breaking news
Tamil Nadu
-
వర్క్షాప్
సాక్షి, చైన్నె: ఇండియన్ అసోసియేషన్ ఫర్ సిమ్యులేషన్ ట్రైనింగ్ ఇన్ హెల్త్కేర్, తమిళనాడు నర్సులు, మిడ్ వైఫరీ అసోసియేషన్, శ్రీరామచంద్ర నర్సింగ్ విభాగం సంయుక్తంగా అంతర్జాతీయ సిమ్యులేషన్ వర్క్షాపును నిర్వహించారు. రోగి భద్రత, ఆరోగ్య మెరుగుకు సహకారం, నర్సుల పాత్ర వంటి అంశాల గురించి ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా యూకే ప్రతినిధి కోలెట్ లాస్ చాప్మన్, డాక్టర్ అని గ్రేస్ కలైమది, డాక్టర్ మక్కని పూర్వ, శ్రీరామచంద్ర వీసీ డాక్టర్ ఉమాశేఖర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్జే నళిని సిమ్యులేషన్ టెక్నాలజీ పాఠ్యాంశాలు, వైద్య విద్య, శిక్షణకు సంబంధించిన అవగాహన, ఈ సొల్యూషన్ బ్రోచర్లను విడుదల చేశారు. ఈవ్ టీజింగ్ కేసులో ఇద్దరి అరెస్ఠ్ కొరుక్కుపేట: ఈవ్టీజింగ్కు పాల్పడిని ఇద్దరు రౌడీలను పోలీసు అరెస్టు చేశారు. చైన్నె పులియాన్తోపులోని కన్నికాపురానికి చెందిన రాధ (50) కుమార్తె నిత్య. ఈమె రెండు రోజుల క్రితం పెంపుడు కుక్కతో కన్నికాపురంలో నడుచుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో అక్కడ వున్న ఇద్దరు వ్యక్తులు నిత్యను ఈవ్టీజింగ్ చేశారు. నిత్య ఈవిషయాన్ని తల్లికి చెప్పింది. ఆమె రౌడీలిద్దరిని మందలించింది. ఈఇద్దరిలో ఒకడు కత్తితో రాధపై దాడి చేసేందుకు యత్నించాడు. స్థానికులు అడ్డు కుని రాధను రక్షించారు. ఫిర్యాదు మేరకు పులియాన్తోపు పోలీసులు పులియాన్తోపునకు చెందిన ముఖేష్, సంజన్లను అరెస్టు చేశారు. -
వేలూరులో కుండపోత వర్షం
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలైలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేలూరు పట్టణంలోని పలు ప్రాంతాలు వర్షపు నీటితో చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. రోడ్లు, వీధులన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి. అదేవిధంగా వర్షపు నీరు వేలూరు నేతాజీ మార్కెట్లోకి చేరుకోవడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు పిడుగులతో కూడిన వర్షం కురుస్తుండటంతో విద్యుత్ శాఖ అధికారులు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. ఇదిలా ఉండగా కార్మికులు, ఉద్యోగులు బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేలూరు గ్రీన్ సర్కిల్, కొత్త బస్టాండ్, బజారు వీధి పూర్తిగా వర్షపు నీటితో నిండి పోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేలూరు పట్టణంలోని కన్సాల్పేటలో 40 ఇళ్లలోకి వర్షపు నీటితో పాటు డ్రైనేజి కాలువ నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే కార్పోరేషన్ అధికారులు ఆ ప్రాంతానికి వెల్లి నీటిని విద్యుత్ మోటర్లు ద్వారా నీటిని తోడే పనిలో నిమగ్నమయ్యారు. ఆంబూరులోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరువణ్ణామలై జిల్లాలోని సెయ్యారు, ఆరణి, తిరువణ్ణామలై, పోలూరు, తండ్రాంబట్టు ప్రాంతాల్లోను శనివారం ఉదయం నుంచి వర్షాలు కురవడంతో ఆ ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. సందవాసల్, పడవేడు, పుష్పగిరి ప్రాంతాల్లోని అరటి తోటలు, చేతికి వచ్చిన వరి పంట పూర్తిగా నేల మట్టమయ్యాయి. తిరువళ్లూరు జిల్లాలో.. తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చోళవరం, తిరుత్తణిలో 131మిమీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా పళ్లిపట్టులో 30మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 76మి.మీ వర్షపాతం నమోదు కావడంతో ప్రధాన రిజర్వాయర్లు, చెరువులు, కాలువల్లో నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలో కురిసిన భారీ వర్షం కారణంగా పూండి సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్కు నీరు రాక పెరిగింది. జిల్లాలో నమోదైన వర్షపాతం : తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి భారీ వర్షపాతం నమోదైంది. తిరువళ్లూరులో 113మిమీ, పూండిలో 104మిమీ, తిరువేళాంగాడులో 96మిమీ, జమీన్కొరట్టూరులో 90మిమీ, తామరపాక్కంలో 83మిమీ, ఆర్కేపేటలో 82మిమీ, పూందమల్లిలో 62మిమీ, గుమ్మిడిపూండిలో 55మిమీ, రెడ్హిల్స్లో 48మిమీ, ఊత్తుకోటలో 43మిమీ, ఆవడిలో 40మిమీ, పొన్నేరిలో 38మిమీల వర్షపాతం నమోదైంది. -
క్లుప్తంగా
జనావాసంలోకి జింక పిల్ల అన్నానగర్: మనలిలోని బర్మానగర్ సమీపంలో శనివారం ఉదయం అటవీ ప్రాంతం నుంచి ఒక చుక్కల జింక పిల్ల నివాస ప్రాంతంలోకి వచ్చింది. వీధికుక్కలు చూసి జింక పిల్లను వెంబడించి కరవడంతో స్వలంగా గాయపడింది. ఆ ప్రాంత నివాసి అనిల్ ప్రసాద్ వీధి కుక్కలను తరిమి, స్థానికుల సాయం జింక పిల్లను రక్షించి సాత్తంగాడు పోలీసులకు అప్పగించారు. పోలీసులు జింక పిల్లకు ప్రథమ చికిత్స అందించి అటవీశాఖకు అప్పగించారు. ఇనుప గోడౌన్లో అగ్నిప్రమాదం అన్నానగర్: పాత ఇనుప గోడౌన్లో భారీ అగ్పిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో రూ.లక్షల విలువ చేసే పాత వస్తువులు కాలిపోయాయి. చైన్నెలోని ఓల్డ్ వాషర్మన్పేటలోని పెరంబలు వీధికి చెందిన బోస్ (64). ఇతను పాత ఇనుప సామగ్రి, పాత కాగితాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులను కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు.అదేప్రాంతంలో దీనికి సంబంధించిన గోడౌన్ ఉంది. ఈ గోడౌన్లో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. మంటల్లో ప్లాస్టిక్ వస్తువులు, కాలి గోడౌన్ అంతటా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న తండయార్పేట్ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలను ఆర్పివేశారు. అయితే, అప్పటికే మంటల్లో లక్షల విలువ చేసే వస్తు వులు కాలిపోయాయి. వాషర్మన్పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అద్దె ఇంట్లో వ్యభిచారం –మహిళ అరెస్ట్ తిరువొత్తియూరు: చైన్నె విల్లివాక్కంలో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నడుపుతున్న ఒక మహిళను పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె పోలీసులకు అందిన సమాచారం మేరకు, శుక్రవారం మధ్యాహ్నం విల్లివాక్కం, శెట్టితోపు వీధిలోని ఒక ఇంట్లో వారు తనిఖీ చేశారు.ఆ సమయంలో అక్కడ వ్యభిచారం నడుస్తున్నట్లు గుర్తించారు. మహిళలతో వ్యభిచారం నడిపిస్తున్న అంబత్తూర్ టీచర్స్ కాలనీకి చెందిన అముద (33)ను ఆమెను అరెస్టు చేసి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను రక్షించారు. 55 సవర్ల నగలు చోరీ తిరువొత్తియూరు: టీచర్ ఇంట్లో 55 సవర్ల నగలు, రూ.5లక్షల నగదు చోరీకి గురయ్యాయి. కృష్ణగిరి జిల్లా, పోచంపల్లి సమీపంలోని వేలంపట్టికి సమీపంలోని పాలేగుళి గ్రామానికి చెందిన ఆనందన్. ఇతను వేలంపట్టిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తమిళ టీచర్గా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగించుకుని ఇంటికి వెళ్లాడు. ఆసమయంలో ఇంట్లో వున్న వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా పగులగొట్టి అందులో ఉన్న 55 సవర్ల బంగారు నగ లు, రూ.5 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం పళ్లిపట్టు: వడకుప్పంలో ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రం శనివారం ప్రారంభమైంది. స్వర్ణవారి సీజన్ ప్రారంభంతో తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ప్రతాప్ ఆదేశించారు. దీంతో పళ్లిపట్టు మండలంలో నొచ్చిలి, వడకుప్పం, బొమ్మరాజుపేట ప్రాంతాల్లో వరికొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి వరి కొనుగోలు చేయనున్నారు. వరి కొనుగోలు చేసిన మూడు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తారు. వడకుప్పంలో సెంట్రల్ మండల డీఎంకే కార్యదర్శి బీడీ చంద్రన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల నుంచి వరి కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. దీంతో రైతులు ట్రాక్టర్ల ద్వారా దిగుబడి చేసిన వరి బస్తాలు తీసుకొచ్చి విక్రయించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు వేణుగోపాల్రాజు, వరి కొనుగోలు కేంద్రం అధికారి మణి, రైతులు లోకేశ్వరన్, అప్పాస్వామి, శ్రీరాములు పాల్గొన్నారు. నొచ్చిలిలో కూడా వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. వృద్ధురాలిపై అత్యాచారం – నిందితుడి కోసం గాలింపు తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని తేరువాయి కండ్రిగ గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృదురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వృద్ధురాలు శుక్రవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా వున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన నార్త్ ఇండియన్ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా కేకలు వేయగా, నోటిలో గుడ్డలు కుక్కి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉత్తరభారతదేశానికి చెందిన వలస కార్మికుడు అత్యాచారానికి ఒడిగట్టి వుండొచ్చని భావించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుత్తణిలో 13 సెం.మీ వర్షపాతం
తిరుత్తణి: తిరుత్తణిలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో పట్టణం జలమయంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. అరక్కోణం రోడ్డులో వర్షపు నీరు పేరుకుపోయింది. దీంతో ఆ రోడ్డు వాహనాల రాకపోకలకు ఇబ్బంది వాటిల్లింది. అలాగే ఆర్కేపేటలో వినాయక విగ్రహాలు వుంచిన గదిలో వర్షపు నీరు చేరడంతో విగ్రహాలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల వరిపంట నీట మునిగి రైతులకు నష్టం కలిగింది. జిల్లాలో అత్యధికంగా తిరుత్తణిలో 13 సెం.మీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తిరువలంగాడులో 10 సెం,మీ. ఆర్కేపేటలో 8 సెం.మీ వర్షం నమోదైంది. -
● సావనీర్ ఆవిష్కరణ
ఇండియన్ ఎపిలెప్సీ సొసైటీ, ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ నేతృత్వంలో చైన్నెలో ఈసీఓఎన్–2025 ఆరోగ్య సదస్సు జరుగుతోంది. ఆరోగ్య సంరక్షణ నిపుణులు అందరూ ఒకే వేదికపైకి వచ్చి న్యూరాలిజి, ఎపిలెప్టాలజి, న్యూరో, సంబంధిత అంశాలు, పరిశోధనలపై దృష్టి పెట్టారు. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, సదస్సు చైర్మన్ డాక్టర్ వి.నటరాజన్, కార్యదర్శి పి.శరత్ చంద్ర ఆరోగ్య సంరక్షణతో పాటు, ఆధునిక విధానాల గురించి రూపకల్పన చేసిన వైద్య సంబంధిత పుస్తకాలు, సదస్సు ముఖ్యోద్దేశంతో కూడిన సావనీర్ను విడుదల చేశారు. – సాక్షి, చైన్నె -
శ్రీరంగం సందర్శనకు ముర్ము
సాక్షి, చైన్నె: సెప్టెంబర్ 3వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమిళనాడుకు రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. తిరుచ్చి, తిరువారూర్లలో ఆమె పర్యటన జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత ఏడాది నవంబర్ చివరి వారంలో కోయంబత్తూరు, నీలగిరి జిల్లా ఊటీ పర్యటనకు వచ్చారు. మూడు రోజులు ఊటీలోనే ఉన్నారు. వెల్లింగ్టన్ ఆర్మీ శిక్షణ కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె తిరువారూర్లోటించాల్సి ఉంది. ఇక్కడ తమిళనాడు వర్సిటీ స్నాతకోత్సవానికి సైతం హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, వర్షం కారణంగా ఆ పర్యటనను రద్దు చేశారు. ఈ పరిస్థితుల్లో సెప్టెంబరు 3న ఆమె తిరువారూర్ పర్యటనకు రానున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా సెంట్రల్ వర్సిటీ స్నాతకోత్సవంలో సైతం ఆమె పాల్గొననున్నట్లు ధ్రువీకరించారు. తిరుచ్చి, తిరువారూర్లలో రాష్ట్రపతి పర్యటన జరగనుంది. తిరుచ్చి విమానాశ్రయం నుంచి తిరువారూర్కు తొలుత వెళతారు. అక్కడ పర్యటనను ముగించుకుని శ్రీరంగంకు వెళ్లనున్నారు. శ్రీరంగంలో రాష్ట్రపతి హెలికాప్టర్ కోసం హెలిపాడ్ ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక్కడ దర్శనానంనంతరం కారులో తిరుచ్చి విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. భద్రతా పర్యవేక్షణకు చర్యలు చేపట్టారు. -
సైబర్ క్రైం కేసులో ఇద్దరి అరెస్టు
తిరువళ్లూరు: బ్యాంకు ఉద్యోగుల లంచం ముట్టచెప్పి భారీగా నగదు వున్న అకౌంట్లను పొంది వాటిని సైబర్ నేరగాళ్లకు అందించి కమిషన్లు పొందిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కొరట్టూరు ప్రాంతానికి చెందిన వరదరాజన్(60). ఇతని వాట్సాప్కు అన్లైన్ ట్రేడింగ్ పేరిట ప్రకటన వచ్చినట్టు తెలుస్తోంది. ఆన్లైన్లో పెట్టుబడి పెడితే రెడింతలు లాభం వస్తుందని నమ్మించారు. దీంతో వరధరాజన్ 1.61 కోట్లు రూపాయలనుపెట్టుబడిగా పెట్టాడు. అయితే లాభం రాకపోగా పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని సైతం తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. మోసపోయామని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు ఆవడి సైబర్ సెల్కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ మహాలక్ష్మి ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టి ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసి వారి బ్యాంకు ఖాతాలను జప్తుచేశారు. అయితే నలుగురి వద్ద చేపట్టిన విచారణలో నాగపట్నం జిల్లాకు చెందిన డానియల్రాజ్కుమార్(34), కోయంబత్తూరు జిల్లాకు చెందిన నవీన్(39) తదితర ఇద్దరి వద్ద పలువురి బ్యాంకు అకౌంట్లను పొంది వారికి కమిషన్లు ఇచ్చినట్టు నిర్ధారించారు. పెద్దమొత్తంలో నగదు వున్న ఖాతాలను గుర్తించి వారికి ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో లింక్లు పెట్టి నగదును కాజేసినట్టు నిర్దారించిన పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరిలించారు. -
క్రీడలతోనే మానసిక ఉల్లాసం
వేలూరు: విద్యార్థులకు క్రీడలతోనే శారీరక, మానసిక ఉల్లాసం పెరుగుతుందని ఎస్పీ మయిల్వాగణన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి సన్బీమ్ మెట్రిక్ పాఠశాలలో వార్షికోత్సవ క్రీడా దినోత్సవ కార్యక్రమం పాఠశాల చైర్మన్ హరిగోపాలన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాల విద్యలోనే విద్యార్థులకు క్రమ శిక్షణను అలవాటు చేయాల్సిన బాధ్యత పాఠశాలలోని టీచర్లతో పాటూ తల్లిదండ్రులపై ఆధారపడి ఉందన్నారు. పాఠశాలలోనూ, ఇంటి వద్ద ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రమశిక్షణతో ఉంటారన్నారు. విద్యార్థులకు ఇష్టమైన పనులు చేసేందుకు పెద్దలు, ఉపాధ్యాయులు అవకాశం కల్పించాలన్నారు. విద్యార్థులు వీరి జీవితాలను ఆరోగ్యంగా ఉండే విధంగా చూడాలన్నారు. విద్యార్థులకు పట్టుదల, క్రమ శిక్షణ చిన్న వయస్సు నుంచే ప్రతి ఒక్కరికీ అవసరమని అప్పుడే ఉన్నత శిఖరాలకు వెళ్లగలరన్నారు. జీవితంలో ఏదైనా సాదించాలనే ధ్యేయంతో అభ్యసించాలన్నారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటూ సర్టిఫికెట్లును అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తంగ ప్రకాశం, వైస్ చైర్మన్ జార్జీ అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
పింక్ ఆటోలతో జీవనోపాధి
సాక్షి, చైన్నె: అబల సురక్షిత ప్రయాణానికి దోహదకరంగా ఉన్న పింక్ ఆటోల రూపంలో మహిళా డ్రైవర్లకు జీవనోపాధిని విస్తృతం చేస్తూ , సామాజిక మార్పు కోసం చర్యలు విస్తృతం చేశారు. ఇందులో భాగంగా 100 మంది మహిళా ఆట్రో డ్రైవర్లకు పింక్ ఆటోలను శనివారం పంపిణీ చేశారు. చైన్నె నందబాక్కం ట్రేడ్ సెంటర్లో రోటరీజిల్లా 3234 గవర్నర్ ఏకేఎస్ రోటేరియన్ వినోద్ సరోగి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. 100 పింక్ ఆటోలను మహిళలకు అందజేశారు. వెనుకబడిన మహిళలకు ప్రత్యేకంగా జీవనోపాదినిమెరుగు పరచడమే కాకుండా, మహిళకు సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించే విధంగా ఆత్మ విశ్వాసం పెంపు దిశగా ఈ ఆటోలను పంపిణి చేశారు. అనంతరం జరిగిన లీడ్ 25 – ఎయిమ్ హై రోటరీ ఇండియా లీడర్ షిప్ కాన్క్లేవ్ రోటరీ అంతర్జాతీయ అధ్యక్షుడు రోటేరియన్ ప్రాన్సిస్కో అరెజ్జో అధ్యక్షతన జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, విద్యా మంత్రి అన్బిల్ మహేశ్ పాల్గొని ప్రసంగిస్తూ, ఇది రాష్ట్ర ప్రాజెక్టుఅని, మహిళ పురోగతి, ఆర్థిక బలోపేతానికి దోహదకరంగా ఉంటుందని వివరించారు. విద్య, సామాజిక సహకారంలో రోటరీ సేవలను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏకేఎస్ రోటేరియన్ ఆర్ఎం మురుగానందం, ఫ్లైట్ లెప్టినెంట్ కేపీ నాగేశ్, పింక్ ఆటో ప్రాజెక్టు చైర్మన్ శివ ఇలంగోవన్ తదితరులు పాల్గొన్నారు. -
కోలాహలం..ఆవణి రథోత్సవం
సాక్షి, చైన్నె: తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆవణి మాసం బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రథోత్సవం కోలాహలంగా జరిగింది. భక్త జనుల హరోంహర నామస్మరణ మార్మోగింది. ఆరుపడై వీడుల్లో రెండవదిగా తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ గత వారం రోజులుగా ఆవణి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. బంగారు రథం, పల్లకి వాహనాలలో సర్వాలంకరణలతో స్వామివారు వళ్లి, దేవయాని సమేతంగా భక్తులకు దర్శనం ఇస్తూ వచ్చారు. శనివారం రథోత్సవం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో సముద్ర తీరంలో ఉన్న తిరుచెందూరు భక్త సాగరంలో మునిగినట్లైంది. వేకువ జాము నుంచి ఆలయంలో విశిష్ట పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు రథంపై దర్శనం ఇచ్చారు. హరోంహర నామస్మరణ మిన్నంటగా రథోత్సవం కనుల పండువగా జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం, దేవదాయశాఖ నేతృత్వంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్ల చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం నేతృత్వంలో గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. -
8 జిల్లాలకు అలర్ట్
సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో చైన్నె, శివారులలో వాతావరణం పూర్తిగా మారింది. అనేక చోట్ల కుండపోతగా వర్షం పడింది. డెల్టాలలోని ఎనిమిది జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు. ఈనెల 29వ తేదీ వరకు వర్షాలు కొనసాగనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. వివరాలు.. గత రెండు రోజులుగా రాష్ట్రంలో అనేక జిల్లాలో చెదరు ముదురుగా వర్షాలు పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో గురువారం రాత్రి నుంచి చైన్నె శివారులలో వర్షం పడుతూ వస్తోంది. శుక్రవారం రాత్రి కూడా ఈ వర్షాలు కొనసాగాయి. చైన్నె శివారులలోని తాంబరం, వండలూరు, గూడువాంజేరి పరిసరాలు, శ్రీపెరంబదూరు పరిసరాలు, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, చెంగల్పట్టు జిల్లాలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. అనేక చోట్ల కుండపోత వాన పడింది. శివారులలో వర్షాలతో పూండి, చోళవరం, పుళల్, చెంబరంబాక్కం రిజర్వాయర్లలోకి నీటి రాక క్రమంగా పెరుగుతోంది. ఇక చైన్నె నగరంలో గిండి, సైదాసేట, బ్రాడ్ వే, ఐనావరం, విల్లివాక్కం, అశోకన్ నగర్, మైలాపూర్, పరిసరాలలో భారీగానే వర్షం పడింది. అత్యధికంగా బ్రాడ్ వేలో 15 సెం.మీ, కొరట్టూరులో 13 సెం.మీ వర్షం పడింది. బంగాళాఖాతంలో ఈనెల 25వ తేదిన అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తిరువారూర్, తంజావూరు, పుదుకోట్టై, నాగపట్నం వంటి డెల్టా జిల్లాలు, ఉత్తర తమిళనాడులోని విల్లుపురం, చెంగల్పట్టు, చైన్నె శివారులలో మోస్తరు వర్షాలు పడుతాయని ప్రకటించారు. ఈనెల 29వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని వివరించారు. 29వ తేదీన నీలగిరి, కోయంబత్తూరులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చైన్నె, శివారులలో శనివారం మధ్యాహ్నం వరకు వర్షం పడింది. ఆ తర్వాత ఆకాశం మేఘావృతంగా మారింది. ఈ వర్షానికి తోడుగా ఈదురు గాలులల రూపంలో పదిచోట్ల చెట్లు నేలకొరిగాయి. కార్పొరేషన్ సిబ్బంది వాటిని ఆగమేఘాలపై తొలగించారు. తాజా వర్షానికి రోడ్డులు గతుకులమయం కావడంతో వాహనదారులకు అవస్థలు తప్పలేదు. విద్యుదాఘాతంతో కార్మికురాలి మృతి చైన్నె శివారులలో కురిసిన వర్షం ఓ పారిశుధ్య కార్మికురాలిని బలిగొంది. శనివారం ఉదయాన్నే ఐదు గంటలకు కన్నగి నగర్కు చెందిన వరలక్ష్మి(30) ఆ ప్రాంతంలో పారిశుధ్య పనులలో నిమగ్నమయ్యారు. రోడ్డుపై పనులలో ఉండగా ఓ చోట నీళ్లు చేరి ఉండటంతో శుభ్రం చేసే పనిలో పడ్డారు. ఈ సమయంలో విద్యుదాఘాతానికి గురై ఘటనా స్థలంలోనే మరణించారు. దీనిని చూసిన ఆ పరిసర వాసులు ఆందోళనకు గురై విద్యుత్ బోర్డుకు సమాచారం ఇవ్వడంతో సరఫరా నిలిపివేశారు. ఆమెను ఆస్పత్రికి తరలించగా మరణించినట్టు వైద్యులు తేల్చారు. మృతురాలు కన్నగినగర్ వాసి కావడంతో అక్కడి ప్రజలలలో ఆగ్రహం వ్యక్తమైంది. అదే సమయంలో ఆమె పనిచేస్తున్న కాంట్రాక్టు సంస్థతో పాటూ ప్రభుత్వం స్పందించింది. ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ఆమె ఇంటికి చేరుకుని ఇద్దరు పిల్లలు, భర్తను ఓదార్చారు. కన్నగినగర్ వాసులకు తాము ఉన్నామన్న భరోసా ఇచ్చారు. వరలక్ష్మి కుటుంబానికి రూ. 20 లక్షలు ఎక్స్గ్రేషియా అందించారు. ఆమె ఇద్దరు పిల్లలు విద్యా ఖర్చులన్ని ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి ప్రకటించారు. ఆమె భర్తకు ఉద్యోగం ఇస్తామన్న హామీ ఇచ్చారు. సాయంత్రం వరలక్ష్మి భౌతిక కాయాన్ని వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ సందర్శించి నివాళులర్పించారు. -
ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ధర్నా
వేలూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ సంఘం కార్యదర్శి మాయవన్ అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు మలైస్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయక పోవడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టిలకు చెందిన పట్ట భద్రులు నిరుద్యోగులుగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారానికి వచ్చిన వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ఆశ చూపించి కనీసం ఒక్క శాఖలో కూడా పోస్టులను భర్తీ చేయక పోవడం సరికాదన్నారు. ప్రతి నెలా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో పదవీ విరమణ పొందుతున్నా కనీసం ఆ పోస్టులు కూడా భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగులతోనే సరి చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. దేశ వ్యాప్తంగా కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేసి పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్ను పెంచడంతో పాటు కనీసం ఆ పోస్టులను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఆ సంఘం రాష్ట్ర నిధి కార్యదర్శి పుదియవన్, జిల్లా కార్యదర్శి సెల్వం సభ్యులు పాల్గొన్నారు. -
చాలా చిత్రాల్లో అసంతృప్తితోనే నటించా!
తమిళసినిమా: సంచలన కథానాయికల్లో నటి సమంత ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. ఈమె ప్రస్తుతం చిత్రాల్లో నటిస్తున్నారో లేదోగానీ ఆమె గురించి రోజుకో వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది. సమంత ఇటీవల నిర్మాతగా మారి శుభం అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాగానే ఆడింది. ప్రస్తుతం కథానాయకిగా మరో రెండు కొత్త చిత్రాలకు సంతకం చేశారనే ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో ఈ అమ్మడు నటనకు గుడ్బై చెప్పబోతున్నారని ప్రచారం కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీటిలో ఏది నిజం అన్న విషయంలో క్లారిటీ లేదు. అయితే సమంత మాత్రం విమర్శలను, ట్రోలింగులను ఎదుర్కొనే మానసిక పరిపక్వత నటీమణులకు ఉండాలనే అభిప్రాయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇంతకుముందు తమిళం, తెలుగు భాషల్లో నాన్స్టాప్గా అత్యధిక చిత్రాలను చేసి స్టార్ హీరోయిన్గా వెలిగిన సమంత ఇప్పుడు ఎక్కువ చిత్రాల్లో నటించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆ మధ్య మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురికావడం కావచ్చు. అయితే ఇటీవల శారీరక వ్యాయామం, విదేశీ పయనాలపై ఈమె ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.దీని గురించి సమంత మాట్లాడుతూ ఇప్పుడు తనను ఉత్సాహపరిచే విషయాలను మాత్రమే చేస్తున్నానని చెప్పారు. అది సినిమా అయినా శారీరక వ్యాయామం అయిన సరే అని పేర్కొన్నారు. ఇంతకుముందు పలు చిత్రాల్లో వరుసగా నటించానని అయితే నిజం చెప్పాలంటే వాటిల్లో చాలావరకు తనకు సంతృప్తి కలిగించని చిత్రాలేనని చెప్పారు. కాగా ఇప్పుడు ఎలాంటి సినిమానైనా పూర్తిగా శ్రద్ధ పెట్టి చేస్తున్నానని చెప్పారు. ఒకేసారి ఐదారు చిత్రాలు చేయాలన్న ఒత్తిడి మాత్రం తనపై లేదన్నారు. తన శరీరం ఏం చెప్తుందో దాన్ని అర్థం చేసుకొని అనుసరిస్తున్నట్లు, అందుకే పనిని తగ్గించుకున్నట్లు సమంత చెప్పారు. -
ప్రేమంటే ప్రపంచ భాష
మైల్స్ చిత్రంలో నిర్ణాతో అశోక్ సెల్వన్తమిళసినిమా: అశోక్సెల్వన్, మిర్ణా జంటగా నటిస్తున్న చిత్రం 18 మైల్స్. సతీష్సెల్వకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి కె.ఎళిల్అరసు చాయాగ్రహణం, సిద్ధుకుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా విచిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను చిత్ర వర్గాలు ఇటీవల విడుదల చేశారు. చక్కని ప్రేమ కావ్యంతో కూడిన ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు సతీష్సెల్వకుమార్ చిత్రం గురించి మాట్లాడుతూ 18 మైళ్ల దూరంలో ఆకాశం ఒకేలా ఉండవచ్చునని ,అయితే జీవితం మాత్రం ప్రతిరోజూ అంతం లేని సముద్రంలో ప్రశాంతత, ఎదురీత, చెప్పలేని ప్రేమ వంటి విషయాలతో కూడుకుందని అన్నారు. ఈ విషయాలను తెరపై ఆవిష్కరించే కథా చిత్రమే 18 మైల్స్ అని చెప్పారు. ప్రేమ అనేది ప్రపంచ భాష అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు అయితే సరిహద్దుల్లోనూ, అంతర్జాతీయ పరిస్థితులు ప్రేమకు ఇంకా హద్దుగానే ఉన్నాయన్నారు. ఇలాంటి ఒక అంతర్జాతీయ సంఘటనను ఈ చిత్రంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అశోక్సెల్వన్ మిర్ణా కలిసి నటిస్తున్న ఇందులో విషయాలు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటాయన్నారు. వీటన్నిటికీ మించి అశోక్సెల్వన్, మిర్ణాల ప్రేమ కాలాన్ని అధిగమించి వారి మౌనం కవితాత్మకమైన భావనలు , సంగీతంలోని చివరి రిథం వరకు ఇందులోని పాటలు మాధుర్యాన్ని ఆస్వాదించ వచ్చునని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు ఈ చిత్రంలో లీనం అవుతారనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. -
క్లుప్తంగా
అన్నానగర్: ప్రైవేట్ బస్సు కండక్టర్పై దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రగాయాలతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శివగంగ జిల్లా మానామదురై సమీపంలోని సిరుకుడి గ్రామానికి చెందిన ముత్తుపాండి కుమారుడు ధవసెల్వం (23). మదురై నుంచి ఇళయంకుడి వెళ్లే ప్రైవేట్ బస్సులో కండక్టర్. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని మానామదురై కొత్త బస్టాండ్లో బస్సు దిగాడు. ఆ సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ధవసెల్వంను వెంటపడి కత్తులతో నరికి పారిపోయారు. ఇది చూసిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలిసి మదురై పోలీసులు అక్కడికి వెళ్లి తీవ్రంగా గాయపడిన ధవసెల్వంను శివగంగై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. రూ. 62 లక్షల పరిహారం అన్నానగర్: చైన్నెలోని తిరువల్లికేణిలోని కపాలినగర్కు చెందిన తంగ రాజ్ (48) చేపాక్లోని రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యాలయంలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 21.10.2023న, అతను తన భార్య మోహనతో కలిసి కామరాజ్ సాలైలోని ఎళీలగమ్ సమీపంలో మోటార్ బైక్పై వెళుతుండగా, ఆ దారిలో వెళుతున్న మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తంగరాజ్ మృతిచెందాడు. దీని తరువాత మోహన చైన్నె మోటార్ యాక్సిడెంట్ కాంపన్సేషన్ ట్రిబ్యునల్లో రూ. 95 లక్షల పరిహారం కోరుతూ కేసు దాఖలు చేసింది. ఈ పిటిషన్పై న్యాయమూర్తి నజీర్ అహ్మద్ ముందు విచారణ జరిగింది. ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పిటిషనర్కు రూ.62.35 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. పిటిషనర్ భర్త నడుపుతున్న మోటార్ సైకిల్ను ఢీకొట్టిన మరో మోటార్ సైకిల్ అజాగ్రత్త, వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. సాక్షి, చైన్నె: పీఎంకే గౌరవాధ్యక్షుడు జీకే మణి ఆస్పత్రిలో చేరారు. ధర్మపురిలో ప్రథమ చికిత్స అనంతరం ఆయన్ను చైన్నెకి తరలించారు. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్య జరుగుతున్న సమరంలో జీకే మణి నలిగిపోతూ వస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. తాను తీవ్ర మనోవేదనతో ఉన్నట్టుగా ఇది వరకు ఆయన తెలిపారు. అయినా రాందాసు వెన్నంటే ఉంటున్నారు. అన్బుమణి చర్యలను తప్పబట్టే విధంగా ముందుకెళ్తున్నారు. ఈపరిస్థితుల్లో అన్బుమణిపై చర్యలకు రాందాసు సన్నద్ధం అవుతున్న వేళ తీవ్ర ఒత్తిడికి ఆయన లోనైనట్టు తెలిసింది. శుక్రవారం రాత్రి ఆయన అస్వస్థతకు లోనైనట్టు, ధర్మపురిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. అక్కడ ప్రథమ చికిత్సతో ఆయన్ను చైన్నెకి తరలించారు. ఇక్కడి అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన ఆరోగ్యంపై ఆందోళన వద్దని, త్వరితగతిన డిశ్చార్జ్ అవుతారని మద్దతు దారులు తెలిపారు. కొరుక్కుపేట: చైన్నెలోని బెసెంట్ నగర్లోని అన్నై వేలంగని ఆలయం 53వ వార్షిక ఉత్సవం 29న ధ్వజారోహణంతో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 8న ఈ ప్రసిద్ధ ఆలయంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. పండుగ మొదటి రోజు చైన్నె మైలాపూర్ ఆర్చ్డయోసెస్ ఆర్చ్ బిషప్ జార్జ్ ఆంథోనీ స్వామి జెండా ఎగురవేసి కార్యక్రమం ప్రారంభం అవుతుందని దీనికి ఆలయ ఫాదర్ అరుళప్ప అధ్యక్షత వహిస్తారు. ఈ నెల 30వ తేదీన సాయంత్రం ప్రత్యేక పూజలు జరుగుతాయని ఈ ప్రార్థనల్లో మాజీ ఆర్చ్ బిషప్ ఎ.ఎం. చిన్నప్ప ఇందులో పాల్గొంటారు. 31వ తేదీన ఉమ్మడి పూజ జరుగుతాయని, బిషప్ సింగరాయన్ ప్రత్యేక అతిథిగా హాజరవుతారని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. చివరి రోజున మేరీమాత పట్టాభిషేక మహోత్సవం జరుగుతుందని, బెసెంట్ నగర్ లోని వేళంకన్ని ఆలయానికి చైన్నెతోపాటూ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేయనున్నారు. ఈ ఏడాది కూడా భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఫాదర్ అరుళప్ప తెలిపారు. కొరుక్కుపేట: చైన్నె నుంచి సేలం వెళ్లే ఇండిగో ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం శుక్రవారం రాత్రి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆ విమానంలో ప్రయాణించడానికి వచ్చిన ప్రయా ణికులను భద్రతా అధికారులు స్క్రీనింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో సేలంకు చెందిన సురేష్ (35) అనే ప్రయాణికుడి వద్ద తనిఖీలు చేశారు. అతని బ్యాగ్లో పరిశోధన కోసం ఉపయోగించగల జీపీఎస్ పరికరం ఉన్నట్లు గుర్తించారు. విమానయాన భద్రతా నిబంధనల ప్రకారం జీపీఎస్ పరికరాలను విమానంలో తీసుకెళ్లకూడదు. దీని తరువాత, వారు అతని ప్రయాణాన్ని రద్దు చేసి, అతని నుంచి ఆ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతను సేలం నుంచి వచ్చాడని, అతను ఖనిజ వనరుల గనిని మైనింగ్ లీజుకు తీసుకుంటున్నాడని వెల్లడైంది. సురేష్ను చైన్నె విమానాశ్రయ పోలీస్స్టేషన్కు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వినాయక చవితికి నిబంధనలు పాటించాలి
వేలూరు: కాట్పాడి ప్రాంతంలో వినాయకచవితికి 10 అడుగులకు పైగా వినాయకుని విగ్రహాలను ప్రతిష్టించరాదని డీఎస్పీ పయణి స్పష్టం చేశారు. ఈనెల 27వ తేదీన దేశవ్యాప్తంగా వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ట, ఊరేగింపు, బందోబస్తు ఏర్పాట్లపై హిందూ మున్నని, ముస్లిం మైనారిటీ సంఘాల ప్రతినిధులతో ఆయన కాట్పాడిలోని తాలుకా కార్యాలయంలో తహసీల్దార్ జగదీశ్వరన్ అధ్యక్షతన సమీక్షించారు. వినాయక చతుర్థికి విగ్రహ ఊరేగింపును పోలీసులు సూచించిన దారిలోనే చెరువుకు తీసుకెళ్లాలన్నారు. అనుమతి పొందిన ప్రాంతాల్లో మాత్రమే వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించి పూజలు చేపట్టాలన్నారు. అనుమతి లేని ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టిస్తే పోలీసుల బందోబస్తు నిర్వహించేందుకు కుదరదని వారి సొంత పూచి కత్తులపై విగ్రహాలు ఏర్పాటు చేస్తే అందుకు నిర్వహకులే బాధ్యత వహించాలన్నారు. ఊరేగింపు సమయంలో ఇతరులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలన్నారు. ఉదయం ఊరేగింపును ప్రారంభించి సాయంత్రానికి పూర్తి చేయాలని ట్రాఫిక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కల్పించరాదన్నారు. సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు, హిందూ మున్నని సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
ఎంపీల మద్దతు వేటలో అభ్యర్థులు
సాక్షి, చైన్నె : తమిళనాడులోని ఎంపీల ఓట్లను గురిపెట్టి ఉప రాష్ట్రపతి అభ్యర్థులు చైన్నె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్రెడ్డి చైన్నెకు రానున్నారు. సోమ లేదా మంగళవారం బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ రాబోతున్నారు. వివరాలు.. రాష్ట్రపతి ఎన్నికకు సెప్టెంబరు 9న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ పోటీలో ఉన్నారు. తమిళనాడు వాసి కావడంతో ఇక్కడున్న ఎంపీలు పార్టీలకు అతీతంగా ఆయన్ని ఆదరించాలనే నినాదం తెరమీదికి వచ్చింది. ఇక్కడున్న పార్టీలతో, ఎంపీలుతో సీపీ రాధాకృష్ణన్కు వ్యక్తిగతంగా పరిచయాలు, సాన్నిహిత్యం ఉండడం గమనార్హం. అదే సమయంలో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్రెడ్డి రంగంలోకి దిగి ఉండడంతో ఓట్ల వేట ఆసక్తికరంగా మారింది. ఇండియా కూటమిలో డీఎంకే కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వారి ఓట్లన్నీ సుదర్శన్రెడ్డి ఖాతాలో చేరాల్సిందే. కాగా ఈ ఇద్దరు అభ్యర్థులు ఎంపీలను ప్రసన్నం చేసుకునేందుకు చైన్నె వైపుగా కదిలేందుకు సిద్ధమయ్యారు. నేడు చైన్నెకి సుదర్శన్రెడ్డి ఇందులో ముందుగా సుదర్శన్రెడ్డి ఆదివారం చైన్నెకు రానున్నారు. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ను కలవనున్నారు. అనంతరం జరిగే కార్యక్రమంలో ఎంపీలతో, డీఎంకే కూటమి పార్టీల నేతలతో సమావేశం కానున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో లోక్సభ సభ్యులు 39 మంది ఉన్నారు. ఇందులో డీఎంకే సభ్యులు 22 మంది (ఒకరు కొంగునాడు మక్కల్దేశీయ కట్చి ఎంపీ), కాంగ్రెస్ –తొమ్మిది, సీపీఎం, సీపీఐ, వీసీకే తలా ఇద్దరు, ఎండీఎంకే ఒకరు, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ ఒకరు ఉన్నారు. ఈ పార్టీలన్నీ ఇండియా కూటమిలో నే ఉన్నాయి. అయితే సీపీఆర్కు ఇందులో అనేక మంది ఎంపీలకు వ్యక్తిగత పరిచాయాలు ఉండడం ఆసక్తికరం. ఇక రాజ్యసభ సభ్యుల విషయానికి వస్తే తమిళనాడు నుంచి మొత్తం 18 మంది ఉన్నారు. వీరిలో నలుగురు అన్నాడీఎంకే సభ్యులు కాగా, మరొకరు అన్నాడీఎంకే మద్దతుతో రాజ్యసభకు వెళ్లిన తమిళమానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ ఉన్నారు. కాగా అన్నాడీఎంకే తరపున రాజ్యసభకు వెళ్లిన ధర్మర్ ఆ తదుపరి పరిణామాలతో తాను స్వతంత్రం అంటూ వేరుగా అడుగులు వేస్తున్నారు. డీఎంకేకు చెందిన పదిమంది , కాంగ్రెస్ ఒకరు, మక్కల్ నీది మయ్యం నుంచి మరొకరు రాజ్య సభకు వెళ్లి ఉండడం గమనార్హం. ఎంపీల ప్రసన్నం కోసం ఉపరాష్ట్రపతి అభ్యర్థుల రాకతో తమిళనాట రాజకీయ సందడి ఊపందుకున్నట్లయ్యింది. -
అవయవ దాతల కుటుంబాలకు సత్కారం
సాక్షి, చైన్నె: తమ వాళ్లు మరణం అంచున ఉన్నా, బరువెక్కిన గుండెతో బాధను దిగమింగుకుని వారి అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబాలను ఎంజీఎం హెల్త్ కేర్ సత్కరించింది. మరొకరి ప్రాణాలను రక్షించేందుకు నిస్వార్థంగా కృషి చేసిన అవయవ దాతలను, వారి కుటుంబాలను సత్కరించుకునేవిధంగా శనివారం స్థానికంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీ నటి నీలిమా రాణి, అన్నానగర్ ఎమ్మెల్యే ఎంకే మోహన్లు ఈ సందర్భంగా మైల్స్ ఫర్ లైవ్ అనే అంశంపై వాక్థాన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఎంజీఎం హెల్త్కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ డిసీజెస్, ట్రాన్స్ పాలట్, అండ్ హెపీబీ సర్జరీ నేతృత్వంలో ఈ వాక్ థాన్, సత్కార కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆస్పత్రి ఎండీ డాక్టర్ ప్రశాంత్ రాజగోపాలన్ మాట్లాడుతూ, దాతల సత్కారం, వాక్థాన్ కార్యక్రమం గురించి గుర్తు చేస్తూ , వైద్య శాస్త్రం అద్భుత అభివృద్ధిని సాధించిందన్నారు. లివింగ్, కాడేవర్ డొనేషన్లు రెండు సురక్షితం అని, జీవించి ఉన్న దాతలు ఒక కిడ్నీ లేదా, కాలేయంలో కొంత భాగాన్ని దానం చేయడానికి వీలుందన్నారు. దీని వలన దాత , గ్రహీత ఇద్దరూ ఆరోగ్యంగా, సంతృప్తికర జీవితాన్ని గడపవచ్చని వివరించారు. కాడేవర్ విరాళాలు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్ర పిండాలు, ప్యాంక్రియాస్, కార్నియాస్ వంటి అవయావాల ద్వారా బహుళ ప్రాణాలను రక్షించ బడుతాయని వివరించారు. సీనియర్ వైద్యులు , డైరెక్టర్ త్యాగరాజన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ, అవయవదానం అత్యాధునిక వైద్యానికి లభించే గొప్ప బహుమతులలో ఒకటిగా పేర్కొన్నారు. అవయదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
వీరరాఘవుని ఆలయ ముందుభాగంలో వర్షపు నీరు
తిరువళ్లూరు: ప్రసిద్ధి చెందిన వీరరాఘవుని ఆలయ ముందుభాగంలో భారీగా చేరిన వర్షపు నీటితో రాకపోకలు సాగించలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో 20పైగా దుకాణాలు, 30 నివాసాలు వుంటున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా ఆలయ ముందు భాగంలో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో పాటూ మురుగు నీరు సైతం కలవడంతో దుర్వాసన వెదజల్లింది. ఈ నీటిలోనే భక్తులు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి వర్షపు నీటిని తొలగించాలని భక్తులు కోరుతున్నారు. -
ప్రజాస్వామ్యం అపహాస్యం
కొందరి తీరుతో..పరిమితికి మించిన అధికారాలను చెలాయిస్తున్న పాలకుల వల్ల కేంద్రానికి రక్తపోటు... ఉన్న అధికారాల్లోనూ కోతల కారణంగా రాష్ట్రానికి రక్త హీనత తప్పడం లేదని సీఎం ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా అనారోగ్యం అంటూ, ఇందుకు కేంద్ర పాలకుల అసమర్థతే కారణం అని విమర్శించారు. వాస్తవానికి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు బదులు, అధికార వర్గం అజమాయిషీ పెరుగుతోందని మండిపడ్డారు. సదస్సులో ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: చైన్నెలోని కలైవానర్ అరంగంలో శనివారం కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై జాతీయ సెమినార్ జరిగింది. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై చారిత్రాత్మక ఘటనలను, అంశాలను గుర్తు చేస్తూ జరిగిన ఈ సదస్సుకు సీఎం ఎంకే స్టాలిన్ హాజరయ్యారు. అలాగే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ చలమేశ్వర్లు కీలక అంశాల గురించి ప్రస్తావించారు. ఈ సదస్సులో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై తొలి జాతీయ సెమినార్ను తమిళనాడు నిర్వహించడం, దీనిని తాను ప్రారంభించడం ఆనందంగా, గర్వంగానూ ఉందన్నారు. వేల సంవత్సరాలుగా అనేక ప్రత్యేక లక్షణాలను ఈ తమిళ భూమి కలిగి ఉందన్నారు. ఇక్కడ అందరూ సమానమే అనే సమానత్వ ఆలోచన ఆధారంగా అందరికీ అన్నీ నినాదంతో తన ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. హక్కుల సాధన, సామాజిక న్యాయం, సిద్ధాంతాలను అనుసరించి ఇక్కడ అనేక ప్రగతి శీల చట్టాలు ఆమోదించ బడ్డాయని వివరించారు. ఆ దిశగానే ప్రణాళికలను కూడా రచించి అమలు చేస్తూ వస్తున్నామని, దీనికి పునాది ద్రావిడ ఉద్యమంగా పేర్కొన్నారు. పిట్టి త్యాగరాయర్ నుంచి అన్నా, కలైంజ్ఞర్ వరకు సమానత్వం, సామాజిక న్యాయం ,మహిళా హక్కులు, ఆదర్శనాల కోసం పోరాడారని వివరించారు. తమిళనాడు రాజకీయాలు అంటే సామాజిక న్యాయం అని, తమిళనాడులో ఆర్థిక వృద్ధి, ప్రయోజనాలు అన్ని వర్గాల ప్రజలను చేరుతూ వస్తున్నట్టు తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడు అన్ని రంగాలలో అగ్రగామని రాష్ట్రంగా కొనసాగుతోంది, ఎదుగుతోందని వ్యాఖ్యలు చేశారు. వారికే అధిక ప్రాధాన్యత.. ఈసందర్భంగా తమిళనాడు గవర్నర్ అనుసరిస్తున్న తీరును గుర్తు చేస్తూ, బీజేపీ అనుకూల రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని రకాలుగా ప్రాధాన్యతను ఇస్తూ, బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలపై చిన్న చూపు తగదని మండి పడ్డారు. రాష్ట్రాలకు తగిన నిధులు అందించాలని డిమాండ్ చేస్తూ, గత నాలుగు సంవత్సరాలలో నిధుల వ్యవహారంలో తాము ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. కేంద్రం నుంచి సరైన సహకారం కొరవొడినా, అంచెలంచెలుగా పరిస్థితిని అధిగమించి నేడు ఆర్థికవృద్ధిని రెండు అంకెల స్థాయికి తీసుకెళ్లామని ధీమా వ్యక్తంచేశారు. జస్టిస్ చలమేశ్వర్ ఇక్కడ ప్రత్యేక ప్రసంగం చేశారని గుర్తు చేస్తూ, ప్రస్తుత న్యాయ విధానాలు, ప్రభుత్వం విభాగాల పద్ధతులలో తన అనుభవాన్ని, ఆలోచనలను ఆయన పంచుకున్నారని వివరించారు. రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి, కేంద్రంలో సమాఖ్య వాదం అనే సూత్రం ఐక్యతను బలోపేతం చేస్తుందన్నారు. ఈ విషయంగా జస్టిస్ కురియన్ మాట్లాడినప్పుడు ఒకే వాక్యంలో రూపంలోచక్కగా వివరించారని పేర్కొంటూ, అన్నింటి కన్నా రాజ్యాంగం గొప్పదని స్పష్టం చేశారన్నారు. స్వయం సంవృద్ధి గల రాష్ట్రాల ప్రయత్నాల ద్వారా మాత్రమే ఐక్యత భారతదేశ బలంగా మారుతుందని, బలహీన రాష్ట్రాల వల్ల భారతదేశం పతనం వైపుగా వెళ్తుందన్న విషయాన్ని కేంద్రం గుర్తెరగాలని హితవు పలికారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి విధానం కోసం శ్రద్ధ వహించే విధంగా ప్రతి ఒక్కరూ తమ స్వరాన్ని పెంచాలని, ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తరహాలో కమిటీలను దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఏర్పాటు చేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి హోదా కోసం తమిళనాడు పోరాడుతుందని, ఇందులో తమిళనాడు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముందుగా కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఉన్నత స్థాయి కమిటీ కోసం రూపొందించిన వెబ్సైట్ను సీఎం స్టాలిన్ ఆవిష్కరించారు. నిధుల కష్టాలు.. అనేక పరోక్ష పన్నులతో పాటూ జీఎస్టీ రూపంలో అధిక ఆదాయం అన్నది కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు నుంచే ఉంటున్నదని వివరించారు. అయితే వారు తిరిగి ఇచ్చే మొత్తం మరీ తక్కువగా ఉంటున్నదని, అంతే కాదు, నిధుల పంపిణీలోనూ వివక్షతకు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంకుచిత రాజకీయ లక్ష్యాలతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా తీవ్రంగా దుయ్యబడుతున్నట్టు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో అనేక అద్భుతమైన సామాజిక–ఆర్థిక ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేశామని, గత నాలుగు సంవత్సరాలలో ద్రావిడ మోడల్ పాలన వివిధ సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లామని వివరించారు. సంక్షోభాలు ఎ దురైనా, కేంద్రం నిర్లక్ష్యానికి గురైనా, ఆర్థికంగా బలోపేతం దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్లలో బీజేపీయేతర పార్టీలనాయకత్వంలో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని గుర్తు చేస్తూ, ఈ రాష్ట్రాలపై రాజ్యంగ నిబంధనలను కేంద్రం పాలకులు ఉల్లంఘిస్తూ వస్తున్నారని ధ్వజమెత్తారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ కశ్మీర్లో ప్రజలతో ఎన్నికై న ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ పాలనను తీసుకొచ్చి ఘనత ఈ కేంద్రం పాలకులది కాదా..? అని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను నిరంతరం ఎలా కాలరాయాలో అన్న దిశగానే కేంద్రం చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో రాజ్యాంగ సవరణను ప్రతిపాదించేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించామని పేర్కొంటూ, గతంలో జస్టిస్ సర్కారియా కమిటీ తన నివేదికలో పేర్కొన్న అంశాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. రక్త పోటు...రక్త హీనత కేంద్ర ప్రభుత్వం అధిక అధికారాన్ని కూడబెట్టుకోవడం వలన దానికి రక్త పోటు తప్పడం లేదని, అధికారాల కోతతో రాష్ట్రాలకు రక్త హీనత ఎదురు అవుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ఫలితం అనారోగ్యం తప్పదన్నారు. కేంద్రం నిర్లక్ష్యం, అసమర్థతే ఇందుకు కారణంగా ధ్వజమెత్తారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పాలనలో రాష్ట్రాల హక్కులను కాపాడటానికి అధ్యయన బృందం ఏర్పాటు చేయాలని డీఎంకే పట్టుబడ్డటంతో 2007లో ఏర్పాటైన కమిషన్ చేసిన సిఫారసులను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఇందులోని అంశాలను కేంద్ర ప్రభుత్వం నేటికీ ఒక్కటంటే ఒక్క సిఫారసును పరిగణించ లేదని మండిపడ్డారు. -
తల్లి ఏనుగు కోసం గున్న ఏనుగు ఆరాటం
అన్నానగర్: కొడైకెనాల్ సమీపంలో స్ప్పహ కోల్పోయిన ఏనుగుకు అటవీ అధికారులు 8 గంటలు చికిత్స అందించారు.ఈ క్రమంలో గున్న ఏనుగు తల్లిని వదలకుండా పోరాడిన వైనం ఆకట్టుకుంది. వివరాలు.. కొడైకెనాల్ కొండలలోని అడవి ఏనుగులు తమ సహజ ఆవాసాలను విడిచిపెట్టి గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ భూములలో మకాం వేస్తున్నాయి. ఈ పరిస్థితిలో, కొడైకెనాల్ తాలూకాలోని విల్పట్టి పంచాయతీ పరిధిలోని అలతురై పక్కన ఉన్న గణేశపురం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ తోటలో ఒక ఆడ ఏనుగు అపస్మారక స్థితిలో కనిపించింది. దాని సమీపంలో ఒక గున్న ఏనుగు నిలబడి ఉంది. ఇది చూసిన తోట యజమాని సెల్వం అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అటవీ అధికారులు, పశువైద్యుల బృందం వైద్య పరికరాలతో అక్కడికి చేరుకుని చికిత్స అందించి కాపాడారు. ఈక్రమంలో తన తల్లికి అపకారం తలపెడుతారనే తలంపుతో వారిని అడ్డుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇక ఆరోగ్యం బాగాలేని ఆడ ఏనుగు వయస్సు దాదాపు 55 సంవత్సరాలు. అది మూడేళ్ల క్రితం ఓ ఏనుగుకు జన్మనిచ్చింది. తగినంత పోషకాహారం లేకపోవడంతో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై స్ప్పహ కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. -
ఆయన నక్సలైట్ల మద్దతుదారుడు
