నెకు వచ్చే పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్లు ప్రకటించబోతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. వివరాలు.. బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై ప్రస్తుతం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, అన్నాడీఎంకేతో పొత్తు ప్రయత్నాలలో ఉన్న బీజేపీ పెద్దలు, ఆ పార్టీ విజ్ఞప్తికి అనుగుణంగా అన్నామలైను మార్చేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇది వరకు అన్నాడీఎంకేను తీవ్ర స్థాయిలో అన్నామలై విరుచుకు పడటం ఇందుకు కారణంగా చర్చ జరుగుతోంది. అన్నామలైను తప్పిస్తే కూటమిలోకి చేరేందుకు సిద్ధం అన్న సంకేతాన్ని గత నెల ఢిల్లీలో జరిగిన భేటీ సందర్భంగా అన్నాడీఎంకే నేతలు స్పష్టం చేసినట్టు చర్చ. ఇందుకు బలాన్ని చేకూర్చే విధంగా శుక్రవారం అన్నామలై స్పందించారు. కొత్త అధ్యక్షుడి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. ఈ దృష్ట్యా, అన్నామలైను తప్పించేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కసరత్తులను మొదలెట్టి ఉన్నారు. ఈ మేరకు పార్టీ శాసన సభా పక్ష నేత నైనార్ నాగేంద్రన్ పేరు ఇది వరకు ప్రముఖంగా వినిపించినా, తాజాగా మరో నలుగురి పేర్లు తెర మీదకు వచ్చింది. మొత్తం ఐదుగురు నేతలతో జాబితాను సిద్ధం చేసి ఉన్నారు. ఇందులో ముందు వరుసలో సీనియర్ నేత పొన్ రాధాకృష్ణన్, ఆ తర్వాత నైనార్ నాగేంద్రన్ పేర్లు ఉండడం గమనార్హం. అలాగే మహిళా నేతలు తమిళిసై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్ పేర్లు పరిగణనలోకి తీసుకుని ఉండడం విశేషం. ఇక, పార్టీలో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న మురుగానందం, రామ శ్రీనివాసన్ పేర్లు కూడా జాబితాలో చేర్చడంతో ఈ ఐదుగురిలో అధ్యక్ష పదవి ఎవ్వరిని వరిస్తుందో అన్న ఎదురు చూపులు కమలనాథులలో నెలకొన్నాయి. సోమ లేదా మంగళవారం పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జ్, కో– ఇన్చార్జ్తో పాటూ ఢిల్లీ నుంచి అధిష్టానం పెద్దలు రానున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అధ్యక్ష ఎంపిక కసరత్తులపై ఇక్కడి నేతలతో తుది చర్చ తదుపరి అధిష్టానం ఆదేశాలలో ఆ పదవి ఎవరిని వరిస్తుందో పెద్దలు ప్రకటించబోతున్నట్టు కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. -
అకాల వర్షం తాండవం
● కుమరి, తిరుప్పూర్లలో కుండపోతసాక్షి, చైన్నె: వేసవిలో అకాల వర్షం శనివారం తాండవం చేసింది. కన్యాకుమారి, తిరుప్పూర్లతో పాటూ ఏడు చోట్ల అతి భారీ వర్షం పడింది. గత రెండు మూడు రోజులుగా అకాల వర్షం చెదరు ముదురుగా కురుస్తున్న విషయం తెలిసిందే. చైన్నె శివారులలో ఉదయం పలు చోట్ల చిరుజల్లుల వాన పడింది. నగరంలో అనేక చోట్ల మోస్తారుగా వర్షం పడింది. కన్యాకుమారిలో అతిభారీ వర్షం పడింది. ఇక్కడి కోలికోవిలై ప్రాంతంలో 19 సెం.మీ వర్షం పడింది. ఈ పరిసరాలన్నీ జలమయం అయ్యాయి. తిరుప్పూర్లో 15 సెం.మీ వర్షం పడింది. ఇక్కడి లోతట్టు ప్రాంతాలలోని నివాసాలలోకి వర్షపు నీరు చేరడంతో జనం అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తేని కోయంబత్తూరు, నీలగిరి, తిరుప్పూర్ జిల్లాల పరిధిలోని పశ్చిమ కనుమలలో వర్షాలు కురుస్తున్నాయి. అడవులలో వర్షం కురుస్తుండటంతో అక్కడి నుంచి వచ్చే నీటి ప్రవాహం పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నారు. అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం కూడా వర్షాలు ఈరోడ్, దిండిగల్లోనూ కురిసే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని జిల్లాలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం కన్యాకుమారి, తిరుప్పూర్లతో పాటూ ఏడు చోట్ల అతి భారీ వర్షం పడినట్టు పేర్కొన్నారు. మరి కొన్ని చోట్ల మోస్తారుగా వర్షం పడిందని వాతావరణ అధికారులు వివరించారు. -
బావిలో పడిన కోడలు రక్షించేందుకు బావిలోకి దూకిన అత్త
అన్నానగర్: విల్లుపురం జిల్లా మేల్ మలయనూర్ సమీపంలోని పాలంబుండి గ్రామానికి చెందిన అయ్యప్పన్. ఇతని భార్య సరసు (22). ఆవులకు గడ్డి కోసేందుకు బుధవారం పొలానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న సరసు ప్రమాదవశాత్తు జారి పక్కనే ఉన్న 60 అడుగుల లోతున్న బావిలో పడిపోయింది.ఆమెకు ఈత రాక కేకలు వేసింది. కేకలు విన్న అత్త మల్లిక (45) సరసును రక్షించేందుకు బావిలోకి దూకింది. ఈమెకు ఈత రాకపోవడంతో వారిద్దరూ బావిలో రాయిని పట్టుకుని కేకలు పెట్టారు. కేకలు విని చుట్టుపక్కల వారుఅగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మేల్ మలయనూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బావిలోకి దిగి మల్లిక, సరసులను సురక్షితంగా బయటకు తీసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
అన్నానగర్: తల్లికి బదులు పరీక్షకు హాజరైన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు వ్యాప్తంగా గత 28వ తేదీ నుంచి 10వ తరగతి సాధారణ పరీక్ష జరుగుతోంది. నాగై వెలిప్పాలయం లోని నటరాజన్–దమయంతి పాఠశాలలో బుధవారం ఉదయం ఇంగ్లిష్ పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష ప్రారంభం కాగానే ఇన్విజిలేటర్ ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు అందజేసి సంతకాలు తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఓ మహిళ ముఖానికి మాస్క్ ధరించి ప్రత్యేకంగా కనిపించింది.అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ మాస్క్ తీయమని మహిళను అడిగాడు. అనంతరం అడ్మిట్ కార్డును పరిశీలించారు. ఆ సమయంలో అడ్మిట్ కార్డు పై పరీక్ష రాస్తున్న మహిళ ఫొటోను చూశారు. అయితే పరీక్ష గది ఇన్విజిలేటర్ వద్ద ఉన్న హాజరు రిజిస్టర్ లో వేరే వ్యక్తి ఫొటో ఉంది. ఇన్విజిలేటర్కు మహిళను పరీక్ష కంట్రోల్ రూమ్కు తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుబాషిణి, జిల్లా విద్యాశాఖాధికారి (స్పెషల్ ఎగ్జామినేషన్) ముత్తుచ్చామి, పరీక్షల నియంత్రణ సహాయ సంచాలకులకు సమాచారం అందించారు.ఈ సమాచారం మేరకు విద్యాశాఖ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పరీక్ష కేంద్రం వద్ద ఉన్న పోలీసులు వెళ్లి మహిళను విచారించారు. విచారణలో ఆమె నాగై వెలిప్పాలయానికి చెందిన సెల్వాంబికై (25) అని తేలింది. ఈమెకి పెళ్లి అయ్యిందని, తల్లి సుగంతి కోసం మాస్క్ వేసుకొని హాజరైనట్లు తెలిసింది. అదేవిధంగా 28న మాస్క్ ధరించి తమిళ సబ్జెక్ట్ పరీక్ష రాసినట్లు గుర్తించారు. విచారణ అనంతరం పోలీసులు ఆమెని అరెస్టు చేశారు. -
ఆడిటర్ నుంచి కోటి హాంఫట్!
సేలం: కలెక్టర్ బంధువునని, ఒక కేసు నుంచి బయట పడేస్తానంటూ ఆడిటర్ నుంచి కోటి రూపాయలు వసూలు చేసిన ఓ లంచగొండి పోలీస్ ఇన్స్పెక్టర్ చివరకు కటకటాలపాలయ్యారు. పోలీసుల కథనం.. తంజావూరు జిల్లాలోని కులశేఖర నల్లూర్ ప్రాంతంలో కొల్లిడం నదిపై చెక్ డ్యామ్ నిర్మాణం కోసం రూ. 465 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం భూములను సేకరించింది. కుంభకోణం రామసామి కోవిల్ వీధికి చెందిన ఆడిటర్ రవిచంద్రన్ (68)కు చెందిన 80 సెంట్ల భూమిని కూడా చెక్ డ్యామ్ నిర్మాణానికి సేకరించి అతనికి పరిహారం సైతం ఇచ్చింది. ప్రభుత్వం సేకరించిన భూమిలో రవిచంద్రన్ 30 టేకు చెట్లను పెంచాడు. వాటిని రవిచంద్రన్ 2020లో నరికి, అమ్మకానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో జలవనరుల శాఖ అధికారులు ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ అధికారులకు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రవిచంద్రన్ నుంచి 3 టన్నుల బరువున్న 207 టేకు దుంగలను రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని కుంభకోణం రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి అప్పగించారు. అలాగే పందనల్లూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయం చేస్తానని రూ.కోటి స్వాహా! ఈ నేపథ్యంలో అరియలూర్ జిల్లాలోని తిరుమంతురై నివాసి, ప్రస్తుతం ధర్మపురి జిల్లాలోని మహిళలపై నేరాల దర్యాప్తు విభాగంలో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న నెపోలియన్ (45), రవిచంద్ర్న్ సంప్రదించి, టేక్ ఉడ్ కేసు నుంచి బయట పడటానికి తాను సాయం చేస్తానని, దీనికిగాను కోటి రూపాయలు ఇవ్వాలని కోరడంతో ఆ మేరకు సొమ్మును ఆడిటర్ ఇచ్చారు. అయినా ఆ తర్వాత కలప కేసులో రవిచంద్రన్ నిర్దోషిగా విడుదల కాలేదు. దీంతో అతను మళ్లీ నెపోలియనన్ను సంప్రదిస్తే మరింత డబ్బులకు డిమాండ్ చేయడంతో రవిచంద్రన్ అవాక్కయ్యాడు. ఆయన వాలకంపై అనుమానించి గత నెల తంజావూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ రాజారామ్ ఆదేశాలతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఇన్స్పెక్టర్ నెపోలియన్ లంచంగా రవిచంద్రన్ నుంచి కోటి రూపాయలు తీసుకున్నాడని, మరింత సొమ్ము డిమాండ్ చేశాడని తేలడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. కేసు నుంచి బయట పడేస్తానంటూ ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ నిర్వాకం మళ్లీ అదనపు సొమ్ము కోసం డిమాండ్ బాధితుడి ఫిర్యాదుతో అరెస్ట్ -
రాష్ట్రంలో 20వ తేదీ వరకు వేసవి వర్షాలు
– 16 జిల్లాల్లో భారీగా... – వాతావరణ శాఖ హెచ్చరిక సేలం: రాష్ట్రవ్యాప్తంగా 20వ తేదీ వరకు, ముఖ్యంగా నీలగిరి, కోయంబత్తూర్, తిరుప్పూర్, ఈరోడ్, కృష్ణగిరి, ధర్మపురి సహా 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, దక్షిణ కేరళ ప్రాంతాలలో వాతావరణ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేసింది. అలాగే సేలం, తేని, దిండిగల్, మదురై, విరుదునగర్, రామనాథపురం, తెన్కాసి, తూత్తు కుడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాలికపై లైంగికదాడి – యువకుడికి 30 ఏళ్ల జైలు శిక్ష సేలం: కోయంబత్తూరులో 13 ఏళ్ల బాలికపై లైంగికదాడి చేసిన కేసులో ఓ యువకుడికి కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2021లో కోయంబత్తూరు జిల్లాలో 13 ఏళ్ల బాలికపై లైంగికదాడి చేసిన నేరానికి పేరూర్ మహిళా పోలీసులు సతీష్కుమార్(35)ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. కోయంబత్తూరు పోక్సో ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతున్న ఈ కేసు విచారణలో నిందితుడు సతీష్కుమార్కు గురువారం న్యాయమూర్తి 30 సంవత్సరాల జైలు శిక్ష, రూ.12వేల జరిమానా విధించారు. ఈ కేసును అద్భుతంగా దర్యాప్తు చేసిన దర్యాప్తు అధికారిని, సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టిన మహిళా హెడ్ కానిస్టేబుల్ కలైయరసిని కోయంబత్తూరు జిల్లా ఎస్పీ కార్తికేయన్ ప్రశంసించారు. ప్లస్టూ మూల్యాంకనం ప్రారంభం తిరువొత్తియూరు: ప్లస్టూ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఇందులో 6 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్లస్–2 పబ్లిక్ పరీక్ష మార్చి 1 నుంచి 25 వరకు జరిగాయి. అదేవిధంగా మార్చి 5న ప్రారంభమైన ప్లస్ఒన్ పరీక్ష మార్చి 27న ముగియగా 16 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్ష అనంతరం సమాధాన పత్రాలను భద్రతా కేంద్రాల్లో భద్రపరిచారు. దీని తర్వాత తమిళనాడు వ్యాప్తంగా 83 కేంద్రాల్లో శుక్రవారం నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. 46 వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు జవాబు పత్రాన్ని మూల్యాంకన పనిలో నిమగ్నమయ్యారు. మొదటి రోజైన శుక్రవారం చీఫ్ ఎగ్జామ్ అధికారులు, జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. రేపటి నుంచి అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన పనిలో పాల్గొననున్నారు. ఈ మూల్యాంకనం 17వ తేదీ వరకు జరుగనుంది. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 58,864 మంది స్వామివారిని దర్శించుకోగా 25,764 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.51 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
అధునాతన ఎలైట్ ఎలివేటర్ల ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: అధునాతన సాంకేతికతతో కూడిన హోమ్ ఎలివేటర్లుగా ఎలైట్ ఎలివేటర్ల బెస్పోక్ను చైన్నెలో ఆవిష్కరించారు. ఇది పూర్తిస్థాయిలో తొలి హోమ్ ఎలివేటర్ అని అధునాతన సాంకేతికతతో అనుకూలీకరించిన పరిష్కారాలను అందిస్తుందని ప్రకటించారు. ప్రత్యేకమైన జీవనశైలి కలిగిన కోసం సమగ్ర జీవన అనుభవాన్ని అందించే విధంగా రూపొందించినట్టు ఎలైట్ ఎలివేటర్స్ వ్యవస్థాపకుడు విమల్ బాబు తెలిపారు. ఆవిష్కరణల గురించి ఆయన విశదీకరించారు. చైన్నెలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఈ గ్రాండ్ ఆవిష్కరణ జరిగిందన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగం పేరిట టోకరా!
–రూ.20 లక్షలు కాజేసిన వైనం –ఎస్పీకి బాధితుల ఫిర్యాదు వేలూరు: ఉద్యోగం ఇప్పిస్తామని రూ.20లక్షలు తీసుకుని మోసం చేశారని బాధితులు వేలూరు ఎస్పీకి శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు..కాట్పాడి సమీపంలోని కయంజూరుకు చెందిన బాధితులు కొన్ని నెలల క్రితం వేలూరులోని ఉపాధి కల్పనా కార్యాలయానికి వెళ్లినప్పుడు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు తన చిన్నాన కొడుకు చైన్నె సచివాలయంలో పనిచేస్తున్నారని, డబ్బులిస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికాడు. తన కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగం కోసం 2021లో రూ.18 లక్షలు, ఆ తర్వాత 2022లో రూ.2 లక్షలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించకపోగా, నిలదీస్తే అంతుచూస్తామని బెదిరిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని బాధితులు ఎస్పీని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేయాలని సంబంధిత పోలీసులను ఎస్పీ ఆదేశించారు. -
ప్రభుత్వ ఉద్యోగం పేరిట టోకరా!
–రూ.20 లక్షలు కాజేసిన వైనం –ఎస్పీకి బాధితుల ఫిర్యాదు వేలూరు: ఉద్యోగం ఇప్పిస్తామని రూ.20లక్షలు తీసుకుని మోసం చేశారని బాధితులు వేలూరు ఎస్పీకి శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు..కాట్పాడి సమీపంలోని కయంజూరుకు చెందిన బాధితులు కొన్ని నెలల క్రితం వేలూరులోని ఉపాధి కల్పనా కార్యాలయానికి వెళ్లినప్పుడు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు తన చిన్నాన కొడుకు చైన్నె సచివాలయంలో పనిచేస్తున్నారని, డబ్బులిస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికాడు. తన కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగం కోసం 2021లో రూ.18 లక్షలు, ఆ తర్వాత 2022లో రూ.2 లక్షలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించకపోగా, నిలదీస్తే అంతుచూస్తామని బెదిరిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని బాధితులు ఎస్పీని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేయాలని సంబంధిత పోలీసులను ఎస్పీ ఆదేశించారు. -
మహిళపై దాడికి యత్నం
తిరుత్తణి: తిరుత్తణి కోర్డు ఆవరణలో చీటీలు నడిపి మోసగించిన మహిళను బాధితులు చుట్టుముట్టి దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. తిరుత్తణి కమ్మర్ వీధికి చెందిన రేవతి(60) పాతికేళ్ల నుంచి చీటీలు నడుపుతోంది. ఆమె వద్ద చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు చీటీలు కట్టారు. ఈ క్రమంలో ఏడాది కిందట అకస్మాత్తుగా చీటి కట్టిన వారికి డబ్బులు చెల్లించకుండా రేవతి పరారైంది. మునుస్వామి అనే వ్యక్తికి ఇచ్చిన రూ.12 లక్షల చెక్ బౌన్స్ కావడంతో తిరుత్తణి కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ కోసం రేవతి శుక్రవారం తిరుత్తణిలోని క్రిమినల్ కోర్టుకు చేరుకుంది. విషయం తెలిసి కోర్టు వద్దకు చేరుకున్న బాధితులు కోర్టు నుంచి వెలుపలికి వచ్చిన రేవతిని చుట్టిముట్టి దాడికి యత్నం చేవారు. ఇంతలో పోలీసులు అడ్డుకుని రేవతిని కాపాడి అటోలో పంపారు. దీంతో కోర్టు ఆవరణలో కలకలం చోటుచేసుకుంది. -
ఎస్ఆర్ఎంలో సాంస్కృతిక ఉత్సవం
సాక్షి, చైన్నె: ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మిలన్ –2025 సాంస్కృతికోత్సవం శుక్రవారం ప్రారంభమైంది. నాలుగురోజుల పాటు జరగనున్న ఈ వేడుకలను సినీ నటుడు అధర్వ మురళి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 50వేల మంది విద్యార్థులను ఈ మిలన్ ఏకం చేసింది. మహోత్సవంలో 40కి పైగా క్లబ్ ఈవెంట్లు, రెండు అద్భుతమైన ప్రొఫెషనల్ షోలు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా ఎస్ఆర్ఎం వ్యవస్థాపక చాన్స్లర్ డాక్టర్ టీఆర్ పారివేందర్ మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఉన్న తమ వర్సిటీలో ఈ వేడుక ప్రతి సంవత్సరం విజయవంతంగా జరుగుతోందన్నారు. మిలన్ 2025 విద్యార్థులతో నిర్వహించే ఒక ఉత్సవంగా నిలుస్తుందన్నారు. భారతీయ జానపద, శాసీ్త్రయ, ప్రపంచ సంగీత ప్రభావాల కలయికకు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన 15 మంది సభ్యుల రాక్ బ్యాండ్ అద్భుతమైన ప్రదర్శనతో ఉత్సవాలు ప్రారంభించామన్నారు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు తమన్ ఎస్తో పాటు భారతీయ పెర్కుషనిస్ట్ శివమణి, ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్ల ప్రత్యేక షోలకు ఏర్పాట్లు చేశారు. -
‘నీట్’ భయం మరో ప్రాణాన్ని బలిగొంది!
● విషం సేవించి ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని ● చికిత్స పొందుతూ మృతి సేలం : నీట్ పరీక్షలకు భయపడి మార్చి 31న విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన సేలం విద్యార్థి పరిస్థితి విషమించి గురువారం రాత్రి మృతి చెందింది. సేలం జిల్లా కొంగనాపురం సమీపంలోని పెరియ ముత్తియంపట్టి ప్రాంతానికి చెందిన సెల్వరాజ్, చంద్ర దంపతుల కుమార్తె సత్య(18). ఈమె పన్నెండవ తరగతిలో 562 మార్కులతో పాసైంది. ఆ తరువాత, జలకంఠాపురం ప్రాంతంలోని నీట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందింది. గత ఏడాది నిర్వహించిన నీట్ పరీక్షలో 333 మార్కులు మాత్రమే రావడంతో సత్య గత ఏడాది వైద్య కళాశాలలో చేరలేకపోయింది. అయితే, సత్య నీట్ పరీక్షకు సిద్ధమవుతూ వచ్చింది. ఈ పరిస్థితిలో, గత వారం, సత్య తన తల్లిదండ్రులతో నీట్ పరీక్షకు చదవడం చాలా కష్టంగా ఉందని చెప్పడంతో వేరే కోర్సు ఎంచుకోవచ్చని ఆమెను తల్లిదండ్రులు కూడా ఓదార్చారు. అయితే డాక్టర్ కావాలనే తన కల నెరవేరడం లేదనే మనస్తాపం చెందిన సత్య గత నెలాఖరున విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పొరుగువారు ఆమెను రక్షించి, ఎడప్పాడి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం సేలంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడి చివరకు గురువారం రాత్రి ఆమె కన్నుమూసింది. కొంగనాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీట్ పరీక్షపై ఆందోళనతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సేలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. -
ఘనంగా జెప్పియార్ ఐకాన్ అవార్డ్స్
కొరుక్కుపేట: విభిన్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అసాధారణ వ్యక్తులను గుర్తించి జెప్పియార్ వర్సిటీ ఐకాన్ అవార్డులను అందిస్తూ వస్తుంది. అందులో భాగంగా 8వ ఎడిషన్లో సినిమా, విద్య, సాంకేతికత, క్రీడలు, పాక కళల్లో రాణిస్తున్న వారిని ఘనంగా సత్కరించుకున్నారు. జేప్పియర్ వర్సిటీ చాన్స్లర్ డాక్టర్ రెజీనా జె మురళి, అధ్యక్షుడు మురళి సుబ్రమణియన్ చేతుల మీదుగా ఐకాన్ అవార్డ్స్ – 2025ను అందజేశారు. ఇందులో ప్రముఖ నేపత్య గాయకులు మనో, ఆధునిక వారసత్వ ఫ్యాషన్ రూపశిల్పి జయశ్రీ రవి, ఆధునిక తమిళ సినిమా మావెరిక్ కార్తీక్ సుబ్బరాజ్, వీరితోపాటు మదన్ గౌరి, డాక్టర్ అశోక్ జి.వర్గీస్, క్రికెట్ మాస్ట్రో విజయ్ శంకర్, దక్షిణ భారత వంటకాల ప్రపంచ రాయబారి కె.టి.శ్రీనివాసరాజా, విజయ్ కరుణాకరన్ అవార్డులను అందుకున్నారు. -
ఘనంగా ఆరుద్ర పూజలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ స్వామి, అమ్మవార్లను చప్పరాలపై అధిష్టింపచేశారు. అనంతరం ఊరేగింపుగా మండలంలోని ఊరందూరు నీలకంఠేశ్వరాలయానికి వేంచేశారు. అక్కడ పూజల అనంతరం తిరిగి పానగల్, అగ్రహారం, సన్నిధివీధి, నాలుగు మాడవీధుల గుండా ఆలయానికి చేరుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ప్లాస్టిక్ పరిశ్రమ డిమాండ్లకు మద్దతుగా మోటాన్
సాక్షి, చైన్నె : పెరుగుతున్న ప్లాస్టిక్ పరిశ్రమ డిమాండ్లకు మద్దతు ఇవ్వడానికి నిర్ణయించింది. జర్మన్ ఇంజినీరింగ్ సంస్థగా ఉన్న మోటాన్ రెండు యూరోల మోటాన్ సంస్థ తన ఉత్పత్తులు, పెట్టుబడులను విస్తరించేందుకు పెట్టుబడితో చైన్నెలో తన కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించింది. చైన్నెలో కొత్త అత్యాధునిక సౌకర్యంతో, నిబద్ధతను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టింది. భారతీయ ప్లాస్టిక్ రంగంలో పెరుగుతున్న డిమాండ్లను తీర్చడంలో మోటాన్ అంకితభావంతో పనిచేస్తుందని నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. మోటాన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫుల్సాక్ సాండ్రా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కార్ల్ లిథర్లాండ్, మోటాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఆనందకుమార్ రామచంద్రన్, విద్యా రమేష్ తమ విస్తరణ ప్రణాళిక గురించి వివరించారు. -
ఎంజీఎంలో ట్రాన్స్ప్లాంట్ విజయవంతం
సాక్షి, చైన్నె :సంచలనాత్మక వైద్య సేవల్లో ఎంజీఎం హెల్త్ కేర్ అరుదైన పేగు రుగ్మత చికిత్స కోసం తొలి మోడిఫైడ్ మల్టీ–విసెరల్ ట్రాన్న్స్ప్లాంట్ ( ఎంఎంవీటీ)ని విజయవంతంగా నిర్వహించింది. కేరళకు చెందిన 32 ఏళ్ల రోగి ప్రాణాలను ఈ ట్రాన్స్ ప్లాంట్ ద్వారా రక్షించారు. రక్త విరేచనాలతో పాటు హిమొగ్లోబిన్ స్థాయిలలో తీవ్రమైన తగ్గుదల, పోషహార లోపం, ఇన్ఫెక్షన్లు, పొత్తికడుపు వాపుతో బాధపడుతున్న ఈ రోగికి జరిగిన ట్రాన్స్ప్లాంట్ గురించి ఎంఎంవీటీ ఆర్గాన్ ట్రాన్న్స్ప్లాంట్ చైర్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ వైద్య, మల్టీ విసెరల్ అండ్ అబ్డామినల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సెంథిల్ ముత్తురామన్, సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శివకుమార్ మహాలింగం, మల్టీ విసెరల్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్ డాక్టర్ వెంకటేష్, డాక్టర్ దినేష్ బాబు, డాక్టర్ నివాష్ చంద్రశేఖరన్తో కూడిన బృందం శుక్రవారం స్థానికంగా ప్రకటించింది. మోడిఫైడ్ మల్టీ–విసెరల్ ట్రాన్న్స్ప్లాంట్తో ముందుకు సాగడానికి ముందు రోగిని స్థిరీకరించడానికి కీలకమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. -
బిల్లు రద్దు చేయాలి
● కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును రద్దు చేయాలని డిమాండ్ వేలూరు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక బిల్లుతో పాటు పెన్షనర్ల హక్కులను కాలరాచేలా ఉన్న బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలూరు ప్రధాన పోస్టల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలో జిల్లా సమన్వయ కమిటీ అధ్యక్షులు కదీర్ అహ్మద్ నేతృత్వం వహించారు. జిల్లా కార్యదర్శి తంగవేలు, తమిళనాడు రిటైర్డ్ స్కూల్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కో–ఆర్డినేటర్ జనార్ధనన్ మాట్లాడారు. పెన్షనర్లకు వ్యతిరేకంగా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు నోటిఫికేషన్ను పార్లమెంట్లో తేవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదే విధంగా కొత్త పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పథకాన్ని అమలు చేయాలని తమ డిమాండ్లను నినదించారు. ధర్నా అనంతరం ప్రధాన పోస్టల్ కార్యాలయంలో ప్రధాన మంత్రికి వినతి పత్రాన్ని పోస్ట్ చేశారు. ధర్నాలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి లోకనాధన్, సిటీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు జ్ఞానశేఖరన్, పన్నీర్సెల్వం, నరసింహన్ పాల్గొన్నారు. -
లవ్ మ్యారేజ్ ఫస్ట్లుక్ విడుదల
తమిళసినిమా: విక్రమ్ప్రభు నటుడిగా తన స్థాయిని విస్తరించుకుంటున్నారు. కోలీవుడ్లో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన తాజాగా అనుష్క కథానాయకిగా నటిస్తున్న తాజా చిత్రం ఘాటీ ద్వారా విక్రమ్ప్రభు టాలీవుడ్ లోకి నేరుగా అడుగు పెట్టారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా విక్రమ్ ప్రభు తాజాగా నటిస్తున్న తమిళ చిత్రం లవ్ మ్యారేజ్. సుష్మిత బట్, మీనాక్షి దినేష్, రమేష్ తిలక్, అరుళ్ దాస్, గజరాజ, మురుగానందం, కోడింగ్ వడివేలు ముఖ్యపాత్రలు పోషించారు. వీరితో పాటు సత్యరాజ్ కీలక పాత్రను పోషించిన ఈ చిత్రం ద్వారా షణ్ముగప్రియన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ వినోదాత్మక కుటుంబ కథా చిత్రాన్ని అష్యూర్ ఫిలిమ్స్, రైజ్ ఈస్ట్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థల అధినేతలు డా.శ్వేతాశ్రీ, శ్రీనిధి సాగర్ కలిసి నిర్మించారు. చిత్రానికి శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించడంతో పాటు ఒక పాటను రాసి పాడారు. ఈ చిత్రం,నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సమ్మర్ స్పెషల్ తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఐందులో సంగీతదర్శకుడు శ్యాన్రోల్డన్ రాసి, పాడి, నటించిన కల్యాణం కలవరం అనే పాటను, చిత్ర టీజర్ను గురువారం విడుదల చేశారు. ఈ పాటకు, టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందనే ఆనందాన్ని దర్శక, నిర్మాతలు వ్యక్తం చేశారు. లవ్ మ్యారేజ్ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ -
వంద ఆలయాల్లో పుస్తక దుకాణాలు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని హిందూ మత ధార్మికశాఖ రూపొందించిన అరుదైన భక్తి గ్రంధాలు, ప్రవచనాల పుస్తకాలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వీటిని భక్తులకు అందించేందుకు వీలుగా 100 దేవాలయాల్లో పుస్తక దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ ప్రారంభించారు. భక్తిసాహిత్యం, ఇతిహాసాలు, ఆచారాలు, సాధువుల చరిత్రలు, ఆలయ కళా పుస్తకాలు, విగ్రహ పుస్తకాలు, పురాణ పుస్తకాలు, చిత్రలేఖన పుస్తకాలు, ప్రాచీన తమిళ పత్రాలు, దైవ సేవకుల రచనలు, సామెతలుగా, సత్యాన్ని బోధించే రక్షించే సిద్ధ పుస్తకాలు అంటూ అరుదైన 216 రకాల భక్తి పుస్తకాలను ప్రచురించారు. ఇదివరకు 103 దేవాలయాల్లో పుస్తక అమ్మకాలకు చర్యలు తీసుకోగా, ప్రస్తుతం మరో 100 ఆలయాలలో వద్ద దుకాణాలను ఏర్పాటు చేశారు. మంత్రి శేఖర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. మణివాసన్, కమిషనర్ పి.ఎన్. శ్రీధర్, అదనపు కమిషనర్లు సి. హరిప్రియ, బి.సి. జయరామన్ హాజరయ్యారు. అలాగే, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్, వైద్య సిబ్బంది సెలక్షన్ బోర్డు ద్వారా వివిధ పోస్టులకు ఎంపిక చేసిన వారికి ఉద్యోగ నియామకాల ఉత్తర్వులను సీఎం స్టాలిన్ అందజేశారు. మొత్తం 621 మందికి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో డెయిరీ శాఖలో 64 మంది, చేనేత, జౌళి శాఖలో 166 మందిని, ఆరోగ్య విభాగం తరఫున 391 మంది ఉన్నారు. మంత్రులు ఆర్ఎస్ రాజకన్నప్పన్, ఆర్ గాంధీ, ఎం.సుబ్రమణియన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.సెంథిల్కుమార్, జౌళిశాఖ కార్యదర్శి అముదవల్లి పాల్గొన్నారు. -
అమ్మ అయితే డాన్స్ చేయకూడదా?
