breaking news
Tamil Nadu
-
మారథాన్
అన్నా జయంతి వేడుకల్లో తిరువళ్లూరు: అన్నా జయంతి ఉత్సవాల్లో భాగంగా తమిళనాడు క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మారథాన్ పోటీలను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నాజర్ పచ్చజెండా ఊపి, ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా జయంతి ఉత్సవాల్లో భాగంగా మారథాన్ పోటీలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగానే తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయంలోని మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీని మంత్రి నాజర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి నాజర్ మాట్లాడుతూ యువతీయువకులకు వేర్వేరుగా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 17 నుంచి 25 సంవత్సరాల వయస్సులోపు ఉన్న యువతకు 8 కిమీ, సీ్త్రలకు 5 కిమీ, 25 వయస్సు పైబడిన వారిలో సీ్త్రలకు 5 కిమీ, పురుషులకు 10 కిమీ దూరం పోటీలను నిర్వహించినట్టు తెలిపారు. పోటీల్లో 200 మందికి పైగా పాల్గొన్నారు. పోటీల విజేతల్లో మొదటి స్థానంలో నిలిచే వారికి రూ.5 వేలు, రెండో స్థానంలో నిలిచే వారికి మూడు వేలు, మూడో స్థానంలో నిలిచే వారికి రెండు వేలు, ప్రత్యేక స్థానంలో నిలిచే వారికి రూ.వెయ్యి అందజేయనున్నారు. తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్, జిల్లా స్పోర్ట్స్ అధికారి సేతురాజన్ పాల్గొన్నారు. -
సదరన్ రైల్వేలో డిజిటల్ టికెట్ పద్ధతి
కొరుక్కుపేట: డిజిటల్ టిక్కెట్లను ప్రోత్సహించడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం ఒక ముఖ్య చర్యగా సదరన్ రైల్వే చైన్నెలోని డాక్టర్ ఎం.జి.రామచంద్రన్ సెంట్రల్ స్టేషన్లో ఎంఅండ్ యూటీఎస్ సహాయక్ పథకాన్ని ప్రారంభించింది. మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ సదుపాయం కలిగిన ప్రింటర్లతో కూడిన శిక్షణ పొందిన సహాయక్లు, టిక్కెట్ కౌంటర్లకు సమీపంలో ప్రయాణికులకు ఈ డిజిటల్ విధానంలో టిక్కెట్లను అందిస్తారు . ఇది ప్రయాణికులకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ప్రయాణ సరళతను అందిస్తుంది. చైన్నె సెంట్రల్ స్టేషన్లో పథకం అమలు చేయబడిందని అధికారులు తెలిపారు. ఈ విధానంతో టిక్కెట్ల కౌంటర్లలో బారులు తీరిన వరుసలను తగ్గించడం, టిక్కెట్ల ప్రక్రియను విరివిగా చేయడం, ప్రయాణికుల సంతృప్తిని మెరుగు పరుస్తుందని వెల్లడించారు. -
నేటి నుంచి ఓటరు జాబితా పరిశీలన
– ఇంటింటికీ వెళ్లి పరిశీలించనున్న అధికారులు తిరువళ్లూరు: ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాను సరి చూసే కార్యక్రమాన్ని నేటి నుంచి నెల రోజులపాటు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. ఓటరు జాబితాను సరి చూడడం, కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడం, మార్పులు చేసి ఫిబ్రవరిలో సవరించిన తుది ఓటర్లు జాబితాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలోని పేర్లను ఇంటింటికి వెళ్లి సరి చూసే కార్యక్రమాన్ని నిర్వహించనున్న క్రమంలో సోమ వారం మధ్యాహ్నం కలెక్టర్ ప్రతాప్ తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అత్యధికంగా మాధవరంలో నాలుగు లక్షల ఓటర్లు, అత్యల్పంగా పొన్నేరిలో 2.71 లక్షల ఓటర్లు ఉన్నారన్నారు. మొత్తం 35.82 లక్షల ఓటర్లు ఉన్నట్టు వివరించారు. ఓటర్లు జాబితాలలోని పేర్లును ఇంటింటికి వెళ్లి సరి చూసే కార్యక్రమాన్ని నేటి నుంచి నిర్వహించనున్నట్టు తెలిపారు. నెల రోజులపాటు జరిగే ప్రక్రియలో ప్రజల కు అధికారులకు సహకరించాలని సూచించారు. ఓటర్లు జాబితాలో తనిఖీల కోసం 3699 పోలింగ్ బూత్లలో 391 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్టు వివరించారు. పైలట్ ప్రాజెక్టుగా ఆర్కేపేటలో ప్రారంభం 16వ జనాభా లెక్కల సేకరణ పనులు 2027లో ప్రారంభం కానున్న క్రమంలో పైలట్ ప్రాజెక్టుగా ఆర్కేపేట, కాంచీపురం జిల్లాలోని మాంగాడు, క్రిష్టగిరి జిల్లాలోని అంజెట్టి యూనియన్లో జనాభా లెక్కల సేకరణ పనులను ప్రారంభించినట్టు కలెక్టర్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా ఆర్కేపేట యూనియన్లోని 17 గ్రామాలలో జనాభా లెక్కల సేకరణ నవంబర్ పది నుంచి 30 వరకు సుమారు 20 రోజుల్లో ప్రక్రియ సాగుతుందన్నారు. ఇప్పటికే 98 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని వివరించారు. ఆర్కేపేట తాలూకాలోని వెళ్లత్తూరు, వంగనూరు, శ్రీకాళికాపురం, చందనవేణుగోపాలపురం, రాజానగరం, రాగనాయుడుకుప్పం, మీసాకండా పురం, జనకరాజకుప్పం, అమ్మనేరి, అమ్మయార్కుప్పం, ఆదివరాహపురం, సెల్లత్తూరు తదితర 17 గ్రామాల్లో అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించనున్నట్టు తెలిపారు. -
●క్యాన్సర్పై అవగాహన
కారు ప్రమాదంలో మహిళ మృతి అన్నానగర్: దిండుగల్ జిల్లా వడమదురైలోని చిత్తూరు ప్రాంతానికి చెందిన భువనేశ్వరి(22) కళాశాల విద్యార్థిని. ఈమె వడమదురైకి చెందిన నందకుమార్(23) గత ఒక సంవత్సరంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పళని మురుగన్ ఆలయానికి వెళ్లి ఒడ్డంఛత్రం సమీపంలోని చత్రపట్టి పశువుల మార్గం ప్రాంతానికి సోమవారం కారులో వస్తున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా కారు అదుపు తప్పింది. నియంత్రణ కోల్పోయి రోడ్డు మధ్యలో బోల్తా పడి ప్రమాదానికి గురైంది. భువనేశ్వరి తలకు తీవ్ర గాయాలు ఏర్పడి, ఆమె ప్రియుడి కళ్లముందే అక్కడికక్కడే మరణించింది. నందకుమార్ అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానిక పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
నవశక్తికి గోల్డ్ మెడల్
తిరుపతి సిటీ: అఖిల భారత స్థాయి కరాటే పోటీల్లో తిరుపతికి చెందిన ర్యాలీ నవశక్తి బంగారు పతకం సాధించి శభాష్ అనిపించుకుంది. కర్ణాటక రాష్ట్రం మైసూరులోని చాముండి విహార్ స్టేడియంలో 29వ అఖిల భారత షిటోర్యు కరాటే చాంపియన్షిప్–2025 పోటీలు నిర్వహించారు. రెండ్రోజుల ఈ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన జట్లలో తిరుపతిలోని వెంకీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి నవశక్తి ప్రాతినిధ్యం వహించి, ఓపెన్ సీనియర్ మహిళల కుమితే (ఫైటింగ్) విభాగంలో పాల్గొంది. రెండేళ్ల విరామం అనంతరం పాల్గొన్నప్పటికీ సెమీస్లో కేరళ, ఫైనల్స్లో కర్ణాటక క్రీడాకారిణులను ఓడించింది. ఇప్పటికే కరాటే పోటీల్లో లెక్కలేనని పతకాలు, ట్రోఫీలు, అవార్డులు సాధించిన నవశక్తి మూడున్నరేళ్ల ప్రాయంలోనే కృష్ణానదిలో 4.5 కిలోమీటర్లు ఈది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చెక్కు చెదరని రికార్డు కలిగి ఉంది. బీటెక్ పూర్తి చేసిన నవశక్తి ప్రస్తుతం చైన్నెలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తోంది. -
శాస్త్రోక్తంగా ఆళ్వార్ల మందిరా నిర్మాణానికి పూజలు
కొరుక్కుపేట: మైలాపూర్లోని జగదాచార్య సహస్రాబ్ది స్మారక సభ ఆధ్వర్యంలో నగర శివారులో నిర్మించనున్న మందిరం నిర్మాణం రెండవ దశ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. జగదాచార్యులుగా ప్రసిద్ధి చెందిన రామానుజాచార్యుల తోపాటూ ఆల్వార్ల మందిరాల నిర్మాణంలో భాగంగా సోమవారం ఐదు మందిరాల నిర్మాణానికి పూజలు ప్రారంభించారు. జగదాచార్య సహస్రాబ్ది స్మారక సభ వ్యవస్థాపకులు ఊసూరు నందగోపాల్ , ఊసూరు లత పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రంగా ఆనందం శెట్టి తోపాటు దాతలు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వాస్ బృంద సభ్యులు విష్ణు సహస్రనామ పారాయణంను భక్తి శ్రద్దలతో చేశారు. అనంతరం ఆల్వార్లు మందిర నిర్మాణాలను గురించి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా రామనుజాచార్యలు, 12 మంది ఆల్వార్లుకు మందిరాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు తొలి దశలో మందిర నిర్మాణానికి అవసరమైన పునాది పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం రెండో దశ పనులను ప్రారంబించామని , త్వరలో ఈ ఆలయాన్ని పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా వత్సల అముల్నాథ్, శ్రీ లక్ష్మీ , అష్రాన్, ఐ.గోపినాథ్ ,ఎథిరాజ్, సంపత్కుమార్, మురళీ పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్పై ఆందోళన వద్దు
నేటి నుంచి సర్వే రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)కు ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. మంగళవారం నుంచి ఇంటింటా సర్వేకు చర్యలు తీసుకున్నారు. ఎస్ఐఆర్పై ఆందోళన వద్దని హైకోర్టుకు ఓ కేసు విచారణ సమయంలో ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. ఎ వ్వరూ ఊహించని రీతిలో ఉత్తమంగా పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సాక్షి, చైన్నె: 2026లో అసెంబ్లీ ఎన్నికలను తమిళనాడు ఎదుర్కోబోతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో రాష్ట్రంలోని ఓటరు జాబితాను సవరించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. ఆ మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 68,467 పోలింగ్ కేంద్రాలున్నాయి. గత నెలాఖరులో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ సవరణ నోటిఫికేషన్ విడుదల చేసినానంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం కసరత్తులపై దృష్టి పెట్టింది. తమిళనాడులో చేపట్టాల్సిన పనులు, ఇతరాత్రా అంశాల గురించి ఎన్నికల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు,జిల్లాలోని ఎన్నికల అధికారులతో వీడియో కాన్పరెన్స్ సమావేశాలు జరిగాయి. అలాగే తొలుత జిల్లాలలో గుర్తింపు పొందిన రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహించారు. గుర్తింపు పొందిన రాష్ట్రస్థాయి నేతలతో అర్చనా పట్నాయక్ సమావేశమయ్యారు. ఈ సమావేశాలలో ఎస్ఐఆర్కు డీఎంకే కూటమి తీవ్ర వ్యతిరేకతను వ్యక్తంచేసింది. కుట్రల్ని భగ్నం చేద్దాం.. ధర్మపురి జిల్లా పెన్నాగరంలో ఎంపీ మణి ఇంటి వివాహవేడుకలో ప్రసంగించిన సీఎం స్టాలిన్ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించారు. ఆదివారం జరిగిన ఎస్ఐఆర్ వ్యతిరేక అఖిల పక్ష సమావేశంలో నేతలు చేసిన సూచనలను గుర్తుచేస్తూ, తీర్మానం గురించి ప్రస్తావించారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతున్న సమయంలో దుష్ట శక్తులు కుట్రలకు పదును పెట్టాయని ధ్వజమెత్తారు. నిజాయితీగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండగా, నిజమైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలించే వ్యూహాలకు పదును పెట్టారని ఽమండిపడ్డారు. ఎన్నికలకు కొన్ని నెలలే ఉన్న తరుణంలో, తాజాగా సమయం కూడా ఇవ్వకుండా ఆగమేఘాలపై ఓటరు జాబితాలో పూర్తిస్థాయి సవరణ పనులు చేపట్టేందుకు సిద్ధం కావడం దొడ్డి దారిలో కేంద్రం అనుసరిస్తున్న కుట్ర కాదా? అని ప్రశ్నించారు. బిహార్లో చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేస్తూ, తొలుత తమిళనాడు నుంచి గళాన్ని విప్పింది తానేనని పేర్కొన్నారు. అలాగే లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఈ కుట్ర గురించి సమగ్ర వివరాలను బయట పెట్టారని వివరించారు. సుప్రీంకోర్టులో కేసు ఉందని గుర్తుచేస్తూ, తాజాగా తమిళనాడుతో సహా పలు రాష్ట్రాలలో బిహార్ కుట్రల వ్యూహాలకు కేంద్ర పాలకులు పదును పెట్టి ఉన్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ చర్యలను ప్రతిపక్ష నేత పళణి స్వామి వ్యతిరేకించక పోవడం, ఈ వ్యవహారంలో ద్వంద్వ బాణి అనుసరించడం అనుమానాలకు బలాన్ని చేకూర్చుతున్నాయన్నారు. బీజేపీకి భయపడి ఎన్నికల కమిషన్ను పళణి వెనకేసుకొస్తున్నట్టుందని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, అన్నాడీఎంకేలు కలిసి కట్టుగా ఎన్నికుట్రలు చేసినా తమిళనాడులో వారి పాచికలు పారవు అని ధీమా వ్యక్తం చేశారు. విషమ పూరితంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం తమిళనాడుపై అక్కసును కక్కుతున్నారని, ద్వేష పూరిత వ్యాఖ్యలను బిహార్ ప్రచారంలో చేస్తున్నారని గుర్తుచేశారు. బిహార్ ప్రజలు తమిళనాడులో సురక్షితంగా ఉన్నారని వివరిస్తూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఇలాంటి ద్వేష పూరిత వ్యాఖ్యలు, ఎన్నికల కమిషన్ ద్వారా మరిన్ని కుట్రలకు ఒడి గడుతున్నారన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, వాటిని భగ్నం చేస్తామని, 2026లో ద్రావిడ మోడల్ 2. ఓ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఓటరు జాబితా సవరణ పేరిట ఎన్నికల కమిషన్ తాజాగా నిజమైన ఓటర్ల పేర్లును తొలగించేందుకు చేస్తున్న కుట్రల్ని భగ్నం చేద్దామని పిలుపునిచ్చారు. మార్గదర్శకాలపై కసరత్తుధాన్యం సేకరణకు ఏర్పాట్లు కోర్టులో పిటిషన్ వేస్తాం.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు సవరణ ప్రయత్నాలను అడ్డుకునే విధంగా డీఎంకే కూటమి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. దీనికి వ్యతిరేకంగా తాము సైతం న్యాయ పోరాటానికి సన్నద్ధంగానే ఉన్నామని అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ఇంటే సీఎం స్టాలిన్కు అలర్జీగా మారిందని ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ను సైతం అన్నాడీఎంకే కార్యాలయం వద్ద పొందు పరచడం గమనార్హం. ఇక కేంద్ర సహాయమంత్రి ఎల్. మురుగన్ పేర్కొంటూ, డీఎంకే అఖిల పక్షం బేటి నాటకం అని వ్యాఖ్యలు చేశారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా నాటకాన్ని తెర మీదకు తెచ్చారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, మంగళవారం నుంచి జరగనున్న ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా డీఎంకే కూటమి పార్టీల తరపున సుప్రీంకోర్టులో పిటిషన్లుదాఖలు చేసినట్టు సమాచారం. ఓటరు జాబితా ఆధారంగా ఇంటింటా సర్వే నిర్వహించేందుకు 77 వేల మంది సిబ్బందిని ఎంపిక చేశారు. వీరికి ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అంశాలు, నిబంధనలు తదితర వివరాలతో ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. సవరణ కసరత్తు ముగించడంతో మంగళవారం నుంచి డిసెంబరు 4 వ తేదీ వరకు నెల రోజుల పాటూ ఇంటింటా సమగ్ర పరిశీలనకు సిద్ధమయ్యారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాలలోని 68,467 పోలింగ్ కేంద్రాలలో అక్కడి బూత్ లెవల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో సమగ్ర సర్వేకు చర్యలు తీసుకున్నారు. ఒక్కో ఇంటికి మూడు సార్లు సిబ్బంది వచ్చి పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా ఇప్పటికే డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశం తీర్మానం చేసింది. న్యాయపోరాటానికి సన్నద్ధమయ్యే విధంగా కసరత్తు చేపట్టారు. అదే సమయంలో హైకోర్టులో దాఖలై ఉన్న ఓ కేసు విచారణ సమయంలో మంగళవారం ఎస్ఐఆర్ ప్రస్తావన వచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఎం శ్రీవత్సవ, న్యాయమూర్తి జి. అరుల్ మురుగన్ నేతృత్వంలోని బెంచ్ సందించిన ప్రశ్నలకు ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ తరపున వివరణ సమర్పించారు. ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య ఉన్న భేదాలను వివరించారు. ఎస్ఎస్ఆర్ కేవలం అభ్యర్థన అని, ఎస్ఐఆర్ పరిశీలన అని పేర్కొన్నారు. బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటా సర్వే నిర్వహించడం జరుగుతుందని వివరించారు. చివరగా ఎస్ఐఆర్ గురించి ఆందోళన వద్దని స్పష్టం చేశారు. ఊహించని రీతిలో ఉత్తమంగా ఈ పనులను విజయవంతం చేస్తామని, సమర్థంగా నిర్వహించి తీరుతామని స్పష్టం చేయడం గమనార్హం. -
తిరువలంగాడు– అరక్కోణం నాలుగు లేన్ల రోడ్డు ప్రారంభం
తిరుత్తణి: తిరువళ్లూరు– అరక్కోణం మార్గంలో రవాణా సేవలు విస్తరించేందుకు వీలుగా ముఖ్యమంత్రి రోడ్ల అభివృద్ధి నిధుల నుంచి రూ. 82 కోట్లు కేటాయించారు. దీంతో రెండు లైన్ల రోడ్డును తిరువలంగాడు నుంచి అరక్కోణం మున్సిపాలిటీ హద్దు వరకు 9 కి.మీ దూరం విస్తరించి నాలుగు లైన్ల రోడ్డు పనులు ఏడాదిగా నిర్వహించారు. తిరుత్తణి హైవే శాఖ ద్వారా నిర్వహించిన పనుల్లో భాగంగా రోడ్డుకు మధ్యలో 21 ప్రాంతాల్లో కల్వర్టులు సైతం నిర్మించి రోడ్డును విస్తరించారు. రోడ్డుకు ఇరువైపుల వెయ్యి మొక్కలు నాటి పర్యవేక్షిస్తున్నారు. విస్తరించిన కొత్త రోడ్డు ద్వారా అరక్కోణం, తిరువళ్లూరు, చైన్నె, కంచి, రాణిపేట,వేలూరు ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటూ ప్రమాదాలు తగ్గి గూడ్సు లారీలు, కర్మాగారాలకు వెళ్లు వాహనాల సమయం వృథా కాకుండా సకాలంలో రాకపోకలు సాగించేందుకు అవకాశం ఏర్పడింది. దీనిపై గ్రామీణులు, ప్రయాణికులు, వాహన చోదకులు హర్షం వ్యక్తం చేశారు. -
● 6న అఖిల పక్షం భేటీ ● రాజకీయ పక్షాలకు ప్రభుత్వం ఆహ్వానం ● సమన్వయ అధికారిగా ధీరజ్కుమార్
సాక్షి, చైన్నె: రాజకీయ పక్షాల రోడ్ షోలు, బహిరంగ సభలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనకు కసరత్తు వేగవంతం చేశారు. దీని గురించి చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈనెల 6న అఖిల పక్ష సమావేశానికి పిలుపు నిచ్చారు. వివరాలు.. 2026 ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమైన విషయం తెలిసిందే. తమ బలాన్ని చాటుకునే రీతిలో, ప్రజల్ని ఆకర్షించే విధంగా దూసుకెళ్తూ వచ్చాయి. అయితే గత నెల 27వ తేదీన కరూర్వేదికగా తమిళగ వెట్రి కళగం నేత విజయ్ నిర్వహించిన ప్రచారం పెను విషాదానికి దారి తీసింది. రాష్ట్ర చరిత్రలోనే ప్రపథమంగా జరిగిన ఈ ఘోర ఘటనలో 41 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. దేశాన్నే ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘటన తదుపరి ఎక్కడిక్కడ ప్రచార సభలు, రోడ్ షోలకు బ్రేక్ పడింది. ఈ ఘటన బాధితులకు తమిళనాడు ప్రభుత్వం ఎక్స్గ్రేషియాను అందజేసింది. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి మార్గదర్శకాలు రూపకల్పనకు చర్యలు చేపట్టింది. మద్రాస్ హైకోర్టు ఇటీవల నిర్దేశించిన నియమాలను అనుసరించే విధంగా తమిళనాడులో బహిరంగ సమావేశాలు , ర్యాలీలు తదితర కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శకాలను రూపొందించడం గురించి ఇప్పటికే సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ అధికారులతో పలుమార్లు చర్చించారు. కొన్ని కీలక అంశాలను పరిగణించి, అందుకు అనుగుణంగా ఆంక్షలతో కూడిన మార్గదర్శకాల రూపకల్పన పై దృష్టి పెట్టారు. సూచనల కోసం.. ఈ మార్గదర్శకాల రూపకల్పన గురించి అందరి అభిప్రాయాలు , సూచనలు, సలహాలను స్వీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కమిషన్ గుర్తింపు పొందిన పార్టీలు , ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిగిన పార్టీల ప్రతినిధులతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈనెల 6న ఉదయం 10.30 గంటలకు చైన్నెలో ఈ సమావేశం జరగనుంది. సచివాలయంలోని నామక్కల్ కవింజ్ఞర్ మాళిగైలోని పదో అంతస్తు ఆడిటోరియంలో జరగనన్న ఈ సమావేశానికి హాజరు కావాలని గుర్తింపు పొందిన పార్టీలకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి మురుగానందం సోమవారం ఆహ్వానాలు పంపించారు. సీనియర్ మంత్రుల నాయకత్వంలో జరిగే ఈ సమావేశానికి గుర్తింపు పొందిన పార్టీలు తప్పకుండా హాజరు కావాలని పిలుపు నిచ్చారు. ఇదిలా ఉండగా కరూర్ ఘటనను విచారిస్తున్న సీబీఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. 306 మందిని విచారించేందుకు సమన్లు జారీ చేశారు. అలాగే, సీబీఐ – తమిళనాడు ప్రభుత్వానికి మధ్య విచారణ పరంగా సమన్వయ అధికారిగా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ధీరజ్కుమార్ను నియమించారు. -
ధనుష్కు జతగా..!