కొచ్చి/తిరునల్వేలి: నక్సలైట్లకు గట్టి మద్దతుదారుడైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డిని విపక్ష ‘ఇండియా’ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తప్పుపట్టారు. ఛత్తీస్గఢ్లో నక్సలైట్లపై పోరాటానికి గిరిజన యువకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సల్వాజుడుం’ చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అంటూ 2011లో జస్టిస్ సుదర్శన్రెడ్డి తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. శుక్రవారం కేరళలో ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. నక్సలైట్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి సుప్రీంకోర్టును జస్టిస్ సుదర్శన్రెడ్డి వాడుకున్నారని ఆరోపించారు. ఆయన ఆ తీర్పు ఇవ్వకుంటే, సల్వాజుడుం అమల్లో ఉంటే నక్సలైట్ల ఉద్యమం 2020 నాటికే అంతమయ్యేదని అన్నారు. నక్సలైట్ల సిద్ధాంతంతో స్ఫూర్తి పొందిన జస్టిస్ సుదర్శన్రెడ్డి సల్వాజుడుంకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని మండిపడ్డారు. వామపక్షాల ఒత్తిడి మేరకే కాంగ్రెస్ పార్టీ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్రెడ్డిని ఎంపిక చేసుకుందని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉంటే... ఢిల్లీ మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండగానే పదవికి రాజీనామా చేసి ఉంటే.. రాజ్యాంగ(130 సవరణ) బిల్లు–2025ను తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదని అమిత్ షా అన్నారు. 30 రోజులపాటు జైల్లో ఉన్న వారిని పదవుల నుంచి తొలగించే బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం సరైంది కాదని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను అన్ని రాజకీయ పారీ్టలూ పాటించాలని సూచించారు. ఏ ముఖ్యమంత్రి అయినా జైలులో ఉండి ప్రభుత్వాన్ని నడపాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. జైల్లో ఉంటూ కూడా పరిపాలన సాగిస్తారని మన రాజ్యాంగ రూపకర్తలు ఊహించలేదని, అందుకే ఈ అంశాన్ని రాజ్యాంగంలోని చేర్చలేదని స్పష్టంచేశారు. జైల్లో ఉన్న నేతలను పదవుల నుంచి తొలగించడంలో తప్పేమీ లేదన్నారు. సోనియా, స్టాలిన్ కలలు నెరవేరవు రాజ్యాంగ(130 సవరణ) బిల్లును ‘నల్ల బిల్లు’ అనే హక్కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు లేదని అమిత్ షా తేల్చిచెప్పారు. శుక్రవారం తమిళనాడులోని తిరునల్వేలిలో బీజేపీ బూత్ కమిటీల సమావేశంలో ప్రసంగించారు. చీకటి పనులు చేసిన చరిత్ర స్టాలిన్కు ఉందన్నారు. డీఎంకే ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆరోపించారు. స్టాలిన్ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం సోనియా గాంధీ ఎజెండా, కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను ముఖ్యమంత్రిని చేసుకోవడం స్టాలిన్ ఎజెండా అని దుయ్యబట్టారు. వారి కలలు నెరవేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 2026లో తమిళనాడులో ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాంను అప్పట్లో రాష్ట్రపతిని చేసింది, నేడు అదే తమిళనాడు బిడ్డ సీపీ రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసింది ఎన్డీయే ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. -
ఫైనాన్సియర్ సహా ముగ్గురి అరెస్టు
తిరుత్తణి: స్పీడ్ వడ్డీ చెల్లింపులో జాప్యం జరగడంతో చిన్నారిసహా దంపతులను లాడ్జీలో బంధించి దాడి చేసి, హత్య చేస్తామని బెదిరించిన అరక్కోణం పట్టనానికి చెందిన ఫైనాన్సియర్ సహా ముగ్గురిని తిరుత్తణి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తిరుత్తణి పోలీసుల కథనం మేరకు.. తిరుత్తణి సాయిబాబానగర్కు చెందిన ప్రత్విరాజ్వర్మ(30) ఆటోడ్రైవర్. తన కుటుంబ అవసరాల కోసం అరక్కోణంలో ఫైనాన్స్ సంస్థలో స్పీడ్ వడ్డీకి భాస్కర్ అనే వ్యక్తి వద్ద రూ.50 వేలు అప్పు తీసుకున్నారు. ఇందుకోసం ముందుగా రూ.15 వేలు వడ్డీ పట్టుకుని రూ.35 వేలు ఇచ్చారు. ప్రతిరోజూ రూ.600 చెల్లించాలని, అప్పు 85 రోజుల్లో పూర్తిగా తిరిగి ఇవ్వాలన్నది వారి కండీషన్. 35 రోజులపాటు క్రమంగా రోజూ రూ.600 చెల్లిస్తూ వచ్చిన క్రమంలో పది రోజులుగా డబ్బులు చెల్లించకపోవడంతో ప్రత్వి రాజ్ వర్మ, అతని భార్య స్వాతి, వారి ఏడాదిన్నర బాలుడిని అరక్కోణం పట్టణానికి రమ్మని చెప్పడంతో వారు గురువారం ఉదయం అరక్కోణంలోని ప్రైవేటు లాడ్జీకి వెళ్లారు. అక్కడ ఒక గదిలో వారిని బంధించి హత్య చేస్తామని బెదిరించడంతోపాటు వడ్డీసహా డబ్బులు చెల్లించకపోతే విడిచిపెట్టబోమని చెప్పారు. దీంతో ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకొస్తానని చెప్పి వచ్చిన ప్రత్విరాజ్ తిరుత్తణి ఏస్పీ కార్యాలయంలో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ దీవాన్ ఆదేశాల మేరకు తిరుత్తణి సీఐ మదియరసన్ అరక్కోణం పట్టణానికి వెళ్లి లాడ్డి గదిలో బంధించిన తల్లీబిడ్డను విడిపించుకుని అక్కడున్న ఇద్దరిని స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. అరక్కోణం మేల్పాక్కంకు చెందిన తమిళ్వానన్(34), దీపక్(35) ఇద్దరు భాస్కర్ అనే వ్యక్తి వద్ద పనిచేస్తున్నట్లు అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్న భాస్కర్ వద్ద డబ్బులు వసూలు చేసే పనిచేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఫైనాన్సియర్ భాస్కర్, తమిళ్వానన్, దీపక్ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టయిన ఫైనాన్సియర్ భాస్కర్, తమిళ్వానన్ -
ఏనుగును గాయపరిచిన మావటి తొలగింపు
తిరువొత్తియూరు: ముదుమలై తెప్పకాడు శిబిరంలో సంరక్షణలో వున్న ఏనుగును కత్తితో పొడిచి గాయపరిచిన మావటిని విధుల నుంచి తొలగించారు. నీలగిరి జిల్లాలోని ముదుమలై పులుల సంరక్షణ కేంద్రం 688 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ సంరక్షణ కేంద్రంలో శతాబ్దాల చరిత్ర కలిగిన తెప్పకాడులో పెంపుడు ఏనుగుల శిబిరం ఉంది. ఇక్కడ 20కి పైగా ఏనుగులను అటవీ శాఖ అధికారులు సంరక్షిస్తున్నారు. ప్రతి ఏనుగుకు ఒక మావటి, ఒక సహాయకుడు ఉంటారు. పెంపుడు ఏనుగులను మావటివాళ్లు రాత్రిపూట అటవీ ప్రాంతంలో మేతకు వదులుతారు. అభయారణ్య ఏనుగుల శిబిరంలో సుమంగళ అనే ఏనుగు ఉంది. దీనికి కృష్ణమారన్ అనే మావటి ఉన్నాడు. ఈ ఏనుగు రాత్రిపూట అడవిలోకి వెళ్లి ఉదయం శిబిరానికి వచ్చి మగ ఏనుగులపై దాడి చేయడం, వాటిని నెట్టడం సాధారణం. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం మేతకు వెళ్లిన సుమంగళ ఏనుగు తెల్లవారుజామున శిబిరానికి వచ్చి శంకర్ అనే ఏనుగును నెట్టి కింద పడేసింది. దీంతో శంకర్ ఏనుగు పెద్దగా అరిచింది. శంకర్ ఏనుగు మావటి విక్కి బయటకు వచ్చి చూశాడు. ఆ సమయంలో శంకర్ ఏనుగు కింద పడి ఉంది. దీంతో కోపంతో ఉన్న విక్కి కరత్రో సుమంగళ ఏనుగును కొట్టి దూరంగా పంపడానికి ప్రయత్నించాడు. కానీ సుమంగళ ఏనుగు మళ్లీ శంకర్ ఏనుగుపై దాడి చేసింది. దీంతో కోపంతో ఉన్న విక్కి కత్తి తీసుకుని ఏనుగు వెనుక కాలిని కోశాడు. ఆ తర్వాత సుమంగళ ఏనుగు ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోయింది. విక్కి కత్తితో కోయడంతో ఏనుగుకు గాయమైంది. విషయం తెలిసి సుమంగళ మావటి కృష్ణమారన్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. పశు వైద్యులు రాజేష్కుమార్, సహాయ సంచాలకుడు విద్యా అక్కడికి వెళ్లి గాయపడిన ఏనుగుకు చికిత్స అందించారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. ఈ మేరకు ఏనుగును కత్తితో గాయ పరిచిన మావటిని విధుల నుంచి తొలగించారు. -
ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
వేలూరు: సిమ్కో కో–ఆపరేటివ్ సొసైటీలోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్ణన్ అన్నారు. సిమ్కో కో–ఆపరేటివ్ సొసైటీ సాదారణ సమావేశం, లబ్ధిదారులకు సంక్షేమ సహాయకాల పంపిణీ కార్యక్రమం వేలూరులోని టౌన్ హాలులో జరిగింది. ఆయన మాట్లాడుతూ సిమ్కో సొసైటీ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళలను ఎంపిక చేసి పలు సంక్షేమ పథకాలను అందజేస్తున్నామన్నారు. ముఖ్యంగా టైలరింగ్ పూర్తి చేసిన వారికి కుట్టుమిషన్లను అందజేస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుతం 20 మంది మహిళలకు కుట్టుమిషన్లు అందజేస్తున్నామని మిగిలిన వారికి కూడా విడతల వారిగా సీనియారిటి ప్రకారం అందజేస్తామన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులు ఉపయోగిస్తున్నారా వారికి ఏదైనా బ్యాంకు రుణాలు అవసరం ఉందా అనే కోణంలో అధికారులు తరచూ పర్యవేక్షించాలన్నారు. అనంతరం లబ్దిదారులకు సంక్షేమ పథకాలను అందజేశారు. అసిస్టెంట్ మేనేజర్ కార్తికేయన్, తమిళనాడు సహాకార భారతి రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్, తిరువణ్ణామలై జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఇమయవర్మన్, నిప్కో చైర్మన్ కార్తికేయన్, పెరుమాల్కుప్పం సర్పంచ్ కోటీశ్వరన్, కార్పొరేటర్ లోకనాథన్, సిమ్కో అధ్యక్షురాలు అముద, బ్రాంచ్ మేనేజర్ నవీన్కుమార్, సిమ్కో కో–ఆపరేటివ్ సొసైటీ నిర్వహకులు, సభ్యులు పాల్గొన్నారు. -
పీఎంకేలో వారసురాలు శ్రీగాంఽధీకి పదవి
రాందాసు నిర్ణయం సాక్షి, చైన్నె : పీఎంకేలో తన పెద్దకుమార్తె గాంధిమది అలియాస్ శ్రీ గాంధీకి రాందాసు పదవి కేటాయించారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో ఇక దూసుకెళ్లనున్నారు. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి రాందాసు మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. తలా ఓ శిబిరంగా పార్టీని ముక్కలు చేసినట్టుగా నడిపించుకుంటున్నారు. ఎవ రికి వారు పోటా పోటీగా సర్వ సభ్య సమావేశాలను నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అన్బుమణికి చెక్ పెట్టే దిశగా రాందాసు వ్యూహాలకు పదును పెట్టినట్టున్నారు. తన పెద్దకుమార్తె గాంధి కుమారుడైన ముకుందన్కు యువజన పదవి అప్పగించే సమయంలో అన్బుమణి తీవ్ర వ్యతిరేకతను తెలియజేయడాన్ని పరిగణించి ఉన్నారు. అన్బుమణికి రాజకీయంగా చెక్ పెట్టేలా తన కుమార్తె గాంధీని రంగంలోకి దించేందుకు రాందాసు నిర్ణయించడం గమనార్హం. రాందాసు, అన్బుమణి మధ్య వార్ తీవ్రతరమైనప్పటి నుంచి రాందాసుకు పక్క బలంగా కుమార్తె గాంధీ, ఆమె కుమారుడు ముకుందన్ వెన్నంటి ఉంటూ వస్తున్నారు. పార్టీ సర్వ సభ్య సమావేశంలో సైతం అన్బుమణి కూర్చునే ప్రదేశంలో గాంధీ కూర్చున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు పార్టీ కార్యనిర్వాహక కమిటీలో చోటు కల్పిస్తూ రాందాసు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. కమిటీలోకి వచ్చిన అనంతరం ఆమెకు పార్టీలో కీలక పదవి అప్పగించనున్నట్టు సమాచారం. అన్బుమణికి ప్రత్యామ్నయంగా గాంధీని పీఎంకేలో ముందుకు తీసుకెళ్లే వ్యూహంతో రాందాసు ఉన్నట్టు చర్చ ఊపందుకుంది. అన్బుమణిని పక్కన పెట్టి గాంధీ, ఆమె కుమారుడు ముకుందన్ను తెరపైకి తెచ్చి పార్టీని నడిపించే వ్యూహంలో భాగంగానే పీఎంకేలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆరోగ్య సంరక్షణ సేవలకు బీమా తప్పనిసరి
సాక్షి,చైన్నె : ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రస్తుతం బీమా తప్పనిసరిగా మారిందని, ప్రతి ఒక్కరూ బీమా సేవల గురించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలని ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ కో చైర్మన్ వెంకటాచలం తెలిపారు. ఆరోగ్యబీమాపై అవగాహన కార్యక్రమంలో శుక్రవారం స్థానికంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన సమగ్ర వివరాలను తెలియజేశారు. బీమా రంగంపై తమిళనాడులో వంద శాతం అవగాహన ఉందని, 70 శాతం మంది త్వరలో జీవిత బీమా కొనడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ చేపట్టిన అధ్యయనంలో వెలుగు చూసిన అంశాలు మరెన్నో ఉన్నాయన్నారు. పాలసీ దారులకు కాని వారిలో 70 శాతం మంది రానున్న 3 లేదా 6 నెలల్లో జీవిత బీమాలో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్టు తేలిందన్నారు. 63 శాతం మందికి పొదుపు ఆధారిత జీవిత బీమా పాలసి కలిగి ఉన్నారని పేర్కొన్నారు. కుటుంబం కోసం 63 శాతం, పిల్లల భవిష్యత్తు కోసం 48 శాతం ఆర్థిక భద్రతను కలిగి ఉన్నట్టు తెలిపారు. రక్షణ, పొదుపు పథకాలతో పాటుగా అవగాహన పెంపునకు మరింతగా మార్గాలను సులభతరం చేయడం, విస్తృతం చేయడం అవశ్యంగా పేర్కొన్నారు. -
శ్రేయా అనిష్కు సత్కారం
కొరుక్కుపేట: వంటల పోటీల్లో బంగారు పతకం సాధించిన శ్రేయా అనిష్ను ఘనంగా సత్కరించారు. చైనీస్ వంటకాల చాంపియన్షిప్లో చైన్నెకు చెందిన చైన్నెస్ అమృత ఇనిస్టిట్యూట్ విద్యార్థిని శ్రేయ అనిష్ పంతకాల పంట పండించింది. ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. దీంతో ఈ విద్యార్థినిని ప్రశంసిస్తూ చైన్నెస్ అమృత ఇనిస్టిట్యూట్ చైర్మన్ ఆర్ భూమినాథన్ ఘనంగా సత్కరించారు. జూలై 24 నుంచి 26 వరకు చైనాలోని చెంగ్డులో జరిగిన 2025 హోటెలెక్స్ చైనా ఇంటర్నేషనల్ చైనీస్ వంటకాల చాంపియన్షిప్లో వ్యక్తిగత ఆహార కళ ప్రదర్శన (కార్వింగ్) విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుని, భారతదేశానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. చైనా, థాయిలాండ్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, వియత్నాం, భారతదేశం నుంచి వచ్చిన 175 మంది ప్రొఫెషనల్ చెఫ్లలో ఆమె విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా భూమినాథన్ మాట్లాడుతూ భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపును సాధించిన శ్రేయ అనిష్ ఎంబీఏ చదువుకు అయ్యే మొత్తం ఫీజును చైన్నెస్ అమృత ఇనిస్టిట్యూట్ అందిస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చెఫ్ కార్తీక్ను ఘనంగా సత్కరించగా ఇందులో ఇనిస్టిట్యూట్ సీఈఓవో కవిత నందకుమార్, డీన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
అనిరుధ్ సంగీత కచ్చేరికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తమిళసినిమా: యువ సంగీత కెరటం అనిరుద్ హుక్కుమ్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా సంగీత కచేరిలను నిర్వహించ తలపెట్టారు. అందులో భాగంగా చైన్నెలో ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నారు. స్థానిక సముద్ర తీర ప్రాంతం, కువత్తూర్లోని స్వర్మభూవి ప్రాంతంలో జరుగనుంది. అందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. టికెట్ల బుకింగ్ కూడా భారీ ఎత్తున జరుగుతున్నట్లు అనిరుద్ వెల్లడించారు. అయితే ఈ సంగీత కచేరిని నిర్వాహకులు కలెక్టర్ అనుమతి పొందకుండా నిర్వహిస్తున్నారని, నిర్వహణ ప్రాంతంలో వచ్చే ప్రజలకు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదని, అందువల్ల ఆ సంగీత కచేరి జరగకుండా నిషేధం విధించాలని కోరుతూ చెయ్యూర్ నియోజకవర్గం శాసనసభ్యుడు పనైయూర్ బాబు శుక్రవారం ఉదయం చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ అనిరుద్ హుక్కుమ్ పేరుతో నిర్వహిస్తున్న సంగీత కచేరీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు ఇచ్చారు. అయితే ప్రజల భద్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా మహాబలిపురం డీఎస్సీ అనుమతి పొందాలని ఆదేశాలు జారీ చేశారు. రూ.85 లక్షలతో అభివృద్ధి పనులకు తీర్మానం పళ్లిపట్టు: పొదటూరుపేట టౌన్ పంచాయతీలో రూ.85 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కౌన్సిలర్ల సమావేశంలో తీర్మానం ఆమోదించారు. పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేట టౌన్ పంచాయతీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. చైర్మన్ రవిచంద్రన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కార్యనిర్వహణాధికారి హరిహకార్తికేయన్తోపాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ముందుగా పట్టణ పంచాయతీలో ఆదాయం, ఖర్చులకు సంబంధించిన నివేదిక సమర్పించారు. అనంతరం అభివృద్ధి పనులకు సంబంధించి సభ్యులు జరిపారు. 15వ ఫైనాన్స్ నిధుల నుంచి రూ.45 లక్షల వ్యయంతో మురుగునీటి కాలువలు, రోడ్ల నిర్మాణం, ఎమ్మెల్యే నిధులు రూ.10 లక్షల వ్యయంతో అంగన్వాడీ కేంద్రం, టౌన్ పంచాయతీ నిధులు రూ.18 లక్షల వ్యయంతో వివిధ సంక్షేమ పనులు చేపట్టాలని సమావేశంలో తీర్మానం ఆమోదించారు. గంజాయి తరలింపు కేసులో ఇద్దరి అరెస్టు అన్నానగర్: థాయిలాండ్ నుంచి చైన్నెకి రూ.12 కోట్ల విలువైన హైగ్రేడ్ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు యువకులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్లైన్న్స్ విమానం చైన్నెలోని మీనంబాక్కం విమానాశ్రయానికి శుక్రవారం వేకువజామున చేరుకుంది. విమానంలో ఉన్న ప్రయాణికులను విమానాశ్రయ కస్టమ్స్ ఇంటెలిజెనన్స్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆ సమయంలో పంజాబ్కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి, తమిళనాడుకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి పర్యాటకులుగా థాయిలాండ్ను సందర్శించి చైన్నెకి తిరిగి వచ్చారు. ఇద్దరూ పెద్ద సంచులను మోసుకెళుతుండగా కస్టమ్స్ డిపార్ట్మెంట్ నిఘా అధికారులకు వారిపై అనుమానం వచ్చింది. దీంతో వారి బ్యాగులను తనిఖీ చేశారు. అందులో మొత్తం 8 పార్శిళ్లు కనిపించాయి. వారు ఆ పార్శిళ్లు తెరిచి చూడగా వాటిలో హైగ్రేడ్, గ్రేడెడ్ హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు. 8 పార్శిళ్లలో మొత్తం 12 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి ఉండగా గుర్తించి, స్వాధీనం చేసుకుని, వారిని అరెస్టు చేశారు. దీని అంతర్జాతీయ విలువ రూ. 12 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. నిందితులపై చర్యలు తీసుకోండి వేలూరు: జిల్లాలోని గుడియాత్తం పట్టణానికి చెందిన కుమరన్ అనే వ్యక్తి శశికళ గురించి అసభ్యంగా మాట్లాడి సోషియల్ మీడియాలో పోస్టు పెట్టాడని, అతనిపై చర్యలు తీసుకుని, అతడిని అరెస్టు చేయాలని తిరుత్తణి నరసింహన్ కోరారు. ఈ మేరకు ఆయన అధ్యక్షతన వేలూరు ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడియాత్తం పట్టణానికి చెందిన కుమరన్ తరచూ అన్నాడీఎంకే ప్రతినిధులపై అసభ్యంగా మాట్లాడి సోషియల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, వీటిపై విచారణ జరిపి వెంటనే అతడిని అరెస్టు చేయాలని కోరారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ఆనందన్, పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి ఎల్కేఎండీ వాసు, కార్యకర్తలు, అనుచరులు ఉన్నారు. -
ముగిసిన దీపావళి బుకింగ్
కొరుక్కుపేట: దీపావళి పండుగ అక్టోబర్ 20న జరుపుకోనున్నారు. చైన్నెలో నివసించే బయటి జిల్లాల ప్రజలు సాధారణంగా దీపావళికి స్వస్థలాలకు వెళతారు. చివరి నిమిషంలో రద్దీని తట్టుకునేందుకు, వారు రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేందుకు ముందస్తుగా బుక్ చేసుకుంటారు. ఈ ఏడాది దీపావళి సోమవారం, ముందు రోజులు శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో శుక్రవారం తమ స్వస్థలాలకు వెళ్లాలని ప్రజలు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఈస్థితిలో, అక్టోబర్ 17న చైన్నె నుంచి బయలుదేరే రైళ్ల బుకింగ్ ఆగస్టు 18తో ముగిసింది. అదేవిధంగా, చైన్నె నుంచి క్రమం తప్పకుండా నడిచే ప్రభుత్వ ఎక్స్ప్రెస్ బస్సులలో చాలా సీట్లు అక్టోబర్ 17, 18 , 19 తేదీలకు రిజర్వ్ అయ్యాయి. పగటిపూట బయలుదేరే బస్సుల సంఖ్య మాత్రమే తక్కువగా ఉంటుంది. అక్టోబర్ 20, 21, 22 తేదీల్లో చైన్నెకి తిరుగు ప్రయాణం కోసం ప్రభుత్వ ఎక్స్ప్రెస్ బస్సుల్లో బుకింగ్లు వేగంగా జరుగుతున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పోక్సో చట్టం కింద యువకుడి అరెస్టు తిరువొత్తియూరు: బాలికను లైంగికంగా వేధించిన కేసులో పోక్సో చట్టం కింద యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. జార్ఖండ్ రాష్ట్రం సర్వాన్ జిల్లాకు చెందిన వినోద్ మహోత్ (35) గూడువాంచేరి ప్రాంతంలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతను నివాసమున్న ప్రాంతంలోని కిరాణా దుకాణంలో ఒక బాలిక ఒంటరిగా ఉండడాన్ని చూసిన వినోద్ మహోత్ కిరాణా దుకాణానికి వెళ్లి ఆ బాలికతో మాట్లాడుతూ తర్వాత తన సెల్ఫోన్లో ఉన్న అశ్లీల వీడియోలను బాలికకు చూపి, లైంగికంగా వేధించాడు. ఈ విషయం గురించి బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు గూడువాంచేరి మహిళా పోలీస్ స్టేషనన్లో ఫిర్యాదు చేశారు. మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ షీలా, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉత్తరాది జార్ఖండ్కు చెందిన యువకుడు వినోద్ మహోత్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అతడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఆత్మవిశ్వాసమే విజయానికి సోపానం కొరుక్కుపేట: ఆత్మవిశ్వాసమే విజయానికి సోపానం అని విద్యార్థులకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి.రాజేంద్రన్ సూచించారు. చైన్నె మందవేల్లిలోని తెలుగు మహాజన సమాజం నిర్వహణలోని శ్రీ వేణుగోపాల్ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ 45వ వార్షికోత్సవాన్ని శుక్రవారం తేనంపేటలోని కామరాజర్ ఆరంగంలో ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల అధ్యక్షుడు కె.అనిల్కుమార్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ సి రాజేంద్రన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా పది, ప్లస్ వన్ , ప్లస్టూ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనిల్కుమార్రెడ్డి ఉత్తమ విద్యార్థులకు వాచ్లు, మెడల్స్, నగదు బహుమతులు ఇచ్చారు. హెచ్ఎం వి.షీలా, పాఠశాల ఉపాధ్యక్షుడు కే ,ఆనంద్కుమార్రెడ్డి, కోశాధికారి రంగారెడ్డి, వెంకట్రెడ్డి, జేకే రెడ్డి, జె ఎం నాయుడు, గుడిమెట్ల చెన్నయ్య, ఊరా ఆంజనేయులు, కృష్ణారావుపాల్గొన్నారు. కార్బన్–న్యూట్రల్ పట్టణ పరివర్తనపై రాష్ట్రస్థాయి వర్క్షాప్ కొరుక్కుపేట: తమిళనాడు గ్రీన్ కై ్లమేట్ కంపెనీ (టీఎన్జీసీసీ), తమిళనాడు ప్రభుత్వం భాగస్వామ్యంతో యూకే ప్రభుత్వం సంయుక్తంగా చైన్నెలో రాష్ట్రస్థాయి వర్క్షాప్ ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ఈరోడ్, తూత్తుకుడిలో రెండు యూకే–పీఏ సిటీ (యునైటెడ్ కింగ్డమ్–పార్టనరింగ్ ఫర్ యాక్సిలరేటెడ్ కై ్లమేట్ ట్రాన్సిషన్స్) ప్రాజెక్టులపై దృష్టి సారించి కార్బన్–న్యూట్రల్ పట్టణ పరివర్తనలను వేగవంతం చేసే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైన్నెలోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ షాలిని మేడేపల్లి, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ జాయింట్ కమిషనర్.పి. జయశీలన్ పాల్గొని మాట్లాడారు. -
వ్యాపార వేత్తలుగా ఎదగాలి
తిరువళ్లూరు: హిజ్రాలు యాచించే స్థాయి నుంచి వ్యాపార వేత్తలుగా ఎదగాలని, అందుకు జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన మేరకు సహాయ సహకారాలను అందిస్తామని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న హిజ్రాలతో తిరువళ్లూరు రైల్వేస్టేషన్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సమావేశంలో కలెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ రైళ్లలో కొందరు హిజ్రాల ఆగడాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హిజ్రాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు పథకాలను అమలు చేస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోకుండా రైలు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయడం, బెదిరింపులకు దిగడం, యాచించడం లాంటి చర్యలకు దిగడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేశాఖ భద్రత విభాగం డిప్యూటీ కమిషనర్ హఫీల్బక్సాస్లా మాట్లాడుతూ రైల్వే ప్రయాణికులకు హిజ్రాల వ్యవహరశైలి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందన్నారు. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలకు దిగాలనుకున్న ప్రతిసారి మానవతావాదంతో మౌనంగా ఉంటున్నామన్నారు. హిజ్రాల ఎదుగుదలకు జిల్లా యంత్రాంగంతోపాటు రైల్వేశాఖ సైతం అవసరమైన మేరకు తమ పరిధిలో ఉన్న అవకాశాలను కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారి వనిత తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్లు రైళ్లలో యాచన చేయకూడదు కొరుక్కుపేట: చైన్నెలో ట్రాన్న్స్జెండర్లు ప్రజా ప్రదేశాలు, బస్సులు, రైళ్లు, ఇతర ప్రదేశాల్లో యాచించ కూడదని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు జెబస్తినియో, శివనేసన్ సూచించారు. చైన్నె ఎగ్మోర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ స్టేషనన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు చైన్నెలో పలు ప్రదేశాల్లో ప్రయాణికులను డబ్బులు అడిగి వేధించే సంఘటనలు పెరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ రైళ్లలో ఒక కంపార్ట్మెంట్ నుంచి మరొక కంపార్ట్మెంట్కు వెళ్లి ప్రయాణికుల తలలను తాకడం, డబ్బులు వసూలు చేయడం నిరంతరం జరుగుతోందన్నారు. చాలా మంది ప్రయాణికులకు ఇది ఇబ్బందిగా ఉందన్నారు. అయితే, కొందరు తమ దగ్గర ఉన్నదంతా ఇచ్చి, ట్రాన్స్జెండర్లు వచ్చిన వెంటనే వారిని పంపించేస్తున్నారని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోతే ప్రయాణికులను దూషిస్తున్నారని అన్నారు. కళాశాల విద్యార్థులను, టీనేజర్లను తక్కువ చేసి మాట్లాడి డబ్బులు వసూలు చేయడంలో వారిపై ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇకపై రైళ్లలో ప్రయాణికులను డబ్బు అడగకూడదని, ఎవరినీ అవమానించకూడదని లేదా బెదిరించకూడదని, ప్రభుత్వం మీకు వివిధ సహాయాలను అందిస్తోందని, వాటి ద్వారా మీరు మీ జీవనోపాధిని మెరుగుపరచుకోవాలని చెప్పారు. -
అధికారం మనదే
‘ఎన్డీఏ కూటమి రాజకీయ కూటమి కాదు అని, తమిళనాడు ప్రగతిని, తమిళ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే కూటమి. అవినీతిమయమైన డీఎంకే సర్కారును గద్దె దించేద్దాం. 2026లో తమిళనాడులో బీజేపీ– అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యం. అధికారం మనదే. ఇందుకోసం బీజేపీ బూత్ కమిటీలోని ప్రతి ఒక్కరూ వీరోచితంగా శ్రమించాల్సిన అవశ్యం ఉంది.’ అని కేంద్రహోం మంత్రి అన్నారు. అమిత్ షా ప్రసంగం సాక్షి, చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాఽ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి డీఎంకేను గద్దె దించేద్దామని వ్యాఖ్యలు చేశారు. ఒకరేమో తన వారసుడ్ని దేశానికి ప్రధానిని చేయాలని, మరొకరేమో తనయుడ్ని తమిళనాడుకు సీఎం చేయాలని పరితపిస్తున్నారని, ఇది వారికి కలగానే మిగలబోతున్నట్టుగా సోనియా గాంధి, స్టాలిన్లను ఉద్దేశించి విమర్శలు ఎక్కుబెట్టారు. తిరునల్వేలి తచ్చనల్లూరు వేదికగా శుక్రవారం బీజేపీ బూత్కమిటీ మహానాడు జరిగింది. తొలి విడతగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాశి, విరుదునగర్ జిల్లాల నుంచి 25 వేల మంది బూత్ కమిటీ ప్రతినిధులను ఈ సమావేశానికి పిలిపించారు. మొత్తంగా లక్ష మంది కూర్చునేందుకు సీట్లు వేయగా, రెట్టింపుగా కమలనాథులు తరలిరావడంతో రాష్ట్ర బీజేపీ వర్గాల్లో జోష్ నిండింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల కోఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్రెడ్డి, నేతలు అన్నామలై, రాజ, పొన్ రాధాకృష్ణన్, మహిళా నేతలు తమిళి సై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్, సినీ నటుడు శరత్కుమార్ తదితరులు తరలివచ్చారు. ఈ వేదికలో అమిత్ షా సమక్షంలో డీఎంకేకు చెందిన నేత కేఎస్ రాధాకృష్ణన్ తన మద్దతు దారులతో బీజేపీ గూటికి చేరారు. ముందుగా ఇటీవల కన్నుమూసిన నాగాలాండ్ గవర్నర్ ఎల్ గణేషన్ చిత్ర పటానికి అమిత్ షాతో పాటుగా నేతలు పుష్పాంజలి ఘటించారు. మహానాడుకు హాజరైన వారందరూ మౌన నివాళులర్పించారు. ఉగ్ర వెన్నెముకను విరిచేశాం ఇటీవల జరిగిన పహల్గామ్ దాడిని గుర్తు చేస్తూ, అమాయక ప్రజలను హతమార్చిన ఉగ్రవాదులను కూకటి వేర్లతో సహా తుంచి పడేసే రీతిలో పాకిస్తాన్లోకి వెళ్లి మరీ వారి స్థావరాలను నామ రూపాలు లేకుండా చేశామన్నారు. ఆపరేషన్ సిందూర్తో ఉగ్ర వెన్నెముకను విరిచేశామన్నారు. లోక్సభలో తాను రెండు రోజుల క్రితం ప్రవేశ పెట్టిన బిల్లుల గురించి ప్రస్తావిస్తూ, పీఎం, సీఎం, అంటూ ఏ పదవిలో ఉన్న వారైనా తప్పు చేసి జైలుకు వెళ్లే వారి పదవిని ఊడగొట్టేలా తీసుకొచ్చిన బిల్లుకు విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయన్నారు. తమిళనాడులో ఇది వరకు మంత్రులుగా ఉన్న పొన్ముడి, సెంథిల్ బాలాజీ వంటి వారు అనేక నెలలు జైలులో ఉన్నారని గుర్తు చేస్తూ, జైలులో ఉన్న వాళ్లు పాలకులుగా ఉండవచ్చా..? అని ప్రశ్నించారు. జైలు నుంచే పాలన సాగవచ్చా..? అంటూ ఈ బిల్లును స్టాలిన్ బాబు నలుపు బిల్లుగా అభివర్ణించారని వ్యాఖ్యానించారు. ఇది కాదు నలుపు చట్టం, చీకట్లో డీఎంకే చేసే రాజకీయం అంతా నలుపే.., వారి అవినీతి అంతా నలుపు మయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారి మనదే డీఎంకే సర్కారు అవినీతి ఊబిలో కూరుకు పోయి ఉందంటూ ఈ సందర్భంగా జాబితాను ప్రకటించారు. అన్నింటా అవినీతి మయం అంటూ వీరిని గద్దె దించేందుకు సిద్ధమా..? సిద్ధమా..? అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. గద్దె దించేద్దాం...! అంటూ 2026లో తమిళనాడులో బీజేపీ– అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇందు కోసం బీజేపీ బూత్ కమిటీలోని ప్రతి ఒక్కరూ వీరోచితంగా శ్రమించాల్సిన అవశ్యం ఉందని పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రగతిని , డీఎంకే అవినీతిని విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు. లోక్సభ ఎన్నికలలో బీజేపీకి 18 శాతం, అన్నాడీఎంకేకు 21 శాతం ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో వేర్వేరుగా వెళ్లిన సమయంలోనే ఈ శాతం రాగా, ప్రస్తుతం ఇద్దరు ఒకే వేదికపైకి వచ్చిన దృష్ట్యా, 39 శాతం ఓట్లు ఖాతాలో ఉన్నట్టే అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి రాజకీయ కూటమి కాదు అని, తమిళనాడు ప్రగతిని, తమిళ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే కూటమి అని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల ద్వారా తన కుమారుడు ఉదయనిధిని సీఎం చేయడానికి స్టాలిన్ తీవ్రంగా తహ తహలాడుతున్నారని, అలాగే, తన కుమారుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి సోనియా గాంధీ తీవ్రంగా పరితపిస్తున్నారని అన్నారు. అయితే, ఈ ఇద్దరు కలలన్నీ కల్లే కాబోతున్నాయని, ఎన్డీఏ గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగురవేసి తీరుతామని, ఇందు కోసం శ్రమిస్తామంటూ కేడర్తో ఈ సందర్భంగా అమిత్ షా ప్రతిజ్ఞ చేయించారు. కాగా, ఈ సమావేశంలో మాట్లాడిన బీజేపీ నేత అన్నామలై రానున్న ఎన్నికల్లో అందరం సమష్టిగా పనిచేద్దామని, మరో ఎనిమిది నెలలు వీరోచితంగా శ్రమించి కూటమి పార్టీ అయిన అన్నాడీఎంకే నేత పళణిస్వామి నేతృత్వంలో అధికారం చేజిక్కించుకుంటామని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే, బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సైతం తన ప్రసంగంలో అన్నాడీఎంకే పేరును, ఎంజీఆర్ గురించి పదే పదే గుర్తు చేస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నాడు కలాం.. నేడు సీపీఆర్ అమిత్ షా ఈ కార్యక్రమంలో ఇలగణేషన్ సేవలను గుర్తు చేస్తూ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాంను నాడు రాష్ట్రపతి సీటులో కూర్చోబెట్టింది ఎన్డీఏ అని వ్యాఖ్యానించారు. నేడు అదే తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి పదవిని అధిరోహింపచేసేందుకు ఎన్డీఏ సిద్ధమైందన్నారు. ఇందుకోసం తాను ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. రాజ్యసభ చైర్మన్గా, ఉపరాష్ట్రపతి తమిళ బిడ్డ సీపీ రాధాకృష్ణన్ కూర్చోబోతున్నారని, ఇందులో మార్పు అన్నది ఉండబోదని స్పష్టం చేశారు. తమిళనాడు, తమిళ ప్రజలు, తమిళభాషా, సంస్కృతి అంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఎనలేని గౌరవం ఉందని, అందుకే ఎక్కడకెళ్లినా ఆయన తమిళ గ్రంథం తిరుక్కురల్లోని అంశాలను ప్రస్తావించడం జరుగుతోందని చెప్పారు. గంగై కొండ చోళపురంలో సహస్త్రాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడమే కాకుండా, స్వయంగా గంగా జలం తీసుకొచ్చి బృహదీశ్వరాలయంలో అభిషేకం చేయించారని గుర్తు చేశారు. సౌ రాష్ట్రా తమిళ సంగమం, కాశీ తమిళ సంగమం కార్యక్రమాలే కాదు, తిరుక్కురల్ను 134కు పైగా భాషల్లో తర్జుమా చేయిస్తున్న ఘటన ఒక్క ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే దక్కుతుందన్నారు. -
చెరువు మట్టి తరలింపుపై గ్రామీణుల నిరసన
పళ్ళిపట్టు: చెరువులో మట్టి తరలింపుపై అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్కడ భారీ గుంతలు ఏర్పడి, భూగర్భజలాలు అడుగంటే ప్రమాదం నెలకొందని కీచ్చళం వాసులు శుక్రవారం నిరసన చేపట్టారు. పంట సాగుకు అనువుగా పొలం చదును చేసుకోవడానికి రైతులు ప్రభుత్వ అనుమతితో చెరువు మట్టిని తరలించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. దీంతో రైతులు తమ చిట్టాను ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసి తహసీల్దార్ అనుమతితో ట్రాక్టర్లలో మాత్రమే చెరువు నుంచి ఎర్రమట్టిని తరలించే అవకాశం ఉందన్నారు. అయితే పళ్లిపట్టు యూనియన్ కీచ్చళంలో రైతుల పేరిట కొంత మంది తహసీల్దార్ నుంచి అనుమతి పొంది కీచ్చళం చెరువు నుంచి పది రోజులుగా జేసీబీ సాయంతో వందలాది ట్రక్కుల్లో మట్టిని తరలించి, ట్రక్కు రూ.2 వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తుందన్నారు. దీంతో చెరువులో భారీగా గుంతలు ఏర్పడి భూగర్భజలాలు అడుగంటడంతోపాటు ట్రాక్టర్ల వేగంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని ఆరోపించారు. అనంతరం గ్రామానికి చెందిన రైతులు మట్టి ట్రాక్టర్లు, జీసీబీని అడ్డుకున్నారు. -
చైన్నెకు సుదర్శన్రెడ్డి రేపు రాక
సాక్షి, చైన్నె: ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బీ సుదర్శన్ రెడ్డి ఆదివారం చైన్నెకు రానున్నారు. సీఎం స్టాలిన్తోపాటు ఇక్కడున్న ఎంపీలను కలవనున్నారు. ఉప రాష్ట్రపతి ఎంపిక నిమిత్తం సెప్టెంబరు 9వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్డీఏ కూటమి తరఫున తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ పోటీలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఇండియా కూటమి తరఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్రెడ్డి పోటీకి దిగారు. ఈ ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఇప్పటికే దాఖలు చేశారు. తమిళనాడుతోపాటుగా పుదుచ్చేరిలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. డీఎంకే కూటమి గుప్పెట్లో ఈ స్థానాలన్నీ ఉండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో తనకు మద్దతు తెలియజేయాలని కోరుతూ ఎంపీలను కలిసేందుకు సుదర్శన్రెడ్డి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన చైన్నెకు రానున్నట్టుగా సమాచారం వెలువడింది. తొలుత సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ను కలవనున్నారు. అనంతరం నగరంలో ఓ హోటల్లో జరిగే కార్యక్రమంలో ఇతర పార్టీల నేతలు, ఎంపీలతో సుదర్శన్రెడ్డి సమావేశం కానున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. పళణి గెలుపు కోసం తిరుమలకు పాదయాత్ర సాక్షి, చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె పళణి స్వామి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటును కాంక్షిస్తూ చైన్నె నుంచి శుక్రవారం డాక్టర్ సునీల్ నేతృత్వంలోని బృందం తిరుమలకు పాదయాత్ర చేపట్టింది. అన్నాడీఎంకే యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నేతృత్వంలో బృందం ఉదయం ఈ యాత్రకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక పూజల అనంతరం యాత్రను చేపట్టారు. 2026లో అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేపట్టాలని, 210 సీట్లలో గెలుపు ను కాంక్షిస్తూ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తూ యాత్రలో అడుగులు వేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి పళణిస్వామి 2026లో జరగనున్న తమిళనాడు శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో 210కి పైగా సీట్లు గెలుచుకుని తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుతూ వరుసగా ఐదో సంవత్సరం చైన్నె నుంచి తిరుమలకు ఈ పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. నేడు రాష్ట్ర విద్యా విధానం ప్రాముఖ్యతపై సెమినార్ కొరుక్కుపేట: తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన రాష్ట్ర విధానాలను జాతీయ విద్యావిధానం ప్రతికూలతలను విద్యార్థుల దృష్టికి తీసుకురావాలనే లక్ష్యంతో ఆగస్టు 23వ తేదీ రాత్రి 10 గంటలకు చైన్నెలోని అన్నా సెంటెనరీ లైబ్రరీ హాల్లో ‘మన విద్య, మన హక్కు‘ అనే సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మార్గదర్శకత్వంలో డీఎంకే విద్యార్థి సంఘం కార్యదర్శి ఆర్.రాజీవ్ గాంధీ, రాష్ట్ర ఉప కార్యదర్శులు మన్నై టి.చోళరాజ్ నేతృత్వంలో ఈ సెమినార్ నిర్వహిస్తారు. తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ , రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ప్రత్యేక ప్రసంగం చేస్తారు. డీఎంకే జిల్లా, నగర, ఏరియా డీఎంకే విద్యార్థి విభాగం కార్యనిర్వాహకులు అందరూ తప్పకుండా ఈ సెమినార్కు హాజరు కావాలని అభ్యర్థించారు. ప్రేమలత ఉద్వేగం! సాక్షి, చైన్నె : డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్, ఆమె కుమారుడు విజయ ప్రభాకరన్ తీవ్ర ఉద్వేగానికి లోనై వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఇందుకు కారణం విజయకాంత్ నటించిన కెప్టన్ ప్రభాకర్ చిత్రం రీ రిలీజ్ ప్రదర్శన వేదికగా మారింది. డీఎండీకే అధినేత, పురట్చి కలైంజ్ఞర్ విజయకాంత్ అందర్నీ వీడినా, ఆయన సేవలు, జ్ఞాపకాలు, నటించిన చిత్రాలు అజరామరం. ఆగస్టు 25వ తేదీ విజయకాంత్ జయంతి. 24వ తేదీ నుంచి వేడుకలు పేదరిక నిర్మూలన దినోత్సవంగా డీఎండీకే వర్గాలు జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో విజయకాంత్ నటించి సూపర్ హిట్ చిత్రం కెప్టన్ ప్రభాకర్ను రీ రిలీజ్ చేశారు. శుక్రవారం నైవేలిలోని ఓ థియేటర్లో ఆమె ఈ చిత్రాన్ని వీక్షించారు. విజయకాంత్ తెర మీద కనిపించగానే ఆమెతో పాటు కుమారుడు వెక్కి వెక్కి ఏడ్చేశారు. తీవ్ర ఉద్వేగంతో థియేటర్ నుంచి వారు బయటకు వచ్చారు. -
విజయ్పై ముప్పెట్ట దాడి
సాక్షి, చైన్నె : మహానాడు వేదికగా తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. ఆయన వ్యాఖ్యలను బీజేపీ, అన్నాడీఎంకే, డీఎంకే కూటమి వర్గాలు తీవ్రంగా పరిగణించి శుక్రవారం ఎదురు దాడికి దిగాయి. మధురై మహానాడు వేదికగా విజయ్ బీజేపీ, డీఎంకేను తీవ్రంగా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీని అయితే, మిస్టర్ పీఎం అంటూ పలుసార్లు సంబోధించడమే కాకుండా ఆయన పూర్తి పేరును పేర్కొంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే డియర్, మైడియర్ అంకుల్ అంటూ సీఎం స్టాలిన్పై సైటెర్లు వేశారు. ప్రస్తుత రక్షకుల రూపంలో అన్నాడీఎంకేలోనే పరిస్థితులను గుర్తు చేస్తూ విమర్శలు గుప్పించారు. పీఎంను టార్గెట్ చేయడాన్ని బీజేపీ వర్గాలు తీవ్రంగానే పరిగణించాయి. విజయ్పై ఎదురు దాడి చేస్తూ ఉదయం బీజేపీ మహిళా నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడారు. విజయ్ తనను ఎంజీఆర్తో సమానంగా పొల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎంజీఆర్ ఇంటికి ఎవరు వెళ్లినా నిత్యం కడుపు నిండా అన్నం పెట్టే వారని వివరిస్తూ, అయితే, మహానాడుకు వచ్చిన వారిని ఆకలితో అలమటించేలా చేసిన ఘనత విజయ్ ఒక్కడికే దక్కిందని ధ్వజమెత్తారు. ఆహారం కోసం టోకెన్లను బ్లాక్లో అమ్ముకోవడం మరీ విడ్డూరంగా ఉందని పేర్కొంటూ, ఒక మహానాడును సరిగ్గా నిర్వహించలేని వ్యక్తి ఎలా ప్రజలకు సుపరిపాలన అందిస్తాడో అని మండిపడ్డారు. తమిళనాట ఎన్నికల్లో బీజేపీ, డీఎంకేకు మాత్రమే పోటీ అని వ్యాఖ్యలు చేశారు. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ తన సిద్ధాంతాలు ఏమిటో విజయ్ ముందుగా స్పష్టత ఇవ్వాలన్నారు. పంచమూర్తుల సిద్ధాంతాలు అంటే చాలదని, అస్సలు ప్రజలకు ఏమి చేశావో, ఏమి చేయబోతున్నావో అన్నది తేటతెల్లం చేసి, ఆ తర్వాత ప్రత్యర్థి ఎవరన్నది ఎంపిక చేసుకో..? అని హితవు పలికారు. సిద్ధాంతాలే లేవు గానీ, సిద్ధాంత పరంగా బీజేపీ తన ప్రత్యర్థి అని విజయ్ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ సీనియర్ నేత, నటుడు శరత్కుమార్ మాట్లాడుతూ సిద్ధాంత పరంగా విజయ్ వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. మిస్టర్ పీఎం అంటూ ప్రధాని నరేంద్ర మోదీని సంబోధించే స్థాయికి ఇంకా ఎదగలేదన్నారు. ముందుగా పాసిజం అంటే ఏమిటో తెలుసుకుని రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని హితవు పలికారు. ఇక, అన్నాడీఎంకే నేత జయకుమార్ మాట్లాడుతూ పళణి స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే అధిష్టానాన్ని విమర్శించే అర్హత విజయ్కు లేదన్నారు. రాజకీయాల్లో అందరూ ఎంజీఆర్, జయలలితలు కాలేరని మండిపడ్డారు. ప్రజలకు తన విధి విధానాలు ఏమిటో ప్రకటించకుండా, ఏళ్ల తరబడి ప్రజల్లో ఉన్న తమను విమర్శించడం విజయ్ అవగాహన లోపానికి నిదర్శమని విమర్శించారు. రాజకీయాల్లో విజయ్ ఏడాదిన్నర బిడ్డ అని అన్నాడీఎంకే శాసన సభా పక్ష ఉపనేత ఆర్బీ ఉదయకుమార్ ఎద్దేవా చేశారు. విజయ్ షో అట్టర్ ప్లాప్ అంటూ, కేవలం ప్రజలకు షో చూపించే ప్రయత్నంలో నోటికి వచ్చింది వాగేసినట్టుగా అన్నాడీఎంకే సీనియర్ నేత సెమ్మైలె మండిపడ్డారు.సవాళ్లకు ధీటుగా సమాధానం విజయ్ విసిరే సవాళ్లు, ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు డీఎంకే సిద్ధం అని ఆ పార్టీ సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. కేవలం అధికారంలో ఉన్న వాళ్లనే విజయ్ టార్గెట్ చేయడం చూస్తే, వచ్చి రాగానే అధికారం కోసం ఆయన తహ తహలాడుతుండటం స్పష్టమవుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అంకుల్...అంకుల్ అంటు హేళనగా వ్యాఖ్యలు చేయడం నాగరిక రాజకీయమా..? అని ప్రశ్నించారు. తమ ప్రగతి ఏమిటో, తమ పథకాలు ఏ మేరకు ప్రజలకు చేరాయో అన్నది 2026 ఎన్నికల్లో తెలుస్తాయన్నారు. విజయ్కు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. సీఎంను అవమాన పరిచేలా, హేళన చేసే రీతిలో వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, లేకుంటే గట్టిగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని విజయ్కు మంత్రి నెహ్రు హెచ్చరికలు చేశారు. ఇంకా ప్రజల్లోకే రాలేదు.. అలాంటప్పుడు డీఎంకే తనకు ప్రత్యర్థి అని విజయ్ ఎలా పేర్కొనగలడని, ఆయన వ్యాఖ్యలు సినీ డైలాగుల్ని తలపిస్తున్నాయంటూ సీపీఎం నేత షణ్ముగం, సీపీఐ నేత ముత్తరసన్లు ఎద్దేవా చేశారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ స్పందిస్తూ మొదటి రోజు థియేటర్ ముందు జనం గుమి గూడినట్టుగా మహానాడుకు తరలి వచ్చారని, అయితే, సాయంత్రానికే జనం తిరుగు పయనం కావడం బట్టి చూస్తూ, ఈ మహానాడు హిట్టా...పట్టా అన్న విషయం విజయ్ గుర్తెరగాలని హితవు పలికారు. జనం తిరుగు పయనం కావడంతోనే ముందుగానే ఆగమేఘాలపై విజయ్ ప్రసంగాన్ని వీరావేశంతో అందుకున్నట్టుందన్నది స్పష్టమవుతోందన్నారు. ఇక, విజయ్ తమ ఇంటి బిడ్డ అని, అందుకే అన్నయ్య విజయకాంత్ను తలచుకున్నట్టుందని డీఎండీకే నేత ప్రేమలత విజయకాంత్ వెనకేసుకు రావడం గమనార్హం. -
చెరువుల్లో ముళ్ల చెట్లను తొలగించండి
వేలూరు: జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటల్లోని ముళ్ల చెట్లను తొలగించి వర్షపు నీరు చెరువుల్లో, కుంటల్లో నిలిచే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు నేతలు సూచించారు. వేలూరు కలెక్టరేట్లో కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జిల్లాలోని రైతు నేతలతో సమవేశం జరిగింది. రైతులు మాట్లాడుతూ కుప్పం నుంచి చైన్నె వరకు పాలారు ఉందని, వర్షం వస్తే ఇందులో నీరు పారి కుంటలు, చెరువులకు నీరు చేరుతుందన్నారు. అయితే వానియంబాడి నుంచి కాంచిపురం మీదుగా తిరువళ్లూరు వరకు వెళ్లే పాలారులో వివిధ పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత నీటిని వదలడం ద్వారా పాలారు కలుషితమవుతోందన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షపు నీరు వృథాగా వెళ్లకుండా చెరువుల్లోనే నిల్వ ఉండే విధంగా కాలువులను శుభ్రపరచడంతో పాటు చెరువులను కూడా శుభ్రం చేయాలన్నారు. పంటలను అడవి ఏనుగులు, పందులు నాశనం చేస్తున్నాయని వీటికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గిడ్డంగికి రైతులు తీసుకెళ్లే వడ్లను నిల్వ ఉంచకుండా వెంటనే తూకం వేసి పంపాలన్నారు. దీంతో కలెక్టర్ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారి కాంచన, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ స్టీబర్ జయకుమార్, రైతులు, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కొలువుల జాతర
సాక్షి, చైన్నె : వైద్య, గ్రామీణ శాఖల్లో వివిధ పోస్టుల భర్తీ నిమిత్తం ఎంపిక చేసిన వారికి సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. మెడికల్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు ద్వారా తమిళనాడులోని ప్రభుత్వం ఆస్పత్రుల్లో సేవలు అందించేందుకు వివిధ పదవులకు మొత్తంగా 644 మందిని ఎంపిక చేశారు. ఇందులో 182 మంది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు, 48 మందిని దంత వైద్యులు, 324 మందిని ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు ఉన్నారు. అలాగే, వైద్య విద్య, పరిశోధన విభాగంలో 18 మందిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, మరో 17 మందిని డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ కోసం క్లినికల్ సైకాలజిస్టులు, 54 మంది జిల్లా ఆరోగ్య అధికారులుగా నియమించారు. మొత్తం 644 మందికి సీఎం స్టాలిన్ నియామక ఉత్తర్వులను అందజేశారు. తాము అధికారంలోకి వచ్చినానంతరం 2021 నుంచి వైద్యశాఖలో జరిగిన నియామకాలను గుర్తించి ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, మేయర్ ప్రియ, ఎంపీ దయానిధి మారన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ తరపున రూ.104.24 కోట్లతో పూర్తి చేసిన భవనాలను సీఎం స్టాలిన్ వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభించారు. వివిధ పోస్టులను భర్తీ చేస్తూ 818 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను సీఎం అందజేశారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటిలో 66 కొత్త పాఠశాలల భవనాలు, నాలుగు లైబ్రరీలు, 49 స్టోర్ట్స్ భవనాలు, 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలు, 45 పంచాయతీ కార్యాలయాల భవనాలున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు పెరియస్వామి, గాంధి, సీఎస్ మురుగానందం తదితరులు పాల్గొన్నారు. ఆలయాలల్లో భక్తుల సేవకు హిందూ మత ధార్మిక దేవాదాయ శాఖ నేతృత్వంలో ఆలయాల్లో భక్తుల సేవ నిమిత్తం రూ.124.97 కోట్లతో పూర్తి చేసిన 17 కొత్త ప్రాజెక్టులను సీఎం స్టాలిన్ వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే రూ.32.53 కోట్లతో 9 పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. రూ.51.19 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 14 పనులకు శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ మత ధార్మిక శాఖ మంత్రి శేఖర్బాబు, పర్యాటక, హిందూ ధార్మిక శాఖ కార్యదర్శి డాక్టర్ కె.మణివాసన్, కమిషనర్లు పీఎన్ శ్రీధర్ పళణి, జయరామన్, జానకి తదితరులు పాల్గొన్నారు. ముందుగా తమిళనాడు కన్స్యూమర్ గూడ్స్ కార్పొరేషన్ నేతృత్వంలో రూ.23.27 కోట్లతో నిర్మించిన ఐదు భవనాలు, రూ.30.38 కోట్లతో నిర్మించిన గిడ్డంగులు, రూ.7.20 కోట్లతో పూర్తి చేసిన మూడు ఆధునిక వరి నిల్వ సముదాయాలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. అలాగే టీఎన్పీఎస్సీ ద్వారా కన్స్యుమర్ గూడ్స్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న 63 పోస్టులకు ఎంపికై న వారికి సీఎం స్టాలిన్ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చక్రపాణి, సీవీ గణేషన్, తదితరులు పాల్గొన్నారు. కాగా, భూమి లేని వ్యవసాయ కార్మికులకు అందించే ప్రమాద బీమా పరిహారం పెంపునకు ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు రూ.లక్ష ఇస్తుండగా ఇక నుంచి రూ.2 లక్షలుగా నిర్ణయించారు. గాయాలకు రూ. 20 వేల నుంచి రూ. లక్షకు పెంచారు. సహజ మరణాలకు ఆర్థిక సాయం ఇది వరకు రూ. 20 ఇవ్వగా, ఇక రూ. 30 వేలు అందజేయనున్నారు. -