తమిళసినిమా: నటనకు ఎల్లలు ఎలాగైతే లేవో ప్రేమకు సరిహద్దులు ఉండవు. దీనికి చిన్న చిన్న ఉదాహరణ నటుడు ఆర్య, నటి ఆయేషాసైగల్. ప్రేమబంధం ఎప్పుడు ఎవరితో ముడిపడుతుందో ఎవరికి తెలియదు. కోలీవుడ్లో ప్రముఖ కథానాయకుడిగా రాణిస్తున్న ఆర్యకు, బాలీవుడ్ భామ ఆయేషా సైగల్కు అలా ప్రేమబంధం ముడిపడింది. అఖిల్ అనే తెలుగు చిత్రం ద్వారా కథానాయికిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీని దర్శకుడు విజయ్ కోలీవుడ్కు పరిచయం చేశారు. నటుడు రవిమోహన్కు జంటగా వనమగన్ చిత్రంతో నటించారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయినా, ఆయేషా సైగల్ మాత్రం మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ తరువాత తమిళంతో పాటు కన్నడం, హిందీ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించినా స్టార్ హీరోయిన్ ఇమేజ్ను అందుకోలేకపోయారు. కాగా ఆర్యకు జంటగా గజినీకాంత్ చిత్రంలో నటిస్తున్న సమయంలో ఆయనతో పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇరు కుటుంబసభ్యుల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. వివాహనంతరం ఆయేషా సైగల్ నటనకు బ్రేక్ ఇచ్చారు. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. దీంతో ఆయేషా సైగల్ మళ్లీ నటనపై దృష్టి సారించారు. అందుకోసం తన వంతు ప్రయత్నాలు చేయడం మొదలెట్టారు. అందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్నారు. మరో విషయం ఏమిటంటే ఆయేషా సైగల్ మంచి డాన్సర్. తన డాన్స్ రీల్స్ను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు పని చెబుతూ ఉంటారు. అలా తాజాగా ఈమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. 2013లో విడుదలైన రేస్–2 చిత్రంలోని లాట్ లక్ కయీ అనే పాటకు ఆమె డాన్స్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు అమ్మ అయితే మాత్రం డాన్స్ ఆడకూడదా ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా త్వరలో ఆర్య, ఆయేషా జంటగా కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. -
హత్య కేసులో ముగ్గురిపై గూండా చట్టం
తిరువళ్లూరు: మాజీ సైనికుడిని హత్య చేసి ఆపై ప్రమాదంగా చిత్రీకరించిన వ్యవహారంలో ముగ్గురు యువకులపై గూండా చట్టాన్ని ప్రయోగిస్తూ కలెక్టర్ ప్రతాప్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోని ముత్తుకొండాపురం గ్రామానికి చెందిన వెంకటేశన్(45). ఇతను మిలటరీలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. ఇతను గత ఫిబ్రవరి మూడున ద్విచక్రవాహనంలో తన సొంత గ్రామం నుంచి తిరువళ్లూరుకు వెళుతున్న సమయంలో కారు ఢీకొని ప్రమాదంలో మృతిచెందినట్టు తిరువేళాంగాడు పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు వెంకటేషన్ మృతదేహాన్ని పోస్ట్మార్టానికి వైద్యశాలకు తరలించారు. అయితే వెంకటేషన్ మృతిపై అనుమానం వుండడంతో పోలీసులు ఆదిశగా విచారణ చేశారు. విచారణలో వెంకటేషన్ ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టి హత్య చేసినట్టు నిర్ధారించిన పోలీసులు మృతుడి భార్య సంధ్య(33), తోమూరు గ్రామానికి చెందిన ఆమె ప్రియుడు లోకనాథన్(45) లను అరెస్టు చేసి విచారణ చేశారు. విచారణలో సంధ్య, లోకనాథన్ల వివాహేతర సంబంధానికి సంబందానికి వెంకటేషన్ అడ్డుగా వున్నాడన్న నెపంతోనే హత్య చేయించినట్టు నిర్ధారించారు. అనంతరం హత్య కేసులో సంబంధం వున్న సంధ్య తమ్ముడు షణ్ముగం(30), తిరువేళాంగాడుకు చెందిన సతీష్(30), చైన్నెకు చెందిన యోగేశ్వరన్(22), శ్రీరామ్(24) సహా ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం వీరు పుళల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా వున్నారు. ఈ క్రమంలో మాజీ సైనికుడిని హత్య చేసిన వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సతీష్, యోగేశ్వరన్, శ్రీరామ్లపై ఇప్పటికే వేర్వేరు పోలీసు స్టేషన్ల పరిధిలో హత్య కేసు వున్నట్టు నిర్ధారించిన ఎస్పీ శ్రీనివాసపెరుమాల్ ముగ్గురిపై గూండా చట్టాన్ని ప్రయోగించాలని కలెక్టర్కు సిఫార్సు చేశారు. నిందితుల చరిత్రను పరిశీలించిన కలెక్టర్ ముగ్గురు నిందితులపై గూండా చట్టాన్ని ప్రయోగిస్తూ శుక్రవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. -
సినిమా పాటలు ప్రదర్శిస్తే చర్యలు
● హెచ్ఎంలకు పాఠశాల విద్యా శాఖ హెచ్చరిక సేలం: కృష్ణగిరి జిల్లా బర్గూర్ సమీపంలోని సోప్పనూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు విద్యార్థులు సినిమా పాటకు డాన్స్ చేశారు. ఒక విద్యార్థి వీరప్పన్ చిత్రం ఉన్న చొక్కాను పట్టుకుని, ఇద్దరు విద్యార్థులు పార్టీ దుస్తులు ధరించి పాల్గొన్నారు. ఈ డాన్స్ వీడియో ఇంటర్నెట్లో విడుదలై పెద్ద వివాదానికి దారితీసింది. ఈక్రమంలో రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ శుక్రవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. అందులో 2024–2025 ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ అభ్యర్థన సందర్భంగా శాసనసభలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ముందు విద్యార్థుల తమలోని కళలు, సాహిత్యం, క్రీడలు వంటి నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ఇందుకుగాను రూ.15 కోట్ల కేటాయిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 2024–2025 విద్యాసంవత్సరం జరుపుకోవడానికి ప్రాథమిక విద్యా శాఖ సహా అన్ని జిల్లా ప్రాథమిక విద్యా అధికారులకు రూ. 15కోట్లు పంపిణీ చేసి, వేడుకలకు సంబంధించిన సూచనలు ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణగిరి జిల్లా బర్గూర్ సమీపంలోని చొప్పనూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన వార్షిక కార్యక్రమంలో కుల చిహ్నాలను ఉపయోగించి సినిమా పాటలు ప్లే చేసి, డాన్స్ చేసినట్లు వెల్లడైందని, ఇలాంటి వాటిని పూర్తిగా నివారించాలని, ఫిర్యాదులు వచ్చాయన్నారు. పాఠశాల వేడుకల్లో సినిమా పాటలను ప్రదర్శించినా, డాన్స్లు చేయించినా తమిళనాడు సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఫిర్యాదుకు లోబడి పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులపై చర్య తీసుకుంటారని హెచ్చరించారు. ఈ మేరకు సర్క్యులర్ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ప్రాథమిక విద్యా అధికారులు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపారు. -
మోదీతో భేటీకి కుస్తీ
● నిఘా వలయంలో రామేశ్వరం దీవులు సాక్షి, చైన్నె : ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వం కుస్తీలు పడుతున్నారు. మోదీ ప్రసన్నం కోసం అపాయింట్ మెంట్ ప్రయత్నాలు వేగవంతంచేశారు. పాంబన్లో వంతెన నిర్మాణం పూర్తయిన విషయం తెలిసిందే. దీనిని ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి మదురైకు వచ్చే ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడి నుంచి హెలికాప్టర్లో రామేశ్వరం వెళ్తారు. దీంతో రామేశ్వరాన్ని నిఘా నీడలోకి తీసుకొచ్చారు. మోదీ రాకతో రామేశ్వరం జాలర్లకు చేపల వేటకు నిషేధం విధించారు. శుక్రవారం నుంచి ఆదివారం సాయంత్రం వరకు జాలర్లు ఎవ్వరూ కడలిలోకి వెళ్లకుండా కట్టడిచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. రామేశ్వరం దీవులన్నీ పూర్తిగా కేంద్ర నిఘా వర్గాల గుప్పెట్లోకి చేరినట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. 3,500 మంది తమిళనాడు పోలీసులు శుక్రవారం నుంచే భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు. కుస్తీలు..అన్నామలై వ్యాఖ్యల చర్చ మదురైలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రయత్నాలు మమ్మరం చేశారు. ఇప్పటికే అపాయింట్మెంట్ ప్రయత్నాలు చేపట్టారు. అదే సమయంలో మాజీ సీఎం పన్నీరుసెల్వం కూడా ప్రయత్నాలపై దృష్టి పెట్టారు. ఈ ఇద్దరు మోదీని కలిసే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. మోదీ ఈ ఇద్దర్ని మళ్లీ కలిపే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. అన్నాడీఎంకేతో 2026లో పొత్తు ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ భేటీ కీలకం కానుంది. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా సైతం చైన్నెకు మరి కొద్ది రోజుల్లో రాబోతున్నారు. ఇది పూర్తిగా రాజకీయ పర్యటన కానున్నట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. పొత్తు కావాలంటే, అన్నామలైను తప్పించాలన్న డిమాండ్ ఉంచినట్టు సమాచారం. ఇందుకు బలం చేకూరే వ్యాఖ్యలను శుక్రవారం అన్నామలై చేశారు. తాను బీజేపీ అధ్యక్ష రేసులో లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఎవ్వర్నీ తాను సిఫారసు చేయనని, ఆ పార్టీలో మేధావులు, మంచి వారు, పుణ్యాత్ములు తమిళనాట ఉన్నారని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అన్నామలై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారాయి. ఆయన్ను తప్పించి నైనార్ నాగేంద్రన్ను అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నాయన్న చర్చ మరింతగా ఊపందుకుంది. -
టోల్గేట్లలో మినహాయింపు ఇవ్వాలి
కొరుక్కుపేట: టోల్గేట్లలో ఓమ్ని బస్సులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ యజమానులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఓమ్నీ బస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్బజగన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి తమిళనాడులోని పలు ప్రాంతాల నుంచి 200 మందికి పైగా ఓమ్నీ బస్సు యజమానులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధాన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. భారతదేశంలోని నాలుగు లేన్లు, 6 లేన్లు , 8 లేన్లలో మూడు రకాల రోడ్లపై సెంట్రల్, రాష్ట్ర రహదారులపై ఏర్పాటు చేసిన టోల్గేట్లలో భారతదేశం అంతటా 1,228 టోల్గేట్లలోని ఓమ్మీ బస్ వంటి ప్రజా రవాణా వాహనాలకు మినహాయింపు ఉంది. అయితే ఓమ్నీ బస్సుకు ప్రత్యేక పర్మిట్ లేకపోవడంతో అనేక అడ్డంకులను ఎదుర్కోవలసి వస్తుంది. ఓమ్నీ బస్సులకు కొత్త తరహా పర్మిట్ను రూపొందించి జారీ చేయాలని కోరారు. ఎస్ఐ పోస్టులకు దరఖాస్తులు ●1,299 పోస్టులకు నోటిఫికేషన్ కొరుక్కుపేట: పోలీసు శాఖలో 1,299 ఎస్ఐ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 7 నుంచి మే 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తమిళనాడు యూనిఫామ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. తమిళనాడు యూనిఫామ్డ్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్–2025లో పోలీస్ ప్రో–ఇన్న్స్పెక్టర్ల (తాలూకా పోలీస్, ఆర్ముడ్ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 1, 299 ఎస్ఐ పోస్టులకు ఆన్న్లైన్ దరఖాస్తుల స్వీకరణ 7న ప్రారంభం కానుంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మే 3. అభ్యర్థులకు పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు. ట్రాక్టర్ను ఢీకొన్న లారీ ● ముగ్గురు దుర్మరణం సేలం: తిరుచ్చి సమీపంలో లారీ ఢీకొని ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. తిరుచ్చి జిల్లాలోని పుల్లంబడి సమీపంలోని అళుంతలైపూర్ గ్రామ ప్రజలు ప్రతి ఏడాది తమ ఇంటి అవసరాల కోసం మన్నచనల్లూరులోని రైస్ మిల్లు నుంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఈక్రమంలో మన్నచనల్లూరు వెళ్లిన 20 మంది మహిళలు బియ్యం బ్యాగులను కొని ట్రాక్టర్లో ఎక్కించుకుని ఇంటికి తిరిగి బయలుదేరారు. ఆ సమయంలో తిరుచ్చి– చిదంబరం కొత్త నేషనల్ హైవేలోని ఇరుదయపురం సమీపంలో ట్రాక్టర్ వెళుతుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బియ్యం బస్తా పైన కూర్చున్న శాంతి (58), సెల్వనాయికి (60), రాసంబాల్ (60) అనే మహిళలు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. విషయం తెలిసి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లాల్గుడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ నటుడు రవికుమార్ కన్నుమూత తమిళ సినిమా: సీనియర్ నటుడు రవికుమార్ (71) శుక్రవారం మధ్యాహ్నం చైన్నెలో కన్నుమూశారు. బాలచందర్ దర్శకత్వం వహించిన అవర్గళ్ చిత్రంలో కమలహాసన్ తదితర ముగ్గురు హీరోలలో ఒకరిగా నటించారు. అనంతరం పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించిన రవి కుమార్ పలు టీవీ సీరియళ్లలో నటించారు ఆఢముఖ్యంగా చిత్తి, రాణి వాణి వంటి మెగా సీరియళ్లలో నటించారు. కాగా అనారోగ్యం కారణంగా స్థానిక వేలచ్చేరిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నటి రాధిక శరత్ కుమార్ మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కత్తితో హల్చల్ తిరువళ్లూరు: నడిరోడ్డులో కత్తితో హల్చల్ చేసిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తిరువళ్లూరులోని పుంగత్తూరు గాంఽధీనగర్ ప్రాంతంలో ముగ్గురు యువకులు నడిరోడ్లో కత్తులతో వీరంగం చేస్తున్నారని సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ అంథోని స్టాలిన్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వీరు.. పుంగత్తూరుకు చెందిన విన్నరసు(23), కమలకన్నన్(19), మనవాలనగర్కు చెందిన డేనియల్ ఎడ్వర్డ్(19) అని తేలింది. వీరు గంజాయి మత్తులో తరచూ ప్రజలను భయాందోళనకు గురి చేసేలా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
కదం తొక్కిన విజయ్ సేన
● రాష్ట్ర వ్యాప్తంగా నిరసన హోరు సాక్షి, చైన్నె : తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేత విజయ్ ఆదేశాలతో ఆపార్టీ వర్గాలు కదం తొక్కాయి. వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన హోరెత్తించారు. శుక్రవారం అన్ని చోట్ల విజయ్ పార్టీ వర్గాలు నిరసనలను విజయవంతం చేస్తూ ముందుకు దూసుకెళ్లారు. పార్లమెంట్, రాజ్యసభలలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకేలు వ్యతిరేకించాయి. తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, రాజ్యసభ సభ్యుడు, సంగీత దర్శకుడు ఇళయరాజా మద్దతుగా ఓటు వేసినట్టు తెలిసింది. పీఎంకే రాజ్యసభ సభ్యుడు అన్బుమణి రాందాసు వాకౌట్ చేశారు. ఈ పరిస్థితులలో ఈ చట్ట సవరణకు వ్యతిరేకంగా టీవీకే నేతృత్వంలో భారీ నిరసనలకు విజయ్ పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీవీకే శ్రేణు కదం తొక్కాయి. ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. కొన్ని చోట్ల వీరి నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వివాదాలు, తోపులాటలు తప్పలేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కారులు నినాదాలు హోరెత్తించారు. చైన్నెలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ నేతృత్వంలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈసీఆర్ మార్గంలోని పనయూరు వద్ద భారీ రాస్తారోకో జరగ్గా పోలీసులు అడ్డుకున్నారు. వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా విజయ్ ఇచ్చిన పిలుపుమేరకు తాజాగా జరిగిన నిరసన రాస్ట్రవ్యాప్తంగా విజయవంతం కావడంతో టీవీకే వర్గాల్లో మరింత జోష్ నెలకొంది. కాగా, ఈ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈనెల 8న రాస్ట్రవ్యాప్త నిరసనకు వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ పిలుపునిచ్చారు. -
ఎస్ఆర్ఈఎస్ ఉగాది వేడుకలు
కొరుక్కుపేట: సదరన్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ (ఎస్ఆర్ఈఎస్) ఆధ్వర్యంలో విశ్వావసు నామ ఉగాది వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. చైన్నె పెరంబూర్లోని సంఘ్ ప్రధాన కార్యాలయంలోని యూనిట్ హౌస్ వేదికై ంది. వేడుకల్లో సంఘ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్ఆర్ఈఎస్ కన్స్ట్రక్షన్ బ్రాంచ్ చైర్మన్ ఎస్ అమత్ కుమార్తోపాటు ఎం.సూర్యప్రకాష్ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలకు రైల్వే అధికారులు కె.నాగరాజు, ఎం.విజయ్కుమార్, వి.విభూషన్, వి.మురళీకృష్ణ పాల్గొని 50 మంది సభ్యులను జ్ఞాపికలతో సత్కరించారు. ఎస్ఆర్ఈఎస్ ప్రధాన కార్యదర్శి వి.గోపాలకృష్ణ, కార్యదర్శి ఓయూవీ శర్మ పాల్గొన్నారు. -
96 సీక్వెల్కు సన్నాహాలు
తమిళసినిమా: ఏ చిత్రం ఎప్పుడు ఎవరికి పేరు తెచ్చిపెడుతుందో తెలియదు. అలా అనూహ్య విజయాన్ని సాధించిన చిత్రం 96. ఈ చిత్రం ద్వారా చాయాగ్రాహకుడు ప్రేమ్ కుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇక ఈ చిత్రంలో విజయ్సేతుపతి, త్రిష తొలి సారిగా జత కట్టారు. నటి గౌరీకిషన్, దేవదర్శిని, ఒడుగళం మురుగదాస్, బక్స్ పెరుమాళ్ ముఖ్యపాత్రలు పోషించారు. పాఠశాల విద్యార్థుల పరువ ప్రేమ, వారి రీ యూనియన్ వంటి కథాంశంతో రూపొందిన ఈ వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రం 2018లో తెరపైకి వచ్చి సూపర్హిట్ అయ్యింది. త్రిష నటన అందరినీ ఆకట్టుకుంది. దీంతో 96 చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. అది ఎప్పుడాని ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు చెప్పారు దర్శకుడు ప్రేమ్కుమార్. ఇటీవల కార్తీ హీరోగా మెయ్యళగన్ వంటి ఫీల్ గుడ్ కుటుంబ కథా చిత్రాన్ని చేసిన ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ 96 చిత్రానికి సీక్వెల్ కథ పూర్తి అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్న్స్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, 96 చిత్రంలో నటించిన వారంతా ఈ చిత్రంలో నటిస్తారని అన్నారు. కాగా ఈ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో విజయ్సేతుపతి, త్రిష జంటను మరోసారి తెరపై చూడబోతున్నాం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
నీట్ రద్దుకు చట్ట సమరం!
సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల అనంతరం సీఎం స్టాలిన్ ప్రత్యేక ప్రసంగం చేశారు. వైద్యరంగంలో తమిళ నాడు భారత దేశానికి మార్గదర్శకంగా ఉందన్నా రు. 2006లో వైద్యం సహా అన్ని కోర్సులకు ప్రవేశ పరీక్షలను రద్దు చేశామని, ప్లస్టూ మార్కుల ఆధారంగా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలను నిర్ధారించే విధంగా మార్గదర్శక ప్రవేశ పద్ధతిని కలైంజ్ఞర్ కరుణానిధి ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులను ఉన్నత చదువుల మేరకు వైద్యులుగా తీర్చిదిద్దామని ధీమా వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష విధానం అమల్లోకి వచ్చిన తర్వాత శిక్షణ కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఏర్పడిందన్నారు. సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఈ పరీక్ష విధానం ఉండడంతో అందరి మధ్య ఏకాభిప్రాయం ఆధారంగా, సరైన ప్రత్యామ్నాయం కోసం రిటైర్డ్ న్యాయమూర్తి రాజన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కమిటీ సిఫార్సు ఆధారంగా, ఈ శాసనసభలో 2021లో నీట్ మినహాయింపు, రద్దుకు తీర్మానం చేశామని గుర్తు చేశారు. అయితే, దీనిని కొంత కాలం గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టారని, ఆతర్వాత పు నఃపరిశీలన పేరిట వెనక్కి పంపించారని పేర్కొన్నా రు. అసెంబ్లీ ఆమోదం పొందిన ముసాయిదాను గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. అయితే, ప్రస్తుతం దీనిని ఆయుష్ మంత్రిత్వ, హోం మంత్రిత్వ శాఖలు వెనక్కి పంపించడం విచారకరం అని అన్నారు. అసెంబ్లీ ఆమోదం పొందిన నీట్ మినహాయింపు చట్టాన్ని యూనియన్ ప్రభుత్వం నిరాకరించడాన్ని అసెంబ్లీకి దృష్టికి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. కేంద్రంలోని యూనియన్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తంచేస్తూ, ఇంతటితో ఈ వ్యవహారం ఆగిపోదని, ఇక న్యాయ పోరాటానికి సిద్ధం అని ప్రకటించారు. ఇందు కోసం ఈనెల 9వ తేదీ సాయంత్రం సచివాలయంలో సమావేశానికి నిర్ణయించామని ప్రకటించారు. పార్టీల ప్రతినిధులు, న్యాయ నిపుణులను సంప్రదించి తమిళనాడులోని లక్షలాది మంది విద్యార్థులకు వైద్య విద్యను దరి చేర్చడం లక్ష్యంగా, వారి కలలను సాకారం చేయడమే ధ్యేయంగా దృఢ సంకల్పంతో ఈ సభ వేదికగా తాను మాటిస్తున్నానని ప్రకటించారు. కులగణన చర్చ – ఎంపురాన్ గోల అసెంబ్లీలో మంత్రి శేఖర్బాబు మాట్లాడుతూ తమిళనాడులో ఆధ్యాత్మిక నినాదం మార్మోగుతోందన్నారు. ఆ మేరకు ఆలయాలకు ఈ ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్టు వివరించారు. మంత్రి వేలు మాట్లాడుతూ కొడైకెనాల్కు మరో మార్గం ఏర్పాటు దిశగా సాధ్యా అసాధ్యాల నివేదిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. మోహన్లాల్ నటించిన ఎంపురాన్ చిత్రం అసెంబ్లీకి చేరింది. ఈ చిత్రంలో కేరళలో ఉన్న తమిళనాడుకు చెందిన ముల్లై పెరియార్ డ్యాం కూలిన పక్షంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ప్రస్తావించి ఉన్నారని తమిళర్ వాల్వురిమై కట్టి ఎమ్మెల్యే వేల్మురుగన్ వివరించారు. ఈ చిత్రానికి అడ్డుకట్ట వేయాలని కోరారు. మంత్రి దురై మురుగన్ జోక్యం చేసుకుని తాను ఆ సినిమా చూడ లేదని, కొందరు అందులోని విషయాన్ని తన వద్ద ప్రస్తావించారని, వినగానే ఆందోళన , భయం, కోపం వచ్చిందన్నారు. ఇంతలోపు సీఎం స్టాలిన్ జోక్యం చేసుకుని వ్యతిరేకతను తెలియజేయగానే ఆ దృశ్యాలను తొలగించారని పేర్కొంటూ, ఆ చర్చకు ముగింపు పలికారు. అనంతరం కులగణన చర్చ సభలో రసవత్తరంగా సాగింది. అన్నాడీఎంకే, పీఎంకే సభ్యులతో న్యాయశాఖా మంత్రి రఘుపతి ఎదురుదాడి చేశారు. అన్నాడీఎంకేను ఇరకాటంలో పెట్టే విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తమరు కులగణనకు చర్యలు తీసుకోలేదో అని ప్రశ్నల వర్షాన్ని మంత్రి కురిపించారు. కులగణన కేంద్రం కోర్టులో ఉందంటూ వివరించారు. అనంతరం న్యాయశాఖకు నిధుల కేటాయింపు అంశాల ప్రకటనను సభలో ఆ శాఖ మంత్రి రఘుపతి ప్రస్తావించారు. అన్నాడీఎంకే వాకౌట్ అసెంబ్లీలో సీఎం ప్రసంగం తర్వాత అన్నాడీఎంకే శాసనసభా పక్ష ఉప నేత ఉదయకుమార్ తెరపైకి తెచ్చిన ఓ అంశాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత పళణిస్వామి ప్రస్తావించారు. ఇందుకు స్పీకర్ అప్పావు అనుమతి ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై చర్చకు ఇది సమయం కాదని వారించారు. దీంతో అన్నాడీఎంకే సభ్యులందరూ లేచి నిలబడి తమ నిరసనను వ్యక్తంచేస్తూ, గళాన్ని నొక్క వద్దు అని నినదించారు. అన్నాడీఎంకే సభ్యులను స్పీకర్ తీవ్రంగా హెచ్చరించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో స్పీకర్ చర్యలకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి, అన్నాడీఎంకే సభ్యులు వెలుపలకు వచ్చేశారు. ఈసందర్భంగా మీడియాతో పళణిస్వామి మాట్లాడుతూ, యూ ట్యూబర్ షౌక్ శంకర్ ఇంటిపై దాడిని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు జరుగుతున్న విఘాతాన్ని గుర్తు చేస్తే, తమ గళాన్ని నొక్కేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శాసన సభా పక్ష సమావేశానికి వెళ్లాలా వద్దా అని చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ఒలింపిక్ అకాడమీలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్
సాక్షి, చైన్నె : చైన్నె నెహ్రూ స్టేడియంలోని ఒలింపిక్ అకాడమీలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీనిని శుక్రవారం క్రీడల మంత్రి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. తేని, రామనాతపురంలో నిర్మించిన స్టేడియంలను క్రీడాకారులకు అంకితం చేశారు. చైన్నెలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఒలింపిక్ అకాడమీ క్యాంపస్ ఉన్న విషయం తెలిసిందే. ఇందులోని మూడవ అంతస్తులో రూ.3కోట్లతో సైన్స్ సెంటర్ను ఏర్పా టు చేశారు. అథ్లెట్లను శారీరకంగా మానసికంగా, దృఢంగా ఉంచడానికి. బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సైన్స్ సెంటర్లో అథ్లెట్ల పనితీరు, ఫిట్నెస్, శారీరక దృఢత్వం, ఆరోగ్యం, క్రీడా వైద్యం వాటికి ప్రాముఖ్యతను ఇవ్వనున్నారు. ఈ కేంద్రంలో ఒక మానసిక ఆరోగ్య నిపుణుడు, పోష కాహార నిపుణుడు ఉన్నారు. అలాగే, తేని జిల్లా పెరియకుళం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి రూ. 5.95 కోట్లతో నిర్మించిన జిల్లా క్రీడా సముదాయంగా ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సర్జికల్ ఇంటర్వెన్షన్కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మల్టీ–విసెరల్ అండ్ అబ్డామినల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చైర్, డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ వైద్య, మల్టీ విసెరల్ అండ్ అబ్డామినల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సెంథిల్ ముత్తురామన్, సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శివకుమార్ మహాలింగం, హెల్త్కేర్లో మల్టీ విసెరల్ ట్రాన్న్స్ప్లాంట్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్ డాక్టర్ వెంకటేష్ నాయకత్వం వహించారు. అనస్థీషియా, ఇంటెన్సివ్ కేర్ బృందంలో డాక్టర్ దినేష్ బాబు, డాక్టర్ నివాష్ చంద్రశేఖరన్ ఉన్నారు. అలాగే, రామనాథపురం జిల్లా, పరమకుడిలో నిర్మించిన జిల్లా క్రీడా సముదాయాన్ని కూడా ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించా రు. మంత్రులు పెరియస్వామి, ఆర్ఎస్ రాజకన్నప్పన్, పీకే శేఖర్బాబు, శాసనసభ సభ్యులు పరంధామన్, శరవణకుమార్, ఎస్. మురుగేశన్, యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ అతుల్య మిశ్రా, తమిళనా డు క్రీడా అభివృద్ధి అథారిటీ సభ్య కార్యదర్శి జె. మేఘనాథ రెడ్డి, తమిళనాడు క్రీడా అభివృద్ధి కమిష న్ వైస్ చైర్మన్ డాక్టర్ అశోక్ శిఖామణి పాల్గొన్నారు. ప్రారంభించిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ -
ఎస్ఆర్ఈఎస్ ఉగాది వేడుకలు
కొరుక్కుపేట: సదరన్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ (ఎస్ఆర్ఈఎస్) ఆధ్వర్యంలో విశ్వావసు నామ ఉగాది వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. చైన్నె పెరంబూర్లోని సంఘ్ ప్రధాన కార్యాలయంలోని యూనిట్ హౌస్ వేదికై ంది. వేడుకల్లో సంఘ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్ఆర్ఈఎస్ కన్స్ట్రక్షన్ బ్రాంచ్ చైర్మన్ ఎస్ అమత్ కుమార్తోపాటు ఎం.సూర్యప్రకాష్ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలకు రైల్వే అధికారులు కె.నాగరాజు, ఎం.విజయ్కుమార్, వి.విభూషన్, వి.మురళీకృష్ణ పాల్గొని 50 మంది సభ్యులను జ్ఞాపికలతో సత్కరించారు. ఎస్ఆర్ఈఎస్ ప్రధాన కార్యదర్శి వి.గోపాలకృష్ణ, కార్యదర్శి ఓయూవీ శర్మ పాల్గొన్నారు. -
తలైవన్ నీయే తొండన్ నానే ఆల్బమ్కు శ్రీకారం
తమిళసినిమా: కోలీవుడ్లో వివిధ రకాల పాత్రలతో తన సత్తాను చాటుకున్న నటుడు సౌందరరాజన్. మరోపక్క సామాజిక సేవల్లోనూ అక్కర చూపిస్తున్న నటుడీయన. ముఖ్యంగా మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం వంటి ప్రయోజన కార్యక్రమాలతో తన వంతు సహకారం అందిస్తున్నారు. ఈయన నటుడు విజయ్కు వీరాభిమాని. ఆయన రాజకీయపార్టీని ప్రారంభించి ఆ మధ్య మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు, ఈయన చైన్నె నుంచి తన బృందంతో సైకిల్ ర్యాలీతో వెళ్లారు. కాగా తాజాగా విజయ్ పై తన అభిమానాన్ని చాటుకునేందుకు మరో ప్రయత్నం చేస్తున్నారు. తలైవన్ నీయే తొండన్ నానే పేరుతో ఒక వీడియో ఆల్బమ్ను రూపొందిస్తున్నారు. ఇందులో ఈయన నటించడంతోపాటు దీన్ని తన సొంత సంస్థ మదురై టూరింగ్ టాకీస్ పతాకంపై రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గురువారం చైన్నెలో జరిగాయి. కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ఈ పాటను డా.నందుదాసన్ నాగలింగం రాయగా సంతోష్ సంగీతాన్ని అందిస్తున్నారు. నియోరాజన్ దర్శకత్వం వహిస్తున్న దీనికి ప్రసాద్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వీడియో ఆల్బమ్కు సంబంధించిన మరిన్ని వివరాలను తరువాత వెల్లడించనున్నట్లు సౌందరరాజన్ పేర్కొన్నారు. -
వక్ఫ్ బిల్లు ఆమోదంపై భారీ ఎత్తున నిరసనలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం ముద్ర పడిన కొన్ని గంటల వ్యవధిలోనే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పార్లమెంట్ లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్, తమిళనాడులో నిరసన గళం వినిపిస్తూ నిరసనకు దిగాయి ముస్లిం సంఘాలు. .‘వక్ఫ్ సవరణ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం’ అంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా, తమినాడులోని చెన్నై, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళలన్నీ జాయింట్ ఫారమ్ ఆఫ్ వక్ఫ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలోని జరిగినట్లు జాతీయ న్యూస్ ఏజెన్నీ ఏఎన్ఐ తెలిపింది.Bengal: Muslim outfits protest against Waqf Amendment Bill in KolkataRead @ANI Story | https://t.co/JTMcg1k79U#WaqfAmendmentBill #Kolkata pic.twitter.com/iCkDlnuYFp— ANI Digital (@ani_digital) April 4, 2025 అహ్మదాబాద్లో తీవ్రరూపం#WATCH | Ahmedabad: Various Muslim organisations hold protests against the Waqf Amendment Bill. pic.twitter.com/viavsuqf3D— ANI (@ANI) April 4, 2025వక్ఫ్ బిల్లుపై నిరసన కార్యక్రమం అహ్మదాబాద్ లో తీవ్రరూపం దాల్చింది. రోడ్లపై కూర్చొని పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే పోలీసులు వారిని బలవంతంగా తొలగించే ప్రయత్నం చేసే క్రమంలో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది.తమినాడు వ్యాప్తంగా విజయ్ తమిళగ వెట్రి కజగం నిరసనచెన్నైలో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి, అక్కడ ఇటీవలే పార్టీ స్థాపించిన నటుడు విజయ్ ‘తమిళగ వెట్రి కజగం’ రాష్ట్రవ్యాప్త నిరసనను ప్రకటించింది. చెన్నై కోయంబత్తూర్, తిరుచిరాపల్లి వంటి ప్రధాన నగరాల్లో టీవీకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. చేతిలో ఫ్లకార్డులతో తమ నిరసన తెలిపారు. ముస్లింల హక్కులను హరించవద్దు అంటూ నిరసన వ్యక్తమైంది.కాగా, రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోద ముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది.#WATCH | West Bengal: Members of the Muslim community take to the streets in Kolkata to protest against the Waqf Amendment Bill. pic.twitter.com/pKZrIVAYlz— ANI (@ANI) April 4, 2025 దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్ బిల్లును లోక్సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే -
తమిళనాట కీలక పరిణామం.. సంచలనంగా అన్నామలై ప్రకటన
కోయంబత్తూర్: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అన్నామలై ప్రకటన సంచలనంగా మారింది. తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం ఆయన బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు. బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన అన్నామలై.. పార్టీకి జోష్ తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.ఆయన పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ బలం కొంత మేరకు పెరిగిందనే వాదన కూడా ఉంది. ఆయనకు అన్నాడీఎంకేతో వైర్యం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ పార్టీకి, బీజేపీ మధ్య పొత్తు చిగురిస్తున్న కారణంగా, ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.రాజీనామా చేసే ముందు శుక్రవారం ఆయన కోయంబత్తూర్లో మాట్లాడుతూ.. మంచి వ్యక్తులు ఉండే పార్టీ బీజేపీ.. ఈ పార్టీ బాగుండాలి. బీజేపీ ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తినంటూ చెప్పుకొచ్చారు. బీజేపీలో, నాయకులు పార్టీ నాయకత్వ పదవికి పోటీ చేయరు. మనమందరం కలిసి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటాము. నేను ఆ పదవి రేసులో లేను’’ అంటూ అన్నామలై స్పష్టం చేశారు.‘‘పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను తదుపరి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో లేను. నేను ఎలాంటి రాజకీయ ఊహాగానాలకు స్పందించబోవడం లేదు. నేను ఏ రేసులో లేను’’ అని అన్నామలై పేర్కొన్నారు.Coimbatore, Tamil Nadu: State BJP chief K Annamalai says, "There is no contest in Tamil Nadu BJP, we will select a leader unanimously. But I am not in the race. I am not in the BJP state leadership race." pic.twitter.com/7OjdbOoTWR— ANI (@ANI) April 4, 2025 -
Neet Row: డీఎంకే సర్కార్కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ/చెన్నై, సాక్షి: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష విషయంలో డీఎంకే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. నీట్ పరీక్ష(NEET Exam) నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు చేసిన అభ్యర్థనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆ రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం అన్ని వివరణలు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నీట్ను ఉప సంహరించుకోలేదన్న ఆయన.. ఈ వ్యవహారంలో తమిళనాడు చేస్తున్న పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఈ నెల 9వ తేదీన పార్టీలకతీతంగా ఎమ్మెల్యేందరితోనూ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.నీట్కు వ్యతిరేకంగా తమిళనాడు ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ, పరీక్షను క్లియర్ చేయలేని స్థితిలో పలువురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడడంతో ఇదొక తీవ్ర అంశంగా మారిందక్కడ. కోచింగ్లకు వెళ్లే స్తోమత లేని విద్యార్థుల పాలిట ఇదొక శాపంగా మారిందనే అభిప్రాయం అక్కడ వ్యక్తమైంది. సామాజిక న్యాయం దక్కాలంటే నీట్ వద్దనే నినాదంతో పోరాడుతూ వస్తోంది. అందుకే నీట్ బదులు 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి తమిళనాడును అనుమతించాలని తమిళనాడు ప్రభుత్వం ఒక బిల్లును రూపొందించింది. అయితే.. 2021-22 నుంచే అది పెండింగ్లో ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో.. కిందటి ఏడాది జూన్లో తమిళనాడు ప్రభుత్వం ఏకగ్రీవంగా నీట్ను రద్దు చేయాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది కూడా. అయినప్పటికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. తాజా ఎదురు దెబ్బపై స్టాలిన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. దక్షిణ రాష్ట్రం మరోసారి అవమానానికి గురైందని అన్నారు. ‘‘కేంద్రం తమిళనాడు అభ్యర్థనను తిరస్కరించవచ్చు. కానీ, మన పోరాటం మాత్రం ఆగదు. న్యాయ నిపుణులపై చర్చించి ఈ నిర్ణయాన్ని సవాల్ చేసే అంశం పరిశీలిస్తాం అని స్టాలిన్ ప్రకటించారు. మరోవైపు తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ కూడా నీట్కు వ్యతిరేకంగా ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇంకోవైపు.. కాంగ్రెస్, ఆర్జేడీ లాంటి పార్టీలు కూడా నీట్ను మొదటి నుంచే వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. -
నకిలీ వెబ్సైట్లతో జాగ్రత్త
● కేవీ కేంద్రం వెల్లడి సేలం : చైన్నె నగర వ్యాప్తంగా 14 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఆ పాఠశాలలు అన్ని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కింద పని చేస్తున్నాయి. ఈ స్థితిలో కేవీ వెబ్సైట్ పేరిట నకిలీ వెబ్సైట్లు పని చేస్తున్న సమాచారం వెల్లడైంది. ఈక్రమంలో కేవీ చైన్నె కేంద్రం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో కేంద్రియ విద్యాలయ పాఠశాల పేరిట కొన్ని నకిలీ వెబ్సైట్లు పని చేస్తున్నాయని తెలిపారు. వాటి ద్వారా విడుదలయ్యే ప్రకటనలను నమ్మవద్దని కోరారు. కేంద్రియ విద్యాలయ పాఠశాలల గురించిన మొత్తం సమాచారం జుఠిట్చ ుఽజ్చ్టజ్చి ుఽ. ుఽజీఛి.జీ ుఽ అనే వెబ్సైట్ ద్వారా మాత్రం వెలువడుతాయని, కనుక నకిలీ వెబ్సైట్ ద్వారా విడుదల సమాచారాన్ని నమ్మవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ విభాగం హెచ్చరించింది. విమానం ల్యాండింగ్పై గందరగోళం సాక్షి, చైన్నె: చైన్నె విమానాశ్రయంలో ముంబై నుంచి వచ్చిన ఓ విమానం ల్యాండింగ్ ఉత్కంఠగా మారింది. రెండుసార్లు ల్యాండింగ్కు ప్రయత్నించి విఫలమైన ఫైలట్, అర్ధగంట పాటూ గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ముంబై నుంచి గురువారం ఉదయం 9 గంటలకు చైన్నెకు విమానం బయలు దేరింది. 11 గంటల సమయంలో ఇది ల్యాండింగ్ కావాల్సి ఉంది. అనంతరం 11.45కు ఈ విమానం మదురై బయలుదేరాల్సి ఉంది. ఈ విమానంలో 164 మంది ప్రయాణికులు ఉన్నారు. ల్యాండింగ్ సమయంలో రన్ వే మీద ఎదురైన పరిస్థితితో ఫైలట్ విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేశారు. పది నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టి మళ్లీ ల్యాండింగ్కు ప్రయత్నించి విఫలమయ్యారు. రెండుసార్లు ల్యాండింగ్ ప్రయత్నాలు విఫలం కావడంతో ఉత్కంఠ నెలకొంది. మొదటి రన్ వేపై అధికారులు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. చివరకు మరో 20 నిమిషాలు గాల్లో విమానం చక్కర్లు కొట్టినానంతరం సురక్షితంగా ల్యాండింగ్ అయింది. అయితే, విమానంలో ఉన్న ప్రయాణికులకు టెన్షన్ తప్పలేదు. అనంతరం భద్రతా పరంగా అన్ని చర్యలు, పరిశీలనతో విమానం గంట ఆలస్యంగామదురైకు బయలు దేరింది. మదురైకు వెళ్లాల్సిన 127 మంది ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. చైన్నె పోర్ట్ – కామరాజ్ పోర్ట్ రూ.1000 కోట్ల వసూళ్ల రికార్డు ● చైన్నె పోర్ట్ అథారిటీ చైర్మన్ సునీల్ పాలివాల్ కొరుక్కుపేట: చైన్నె పోర్ట్ అథారిటీ, కామరాజర్ పోర్ట్ లిమిటెడ్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.1000 కోట్ల వసూళ్ల రికార్డు సష్టించిందని చైన్నె పోర్ట్ అథారిటీ చైర్మన్ సునీల్ పలివాల్ తెలిపారు. గురువారం ఉదయం పోర్ట్ ఆర్థిక పనితీరును ప్రకటించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో చైన్నె పోర్ట్, కామరాజ్ పోర్ట్ మొత్తం 103.36 మిలియన్ మెట్రిక్ టన్నులతో సంయుక్త కార్గో ఉత్పత్తిలో మొదటిసారిగా 100 మిలియన్ మెట్రిక్ టన్నులను దాటి ఒక చారిత్రాత్మక మైలురాయిని సాదించిందన్నారు. ఇందులో చైన్నె పోర్ట్ 54.96 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా, కామరాజర్ పోర్ట్ 48.41 మిలియన్ మెట్రిక్ టన్నులను నిర్వహించిందన్నారు. చైన్నె ఓడరేవు ఏడాది ప్రాతిపదికన 6.5 శాతం, కామరాజ్ పోర్ట్లో వార్షిక 6.9 శాతం వృద్ధిని చూపిందన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో, చైన్నె పోర్ట్, ఒక్కొక్కటి రూ.1000 కోట్ల నిర్వహణ ఆదాయంతో ఉమ్మడి రికార్డు సృష్టించిందన్నారు. చైన్నెలో కదం తొక్కిన జాలర్లు సాక్షి, చైన్నె: చైన్నెలోని జాలర్లు, వారి కుటుంబాలు కదంతొక్కారు. మెరీనా తీరంలో రోడ్డు మార్గంలో టూవే అనుమతి కోసం నిరసన, ఆందోళన నిర్వహించారు. చైన్నెలో మెరీనా బీచ్ కూత వేటు దూరంలో పట్టినంబాక్కం, శ్రీనివాసపురం, నొచ్చికుప్పం, ముల్లైప్పం, తదితర జాలర్ల గ్రామాలు ఉన్నాయి. మెరీనా – శాంతోమ్ రోడ్డులో మెట్రో నేపథ్యంలో ట్రాఫిక్ మార్పులు జరిగాయి. టూవేను వన్ వే చేశారు. దీంతో వాహనాలన్నీ జాలర్లగ్రామాల మీదుగా వెళ్తున్నాయి. దీంతో నిత్యం ట్రాఫిక్ రద్దీతో జాలర్లు నివసించే ప్రాంతాలు మునిగాయి. తమ ప్రాంతం రోడ్లన్నీ ట్రాఫిక్తో నిండటం, అస్తవ్యస్తంగా పరిస్థితి మారడంతో శాంతోమ్ రోడ్డును టూవే గా మార్చలన్న నినాదంతో ఆ పరిసర గ్రామాల జాలర్లు, వారి కుటుంబాలు గురువారం ఉదయం చైన్నెలో ఆందోళన నిర్వహించారు. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోని పక్షంలో నిరసన ఉధృతం అవుతుందన్న హెచ్చరికలు చేశారు. -
కార్ల్మార్క్స్కు చైన్నెలో విగ్రహం
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ గురువారం తమిళనాడు అసెంబ్లీ వేదికగా డీఎంకే కూటమి సభ్యులతో పాటూ మరికొన్ని పార్టీల సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనను వ్యక్తం చేశారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీ వేదికగా నినాదాలు మార్మోగించారు. కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా చట్ట పోరాటానికి సిద్ధమయ్యారు. అయితే, నల్ల బ్యాడ్జీలను ధరించేందుకు అన్నాడీఎంకే సభ్యులు నిరాకరించగా, బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో నల్ల బ్యాడ్జీ ధరించి ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్ తమిళనాడు శాసనసభలో, సీఎం స్టాలిన్ అసెంబ్లీ నిబంధనలు 110 ప్రకారం ప్రత్యేక ప్రకటన చేశారు. జర్మనీ తత్వవేత్త, సోషలిస్టు నేత, కమ్యూనిజం రూపకర్త కార్ల్మార్క్స్ గురించి ఈ ప్రకటన చేస్తూ, సభ్యుల చేత కరతాళ ధ్వనులను మార్మోగించారు. తత్వశాస్త్రాన్ని కనుగొన్న విప్లవకారుడు కార్ల్ మార్క్స్ జీవితం, సామాజిక కార్యక్రమాలను ప్రస్తావిస్తూ చరిత్రలో చాలా మంది జన్మించారని, అయితే, చరిత్రకు చాలా మంది దోహదపడ్డారని గుర్తు చేశారు. ప్రపంచ విప్లవాలకు, సాధించిన వివిధ విజయాలకు కార్ల్ మార్క్స్ నివేదికను వివరిస్తూ మార్చి 14వ తేదీన ఆయన స్మారక దినోత్సవం అని గుర్తు చేశారు. గొప్ప మేధావి కార్ల్ మార్క్స్ విగ్రహాన్ని తమిళనాడు రాజధాని చైన్నెలో ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు మూకయ్యదేవర్కు మదురై జిల్లా ఉసిలం పట్టిలో మణి మండపం ఏర్పాటు చేయనున్నామని సభలో ప్రకటించారు. ● కోర్టును ఆశ్రయించేందుకు అసెంబ్లీ వేదికగా నిర్ణయం ● వక్ఫ్ సవరణకు వ్యతిరేకంగా మిన్నంటిన నినాదం ● కేంద్రంపై డీఎంకే కూటమి ఆగ్రహం ● నల్లబ్యాడీలతో సభకు సభ్యులు ● అన్నాడీఎంకే నిరాకరణ ● బీజేపీ వాకౌట్ -
ఢిల్లీలో అన్నాడీఎంకే ఎంపీల బిజీబిజీ
సాక్షి, చైన్నె: ఢిల్లీలో అన్నాడీఎంకే ఎంపీలు ఇరువురితో పాటూ నేతలు బిజీ అయ్యారు. ఎంపీ తంబిదురై ఓ వైపు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో, మరోవైపు ఎంపీ సీవీ షణ్ముగం నేతృత్వంలోని ప్రతినిధులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. రాష్ట్రంలో2026 అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి అన్నాడీఎంకే – బీజీపీల బంధం మళ్లీ ఏర్పడబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అమిత్ షాతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఓ వైపు, సీనియర్ నేత సెంగోట్టయన్ మరో వైపు భేటీ కావడంతో మళ్లీ వీరి బంధం ఏర్పడడం ఖాయమైనట్టే అన్న చర్చ జోరందుకుంది. అదే సమయంలో రాష్ట్ర బీజేపీలో కొత్త చర్చ ఊపందుకుని ఉంది. అన్నాడీఎంకేతో పొత్తు పొడవాలంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు అనివార్యం అన్న ప్రచారం జరుగుతోంది. అన్నామలైను తప్పించబోతున్నట్టుగా చర్చ జోరందుకున్న నేపథ్యంలో ఆయనకు మద్దతు స్వరం బీజేపీలో బయలుదేరింది. అన్నామలైను తప్పించ వద్దని, అన్నాడీఎంకేతో పొత్తు వద్దంటూ ఓ వర్గం పోస్టర్ల ప్రచారం విస్తృతం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం అన్నాడీఎంకే ఎంపీలు డిల్లీలో బిజీగా కావడం ప్రాధాన్యత సంతరించుకున్నట్లయ్యింది. ఓ వైపు అమిత్ షాతో ఎంపీ సీవీ షణ్ముగంతో పాటూ మరికొందరు భేటీ కావడంతో రాజకీయ చర్చ ఊందుకుంది. అదే సమయంలో మరో ఎంపీ తంబిదురై సైతం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కలవడంతో పొత్తుల చర్చ జోరందుకుంది. ఢిల్లీ వేదికగా సాగుతున్న ఈ పరిణామాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మార్పుకోసమే అన్న ప్రచారం కూడా సాగడం గమనార్హం. -
మన ఊరు.. మన బడి నినాదానికి మద్దతు
సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వ మన ఊరు..మన బడి నినాదానికి బలాన్ని చేకూర్చే విధంగా చైన్నె లేడీ వెల్లింగ్టన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో అధునాతన ల్యాబ్ సౌకరాలు, కొత్త వంట గది, డైనింగ్ హాల్ తదితర నిర్మాణాలను విర్చుసా ఫౌండేషన్ పూర్తి చేసింది. వీటిని గురువారం డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, విద్యా మంత్రి అన్బిల్ మహేశ్ ప్రారంభించారు. డిజిటల్ ఇంజినీరింగ్ , టెక్నాలజీ రంగంలో ఉన్న విర్చుసా కార్పొరేషన్ తన సేవలను విస్తరించే విధంగా చైన్నెలోని లేడీ వెల్లింగ్టన్ హయ్యర్ సెకండరీ స్కూల్ను ఎంపిక చేసుకుంది. మన వూరు..మన బడి నినాదానికి బలాన్ని చేకూర్చు విధంగా అధునాతన ల్యాబ్ సౌకర్యాలు, విద్య, పర్యావరణ అంశాలతో పాటూ అనేక నిర్మాణాలను పూర్తి చేసింది. 1922లో స్థాపించబడిన చైన్నె మైలాపూర్లోని లేడీ విల్లింగ్డన్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఒక శతాబ్దానికి పైగా ఉచిత ప్రభుత్వ విద్యను అందిస్తోంది. 103 సంవత్సరాల పాటూ విద్యాసేవలలో ఉన్న ఈ పాఠశాల నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది విద్యార్థులను ఉన్నత విద్యా వంతులుగా తీర్చిదిద్దింది. ప్రధానంగా సత్యనగర్, కన్నగి నగర్, పెరుంబాక్కంలోని వెనుకబడిన ప్రాంతాలలోని పిల్లలకు సైతం సేవలు అందిస్తోంది. అంతటి ప్రసిద్ధి చెందిన ఈ బడిలో పురాతనత చెక్కు చెదరకుండా రూ.3.65 కోట్లతో రూపుదిద్దుకున్న నిర్మాణాలను ఉదయనిధి స్టాలిన్ అన్బిల్ మహేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విర్చుసా సీటీఓ రామ్ మీనాక్షిసుందరం, గ్లోబల్ హెడ్ టెక్నాలజీ సర్వీస్ లైన్ ఈవీపీ వెంకటేశన్ విజయరాఘవన్ తదితరులు పాల్గొన్నారు. -
నల్ల బ్యాడీలతో నిరసన..
సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలలో ఉదయం తొలుత ప్రశ్నోత్తరాలు జరిగాయి. మంత్రి రాజకన్నప్పన్ మాట్లాడుతూ, తమిళనాడులో రూ. 10 కోట్లతో 500 ఆవిన్ పార్లర్లను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. పాలలో కల్తీ గుర్తింపునకు రూ. 129 కోట్లతో ప్రత్యేక పరికరం అందజేయనున్నామన్నారు. పాలు పితకడం గురించి ప్రత్యేక పోటీలను పాడి రైతులకు నిర్వహించనున్నామని, పాల ఉత్పత్తి 56 లక్షల లీటర్లకు పెంచడం లక్ష్యంగా ముందుకెళ్లనున్నామని వివరించారు. మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం మాట్లాడుతూ, 100 మంది రైతులను పాడి ఉత్పత్తిపై అధ్యయనం నిమిత్తం విదేశాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. మంత్రి సెంథిల్ బాలాజీ మాట్లాడుతూ, తూత్తుకుడి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం నష్టం తీవ్రతను అంచనా వ్యయానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నామన్నారు. పోరాట ఆపబోం.. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో సీఎం స్టాలిన్ ప్రసంగించారు. గత నెల 27వ తేదిన అసెంబ్లీ వేదికగా ఆ చట్ట సవరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ దేశంలో మత సామరస్యంకు హాని కలిగించే పరిణామాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు వక్ఫ్ చట్ట సవరణకు దేశంలోని అనేక పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, అయితే, ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందడం విచారకరంగా పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా 232 మంది ఓటు వేశారని, 288 మంది మద్దతు ఇచ్చాని గుర్తు చేస్తూ, ఒక్క అదనపు సంఖ్యతో బిల్లు ఆమోదం పొందినట్టు వివరించారు. ఇది ఆమోద యోగ్యమా? అని ప్రశ్నిస్తూ, ఈ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్నామన్నారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్య ఈ బిల్లు అని వ్యాఖ్యానించారు. దీనికి నిరసనగా తాము అసెంబ్లీ లో నల్ల బ్యాడ్జీలను ధరించినట్టు పేర్కొన్నారు. ఈ వివాదాస్పద సవరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడానికి ఈ అసెంబ్లీ వేదికగా నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. మైనారిటీ ఇస్లామిక్ వక్ఫ్ బోర్డు స్వయంప్రతిపత్తిని నాశనం చేయడం, ఆ ప్రజలను బెదిరించే, భయాందోళనకు గురి చేసే కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతుందని ప్రకటించారు. పోరాడండి...పోరాడండి...అందులో విజయం సాధిస్తారు...రాజ్యాంగంపై దాడి చట్టబడ్డమా? అని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. ఈ సమయంలో అసెంబ్లీ వేదికగా నిరసన గళం మిన్నంటింది. కరతాళ ధ్వనులు మార్మోగాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్ట కార్యా చరణకు మద్దతు ఇస్తున్నట్టు పీఎంకే ప్రకటించడం విశేషం. ప్లకార్డులతో డీఎంకే సభ్యుల నిరసన వక్ఫ్ చట్ట సవరణ ముసాయిదా పార్లమెంట్ ఆమోదం పొందడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన అసెంబ్లీని తాకింది. కేంద్ర ప్రభుత్వానికి, ఆ చట్టానికి వ్యతిరేకంగా డీఎంకే, కూటమి పార్టీల ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. సచివాలయం ఆవరణలో బిల్లుకు, కేంద్రానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. సభలోకి సీఎం స్టాలిన్తో పాటూ డీఎంకే సభ్యులు, మిత్ర పక్ష సభ్యులు అందరూ నల్ల బ్యాడ్జీలను ధరించి సభకు హాజరయ్యారు. సభ వెలుపల డీఎంకే సభ్యులు అందరికి నల్లబ్యాడ్జీలను అందజేశారు. అన్నాడీఎంకే సభ్యులు నల్ల బ్యాడ్జీలను నిరాకరించారు. మరికొన్ని ప్రతిపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడుతామని, మద్దతు ఇస్తామని ప్రకటించాయి. అసెంబ్లీలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ నినాదం అందుకున్నారు. ఇందుకు డీఎంకేతో పాటూ కూటమి పార్టీల సభ్యులు గళాన్ని అందుకున్నారు. దీంతో వక్ఫ్చట్ట సవరణకు వ్యతిరేకంగా సభలో నినాదాలు మార్మోగాయి. ఈ సమయంలో బీజేపీ సభ్యులు డీఎంకే ప్రభుత్వ తీరును ఖండిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. -
టాస్మాక్ చర్చ!