తమిళసినిమా: ఒక స్టేజ్ దాటిన తరువాత హీరో అయినా, హీరోయిన్ అయినా జయపజయాలకు అతీతంగా మారుతారు. అలాంటి వారికి మధ్యమధ్యలో ఎదురైయే అపజయాల ప్రభావం పెద్దగా ఉండదు. అలానే ఇటీవల కుబేరా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నటుడు ధనుష్, ఆ తరువాత తన స్వీయ దర్శకత్వంలో నటించిన ఇడ్లీకడై చిత్రం ఆశించిన విజయాన్ని అందుకో లేకపోయ్యిందనే విమర్శలను ఎదుర్కొంది. అయినా ధనుస్ చేతిలో ఇప్పుడు అరడజనుకు పైగా చిత్రాలు ఉండటం విశేషం. ఇటీవల తేరే ఇష్క్ మే అనే హిందీ చిత్రాన్ని పూర్తి చేసిన ఈయన ప్రస్తుతం వరుసగా నాలుగు చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందులో ఒకటి అమరన్ చిత్రం ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో నటించే చిత్రం. ఈ చిత్రాన్ని గోపురం ఫిలింస్ పతాకంపై అన్భుసెళియన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. కాగా దీన్ని ఓ యదార్థ ఘటన ఆధారంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇందులో ఇందులో నటి పూజాహెడ్గేను హీరోయిన్గా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఇటీవల సరైన హిట్స్ లేక వరుసగా అవకాశాలను కోల్పోయిన ఈ అమ్మడికి నటుడు సూర్యకు జంటగా నటించిన రెట్రో చిత్ర కమర్షయల్ హిత్ కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. అంతేకాకుండా ఇప్పుడీ భామ మళ్లీ బిజీ అవుతున్నారు. నటుడు విజయ్కు జంటగా నటించిన జననాయకన్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న తెరపైకి రానుంది. అదే విధంగా నటుడు, నృత్యదర్శకుడు లారెన్స్ కు జంటగా కాంచన – 4లో నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ధనుష్కు జతగా నటించే అవకాశం వచ్చిందన్నది నిజమైతే ఆమెకు నిజంగా లక్కీనే అవుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. నటుడు ధనుష్ -
పనుల్లో వేగం పెంచాలి
సాక్షి, చైన్నె: ధర్మపురిలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న బస్ టెర్మినల్, పారిశ్రామిక వాడ నిర్మాణ పనులను సోమవారం సీఎం స్టాలిన్ పరిశీలించారు. ధర్మపురి మునిసిపాలిటీలో రెడ్డి అల్లి గ్రామం, సొగటూరు పంచాయతీ పరిధిలోని ప్రాంతాల్లో 10 ఎకరాల స్థలంలో రూ. 39.14 కోట్లతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త బస్టాండ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రౌండ్ ఫోర్లర్, తొలి అంతస్తుతో పాటూ దుకాణాలు, రెస్టారెంట్లు, విశ్రాంతి గదులు తదితర అన్ని రకాల సౌకర్యాలతో బస్ టెర్మినల్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ 55 బస్సులను ఆపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను సోమవారం ఉదయం పరిశీలించిన సీఎం స్టాలిన్, త్వరితగతిన ముగించాలని అధికారులను ఆదేశించారు. ధర్మపురి తాలూకా అటకపాడి గ్రామం, నల్లంపల్లి తాలూకా, తడంగం, అధియమాన్కోట్టై , బాలజంగమనహళ్లి గ్రామాలను ఏకంచేస్తూ 1,733 ఎకరాల భూమిని సేకరించి పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ఇటీవల చర్యలు తీసుకున్నారు. ఇక్కడ జరుగుతున్నపనులను సైతం సీఎం స్టాలిన్ పరిశీలించారు. జాతీయ రహదారి 44 పనులు, పారిశ్రామిక వాడకు అనుసంధానంగా సర్వీసు రోడ్డు పనుల ఏర్పాటు గురించి ఆరా తీశారు. ఈ పారిశ్రామిక పార్కులో బ్యాటరీ, ఎలక్ట్రానిక్ వాహన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ పరిశీలనలో సీఎం స్టాలిన్ వెంట ప్రజా పనుల శాఖ మంత్రి ఏవీ వేలు, వ్యవసాయ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం, పర్యాటక మంత్రి ఆర్ రాజేంద్రన్, విద్యుత్మంత్రి ఎస్ఎస్ శివశంకర్, మాజీ మంత్రి పళణియప్పన్, ధర్మపురి జిల్లా కలెక్టర్ ఆర్ సతీష్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ పి. మధుసూధన్ రెడ్డి, సిప్కాట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె. సెంథిల్ రాజ్ ఉన్నారు. -
జైలర్– 2 చిత్ర షూటింగ్ను పూర్తి చేసిన రజనీకాంత్
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు వసంత్ రవి,రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్ తదితరులు ముఖయ పాత్రలు పోషించారు. మోహన్లాల్, శివరాజ్కుమార్, జాకీష్రాప్ తదితర స్టార్స్ అతిథి పాత్రల్లో మెరిన ఈ చిత్రంలో నటి తమన్న ఐటమ్ సాంగ్లో నటించారు. 2023లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో తాజాగా జైలర్– 2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్ర షూటింగ్ పలు ప్రదేశాలో జరుపుకుంది. చివరిగా గోవాలో చిత్రీకరణను జరుపుకుంది. ఇందులో పాల్గొన్న రజనీకాంత్ తన షూటింగ్ను పూర్తి చేసుకుని ఆదివారం సాయంత్రం చైన్నెకి తిరిగి వచ్చారు. ఆయన్ని చైన్నె విమానాశ్రయంలో పలువురు అభిమానులు కలిసి ఫొటోలు దిగారు. కాగా రజనీకాంత్ తదుపరి సుందర్.సీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈయన చాలా కాలం క్రితం సుందర్.సీ దర్శకత్వంలో నటించిన అరుణాచలం చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తాజాగా మరోసారి ఈ కాంబోలో చిత్రం తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది వినోదాన్ని మేళ వించిన కమర్షియల్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. కాగా ఈ చిత్రం తరువాత రజనీకాంత్, కమలహాసన్ కాండోలో చిత్రం తెరకెక్కుతుందని తెలిసింది. దీన్ని రజనీకాంత్ ,కమలహాసన్ల వారుసురాళ్లు, సౌందర్యరజనీకాంత్, శృతీహానస్ కలిసి నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ క్రేజీ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటనను కమలహాసన్ పుట్టిన రోజు అయిన ఈ నెల 7న రజనీకాంత్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ప్రకటన కోసం ఈ ఇద్దరు స్టార్స్ హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
క్లుప్తంగా
వేలూరు: రక్తదానం చేసి ప్రాణపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణం. కలర్స్ వస్త్ర దుకాణం అధినేత ప్రవీన్ అన్నారు. విల్లుపురం మహాలక్ష్మి గ్రూప్స్ అధినేత కేజీ రమేష్ గుప్తా నాల్గవ వర్థింతి దినోత్సవాన్ని పురస్కరించుకొని వేలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని కలర్స్ వస్త్ర దుకాణంలో వేలూరు మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి, కలర్స్ వస్త్ర దుకాణం సంయుక్తంగా ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో అధిక సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. తిరువొత్తియూరు: తూత్తుకుడి జిల్లాలోని కోవిల్పట్టి సమీపంలో సాత్తూరు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాన్ సోమవారం విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లడానికి నాలాట్టిన్ పుత్తూరు ప్రాంతానికి వెళ్తోంది. డ్రైవర్ కరుప్పాస్వామి వ్యాన్ను నడుపుతున్నాడు. నైల్లె–మదురై జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో స్కూల్ వ్యాన్ను ఓ కారు అకస్మాత్తుగా రోడ్డు దాటి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వల్లీయూరుకు చెందిన షేక్ అనే వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. కారు నడుపుతున్న అగస్టిన్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ కరుప్పాస్వామి, వ్యాన్లో ఉన్న సహాయకురాలు అయ్యమ్మాళ్, 10వ తరగతి, 2వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలతో సహా మొత్తం ఐదుగురు గాయపడ్డారు. సాక్షి, చైన్నె: తమ విజయగాథలతో రైతులకు నిరంతర మద్దతును ఇస్తూనే ఉంటామని ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ జాయింట్ ఎండీ రామన్ మిట్టల్ తెలిపారు. ఆవిష్కరణ, రైతు కేంద్రీకృత,క్రాస్ పంక్షనల్ సహకారంపై దృష్టి పెట్టే విధంగా చేపట్టిన కార్యక్రమం గురించి స్థానికంగా సోమవారం ఆయన ప్రకటించారు. అక్టోబరు 25 ట్రాక్టర్లపై జీఎస్టీ తగ్గింపు తర్వాత సోనాలికా ట్రాక్టర్స్ అమ్మకాలు 27,028గా నమోదై కొత్త రికార్డును నమోదు చేసిందని వివరించారు. ఈ అద్భుత ప్రయాణం కొత్త అధ్యాయాన్ని లఖించిందన్నారు. ట్రాక్టర్ల పరిశ్రమలో తిరుగులేని శక్తిని నిర్వచిస్తూ, ఓ ఏకీకృత బృందంగా కలిసి నిలబడి అందించే ప్రతి హెవీ డ్యూటీ ట్రాక్టర్ సాధికారతకు చిహ్నంగా సూచిస్తున్నామన్నారు. ఈ విజయగాథలతో రైతులకు మరంత మద్దతు ఇచ్చే విధంగా దూసుకెళ్లనున్నామని వివరించారు. సాక్షి, చైన్నె: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో కొత్తమైలురాయిని చేధించినట్టు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటారు ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రెత్రా తెలిపారు. దేశంలో 4 డబ్ల్యూ – ఈవీ వృద్ధిలో కీలక పాత్ర గురించి స్థానికంగా సోమవారం ప్రకటించారు. ఈవీ పోర్ట్ పోలియో బలమైన పనీతీరుతో ముందుకెళ్తోందన్నారు. ఆటో – టెక్ కంపెనీ స్థిరమైన భవిష్యత్తు కోసం, ఇంటెలిజెంట్ మొబిలిటీ సొల్యూషన్లను రూపొందించడంలో ముందజంలో ఉందని వివరించారు. స్మార్ట్ ఉత్పత్తులను మాత్రమే కాకుండా సహజమైన పర్యావరణ వ్యవస్థ ఆధారిత పరిష్కారాలు కూడా అందిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలో 1,00,000 ఈవీ అమ్మకాల మైలురాయిని తాము ఛేదించామని ఈసందర్భంగా ప్రకటించారు. తిరుత్తణి: ఆంధ్రా నుంచి షోళింగర్కు బైకులో మద్యం తరలించిన ఇద్దరిని పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. తమిళనాడుకు సరిహద్దులోని ఆంధ్రా ప్రాంతాల్లోని ప్రయివేటు మద్యం షాపుల నుంచి తక్కువ ధరకు విక్రయిస్తున్న మద్యం కొనుగోలు చేసి తమిళనాడు సరిహద్దు గ్రామాలు ద్వారా తరలించి విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో మద్యపాన నిషేధిత విభాగం సీఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం ఆర్కేపేట మండలంలోని ఆంఽధ్రా సరిహద్దు ప్రాంతాల్లో నిఘావుంచారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పాలసముద్రం నుంచి తమిళనాడు గ్రామం దేవలంబాపురం వైపు వచ్చిన బైకును నిలిపి తనిఖీ చేశారు. అందులో అక్రమంగా ఆంధ్ర మద్యం 95 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరిని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తులో షోళింగర్ సోమసుందరానికి చెందిన దక్షిణామూర్తి (52), ప్రవీణ్కుమార్(32) ఇద్దరు ఆంధ్రాలో మధ్యం కొనుగోలు చేసి షోళింగర్లో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు విచారణలో తెలిసింది. వైభవంగా ఆలయ కుంభాభిషేకం కొరుక్కుపేట: రామనాథపురం సంస్థానం దేవస్థానం అయిన ముత్తురామలింగ స్వామి ఆలయం మహాకుంభాభిషేకం మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. గత శనివారం విఘ్నేశ్వర పూజతో కుంభాభిషేక పూజలను చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 8 గంటలకు మహా హోమం, మహా లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, బ్రహ్మ చారి పూజ, గో పూజ దీపారాధన నిర్వహించారు. పవిత్ర జలంతో గోపుర కలశాలపై పోసి కుంభాభిషేకం వైభవోపేతంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ప్రజల సహకారంతోనే.. రాష్ట్రాభివృద్ధి
వేలూరు: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ప్రజలతో పాటూ అఽధికారులు సహకరించాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పిలపునిచ్చారు. రాణిపేట జిల్లాలోని రాణిపేట మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో కామరాజర్ భవణాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రాణపేట కలెక్టరేట్లో కలెక్టర్ చంద్రకళ అధ్యక్షతన జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రూ. 24 కోట్ల వ్యయంతో చేయనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా రూ: 42 కోట్లు వ్యయంతో పూర్తి అయిన పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 73 వేల మంది లబ్ధిదారులకు రూ: 300 కోట్లు విలువ చేసే సంక్షేమ పథకాలను అందజేస్తున్నామన్నారు. తక్కువ కాలంలోనే ఈ జిల్లాలో ఈ కార్యక్రమాలను మహానాడు తరహాలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. రాజుల పేర్లు అఽధికంగా గ్రామాల పేర్లు ఉన్నాయని అయితే రాణిల పేర్లు ఎక్కడా లేవన్నారు. అయితే ప్రస్తుతం రాణి పేరుతో రాణిపేట ఉండటం మహిళలను గుర్తించే విధంగా ఉందన్నారు. ప్రస్తుతం సంక్షేమ పథకాలు పొందిన 73 వేల మంది లబ్ధిదారుల్లో 55 వేల మంది మహిళలే ఉండడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మంత్రి ఆర్ గాంధీ, పార్లమెంట్ సభ్యులు జగత్రక్షగన్, ఎమ్మెల్యేలు ఈశ్వరప్పన్, మునిరత్నం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేలూరు జిల్లాలోని సోమ, మంగళ వారాల్లోను బూత్ కమిటీ సభ్యులతో పాటు, అధికారులతో సమీక్షించనున్నారు. ఇందుకోసం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బూత్కమిటీ సభ్యులతో సమీక్ష రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లును ముందుస్తుగా సిద్ధం చేసేందుకు ఆయన రాణిపేట జిల్లాలోని బూత్ కమిటీ సభ్యులతో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆ సమయంలో పార్టీ అభివృద్దికి కార్యకర్తలు, యువకులు సైనికుల్లా పని చేయాలన్నారు. -
రోజా మల్లి కనకాంబరం ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల
తమిళసినిమా: చాలా మంది దర్శకులు కథానాయకులుగా మారి విజయపదంలో సాగుతున్నారు. అదే పట్టికలో దర్శకుడు కేపీ.జగన్ తన పయనాన్ని ప్రారంభించారు. ఈయన ఇంతకు ముందు పుదియ గీతై, కోడంబాక్కం, రామన్ తేడియ సీతై, ఎన్ ఆలోడ చెరుప్పు కానోమ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా తాజాగా కేపీ.జగన్ హీరోగా మారి, స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి రోజా మల్లి కనకాంబరం అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో బిగ్బాస్ ఫేమ్ నటుడు విజయ్వర్మ, సంగీత కల్యాణ్, పిచ్చైక్కారన్ మూర్తి, దియా, రంజిత్ వేలాయుధన్, వెట్రివేల్ రాజా,దింగుక్కల్ అలెక్స్, ఉరరియడి శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటూ జాతీయ అవార్డు గ్రహీత ఎంఎస్.భాస్కర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ ఒక సరళరేఖలో పయనించే మూడు కథలతో తెరకెక్కిస్తున్న చిత్రం రోజా మల్లి కనకాంబరం అని చెప్పారు. యదార్ధ ఘటన ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్ర కథనం చాలా కొత్తగా ఉంటుందన్నారు. ఒక్కో కథకు ఒక పాట చోటు చేసుకునే ఈ చిత్రంలో అదనంగా మరో పాటు ఉంటుందని చెప్పారు. ఇది పాటలకు, నేపధ్య సంగీతానికి ప్రాముఖ్యత కలిసిన చిత్రంగా ఉంటుందన్నారు. బిగ్బాస్ సీజన్ 7లో పాల్గొన విజయ్వర్మ ఈ చిత్రంలో ప్రముఖ నటులలో ఒకరుగా నటిస్తున్నారనీ, ఆయనకు జంటగా సంగీత కల్యాణ్ నటిస్తున్నట్లు చెప్పారు. చిత్ర షూటింగ్ను అధికభాగం తిరుచెందూర్, తూత్తుక్కుడి, మణపాడు, కులశేకర పట్టణం ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. చివరి షెడ్యూల్ను ఈ నెలలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కాగా ఇంతకు ముందు మాయాండి కుటుంబత్తార్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మునైటెడ్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇదని చెప్పారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను దర్శకుడు చేరన్, విఘ్నేశ్ శివన్ సోమవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ -
టీవీకేలో కొత్త విభాగాధిపతులు