క్లుప్తంగా
కుట్టి పద్మినికి పురస్కారం ప్రదానంకొరుక్కుపేట: తమిళనాడు హిందీ సాహిత్య అకాడమీ– చైన్నె, శ్రీ కన్యకాపరమేశ్వరి మహిళా కళాశాల సంయుక్తంగా ఒక రోజు జాతీయ సెమినార్ను శుక్రవారం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న హిందీ పండితులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు విశిష్ట వ్యక్తులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో మొదటి సెషన్ ఆరంభమైంది. కార్యక్రమానికి చంద్ర ప్రకాష్ గోయెంకా హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా జయశంకర్బాబూజీ, ప్రకాష్ జైన్, మహేష్ కుమార్ శర్మ, ప్రొఫెసర్ డాక్టర్ నిర్మలా ఎస్. మౌర్య పాల్గొన్నారు. ప్రారంభ సమావేశంలో కుట్టి పద్మినితో పాటు హిందీలో విశేష కృషికి గుర్తింపుగా అనేక మంది ప్రముఖ వ్యక్తులకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. రెండవ సెషన్లో, సాహిత్యం, సైన్స్, అనుబంధ రంగాలు సహా వివిధ అంశాలపై ప్రసంగించారు. ప్రముఖ కవులు తమ రచనలను ప్రదర్శించిన ప్రత్యేక కవితా పఠన సెషన్ కూడా నిర్వహించి ఆకట్టుకున్నారు. కళాశాల విద్యార్థులు కూడా కవితలు పఠించి గొప్ప ప్రశంసలు పొందారు. తల్లిని కడతేర్చిన కుమారుడు అన్నానగర్: మాధవరం సమీపంలో తల్లిని కొట్టి చంపిన కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె సమీపంలోని మాధవరం పొన్నియమ్మన్మేడు తిరుపతి తంగవేల్ నగర్లో రూపక్ పరిమళ (60) నివాసమున్నారు. ఈమె భర్త సెల్వరాజ్ కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. వీరి కుమారుడు రూపక్ (35) కుటుంబంతో కలిసి బెంగళూరులో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మాధవరంలోని ఇంట్లో రూపక్ మాత్రమే ఒంటరిగా ఉండేవాడు. రూపక్ తన తల్లి వద్దకు నెలకు రెండుసార్లు మాధవరం వచ్చేవాడు. గత వారం, తన తల్లిని చూడటానికి మాధవరం వచ్చిన రూపక్, తన తల్లి పరిమళతో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో తన తల్లి అని కూడా చూడకుండా పరిమళ జుట్టు పట్టుకుని గోడకు విసిరాడు. తీవ్రంగా గాయపడిన పరిమళను చికిత్స కోసం చైన్నెలోని ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే, చికిత్స ఫలించక పరిమళ శుక్రవారం మరణించింది. ఈ విషయమై మాధవరం పోలీస్ ఇన్స్పెక్టర్ భూపాలన్ రూపక్ను అరెస్టు చేసి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య అన్నానగర్: వచ్చే నెలలో తన నిశ్చితార్థం జరగనున్న తరుణంలో ఒక ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణకు చెందిన సిల్గురి మాధవ్ (28) చైన్నె తిరువాన్మియూర్లోని ఒక ప్రసిద్ధ ప్రైవేట్ బ్యాంకు రుణ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను తన సహచరులతో కలిసి తిరువాన్మియూర్లో అద్దెకు ఇల్లు తీసుకున్నాడు. తెలంగాణలో నివసిస్తున్న అతని తల్లిదండ్రులు సిల్గురి మాధవ్కు వివాహం చేయడానికి అమ్మాయి కోసం చూస్తున్నారు. ఇతనికి నిశ్చితార్థం వచ్చే నెలలో జరగాల్సి ఉంది. శుక్రవారం వేకువజామున సిల్గురి మాధవ్ తన బెడ్రూమ్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరువాన్మియూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసులు అతని సెల్ ఫోన్ను పరిశీలించగా, ఆత్మహత్యకు ముందు సిల్గురి మాధవ్ మాట్లాడుతున్న వీడియో కనిపించింది. ఆ వీడియోలో, అతను ‘నేను ఈ ప్రపంచంలో జీవించలేను. పెళ్లి తర్వాత నా భార్యను ఎలాంటి చింత లేకుండా ఎలా చూసుకోగలనో అని నాకు భయంగా ఉంది. కాబట్టి నేను ఇక పై ఇలా జీవించలేను. దీంతో నా జీవితాన్ని ముగించుకుంటాను’ అని ఉంది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. క్వారీ లారీలను అడ్డుకుని గ్రామస్తుల ఆందోళన తిరుత్తణి: పట్టణ సమీపంలో క్వారీ లారీలను శుక్రవారం గ్రామీణులు అడ్డుకుని నిరసన తెలిపారు. తిరుత్తణి మండలంలోని సూర్యనగరం పంచాయతీలో రెండు రాళ్ల క్వారీలున్నాయి. మూడేళ్ల నుంచి క్వారీల్లో అనుమతికి మించి రాళ్లు పేల్చి వాహనాల్లో వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ఎల్లంపల్లె, గజలక్ష్మీపురం యూనియన్ రోడ్డు దుస్థితికి చేరుకుని, ఆ దారిలో గ్రామీణులకు రాకపోకలు కష్టంగా మారింది. అవసర సమయాల్లో రాత్రి వేళల్లో ఆ రోడ్డులో ప్రయాణం కష్టంగా మారింది. రోడ్డు బాగు చేయాలని, అనుమతికి మించి రాళ్లు కొట్టి పిండి చేస్తున్న క్వారీపై చర్యలు తీసుకోవాలనే ఆయా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయినా స్పందన లేకపోవడంతో గ్రామస్తులు క్వారీ లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో తహసీల్దారు మలర్విళి గ్రామస్తులతో మాట్లాడారు. వెంటనే గ్రామీణ రోడ్డు బాగు చేసేందుకు క్వారీ యాజమాన్యం ముందుకు రావాలని, రాళ్ల తవ్వకంపై కొలతలు తీసి, రిపోర్టు వచ్చే వరకు తవ్వకాలు చేపట్టకూడదని ఆదేశించారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. -
29 జిల్లాల్లో వర్షం అలర్ట్
సాక్షి, చైన్నె : చైన్నె, శివార్లలో పలు చోట్ల మోస్తారుగా శుక్రవారం వేకువ జామున వర్షం కురిసింది. తురైపాక్కం పరిసరాల్లో అత్యధికంగా పది సెంటీమీటర్ల వర్షం పడింది. 29 జిల్లాల్లో మోస్తారు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతీ రుతు పవనాల రూపంలో తమిళనాడులో వర్షపాతం తక్కువే అన్నది తెలిసిందే. ఏటా నైరుతి రుతుపవనాల కన్నా, ఈశాన్య రుతు పవనాలతోనే మరీ ఎక్కువగా వర్షం పడుతుంది. నైరుతి రూపంలో కేరళ, కర్ణాటకలో కురిసే వర్షాలతో అక్కడి నుంచి తమిళనాడు వైపుగా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లడం జరుగుతుంది. ప్రస్తుతం కావేరి నది ఉధృతంగా కర్ణాటక నుంచి ప్రవహిస్తున్నది. ఐదోసారి ఈ ఏడాది మేట్టూరు జలాశయం నిండింది. ఈ జలాశయం నుంచి ఉబరి నీటిని బయటకు పంపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం వేకువ జామున చైన్నె నగరంలో, శివార్లలో అనేక చోట్ల మోస్తారుగా వర్షం పడింది. ఉదయాన్నే రోడ్లపై వరదనీరు పారాయి. మైలాపూర్, తరమణి, షోళింగనల్లూరు, తురై పాక్కం పరిసరాల్లో భారీ వర్షం పడింది. తురైపాక్కంలో పది సెంటీమీటర్ల వర్షం పడింది. చైన్నెతో పాటు రాష్ట్రంలోని 29 జిల్లాల్లో రాగల 5 రోజులు మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల, భారీగా మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తురైపాక్కం పరిధిలోని ఈంజంబాక్కం మునీశ్వర ఆలయం వీధిలో వర్షపు నీటిలో తెగి పడిన విద్యుత్ తీగను తొక్కడంతో ఆ ప్రాంతానికి చెందిన తాపీమేస్త్రి శామువేల్ మరణించాడు. -
థ్రిల్లర్ చిత్రంగా రూమ్బాయ్
తమిళసినిమా: ఏసీఎం సినిమాస్ పతాకంపై సూర్యకళ నిర్మిస్తున్న చిత్రం రూమ్బాయ్. ఈ చిత్రం ద్వారా ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థి జగన్రాయన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవ నటుడు సి.నిఖిల్ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. అరణ్మణై 4 చిత్రం ఫేమ్ హర్ష నాయకిగా నటిస్తున్న ఇందులో ఇమాన్ అన్నాచ్చి, బిర్లాబోస్, యూట్యూట్ ఫేమ్ కరుప్పు, సాధన, ఇన్స్టా ఫేమ్ కవిత విజయన్, కర్సగమ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సి.భారతీరాజన్ (డీఎఫ్టీ) చాయాగ్రహణం, వేలన్ సహాదేవన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 50కి పైగా షార్ట్ ఫిలింస్ చేసిన దర్శకుడు జగన్రాయన్ తెరకెక్కించిన తాతా అనే షార్ట్ పిలిం తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తయ చాయాగ్రహణం అవార్డును గెలుచుకుందన్నది గమనార్హం. రూమ్బాయ్ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇది ఫ్యామిలీ సెంటిమెంట్తో కూడిన ఇన్వెస్టిగేషన్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని చెప్పారు. చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను విజయ్సేతుపతి ఆన్లైన్ ద్వారా విడుదల చేశారని, దీనికి మంచి స్పందన వస్తోందని దర్శకుడు చెప్పారు. -
సెవ్వాపేట రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు పునః ప్రారంభం
● 11 ఏళ్ల తరువాత పనులకు మోక్షం తిరువళ్లూరు: అనివార్య కారణాలతో ఆగిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను సుమారు 11 ఏళ్ల తరువాత అదనపు నిధులతో శుక్రవారం ఉదయం పునఃప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా సెవ్వాపేట రైల్వేస్టేషన్ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులను 11 ఏళ్ల కిందట ప్రారంభించారు. రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు ఒకవైపు పూర్తి కాగా మరోవైపు ఆగిపోయాయి. బ్రిడ్జి నిర్మాణంతో నివాసాలను కోల్పోయే బాధితులు కోర్టును ఆశ్రయించడంతోపాటు మరి కొందరు అదనపు పరిహారం కోసం స్టే తెచ్చుకోవడంతో పనులు ఆగిపోయాయి. ఇదే సమయంలో భవన నిర్మాణ రంగానికి చెందిన వస్తువుల ధరలు పెరగడంతో నిర్మాణం భారంగా మారి కాంట్రాక్టర్ వెళ్లిపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఇటీవల కోర్టు అడ్డంకులు తొలగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.8.11 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో నిర్మాణ పనులను ఎమ్మెల్యే కృష్ణస్వామి నేతృత్వంలోని అధికారులు శుక్రవారం ఉదయం పునః ప్రారంభించారు. -
మీతో స్టాలిన్ను సద్వినియోగం చేసుకోండి
వేలూరు: మీతో స్టాలిన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సుందరి అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి తాలుకా వంజూరు గ్రామంలో మీతో స్టాలిన్ పథకంలో భాగంగా ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఇందులో మొత్తం 15 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొని ప్రజలు ఇచ్చే వినతులను వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి రశీదులను అందజేయడంతో పాటు కొన్నింటిని అక్కడిక్కడే పరిష్కరించి సర్పంచ్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. అధికంగా మహిళా రుణాలు, ఇంటి పట్టాల కోసం వినతి పత్రాలు అందజేయడంతో వాటిపై విచారణ జరిపి అర్హులైన లబ్ధిదారులందరికీ అందజేస్తామన్నారు. కౌన్సిలర్ పెరుమాల్, వైస్ సర్పంచ్ సుమతి, గ్రామ పరిపాలన అధికారి వెంకటేశన్ పాల్గొన్నారు. -
ఈ చిత్రానికి రెండేళ్లు శ్రమించాం!
తమిళసినిమా: జీకేఆర్ సినీ ఆర్ట్స్ పతాకంపై కుట్రం పుదిదు అనే చిత్రాన్ని నిర్మించి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు తరుణ్ విజయ్. ఈయన తండ్రి కార్తికేయన్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ద్వారా నోవా ఆర్మ్స్ట్రాంగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి శాన్విత కనిమొళి నాయకిగా నటించిన ఇందులో మధుసూదన్రావు, నిళగల్ రవి, రామచంద్రన్ దురై, బాయ్స్ రాజన్, ప్రియదర్శిని రాజకుమార్ ముఖ్యపాత్రలు పోషించారు. క్రైమ్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఈనెల 29న తెరపైకి రానుంది. ఈ చిత్రాన్ని ఉత్రా ప్రొడక్షన్న్స్ అధినేత హరిఉత్రా తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈసందర్భంగా కుట్రం పుదిదు చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఈ వేదికపై సహా నిర్మాత, కథానాయకుడి తండ్రి కార్తికేయన్ మాట్లాడుతూ ఈచిత్రం కోసం తాను, తన కుమారుడితో కలిసి రెండు ఏళ్లు శ్రమించానన్నారు. తరుణ్ విజయ్ మాట్లాడుతూ అమ్మ, నాన్నల ప్రోత్సాహం లేకుంటే తాను ఇక్కడ నిలబడేవాడినే కాదన్నారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ఒక తండ్రి కుమారుడిని హీరోగా పరిచయాలనుకుంటే ఒక ఇంట్లో సాంగ్, కలర్ ఫుల్ కథాశంతో కూడిన కమర్షియల్ కథా చిత్రంలో చూడాలనుకుంటారని, అయితే కార్తికేయన్ మాత్రం వైవిధ్య భరిత కథా చిత్రం చేశారని అన్నారు. ఉత్కంఠ భరితంగా సాగే థ్రిల్లర్ కథా చిత్రాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం అంత సులభం కాదన్నారు. కుట్రం పుదిదు చిత్రం మంచి విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 25 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 75,688 మంది స్వామిని దర్శించుకున్నారు. 29,099 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.45 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 15 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనమవుతోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని లోనికి అనుమతించబోమని స్పష్టం చేసింది. -
అమ్మవారి సేవలో సినీ ప్రముఖులు
చంద్రగిరి: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని గురువారం సినీనటుడు నాగ చైతన్య, శోభిత దంపతులు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వారికి ఆలయాధికారులు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. ముందుగా ఆలయ ధ్వజస్తంభం వద్ద మొక్కుకుని అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినీనటులను చూసిన భక్తులు వారితో కలసి పెద్ద ఎత్తున సెల్ఫీలను దిగేందుకు పోటీపడ్డారు. రాజనాలబండ హుండీ ఆదాయం రూ.4.13 లక్షలు చౌడేపల్లె: సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయానికి హుండీ ఆదాయం రూపేణా రూ.4.13 లక్షలు సమకూరిందని, దీనిని ఆలయ ఖాతాకు జమ చేస్తామని టీటీడీ సూపరింటెండెంట్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇటీవల రాజనాలబండలో నిర్వహించిన తిరునాళ్ల సందర్భంగా భక్తులు హుండీ సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సీవీ. శ్రీహర్ష, టెంపుల్ ఇన్స్పెక్టర్లు భానుప్రకాష్, కృష్ణమూర్తి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
ఇద్దరు వీసీల పదవీ కాలం పొడిగింపు సాక్షి, చైన్నె: రెండు వర్సిటీల వీసీల పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి ఉత్తర్వులు జారీ చేశారు. కారైక్కుడి అళగప్ప వర్సిటీ వీసీగా ఉన్న ప్రొఫెసర్ చంద్రశేఖర్, తిరునల్వేలి మనోన్మణియం సుందరనార్ వీసీ కె రవి పదవీ కాలం తాజాగా ముగిసింది. దీంతో వీరి పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. చైన్నెలో గ్రామోత్సవం ప్రారంభం – ప్రారంభించిన మంత్రి మహేష్ కొరుక్కుపేట: చైన్నెలోని నందనం వైఎంసీఏ మైదానంలో సెంపోజిల్ సంస్థ తరఫున గ్రామోత్సవం జరుగుతోంది. నగరంలో పుట్టి పెరిగిన వారికి గ్రామోత్సవం, సంప్రదాయ అనుభవాన్ని అందించడానికి ఈ ఉత్సవం ఏర్పాటైంది. గ్రామోత్సవాన్ని పాఠశాల విద్యాశాఖా మంత్రి అన్బిల్ మహేష్ ప్రారంభించారు. అక్కడ కొలువుదీర్చిన స్టాల్స్ను సందర్శించారు. ఈ గ్రామోత్సవం 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఉత్సవంలో సంప్రదాయ ఆహార పదార్థాలు, ధాన్యాలు, వ్యవసాయ పుస్తకాలు, చెక్క చేతిపనులు, ఎడ్ల బండ్లు, బండ్లు, గురప్రు బండ్లు, ఉట్టి కొట్టడం వంటి గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా 120కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. మహిళ గొంతు కోసి నగలు దోపిడీ తిరువళ్లూరు: ఇంట్లో మహిళ వంట చేస్తుండగా ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసి ఆమె మెడలో వున్న ఐదు సవర్ల బంగారు నగలను దోచుకెళ్లిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పోలీవాక్కం ప్రాంతానికి చెందిన జీవిత(36). ఈమె భర్త జయచంద్రన్ రియల్టర్. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. ఈ క్రమంలో జయచంద్రన్ వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లాడు. తల్లితో పాటు కూతురు ఒక్కటే ఉందని గుర్తించిన అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలో వున్న బంగారు నగలను లాక్కెళ్లడానికి యత్నించాడు. అయితే ఆమె గట్టిగా పట్టుకోవడంతో జీవిత గొంతును బ్లేడుతో కోసి నగలను లాక్కెళ్లాడు. మనవాలనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హెల్త్ ఇన్స్పెక్టర్ ఆత్మహత్య అన్నానగర్: హెల్త్ ఇన్స్పెక్టర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పెరంబలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆలత్తూర్ తాలూకా, సిరుగన్పూర్కు చెందిన ప్రభాకరన్ (30). ఆలత్తూర్ తాలూకా, కొలకన్నతంలోని ప్రభుత్వ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. గురువారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రభాకరన్ తన కుటుంబానికి రాసిన లేఖ గదిలో కనిపించింది. నా మరణానికి ఎవరూ బాధ్యులు కాదని అందులో రాసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పుళల్లో దూకి వివాహిత ఆత్మహత్య అన్నానగర్: పుళల్ చెరువులో దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రెడ్హిల్స్ సమీపం తీర్థంకరైయంపట్టు పాలవాయల్ ప్రాంతానికి చెందిన శరవణకుమార్. ఇతని భార్య ఈశ్వరి (27). వీరికి ఇద్దరు పిల్లలు. మంగళవారం దంపతుల మధ్య గొడవ చోటుచేసుకుంది. మనస్తాపం చెందిన ఈశ్వరి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తరువాత, ఆమె పుళల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. రెడ్ హీల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. సెల్ఫోన్ చోరీ–మహిళ అరెస్ట్ తిరువొత్తియూరు: తిరువల్లికేనిలో సెల్ఫోన్ను చోరీ చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశా రు. చైన్నె, ట్రిప్లికేన్ థైపూన్ అలీఖాన్ వీధికి చెందిన వసంతి (48) సీఏకే రోడ్డులో చిల్లర దుకా ణం నడుపుతోంది. గత నెల 31వ తేదీ రాత్రి ఆమె దుకాణంలో ఉండగా, ఒక యువతి అక్కడికి వచ్చి అత్యవసరంగా ఒకరికి ఫోన్ చేయా లని చెప్పి సెల్ఫోన్ తీసుకుంది. తర్వాత మా ట్లాడుతున్నట్లు నటించి సెల్ఫోన్ ఎత్తుకుని పా రిపోయింది. ఈసంఘటనపై వసంతి తిరువల్లికేని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా తిరువల్లి కేని ప్రాంతానికి చెందిన సౌమ్య (23)ను అరె స్టు చేసి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎంఎస్ఎంఈల కోసం డిజిటల్ సేకరణ సాక్షి, చైన్నె : ఎంఎస్ఎంఈల కోసం డిజిటల్ సేకరణకు శ్రీకారం చుట్టామని అమెజాన్ బిజినెస్ డైరెక్టర్ మిత్రంజన్ బాధురి తెలిపారు. పండుగ సీజన్ ముందు వ్యాపార కొనుగోళ్లను క్రమబద్ధీకరించే విధంగా, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ దారులకు అనుమతి కల్పించే విధంగా చేపట్టిన కార్యాచరణ గురించి గురువారం స్థానికంగా ఆయన ప్రకటించారు. దేశంలో 50 మిలియన్లకు పైగా ఎంఎస్ఎంఈల కోసం డిజిటల్ సేకరణ పై దృష్టి పెట్టామన్నారు. ఎంఎస్ఎంఈ కొనుగోలు దారులకు సేకరణ తరచూగా ఒక చిక్కుముడిగా ఉంటూ వస్తున్నట్టు వివిరంచారు. బహుళ విక్రేతలు, అస్థిరమైన ధర, సుదీర్ఘ ప్రక్రియలు, వంటి సమస్యలు పరిష్కరించే విధంగా, సేకరణను సరళంగా, సమర్థవంతం చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. గత సంవత్సరంతో పోల్చితే, కొత్త కొనుగోలు దారులలో 35 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసినట్టు, 70 శాతం కంటే ఎక్కువ వినియోగదారులు టైర్ 2, టైర్ 3 నగరాలల్లోని బలంగా ఉన్నట్టు వివరించారు. -
శివాలయాల్లో ప్రదోష పూజలు
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోని శివాలయాల్లో ప్రదోష పూజలు బుధవారం ఘనంగా నిర్వహించారు ముందుగా తిరువణ్ణామలై అన్నామలైయార్ సన్నిధిలోని పెద్ద నంది భగవాన్కు శివాచార్యులు వేదమంత్రాలు నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణ దీపారాధన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని మాడవీధుల్లో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. భక్తులు అన్నామలైకు హరోంహర నామస్మరణాలు చేస్తూ స్వామి వారికి కర్పూర హారతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో నంది భగవాన్కు పేద పండితులు వివిధ అభిషేకాలు చేసి పుష్పాలంకరణ చేసి దీపారాధన పూజలు చేశారు. అదేవిధంగా వేలూరు తిరువణ్ణామలై రాణిపేట జిల్లాలోని శివాలయాల్లో శివచార్యులు, వేదపండితులు, అర్చకులు సోనార్లకు పూజలు చేసి మొక్కలు చెల్లించారు. -
అంగన్వాడీ వర్కర్ల ధర్నా
పళ్ళిపట్టు: డిమాండ్లు పరిష్కరించాలనే డిమాండ్ మేర కు అంగన్వాడీ సిబ్బంది గురువారం ధర్నా చేపట్టా రు. చిన్నారులకు ప్రీస్కూల్ విద్య అందిస్తున్న అంగన్వాడీలకు అదనపు బాధ్యతగా ప్రతి చిన్నారికి అంద జే సే పౌష్టికాహారంతో పాటూ గర్భిణులకు, బాలింతలకు అందజేసే పౌష్టికాహారం, పిండి, గుడ్లకు సంబంధించి ఆన్లైన్లో ఫొటో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదే శించింది. దీంతో ఆగ్రహం చెందిన అంగన్వాడీల పని బాధ్యతలు పెంచిన క్రమంలో రాష్ట్ర వ్యా ప్తంగా మండ ల కేంద్రాల్లో చిన్నారుల సంరక్షణ కేంద్రాల కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టారు. తిరుత్తణి, పళ్లిపట్టు, ఆర్కే పేట, తిరువలంగాడు మండల కేంద్రాల్లో నిర్వహించిన ధర్నాలో అంగన్వాడీలు, సహాయకులు పాల్గొని నిరస న వ్యక్తం చేశారు. తమకు పనిభారం పెంచిన క్రమంలో ప్రభుత్వం 5జీ సెల్ఫోన్, 5జీ సిమ్తో పాటూ వైపై సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. -
చోరీ కేసులో ఎనిమిది మంది అరెస్ట్
తిరువళ్లూరు: సేలై గ్రామంలో జరిగిన వేర్వేరు చోరీ కేసుల్లో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా సేలై ఎన్జీఓ కాలనీకి చెందిన చిత్రరాజ్. ఇతను రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఈక్రమంలో చిత్రరాజ్ అతడి భార్య గత కొద్ది రోజుల క్రితం చైన్నెలోని కుమారుడి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చారు. ఈసమయంలో ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలో వుంచిన బంగారు నగలు, రూ.1.50 లక్షల నగదు, సిలిండర్, వెండి వస్తువులను చోరీ చేసినట్టు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదే ప్రాంతానికి చెందిన యువకులే చోరీకి పాల్పడినట్టు గుర్తించి కార్తీక్, ప్రభు, సెందమిల్, విశాల్, ప్రేమ్కుమార్లను అరెస్టు చేశారు. అదేవిధంగా సేలై గ్రామంలో విద్యుత్ వైర్లను చోరి చేసిన సంఘటనలో కలైయరసన్, శ్రీనివాసన్, మూర్తిలను అరెస్టు చేశారు. కాగా అరెస్టయిన ఎనిమిది మంది అదే గ్రామానికి చెందిన వారు కావడం గమనార్హం. నాటుబాంబులు పేలిన ఇంటిలో పులి గోర్లు తిరువొత్తియూరు: తేనిజిల్లా కంబం జల్లికట్టు వీధికి చెందిన గురునాథన్ (67) ఇంట్లో గురువార ం భారీ పేలుడు సంభవించింది. ఇది విని దిగ్భ్రాంతి చెందిన చుట్టుపక్కల వారు పరుగున వెళ్లి చూడగా, గురునాథన్ మనవళ్లు రిథీష్ (7), అభినవ్ (5) తీవ్రంగా గాయపడి ఉన్నారు. వెంటనే వారిని రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వేకువజామున బాంబు పేలిన ఇంట్లో పోలీసులు జాగిలాలు సహాయంతో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో పేలుడు జరిగిన ఇంటిలో 17 పులి గోర్లు, బాంబు తయారీకి అవసరమైన ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై కంబం పశ్చిమ అటవీ ప్రాంత అధికారి స్టాలినన్కు పోలీసులు సమాచారం అందించారు. దీని ఆధారంగా, అటవీ శాఖ అధికారులు ఇంటికి వచ్చి పులి గోర్లను పరీక్షల నిమిత్తం పంపారు. ఇప్పటికే బాంబు పేలుడు ఘటనకు సంబంధించి కంబం ఉత్తర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, పులి గోర్లు దొరకడంతో కంబం పశ్చిమ అటవీ శాఖ కార్యాలయంలో కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మసాజ్ పేరుతో మోసం – 14 సవర్ల నగలు పోగొట్టుకున్న పూజారి తిరువొత్తియూరు: స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన పూజరి నుంచి ఓ ట్యాక్సీ డ్రైవర్, అతడి స్నేహితుడు 14 సవర్ల బంగారు నగలు పోగొట్టుకున్నాడు. పోలీసులె చెప్పిన వివరాల మేరకు.. చైన్నె ఎం.జి.ఆర్. నగర్లో సీతలై సాతనార్ వీధిలో పూజారి (61) నివసిస్తున్నారు. ఈనెల 8వ తేదీన నీలాంగరైలోని ఒక ఇంటిలో పూజ చేయించడానికి బైక్ టాక్సీని పిలిపించుకుని వెళ్లాడు. ఈక్రమంలో ఐనావరం ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడైన బైక్ టాక్సీ డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. పూజరి హోమో సెక్యువల్కి అలవాటుపడిన విషయాన్ని గమనించిన బైక్ ట్యాక్సీ డ్రైవర్ మసాజ్ పేరుతో.. తన స్నేహితుడిని కూడా పూజారి ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాత పూజారిని కరత్రో కొట్టి చంపేస్తామని బెదిరించి, అతను ధరించిన 14 సవర్లు నగలను లాక్కుని పారిపోయినట్లు విచారణలో గుర్తించారు. దీంతో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. దేవాలయాల్లో పునరుద్ధరణ పనులు కొరుక్కుపేట: రూ.6,780 కోట్లతో 27,563 దేవాలయాల్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్టు రాష్ట్ర హిందూదేవదాయ శాఖామంత్రి పి.కె.శేఖర్ తెలిపారు. చైన్నె పార్క్ నగర్లోని కామాక్షి అమ్మన్ సమేత ఏకాంబరేశ్వరర్ ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయాన్ని రూ.5కోట్లతో పునరుద్ధరించి వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 11 దేవాలయాల్లో పవిత్రోత్సవాలు సహా, 3,412 దేవాలయాలల్లో పునరుద్ధరణ పనులు చేశామని తెలిపారు. ఇంతటి చారిత్రాత్మక విజయాలకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కమిషనర్, కార్యదర్శి, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. -
పగ, ప్రతీకారాల ఇంద్ర
తమిళసినిమా: ఇంద్ర చాలా పవర్ఫుల్ టైటిల్. ఇదైతే ఇంతకుముందు తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం రూపొంది సంచలనం విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదే టైటిల్తో ఇప్పుడు తమిళంలో వసంత్ రవి కథానాయకుడిగా నటించిన చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. మెహ్రిన్ నాయకిగా నటించిన ఇందులో టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్, కల్యాణ్ మాస్టర్, అనిఖ సురేంద్రన్ రాజ్కుమార్ ముఖ్యపాత్రలు పోషించారు. శబరినంద కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని జేఎస్ఎం మూవీ ప్రొడక్షన్న్స్ అండ్ ఎంపీరర్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జాఫర్ సాధిక్, ఇర్ఫాన్ మాలిక్ నిర్మించారు. అజ్మల్ తహ్సీన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నేడు తెరపైకి రానుంది. దీన్ని తమిళనాడు వ్యాప్తంగా ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ విడుదల చేస్తుంది. ఇందులో వసంత్ రవి చూపు కోల్పోయిన పోలీస్ అధికారిగా నటించారు. ఆయనకు జంటగా మెహ్రీన్ నటించగా, విలన్ పాత్రలో సునీల్ నటించారు. ఈ చిత్రంలో సీరియల్ హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు చేసింది ఎవరు? ఎందుకు చేశారు వంటి పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగే కథ చిత్రం ఇంద్ర. చిత్ర కథానాయకుడికి కంటిచూపు కోల్పోవడానికి కారణం ఏమిటి? అయినప్పటికీ సంచలనంగా మారిన హత్యల వెనక ఎవరు ఉన్నారు? ఆ హంతకులను హీరో పట్టుకోగలిగారా వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో సాగే ఉత్కంఠ భరిత సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ చిత్రం ఇంద్ర. -
విద్యార్థులు పరిశోధనా విద్యకు ప్రాధాన్యమివ్వాలి
వేలూరు: ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధన విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సినీ నటి రోహిని అన్నారు. సమీపంలోని అనై మీరా ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగత కార్యక్రమం కళాశాల చైర్మన్ రామదాసు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సినీనటి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం కళాశాలల చేరిన విద్యార్థులు అధికంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే కావడంతో మీ తల్లిదండ్రుల కష్టాలను ఒక్కసారి దృష్టిలో ఉంచుకొని ఉన్నత విద్యను అభ్యసించి మీ గ్రామానికి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. పట్టుదలతో ప్రయత్నం చేస్తే జీవితంలో సాధించలేనిది ఏమీ లేదన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించింది పరిశోధనలపై ఆసక్తి చూపాలన్నారు. ఆర్కాడ్ ఎమ్మెల్యే ఈశ్వరప్ప మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంలో ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్య తీర్చి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుందని వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మేధాశక్తితో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి దామోదరం, కళాశాల డైరెక్టర్ ప్రశాంత్ కిషోర్, కుమార్, ప్రిన్సిపల్ గోపీనాథ్, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
కొరుక్కుపేట: విద్యతోపాటూ క్రీడల్లోనూ ఆసక్తిని పెంచుకొని సాధన చేస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని బిలియడ్స్ అండ్ స్నూకర్ ప్రొఫెషనల్ అనలిస్ట్, పాన్ ఇండియా కోచ్ విజయకుమార్ అన్నారు. ఎస్కేపీడీ అండ్ చారిటీస్ నిర్వహణలో కొనసాగుతున్న ఎస్కేపీడీ బాలుర పాఠశాల, కేటీసిటీ బాలికల పాఠశాలల 2025 –26 క్రీడ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్థానిక జార్జిటౌన్లోని ఎస్కేపీసీ మైదానం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిలియడ్స్ అండ్ స్నూకర్ ప్రొఫెషనల్ అనలిస్ట్, పాన్ ఇండియా కోచ్ విజయకుమార్, గౌరవ అతిథిగా లైఫ్ బోట్ ఫౌండేషన్ ట్రస్ట్ ట్రస్టీ అయ్యప్పన్ పాల్గొని జ్యోతి వెలిగించి క్రీడా దినోత్సవాన్ని ప్రారంభించారు . క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు .అలాగే ఉపాధ్యాయులకు కూడా పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిని పాఠశాల కరచాలకులు ఎస్ఎల్ సుదర్శనం, కళాశాల కరచాలకులు ఊటు కూరు శరత్ కుమార్ ఘనంగా సత్కరించారు. విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథి విజయ కు మార్ ప్రసంగించారు. పాఠశాలలో అనేకమంది జోనల్, డిస్ట్రిక్ట్ లెవెల్ రాణిస్తున్న విద్యార్థులందరికీ మెడల్స్ను ప్రదానం చేశారు. అథ్లెట్లో రాణి స్తున్న బి.చంద్రలేఖ, టెన్నికాయిట్లో రాణిస్తున్న సీహెచ్ హన్సికను, కేటీసిటీ పాఠశాల స్పోర్ట్స్ సెక్ర టరీ వి. దేవీని అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అనిల, లీలారాణి, రమేష్, రేవతి పాల్గొన్నారు. -
ఉయిరుళ్లవరై ఉష రీ రిలీజ్
తమిళసినిమా: బహు ముఖాలు కలిగిన టి.రాజేందర్ అనే విషయం తెలిసిందే. ఈయన తెరకెక్కించిన చిత్రాలన్నీ సంచలన విజయాన్ని సాధించినవే. కాగా ఆ చిత్రాలన్నిటిని ఇప్పుడు వరుసగా రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో ఒక చిత్రం ఉయిరుళ్లవరై ఉష. టి.రాజేందర్, నళిని, సరిత, రాధారవి, వెన్నిరాడై మూర్తి, గంగ, ఎస్ ఎస్ చంద్రన్, ఇడిచ్చ పులి, గాంధీమతి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి టి.రాజేందర్ కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, చాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఉషా రాజేంద్రన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం 1982లో విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమ కథాంశంతో ఈ చిత్రం తెలుగులోను ప్రేమసాగరం పేరుతో విడుదలై ఏడాదిపాటు ప్రదర్శింపబడింది. కాగా అలాంటి సూపర్ హిట్ చిత్రాన్ని మళ్లీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, డిజిటల్ ఫార్మెట్లో సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టి.రాజేందర్ వెల్లడించారు. ఈ చిత్ర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం 38 రోజులు పని చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా తాను ఇంతకుముందు రూపొందించిన మైథిలి ఎన్నై కాదలీ, ఒరుతలైరాగం, ఎన్ తంగైకళ్యాణి, టీఆర్ సిలంబరసన్ కథానాయకుడిగా పరిచయమైన కాదల్ ఐళివదిల్లై, శరవణ, ఇదునమ్మఆళు, మోనీషా ఎన్మొనాలిసా, సొన్నాల్ దాన్ కాదలా, చిన్నం చిరువనాగ, ఎంగవీట్టు వేలన్ చిత్రాలను వరుసగా రీ రిలీజ్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం టీ ఆర్ టాకీస్ అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రీ రిలీజ్ చిత్రాల సలహాలను తన కుమారుడు చిలంబరసన్ ఇచ్చారని తెలిపారు. ఈసందర్భంగా ఉయిరుళ్లవరై ఉష చిత్ర పోస్టర్ను విడుదల చేశారు. -
క్లుప్తంగా
పట్టాలపై బైక్ నడిపిన ముగ్గురి అరెస్టుఅన్నానగర్: మధురై డివిజనల్ రైల్వేలోని మధురై–బోడి మార్గంలో, బోడి రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై నలుగురు యువకులు ఇటీవల తమ మోటార్ సైకిళ్లపై సాహసయాత్ర చేశారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ట్రాక్ నిర్వహణ విధుల్లో ఉన్న రైల్వే కార్మికులు వారిపై దాడి చేశారు. దీనితో ఆగ్రహించిన యువకులు రైల్వే కార్మికులపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయంలో, మధురై రైల్వే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా, యువకులను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, తీవ్ర పరిశోధన నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో రైల్వే ట్రాక్ ప్రాంతంలో సాహసయాత్రలో పాల్గొన్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. ఒక వ్యక్తి మాత్రమే పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు. పట్టుబడిన వ్యక్తులను విచారించగా, వారు బోడి సుబ్బరాజ్ నగర్కు చెందిన గణేషన్ కుమారుడు ఈశ్వరన్, సుబ్బరాజ్ నగర్ పుదు కాలనీకి చెందిన రామకృష్ణన్ కుమారుడు మణికంఠన్, జయంనగర్కు చెందిన కంఠసామి కుమారుడు తంగపాండి అని తేలింది. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి జీవిత ఖైదు కొరుక్కుపేట: కార్మికుడిని హత్య చేసిన కేసులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి నాగపట్నం కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలు.. నాగపట్నం జిల్లా ముట్టం కీలాతేరుకు చెందిన నరసింగమూర్తి(60) కార్మికుడు. ఇతడికి అదే వీధికి చెందిన పరమశివం, మహదేవన్, భాగ్యవతి మధ్య శత్రుత్వం ఉంది. ఈక్రమంలో 2022లో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది, నరసింహమూర్తిని పరమశివం, అతని భార్య భాగ్యవతి, కుమారుడు మహాదేవన్ హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరమశివం, భాగ్యవతి, మహాదేవన్ను అరెస్టు చేశారు. ఈ విషయంలో నాగై జిల్లా న్యాయమూర్తి కోర్టులో జరిగిన ఈ కేసులో గురువారం సంచలన తీర్పు వెలువడింది. పరమశివం (55), భాగ్యవతి (52), మహాదేవన్ (31)కి న్యాయమూర్తి కందకుమార్ జీవిత ఖైదు విధించారు. దీని తరువాత, పరమశివం, మహాదేవన్ను కడలూరు జైలులో, భాగ్యవతిని తిరుచ్చి మహిళా జైలుకి తరలించారు. ఎస్యూవీలో కొత్త బెంచ్మార్క్ సాక్షి, చైన్నె: కొత్త బెంచ్ మార్కుతో డాల్బీ అట్మొస్ను కలిగిన ఎస్యూవీగా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ ఆర్ఈవీఎక్స్ ఏ అవతరించిందని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో మోటివ్ బిజినెస్ అధ్యక్షుడు ఆర్ వేలు స్వామి తెలిపారు. మహీంద్రాలో విస్తృత శ్రేణి అంశాలు, అధునాతన ఆవిష్కరణల గురించి గురువారం స్థానికంగా ఆయన ప్రకటించారు. డాల్బీ అట్మొస్ను మహీంద్రా వర్గానికి పరిచయం చేయడం ద్వారా మరింతగా కార్లలో ఆడియో వినోద అనుభవాన్ని విస్తృతం చేసినట్టు వివరించారు. ఇది కళాత్మక వ్యక్తికరణను పూర్తి సామర్థ్యంతో అందించే కొత్త మార్గంగా పేర్కొన్నారు. ఈ ఎస్యూవీ రూ. 12 లక్షల కంటే తక్కువ ధరకే లభించే డాల్బీ అట్మొస్గా పరిచయం చేశామన్నారు. ఇందులోని ప్రీమియం ఫీచర్లు ఎస్యూవీ కొనుగోలు దారుల కాంక్షలకు అనుగుణంగా ఉంటాయని వివరించారు. డాల్బీ లాబొరేటరీస్ సీనియర్ డైరెక్టర్ కరణ్ గ్రోవర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ ప్రతి చోటా గొప్ప ధ్వనీ అందుబాటులో ఉంచాలన్న ధృక్పథంతో వినోదాన్ని పంచే కారుగా తీర్చిదిద్దామన్నారు. స్కాన్ సెంటర్ పేరుతో అబార్షన్లు – డాక్టర్, బ్రోకర్లు అరెస్ట్ వేలూరు: తిరుపత్తూరులో స్కాన్ సెంటర్ నడుపుతూ ఆడపిల్లలను హత్య చేస్తున్న డాక్టర్తో పాటూ బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజుల క్రితం ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల నుంచి గర్భవతులను ఆటోలో తిరుపత్తూరు జిల్లా గ్రామానికి వచ్చారు. అయితే వచ్చిన వారికి స్కాన్ సెంటర్ ఉన్న దారి తెలియకపోవడంతో గ్రామ సమీపంలో ఆటోను నిలిపివేసి అడ్రస్సును స్థానికుల వద్ద అడిగినట్లు తెలుస్తుంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారి వద్దకు చేరుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో ఏజెంట్ల మాటలు విని తాము వచ్చినట్లు తెలిపారు. దీంతో పోలీసులు ఏజెంట్లను అదుపులోకి తీసుకొని విచారణ జరపగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు లేని ఇంటిని అద్దెకి తీసుకొని స్కాన్ సెంటర్ నడుపుతూ కడుపులో ఉన్న బిడ్డ ఆడ, మగ అని నిర్ధారించి అబార్షన్లు చేస్తున్నట్లు తెలిసంది. ఏజెంట్లు ఇచ్చిన సమాచారం వరకు రాచమంగళం గ్రామానికి చెందిన శివశక్తి అతని భార్య జ్యోతితో పాటూ కావేరి పట్నం చెందిన గోవిందం వ్యాపంబట్టు చెందిన రంజితం అమల ఏజెంట్లు అని తెలియ వచ్చింది. దీంతో ఏజెంట్లను పోలీసుల అరెస్టు చేసి పరారీలో ఉన్న డాక్టర్ సుకుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఏజెంట్ల సాయంతో డాక్టర్ స్కాన్ సెంటర్ నడుపుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
తిరువళ్లూరు: నాటుబాంబు విసిరి యువకుడి హత్యకు యత్నించిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఇద్దరు యువకులు పరుగులు తీసే సమయంలో వారికి కాలు విరిగింది. గాయపడ్డ ఇద్దరిని వైద్యశాలకు తరలించి చికిత్స అందించిన తరువాత రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా చిట్రంబాక్కం గ్రామానికి చెందిన ఓబుల్ కుమారుడు సేతురామన్. ఇతను గత రెండు రోజుల క్రితం ఇంటి వద్ద ఉండగా కారులో వచ్చిన గుర్తు తెలియని యువకులు అతడినిపై నాటుబాంబులు విసిరి హత్య చేయడానికి యత్నించారు. అయితే సేతురామన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడంబత్తూరు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో గంజాయి విక్రయించే విషయంలో సేతురామన్కు ఇరుళంజేరి గ్రామానికి చెందిన ముఖేష్ గ్రూపు మధ్య పాతకక్షలు వున్నట్టు తెలిసింది. ఈ కక్షతోనే నాటుబాంబు విసిరి హత్య చేయడానికి ప్రయత్నించారన్న కోణంలో పోలీసులు నిర్ధారించారు. ఇరుళంజేరి గ్రామానికి చెందిన భరత్ కుమారుడు ముఖేష్(22), అరుల్దాస్ కుమారుడు అభిమన్యు(24), శివకుమార్ కుమారుడు వినోధ్కుమార్(25)లను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. స్టేషన్కు తరలించే క్రమంలో ముఖేష్, అరుల్దాస్ వ్యాన్ నుంచి దూకి తప్పించుకోవడానికి యత్నించడంతో వారి కాళ్లకు గాయమైంది. గాయపడ్డ వారిని తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందించి రిమాండ్కు తరలించారు. -
అమెరికా తెలుగు సాహితీ సదస్సులో చైన్నె వాసులు
కొరుక్కుపేట: చైన్నెకు చెందిన ఇద్దరు తెలుగు ప్రముఖులకు అరుదైన గౌరవం దక్కింది. భారతదేశం నుంచి పాల్గొన్న తెలుగు సాహితీ ప్రముఖుల్లో చైన్నెకి చెందిన మద్రాసు క్రైస్తవ కళాశాల తెలుగుశాఖ అధ్యక్షుడు యజ్ఞశేఖర్, విశ్రాంత ఉపాధ్యాయిని డాక్టర్ ఏవీ శివకుమారిలు 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో పాల్గొని తెలుగు భాష, సాహిత్యాల ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. ఇటీవల అమెరికాలోని టెక్సస్ నగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్త ఆధ్వర్యలో 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో అడవి బాపిరాజు నారాయణ నవలపై విశ్లేషణ జరినట్టు డాక్టర్ శివకుమారి ఒక ప్రకటనలో తెలియజేశారు. నిన్న ఊరట.. నేడు షాక్ సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి కె. పళణి స్వామికి బుధవారంఊరట నిచ్చిన హైకోర్టు, గురువారం పెద్ద షాక్ ఇచ్చింది. ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎంపికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై సిటీ సివిల్ కోర్టు విచారణకు తాత్కాలికంగా స్టే విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా 2022లో పళణి స్వామి ఎంపికై న విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ఈకేసును దాఖలు చేసిన వ్యక్తికి అన్నాడీఎంకేతో సంబంధం లేదంటూ పళణి స్వామి తరపున రిట్పిటిషన్ దాఖలైంది. అయితే, పళణి స్వామి వాదననను తిరస్కరించిన సిటీ సివిల్ కోర్టు పిటిషన్ను విచారణకు స్వీకరించింది. దీనిని వ్యతిరేకిస్తూ పళణి స్వామి అప్పీలుకు వెళ్లారు. బుధవారం ఈ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. సిటీ సీవిల్ కోర్టు విచారణకు తాత్కాలిక స్టే విధిస్తూ బుధవారం హైకో ర్టు బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేసులో పళణి స్వామికి ఊరట కలిగినట్టైంది. తదుపరి విచారణను సెప్టెంబర్ మూడో తేదీ జరగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా బుధవారం స్టే విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు గురువారం రద్దు చేయడం పళణి స్వామికి పెద్ద షాక్గా మారింది. ఇందుకు ప్రధాన కారణంగా ఈ వ్యవహారంలో పళణికి వ్యతిరేకంగా ఉన్న పిటిషనర్ సూర్యమూర్తి కేవియేట్ పిటిషన్ను ఇప్పటికే దాఖలు చేసి ఉండటం వెలుగులోకి రావడం గమనార్హం. తన వాదనను వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదని పిటిషనర్ విజ్ఞప్తి చేసి ఉండటంతో బుధవారం జారీ చేసిన తాత్కాలిక స్టే ఉత్తర్వులను రద్దు చేస్తూ గురువారం హైకోర్టు బెంచ్ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. మత్తుమందు ఇచ్చి కూతురిపై అత్యాచారం – తండ్రికి 66 ఏళ్ల జైలు శిక్ష అన్నానగర్: తన కూతురిపై అత్యాచారం చేసిన నామక్కల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒక వ్యక్తికి 66 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్కు చెందిన గణేష్ (37). ఇతను తన భార్య, 11 ఏళ్ల కుమార్తెతో నివసిస్తున్నాడు. ఇతను మేకల పెంపకంలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ స్థితిలో, 22.2.2022న, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గణేష్ తన 6వ తరగతి చదువుతున్న కూతురికి మత్తుమందు ఇచ్చి ఆమైపె అత్యాచారం చేశాడు. బాధిత బాలిక ఈ విషయాన్ని తన తల్లికి తెలిపింది. ఆమె తన భర్తపై తిరుచెంగోడు ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి గణేష్ను అరెస్టు చేశారు. నామక్కల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరిగిన ఈ కేసులో న్యాయమూర్తి మునుస్వామి గురువారం తీర్పు వెలువరించారు. ఇందులో గణేష్కు 66 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. దక్షిణ జిల్లాలకు 5 ప్రత్యేక రైళ్లు? కొరుక్కుపేట: దీపావళి పండుగ అక్టోబర్ 20న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా చైన్నెలో నివసిస్తున్న వివిధ జిల్లాల ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం దీపావళి సోమవారం వస్తుంది, దీంతో శనివారం, ఆదివారం సహా వరుసగా 3 రోజులు సెలవులు ఉన్నాయి. దీని కారణంగా, ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లడానికి రైళ్లను బుక్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీని కోసం బుకింగ్ మంగళవారం రోజు ప్రారంభమైంది. ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే, ప్రధాన రైళ్లలోని అన్ని సీట్లు బుకింగ్ అయిపోయాయి. చైన్నె నుంచి జిల్లాలకు వెళ్లే రైళ్లన్నీ నిండిపోయాయి. అలాగే తిరునల్వేలి, నాగర్కోయిల్, కోయంబత్తూర్, బెంగళూరు వందే భారత్ రైళ్లు కూడా నిండిపోయా యి. ఈక్రమంలో దీపావళికి అక్టోబర్ రెండవ వా రంలో దక్షిణాది జిల్లాలకు 5ప్రత్యేక రైళ్లు నడపా లని యోచిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. -
చైన్నెలో తగ్గిన చేపల ధరలు
తిరువొత్తియూరు: కేరళ నుంచి చేపలు పెద్దఎత్తున విక్రయానికి వస్తుండడంతో చైన్నెలో చేపల ధరలు తగ్గాయి. ఫలితంగా తాము నష్టపోతున్నట్లు కాశిమేడు మత్స్యకారులు వాపోతున్నారు. పైగా తమిళనాడు తీరప్రాంతాల్లో చేపలు దొరకకపోవడంతో పూర్తిగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చేపల వేట నిషేధం ముగిసిన తర్వాత కూడా ఫైబర్ పడవల లో వెళ్లిన మత్స్యకారులకు వలలో చేపలు పడటం లేదు. ఇక లోతైన సముద్రంలో చేపలు దొరకకపోవడంతో మత్స్యకారులు నిరాశతో తిరిగి వచ్చి నష్టపోతున్నారు. అదే సమయంలో కేరళ నుండి అధిక సంఖ్యలో చేపలు చైన్నెకి అమ్మకానికి వస్తున్నాయి. పుళల్, వానగరం ప్రాంతాలకు రోజూ కేరళ నుంచి పెద్దఎత్తున వంజిరం, వవ్వాల్, శంకర, రొయ్యలు వంటి చేపలు అధికంగా విక్రయానికి రావడంతో కాశిమేడు మత్స్యకారుల వ్యాపారం దెబ్బతింది. కేరళ నుం వస్తున్న వంజిరం చేపలు కిలో రూ.600, రూ.700లకు లభిస్తున్నాయి. దీనివల్ల రూ.1000 వరకు అమ్ముడైన ఈ చేపల ధర తగ్గింది. రొయ్యలు కిలో రూ.500కి లభిస్తున్నాయి. అలాగే 20 కిలోల కడంబ ధర రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు అమ్ముడవుతోంది. ఇక చేపల లభ్యత గురించి కాశిమేడు మొత్తం చేపల వ్యాపారి పొన్నన్ మాట్లాడుతూ లోతైన సముద్రంలో చేపలు దొరకకపోవడంతో మత్స్యకారులు ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నారు. దీనివల్ల నష్టం జరుగుతోంది. 800 ఫైబర్ పడవలో వెళ్లాల్సి ఉండగా..400 ఫైబర్ పడవలు మాత్రమే సముద్రంలోకి వెళ్లినట్లు వెల్లడించారు. -
నియంతృత్వం వైపుగా దేశం!