● బెంచ్ల మార్పునకు పట్టు సాక్షి, చైన్నె : టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఈడీ సోదాల వ్యవహారం న్యాయ వర్గాలకు చిక్కుగా మారింది. ఈ కేసు విచారణ బెంచ్ మార్పు వ్యవహారం చర్చకు దారి తీసింది. వివరాలు.. చైన్నెలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో గత నెల 6వ తేది నుంచి 8వ తేది వరకు మూడు రోజులు ఈడీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. మద్యం విక్రయాలలో అక్రమాలు జరిగినట్టుగా పేర్కొంటూ ఈ సోదాలు జరిగాయి. ఇందులో రూ. 1000 కోట్ల మేరకు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఈడీకి చిక్కినట్టు సమాచారం వెలువడింది. ఈ వ్యవహారంలో ఈడీ తదుపరి అడుగులు వేయడానికి సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ప్రభుత్వం, అధికారుల తరపున హైకోర్టుకు పిటిషన్ చేరగా, ఎలాంటి చర్యలు తీసుకోకూడదని తొలుత కేసును విచారించిన న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, ఎం. సెంథిల్కుమార్ బెంచ్ ఆదేశించింది. మూడు వారాల పాటూ ఈ పిటిషన్ను విచారించిన బెంచ్ చివరకు తమకు వద్దే..వద్దు అంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీరామ్కు న్యాయమూర్తులు సూచించారు. దీంతో బెంచ్ మార్పు అనివార్యమైంది. చివరకు న్యాయమూర్తులు ఎస్ఎం సుబ్రమణియన్, కె రాజశేఖర్ బెంచ్కుమార్చారు. ఈ బెంచ్లోని న్యాయమూర్తి రాజశేఖర్, టాస్మాక్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మంత్రి సెంథిల్ బాలాజీ న్యాయవాది అన్నదమ్ముళ్లుగా తేలింది. దీంతో ఈడీ తరపున హాజరైన న్యాయవాది ఈ బెంచ్ను మార్చాలని పట్టుబట్టారు. ఈ కేసు తుది విచారణ ఏప్రిల్ 8,9 తేదీలలో జరుగుతాయని ప్రకటించారు. అదే సమయంలో గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీరామ్న్యాయమూర్తి మహ్మద్ షబిక్ బెంచ్ ముందు మంత్రి సెంథిల్ బాలాజీ తరపున హాజరైన న్యాయవాది బాలాజీ తన తరపు విజ్ఞప్తిని ఉంచారు. టాస్మాక్ కేసు విచారిస్తున్న జస్టిస్ రాజశేఖరన్ మంత్రి సెంథిల్ బాలాజీ న్యాయవాది సహోదరుడు అని, ఈ దృష్ట్యా, కేసును మరో బెంచ్కు అప్పగించాలని కోరారు. ఇందుకు సీజే బెంచ్స్పందిస్తూ, తాము జోక్యం చేసుకోబోమని, మరో బెంచ్ విచారణకు మార్చలేమని, అయితే సంబంధిత బెంచ్ న్యాయమూర్తుల వద్ద అప్పీల్ చేసుకోవచ్చు అని సూచించారు. ఇందుకు తగ్గ కసరత్తులలో ఓ వైపు ఈడీ తరపున, మరో వైపు సెంథిల్ బాలాజీ తరపున న్యాయవాదులు ప్రయత్నాలు చేపట్టడంతో టాస్మాక్ స్కాంలో మరో బెంచ్ ప్రవేశించేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. -
పంగుణి బ్రహ్మోత్సవ శోభ
● కపాలీశ్వరాలయంలో ధ్వజారోహణం ● 10 రోజుల పాటూ వేడుక సాక్షి, చైన్నె: చైన్నె మైలాపూర్లోని కపాలీశ్వరాలయంలో పంగుణి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. గురువారం ఈ ఉత్సవాలకు వేడుకగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. పది రోజుల పాటూ ఉత్సవాలు వేడుకగా జరగనున్నాయి. వివరాలు.. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శివాలయాల్లో చైన్నె మైలాపూర్లోని కపాలీశ్వర ఆలయం కూడా ఒకటి. కపాలీశ్వరుడిగా పరమ శివుడు, కర్పగం అంబాల్గా పార్వతీ దేవి ఇక్కడ కొలువై ఉన్నారు. మయూరం తరహాలో కూర్చుని పార్వతీ దేవి శివుడి కోసం తపస్సు చేసిన ప్రదేశం ఇది అని, అందుకే దీనిని మైలాపూర్ అని పిలవడం జరుగుతోందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ పల్లవ రాజు హయాంలో నిర్మించబడినట్టు పేర్కొన బడింది. ఈ ఆలయంలో ఏటా ఇక్కడ పంగుణి ఉత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. దీంతో ఆలయ పరిసరాలలో బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. ఈ ఏడాది ఉత్సవాలకు గురువారం ఉదయం ధ్వజారోహణం జరిగింది. ఉదయం నుంచి ఆలయంలో విశిష్ట పూజలను శివాచార్యులు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలంకరణలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఆవరణలో ధ్వజస్తంభం వద్ద పూజలు జరిగాయి. అభిషేకాది కార్యక్రమాలు జరిగాయి. గ్రామ దేవతకు జరిగిన పూజల తదుపరి ధ్వజారోహనం జరిగింది. ఈసమయంలో భక్తులు ధ్వజస్తంభంపై పుష్పాలను చల్లి శివ... శివ, నమ శివాయ అన్న నామస్మరణను మార్మోగించారు. మహాదీపారాదన జరిగింది. -
● సీపీఎం మహానాడులో సీఎం స్టాలిన్ ● కూటమిలో చీలికకు నో ఛాన్స్ అని స్పష్టీకరణ ● ఉమ్మడి పాలన కేంద్రానికి అలర్జీ
సాక్షి, చైన్నె: మీలో సగం నేనూ అంటూ మార్కిస్టు నేతలను ఉద్దేశించి సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. మదురై వేదికగా 24వ సీపీఎం జాతీయ మహానాడు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం ఉమ్మడిపాలన– ఇండియా బలం అన్న నినాదంతో మహానాడు చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో సీపీఎం నేతలు ప్రకాష్ కారత్, షణ్ముగం, బాలకృష్ణన్, కేరళ సీఎం పినరాయ్ విజయన్, కర్ణాటక ఉన్నత విద్యా మంత్రి సుధాకర్, మదురై ఎంపీ వెంకటేషన్, తమిళనాడు మంత్రులు మూర్తి, పీటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్, నటి రోహిణి, తదితరులు పాల్గొన్నారు. సీఎం ఎంకే స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ, ఉమ్మడి పాలనతో ఇండియాకు బలం అన్న ఈ నినాదం అందరీకీ ఆమోద యోగ్యమే అయినా, కేంద్రంలోని యూనియన్ ప్రభుత్వానికి అలర్జీగా అని ఎద్దేవా చేశారు. ఉమ్మడి పాలన అంటే వారికి అలర్జీ అన్నట్టుగా ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఉందన్నారు. సీపీఎం, డీఎంకే జెండాలలోని ఎరుపు రంగులను గుర్తు చేస్తూ, జెండాలోనే కాదు, ఇక్కడున్న వారందరీలోనూ తాము సగం భాగం అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ,మార్కిస్టుల మధ్య సిద్ధాంత పరంగా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, అందుకే తమ బంధం అన్నది అనాదిగా కొనసాగుతున్నట్టు గుర్తు చేశారు. కమ్యూనిజంను ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ అప్పట్లోనే తమిళంలో తర్జుమా చేయించారని గుర్తుచేస్తూ, దివంగత నేత కరుణానిధి సైతం తనను ఓ కమ్యూనిస్టుగా చూపించుకున్నారని వివరించారు. కార్ల్ మార్క్స్కు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు చైన్నెలో ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ‘మీలో సగం నేను...నా పేరు స్టాలిన్’ అని వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా కరతాళ ద్వనులుమార్మోగాయి. సిద్ధాంతపరంగా అందరూ ఒక్కటే, అందరికీ అన్నీ... సమ సమాజం నిర్మాణం లక్ష్యంగా డీఎంకే ఎన్నికల కూటమి ఆవిర్భవించిందన్నారు.మహానాడులో ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్, వేదికపై కేరళ సీఎం పినరాయ్ విజయన్, ప్రకాష్ కారత్ తదితర సీపీఎం నేతలుమార్పు అన్నది మ్యాజిక్ కాదు.. మార్పు అన్నది ఒక్క సారిగా జరగదని, ఇది మ్యాజిక్ కాదు అని, ప్రాసెస్ అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని సూచించారు. 2019లో బయలుదేరిన ఈ కూటమి బంధం మేరకు లక్ష్యాలు, ఎవర్ని , ఎందుకు వ్యతిరేకించాలో అన్న దృక్పథంతో ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ కూటమిలో చీలిక రాదా..? అని అనేక మంది ఆశతో ఎదురు చూస్తున్నారని, అయితే వారి కల అన్నది నెరవేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక్కడున్న వాళ్లు ఏ ఒక్కరూ అందుకు చోటు ఇవ్వరని వ్యాఖ్యానించారు. అనంతరం సీతారాం ఏచూరి పోరాటాలను గుర్తు చేస్తూ ఈప్రాంగణానికి ఆయన పేరు పెట్టడం మనస్సును పులకింప చేసిందన్నారు. ఉమ్మడి పాలనను అలర్జిగా మలుచుకుని రాష్ట్రాల హక్కుల కోసం గలం విప్పే వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న కేంద్రం చర్యలను సమిష్టిగా తిప్పి కొడుదామన్నారు. కేంద్రంలోని యూనియన్ ప్రభుత్వం రూపంలో తమిళనాడు సీఎంగా తాను, , పొరుగున, తన పక్కనే వేదిక మీదున్న కేరళ సీఎం పినరాయ్ విజయ్ అధిక నష్టాన్ని ఎదుర్కొంటున్నట్టు వ్యాఖ్యానించారు. రెండు మూడురోజుల్లో తమిళనాడుకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ సర్కారియాకమిషన్ సిఫార్సుల అమలు గురించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వివిధ చట్టాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను లాగేసుకుంటున్నారని, జీఎస్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక హక్కులను కాల రాశారని పేర్కొన్నారు. ఒక రాష్ట్ర అధికార పార్టీల రాష్ట్ర శాసనసభలలో ఆమోదించబడిన బిల్లులకు విరుద్ధంగా కేంద్రంలోని యూనియన్ ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయని మండి పడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరిస్తున్నారని, అక్కడి పార్టీలను విచ్ఛిన్నం చేస్తున్నారని , పార్టీ మారమని బలవంతం చేస్తున్నారని పేర్కొంటూ, మరోమాటలో చెప్పాలంటే, రాష్ట్రాలు అస్సలు ఉండకూడదన్న భావనతో ఈ యూనియన్ పాలకులు ఉన్నారని ధ్వజమెత్తారు. లోక్ సభ నియోజకవర్గాలపునర్విభజన వ్యవహారంపై జాయింట్ యాక్షన్ కమిటీలో చేసిన తీర్మానంపై పీఎంకు తాను లేఖ రాసినట్టు గుర్తు చేశారు. అయితే, దీనిపై ప్రధాని ఇంకా స్పందించలేదన్నారు. భారతదేశంలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ఒక సమాఖ్య వికసించి ఉందని, తద్వారా ప్రజాస్వామ్య శక్తులను సమీకరిస్తామని ప్రకటించారు. డీఎంకే, కమ్యూనిస్ట్ పార్టీలు ఒకే గొంతుకగా ఫాసిజాన్ని.. ఫాసిస్టులను ఒడించడమే లక్ష్యంగా ముందుకెళ్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
మహిళా సంరక్షణపై కరపత్రాలతో అవగాహన
వేలూరు: కోవై నుంచి తిరుపతికి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలులో గర్భవతిపై గత మార్చి 7వ తేదీన ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటూ రైలు నుంచి కింద తోసి వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైలులో ప్రయాణం చేసే మహిళలకు రక్షణ కోసం రైలులో ఏమైనా సమస్యలు ఏర్పడితే పోలీసులకు వెంటనే సమాచారం అందజేసేందుకు వాట్సాఫ్ గ్రూపు ఏర్పాటు చేయాలని రైల్వే పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాట్పాడి రైల్వే పోలీసు ఇన్స్పెక్టర్ చిత్ర ఆధ్వర్యంలో ప్రత్యేక వాట్స్ఆఫ్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఇందులో మహిళా ప్రయాణికులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు మొత్తం 210 మందితో కూడిన ప్రత్యేక గ్రూపును ప్రారంభించారు. వీటితో పాటూ మహిళా ప్రయాణికులకు ఏమైనా లైంగిక వేధింపులు జరిగినా వెంటనే సంబంధిత గ్రూపులోని నెంబర్కు వాట్సాప్లో సమాచారం అందజేస్తే వాటిపై వెంటనే చర్యలు తీసుకుంటామని అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం కరపత్రాలను రైల్వే ప్రయాణికులకు అందజేసి అవగాహన కల్పించారు. అదేవిధంగా రైలు బోగీలపై కరపత్రాలను అంటించారు. రైలు ప్రయాణం చేసే సమయంలో ప్రయాణికులు ఏమైనా ఇబ్బందులు జరిగినా వెంటనే సమాచారం అందజేయాలని కరపత్రాలను అందజేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ శ్యామల, సుమతి, ఉషారాణి, పద్మరాజ, రైల్వే పోలీసులు పాల్గొన్నారు. -
అకాల వర్షంతో పులకింత
ఏర్కాడు కొండ మార్గంలో నేలకొరిగిన భారీ వృక్షం వేసవిలో అకాల వర్షం పులకింతకు గురి చేసింది. చైన్నె శివారులలో గురువారం వేకువ జాము నుంచి చిరు జల్లులతో వర్షం పడింది. రాష్ట్రంలో అనేక చోట్ల వర్షం కురిసింది. ఈ వర్షాలు మరో నాలుగైదు రోజులు కొనసాగనున్నాయి. క్రమంగా వేసవి ప్రతాపం పెరుగుతున్న విషయం తెలిసిందే. భానుడు మరింతగా ఉగ్ర రూపం దాల్చే సమయంలో హఠాత్తుగా గురువారం అకాల వర్షంరాష్ట్రంలో పలు జిల్లాలను పలకరించింది. చైన్నె, శివారులలో చిరు జల్లుల వాన పడింది. ఆకాశం మేఘావృతంగా మారింది. కాసేపు కొన్ని చోట్ల జోరు వాన పడింది. వాతావరణం చల్లబడినట్టుగా పరిస్థితినెలకొంది. ఇక, రాష్ట్రంలో తిరువారూర్, ఈరోడ్, సేలం, తదితర ప్రాంతాలలో సైతం వర్షం పడింది. ఏర్కాడు మార్గంలో చెట్టు కూలడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. అయితే, ఉపరితల ఆవర్తనంకారణంగా ఈ వర్షం పడుతున్నట్టు ,మరో నాలుగైన రోజులు వాతావరణం చల్లగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొంటున్నారు. –సాక్షి, చైన్నె -
4 నెలల శిశువుకు.. కాలెయమార్పిడి!
సాక్షి, చైన్నె: నాలుగు నెలల శిశువుకు పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ను వడపళని కావేరి ఆస్పత్రి వైద్యులు విజయవంతం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద ఈ సంక్లిష్ట శస్త్ర చికిత్సను నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్సతో పిల్లలకు కాలేయ మార్పిడిని నిర్వహించగల సామర్థ్యం ఉన్న కేంద్రాలలో ఒకటిగా ఈ ఆస్పత్రి నిలిచినట్లయ్యింది. అరుదైన జన్యుపరమైన రుగ్మత , తీవ్రమైన కామెర్లు ప్రభావం బారీన పడ్డ 3.5 కిలోల బరువున్న శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో వడపళనిలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. కేసు అత్యవసరంగా ఉండటంతో, తమిళనాడు సీఎం పథకం కింద క్లియరెన్స్ సహా అవసరమైన అనుమతులను ఆసుపత్రి వర్గాలు త్వరితగతిన పూర్తి చేశారు. 10 రోజులలో కాలేయ మార్పిడికి సంబంధించిన శస్త్ర చికిత్సలకు సిద్ధమయ్యారు. తన బిడ్డకు తల్లి కాలేయం దానం చేయడానికి సిద్ధమైంది. సుమారు 110 గ్రాముల బరువున్న ఆమె కాలేయంలోని ఒక భాగాన్ని ఆమె బిడ్డకు విజయవంతంగా అమర్చారు. ఈ ప్రక్రియను వడపళనిలోని కావేరి ఆసుపత్రిలోపి లివర్ – మల్టీ–ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ స్వామినాథన్ సంబంధం కనిష్ట ఇన్వాసివ్ విధానంతో లాపరోస్కోపిక్–సహాయక దాత శస్త్రచికిత్సను ఉపయోగించి నిర్వహించారు. శస్త్రచికిత్స తర్వాత మూడు రోజులకే తల్లిని డిశ్చార్జ్ చేశారు ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్లు, పీడియాట్రిక్ అనస్థీషియాలజిస్టులు, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్లు, పీడియాట్రిక్ హెపటాలజిస్టులు, రేడియాలజిస్టులు , ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులతో కూడిన ప్రత్యేక బృందం ఈ శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. ప్రధానంగా 4 కిలోల బరువు , 6 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులలో పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్ప్లాంట్లు తీవ్రమైన శస్త్రచికిత్స సవాళ్లతో కూడుకున్నట్టు వైద్యులు వివరించారు. శిశువులలో రక్త నాళాలు చాలా చిన్నవిగా ఉంటాయని, ధమనులు 2 మిమీ వరకు , సిరలు 3 మిమీ వరకు ఉంటాయని వివరించారు. శిశువు చిన్న పరిమాణం కారణంగా, 110 గ్రాముల కాలేయని మార్పిడి శస్త్ర చికిత్స ద్వారా అమర్చడం చాలా సంక్లిష్టంగా జరిగినట్టు పేర్కొన్నారు. ఈ శస్త్ర చికిత్స త మిళనాడు ముఖ్యమంత్రి భీమా పథకం కింద విజయవంతంగా పూర్తి చేశామని ఈసందర్భంగా డాక్టర్ స్వామినాథన్ సంబంధం తెలిపారు. ఆస్పత్రి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మాట్లాడుతూ, సంక్లిష్టమైన విధానాలలో తమ ఆస్పత్రి ప్రత్యేక బృందం నైపుణ్యం, అధునాతన పద్ధతులను అనుసరిస్తున్నట్టు వివరించారు. -
ప్రాణ రక్షణ కోసం బ్లడ్ బ్యాంక్
సాక్షి, చైన్నె: అత్యవసర పరిస్థితులలో ఉన్న పేదలు, మధ్య తరగతి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు మొగప్పేర్లో మద్రాసు మెడికల్మిషన్, శివ ప్యారి బాయ్ బ్రిజ్ లాల్ ధూత్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ఎంఎంఎం–బ్రిజ్ లాల్ రామ్నాథ్ ధూత్ రోటరీ బ్లడ్ బ్యాంక్ పేరిట దీనిని ఏర్పాటు చేశారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయల కల్ప, పాణ రక్షణ అంశాలకు మద్దతు నిలిచే విధంగా ఈ బ్లడ్ బ్యాంక్తో పాటుగా ఇక్కడి సేవలు ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రోటరీ, ఎంఎంఎం, ఆ ట్రస్టు ప్రతినిధులు,నిర్వాహకులు ఇషాక్ నాజర్, వీణా జహ్హవీర్, ఎస్ మహావీర్ బోత్రా, డాక్టరుల జాకబ్ రాయ్ , క్రిసోఫర్ రాయ్, సెంథిల్కుమార్, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రక్త దాతలను సత్కరించారు. -
వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి
వేలూరు: వేలూరు జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పాటూ కొన్ని ప్రాంతాల్లో తాగునీటి బోర్లు కూడా ఎండి పోవడంతో జిల్లావ్యాప్తంగా ఎక్కడా నీటి సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. వేలూరు జిల్లా గుడియాత్తం మున్సిపాలిటీ పరిధిలోని వినాయకపురం నుంచి మున్సిపాలిటీకి సరఫరా చేస్తున్న తాగునీటి పైపులైన్లను ఆమె తనిఖీ చేశారు. వేసవిలో నీటి సమస్య లేకుండా చూడాలని పంచాయతీలోని నిధులు తాగునీటికి మాత్రమే ఉపయోగించాలని ఇప్పటికే ఆయా బ్లాకు డెవలప్మెంట్ అధికారులకు, గ్రామ సర్పంచ్లకు తెలియజేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం గుడియాత్తం ప్రాంతంలో అమృత్ 2.0 పథకం కింద రూ: 1,292 లక్షల వ్యయంతో తాగునీటి ట్యాంకు పైపులైన్ తదితర వాటిని ఏర్పాటు చేసి మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు సరఫరా చేస్తున్నామన్నారు. నీటిని వృథా చేయకుండా సంబంధిత అధికారులు తరచూ పైపులైన్లను తనిఖీ చేయాలన్నారు. అనంతరం గుడియాత్తంలోని మున్సిపల్ పాఠశాలకు వెల్లి విద్యార్థులకు అవసరమైన వసతులున్నాయా తాగునీటి సదుపాయం కల్పించారా? అని తనిఖీ చేయడంతో పాటూ వసతులపై విద్యార్థుల వద్ద అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్తో పాటూ గుడియాత్తం మున్సిపల్ కమిషనర్ మంగయకరసర్, తహసీల్దార్ మెర్లిన్ జ్యోతిక అఽధికారులున్నారు. -
ఈ–పాస్ విధానాన్ని పునఃసమీక్షించాలి
● మద్రాసు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ సేలం: ఊటీ, కొడైకెనాల్లలో పర్యాటక వాహనాల రాకపోకలను పరిమితం చేస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వారాంతాల్లో, సెలవు దినాల్లో, ఊటీ, కొడైకెనాల్ వంటి పర్యాటక ప్రదేశాలకు వచ్చే పర్యాటక వాహనాలు భారీ ట్రాఫిక్ రద్దీని కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో పర్యాటక వాహనాలపై ఆంక్షలు విధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ఊటి, కొడైకెనాల్ పర్యాటక ప్రదేశాలకు ఎంత మంది పర్యాటకులను అనుమతించవచ్చనే దానిపై ఐఐటీ మద్రాస్, ఐఐఎం బెంగళూరు ఒక అధ్యయనం నిర్వహించాయి. ఆ నివేదిక రావాల్సి ఉంది. వారాంతపు రోజుల్లో 8వేల వాహనాలను ఊటీకి అనుమతించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది, అయితే వారాంతపు రోజుల్లో 4వేలు వాహనాలను మాత్రమే కొడైకెనాల్కు అనుమతించాలని ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు సతీష్ కుమార్, భరత చక్రవర్తితో కూడిన ధర్మాసనం స్థానిక వాహనాలపై ఎటువంటి ఆంక్షలు విధించవద్దని జిల్లా యంత్రాంగాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఈ–పాస్ విధానం బుధవారం అమల్లోకి వచ్చింది. ఈ–పాస్ విధానం పర్యాటక పరిశ్రమను స్థానిక ప్రజల సాధారణ జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని ఆరోపిస్తూ, వ్యాపార అసోసియేషన్ బుధవారం ఊటీ, కొడైకెనాల్లో దుకాణాలను మూసివేత నిరసన తెలిపారు. ఈ పరిస్థితిలో, ఈ–పాస్ విధానానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను మరోమారు సమీక్షించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం గురువారం మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఊటీలోకి అనుమతించే వాహనాల సంఖ్యను ఐఐటీ, ఐఐఎంల అధ్యయన నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయించవచ్చునని, ప్రస్తుత వాహన పరిమితుల వల్ల స్థానిక ప్రజలు ప్రభావితమవుతున్నందున ఈ ఉత్తర్వును పునఃసమీక్షించాలి అభ్యర్థిస్తున్నట్టు పిటిషన్లో కోరారు. పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
ఉచిత ఇంటి పట్టాల పంపిణీపై డీఆర్ఓ తనిఖీ
తిరుత్తణి: తిరుత్తణిలో పోరంబోకు స్థలాల్లో నివాసముంటున్న వారిలో అర్హులకు ఉచిత ఇంటి పట్టాలు పంపిణీకి సంబంధించి డీఆర్ఓ గురువారం తనిఖీ చేశారు. వివరాలు.. తిరుత్తణి పట్టణంలోని ఇంద్రానగర్, పెరియార్ నగర్, నెహ్రూ నగర్ ప్రాంతాలతో పాటూ పట్టణ శివార్లలోని గ్రామాల్లో కొండ, గుట్టల పోరంబోకు స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని అనేక మంది చాలాకాలంగా నివాసముంటున్నారు. అలాంటి వారికి ఉచిత ఇంటి పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వ సాయం పొందలేక ఇబ్బందులు చెందుతున్నారు. ఈక్రమంలో అభ్యంతరం లేని పోరంబోకు స్థలాల్లో నివాసముంటున్న వారికి ఉచిత ఇంటి పట్టాలు పంపిణీకి సంబంధించి సీఎం స్టాలిన్ ఆదేశించారు. దీంతో తిరుత్తణి పట్టణంతో పాటూ శివారులో పోరంబోకు స్థలంలో నివాసముంటున్న దాదాపు 1500 మందికి సంబంధించి రెవెన్యూ శాఖ అధికారులు వివరాలు సేకరించి కలెక్టర్కు నివేదిక సమర్పించారు. గతవారం తిరుత్తణిలో పోరంబోకు స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్న వారికి సంబంధించి కలెక్టర్ తనిఖీ చేశారు. దీంతో అర్హులు ఎంపిక ఊపందుకుంది. ఈక్రమంలో గురువారం డీఆర్ఓ రాజ్కుమార్ తిరుత్తణిలోని ఇంద్రానగర్, శివారులోని కార్తికేయపురంలో పోరంబోకు ఇళ్లలను పరిశీలించి కుటుంబీకుల వద్ద వివరాలు సేకరించారు. త్వరలో అర్హుల ఎంపిక పూర్తిచేసి ఉచిత ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఆర్డీఓ దీప, తహసీల్దారు మలర్విళి, ఆర్ఐ గణేష్కుమార్ సహా అనేక మంది పాల్గొన్నారు. -
జో చిత్ర దర్శకుడితో హిప్ హాప్ ఆది
తమిళసినిమా: సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హిప్ హాప్ ఆది ఆ తరువాత కథానాయకుడిగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఈ రెండు రంగాల్లోనూ రాణిస్తున్నారు. కాగా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం కడైసీ ఉలగ పోర్. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే ఆ తరువాత పలువురు దర్శకులు కథలు చెప్పినా నచ్చక పోవడంతో ఏ దర్శకుడికి పచ్చజెండా ఊపలేదు. అలాంటిది తాజాగా దర్శకుడు హరిహరన్ రామ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈయన ఇంతకు ముందు జో వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. హరిహరన్ రామ్ చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే నటించడానికి సమ్మతించారట. కాగా ప్రమోద్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. చిత్ర షూటింగ్ ను జూన్ నెలలో ప్రారంభించనున్నట్లు ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసింది. కాగా ఇందులో హిప్ హాప్ ఆదికి జంటగా ఒక ప్రముఖ కథానాయికితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం మూక్కుత్తి అమ్మన్– 2 చిత్రానికి సంగీతాన్ని అందించే పనిలో బిజీగా ఉన్న హిప్ హాప్ ఆది ఈ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది.ఈ చిత్రం అయినా మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. తమిళసినిమా: పుష్ప – 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్. ఇండియన్ సినిమా చరిత్రలోనే కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టిన చిత్రం పుష్ప 2. దీంతో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించే తదుపరి చిత్రం మామూలుగా ఉండకూడదు. అది కచ్చితంగా పాన్ ఇండియా చిత్రం అయ్యే ఉండాలి. దీంతో నటుడు అల్లు అర్జున్ అలాంటి చిత్రం వైపే నడుస్తున్నారు. అందులో భాగంగానే కోలీవుడ్ యువ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. రాజారాణి చిత్రంతో దర్శకుడిగా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అట్లీ. తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత నటుడు విజయ్ హీరోగా వరుసగా మెర్సల్, బిగిల్, తేరి చిత్రాలు చేసి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి నటుడు షారుఖ్ ఖాన్ కథానాయకుడుగా జవాన్ చిత్రాన్ని చేశారు. నయనతార దీపిక పడుకొనే హీరోయిన్గా నటించిన అందులో తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్గా పరిచయం చేయడం విశేషం. అంతే కాకుండా జవాన్ చిత్రాన్ని స్వయంగా నటుడు షారుక్ ఖాన్ నిర్మించడం మరో విశేషం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత మోగించింది. అలా అట్లీ దర్శకత్వం వహించిన చిత్రాలు ఒకదాని మించి ఒకటి విజయం సాధించాయి. అలాంటి దర్శకుడు తాజాగా అల్లు అర్జున్ కథానాయకుడుగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడకపోయినా వీరి సంచలన కాంబో షురూ అయిందంటున్నారు. సినీ వర్గాలు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందిన చిత్రంలో కథానాయకిగా మరో పాన్ వరల్డ్ నటి ప్రియాంక చోప్రాను నాయకిగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రం నటించడానికి ఆమె రూ.30 నుంచి 40 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు గాని ఆమె గనుక నటిస్తే ఈ చిత్రం వేరే లెవల్ కు వెళుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటుడు అల్లుఅర్జున్, దర్శకుడు అట్లీ -
నమ్మలేకపోతున్నా..!