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అనుబంధ విద్యార్ధి, యువజన, మహిళావిభాగాలకు కొత్త నిర్వాహకులను సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ నియమించారు. ఈ మేరకు పార్టీ పరంగా ఉ న్న ప్రతి జిల్లాకూ ఓ నిర్వాహకుడు, పది మంది సహ నిర్వాహకులను నియమించారు. మొత్తంగా తమిళనాడు వ్యాప్తంగా 2,827 మందిని నియమిస్తూ ప్రకటన చేశారు. అన్నాడీఎంకేలోనూ కుటుంబ రాజకీయం సెంగొట్టయ్యన్ విమర్శ సాక్షి, చైన్నె : డీఎంకేలోనే కాదు, తాజాగా అన్నాడీఎంకేలోనూ కుటుంబ రాజకీయం పెరిగిందని ఆ పార్టీ బహిష్కృత నేత, ఎంపీ సెంగొట్టయ్యన్ వ్యాఖ్యానించారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, తాను ఎంజీఆర్ కాలం నుంచి అన్నాడీఎంకేలో కొనసాగుతూ వచ్చినట్టు గుర్తు చేశారు. పార్టీ కోసం అహర్నిషలు కృషి చేస్తూ వచ్చినట్టు పేర్కొన్నారు. ఎన్నికలలో పార్టీవిజయం సాధించాలన్న ఒకే ఒక లక్ష్యం తనది అని, ఆ దిశగా ఐక్య గళం వినిపిస్తే బయటకు పంపించే పరిస్థితులు అన్నాడీఎంకేలో ఉండటం విచారకరంగా పేర్కొన్నారు. డీఎంకేలో కుటుంబ రాజకీయాలు అని వ్యాఖ్యలు చేస్తున్నారని, అయితే, తాజాగా అన్నాడీఎంకేలోనూ కుటుంబ రాజకీయ జోక్యం పెరిగిందని ఆరోపించారు. పళణి స్వామికుమారుడు, బావమరిది, బంధువులు తాజాగా అన్నాడీఎంకే రాజకీయ జోక్యం పెరిగినట్టు ఆరోపించారు. కొత్త ఏఐ ఫ్రేమ్వర్క్ అభివృద్ధి పరిచిన ఐఐటీ కొరుక్కుపేట: తదుపరి తరం ఔషధాల ఆవిష్కరణకు సహాయపడటానికి ఐఐటి – మద్రాస్ మరో అడుగు ముందుకు వేసింది. ఐఐటీ మద్రాస్లోని వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (డబ్ల్యూఎస్ఏఐ) , అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి వాస్తవ ప్రపంచ ప్రయోగశాల సెట్టింగ్లలో సంశ్లేషణ చేయడానికి సులభమైన ఔషధ–వంటి అణువులను వేగంగా ఉత్పత్తి చేయగల ఒక పురోగతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేసినట్టు సోమవారం డబ్ల్యూఎస్ఏఐ హెడ్ ప్రొఫెసర్ బి. రవీంద్రన్ తెలిపారు. ఇంకా ఆయన పేర్కొంటూ కృత్రిమ మేధస్సు ఆవిష్కరణ గురించి మనం ఎలా ఆలోచిస్తామో క్రమంగా పునర్నిర్మిస్తోందని, ఔషధ రూపకల్పన ఆ పరివర్తనకు ఒక అద్భుతమైన ఉదాహరణను అందిస్తుందన్నారు. ఔషధ ఆవిష్కరణతో పాటూ ఏఐ ఫ్రేమ్వర్క్ కొత్త పదార్థాల ఆవిష్కరణను వేగవంతం చేయడానికి ఓ ఆశాజనకమైన పునాదిని అందిస్తుందని, ఇది భవిష్యత్తులో ముఖ్యమైన పరిశోధన దిశగా మారనుందని వెల్లడించారు. బాల్య వివాహాలను నిర్మూలించాలి కొరుక్కుపేట: బాల్య వివాహాలను ఆపాలని ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఐసీడబ్ల్యూవో) పిలుపునిచ్చాంది. ఈ మేరకు ఐసీడబ్ల్యూవో ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత భారతదేశం ప్రచారంలో భాగంగా ఎన్జివో , పాఠశాలలు , సంఘాలు , గ్రామాలలో అవగాహన ప్రచారాలను నిర్వహిస్తోంది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తోం. ఈక్రమంలో చైన్నెలోని ఓ పాఠశాలలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన తీసుకుని వచ్చారు . ఇందులో ఐసిడబ్ల్యూవో సెక్రటరీ ఏజే హరిహరన్ మాట్లాడుతూ హిందువుల వివాహ సీజన్ ప్రారంభం అయిన సందర్భంగా బాల్య వివాహాలు జరగకుండా చూసుకోవడానికి జిల్లా యంత్రాంగం, జిల్లా లీగల్ సర్వీసెస్ అఽథారిటీ కఠినమైన నిఘా ఉంచాలని , బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అధిక అప్రమత్తంగా ఉండాలని కోరారు. బాల్య వివాహాల గురించి ఏదైనా సమాచారం ఉన్న ఎవరైనా వెంటనే పోలీసు హెల్త్ లైన్ (112) , ఛైల్డ్ హెల్ప్ లైన్ (1098), ఐసీడబ్ల్యూవో హెల్ప్లైన్ (9087161161 ) కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
గీతాకై లాసం ప్రధాన పాత్రలో అంగమ్మాళ్
తమిళనినిమా: ప్రముఖ రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిని కోడితుణి అనే చిరుకథ అంగమ్మాళ్ చిత్రంగా తెరకెక్కుతోంది. విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్జామ్ ఫిలింస్, ఫిరో మూవీ స్టేషన్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నామి. కాగా ఈ చిత్రాన్ని స్టోన్బెంట్ ఫిలింస్, ఎంజాయ్ ఫిలింస్, ఫిరో మూవీ స్టేషన్ సంస్థలు కలిసి విడుదల చేయనున్నాయి. కాగా ఇందులో నటి గీతా కై లాసం ప్రధాన పాత్రను పోషిస్తుండగా, చరణ్, భరణి, ముల్లైయరసీ, తెండ్రల్ రఘునాథన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం గురించి రచయిత పెరుమాళ్ మురుగన్ తెలుపుతూ తాను చిరుకథను మాత్రమే ఇచ్చాననీ, దాన్ని సినిమాకు కావలసిన కథాగా మార్చుకోవడం, మరిన్ని హంగులు చేర్చుకోవడం దర్శకుడి పని అని చెప్పారు. తన కథను అర్ధం చేసుకుని పూర్తి చిత్రంగా మార్చడంలో దర్శకుడి ప్రతిభ దాగి ఉందన్నారు. 25 నిమిషాల షార్టు ఫిలింస్కు తగిన ఈ కథను చిత్రంగా మార్చడం అంత సులభంగా కాదన్నారు. ఆ పనిని దర్శకుడు విపిన్ రాధాకృష్ణన్ అద్భుతంగా చేశారన్నారు. దీనికి అంజోయ్ సామువేల్ ఛాయాగ్రహణం, ముహమదు మక్యూస్ మన్సూర్ సంగీతాన్ని అందించారు. అంగమ్మాళ్ చిత్రంలో నటి గీతా కై లాసం -
తిరుత్తణి ఆలయంలో నూతన దంపతుల సందడి
తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో సోమవారం నూతన దంపతుల సందడి నెలకొంది. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సోమవారం శుభముహూర్త దినం సందర్భంగా ఆలయ అనుమతితో కొండ ఆలయంలో కావడి మండపంలో 31 జతలకు వివాహం నిర్వహించారు. దీంతో వధూవరులతో పాటు వారి బందువులు, మిత్రులు వేకువజామున కొండ ఆలయానికి చేరుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు శుభ ముహూర్త సమయంలో వివాహాలు నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ బంధువులు, మిత్రుల సమక్షంలో దైవ సన్నిధి సాక్షిగా మూడు ముళ్ల బృందం ద్వారా నూతన వధూవరులు దంపతులుగా ఏకమైయ్యారు. తొలిత తల్లిదండ్రులు, బందువుల ఆశీస్సులు తీసుకున్న నూతన దంపతులు తొలి దర్శనంగా వివాహం ముగియగానే స్వామివారిని దర్శించుకున్నారు. నూతన దంపతులకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే వివాహ వేడుకల్లో పాల్గొన్న వారు సైతం స్వామిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపారు. సోమవారం ఉదయం నూతన వధూవరులతో కొండ ఆలయం కళకళలాడింది. -
తమిళనాట ఎస్ఐఆర్పై సుప్రీంకు డీఎంకే
న్యూఢిల్లీ: తమిళనాడులో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) చేప ట్టాలంటూ ఎన్నికల కమిషన్(ఈసీ) తీసుకు న్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అధి కార డీఎంకే సోమవారం సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. ఈసీ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, ప్రజాస్వామ్య హక్కు లకు భంగకరమని పేర్కొంది. డీఎంకే నేత ఆర్ఎస్ భారతి ఈ పిటిషన్ వేశారు. తమిళ నాడులో ఎస్ఐఆర్ చేపట్టేందుకు అక్టోబర్ 27న ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘించడమేనన్నారు. ఎస్ఐఆర్తో అసలైన ఓటర్ల పేర్లను సైతం సరైన పత్రాలు లేవనే సాకుతో తొలగించే ప్రమాదముందన్నారు. పిటిషన్పై ఈ వారంలోనే అత్యు న్నత న్యాయస్థానం విచారణ చేపట్టే అవకా శముంది. -
ఎం.ఎస్. స్వామినాథన్ జీవితగాథ పుస్తకాన్ని ఆవిష్కరించిన కమల్హాసన్
వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడు ఎం.ఎస్. స్వామినాథన్ జీవితగాథను 'ఎం.ఎస్. స్వామినాథన్: ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా' పుస్తకాన్ని ప్రముఖనటుడు కమల్ హాసన్ చెన్నైలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఈ పుస్తకం రచయిత్రి, ఆయన మేనకోడలు, ప్రియంవద జయకుమార్ ఎం.ఎస్. స్వామినాథన్తో తన అనబంధాన్ని పంచుకున్నారు. "నేను ఆయనను ఎంతగానో ఆరాధించాను, రాయాలనుకున్నాను. నా అభిమానిని. చిన్నతనంలో ఆయనను చూసి పెరిగిన వ్యక్తి. కానీ నేను ఆయన గురించి విన్న అనే విశేషాలు పుస్తకంలోకి రాలేదు. అందుకే ఆయన జీవితాన్ని గురించి ఒక పుస్తకం రాయాల్సిన సమయం ఆసన్నమైందని నేను అనుకున్నాను. అదే సమయంలో భారతదేశాన్ని నిర్వచించాను. నిజంగి ఇది ఎం.ఎస్. స్వామినాథన్ కథ. ఆయలన కలగన్న ఆశ, స్థితిస్థాపకత కలిగిన భారతదేశం కథ. భారతదేశం యొక్క ఎప్పటికీ చెప్పలేని స్ఫూర్తి మరియు ఎప్పటికీ వదులుకోలేని స్ఫూర్తిని మీకు తెలుసు, దీనిని ఆయన తరం భారతీయులు ఉదాహరణగా చూపించారు."అని పేర్కొన్నారు. గొప్ప శాస్త్రవేత్త... చక్కటి వ్యవహర్త ఉన్నత విద్యావంతులున్న ఉమ్మడి కుటుంబంలో మాన్కోంబు సాంబశివన్ స్వామి నాథన్ (M.S. Swaminathan) జన్మించారు (1925). తండ్రి బాటలో మెడిసిన్ చదివి కుంభకోణంలోని వాళ్ల హాస్పిటల్ను నడిపే అవకాశం; ఐపీఎస్కు ఎంపికైనందున అటు వైపుగానూ కెరీర్ మలుచుకునే వీలు ఆయనకు ఉండినాయి. కానీ లక్షల మంది చావు లకు కారణమైన బెంగాల్ క్షామం(1943) వేసిన ముద్ర ఆయన్ని వ్యవసాయం వైపు నడిపించింది. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడిగా ఆయన కృషిని చెప్పే పుస్తకం ‘ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా’. ఆయన మేనకోడలు రాసిన జీవిత కథ. స్వాతంత్య్రానంతర భారతదేశం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య... తిండి గింజల కరువు. ‘ఏదైనా ఆగుతుంది కానీ వ్యవసాయం ఆగదు’ అన్నారు నెహ్రూ. సోమవారాలు పస్తులుండమని పిలుపు నిచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి. ‘బ్లడీ అమెరికన్ల’ ముందు చేయి చాచకుండా ఉండే మార్గాల కోసం వెతికారు ఇందిరా గాంధీ. ఒక దశలో ‘పీఎల్ 480’ పథకం కింద అమెరికా పంపే గోధుమలే దిక్కు. ఓడలు దిగితేగానీ నోళ్లు ఆడని పరిస్థితి. ఈ దిగుమ తులకు చెల్లించాల్సిన మూల్యం విదేశాంగ విధానంలో స్వతంత్రంగా నిలబడలేకపోవడం. అలాంటి స్థితిలో స్వామినాథన్ దేశంలో హరిత విప్లవానికి బాటలు పరిచారు. ‘చరిత్ర ఆయనకు అవకాశం ఇచ్చింది, దాన్ని ఆయన రెండు చేతులా అందుకున్నారు’అంటారు రచయిత్రి.VIDEO | Chennai, Tamil Nadu: Actor, politician Kamal Haasan launches book on 'MS Swaminathan - The Man who fed India' authored by Priyambada Jayakumar. (Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/HfsbGoozj4— Press Trust of India (@PTI_News) November 2, 2025 గాలికి పడిపోకుండా నిలబడే పొట్టి రకం గోధు మల మీద గామా కిరణాలతో ‘ఐండియన్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్’లో స్వామినాథన్ ప్రయోగాలు చేశారు. దానికోసం ‘ఆటమిక్ ఎనర్జీ కమిషన్’ సాయంతో ‘గామా గార్డెన్’ ఏర్పాటుచేశారు. వ్యవ సాయం కోసం అన్ని రంగాలూ సహకరించుకోవాలంటారాయన. ఈ దశలోనే పొట్టి రకం హైబ్రిడ్ గోధు మలను మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ విజయవంతంగా పరీక్షించారని తెలిసి, స్వామినాథన్ ఆయనకు ఉత్తరం రాశారు(1963). దానివల్ల పదేళ్ల కాలం కలిసొస్తుంద నేది ఆయన ఆలోచన. ఇక వంద కేజీల చొప్పున వచ్చిన ఆ నాలుగు రకాల విత్తనాలను ఇక్కడి నేలలకు అనుగుణంగా కల్యాణ్ సోనా, సోనాలిక లాంటి విత్తనాలుగా మార్చి, వ్యవస్థలోని అన్ని అడ్డంకులను అధిగమించి, రైతుల అనుమానాలను తీర్చి, దిగు బడుల ‘చమత్కారాన్ని’ చూపించి, ఇండియా వచ్చిన నార్మన్ బోర్లాగ్నే ఆశ్చర్యపరిచేలా చేశారు స్వామి నాథన్. నాలుగు హెక్టార్లతో మొదలైన ప్రయోగం, 1968 నాటికి పది లక్షల హెక్టార్లకు విస్తరించింది. ఈ మధ్యలోనే విక్రమ్ సారాభాయి సహకారంతో రైతుల కోసం దూరదర్శన్లో ‘కృషి దర్శన్’ మొదలైంది (1967). సైన్సు శక్తి, విధాన నిర్ణయం, రైతుల ఉత్సాహం – కలగలిసి ‘యూఎస్ ఎయిడ్’కు చెందిన విలియమ్ గాడ్ నోటి నుంచి తొలిసారిగా వెలువడిన మాట ‘గ్రీన్ రివల్యూషన్’ అనేది విజయవంతమైంది. 1981లో ఫిలిప్పైన్స్లోని ‘ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్’ డైరెక్టర్ జనరల్ పదవి ఆయన్ని వరించింది. ఆ స్థానంలోకి వెళ్లిన మొదటి ఆసియన్ ఆయన. ఐఆర్64 లాంటి పాపులర్ వరి రకం ఈ కాలంలోనే వచ్చింది. ప్రణాళికా సంఘం, వ్యవసాయ మంత్రిత్వ శాఖల్లోనూ పనిచేసిన స్వామినాథన్ పాత్ర ఇండియాకే పరిమితం కాలేదు. చైనా, పాకిస్తాన్,ఇండోనేషియా, మయన్మార్, టాంజానియా, ఇథియో పియా లాంటి ఎన్నో దేశాల్లో వరి పరిశోధనాకేంద్రాలు ఏర్పాటయ్యేలా సహకరించారు. టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన అత్యంత ప్రభావశీల ఆసి యన్ల జాబితాలోని ముగ్గురు భారతీయుల్లో స్వామి నాథన్ ఒకరు (మిగిలిన ఇద్దరు: గాంధీజీ, టాగూర్). ‘పది జీవితాల్లో కూడా సాధించలేనిది ఆయన ఒక్క జీవితంలో సాధించారు’ అంటారు రచయిత్రి. ముగ్గురు కూతుళ్ల తండ్రిగా, స్వతంత్ర భావాలున్న భార్య మీనా భర్తగా ఆయన కుటుంబ విశేషాలు మేళవిస్తూ పది అధ్యాయాలుగా రాసిన పుస్తకమిది. ఫిలిప్పైన్స్ వదిలివచ్చేటప్పుడు టగలాంగ్లో వీడ్కోలు ఉపన్యాసం చేసి ఆశ్చర్యపరిచారు మీనా. రైతుల కోసం నియమించిన జాతీయ కమిషన్తో సహా పదుల కమి టీలకు చైర్మన్గా వ్యవహరించి; రామన్ మెగసెసే, వరల్డ్ ఫుడ్ ప్రైజ్, భారతరత్న లాంటి గౌరవాలు పొందిన ఎంఎస్ తన జీవితంతోనే ఆశ్చర్యపరిచారు.- ఎడిటోరియల్ టీం(M.S. Swaminathan: The Man Who Fed India)ఎం.ఎస్. స్వామినాథన్: ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా (జీవిత చరిత్ర)రచన : ప్రియంవద జయకుమార్ -
100 అడుగుల లోయలో పడిపోయిన హీరోహీరోయిన్
సినిమా షూటింగ్లో కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆపదే అగరా షూటింగ్లో జరిగింది. ఎంపీ.నక్కీరన్, లిబియాశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కేరళలోని పాలక్కాడు అట్టప్పాడి ప్రాంతాల్లో జరుగుతోంది. ఓ సీన్ చిత్రీకరస్తున్న సమయంలో హీరోహీరోయిన్లు కాలుజారి లోయలో పడిపోయారట! ఈ విషయాన్ని దర్శకుడు వెల్లడించాడు.100 అడుగుల లోయలో..జీవాభారతి మాట్లాడుతూ.. కేరళలోని అట్టప్పాడి కొండ ప్రాంతాల్లో హీరో హీరోయిన్లకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాం. హీరోయిన్లు ఒకచోట నిలబడి మాట్లాడుకుంటున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా లిబియాశ్రీ కాలుజారి 100 అడుగుల లోయలోకి పడిపోయారు. ఆమెని కాపాడే ప్రయత్నంలో హీరో నక్కీరన్ కూడా లోయలోకి పడిపోయారు. ఓ పొడవైన తాడును తీసుకొచ్చి వారిని పైకి తీసుకొచ్చాం. వాళ్లు పడ్డ ప్రాంతం పచ్చికతో నిండి ఉండడంతో అదృష్టవశాత్తూ చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. లిబియాశ్రీ ప్రథమ చికిత్స అనంతరం మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు అని తెలిపాడు.అగరా సినిమాను ఎంపీఎన్ మూవీస్ పతాకంపై ఎంపీ నక్కీరన్ నిర్మిస్తున్నారు. జీవాభారతి కథ, కథనం, మాటలు పాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నిశాంత్, జీవాభారతి, కోవై డాక్టర్ కె.కన్నన్, రంగరాజన్ సుబ్బయ్య, సెంథిల్ తంగవేల్, రమేష్రాజా, ఆర్.ప్రభు, జి.గణేష్కుమార్, సెంథిల్కుమార్, ఇనియన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి యూఎం.స్టీవెన్ సతీష్ సంగీతం, చాయాగ్రహణం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కోవై డాక్టర్ కె.కన్నన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
పక్షవాతంపై అవగాహన కలిగి ఉండాలి
వేలూరు: పక్షవాతంపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే కార్తికేయన్ అన్నారు. వేలూరులోని నరువి ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రపంచ పక్షవాత దినోత్సవం పురష్కరించుకొని మారథాన్ పోటీలు ఆస్పత్రి చైర్మన్ జీవీ సంపత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. జీవీ సంపత్ మాట్లాడుతూ పక్షవాతంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మొట్టమొదటిసారిగా వేలూరు పట్టణంలో 500 మందితో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం మనం తీసుకునే ఆహారం, మద్యం, పొగతాగడం వల్ల అధికంగా పక్షవాతం వచ్చే అవకాశం ఉందన్నారు. వేలూరు గాంధీ విగ్రహం వద్ద మారథాన్ పోటీలు ప్రారంభమయ్యాయి. నరువి ఆస్పత్రి ఉపాధ్యక్షులు అనిత, జనరల్ మేనేజర్ నితిన్, వేలూరు కార్పొరేషన్ జోన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందన
శ్రీసిటీ,(సత్యవేడు) : ఎల్వీఎం3–ఎం5 రాకెట్ ప్రయోగం విజయవంతమవడంతో శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో చైర్మన్ వి.నారాయణన్, షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ , శాస్త్రవేత్తలు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైందని పేర్కొన్నారు. భారతనౌకాదళానికి, కమ్యూనికేషన్స్ పరంగా ఇది కొత్త శక్తిని అందించగలదని, తద్వారా హిందూ మహాసముద్రంలో రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని వెల్లడించారు. -
వైభవం..కై శిక ద్వాదశి ఆస్థానం
తిరుమల: కై శిక ద్వాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆదివారం వైభవంగా ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువ జామున 4.30 నుంచి 5.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అనంతరం దేవదేవేరులను బంగారువాకిలి వద్దకు వేంచేపు చేసి శాస్త్రోక్తంగా పురాణ పఠనంతో కై శిక ద్వాదశి ఆస్థానం జరిపించారు. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ ఏడాదికోసారి కై శిక ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులందరికీ స్వామివారి కృపా కటాక్షాలు లభించాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తిరుమల చినజీయర్స్వామి, డిప్యూటీ ఈఓ లోకనాథం పాల్గొన్నారు. ద్వాదశి ఆస్థానంలో చినజీయర్ స్వామి, టీటీడీ ఈఓ, ఎస్పీ -
క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలి
వేలూరు: విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని సన్బీమ్ పాఠశాలలో కోరల్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమం పాఠశాల చైర్మన్ హరిగోపాలన్ అద్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ పాఠశాలలోని స్నేహితులు మనకు చివరి వరకు మనస్సులో ఉండిపోతారన్నారు. మనం ఎంత డబ్బు సంపాదించామనే విషయం ముఖ్యం కాదని ఎంత సంతోషంగా ఉన్నామనే విషయాన్ని ప్రతిఒక్కరూ ప్రశ్నించుకోవాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో మునిగిపోయి విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. మీరు పుస్తకాలు చదవడం వల్ల మేధాశక్తి పెరుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ విద్యను అభ్యసించాలనే ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తుందని వీటిని గ్రామీణ ప్రాంతాల్లోని వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కోరల్ ఫెస్టివల్ చిహ్నాన్ని అవిష్కరించి రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ఫుట్బాల్ మైదానాన్ని ప్రారంభించారు. అదేవిధంగా గుడియాత్తంలో ఇండోర్ స్టేడియానికి శంకుస్థాపన చేసి వివిధ క్రీడల్లో రాణించిన 42 మంది విద్యార్థులకు అవార్డులను అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ తంగప్రకాష్, ఉపాధ్యక్షుడు అరవింద్ పాల్గొన్నారు. -
ప్రతి బూత్లో మెజారిటీ సాధించాలి
తిరువళ్లూరు: రానున్న ఎన్నికల్లో డీఎంకేకు ప్రతి పోలింగ్ బూత్లోనూ మెజారిటీ వచ్చేలా పనిచేయాలని డీఎంకే జిల్లా కన్వీనర్ తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా డీఎంకే పార్టీ ముఖ్యనేతలు, కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ద్రావిడ భక్తన్, తిరుత్తణి ఎమ్మెల్యే, జిల్లా కన్వీనర్ చంద్రన్, తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ హాజరయ్యారు. ఎమ్మెల్యే రాజేంద్రన్ మాట్లాడుతూ డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత నిరుపేదలే లక్ష్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ఎమ్మెల్యే చంద్రన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 68వేల పోలీంగ్ బూత్లలో డీఎంకేకు మెజారిటీ వచ్చేలా లక్ష్యాన్ని పార్టీ నిర్దేశించిందని, లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలన్నారు. పార్టీ నేతలు తిరుత్తణి ఎం. భూపతి, వీసీఆర్ కుమరన్, ఉధయమలర్పాండ్యన్, బీకే నాగరాజ్, వీఎస్ నేతాజీ, జైకృష్ణ పాల్గొన్నారు. -
విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి
కొరుక్కుపేట: రాష్ట్ర జనాభాలో 40 శాతానికి పైగా ఉన్న తెలుగు కుటుంబాలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నార్త్ చైన్నె కొడింగైయూర్లోని సీతారామనగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం కార్యదర్శి పాతూరి లక్ష్మణ రావు ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. సీతారామనగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం 44వ వార్షిక సర్వసభ్య మండలి సమావేశం–2025 ఆదివారం ఘనంగా జరిగింది. పదవ, ప్లస్–2 పబ్లిక్ పరీక్షల్లో అధిక మార్కులతో ఉత్తీర్ణులైన సంఘ సభ్యుల పిల్లలను ప్రోత్సహిస్తూ నగదు ప్రదానం, అలాగే సీనియర్ల సేవలను కొనియాడుతూ జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. రెస్కో బ్యాంక్ విశ్రాంత జనరల్ మేనేజర్, సంఘం మాజీ అధ్యక్షులు వంజరపు శివయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించి సభను విజయవంతంగా నడిపించారు. సంఘ కార్యదర్శి పాతూరి లక్ష్మణ్ రావు సంఘాభివృద్ధికి అందించిన సేవలు అపారమని, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. నూతన కార్యవర్గం ఏర్పాటు ఈ సంఘంలో ప్రతి మూడేళ్లకు ఒకసారి నూతన కార్యవర్గ కమిటీను ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్ష పదవికి ఎన్నిక జరగగా, అందులో సంఘం నూతన అధ్యక్షులుగా కె. శ్రీనివాస కుమార్ ఎనికయ్యారు. మిగతా పదవులకు కొత్త వారిని ఏకగ్రీవంగా ఎంపిక చేస్తూ తీర్మానం ఆమోదించింది. ఇందులో పాతూరి లక్ష్మణ రావు (కార్యదర్శి), దానభనేని పిచ్చేశ్వరరావు (కోశాధికారి), ఆఖం దుర్గాప్రసాద్ (ఉపాధ్యక్షుడు), కొలకలేటి శ్రీనివాస్ కుమార్, బెల్లం శ్రీధర్ (సహ కార్యదర్శులు), పి.బాలాజీ, సీఎస్ జయకుమార్, జె.మధుసూధన్రావు, టి.నాగరాజు, డి.సాంబశివరావు, ఎన్.సతీష్ కుమార్, పి.సుబ్బరాజు, డి.వినోద్ కుమార్(కార్య నిర్వాహకులు)గా,ఎన్.చంద్రశేఖర్ రెడ్డి గౌరవ అధ్యక్షులుగా ఎంపికై తమ బాధ్యతలను స్వీకరించారు. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా ఆవడి కార్పొరేషన్ పరిధిలో చేపట్టనున్న 64 పనులకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నెహ్రూ, ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నాజర్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి కార్పొరేషన్ పరిదిలోని జ్యోతినగర్, అన్ననూర్, రేవానగర్, హౌసింగ్బోరు ప్రాంతాలలో వర్షపు నీరు వెళ్లడానికి రూ.29.67 కోట్లతో కాలువలు నిర్మించనున్నారు. దీంతో పాటు మరో రూ.9.76 కోట్లతో మరిన్ని పనులను చేపట్టనున్నారు. ఈ పనులకు శంకుస్థాపన కార్యక్రమం కలెక్టర్ ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించారు. మంత్రులు నెహ్రు, నాజర్ హాజరై శంకుస్థాపన చేశారు. మంత్రి నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇస్తున్న సహాకారంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్టు తెలిపారు. మున్సిపల్శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్రెడ్డి, కలెక్టర్ ప్రతాప్, ఆవడి కమిషనర్ శరణ్య, మేయర్ ఉదయకుమార్, డిప్యూటి మేయర్ సూర్యకుమార్, తిరునిండ్రవూర్ చైర్పర్సన్ ఉషారాణి పాల్గొన్నారు. -
ఘనంగా సమాధుల తోట దినోత్సవం
సేలం: ప్రతి సంవత్సరం నవంబర్ 2వ తేదీన ఆత్మల దినంగా పాటిస్తారు, ఇది ప్రకృతి వైపరీత్యాలలో మృతిచెందిన క్రైస్తవులను స్మరించుకునే రోజు. ఈ సంవత్సరం ఆత్మల పండుగ సందర్భంగా ఆదివారం, సేలంలోని ఫోర్లేన్ రోడ్డు సమీపంలోని ఇన్ఫాంట్ జీసస్ కేథడ్రల్ శ్మశానవాటికకు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు వచ్చి తమ పూర్వీకుల సమాధులను శుభ్రం చేసి పూలతో అలంకరించారు. కొవ్వొత్తులను వెలిగించి, పుష్పగుచ్ఛాలు ఉంచి ప్రార్థనలు చేశారు. ఇన్ఫాంట్ జీసస్ కేథడ్రల్ పారిష్ పూజారి ఫాదర్ జే బెర్నార్డ్ జోసెఫ్, అసిస్టెంట్ పారిష్ పూజారి సహాయరాజ్ పాల్గొన్నారు. ఆత్మీయుల సమాధుల వద్ద కొవ్వొత్తులను వెలిగించి ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు -
మత సామరస్యానికి నిదర్శనం
సేలం: నామక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్ సమీపంలోని కొక్కరాయన్ పేట్టై స్వయంసేవక్ మారియమ్మన్ కుంభాభిషేక మహోత్సవం మత సామరస్యానికి నిదర్శంగా నిలిచింది. ఇక్కడ జరిగే వేడులకు ముస్లింలు ఏటా సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో హిందూ మత, దేవాదాయ శాఖ నిర్వహణలోని స్వయంభు మారియమ్మన్ ఆలయంలో రెండవ పూజ ఆదివారం జరిగింది. సోమవారం పవిత్రోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక గ్రామస్తులు గుర్రాలు, ఎద్దులతో ఊరేగింపుగా మూలపారిని తీసుకెళ్లి ఆలయంలో ఉంచారు. ఆ తరువాత, ఆలయ ఉత్సవ బృందం, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ ఆచారం ప్రకారం, ఆలయం సమీపంలోని అల్ ముహమ్మదియా జామియా మజీద్కు డప్పులతో వెళ్లి స్థానిక సమాజాన్ని కుంభాభిషేక వేడుకకు ఆహ్వానించింది. దీనికి ప్రతిస్పందనగా, మసీదు సీనియర్ అధికారి జలీల్ నేతృత్వంలో 50 మందికి పైగా ముస్లిం ప్రముఖులు అన్నదానం, పూలమాలలు, పండ్లు సహా తొమ్మిది రకాల వస్తువులు, లక్ష రూపాయల నగదుతో ఊరేగింపుగా ఆలయానికి వచ్చారు. ఈ విషయం గురించి మసీదు ముత్తవల్లి జల్లి, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుడు మోహన్ విలేకరులతో మాట్లాడుతూ, ‘కాలానుగుణంగా, మారియమ్మన్ పండుగ, మారియమ్మన్ ఆలయంలో కుంభాభిషేకం వేడుక జరిగినప్పుడు, మత సామరస్యాన్ని పెంపొందించడానికి, ముస్లిం ప్రముఖులు, కులం లేదా మతంతో సంబంధం లేకుండా, 9 రకాల సీర్ ప్లేట్లతో ఆలయానికి వచ్చి ఆహార పంపిణీకి తమకు సాధ్యమైనంత వరకు సహాయం అందిస్తారన్నారు. దాని ప్రకారం, ఈ సంవత్సరం కుంభాభిషేక వేడుకను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. -
ఒకే వేదికపైకి వేలాది మంది రన్నర్లు
విజేతను సత్కరిస్తున్న కమల్ పరుగు పందేలను ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్– చైన్నెలో పరుగు పందెం సాక్షి, చైన్నె : ఎంఆర్టీ – 1 చార్జ్బీ చైన్నె పరుగు పందెంతో వేలాదిమంది రన్నర్లు ఆదివారం ఒకే వేదికపైకి వచ్చారు. ఈ రన్ను డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ప్రారంభించగా, విజేతలను మక్కల్ నీది మయ్యంనేత, రాజ్య సభ సభ్యుడు, సినీ నటుడు కమలహాసన్ సత్కరించారు. ఛార్జ్బీ చైన్నె రన్స్ 2025 పేరిట ఫిట్ నెస్,కమ్యూనిటీ, క్రీడా, మారథాన్ స్పూర్తితో నిధుల సేకరణ ద్వారా పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 కి.మీ, 5కి.మీ, 10 కి.మీ, హాఫ్ మారథాన్ విభాగాలతో ఛార్జ్ బీ చైన్నె రన్స్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం, క్రీడల మంది ఉదయనిధి స్టాలిన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరుగు పందెంలో పాల్గొనే వారిని ప్రోత్సహిస్తూ, తన మద్దతును తెలియజేశారు. చైన్నె రన్స్ క్రీడలు, సమష్టి పురోగతిని ఎలా ప్రేరేపిస్తాయో చాటిందన్నారు. పరుగుతో ఫిట్ నెస్ను ప్రోత్సహించడమే కాదు, తదుపరి తరానికి బలమైన, మరింత సాధికారతను ఆరోగ్య పరంగా కల్పించేందుకు వీలుంటుందన్నారు. ఈ రన్లో విజేతలుగా నిలిచిన వారిని పద్మభూషన్ కమలహాసన్,ఎంఆర్టీ – 1 చైర్మన్ బాలకృష్ణలు సత్కరించారు. ఈ పరుగు పందెంతో 12 వేల మందికి పైగా రన్నర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చినట్టు బాలకృష్ణ పేర్కొన్నారు. -
100 సవర్ల నగలు చోరీ
డాక్యుమెంట్ రైటర్ ఇంట్లో.. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పళ్ళిపట్టు: డాక్యుమెంట్ రైటర్ ఇంట్లో చొరబడి 100 సవర్ల నగలు, కేజీ వెండి. రూ. లక్ష నగదు చోరీ ఘటన ఆదివారం కలకలం రేపింది. వివరాలు.. పళ్లిపట్టు సమీపంలోని కర్లంబాక్కం గ్రామానికి చెందిన పళని(65) డాక్యుమెంట్ రైటర్తో పాటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి కొడుకు, కుమార్తె ఉన్నారు. కుమారుడు డాక్టర్గా హైదరాబాదులో కుటుంబంతో నివాసముంటున్నారు. కూతురు ఆంధ్రాలోని పుత్తూరులో వుంటున్నారు. ఈక్రమంలో గ్రామంలోని ఇంట్లో పళని అతని భార్య రజిని మాత్రమే వుండేవారు. కూతురు వద్దకు మూడు రోజుల కిందట గ్రామంలోని ఇంటిని తాళం వేసుకుని పళని అతని భార్య వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున పళని ఇంటి నుంచి శబ్దం రావడంతో ఎదురింటికి చెందిన వారు వీధికి వచ్చి చూడగా పళని ఇంటి ముందు తలుపు తెరిచి వుండడంతో పళనికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులకు సైతం సమాచారం ఇచ్చారు. పళ్లిపట్టు పోలీసులతో పాటు డీఎస్పీ కందన్ సంఘటన ప్రాంతం చేరుకున్నారు. పుత్తూరు నుంచి పళని గ్రామానికి చేరుకుని ఇంట్లో చూడగా బీరువా కూల్చివేతను చూసి దిగ్భ్రాంతి చెందారు. పోలీసుల విచారణలో తన కుమారిడి వివాహం ఏడాదిన్న కిందట జరిగిందని తన కోడలకు వారి తల్లిదండ్రులు 60 సవర్ల నగలు వేసినట్లు ఆ నగలతో పాటూ మొత్తంగా వంద సవర్లు, కేజీ వెండీ రూ. లక్ష బీరువాలో వుంచినట్లు తెలిపారు. దీంతో వేలిముద్ర నిపుణులు వచ్చి ఆదారాలు సేకరించారు. 13 సవర్లకు కేసు నమోదు వంద సవర్లు నగలు చోరీకి సంబంధించి పోలీసులు రసీదులు కోరగా 13 సవర్లకు మాత్రమే చూపడంతో ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. వంద సవర్లకు రసీదు చూపితే కేసు మార్చి నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. గ్రామంలోని ఇంట్లో చోరబడి భారీ మొత్తంలో నగలు నగదు చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. -
చైన్నె తిరువేర్కాడు సమీపంలో విషాదం
ఇద్దరు బాలురు మృతి తిరువొత్తియూరు: చైన్నె తిరువేర్కాడు సమీపంలో ఆలయ కోనేరులో మునిగి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. పనికి వెళ్లిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటిలో ఒంటరిగా వదిలి వెళ్లడం వలన ఈ విషాదం జరిగినట్టు తెలిసింది. వివరాలు.. చైన్నె తిరువేర్కాడు కీళ్ అయనంబాక్కం, పొన్నియమ్మన్ గుడి వీధికి చెందిన తమీమ్ అన్సారీ అలియాస్ తమిళరసు (32) ఆన్లైన్ ద్వారా ఆహారం విక్రయించే సంస్థలో పని చేస్తున్నారు. ఆయన భార్య వసంతి (26) సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. వారికి రియాస్ (5), రిస్వాన్ (3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ శనివారం ఉదయం పనికి వెళ్లారు. ఇంటిలో కుమారులు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇద్దరు సోదరులు ఇంటి ముందు ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా వారు ఇంటి దగ్గర ఉన్న పొన్నియమ్మన్ గుడి కోనేరు ఒడ్డుకు వెళ్లారు. ఆ సమయంలో ఊహించని విధంగా ఇద్దరూ కోనేటి జారిపడి నీటిలో మునిగిపోయారు. ఇది చూసిన అక్కడ ఉన్న ప్రజలు దిగ్భ్రాంతి చెందారు కొలను లో పడిపోయిన ఇద్దరు పిల్లలను రక్షించి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఇద్దరు సోదరులు నీటిలో మునిగి అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఒకే సమయంలో తమ ఇద్దరు కొడుకులను కోల్పోయిన తల్లిదండ్రులు, కొడుకుల మతదేహాలను చూసి రోదించడం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరువేర్కాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సెంగొట్టయ్యన్పై ముప్పెట దాడి