భారతదేశం నియంతృత్వం వైపుగా కదులుతోందని, సర్వాధికారం తమ గుప్పెట్లో పెట్టుకునే దిశగా కేంద్రం పావులు కదుపుతున్నట్టు సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పాలకుల బండారం బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే పార్లమెంట్ వేదికగా నలుపు చట్టాలను ప్రవేశ పెట్టారని ధ్వజమెత్తారు. ఇది వరకు తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడటం జరిగిందో, దానిని తలదన్నే రీతిలో పోరాటాలు తాజాగా జరుగుతాయన్నారు. సాక్షి, చైన్నె: తేనాం పేటలోని అన్నా అరివాలయంలోని కలైంజ్ఞర్ అరంగంలో మాజీ మంత్రి రెహ్మాన్ ఖాన్ రాసిన ఐదు పుస్తకాల ఆవిష్కరణ గురువారం జరిగింది. ఈ పుస్తకావిష్కరణ కు సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ జాతీయ నేత ఖాదర్ మొహిద్దీన్, న్యాయ రంగానికి చెందిన సుబేర్ ఖాన్, రియాజ్ ఖాన్ హాజరయ్యారు. ఈ పుస్తకాలను సీఎం స్టాలిన్ ఆవిష్కరణగా, ఖాదర్ మొహిద్దీన్ అందుకున్నారు. రెహ్మాన్ఖాన్ జీవితం, సేవలు, అనుబంధాన్ని గుర్తుచేస్తూ సీఎం ఈసందర్భంగా ప్రసంగించారు. సోదరుడు రెహ్మాన్ ఖాన్ ఇంటిపై ఒకటి కాదు, రెండు సార్లు దాడి జరిగిందని, అయినా, ఏ మాత్రం ఆయన తగ్గకుండా ముందడుగు వేశారని గుర్తు చేశారు. బుధవారం పార్లమెంట్లో జరిగిన పరిణామాలను ఈసందర్భంగా వివరిస్తూ వ్యాఖ్యల తూటాలను పేల్చారు. కక్ష పూరితంగానే బిల్లు దేశం నియంతృత్వం వైపుగా కదులుతోందన్నారు. తమను వ్యతిరేకించే వారిని నిఘా సంస్థలను, స్వతంత్ర సంస్థలను ఉపయోగించి అణగొక్కే ప్రయత్నాలు చేస్తూ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా మరో నల్ల చట్టాన్ని తీసుకొచ్చారని మండి పడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం, వక్ఫ్ సవరణ చట్టం అంటూ మైనారిటీ ప్రజలకు వ్యతిరేకంగా ఇది వరకు కొన్ని చట్టాలను తీసుకొచ్చారని వివరించారు. ఈ చట్టాలు ఆ వర్గాల ప్రజలను తీవ్ర ఆందోళనకు నెట్టే పరిస్థితికి తెచ్చాయని మండి పడ్డారు. దేశంలో కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా పెద్ద చర్చే సాగుతోందని పేర్కొంటూ, వాటి నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు మరో నల్ల చట్టంను అమిత్ షా పార్లమెంట్లో ప్రవేశ పెట్టారన్నారు. కక్ష పూరితంగానే ఈ బిల్లును రూపకల్పన చేశారని ధ్వజమెత్తారు. దేశం మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకునే విధంగా సర్వాధికార పాలన సాగించే కుట్రలు విస్తృతం చేసినట్టున్నారన్న తాజా పరిణామాలను స్పష్టం చేస్తున్నాయన్నారు. నేరాలు నిరూపితం కాక ముందే, ఆరోపణల సాకుతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై న ప్రభుత్వాలను కుప్ప కూల్చేందుకు కుట్ర పూరితంగా కేంద్రం బిల్లును ప్రవేశ పెట్టిందని మండిపడ్డారు. ఇది వరకటి నల్ల బిల్లులకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలు జరిగాయో , వాటిని తలదన్నే రీతిలో ఈ వ్యవహారంలోనూ పోరాటాలు జరుగుతాయని స్పష్టం చేశారు. డీఎంకే ఎల్లప్పుడు మైనారిటీలకు మద్దతుగానే ఉంటుందని, ఇందులో మార్పు ఉండదన్నారు. ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడుతూ, ఈ పుస్తకాలలో చారిత్రాత్మక ఘటనల గురించి వివరించి ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి తమిళుడు చదవాల్సిన పుస్తకంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసే విధంగా పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాట బంద్ నిర్వహణకు సీఎం స్టాలిన్ పిలుపు నివ్వాలని, అన్ని దుకాణాలను మూసి వేసి నిరసన తెలియజేద్దామని వీసీకే నేత తిరుమావళవన్ మీడియా సమావేశంలో సీఎంకు విన్నవించారు. -
అల్పాహార పథకం మరింత విస్తరణ
సాక్షి, చైన్నె: బడులలో సీఎం అల్పాహార పథకం మరింత విస్తరణకు చర్యలు చేపట్టారు. అదనంగా 3.05 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరే విధంగా ఈ విస్తరణ కార్యక్రమాన్ని ఈనెల 26వ తేదిన చైన్నె మైలాపూర్లో సీఎం స్టాలిన్ ప్రారంభించనున్నారు. వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులలో అధిక శాతం మంది ఉదయం వేళల్లో అల్పాహారం తీసుకోవడం లేదన్న విషయం గతంలో ప్రభుత్వం దృష్టికి చేరింది. ఓ పరిశీలనలో వెలుగు చూసిన ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ బడుల్లో ఉదయం వేళల్లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. 2022 సెప్టెంబరులో తొలి విడతగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 1,541 ప్రభుత్వ పాఠశాల్లో ఈ పథకం అమల్లోకి తెచ్చారు. దశల వారీగా ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకం ప్రస్తుతం దిగ్విజయవంతంగా అమల్లో ఉంది. 30,992 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 18.50 లక్షల మంది పిల్లలు ఈ అల్పాహారం స్వీకరిస్తున్నారు. రోజుకో మెనూతో అల్పాహారం విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వ సహకారంతో నడిచే ఎయిడెడ్ పాఠశాలలోనూ అమలు చేయాలన్న విజ్ఞప్తి మేరకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 3,995 ప్రభుత్వ సహాయంతో కూడిన ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 2,23,536 మంది పిల్లలకు లబ్ధి చేకూర్చే విధంగా ఇటీవల చర్యలు తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలలో గొప్ప పథకంగా అల్పాహార పథకం మరింత దిగ్విజయవంతంగా అమలు చేస్తామని సీఎం స్టాలిన్ ఇది వరకే ప్రకటించారు. ఈ మేరకు తాజాగా మరో 3.05 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరే విధంగా పథకం విస్తరణకు చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా మీతో స్టాలిన్ శిబిరాలకు వస్తున్న విజ్ఞప్తుల మేరకు కలైంజ్ఞర్మగళిర్ ఉరిమై తిట్టం (మహిళా హక్కు పథకం) మేరకు రూ. 1000 నగదు పంపిణిని మరో 15 లక్షల మందికి వర్తింప చేయడానికి నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. -
నేడు తిరునల్వేలికి అమిత్ షా
సాక్షి, చైన్నె: తిరునల్వేలి వేదికగా బూత్ కమిటీ మహానాడుకు కమలనాథులు సన్నద్ధమయ్యారు. శుక్రవారం జరిగే ఈ మహానాడుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. తచ్చనల్లూరు వరకు రోడ్ షోకు ఏర్పాట్లు జరిగాయి. అమిత్షా రాకతో నిఘా వలయంలోకి తిరునల్వేలిని తీసుకొచ్చారు. వివరాలు.. తమిళనాడులో పాగా వేయడమే లక్ష్యంగా అమిత్ షా వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఏడాదిలో నెలకు ఒక పర్యాయం అమిత్ షా తమిళనాడుకు వచ్చి వెళ్లారు. మే నెలలో మాత్రం విరామం ఇచ్చినా జూన్ నెల మదురైలో రెండురోజులు తిష్ట వేశారు. జూలైలో పర్యటనకు ఏర్పాట్లు జరిగినా చివరి క్షణంలో వాయిదా పడింది. తాజాగా ఆగస్టు పర్యటనకు రెడీ అయ్యారు. తమిళనాడులో రానున్న ఎన్నికలలో అన్నాడీఎంకే కూటమిలో 50 సీట్లను బీజేపీగురి పెట్టినట్టుగా ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ఈ నియోజక వర్గాలలోని బూత్ కమిటీలో మహానాడుకు ఏర్పాట్లు చేపట్టారు. తిరునల్వేలి వేదికగా తొలి మహానాడు శుక్రవారం జరగనుంది. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాశి, రామరనాధపురం, విరుదునగర్ జిల్లాలోని బూత్ కమిటీలతో మాట్లాడేందుకు స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. సర్వం సిద్ధం తచ్చనల్లూరు వద్ద మహానాడు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. లక్షల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలను ఏర్పాటు చేశారు. బూత్ కమిటీల ప్రతినిధులు, ముఖ్య నేతల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ మహానాడు నిమిత్తం అమిత్ షా కేరళలో జరిగే కార్యక్రమాలను ముగించుకుని తిరునల్వేలికి శుక్రవారం మధ్యాహ్నం రానున్నారు.మధ్యాహ్నం 2 గంటలకు కొచ్చిన్ నుంచి బయలు దేరి 2.50 గంటలకు తూత్తుకుడి విమానాశ్రయం చేరుకుంటారు. ఇక్కడి నుంచి 3.10 గంటలకు హెలికాఫ్టర్లో తిరునల్వేలి సాయుధ బలగాల విభాగం పరేడ్ గ్రౌండ్ హెలిపాడ్కు హెలికాఫ్టర్లో చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్ షోజరగనున్నది. 4 గంటలకు తచ్చనల్లూరు వేదికకు చేరుకుని అమిత్ షా ప్రసంగించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగే తొలి మహానాడు కావడంతో కార్యక్రమం విజయవంతమే లక్ష్యంగా సర్వం సిద్ధం చేశారు. అమిత్ షా రాకతో తిరునల్వేలిని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. -
సింహం ఎప్పుడూ సింహమే
సాక్షి, చెన్నై: సింహం ఎప్పటికీ సింహంగానే ఉంటుందని నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్ విజయ్ స్పష్టం చేశారు. బీజేపీ, డీఎంకేలతో ఎన్నికల పొత్తు పెట్టుకోబోమని, ఆ రెండు పార్టీలు తమకు బద్ధ శత్రువులని విమర్శించారు. ఆత్మగౌరవంతోనే ముందుకు సాగుతామన్నారు. తమిళనాడులోని మదురైలో గురువారం జరిగిన పార్టీ రెండో మహాసభకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మద్దతు కూడగట్టుకోవడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సభలో ఆయన ప్రసంగించారు. తమ రాజకీయ శత్రువు డీఎంకే కాగా, సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని పేర్కొన్నారు. టీవీకే ఎవరికీ భయపడదు, మాఫియా వ్యాపారాలు చేయదు అని వ్యాఖ్యానించారు. తమిళనాడు బలం మొత్తం మనతోనే ఉంది. ఫాసిస్ట్ బీజేపీ, విషపూరిత డీఎంకేకి వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ‘సింహం ఎప్పుడూ ప్రత్యేకమే. దాని గర్జన 8 కిలోమీటర్ల మేర ప్రతిధ్వనిస్తుంది. వేటకు మాత్రమే బయటకు వస్తుంది. అడవిలో నక్కలు చాలానే ఉంటాయి. సింహం మాత్రం ఒక్కటే. అదే అడవికి రాజు. ఇదే మా స్పష్టమైన ప్రకటన’అని విజయ్ పేర్కొన్నారు.మిస్టర్ పీఎం మోదీజీ.. సీఎం స్టాలిన్ అంకుల్!మిస్టర్ నరేంద్ర దామోదర దాస్ మోదీ జీ అంటూ అని సంబోధించిన విజయ్..తమిళనాడు ప్రజల ఆకాంక్షలను బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. అరెస్టయిన తమిళ జాలర్లను విడిపించాలి..కచ్ఛతీవును తిరిగి స్వాధీనం చేసుకోవాలి, నీట్ను రద్దు చేయాలని ఆయన డిమాండ్లు వినిపించారు. బీజేపీది బానిసల కూటమి అని విమర్శలు ఎక్కుబెట్టారు. ఆర్ఎస్ఎస్కు బీజేపీ బానిస అని, బీజేపీకి అనేక రాష్ట్ర పార్టీలు బానిసలుగా మారి మైనారిటీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆ బానిసలలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ టీవీకే ఉండబోదని స్పష్టం చేశారు. అదేవిధంగా, మైడియర్ అంకుల్ అంటూ సీఎం స్టాలిన్ను ఉద్దేశించి విమర్శలను ఎక్కుపెట్టారు. మహిళలకు నెలకు రూ.వెయ్యి ఇస్తే సరిపోతుందా? వాళ్ల రోదనలు వినిపించడం లేదా? పరంధుర్ ఎయిర్పోర్టుతో భూములు కోల్పోయిన రైతులు, మత్స్యకారుల ఆవేదన ఆలకించారా? మనస్సాక్షి ఉంటే సమాధానం ఇవ్వండని సవాల్ విసిరారు. మైడియర్ అంకుల్ వినిపిస్తుందా ప్రజా గళం? త్వరలో ప్రజల్లోకి వెళ్తున్నా. మనస్సు విప్పి మాట్లాడుతా..ఇక తమరికి నిద్ర కరువైనట్టే అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలలో తానే అభ్యర్థి అని, తనను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
గిండిలో 7 అంతస్తులతో రవాణా కేంద్రం
– మూడు సేవల అనుసంధానం సాక్షి, చైన్నె: గిండిలో ఏడు అంతస్తులో రవాణా కేంద్రం భవనం వాణిజ్య సముదాయాలతో రూపుదిద్దుకోనుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు చేపట్టారు. చైన్నె నగరంలో గిండి ఒక ప్రధాన ప్రాంతంగా ఉంది. రవాణాకు ఇది ఒక జంక్షన్ వలే ఉంది. ఇక్కడే మెట్రో, ఎలక్ట్రిక్, బస్సు రవాణా ఒకే చోట ఏకం అవుతాయి. ఎంటీసీ బస్సులు గిండి మీదుగా పోరూరు, పూందమల్లి వైపుగా ఓ మార్గంలో, కోయంబేడు వైపుగా మరో మార్గంలో. తాంబరం, విమానాశ్రయం వైపుగా ఇంకో మార్గంలో సేవలు సాగిస్తూ వస్తున్నాయి. నగరంలో ప్రధాన రవాణా ప్రాంతంగా ఉన్న గిండి బస్టాండ్ను వాణిజ్య సముదాయంతో తీర్చిదిద్దేందుకు కసరత్తు మొదలయ్యాయి. ఇప్పటికే చైన్నెలో పలు బస్టాండ్లను మాల్స్ తరహాలో తీర్చిదిద్దే కసరత్తులు వేగంగా జరుగుతుండగా, ప్రస్తుతం గిండి కూడా ఆ జాబితాలో చేరింది. ఏడు అంతస్తులతో బ్రహ్మాండ భవనంగా, వాణిజ్యసముదాయాలతో, మెట్రో, ఎలక్ట్రిక్, బస్సు సేవలకు ఉపయోగకరంగా ఉండే మాల్ ఇక్కడ రూపకల్పన జరగబోతోంది. -
చెట్ల కోసం చెట్లతో మాట్లాడుదాం
– సీమాన్ సరికొత్త నినాదం తిరుత్తణి: చెట్లకోసం మాట్లాడుదాం, చెట్లతో మాట్లాడుదాం అనే సరికొత్త నినాదంతో ప్రకృతిపై తన ప్రేమను చాటుకునే పనిలో పడ్డారు నామ్ తమిళర్ పార్టీ ప్రధాన కోఆర్డినేటర్ సీమాన్. వివరాల్లోకెళితే.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అధికార పార్టీ రోజుకో కొత్త పథకంతో ఓటర్లను ఆకర్షించే పనిలో వుండగా, ప్రతిపక్ష నాయకుడు ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేసుకుంటున్నారు. అదే తరహాల్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ మహానాడు ద్వారా తన సత్తా చాటే పనిలో వున్నారు. డీఎండీకే పార్టీ, పీఎంకే సైతం ప్రజల వద్ద వెళ్లి ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అందుకు భిన్నంగా సీమాన్ ప్రకృతి పట్ల తన ప్రేమను చాటుకునే పనిలో పడ్డారు. గతవారం పశువులు పెంపకం, పశువుల పట్ల ప్రేమను చూపించగా, బుధవారం చెట్లపట్ల తన ప్రేమను చాటుకున్నారు. ఆగస్టు 30న చెట్ల దినోత్సవాన్ని తిరుత్తణి సమీపంలోని అరుంగుళంలో వనంలో వేడుకలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం చెట్లను పరిశీలించిన సీమాన్ చెట్లను హత్తుకుని, ముద్దాడి చెట్లతో మాట్లాడి ప్రకృతిపట్ల తన ప్రేమను చాటుకున్నారు. -
రూ.66.78కోట్లతో పైప్లైన్
తిరువళ్లూరు: చెమరంబాక్కం నుంచి కోయంబేడు వరకు తాగునీటిని తరలించడానికి రూ.66.78 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పైప్లైన్ ట్రయల్రన్ను మంత్రులు నెహ్రూ, నాజర్ బుధవారం పరిశీలించారు. చెమరంబాక్కం రిజర్వాయర్ వద్ద వున్న శుద్ధీకరణ కేంద్రం నుంచి నీటిని శుద్ధీకరణ చేసిన తరువాత చైన్నె ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఈక్రమంలోనే రెండవ దశలో చెమరంబాక్కం నుంచి పూందమల్లి జంక్షన్ మీదుగా కోయంబేడు వరకు పైప్లైన్ను అమర్చారు. ఈ పైప్లైన్ ద్వారా కోయంబేడు, అంబత్తూరు, అన్నాఽనగర్, తేనాంపేట, కోయంబాక్కం, వలసరవాక్కం, ఆలందూరు, అడయార్, తాంబరం, కుండ్రత్తూరు ప్రాంతాలకు తాగునీటిని అందించనున్నారు. పనులు పూర్తయిన క్రమంలో ట్రయల్రన్ను నిర్వహించారు. ఈ ట్రయల్రన్ను మున్సిపల్శాఖ మంత్రి నెహ్రూ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ పరిశీలించారు. మంత్రి నెహ్రూ మాట్లాడుతూ చెమరంబాక్కం శుద్ధీకరణ కేంద్రం నుంచి 11.7 కి.మీ, పూందమల్లి జంక్షన్ నుంచి 9.2 కి.మీ మేరకు పైప్లైన్లను అమర్చినట్టు తెలి పారు. దీంతో రోజుకు అదనంగా 265 మిలియన్ లీటర్ల తాగునీటిని శుద్ధీకరణ చేసి తాగునీటి అవసరాల కోసం వినియోగించనున్నట్టు తెలిపారు. కార్య క్రమంలో కలెక్టర్ ప్రతాప్, పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి, ఆవడి మేయర్ ఉదయకుమార్, వివిధ విభా గాల అధికారులు పాల్గొన్నారు. -
నాటుబాంబుతో యువకుడి హత్యకు కుట్ర
– తిరువళ్లూరులో కలకలం తిరువళ్లూరు: నాటుబాంబులను విసిరి యువకుడిని హత్య చేయడానికి యత్నించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ చిట్రంబాక్కం గ్రామానికి చెందిన సేతు. ఇతను కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సేతు మంగళవారం రాత్రి ఇంటికి సమీపంలో ఉండగా కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు నాటుబాంబులను అతనిపై విసిరారు. నాటుబాంబు పేలి సేతుకు స్వల్ప గాయమైంది. వెంటనే స్థానికులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు విచారణ చేశారు. సేతుకు, పేరంబాక్కం గ్రామానికి చెందిన ముఖేష్ వర్గానికి మధ్య గంజాయి విక్రయించే అంఽశంపై పాతకక్షలు వున్నట్టు తెలిసింది. గత మూడు నెలల క్రితం సేతు వర్గీయులు ముఖేష్ వర్గీయులపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడికి ప్రతీకారంగానే ముఖేష్ వర్గీయులు సేతుపై నాటుబాంబులతో దాడి చేసినట్టు నిర్ధారించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
చైన్నెలో బిగ్ సినీ ఎక్స్ పో
సాక్షి, చైన్నె : చైన్నె నందంబాక్కంలోని ట్రేడ్ సెంటర్ వేదికగా బిగ్ సినీ ఎక్స్ పో ప్రారంభమైంది. 8వ ఎడిషన్ సినీ ప్రదర్శన చథియేటర్ పంపిణీ పరిశ్రమకు ఆసియాలోని ఏకై క వేదికగా ఈ ఎక్స్పోను ఏర్పాటు చేశారు. థియేటర్ వరల్డ్ నిర్వహించిన ఈ ప్రదర్శన సింగిల్– స్క్రీన్ సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ పరిశ్రమ వాటాదారులు తరలివచ్చారు. ఈ ప్రదర్శనను తమిళనాడు సినిమా థి యేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పన్నీర్ సెల్వం, థియేటర్ వరల్డ్ వ్యవస్థాపకుడు సందీప్ మిట్టల్, బిగ్ సినీ ఎక్స్ పో డైరెక్టర్ రాఘవేంద్ర, జీటీసీ ఇండస్ట్రీస్ భాగస్వామి యూసఫ్ తదితరులు బుధవారం ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో షో ఫ్లోర్, లైవ్ టెక్నాలజీ డెమోలు, ఉత్పత్తి ప్రదర్శనలు, స్టూడియో ప్రజెంటేషన్లు, ఫిల్మ్ స్క్రీనిం గ్లు, సెమినార్లు, ప్యానల్ చర్చలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. -
భక్తితోనే పాండురంగ స్వామి అనుగ్రహం
కొరుక్కుపేట: భక్తితో పాండురంగస్వామిని వేడుకుంటే అనుకున్న కోర్కెలు తీరుతాయని బ్రహ్మశ్రీ విట్టల్ దాస్ మహరాజ్ ఉపదేశించారు. చైన్నె పెరంబూరులో మంగళవారం రాత్రి వేంకటేశ్వర భక్త సమాజం, శ్రీ కృష్ణ స్వీట్స్, రంగనాథన్ మోంట్ ఫోర్డ్ మెట్రుక్కులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రావణ మాసం పురస్కరించుకుని నామసంకీర్తనం పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్త సమాజం అధ్యక్షుడు తమ్మినేని బాబు, బ్రహ్మశ్రీ విట్టల్ దాస్ మహరాజ్ పాల్గొని పాండురంగస్వామిని కీర్తిస్తూ నామసంకీర్తనం చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు విట్టల్ దాస్ మహరాజ్తో కలిసి పాండురంగుని పాటలను పాడుతూ ఆకట్టుకున్నారు. సెక్రటరీ ఎస్.వెంకటరామన్, కోశాధికారి పి.కోదండరామయ్య, జాయింట్ సెక్రటరీ పి.రవికుమార్, పాఠశాల కరస్పాండెంట్ జనార్దనం, సీఈఓ భువనేశ్వర్, ప్రిన్సిపల్ సుదర్శనం పాల్గొని విట్టల్ మహరాజ్ను సత్కరించారు. -
వైభవం.. స్తంభ ప్రతిష్ట
కొరుక్కుపేట: శరన్నవరాత్రి మహోత్సవం, వడాయతి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం స్తంభ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. చైన్నెలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు వడాయతి ఉత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో, ఈ ఉత్సవాలకు అంకురార్పణగా ఆలయ ప్రధాన అర్చకుల బృందం శాస్త్రోక్తంగా స్తంభ ప్రతిష్ట చేశారు. ముందుగా కన్యకా పరమేశ్వరి మూల, ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, అలంకరణలు, ఆరాధనలు నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం దేవస్థాన మహామండపంలో కలశ పూజను భక్తిశ్రద్ధలతో చేశారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త కొల్లా వెంకట చంద్రశేఖర్, పాలకమండలి సభ్యులు ఊటుకూరు శరత్కుమార్, ఎస్ ఎల్ సుదర్శనం, సీఆర్ కిషోర్బాబు, తాతా బద్రీనాథ్, ఎస్కేపీడీ చారిటీస్ కార్యదర్శి ఎం కిషోర్ కుమార్ పాల్గొన్నారు. -
కుశస్థలి నదిలో కట్టకు అడ్డుగోడ
తిరుత్తణి: కుశస్థలి నదిలో రూ.కోటి వ్యయంతో కట్టకు అడ్డుగోడ నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. తిరువలంగాడు సమీపంలో ఎన్ఎన్.కండ్రిగ వద్ద కుశస్థలి నదిలో గత ఏడాది వరద ప్రవాహానికి నది కట్ట దెబ్బతింది. వరద ప్రవాహం నదితీర ప్రాంతంలోని పంట పొలాలను ముంచెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వుంది. వర్షాకాలం సమీపిస్తున్న క్రమంలో నదికట్టను దృఢపరిచి అడ్డుగోడ నిర్మాణానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ. కోటి వ్యయంతో నది కట్టకు అడ్డుగోడ నిర్మాణ పనులు ప్రారంభోత్సవం నిర్వహించారు. ఇందులో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని నదికి అడ్డుగోడ నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో వరద పోటెత్తిన నది కట్టకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వరద ప్రవాహం వెళుతుందని ప్రజా పనుల శాఖ అధికారులు తెలిపారు. ప్రజాపనులశాఖ అధికారులు, మండల డీఎంకే కన్వీనర్ విజయకుమార్ పాల్గొన్నారు. అదేవిధంగా తాళవేడులో ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.7లక్షలతో బస్షెల్టర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. -
క్లుప్తంగా
మహిళా ఉద్యోగులకు లైంగిక వేధింపులు –మహిళా సంఘం నేతల ఆందోళన తిరువళ్లూరు: మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తమిళనాడు గ్రామీణ జీవనోపాధి విభాగం మేనేజర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం నేతలు బుధవారం ఉదయం ఆందోళన చేశారు. తిరువళ్లూరులోని మెడికల్ కళాశాల ఎదుట జరిగిన ఆందోళనకు సంఘం జిల్లా అధ్యక్షురాలు శశికళ అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ తమిళనాడు గ్రామీణ జీవనోపాధి విభాగంలో పని చేసే మహిళల పట్ల మేనేజర్ సభాపతి అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడన్నారు. వెంటనే అతనిపై విచారణ జరిపి విధుల నుంచి తొలగించాలని కోరారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందింకుంటే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళా సంఘం నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లారీ దగ్ధం తిరువొత్తియూరు: కోవిలంబాకం సత్యనగర్ 6వ వీధికి చెందిన జాన్బాషా (33కి సొంత లారీ ఉంది. దీని ద్వారా పల్లవరం, క్రోంపేట్, తాంబరం ప్రాంతాల్లోని ఇళ్లు, అపార్ట్మెంట్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించే పని చేస్తుండేవాడు. అయితే ఈ విధంగా తొలగించిన వ్యర్థాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా తిరునీర్మలై చెత్తకుప్ప వద్ద పడేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఎప్పటిలాగే అనకాపుత్తూరు నుంచి తిరునీర్మలై వెళ్లే క్వారీ రోడ్డులో ఉన్న చెత్తకుప్ప దగ్గర చెత్తను పారవేసేందుకు లారీని ఆపారు. ఆ సమయంలో లారీకి మంటలంటుకున్నాయి. దీంతో తాంబరం అగ్నిమాపక, రెస్క్యూ దళానికి సమాచారం అందించాడు. అగ్నిమాపక సిబ్బంది గంటపాటూ పోరాడి మంటలను ఆర్పివేశారు. అయినప్పటికీ, లారీలో కొంత భాగం కాలిపోయింది. దీనిపై శంకర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపగా, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టడం వల్ల, గాలిలో మంటలు వ్యాపించి లారీకి అంటుకుని కాలిపోయినట్లు తెలిసింది. అనుమతుల్లేని ఆస్పత్రికి సీల్ అన్నానగర్: చైన్నె కార్పొరేషన్లోని అడయార్ జోన్లోని వేళచ్చేరిలోని వార్డ్ 177 లోని ముత్తుకృష్ణన్ వీధిలో ఓ ‘మల్టీ స్పెషాలిటీ’ ఆస్పత్రి పనిచేస్తోంది. ఈ ఆస్పత్రి భవనానికి కార్పొరేషన్ నుంచి సరైన భవన అనుమతి తీసుకోలేదని తెలుస్తుంది. ఈ విషయంలో భవన యజమానికి నోటీసు జారీ చేశారు. తదనంతరం, అడయార్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ హార్దిన్ రోసారియా ఆదేశాల మేరకు, కార్పొరేషన్ అధికారులు ఆస్పత్రి భవనాన్ని మూసివేసి ‘సీల్’ వేశారు. దీని కోసం వేళచ్చేరి ఇన్స్పెక్టర్ నేతృత్వంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గుంతలో పడి కారు బోల్తా – ముగ్గురు యువకుల మృతి అన్నానగర్: కడలూరు జిల్లాలోని విరుధాచలం సమీపంలోని ఎరుమనురులో ఆలయ ఉత్సవం సందర్భంగా 11వ తేదీ రాత్రి వీధి నృత్యం జరిగింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు, బాబు కుమారుడు ఆదినేష్ (21), వీర యాండియన్ కుమారుడు అయ్యప్పన్ (29), మణి కుమారుడు వేల్ మురుగన్ (21), కన్నన్ కుమారులు వెంకటేశన్ (25), గౌతమ్ (20), పచ్చముత్తు కుమారుడు నటరాజన్ (21), తెల్లవారుజామున ఒంటి గంటల ప్రాంతంలో విరుదాచలం సమీపంలోని కోలంచియప్పర్ ఆలయం సమీపంలోని టీ దుకాణానికి కారులో వెళ్లారు. వెంకటేశన్ కారు నడుపుతున్నాడు. అక్కడి టీ దుకాణం మూసివేసి ఉండడంతో వారు తాల్ చిత్తలూర్ బైపాస్ రోడ్డులో ఏదైనా టీ దుకాణం తెరిచి ఉండవచ్చని భావించి అక్కడికి బయలుదేరారు. చిత్తలూరు బైపాస్లో వేగంగా వెళుతుండగా, అకస్మాత్తుగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. కారు శిథిలాలలో చిక్కుకున్న ఆదినేష్, అయ్యప్పన్, వేల్మురుగన్ అనే ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వాహనదారులు విరుధాచలం పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాయపడిన వెంకటేశన్, గౌతమ్, తాడరాజన్ను రక్షించి చికిత్స కోసం విరుధాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన ముగ్గురి మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. వలస కార్మికుల సర్వేకు చర్యలు కొరుక్కుపేట: తమిళనాడులో వలస కార్మికులపై సమగ్ర సర్వేకు చర్యలు తీసుకున్నారు. తమిళనాడు కార్మిక శాఖ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోకి వలస వస్తే అన్ని వలస కార్మికులపై సమగ్ర సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. వలస కార్మికులు, వారి సామాజిక–ఆర్థిక పరిస్థితులు, ఉపాధిపై వివరణాత్మక వివరాలను సేకరించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సర్వే ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనుందని అధికారులు వెల్లడించారు. 2015–16లో గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం, తమిళనాడులో 67.74 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని అంచనా. ప్రస్తుతం, తమిళనాడు ప్రభుత్వం 2025లో వలస కార్మికుల సర్వే నిర్వహించడానికి టెండర్లను ఆహ్వానించింది. వలస కార్మికుల సంక్షేమం కోసం తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఈ సర్వే ఎంతో సహాయపడుతుందని భావిస్తున్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
● వ్యక్తి హత్య ● భర్త సహా ఐదుగురి అరెస్ట్ అన్నానగర్: విల్లుపురం జిల్లా మరకానం సమీపంలోని కూనిమేడు గ్రామానికి చెందిన అబ్దుల్లా కుమారుడు సాదిక్ భాషా (28) పెయింటర్. మంగళవారం రాత్రి తన స్నేహితులు షేక్ అమానుల్లా, ఆషిక్ లతో కలిసి మద్యం సేవించాడు. ఆ సమయంలో, ఆ ప్రాంతానికి కత్తులు, కొడవళ్లతో వచ్చిన అదృశ్య వ్యక్తులు సాదిక్ బాషా తల వెనుక భాగంలో విచ్చలవిడిగా నరికారు. సాదిక్ బాషా రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది చూసి అతనితో ఉన్న అతని స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దారుణ హత్యకు సంబంధించి రాగమతుల్లా (26), భారతి దాసన్ (22), రాజేష్ కుమార్ ఆనందరాజ్ (21), సెల్వకుమార్ (23), గుణశేఖరన్ (22) అనే ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో హత్యకు గురైన సాదిక్ బాషా, రహ్మతుల్లా భార్య మధ్య వివాహేతర సంబంధం ఉందని తేలింది. తన భార్యతో ఉన్న సంబంధం గురించి తెలుసుకున్న రహ్మదుల్లా, సాదిక్ భాషాను కలిసి, ఆ సంబంధాన్ని ఆపమని హెచ్చరించాడు. అయితే అతను తన భార్యతో ఆ సంబంధాన్ని వదులుకోలేదని తెలుస్తోంది. దీంతో ఆవేశంలో సాదిక్ బాషాను నరికి చంపి, తప్పించుకున్నాడని వెల్లడైంది. లైంగికదాడి కేసులో 14 ఏళ్ల జైలు తిరువళ్లూరు: ఏడేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి 14 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తిరువళ్లూరు పోక్సో కోర్టు తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలోని ముత్తాపుదుపేటకు చెందిన ఏడేళ్ల బాలుడిపై అదే ప్రాంతానికి చెందిన ప్రవీణ్ గత 2023లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడిపై జరిగిన లైంగిక దాడిపై బాధితుడి తల్లిదండ్రులు ముత్తాపుదుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. కేసు విచారణ తిరువళ్లూరు పోక్సో కోర్టులో సాగింది. విచారణలో యువకుడు బాలుడిపై లైగింక దాడికి పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో అతడికి 14 ఏళ్ల జైలుశిక్ష, రూ.25వేల జరిమానా విధిస్తూ తిరువళ్లూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. జరిమాన చెల్లించని ఫక్షంలో మరో ఆరు నెలలు శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. బెయిల్పై వచ్చిన యువకుడు ఆత్మహత్య తిరువొత్తియూరు: తండ్రిని హత్య చేసిన కేసులో జైలు నుంచి బెయిల్పై వచ్చిన కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చైన్నెలోని పెరంబూరులోని బాలమురుగన్ వీధికి చెందిన దినకరన్ (24). ఇతని భార్య అర్చన (22). వీరికి ఒకటిన్నర ఏళ్ల పాప ఉంది. దినకరన్ గత రెండు నెలలుగా తల్లి రాజేశ్వరితో నివసిస్తున్నాడు. దినకరన్ మద్యానికి బానిసయ్యాడని అర్చన అతని నుంచి విడిపోయి వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నట్టు తెలిసింది. ఈ సమయంలో దినకరన్ తన తండ్రి మనశేఖరన్తో గొడవపడి దాడి చేశాడు. దాడిలో తండ్రి మృతిచెందాడు. ఈ కేసులో దినకరన్ జైలుకు వెళ్లి గత నెల 5న బెయిల్పై బయటకు వచ్చాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి మద్యం తాగిన దినకరన్, తల్లితో గొడవ పడ్డాడు. తర్వాత దినకరన్ ఫ్యాన్న్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏజీఎస్ చిత్రం ప్రారంభం
అర్జున్, అభిరామిలతో చిత్ర యూనిట్ తమిళసినిమా: భారీ చిత్రాలతోపాటు, చిన్న చిత్రాలతోనూ మంచి విజయాలను సాధిస్తున్న నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్. ఈ సంస్థ అదినేతలు కల్పాత్తి ఎస్.అఘోరం, కల్పాత్తి ఎస్.గణేశ్, కల్పాత్తి ఎస్.సురేష్ ఇంతకుముందు నిర్మించిన గోట్, లవ్ టుడే, డ్రాగన్ వంటి చిత్రాలు ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థ నిర్మిస్తున్న 28వ చిత్రం బుధవారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో అర్జున్, అభిరామి, ప్రీతీముకుందన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జాన్కొక్కెన్, దిలీపన్, పవన్, అర్జున్ చిదంబరం, వివేక్ ప్రసన్న, బాలాహాసన్ ముఖ్యపాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శక, నటుడు ప్రదీప్రంగనాథన్ శిష్యుడు సుభాష్ కే.రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి కల్పాత్తి అర్చన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గానూ, అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఐశ్వర్య కల్పాత్తి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి కేజీఎఫ్ చిత్రం ఫేమ్ రవిబస్రూర్ సంగీతాన్ని, అరుణ్ రాధాకృష్ణన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్రం అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉంటుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. -
నిషేధిత గుట్కా స్వాధీనం
తిరువళ్లూరు: పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నిషేధిత గుట్కా ప్లాస్టిక్ వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరులోని వేర్వేరు ప్రాంతాల్లో గుట్కా, ప్లాస్టిక్ వస్తువులు అమ్మకాలు జోరుగా సాగుతున్నట్టు తిరువళ్లూరు మున్సిపల్ కమిషనర్ దామోదరన్కు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులో భాగంగానే కమిషనర్ దామోదరన్ నేతృత్వంలోని 20 మంది అధికారులు బజారువీధి, వడక్కురాజవీధితోపాటు దుకాణాలు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ప్రభుత్వం నిషేధించిన గుట్కా, ప్లాస్టిక్ వస్తువులు రెండు టన్నులు పట్టుబడింది. వీటిని స్వాధీనం చేసుకున్న అధికా రులు మున్సిపాలిటీ కార్యాలయానికి తరలించారు. -
నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి
కొరుక్కుపేట: విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఎంటర్ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూట్ (ఈడీఐఐ) డైరెక్టర్ ఆర్ అంబలవానన్ హితవుపలికారు. ఎస్ఆర్ఎం ఐఎస్టీ –వడపలని మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ 17వ ఇండక్షన్ డేను బుధవారం ఘనంగా నిర్వహించారు . వడపలని క్యాంపస్లోని ఎస్ఆర్ఎం, మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ వి. శశిరేఖ కొత్త విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యఅతిథిగా ఆర్. అంబలవణన్. పాల్గొని ఇండక్షన్ డే ప్రసంగం చేశారు. వ్యాపారం, సమాజ భవిష్యత్తును రూపొందించడానికి అవసరమైన నైపుణ్యాలు – ఆవిష్కరణ, నాయకత్వం వ్యవస్థాపకత ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులను ప్రేరేపించారు.ఈ కార్యక్రమంలో విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డులను ప్రదానం చేశారు.ఇందులో ఎస్. శరవణ కుమార్, బి ఎన్ వై మెల్లన్ (ఎంబీఏ బ్యాచ్ 2012–2014), సంయుక్త జయరామన్(బిబిఏ బ్యాచ్ 2020–2023) అవార్డు అందుకున్నారు. ఈకార్యక్రమంలో అంతర్జాతీయ సమావేశం –2025 ప్రొసీడింగ్స్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీఏ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.ఎన్. ప్రభాదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ పి. జయప్రభ , డాక్టర్ ఎస్. విజయకాంత, బీబీఏ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. సుభశ్రీ పాల్గొన్నారు. -
క్లుప్తంగా
అన్నానగర్: చైన్నెలోని రాయపురానికి చెందిన 30 ఏళ్ల మహిళకు కొన్ని రోజుల క్రితం కుంభకోణంకు చెందిన మణికంఠన్ (30)తో నిశ్చితార్థం జరిగింది. ఈ పరిస్థితిలో మరో మహిళ నిశ్చితార్థం చేసుకున్న మహిళను సంప్రదించి, మణికంఠన్తో తనకు పెళ్లి అయ్యిందని, వివాహం చేసుకోవద్ద్ఙు అని చెప్పింది. దీంతో యువతి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది, వారు రాయపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఐటీ కంపెనీలో పనిచేస్తున్న మణికంఠన్ను విచారణ కోసం పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. మణికంఠన్ ఇప్పటికే ఒక మహిళను ప్రేమిస్తున్నాడని, అతను ప్రేమించిన మహిళ తనను వివాహం చేసుకోవాలని కోరినప్పుడు, అతను నిశ్చితార్థం చేసుకున్న మహిళకు ఫోన్ చేసి వివాహం ఆపమని కోరాడని వెల్లడైంది. దీని తర్వాత, బుధవారం పోలీసులు మణికంఠన్ను అరెస్టు చేసి పుళల్ జైలుకు పంపారు. తిరుత్తణి: కందిరీగలు కుట్టి ఓ వృద్ధురాలు మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కనకమ్మసత్రం సమీపం పూండి మండలంలోని మేట్టుపాళ్యం గ్రామానికి చెందిన రాజేశ్వరి(80). ఈమె మంగళవారం గ్రామానికి శివారులో చెరువు కట్టవద్ద కట్టెలు తెచ్చేందుకు వెళ్లింది. ఆ సమయంలో కందిరీగలు ఆమె దాడి చేశాయి. దాడిలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ ఆమెను స్థానికులు తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతిచెందింది. కనకమ్మసత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అన్నానగర్: చైన్నెలోని జాఫర్గావ్ పేటలోని వి.ఎస్.ఎమ్ గార్డెన్ కు చెందిన కరుణాకరన్ (48) వంటవాడు. అతనికి 6 నెలల క్రితం కుడి తొడలో ఫ్రాక్చర్ అయి, దానికి చికిత్స చేయించుకున్నాడు. ఈ స్థితిలో, మంగళవారం వంట పనికి వెళ్లి సాయంత్రం తలుపు దగ్గర కూర్చున్నాడు. తన ఇంటి దగ్గర నివసించే పూంగోడి (48) ఓ పిట్ బుల్ రకం కుక్కను పెంచుతున్నారు. అది గొలుసు తెంచుకుని కరుణాకరన్ కుడి తొడపై కరిచింది. ఇది చూసి పూంగొడి భయపడి కుక్కను పట్టుకోవడానికి యత్నించింది. ఆ సమయంలో, అది పూంగోడిని కూడా కరిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కరుణాకరన్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. అరుపులు విన్న పొరుగువారు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ పరీక్షించిన వైద్యులు కరుణాకరన్ అక్కడికి చేరుకునే లోపే మృతి చెందినట్లు ప్రకటించారు. కుమరన్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కరుణాకరన్ను రక్షించే క్రమంలో కుక్క యజమాని పూంగోడి కాలు, చేతికి తీవ్ర గాయాలై రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర చికిత్స పొందుతున్నారు. అన్నానగర్: కేరళకు చెందిన జువాలా (35) కొన్ని నెలల క్రితం చైన్నెకి వచ్చి అడయార్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో క్యాన్సర్కు చికిత్స చేస్తూ వైద్యురాలిగా పనిచేస్తోంది. జువాలా తన భర్తకు ఏడాదిన్నర క్రితం విడాకులిచ్చి ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు పిల్లలు లేరు. విడాకులు తీసుకున్నప్పటి నుంచి జువాలా మనస్తాపంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ స్థితిలో, జువాలా బుధవారం తెల్లవారుజామున తన గదిలో ఫ్యానన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న అడయార్ పోలీసులు, జువాలా మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వేలూరు: వేలూరు జిల్లా పొదిగై గ్రామానికి చెందిన ప్రభాకర్ ఆర్మీ సిపాయిగా పని చేస్తున్నాడు. ఇతని భార్య చిత్ర (32) ఉన్నారు. ప్రభాకర్ సెలవులు ఆర్మీ నుంచి తన సొంత గ్రామానికి చేరుకొని సెలవుల ముగించుకొని తన భార్యతో పాటూ మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో కాట్పాటి రైల్వే స్టేషన్కు వచ్చారు ఆ సమయంలో వచ్చిన శబరి ఎక్స్ప్రెస్ రైలులో ప్రభాకర్ ఎక్కారు అనంతరం రైలు బయలుదేరిన వెంటనే ప్రభాకర్ గుర్తింపు కార్డు భార్య వద్ద ఉండిపోవడంతో వాటిని అందజేసేందుకు యత్నించింది. ఈక్రమంలో అదుపుతప్పి రైలు కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. వీటిని గమనించిన ప్రభాకర్ వెంటనే రైలు నిలిపి అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
బ్లూమ్ సిండ్రోమ్ పిల్లలకు బీఎంటీతో శస్త్ర చికిత్స