తమిళసినిమా: ఎక్కడో కర్మాటకలోని ఒక మారు మూల గ్రామాల్లో పుట్టి పెరిగిన నటి రష్మికా మందన్నా. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా కిరాక్ పార్టీ చిత్రం ద్వారా కథానాయికిగా రంగప్రవేశం చేసి తొలి చిత్రంతోనే హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక సక్సెస్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దెబ్బతో కన్నడం, తెలుగు భాషల దర్శక నిర్మాతలు దృష్టిలో పడ్డారు. అలా తెలుగులో ఛలో చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో ఈ అమ్మడి అందానికి ప్రేక్షకులు గులాం అయ్యారు. ఇక ఆ తరువాత నటించిన గీత గోవిందం చిత్ర విజయం రష్మికను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. అంతే భారీ చిత్రాల అవకాశాలు ఈ అమ్మడిని చుట్టు ముట్టడం మొదలెట్టాయి.అలా రష్మికా మందన్నా నటుడు అల్లు అర్జున్తో జత కట్టిన పుష్ప ఆమెను నేషనల్ క్రష్ గా మార్చింది. అంతే దెబ్బతో బాలీవుడ్ ను టచ్ చేశారు. అక్కడ తొలి చిత్రం గుడ్ బై చిత్రంలోని అమితాబ్ బచ్చన్ వంటి బిగ్బీ తో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ తరువాత నటించిన యానిమల్, ఛావా చిత్రాలు అగ్ర కథానాయకిగా మార్చాయి. కోలీవుడ్ లోకి సుల్తాన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. విజయ్ సరసన ద్విభాషా చిత్రం వారిసులో నటించారు. అయితే ఇక్కడ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. ఏదేమైనా చాలా తక్కువ కాలంలోనే నేషనల్ క్రష్ గా మారిన రష్మికా మందన్నా ఈ నెల 5 న పుట్టిన రోజు. తాను 28 సంవత్సరానికి గుడ్ బై చెప్పి 29వ ఏట అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఇన్ స్ట్రాగామ్ ఒక పోస్ట్ పెట్టారు. అందులో ‘‘ ఇది నా పుట్టిన రోజు మాసం. అందువల్ల చాలా ఉత్సాహంగా ఉన్నాను. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ పుట్టినరోజు వేడుకలపై ఆసక్తి తగ్గుతుంది. అయితే నాకు మాత్రం ఆసక్తి పెరుగుతూనే ఉంది. నేనిప్పుడు 29వ ఏట అడుగుపెడుతున్నానున్నది నమ్మలేక పోతున్నాను. గత ఏడాది ఆరోగ్యంగా, ఆనందంగా, సురక్షితంగా దాటేయడంతో చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సమయంలో నా పుట్టిన రోజు వేడుకను జరపుకోకుండా ఉంటానా?’’‘ అని పేర్కొన్నారు. దీంతో రష్మికా మందన్నా పోస్ట్కు నెటిజన్లు నుంచి లైక్ల వర్షం కురిపిస్తున్నారు. రష్మిక మందన్న -
ఈ–పాస్ రద్దు చేయాలి
● ఊటీ, కొడైకెనాల్లలో 20 వేల దుకాణాలు మూత ● పర్యాటకులకు తప్పని పాట్లు ● అమ్మ క్యాంటిన్లు కిటకిట సేలం: నీలగిరి జిల్లాలోని ఊటీ, కొడైకెనాల్ పర్యాటక కొండ ప్రాంతాలలో ఈ–పాస్ విధానం మంగళవారం నుంచి అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నీలగిరి జిల్లాలోని వ్యాపారులు బుధవారం పూర్తి స్థాయి బంద్ చేపట్టారు. తమిళనాడులో వేసవి ప్రారంభం కావడంతో, ప్రజలు పర్యాటక ప్రదేశాలకు తరలిరావడం ప్రారంభించారు. దీంతో నీలగిరి, కొడైకెనాల్ ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఈ కారణంగా, ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ–పాస్ల కోసం నమోదు చేసుకునే విధానాన్ని గత ఏడాది ప్రవేశపెట్టారు. ఈ ఏడాది కూడా ఈ–పాస్ విధానాన్ని ప్రవేశపెట్టారు, మంగళవారం నుంచి ఊటీ ప్రాంతంలో సొంత లేదా అద్దె వాహనాల్లో ప్రయాణించే పర్యాటకులను వారాంతాల్లో ఈ ప్రాంతంలోకి అనుమతించాలని, వారాంతాల్లో గరిష్టంగా 8వేల వాహనాలను, వారపు రోజుల్లో 6వేల వాహనాలను అనుమతించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. వ్యాపారుల సమ్మె దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొంటూ వ్యాపారుల సంఘం 24 గంటల బంద్కు పిలుపునిచ్చింది. దీని తరువాత, ఈ–పాస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు మంగళవారం ఒక రోజు పూర్తి బంద్లో చేశారు. తేయాకు రైతుల నుంచి గ్రీన్ టీ ఆకులకు కనీస ధర, ఊటీ, కూనూరు మున్సిపల్ మార్కెట్ వ్యాపారుల డిమాండ్లను నెరవేర్చడం, ప్లాస్టిక్ నిషేధ చట్టానికి ప్రత్యామ్నాయ నిబంధన వంటి 13 అంశాల డిమాండ్ల కోసం ఒత్తిడి చేస్తున్న ఈ నిరసనలో జిల్లా అంతటా 20వేల దుకాణాలను మూసివేశారు. పర్యాటకుల పాట్లు.. ఈ కారణంగా బుధవారం ఊటీ, కున్నూరు, కోత్తగిరి, గూడలూరు, కొడైకెనాల్, పట్టణ ప్రాంతాలు దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పర్యాటక వాహనాలు పనిచేయకపోవడంతో నిర్మానుష్యంగా మారాయి. ఇంకా, నీలగిరి జిల్లాను సందర్శించే పర్యాటకులు, స్థానికులు ఆహారం, పాలు లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అమ్మ క్యాంటీన్లలో ఆహారం కోసం ఎగబడ్డారు. జిల్లా వ్యాప్తంగా అమ్మ క్యాంటీన్లు కిటకిటలాడాయి. బంద్ కారణంగా మూడపడిన దుకాణాలు, నిర్మానుష్యంగా ఊటీ -
బైక్ను ఢీకొన్న కారు
● ముగ్గురు దుర్మరణం ● తిరుపోరూర్లో ఘటన సేలం: తిరుపోరూర్ సమీపంలో బైక్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. కేళంబాక్కం సమీపంలోని తయ్యూరు పలమానగర్ ప్రాంతానికి చెందిన హరిదాస్ (34) ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. ఇతని భార్య సుగంధి (33). వీరి కుమారులు లియో డేనియల్ (10), జో డేనియల్ (5). ఈక్రమంలో హరిదాస్ భార్య, ఇద్దరు కుమారులను ఒకే బైక్లో తిరుపోరూర్ సమీపంలోని కయార్ గ్రామంలోని అత్తమామల ఇంటికి మంగళవారం సాయంత్రం వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి నలుగురు ఒకే బైక్లో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరారు. తైయూర్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాల వద్ద వెళుతుండగా ఆమార్గంలో వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొంది. ఈప్రమాదంలో హరిదాస్, కుమారుడు లియో డేనియల్ సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్న సుగంధి, చిన్న కుమారుడు జో డేనియల్లను స్థానికులు కేలంబాక్కంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సుగంధి మృతిచెందింది. జో డేనియల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా, కారు డ్రైవర్ కాయర్ గ్రామానికి చెందిన అశ్విన్ కుమార్ (43), భార్య బిందు (35), వారి కుమారుడు అభినేష్ పాల్మోని (6) కారులో ఉన్నారని తేలింది. అశ్విన్ కుమార్ కేలంబాక్కంలో ఒక షూ దుకాణం నడుపుతున్నాడు. మంగళవారం రాత్రి దుకాణం వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అశ్విన్ కుమార్, భార్య, కుమారుడు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఈముగ్గురిని కేలంబాక్కంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘనంగా మార్గబందేశ్వరాలయ బ్రహ్మోత్సవాలు
వేలూరు: వేలూరు జిల్లా విరింజిపురంలో వెలిసిన మార్గ బందేశ్వరాలయ బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తమిళ పంగుణి ఉత్తర మాసంలో ప్రతి సంవత్సరం ఆలయ బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఆలయ ఈఓ ప్రియ ఆధ్వర్యంలో శివాచార్యులు వేద మంత్రాల నడుమ ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, పుష్పాలంకరణలు చేసి దీపారాధన పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖ ద్వారంలో ఉన్న వెండి ధ్వజస్తంభానికి పూజలు చేసి పుష్పాలంకరణలు చేసి వేద మంత్రాల నడుమ హరోంహరా నామ స్మరణాల మధ్య ధ్వజారోహణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారు వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ధ్వజారోహణ పూజల్లో దేవదాయ శాఖ జిల్లా చైర్మన్ అశోక్ కుమార్, రత్నగిరి బాలమురుగన్ స్వామీజీ పాల్గొని ధ్వజస్తంభానికి కర్పూర హారతులు పట్టి పూజలు చేశారు. ముందుగా స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేసి దీపారాధన పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి ధ్వజస్తంభం వద్ద ఉంచారు. తులవర్ బ్రహ్మణ సంఘం అధ్యక్షుడు పాండియన్, కార్యదర్శి రామలింగం, కోశాధికారి సెల్వకుమార్, జాయింట్ కార్యదర్శి జ్ఞానవేల్, హరిక్రిష్ణన్ పాల్గొన్నారు. -
పోలీసు తూటాకు మరో రౌడీ హతం
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో రౌడీల ఏరివేతలో ఎన్కౌంటర్ల పర్వం కొనసాగుతోంది. వారం వ్యవధిలో నాలుగో ఎన్కౌంటర్ బుధవారం జరిగింది. కడలూరులో పోలీసు తూటాలకు పుదుచ్చేరి రౌడీ మొట్టై విజయ్ (19) హతమయ్యాడు. గత బుధవారం (మార్చి 26 ) చైన్నెలో ముంబయి ఇరానీ దొంగల ముఠాకు చెందిన జాఫర్ గులాం హుస్సైన్ను పోలీసు ఎన్కౌంటర్లో మట్టు బెట్టిన విషయం తెలిసిందే. ఆ తదుపరి మదురైలో రౌడీ సుభాష్ చంద్ర బోస్ను ఎన్కౌంటర్లో హతం చేశారు. తేనిజిల్లా ఉసిలం పట్టిలో పోలీసును హతమార్చిన గంజాయి వ్యాపారి పొన్ వణ్ణన్ కంబం కొండలలో ఎన్కౌంటర్ ద్వారా మట్టుబెట్టారు. ఈ ఎన్కౌంటర్లు రౌడీల గుండెల్లో గుబులు రేపాయి. రౌడీల ఏరివేతలో ఓ వైపు ఎన్కౌంటర్, మరో వైపు తుపాకీతో కాల్చి పట్టుకోవడం వంటి ప్రక్రియతో పోలీసులు దూకుడు పెంచారు. దీంతో రౌడీలు పొరుగు రాష్ట్రాలకు పారి పోయే పనిలో పడ్డారు. ఈపరిస్థితులలో బుధవారం మధ్యాహ్నం కడలూరులో మరో ఎన్కౌంటర్ జరిగింది. పుదుచ్చేరికి చెందిన రౌడీ మొట్టై విజయ్ (19) మీద సుమారు 30 కేసులు ఉన్నాయి. ఇతడి కోసం ఓ వైపు పుదుచ్చేరి పోలీసులు గాలిస్తూ వస్తున్నారు. ఇతగాడు పుదుచ్చేరి నుంచి తప్పించుకుని పొరుగున ఉన్న తమిళనాడుకు చెందిన కడలూరులోకి ప్రవేశించారు. ఎం పుదూర్ ప్రాంతంలో రౌడీ మొట్టై విజయ్ ఉన్న సమాచారంతో కడలూరు పోలీసులు గోపి, గణపతి బృందం పట్టుకునేందుకు వవెళ్లింది. వీరిపై విజయ్ కత్తితో దాడి చేశారు. గోపి, గణపతి చేతికి గాయాలు అయ్యాయి. దీంతో ఆత్మరక్షణ కోసం శివపై తుపాకీ ఎక్కు బెట్టారు. తుపాకీ తూటాలకు అతడు నేలకొరిగాడు. విజయ్ ఎన్కౌంటర్లో మరణించిన సమాచారాన్ని పుదుచ్చేరి పోలీసులకు కడలూరు పోలీసులు చేర వేశారు. అతడి మృతదేహాన్ని కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ పోలీసులకు చికిత్స అందించారు. సమాచారం అందుకున్న కడలూరు జిల్లా ఎస్పీ జయకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. గాయపడ్డ పోలీసులను పరామర్శించారు. -
కారులో గంజాయి తరలింపు
● ఐదుగురి అరెస్ట్ వేలూరు: ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి రాణిపేట మీదుగా చైన్నె, బెంగళూరు ప్రాంతాలకు గంజాయి, మత్తు పదార్థాలను తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రాణిపేట మీదుగా మత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు రాణిపేట పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాణిపేట, ఆర్కాడు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వాహన తనఖీలు నిర్వహించారు. తనిఖీల్లో చైన్నెకి వెళుతున్న రెండు కార్లను పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీల్లో గోనె సంచిలో గంజాయి, మత్తు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. కారుతో పాటు మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ జరపగా అందులో రెండు కార్లలో 210 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో రాణిపేట జిల్లా ఆర్కాడు ప్రాంతంలో వచ్చిన ఒక కారును తనఖీ చేయగా అందులో 120 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు మూడు కార్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారులో ఉన్న యువకులను విచారణ జరపగా ఒడిశా రాష్ట్రానికి చెందిన గుప్తా శరన్ సాహు, సుధీర్ ఆల్పెరియా, తోపత్తాదాస్, రోల్మాజీ, గౌరవ్ అని తెలిసింది. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉల్లాసంగా..ఉత్సాహంగా
● జంబుకేశ్వర ఆలయ ఏనుగు జలకాలాట ● వేసవి తాపం తగ్గేందుకు ప్రత్యేక ఏర్పాట్లు సేలం: వేసవి వేడి తగ్గేందుకు ఏర్పాటు చేసిన కొలనులో జంబుకేశ్వర ఆలయ ఏనుగు ఉల్లాసంగా ఉత్సాహంగా జలకాలాడుతోంది. ఈ ఏడాది రాష్ట్రంలో మార్చి చివరి నుంచే వేసవి వేడి ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో తిరుచ్చిలో గత రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రత 104 డిగ్రీలు నమోదు కావడంతో, వేసవి వేడిమి, వడదెబ్బతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితిలో, పక్షులు, జంతువులు సహా వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కాగా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో ప్రముఖమైనది తిరుచ్చిలోని తిరువనైక్కవల్ జంబుకేశ్వరర్ ఆలయం. ఇందులో అఖిల అనే ఏనుగు 2011 నుంచి సేవ చేస్తోంది. ఈ ఆలయంలో కావేరి నది నుంచి ఒక ఏనుగు నీటిని తీసుకొచ్చి శివుడిని పూజించిందని చరిత్రలో చెప్పబడింది. ఈ కారణంగా ప్రతి కాలపూజ సమయంలో ఆలయ ఏనుగు అఖిల తీసుకొచ్చే పవిత్ర జలంతో శివుడికి అభిషేకం చేస్తారు. ఏనుగులు నీటిని చూసినప్పుడు సహజంగానే ఉత్సాహంగా ఉంటాయి, జంబుకేశ్వరర్ ఆలయ సముదాయంలోని నాచియార్ గ్రోవ్ ప్రాంతంలో 20 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు గల చుట్టుపక్కల గోడతో స్నానపు తొట్టిని నిర్మించారు. ఎండ తీవ్రత పెరిగిన స్థితిలో ఆలయ ఏనుగు అఖిలకు వేసవి తాపం తగ్గే రీతిలో ఏర్పాటు చేసిన ఈ తొట్టెలో ఉల్లాసంగా ఉత్సాహంగా జలకాలాడుతోంది. -
చందన కాపు అలంకరణ తొలగింపు
తిరువొత్తియూరు: ఉత్తరకోసమంగై ఆలయ కుంబాభిషేకాన్ని పురస్కరించుకొని మరకత నటరాజ స్వామికి చందన కాపు అలంకరణను తొలగించారు. 3 రోజుల వరకు భక్తులు నటరాజ స్వామిని దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. వివరాలు.. రామనాథపురం జిల్లా, తిరు ఉత్తకోసమంగైలో మంగళనాథర్ దేవాలయం ఉంది. 15 ఏళ్ల తర్వాత ఈ ఆలయంలో 4వ తేదీన కుంభాషేకం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కుంభాభిషేకం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయంలో కొలువై ఉన్న అరుదైన మరకత నటరాజ మందిరాన్ని మంగళవారం అర్ధరాత్రి తెరిచి, మరకత నటరాజ విగ్రహానికి పూసిన చందనాన్ని తొలగించారు. అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. ఆరుద్ర దర్శన పండుగ సందర్భంగా, సంవత్సరంలో ఒక రోజు మాత్రమే మరకత నటరాజ మందిరం తెరవబడి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ ఏడాది జనవరి 12వ తేదీన తిరు ఉత్త కోసైమంగై ఆలయంలో మరకత నటరాజ క్షేత్రాన్ని భక్తులు దర్శించుకున్నారు. మరకత నటరాజ క్షేత్రం కుంభాభిషేకం సందర్భంగా 4 రోజుల పాటు తెరిచి ఉండడంతో తమిళనాడులోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారని అంచనావేశారు. -
తమిళంలో పేరు బోర్డులు తప్పనిసరి
● మే 15 వరకు గడువుసాక్షి, చైన్నె: తమిళంలో పేరు బోర్డులు లేకపోతే చర్యలు తప్పదని ప్రభుత్వం ప్రకటించింది. మే 15 వరకు గడువు విధిస్తూ బుధవారం అధికారులు ప్రకటన విడుదల చేశారు. వివరాలు.. చైన్నె, మదురై, తిరుచ్చి కోవై, తిరునెల్వేలి వంటి ముఖ్య నగరాలలో తమిళంలో పేరు బోర్డులు ఖచ్చితంగా ఉంచాలని, దాన్ని క్రమంగా పాటించాలని, ఆ విధంగా పాటించని దుకాణాలపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో సూచించింది. నగరాలలోని వ్యాపార సంస్థలు, దుకాణాలు, మాల్స్ , విద్యాలయాలు, ఇలా...తదితర అన్ని రకాల వ్యాపార సంబంధిత కార్యాలయాల నేమ్ బోర్డుల్లో పేర్లు పెద్దవిగా తమిళ అక్షరాలలోను, దానికంటే చిన్న అక్షరాలలో ఆంగ్లం లేదా ఇతర భాషలు ఉండాలన్న ఆదేశాలు జారీ చేసింది. అయితే దీన్ని వ్యాపారులు పాటించడం లేదు. అయితే తమిళ అక్షరాలు అతి చిన్నవిగాను, ఇంగ్లీషు అక్షరాలు అతి పెద్దవిగాను అనేక నేమ్ బోర్డులు కనిపిస్తుంటాయి. దీనికి సంబంధించి అధికారులు పరిశీలన చేపట్టారు. తమిళం బోర్డులు పూర్తి స్తాయిలో లేక పోవడాన్ని పరిగణించారు. దీంతో మే 15లోపు అన్ని చోట్ల తమిళ బోర్డులు తప్పనిసరి అని, లేని పక్షంలో చర్యలు తప్పదన్న హెచ్చరికలు జారీ చేశారు. ఇక చైన్నె విషయానికి వస్తే 70 వేల దుకాణాలు లైసెన్స్ పొంది నిర్వహిస్తున్నాయి.ుు వీటిలో ప్యారిస్, సౌకార్పేట వంటి ప్రాంతాలలో ఉన్న దుకాణాలలో తమిళ నేమ్ బోర్డులు లేనట్టు సమాచారం. తమిళంలో నేమ్ బోర్డులు పెట్టని దుకాణాలకు వివరణ కోరుతూ నోటీసులు పంపించాలని చైన్నె కార్పొరేషన్ఇప్పటికే నిర్ణయించింది. ఏతు బోర్డులను సరి చేయకుంటే లైసెన్స్ను రద్దు చేసే విధంగా హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అదే సమయంలో చైన్నె నగరంలోని రోడ్లు, వీధులలో బోర్డులన్నీ తమిళం, ఆంగ్లంలో ఉండే విధంగా ఇప్పటికే పనుల వేగాన్ని పెంచిన విషయం తెలిసిందే. అలాగే కొన్ని తెలుగుపేర్ల వెనుక తమిళ అక్షరాన్ని కలిపి తమిళ పేర్లుగానే వాటిని మార్చేస్తుండడం గమనార్హం. -
● ఐఐటీ హ్యాపీనెస్
ఐఐటీ మద్రాసు రేఖీ ఫౌండేషన్ నేతృత్వంలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్ను ఏర్పాటు చేశారు. ఇది విద్యాపరంగా పాఠ్యాంశాలలో ఆనంద శాస్త్రం, అధ్యయనాలను సమగ్రపరచడం వంటి అనేక అంశాలపై దృష్టి పెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు బుధవారం జరిగాయి. రేఖి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సతీందర్ సింగ్రేఖి, ఐఐటీ మద్రాసు డీన్ ప్రొఫెసర్ మను సంతానం, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ కామకోటి సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ప్రొఫెసర్ తేన్మొళి, ప్రొఫెసర్ రూపశ్రీ బరాల్, ప్రొఫెసర్ శ్రీనివాసన్ పాల్గొన్నారు. – సాక్షి, చైన్నె సెయిలింగ్ పోటీలు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్లతో సెయిలింగ్ పడవ పోటీలు చైన్నె–నాగపట్టణం మధ్య పూంపుహార్ హార్బర్ వద్ద జరిగాయి. రాయల్ మద్రాస్ యాచ్ట్ క్లబ్ సౌజన్యంతో సాగిన ఈ పోటీల్లో ఎన్సీసీ మహిళా క్యాడెట్లు సైతం తమ ప్రతిభను చాటారు. –సాక్షి, చైన్నె ఐజేయూ సమావేశాలు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సమావేశాలు చైన్నెలో బుధవారం ప్రారంభమయ్యాయి. వేప్పేరిలోని వైఎంసీఏ మినీ ఆడిటోరియం వేదికగా ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన గురువారం కూడా ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు సమావేశాన్ని సినీ నటి గౌతమి, సీనియర్ జర్నలిస్టు శశికళ రవీంద్ర దాస్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, తమిళనాడు జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు డీఎస్ఆర్ సుభాష్తోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన ఐజేయూ ప్రతినిధులు, నిర్వాహకులు సమావేశానికి హాజరయ్యారు. – సాక్షి, చైన్నె కాలువలో శిశువు మృతదేహం అన్నానగర్: చైన్నె పట్టినంబాక్కం మసీదు వీధి సమీపంలోని కాలువలో ఓ శిశువు మృతదేహం బుధవారం ఉదయం లభ్యమైంది. ప్లాస్టిక్ పేపర్లో చుట్టి ఉన్న శిశువు మృతదేహాన్ని చూసి ఆ ప్రాంత ప్రజలు షాక్కు గురయ్యారు. విషయం తెలుసుకున్న పట్టినంబాక్కం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చైన్నె పోర్టులో రూ.26 కోట్ల సరుకులు స్వాధీనం
అన్నానగర్: దుబాయ్ మీదుగా చైన్నెకి అక్రమంగా తరలిస్తున్న రూ.26.4 కోట్ల విలువైన వస్తువులను చైన్నె పోర్టులో 7 కంటైనర్లలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైన్నె పోర్టులోకి అక్రమంగా నిషేధిత వస్తువులు తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు కస్టమ్స్ శాఖ అధికారులు విదేశాల నుంచి వస్తున్న కంటైనర్లను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో బుధవారం దుబాయ్ నుంచి చైన్నె పోర్టుకు ఓడలో వచ్చిన కంటైనర్లను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు 5 కంటైనర్లను తెరిచి పరిశీలించగా అందులో వ్యక్తిగత వస్తువులు, ఆభరణాలు ఉన్నాయని తెలిసింది.వాటిలో నిషేధిత టాయ్ డ్రోన్లు, షూలు, పోర్టబుల్ ఫ్యాన్లు, కటింగ్ టూల్స్, రూ.7.5 కోట్ల విలువైన బొమ్మలు ఉన్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్, ఇంటర్మీడియట్ రివ్యూ అవసరం అయినందున వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కస్టమ్స్ అధికారులు ప్లాస్టిక్ వస్తువులు, ఫొటో ఫ్రేమ్ ఉన్న 2 కంటైనర్లను తనిఖీ చేశారు. నిర్దేశిత వస్తువులకు బదులుగా రూ.18.9 కోట్ల విలువైన కాస్మోటిక్ ఉత్పత్తులు, మందులు, బొమ్మలు ఉన్నాయి. వీటిని కాస్మోటిక్స్ చట్టం ప్రకారం, బొమ్మలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ద్వారా నియంత్రించారు. సౌందర్య సాధనాలు పీర్ సమీక్షలో ఉన్నాయి. మొత్తం 7 కంటైనర్లలో రూ.26.4 కోట్ల విలువైన వస్తువులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైన్నెలో ఈ వస్తువులు ఎవరికి దిగుమతి అవుతాయి? దీనిపై విచారణ జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మదురై వద్ద అర్ధరాత్రి ఎక్స్ప్రెస్ రైలులో పొగలు ● ప్రయాణికుల ఆందోళన తిరువొత్తియూరు: మధురై వద్ద ఓ ఎక్స్ప్రెస్ రైలులో పొగలు రావడంతో ప్రయాణికులలో భీతి కలిగించింది. అడవి పంది పట్టాలపై చిక్కుకోవడమే ఇందుకు కారణమని తెలిసింది. వివరాలు.. తిరువనంతపురం నుంచి కాకినాడ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం అర్ధరాత్రి మధురై రైల్వే స్టేషన్ వద్ద వస్తుంది. శివరకోట్టై సమీపంలోని రైలులోని 1 కంపార్ట్మెంట్ నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. రైలు తిరుమంగళం రైల్వే స్టేషన్లోకి ప్రవేశించగానే ప్రయాణికులు వెంటనే రైలు సేఫ్టీ చైన్ పట్టుకుని లాగారు. దీంతో తిరుమంగళం రైల్వే స్టేషనన్లో రైలు నిలిచిపోయింది. భయపడిన ప్రయాణికులు హడావుడిగా రైలు నుంచి కిందకు దిగారు. రైల్వే ఉద్యోగులు పరుగులు, అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపు చేశారు. పొగ వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించగా రైలు పెట్టె కింద ఉన్న బ్రేక్ షూ నుంచి పొగలు వస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనతో 40 నిమిషాలు ఆలస్యంగా తిరుమంగళం నుంచి 11.50కి మదురైకి రైలు బయలుదేరింది. రైలు మదురై జంక్షన్కు చేరుకోగా, పొగ వచ్చిన చోట అడవి పంది చిక్కుకుపోయి మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం అడవి పంది కళేబరాన్ని తొలగించడంతో రైలు బయలుదేరింది. విమాన సేవల పెంపు ●చైన్నె నుంచి పలు నగరాలు, దేశాలకు అదనపు విమానాలు సాక్షి, చైన్నె: వేసవి సెలవుల నేపథ్యంలో చైన్నె నుంచి దేశంలోని పలు నగరాలు, పలుదేశాలకు విమానాల సేవలను పెంచారు. ప్రస్తుతం రోజుకు 206 విమానాల సేవలకు చర్యలు తీసుకున్నారు. దీంతో చైన్నె విమానాశ్రయంలో రద్దీ పెరిగింది. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయం నుంచి స్వదేశంతో పాటుగా అంతర్జాతీయ స్థాయిలో అన్ని ప్రధాన నగరాలకు , దేశాల రాజధానులకు విమానాల సేవలు జరుగుతున్న విషయం తెలిసిందే. సంవత్సరానికి 23 మిలియన్ మేరకు ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా సేవల్ని పొందుతున్నారు. రోజుకు 50 వేల మంది సేవలు పొందుతుండగా ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో సంఖ్య 60 వేలకు చేరింది. ఈ సంఖ్య మరింతగా మున్ముందు రోజులలో పెరగనున్నది. దీంతో జనం రద్దీని దృష్టిలో ఉంచుకుని విమాన సేవలను పెంచేదిశగా పలు విమాన సంస్థలు చర్యలు తీసుకున్నాయి. స్వదేశీ, విదేశీ విమాన సేవలు 206గా పెంచారు. ఇందులో కొన్ని వేసవి స్పెషల్గా ప్రకటించారు. శ్రీలంక , కువైట్, థాయ్ లాండ్ , బ్యాంకాక్ వంటి దేశాలకు అదనపు విమాన సేవలు కల్పించారు. దేశంలోని పర్యాటక ప్రాంతాలను కలిపే విధంగా పలు నగరాలకు విమాన సేవలను విస్తరించారు. 206 విమాన సేవలలో 42 విదేశీ, 164 స్వదేశీ విమానాల సేవలు ఉన్నాయి. విమానాశ్రయంలో పెరిగిన రద్దీ నేపథ్యంలో అదనపు కౌంటర్ల ద్వారా ప్రయాణికులకు సేవలను మరింత సులభతరం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. -
ఘనంగా చిన్న మారియమ్మ ఆలయ రథోత్సవం
సేలం : ఈరోడ్లో కొలువున్న పెరియ మారియమ్మన్ ఆలయం, చిన్న మారియమ్మన్, కరైవైక్కల్ మారియమ్మన్లో పంగుణి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 18వ తేదీ రాత్రి పూల సమర్పణతో ప్రారంభమైన ఈ వేడుకల్లో 22వ తేదీ రాత్రి మూడు ఆలయాల్లోనూ స్తంభాలను నాటారు. ఆ తరువాత, మహిళలు రోజూ స్తంభాలపై పవిత్ర జలాన్ని పోసి దేవతను పూజిస్తూ వస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా కరైవైక్కల్ మారియమ్మన్ ఆలయంలో అగ్నిగుండ మహోత్సవం జరిగింది. వేలాది మంది భక్తులు నిప్పులు తొక్కి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో మరో ప్రధాన ఘట్టం పొంగల్ పండుగ మంగళవారం ఉదయం జరిగింది. ఇందులో భక్తులు పొంగల్ను తమ ఇళ్లలోనే ఉంచుకుని దేవతకు సమర్పించారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం చిన్న మరియమ్మన్ ఆలయంలో రథోత్సవం నిర్వహించారు. ముందుగా అమ్మవారు ఆలయం సమీపంలో అలంకరించబడిన రథంలో వచ్చారు. ప్రత్యేక పూజ, దృష్టి పూజ పూర్తయిన తర్వాత, భక్తులు రథాన్ని తాడుతో లాగారు. రథోత్సవం సందర్భంగా, ఇరువైపులా నిలబడి ఉన్న భక్తులు పారవశ్యంతో మంత్రోచ్ఛారణలు చేస్తూ, రథంలో వచ్చిన అమ్మవారిని పూజించారు. ఈ రథం పెరియార్ రోడ్డు, అగ్రహారం రోడ్డుతో సహా వివిధ వీధులలో ఊరేగింది. ● తరలివచ్చిన భక్తజనం -
చిరుతై చిత్ర కాంబో రిపీట్
తమిళసినిమా: పరుత్తివీరన్ చిత్రంతో కథానాయకుడిగా రంగప్రవేశం చేసిన కార్తీ. సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈయన తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత ఆయనకు కెరీర్ పరంగా వెనక్కి చుసుకునే అవకాశం లేకపోయింది. ఇటీవల తన 26 వ చిత్రం మెయ్యళగన్ చిత్రంతో మరో క్లాసికల్ హిట్ కొట్టిన కార్తీ ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు.ఈయన తాజాగా సర్ధార్ 2, వా వాథ్థియార్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది.కాగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ 2 చేయాల్సి ఉంటుంది. అదే విధంగా టాణాకారన్ చిత్రం ఫేమ్ తమిళ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి కమిట్ అయినట్లు ప్రచారంలో ఉంది. కాగా తాజాగా మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇంతకు ముందు శివ దర్శకత్వంలో కార్తీ చిరుతై అనే చిత్రంలో నటించారు. ఈయన ద్విపాత్రాభినయం చేసిన ఆ చిత్రం 2011లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. అది దర్శకుడు శివకు తొలి చిత్రం. ఆ తరువాత ఆయన నటుడు అజిత్ హీరోగా వరుసగా వీరం, వేదాళం,, వివేకం, విశ్వాసం మొదలగు నాలుగు హిట్ చిత్రాలు చేశారు. ఆ తరువాత రజనీకాంత్ కథానాయకుడిగా అన్నాత్తే, సూర్య హీరోగా కంగువ చిత్రాలు చేశారు. కంగువ చిత్రంలో కార్తీ గెస్ట్ రోల్ చేశారు. కాగా తాజాగా 14 ఏళ్ల తరువాత శివ దర్శకత్వంలో కార్తీ మరో సారి కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. కమర్షియల్ అంశాలతో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రం కార్తీ ప్రస్తుతం నటిస్తున్న, అంగీకరించిన చిత్రాలు పూర్తి అయిన తరువాత సెట్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ హిట్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడానికి ఇంకా చాలా సమయం ఉంది. -
గంటలో హౌస్ఫుల్!