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే బహిష్కృత నేత, ఎమ్మెల్యే సెంగొట్టయ్యన్పై దక్షిణ తమిళనాడులోని పార్టీ నేతలు ముప్పెట దాడి చేసే పనిలో పడ్డారు. ఇక, ఆయన రాజకీయ జీవితం ప్రశ్నార్థకమే అని అన్నాడీఎంకే శాసన సభా పక్ష ఉప నేత ఆర్బీ ఉదయకుమార్ వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను పార్టీ నుంచి తొలగించడం ఆనందమే అని మాజీ మంత్రి సెల్లూరు రాజు వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. ఐక్య నినాదం పుణ్యమా అన్నాడీఎంకే నుంచి సెంగొట్టయ్యన్ను సాగనంపుతూ పార్టీ ప్రధానకార్యదర్శిపళణి స్వామి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉద్వాసన విషయంగా సెంగొట్టయ్యన్, పళణి మధ్య వ్యాఖ్యల తూటాలు సైతం పేలాయి. ఈ పరిస్థితులలో ఆదివారం మీడియాతో మాట్లాడిన సెంగొట్టయన్ న్యాయవాదుల ద్వారా వివరణ కోరుతూ నోటీసులు పంపించనున్నట్టు ప్రకటించారు. 53 సంవత్సరాలు అన్నాడీఎంకేకు తాను సేవలు అందించానని, ఆ పార్టీ ప్రస్తుతం ఉన్నది తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమేనని వివరించారు. తనకు పార్టీలో దక్కిన ఈ గుర్తింపు కారణంగా కంట కన్నీళ్లు వస్తున్నాయని, నిద్ర కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు సమాధానం ఇచ్చే విధంగా అన్నాడీఎంకే శాసన సభా పక్ష ఉప నేత ఆర్బీ ఉదయకుమార్ ఎదురు దాడిచేశారు. తనను తొలగిస్తే ఆనందమే అని వ్యాఖ్యలుచేసిన సెంగొట్టయ్యన్ ఇప్పుడేమో కన్నీళ్లు అంటూ సానుభూతి ప్రయత్నాలలో ఉన్నట్టుందని ఎద్దేవా చేశారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టుగా పార్టీ బహిష్కృతులను నమ్ముకుని తన రాజకీయ జీవితాన్ని సెంగొట్టయ్యన్ ప్రశ్నార్థకం చేసుకున్నారని హితవు పలికారు. తన చేజేతులా ఆయన రాజకీయ జీవితాని అస్తమయం చేసుకుని, ఇప్పుడు ఒప్పారి పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయ స్వలాభం కోసం సెంగొట్టయ్యన్ ఇక ఎన్ని ఎత్తులు వేసినా అన్నాడీఎంకే కేడర్ నమ్మ బోరని, ఆయన రాజకీయ జీవితానికి ఇక శుభం కార్డు పడ్డట్టే అని స్పష్టంచేశారు. మాజీ మంత్రి సెల్లూరు రాజు స్పందిస్తూ, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామి పేరును ప్రకటించిందని సెంగొట్టయ్యన్ అని, అయితే, ఇప్పుడేమో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సెంగొట్టయ్యన్ను పార్టీ నుంచి తొలగించడం ఆనందంగా ఉందన్నారు. -
ఎస్ఐఆర్ ఆపాల్సిందే..!
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా చేపడుతున్న ఎస్ఐఆర్ను ఆపాల్సిందేనని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశం డిమాండ్ చేసింది. లేకుంటే అన్నీ పార్టీల తరపున చట్ట పోరాటం దిశగా సుప్రీం కోర్టులో పిటిషన్ల దాఖలకు తీర్మానించారు. సాక్షి, చైన్నె: 2026లో తమిళనాట జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈనెల 4వ తేదీ నుంచి నెల రోజుల పాటూ రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా పరిశీలనలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులకు, శిక్షణ, ఇంటింటా పరిశీలనలు, సర్వేకు బూత్ స్థాయిలో సిబ్బంది సన్నద్ధం అవుతున్నారు. తమిళనాట పాగా వేయడం కోసం బీజేపీ కొత్తకుట్రలకు సిద్ధమైందని పేర్కొంటూ, కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలను ఆది నుంచి డీఎంకే కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన నేపథ్యంలో ఆదివారం చైన్నెలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. 46 పార్టీల మద్దతు.. సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి 46 పార్టీలు మద్దతు ప్రకటించాయి. డీఎంకే, కాంగ్రెస్, ద్రావిడ కళగం, ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ, పీపుల్స్ జస్టిస్, ఇండియన్ యూనియన్ ముస్లీంలీగ్, మక్కల్ నీది మయ్యం, కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి, తమిళర్ వాల్వురిమై కట్చి, మూవేందర్ మున్నేట్ర కజగం, ఆమ్ఆద్మీ పార్టీ తమిళనాడు రైతులు – కార్మికుల పార్టీ, మనిద నేయమక్కల్ కట్చి, మనిద నేయ జననాగక కట్చి, కొంగు యువజన మండలి, ఇండియన్ నేషనల్ లీగ్, తమిళనాడు నేషనల్ లీగ్, పెరుంతలైవర్ మక్కల్ కట్చి, బహుజన్ సమాజ్, డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, న్యూ జస్టిస్ పార్టీ, ఇండియన్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ , ఆల్ ఇండియా మూవేంధర్ ఫ్రంట్ , ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఆది తమిళ్ తదితర పార్టీల నాయకులు, ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎవర్వెవ్వరు ఏమన్నరంటే.. ఈ సమావేశంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణను యావత్ తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఎన్నికల నేపథ్యంలో నిజమైన ఓటర్లను తొలగించేందకు అతి పెద్ద కుట్రకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. వీసీకే నేత తిరుమావళవన్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ను అడ్డం పెట్టుకుని ఎన్ఆర్సీ అమలుకు పథకం రచించి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ఎదుర్కొనేందుకు ఆదిలోనే కీలక నిర్ణయం తీసుకోవాలని కోరారు. ద్రవిడ కళగంనేత వీరమణి మాట్లాడుతూ, ఎస్ఐఆర్కు రాజకీయ చట్టంలో చోటు గానీ, ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇందుకు ఎన్నికల కమిషన్కు అవకాశం, వీలు లేదని, తమిళనాడు వ్యాప్తంగా ఒకే సారి చేపట్టడం వెనుక అతి పెద్ద కుట్ర ఉందనేది స్పష్టమవుతోందన్నారు. బూత్ లెవల్ ఆఫీసర్స్ను ఎందుకు నియమించారని, ఇందుకు చట్టంతో సంబంధం గానీ, అనుమతి గానీ లేదని వివరించారు. ఎండీఎంకే నేత వైగో మాట్లాడుతూ, బిహార్లో రచించిన కొత్త కుట్రలను తమిళనాటు అమలు చేయడానికి కేంద్రం వ్యూహ రచన చేసినట్టుందన్నారు. బిహార్లో తొలగించిన ఓటర్లను ఇక్కడ చేర్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. తమిళనాడులో 2011 జనాభా లెక్కల మేరకు సుమారు 35 లక్షల మంది ఉత్తరాది కార్మికులు ఉన్నారని, ఈ 14 సంవత్సరాల కాలంలో ఈ సంఖ్య రెట్టింపు అయ్యేందుకు అవకాశాలు ఎక్కువేని వివరించారు. కోయంబత్తూరు,తిరుప్పూర్, చైన్నె, కరూర్, ఈరోడ్ తదితర ప్రాంతాలలో ఉత్తరాది వాసుల పేర్లును తమిళనాడు ఓటర్ల జాబితాలో చేర్చేందుకే ఈ ఎస్ఐఆర్ చేపడుతుున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. తమిళనాడును గురి పెట్టి బీజేపీ రచిస్తున్న కుట్రలను చోద్యం చూడకుండా సమష్టిగా అడ్డుకుందామని పిలుపు నిచ్చారు. టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై మాట్లాడుతూ, తమ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే సమగ్రంగా ఓటు చోరీ గురించి వివరించి ఉన్నారని గుర్తు చేస్తూ, తమిళనాడులో ఎస్ఐఆర్ను అడ్డుకుని తీరుదామని పిలుపు నిచ్చారు. సీపీఎం నేత షణ్ముగం మాట్లాడుతూ, తమిళనాడు హక్కులకు వ్యతిరేకంగా బీజేపీ కుట్రలను ఖండిస్తూ ఆది నుంచి కూటమి పోరాటాలు సాగిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఎస్ఐఆర్ వ్యవహారంలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ భారీ నిరసనకు సన్నద్దం కావాలని సూచించారు. సీపీఐ నేత వీర పాండియన్ స్పందిస్తూ, కుట్రలతో దొడ్డి దారిలో ఎవ్వరు వచ్చినా, వాటిని సమష్టిగా భగ్నం చేద్దామన్నారు. మక్కల్ నీది మయ్యంనేత కమలహాసన్ మాట్లాడుతూ, ఓటరు జాబితా పరిశీలన అవశ్యమే అయినా, ఎన్నికలకు ముందుగా ఈ కార్యాచరణకు సిద్ధం కావడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. నిజమైన అర్హుల పేర్లను తొలగిస్తూ చూస్తూ ఊరుకోమని పేర్కొంటూ ఇటీవల కాలంగాకేంద్ర ఎన్నికల కమిషన్ పనితీరు ఆ సంస్థపై నమ్మకాన్ని పూర్తిగా సన్నగిళ్లే విధంగాచేస్తున్నట్టు ధ్వజమెత్తారు.తీర్మానాలు.. తమిళనాడులో ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న ఎస్ఐఆర్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని ఈ సమావేశంలో తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వంచేతిలో కీలు బొమ్మగా మారి నిరంకుశ ధోరణిని అనుసరిస్తున్న ఎన్నికల కమిషన్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు.మైనారిటీలు తదితర అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం లక్ష్యంగా, అనర్హులను చేర్చే ప్రయత్నాన్ని వీడాలని హెచ్చరించారు. బిహార్ కుట్రలను ఇక్కడ పారనివ్వమని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రజా ప్రాతినిత్య చట్టానికి విరుద్ధంగా సాగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎన్నికలక మిషన్ జారీ చేసిన నోటిఫికేషన్లో అనేక అంశాలు అస్పష్టంగా ప్రస్తావించ బడినట్టు వివరిస్తూ, ఓటరు ధ్రువీకరణ విషయంలో నిజాయితీ, పారదర్శకత లేదన్న విషయం స్పష్టం అవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఓటర్ల నుంచి ఆధార్ తదితర పత్రాల స్వీకరణ గురించి స్పష్టత ఇవ్వక పోగా గుర్తింపు పత్రాలు, ఇతర ఫాంల గురించి తీవ్ర గందరగోళం సృష్టించి ఉన్నారని ఆరోపిస్తూ తీర్మానం చేశారు. అఖిల పక్షం డిమాండ్ ఈశాన్య రుతుపవనాల సీజన్లోనా..? తమిళనాడులో సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలలో ఈశాన్య రుతు పవనాల సీజన్ బల పడుతున్నాయని, ఈ కాలంలో ఎస్ఐఆర్ షెడ్యూల్ చేయడం మరింత అనుమానాలు కలిగిస్తున్నాయని వివరించారు. వర్షాలసీజన్, క్రిస్మిస్ తదితర పండుల కాలంలో ఈ సవరణ అన్నది సజావుగా సాగేనా అని కేంద్ర ఎన్నికల కమిషన్ను ప్రశ్నిస్తూ తీర్మానం చేశారు. ఎన్నికల కమిషన్ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కాకుండా తటస్థంగా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హితవు పలుకుతూ , తాజాగా కేంద్రం చేతిలో కీలు బొమ్మగా మారి తీసుకున్న ఎస్ఐఆర్ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్చేశారు. ఓటరు జాబితా వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో ఎలా ఎస్ఐఆర్కు చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తూ, తమిళనాడు ప్రజల ఓటుహక్కుకు విరుద్ధమైన చర్యలను తక్షణం నిలుపుదల చేయాలని కోరారు. ఎస్ఐఆర్ ఆమోద యోగ్యం కాదని, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లో అనేక లోపాలు ఉన్నాయని వివరిస్తూ ఎస్ఐఆర్ను ఆపాల్సిందేనని పట్టుబడుతూ తీర్మానం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాడులో ఓటర్ల జాబితా సవరణపై దృష్టి పెట్టుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఓటర్ల హక్కును కాపాడేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించడం తప్పా, మరేదారీ తమకు కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ను ఆపకుంటే సుప్రీం కోర్టులో అన్ని పార్టీలు పిటిషన్లు దాఖలు చేయడానికి సిద్ధం అని హెచ్చరిస్తూ తీర్మానించారు. -
సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి
సాక్షి, చైన్నె : సామాజిక మాధ్యమాల వేదికగా జనరంజకంగా ప్రచారం ముందుకు తీసుకెళ్లాలని ఐటీ వింగ్ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణి స్వామి ఆదేశించారు జిల్లాల వారీగా చైన్నెలో ఐటీ విభాగం నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. ప్రజల్ని ఆకర్షించే రీతిలో గత కొన్ని నెలలుగా ప్రజా చైతన్యయాత్రను తమిళానుడు, తమిళ ప్రజలను రక్షిద్దామన్న నినాదంతో పళని స్వామి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పలు విడతలుగా సాగుతూ వస్తున్న ఈ ప్రచారంలో భాగంగా తాజాగా పార్టీ అనుబంధ విభాగాల ద్వారా సైతం కార్యక్రమాలను విస్తృతం చేయించే దిశగా పళని కసరత్తులలో పడ్డారు. ఇందులో ఐటీ వింగ్ పాత్ర కీలకంగా పరిగణించారు. సామాజిక మాధ్యమాలలో ఐటీ వింగ్ ద్వారా విస్తృతంగా ప్రజల్ని ఆకర్షింప చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ప్రజలలోకి చొచ్చుకెళ్లే ప్రచారం.. రాయపేటలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం 39 జిల్లాలకు చెందిన ఐటీ విభాగం నేతలతో పళణి స్వామి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు దిండుల్ శ్రీనివాసన్, ఎస్పీ వేలుమణి, నత్తంవిశ్వనాథన్, కేపీ మునుస్వామి పళణి స్వామితో పాటూ పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఐటీ విభాగం పని తీరు గురించి సమీక్షించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై ఐటీ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టాలని పళణిస్వామి సూచించారు. బూత్ కమిటీలు, లీగల్ టీం, విద్యార్ధి, యువజన విభాగాలతో కలిసి సామాజిక మాధ్యమాలను మరింతగా ఉపయోగించుకోవాలని వివరించారు. డీఎంకే ప్రభుత్వ వైఫల్యలాలను, అమలుకు నోచుకోని పథకాలను ప్రధాన అంశాలుగా చేసుకుని సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని సూచించారు. ఉరుట్టు, తిరుట్టు, హల్వా పేర్లతో ఈ ప్రచారాలు ముమ్మరం కావాలని సూచించారు. అలాగే అన్నాడీఎంకే హయాంలో జరిగిన సంక్షేమ పథకాల తీరు తెన్నులను ప్రజలకు సవివరంగా తెలియజేసే రీతిలో, గతంలో అన్నాడీఎంకే వేసిన పునాదులు, నిర్మాణాలు, తాజాగా పూర్తయిన వాటికి డీఎంకే వాడుకుంటున్న పేర్లకు వ్యతిరేకంగా ముందుకెళ్లడమే కాకుండా, ఆ నిర్మాణాలన్నీ అన్నాడీఎంకే ఘనతే అని చాటే విధంగా వినూత్న రీతిలో జన రంజకంగా ప్రచారాలపై ఐటీ వింగ్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ఆదేశించారు. సాంకేతిక పరంగా ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల గుండెల్లోకి చొచ్చుకెళ్లే విధంగా సందేశాలు, వీడియోలు తదితర వినూత్న అంశాలతో దూకుడు పెంచాలని ఐటీ వింగ్ నేతలకు పళణి స్వామి ఆదేశించారు. సాయంత్రం జరిగిన సమావేశంలో పార్టీ పరంగా జిల్లాల ఇన్చార్జ్లతో పళణి స్వామి సమావేశమయ్యారు. జిల్లాలో ఇప్పటి వరకు తాను నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రకు వచ్చిన స్పందన, తదితర అంశాల గురించి సమాచారం రాబట్టారు. హాజరైన ఐటీ విభాగం జిల్లాల నేతలు సమావేశంలో పళణి స్వామి తదితర నేతలు -
సీఈసీకి విజయ్ ఏడు ప్రశ్నలు
సాక్షి, చైన్నె: ఎస్ఐఆర్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ)కి తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఏడు ప్రశ్నలను సంధించారు. ఈ వ్యవహారంలో ప్రజలపక్షాన నిలబడేందుకు నిర్ణయించామన్నారు .ప్రజల్ని మమేకం చేస్తూ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా అవగాహన సదస్సులు, శిబిరాలకు చర్యలు తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశానికి విజయ్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఆపార్టీ తరపున ఎవ్వరూ ఈ సమావేశానికి హాజరు కాలేదు. అదే సమయంలో విజయ్ ఆదేశాల తో టీవీకే వర్గాలు ఈవ్యవహారంలో కొత్త బాటను ఎంచుకున్నారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి ముందుకు సాగేందుకు నిర్ణయించారు. ఇందులో భా గంగా కేంద్ర ఎన్నికల కమిషన్కు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ, పలు సూచనలు ఇస్తూ విజయ్ ఏడు ప్రశ్నలను సందించారు.ఓటరు జాబితాలో తప్పులు సరిదిద్దేందుక ఫారం, మరణించిన వారిపేర్ల తొగింపునకు ఫారం, ఆధార్ను గుర్తింపు కార్డుగా పరిగణిస్తారా లేదా? తదితర ప్రశ్నలను విజయ్ సంధించారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే విధంగా అవగాహన సదస్సులు,శిబిరాల నిర్వహణకు నిర్ణయించినట్టు ప్రకటించారు. అదే సమయంలో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం అన్నది ప్రవేశ పెట్టి ఆమోదించకుండా, డీఎంకే అఖిల పక్షం అంటూ కొత్త నాటకం రచించడంతోనే తాము ఆ సమావేశానికి దూరంగా ఉన్నట్టు టీవీకే ప్రకటించడం గమనార్హం. ఇదిలా ఉండగా విజయ్ ప్రచార భద్రతకు పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ను నియమించేందుకు సిద్ధమయ్యారు. ఇది వరకు రిటైర్డ్పోలీసు అధికారుల నేతృత్వంలో ప్రత్యేక భద్రతా బృందం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. తాజాగా డిఫెన్స్ ఫోర్సును 2,500 మందితో ఎంపిక చేయనున్నారు. ఇందులో 1,200 మంది మహిళలు ఉన్నారు. వీరికి భద్రతా పరంగా అంశాలతో శిక్షణ ఇస్తున్నారు. -
అజిత్ చిత్రం ప్రారంభం ఎప్పుడంటే?