సాక్షి, చైన్నె: బ్లూమ్ సిండ్రోమ్ ఉన్న పిల్లలలో ఆరోగ్యపరంగా డాక్యుమెంట్ చేయబడ్డ టీసీఆర్ ఆల్పా బీటా డిప్లీటెడ్ హాప్లోయిడెన్టికల్ బోన్మ్యారో ట్రాన్స్ ప్లాంట్ ప్రక్రియను విజయవంతం చేశామని ఎంజీఎం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పీడియాట్రిక్ హెమటాలజీ, ఆంకాలజీ విభాగం హెడ్ ఎం. దీనదయాళన్ ప్రకటించారు. బుధవారం స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్రోమోజోమల్, మ్యారో సమస్యలతో బాధ పడుతున్న పిల్లలను బ్లూమ్ సిండ్రోమ్ చైల్డ్గా పిలవడం జరుగుతున్నట్టు వివరించారు. ఈ అరుదైన జన్యు పరమైన రుగ్మత ఉన్నట్టు నిర్ధారణ అయిన పక్షంలో రక్త క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందన్నారు. ఈ బ్లూమ్ సిండ్రోమ్ అనే అరుదైన జన్యు రుగ్మతతో బాధపడుతూ వచ్చిన 12 సంవత్సరాల బాలిక ప్రాణాలను కాపాడేందుకు ఆమె తమ్ముడి నుంచి ప్రాణాలను రక్షించే స్టెమ్ సెల్స్ ఉపయోగించామన్నారు. టీసీఆర్ ఆల్పా బీటా డిప్లీటెడ్ మాప్లోయిడెంటికల్ బోన్మ్యారో ట్రాన్స్ ప్లాంట్(బీఎంటీ) అని పిలవబడే సంక్లిష్ట ప్రక్రియను ఆధునిక విధానంతో తొలి సారిగా విజయవంతం చేశామన్నారు. బ్లూమ్ సిండ్రోమ్ ప్రాణాంతక సమస్యలకు దారి తీస్తాయని, ఎముక మజ్జ వైఫల్యం కారణంగా ఈ మార్పిడి అవశ్యంగా మారిందన్నారు. స్టెమ్ సెల్ మార్పిడికి తగిన దాతను కొనుకొనగడం ముఖ్య సవాలుగా ఈ విధానంలో మారిందన్నారు. చివరకు ఆ బాలిక తమ్ముడి నుంచి తగినంత మోతాదులో స్టెమ్ సెల్ను సేకరించామని, బాలిక, ఆమె తమ్ముడికి సాధ్యమైన ఉత్తమమైన ఫలితాన్ని నిర్ధారించడానికి ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లి విజయం సాధించామన్నారు. ఈ సమావేశంలో పీడియాట్రిక్ హెమటాలజీ విభాగం డాక్టర్ విమల్కుమార్, రిషబ్ భరద్వాజ్ పాల్గొన్నారు. -
అశోక్ సెల్వన్ హీరోగా నూతన చిత్రం ప్రారంభం
తమిళసినిమా: వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న నటుడు అశోక్ సెల్వన్. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాన్ని రెండు భారీ చిత్ర నిర్మాణ సంస్థలు మిలియన్ డాలర్ స్టూడియోస్, వేల్స్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇంతకుముందు గుడ్ నైట్, లవర్, టూరిస్ట్ ఫ్యామిలీ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మిలియన్ డాలర్ స్టూడియోస్ సంస్థ ప్రస్తుతం నిర్మిస్తున్న హ్యాపీ ఎండింగ్, ఒన్స్ మోర్ చిత్రాలు నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అదేవిధంగా పలు భారీ చిత్రాలను నిర్మించిన వేల్స్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రస్తుతం సుందర్.సి దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మూకుత్తి అమ్మన్ – 2, విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న ఆయన 54వ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా ఈ రెండు సంస్థలు కలిసి తాజాగా అశోక్ సెల్వన్ హీరోగా చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఇందులో నిమిషా సజయన్ నాయకిగా నటిస్తున్నారు. మణికంఠన్ ఆనందన్ దర్శకత్వం అవహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ బుధవారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నటుడు, దర్శకుడు శశికుమార్, దర్శకుడు ఆర్.శరవణన్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు అందించారు. కాగా ఇది అన్ని వర్గాలను అలరించే కమర్షియల్ అంశాలతో కూడిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. షూటింగ్ను ఒకే షెడ్యూల్ లో ఏకధాటిగా నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రానికి దీపు నినన్ థామస్ సంగీతాన్ని, పుష్పరాజ్ సంతోష్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
సేవా కార్యక్రమాల్లో స్టాలిన్ దంపతులు
సాక్షి,చైన్నె : సీఎం స్టాలిన్ జీవిత భాగస్వామిగా దుర్గా అడుగు పెట్టి బుధవారంతో 50 సంవత్సరాలైంది. 50వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ దంపతులు సేవా కార్యక్రమాలో మునిగారు. ఉదయాన్నే మెరీనా తీరంలోని దివంగత నేతలు అన్నా, కరుణానిధి సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించారు. అక్కడి నుంచి గోపాలపురం ఇంటికి వెళ్లారు. తండ్రి కరుణానిధి చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న తల్లి దయాళు అమ్మాల్ను కలిసి స్టాలిన్ ఆశీస్సులు అందుకున్నారు. మధ్యాహ్నం సిరుమలర్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఫర్ ది విజువల్లీ అండ్హియరింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి బాల బాలికలతో కాసేపు మాట్లాడారు. వారికి కావాల్సిన సహకారం అందించారు. పిల్లలకు తమచేతులతో బిర్యాని వడ్డించారు. స్వీట్లు, కేకులను అందజేశారు. కాగా, తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా సీఎం స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అర్ధ శతాబ్దం పాటూ నా జీవిత భాగస్వామి ప్రయాణం అంటూ, నాలో దుర్గా సగం అని వ్యాఖ్యానించారు. తన ప్రేమతో సంతృప్తికరమైన జీవితాన్ని సాగించామని, ఆమె అపరిమిత ప్రేమకు కృతజ్ఞడను అని పేర్కొన్నారు. షరతులు లేని ప్రేమ, సర్దుకెళ్లే తత్వం ఈ తరం యువత జీవితాన్ని మెరుగు పరుస్తుందని ఈసందర్భంగా పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ఇంటిని, దేశాన్ని గౌరవించే జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ తల్లిదండ్రుల ఆశీస్సులను అందుకున్నారు. వారి ప్రేమానురాగాలను గుర్తుచేస్తూ సామాజికమాధ్యమంలో పోస్టు చేశారు. ఇక, మంత్రులు నెహ్రూ, ఎం. సుబ్రమణియన్, రఘుపతి, శివశంకర్, శేఖర్బాబు, పెరియస్వామి, ముత్తుస్వామిలతో పాటూ పలువురు సీఎంకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, డీఎంకే కూటమి పార్టీలకు చెందిన కాంగ్రెస్ నేత సెల్వ పెరుంతొగై, సీపీఐ నేత ముత్తరసన్, సీపీఎం నేత షణ్ముగం, వీసీకే నేత తిరుమావళవన్, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, ఎండీఎంకే నేత వైగో, మక్కల్ నీదిమయ్యం నేత కమలహాసన్, మనిద నేయమక్కల్ కట్చి నేత జవహిరుల్లా, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్, కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి నేత ఈశ్వరన్లు సీఎం స్టాలిన్, దంపతులను క్యాంప్ కార్యాలయంలో నేరుగా కలిసి సత్కరించారు. ఇద్దరికి పూల మాలలు వేయించారు. కానుక సమర్పించారు. -
ముగిసిన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి, చైన్నె: ఇంజినీరింగ్ కోర్సులకు మూడు విడతల కౌన్సెలింగ్ ముగిసింది. లక్షా 45 వేల 481 మంది విద్యార్థులు తమకు కావాల్సిన సీట్లను వివిధ కళాశాలలో ఎంపిక చేసుకున్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటుగా అనుబంధ కౌన్సిలింగ్ జరగనుంది. రాష్ట్రంలో అన్నావర్సిటీ, సాంకేతిక విద్యా డైరెక్టరేట్ పరిఽధిలో ఉన్న 430 మేరకు ఇంజినీరింగ్ కళాశాలలో బీఈ, బీటెక్ కోర్సుల ప్రవేశ నిమిత్తం దరఖాస్తుల ప్రక్రియ ముగించి గత నెల మొదటి వారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తూ వచ్చారు. తొలుత రిజర్వుడ్ కోటా సీట్లను భర్తీ చేశారు. జూలై 14 నుంచి మూడు విడతలుగా జనరల్ కౌన్సెలింగ్ జరుగుతూ వచ్చింది. ప్రభుత్వ కోటాలో సుమారు రెండు లక్షల సీట్లు ఉండగా 2 లక్షల 50 వేల 298 మంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. వీరిలో ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సెలింగ్కు 2 లక్షల 41 వేల 641 మంది అర్హత సాధించారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. మొత్తం లక్షా 45 వేల 481 మంది విద్యార్థులకు తమకు కావాల్సిన కళాశాలలలో సీట్లను ఎంపిక చేసుకున్నారు. వీరందరికి సీట్ల కే టాయింపునకు సంబంధించిన ప్రక్రియను బుధవారం ముగించారు. మొత్తం భర్తీ చేసిన సీట్లలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్ మేరకు 14,143 మంది విద్యార్థులు సీట్లును దక్కించుకున్నారు. కాగా అనేక కళాశాలలో పూర్తి స్థాయిలో సీట్ల భర్తీ జరగలేదు. ప్రధాన కోర్సులు భర్తీ చేసినా, మరికొన్ని కోర్సుల్లో చేరే వారి సంఖ్య తక్కువే. అలాగే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మరెన్నో కళాశాలలో సీట్ల భర్తీ సగానికి సగం కూడా జరగక పోవడం గమనార్హం. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడం కోసం అనుబంధ కౌన్సెలింగ్కు చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానించారు.ఈ విద్యార్థులకు గురు, శుక్ర, శనివారాలలో అనుబంధ కౌన్సెలింగ్కు ఉన్నత విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈనెల 26వ తేదీ సోమవారం పూర్తిస్థాయిలో సీట్ల భర్తీ వివరాలతో పాటూ ఏఏ కళాశాలలో సీట్ల భర్తీ మరీ తక్కువగా జరిగిందో అన్న సమాచారాలు వెలువడనున్నాయి. -
విజయ్ సన్నద్ధం
మహానాడుకు సాక్షి, చైన్నె : ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్, కర్మ యోగి కామరాజర్, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, వీర నారీ వేలు నాచ్చియార్, స్వాతంత్య్ర సమర యోధురాలు అంజలై అమ్మాల్ సిద్ధాంతాల ఆదర్శంగా తమిళగ వెట్రి కళగం వేదికగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విజయ్ గత ఏడాది అక్టోబరులో తొలి మహానాడును జయప్రదం చేసుకున్నారు. ఈ మహానాడు వేదికగా తానేమిటో, తన సిద్ధాంతాలు ఏమిటో ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ తదుపరి పార్టీ పరంగా రూపు రేఖల నిర్మాణంపై దృష్టి పెట్టారు. 120 జిల్లాలను పార్టీ పరంగా ఏర్పాటు చేసి నిర్వాహకులను నియమించారు. 68 వేల పోలింగ్ బూత్లకు కమిటీలను నియమించారు. పార్టీ పరంగా సుమారు రెండంకెల మేరకు అనుబంధ విభాగాలను ప్రకటించి కార్యక్రమాలను విస్తృతం చేశారు. అలాగే, తన చివరి చిత్రం జననాయగం షూటింగ్ను ముగించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో తనకు డీఎంకే, బీజేపీ కూటమి టార్గెట్గా తరచూ జరిగే కార్యక్రమాలలో విజయ్ విమర్శలు, ఆరోపణలు ఎక్కుబెడుతూ వచ్చారు. తమిళగ వెట్రి కళగం తమిళనాడుకు ప్రత్యామ్నాయం కాదని, అసలైన శక్తి అని చాటుకుంటూ వచ్చారు. ఇక, ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే ఉండటంతో ప్రజాక్షేత్రంలో దూసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. నేడు సమర శంఖం ప్రజా క్షేత్రంలోకి దూసుకెళ్లడమే కాదు, తానేమిటో, తన బలం, యువ సమూహం, నవతరం ఓటరు తన వెన్నంటి ఏ మేరకు ఉన్నారో చాటు కునేందుకు పార్టీ పరంగా రెండవ మహానాడుకు సిద్ధమయ్యారు. ఈనెల 25వ తేదీ మహానాడుకు తేదీ ఖరారు చేసినా, చివరకు పోలీసు ఆంక్షలు, సూచనలతో నాలుగు రోజులు ముందుగానే గురువారం నిర్వహణకు సిద్ధమయ్యారు. ఇందు కోసం మదురై శివారులోని పరపత్తి గ్రామం వద్ద 506 ఎకరాలలో సచివాలయం ఆకారంలో బ్రహ్మాండ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. 200 అడుగుల దూరం మేరకు విజయ్ నడిచి వచ్చి అభిమానులను పలకరించేందుకు ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేశారు. గత మహానాడులో ఎదురైన సమస్యలు, పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించారు. ఆహారం, వాటర్, సరఫరా, తదితర అన్ని రకాల ఏర్పాట్ల మీద దృష్టి పెట్టే విధంగా ఒక్కో అంశానికి ఒక కమిటీ చొప్పున మొత్తం 20కమిటీలకు అభిమానుల సేవలో నిమగ్నమయ్యాయి. మహానాడు పరిసరాలలో 100 చోట్ల నిఘా నేత్రాలను సైతం ఏర్పాట్లు చేశారు. అలాగే పదుల సంఖ్యలో భారీ జనరేటర్లను సిద్ధం చేసి ఉంచారు. రెండు లక్షల మంది కూర్చునేందుకు కుర్చీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కుర్చీల సరఫరా కాంట్రాక్టరుల చివరి క్షణంలో చేతులు ఎత్తేయడంతో ఆగమేఘాలపై కేరళ నుంచి కుర్చీలను తెప్పించడం విశేషం. మహానాడు ప్రాంగణంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశారు. జనాన్ని కట్టడి చేసేందుకు చర్యలు విల్లుపురం జిల్లా విక్రవాండి వీ సాలై గ్రామంలో జరిగిన మహానాడులో జనం ఊహించని రీతిలో తరలి రావడంతో నిర్వహకులు ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా, అన్ని టోల్ గేట్ల మీద దృష్టి పెట్టారు. ఏ మేరకు మదురైకు వాహనాలు బయలుదేరి వెళ్తున్నాయో అన్న సమాచారం, జనం ఏ మేరకు తరలి వస్తున్నారో అన్న వివరాలను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కు చేర వేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలుగని రీతిలో మహానాడు జయప్రదానికి సిద్ధమయ్యారు. ఈ మహానాడు నిమిత్తం తమిళగ వెట్రి కళగం ముఖ్య నేతలు, విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్, శోభాలతో పాటుగా సన్నిహితులు బుధవారమే మదురైకు వచ్చేశారు. విజయ్ ఈ మహానాడు వేదికగా కీలక ప్రకటనలు చేయబోతున్నట్టు సమాచారం వెలువడింది. ప్రజలకు వాగ్దానాలు ఇవ్వబోతున్నట్టుగా సమాచారాలు రావడంతో అందరి దృష్టి విజయ్ ప్రసంగం వైపుగా మరలింది. విజయ్ సైతం ముందుగానే వేదిక వద్దకు చేరుకుని అర్ధరాత్రి వేళ ఏర్పాట్లను పరిశీలించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, మూడున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మహానాడు కార్యక్రమాలు జరగబోతున్నాయి. రాత్రి 7 గంటల సమయంలో విజయ్ ప్రసగించనున్నారు. ఎనిమిదిన్నరలోపు కార్యక్రమాలను ముగించి అభిమానులు , జనం సురక్షితంగా వారి వారి ఊర్లకు వెళ్లేందుకు వీలుగా చర్యలు తీసుకుని ఉన్నారు. కేడర్కు సేవలు అందించే కమిటీలకు ప్రత్యేక డ్రెస్ కోడ్తో టీషర్టులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ అందజేశారు. కాగా, ఈ సారి మహానాడు వేదిక పరిసరాలలో పంచమూర్తుల ఫ్లెక్సీలతో పాటూ అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు దివంగత ఎంజీఆర్ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. దివంగత నేతలు అన్నా, ఎంజీఆర్ల ఆశీస్సులు విజయ్కు ఉన్నట్టుగా ఈ ఫెక్సీలు ఏర్పాటు కావడం విశేషం. అయితే, ఎంజీఆర్ అన్నాడీఎంకేకు మాత్రమే సొంతం అని, ఆయన ఫొటోతో ఫ్లెక్సీని వాడటం శోచనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ విమర్శించారు. అపశ్రుతి మహానాడు ఏర్పాట్లలో బుధవారం మధ్యాహ్నం అపశ్రుతి చోటు చేసుకుంది. వంద అడుగులతో జెండా స్తూపం సిద్ధం చేశారు. దీనిని క్రేన్ సాయంతో నిలబెట్టే ప్రయత్నం చేసే సమయంలో బెల్టు ఊడింది. ఈ సమయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ జెండా స్తూపం ఓ కారు మీద పడటంతో అది నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనతో ఆ పరిసరాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో భద్రతా అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టే పనిలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ప్రత్యామ్నాయంగా జెండా స్తూపం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. మహానాడుకు తరలి వచ్చే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని, సైనికుల వలే క్రమ శిక్షణతో మెలగాలని విజయ్ కోరారు. వృద్ధులు, గర్భిణిలు, చంటి బిడ్డల తల్లుల దయ చేసి మహానాడుకు రావద్దు అని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా మహానాడు కోసం విరుదుగనర్ జిల్లా రాజపాళయం సమీపంలోని శ్రీవిళ్లిపుత్తూరు కరసల్కుడిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతం ఏర్పడటంతో కాళీశ్వరన్ అనే విద్యార్థి మరణించాడు. -
ఎన్ఐఏ వేట
దిండుగల్, తెన్కాశిలో సోదాలు సాక్షి, చైన్నె : దిండుగల్ జిల్లాలో ఎనిమిది చోట్ల బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారుల బృందం తీవ్ర సోదాలో నిమగ్నమైంది. రాష్ట్రంలో తరచూ ఎన్ఐఏ సోదాలు విస్తృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. హిందూ మున్నని నేత రామలింగం హత్య కేసు విచారణలో భాగంగా బుధవారం ఉదయాన్నే ఎన్ఐఏ అధికారులు దిండుగల్ జిల్లాలోని దిండుగల్ పట్టణం, ఒట్టన్చత్రం, కొడైకెనాల్తోపాటుగా ఎనిమిది చోట్ల పలువుర్ని గురి పెట్టి వేటలో నిమగ్నమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు జరిగాయి. దిండుగల్లోనే ఎన్ఐఏ అధికారులు తిష్ట వేసి ఉన్నారు. ఇందులో దిండుగల్కు చరెందిన మహ్మద్, వత్తగుండుకు చెందిన ఖాదర్లతో పాటూ 8 మందికి సమన్లు జారీ చేశారు. వీరంతా ఈనెల 25న చైన్నెలోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అలాగే తెన్కాశి జిల్లా తెన్కాశితో పాటూ ఆ పరిసరాలలోని అబ్దుల్ ఖాదర్, మహ్మద్ అలీ అనే ఇద్దరు ఇళ్లలో మూడు గంటల పాటూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా, సోదాలకు వ్యతిరేకంగా కొన్ని మైనారిటీ సంఘాలు ఆందోళనకు పలు చోట్ల దిగాయి. దీంతో పోలీసు భద్రత నడుమ ఎన్ఐఏ సోదాలు జరిగాయి. రద్దుకు కోర్టు నిరాకరణ సాక్షి, చైన్నె: రాయపురం, తిరువీకానగర్ మండలాలలో ప్రైవేటుకు పారిశుద్ద్య పనులు అప్పగించడాన్ని తాము రద్దు చేయబోమని హైకోర్టు స్పష్టం చేసింది. జీతం విషయంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. గ్రేటర్ చైన్నె పరిధిలోని రాయపురం, తిరువీకానగర్ మండలాలకు చెందిన పారిశుధ్య కార్మికులు రెండు వారాల పాటూ రిప్పన్ బిల్డింగ్ ఆవరణలో నిరసన దీక్ష కొనసాగించిన విషయం తెలిసిందే. అధికారులు, మంత్రులు పలు దఫాలుగా చర్చించినా కార్మికులు తగ్గ లేదు. ఫుట్పాత్ను ఆక్రమించి వీరు నిరసన దీక్ష సాగించడంతో ట్రాఫిక్ సమస్య తప్పలేదు. చివరకు కోర్టు ఆదేశాలతో నిరసన కారులను అక్కడి నుంచి తరలించారు. అర్ధరాత్రి వేళ పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో రాయపురం, తిరువీకానగర్ మండలాలలో పారిశుధ్య పనులు ప్రైవేటుకు అప్పగిస్తూ గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము రద్దు చేయలేమని కోర్టు స్పష్టంచేసింది. అలాగే గత నెల ఇచ్చినట్టుగానే జీతం ఇవ్వాలని సూచిస్తూ, ఇతర జీతాల విషయంగా కార్పొరేషన్, ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. చైన్నెకి మరో 125 ఎలక్ట్రిక్ బస్సులు సబర్బన్ ప్రాంతాల్లో అందుబాటులోకి.. కొరుక్కుపేట: పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి చైన్నెలో ప్రజా రవాణాను ఆధునీకరిస్తున్నారు. మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డీజిల్ బస్సులను నడుపుతుండగా, ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సు సేవలను క్రమంగా ప్రవేశపెడుతున్నారు. 625 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయించారు. ప్రారంభంలో, వ్యాసర్పాడి నుంచి 125 ఎలక్ట్రిక్ బస్సులు ఉత్తర చైన్నె ప్రధాన కేంద్రంగా నడుపుతున్నారు. ఈ బస్సులన్నీ డీలక్స్ కేటగిరీకి చెందినవి. ఈ నేపథ్యంలో పూందమల్లి వర్క్షాప్లో వచ్చే నెల నుంచి మరో 125 బస్సులు నడపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి నడపడానికి ఏసీ, డీలక్స్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నారు. బ్యాటరీ రీఛార్జింగ్ సౌకర్యాలు, సర్వీస్ సౌకర్యాలు, సిబ్బంది విశ్రాంతి గదులు కల్పిస్తున్నారు . ఇదిలా ఉండగా ఎయిర్ పోర్టు నుంచి సిరుచ్చేరి ఏసీ బస్సులను ప్రారంభించటం విశేషం . పూందమల్లి – మదుర వాయిల్ మధ్య సిక్స్ వే సాక్షి, చైన్నె : పూందమల్లి – మదుర వాయిల్ మధ్య ఆరు లైన్లతో ఎక్స్ప్రెస్ వే ఏర్పాటుకు జాతీయ రహదారుల శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ. 1,250 కోట్లు కేటాయించారు. చైన్నె నగరంలోకి ప్రవేశించే వాహనాలతోపూందమల్లి పరిసరాలు నిత్యం రద్దీతో ఉంటాయి. ఈ దృష్ట్యా, 8.1 కి.మీ దూరం మదుర వాయిల్ వరకు ప్రత్యేక ఎక్స్ప్రెస్ వేను సిక్స్వేగా ఏర్పాటు చేయడానికి చర్యలుతీసుకున్నారు. బెంగళూరు నుంచి వేలూరు, కాంచీపురం మీదుగా చైన్నె లోకి వచ్చే వాహనాలు, ఆంధ్ర నుంచి తిరువళ్లూరు మీదుగా వచ్చే వాహనాల రవాణాకు ఎలాంటి సమస్య ఎదురుకాకుండా ఈ వే నిర్మాణం జరగనుంది. కాగా, ఇప్పటికే మదుర వాయిల్ బైపాస్ వరకు చైన్నె హార్బర్ నుంచి డబుల్ డెక్కర్ వంతెన మార్గం పనులకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. -
ఆభరణాల అలంకరణలో వివాదం
సాక్షి, చైన్నె: స్వామి వారికి ఆభరణాల అలంకరణలో ఇరువర్గాల మధ్య వివాదం రేగింది. దీంతో రెండు గంటల పాటూ ఆలయంలో దర్శన సేవలు ఆగాయి. దీంతో భక్తులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. వివరాలు.. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆరుపడై వీడుల్లో రెండోదిగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో సముద్ర తీరం ఒడ్డున ఉంటుంది. ఇక్కడ ఏటా స్కంద షష్ఠి అత్యంత వేడుకగా జరుగుతుంది. అలాగే ఆవని బ్రహ్మోత్సవాలు కనుల పండువగా నిర్వహించడం ఆనవాయితీ. నిత్యం భక్తులతో పోటెత్తే ఈ ఆలయంలో ఆవని మాస బ్రహ్మోత్సవాలకు గత వారం రోజులుగా జరుగుతూ వస్తున్నాయి. పెద్దఎత్తున భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు పోటెత్తుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం సుబ్రహ్మణ్యస్వామి వారికి బంగారు ఆభరణాలను సమర్పించి అలంకరించే విషయంగా శివాచార్యులు, త్రిసుదందిరంగల్ మధ్య వివాదం రేగింది. ఈ అలంకరణ వివాదం రచ్చకెక్కడంతో పరస్పరం కయ్యానికి కాలుదువ్వారు. దీంతో ఆలయంలో స్వామి వారి దర్శన సేవలు ఆగాయి. ఆలయం ఆవరణలో ఇరు వర్గాలు వేర్వేగారు భీష్మించుకుని కూర్చోవడంతో ఉత్కంఠ నెలకొంది. భక్తులుకిలో మీటర్ల కొద్ది బారులు తీరాల్సి వచ్చింది. చివరకు దేవాదాయ శాఖ, జిల్లా స్థాయి అధికారులు రంగంలోకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. రెండు గంటల అనంతర భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆలయంలో శివాచార్యులు, త్రిసుదందిరంగల్ మధ్య వివాదాన్ని పలువురు తీవ్రంగా విమర్శించే పనిలో పడ్డారు. -
మల్లై సత్యపై వైగో వేటు
సాక్షి, చైన్నె: ఎండీఎంకేలో మల్లై సత్యపై పార్టీ నేత వైగో వేటు వేశారు. ఆయన్ని తాత్కాలికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. డీఎంకే నుంచి గతంలో చీలికతో ఆవిర్భవించిన పార్టీ మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కళగం(ఎండీఎంకే) అన్నవిషయం తెలిసిందే. ఆ పార్టీ వ్యవస్థాపకుడిగా, ప్రధాన కార్యదర్శిగా వైగో వ్యవహరిస్తున్నారు. ఆయన తనయుడు దురై వైగో రాజకీయ ప్రవేశంతో పార్టీకోసం శ్రమించిన ముఖ్య నేతలందరూ బయటకు వెళ్లి పోయారు. ఆయన వైగో నమ్మిన బంటుగా ఉంటూ వచ్చిన మల్లై సత్య ఎన్ని అటు పోట్లు ఎదురైనా పార్టీనే నమ్ముకుని ఉన్నారు. అయితే, దురై వైగో, మల్లై సత్యమద్య తాజాగా వివాదం రాజుకుంది. ఈ వివాదం నేపథ్యంలో వైగో తనను ద్రోహిగా వ్యాఖ్యానించడాన్ని మల్లై సత్య పరిగణించారు. తనకు న్యాయం కావాలంటూ ఆందోళనకు సైతం దిగారు. పార్టీలోకి వచ్చి రాగానే దురైవైగోకు ప్రిన్సిపల్ ప్రధాన కార్యదర్శి పదవిఅప్పగించడాన్ని అనేక మంది వ్యతిరేకిస్తూ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మల్లై సత్య వెన్నంటి నిలుస్తూ వస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మల్లై సత్యను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూవైగో నిర్ణయం తీసుకున్నారు. వివరణ కోరుతూ ఆయనకు నోటీసులు పంపించారు. -
ఈడీకి మళ్లీ అక్షింతలు
సాక్షి, చైన్నె: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు హైకోర్టు బుధవారం మళ్లీ అంక్షింతలు తప్పలేదు. ఈ సారి విచారణకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తులు ఆదేశించారు. టాస్మాక్లో రూ. 1000 కోట్ల అక్రమాల పేరిట ఈడీ సృష్టించిన సోదాలు, దాడుల గురించి తెలిసిందే. నిర్మాత ఆకాశ్ భాస్కరన్, వ్యాపార వేత్త విక్రమ్ రవీంద్రలు ఈ సోదాలకు వ్యతిరేకంగా, ఈడీ చర్యలకు చెక్ పెట్టే విధంగా మద్రాసు హైకోర్టు ఆశ్రయించారు. తమ కార్యాలయాలను సీజ్ చేయడం, తదితర అంశాలను కోర్టు ముందు ఉంచారు. ఈ పిటిషన్ విచారణ వాడివేడిగానే సాగింది.ఈ సమయంలో పలు మార్లు ఈడికి కోర్టు అక్షింతలు వేసింది. టాస్మాక్ స్కాంతో వీరిద్దరికి ఉన్న సంబంధాలేమిటో అని ప్రశ్నించింది. ఆధారాలు ఏవీ అని కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈకేసు విచారణకు స్టే విధించారు. అయినా, ఈడీ తరపున ఆకాశ్ భాస్కరన్కు సమన్లు వెళ్లడం చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంపై ఆకాశ్ తరపు న్యాయవాది ఇటీవల కోర్టుకు ఫిర్యాదు చేశారు. కోర్టు ధిక్కారం పరిధిలోకి ఈడీ చర్యలు రావడంతో అవసరం అయితే, పిటిషన్ దాఖలు చేయవచ్చు అని న్యాయమూర్తి సూచించారు. అదే సమయంలో సమన్లు పొరబాటుగా వెళ్లినట్టు ఈడీ పేర్కొనడంతో సంబంధిత అధికారులపై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఆకాశ్, విక్రమ్కు ఈ స్కాంతో ఉన్న సంబంధం గురించి పలు ప్రశ్నలను కోర్టు సందించింది. ఇందుకు గత విచారణ సమయంలో ఈడీ తరపున సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. అయితే, ఈడీ తరపున సమాధానాలు దాఖలుచేయక పోవడంతో తీవ్రంగా పరిగణించిన హైకోర్టు రూ. 30 వేలు జరిమానా విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మొత్తాన్ని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిధికి చెల్లించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదావేశారు. బుధవారం మళ్లీ పిటిషన్ విచారణకు రాగా న్యాయమూర్తులు ఈడీ అధికారులకు తీవ్ర అక్షింతలు వేశారు. కోర్టు ధిక్కార వ్యవహారంలో ఎలాంటి సమాధానాలు అన్నది ఈడీ తరపున దాఖలు కాకపోవడంతో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారి తదుపరి విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తులు ఆదేశించారు. -
స్టంట్ సిల్వాకు అవార్డు
తమిళసినిమా: ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. దీన్ని అక్షరాలా పాటిస్తున్న ఫైట్ మాస్టర్ సిల్వా. స్టంట్ సిల్వాగా పిలువబడే ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తమిళుడైన ఈయన తమిళంలోనే కాకుండా దక్షిణాది ప్రముఖ స్టంట్ మాస్టర్గా రాణిస్తున్నారు. అంతేకాదు, నటుడిగానూ వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ ఆ విధంగానూ గుర్తింపు పొందారు. మొత్తం 100కుపైగా చిత్రాలకు స్టంట్ మాస్టర్గా పనిచేసిన ఈయన ఇప్పటికే పలు అవార్డులను గెలుచుకున్నారు. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం అందించే ఉత్తమ స్టంట్ మాస్టర్ అవార్డుతోపాటు సైమా అవార్డు, ఎడిసన్ అవార్డులను గెలుచుకున్నారు. తాజాగా కేరళ ప్రభుత్వం అందించే ఉత్తమ స్టంట్ మాస్టర్ అవార్డును గెలుచుకోవడం విశేషం. మనోరమ కేరళ రాష్ట్రం అందించే ఉత్తమ స్టంట్ మాస్టర్ అవార్డును స్టంట్ సిల్వాను వరించింది. నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వంలో మోహన్లాల్ హీరోగా నటించిన ఎంబురాన్ ఎల్ 2 చిత్రం, మోహన్లాల్ నటించిన మరో సూపర్హిట్ చిత్రం తుడరుమ్ చిత్రాలకు ఫైట్మాస్టర్, స్టంట్మాస్టర్గా పని చేశారు. ఈ చిత్రాలకుగానూ 2025వ ఏడాదికిగానూ మనోరమ కేరళ రాష్ట్ర అవార్డును స్టంట్ సిల్వాకు ప్రదానం చేసి సత్కరించారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు స్టంట్ సిల్వాను అభినందిస్తున్నారు. స్టంట్ సిల్వా -
చెరువు కరకట్ట ధ్వంసం
తిరువళ్లూరు: చెరువు కరకట్టను ధ్వంసం చేసి మట్టి తరలించడాన్ని నిరసిస్తూ లారీలను అడ్డుకుని స్థానికులు మంగళవారం ఆందోళన చేశారు. తిరుపతి–చైన్నె జాతీయ రహదారి విస్తరణ పనులు తిరునిండ్రవూర్ నుంచి తిరుత్తణి వరకు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల కోసం జిల్లాలోని పట్రపెరంబదూరు, కారణి సహా పది ప్రాంతాల్లో మట్టి తరలించడానికి ప్రభుత్వం క్వారీలకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అన్ని క్వారీల్లో మట్టి తరలింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లా పట్రపెరంబదూరులోని క్వారీల్లో మట్టి తరలింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన క్రమంలో చెరువు కరకట్టను ద్వంసం చేసి మట్టి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానికులు లారీలను అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. రెండుగంటల పాటు ఆందోళన నిర్వహించడంతో లారీలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలిసి తాలుకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళకారులకు మధ్య స్వల్పంగా వాగ్వా దం నెలకొంది. భారీ వర్షం కురిస్తే చెరువులోని నీరు వృథా కాకుండా రెండుగంటల్లో కరకట్టకు మరమ్మతు చేస్తామని క్వారీ నిర్వాహకులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
విద్యార్థులకు స్కాలర్షిప్లు రూ.5కోట్లు
సాక్షి, చైన్నె: ద్యార్థులకు రూ. 5 కోట్లకు పైగా స్కాలర్ షిప్లు, టాపర్లకు పూర్తిగా ఫీజు మినహాయింపు, గ్లోబల్ స్పోర్ట్స్ అవకాశాలను కల్పిస్తూ హిందూస్థాన్ ఇన్స్టిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ చర్యలు తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఫ్రెసర్స్ను ఆహ్వానిస్తూ మంగళవారం ఫ్రెషర్స్ ఇండక్షన్ ప్రోగ్రామ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ట్రాఫిక్ కంట్రోల్ జాయింట్ జనరల్ మేనేజర్ ఆర్ సేనాపతి, కస్టమ్స్, జీఎస్టీ రిటైర్డ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎస్ కన్నన్, కేవీఎం ఎక్స్ పోర్ట్స్ ఎండీ డాక్టర్ వికాశ్లు హాజరయ్యారు. విద్యార్థులకు విద్య, ఉపాధి, జీవితం గురించిన పలు అంశాలను వివరించారు. ఆ విద్యా సంస్థ చాన్స్లర్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్, ప్రొ. చాన్స్లర్ డాక్టర్ అశోక్ జార్జ్ వర్గీస్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ అభిశామ్, తాత్కాలిక వైస్ చాన్స్లర్ డాక్టర్ ఎస్. గణేషన్, డిప్యూటీ డైరెక్టర్ ఎనిడ్ వర్గీస్ జాకబ్లు వర్గీస్లు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ ప్రోగ్రామ్ ద్వారా రూ. 5 కోట్లకు పైగా విలువైన స్కాలర్ షిప్లను ప్రకటించారు. విద్యా, అథ్లెటిక్, కమ్యూనిటీ డొమైన్లలో మాత్రమే కాకుండా, సామాజిక– ఆర్థిక అడ్డంకులను విద్యార్థులకు తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. టాపర్లకు వంద శాతం ట్యూషన్ ఫీజును మినహాయించారు. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ స్కాలర్ షిప్ను ప్రకటించారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన
తిరుత్తణి: పారిశుధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో తిరుత్తణిలో మంగళవారం ఆందోళన చేశారు. మహిళలు సహా 50 మంది సీఐటీయూ శ్రేణులు పాల్గొని చైన్నెలో పారిశుధ్య కార్మికుల పనులను ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పారిశుధ్య కార్మికులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రయివేటీకరణ రద్దు చేయాలని, పారిశుధ్య కార్మకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కరోనా సమయంలో విధులు నిర్వహించిన పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ ప్రకటన మేరకు రూ.15వేలు వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ చేశారు. -
క్లుప్తంగా
రేబిస్తో కార్మికుడి మృతి సేలం: కుక్క కరిచి మగ్గం కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన సేలంలో చోటుచేసుకుంది. సేలం జిల్లా కొంగణాపురం సమీపంలోని ఇలవంపాళయం కుప్పుసామి (43) మగ్గం కార్మికుడు. గత కొన్ని రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు మూడు నెలల కిందట కుక్క కరిచినా అతను చికిత్స తీసుకోలేదు. తీసుకోకపోవడంతో అప్పటి నుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. కుటుంబసభ్యులు అతన్ని పరీక్షల కోసం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు, అక్కడ అతనికి రేబిస్ వ్యాధి సోకినట్లు తేలింది. వెంటనే కుప్పుసామిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఉద్యోగం పేరుతో రూ.48లక్షల మోసం – తండ్రీకూతురు అరెస్ట్ అన్నానగర్: విదేశాల్లో ఉద్యోగం పేరుతో రూ.48లక్షలు మోసం చేసిన తండ్రీకూతురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్నెలోని అరుంబాక్కం రామకృష్ణన్ వీధికి చెందిన ఆరోగ్యరాజ్ (35). ఇతను అరుంబాక్కం క్రైంబ్రాంచ్ పోలీస్స్టేషన్న్లో ఒక ఫిర్యాదు చేశాడు. అందులో కేలంబాక్కంకు చెందిన వెంకటేషన్ (50). ఇతని భార్య జ్ఞానసుందరి (43), వీరి కుమార్తె మోనిషా (21). వీరు ముగ్గురు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని, మీకు తెలిసిన వారికి చెప్పాలని ఆరోగ్యరాజ్తో చెప్పారు. వారి మాటలు నమ్మి, 2023 సంవత్సరంలో తనకు తెలిసిన 24 మంది నుంచి రూ.48 లక్షలు ఇప్పించాడు. చాలా రోజులు అయినప్పటికీ ఉద్యోగం తీసివ్వలేదు, నగదు ఇవ్వలేదు. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం వెంకటేషన్, కుమార్తె మోని షాను అరెస్టు చేశారు. విదేశాల్లో ఉన్న జ్ఞానసుందరిని అరెస్టు చేయడానికి లుకౌట్ నోటీసు జారీ చేశారు. తండ్రి, కుమార్తెను కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు ఎడ్యుకేషనల్ టూర్ కొరుక్కుపేట: చైన్నె కార్పొరేషన్ ఆర్థిక నివేదిక ప్రకారం, పబ్లిక్ పరీక్షలో అత్యధికంగా మార్కులు సాధించిన 60 మంది విద్యార్థుల కోసం మేయర్ ప్రియా విద్యా పర్యటనను ప్రారంభించారు. ప్రభుత్వ పబ్లిక్ పరీక్షలో అధిక మార్కులు సాధించి చైన్నె పాఠశాలల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థులను విద్యా పర్యటనలకు తీసుకెళ్తామని మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థిక నివేదిక ప్రకటించింది. దీని ప్రకారం, గత సంవత్సరం వారిని మహేంద్రగిరి అంతరిక్ష పరిశోధన కేంద్రం, కుడంకుళం థర్మల్ పవర్ ప్లాంట్ వంటి ప్రదేశాలకు తీసుకెళ్లారు. ఈ విద్యా సంవత్సరంలో, చైన్నె ఉన్నత , మాధ్యమిక పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, చైన్నె పాఠశాలల్లో 11వ తరగతి చదువుతున్న 60 మంది విద్యార్థులను ఎంపిక చేసి, తమిళనాడు పర్యాటక అభివద్ధి సంస్థకు చెందిన ఎయిర్ కండిషనన్డ్ బస్సులో 10 మంది ఉపాధ్యాయులతో పాటు, ఆంధ్రప్రదేశ్లోని అంతరిక్ష కేంద్రం, ప్రయోగ వేదిక అయిన శ్రీహరి కోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు తీసుకెళ్లారు. కార్యక్రమాన్ని మేయర్ ప్రియ జెండాను ఎగురవేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రతివిరాజ్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ పాల్వాక్కం విశ్వనాథన్, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు. గాయపడిన డ్రైవర్కు పోలీసుల సాయం తిరువొత్తియూరు: తిరుచెందూరు ప్రాంగణంలో స్ప్పహ కోల్పోయి ప్రాణాలతో పోరాడుతున్న చైన్నె కార్పొరేషన్ డ్రైవర్ను కాపాడి ఆస్పత్రిలో చేర్చిన ఆలయ పోలీస్స్టేషన్ పోలీసులు, తీరప్రాంత రక్షణ బృందాన్ని భక్తులు అభినందించారు. వివరాలు.. తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని నాళికైనారు సమీపంలో నిర్మానుష్యంగా, చీకటిగా ఉన్న ప్రాంతంలో బట్టలు మార్చుకోవడానికి వెళ్లిన చైన్నెకి చెందిన కార్పొరేషన్ డ్రైవర్గా పనిచేస్తున్న జైశంకర్ (58) ఉన్నట్టుండి అస్వస్థతకు గురై స్ప్పహ కోల్పోయి ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆ సమయంలో అక్కడ గస్తీలో ఉన్న ఆలయ పోలీస్స్టేషన్ పోలీసులు ముత్తుకుమార్, సుబిన్రాజ్ ప్రాణాల కోసం పోరాడుతున్న ఆ వ్యక్తిని చూసి వెంటనే అక్కడి ఆలయ తీరప్రాంత రక్షణ సిబ్బందికి సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు శివరాజా కార్తీక్ సర్వేశ్వరన్, మహారాజా మారిముత్తు వెంటనే అక్కడికి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని అక్కడి నుంచి ఆలయ ఉచిత అంబులెన్స్ ద్వారా తిరుచెందూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్టు తిరువొత్తియూరు: ఒడిశా నుంచి చైన్నెకి రైలులో గంజాయి తరలిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె అన్నానగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ బాలసుబ్రమణియన్ మంగవారం పెరంబూరు రైల్వేస్టేషన్ జమాలియా ఆటోస్టాండ్ ప్రాంతంలో తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఒడిశా నుంచి రైలులో పెరంబూరు రైల్వేస్టేషన్లో దిగిన ఓ యువకుడు పార్శిల్ను తీసుకెళ్తుండగా సోదా చేశారు. విచారణలో ఆవడికి చెందిన గంజాయి వ్యాపారి దిలీపన్ (23) అని ఇతను భార్యతో కలిసి గత ఐదేళ్లుగా గంజాయి సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. ఒడిశా, విశాఖపట్నం నుంచి గంజాయిని కొనుగోలు చేసి చైన్నెకి తీసుకొస్తున్నట్లు తెలిసింది. దిలీపన్ను పోలీ సులు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
ప్రదర్శన
పొటో: 30: చైన్నె షావుకారు పేటలోని ఎస్ఎస్ జైన్ ఎడ్యుకేషనల్ గ్రూప్ పరిధిలోని పాఠశాలలో దిన చర్యలో సైన్స్ భాగం పేరిట సైన్స్ ఎక్స్పోను మంగళవారం ఏర్పాటు చేశారు. 35 మందికి పైగా విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలో ఈ ప్రదర్శనలో కొలువు దీర్చారు. జిల్లా విద్యా శాఖ అధికారి ఎలిళరసి, ప్రిన్సిపల్ హనుమాన్ చంద్ బోత్రా, కార్యదర్శి దల్జీత్ సింగ్, నిర్వాహకులు జయశ్రీ పరిశీలించారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, బిర్లా ప్లానిటోరియం తరహా ప్రదర్శన నిలిచింది. – సాక్షి, చైన్నె -
తెలుగు భాషను పరిరక్షించుకుందాం
కొరుక్కుపేట: తెలుగు భాషను పరిరక్షించుకుందామని ప్రముఖ రచయిత్రి, గాయని డా. గుమ్మడి రామలక్ష్మి పిలుపునిచ్చారు.ఈ మేరకు కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాలలో చైతన్య పేరుతో ఏర్పాటైన రెండు రోజుల పోటీలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు మంగళవారం నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు విభాగాల వారీగా అంతర్ కళాశాల పోటీలు నిర్వహించారు. తెలుగు శాఖ అధ్యాపకురాలు డాక్టర్ మైథిలి అధ్యక్షతన, తెలుగు శాఖ సృజన తెలుగు భాషా మండలి తరఫున పోటీలకు డా.గుమ్మడి రామలక్ష్మి పాల్గొన్నారు. వివిధ పోటీల్లో తెలుగు విద్యార్థులు పాల్గొని ప్రతిభను చాటుకున్నారు. విజేతలుగా నిలిచిన వారికి రామలక్ష్మి బహుమతులను ప్రదానం చేశారు. -
హెల్ప్ డెస్క్
న్యూ ఇండియా అస్యూరెన్స్ హెల్ప్ డెస్క్ను శ్రీ రామచంద్ర వైద్య కేంద్రంలో ఏర్పాటు చేశారు. బీమా హెల్ప్ డెస్క్గా రోగుల కోసం పాలసీ సమాచారం, క్లైయిమ్ సెటిల్మెంట్, తక్షణ సాయం కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ది న్యూ ఇండియా అస్యూరెన్స్ చైర్మన్ గిరిజ, డిప్యూటీ జీఎం ఎంవీ చంద్రశేఖర్, శ్రీరామచంద్ర వైద్యకళాశాల డీన్ కె.బాలాజీ సింగ్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ సింగ్, జనరల్ మేనేజర్లు ఆర్ మోహన్, రమేష్ ప్రారంభించారు. – సాక్షి, చైన్నె -
అన్నాడీఎంకేకు పునర్జీవం పోయ బోతున్నా!