● హాట్ కేక్ల్లా ఐపీఎల్ టికెట్లు సాక్షి, చైన్నె: ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు హాట్ కేకుల్లో మారాయి. ఆన్లైన్లో 1.15 గంటల వ్యవధిలో వేలాది టికెట్లు బుక్కయ్యాయి. లక్ష మందికి పైగా టికెట్ల కోసం ఎదురు చూడగా చివరకు వేల మందికి టికెట్లు దక్కాయి. వివరాలు.. ఐపీఎల్ సీజన్ వేసవిలో మరింత ఉత్కంఠనురేపుతోంది. చైన్నెలోని చేపాక్కం స్టేడియంలో ఏడు మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో ఇప్పటికే 23,28 తేదీలలో రెండు మ్యాచ్లు ముగిశాయి. మరో ఐడు మ్యాచ్లు ఇక్కడ జరగాల్సి ఉంది. తమిళనాడులోని క్రికెట్ అభిమానులు చైన్నె సూపర్ కింగ్స్ జట్టు తమదే అన్నట్టుగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రత్యక్షంగా మ్యాచ్లను తిలకించేందుకు ఉరకలు తీస్తున్నారు. ఇక్కడి ఇది వరకు జరిగిన రెండు మ్యాచ్లలో చైన్నె ఒక దాంట్లో గెలవగా, మరో దాంట్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇక, ఈనెల 5వ తేదిన జరిగే మ్యాచ్లో ఢిల్లీని చైన్నె సూపర్ కింగ్స్ ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్కు గాను టికెట్ల అమ్మకాలు బుధవారం ఉదయం 10.15 గంటలకు ఆన్లైన్లో ఓపెన్ చేశారు. అప్పటికే లక్షల మంది వరకు అభిమానులు టికెట్ల కోసం ఆన్లైన్లతో తమ పేర్లు, వివరాలను పొందు పరిచి సిద్ధంగా ఉన్నారు. అయితే,ఒకొక్కరికి రెండు టికెట్లు మాత్రమే ఆన్లైన్ ద్వారా పొందే అవకాశం కల్పించారు. దీంతో బుకింగ్ ఓపెన్ చేసిన 1.15 గంటలలో హౌస్ఫుల్ అయ్యాయి. తొలుత రూ.1,700 టికెట్లు, ఆతర్వాత సీ, డీ, ఈ కేటగిరిర గ్యాలరీ టికెట్లు ఆన్లైన్లో ఓపెన్ చేశారు. మొత్తంగా రూ. 1,700, రూ. 2,500, రూ. 3,500, రూ. 4,000, రూ. 7,500 ధర పలికిన టికెట్లు అన్నీ హౌస్ పుల్ అయ్యాయి. స్టేడియంలో సుమారు 50 వేల మంది కూర్చునేందుకు అవకాశం ఉంది. ఇ ందులో ప్రాంచైజీ, ఇతర ఉచిత టికెట్ల పొగా, మిగిలిన 35 వేల నుంచి 40 వేల మేరకు టికెట్లు ఆన్లైన్ ద్వారా విక్రయించినట్లు సమాచారం. ఇవన్నీ గంట వ్యవఽధిలో బుక్కయ్యాయి. టికెట్లు దక్కని వారికి నిరాశ తప్పలేదు. అదే సమయంలో టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ విక్రయాలు తరచూ వెలుగులోకి రావడంతో పోలీసులు నిఘాను మరింత పెంచారు. ఐపీఎల్ టికెట్ల బాక్ మార్కెటింగ్కు పాల్పడే వారి భరతం పట్టేందుకు సిద్ధమయ్యారు. చేపాక్కం స్టేడియం -
24న తెరపైకి గ్యాంగర్స్
తమిళసినిమా: ఇటీవల మదగజరాజా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు సుందర్ సి. ఈయన తదుపరి కలగలప్పు 3 చిత్రం చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రానికి నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించాల్సింది. కారణాలు ఏవైనా దర్శకుడు మారిపోయారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా మధ్యలో దర్శకుడు సుందర్ సి గ్యాంగర్స్ అనే వినోదభరిత చిత్రాన్ని పూర్తి చేశారు. ఆయన సతీమణి, నటి కుష్బూ బెంజ్ మీడియా సంస్థతో కలిసి తన అవ్నీ సినీ మ్యాక్ పతాకంపై నిర్మించారు. ఇందులో దర్శకుడు సుందర్ సి, వడివేలు ప్రధాన పాత్రలు పోషించారు. నటి కేథరిన్ థ్రెసా కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో పలువురు హస్య నటీనటులు నటించారు.సీ.సత్య సంగీతాన్ని అందించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల రాబరీ కోసం ప్రయత్నించే ఇతివృత్తంతో రూపొందిందని సమాచారం. కాగా ఇటీవలే చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. అదే విధంగా కొందరు సినీ ప్రముఖుల కోసం చిత్రాన్ని చైన్నెలో ప్రత్యేకంగా ప్రదర్శించగా మంచి కామెడీ ఎంటర్టైనర్ అని ప్రశంసించారని యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మరో విషయం ఏమిటంటే సుందర్ సి, వడివేలు కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన పలు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అలాంటిది ఆ మధ్య వీరి మధ్య చిన్న. అభిప్రాయ భేదాలు తలెత్తడంతో కలిసి చిత్రాలు చేయలేదు. చాలా గ్యాప్ తరువాత మళ్లీ సుందర్ సి, వడివేలు కలిసి నటించడంతో గ్యాంగర్ర్స్ చిత్రంపై ముందు మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇది ఈ నెల 24వ తేదీన తెరపైకి రానుంది. -
లంక చెర నుంచి తిరిగొచ్చిన 13 మంది జాలర్లు
● విమానంలో చైన్నెకి రాక.. ● ప్రత్యేక వాహనాలలో స్వస్థలాలకు తరలింపుసేలం : శ్రీలంక జైలు నుంచి విడుదలైన 13 మంది రామేశ్వరం జాలర్లను విమానంలో చైన్నెకి తీసుకువచ్చి, తరువాత వారి ప్రత్యేక వాహనాలలో స్వస్థలాలకు పంపించారు. వివరాలు.. తమిళనాడులోని రామేశ్వరం నుండి ముగ్గురు మత్స్యకారులు ఫిబ్రవరి 19న మోటారు పడవలో సముద్రానికి వెళ్లి చేపలు పట్టారు. ఆ సమయంలో, శ్రీలంక కోస్ట్ గార్డ్ ఒక గస్తీ నౌకలో వచ్చి, రామేశ్వరం జాలర్లు సరిహద్దు దాటి చేపలు పడుతున్నారని ఆరోపించారు. వారు ముగ్గురు మత్స్యకారులను అరెస్టు చేసి, పడవను శ్రీలంకకు తీసుకెళ్లారు. అదే విధంగా ఫిబ్రవరి 23న, రామేశ్వరం నుంచి 10 మంది మత్స్యకారులు రెండు పడవలలో చేపలు పట్టడానికి వెళ్లారు. వారు భారత జలాల్లో చేపలు పడుతుండగా, శ్రీలంక కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ షిప్ వచ్చి, 10 మంది రామేశ్వరం జాలర్లను అరెస్టు చేసి, 2 ఫిషింగ్ బోట్లను సీజ్ చేశారు. తర్వాత శ్రీలంక కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన తమిళనాడు జాలర్లను విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు లేఖ రాశారు. అనంతరం శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయ అధికారులు శ్రీలంక ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారు. ఈ పరిస్థితిలో, మంగళవారం శ్రీలంక కోర్టు రామేశ్వరంకు చెందిన 13 మంది జాలర్లను విడుదల చేసి, శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయానికి అప్పగించాలని ఆదేశించింది. అనంతరం, భారత రాయబార కార్యాలయ అధికారులు రామేశ్వరం నుంచి విడుదలైన 13 మంది మత్స్యకారులకు అత్యవసర ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఆ తర్వాత 13 మంది జాలర్లను మంగళవారం అర్ధరాత్రి శ్రీలంక రాజధాని కొలంబో నుండి చైన్నెకి పంపించారు. ఈ క్రమంలో చైన్నె విమానాశ్రయానికి చేరుకున్న 13 మంది జాలర్లను తమిళనాడు మత్స్య శాఖ అధికారులు స్వాగతించారు. తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో రామేశ్వరానికి పంపించారు. అంతకుముందు, మత్స్యకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పడవలను, చేపల వలలను చైన్నె విమానాశ్రయంలోని తమిళనాడు ప్రభుత్వ మత్స్య శాఖ అధికారులకు వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఆగస్టు నుంచి నెల వారీ విద్యుత్ లెక్కింపు
● ప్రభుత్వం కసరత్తు ● వడ్డనకు సైతం జూలైలో ఛాన్స్సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాన్ని నాలుగేళ్ల తర్వాత అమలు చేయడానికి డీఎంకే సర్కారు కసరత్తులు చేపట్టింది. ఆగస్టు నుంచి లెక్కింపునకు అవకాశాలు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.అ దే సమయంలో జూలైలో చార్జీల వడ్డకు అవకాశం ఉన్నట్టుసంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. రాష్ట్రంలో రోజు రోజుకు విద్యుత్ వాడకం పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 2014లో విద్యుత్ చార్జీలను వడ్డించారు. ఆతర్వాత విద్యుత్ చార్జీలు పెరగలేదు. 2016 ఎన్నికల అనంతరం 100 యూనిట్ల ఉచిత పథకం అమల్లోకి రావడంతో పాటుగా ఇతర వ్యయాలు పెరగడంతో విద్యుత్ బోర్డుకు కష్టాలు ఎదురై అప్పులు అమాంతంగా పెరిగాయి. దీంతో చార్జీల వడ్డనపై విద్యుత్ బోర్డు కసరత్తు చేసింది. 2022 సెప్టెంబర్లో డీఎంకే ప్రభుత్వం చాక చక్యంగా విద్యుత్చార్జీలను పెంచే రీతిలో వడ్డనమోత మోగించింది. అలాగే 2027 వరకు ఏటా జూలైలలో చార్జీలను పెంచే దిశగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ దిశగా 2023లో చార్జీల వడ్డన మోపినా, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే పాలకులు ముందు జాగ్రత్తలలో పడ్డారు. గృహాలకు మాత్రం పెంపును రద్దు చేస్తూ, ఆ భారాన్ని భర్తీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికలు ముగియగానే చడీ చప్పుడు కాకుండా, 4.83 శాతం పెంపు వడ్డను మోగించారు. ఆగస్టులో నెలవారీ వసూళ్లు.. రాష్ట్రంలో రెండు నెలలకు ఒక పర్యాయం విద్యుత్ యూనిట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ కారణంగా విద్యుత్ చార్జీలు అధికంగానే చెల్లించాల్సి ఉంది. 100 యూనిట్లకు ఒక చార్జీ ఆ పైన ఒక్కో వంద చొప్పున యూనిట్ పెరిగే కొద్ది అధిక చార్జీ చెల్లించుకోవాల్సిన పరిస్థితి వినియోగ దారులకు ఉంది. రెండు నెలల అనేది ఒక నెలకు తగ్గించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచే ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో డీఎంకే నెల వారీ విద్యుత్ లెక్కింపు, చార్జీల వసూళ్ల ప్రకటన చేసినా అమలు చేయలేదు. తాజాగా రాష్ట్రంలో నెలకొంటున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2026లో మళ్లీ అధికారం కోసం ప్రయత్నాలలో ఉన్న డీఎంకే నెల వారీ లెక్కింపుపై దృష్టి పెట్టెందుకు సిద్ధమవుతోన్నది. ఇందుకు సంబంధించిన కసరత్తులు సాగుతున్నాయి. జూలైలో నామ మాత్రంగా చార్జీలను వడ్డించి, ఆ తదుపరి ఆగస్టు నుంచి నెలవారీ మీటర్ రీడింగ్, చార్జీల వసూళ్ల మీద దృష్టి పెట్టేవిధంగా ఈ కసరత్తులు జరుగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, గుడిసెలకు ఉచిత విద్యుత్, వ్యవసాయం, చేనేత, హ్యాండ్ లూం, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తదితర వాటికి విద్యుత్ రాయితీలు యథా ప్రకారం కొనసాగించే దిశగా అధికారులు కసరత్తులలో ఉన్నట్టు విద్యుత్ బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఘనంగా సూర్య మగళ్ అవార్డుల వేడుక
కొరుక్కుపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డి.ఎం.కె. పార్టీ తరపున 35 మంది ప్రముఖ మహిళలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. దీనికి చైన్నెలోని బ్రాడ్వేలోని రాజా అన్నామలై మండ్రం వేదికై ంది. చైన్నె కార్పొరేషన్ మేయర్ మేయర్ ప్రియ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్, ప్రత్యేక అతిథులుగా నటులు సత్యరాజ్, ప్రభు హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో సమాజంలోని వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలను అవార్డులతో సత్కరించుకున్నారు. వీరిలో ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల, చైన్నె హైకోర్టు న్యాయమూర్తి టి.ఎన్. మాల, అగ్నిమాపక శాఖ మాజీ జాయింట్ డైరెక్టర్ ప్రియా రవిచంద్రన్, రచయిత్రి శివశంకరి, అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రీతారెడ్డి, డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఇనన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ సౌమ్య తదితర 35 మంది మహిళలకు అవార్డులను అందించారు. -
● అసెంబ్లీలో మళ్లీ తీర్మానం ● చర్చ సమయంలో తీవ్ర వాగ్వాదం ● స్టాలిన్ వర్సెస్ పళణి ● సెంగోట్టయన్ వర్సెస్ సెల్వ ● మంత్రుల వర్సెస్ వానతీ ● చివరకు ఏకగ్రీవంగా ఆమోదం
కచ్చదీవుల సాధనే లక్ష్యంగా అసెంబ్లీలో బుధవారం తీర్మానం చేశారు. ఈ వ్యవహారంపై చర్చ సమయంలో సీఎం స్టాలిన్, ప్రధాన ప్రతి పక్ష నేత పళణి స్వామి మధ్య మాటల తూటాలు పేలాయి. కాంగ్రెస్ సభ్యుడు సెల్వ పెరుంతొగై, అన్నాడీఎంకే సభ్యుడు సెంగోట్టయన్ మధ్య మరోవైపు వ్యాఖ్యల తూటాలు పేలాయి. ఇక బీజేపీ సభ్యురాలు వానతీ శ్రీనివాసన్ పలువురు మంత్రుల మధ్య వాడివేడి చర్చసాగింది. అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు నెహ్రూ, శేఖర్బాబు, ఏవీ వేలు, తదితరులు సమాధానాలు ఇచ్చారు. కోయంబత్తూరుకు సురక్షిత తాగు నీరు సంవృద్ధిగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నెహ్రూ వివరించారు. సిరువాపురి మురుగన్ ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ రోడ్డు మార్గంకు రూ. 45 కోట్లు కేటాయించామని మంత్రి శేఖర్బాబు ప్రకటించారు. చైన్నె మదుర వాయిల్ – హార్బర్ మధ్య డబుల్ డెక్కర్ వంతెన మార్గం పనులకు పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు మంత్రి ఏవీ వేలు పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం పశు సంవర్థక, మత్స్య శాఖ నిధుల కేటాయింపునకు సంబంధించిన బడ్జెట్ చర్చ జరగాల్సిన నేపథ్యంలో స్పీకర్ అప్పావు అనుమతితో సీఎం స్టాలిన్ ఓ తీర్మానం సభ ముందుకు తెచ్చారు. బరువెక్కిన హృదయంతో. బరువెక్కిన హృదయంతో తాను ఈ తీర్మానం తీసుకొస్తున్నట్టు సీఎం ప్రసంగించారు. తమిళనాడు జాలర్లపై నిరంతరం జరుగుతున్న దాడులను గుర్తు చేస్తూ తమిళనాడుకు చెందిన మత్స్యకారులు భారతీయులే అన్న విషయాన్ని కేంద్రంలోని యూనియన్ ప్రభుత్వం గుర్తెరగాలని హితవు పలికారు. తమిళ జాలర్ల సమస్యలపై పదే పదే వారికి గుర్తు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. 2014 పార్లమెంటరీ ఎన్నికలకు ముందు ప్రచార సమయంలో నరేంద్ర మోడీ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనికి ముగింపు పలుకుతామని హామీ ఇచ్చారన్నారు. అయితే శ్రీలంకలో ప్రభుత్వాలు మారినా తమిళనాడు జాలర్లు పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులపై దాడులు ఆగడం లేదన్నారు. వారి హక్కులను సాగరంలో కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఆదేశ చెరలో బందీలుగా తమిళ జాలర్లు గడపాల్సిన దుస్థితి ఉందన్నారు. జాలర్ల విషయంపై ఇప్పటి వరకు తాను 74 లేఖలను కేంద్రానికి రాసినట్టు గుర్తుచేశారు. పడవలను కోల్పోవడమే కాకుండా, భారీ జరీమానాను సైతం చెల్లించుకునే పరిస్థితులు జాలర్లకు ఎదురు అవుతున్నాయని పేర్కొన్నారు. రెండు దేశాల మత్స్యకారుల మధ్య నిర్మాణాత్మక చర్చలకు చర్యలు తీసుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా ఖాతరు చేయడం లేదన్నారు. జాలర్లు ఆదేశ చెరలో బందీలుగా ఉంటే, ఇక్కడ వారి కుటుంబాలు కన్నీటి మడుగులో మునగాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ దాడులకు ముగింపు పలకాలంటే కచ్చదీవులను తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమని స్పష్టం చేశారు. జాలర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా కచ్చదీవులను స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని సభలో దాఖలు చేస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయ లాభం కోసం పార్టీలు చేసే తప్పునే కేంద్రంలోని యూనియన్ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు విమర్శించారు. కచ్చదీవులపై గతంలో ఒప్పందాలు జరిగినప్పుడు అప్పటి సీఎం కరుణానిధి తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. 1974లో జరిగిన ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేసినట్టు పేర్కొన్నారు. 1991, 2013, 2014లో సైతం కచ్చదీవుల తిరిగి స్వాధీనం విషయంగా సభభలో తీర్మానాలు ఆమోదించ బడ్డాయన్నారు. 2023లో భారత ప్రధానమంత్రికి రాసిన లేఖలో చారిత్రాత్మకంగా కచ్చదీవు భారతదేశంలో ఓ భాగం అని, తమిళనాడు జాలర్లు సాంప్రదాయకంగా కచ్చదీవుల చుట్టూచేపల వేటకు అనుమతి ఇవ్వాలని, జాలర్ల హక్కులను , జీవోనోపాధిని పరిరక్షించాలని కోరినట్టు వివరించారు. గత ఏడాది కూడా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్కు తాను రాసిన లేఖను ప్రస్తావిస్తూ, ఇంత వరకు సమస్య అన్నది పరిష్కరించ బడ లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాజాగా శ్రీలంక పర్యటనకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొని, కచ్చదీవును తిరిగి స్వాధీనం చేసుకునేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నామని ప్రకటించారు. ఆ దేశ ప్రభుత్వంతో చర్చించి శ్రీలంక చెరలో ఉన్న జాలర్లను విడుదల చేయించాలని, వారి పడవలన్నీ విడుదల తిరిగి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని, కచ్చదీవుల సాధనే లక్ష్యంగా , జాలర్ల ప్రయోజనాల ధ్యేయంగా చర్యలు విస్తృతం చేయాలని డిమాండ్ చేస్తూ సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. సభలో చర్చ సమయంలో వాగ్యుద్దాలు సాగినా, చివరకు డీఎంకే కూటమి, అన్నాడీఎంకే, బీజేపీతో సహా అన్ని పార్టీలు కచ్చదీవులను తిరిగి స్వాధీనం చేసుకోవడం లక్ష్యంగా సభలో దాఖలు చేసిన తీర్మానానికి ముక్తకంఠంతో ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం విశేషం. కాగా, సభ అనంతరం పళణి స్వామి మీడియాతో మాట్లాడుతూ, డీఎంకే ప్రభుత్వంపై కచ్చదీవుల వ్యవహారానికి సంబంధించి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఇందుకు న్యాయమంత్రి రఘుపతి ఎదురు దాడిచేస్తూ వ్యాఖ్యల తూటాలను పేల్చడం గమనార్హం. అనంతరం సభలో 2025–26 సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్ – నిధులు – చర్చలో ఆ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం, మత్స్య, పశు సంవర్ధక శాఖ నిధుల చర్చలో ఆ శాఖ మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్, పాడి పరిశ్రమలకు సంబంధించి ఆ శాఖమంత్రి రాజకన్నప్పన్ ప్రసంగించారు. తమ తమ శాఖలో చేపట్టనున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, లబ్దిదారులకు ప్రోత్సాహకాలు, సహకారం , ప్రాజెక్టులకు నిధుల కేటాయింపునకు సంబంధించిన సమగ్ర వివరాలను ప్రకటించారు. కచ్చదీవుల సాధన తీర్మానం తమిళ జాలర్ల పై కచ్చదీవులలో శ్రీలంక నావికాదళం దాష్టీకాలను సీఎం స్టాలిన్ ప్రస్తావించారు. దీంతో కచ్చదీవుల విషయంగా చర్చ ఊపందుకుంది. ఈ విషయంపై సీఎం స్టాలిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అన్నాడీఎంకే నేత, ప్రధాన ప్రతి పక్ష నేత పళణి స్వామికి ఆగ్రహాన్ని తెప్పించాయి. మీరంటే, మీరే ధారాదత్తం చేశారంటూ, జాలర్లపై చిత్త శుద్ధి లేదంటూ పరస్పరం మాటల తూటాలతో వాగ్యుద్దానికి దిగారు. కచ్చదీవుల గురించి మాట్లాడే అర్హత డీఎంకేకు లేదంటూ పళణి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ సభ్యుడు సెల్వ పెరుంతొగై కచ్చదీవుల విషయంలో దివంగత అన్నాడీఎంకే వర్గాల అమ్మ జయలలిత వైఖరిని తప్పుబట్టే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ సభ్యుడు సెంగోట్టయన్ తీవ్రంగా పరిగణించారు. సెల్వ పెరుంతొగై వ్యాఖ్యలపై తొలి గళాన్ని వినిపిస్తూ అన్నాడీఎంకే సభ్యులందరీలో చైతన్యం తెస్తూ విరుచుకు పడ్డారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. జయలలితకు వ్యతిరేకంగా స్పందించిన సెల్వపెరుంతొగై తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ఇక బీజేపీ సభ్యురాలు వానతీ శ్రీనివాసన్ మాట్లాడే సమయంలో పలువురు మంత్రులు ఎదురు దాడితో వ్యాఖ్యల తూటాలను అందుకున్నారు. పీఎం మోదీ ద్వారానే జాలర్లకు న్యాయం జరుగుతోందంటూ వానతీ శ్రీనివాసన్ విరుచుకుపడ్డారు. సభలో నెలకొన్న గందరగోళాన్ని స్పీకర్ అప్పా సద్దుమణిగేలా చేశారు. చివరకు సీఎం స్టాలిన్ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. -
భార్యను కాపురానికి పంపలేదని అత్తకు శ్రద్ధాంజలి పోస్టర్
వేలూరు: తిరుపత్తూరు సమీపంలోని తన భార్యను కాపురానికి పంపలేదని అత్తపై ఆగ్రహించిన అల్లుడు అత్త మృతి చెందినట్లుగా శ్రద్ధాంజలి పోస్టర్ను ముద్రించి వాటిని అన్ని ప్రాంతాల్లో కరిపించడంతో పాటూ బంధువులకు వాట్సాప్ ద్వారా పంపిన ఘటన సంచలనం రేపింది. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని నిమ్మయంబట్టు గ్రామానికి చెందిన వెంకటేశన్ ఇతని భార్య వినోదిని దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. వెంకటేశన్ బ్యాంకులో లోన్ తీసుకొని పాడి పశువును కొనుగోలు చేసి బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించలేదు. దీంతో దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో భార్య వినోదిని ఇలక్కినాయకన్పట్టి గ్రామంలో ఉన్న అమ్మగారింటికి రెండు నెలల క్రితం వెళ్లింది. అక్కడ నుంచే వినోదిని వేరే దుకాణంలో పనిచేస్తోంది. ఇదిలా ఉండగా అత్త మాదు తన భార్యను కాపురానికి పంపకుండా అడ్డుకుంటుందని ఆగ్రహించిన వెంకటేశన్ అత్త ప్రాణాలతో ఉన్నప్పటికీ ఆమె మృతి చెందినట్లు శ్రద్ధాంజలి బ్యానర్, పోస్టర్లు వేసుకొని చుట్టు పక్కల కరిపించడంతో పాటూ భార్య వినోదిని బంధువులకు వాట్సాప్ పంపాడు. ఈ విషయాన్ని బంధువులు వినోదినికి పోన్ చేసి విషయాన్ని తెలిపారు. దీంతో వినోదిని తన భర్త వెంకటేష్ నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంకటేష్ ను అరెస్ట్ చేశారు. -
సీఐఎస్ఎఫ్ సిబ్బంది అవగాహన సైకిల్ ర్యాలీ
కన్యాకుమారిలో కోలాహలం ముగింపు సేలం : తూర్పు, పశ్చిమ సముద్రతీర రాష్ట్రాల ప్రజలలో అవగాహన కల్పించే రీతిలో సీఐఎస్ఎఫ్ చేపట్టిన 6,559 కిలో మీటర్ల దూరం సైకిల్ ర్యాలీ కన్యాకుమారిలో విజయవంతంగా ముగిసింది. సీఐఎస్ఎఫ్ తరపున బలమైన ఇండియా – సురక్షితమైన ఇండియా అనే నినాదంతో సముద్రతీర భద్రత, సముద్ర మార్గంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనుషుల కిడ్నాప్, మారణాయుధాల అక్రమ రవాణా వంటి వాటిని అడ్డుకోవాల్సిన ఆవశ్యకత, మహిళా విద్య గురించి సముద్రతీర ప్రజల్లో అవగాహన కల్పించే రీతిలో ఈ ఏడాది ఫిబ్రవరి నెల 7వ తేదీన ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీ కన్యాకుమారిలో ఉన్న వివేకానంద స్మారకం వద్ద సోమవారం ముగించారు. 14 మంది మహిళలతో పాటూ 125 మందితో కూడిన ఈ బృందం సైకిల్ ర్యాలీ వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఆంధ్రా, పుదుచ్చేరి, తమిళనాడులో రామనాథపురం, తూత్తుకుడి మార్గంగా కన్యాకుమారికి చేరింది. ఈ సైకిల్ ర్యాలీ సోమవారం కన్యాకుమారిలో కోలాహలంగా ముగిసింది. రేవతి రామచంద్రన్కు నాట్యకళా సారథి అవార్డు సాక్షి, చైన్నె : భారత నృత్య ఉత్సవ్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి అవార్డులతో మంగళవారం సత్కరించారు. ఇందులో రేవతి రామచంద్రన్కు నాట్య కళా సారథి అవార్డును ప్రదానం చేశారు. నారగ గాన సభలో శ్రీ పార్థసారథి స్వామి సభ వార్షిక నృత్యోత్సవం, భారత నృత్య ఉత్సవ్ 60 రోజుల పాటూ జరిగింది. ఈ వేడుకలో సోమవారం రాత్రితో ముగిశాయి. ఇందులో ఉత్తమ ప్రదర్శనలు కనబిరిన వారికి అవార్డులను మంగళవారం ప్రదానం చేశారు. ఇందులో ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి రేవతి రామచంద్రన్కు నాట్యకళాసారథి అవార్డును అందజేశారు. ఈ ఉత్సవంలో ప్రదర్శన ఇచ్చిన 34 మంది కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్త డాక్టర్ నల్లికుప్పుస్వామి చెట్టి, భరత నాట్య కారులు పద్మా సుబ్రమణ్యం , మీనాక్షి చిత్రరంజన్. ఎం కృష్ణమూర్తి పాల్గొని అవార్డు గ్రహీతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో భరతనాట్యం నర్తకులు శ్రీకళ భరత్, షీలా ఉన్నికృష్ణన్, లలితా గణపతి, ప్రముఖ నర్తకులు పాల్గొన్నారు. 60 రోజుల పాటూ జరిగిన ఈ నత్యోత్సవంలో 130 కి పైగా నత్య కార్యక్రమాలు జరిగాయి. భరతనాట్యం , మన భారతీయ శాసీ్త్రయ నత్యంలోని ఇతర విభాగాల నుంచి 175 మంది కళాకారులు, వర్ధమాన నత్యకారులు తమ ప్రదర్శనలు ఇచ్చారు. పాత ట్రావెల్ కార్డును మరో 2 నెలలు పొడిగింపు ●మెట్రో రైల్ అధికారుల నిర్ణయం కొరుక్కుపేట: చైన్నె మెట్రో రైల్లో టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు కౌంటర్ల వద్ద ప్రయాణికుల పొడవైన క్యూలను నివారించేందుకు ట్రావెల్ కార్డ్ 2015 సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. 5 సంవత్సరాల వరకు చెల్లుబాటులో ఉంటుంది, ఈ కార్డ్ ఫీజులో 20 శాతం తగ్గింపును అందిస్తుంది. ఇంతలో నేషనల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్డ్ (సింగార చైన్నె కార్డ్)ని మెట్రో రైల్వే కంపెనీ ఏప్రిల్ 14, 2023న ప్రవేశపెట్టింది. దీని తర్వాత చైన్నె మెట్రో కంపెనీకి చెందిన రైల్వే యుటిలిటీ కార్డులను రీఛార్జ్ చేసుకునే సదుపాయాన్ని 41 మెట్రో రైల్ స్టేషన్లలో దశలవారీగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుండి, ప్రయాణికులు షెడ్యూల్ చేయబడిన రైళ్లలో ప్రయాణించడానికి, మెట్రో స్టేషన్లలో పార్కింగ్ చేయడానికి కార్డును ఉపయోగిస్తున్నారు. మంగళవారం నుంచి మెట్రో రైల్ ట్రావెల్ కార్డు పూర్తిగా మారుతుందని భావించిన ప్రయాణికులు ట్రావెల్ కార్డ్లోని మిగిలిన మొత్తాన్ని 4 అలందూరు సహా పలు మెట్రో రైల్ స్టేషన్ కౌంటర్లలో తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే పాత ప్రయాణంలో ఉన్న మొత్తాన్ని మినహాయించుకోవాలని వారు సమాధానమిచ్చారు. ట్రావెల్ కార్డ్లో జీరో వచ్చిన తర్వాత, సింగర చైన్నె కార్డుకు బదిలీ చేయాలి. అప్పటి వరకు మెట్రో రైల్ ట్రావెల్ కార్డు వినియోగాన్ని అనుమతించాలి కోరారు . దీనిపై మెట్రో రైలు సంస్థ అధికారులు పేర్కొంటూ.. ప్రయాణికులను సింగర చైన్నె కార్డుకు మార్చుకునేలా ప్రోత్సహిస్తున్నామని, ఈ ట్రావెల్ కార్డులో మొత్తం జీరోకు చేరిన తర్వాత రీఛార్జ్ చేయకుండానే సింగర చైన్నె కార్డు ఇస్తున్నామని చెప్పారు. -
మోదీతో భేటీకి పళణి కసరత్తు
సాక్షి,చైన్నె: రామేశ్వరం పర్యటనకు రానున్న ఫ్రధాని నరేంద్ర మోదీతో భేటీకి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామికసరత్తు చేపట్టారు. మదురైలో పీఎంను కలిసేందుకు అనుమతి కోరుతూ ప్రయత్నాలు చేపట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. మండపం – రామేశ్వరంను కలుపుతూ పాంబన్ వద్ద సముద్ర మార్గంలో రైల్వే వంతెన నిర్మాణాలు పూర్తయిన విషయం తెలిసిందే. దీనిని ప్రారంభించేందుకు ఈనెల 6వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ రామేశ్వరం రానున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఢిల్లీ నుంచి మదురైకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్లో మండపం క్యాంప్ హెలిపాడ్కు చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ మంగళవారం జరిగింది. మదురై నుంచి రామేశ్వరం మీదుగా మండపం వరకు రెండు ఆర్మీ హెలిక్టాపర్లు దూసుకొచ్చాయి. హెలీపాడ్లో అధికారుల పరిశీలన జరిగింది. రామేశ్వరం లోని ఓఆలయం వద్ద వేదిక ఏర్పాట్లు పనులు చేపట్టారు. ఈవేదిక మీద నుంచి ఆ వంతెనను పీఎం ప్రారంభించనున్నారు. ఈ పనులు ఓవైపు జరుగుతుంటే, మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామిక సరత్తులు చేపట్టారు. గత వారం ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్షాను మాత్రం పళణి స్వామి కలిసి వచ్చారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పర్యటనకు వచ్చే పీఎంను మదురైలో కలిసి మాట్లాడేందుకు అనుమతి కోరి ఉండడం గమనార్హం. ఈ భేటీ రాష్ట్ర సమస్యలను ప్రధానికి నివేదించే విధంగా మలచుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా అన్నాడీఎంకే కేడర్లో ప్రస్తుతం నెలకొన్న కూటమి గందరగోళానికి కాస్త ఊరట కలిగించే విధంగా ఇప్పటి వరకు ఎలాంటి పొత్తు కసరత్తులు లేవు అని, అన్ని భేటీలు , సమావేశాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా జరుగుతున్నట్టు కేడర్కు పార్టీ వర్గాలు సూచించే పనిలో పడడం గమనార్హం. అనుమతి కోసం ప్రయత్నం ఆరున పీఎం రాక షురూ -
నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లాలోని వేరువేరు ప్రాంతాల్లో జరుగుతున్న గృహ నిర్మాణ పనులను కలెక్టర్ ప్రతాప్ మంగళవారం ఉదయం పరిశీలించారు. వెళ్లియ్యూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడ వైద్యుల హాజరు, మందుల నిల్వలు, రోగుల వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. రోగులతో వైద్య సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలని ఆయన సూచించారు. వైద్యశాలల్లో మందుల కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వేపబట్టు, పెరుమాళ్పట్టు ప్రాంతాల్లో జరుగుతున్న పక్కా గృహాల నిర్మాణాలు, రోడ్ల నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సైతం కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
‘మారీశన్’
సూపర్ గుడ్ ఫిలిమ్స్బ్యానర్లోతమిళ సినిమా: సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ సంస్థ అధినేత ఆర్బీ చౌదరి తమిళం, తెలుగు తదితర భాషల్లో ఇప్పటికీ 97 చిత్రాలు నిర్మించారు. ప్రతిభావంతులైన నూతన కళాకారులను ప్రోత్సహించడంలో ఈయన ముందు ఉంటారు. అదేవిధంగా కథలను నమ్మి చిత్రాలు చేసే నిర్మాత ఈయన.కాగా తాజాగా ఆర్బీ చౌదరి నిర్మిస్తున్న చిత్రం మారీశన్. ఇందులో మలయాళ నటుడు ఫాహత్ ఫాజిల్, వడివేలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నటుడు వివేక్ ప్రసన్న, నటి రేణుక, సితార, తదితరులు ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి వి. కృష్ణమూర్తి కథ, కథనం, మాటలు అందిస్తూ క్రియేటివ్ దర్శకుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా సుదీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, కలైసెల్వన్ శివాజీ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది వైవిధ్య భరితంగా సాగే ట్రావెలింగ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. కాగా చిత్రాన్ని జూలై నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా మామన్నన్ చిత్రం తర్వాత ఫాహత్ ఫాజిల్, వడివేలు మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం కావడం, దీన్ని సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తుండడంతో మారీశన్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను యూనిట్ వర్గాలు విడుదల చేశారు. మారీశన్ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ -
ఐఐటీలో సైబర్ కమాండో శిక్షణ పూర్తి
సాక్షి, చైన్నె: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చొరవతో, ’సైబర్ కమాండోస్’ కార్యక్రమంతో ఒక ప్రత్యేక దళాన్ని సృష్టించే విధంగా ఐఐటీ మద్రాసు ప్రణాళికను సిద్ధం చేసింది. భారతదేశ సైబర్ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా శిక్షణను వేగవంతం చేశారు. ఇందులో తొలి బ్యాచ్ శిక్షణ ముగిసింది. ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ సైబర్ కమాండోల మొదటి బ్యాచ్కు శిక్షణను పూర్తి చేసింది, దీని ద్వారా భారతదేశం అంతటా చట్ట అమలు, అధికారులను అధునాతన సైబర్ భద్రతా పద్ధతులతో సన్నద్ధం చేశారు. శిక్షణ తో చట్ట అమలు అధికారులకు డిజిటల్ ల్యాండ్స్కేప్లో ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీలు కల్పించారు. ప్రవర్తక్ ద్వారా శిక్షణ పొందిన 37 మంది లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అధికారిక ముగింపు కార్యక్రమం మంగళవారం ఐఐటీ మద్రాస్ క్యాంపస్లో జరిగింది. తమిళనాడు ఏడీజీపీ (సైబర్ క్రైమ్ వింగ్) డాక్టర్ సందీప్ మిట్టల్,ప్రవర్తక్ చీఫ్ నాలెడ్జ్, డిజిటల్ స్కిల్స్ అకాడమి ప్రతినిధులు డాక్టర్ శంకర్ రామ్, బాలమురళి శంకర్, మంగళ సుందర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సైబర్ దాడుల నుంచి దేశాన్ని రక్షించడంలో, సున్నితమైన డేటాను రక్షించడంలో, డిజిటల్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో ఈ ప్రత్యేక దళం ముందంజలో ఉంటుంది. సైబర్ కమాండోలు ఇప్పటికే ఉన్న సైబర్ క్రైమ్ సెల్స్ నుండి గణనీయమైన అప్గ్రేడ్ను సూచిస్తారు. ప్రధానంగా సైబర్ నేరాల దర్యాప్తు, విచారణ వంటి రియాక్టివ్ చర్యలపై దృష్టి సారిస్తుండగా, కమాండోలు చురుకై న శక్తిగా ఉంటారు. ముగింపు సభలో తమిళనాడుకు చెందిన సైబర్ క్రైమ్ వింగ్ ఏడీజీపీ (సైబర్ క్రైమ్ వింగ్) డాక్టర్ సందీప్ మిట్టల్ మాట్లాడుతూ ‘‘సైబర్ స్పేస్లో ఒక చిన్న చర్య భౌతిక ప్రపంచంలో అసమాన ప్రభావానికి దారితీస్తుందన్నారు. గత ఒక సంవత్సరం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా భారతదేశం ఆదా చేసిన మొత్తాన్ని, గత నాలుగు సంవత్సరాలలో భారతదేశంలో జరిగిన సైబర్ నేరాల కారణంగా కోల్పోవాల్సివ చ్చిందన్నారు. సైబర్ స్పేస్ ఇప్పటికే భూమి, గాలి, నీరు, అంతరిక్షంతో పాటు యుద్ధ డొమైన్గా గుర్తించబడుతోందన్నారు. భారతదేశంలో విధాన రూపకర్తగా, దీనిని యుద్ధంగా గుర్తించి, దాని పౌరుల జాతీయ ఆర్థిక ప్రయోజనాలను కాపాడటానికి తగిన చర్య తీసుకోవడానికి ఇది సరైన సమయం వివరించారు. సైబర్ బెదిరింపులను పరిశోధించడంలో, దర్యాప్తులలో సహాయం చేయడంలో ఈదళం మెరుగైన నైపుణ్యం కలిగి ఉంటుందన్నారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరినీ అభినందించారు. ఈ సందర్భంగా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి పంపిన సందేశంలో సైబర్ కమాండోలను అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా, తాము వారికి అవసరమైన సహాయం అందించామన్నారు. ఇది నిరంతర అభ్యాస వ్యాయామం అవుతుందన్నారు. తాము వేసిన పునాది ద్వారా కమాండోలు ఇప్పుడు ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతపై పట్టు సాధిస్తారాన్నారు. -
లారీ, ఓమ్నీ బస్సు యజమానుల నిరసన
కొరుక్కుపేట: టోల్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మధురవాయల్ మేట్టుకుప్పం రోడ్డులో ఇసుక లారీల యజమానుల సంఘం, ఓమ్నీ బస్సు యజమానుల సంఘం, వివిధ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొని నిరసన తెలిపారు. వివరాలు.. తమిళనాడులోని 78 టోల్ బూత్లలో 40 టోల్ బూత్లకు సోమవారం అర్ధరాత్రి నుంచి మొదటి దశలో టోల్ ఫీజులను పెంచారు. చైన్నెలో పరనూర్, వానగరం, సురపాట్టు అనే 3 టోల్ బూత్లలో టోల్ పెంచారు. ఇలా రూ.5 నుంచి రూ.75 వరకు అదనంగా వసూలు చేస్తే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్యులు అవస్థలు పడుతున్నారు. పేదలు, , మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు, రవాణా పరిశ్రమలో నిమగ్నమైన వారందరూ తీవ్రంగా నష్టపోతారు. ఈ ఛార్జీల పెంపుపై వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు నిరసనలు తెలుపుతున్నాయి. కస్టమ్స్ డ్యూటీ పెంపును వెనక్కి తీసుకోవాలని, కాలం చెల్లిన టోల్ గేట్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మధురవాయల్ మేటుక్కుప్పం రోడ్డులో ఇసుక లారీల యజమానుల సంఘం అధ్యక్షుడు యువరాజ్ నేతృత్వంలో టోల్ పెంపును తీవ్రంగా ఖండించారు. ఇందులో ఓమ్నీ బస్సు యజమాని సంఘం అన్బళగన్, వివిధ సంస్థలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు. నిరసనకారులు కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ, అధిక ఎకై ్సజ్ సుంకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గడువు ముగిసిన టోల్లను తొలగించడంతోపాటూ తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. -
జైలర్ –2 మరింత బ్రహ్మాండంగా..
తమిళ సినిమా: అతడు రజినీకాంత్ ఇంతకుముందు నెల్సన్ దర్శకత్వంలో నటించిన జైలర్ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో నటి తమన్నా నటించిన నువ్వు కావాలయ్యా అని స్పెషల్ సాంగ్ ట్రెండీగా మారింది. అదేవిధంగా బాబు ప్రేక్షకులను అలరించింది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాగా సోమవారం నటుడు యోగి బాబు తూత్తుక్కుడి జిల్లా లోని ప్రసిద్ధి చెందిన కులశేఖరపట్టణంలోని ముత్తారమ్మన్ ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు. అంతకు ముందు ఆయన తిరుచెందూర్లోని సుబ్రహ్మణ్యం స్వామిని దర్శించుకున్నారు. అక్కడ ఆయనకు ఆలయ ధర్మకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన నటుడు యోగి బాబును అక్కడ హక్కులు ఆయనతో ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుసెందూర్ సుబ్రమణ్యం స్వామి తనకు వరుసగా విజయాలను కలిగిస్తున్నారని చెప్పారు. జైలర్ చిత్రంలో నటుడు రజనీకాంత్తో కలిసి నటించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు.తాజాగా రూపొందుతున్న జైలర్ 2 చిత్రంలోనూ తాను నటిస్తున్నట్లు చెప్పారు. ఈఈ చిత్రం జైలర్ కంటే బ్రహ్మాండంగా వస్తోందని చెప్పారు. ముఖ్యంగా రజనీకాంత్ నటించిన సన్నివేశాలు అభిమానులను అలరిస్తాయని నటుడు యోగి బాబు పేర్కొన్నారు. -
టాస్మాక్ స్కాంపై వాడివేడి వాదనలు
సాక్షి, చైన్నె: టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)సోదాల వ్యవహారంపై హైకోర్టులో మంగళవారం వాడివేడిగా వాదనలు జరిగాయి. కేసును తప్పుదోవ పట్టించేందుకు తమిళనాడుప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ఈడీ తరపు న్యాయవాదులు ఆరోపించారు. వివరాలు.. చైన్నెలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో గత నెల 6వ తేది నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులు ఈడీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. మద్యం విక్రయాలలో అక్రమాలు జరిగినట్టుగా పేర్కొంటూ ఈ సోదాలు జరిగాయి. ఇందులో రూ. 1000 కోట్ల మేరకు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఈడీకి చిక్కినట్టు సమాచారాలు వెలువడ్డాయి. టాస్మాక్ అధికారులు తమకు కావాల్సిన వారికి బార్ లైసెన్సులు జారీ చేసినట్టు, ఇందులో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్టుగా ఈడీ గుర్తించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకుని అసెంబ్లీలో సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ముందుకెళ్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈడీ తదుపరి అడుగులు వేయడానికి సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. టాస్మాక్ అధికారులను విచారించే దిశగా ఈడీ సిద్ధమవుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. దీంతో ప్రభుత్వం, టాస్మాక్ తరపున మూడు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. చట్ట విరుద్ధంగా టాస్మాక్ కార్యాలయంలో సోదాలు జరపడమే కాకుండా,అధికారులు, సిబ్బందిని విచారణ పేరిట వేదించేందుకు ఈడీ చేస్తున్న ప్రయత్నాలకు స్టే విధించాలన్న రాష్ట్రప్రభుత్వ పిటిషన్కు హైకోర్టు స్పందించింది. విచారణకు చెక్ పెట్టే విధంగా న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, సెంథిల్కుమార్ బెంచ్లో గత నెలాఖరులో ఉత్తర్వులు జారీ చేసింది. టాస్మాక్ వ్యవహారంలో అధికారులపై ఎలాంటి చర్యలు, విచారణ వంటి అంశాలపై దృష్టి పెట్ట కూడదని, సమగ్ర వివరణతో నివేదికను సమర్పించాలని ఈడీని న్యాయమూర్తులు ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఈ పిటిషన్పై వాదనలు జోరుగా సాగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదిస్తూ, మహిళా అధికారులను సైతం రేయింబవళ్లు కార్యాలయంలోనే ఉంచి సోదాల పేరిట విచారించారని ఈడీ తీరును వివరిస్తూ వాదనలు వినిపించారు. మానవ హక్కులను ఈడీ ఉల్లంఘించినట్టు పేర్కొన్నారు. అదే సమయంలో ఈడీ తరపున న్యాయవాదులు స్పందిస్తూ, కేసు తప్పుదోవ పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తున్నట్టు వాదించారు. వాడివేడిగా వాదనలు సాగినానంతరం తదుపరి విచారణను న్యాయమూర్తులు ఈనెల 18వ తేదీకి వాయిదా వేశారు. -
అన్నామలైకు పదవీ గండం
సాక్షి, చైన్నె: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలైను అధిష్టానం తప్పించబోతున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. ఆయన స్థానంలో దక్షిణాదికి చెందిన సీనియర్ నేత, పార్టీ శాసన సభా పక్ష నేత నైనార్ నాగేంద్రన్కు ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు చర్చ ఊందుకుంది. వివరాలు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై పగ్గాలు చేపట్టినానంతరం తమిళనాట ఆ పార్టీ బలం పెరిగింది. రాష్ట్రంలో ఆయన చేసిన పాదయాత్రతో పాటూ అధికార పక్షం, ప్రధాన ప్రతి పక్షం అన్నాడీఎంకేను ఢీకొట్టే విధంగా దూకుడు ప్రదర్శించడం కలిసి వచ్చింది. అధికార డీఎంకేను ఢీ కొట్టినా, ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేతో ఆయన వైర్యం పెంచుకోవడం బీజేపీలోని సీనియర్లకు ఇష్టం లేదని చెప్పవచ్చు. రాష్ట్రంలో రెండవ అతి పెద్ద పార్టీగా ఉన్న అన్నాడీఎంకేను తనవ్యాఖ్యలతో అన్నామలై దూరం చేసుకోవడాన్ని సీనియర్లు తీవ్రంగానే పరిగణించారు. గత లోక్ సభ ఎన్నికలలో కన్యాకుమారి, రామనాథపురం, కోయంబత్తూరుతోపాటూ కొన్ని చోట్ల గెలుపు అవకాశాలు ఉన్న నేతలు సరైన కూటమి మద్దతు అన్నది లేని కారణంగా ఓటమి పాలు కావాల్సి వచ్చిందంటూ అధిష్టానానికి సీనియర్లు గత కొంత కాలంగా ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. అన్నాడీఎంకే బలం కలిసి వచ్చి ఉంటే ఈ పాటికి కనీసి నాలుగురు పార్టీ ప్రతినిధులు పార్లమెంట్లో అడుగు పెట్టి ఉండే వారని పేర్కొంటూ వచ్చారు. ఈ పరిణామాలు ఓ వైపు ఉంటే, ప్రస్తుతం 2026 ఎన్నికలను కేంద్రంలోని బీజేపీ తీవ్రంగానే పరిగణించింది. తమను ఢీ కొట్టే విధంగా సీఎం స్టాలిన్ దూకుడు పెంచడాన్ని పరిగణించి డీఎంకే ఓటమి లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. ఇందు కోసం అన్నాడీఎంకేను మళ్లీ అక్కున చేర్చుకునే దిశగా కసరత్తులు, పొత్తుల చర్చలు జరుగుతున్నట్టు గత వారం రోజులుగా తమిళనాట మీడియా కోడైకూస్తూ వస్తున్నది. అన్నామలైకు గండం.. 2026 ఎ న్నికల నేపథ్యంలో డీఎంకేను ఓడించేందుకు తమిళనాట బలమైన కూటమి అవశ్యమని పరిగణించిన బీజేపీ పెద్దలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామిని ఢిల్లీకి పిలిపించి మరీ బుజ్జగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో అన్నామలై రూపంలో తమకు ఎదురైన సమస్యలు, పార్టీలో ఉన్న అసంతృప్తిని బీజేపీ పెద్దల ముందు పళణి స్వామి ఉంచినట్టు సమాచారం. అదే సమయంలో కొంగు మండలంలో కీలక నేతగా పళణి స్వామి ఉన్నారు. కూటమి ఏర్పాటైన పక్షంలో అదే మండలంలో అన్నామలై సైతం మరో కీలక నేతగా మారడం ఖాయం అయితే, ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్న చందంగా ఒకే మండలంలో ఇద్దరు నేతలు ఉంటే అది సమస్య అవుతుందని బీజేపీ అధిష్టానం పరిగణించినట్టు సమాచారం. దీంతో అన్నామలైను పార్టీ అధ్యక్ష పదవిని నుంచి తప్పించే వ్యూహంతో ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో దక్షిణ తమిళనాడులో అన్నాడీఎంకేకు బలమైన నేతలు తక్కువే. అదే సమయంలో ప్రస్తుతం బీజేపీలో ఉన్న పూర్వపు అన్నాడీఎంకే నేత నైనార్ నాగేంద్రన్ దక్షిణ తమిళనాడులో బలం కలిగిన వ్యక్తి కావడంతో ఆయన్ను పార్టీ అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దక్షిణ తమిళనాడులో నైనార్ నాగేంద్ర, కొంగు మండలంలో పళణి స్వామి, ఉత్తర తమిళనాడులో మరోనేత అంటూ డీఎంకే మూడు వైపులా చుట్టుముట్టి గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు బీజేపీ అఽధిష్టానం వ్యూహ రచనలో ఉన్నట్టు బీజేపీ వర్గాలుపేర్కొంటున్నాయి. ఇందులో భాగంగా అన్నామలైను అధ్యక్ష పదవి తప్పించి, మరైదెనా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. సీనియర్లు అన్నామలైకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ అధ్యక్ష మార్పు తథ్యమన్న చర్చ జోరందుకుంది. ఇందుకు అనుగుణంగా అన్నామలై సైతం స్పందించడం గమనార్హం. పార్టీ కోసం పదవిని త్యాగం చేయడానికి సిద్ధం అని అన్నామలై వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. బీజేపీలో చర్చ నైనార్కు ఛాన్స్గా ప్రచారం -
మేలో జీవీ ‘బ్లాక్ మెయిల్’
తమిళ సినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు జీఏ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బ్లాక్ మెయిల్. నటి తేజు అశ్విని కథానాయకగా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు శ్రీకాంత్, బిందు మాధవి, లింగ, వేట్టై ముత్తుకుమార్, రెడిన్ కింగ్స్ లీ, రమేష్ తిలక్, హరిప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకుముందు ఇరుక్కు ఆయిరం కంగళ్, కన్నై నంబాదే పంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎం.మారన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. జేడీఎస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై జయక్కొడి అమల్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను నటుడు రవి మోహన్, విజయ్ సేతుపతి ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్ర ఫస్టు పోస్టర్కు శని ప్రముఖుల నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని యూనిట్ వర్గాలు వ్యక్తం చేశారు. చిత్ర దర్శకుడు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మిస్టరీ, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం బ్లాక్మెయిల్ అని చెప్పారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేసిన నటుడు రవి మోహన్ విజయ్ సేతుపతిలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు నిర్మాత పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నిర్మానంత కార్యక్రమాలు జరుపుకుంటున్న బ్లాక్ మెయిల్ చిత్రాన్ని మేలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ చిత్రానికి శ్యామ్. సీఎస్ సంగీతాన్ని, గోకుల్ బెనాయ్ చాయాగ్రహణం అందిస్తున్నారు. లేకపోతే సంగీత దర్శకుడుగా 100కు పైగా చిత్రాలు చేసి మంచి విజయాలను అందుకుంటున్న జీవి ప్రకాష్ కుమార్కు కథానాయకుడుగా మాత్రం ఇటీవల సరైన విజయం రాలేదు. దీంతో బ్లాక్ మెయిల్ చిత్రం ఆయనకు మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.! -
కారు.. రెండు లారీలు ఢీ
సేలం: చెంగల్పట్టు సమీపంలో సోమవారం రాత్రి మూడు వాహనాలు (టారస్ లారీ, కారు, టిప్పర్ లారీ) ఢీకొన్న ఘోర ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు నుజ్జునుజ్జు అయ్యారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టారస్ లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. మదురై అగలపదుంపూర్, జానకీపురానికి చెందిన అయ్యనార్ (56). ఆయన భార్య దైవపూంచారి (52). ఈ దంపతుల కుమారుడు కార్తీక్ (36). అతని భార్య నందిని (32), వారి పిల్లలు ఇలమతి (7), సాయివేలు (01). వారందరూ, వారి బంధువు శరవణన్తో కలిసి, కొన్ని రోజుల క్రితం చైన్నెలోని వారి బంధువుల ఇంటికి కారులో వెళ్లారు. అక్కడ కొన్ని కార్యక్రమాలకు హాజరైన తర్వాత, సోమవారం అర్ధరాత్రి వారు కారులో మధురైకి బయలుదేరారు. వారు చెంగల్పట్టు సమీపంలోని సింగపెరుమాళ్ ఆలయం సమీపంలో చైన్నె–తిరుచ్చి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో, పెద్దసంఖ్యలో వాహనాలు ముందుకు నడిచాయి. షడన్ బ్రేక్ వేడయంతో ప్రమాదం అయ్యనార్ కుటుంబాన్ని తీసుకెళ్తున్న కారు ముందు వెళ్తున్న టారస్ లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. దీంతో వెనుక ఉన్న కారు టారస్ ట్రక్కు వెనుక భాగాన్ని తీవ్రంగా ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న టిప్పర్ లారీ కారును బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న వారందరూ అరుస్తూ విలపిస్తున్నారు. ఈ ప్రమాదంలో, అయ్యనార్, శరవణన్, సాయివేలు అనే ముగ్గురు అక్కడికక్కడే నుజ్జునుజ్జు అయిన కారులో చిక్కుకుని దుర్మరణం చెందారు. మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడి ప్రాణాలకు పోరాడారు. సమాచారం అందుకున్న మరైమలైనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శవపంచనామా నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అందరూ అక్కడ ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారిలో ఇలమతి అనే బాలిక పరిస్థితి విషమంగా ఉండి చికిత్స పొందుతోంది. ఈ సంఘటన కారణంగా ఆ ప్రాంతంలో 2 గంటలకు పైగా తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు త్వరగా చర్య తీసుకుని, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ దారుణ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు దుర్మరణం విషమ స్థితిలో నలుగురు -
కొడైకెనాల్లో ఈ పాస్ విధానం
సేలం: కొడైకెనాల్లో వాహన రాకపోకలపై తీవ్ర కట్టుబాట్లు అమలు చేశారు. మంగళవారం నుంచి ఈ–పాస్ విధానం ప్రారంభమైనది. కోర్టు ఆదేశం ప్రకారం, మంగళవారం నుండి కొడైకెనాల్లో వారంలో ఐదు రోజులు రోజుకు 6,000 పర్యాటక వాహనాలను, వారాంతాలు, సెలవు రోజుల్లో 8,000 పర్యాటక వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. వారాంతపు వేడుకలను జరుపుకోవడానికి గత రెండు రోజులుగా దిండిగల్ జిల్లా కొడైకెనాల్కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తమిళనాడులో ప్లస్ 2, ప్లస్ 1 పరీక్షలు పూర్తయినందున, పర్యాటకుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. తమిళనాడులోనే కాదు, వివిధ రాష్ట్రాల్లో కూడా వేడి 100 డిగ్రీలకు చేరుకుంటోంది. ఈ క్రమంలో కొడైకెనాల్లో ఇప్పుడు సీజన్ ప్రారంభం కావడంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. పగటిపూట మితమైన వేడి రాత్రి చల్లని వాతావరణం ఉంటోంది. దీన్ని ఆస్వాదించడానికి తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు కొడైకెనాల్కు తరలివస్తున్నారు. ఇక్కడ పర్యాటకులు మోయిర్ పాయింట్, గుణ గుహ, పైన్ ఫారెస్ట్, పిల్లర్ రాక్, గ్రీన్ వ్యాలీ, కాకర్స్ వాక్ వంటి ప్రదేశాలకు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాధిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశం ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుండి కొడైకెనాల్లో వారం రోజులలో 6,000 పర్యాటక వాహనాలను, వారాంతాల్లో 8,000 పర్యాటక వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఇందుకు గాను ఈ–పాస్ను ఆన్లైన్ ద్వారా తీసుకోవాలి. ఇదిలా ఉండగా ఈ–పాస్ విధానాన్ని అమలు చేయడాన్ని ఖండిస్తూ కొడైకెనాల్లో వ్యాపారులు ఆందోళన చేపడుతున్నారు. ఏప్రిల్ 2వ తేదీ కొడైకెనాల్ నగర వ్యాప్తంగా దుకాణాలను మూసి ఆందోళన చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఇదే విధంగా కొడైకెనాల్ బస్టాండ్ వద్ద ఒక ఎకరా స్థలంలో 100 వాహనాలను నిలిపే విధంగా పార్కింగ్ సౌకర్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ పనులు వారం రోజుల్లో పూర్తి అవుతాయని నిర్వాహకులు వెల్లడించారు. ప్రస్తుతం రోడ్డు పక్కన వాహనాలు పార్కింగ్ చేసే విధంగా తాత్కాలిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జోరుగా తాత్కాలిక పార్కింగ్ నిర్మాణ పనులు 2న వ్యాపారులు ఆందోళన -
కోలాహలం.. అగ్నిగుండ మహోత్సవం
సేలం: ఈరోడ్ కరైవైక్కల్ మారియమ్మన్ ఆలయంలో అగ్నిగుండ మహోత్సవం మంగళవారం ఉదయం కోలాహలంగా నిర్వహించారు. ఈరోడ్ పెరియ మారియమ్మన్, చిన్న మారియమ్మన్, కరైవైక్కల్ మారియమ్మన్ ఆలయంలో ఫంగుని ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ముఖ్యఘట్టమైన అగ్నిగుండ మహోత్సవం మంగళవారం వేకువజామున జరిగింది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి మాలధారణ చేసిన భక్తులు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ముందు అగ్నిగుండాన్ని రగిలించారు. అనంతరం సోమవారం వేకువజామున భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పైనుంచి పడి యువకుడి దుర్మరణం అన్నానగర్: మూడో అంతస్తు నుంచి పడి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఐనవరం మైలప్ప వీధిలో శిథిలావస్థకు చేరుకున్న మూడంతస్థుల భవనం పునరుద్ధరణ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్కు చెందిన దుర్గేష్ గుప్తా (40), విరిజిష్ (27) ఇద్దరూ అక్కడే ఉంటూ పనిచేస్తున్నారు. వీరిద్దరు సోమవారం రాత్రి భవనంలోని 3వ అంతస్తులో ఉండగా ఒక్కసారిగా కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన దుర్గేష్గుప్తా మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన విరిజిష్ను కిల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో 3వ అంతస్తు నుంచి పడిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై ఐసీఎఫ్ పోలీసులు విచారణ చేశారు. -
ధ్వజారోహణంతో పంగుణి ఉత్సవాలు ప్రారంభం
తిరుత్తణి: తిరువలంగాడులోని వడారన్నేశ్వరర్ ఆలయంలో పంగుణి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తిరువలంగాడులోని వడారన్నేశ్వరర్ ఆలయంలో ప్రతి ఏటా పంగుణి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టే విధంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి అలంకరించారు. ఉదయం 8 గంటలకు ఆలయ ధ్వజస్తంభానికి శివాచార్యులు పూజలు చేసి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. పది రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలో భాగంగా ప్రతిరోజూ ఉత్సవర్లు సోమస్కందర్ వాహనాల్లో కొలువై ఆలయ మాడ వీధుల్లో ఊరేగనున్నారు. తిరుత్తణి ఆలయంలో భక్తుల సందడి పంగుణి కృత్తిక సందర్భంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తజన సందడి నెలకొంది. మాడ వీధుల్లో సర్వదర్శన క్యూలో భక్తులు మూడు గంటల పాటు వేచివుండి స్వామి దర్శనం చేసుకున్నారు. కృత్తిక సందర్భంగా 50 వేల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
విజయవంతంగా నాట్య ప్రదర్శనలు
కొరుక్కుపేట: శ్రీ భారత్ కళా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో తిరువన్నామలై ఆలయంలో నిర్వహించిన కూచిపూడి, భరతన్యాట ప్రదర్శనలు విజయవంతంగా ముగిశాయి. అకాడమీ గురువు, వ్యవస్థాపక డైరెక్టర్, కళాకారణి రోజా రాణి, డైరెక్టర్ దుర్గా నటరాజ్ నేతృత్వంలోఈ ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యఅతిథులుగా తమిళనాడు ప్రభుత్వ ఆర్ట్ అండ్ కల్చర్ విభాగం మాజీ గౌరవ డైరెక్టర్ పూర్ణపుష్కల , కళాషోషకులు ప్రణతి పాల్గొని శ్రీ భారత్ కళా ఆర్ట్స్ అకాడమీ సేవలను కొనియాడారు. కళాసింధూ స్కూల్ ఆఫ్ ఫర్ఫార్మింగ్ ఆర్ట్స్ వ్యవస్థాపకులు ఆచార్య సింధూ శ్యామ్, వారి శిష్యబృందం పాల్గొని నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ భారత్ కళా ఆర్ట్స్ అకాడెమీ గురువు, వ్యవస్థాపక డైరెక్టర్ రోజారాణిని ఘనంగా సత్కరించుకున్నారు. రోజారాణికి ఘన సత్కారం -
హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
సేలం: తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి సమీపంలో పెట్రోల్ బంకు మేనేజర్ హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. కయత్తారు సమీపంలో కాప్పులింగపట్టికి చెందిన సెల్వయా కుమారుడు శంకరలింగ పాండి (29). కడంపూర్లో ఉన్న పెట్రోల్ బంకు మేనేజర్. ఈ స్థితిలో ఇతను సోమవారం ఉదయం కడంపూర్కు బైక్లో వెళ్లాడు. 11 గంటల సమయంలో చత్రపట్టి సమీపంలో వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారు బైక్ను ఢీకొంది. ఈప్రమాదంలో శంకరలింగ పాండి గాయపడ్డాడు. ఇది చూసి కారులో నుంచి దిగిన ముఠా కత్తులతో శంకరలింగపాండిని నరికి హతమార్చారు. తర్వాత ఈ హత్యను ప్రమాదంగా నమ్మించారు. సమాచారం అందుకున్న కయత్తారు పోలీసులు శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బైక్ను ఢీకొన్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో మహిళ విషయంగా అతన్ని హత్య చేసటినట్లు తెలిసింది. శంకరలింగ పాండిని హత్య చేసిన అదే ప్రాంతానికి చెందిన షణ్ముగరాజ్, స్నేహితుడు మహారాజన్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరిలో షణ్ముగరాజ్ భార్య కొన్ని నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఈక్రమంలో పాత కక్షల కారణంగానే శంకరలింగపాండిని హత్య చేసినట్టు తెలిసింది. -
ఘనంగా రంజాన్ వేడుకలు
తిరువళ్లూరు: ముస్లింలు ప్రతి ఏటా నిర్వహించుకునే రంజాన్ వేడుకలను తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా మసీదుల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ముస్లింలు నెల రోజులపాటు ఉపవాసం ఉండి రంజాన్ వేడుకలను నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే గత నెల క్రితం రంజాన్ ఉపవాసాలు ప్రారంభించారు. ఉదయం నాలుగు గంటలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అల్పాహారం తీసుకోవడం, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసిన తరువాత ఉపవాసాన్ని ముగించడం ప్రత్యేకత. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం రంజాన్ కావడంతో తిరువళ్లూరు, మనవాలనగర్, ఊత్తుకోట, తామరపాక్కం, ఆవడి, అంబత్తూరు, పూందమల్లి, పొన్నేరి, గుమ్మిడిపూండి తదితర ప్రాంతాల్లోని మసీదుల్లో పండుగ కోలాహలం నెలకొంది. నూతన దుస్తులు ధరించిన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థఽనలు ముగిసిన తరువాత ఒకరినొకరు ఆలింగనాలు చేసుకుని పండుగ శుభాకాంక్షలు అందుకున్నారు. అనంతరం నిరుపేద ముస్లింలకు మాంసం, గోధుమలు, బియ్యం తదితర వాటిని ఉచితంగా అందజేశారు. తిరువళ్లూరు పట్టణంలోని ఈద్గా మైదానంలో జరిగిన ప్రత్యేక ప్రార్థఽనలకు వేలాది మంది హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం అన్నదానం, మజ్జిగ తదితర వాటిని అందజేశారు. రంజాన్ వేడుకల కోలాహలం పళ్లిపట్టు: పళ్లిపట్టు, తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. పేదలకు సహాయకాలు పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టారు. దీంతో సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా పళ్లిపట్టులోని జుమ్మా మసీదులో ముస్లింలు ఏకమై ఊరేగింపుగా పట్టణ బస్టాండు సమీపంలోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. పేదలకు బియ్యం, గోధుమలు, చీర, దోవతులు పంపిణీ చేశారు. అలాగే తిరుత్తణి గాంధీ రోడ్డు మార్గంలోని మక్కా మసీదులో నిర్వహించిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో 500 మంది ముస్లింలు పాల్గొన్నారు. పొదటూరుపేట, ఆర్కేపేట, అత్తిమాంజేరిపేట, కొళత్తూరు సహా వివిధ ప్రాంతాల్లో ముస్లింలు రంజాన్ సందర్భంగా నూతన దుస్తులు ధరించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మధ్యాహ్నం పేదలకు బిరియానీ పంపిణీ చేశారు. వేలూరు, తిరువణ్ణామలైలో రంజాన్ వేడుకలు వేలూరు: వేలూరు ఉమ్మడి జిల్లాతో పాటూ తిరువణ్ణామలై జిల్లాలోను రంజాన్ వేడుకలను ముస్లీం సోదరులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. వేలూరు ఆర్ఎన్ పాళ్యంలోని ఈద్ఖా మైదానంలో అధిక సంఖ్యలో ఇస్లామియన్లు ప్రార్థనలు చేశారు. అదేవిధంగా వేలూరు కస్పాలోని పెద్ద మసీదు, చిన్న మసీదు, అల్లాపురం, కొనవట్టం, విరుదంబట్టులో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదే విధంగా ఆంబూరు, వానియంబాడి, మేల్ విషారం, కీల్ విషారం, వాలాజ వంటి ప్రాంతాల్లో ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇదిలా ఉండగా వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని అన్ని మసీదుల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలూరు ఆర్ఎన్ పాళ్యంలోని పెద్ద మసీదు వద్ద ట్రాఫిక్ సమస్య రాకుండా ముందుస్తు జాగ్రత్తగా పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు. రంజాన్ పండుగ సందర్భంగా అన్నీ మసీదుల్లో ముస్లింలతో కిటకిటలాడింది. -
నెహ్రూనగర్లో కలెక్టర్ తనిఖీలు
తిరుత్తణి: తిరుత్తణిలో పోరంబోకు స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న అర్హులకు ఉచిత ఇంటి పట్టాలు పంపిణీకి సంబంధించి జిల్లా కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు. రాష్ట్రంలో అభ్యంతరాలు లేని పోరంబోకు స్థలంలో నివాశముంటున్న వారికి ఉచిత ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. దీంతో తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా పోరంబోకు స్థలాల్లో చాలా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారి వివరాలను రెవెన్యూ సిబ్బంది సేకరించి, కలెక్టర్కు సమర్పించారు. ఇందులో భాగంగా తిరుత్తణిలోని ఇంద్రా నగర్, పెరియార్నగర్, నెహ్రూ నగర్, అక్కయ్యనాయుడు వీధి సహా వివిధ ప్రాంతాల్లో దాదాపు 1600 మంది పోరంబోకు స్థలంలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతాప్ నెహ్రూ నగర్, పెరియార్ నగర్లో పోరంబోకు స్థలాల్లో ఉంటున్నవారి వివరాలు సేకరించి తనిఖీ చేశారు. త్వరలో అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉచిత ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్డీఓ దీప, తహశీల్దారు మలర్విళి, మున్సిపల్ కౌన్సిలర్ అశోక్కుమార్, ఆర్ఐ గణేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కోర్సుల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి
● తిరువళ్లూరు జిల్లా ఆదిద్రావిడ సంక్షేమ శాఖ అధికారి సెల్వరాణి తిరువళ్లూర్. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత డిగ్రీలో చేరడానికి ఆసక్తిగా ఉన్న విద్యార్థులు కోర్సుల ఎంపికలో జాగ్రత్తలను పాటించాలని తిరువళ్లూరు జిల్లా ఆదిద్రావిడ సంక్షేమ శాఖ అధికారి సెల్వరాణి విద్యార్థులకు సూచించారు. ఇంటర్ పరీక్షలు పూర్తయిన సమయంలో డిగ్రీలో చేరడానికి ఆసక్తిగా ఉన్న విద్యార్థులతో మై కాలేజ్ డ్రీమ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పాఠశాలకు చెందిన సుమారు 100 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సెల్వరాణి విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడుతూ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలో చేరడానికి కోర్సుల ఎంపికలను జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చాలామంది విద్యార్థులు పాఠశాల జీవితానికి ముగింపు పలికిన నేపథ్యంలో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాలని ఆమె ఆకాంక్షించారు. డిగ్రీ చేరిన తర్వాత చదువుతోపాటు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని అందుకు అవసరమైన మెటీరియల్స్ ప్రభుత్వ గ్రంథాలయాల్లో లభిస్తుందని ఆమె వివరించారు. అనంతరం కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా హాజరైన లయోలా కళాశాల ప్రొఫెసర్ కాలేశ్వర్ మాట్లాడుతూ ఇంటర్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడమే మంచిదన్నారు. కరోనా తర్వాత చాలా పరిశ్రమలు మూతపడ్డాయని కార్మికుల సంఖ్యను సైతం యాజమాన్యాలు కుదించాయని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో ప్రైవేటు ఉద్యోగాలు అంత భద్రత కాదన్న ఆయన ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ తహశీల్దార్లు మదీయళగన్, సెంథిల్కుమార్, చిత్ర అసిస్టెంట్ ప్రొజెక్టర్ బాలమురుగన్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ విద్యా విధానంపై ధ్వజం
● డీఎంకే ప్రచార విభాగ ఉప కార్యదర్శి విమర్శలు తిరుత్తణి: కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న జాతీయ నూతన విద్యా విధానం అమలు తమిళనాడులో సాధ్యం కాదని డీఎంకే ప్రచార విభాగం ఉప కార్యదర్శి తమిళన్ ప్రసన్న పేర్కొన్నారు. తిరువళ్లూరు వెస్ట్ జిల్లా డీఎంకే యువజన విభాగం ఆధ్వర్యంలో కనకమ్మసత్రంలో ఆదివారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్రానికి నిధులు నిలుపుదల, లోక్సభ స్థానాలు తగ్గింపు, కొత్త విద్యా విధానంతో పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీరుకు నినరసగా నిర్వహించిన సభకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ అధ్యక్షత వహించారు. యువజన విభాగం జిల్లా కన్వీనర్ తిరుత్తణి కిరణ్ స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా డీఎంకే ప్రచార విభాగ ఉప కార్యదర్శి తమిళన్ ప్రసన్న పాల్గొని, ప్రసంగించారు. ఇతర భాషలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు వీలుగా హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్రం మరొక అడుగు ముందుకేసి జాతీయ నూతన విద్యా విధానం పేరిట గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. కుల వృత్తులు చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు. 3, 5, 8, 10వ తరగతులవారు పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉంటుందని, టెన్త్, ప్లస్టూ పరీక్షలు కేంద్ర సిలబస్ ద్వారా ఉంటాయని, దీంతో రాష్ట్ర విద్యార్థుల జీవితాలు నాశనమవుతాయని ఆరోపించారు. అందుకే కేంద్ర నూతన విద్యా విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించదన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ లేకపోవడంతో ఎంపీ స్థానాలు తగ్గించే కుట్ర పన్నుతున్నట్లు ఆరోపించారు. తిరువళ్లూరు ఎమ్మెల్యే రాజేంద్రన్, తిరువలంగాడు యూనియన్ కార్యదర్శి గూలూరు రాజేంద్రన్, యువజన విభాగం ఉప కార్యదర్శి భువనేష్కుమార్ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాట్లు చేపట్టారు. -
మద్దతుదారులతో సెంగోట్టయన్ మంతనాలు
● మళ్లీ ఢిల్లీ పయన కసరత్తు సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగోట్టయన్ సోమవారం మద్దతుదారులతో తీవ్ర మంతనాలలో మునిగారు. ఆయన మళ్లీ ఢిల్లీ వెళ్లేందుకు కసరత్తులలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళణి స్వామికి వ్యతిరేకంగా సీనియర్ నేత సె ంగోట్టయన్ గళం విప్పడం ఆ పార్టీలో చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆయన్ను మరికొందరు సీనియర్ నేతలు బుజ్జగించారు. సమస్య సమసినట్టే అనుకున్న సమయంలో సెంగోట్టయన్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడం చర్చకు దారి తీసింది. శనివారం కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో ఆయన సమావేశం కావడంతో అన్నాడీఎంకేలో కొత్త ప్రచారాలు ఊపందుకున్నాయి. ఢిల్లీ నుంచి ఆదివారం ఉదయం ఈరోడ్కు చేరుకున్న సెంగోట్టయన్ అక్కడి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పరిస్థితులలో సోమవారం సెంగోట్టయన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్దతుదారులతో మంతనాలలో మునిగారు. కుల్లం పాళయంలోని తన ఫామ్హౌస్ నివాసంలో ఆయన మద్దతుదారులతో సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ నుంచి మళ్లీ పిలుపు రావడంతోనే సెంగోట్టయన్ మద్దతు దారులతో మంతనాలు జరిపినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకేలో సెంగోట్టయన్ను కీలక స్థానంలో కూర్చొబెట్టే దిశగా ఢిల్లీ బిజేపీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన కసరత్తులలో భాగంగానే ఈ మంతనాలు సాగుతున్నట్టు సమాచారం. బుధవారం సెంగోట్టయన్ మళ్లీ ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి అమిత్షాను కలిసే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా ఈ తాజా కసరత్తులు మరో చర్చకు కూడా తెర మీదకు వస్తున్నాయి. సెంగోట్టయ్యన్ను బీజేపీ లోకి ఆహ్వానించి రాష్ట్ర పార్టీలో కీలక పదవి అప్పగించబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. -
టోల్ వడ్డన ఆరంభం
●5 నుంచి 10 శాతం వరకు పెంపుసేలం: రాష్ట్రవ్యాప్తంగా 40 టోల్గేట్లలో సోమవారం అర్ధరాత్రి నుంచి టోల్ ట్యాక్స్ పెంపు అమలు ప్రారంభమైంది. తద్వారా వాహన చోదకుల వద్ద 5 నుంచి 10 శాతం వరకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న టోల్గేట్లలో ఏడాదికి ఒకసారి, రెండు విడతలుగా టోల్ ట్యాక్స్ పెంచి వసూలు చేస్తున్నారు. ఈక్రమంలో రాష్ట్రంలో మొత్తం ఉన్న 78 టోల్ గేట్లలో తొలి విడతగా 40 టోల్ గేట్లలో సోమవారం అర్థరాత్రి నుంచి టోల్ ట్యాక్స్ ఛార్జీలు పెంచుతూ జాతీయ హైవే కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టోల్ గేట్లలో 5 నుంచి 10 శాతం వరకు ఛార్జీలు పెంచారు. చైన్నె పరిధిలో.. ఈ క్రమంలో చైన్నె పరిధిలో ఉన్న ఈసీఆర్ (ఈస్ట్ కోస్ట్ రోడ్డు)లో ఉత్తండి, చైన్నె ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న వరదరాజపురం, కొరప్పంజేరి, పళవేడు, చిన్న ముల్లైవాయల్ ప్రాంతాలలో ఉన్న టోల్ గేట్లలో ఛార్జీలను పెంచారు. -
మాపై నిందలు వేస్తున్నారు!
● ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి తమిళసినిమా: తమిళ్ నిర్మాతల మండలికి దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్య ( ఫెప్సీ)కి మంధ్య అభిప్రాయ బేధాలు తలెత్తిన విషయం తెలిసిందే. వేతనాలు వంటి పలు అంశాల వ్యవహారంలో ఈ రెండు సంఘాల మధ్య చాలా కాలంగా ఆరోపణలు ప్రతి ఆరోపణలు జరుగుతున్నాయి. తాజాగా ఇవి పతాక స్థాయికి చేరుకున్నాయి. ఎంత వరకూ అంటే తమిళ్ నిర్మాతల సంఘం దక్షిణాది సినీ కార్మికల సమాఖ్యకు పోటీగా తమిళ్ సినీ కార్మికుల సమాఖ్యను ఎర్పాటు చేసేంతదాకా. తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో ఇటీవల ఒక దిన పత్రికలో ప్రకటన వెలువడింది. ఈ నేపధ్యంలో దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే. సెల్వమణి ఆదివారం చైన్నెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము నిర్మాతల మండలి కోసం ఎంతగానో దిగొచ్చామని చెప్పారు. కార్మికుల వేతనాల నుంచి చాలా విషయాల్లో నిర్మాతకు సహకరిస్తున్నామన్నారు. అయితే వారిలో ఐక్యత లేక సమస్యలను పరిష్కరించుకోలేక తమపై నిందలు వేస్తున్నారని అన్నారు. కొత్తగా తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో సంఘాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా ఇటీవల ఓ దినపత్రికలో తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారని అన్నారు. దాన్ని దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి కార్యాలయం నుంచి విడుదల చేసినట్లు పేర్కొన్నారన్నారు. ఈ విషయమై తాము ఫిలింఛాంబర్ నిర్వాహకులను సంప్రదించగా తమ ఛాంబర్ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని చెప్పారన్నారు. ప్రతిక నిర్వాహకులను అడగ్గా తమకు ఆ ప్రకటన తమిళ్ నిర్మాతల మండలి నుంచి వచ్చిందని చెప్పారన్నారు. వారిలో వారికి సఖ్యత లేక తమ సమాఖ్యను విడదీసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కుట్రలు పాల్పడుతోంది వారే.. కొందరు నిర్మాతలే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం నుంచి ఒక్క కార్మికుడు కూడా బయటకు వెళ్లడని అన్నారు. కారణం తమ సమాఖ్య అంత కట్టుదిట్టంగా ఉందని , వారి శ్రేయస్సు కోసమే తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే నిర్మాతలు తమ చిత్రాల షూటింగ్లను తమిళనాడులో కాకుండా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాల్లో చేస్తున్నారని, అందువల్ల తమిళ సినీ కార్మికులకు పని లేకుండా పోతోందని అన్నారు. తప్పని సరి అయితేనే తమిళ చిత్రాల షూటింగ్లను ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తే బాగుంటుందని, తమిళ చిత్రాలను నమ్ముకుని 25 వేల మంది కార్మీకులు ఉన్నారని ఆర్కే.సెల్వమణి పేర్కొన్నారు. ఈ విషయంలో నటీనటులు కూడా ఆలోచించాలన్నారు. -
ముగిసిన ఆస్తిపన్ను గడువు
● ఒక్క శాతం జారిమానాతో వసూలుకు నిర్ణయం సాక్షి, చైన్నె: చైన్నెలో ఆస్తి పన్ను వసూళ్ల గడువు సోమవారంతో ముగిసింది. ఇక, మంగళవారం నుంచి ఒక్క శాతం జరిమానతో వసూలు చేయనున్నారు. చైన్నె కార్పొరేషన్ పరిధిలో 13 లక్షల మేరకు గృహాల నుంచి ఆస్తిపన్నును ఏటా వసూలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చి 31 నాటికి ఈ మొత్తాన్ని ఇంటి యజమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.2 వేల కోట్ల వరకు ఉంటుంది. అయితే దీనిని చెల్లించకుండా ఏళ్ల తరబడి బకాయిలు పెడుతూ వస్తున్న వారూ ఎక్కువే. వీరి భరతం పట్టే విధంగా తరచూ చైన్నె కార్పొరేషన్ వర్గాలు దూకుడు పెంచడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో 2024–25 సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపు గడవు సోమవారంతో ముగిసింది. రంజాన్ సెలవు రోజైనప్పటికీ, ఆస్తిపన్ను వసూళ్ల కోసం అన్ని మండల కార్యాలయాలలో రెవెన్యూ విభాగాలు పనిచేశాయి. గడువు ముగియడంతో మంగళవారం నుంచి చెల్లించాల్సిన ఆస్తిపన్ను నుంచి ఒక్క శాతం జరిమానతో వసూలు చేయాలని నిర్ణయించారు. ఇందులోనూ జాప్యం చేసిన పక్షంలో జరిమాన శాతం మరో వారం తర్వాత పెంపునకు కార్పొరేషన్ అధికారులు పరిశీలన చేస్తున్నారు. పక్షులను రక్షించుకుందాం! ● సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: పక్షులను రక్షించుకుంద్దామని సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. జనం విలవిల లాడుతున్నారు. ఓ వైపు కొన్ని చోట్ల అకాల వర్షం పలకరింపు , మరో చోటభానుడి ఉగ్ర రూపం వెరసి జన జీవనం పిప్పి అవుతోంది. ఎండ నుంచి ఉపశమనం కోసం చైన్నె వంటి నగరాలలో బీచ్ల వైపుగా సాయంత్రం వేళ జనం పరుగులు తీస్తున్నారు. ఎండ దాటికి పక్షలు సైతం విల విలాడుతున్నాయి. చైన్నెతో పాటుగా పలు నగరాలలో ఉన్న జంతు ప్రదర్శన శాలలోని జంతువులు, పక్షులను ఎండ వేడి నుంచి రక్షించే విధంగా వాటర్ స్ప్రే చేస్తున్నారు. అయితే అనేక చోట్ల చెట్ల మీద ఉండే పక్షులు నీటి కోసం అలమటించే పరిస్థితులు తప్పడం లేదు. దీనిని పరిగణించిన సీఎం స్టాలిన్ పక్షులను రక్షించుకుందామని పిలుపు నిస్తూ ఎక్స్ పేజిలో ట్వీట్ చేశారు. పక్షులకు తన ఇంటి డాబా పైన ఆహారం, నీళ్లు పెడుతున్నట్టుగా కొన్ని ఫొటోలను పొందు పరిచారు. ఎండల క్రమంగా పెరుగుతున్నాయని, పక్షులను రక్షించుకుంద్దాం. ఇళ్ల వద్ద డాబాలపై వాటి కోసం నీరు, ఆహారం ఉంచుదాం అని సీఎం స్టాలిన్ పిలుపు నిచ్చారు. అలాగే మరో ట్వీట్ చేస్తూ ఆదివారం రాత్రి చైన్నె నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన బ్రిజిల్ – ఇండియా ఆల్ స్టార్స్ ఫుట్బాల్ మ్యాచ్ గురించి ప్రస్తావించారు. ఇక్కడ జరిగిన మ్యాచ్ను గర్తు చేస్తూ అందర్నీ అభినందించారు. పళణి యానిమేషన్ ప్రచారం సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె. పళణి స్వామి యానిమేషన్ ద్వారా ప్రచార అంశాలను ఎంపిక చేసుకున్నారు. ఆయనకు సంబంధించిన అనేక ఫొటోలు, కార్యక్రమాలను యానిమేషన్ చేసి ప్రజలలోకి పంపించే దిశగా అన్నాడీఎంకే వర్గాలు విస్తృత చర్యలు చేపట్టారు. 2026 ఎన్నికల ద్వారా అధికారం లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల ద్వారా ఆ పార్టీ ఐటీ విభాగం ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేసింది. ప్రస్తుతం ఏఐ టె క్నాలజీ ద్వారా జుబ్లీ యానిమనేషన్ ప్రక్రియను ఉపయోగించుకోవడం వేగవంతమైంది. దీంతో ఈ ప్రక్రియ ద్వారా పళణి స్వామికి సంబంధించిన ముఖ్యమైన అనేక పోటోలు, కార్యక్రమాలు, ఆసక్తికర అంశాలు,ఘటనలకు సంబంధించి వాటిని యానిమేషన్ చేయిస్తున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి యామినేషన్తో జనాన్ని ఆకట్టుకునే విధంగా ముందుకెళ్తున్నారు. ఇందులో కొన్ని యానిమేషన్ చేసిన ఫొటోలను పళణి స్వామి తన ఎక్స్ పేజీలో విడుదల చేశారు. -
పా.రంజిత్ దర్వకత్వంలో..
తమిళసినిమా: దర్శకుడు పా.రంజిత్ కథలే కాదు ఆయన దర్శకత్వం శైలి ఇతర చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అట్టకత్తి, మెడ్రాస్ చిత్రాల నుంచి సర్పట్టా పరంపరై, తంగలాన్ వంట్టి చిత్రాలే పా.రంజిత్ వైవిధ్య దర్శక శైలికి నిదర్శనం. ఈయన ఇటీవల తెరకెక్కించిన చిత్రం తంగలాన్. నటుడు విక్రమ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా నటుడు విక్రమ్ , నటి పార్వతీ, మాళవికా మోహన్ల వేషధారణ, హావభావాలకు మంచి పేరు వచ్చింది. కాగా పా.రంజిత్ తదుపరి సర్పట్టా పరంపరై – 2 చిత్రం చేయబోతున్నట్లు, అదే విధంగా హిందీలో పర్సీ చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అవేవీ కాకుండా ప్రస్తుతం ఆయన వెట్టువన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు దినేశ్ హీరోగా,ఆర్య విలన్గా నటిస్తున్నారు. అట్టకత్తి చిత్రం తరువాత వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. అదే విధంగా నటుడు అశోక్ సెల్వన్, ఫాహత్ ఫాజిల్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటి శోభిత దూళిపాల నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలవడలేదన్నది గమనార్హం. కాగా ఈమె ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కీలక పాత్ర పోషించారన్నది గమనార్హం. కాగా ఈ చిత్రాన్ని గోల్డన్ రెయోమ్స్ సంస్థతో కలిసి దర్శకుడు .పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్ర పస్ట్లుక్ పోస్టర్ను 2022లో జరిగిన కాన్ చిత్రోత్సవాల వేదికపై ఆవిష్కరించారన్నది గమనార్హం. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ను ప్రారంభించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దర్శకుడు పా.రంజిత్ -
ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
పళ్లిపట్టు: పళ్లిపట్టు యూనియన్లోని గొళ్లాలకుప్పం, పాండ్రవేడు, కేశవరాజుకుప్పం ప్రాంతాల్లో నివాశముంటున్న ఇరుళ కుటుంబాలకు వెంకటేశపురం ప్రాంతంలో వంద కుటుంబాలకు ఉచిత ఇంటి పట్టా లను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేశారు. ఈక్రమంలో తొలి విడతలో 35 కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మాణంకు సంబంధించి ఉత్తర్వులు పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఇందులో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని అర్హులైన 35 కుటుంబాలకు చెందిన ఇరుళలకు కేంద్ర ప్రభుత్వ ఇరుళ సంక్షేమ నిధులనుంచి రూ.5 లక్షల వ్యయంతో ఇళ్లు నిర్మాణంకు భూమిపూజ చేసి నిర్మాణపు పనులను ప్రారంభించారు. పళ్లిపట్టు నార్త్ మండల డీఎంకే కార్యదర్శి న్యాయవాది సీజే.శ్రీనివాసన్, పళ్లిపట్టు పట్టణ కార్యదర్శి సెందిల్కుమార్, డీఎంకే శ్రేణులు దండపాణి, ముత్తురెడ్డి, మీసై వెంకటేశన్ పాల్గొన్నారు. -
అజిత్ తర్వాతి చిత్రానికి దర్శక ద్వయం?
దర్శక ద్వయం గాయత్రి –పుష్కర్, నటుడు అజిత్ తమిళసినిమా: అజిత్ చిత్రం వస్తుందంటే ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కాగా ఆయన ఇటీవల నటించిన విడాముయర్చి చిత్రం కాస్త నిరాశ పరిచినా, వెంటనే గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో అభిమానులను ఉత్సాహపరచడానికి అజిత్ సిద్ధమయ్యారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న తెరపైకి రానుంది. దీంతో అజిత్ తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. కాగా అజిత్ హీరోగా నటుడు ధనుష్ దర్శకత్వంలో చిత్రం తెరకెక్కనున్నట్లు ప్రచారం జరిగింది. త్వరలో ధనుష్ ఆయనకు కథ చెప్పడానికి సిద్దం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక ద్వయం పుష్కర్–గాయత్రి ఇటీవల ఒక చిత్రోత్సవాల వేడుకలో నటుడు అజిత్కు కథ చెప్పినట్లు, ఆయనకు ఆ కథ నచ్చినట్లు తాజాగా ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకు ముందు మాదవన్, విజయ్సేతుపతి హీరోలుగా ఈ దర్శక ద్వయం తెరకెక్కించిన విక్రమ్ వేదా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇటీవల వీరు వెబ్ సిరీస్పై దృష్టి సారిస్తున్నారు. అలా వీరు రూపొందించిన సుళల్, వదంతి, సుళల్– 2 వంచి వెబ్ సిరీస్ మంచి ప్రేక్షకాదరణను పొందాయి. కాగా ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం గురించి దర్శక ద్వయంలో ఒకరైన గాయత్రి స్పందిస్తూ ఎవరైనా నటుడు అజిత్తో చిత్రాన్ని చేయాలని కోరుకుంటారన్నారు. అజిత్ హీరోగా చిత్రం చేసే అవకాశం వస్తే అందరి కన్నా సంతోష పడేది తానేనన్నారు. కాబట్టి తాము కూడా అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా నటుడు అజిత్ నటించే తదుపరి చిత్రం అప్డేట్ కోసం ఆయన అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రస్తుతం కార్ రేస్లపై దృష్టి సారిస్తున్న అజిత్ తన తదుపరి చిత్రాన్ని ఎవరి దర్శకత్వంలో నటించేది త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. -
విశాల్తో జత కుదిరినట్టేనా?
తమిళసినిమా: నటుడు విశాల్కు మార్క్ ఆంటోని తరువాత సరైన సక్సెస్ లేదు. అలాంటిది కరెక్ట్గా గత 12 ఏళ్ల క్రితం ఈయన సుందర్.సీ దర్శకత్వంలో నటించిన మదగజరాజా చిత్రం ఈ పొంగల్కు తెరపైకి వచ్చి మంచి విజయాన్ని సాధించి విశాల్తో పాటు ఈ చిత్ర యూనిట్ను ఫుల్జోష్లో నింపింది. కాగా తాజాగా విశాల్ వరుసగా చిత్రాలు చేయడానికి సిద్ధమయ్యారు. అలా పలు కథలను విన్నా, అవేవీ సెట్ కాలేదు. దీంతో తన సొంత నిర్మాణంలోనే చిత్రం చేయడానికి రెడీ అయినట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి రవి అరసు కథా దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కాగా ఇందులో విశాల్కు జంటగా నటి దుషారా విజయన్ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా వార్త. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటి దుషారా విజయన్. ఈ అమ్మడు ఆ మధ్య నటుడు ధనుష్కు చెల్లెలిగా రాయన్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా విక్రమ్తో జత కట్టిన వీర ధీర సూరన్ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. తదుపరి విశాల్తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. దర్శకుడు రవి అరసు ఇటీవల ఈమెకు కథ చెప్పారని, ఆ కథ నచ్చడంతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విశాల్ స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ 2 చిత్రాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. నటి దుషారా విజయన్