తమిళసినిమా: కోలీవుడ్లో టాప్ హీరోల్లో నటుడు అజిత్ ఒకరు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన చిత్రం వస్తుందంటే అభిమానులకు పండగే. అజిత్ ఇంతకుముందు గుడ్బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటించారు. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఇందులో నటి త్రిష నాయకిగా నటించారు. పక్కా కమర్షియల్ ఫార్ములాలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆలరించింది. దీంతో అజిత్ తర్వాత చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న ఆసక్తి అటు అభిమానుల్లోనూ, ఇటు చిత్ర పరిశ్రమలోనూ నెలకొంది. కానీ ప్రస్తుతం అజిత్ కార్ రేస్ పోటీల్లో పాల్గొంటూ బిజీగా ఉండడమే. ఈయన అంతర్జాతీయ కార్ రేసుల్లో పాల్గొంటూ బహుమతులను గెలుచుకుంటున్నారు. అలా సినిమాలతోపాటు కార్ రేసులకు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. కాగా అజిత్ 64వ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే ఆసక్తి నెలకొంది. అయితే ఈయన తర్వాత చిత్రానికి కూడా గుడ్బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్నే దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. కాగా తన తాజా చిత్రం గురించి అజిత్ పేర్కొంటూ మరో రెండు నెలల్లో తన 64వ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని స్పష్ట.ం చేశారు. ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇది అజిత్ అభిమానులు జోష్ నింపే వార్తే అవుతుంది. నటుడు అజిత్తో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ -
గ్రాడ్యుయేట్ యువతి సజీవదహనం?
చెన్నై: పెరంబలూర్ జిల్లాలోని కున్నం ప్రాంతానికి చెందిన ఆంథోనీ సామి. ఇతని భార్య కళావతి. ఈ దంపతులకు మీరా జాస్మిన్ (22) అనే కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లల చదువు కోసం తిరుచ్చిలోని శ్రీనివాస నగర్లోని వాయలూర్ రోడ్లోని ఓ అద్దె ఇంట్లో ఆంథోనీ సామి నివసించారు. ప్రస్తుతం, ఆంథోనిసామి విదేశాల్లో పనిచేస్తున్నారు. మీరా జాస్మిన్ తిరుచ్చిలోని ఓ ప్రసిద్ధ కళాశాల నుంచి ఎంఎస్సీ పూర్తి చేశారు. ఆమె విశ్వవిద్యాలయ పోటీల్లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉద్యోగం కోసం మీరా జాస్మిన్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తర్వాత తిరిగిరాలేదు. దీంతో తల్లి కళావతి ఆమెను సెల్ ఫోన్లో సంప్రదించింది. ఫోన్ పూర్తిగా మోగింది, తర్వాత కట్ అయింది. తర్వాత ఎవరూ ఫోన్ ఎత్తలేదు. దీంతో కళావతి తిరుచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా తిరుచ్చి మనచనల్లూరు సమీపంలోని సిరుకనూరు సానమంగళం రక్షిత అటవీ ప్రాంతంలో ఓ యువతి మృతదేహం పాక్షికంగా కాలిపోయి కనిపించింది. తరువాత, ఆ మృతదేహం మీరా జాస్మిన్ది అని దర్యాప్తులో తేలింది. మృతదేహం దగ్గర ఆమె హ్యాండ్బ్యాగ్, సెల్ ఫోన్, బూట్లు, బీరు బాటిళ్లు కనిపించాయి. మృతదేహం అర్ధనగ్నంగా కనిపించింది. ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన తర్వాత, గొంతు నులిమి చంపి, ఆపై కిరోసిన్ పోసి నిప్పంటించారని తెలుస్తోంది. గతంలో తనలో కలిసి చదివిన స్నేహితుడితో మీరా జాస్మిన్కు ప్రేమ సంబంధం ఉందని, వారిమధ్య మనస్పర్థల కారణంగా విడిపోయినట్లు తెలిసింది. దీంతో తీవ్ర నిరాశ చెందిన స్నేహితుడి సోదరుడు 6 నెలల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ప్రతీకారంగా ప్రియుడి బంధువులు ఆమెని కిడ్నాప్ చేసి హత్య చేశారా.? అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పరిశోధన కేంద్రం
సదరన్ రైల్వేలో జాతీయ ఐక్యతా దినోత్సవం కొరుక్కుపేట: భారతదేశ ఏకీకరణలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని సదరన్ రైల్వే ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించింది. సదరన్ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్. సింగ్, అదనపు జనరల్ మేనేజర్ విపిన్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ కె.హరికష్ణన్ పాల్గొని సదరన్ రైల్వే ప్రధాన కార్యాలయ అధికారులు, సిబ్బంది చేత ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం పురస్కరించుకుని సదరన్ రైల్వేలోని ఆరు డివిజన్లు, వర్క్షాప్లు, ఫీల్డ్ యూనిట్లలో జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకున్నారు. -
సమాధుల తోటలో ఆంగ్లో ఇండియన్స్ సందడి
– ఆత్మీయుల సమాధుల వద్ద ఘన నివాళి పాకాల: స్థానిక ఆర్సీఎం, సీఎస్ఐ చర్చి ఉమ్మడి శ్మశాన వాటికలో చాలా కాలం తరువాత ఆంగ్లో ఇండియన్స్ సందడి చేశారు. పాకాల రైల్వే డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు పదుల సంఖ్యలో ఆంగ్లో ఇండియన్స్ కుటుంబాలు స్థానికంగా ఉన్న రైల్వే క్వార్టర్స్లో ఉండేవారు. ఇక్కడ సమాధుల తోటలో 18, 19వ శతాబ్దాల నాటి ఆంగ్లో ఇండియన్స్ సమాధులు ఉన్నాయని, నవంబర్ 2న ఆల్ సోల్స్ డే (ఆత్మల దినం)ని పురస్కరించుకుని స్థానిక స్మశాన వాటికలో సమాధులకు పెయింటింగ్ వేయడం, పిచ్చి మొక్కలను తొలగించడం పనుల్లో నిమగ్నమయ్యారు. కాలక్రమంలో ఇక్కడి ఆంగ్లో ఇండియన్స్ కుటుంబాలు చైన్నె, డిల్లీ, ఆస్ట్రేలియా, బ్రిటన్ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో శనివారం చైన్నె నుంచి ఒకప్పుడు పాకాలలో నివాసం ఉన్న ఆంగ్లో ఇండియన్ షైలీ తమ కుటుంబసభ్యులైన కుమార్తెలు, అల్లుల్లు, మనవరాళ్లతో విచ్చేసి తమ తల్లిదండ్రులు, సోదరుడు, వియ్యంకులు, ఇతర ఆత్మీయుల సమాధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి ఆత్మశాంతికి ప్రార్థన చేశారు. గతంలో పాకాలలో నివాసం ఉన్న షైలీ ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె రాకను తెలుసుకున్న పలువురు పూర్వ విద్యార్థులు ఆమెతో కలసి పనిచేసిన టీచర్లు ఆమెతో కలుసుకుని ఆత్మీయ పలకరింపులతో భావోద్వేగానికి గురయ్యారు. -
ప్రచారం
ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్యతిరుత్తణి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో మనస్తాపానికి గురైన యువతి సూసైడ్ నోట్ రాసివుంచి ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుత్తణి ప్రాంతంలో విషాదాన్ని మిగిల్చింది. తిరువలంగాడు యూనియన్ లక్ష్మాపురం గ్రామానికి చెందిన సెల్వం రైతు. ఇతనికి ఇద్దరుకుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో చిన్న అమ్మాయి హరిత(19) తిరుత్తణిలోని ప్రయివేటు డిప్లొమా నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదివేది. ఈక్రమంలో శుక్రవారం కళాశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన హరిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కనకమ్మసత్రం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న గదిలో యువతి రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. అందులో అమ్మా నువ్వు చాలా కష్టాలు భరించారు. ఇకపై నీకు కష్టాలు పెట్టేందుకు నేను సిద్దంగా లేను. అక్క, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. నమ్ముకున్న ప్రేమ నన్ను జీవించాలనే ఆశ లేకుండా చేసింది. తన చావుకు గోవిందమ్మ కారణమే, శిక్ష పడేలా చేయాలని రాసిన సూసైడ్నోట్ గుర్తించారు. ప్రేమించి మోసం చేసిన చిత్తూరు జిల్లా మేట్టుపాళ్యంకు చెందిన దిలీప్(25) అనే యువకుడు లక్ష్మాపురంలోని అతని బంధువు గోవిందమ్మ ఇంటికి వచ్చి వెళ్లే సమయంలో వారి మధ్య ప్రేమ చోటుచేసుకున్నట్లు, అయితే నగలు, నగదు ఇస్తేనే పెళ్లి చేసుకోవాలని దిలీప్కు గోవిందమ్మ చెప్పడంతో హరితను వివాహం చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. అంత మొత్తం ఇవ్వలేని స్థితిలో హరిత ఆత్మహత్య చేసుకుంది. హరిత మృతికి కారణమైన గోవిందమ్మ, దిలీప్ను అరెస్టు చేయాలని బంధువులు పట్టుబడ్డారు. కనకమ్మసత్రం పోలీసులు పరారీలో వున్న దిలీప్ కోసం గాలిస్తున్నారు. -
మరో 38 చోట్ల హెల్త్ వాక్
సాక్షి, చైన్నె: ఉదయాన్నే వాకింగ్ చేసే వారి కోసం ప్రత్యేక మార్గం ఏర్పాట్లను ప్రభుత్వం విస్తృతం చేసింది. మరో 38 చోట్ల హెల్త్ వాక్ పేరిట ఈ మార్గాలను ఏర్పాటు చేయనున్నామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. చైన్నెలో మెరీనా, బీసెంట్ నగర్ బీచ్తో పాటూ ఇతర పార్కులలతో వాకింగ్ చేసే వారు ఉదయాన్నే ఎక్కువగా ఉంటారు. ఆయా ప్రాంతాలలో వాకింగ్ చేసే వారి కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం చైన్నెలో 16 చోట్ల వాకింగ్ మార్గాలకు సిద్ధం చేశారు. ఎంకేబీ నగర్, డౌటన్, వ్యాసార్పాడి, నంగనల్లూరు, రాజా అన్నామలైపురం తదితర ప్రాంతాలో కొన్ని వీధులను ప్రత్యేకంగా వాకింగ్ కోసం మాత్రమే ఎంపిక చేశారు. ఈ వీధులలో రోడ్డుకు ఇరు వైపులా ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేయడమే కాకుండా, వాకర్లు కూర్చుని విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అక్కడక్కడ ప్రత్యేకంగా కుర్చీల ఏర్పాటు, ఇతర సౌకార్యలను సైతం కల్పిస్తున్నారు. అలాగే 38 జిల్లాలోను ఈ వాకింగ్ ట్రాక్లపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మరో 38 చోట్ల హెల్త్ వాక్ ట్రాక్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టుగా ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ శనివారం చైన్నెలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. -
డెంగీతో అప్రమత్తంగా ఉండాలి
తిరువళ్లూరు: డెంగీ వేగంగా విజృంబిస్తున్న క్రమంలో ప్రజలు అప్రమతంగా వుండాలని కలెక్టర్ ప్రతాప్ గ్రామసభలో సూచించారు. తిరువళ్లూరు జిల్లా కొరట్టూరు గ్రామంలో జరిగిన ప్రత్యేక గ్రామసభలో కలెక్టర్ ప్రతాప్, పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి హాజరయ్యారు. ఈసందర్భంగా గ్రామంలోని అర్హులైన వారికి ఇంటి పట్టాలు, తాగునీటి సదుపాయం, రోడ్డు మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటుపై ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వడంతోపాటు త్వరలోనే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలం ప్రారంభమైన క్రమంలో నీరు నిలిచి ధోమలు ఉత్పత్తి జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో డెంగీ లాంటి వ్యాధులు వేగంగా విజృంభించే అవకాశం వున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. పంచాయతీ అసిస్టెంట్ డైరెక్టర్ యువరాజ్, తహసీల్దార్ ఉదయం, ఆర్ఐ మహేశ్వరి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేశింగు పాల్గొన్నారు. -
గ్రామసభలతోనే సమస్యలకు పరిష్కారం
వేలూరు: గ్రామసభలతోనే గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. గ్రామ పంచాయతీల దినోత్సవాన్ని పురష్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లోనూ శనివారం ఉదయం గ్రామసభలు నిర్వహించారు. గ్రామ పంచాయతీలోని ఆదాయంఖర్చుల వివరాలను ప్రజలకు తెలియజేసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వేలూరు జిల్లా గుడియాత్తం నియోజకవర్గం పరిధిలోని వలత్తూరు గ్రామ పంచాయతీలో కలెక్టర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా పంచాయతీ పరిధిలోని వివిధ సమస్యలపై వచ్చిన వినతులను స్వీకరించి వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీల దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించాలని ఆదేశించామన్నారు. సమస్యలను ఆయా సర్పంచ్లు, వార్డు సభ్యులకు తెలియజేసి వాటిలో అర్హులైన వారికి పథకాలను అందజేస్తామన్నారు. గ్రామసభలో ఎమ్మెల్యే అములు, యూనియన్ చైర్మన్ నిత్యానందం, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా అనకట్టు నియోజకవర్గంలో గంగనల్లూరు గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించి ప్రజలకు అన్నదానం చేశారు. అదేవిధంగా కాట్పాడి తాలుకా అమ్ముండి, పెరుముగై, వంటి పంచాయతీల్లో ఆయా సర్పంచ్ల అధ్యక్షతన ప్రజలతో గ్రామసభ నిర్వహించారు. వీటిలో ఎక్కువగా పింఛన్లకు సంబంధించి వినతులు రావడంతో వాటిని ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని తెలిపారు. -
ఆకట్టుకున్న ప్రయోగ జూనియర్–2025
తిరువళ్లూరు: ప్రత్యూష ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రయోగ జూనియర్–2025తో పాటు ప్రదర్శనలో వుంచిన పలు ప్రయోగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తిరువళ్లూరు జిల్లా ఆరణ్వాయల్కుప్పంలో ప్రత్యూష ఇంజినీరింగ్ తెలుగు కళాశాల వుంది. కళాశాలలో రెండు రోజుల పాటు ప్రయోగ జూనియర్–2025 పేరిట ఎగ్జిబిషన్ను నిర్వహించారు. విద్యార్థులకు సైన్సు పరిశోధనలపై అవగాహన, ఆసక్తిని పెంచడంతో పాటు విద్యార్థుల్లో వున్న ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా నిర్వహించారు. ఎగ్జిబిషన్కు వివిధ ప్రాంతాలకు చెందిన 30 3,600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్లస్టూ విద్యార్థులకు నిర్వహించిన ఎగ్జిబిషన్లో 110 ప్రాజెక్టులను ప్రదర్శనలో వుంచారు. ఎగ్జిబిషన్ను ప్రయివేటు సంస్థకు చెందిన హెచ్ఆర్ హెడ్ ప్రార్థఽసారథి ప్రారంభించారు. అనంతరం ఉత్తమ ప్రదర్శనలకు చైన్నెకు చెందిన స్టాంజ్ టెక్నాలజీ సంస్థ డైరెక్టర్ మారియప్పన్ పళణిపాండ్యన్ బహుమతులను ప్రదానం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
దర్శకత్వానికే ప్రాధాన్యం!