– శశికళ సాక్షి, చైన్నె: బలహీన పడ్డ అన్నాడీఎంకేకు పునర్జీవం పోయేబోతున్నానని, తనకు ఉన్న అనుభవంతో కార్యాచరణను విస్తృతం చేయనున్నట్టు దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ వ్యాఖ్యానించారు. పోయేస్ గార్డెన్లో మంగళవారం శశికళ మీడియాతో మాట్లాడారు. జయలలిత రాజకీయ ప్రయాణంలో తన పాత్రను గుర్తు చేశారు. ఆమెకు వెన్నంటి ఉంటూ అన్ని అంశాలను నిశితంగా పరిశీలించానన్నారు. 2011లో అధికారంలోకి వచ్చినానంతరం 2016లోమళ్లీ అధికారం దిశగా ముందడుగు వేసి విజయకేతనం ఎగుర వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె మరణం గురించి పేర్కొంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం కొందరి రూపంలో అన్నాడీఎంకే బలహీన పడిఉందని, అందర్నీ ఏకం చేయడం, బలహీన పడ్డ పార్టీకి పునర్జీవం పోయడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టనున్నట్టు, క్రియా శీలక రాజకీయాలోకి రానున్నట్టు ప్రకటించారు. అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యమని, ఇందుకుగాను తనవంతుగా పార్టీకి పునర్జీవం పోయనున్నట్టు, ఇందుకు సంబంధించిన కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానన్నారు. బస్సు ఢీకొని వైద్యుడు దుర్మరణం అన్నానగర్: విల్లుపురం రాష్ట్ర రవాణా సంస్థ బస్సు మంగళవారం ఉదయం చైన్నెలోని కల్పక్కం నుంచి చెంగల్పట్టుకు బయలుదేరింది. చెంగల్పట్టులోని రాట్టినక్కినారు రైల్వే ఫ్లైఓవర్ వద్ద వెళుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో రోడ్డు దాటేందుకు అక్కడ నిలబడి ఉన్న ఇద్దరు వైద్యులను బస్సు ఢీకొని, చెంగల్పట్టు నుంచి మధురాంతకం వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సును కూడా ఢీకొంది. ఈ ప్రమాదంలో క్రోంపేట – హస్తినాపురం నుంచి డాక్టర్ మణికుమార్ (46), చైన్నెకి చెందిన డాక్టర్ ప్రవీణ్ కుమార్, 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని రక్షించి చెంగల్పట్టు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డాక్టర్ మణికుమార్ మృతిచెందాడు. మణికుమార్ చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నారు. డాక్టర్ మణికుమార్ భార్య కూడా పిల్లల వైద్యురాలు. మణికుమార్ అవయవాలను దానం చేయడానికి 2 రోజు ల ముందు నమోదు చేసుకోవడం గమనార్హం. అయితే ప్రమాదంలో అతని అవయవాలు దెబ్బతినడంతో కళ్లను మాత్రం దానం చేశారు. బహుళ అంతస్తులో అగ్నిప్రమాదం సాక్షి, చైన్నె: చైన్నె అభిరామిపురం ఎంఆర్సీ నగర్లోని బహుళ అంతస్తుల భవనంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఎంఆర్సీ నగర్లో లగ్జరీ బహుళ అంతస్తుల భవనాలు అనేకం ఉన్నాయి. ఇందులో నాలుగు బ్లాక్లతో కూడిన ఓ బహుళ అంతస్తుల భవనం వద్ద సాయంత్రం ఉత్కంఠ నెలకొంది. సీ బ్లాక్ ఐదవ అంతస్తులోని ఓ ఫ్లాట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఐదవ అంతస్తు నుంచి ఆరో అంతస్తుకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అపార్ట్మెంట్లల ఉన్నవారందర్నీ బయటకు పంపించేశారు. మంటలను గంటన్నర సేపు శ్రమించి అదుపులోకి తెచ్చారు. తంగచ్చి మఠంలో ఉద్రిక్తత సాక్షి, చైన్నె : రామేశ్వరం తంగచ్చి మఠంలో మంగళవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామేశ్వరం – తాంబరం రైలు గంటన్నరకు పైగా మార్గమధ్యలో ఆగింది. తమకు భద్రత కల్పించాలని, శ్రీలంక చెరలో ఉన్న వారిని విడుదల చేయాలని, పడవలను స్వాధీ నం చేసుకోవాలని రామేశ్వరంలో జాలర్లు సమ్మె సైరన్ మోగించిన విషయం తెలిసిందే. మంగళవారం జాలర్లు, వారి కుటుంబాలు వందలాదిగా తంగచ్చి మఠం వద్ద రైల్వే ట్రాక్పై కూర్చున్నారు. అదే సమయంలో రామేశ్వరం నుంచి తాంబరం వెళ్లే ఎక్స్ప్రెస్ రావడంతో డ్రైవర్ గమనించి రైలును ఆపేశాడు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో పోలీసులు చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు.. -
ఐఐటీలో స్మార్ట్ సెంటర్
ఐఐటీ మద్రాసులో స్థిరమైన ఆర్టిఫిషియల్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ను పరిశోధించేందుకు ఫెడెక్స్–స్మార్ట్ సెంటర్ను మంగళవారం ఏర్పాటు చేశారు. తొలి ఆవిష్కరణ కేంద్రంగా అత్యాధునిక పరిశోధనలను మిళితం చేస్తూ ఏర్పాటైన ఈ సెంటర్ను ఫెడెక్స్లోని మిడిల్ ఈస్ట్, ఇండియన్ సబ్కాంటినెంట్, ఆఫ్రికా అధ్యక్షుడు కామి విశ్వనాథన్, ఎయిర్ నెట్ వర్క్ ఉపాధ్యక్షుడు నితిన్ నవనీత్ తటివాలా, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వి.కామకోటి, డీన్ అశ్విన్ మహాలింగం ప్రారంభించారు. ఈ కేంద్రం కేవలం పరిశోధన కేంద్రంగా మాత్రమే కాకుండా, సాంకేతికత, ప్రతిభ కలిపిన ఒక ఉమ్మడి వేదికగా ఉంటుందని ప్రకటించారు. – సాక్షి, చైన్నె -
బెల్జియం వాసికి చైన్నెలో అరుదైన శస్త్ర చికిత్స
సాక్షి, చైన్నె: బెల్జియంకు చెందిన వ్యక్తికి చైన్నె గ్లెనీగల్స్లో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించారు. జెడ్– పీఓఈఎం విధానాన్ని అనుసరించి , జీఐ ఎండోస్కోపీ మైలారాయిని చేదించారు. మంగళవారం ఈ వివరాలను గ్లెనీగల్స్లో జరిగిన కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ బీ మహాదేవన్ వెల్లడించారు.బెల్జియంకు చెందిన 75 సంవత్సరాలవ్యక్తికి 15 సంవత్సరాలకు పైగా తీవ్ర మైన వాంతులు, నిరంతరం దగ్గు, జీర్ణ సమస్య ఉంటూ వచ్చిందని వివరించారు. అరుదైన, సంక్లిష్టమైన జెడ్–పీఓఈఎం( పెరో ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమి) ప్రక్రియను ఉపయోగించి ఆయనకు శస్త్ర చికిత్సకు చర్యలు తీసుకుని విజయవంతం చేశామన్నారు.తొలుత రోగి పరిస్థితిని చూసినప్పుడు సంక్లిష్టమైన సవాలును ఎదుర్కోవాల్సి ఉంటుందని పరిగణించే అధునాతన విధానం అనుసరించామన్నారు. బెల్జియం వ్యక్తికి చైన్నెలో ఈ అరుదైన చికిత్స జరగడం గర్వకారణంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆస్పత్రి సీఈఓ డాక్టర్ నాగేశ్వర్ రావు, డాక్టర్లు బాబుకుమార్, శ్రీనివాస్, కృతిక తదితరులు పాల్గొన్నారు. -
తీరప్రాంత ప్రజలకు వరద హెచ్చరిక
సేలం: కావేరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, కర్ణాటకలోని కబిని, కృష్ణరాజ సాగర్ ఆనకట్టల నుంచి సెకనుకు లక్ష క్యూబిక్ అడుగులకు పైగా మిగులు నీటిని విడుదల చేశారు. దీంతో మెట్టూరు ఆనకట్టలోకి నీటి ప్రవాహం పెరగడం ప్రారంభమైంది. అధికారులు అప్రమత్తమై కావేరి నది ఒడ్డున ఉన్న ప్రజలకు వరద హెచ్చరిక జారీ చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు, ఆనకట్ట నీటి మట్టం 117,450 అడుగులు. ఆ సమయంలో, ఆనకట్టలోకి నీటి ప్రవాహం సెకనుకు 36,242 క్యూబిక్ అడుగులు. ఆనకట్ట నుంచి నీటి విడుదల సెకనుకు 50వేల క్యూబిక్ అడుగులుగా విడుదల చేశారు. ఆనకట్టలోకి నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. సాయంత్రం 4 గంటలకు ఆనకట్టలోకి 101,227 క్యూబిక్ అడుగులు నీరు వస్తోంది. ఆనకట్ట నీటి మట్టం 118,370 అడుగులకు పెరిగింది. ఆనకట్టలోని జలవిద్యుత్ కేంద్రాల ద్వారా సెకనుకు 21,300 క్యూబిక్ అడుగుల నీరు, ఓవర్ ఫ్లో ద్వారా సెకనుకు 28,700 క్యూబిక్ అడుగుల నీరు విడుదలవుతోంది. కాలువలో సెకనుకు 500 క్యూబిక్ అడుగుల నీరు ప్రవహిస్తోంది. ఆనకట్ట నీటి సామర్థ్యం 90,895. ఈ రిజర్వ్ టీఎంసీలలో ఉంది. కర్ణాటక రాష్ట్ర ఆనకట్టల నుంచి లక్ష క్యూబిక్ అడుగులకు పైగా నీరు విడుదల కావడంతో ఈ ఏడాది మెట్టూరు ఆనకట్ట 5 సార్లు నిండిపోయింది. నీటి ప్రవాహం పెరుగుతూనే ఉండడంతో, మెట్టూరు ఆనకట్ట నుంచి నీటి విడుదల మరింత పెరిగే అవకాశం ఉంది. మెట్టూరు ఆనకట్ట నుంచి అధిక నీటిని విడుదల చేయడంతో కావేరి నది ఒడ్డున ఉన్న ప్రజలకు అధికారులు వరద హెచ్చరిక జారీ చేశారు. -
అన్నాడీఎంకేకు పునర్జీవం పోయబోతున్నా!
సాక్షి, చెన్నై: బలహీన పడ్డ అన్నాడీఎంకేకు పునర్జీవం పోయేబోతున్నానని, తనకు ఉన్న అనుభవంతో కార్యాచరణను విస్తృతం చేయనున్నట్టు దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ వ్యాఖ్యానించారు. పోయేస్ గార్డెన్లో మంగళవారం శశికళ మీడియాతో మాట్లాడారు. జయలలిత రాజకీయ ప్రయాణంలో తన పాత్రను గుర్తు చేశారు. ఆమెకు వెన్నంటి ఉంటూ అన్ని అంశాలను నిశితంగా పరిశీలించానన్నారు. 2011లో అధికారంలోకి వచ్చినానంతరం 2016లోమళ్లీ అధికారం దిశగా ముందడుగు వేసి విజయకేతనం ఎగుర వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె మరణం గురించి పేర్కొంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం కొందరి రూపంలో అన్నాడీఎంకే బలహీన పడిఉందని, అందర్నీ ఏకం చేయడం, బలహీన పడ్డ పారీ్టకి పునర్జీవం పోయడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టనున్నట్టు, క్రియా శీలక రాజకీయాలోకి రానున్నట్టు ప్రకటించారు. అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యమని, ఇందుకుగాను తనవంతుగా పారీ్టకి పునర్జీవం పోయనున్నట్టు, ఇందుకు సంబంధించిన కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానన్నారు. -
తన భర్త సంసారానికి పనికిరాడని..!
చెన్నై: చెన్నై, ఆలందూర్లో పిల్లలు లేరనే విరక్తితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చెన్నై ఆలందూరుకు చెందిన కోటేశ్వరి (30)కి, తిరుచ్చి జిల్లా కూవియలూరుకు చెందిన వినోద్కు రెండేళ్ల క్రితం పెళ్లయింది. గత రెండేళ్లుగా పిల్లలు లేకపోవడంతో కోటేశ్వరి వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందింది. అయితే వైద్య నివేదికలో కోటేశ్వరికి ఎలాంటి లోపాలు లేవని తేలింది. దీంతో కోటేశ్వరి తన భర్త వినోద్ను వైద్య చికిత్సకు రమ్మని పిలిచినప్పుడు, అతను రాలేదు. దీంతో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీనితో మనస్తాపం చెందిన కోటేశ్వరి మంగళవారం తెల్లవారుజామున ఇంట్లోని బాత్రూంలో దుపట్టాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
● మాజీ సైనికుల కోసం కొత్త పథకం ● మూడు శాఖలలో ఉద్యోగ నియామక ఉత్తర్వులు ● పర్యాటక డాక్యుమెంటరీకి అవార్డు
సాక్షి, చైన్నె: ఎండ, వాన, చలి, మంచు దుప్పటిని లెక్క చేయకుండా దేశం భద్రత కోసం సరిహద్దులలో అహర్నిషలు సైనికులు శ్రమిస్తున్న విషయం తెలిసిందే. మాతృభూమి కోసం యుక్త వయస్సులోనే ఆర్మీలో చేరి సైనిక సేవ చేసినానంతరం పదవీ విరమణ పొందిన మాజీ సైనికులు ఎందరో కష్టాలను ఎదుర్కొంటున్న విషయాన్ని సీఎం పరిగణించారు. మరెందరో సెక్యూరిటీలుగా అనేక సంస్థలలో పనిచేస్తుండడం గుర్తించారు. అలాగే మరణించిన సైనికుల కుటుంబాలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మాజీ సైనికుల సంక్షేమం, యుద్ధభూమిలో వీర మరణం పొందిన అమర సైనికుల కుటుంబాలను ఆదుకునే విధంగా కారుణ్య నియామకాల కింద ఉపాధి కల్పన, విద్యా సంస్థలలో సీట్ల రిజర్వేషన్ వంటి ప్రక్రియలపై సీఎం దృష్టి కేంద్రీకరించారు. అలాగే మాజీ సైనికుల జీవనోపాధిని మెరుగు పరిచే విధంగా సీఎం రక్షణ కవచం పేరిట ప్రత్యేక పథకం అమలుకు కార్యాచరణను సిద్ధం చేశారు. మాజీ సైనికులు వయస్సు, వారి సేవలను పరిగణించి సురక్షిత జీవితాన్ని అందించే విధంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 155 మంది మాజీ సైనికులకు 30 శాతం సబ్సిడీతో స్వయం ఉపాధి కల్పన దిశగా రూ. 24.43 కోట్లు కేటాయించారు. వీరికి స్వయం ఉపాధి శిక్షణ, వ్యవస్థాపకులుగా మార్చేందుకు అవసరమైన నిధుల కల్పనకు చర్యలు తీసుకున్నారు. అలాగే తొలి విడతగా 348 మాజీ సైనికులు, వారి కుటుంబాలకు ఈ పథకం మొత్తం వ్యయం రూ. 50 కోట్ల ఒక లక్షతో వివిధ వృత్తులు,స్టార్టప్ల కోసం ఒక్కొక్కరికి రూ.కోటి బ్యాంక్ రుణాన్ని మొత్తంపై 30 శాతం మూలధన సబ్సిడి, 3 శాతం వడ్డీ సబ్సిడీ అందించేందుకు చర్యలు తీసుకున్నారు. అర్హులైన మాజీ సైనికులు ప్రయోజనాలు పొందేందుకు వీలుగా ప్రతిజిల్లాలో కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయించారు. ఈ కమిటీ ఆమోదం ఆధారంగా దరఖాస్తులు సంబంధిత బ్యాంకులకు పంపించనున్నారు. భవిష్యత్తులో 500 మంది మాజీ సైనికులకు దీని ద్వారా ప్రయోజనం చేకూర్చనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ శాఖమంత్రి కయల్వెలి సెల్వరాజ్, సీఎం మురుగానందం, మాజీ సైనికుల సంక్షేమ శాఖ కార్యదర్శి రీటా హరీష్ ఠక్కర్ , డెరెక్టర్ సజ్జన్ సింగ్ రావు చవాన్,తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులు అనంతరం జరిగిన కార్యక్రమంలో టీఎన్పీఎస్సీ ద్వారా రహదారుల శాఖకు ఎంపిక చేసిన 45 మంది అసిస్టెంట్ ఇంజినీర్లకు ఉద్యోగ నియామక ఉత్తర్వులను సీఎం స్టాలిన్ అందజేశారు. డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం 2021 మే నుంచి ఇప్పటి వరకు రహదారుల శాఖలో 416 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, 84 అసిస్టెంట్ ఇంజినీర్లు, 186 అసిస్టెంట్లు, 139 జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, 73 మంది టైపిస్టులు, 3 ఆడిటింగ్ అసిస్టెంట్లు, 7 స్టెనోగ్రాఫర్లు లెవెల్ –3 నియామకాలు జరిగినట్టు ఈసందర్భంగా వివరించారు. తాజాగా జరిగిన నియామకంతో మొత్తంగా 1,016 పోస్టులను భర్తీ చేసినట్టు ప్రకటించారు. అలాగే రైతు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీ నిమిత్తం 169 మందిని ఎంపిక చేశారు. మరో 33 మందికి కారుణ్య నియామకం కింద నియామక ఉత్తర్వులను సీఎం అందజేశారు. తమిళనాడులో వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ను ఐదు సార్లు విజయవంతంగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టడమే కాకుండా, ఇప్పటి వరకు వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖలో 1,982 ఖాళీలను భర్తీ చేసినట్టు, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 266 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కేటాయించినట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. మొత్తం 2,248 మందికి ఉద్యోగాలు కల్పించామని పేర్కొంటూ, తాజాగా టీఎన్పీఎస్సీ ద్వారా 60 మంది వ్యవసాయ అధికారులు, 109 మంది సహాయక అధికారులను నియమించామని ప్రకటించారు. మరణించిన ఉద్యోగుల వారసులకు జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులను 33 మందికి అందజేశామని వివరించారు. తదుపరి ప్రజా పనుల శాఖలో ఖాళీల భర్తీ నిమిత్తం టీఎన్పీఎస్సీ ద్వారా ఎంపిక చేసిన 165 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను సీఎం అందజేశారు. ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 98 మంది, ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు 67 మందిని ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఈ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 406 మంది, అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) 103 మంది, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్గా నలుగురు, జూనియర్ ఆర్కిటెక్ట్ మరో నలుగురు, జూనియర్ ఒకేషనల్ ఆఫీసర్గా 156 మంది, జూనియర్ అసిస్టెంట్ 55 మంది వ్యక్తులు, టైపిస్ట్ 32 మంది నియమించినట్టు వివరించారు. ఈ కార్యక్రమాలలో మంత్రులు ఏవీ వేలు, ఎంఆర్కే పన్నీరు సెల్వం, సీఎస్ మురుగానందం, రహదారుల శాఖ కార్యదర్శి ఆర్. సెల్వరాజ్, డైరెక్టర్ సెల్వదురై, చీఫ్ ఇంజనీర్ కెజీ సత్య ప్రకాశ్, ప్రత్యేక అధికారి ఆర్ చంద్రశేఖర్, వ్యవసాయ ఉత్పత్తి విభాగం కమిషనర్లు వి. దక్షిణామూర్తి, ఐ, టి. అబ్రహం, పి. మురుగేష్, పి. కుమార వేల్ పాండియన్, వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగం ఇంజినీర్ మురుగేశన్, ప్రజా పనుల శాఖ ప్రధాన కార్యదర్శి మంగత్ రామ్ శర్మ, చీఫ్ ఇంజనీర్ మణివణ్ణన్ తదితరులు పాల్గొన్నారు.పర్యాటకానికి ఉత్తమ అవార్డు పోటోగ్రాఫర్గా సీఎం ప్రపంచ పోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం స్టాలిన్ కాసేపు ఫొటోగ్రాఫర్గా మారి పోయారు. తమిళనాడు ప్రెస్ ఫొటో గ్రాఫర్ అసోసియేషన్ తరపున ఫొటో గ్రాఫర్లు హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్. రామ్తో కలిసి సీఎం స్టాలిన్ను కలిశారు. ఈ సందర్భంగా పలువురు ఫొటోగ్రాఫర్లు అవయవ దానంకు ముందుకు రాగా, వారికి ప్రశంసాపత్రాలను సీఎం అందజేశారు. అలాగే ఫొటో గ్రాఫర్లందర్నీ ఒక చోట నిలబెట్టి, తాను ఫొటో గ్రాపర్ అవతారం ఎత్తి క్లిక్ మనిపించారు. తమిళనాడు పర్యాటక రంగం కోసం రూపొందించిన టైమ్ లెస్ తమిళనాడు డాక్యుమెంటరీ చిత్రం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ కళ, సంస్కాతిక కేటగిరిలో జాతీయ చలన చిత్ర పురస్కారంగా రజత్ కమల్ అవార్డును అందుకుంది. ఈ డాక్యుమెంటరీలో నటించిన నటుడు ప్రశాంత్, మేనేజ్మెంట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చోటాని, వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ నిషా చోటాని, దర్శకుడు శ్రీ కామాక్య నారాయణ్ సింగ్ సచివాలయంలో సీఎం స్టాలిన్ను కలిశారు. ఆయనకు అవార్డును పర్యాటక మంత్రి ఆర్ రాజేంద్రన్ అందజేశారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శి కె మణివాసన్, విద్యాశాఖ కార్యదర్శి పి. చంద్రమోహన్, పర్యాటక శాఖ డైరెక్టర్ క్రీస్తురాజ్, తమిళనాడు పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఎస్. కవిత తదితరులు పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 19న దండకారుణ్యం
తమిళసినిమా: అట్టకత్తి దినేష్, కలైయరసన్ ప్రధాన పాత్రలు పోషించిన తాజా చిత్రం దండకారుణ్యం. ముత్తుకుమార్, నటి రిత్విక, విన్సు, షబ్బీర్, బాలా శరవణన్, యువన్ మయిల్సామి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నీలం ప్రొడక్షన్న్స్, లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్న్ సంస్థల అధినేతలు ఎస్.సాయిదేవానంద్, ఎస్.సాయి వెంకటేశన్, పా.రంజిత్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. అదిరన్ ఆదిరై దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెప్టెంబర్ 19న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది అడవి నేపథ్యంలో సాగే ఇద్దరు పోరాటదారుల ఇతివృత్తంతో రూపొందించిన యథార్థ సంఘటనలతో కూడిన కథా చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపాయి. రబ్బర్ బంతు చిత్రం తర్వాత దినేష్ నటించిన చిత్రం ఇదని, అదేవిధంగా వాళై చిత్రం తర్వాత కలైయరసన్ నటించిన ఈ చిత్రం వీరిద్దరికీ చాలా ముఖ్యమైనదిగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా దండకారుణ్యం ఉంటుందన్నారు. దీనికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని, ప్రదీప్ కలిరాజా చాయాగ్రహణం అందించారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు పేర్కొన్నారు. -
పరిశోధనా విద్యకు అధిక ప్రాధాన్యమివ్వాలి
వేలూరు: విద్యార్థులు పరిశోధన విద్యపై ఆసక్తి పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి తాలుకా సేర్కాడులోని తిరువళ్లువర్ యూనివర్సిటీ పరిధిలో వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట, కళ్లకుర్చి, విల్లుపురం జిల్లాల్లో మొత్తం 83 డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు నడుస్తోంది. వీటిలో మొత్తం ఒక లక్ష 13,275 మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ పరిధిలో 20వ స్నాతికోత్సవ కార్యక్రమం మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్య అతిథిగా హాజరై వివిధ కోర్సుల్లో డిగ్రీలు సాధించిన 256 మంది విద్యార్థినీ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా బెంగుళూరు ఎంఎస్ రామయ్య యూనివర్శిటీ ఆఫ్ అప్లేడ్ సైన్స్ వైస్ చాన్స్లర్ కుల్దీప్ కుమార్ రైనా మాట్లాడుతూ విద్యను అభ్యసించడంతో పాటూ పలు పరిశోధనలు చేసి దేశాభివృద్ధికి దోహద పడాలన్నారు. ప్రతి విద్యార్థికి జీవితంలో లక్ష్యం ఉండాలని ఆ లక్ష్యాన్ని అధిగమించేందుకు కష్టపడి ప్రయత్నం చేయాలన్నారు. ఇండియా ఇతర దేశాలకంటే అధికంగా పరిశ్రమలను స్థాపించి మొదటి స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఆరుముగం, రిజిస్టార్ సెంథిల్ వేల్మురుగన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ వేలూరు రాకతో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా వేలూరుకు వచ్చిన గవర్నర్కు కలెక్టర్ సుబ్బలక్ష్మి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. -
సిమ్స్లో అరుదైన శస్త్ర చికిత్స
సాక్షి, చైన్నె: డెర్మాటో ఫైబ్రోసార్కోమా ప్రోటు బెరాన్స్ అనే అరుదైన చర్మ క్యాన్సర్తో బాధ పడుతున్న యువ ఐటీ ఉద్యోగికి విజయవంతంగా పుర్రె , తల చర్మం పునర్నిర్మాణంతో చర్మ కణితికి శస్త్ర చికిత్సను చైన్నె సిమ్స్ ఆస్పత్రిలోని మల్టీ డిసిప్లినరీ బృందం నిర్వహించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రానియోఫేషియల్, ప్లాస్టిక్ సర్జరీ విభాగం మాజీ డైరెక్టర్ డాక్టర్ కృష్ణమూర్తి, కన్సల్టెంట్ డాక్డర్ శ్యామ్నాథ్ కృష్ణ పాండియన్ ఈశస్త్ర చికిత్స గురించి మంగళవారం మీడియాకు వివరించారు. డెర్మాటో ఫైబ్రో సార్కోమా ప్రోటు బెరాన్స్ చాలా అసాధారణంగా ప్రతి మిలియన్కు 1 నుంచి 5 మంది వ్యక్తులను ప్రభావితం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే రుగ్మతతో యువ ఐటీ ప్రొఫెసనల్ బాధ పడుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందన్నారు. ఇది కండరాలు, ఎముకలతో సహా పరిసరాలలోని ఖనజాలలకు వేగంగా వ్యాపించి ఉండడం, ఈ క్యాన్సర్ నెత్తి, పుర్రె మీద తీవ్ర ప్రభావం చూపి ఉంటాన్ని గుర్తించామన్నారు. మెదడు రక్షణే లక్ష్యంగా అత్యంత సంక్లిష్టతో కూడిన శాస్త్ర చికిత్స మీద దృష్టి పెట్టి విజయవంతం చేశామన్నారు. కణితిని తొలగించినానంతరం రోగి పుర్రెను పునర్ నిర్మించామని, స్కిన్ గ్రాఫ్ట్లు, ఫ్లాప్స్ టిష్యూ ఎక్స్ పాండర్ను రోగి తొడ నుంచి కణజాల భాగాన్ని ఉపయోగించి నెత్తిన చర్మం సైతం పునర్నిర్మించామని పేర్కొంటూ, ఈ ప్రక్రియలో మెటాస్టాటిక్ ఊపిరితిత్తుల నాడ్యూల్ కూడా తొలగించాల్సి వచ్చిందన్నారు. సూర్య రక్షణ, నెత్తి మీద పరిశుభ్రత కోసం రోగికి క్రమం తప్పకుండా ఫాలోఅప్ అవసరం అని, పుర్రె మరమ్మతు నుంచి జుట్టును మోసే తల పునర్నిర్మాణం వరకు ప్రతి దశ చాలా జాగ్రత్తతో, పక్కా ప్రణాళిక, విధానాలు, సమన్వయంతో తమిళనాట విజయవంతం చేశామన్నారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని సిమ్స్ చైర్మన్ డాక్టర్రవి పచ్చముత్తు అభినందించారు. -
టీఆర్ బాలుకు సతీవియోగం
సాక్షి, చైన్నె : డీఎంకే కోశాధికారి, సీనియర్ ఎంపీ టీఆర్బాలు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సతీమణి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజ తల్లి రేణుకా దేవి (79) చైన్నెలో మంగళవారం కన్నుమూశారు. ఈ సమాచారంతో టీఆర్ బాలు నివాసానికి సీఎం స్టాలిన్ చేరుకుని రేణుకాదేవి పార్తీవ దేహానికి నివాళులర్పించారు. ఇది వరకు డీఎంకే పార్లమెంటరీ నేతగా, ప్రస్తుతం డీఎంకే కోశాధికారిగా , సీనియర్ ఎంపీగా అందరికి టీఆర్బాలు సుపరిచితులు. ఆయనకు రాజకీయంగానే కాకుండా, కుటుంబ పరంగా సతీమణి రేణుకాదేవి అండగా ఉండే వారు. ఈ దంపతుల తనయుడే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా టీఆర్బీ రాజ వ్యవహరిస్తున్నారు. గత కొంత కాలంగా రేణుకాదేవి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ వచ్చారు. చైన్నెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోచికిత్స పొందుతూ వచ్చిన ఆమె మంగళవారం ఉదయం తుది శ్వాసను విడిచారు. ఆమె భౌతికకాయాన్ని టీ నగర్లోని నివాసానికి తరలించారు. ఈ సమాచారంతో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, డీఎంకే వర్గాలు, పలువురు మంత్రులు టీనగర్లోని నివాసానికి చేరుకున్నారు. ఆమె పార్తీవ దేహానికి నివాళుర్పించారు. టీఆర్బాలును, రాజను సీఎం స్టాలిన్ ఓదార్చారు. టీఆర్బాలుకు తోడు నీడగా ఉంటూ వచ్చిన రేణుకాదేవి సేవను గుర్తుచేస్తూ నివాళుర్పించారు. -
పోలీస్ ఫ్యామిలీ ఫస్ట్లుక్ విడుదల
తమిళసినిమా: ఆన్ ది టేబుల్ ప్రొడక్షన్న్స్ పతాకంపై మలైసామి ఏఎం.రాజా నిర్మిస్తున్న చిత్రం పోలీస్ ఫ్యామిలీ. పరుత్తివీరన్ శరవణన్, కాదల్ సుకుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో ముంబయికి చెందిన సురేఖ, నిషాదుబై కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలోని ఒక కీలక పాత్రను నిర్మాత మలైసామి, ఏఎం.రాజా పోషించారు. దీనికి బాలు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు దర్శకత్వం వహించిన పగై మిరల్ చిత్రం త్వరలో విడుదల కానుంది. కాగా పోలీస్ ఫ్యామిలీ చిత్రం వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నిర్మాత మలైసామి ఏఎం.రాజా పేర్కొంటూ ఇది ఎమోషన్తో కూడిన సస్పెన్న్, క్రైమ్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ చిత్రం ముఖ్యంగా పోలీసులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, వారి కుటుంబసభ్యులకు ఎదురయ్యే ఇబ్బందులు వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రం ఇదన్నారు. ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను దర్శకుడు శశికుమార్, పాండిరాజత, పరుర్తువీరన్ శరవణన్, వెట్రి, కాళీవెంకట్, చాయాగ్రాహకుడు పీజీ.ముత్తయ్య సినీ ప్రముఖులు ఆన్లైన్ ద్వారా విడుదల చేశారని చెప్పారు. షూటింగ్ పూర్తి అయ్యిందని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు. -
పళనికి ఊరట
సివిల్ కోర్టు విచారణపై హైకోర్టు స్టే సాక్షి, చైన్నె : తన ఎంపికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణ నుంచి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి కె పళణి స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. సిటీ సివిల్ కోర్టు విచారణకు తాత్కాలికంగా స్టే విధిస్తూ మద్రాసు హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా 2022లో పళణి స్వామి ఎంపికై న విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ఈకేసును దాఖలు చేసిన వ్యక్తికి అన్నాడీఎంకేతో సంబంధం లేదంటూ పళణి స్వామి తరపున రిట్పిటిషన్ దాఖలైంది. తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ను తిరస్కరించాలని కోరారు. ఈ పిటిషన్ ఇటీవల విచారణకు వచ్చింది. వాదన అనంతరం పళణి స్వామి వాదనను కోర్టు తిరస్కరించింది. పళణి ఎంపికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణకు న్యాయమూర్తి నిర్ణయించారు. సిటీ సీవిల్ కోర్టు నిర్ణయం అన్నాడీఎంకే వర్గాల్ని కలవరంలో పడేశాయి. పళణి స్వామి ప్రధాన కార్యదర్శి ఎంపిక విషయంగా విచారణను ఎదుర్కోవాల్సి రావడటంతో ఇది ఎన్ని మలుపులకు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తూనే, మరో వైపు ప్రజా చైతన్య యాత్రలో పళణి స్వామి దూసుకెళ్తున్నారు. నాలుగో విడత పర్యటనకు సైతం సన్నద్దం అయ్యారు. ఈ న్యాయ పోరాటంలో భాగంగా హైకోర్టులో సివిల్ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పళణి స్వామి దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. వాదన అనంతరం పళణి స్వామికి ఊరట కలిగించే విధంగా సిటీ సివిల్ కోర్టు విచారణకు స్టే విధిస్తూ న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేశారు. అన్బుమణికి నోటీసు సాక్షి, చైన్నె : పీఎంకేలో సాగుతున్న వార్లో భాగంగా తనయుడు అన్బుమణికి తండ్రి రాందాసు నోటీసు పంపించారు. పార్టీ పరంగా ఆయనపై క్రమ శిక్షణ చర్యలు తప్పదన్న చర్చ జోరందుకుంది. పీఎంకేలో తానంటే తాను అధ్యక్షుడ్ని అని రాందాసు, అన్బుమణి ప్రకటించుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి నేతృత్వంలో వేర్వేరుగా సర్వ సభ్య సమావేశాలు నిర్వహించారు. ఇందులో 2026 ఆగస్టు వరకు తానే అధ్యక్షుడ్ని అని, తనతోపాటూ నిర్వాహకులు కొనసాగుతారని అన్బుమణి ప్రకటించుకున్నారు. అదే సమయంలో పీఎంకేలో సర్వాధికారాలు తనకు మాత్రమే ఉన్నాయని, పార్టీ చట్ట ప్రకారం సవరణలతో తానే వ్యవస్థాపకుడిగా, అధ్యక్షుడిగా వ్యవహరిస్తానని రాందాసు స్పష్టం చేశారు. అదే సమయంలో రాందాసు నేతృత్వంలో జరిగిన సర్వ సభ్యం భేటీలో వ్యూహాత్మకంగా క్రమ శిక్షణ కమిటీకి అన్బుమణి చర్యలను పంపించారు. ఆయన తీరును కమిటీ పరిశీలించి, నోటీసులు జారీకి నిర్ణయించింది. దీంతో అన్భుమణి ముందు 16 ఆరోపణలు ఉంచారు. ఈనెల 31వ తేదీ నాటికి సమాధానం ఇవ్వాలని పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడైన రాందాసు అన్బమణికి హుకుం జారీ చేశారు. ఈ నోటీసులకు అన్బుమణి సరిగ్గా స్పందించేనా అన్న చర్చ ఊపందుకుంది. ఈ దృష్ట్యా, పీఎంకే లో అన్బుమణిపై క్రమ శిక్షణ చర్య తప్పదన్న చర్చ జోరందుకుంది. రూ. 2.3 కోట్ల విలువైన బంగారం స్వాధీనం అన్నానగర్: చైన్నె విమానాశ్రయంలో మంగళవారం దుబాయ్ నుంచి విమానంలో అక్రమంగా తరలించిన రూ.2.3 కోట్ల విలువైన 2.5 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాలో పాల్గొన్న ముగ్గురు ప్రయాణికులు, విమానాశ్రయ కాంట్రాక్ట్ ఉద్యోగిని మరో విమానంలో శ్రీలంకకు పారిపోవడానికి యత్నించిన వారిని కస్టమ్స్ విభాగం ఆకస్మికంగా అరెస్టు చేసింది. ఈ ఘటన విమానాశ్రయ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది. -
ఇది సాధ్యమేనా..?
తమిళసినిమా: లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కించిన కూలీ చిత్రం ఇటీవలే విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అంతకుముందు కమలహాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ చిత్రం సాధించింది. ఇప్పుడు కమలహాసన్, రజినీకాంత్ హీరోలుగా మల్టీస్టారర్ చిత్రం చేయడానికి లోకేష్ కనకరాజ్ సన్నాహాలు చేస్తున్నారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇది సాధ్యమేనా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. కమలహాసన్ రజనీకాంత్ చిరకాల మిత్రులు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వీరిద్దరూ కలిసి 1975లో అపూర్వ రాగంగళ్ చిత్రంలో కలిసి నటించారు. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో మొత్తం 21 చిత్రాలను కలిసి చేశారు. కమలహాసన్, రజనీకాంత్ కలిసి చివరిగా 1979లో అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత కొందరు దర్శకులు వీరి కాంబోలో చిత్రం చేయాలని ప్రయత్నించినా, అది కార్యరూపం దాల్చలేదు. అలాంటిది సుమారు 46 ఏళ్ల తర్వాత కమలహాసన్, రజనీకాంత్ను ఓకే చిత్రంలో నటింపజేయడానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం. ఈ చిత్రాన్ని నటుడు కమలహాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈయన విక్రమ్ చిత్రానికి ముందే తన బ్యానర్లో రజనీకాంత్ తో కలిసి చిత్రం చేయడానికి ప్రయత్నించారనీ, అయితే అది సెట్ కాలేదని ప్రచారం జరిగింది. తాజాగా ఇద్దరు ఓల్డ్ గ్యాంగర్స్ ఇతివృత్తంతో సాగే కథా చిత్రంలో కమలహాసన్, రజనీకాంత్ను నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. రజనీకాంత్, కమలహాసన్, లోకేష్ కనకరాజ్ -
● కోయంబేడు – పట్టాభిరాం మధ్య సేవలు ●తొలి విడతగారూ. 2,442 కోట్లు కేటాయింపు
మెట్రో విస్తరణకు ఆమోదం సాక్షి, చైన్నె: కోయంబేడు నుంచి ఆవడి మీదుగా పట్టాభిరాం వరకు మెట్రో రైలు సేవలకు సంబంధించిన సమగ్రనివేదిక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మార్గంలో పనులకు రూ. 2,442 కోట్లు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులను అధికారులు జారీ చేశారు. వివరాలు.. చైన్నెలో ప్రస్తుతం విమానాశ్రయం నుంచి ఆలందూరు – కోయంబేడు మీదుగా సెంట్రల్కు, సెయింట్ తామస్ మౌంట్ నుంచి ఆలందూరు – అన్నా సాలై మీదుగా విమ్కో నగర్కు మెట్రో రైలు సేవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు ఈ మార్గాలలో సుమారు మూడు లక్షల మంది వరకు రైలు సేవలను పొందుతున్నారు. అలాగే, ఫేజ్ 2 లో 119 కి.మీ దూరం మాదవరం – సిరుచ్చేరి, మాదవరం – షోళింగనల్లూరు, పూందమల్లి – లైట్ హౌస్ మధ్య మెట్రో రైలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులన్నీ 2028లో ముగించేందుకు కార్యచరణ సిద్ధం చేశారు. అదే సమయంలో చైన్నె విమానాశ్రయం నుంచి కిలాంబాక్కం వరకు, కోయంబేడు నుంచి ఆవడి మీదుగా పట్టాభిరాం వరకు, పూందమల్లి నుంచి పరందూరు వరకు రైలు సేవలను పొడిగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ వేదికగా ప్రకటన కూడాచేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను మెట్రో యాజమాన్యం రూపకల్పన చేస్తూ వస్తోంది. ఇందులో కోయంబేడు నుంచి పట్టాభిరాం వరకు సుమారు 22 కి.మీ దూరం మెట్రో పనులకు కార్యాచరణ సిద్ధంచేశారు. కోయంబేడు నుంచి తిరుమంగళం – మొగపేర్ మీదుగా పాడి, అంబత్తూరు, తిరుముల్లై వాయిల్, ఆవడి మీదుగా పట్టాభిరాం వరకు పనులకు నిర్ణయించారు. అంబత్తూరు ఎస్టేట్, ఆవడి బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటూ ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానించే విధంగా పనులకు సంబంధించిన నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించారు. దీనికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో పాటూ తొలి విడత పనులకు రూ. 2,442 కోట్లు కేటాయించింది. త్వరంలో ఈ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పనులు మొదలు కాగానే, పూందమల్లి – పరందూరు, విమానాశ్రయం – కిలాంబాక్కం పనులకు ఆమోద ముద్ర వేయబోతున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
క్రీడలతో చెడు అలవాట్లు దూరం
–మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ తిరువళ్లూరు: క్రీడలతో చెడు అలవాట్లకు దూరంగా ఉండొచ్చని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ సూచించారు. తిరువళ్లూరు జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు మంగళవారం ఆవడిలోని పోలీసు క్రీడామైధానంలో జరిగాయి. పోటీలను మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్, పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి ప్రారంబించారు. మంత్రి నాజర్ మాట్లాడుతూ విద్యార్థి దశలో క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యం పెరిగి ఆరోగ్యవంతంగా వుండడంతోపాటు చెడు అలవాట్లకు దూరంగా ఉండొచ్చన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చి క్రీడల మంత్రిగా ఉదయనిధి బాధ్యతలు చేపట్టిన తరువాతే రాష్ట్రంలో మెరుగైన క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించడం పెరిగిందన్నారు. గత ఏడాది క్రీడల కోసం రాష్ట్ర ప్రభుత్వంరూ.200కోట్లు కేటాయించిదన్నారు. తమ ప్రోత్సాహంతోనే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్ట వచ్చిందన్నారు. అనంతరం పోటీల్లో విజయం సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఆవడి మేయర్ ఉదయకుమార్, సీఈఓ మోహన పాల్గొన్నారు. -
రవాణా ఉద్యోగులకు రూ. 1,137 కోట్ల కేటాయింపు
ఉత్తర్వుల జారీ సాక్షి, చైన్నె :రవాణా ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు అందించేందుకు వీలుగా రూ.1,137 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం జారీ అయ్యాయి.2023, 2024లో పదవీ విరమణ చేసిన వారికి ఈ మొత్తాన్ని వర్తింప చేశారు. వివరాలు.. రాష్ట్రంలో వివిధ డివిజన్లుగా రవాణా సేవలు సాగుతున్న విషయం తెలిసిందే. సుమారు లక్షన్నర మంది ఈ శాఖలో పనిచేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన నినాదంతో తరచూ ఆందోళనలు చేస్తూవస్తున్నారు. సమ్మే గంటకు సిద్ధమైనప్పుడల్లా వీరితో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరపడం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితులో కార్మికుల విజ్ఞప్తులకు అనుగుణంగా వారికి పదవీ విరమణ సహా తక్షణ ప్రయోజనాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. 2023లో రవాణా రంగం నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు యోజనాల నిమిత్తం రూ.265 కోట్లు, 2024 ఏప్రిల్నుంచి 2025 జనవరి వరకు కాంట్రిబ్యూటరి రిటైర్మంట్ పథకం కింద పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు నగదు ప్రయోజనాల చెల్లింపునకు రూ. 40 కోట్లు , 2023 నుంచి 2025 వరకు పదవీ విరమణ చేసిన వారి ప్రయోజనాల నిమిత్తం రూ. 2,450 కోట్లు కేటాయించాలని రవాణా శాఖ నుంచి ప్రభుత్వానికి నివేదిక చేరింది. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం 2023–2024 సంవత్సరానికి గాను తొలి విడతగా రూ. 1,137 కోట్లను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని విడుదల చేస్తూ, ఆయా డివిజన్లకు కేటాయించాల్సిన నిధుల సమగ్ర వివరాలను ప్రకటించారు. -
క్లుప్తంగా
రవాణా కార్మికుల నిరసన – 200 మంది అరెస్టు కొరుక్కుపేట: చైన్నె ట్రాన్స్పోర్ట్ యూనియన్, తమిళనాడు రిటైర్డ్ పేరెంట్స్ రిటైర్మెంట్ హోమ్ ఆర్గనైజేషన్కు చెందిన 3,500 మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులు గత 7 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. గత 12 నెలల బకాయిలు, 2003 తర్వాత ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు పెన్షన్ పథకం, పదవీ విరమణ చేసిన వారికి తక్షణ వైద్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీఐడీ ట్రేడ్ యూనియన్ సభ్యులు చింతాద్రి పేట పల్లవన్ ఇల్లం లో నిరసన తెలిపారు. నిరసన తెలిపేందుకు అనుమతి లేదని, నిరసనలో పాల్గొనకూడదని చెబుతూ పోలీ సులు వారిని అరెస్టు చేశారు. మూడు ప్రదేశాల్లో 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కార్మికులు మాట్లాడుతూ చట్టబద్ధమైన డిమాండ్ల కోసం ఒత్తిడి తీసుకురావడానికే తాము నిరసన తెలిపేందుకు వచ్చామని, అయితే పోలీసులు తమపై అణచివేత విధానాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. రోడ్డుకు మరమ్మతులు చే యాలని ఆందోళనకొరుక్కుపేట: చైన్నెలోని వ్యాసార్పాడి రోడ్డులోని నెహ్రూ నగర్ ప్రాంతంలోని 46వ వార్డులో రోడ్డు వేయడానికి పాత రోడ్డును అధికారులు తవ్వారు. అయితే తర్వాత దాన్ని పట్టించుకోలేదు. దీంతో వర్షాల వల్ల రోడ్డు దెబ్బతింది. దీనిపై ప్రజలు అనేకసార్లు అధికారులను సంప్రదించారు. అధికారులు ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో, మంగళవారం ఉదయం వ్యాసర్పాడి సత్యమూర్తి నగర్ ప్రధాన రహదారిపై 50 మందికి పైగా ప్రజలు ఒక్కసారిగా రోడ్డును దిగ్భందించారు. సమా చారం అందుకున్న వ్యాసార్పాడి సబ్–ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్, మెట్రో వాటర్ అసిస్టెంట్ ఇంజినీర్ సూర్య ప్రకాష్, కార్పొరేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలతో చర్చలు జరిపారు. రోడ్డు మరమ్మతులు చేస్తా మని అధికారులు హామీ ఇవ్వడంతో ప్రజలు వెళ్లిపోయారు. విద్యార్థులకు ప్రత్యేక బస్సులు కొరుక్కుపేట: చైన్నెలో 25 పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. తమిళనాడు అంతటా విద్యార్థులు తమ నివాస స్థలాల నుంచి విద్యా సంస్థలకు రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి దీనిని ప్రారంభించారు. ఈ పథకాన్ని రాష్ట్రం అంతటా 34,12,147 మంది విద్యార్థులకు, చైన్నెలో 4లక్షల30 వేలమంది విద్యార్థులకు అమలు చేస్తున్నారు. ఈ సందర్భంలో చైన్నెలోని ట్రిప్లికెన్లోని లేడీ వెల్లింగ్టన్ కళాశాల ప్రాంగణంలో బస్ ట్రావెల్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పాల్గొని విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ కార్డులను పంపిణీ చేశారు. రవాణా, విద్యుత్ శాఖమంత్రి ఎస్సీ శివశంకర్ పాల్గొన్నారు. యువతికి లైంగిక వేధింపులు తిరువొత్తియూరు: చైన్నె, మడిపాక్కంలో డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్న సమయంలో లైంగిక వేధింపులకు గురిచేసిన డ్రైవింగ్ స్కూల్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె మడిపాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలోని 24 ఏళ్ల యువతి ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. ఆమె ద్విచక్ర వాహనం నడపడం నేర్చుకోవడానికి మడిపాక్కం రామ్నగర్లో నడుస్తున్న డ్రైవింగ్ స్కూల్లో చేరారు. మంగళవారం పని ముగించుకుని తన తండ్రితో కలిసి డ్రైవింగ్ స్కూల్కు వెళ్లారు. ద్విచక్ర వాహనం నడపడంలో శిక్షణ ఇస్తానని చెప్పి, దాని యజమాని మడిపాక్కం రామ్నగర్కు చెందిన గోపాలకృష్ణన్ (60), ఆమెను వేళచ్చేరి రైల్వేస్టేషన్ సమీపంలోని రహదారికి తీసుకెళ్లాడు. అక్కడ శిక్షణ ఇస్తున్నట్లుగా నటిస్తూ ఆమెకు లైంగిక వేధింపులు ఇచ్చాడు. వెంటనే ఆ యువతి ద్విచక్ర వాహనం దిగి పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించింది. దీంతో గోపాలకృష్ణన్ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆ మహిళను రక్షించి ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మడిపాక్కం మహిళా పోలీసులు గోపాలకృష్ణన్పై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ సమయంలో గోపాలకృష్ణన్ శిక్షణ పేరుతో లైంగిక వేధింపులు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో గోపాలకృష్ణపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. సహాయకాల పంపిణీ పళ్లిపట్టు: అన్నాడీఎంకే శశికళ వర్గీయులు ఆర్కేపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పేదలకు సహాయకాలు, బిర్యానీ పంపిణీ చేశారు. శశికళ పుట్టిన సందర్భంగా ఆర్కేపేట బీడీఓ కార్యాలయం సమీపంలో మంగళవారం అన్నాడీఎంకే శశికళ వర్గీయులు సహాయకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే నరసింహన్ హాజరై ఎంజీఆర్, జయలలిత చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం పేదలకు చీరలు, లుంగీలు అందజేశారు. అందరికీ బిర్యానీ పంపిణీ చేశారు. నేతలు రజిని, నటరాజన్. చంద్రన్, రాజానగరం శేఖర్, కుమారస్వామి, వంగనూరు కందప్పన్, హరిరాజు, పారి, గిరిరాజు, ఆనందన్ పాల్గొన్నారు. -
రోగి లేని అంబులెన్స్ను పంపి.. నీచ రాజకీయాలు
వేలూరు: అన్నాడీఎంకే కార్యకర్తలను బెదిరించేందుకే రోగి లేని అంబులెన్స్లను తమ ప్రచార సభలోకి పంపారని ప్రతిపక్ష నేత అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళణిస్వామి అన్నారు. వేలూరు జిల్లా అనకట్టు నియోజక వర్గంలో సోమవారం రాత్రి ప్రచార సభ నిర్వహించారు. ఆ సమయంలో 108 అంబులెన్స్ వాహనం కార్యకర్తల మధ్యలో అతి వేగంగా వచ్చి ఎడపాడి మాట్లాడుతున్న పక్కనే వెళ్లింది. ఆ సమయంలో ఎడపాడి మాట్లాడుతూ డీఎంకే ఉద్దేశ పూర్వకంగానే తాను చేస్తున్న ప్రచార సభలోకి అంబులెన్స్లను పంపి అంతరాయం కలిగించాలని డీఎంకే నీచమైన రాజకీయాలు చేస్తోందని, ఎన్ని అంబులెన్స్లు పంపినా తమను ఏమీ చేయలేరన్నారు. తాను చేసిన 30 ప్రచార సభలోను ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. మరొక ప్రచార సభలో అంబులెన్స్ వస్తే వాటిని నడిపే డ్రైవరే అందులో రోగిగా వెళ్తారని అన్నారు. ప్రతి పక్ష పార్టీలకు చెందిన సమావేశాలకు పోలీసులు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనకట్టు నియోజక వర్గం అన్నాడీఎంకే కోటగా ఉందన్నారు. ప్రస్తుతం పంపిన అంబులెన్స్లో రోగులు ఎవరూ లేదని అయినప్పటికీ రోగిని తీసుకొచ్చే విధంగానే వెళ్తుందన్నారు. గత ఐదు సంత్సరాల కాలంలో డీఎంకే ప్రజలకు ఎటువంటి పథకాలు కల్పించలేదన్నారు. తాము ప్రవేశ పెట్టిన పథకాలను పూర్తిగా నిలిపి వేశారని అయినప్పటికీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని కొనసాగిస్తామన్నారు. కరోనా కాలంలోనూ తాము ఎటువంటి ధరలు పెంచకుండా ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. అంబులెన్స్ డ్రైవర్పై దాడికి దిగిన కార్యకర్తలు: ప్రచార సభసమయంలో వచ్చిన 108 అంబులెన్స్ డ్రైవర్పై కార్యకర్తలు దాడికి దిగారు. ఆ సమయంలో అంబులెన్స్లో రోగులు లేనప్పటికీ కావాలనే ఎందుకు తీసుకొచ్చారని నిలదీశారు. అనంతరం అతని గుర్తింపు కార్డును తీసి పరిశీలించినట్లు తెలిసింది. డ్రైవర్ను బెదిరించడం సరికాదు: మంత్రి సుబ్రమణియన్ వేలూరు జిల్లా అనకట్టులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి అడుక్కంబరైలోని ప్రభుత్వ ఆసుపత్రికి రోగిని తీసుకెళ్లేందుకు అత్యవసరంగా వెలుతున్న అంబులెన్స్ డ్రైవర్ను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ చైన్నెలో విలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డారు. -
పుట్టిన బిడ్డకు తల్లిపాలే ఆరోగ్యకరం
వేలూరు: పురిటి బిడ్డలకు తల్లిపాలు ఇవ్వడమే తల్లులకు అందమని పల్లిగొండ రోటరీ అసోసియేషన్ సభ్యులు జోసెఫ్ అన్నయ్య అన్నారు. ప్రపంచ తల్లిపాల దినోత్సవ వారోత్సవాల్లో బాగంగా వేలూరు జిల్లా పల్లిగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బిడ్డ తల్లులకు పల్లిగొండ రోటరీ అసోసియేషన్ అద్యర్యంలో కిట్లు పంపిణీ కార్యక్రమం సంఘం అధ్యక్షులు సుందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి తల్లి వారి పిల్లలకు ఆరు నెలల వరకై నా తల్లిపాలను ఇవ్వాలని డాక్టర్లు తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. తల్లి పాలతోనే చిన్నారులకు మంచి పౌష్టిక శక్తితో పాటు ఆరోగ్యంగానూ ఉంటారన్నారు. ప్రస్తుత కాలంలో పురుషులతో పాటూ మహిళలు కూడా ఉద్యోగాలకు వెళ్లడంతో చిన్నారులకు తల్లి పాలను ఇవ్వడంలో కాస్త ఇబ్బందులున్నాయన్నారు. అదేవిధంగా కొంత మంది తల్లులు తల్లి పాలు ఇవ్వడం ద్వారా అందం చెడిపోతుందని పాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, అటువంటి భ్రమలన్నీ వదిలి పెట్టాలన్నారు. తల్లి పాలలో ఎంతో శ్రేయష్కరం ఉంటుందన్నారు. దేశంలో తల్లి పాలు ఇచ్చేవారి సంఖ్య తగ్గుతూ వస్తుందని వీటిపై గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించాలన్నారు. డాక్టర్ బాలచందర్ మాట్లాడుతూ పుట్టిన అర్ధగంటలోనే తల్లి ముర్రుపాలను ఇవ్వడం ద్వారా పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ కుమరగురు, అసోసియేషన్ కార్యదర్శి అక్బర్, కోశాధికారి కోవేందన్, ఉపాధ్యక్షులు చక్రవర్తి, జయసింహన్ పాల్గొన్నారు. -
వీధి కుక్కలకు కు.ని ఆపరేషన్లు
వేలూరు: వేలూరు కార్పొరేషన్లోని 60 వార్డుల్లోని 32 వేల వీధి కుక్కలకు కు.ని ఆపరేషన్లు చేయనున్నట్లు మేయర్ సుజాత అన్నారు. మంగళవారం ఉదయం వేలూరు పాలారు సమీపంలోని వెటర్నరీ వైద్యులతో ఈ ఆపరేషన్లను ఎమ్మెల్యే కార్తికేయన్ ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ వేలూరు కార్పొరేషన్ పరిధిలోని వీధి కుక్కలు అధికంగా ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతోపాటు కుక్కలు కరిస్తే రేబిస్ వ్యాఽధి మనిషికి సోకి వెంటనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో కార్పొరేషన్ పూర్తిగా వీధి కుక్కలకు గత మే మాసంలో పిచ్చికుక్కలకు ఇంజెక్షన్లు వేశారన్నారు. ప్రస్తుతం వీధి కుక్కలకు కు.ని ఆపరేషన్లు చేయాలని కలెక్టర్ ఆదేశించడంతో వీటిని ప్రారంభించామన్నారు. ఆపరేషన్లను వేలూరు కార్పొరేషన్, వెటర్నరీ, తిరిచ్చికి చెందిన ప్రయివేటు స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా చేయనున్నట్లు తెలిపారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 32 వేల వీధి కుక్కలు, గ్రామీణ ప్రాంతాల్లో 15 వేలకు పైగా వీధి కుక్కలున్నట్లు గుర్తించామన్నారు. ఈ ఆపరేషన్లను కార్పొరేషన్లోని మొత్తం 60 వార్డుల్లోను ఆయా ప్రాంతాలకు వెటర్నరీ డాక్టర్లు వెళ్లి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు స్థానికులు సహకరించాలన్నారు. పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ తిరుకుమరన్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. -
అల్యూమినియం తయారీ కేంద్రంగా తమిళనాడు
సాక్షి, చైన్నె: దేశంలోనే అల్యూమినియం తయారీకి అత్యంత ముఖ్యమైన కేంద్రాల్లో ఒకటిగా తమిళనాడు అవతరించిందని అల్యూమినియం ఎక్స్ట్రూషన్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జితేంద్ర చోప్రా ప్రకటించారు. మంగళవారం చైన్నెలో జరిగిన కార్యక్రమంలో అలుమెక్స్ ఇండియా 2025 ఎక్స్ పో గురించి వివరాలను ప్రకటించారు. అల్యూమినియం ఎక్స్ట్రూషన్ పరిశ్రమలో తమిళనాడు ఒక పవర్హౌస్గా అవతరించిందన్నారు. ప్రపంచ అవకాశాలను ప్రదర్శించడానికి ఎఎల్యూఎంఈఎక్స్ ఇండియా 2025 వేదిక కానున్నట్టు వివరించారు. తమిళనాడు షీట్లు, కాయిల్స్, ఎక్స్ట్రూషన్లు, ప్రత్యేక ఉత్పత్తులు, ఆటోమోటివ్, నిర్మాణం వంటి పరిశ్రమలకు సేవలు అందిస్తాయన్నారు. అల్యూమినియం రంగంలో తమిళనాడు పాత్రను అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తించిందని, పరిశ్రమ భవిష్యత్తు. అల్యూమినియం ఉత్పత్తి విస్తృతం కోసం భారతదేశంలో తొలి ఎక్స్పో సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు న్యూఢిల్లీలో జరగనున్నట్టు ప్రకటించారు. అల్యూమినియం వాల్యూ చైన్ నుంచి 200 కంటే ఎక్కువ ఎగ్జిబిటర్లు, 12,000 కంటే ఎక్కువ వ్యాపార సందర్శకులు తరలిరాబోతున్నారని ఈసందర్భంగా జితేంద్ర చోప్రా ధీమా వ్యక్తంచేశారు. పెట్టుబడులు చైన్నె, ఎన్నూర్ , తూత్తుకుడి ఓడ రేవులతో ఇక్కడి ఉత్పత్తి దారులకు బాకై ్సట్ దిగుమతులు, పూర్తయిన ఖనిజాల ఎగుమతులు రెండింటికీ సమర్థవంతమైన లాజిస్టిక్స్ ప్రయోజనం మరింతగా దక్కబోతున్నట్టు ఆయన వివరించారు. -
ప్రజాస్వామ్యబద్ధంగా.. ముందడుగు
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం సైనికులంతా ఆర్మీ క్రమ శిక్షణతో ప్రజా స్వామ్య బద్దంగా ముందడుగు వేద్దామని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ పిలుపు నిచ్చారు. మదురైలో జరగనున్న మహానాడుకు గర్భిణులు, చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు రావద్దు అని విన్నవించారు. మధురై వేదికగా తమిళగ వెట్రి కళగం 2వ మహానాడుకు భారీ ఏర్పాట్లు ముగింపు దశలో ఉన్న విషయం తెలిసిందే. 21వ తేదీన జరగనున్న ఈ మహానాడును 2026 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ తరపున సమర శంఖం పూరించే వేదికగా ఈ మహానాడును ఎంపిక చేశారు. ఈ బ్రహ్మాండ వేడుకకు మంగళ, బుధవారం మాత్రమే సమయం ఉంది. గురువారం జరగనున్న ఈ వేడుకకు పెద్ద ఎత్తున జన సమీకరణ కసరత్తు జరుగుతున్నాయి. విజయ్ వెన్నంటి ఉన్న యువ సమూహం మదురైకు కదిలేందుకు సన్నద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో మహానాడుకు సంబంధించి కేడర్కు విజయ్ సోమవారం లేఖ రాశారు. మహానాడుకు సంబంధించి ఇది రెండవ లేఖ అని పేర్కొంటూ, తమిళ ప్రజల ప్రేమ, అభిమానులు, గొప్ప ఆదరణతో ఎన్నికల రాజకీయ కదనరంగంలో మనం అంటే ఏమిటో నిరూపించుకునే సమయం ఆసన్నమైందన్నారు. అటు పోట్లను ఎదుర్కొని ముందుకు సాగామని గుర్తు చేస్తూ, మరికొన్ని నెలలు ఎన్నికల సమరం జరగబోతోందన్నారు. 1967, 1977 ఎన్నికల ఫలితాల చరిత్రను మళ్లీ చూసే దిశగా 2026 ఎన్నికలు కాబోతున్నాయన్నారు. తమిళనాడు ప్రజలు ఎంతో అభిమానించే ఈ విజయ్ గురించి అందరికీ బాగా తెలుసునని పేర్కొంటూ, నిజాయితీగా, నాగరికంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తన రాజకీయ వ్యవహార శైలి ఉంటుందని వివరించారు. ఆ దిశగా తమిళగ వెట్రి కళగం సైనికులు ఆర్మీలో ఏ విధంగా క్రమ శిక్షణతో ఉంటారో,అ దే తరహాలో ముందడుగు వేద్దామని పిలుపు నిచ్చారు. మదురైలో జరగనున్న మహానాడును జయప్రదం చేసుకుంద్దామని పిలుపునిస్తూ, ఈ మహానాడుకు దయ చేసి గర్భిణి మహిళలు, చంటి బిడ్దల తల్లులు, వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులను తీసుకు రావద్దని కోరారు. వారికి తాను ఒకే విజ్ఞప్తి చేస్తున్నానని, తన మీద అభిమానం ఉంటే, ఇంటి వద్ద నుంచి ప్రత్యక్షప్రసార ఏర్పాట్ల ద్వారా మహానాడును వీక్షించాలని విన్నవించారు. అందరి భద్రత, ఆరోగ్య క్షేమం తనకు ముఖ్యం అని వివరిస్తూ, మహానాడు ముగిసినానంతరం కేడర్ అంతా క్రమ శిక్షణతో స్వస్థలాలకు బయలు దేరి వెళ్లాలని, ప్రజల ప్రయోజనాలను కాంక్షించే విధంగా కేడర్ అడుగులు ఉండాలే గానీ, వారికి ఆటంకం కలిగించే పరిణామాలు అన్నది ఉండ కూడదని, ఇందుకు చోటు లేదని స్పష్టం చేశారు. -
కల నెరవేరింది!
సాక్షి, చైన్నె: చైన్నె రాయపురం మండలంలోని భోజరాజన్ నగర్లో కొత్తగా నిర్మించిన సబ్ వేను ప్రజాపయోగానికి తీసుకొచ్చారు. సోమవారం దీనిని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ఆ సబ్ వే మార్గంలో నడచుకుంటూ వాహనాలు సులభంగా వెళ్లేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్తర చైన్నెలోని కొరుక్కుపేట ప్రాంతంలోని భోజరాజన్ నగర్ పరిసరాలకు మూడు వైపులా రైల్వే ట్రాక్లు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలు రోడ్డు దాటాలంటే గగనమే. రైల్వే క్రాసింగ్ను దాటక తప్పదు. అత్యవసర సమయాలలో బయటకు రావాలంటే మార్గం అన్నది లేక తీవ్ర అవస్థలు పడుతుంటారు. ఈ రైల్వే క్రాసింగ్లలో గూడ్స్ రైళ్లు కొన్ని గంటల తరబడి ఆగితే చాలు, వాటి కింది భాగం నుంచి దూరి రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి. ఇటు వైపుగా బస్సులు,ఆటోలు కూడా వెళ్లవు. మూడు వైపులా ఉన్న రైల్వే క్రాసింగ్ నుంచి తమకు విముక్తి కలిగించే ప్రయాణ మార్గం సుగమం చేయాలని దీర్ఘ కాలంగా భోజరాజన్ నగర్ పరిసరాలకు చెందిన ప్రజలు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. రూ. 30.13 కోట్లతో.. ఉత్తర చైన్నెలోని రాయపురంమండలం పరిధిలో ఉన్న ఈ భోజరాజన్ నగర్ పరిసరాలలోని సాధారణ ప్రజలతో సహా , వాహన దారులు దీర్ఘకాల ఎదురు చూస్తూ వచ్చిన సబ్ వే మార్గం ప్రస్తుతం నెరవేరింది. పరిమిత వాహన సబ్ వేగా , ప్రజా ఉపయోగ సబ్వేగా 2023లో చైన్నె కార్పొరేషన్ నిధి రూ. 30.13 కోట్లతో పనులు చేపట్టారు. సొరంగం పొడవు 207 మీటర్లు (రైల్వే విభాగం 37 మీటర్లు సహా), వెడల్పు 6 మీటర్లు. అలాగే, వర్షాకాలంలో, వర్షపు నీరు నీటిని సబ్ వే నుంచి బయటకు తరలించేందుకు వీలుగా 85 హెచ్పీ మోటారు పంపులు, జనరేట్ను సైతం ఏర్పాటు చేశారు. ఈ సబ్ వేద్వారా భోజరాజన్ నగర్, శ్రీనివాసన్ నగర్, మింట్ మోర్టన్ నగర ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు లక్షన్నర మందికి ప్రయోజనకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దారు. భోజరాజన్ నగర్ సబ్ వే ను డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ప్రారంభించారు. అలాగే, ఇక్కడకు సమీపంలోని నిర్మించిన పిల్లల క్రీడా మైదానం, వాకింగ్ మార్గం తదితర పూర్తయిన నిర్మాణాలను కూడా ఉదయ నిధి స్టాలిన్ ప్రారంభించారు. సబ్వేలో నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.ఈకార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రు, పికే శేఖర్బాబు, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మేయర్ ఆర్.ప్రియ, ఎమ్మెల్యేలు ఆర్.మూర్తి, ఆర్.టి. శేఖర్, జె.జె. ఎబెనెజర్, డిప్యూటీ మేయర్ ఎం. మహేష్ కుమార్, కార్పొరేషన్ కమిషనర్ జె. కుమారగురుబరన్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ (పట్టణ ప్రణాళిక), ఇళయ అరుణ, రాయపురం జోనల్ కమిటీ చైర్మన్ పి. శ్రీరాములు, కార్పొరేటర్లు ఎస్. గీతా సురేష్, పి. వేలాంకన్ని పాల్గొన్నారు. -
కమలనాథుల్లో జోష్!
రాష్ట్రంలో 23వ తేదీ వరకు కొనసాగనున్న వర్షం కొరుక్కుపేట: రాష్ట్రంలో ఈనెల 23 వతేదీ వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని చైన్నె వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ గాలుల వేగంలో మార్పు కారణంగా, సోమవారం నుండి ఆగస్టు 23 వరకు రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల, అలాగే పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఒకటి , రెండు చోట్ల, ఉపరితల గాలులు గంటకు 50 కి.మీ వేగంతో వీచవచ్చు. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ఇది పశ్చిమ–వాయువ్య దిశగా కదిలి సోమవారం (ఆగస్టు 18) అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. తమిళనాడు తీరప్రాంతాలు, మన్నార్ గల్ఫ్, కుమారి సముద్రం, బంగాళాఖాతంలో సోమవారం, మంగళవారం (ఆగస్టు 18 , 19) రెండు రోజుల పాటూ గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు ఆ ప్రాంతాలలో చేపలు పట్టవద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది డీఎస్పీల బదిలీ కొరుక్కుపేట: రాష్ట్రవ్యాప్తంగా 12 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ శంకర్ జివాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుప్పూర్ నగర క్రైమ్ కమిషనర్గా ఉన్న చెంగ్ కుట్టువన్ను చైన్నె మెట్రోపాలిటన్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్కు, చైన్నెలోని సీఐడీలోని నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్లో డీఎస్పీగా ఉన్న రాగవిని చైన్నె మెట్రోపాలిటన్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశారు. నాగపట్నం జిల్లా క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ సెంథిల్ను చైన్నె మెట్రోపాలిటన్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్కు, తిరువల్లూరు జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డీఎస్పీగా ఉన్న మణిమేగలైయన్ను ఈఐఏ బ్రాంచ్కు, చైన్నె మెట్రోపాలిటన్ వెస్ట్ ట్రైనింగ్ సెంటర్గా ఉన్న మును స్వామిని చైన్నె మెట్రోపాలిటన్ ఈస్ట్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్కు, చైన్నె ఎకనామిక్ క్రైమ్ బ్రాంచ్ హెడ్క్వార్టర్స్ డీఎస్పీగా ఉన్న పొన్రాజ్ను చైన్నె మెట్రోపాలిటన్ ఈస్ట్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్కు బదిలీ చేశారు. ఇలాగే పలువురి డీఎస్పీలను బదిలీ చేసినట్టు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో కమలనాథులలో జోష్ నెలకొంది. పార్టీ కోసం శ్రమించే వారందరికీ అధిష్టానం తప్పకుండా ఏదో ఒక రోజు గుర్తింపు ఇస్తుందన్న భావనలో పడ్డారు. అదే సమయంలో త్వరలో రాష్ట్రానికి చెందిన మరో నేతకు గవర్నర్ పదవి దక్కబోతుందన్న సమాచారం బీజేపీ వర్గాలలో మరింత ఉత్సాహాన్ని నింపినట్లయ్యింది. సాక్షి, చైన్నె: తమిళనాట పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు పెద్దపీట వేస్తున్నామని చాటే విధంగా ప్రాజెక్టులు అమల్లోకి వస్తున్నాయి. తమిళనాడుకు చెందిన బీజేపీ నేతలకు జాతీయ స్థాయిలో పార్టీలోనే కాదు, వివిధ పదవులలోనూ స్థానం కల్పిస్తున్నారు. ఇది వరకు రాష్ట్రానికి చెందిన తమిళి సై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు అప్పగించారు. ఆమె ఎన్నికలలో పోటీ చేయాలన్న కాంక్షతో ఆ పదవికి రాజీనామా చేశారు. మరో సీనియర్ నేత ఇలగణేషన్ను గవర్నర్గా నియమించారు. నాగాలాండ్ గవర్నర్గా వ్యవహరిస్తున్న సమయంలో రెండు రోజుల క్రితం ఆయన కన్నుమూశారు. ఇక, రాష్ట్రానికి చెందిన ఎల్మురుగన్కు ఏకంగా రాజ్యసభ హోదాలో కేంద్ర సహాయమంత్రి ఎన్డీఏ 1, 2లలో సైతం దక్కాయి. అలాగే సీపీ రాధాకృష్ణన్కు తొలుత గవర్నర్ పదవి దక్కడం, తాజా పరిణామాల అత్యుత్తమంగా ఉప రాష్ట్రపతి పదవి సైతం దక్కనున్నడం తమను కూడా అందలం ఎక్కించే విధంగా అధిష్టానం ఏదో ఒక రోజు గుర్తింపు ఇస్తుందన్న ఆశాభావంతో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుకుని ఎన్నికలలో పనిచేయడానికి రాష్ట్రంలోని కమలనాథులు సన్నద్ధం అవుతున్నారు. కార్యకర్త నుంచి.. తిరుప్పూర్లో రైతు కుటుంబంలో జన్మించిన సీపీ రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయస్సు నుంచే ఆర్ఎస్ఎస్ ద్వారా తన రాజకీయ ప్రయనాన్ని కొనసాగించారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1998, 1999లో రెండు సార్లు కోయంబత్తూరులోక్ సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ మెట్లు ఎక్కారు. 2014,2019 ఎన్నికలలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. బీజేపీలో సీనియర్ నేతగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలలో నామినెటెడ్ పదవుల్లో కొనసాగారు. ఒకప్పుడు తమిళనాడు బీజేపీ అంటే సీపీరాధాకృష్ణన్, సీపీఆర్ అంటే బీజేపీ అన్నట్టుగా రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. తన కన్నా జూనియర్లు అనేక మంది రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో కీలక పదవుల్లోకి వెళ్లినా, తనకు కూడా ఏదో ఒక రోజు మంచి అవకాశం దక్కక పోదా? అని ఎదురు చూశారు. ఎట్టకేలకు సీపీఆర్ గవర్నర్ ఛాన్స్ దక్కింది. చివరకు ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతి పదవి సైతం ఆయన కోసం ఎదురు చూస్తున్నట్టుగా మద్దతు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్రం ఎంపిక చేయడం సీపీఆర్ మద్దతు దారుల్లోనే కాదు, తమిళనాడులోని సీనియర్లుగా, పదవుల కోసం ఎదురు చూస్తున్న కమలనాథులలోనూ ఆనందం, జోష్ నిండుకుంది. డీఎంకే దారి ఎటో.. తమిళనాడుకు చెందిన మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాంను రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టడంలో గతంలో డీఎంకే కీలక పాత్రనే పోషించింది. రెండో సారి ఆయనకు అవకాశం కల్పించే ప్రయత్నాలు సాగినా, పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో కలాం సున్నితంగా తిరస్కరించారు. ఈ పరిస్థితులో తమిళనాడుకు చెందిన సీపీఆర్కు ఉప రాష్ట్రపతి అయ్యే అవకాశం దక్కింది. ఇది తమిళనాడుకు గర్వకారణమే. సర్వేపల్లి రాధాకృష్ణన్ , రామస్వామి వెంకటరామన్లు ఒకప్పుడు తమిళనాడు నుంచి ఉప రాష్ట్రపతులు అయ్యారు. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత ఆ పదవికి తమిళనాడుకు చెందిన సీపీఆర్ను బీజేపీ అధిష్టానం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎంపిక చేయడం తమిళనాట రాజకీయంగాను చర్చకు దారి తీసింది. తమిళనాట పాగా వేయాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపి, అన్నాడీఎంకే కూటమి, తాజాగా డీఎంకే కూటమిని ఇరకాటంలో పెట్టేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సీఎం స్టాలిన్తో సీపీఆర్కు స్నేహబంధం ఉందని చెప్పవచ్చు. గత వారం సీఎంతో పరామర్శ భేటీ అనంతరం ముంబైకు సీపీఆర్ వెళ్లారు. ఈ పరిస్థితులో సీపీఆర్ విషయంలో డీఎంకే అడుగులు ఎలా ఉంటాయో అన్న ఎదురు చూపులు తమిళనాట పెరిగాయి. అదే సమయంలో సీపీఆర్కు మద్దతు ఇవ్వాలంటూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సీఎం స్టాలిన్తో పోన్లో మాట్లాడినట్టు సమాచారాలు వెలువడ్డాయి. రాజ్నాథ్ సింగ్ సీఎం స్టాలిన్కు సన్నిహిత నేత అన్న విషయం గమనార్హం. సర్వత్రా ఆనందం తమిళనాడు నుంచి బీజేపీకి చెందిన నేతగా తొలిసారిగా ఉప రాష్ట్రపతి పదవిని సీపీఆర్ అధిరోహించి తీరుతారన్న నమ్మకాన్ని ఆయన మద్దతు దారులే కాదు, బీజేపీలోని ప్రతి ఒక్కరూ హర్షం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి అయితే, తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సీపీఆర్ గెలుపునకు తమిళనాడులోని అందరు ఎంపీలు పార్టీలకు అతీతంగా ఓట్లు వేయాలని కోరారు. పీఎంకే నేత అన్బుమణి స్పందిస్తూ, ఉప రాష్ట్ర పతి పదవికి సీపీఆర్ అర్హుడు అని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమిలోని పార్టీల నేతలందరూ సీపీఆర్ గెలుపు ఖాయం అన్న ధీమాతో ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆనందానికి అవధులు లేదని చెప్పవచ్చు. ఆయనతో పాటూ తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ సైతం రాష్ట్రంలోని ఎంపీలందరూ పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలని పిలుపు నివ్వడం విశేషం. మరో నేతకు గవర్నర్ పదవి.. తమిళనాడుకు చెందిన ముగ్గురు బీజేపీ నేతలు ఇది వరకు గవర్నర్లుగా వ్యవహరించారు. వీరిలో తమిళి సై రాజీనామా చేయగా, ఇలగణేషన్ కాన రాని లోకాలకు వెళ్లారు. తాజాగా ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ ఎంపిక కావడంతో గవర్నర్ పదవికి రాజీనామా చేయక తప్పదు. దీంతో రెండు రాష్ట్రాలకు గవర్నర్ పదవులు ఖాళీ కానున్నాయి. అలాగే, మరికొన్ని రాష్ట్రాలలో గవర్నర్ల పదవీకాలం ముగింపు దశలో ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితులో తమిళనాడుకు చెందిన ఓ నేతకు గవర్నర్ పదవి దక్కబోతుందన్న సంకేతాలు వెలువడ్డాయి. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పొన్ రాధాకృష్ణన్ గతంలో రెండు సార్లు కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరించి ఉన్నారు. మరో నేత హెచ్ రాజ పార్టీ పదవులతో సరి, జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు దక్కే ఓ పదవి కోసం ఎ దురు చూస్తున్నారు. ఈసారి రాజాకు గవర్నర్ పదవి దక్కేందుకు అవకాశం అధికంగా ఉన్నట్టు బీజేపీలో చర్చ మొదలు కావడం గమనార్హం. -
సీఈసీకి స్టాలిన్ 7 ప్రశ్నలు
సాక్షి, చైన్నె: కేంద్ర ఎన్నికల కమిషన్కు సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం 7 ప్రశ్నలను తన సామాజిక మాధ్యమం పేజీ ద్వారా సంధించారు. ఓట్ల చోరీ అంశాన్ని గుర్తు చేస్తూ, ఈ ప్రశ్నలను లేవనెత్తారు. ఇంటింటికీ సర్వే నిర్వహిస్తామని చెబుతున్న ఈసీ తాను ప్రకటించిన తాజా జాబితాల్లో ఓటర్ల సంఖ్యలో అనూహ్య మార్పులు ఎందుకున్నాయని ప్రశ్నించారు. అలాగే యువ ఓటర్లను లెక్కించారా? అర్హత రోజున 18 సంవత్సరాలు నిండిన ఓటర్ల సంఖ్య ఏ మేరకు ఉందో అన్న డేటాబేస్ ఉందా? అని రెండవ ప్రశ్న వేశారు. ఓటర్ల నమోదు నియమాలు 1960 కింద ఇవ్వబడిన నిబంధనలు దర్యాప్తు కాలపరిమితి, రెండు అప్పీల్ విధానాలు గురించి వివరిస్తూ బిహార్ ఎన్నికల అంశాన్నిగుర్తు చేస్తూ, అక్కడి సమస్యలు ఎలా పరిష్కరించనున్నారో? అని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలలో స్పెషల్ ఇంటెన్సివ్ కరెక్షన్ అమలు చేసినప్పుడు, ఎన్నికల సంఘం ఈ ఆచరణాత్మక సమస్యలను పరిష్కరిస్తుందా.? దీనిని పరిగణనలోకి తీసుకుంటారా? అని నాలుగో ప్రశ్న సంధించారు. 2025 మే 1న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఆలస్యంగా ఓటర్ల పేర్లను తొలగించడానికి తాము జూలై 17న ఎన్నికల సంఘానికి అప్పీలు చేశామని గుర్తు చేస్తూ, ఇది ఎప్పుడు అమలు చేయబడుతుందని ప్రశ్నించారు. ఓటరు హక్కును నిర్ధారించే పత్రంగా ఆధార్ను అంగీకరించాలని, ఇందులో ఎన్నికల సంఘానికి ఉన్న అభ్యంతరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘం లక్ష్యం న్యాయమైన ఎన్నికలు అయితే, అది మరింత పారదర్శకంగా, ఓటర్లకు దగ్గరగా ఉంటుందా? అని ప్రశ్నలు సంధించారు. వేలాంకన్నికి ప్రత్యేక రైలుసేవలు సాక్షి, చైన్నె: పండుగ సమయంలో ప్రయాణీకులకు అదనపు సేవలు అందించే విధంగా రాష్ట్రంలోని వేలాంకన్నీ స్పెషల్స్ పేరిట ప్రత్యే రైళ్లను దక్షిణ రైల్వే పట్టాలెక్కించేందుకు సన్నద్ధమైంది.ఈ మేరకు కేరళ రాష్ట్రం ఎర్నాకులం జంక్షన్ – వేలాంకన్నీ మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును సోమవారం ప్రకటించారు. ఈ రైలు ఆగస్టు 27వ తేదీ, సెప్టెంబరు 3, 10 తేదీలలో రాత్రి 11.50 గంటలకు ఎర్నాటకులం జంక్షన్లో బయలుదేరి, మరుసటి రోజులలో సాయంత్రం 3.15 గంటలకు వేలాంకన్నీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఆగస్టు 28, సెప్టెంబరు 4, 11 తేదీలలో సాయంత్రం 6.40 గంటలకు వేలాంకన్నిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు ఎర్నాకులం జంక్షన్ చేరుకుంటుందని ప్రకటించారు.3 ఏసీ టూ టైర్ కోచ్, 8 ఏసీ త్రీ టైర్ కోచ్లులు,4 స్లీపర్ కోచ్లు, ఓ జనరల్ బోగీతో ఈరైలు పట్టాలెక్కనుంది. ఈ రైలు కేరళలోని కోట్టాయం, చంగనస్సేరి, తిరువల్ల, చెంగన్నూర్, మావెలిక్కర, కయంకుళం, కరునాగపల్లి,శాస్తాం కోట, కొల్లం, కుందార, పునలూరు,తెన్మలై, తమిళనాడులోని సెంగోట్టై, తెన్కాశి, కడయనల్లూరు, శంకరన్కోయిల్ , రాజపాళయం, శివకాశి ,విరుదునగర్, అరుప్పుకోట్టై, మానా మదురై, కారైక్కుడి, అరంతాంగి, పేరావూరని, పట్టుకోట్టై, అదిరాం పట్నం, తిరుత్తురైపూండి, తిరువారూర్,నాగపట్నం మీదుగా వేలాంకన్నికి ప్రయాణించనుంది. ఈసీ నోటీసులు కొరుక్కుపేట: చైన్నెలోని మూడు రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం సోమవారం నోటీసులు జారీ చేసింది. వివరాలు..ఆవడి తాలూకాలోని అన్నా మక్కల్ ఇయకం, తిరువోత్తియూర్లోని సమత్వ మక్కల్ కజగం, మొగప్పేర్లోని తమిళర్ మున్నేట్ర కజగం అనే మూడు పార్టీలు గత 6 సంవత్సరాలుగా ఏ ఎన్నికల్లోనూ అభ్యర్థులను నిలబెట్టలేదని నోటీసులో పేర్కొంది. ఈ మూడు పార్టీల ప్రతినిధులు 26వ తేదీన ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో స్వయంగా హాజరు కావాలని, వారి రిజిస్ట్రేషన్ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని కోరారు. రజనీతో నైనార్ భేటీ సాక్షి, చైన్నె : దక్షిణభారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్తో తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ భేటీ అయ్యారు. ప్రతిసారి ఎన్నికలకు ముందుగా రజనీ మద్దతు దిశగా బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేయడం ఒకప్పడు పరిపాటిగా ఉండేదన్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందుగానే, ఎన్నికల రోజు గానీ ఆయన ఇచ్చే సంకేతం కోసం ఎదురు చూసే అభిమానులు ఎందరో ఉన్నారు. చివరకు తానే ఓ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించి, ఆ తర్వాత రజనీ యూటర్న్ తీసుకున్నారు. తదుపరి పరిణామాలతో తన దృష్టిని అంతా సినిమాల వైపుగా మళ్లించారు. అయితే ఇటీవల కాలంగా డీఎంకేతో సన్నిహితంగా ఉండే దిశగా రజనీ అడుగులు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అదే సమయంలో రజనీ కాంత్ సినీ రంగంలో అడుగు పెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకోవడాన్ని పురస్కరించుకుని తరచూ ఆయన్ని పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు.. ఈ పరిస్థితులలో సోమవారం పోయేస్ గార్డెన్లో రజనీ కాంత్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ భేటీ అయ్యారు. అర్ధగంట పాటూ వీరి సమావేశం జరిగింది. ఈ భేటీ మర్యాద పూర్వకం అని నైనార్ స్పష్టం చేశారు. సినీ రంగంలో ఆయన రజనీ 50 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ,జ్ఞాపికను అందజేశానని తెలిపారు. -
10 అడుగులకు మించి విగ్రహాలు పెట్టొద్దు
వేలూరు: అనుమతి లేని ప్రాంతాల్లో వినాయకుని విగ్రహాలను ప్రతిష్టించరాదని కలెక్టర్ సుబ్బలక్ష్మి స్పష్టం చేశారు. వేలూరులో ఈనెల 27న జరగనున్న వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ట, ఊరేగింపుపై హిందూ మున్నని, పోలీసులు, రెవెన్యూ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఈనెల 27న పండుగ జరుపుకుంటారని అయితే అనుమతి పొందిన ప్రాంతాల్లో మాత్రమే వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించి పూజలు చేపట్టాలన్నారు. అదే విధంగా పది అడుగులకు పైగా విగ్రహాలను ప్రతిష్టించేందుకు అనుమతి ఇవ్వరాదన్నారు. మూడవ రోజున విమగ్నానికి వేలూరు కార్పొరేషన్ పరిధిలో 508 విగ్రహాలకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. అనుమతి లేని ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టిస్తే పోలీసుల బందోబస్తు నిర్వహించేందుకు కుదరదని, సొంత పూచీకత్తుపై విగ్రహాలు ఏర్పాటు చేస్తే అందుకు నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఉదయం ఊరేగింపును ప్రారంభించి సాయంత్రానికి పూర్తి చేయాలని ట్రాఫిక్కు ఎట్టి పరిస్థితుల్లోను ఆటంకం కల్పించరాదన్నారు. వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ముందుగా సంబంధిత రెవెన్యూ అధికారుల వద్ద అనమతి పొందాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగే విధంగా ఏర్పాటు చేయరాదన్నారు. ఇతర మతస్తుల ప్రార్థనా స్థలం వద్ద విగ్రహాలు ఏర్పాటు చేయరాదన్నారు. సమావేశంలో ఎస్పీ మయిల్వాగనం, డీఆర్ఓ మాలతి, జిల్లాలోని రెవెన్యూ, పోలీసు అధికారులతో పాటూ హిందూ మున్నని కార్యకర్తలు పాల్గొన్నారు. -
నాకు ఆ చెడ్డ అలవాటు ఉంది
తమిళసినిమా: సినీ సెలబ్రిటీలది లగ్జరీ లైఫ్ అని చెప్పక తప్పదు. షూటింగ్స్ లేని సమయాల్లో క్లబ్లు, పబ్బుల్లో గడపడం సర్వసాధారణమనే చెప్పాలి. అందరూ అని కాదు కానీ, చాలా మంది జీవన విధానం ఇలానే ఉంటుందంటారు. కొందరు తారలు మాత్రం తమ అలవాట్లను ధైర్యంగా బయటకు వెల్లడిస్తారు. మరి కొందరు కెరీర్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనని భయపడతారు. అయితే నటి సంయుక్త మాత్రం మొదటి కోవకు వస్తారనే చెప్పాలి. 2016లో కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ మలయాళీ కుట్టి మొదట్లో మాతృభాషలో నటించింది. ఆ తరువాత తెలుగు, కన్నడం, తమిళం, హిందీ భాషల్లో కూడా నటించి పాన్ ఇండియా కథానాయకిగా గుర్తింపు పొందారు. తెలుగులోనే వరుసగా అవకాశాలు పొందుతూ బిజీగా ఉన్న సంయుక్త తమిళంలో కలరి చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత జూలై కాట్రిల్ అనే చిత్రంలో నటించారు. అవేవీ ఈ అమ్మడికి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆ మధ్య ధనుష్తో జత కట్టిన వాత్తీ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం తమిళంలో బెంజ్ అనే చిత్రంలో నటిస్తున్న సంయుక్త ఇటీవల ఒక సమావేశంలో చెప్పిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతగా వైరల్ అవుతున్న ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా.. తనకు ఒక చెడ్డ అలవాటు ఉందన్నారు. అదే మద్యం సేవించడం అని చెప్పారు. అయితే నిత్యం సేవించనని, మానసిక ఒత్తిడి, ఏదైనా ఆందోళన కలిగించే సంఘటన జరిగినప్పుడు మద్యం సేవిస్తానని చెప్పారు. ఇది సమాజంలోకి ఎలాంటి సందేశాన్ని తీసుకెళుతుందన్నది పక్కన పెడితే ఇలా తన చెడు అలవాటును బహిరంగపరచడానికి కూడా గట్స్ కావాలంటున్నారు నెటిజన్లు. నటుడు సూర్య, దర్శకుడు జీతూ మాధవన్ -
వేళచ్చేరిలో వృద్ధులకోసం గెరికేర్ సెంటర్
సాక్షి, చైన్నె: చైన్నె వేళ చ్చేరిలో గెరి కేర్ డయాలసిస్ డే కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. వృద్ధుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. సోమవారం ఈ సెంటర్ను సినీ నటి సుహాసిని ప్రారంభించారు. 2018 నుంచి గెరికేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. తాజాగా 10వ సెంటర్గా వేళచ్చేరి ఎల్డర్కేర్ను దృష్టిలో ఉంచుకుని, 75 పడకలతో అత్యాధునిక అసిస్టెడ్ లివింగ్ సౌకర్యం, శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడం, దీర్ఘకాలిక పరిస్థితి నిర్వహణ, వైకల్యం సంరక్షణ , ఆసుపత్రిలో చేరిన తర్వాత కావాల్సిన సహకారం, నిపుణుల వైద్య సంరక్షణ అవసరమయ్యే విధంగా వృద్ధుల కోసం అన్ని రకాల సౌకర్యాలను ఇక్కడ కల్పించారు. గెరి కేర్ నేతృత్వంలో డయాలసిస్ డే–కేర్ సెంటర్ ఫర్ ఎల్డర్స్గా ఈ సెంటర్పనిచేయనున్నది. ఈ సెంటర్కు సమీపంలోని ఫిజియోథెరపీ, పునరావాసం కోసం ప్రత్యేకమైన ఎల్డర్ ఫిట్నెస్ స్టూడియోతో పాటూ విశ్రాంతి తీసుకునేందుకు, పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించేందుకు ఎల్డర్ గ్రోవ్ స్థలాలను కూడాఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను సుహాసిని మణిరత్నం ప్రారంభించారు. ఇక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గెరి కేర్ హెల్త్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు డాక్టర్ లక్ష్మీపతి రమేష్ మాట్లాడుతూ, అత్యాధునిక అసిస్టెడ్ లివింగ్ సౌకర్యం తో ఈ సెంటర్ ప్రారంభించామన్నారు. 2050 నాటికి పెరగనున్న వృద్ధుల సంఖ్యను పరిగణించి వారికి కావాల్సిన సేవలను అందించే విధంగా ముందుకెళ్తున్నామన్నారు. సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ ఎల్డర్కేర్ తన హృదయానికి దగ్గరగా ఉన్న ఒక విషయం అని పేర్కొన్నారు. గెరి కేర్ ఆరోగ్య సంరక్షణలో నిజమైన కరుణ ఎలా ఉంటుందో చూపిస్తుందన్నారు. ఈ సదుపాయం కేవలం వైద్య సహాయం గురించి కాదు అని, ఇది గౌరవం, సౌకర్యం పెద్దలకు వారు అర్హులైన జీవన నాణ్యతను అందించడం కీలకంగా పేర్కొన్నారు., పద్మశ్రీ ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎస్. నటరాజన్ మాట్లాడుతూ, దేశంలో వృద్ధాప్య సంరక్షణ చాలా అవసరం అని, ఇలాంటిసెంటర్లు ఇందుకు ఎంతో దోహదకరంగా వివరించారు. -
తిరుత్తణిలో 210 టన్నుల చెత్త తొలగింపు
తిరుత్తణి: తిరుత్తణిలో ఆడికృత్తిక సందర్భంగా పట్టణ వ్యాప్తంగా పేరుకుపోయిన 210 టన్నుల చెత్తకుప్పలను మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది తొలగించారు. విస్తృతంగా పరిశుభ్రత పనులు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో అశ్వినితో ప్రారంభమైన ఆడికృత్తిక వేడుకలు సోమవారం వరకు ఐదు రోజులపాటు నిర్వహించారు. పది లక్షల మందికి పైగా భక్తులు పాల్గొని స్వామికి కావళ్లు చెల్లించి, దర్శించుకున్నారు. భక్తులు వేసిన చెత్తకుప్పలు పేరుకుపోకుండా పరిశుభ్రత పనుల్లో మున్సిపల్ పారిశుధ్య సిబ్బందితోపాటు వివిధ మున్సిపాలిటీలు, టౌన్ పంచాయతీల నుంచి 140 మంది పాల్గొన్నారు. వేడుకలు జరిగిన ఐదు రోజులు షిఫ్ట్ పద్ధతిలో విధులు నిర్వహించారు. ఎప్పటికప్పుడు చెత్తకుప్పలు తొలగించే పనులు చేపట్టారు. పట్టణ వ్యాప్తంగా చెత్త కుప్పలు పేరుకుపోకుండా శుభ్రం చేసి వాహనాల ద్వారా తరలించారు. అలాగే శరవణ పుష్కరిణితోపాటు ఎగువ తిరుత్తణి నల్లాన్ పుష్కరిణిలో భక్తులు వేసిన పుష్పాలు, పూజా సామగ్రిని తొలగించి వాహనాల్లో తరలించారు. పారిశుధ్య పనులు నిర్విరామంగా నిర్వహించి పరిశుభ్రతగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికుల కృషితో 210 టన్నుల చెత్తకుప్పలు తొలగించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచినట్లు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. -
వాణిజ్య అధికారులకు శిక్షణ
సాక్షి, చైన్నె: వండలూరులో పోలీసు శిక్షణ కేంద్రంలో 190 మంది వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మంత్రులు అన్బరసన్, మూర్తి ప్రారంభించారు. వాణిజ్య పన్ను అధికారుల పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగు పరిచేందుకు ఈ శిక్షణ శిబిరం సెప్టెంబరు 30వ తేదీ వరకు జరగనున్నాయి. వాణిజ్య పన్ను శాఖ కార్యకలాపాలకు సంబంధించిన చట్టాలు, నియమాలు, విధానాలు, బాధ్యతలు, తాజా పన్ను చట్టాలు, పన్ను సేవా మెరుగుదల ప్రాజెక్టులు, అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం గురించి అవగాహన కల్పించనున్నారు. రోజువారీ భౌతిక, మానసిక ఆరోగ్యానికి యోగాతో శిక్షణ కూడా ఇవ్వనన్నారు. సాంకేతిక నిపుణులచే ప్రత్యేక కార్యక్రమాలు జరగనన్నాయి.ఈ కార్యక్రమానికి వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శిల్ప ప్రభాకర్ సతీష్, కమిషనర్ ఎస్. నాగరాజన్, చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ టి.స్నేహ, చెంగల్పట్టు శాసన సభ్యురాలు వరలక్ష్మి మధుసూదనన్, తమిళనాడు పోలీస్ ఉన్నత శిక్షణ సంస్థ, వాణిజ్య పన్ను శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ధనుష్ ఇడ్లీకడై ఎప్పుడంటే..