తమిళసినిమా: సీనియర్లో, జూనియర్లో, కొత్త దర్శకులైనాగానీ కంటెంట్ కొత్తగా ఉంటేనే చిత్రాలు సక్సెస్ సాధిస్తాయి. ఇందుకు ఉదాహరణ టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం. ఈ చిత్రం ద్వారా అభిషన్ జీవింత్ దర్శకుడుగా పరిచయమయ్యారు. అంతేకాకుండా కీలకపాత్రను పోషించారు. ఈయనకు ఎలాంటి దర్శకత్వం అనుభవం లేదన్నది గమనార్హం. అయినప్పటికీ టూరిస్ట్ ఫ్యామిలీ అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా అభిషన్ జీవింత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్ర షూటింగ్ కూడా పూర్తి అయింది. దీనికి ఆయన శిష్యుడు మదన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే దర్శక, నటుడు అభిషన్ జీవింత్ తాజాగా ఓ ఇంటివాడయ్యారు. తన పాఠశాల స్నేహితురాలు అఖిలని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం శుక్రవారం చైన్నెలో ఘనంగా జరిగింది. ఈసందర్భంగా శనివారం ఉదయం ఈ నూతన దంపతులు చైన్నెలో మీడియాను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. అనంతరం అభిషన్ జీవింత్ మీడియాతో ముచ్చటిస్తూ తాను దర్శకత్వం వహించిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రాలు ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కథానాయకుడుగా నటిస్తున్న చిత్ర షూటింగ్ పూర్తి అయిందని త్వరలోనే దానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. అయితే తనకు తగిన కథ లభిస్తేనే నటిస్తానని, తాను దర్శకత్వానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. త్వరలోనే తాను దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని అభిషన్ జీవింత్ తెలిపారు. -
గ్రామీణ పాఠశాలలు అభివృద్ధి చెందాలి
వేలూరు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెంది నిరుపేద విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే మేధాశక్తిని పెంచే విధంగా విద్యా బోధన చేయాలని తహసీల్దార్ జగదీశన్ తెలిపారు. ప్రపంచ రెడ్క్రాస్ నిర్వాహకులు జీన్ హెండ్రీ డోనాంట్న్115వ వర్ధంతి పురష్కరించుకొని కాట్పాడిలోని జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఇండియన్ రెడ్క్రాస్ సంఘం నిర్వాహకుడు జీన్ హెండ్రీ డోనాంట్న్115వ వర్ధంతి, ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ దినోత్సవంలో ప్రతి ఏడాది విద్యార్థులకు సేవాభావాన్ని అలవరుచుకునే విధంగా పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు చిన్నప్పటి నుంచే సేవాభావం అలవాటు అవుతుందన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకే జీన్ హెండ్రీ ఈ సంఘాన్ని ప్రారంభించారన్నారు. ఇందులోని సభ్యులు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందజేశారు. రెడ్క్రాస్ సంఘం కార్యదర్శి సేనా జనార్దన్, ఉపాధ్యక్షులు పారివల్లల్, శ్రీనివాసన్, కోశాధికారి పయణి, విజయకుమారి, రెడ్క్రాస్ సభ్యులు పాల్గొన్నారు. -
సినిమా నేపథ్యంలో తడై అదై ఉడై
తమిళసినిమా: యువతను అలరించే, ఆకట్టుకునే, ఉన్నత శిఖరాలకు చేర్చే మాద్యమాల్లో సినిమా ఒకటి. ఈ రంగంలో రాణించడం అంత సులభం కాదు. తగి న ప్రతిభ, కఠిన శ్రమ ఉన్నా కూడా అదృష్టం చాలా ముఖ్యం. అలా సినిమా రంగంలో తమ ప్రతిభను చాటుకోవడానికి ప్రయత్నించే యువకుల ఇతివృత్తంతో రూపొందిన చిత్రం తడై అదై ఉడై. ఇంతకుముందు సినిమా రంగంలో రాణించాలంటే చాలా శిక్షణ అవసరం అయ్యేది. అయితే సాంకేతిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో శిక్షణ కంటే ప్రతిభ, అదృష్టం అవసరం అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు యూట్యూబ్ చానళ్లు వంటి సామాజిక మాధ్యమాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటి ద్వారా తమ ప్రతిభను నిరూపించుకోవాలని కొందరు యువకులు చేసే ప్రయత్నమే తడై అదై ఉడై. తమ ప్రయత్నంలో ఆ యువకులు ఎదుర్కొనే అవమానాలు, ఆటంకాలు, సమకాలీన రాజకీయాలు, విద్య ఆవశ్యకతను తెలిపే సన్నివేశాలు వంటి పలు ఆసక్తికరమైన ఆలోచింపజేసే అంశాలతో కూడిన చిత్రం ఇది. సినిమాను రూపొందించడానికి ఒక నిర్మాతను ఒప్పించే ప్రయత్నంలో ముగ్గురు యువకులు ఎలాంటి సమస్యలకు ఎదుర్కొన్నారు వంటి విషయాలను సహజత్వంగా చూపించిన చిత్రం ఇది. అయితే వారి ప్రయత్నం ఫలించిందా ? లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన తడై అదై ఉడై చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను అరివళగన్ మురుగేశన్ మునిగేషన్ నిర్వహించారు. ఈ చిత్రానికి తంగ పాండియన్, చోటా మణికంఠన్ చాయాగ్రహణం, సాయ్సుందర్ సంగీతాన్ని అందించారు. కాగా ఈ చిత్రం శుక్రవారం తెర పైకి వచ్చింది. -
అరుణాచలేశ్వరాలయంలో బలి పీఠాలకు కుంభాభిషేకం
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల చివరలో ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు చివరి రోజు ఆలయం వెనుక వైపున ఉన్న మహాకొండ కింద భరణి దీపం, కొండపైన మహా దీపాన్ని వెలిగించనున్నారు. పది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో స్వామివారు వివిధ వాహనాల్లో మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మాడ వీధుల్లోని ఎనిమిది దిక్కుల్లోను కాపలా దైవాలకు అష్ట దిక్క బలిపీఠం నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ బలి పీఠాలకు మహాకుంబాభిషేకం ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ అధ్యక్షతన శివాచార్యులు వేద మంత్రాల నడుమ ఎనిమిది దిక్కుల్లోనూ పూజలు చేసి అష్టబంధన కుంబాభిషేకం వైభభవంగా నిర్వహించారు. స్వామివార్లు వాహనాల్లో మాడ వీధుల్లో వచ్చే సమయంలో ఈ బలిపీఠాలు కాపాలా కాస్తాయని నమ్మకంతో ఈ పూజలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయ శివాచార్యులు గోకుల్ గురుకుల్, వెంకట్రాజు గురుకుల్, కార్తీ, అసిస్టెంట్ కమిషనర్ సుబ్రమణి పాల్గొన్నారు. -
ఒకే వేదికగా వెన్నెముక సంరక్షణ నిపుణులు
– మంత్రి పీటీఆర్ సాక్షి, చైన్నె : వెన్నెముక సర్జన్లు, పునరావాస నిపుణులు, న్యూరో సైంటిస్టులు, అనుబంధ ఆరోగ్య నిపుణులను ఒకే వేదిక పైకి తెచ్చే విధంగా చైన్నె అంతర్జాతీయ సదస్సు వేదికగా నిలిచిందని ఐటీ మంత్రి పీటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్ వ్యాఖ్యానించారు. కావేరి ఆస్పత్రి, హంస రిహబ్ ఇస్సికాన్ –2025 అంతర్జాతీయ వెన్నెముక సదస్సుకు చైన్నె వేదికగా నిలిచింది. 3 రోజుల ఈ సదస్సును మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ ప్రారంభించారు. వెన్నెముక గాయం, వెన్ను పాము గాయాల సంరక్షణలో ఆవిష్కరణలు, పురోగతులకు ఈ సదస్సు వేదిక కావాలని తన ప్రసంగంలో మంత్రి ఆకాంక్షించారు. స్పైనల్ కార్డ్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ హెచ్ ఎస్ ఛబ్రా కార్యదర్శి డాక్టర్ జి బాల మురళీ, కావేరి సహ వ్యవస్థాపకుడు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్లతో పాటూ 500 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయినిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ఆకట్టుకున్న కళా ప్రదర్శన
సాక్షి, చైన్నె: ప్రముఖ కళాకారుడు, కళా దర్శకుడు పద్మశ్రీ తోట తరణి పెయింటింగ్లతో చైన్నెలో కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫుట్నోట్స్ ఆన్ సినిమా (కాహియర్స్ డు సినిమా) పేరిట చైన్నె నుంగంబాక్కంలో అలయన్స్ ఫ్రాంకై సీ ఆఫ్ మద్రాస్లో ఏర్పాటైన ఈ ప్రదర్శనను అలయన్స్ ఫ్రాంకై స్ ఆఫ్ మద్రాస్ అధ్యక్షుడు టి.కె. దుర్గాప్రసాద్, చెవాలియర్ డె ఐ’ఆర్డ్రే డెస్ ఆర్ట్స్ ఎట్ లెట్రెస్కి చెందిన ప్రవీణ్ కన్ననూర్ ప్రారంభించారు. కళ, సినిమా అద్భుతమైన కలయికలతో సజీవంగా నిలుస్తున్న ఈ పెయింటింగ్లు ప్రత్యేక ఆకర్షణగా మారి ఉన్నాయి. ఈ ప్రదర్శనను దర్శకుడు మణిరత్నం, నటుడు పసుపతి, పారిశ్రామిక వేత్త సీకే కుమారవేల్, శరవణన్, మణియన్ సెల్వన్, గుహన్, సమీర్ భరత్ రామ్తో పాటు చలనచిత్ర, కార్పొరేట్, కళా రంగాలకు చెందిన ఇతర ప్రముఖులు పాల్గొని పద్మశ్రీ తోటా తరణిని ప్రశంసించారు. 125 కి పైగా కళా ప్రదర్శనలు ఇక్కడ కొలుదీరాయి. తోట తరణి జ్ఞాపకాలు, సినిమా పరిశీలనలపై సన్నిహిత ప్రతిబింబాన్ని అందిస్తుంది. తన తండ్రితో పాటూ చిన్నతనంలో సినిమా సెట్లలో ఆయన అనుభవాల ద్వారా ఇది రూపొందించబడినట్టు తోట తరణి చెప్పకొచ్చారు. ఈ ఆర్ట్ షోలో 25 కి పైగా పెయింటింగ్లు ఉన్నాయి, ూగించి తయారు చేసిన ఫ్రేమ్లపై ప్రదర్శించబడ్డాయి. స్కెచ్ పెన్నులతో గాడా వస్త్రంపై రూపొందించబడిన స్కెచ్లు, సెల్యులాయిడ్ యొక్క మంత్రముగ్ధతను స్పష్టంగా జీవం పోస్తున్నాయి. సినిమాపై పుట్నోట్స్... ఈ సందర్భంగా పద్మశ్రీ తోట తరణి మాట్లాడుతూ ఆయన మాటల్లోనే, ‘సినిమాపై ఫుట్నోట్స్ సినిమా కళలో మునిగిపోయిన జీవితకాలాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రాల చుట్టూ పెరిగి, సినిమా సెట్లలో లెక్కలేనన్ని గంటలు గడిపిన తాను ప్రతి ఫ్రేమ్, ప్రతి సంజ్ఞ కథకు ప్రాణం పోసే ప్రతి వివరాలను గమనించాను, గ్రహించాను, ప్రేరణ పొందాను. ఈ పని ద్వారా, ఆ క్షణాలను కాన్వాస్పైకి అనువదించాలని, భారతీయ సినిమా యొక్క సారాంశం , ఉత్సాహాన్ని సంగ్రహించాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ ప్రదర్శనను కెమెరామెన్, అసిస్టెంట్ డైరెక్టర్లు, సిబ్బంది, తెరవెనుక అవిశ్రాంతంగా పనిచేస్తున్న వారందరికీ అంకితం చేయడానికి నేను ప్రత్యేకంగా సంతోషిస్తున్నాను అని వ్యాఖ్యలు చేశారు. ఈనెల14 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని ప్రకటించారు. ప్రదర్శనలో కొలువుదీరిన పెయింటింగ్స్ -
నిర్మాత కథతో వచ్చారు!
తమిళసినిమా: అన్నా ప్రొడక్షన్స్ పతాకంపై అన్నాదురై నిర్మించిన చిత్రం మెడ్రాస్ మాఫియా కంపెనీ. ఏఎస్ .ముకుందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంద్రాజ్, బిగ్బాస్ సంయుక్త కలిసి నటించారు. నటులు ఆరాధ్య, దీప, షకీలా ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందించారు. శుక్రవారం సాయంత్రం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించారు. దర్శకుడు ఆర్కే సెల్వమణి, ఆర్వీ ఉదయ్కుమార్, పేరరసు పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. అన్నాదురై మాట్లాడుతూ ఏడాదికి 240 చిత్రాలు విడుదలవుతున్నాయని, వాటిలో ఐదు శాతం మాత్రమే విజయం సాధిస్తున్నాయని అన్నారు. అయినప్పటికీ ప్రతి ఏడాది నూతన నిర్మాతల సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. ఇందుకు కారణం సినిమాలపై మొహమేనని అన్నారు. పేపర్లో చదివిన ఒక సంఘటన నిజ జీవితంలో జరిగితే ఏమవుతుంది అనే ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం మెడ్రాస్ మాఫియా ఫ్యాక్టరీ అని చెప్పారు. దర్శకుడు ఏఎస్.ముకుందన్ మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాత అన్నాదురై ఒక న్యాయవాది అని చెప్పారు. అయినప్పటికీ ఆయన సినిమా ప్రేమికుడని ఈ చిత్రం ఇంత మంచిగా రావడానికి ఆయనే కారణమని అన్నారు. పారితోషకాలు బాకీ లేకుండా చెల్లించారని ఆయన డబ్బుతోనే కాకుండా కథతోనూ వచ్చారని చెప్పారు. ఈ కథలోని ప్రధాన పాత్రకు ఆనంద్రాజ్ కరెక్ట్గా ఉంటారని చెప్పడంతో వెంటనే ఆయనతో మాట్లాడి ఓకే చేసినట్లు చెప్పారు. అలాంటి మంచి మనసున్న నిర్మాత కోసమైనా ఈ చిత్రం విజయం సాధించాలని దర్శకుడు తెలిపారు. -
ఆధునిక స్కానర్లతో కరూర్లో సీబీఐ దర్యాప్తు
– విజయ్ భద్రతకు రిటైర్డ్ పోలీసు అధికారుల బృందం సాక్షి, చైన్నె: కరూర్ విషాద ఘటనపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. అత్యాధునిక స్కానర్లను ఉపయోగించి దర్యాప్తు శనివారం జరిగింది. వేలుస్వామి పురానికి ఈ స్కానర్ ద్వారా 360 డిగ్రీలు పరిశీలన చేశారు. టీవీకే నేత విజయ్ ప్రచారంలో చోటు చేసుకున్న ఘోర ఘటనను సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. తమ విచారణలో భాగంగా శనివారం కొన్ని గంటల పాటూ వేలు స్వామిపురం ప్రధాన మార్గంను సీబీఐ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ మార్గంలో వాహనాలు వెళ్లకుండా ట్రాఫిక్ మార్పులు చేశారు. సీబీఐ అధికారులు అత్యాధునిక స్కానర్ను వెంట బెట్టుకొచ్చారు. దీని ఆధారంగా వేలుస్వామిపురంలో సమగ్ర పరిశీలన చేశారు. ఇక్కడున్న దుకాణాలు, గృహాలు, రోడ్డు , ఆ పరిసరాలన్నీ పరిశీలించారు. ఇందులో వెలుగు చూసే వివిధ అంశాల ఆధారంగా అక్కడి దుకాణ దారుల వద్ద విచారణ వేగవంతంచేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనతో ఆగిన విజయ్ ప్రచార పయనం మళ్లీ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీవీకే వర్గాలు దృష్టి పెట్టారు. ఈసారి తన ప్రచారాలలో భద్రతా పర్యవేక్షణ, ఏర్పాట్లపై దృష్టి పెట్టే దిశగా 15 మంది రిటైర్డ్ పోలీసు అధికారులతో ఒక బృందాన్ని నియమించే పనిలో విజయ్ నిమగ్నమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. -
కోవైలో రూ.500 కోట్లతో క్రికెట్ స్టేడియం
– ప్రభుత్వం టెండర్లు సాక్షి, చైన్నె: చైన్నె చేపాక్కం ఎంఏ చిదంబరం స్టేడియంకు దీటుగా కోయంబత్తూరులో భారీ క్రికెట్ స్టేడియంకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ. 500 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు టెండర్లు ఆహ్వానించారు. చైన్నెలోని క్రికెట్ స్టేడియం గురించి తెలిసిందే. రాష్ట్రంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఇది ఒక్కటే. తాజాగా క్రీడలకు ప్రాధాన్యత ఇస్తు న్న తమిళనాడు ప్రభుత్వం కోయంబత్తూరులో నూ అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియానికి ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కోయంబత్తూరులోని ఒండిపుదూర్లో 20.72 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఇక్కడి క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులకు అంచనా వ్యయంగా రూ.500 కోట్లు నిర్ణయించారు. ఈ పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానిస్తూ, గడువును ఈనెల 24వ తేదీగా నిర్ణయించారు. శ్రీగాంధీకి మద్దతుగా తీర్మానాలు సాక్షి, చైన్నె : పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీగాంధీకి మద్దతుగా పార్టీ కార్య నిర్వాహక కమిటీలో తీర్మానాలకు చర్యలు తీసుకున్నారు. 37 చోట్ల ఈ కమిటీ సమావేశాలు శనివారం నుంచి విస్తృతం చేశారు. పీఎంకే నుంచి అన్బుమణిని రాందాసు తొలగించిన విషయం తెలిసిందే. ఆయన చేతిలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తనకుమార్తె శ్రీగాంధికి రాందాసు గత నెల అప్పగించారు. అయితే పార్టీ తనదే అంటూ అన్బుమణి ముందుకు సాగుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి వ్యతిరేకంగా అన్బుమణి వ్యవహరిస్తున్నారని, ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లే విధంగా కార్యనిర్వాహక కమిటీ సమావేశాలలో తీర్మానాలను గత వారం చేశారు. ఈ తీర్మానాలు కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో శ్రీగాంధీకి మద్దతుగా సైతం తీర్మానాలు చేయడానికి సిద్ధమయ్యారు. శనివారం నుంచి పీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు 37 చోట్ల జరుగుతున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీగాంధీ నియామకానికి బలం చేకూరే విధంగామద్దతు తీర్మానాలపై దృష్టి పెట్టారు. పోలీసుశాఖలో అధికార ప్రతినిధి పోస్టు సాక్షి, చైన్నె: రాష్ట్ర పోలీసు శాఖలలో ప్రపథమంగా అధికార ప్రతినిఽధి, మీడియా రిలేషన్స్ అధికారి పోస్టుకు రూపకల్పన చేశారు. ఎస్పీ స్థాయిలో ఐపీఎస్ అధికారి జె. ముత్తరశి ఈ పోస్టుకు నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి దీరజ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అసిస్టెంట్ ఐజీగా ఉన్న జేముత్తరశిని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, స్పోక్స్ పర్సన్, మీడియా రిలేషన్ ఆఫీసర్గా నియమించారు. అలాగే శాంతి భద్రత విభాగం చైన్నె అసిస్టెంట్ ఐజీగా కూడా కొనసాగుతారని ప్రకటించారు. ఇక క్రైం రికార్డుల విభాగం ఐజీ వి. జయశ్రీని హోం గార్డు విభాగానికి, టెక్నికల్ సర్వీసు విభాగం ఐజీ అవినాశ్కుమార్కు క్రైం రికార్డులను అదనపు బాధ్యతగా అప్పగించారు. ఆవడి ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ సీ శంగును రెడ్ హిల్స్ డిప్యూటీ కమిషనర్గా, తూత్తుకుడి పోలీసు ట్రైనింగ్ స్కూల్ ప్రిన్సిపల్ కె. మహేశ్వరిని చైన్నె పోలీసు ట్రైనింగ్ కళాశాలకు స్థాన చలనం కల్పించారు. ఇదిలా ఉండగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా, ఏదేని ఆరోపణలకు వివరణ ఇచ్చే రీతిలో మంచి వాక్ చాతుర్య కలిగిన సీనియర్ ఐఏఎస్లను అధికార ప్రతినిధులుగా ద్రావిడ మోడల్ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. కరూర్లో టిప్పర్ బోల్తా – ముగ్గురి మృతి తిరువొత్తియూరు: కరూర్లో లారీ బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు మరణించిన ఘటన తీవ్ర విషాదం కలిగించింది. వివరాలు.. కరూర్ జిల్లాలోని తెన్నైలె సమీపంలో ఉన్న కోడత్తూరు వద్ద ముధలికౌండన్పాళయం ప్రాంతంలో నిర్మాణ పనుల కోసం శనివారం తెల్లవారుజామున ఎం.శాండ్ లోడ్తో ఓ టిప్పర్ లారీ వచ్చింది. అక్కడ ఎం.శాండ్ లోడ్ను నింపుకొని ఆ టిప్పర్ లారీ కరూర్ వైపు బయలుదేరింది. లారీని డ్రైవర్ సంతన కుమార్ (41) నడుపుతున్నాడు. ఒడిశాకు చెందిన కూలీలు సిక్కందర్ కేటా (21), అజయ్ బంగరా (30), పల్ జెమ్స్ పర్వా (30), బిహార్కు చెందిన విద్యా నానప్రభాకర్ (48) అనే నలుగురు అందులో కూర్చొని ప్రయాణిస్తున్నారు. క్వారీ నుంచి వెళ్తున్న క్రమంలో ఓ మలుపు వద్దకు రాగానే, ఊహించని విధంగా టిప్పర్ లారీ రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో కింద పడిన సిక్కందర్ కేటా, అజయ్ బంగరా, విద్యానానప్రభాకర్ ఎం.శాండ్ మట్టి కింద చిక్కుకున్నారు. సంతన కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, పొకై ్లన్ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎం.శాండ్ కింద చిక్కుకున్న ముగ్గురి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. -