తమిళసినిమా: సక్సెస్ఫుల్ బాటలో పయనిస్తున్న నటుడు ధనుష్ దర్శకుడిగానూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈయన చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఇడ్లీకడై చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. నటి నిత్యామీనన్ నాయకిగా నటిస్తున్న ఇందులో ధనుష్కు చెల్లెలిగా నటి షాలిని పాండే నటించడం విశేషం. ఈమె ఇంతకు ముందు తెలుగు, తమిళం భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా అర్జున్రెడ్డి చిత్రంలో నటించి, పాపులర్ అయ్యారు. చాలా గ్యాప్ తరువాత తమిళంలోకి ఇడ్లీకడై చిత్రం ద్వారా రీ ఎంట్రీ అవుతున్నారు. అదే విధంగా నటుడు పార్తీపన్, అరుణ్విజయ్, సముద్రఖని తదితర ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆకాశ్ భాస్కర్ తన డాన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్కుమార్్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని ఎన్న సుఖమ్ అనే లిరికల్ వీడియో పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాట ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకుంది. ఈ పాటను నటుడు ధనుష్, గాయనీ శ్వేతామోహన్ పాడారు. ఈ చిత్రంలో ధనుష్ పాడిన ఎన్సామి తందానే అనే మరో పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇడ్లీకడై చిత్రాన్ని అక్టోబర్ ఒకటో తేదీన విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాయి. నటుడు ధనుష్ ప్రస్తుతం హిందీ చిత్రం తేరే ఇష్క్ మేన్ను పూర్తి చేసి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటి మమితా బైజా నటిస్తుండగా కరుణాస్, జయరామ్, కేఎస్ రవికుమార్, సురాజ్ వెంజారముడు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ కోసం రామనాథపురం, తేని ప్రాంతాల్లో జరుపుకోవడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం తరువాత అమరన్ చిత్రం ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో నటించనున్నట్లు సమాచారం. ఇకపోతే తన అభిమానులను నెలకొక్క రోజున 500 చొప్పున కలుసుకోవాలని నిర్ణయించుకున్న ధనుష్ గత జూలై 27వ తేదీన, ఆగస్టు 3వ తేదీన అభిమానులకు కలుసుకున్నారు. అయితే తదుపరి విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం రెండో షెడ్యూల్ పూర్తి అయిన తరువాత అభిమానులను కలుసుకుంటారని సమాచారం. -
వాక్థాన్తో వాస్కులర్ వ్యాధులపై అవగాహన
సాక్షి, చైన్నె: వాస్కులర్ వ్యాధులపై అవగాహన కల్పించే విధంగా చైన్నెలో విద్యార్థులను ఒకే వేదికపైకి తెస్తూ వాక్థాన్ కార్యక్రమం సోమవారం జరిగింది. చైన్నె వాస్కులర్ వెల్పేర్ సొసైటీ, వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఆళ్వార్ పేట కావేరి ఆస్పత్రి వాస్కులర్ ఫౌండేషన్ డాక్టర్ ఎన్శేఖర్ నేతృత్వంలో చైన్నె బీసెంటర్ నగర్ బీచ్ నుంచి వాక్థాన్ నిర్వహించారు. వాస్కులర్ వ్యాధులపై అవగాహహన కల్పించే విధంగా, నివారణ గురించి వివరిస్తూ విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నిర్మల్కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఐఎఎస్ అధికారి చంద్ర మోహన్, ఎన్ఎంసీ మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ శివరామన్ కణ్ణన్ తదితరులు ఈవాక్ థాన్లో అడుగులు వేశారు. ఈసందర్భంగా డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ, వాస్కులర్ వ్యాధులు తరచూ అధునాతన దశకు చేరుకుంటున్నదని, ఇది నిశ్శబ్దంగావం చూపించే దిశగా ముందుకెళ్తున్నాయని వివరించారు. అందుకే వాస్కులర్ వ్యాధులపై ప్రజలలో అవగాహన పెంపొందించే కార్యక్రమాల వైపుగా దృష్టి పెట్టామన్నారు. -
తలైవన్ తలైవి సక్సెస్ మీట్
తమిళసినిమా: తలైవన్ తలైవి చిత్ర విజయోత్సవాన్ని యూనిట్ సభ్యులు వేడుకగా జరుపుకున్నారు. నటుడు విజయ్సేతుపతి,నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం ఇది. పాండిరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని సత్యత్యోతి ఫిలింస్ పతాకంపై టీజీ.త్యాగరాజన్ సమర్పణలో అర్జున్ త్యాగరాజన్, సెంథిల్ త్యాగరాజన్ నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గత నెల 22న విడుదలై ప్రేక్షకుల ఆదరణతో మంచి విజయాన్ని అందుకుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు, మనస్తాపాలు, విడిపోవడాలు వివాహ రద్దుకు పరిష్కారం కాదనే చక్కని సందేశంతో వినోదభరితంగా రూపొందిన చిత్రం తలైవన్ తలైవి. ఇది నటుడు విజయ్ సేతుపతి నటించిన 52వ చిత్రం కావడం గమనార్హం. కాగా ఈ చిత్ర విజయోత్సవ వేడుకలను ఇటీవల చైన్నెలోని ఒక నక్షత్ర హోటల్లో యూనిట్ సభ్యులు జరుపుకున్నారు. దర్శకుడు, ఫెఫ్సీ అద్యక్షుడు ఆర్కే.సెల్వమణి, తమిళ్ దర్శకుల సంఘం అద్యక్షుడు ఆర్వీ ఉదయకుమార్ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గానికి జ్ఞాపికలను ప్రదానం చేశారు. -
సిలికాన్ ఫోటోనిక్స్ జనరేటర్కు ఐఐటీ ఒప్పందాలు
సాక్షి, చైన్నె: భారతదేశపు మొట్టమొదటి సిలికాన్ ఫోటోనిక్స్ ఆధారిత హై–స్పీడ్ క్వాంటం రాండమ్ నంబర్ జనరేటర్ (క్యూఆర్ఎన్జీ) కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మద్రాస్ రూ. కోటి విలువైన ఒప్పందంతో దేశీయంగా పరిశ్రమకు అనుమతి ఇచ్చింది. సిలికాన్ ఫోటోనిక్ క్యూర్ఎన్జీ వాణిజ్య విస్తరణ కోసం ఇంద్రార్కా క్వాంటం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్తో రూ. కోటి లైసెన్సింగ్ ఒప్పందంపై టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆఫీస్, ఐఐటీ మద్రాస్ సోమవారం సంతకాలు చేశాయి. ఐఐటీ మద్రాసులని సెంటర్ఫర్ ప్రోగ్రామబుల్ ఫోటోనిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ సిస్టమ్స్ (అభివృద్ధి చేయబడిన ఈ మైలురాయి, ఈ సాంకేతికత వ్యూహాత్మక విలువను, భారతదేశ క్వాంటం ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడంలో తన సామర్థాన్ని చాటనుంది. ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేసే కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి అధ్యక్షత వహించారు. ఈ ఒప్పందంపై ఐఐటీ మద్రాస్ డీన్ (ఐసీఎస్ఆర్) ప్రొఫెసర్ మను శాంతనం, ఇంద్రార్కా క్వాంటం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీనానాథ్ సోని, ఇంద్రార్కా క్వాంటం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తేజ్ సోని, ఐఐటీ మద్రాస్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ బిజోయ్ కృష్ణ దాస్ సంతకం చేశారు. కార్యక్రమానికి భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ శంఖదీప్ దాస్, డాక్టర్ వి. నటరాజన్ నితిన్, ఐఐటీ మద్రాసు అరనబ్ గో స్వామి ట్రాన్స్ ఫర్ ఆఫీస్ హెడ్ డాక్టర్ దారా అజయ్ హాజరయ్యారు. -
చాంపియన్స్ ఆఫ్ చైన్నె అవార్డుల ప్రదానం
కొరుక్కుపేట: కేఎస్ఏ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలను అందిస్తున్న పలువురు ప్రముఖులకు చాంపియన్స్ ఆఫ్ చైన్నె అవార్డ్స్–2025 ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి చైన్నె మైలాపూర్లోని దక్షిణామూర్తి ఆడిటోరియం వేదికై ంది. కేఎస్ఏ ట్రస్ట్ ట్రస్టీ టీఆర్ గోపాలకృష్ణన్ స్వాగతోపన్యాసం చేస్తూ అవార్డు గ్రహీతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వందన సమర్పణను ట్రస్టీ కె.కల్యాణరామన్ చేశారు . ముఖ్య అతిథిగా దక్షిణ భారత్ ఏరియా మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ ఇంద్రబాలన్ పాల్గొని, అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో చాంపియన్స్ ఆఫ్ చైన్నె అవార్డులను నార్త్ చైన్నెకు చెందిన నన్భర్ గల్ గ్రామియ కలై కుళు(ఆర్ట్ అండ్ కల్చర్), యువన్ ఆవేష్(ఎడ్యుకేషన్) , ఫ్లై యింగ్ స్క్వాడ్ అంబులెన్స్ సర్వీస్ (ఎంటర్ప్రైజ్), టీటీ రంగనాథన్ క్లినికల్ రీసెర్చ్ ఫౌండేషన్(హెల్త్కేర్), అరప్పోర్ ఐక్యం(సోషల్ ఇనిషియేటివ్), విక్టరీ స్పోర్ట్స్ ఫౌండేషన్(స్పోర్ట్స్), స్పేస్ జోన్ ఇండియా ఆనంద మేగలింగం(సైన్స్) లకు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా కేఎస్ఏ ట్రస్ట్ తొలిసారిగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. -
సీపీ రాధాకృష్ణన్ను మద్దతివ్వాలి
వేలూరు: ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనున్న సీపీ రాధాకృష్ణన్కు తమిళ ఎంపీలందరూ మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పయణిస్వామి అన్నారు. ప్రజలను కాపాడుదాం, తమిళనాడును రక్షిందాం అనే సిద్దాంతంతో ఎడపాడి పళణిస్వామి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా తిరువణ్ణామలై చేరుకున్న ఆయన సోమవారం ఉదయం అమ్మనియమ్మన్ గోపురం దారిలో సంపద వినాయకుడి సన్నిధి, అన్నామలైయార్ సన్నిధి, ఉన్నామలై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ నిర్వహకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఆసమయంలో ఆలయంలోని శివాచార్యులతో కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహారాష్ట్ర రాష్ట్ర గవర్నర్గా ఉన్న తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్నారు. మొట్ట మొదటి సారిగా తమిళనాడుకు చెందిన వారికి ఉపరాష్ట్రపతి పదవి రావడం సంతోషంగా ఉందని ఆయనకు పార్టీలకు అతితంగా ఒక తమిళుడునే అభిమానంతో మద్దతు ఇవ్వాలన్నారు. అనంతరం రానున్న ఎన్నికల్లో కూటమి, రాజకీయ ప్రశ్నలకు ఆయన ఎటువంటి సమాదానం చెప్పకుండా కారులో గిరివలయం వెల్లారు. ఆయనతో పాటు మాజీ మంత్రి అగ్ని క్రిష్ణమూర్తితో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ
తిరువళ్లూరు: ఎయిడ్స్ రహిత దేశాన్ని నిర్మించాలన్న బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ప్రతాప్ పిలుపునిచ్చారు. ఎయిడ్స్పై ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాలోనూ ఎయిడ్స్ లైంగికంగా సంక్రమించే వ్యాధులపై అవగాహన ర్యాలీని నిర్వహించాలని తమిళనాడు ఆరోగ్యశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీని కలెక్టర్ ప్రతాప్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజాజీవీధి, మాడవీధి, బజారువీధుల్లో సాగింది. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు ఎయిడ్స్ను వందశాతం నిర్మూలించడానికి ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ ఎయిడ్స్ భాదితులను దూరంగా పెట్డడం, వారిపై చిన్నచూపు చూడడం సరికాదన్నారు. ఎయిడ్స్ బాధితులను సమానంగా చూడాలన్న కలెక్టర్ వారితో సోదర భావంతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రియరాజ్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ భవ్య దివ్యదర్శిని, జిల్లా ఐసీటీసీ బబిత ఎయిడ్స్ నివారణ యూనిట్ సిబ్బందితోపాటు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
మంత్రి పెరియ స్వామికి సుప్రీంలో ఊరట
– విడుదల రద్దు ఉత్తర్వులపై స్టే సాక్షి,చైన్నె: డీఎంకే మంత్రి ఐ పెరియస్వామికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయన విడుదలను రద్దు చేస్తూ హైకోర్టు బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. డీఎంకే మంత్రులు దురై మురుగన్, ఎంఆర్కే పన్నీరు సెల్వం తదుపరి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వేల్ మురుగన్ దృష్టిలో మంత్రి ఐ.పెరియస్వామి పడిన విషయం తెలిసిందే. . 2006–2010లో మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి మంత్రి ఐ. పెరియ స్వామి ఆస్తులు గడించినట్టుగా గతంలో కేసు నమోదైంది. ఆయన సతీమణి సుశీల, కుమారులు ప్రభు, సెంథిల్కుమార్లను ఈకేసులో చేర్చారు. వీరిని దిండుగల్ కోర్టు కేసు నుంచి విడుదల చేసింది. అయితే, పునర్ సమీక్ష పిటిషన్ విచారణలో విడుదల తీర్పు రద్దు చేస్తూ న్యాయమూర్తి వేల్ మురుగన్ తీర్పు చెప్పారు. ఈ కేసును ఐ.పెరియస్వామి అండ్ ఫ్యామిలీ మళ్లీ ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కేసును ఆరు నెలలో ముగించే విధంగా కింది కోర్టును న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఈ రద్దు తీర్పును వ్యతిరేకిస్తూ ఐ. పెరియస్వామి సుప్రీం కోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. వాదన అనంతరం హైకోర్టు జారీ చేసిన రద్దు ఉత్తర్వులకు మధ్యంతర స్టే విధించారు. ఈ కేసుకు సంబంధించిన సమగ్ర వివరాలను దాఖలు చేయాలని తమిళనాడు అవినీతి నిరోధక శాఖను సుప్రీం కోర్టు బెంచ్ న్యాయమూర్తులు ఆదేశించారు. దీంతో ఈ కేసుల నుంచి తాత్కాలికంగామంత్రికి ఊరట కలిగినట్లయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా మనీ లాండరింగ్ అంటూ ఐ.పెరియస్వామిని ఈడీ టార్గెట్ చేసి శని, ఆదివారాలలో ఆయన నివాసాలలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. -
క్లుప్తంగా
అన్నానగర్: మాధవరం సమీపంలోని పొన్నియమ్మన్ మేడు తణికాసలం నగర్కు చెందిన ఆనందన్ (55). మాధవరం ట్రాఫిక్ ఇన్వెస్టిగేషనన్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మెడికల్ లీవ్లో ఉన్నారు. అతని భార్య సరళ. వీరికి ఇద్దరు కుమార్తెలు. సోమవారం మధ్యాహ్నం ఆనందన్ కొలత్తూరు లోని వెట్రి నగర్లోని తన తల్లి ఇంటికి వచ్చాడు. భోజనం చేసిన తర్వాత పడుకోవడానికి తన బెడ్రూమ్లోకి వెళ్లాడు. తరువాత సాయంత్రం చాలా సేపటి వరకు ఆనందన్ తన గది నుంచి బయటకు రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పొరుగువారి సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, ఆనందన్ సీలింగ్ ఫ్యానన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందాడు. ఈ విషయం పై తిరు.వి.కె. నగర్ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కిల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. పోలీసులు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో సబ్–ఇన్స్పెక్టర్ ఆనందన్ తన పెద్ద కుమార్తె తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించడం, ఆత్మహత్యకు పయత్నించడం వల్ల కలిగిన మానసిక వేదన కారణంగా బలవన్మరణానికి పాల్పడినట్లు తేలింది. కొరుక్కుపేట: సృజనాత్మకత, సంస్కృతి, ప్రతిభను ప్రదర్శించే రీతిలో సోమవారం ఆరంభమైన చైతన్య మెగా ఇంటర్ కాలేజియేట్ ఫెస్ట్ 2025–26 కు అనూహ్యమైన స్పందన లభించింది. శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళక కళాశాల ఐక్యూఏసీ, కలాలయ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా రెండు రోజులు చైతన్య పోటీలు కళాశాల ప్రాంగణంలో నిర్వహించింది. కళాశాల కరస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్, ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి. బి. వనీత తదితరులు పోటీలను ప్రారంభించారు. నగరంలోని దాదాపు 20 కళాశాల నుంచి 400 మందికి పైగా విద్యార్థినులు ఈ ఫెస్ట్లో పాల్గొన్నారు. సమూహ గానం, ద్వంద్వ అడాప్ ట్యూన్ ,గ్రూప్ డ్యాన్స్,ఫోటో ఫ్రేమ్ తయారీ, థ్రెడ్ బ్యాంగిల్ తయారీ, ఫైర్లెస్ వైర్లెస్ వంట, సాంప్రదాయ మేక్ ఓవర్ తదితర పోటీ ల్లో ప్రతిభను చాటుకున్నారు. సాక్షి, చైన్నె: చైన్నె ఈక్కాడు తాంగల్లోని వివిధ రకాల ఉత్పత్తి సంస్థగా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన నిర్వాహకులను ఆదాయ పన్ను శాఖ అధికారులు టార్గెట్ చేశారు. సోమవారం ఉదయాన్నే చైన్నె, కాంచీపురం, వేలూరుల్లోని ఆ సంస్థల ప్రతినిధులు, నిర్వాహకులు, అనుబంధ సంస్థలకు చెందిన వారి కార్యాలయాలు, ఇళ్లలో మొత్తం పది చోట్ల పది బృందాలుగా ఐటీ అధికారులు సోదాలలో నిమగ్నమయ్యారు. తిరువళ్లూరు: చెరువు కరకట్టపై నిర్మించిన నివాసాలను ఆక్రమణగా గుర్తించిన అధికారులు పోలీసుల సాయంతో సోమవారం ఉదయం జేసీబీ సాయంతో కూల్చివేశారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అక్రమణల గుర్తింపు, తొలగింపు పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. కాలువలు, చెరువులు, వర్షపు నీరు వెళ్ళే కాలువల వద్ద వున్న అక్రమణలను గుర్తిస్తున్న రెవవెన్యూ అదికారులు వాటిని కూల్చివేస్తున్నారు. ఇందులో భాగంగానే కాకలూరు చెరువు కరకట్టపై వున్న నివాసాలను ఆక్రమణగా గుర్తించిన అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం తొలగించారు. కాగా ఈ సమయంలో రెవెన్యూ, స్థానికుల మధ్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. దీంతో తాహశీల్దార్ రజినీకాంత్, డిప్యూటీ తాహశీల్దార్ దినేష్, రెవెన్యూ ఇన్పెక్టర్ ఉధయకుమార్, వీఏఓ సుబ్రమణ్యం తదితరులు పోలీసులకు సమాచారం అందించి వారి సాయంతో జేసీబీ ద్వారా నివాసాలను తొలగించారు. కొరుక్కుపేట: చైన్నెలోని సైదాపేట రోడ్డులో రూ.28.70 కోట్లుతో నిర్మిస్తున్న ఆరు అంతస్తుల కొత్త ఆసుపత్రిని రాష్ట్ర ఆర్యోగ శాఖామంత్రి సుబ్రమణ్యన్ సోమవారం పరిశీలించారు. 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారీ వైద్య సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ఆసుపత్రి పురోగతిపై అధికారులతో చర్చించారు. 120 ఏళ్ల నాటి ప్రభుత్వ ఆసుపత్రి సముదాయంలో ఉన్న సైదాపేటలో కొత్తగా నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని పరిశీలించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పాత నిర్మాణాలతో కూడిన ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయడానికి, ప్రభుత్వ నిధులతో రూ.28.70 కోట్లు వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. -
ప్రసాద్ ల్యాబ్లో ముత్యాల ముగ్గు సినిమా ప్రదర్శన
– ఈ ఏడాదితో ముత్యాలముగ్గుకు 50 ఏళ్లు కొరుక్కుపేట: శ్రీరామ చిత్ర పతాకంపై ఎంవీఎల్ నిర్మించిన ముత్యాల ముగ్గు సినిమాకి ఈ ఏడాదితో యాభై ఏళ్లు నిండాయి. అలాగే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బాపునకు 92 ఏళ్లు, మాటలు అందించిన రమణకు 94 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా బాపు, రమణ కుటుంబ సభ్యులు చైన్నెలోని ప్రసాద్ లాబ్లో అభిమానుల కోసం ముత్యాలముగ్గు సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా ప్రదర్శనను సినిమా నేపథ్య గాయని పి.సుశీల, సీనియర్ నటి సుహాసిని, సంగీత దర్శకుడు సాలూరి వాసు రావు, ప్రముఖ హీరో భానుచందర్, తెలుగు ప్రముఖలు, వేదవిజ్ఞానవేదిక అధ్యక్షుడు జేకేరెడ్డి, తెలుగు భాషాభిమాని శోభారాజా, బాపు రమణ కుటుంబసభ్యులు, ఇంకా అభిమానులు పాల్గొని ముత్యాల ముగ్గు సినిమాను చూసి ఆనందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముత్యాల ముగ్గు సినిమా తెలుగు సినీ చరిత్రలో ఓ క్లాసిక్గా నిలిందన్నారు. బాపు దర్శకత్వం, ముళ్లపూడి వెంకటరమణ మాటలతో 1975లో విడుదలైన ముత్యాల ముగ్గు సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని నేపథ్య గాయని సుశీల పేర్కొన్నారు. ఈ సినిమాలోని అన్ని పాత్రలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయని, సామాజిక సమస్యలను, కుటుంబ సంబంధాలను సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించారని గుర్తు చేసుకున్నారు. ఎప్పటికీ మరిచిపోలేని ముత్యాల ముగ్గు సినిమాను మరో సారి చూసి ఆనందించాలని బాపు–రమణ కుటుంబసభ్యులు కోరారు. -
‘రాధాకృష్ణన్తో లాభం లేదు.. ఇండియాకు మనం గట్టి అభ్యర్థిని నిలబెడదాం’
సాక్షి, చెన్నై: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఇండియా కూటమిలో చర్చలు జరుగుతున్నాయి. కూటమి తరఫున ఎవరిని బరిలో నిలపాలి అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన వ్యక్తినే ఎంపిక చేయాలని డీఎంకే సీనియర్ నాయకుడు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సదరు నేత అంతటితో ఆగకుండా.. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్తో తమిళనాడుకు ప్రయోజనం లేదని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించే అంశంపై విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు సోమవారం సమావేశమయ్యారు. కూటమి పార్లమెంటరీ పక్ష నేతలు.. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో డీఎంకే సీనియర్ నాయకులు ఇళంగోవన్ స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది భారత ఉప రాష్ట్రపతి పదవి. రాధాకృష్ణన్ బీజేపీ అభ్యర్థి.. ఆర్ఎస్ఎస్ వ్యక్తి. ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ మా రాష్ట్రానికి ప్రత్యేకంగా జరిగే మంచి ఏమీ ఉండదు. దీన్ని భాష ద్వారా మాత్రమే కాకుండా రాజకీయంగా చూడాలి.#WATCH | Chennai, Tamil Nadu: On Maharashtra Governor CP Radhakrishnan announced as NDA's Vice Presidential candidate, DMK Leader TKS Elangovan says, "He is an RSS man. He is a BJP candidate. You should view this politically, not as per language...I don't know why the poor man… pic.twitter.com/I1IxxxH2Ij— ANI (@ANI) August 18, 2025బీజేపీ నేతృత్వంలోని బీజేపీ.. ఇప్పటికే పలుమార్లు తమిళులను అవమానించింది. బీజేపీ.. తమిళుల కోసం పనిచేయలేదు. కేంద్రంలోని పెద్దలు.. తమిళనాడు విద్యార్థులకు ఎటువంటి సాయం అందించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా డీఎంకే నుంచే అభ్యర్థి ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అందుకే రాధాకృష్ణకు పోటీగా తమిళనాడు నుంచే.. అది కూడా డీఎంకే నుంచి అభ్యర్థి ఎంపిక చేయాలని కోరుతున్నాను అని అన్నారు. చివరగా.. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇండియా బ్లాక్ తీసుకున్న నిర్ణయానికే తమ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇండియా కూటమిలో కొంత మంది నేతలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకూడదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలు దగ్గరలో ఉన్నందున అధికార పక్షం క్రాస్ ఓటింగ్ ద్వారా తమ బలాన్ని పెంచుకుంటే.. అది బీహార్ ఓటర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వారు భావించారు.కూటమి మల్లగుల్లాలు..కాంగ్రెస్ వర్గాల సమాచారాల ప్రకారం.. విపక్ష అభ్యర్థి కాంగ్రెస్ నుంచే ఉండాలనే నిబంధన ఏమీ లేదు. మిత్రపక్షాలు తటస్థ, స్వచ్ఛమైన నేపథ్యం ఉన్న అభ్యర్థి పేరును సూచిస్తే, కాంగ్రెస్ కూడా దానికి అంగీకరించే అవకాశం ఉంది. అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని నిలబెట్టి, సిద్ధాంతపరమైన పోరాటాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ.. ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం అంటే బీజేపీకి స్వేచ్ఛగా మార్గం ఇవ్వడమేనని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ విషయంపై రాహుల్ గాంధీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ ఈ నెల 19న సాయంత్రం ఢిల్లీకి తిరిగి వచ్చి మళ్లీ 21న బీహార్ వెళ్లనున్నారు. ఈ సమయంలో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. -
అర్ధరాత్రి నగ్నంగా పుర్రెలతో పూజలు
వేలూరు: తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని పూసికల్మేడు గ్రామానికి చెందిన తిరుపతి కుమారుడు పరుశురామన్ ఇతను అదే గ్రామంలోని రాజాత్తి ఇంటి సమీపంలో ఆదివారం అర్థరాత్రి పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పరుశరామన్ ఇంటి సమీపంలో నివశిస్తున్న కుమరన్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో దీపం వెలుగుతుందని దగ్గరకు వెళ్లి చూశాడు. ఆ సమయంలో పరుశురామన్ నగ్నంగా నిలుచుకొని పూజలు చేస్తున్నాడు. వీటిని గమనించి అవాక్కైన కుమరన్ వీటిని నిలదీశాడు. దీంతో ఇద్దరి మద్య వాగ్వాదం ఏర్పడింది. ఇద్దరు ఘర్షణ పడటంతో స్థానికులు గమనించి అక్కడకు వచ్చారు. వెంటనే ఇరు వర్గాల వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం కుమరన్ ఇంటికి వెల్లి నిద్రించాడు. ఆ సమయంలో పరుశురామన్ తన అనుచరులతో వచ్చి కుమరన్ తలపై రాతిని వేసి హత్య చేసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. కుమరన్కు తీవ్ర గాయాలు కావడంతో అతని బార్య జయలక్ష్మి వెంటనే కేకలు వేసింది. వెంటనే స్థానికులు గమనించి కుమరన్ను చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభ్తుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు జయలక్ష్మి నాట్రంబల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి పరుశురామన్, అతని సోదరుడు శాంతకుమరన్ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
నా భర్తకు మహిళల పిచ్చి.. 30 మందితో సంబంధాలు..
తమిళనాడు: వివాహమైన 10 నెలలలోనే ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. చెన్నై కోడంబాక్కంలో అద్దెకు గది తీసుకుని నివసిస్తున్న జ్యోతిశ్వరి ( 30). ఈమె ఎం.బి.బి.ఎస్, ఎం.ఎస్. చదివింది. ఆమె స్వస్థలం రామనాథపురం. ఈమె మీనంబాక్కంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తోంది. ఈమెకు రామనాథపురానికి చెందిన యోతీశ్వరన్ (34)తో గత సంవత్సరం నవంబర్లో వివాహం జరిగింది. ఇంజినీరైన యోతీశ్వరన్ దురైపాక్కంలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో యోతీశ్వరన్ తన భార్యను విడిచిపెట్టి తన స్వస్థలానికి వెళ్లి ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడూ భార్యను చూడటానికి వచ్చి వెళ్లేవాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజులు సెలవు కావడంతో పెరుంగళత్తూరు శ్రీరామ్ గేట్లో 12 అంతస్తుల అపార్ట్మెంట్లో నివసిస్తున్న తన సోదరి ముత్తులక్ష్మి ఇంటికి జ్యోతిశ్వరి వెళ్లింది. ఆ తర్వాత సాయంత్రం తన ఇంటికి బయలుదేరింది. అపార్ట్మెంట్ ’లిఫ్ట్’లోకి వెళ్లిన జ్యోతిశ్వరి, కిందకు వెళ్లకుండా పైకి వెళ్లింది. టెరస్ర్కు వెళ్లి తన చెప్పులు, హ్యాండ్బ్యాగ్ తీసివేసి 12వ అంతస్తు నుంచి కిందకు దూకింది. ఇందులో, తలకు. తీవ్రంగా గాయపడిన జ్యోతిశ్వరి సంఘటన స్థలంలోనే దారుణంగా మృతి చెందింది . ఈ విషయం తెలుసుకున్న పీర్కన్కరణై పోలీసులు ఆత్మహత్య చేసుకున్న జ్యోతిశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్త అరాచకాలు భరించలేకనే..? కాగా గత నవంబర్ నెలలో తల్లిదండ్రులు చూసిన వరుడు యోతీశ్వరన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే, యోతీశ్వరన్ తన భార్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా గంజాయితో పాటూ అనేక ఇతర చెడు అలవాట్లలో మునిగిపోయాడు. అంతేకాకుండా, డేటింగ్ యాప్ ద్వారా 30 మందికి పైగా మహిళలతో పరిచయం పెంచుకుని, పెళ్లయిన తర్వాత కూడా వారితో సంబంధాలు కొనసాగించాడు. కాగా ఎంతో ఆశతో పెళ్లి చేసుకున్న భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలుసుకున్న జ్యోతీశ్వరి, తన భర్త ల్యాప్టాప్ను పరిశీలించగా, అతను అనేక మంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్న విషయం తెలిసి మనోవేదకు గురైంది. ఈ నేపథ్యంలో, కోడంబాక్కంలోని తన తల్లితో కలిసి గది తీసుకుని ఉంటున్న జ్యోతీశ్వరి, పెరుంగళత్తూరులోని అక్క ఇంటికి వెళ్లినప్పుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
కొరుక్కుపేట: శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. చైన్నె ఆళ్వార్పేట, టీటీకే రోడ్డులోని మ్యూజిక్ అకాడమీ దీనికి వేదికై ంది. అసోసియేషన్ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో యూఎస్ఏకు చెందిన ఎస్ఎస్ శశాంక భక్తిగీతాలాపనలు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరానికి చెందిన సుచరిత, సుప్రజ బృందం కూచిపూడి నృత్యం ఆహూతులను అమితంగా ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణం వందే జగద్గురుం – ప్రతిభా పురస్కారాలను నటి లయ, నటి నమిత ప్రదానం చేశారు. ముందుగా కర్ణాటక, క్లాసికల్ సంగీత కళాకారిణి శ్వేత మంగళంపల్లి బృందం నాదార్పణం, తర్వాత కార్యక్రమంలో శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ సభ్యులతో పాటు పుర ప్రముఖులు పాల్గొని విజయవంతం చేశారు. -
భజన పోటీలకు అనూహ్య స్పందన
కొరుక్కుపేట: జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్)– చైన్నె ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం నిర్వహించిన వార్షిక భజన పోటీలకు అనూహ్య స్పందన లభించింది. టీ.నగర్లోని పీఆర్సీ సెంటినరీ హాలులో జరిగిన పోటీలకు వివిధ పాఠశాలల నుంచి 26 బృందాలు సీనియర్, జూనియర్ విభాగాల్లో పాల్గొన్నారు. చిన్నజీయర్స్వామి మంగళాశాసనాలతో జెట్–చైన్నె అధ్యక్షుడు పి. రవీంద్ర కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన పోటీలకు శ్రీ సిటీ అధినేత రవిసన్నారెడ్డి పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన సీనియర్, జూనియర్ విభాగాల్లో విజేతలకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలతోపాటు వెండి, రజిత పతకాలతో రవిసన్నారెడ్డి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. -
శ్రీకృష్ణుని ఆలయాల్లో అభిషేకాలు
వేలూరు: శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో శ్రీ కృష్ణుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. శనివారం సాయంత్రం వేలూరులోని శ్రీ కృష్టుడి ఆలయంలోని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వేలూరు తోటపాళ్యంలోని శ్రీకృష్ణ ఆలయంలో యువకులచే ప్రత్యేక పూజలు, పుష్పాలంకరణలు చేశారు. అదేవిధంగా వాలాజలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలోని నవనీత చిన్ని కృష్టుడికి సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లోకక్షేమం కోసం ప్రత్యేక హోమపూజలు చేశారు. అదేవిధంగా వేలూరు ఉమ్మడి జిల్లాతో పాటు తిరువణ్ణామలై జిల్లాలోని శ్రీకృష్ణుడి ఆలయాల్లో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. -
పోక్సో కేసులో శిక్షపడిన యువకుడి విడుదల
– మద్రాసు హైకోర్టు తీర్పు కొరుక్కుపేట: యుక్తవయస్సు రావడానికి కేవలం 19 రోజుల దూరంలో ఉన్న కళాశాల విద్యార్థిని అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన యువకుడిని మద్రాస్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. వివరాలు.. కోయంబత్తూరుకు చెందిన ఓ యువకుడు కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అతడిని తన ఇంటికి ఆహ్వానించింది. అక్కడ ఇద్దరూ లైంగిక చర్యలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు వీరి ప్రేమకు అంగీకరించలేదు. పైగా అప్పటికే వివాహం చేసుకున్న 40 ఏళ్ల బంధువుతో ఆమెకు వివాహం ఏర్పాటు చేశారు. అయిష్టత వ్యక్తం చేసిన ఆ విద్యార్థిని తన ప్రియుడి ఇంట్లో ఆశ్రయం పొందింది. దీని తరువాత, బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆ యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు. కేసును విచారించిన కోయంబత్తూరు పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి, ఆ యువకుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో అప్పీలు దాఖలైంది. ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి జి.కె. ఇలంధిరియన్, దిగువ తీర్పును కొట్టివేసి, యువకుడిని నిర్దోషిగా విడుదల చేయాలని ఆదేశించారు. ఆ సంబంధం ఇద్దరి మధ్య ఏకాభిప్రాయంతోనే జరిగిందని, బాధితురాలు కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్నందున ఆమె తన చర్యల పర్యవసానాలను అర్థం చేసుకోగలదని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా ఘటన జరిగిన సమయంలో ఆ మహిళ మద్యం మత్తులో లేదని పేర్కొంది. అతను ఆ మహిళను అపహరించాడని, కిడ్నాప్ చేశాడని ఎటువంటి ఆధారాలు లేవు. విచారణ అంతటా విద్యార్థిని ఎక్కడా తన అనుమతి లేకుండా , ఒత్తిడితో లైంగిక సంబంధం జరిగిందని పేర్కొనలేదు. ఈనేపథ్యంలో అతన్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. -
క్లుప్తంగా
కారు ఢీకొని ఉద్యోగి దుర్మరణం తిరువొత్తియూరు: బైక్ను కారు ఢీకొన్న ఘటనలో ఒక విద్యుత్ శాఖ ఉద్యోగి దుర్మురణం చెందాడు. చైన్నె పాలవాక్కంకు చెందిన అశోక్కుమార్ (30) చైన్నెలో విద్యుత్శాఖలో పనిచేస్తున్నారు. ఇతని భార్య అనుప్రియ. వీరికి మేఘవ్(2) అనే కుమారుడు ఉన్నాడు. గత రెండు రోజుల క్రితం అశోకుమార్ భార్య, కుమారుడితో కలిసి నాగపట్టణం జిల్లా, తిరుప్పుగళూరులోని అత్తగారింటికి వెళ్లాడు. శనివారం అశోక్కుమార్ భార్య, కుమారుడుతో కలిసి తిరువారూర్ జిల్లా నన్నిలం సమీపంలోని ఒక ఆలయానికి బైక్లో వెళ్లాడు. నన్నిలం సమీపంలోని నాలుగు రోడ్ల రౌండ్ ఠాణా మలుపు వద్ద వెళుతుండగా తిరుచ్చికి చెందిన అవినాష్బాబు (24) నడుపుతున్న కారు బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో అశోకుమార్, అనుప్రియ, మేఘవ్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరు కుని తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో అశోక్కుమార్ మృతిచెందాడు. అనుప్రియ, మేఘవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. షేర్ మార్కెట్లో నష్టం – మహిళ ఆత్మహత్య తిరువొత్తియూరు: ĶæÊr*Å»Œæ ^èl*íÜ B¯ŒS-OÌñæ-¯Œ-¯ŒSÌZ õÙÆŠ‡ Ð]l*Æð‡P-sŒæÌZ ò³r$t-ºyìl ò³sìæt Æý‡*.2.5 ÌS„ýSË$ ´ùVör$t-MýS$¯]l² Ð]l$íßæâýæ, ¿ýæÆý‡¢MýS$ ÐésêÞ-‹³ ÌZ çÜÐ]l*-^éÆý‡… ç³…í³ B™èlÃ-çßæ™èlÅ ^ólçÜ$-MýS$…-¨. ^ðlO¯ðl² ç³ÌSÏ-Ð]lÆý‡… çÜÒ$ç³…ÌZ° ´÷ã-^èla-Ë*Æý‡$, gêq¯]lÐ]l$×ìæ ¯]lVýSÆŠ‡ 3Ð]l Ò«¨MìS ^ðl…¨¯]l AÆý‡$׊æ (44). C™èl° ¿êÆý‡Å Ð]l¯]l-f(38). ¨ÐéÅ…VýS$-Oyðl¯]l AÆý‡$׊æ ò³Æ‡$$…sìæ…VŠæ yìlOgñæ-¯]lÆŠ‡V> ç³°^ól-çÜ$¢-¯é²yýl$. D{MýS-Ð]l$…ÌZ Ð]l¯]lf ĶæÊr*Å»Œæ ^èl*íÜ B¯Œ-¯ŒS-OÌñæ-¯Œ¯ŒS õÙÆŠ‡ Ð]l*Æð‡P-sŒæÌZ _¯]l² Ððl¬™èl¢…ÌZ ò³r$t-ºyìl ò³sìæt…-¨. ©…™ø B§éĶæ$… Æð‡sìæt…ç³# AƇ$$Å…-¨. GMýS$PÐ]l yýlº$¾ ò³r$tºyìl ò³yìl™ól GMýS$PÐ]l Ìê¿ýæ… Ð]lçÜ$¢…§ýl° ¿êÑ…_¯]l Ð]l¯]l-f, ¿ýæÆý‡¢MýS$ ™ðlÍ-Ķæ$-MýS$…yé, JMýS ÌZ¯ŒS Ķæ*‹³ §éÓÆ> ₹2.5 ÌS„ýSÌS A糚 ¡çÜ$-MýS$-°, ÝëtMŠS Ð]l*Æð‡P-sŒæÌZ ò³sìæt…-¨. AƇ$$™ól, BÐðl$MýS$ Ìê¿ýæ… Æ>Ìôæ§ýl$. A糚 †ÇW ^ðlÍÏ…-^èlÐ]l$° J†¢yìl ^ólĶæ$-yýl…™ø Ð]l$¯]lçÜ$ ÑÇW-´ù-Ƈ$$¯]l Ð]l¯]l-f, C…sZÏ GÐ]lÆý‡* Ìôæ° çÜÐ]l$-Ķæ$…ÌZ EÇ-ÐólçÜ$MýS$° B™èlÃ-çßæ™èlÅ ^ólçÜ$-MýS$…-¨. Ôèæ…MýSÆŠ‡ ¯]lVýSÆŠ‡ ´ùÎ-çÜ$Ë$, Ð]l¯]lf Ð]l$–™èl-§ól-à°² ´ù‹Üt-Ð]l*-Æ>-t-°MìS {MøÐŒl$-õ³sŒæ {糿¶æ$™èlÓ Bçܵ-{†MìS ™èlÆý‡Í…-^éÆý‡$. లారీని ఢీకొన్న కారు –ఇద్దరు మహిళలు దుర్మరణం –ముగ్గురికి తీవ్రగాయాలు తిరువొత్తియూరు: కోవై సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఆగివున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో చైన్నెకి చెందిన ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. చైన్నె అంబత్తూరుకు చెందిన లావణ్య (40), మలర్ (40) అనే వీరిద్దరూ కుటుంబాలతో కలిసి రెండు రోజుల క్రితం చైన్నె నుంచి కేరళలోని కొచ్చికి పర్యాటకానికి వెళ్లారు. ముగించుకునిఆదివారం తెల్లవారుజామున చైన్నెకికారులో బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున కోయంబత్తూరు జిల్లా వాలైయార్ చెక్పోస్ట్ సమీపంలో వెలుతుండగా అక్కడ ఆగివున్న లారీని కారు అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వాలైయార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ కాసిహా, కృతిక్ రోషన్ (14), దీప (8)లను కోవై ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే గేట్మన్ సస్పెన్షన్ తిరువొత్తియూరు: లెవల్ క్రాసింగ్ వద్ద రైల్వే గేట్ వేయక పోవడంతో గేట్మన్ను అధికారులు సస్పెండ్ చేశారు. రామేశ్వరం నుంచి శనివారం ఉదయం 5.40 గంటలకు మదురైకి వెళ్లే ప్యాసింజర్ రైలు బయలుదేరింది. ఈ రైలు పాంబన్, మండపం, ఉచ్చిపుళి రైల్వేస్టేషన్లను దాటి రామనాథపురం వైపు వెళుతోంది. రామనాథపురం, వళుదూర్ మధ్య ప్రాంతంలో వెళుతుండగా, వాలాంతరవై ప్రాంతంలోని రైల్వే గేటు తెరిచి వుంది. వాహనాలు గేటును దాటి వెళ్లడాన్ని దూరం నుంచే గమనించిన ఇంజిన్ డ్రైవర్ వెంటనే రైల్వే గేటుకు 100 మీటర్ల దూరంలో రైలును నిలిపివేశారు. రైలు నుంచి దిగి రైల్వే గేటు వద్దకు వెళ్లి గేట్మన్తో గేట్ వేయించాడు. తర్వాత ఇంజిన్ డ్రైవర్ రైలును నడిపాడు. ఇంజిన్ డ్రైవర్, మదురై డివిజనల్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఈ ఘటనపై డ్యూటీలో నిర్లక్ష్యం వహించినందుకు రైల్వే అధికారులు గేట్మన్ను సస్పెండ్ చేశారు. భక్తులతో పోటెత్తిన బోయకొండ చౌడేపల్లె: కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తులపాలిట వరాలిచ్చే ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. భక్తులు అధిక సంఖ్యలో బోయకొండకు చేరుకుని అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ గణనీయంగా పెరగడంతో క్యూలైన్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ిపిండి, నూనెదీపాలు, మేళతాళాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈఓ ఏకాంబరం పర్యవేక్షణలో అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. -
కనకదుర్గా శతకం పుస్తకావిష్కరణ
కొరుక్కుపేట: తెలుగు భాషా ప్రక్రియల్లో శతక ప్రక్రియకు ప్రత్యేక స్థానం ఉందని, నేడు 108 పద్యాలతో శ్రీ కనకదుర్గా శతకం రావడం అభినందనీయమని జలదంకి కోదండరామ రెడ్డి, ఆచార్య విస్తాలి శంకరరావు, రాంబాబు అన్నారు. ఆదివారం ఉదయం చైన్నె మైలాపూర్లోని అమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములు స్మారక భవనం వేదికగా, జనని సాంఘీక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు గుడిమెట్ల చెన్నయ్య నిర్వహణలో, జనని అధ్యక్షురాలు నిర్మల సభాధ్యక్షతన కవి, రచయిత, డాక్టర్ మన్నవ గంగాధర ప్రసాద్ రాసిన శ్రీ కనకదుర్గా శతకం పుస్తకావిష్కరణ ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషాభిమాని శోభారాజ పుస్తకం తొలి ప్రతిని అందుకున్నారు. మన్నవ గంగాధర ప్రసాద్ మాట్లాడుతూ 2008 లో ప్రారంభించిన ఈ శతకం కొన్ని అనివార్య కారణాల రీత్యా మధ్యలో ఆపగా నేడు జనని సంస్థ వల్ల పుస్తక రూపంలోకి తీసుకురావడం, చైన్నెలో ఆవిష్కరించడం ఆనందమన్నారు. డాక్టర్ మోహనశ్రీ , లక్ష్మీకాంత్, సగలి సుధారాణి, అభ్యుదయ రచయితల సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు యువశ్రీ, కథా రచయిత పేరూరు బాలసుబ్రమణ్యం, టీచర్ఏడుకొండలయ్య, సంగీత దర్శకులు ఎంఆర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
రోగులకు అవసరమైన వసతులు
వేలూరు: పెంట్ల్యాండ్ ప్రభుత్వాస్పత్రిలో రోగులకు అవసరమైన వసతులన్నీ సిద్ధం చేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. గత రెండు నెలల క్రితం సీఎం స్టాలిన్ చేతులమీదుగా పెంట్ల్యాండ్ ప్రభుత్వాస్పతిని ప్రారంభించారు. అయినప్పటికీ ఎటువంటి వసతులు లేకపోవడంతో రోగులను అనుమతించలేదు. దీంతో ప్రతి పక్ష పార్టీలు దీనిపై పలు విమర్శలు చేయడంతోపాటు వేలూరులో అన్నాడీఎంకే పార్టీ ధర్నాలు నిర్వహించి రోగులకు అవసరమైన వసతులు కల్పించకుండా ఆస్పత్రిని ప్రారంభించారని నినాదాలు చేయడంతో ఆస్పత్రిని మూసి వేశారు. ప్రస్తుతం వార్డులను ప్రారంభించి రోగులను అనుమతించారు. కలెక్టర్ సుబ్బలక్ష్మి ఆస్పత్రిలో రోగుల వద్ద వసతులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు అవసరమైన ఓపీ వసతి, వార్డుల్లోని కనీస వసతులున్నాయా అనే వాటిని తనఖీ చేశారు. కలెక్టర్తో పాటు కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణన్, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
ఊపందుకున్న గణపయ్యల తయారీ
తిరువళ్లూరు: వినాయకచవితి వేడుకలకు మరో పది రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో వినాయకుడి విగ్రహాల తయారీ, ముందస్తు బుకింగ్ ఊపందుకుంది.ఈ ఏడాది కూడా వినాయకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే బీజేపీ హిందూమున్ననీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో ప్రతిమల తయారీ ఊపందుకుంది. హిందు మున్ననీ నేతలు తిరుపతి, విల్లుపురం ప్రాంతాల నుంచి విగ్రహాలను తీసుకొచ్చి పలు ప్రాంతాల్లో తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి విక్రయాలకు సిద్ధంగా వుంచారు. ప్రస్తుతం విక్రయాలకు సిద్ధంగా వున్న విగ్రహాలను ముందుగానే బుకింగ్ చేసుకునే పనిలో ఉత్సవ నిర్వాహకులు నిమగ్నమయ్యారు.పర్యావరణానికి ముప్పులేని, సులభంగా నీటిలో కరిగే ప్రతిమలను మాత్రమే విక్రయించాలని అధికారులు ఆదేశించారు. దీంతో బొమ్మల తయారీదారులు అధికారుల సూచన మేరకు బొమ్మలను తయారు చేసి తుది మెరుగులు దిద్దుతున్నారు. మూడు నుంచి పది అడుగుల మేరకు విగ్రహాలను తయారు చేస్తున్నారు. వీటి ధరలు వెయ్యి నుంచి రూ.20 వేల వరకు వుంటుందని హిందూ మున్ననీ అధ్యక్షుడు వినోద్కన్నా వివరించారు. ప్రస్తుతం రెండువందలకు పైగా విగ్రహాలు వున్నాయి. 30 రకాల ప్రతిమలను తయారు చేసి విక్రయాలకు సిద్ధంగా వుంచినట్టు హిందూ మున్ననీ నేతలు ప్రకటించారు. -
పూర్వవిద్యార్థుల కలయిక
కొరుక్కుపేట: చైన్నెలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానం అండ్ చారిటీస్ నిర్వహణలోని ఎస్కేపీడీ హాస్టల్ పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఎస్కేపీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. దీనికి అసోసియేషన్ అధ్యక్షుడు టి.జగదీష్బాబు అధ్యక్షత వహించారు. 74 మందికిపైగా పూర్వవిద్యార్థులు పాల్గొని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పూర్వవిద్యార్థుల అసోసియేషన్ తరఫున హాస్టల్కు ఇండక్షన్ స్టవ్ , 18 మంది విద్యార్థులకు ట్రావెల్ బ్యాగ్లు, మెరిట్ విద్యార్థులకు ఆర్ధిక సాయం, సీనియర్ సభ్యులు, అతిథులకు మెమెంటోలు బహూకరించి సత్కరించారు. కార్యక్రమంలో జయరాజ్ గ్రూప్ ఎండీ రాజశేఖర్ తాడేపల్లి, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరు రామకృష్ణ, అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి గుర్రం బాలాజీ, ఉపాధ్యక్షుడు నరసింహన్, కోశాధికారి ఎస్ రాములు, రాధాకృష్ణమూర్తి, కె.గోపాల్శెట్టి పాల్గొన్నారు. -
విభేదాలన్నీ వీడితేనే దేశంలో ఐక్యత
సాక్షి, చైన్నె: కుల, మత బేధాలన్నింటినీ చిన్నాభిన్నం చేసినప్పుడే అందరం ఒకే దేశంలో ఐక్యంగా ముందుకెళ్లగలమని రాజ్యసభ సభ్యుడు, మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ అభిప్రాయపడ్డారు. వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ ఆదివారం 63వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కామరాజర్ అరంగంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో తిరుమావళవన్కు కమలహాసన్ కేజీ బరువు కలిగిన వెండి చైన్ను బహూకరించారు. ఈసందర్భంగా కమల్ ప్రసంగిస్తూ, తిరుమావళవన్ 46 ఏళ్ల రాజకీయ ప్రస్తానం గురించి వివరించారు. రాజకీయాలలో రాణించడం సాధారణం కాదని, ఆయన ఒక పార్టీని 40 సంవత్సరాలకు పైగా నడిపిస్తుండటం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఒక పార్టీని నడిపించాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని అని, ఇది ఒక పార్టీ నేతగా తనకు తెలుసునని వ్యాఖ్యలు చేశారు. తిరుమావళవన్ అద్బుతమైన వ్యక్తి అని, ఆయన్ను ఆదాయం కావాలా..? రాజకీయం కావాలా..? అని ప్రశ్నిస్తే, తనకు రాజకీయం కావాలని సమాధానం ఇచ్చే వ్యక్తి అని కొనియాడారు. తన కులం తనకు తొలి శతృవు అని అంటారని పేర్కొంటూ, కులం, మతం బేధాలన్నీ చిన్నా భిన్నమైనప్పుడే ఈ దేశంలో అందరం ఐక్యంగా ఉండగలమని వ్యాఖ్యలు చేశారు. -
బీజేపీలోకి డీఎంకే నేతలు
సాక్షి, చైన్నె: బీజేపీలోకి డీఎంకే నుంచి పలువురు నేతలు వచ్చి చేరబోతున్నారని కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నట్టు వివరించారు. కేంద్ర సమాచార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎల్ మురుగన్ ఆదివారం కోయంబేడులో మీడియాతోమాట్లాడారు. తమిళనాడుకు కేంద్ర అనేక ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను అందిస్తున్నట్టు వివరించారు. తాజాగా ప్రజల విజ్ఞప్తి మేరకు అదనంగా రైళ్ల స్టాపేజికి సైతం అనుమతులు దక్కాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఏడాది తమిళనాడులో రైల్వే పథకాలకు కేంద్రం రూ. 6,626 కోట్లు కేటాయించిందన్నారు. బీజేపీలోకి వలసలు.. డీఎంకే నేతలు కొందరు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వారు తమతో సంప్రదింపులు చేస్తున్నారని, త్వరలో వారు బీజేపీలోకి వస్తారని వ్యాఖ్యానించారు. తమ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా ఈనెల 22వ తేది తిరునల్వేలిలో పర్యటించనున్నారని తెలిపారు. ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని బూత్ కమిటీల నేతలతో ఆయన మాట్లాడుతారని వివరించారు. తమ కూటమిలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నదన్నారు. ఆయన ఎక్కడకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు. ఆయన యాత్రకు వస్తున్న స్పందనను చూస్తే తమ కూటమిలోకి చేరేందుకు మరిన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయన్నారు. -
క్రీడాకారులకు అభినందనలు
సాక్షి,చైన్నె: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా వివిధ అవార్డులను అందుకున్న క్రీడాకారులను క్రీడల శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ఆదివారం అభినందించారు. వారిని సత్కరించారు. పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తులసిమది మురుగేశన్కు కల్పనా చావ్లా అవార్డు దక్కిన విషయం తెలిసిందే. కాంచీపురంకు చెందిన తులసిమదిని 2025 సంవత్సరానికి గాను కల్పనా చావాల్లా అవార్డుతో సత్కరించారు. అలాగే, తిరునెల్వేలి జిల్లాకు చెందిన సి. చందూరుకుమార్, సేలం జిల్లా ఎం. జయకుమార్, పారా హై జంప్ క్రీడాకారుడు టి. మరియప్పన్,చైన్నెకు చెందిన క్యారమ్స్ క్రీడాకారిణి కాశీమా, పుదుకోట్టైకు చెందిన ఎ. లావణ్య, కృష్ణగిరికి చెందిన కె. గౌరిలు సీఎం యువజన అవార్డులను అందుకున్నారు. వీరందర్నీ ఉదయనిధి స్టాలిన్ పిలిపించి సత్కరించారు. అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జె. మేఘనాథరెడ్డి పాల్గొన్నారు. -
తమిళుల మనో భావాలకు వ్యతిరేకంగా గవర్నర్ మాట్లాడటం విచారకరం అని సీఎం స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు గవర్నర్ ద్వారా నీచ రాజకీయాలను చేయడం తగదని హెచ్చరించారు. చౌక బారు విమర్శలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.
రెతులకు పంట రుణాలకు గాను చెక్కులను అందజేస్తున్న సీఎం స్టాలిన్ మురసోలి మారన్ ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న సీఎం స్టాలిన్సాక్షి, చైన్నె : సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ధర్మపురిలో క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లారు. ఆదియమాన్ కోట్టైలో జరిగిన కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార రుణ సంఘాల నుంచి దరఖాస్తు చేసుకున్న రోజే పంట రుణాలు అందించే కొత్త పథకంకు శ్రీకారం చుట్టారు. దేశానికే మార్గదర్శకంగా నిలిచే విధంగా ఈ ప్రాజెక్టును సీఎం ప్రకటించారు. ఇది వరకు వారం రోజులు సమయం పట్టేదని, ఇక దరఖాస్తు చేసుకున్న రోజే జాప్యం లేకుండా రైతుల బ్యాంక్ ఖాతాలలో పంట రుణాలు జమ చేసే విధంగా పైలట్ ప్రాజెక్టుగా అమల్లోకి తీసుకొచ్చారు. తొలి విడతగా ధర్మపురి జిల్లాలో ఎంపిక చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకారం రుణ సంఘాలలో ఐదుగురు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగా, వారికి రుణాలను సీఎం అందజేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పొదుపు ఖాతా నంబరును ఉపయోగించి రుణానికి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా చేసుకునే అవకాశం కల్పించారు. ఈ పథకానికి సంబంధించిన వివరాలు రెవెన్యూ శాఖ లేదా వ్యవసాయ శాఖ నుంచి ఆన్లైన్ ద్వారా పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. దిగజారుడు రాజకీయాలు.. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను విజయవంతంగా అమలు చేస్తూ ముందుకెళ్తున్న తమ మీద నిందలు వేయడమే లక్ష్యంగా ప్రయత్నాలను విస్తృతం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం తమిళనాడులో అమలులో ఉన్న పథకాలు, ప్రాజెక్టులను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోనూ అమలు చేస్తున్నారని , దీనిని బట్టి చూస్తే దేశ అభివృద్ధికి తమిళనాడు తోడ్పాటుగా ఉండటమే కాదు, ప్రాజెక్టులలో తమిళనాడు అగ్రగామి రాష్ట్రంగా అవతరించి ఉందన్నారు. భారతదేశానికి దిక్సూచిగా తమిళనాడు మారుతుండటాన్ని చూసి తట్టుకోలేకి , దుర్మార్గపు శక్తులు బురద చల్లడమే ధ్యేయంగా ముదుకెళ్తున్నాయని మండి పడ్డారు. ప్రతి పక్షాలు విమర్శిస్తే, రాజకీయ నాయకులకు పరిపాటే అనుకోవచ్చు అని, అయితే, తమిళనాడులో కీలక పదవిలో ఉన్న వ్యక్తి చౌక బారు రాజకీయాలు చేస్తుండటం శోచనీయమని విమర్శించారు. ఈ రాజకీయాలు చేస్తున్నదెవరో కాదని, గవర్నర్ అని వ్యాఖ్యలు చేశారు. ప్రతి పక్షాలు ఎన్ని చెప్పినా వాటితో తనకు పని లేదని, అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వారా నియమితులైన గవర్నర్ డీఎంకే పాలనను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ఆయన ద్రావిడ వాదాన్ని విమర్శిస్తారే గానీ, చట్టాలను మాత్రం ఆమోదించరని విమర్సించారు. తిరుక్కురల్ను ముద్రించి పంపిణీ చేస్తారని, తమిళంలో మాట్లాడుతానంటూ వ్యాఖ్యల చేస్తాని, అయితే, ఆచరణలో తమిళనాడును అవమానించడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని గవర్నర్ తీరును వివరిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడు విద్యార్థులను అవమానిస్తాడని, ప్రజల్లో భయాన్ని వ్యాపింపచేసే విధంగా చర్యలు ఉంటాయని మడిపడ్డారు. తమిళనాడు అత్యున్నత రాష్ట్రంగా అవతరించిందని కేంద్ర వెల్లడించే జాబితాలలోనే స్పష్టం చేస్తుంటే, గవర్నర్ వ్యాఖ్యలు మాత్రం భిన్నంగా విమర్శలతో కూడుకుని ఉండడం విచారకరం అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తమిళనాడు అన్ని విధాలుగా సురక్షితం అని, దీనిని ఓర్వలేకే బహిరంగంగా గవర్నర్ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని, తమిళనాడుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారని మండిపడ్డారు. బీజేపీ పాలిక రాష్ట్రాలలో నేరాలు ఏ మేరకు పెట్రేగుతున్నాయో గవర్నర్ గమనిస్తే.. మంచిదని హితవు పలికారు. తమిళానికి, తమిళుల మనో భావాలకు వ్యతిరేకంగా నీచ, దిగజారుడు రాజకీయాలను, చౌకబారు విమర్శలుమానుకోవాలని హెచ్చరించారు. బ్రహ్మరథం.. క్షేత్రస్థాయి పర్యటన నిమిత్తం సేలం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం స్టాలిన్కు డీఎంకే వర్గాలు, ప్రజలు బ్రహ్మరథం పట్టాయి. రోడ్డు మారగలో ఆయన ధర్మపురికి వెళ్లారు. అడుగడుగునా జన నీరాజనాలు లభించాయి. ధర్మపురిలోని తండంగంలో జరిగిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రి మురసోలిమారన్ జయంతి సందర్భంగా, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన ఆ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రభుత్వ వేడుకలో రూ. 362 కోట్ల 77 లక్షల విలువైన 1,073 పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ. 512 కోట్ల 52 లక్షల అంచనా వ్యయం వివిధ శాఖల తరపున చేపట్టనున్న 1044 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. రూ. 830 కోట్లు విలువగల సంక్షేమ పథకాలను 70,427 మంది లబ్ధిదారులకు అందజేశారు. పూర్తైన ప్రాజెక్టులలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ కార్యాలయాల భవనాలు, వంతెనలు, పాఠశాలలకు అదనపు తరగతి గదులు, ఆరోగ్య కేంద్రాల భవనాలు, కమ్యూనిటీ సెటర్లు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లు, బోరు బావులు, ఈసేవా కేంద్రాల భవనాలు, రోడ్లు, తదితర పనులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎంఆర్కే పన్నీరు సెల్వం, ఏవీ వేలు, పెరియకర్పున్, ఆర్ రాజేంద్రన్, ఎంపి మణి, ఎమ్మెల్యే ఎస్పీ వెంకటేశ్వరన్, జిల్లా కలెక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందుబాటులోకి రుణాలు.. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ, అన్నదాత సమాజానికి పంట రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతోనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టామన్రాను. రైతుల ప్రయోజనాల దృష్ట్యా, ఎలాంటి జాప్యం అననది లేకుండా ఇక రుణాలు ఖాతాలలో జమ అవుతాయన్నారు. ధర్మపురి అభివృద్ధి ద్రావిడ పురోగతి అని, హొగ్నెకల్ ఉమ్మడి తాగు నీటి ప్రాజెక్టు ఘనత తమదేనని ధీమా వ్యక్తంచేశారు. ఈసందర్భంగా ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలకు తమ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.ఈ నాలుగు సంవత్సరాలలో ధర్మపరి జిల్లాకు రూ. 447 కోట్లు వెచ్చించామని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కొన్ని కొత్త ప్రకటనలు చేశారు. చిత్తేరి పంచాయతీ పరిధిలోని కొండ గ్రామాలు, చిన్నం కుప్పం, గోపిశెట్టిపాళ్యంతోపాటుగా ఉన్న పరిసర గ్రామాల ప్రజలకు పాపి రెడ్డి పట్టి గ్రామాలను అరూర్ రెవెన్యూ తాలుకాల విలీనం చేస్తున్నామని ప్రకటించారు. హొగ్నెకల్ – ధర్మపురి మార్గంలోని ఆట్టుకారన్ పట్టి నుంచి పెన్నగరం వరకు 25 కి.మీ దూరం రోడ్డును ఫోర్వేగా విస్తరించనున్నామని వివరించారు.రూ. 165 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నామన్నారు. నల్లంపల్లి పంచాయతీ యూనియన్లోని పారికం నుంచి మలైయూర్ వరకు అటవీ రహదారినిఇ రూ. 10 కోట్లతో అప్ గ్రేడ్ చేయనున్నామన్నారు. చింతపండు ఉత్పత్తిలో ప్రసిద్ది చెందిన ఈ జిల్లాలోని రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా రూ.11.30 కోట్లతో ఇంటి గ్రేటెడ్ చింత పండు ట్రేడింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నామన్నారు. అరూర్ మునిసిపాలిటీలో నివసిస్తున్న ప్రజల సంక్షేమం కోసం వల్లిమధురై నీటి సరఫరా ప్రాజెక్టు కొత్త పైపులను ఏర్పాటు చేయనున్నామని రూ. 15 కోట్లతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.