త్యాగానికి ప్రతీక .. పొట్టి శ్రీరాములు
కొరుక్కుపేట: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి ప్రతీక అని అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ చైర్మన్ కె. అనిల్కుమార్రెడ్డి కొనియడారు. చైన్నె మైలాపూర్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ వేడుకలో కమిటీ ఛైర్మన్ కె.అనిల్ కుమార్ రెడ్డితోపాటూ సంయుక్త కార్యదర్శి ఊరా శశికళ, కార్యవర్గ సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య, ఎం వి. నారాయణ గుప్తా , జె ఎం.నాయుడు, ఆచార్య విస్తాలి శంకరరావు, డాక్టర్ ఏవీ శివకుమారి కలసి అమరజీవి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర సాధనకొరకు ఆమరణదీక్ష చేసి.. ప్రాణాలు అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ సభలో పాల్గొన్న వక్తలు మాట్లాడారు. ముందుగా కె. అనిల్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ పొట్టి శ్రీరాములను స్మరించుకుంటూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంకోసం ప్రాణాలు విడిచిన స్థలంలో ఈ వేడుకలను జరుకోవడం మరింత ఆనందంగా ఉందన్నారు. ఆయన ప్రాణత్యాగంతో దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయని గుర్తు చేశారు. ఇంకా పలువురు వక్తలు పేర్కొంటూ ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితాన్ని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. ఇంకా ఈ వేడుకల్లో ఊరా ఆంజనేయులు ,తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. -
6 నుంచి సమతా ఇష్టి ప్రారంభం
కొరుక్కుపేట: కులమత బేధాలు లేకుండా శ్రీమన్నారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించే సమతా ఇష్టి వైభవం ఈ నెల 6న అంకురార్పణతో ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగనుంది. చైన్నె పెరంబూర్లోని ఎస్పీఆర్ సిటీ వేదికగా సమతా ఇష్టి సేవా కమిటీ, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్)–చైన్నె సంయుక్తంగా నిర్వహించనున్న సాప్తాహ్నిక పంచ కుండాత్మక సమతా ఇష్టి కార్యక్రమాన్ని శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిజీ ప్రారంభిస్తారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు చిన జీయర్ స్వామి చేతుల మీదుగా అంకురార్పణంతో సమతా ఇష్టి ఆరంభం కానుంది. ఈ నెల 7వ తేదీన లక్ష్మీ పూజ, 8న వెంకటేశ్వర పూజ, 9న ఉదయం 10 గంటలకు రామానుజ నూట్రంధాది సామూహిక పారాయణం, మధ్యాహ్నం 2 గంటలకు వార్షిక పోటీల విజేతలకు బహుమతులు ప్రధానం ,10వ తేదీన మంత్ర దీక్ష, 12న సాయంత్రం నాలుగు గంటలకు శోభాయాత్ర ,13వ తేది ఉదయం 11 గంటలకు మహా పూర్ణాహుతి, మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీ శ్రీనివాస కళ్యాణం మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ పూజల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైన్నె అధ్యక్షులు పి. రవీంద్ర కుమార్ రెడ్డి ,నిర్వాహకులు కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో 7వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు ప్రతీ రోజు ఉదయం 9:30 గంటలకు శ్రీ సుదర్శన నృసింహ ఇష్టి, శ్రీ వైనతేయ ఇష్టి, శ్రీ హయగ్రీవ ఇష్టి, శ్రీ పరమేష్టి (శ్రీ ధన్వంతరి హోమం తో), శ్రీ విశ్వక్సేన ఇష్టి, శ్రీ లక్ష్మీ నారాయణ ఇష్టి కార్యక్రమాలుతోపాటూ ప్రతి రోజూ రామానుజర్కి అభిషేకాలు, పూజలు, ఇంకా సాంస్కతి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. త్రిదండి చినజీయర్ స్వామి -
గిండిలో.. ఎకో పార్కు
చైన్నెలోని గిండిలో 118 ఎకరాల్లో విస్తీర్ణంలో అతిపెద్ద పర్యావరణ వ్యవస్థతో కూడిన ఎకో పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులను శనివారం సీఎం స్టాలిన్ ప్రారంభించారు. నీటి వనరులకు మరమ్మతులు, అరుదైన చెట్ల పెంపకం, అందమైన పుష్పించే మొక్కలతో నర్సరీ పనులపై దృష్టి పెట్టారు. సాక్షి, చైన్నె: రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ గత ఏడాది ఉద్యానవన శాఖకు గిండిలోని 118 ఎకరాల స్థలాన్ని అప్పగించింది. ఇక్కడ ఎకో–పార్క్ ఏర్పా టు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చైన్నె నగరంలో సెంట్రల్భాగంలో ఉన్న గిండిలో ఎకో పార్కు ఏర్పాటుతో మహానగరాన్ని భారీ వరదల నుండి రక్షించడానికి వీలు అవుతుందని భావించి చర్యలు చేపట్టారు. ఈ మేరకు కార్పొరేషన్ ద్వారా నాలుగు చెరువులు ఇక్కడ నిర్మించబడ్డాయి. ఈ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే విధంగా అక్కడ ఉన్న నీటి వనరుల బలోపేతం చేయడం, మొక్కలు నాటడం, నర్సరీలను ఏర్పాటు చేయడం వంటి పనులను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మంత్రులు ఎం.ఆర్. కె. పన్నీర్ సెల్వం,ఎం. సుబ్రమణియన్, పీకే శేఖర్ బాబు, ఎమ్మెల్యేలు గణపతి, ప్రభాకర్ రాజా, అరవింద్ రమేష్ పాల్గొన్నారు. రోడ్లు – వంతెనలు.. సచివాలయం నుంచి రహదారుల శాఖ తరపున రూ.1,248 కోట్ల వ్యయంతో నిర్మించిన 10 రోడ్లు, 2 రైల్వే క్రాసింగ్ వంతెనలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఈరోడ్, తిరువారూర్, మైలాడుతురై, తంజా వూరు, తిరువళ్లూరు, తిరునెల్వేలి,అరియలూరు, మదురైలలో కొత్త రోడ్లను ఏర్పాటు చేయగా, వేలూ రు లోరైల్వే క్రాసింగ్ వంతెనలను నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ముత్తుస్వామి, ఎస్ఎంనాజర్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో క్రైస్తవులకు, ముస్లింలకు శ్మశాన వా టికల నిమిత్తం స్థలాన్ని కేటాయిస్తూ సీఎం చర్యలు తీసుకున్నారు. మైనారిటీల సంక్షేమ శాఖ తరపున వి రుదునగర్, తేని, రామనాథపురం, తిరువళ్లూరు, పెరంబలూరు, శివగంగైలో క్రైస్తవులకు ప్రభుత్వ ప్ర జా శ్మశానవాటికలకు స్థలాన్ని అప్పగించారు. రుదునగర్, తేని, తిరువళ్లూరు, పెరంబలూరు, శివగంగైల లో ముస్లింల కోసం ప్రభుత్వ ప్రజా శ్మశానవాటికలకు స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలాలలో ప్రహరీ గొడ నిర్మాణం, ఇతర సౌకార్యల కల్పనకు చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా సరిహద్దు పోరాటంలో అమర వీరులను స్మరిస్తూ సీఎం స్టాలిన్ ప్రకటన చేశారు. మార్షల్ నేషమణి, శిలంబు సెల్వర్ వంటి వీరులను త్యాగాలను గుర్తు చేశారు. ఇలాంటి వారి స్పూర్తితో తమిళనాడు హక్కులను కాపాడుకుందాం, పోరాడుదాం. గెలుద్దాం అని వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శకాలు.. సచివాలయంలో అధికారులతో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి, మంత్రులు సమావేశమయ్యారు. కరూర్లో విజయ్ ప్రచారంలో జరిగిన పెను విషాదంను పరిగణించి రోడ్ షోలు, సభల నిర్వహనకు మార్గాదర్శకాల రూపకల్పనకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా, మార్గదర్శకాల రూపకల్పనకు ప్రభుత్వం సిద్ధమైంది. రాజకీయ పక్షాల రోడ్ షోలు, బహిరంగ సభలు, ఇతర సభలను పరిగణించి, అనేక నిబంధనలు, ఆంక్షలతో కూడిన మార్గదర్శకాల రూపకల్పన దిశగా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.87 కొత్త అంబులెన్స్లు అత్యవసర వైద్య సేవల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అంబులెన్స్ల సేవలను విస్తృతం చేసింది. 108 అంబులెన్స్లకు మరింత బలాన్ని కలిగించే విధంగా కొత్తగా 87 వాహనాలను కొనుగోలు చేశారు. రూ. 18 కోట్ల 90 లక్షల 46 వేలతో కొనుగోలుచేసిన ఈ అంబులెన్స్లకు సీఎం స్టాలిన్ జెండా ఊపారు. 2008లో రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవలకు డీఎంకే ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ అంబులెన్స్లో 24 గంటల పాటూ సేవలను అందిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం, 1,353 అత్యవసర వాహనాలు ఉన్నాయి. ఇందులో 977 ప్రాథమిక సౌకర్యాలతో కూడినవి కాగా, మరో 307 మెరుగైన వైద్య సౌకార్యలు కలిగినవి ఉన్నాయి. 65 అంబులెన్స్లను గర్బిణిలు, శిశువులను తరలించేందుకు వీలుగా ప్రత్యేక సౌకార్యలను కలిగి ఉంటాయి. ఇవే కాకుండా 41 ద్విచక్ర అంబులెన్స్లు సేవలు అందిస్తున్నాయి. తాజాగా మరో 87 కొత్త అంబులెన్స్లు ’108’ అత్యవసర సేవలలో చేరాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు హౌసింగ్ బోర్డులో 36 మంది టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్), పట్టణ ప్రణాళిక డైరెక్టరేట్లో 24 మంది సర్వేయర్లు, అసిస్టెంట్లుగా నియమితులైన వారికి సీఎం స్టాలిన్ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముత్తుస్వామి, సీఎస్ మురుగానందం, పట్టణాభివృద్ధి శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి కాకర్ల ఉష, తమిళనాడు హౌసింగ్బోర్డు చైర్మన్ పూచ్చి ఎస్ మురుగన్ తదితరులు హాజరయ్యారు. -
తమిళనాడు
Tamilnadu765 ఏళ్లు పైబడిన వారికి ఇంటికే రేషన్ సరుకుల పంపిణీ కొరుక్కుపేట: తమిళనాడులో ముఖ్యమంత్రి మాతత్వ నవర్ పథకం ద్వారా వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటింటికీ రేషన్ వస్తువులను అందిస్తున్నారు. ఈ పథకం కింద, 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల ప్రయోజనం పొందుతున్నారు. వారికి అవసరమైన బియ్యం, చక్కెర, పప్పులు, పామాయిల్ మొదలైన రేషన్ వస్తువులను లబ్ధిదారుల ఇళ్లకే నేరుగా పంపిణీ చేశారు. ఇప్పుడు లబ్ధిదారుల వయో పరిమితిని 70 నుంచి 65 ఏళ్లకు సడలిస్తూ ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయింది. దీని ఆధారంగా ఈ నెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 65 ఏళ్లు పైబడిన వారి ఇళ్లకే రేషన్ సరుకులు అందిస్తారు. ముఖ్యమంత్రి మాతృత్వ పథకం లబ్ధిదారులైన వృద్ధులు, దివ్యాంగులు ఈ పథకాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025247 -
పళణి సెంగొట్టయన్
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే సెంగొట్టయన్ మధ్య మాటల తూటాలు పేలాయి. కొంగు మండలంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన వివాదం చర్చకు దారి తీసింది. ‘పళణి ఏ–1’ అంటూ పరోక్షంగా కొడనాడు హత్య, దోపిడీ కేసును ప్రస్తావిస్తూ సెంగొట్టయన్ వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే నుంచి తనను తొలగించడం నిబంధనలకు విరుద్ధమని, దీనిపై న్యాయ పోరాటం చేయనున్నట్టు ప్రకటించారు. అయితే పార్టీ నిబంధనలకు అనుగుణంగానే సెంగొట్టయన్ను సాగనంపినట్టు పళణి స్వామి స్పష్టం చేశారు. సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలో పార్టీ ప్రధాన కార్యదర్శి పళళణిస్వామిని కొంగు మండలంలో సీనియర్ నేత, ఎమ్మెల్యే సెంగొట్టయన్ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. పార్టీ బహిష్కృత నేతలు పన్నీరు, సెల్వం, టీటీవీ దినకరన్, దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలిశశికళతో ఆయన భేటీ కావడం చర్చకు దారి తీసింది. దీంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగించారు. ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం తొలగిస్తూ ఇక అన్నాడీఎంకే వర్గాలు ఎవ్వరూ ఆయనతో సంప్రదింపు జరకూడదని పళణి స్వామి శుక్రవారం ఆదేశించారు. ఈ పరిస్థితులలో శనివారం ఈరోడ్లో సెంగొట్టయన్ ఓ వైపు, సేలంలో పళణి స్వామి మరోవైపు మీడియా ముందుకు వచ్చారు. సెంగొట్టయన్ మాట్లాడుతూ, అన్నాడీఎంకేలో తన ప్రయాణం గురించి గుర్తు చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలితల నుంచి తాను పొందిన మెప్పును, పార్టీకి అందించిన సేవలను వివరించారు. అయితే ప్రస్తుతం పార్టీలో ఏకాధిపత్యం సాగుతున్నట్టు ఆరోపించారు. అందరూ సమష్టిగా ముందుకెళ్దామని పిలుపు నిస్తే, పార్టీ పదవి నుంచి తప్పించారని, ఇప్పుడేమో పార్టీ నుంచి తొలగించారని పేర్కొన్నారు. తనను పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తొలగించినట్టు స్పష్టం చేశారు. అన్నాడీఎంకే నిబంధనల మేరకు తొలగింపు జరగ లేదని, ఇది చట్ట విరుద్ధం అని వ్యాఖ్యలు చేశారు. ఈ తొలగింపును వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం చేయనున్నట్టు ప్రకటించారు. పళణి స్వామి కంటే అన్నాడీఎంకేలో తాను సీనియర్ అని, తనకు కనీసం ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించడం వేదన కలిగించిందన్నారు. అమ్మ జయలలిత మరణం తర్వాత పార్టీని నడిపించాలని చిన్నమ్మ శశికళ తనకు ఆదేశాలు ఇచ్చారని , అయితే పళణి స్వామి పేరును ప్రతిపాదించింది తానే అని వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పళణి స్వామి చేపట్టినానంతరంపార్టీ కనీసం ఒక్కటంటే ఒక్క ఎన్నికలలోకూడా గెలవ లేదని, అంతా పతనమే అని ధ్వజమెత్తారు. విలేకరులతో మాట్లాడుతున్న పళణి స్వామి మీడియాతో మాట్లాడుతున్న సెంగొట్టయన్ V/Sనిబంధనలకు అనుగుణంగానే చర్యలు : పళణిస్వామి సేలంలో పళణి స్వామి మీడియాతో మాట్లాడుతూ, సెంగొట్టయన్ను అన్నాడీఎంకే నిబంధనలకు అనుగుణంగానే తొలగించామన్నారు. సీనియర్లు అందరూ కూర్చుని చర్చించి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పార్టీ నుంచి బహిష్కరించిన వారితో కలిసి తిరగడం, పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తే చోద్యం చూడలేమన్నారు. పార్టీ నిబంధనలు ఎవ్వరు ఉల్లంఘించినా చర్యలు తప్పదని హెచ్చరించారు. సెంగొట్టయన్ వ్యవహారంలో అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే గానీ, తాను వ్యక్తి గతంగా ఏ చర్యలు తీసుకోలేదన్నారు. కొడనాడు కేసులో అన్నాడీఎంకే హయంలో చట్ట రీత్య చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అయితే, సెంగొట్టయన్ ఇప్పడు విషం కక్కడం శోచనీయమన్నారు. నేరం జరగడంతో అందుకు సంబంధించిన సమగ్ర విచారణ జరిగిందన్నారు. అయితే రెండు మూడు హత్యలు జరిగినట్టుగా విషం చిమ్మడం మంచి పద్ధతి కాదన్నారు. ఇన్నాళ్లు మనస్సులో విషాన్ని పెట్టుకుని నాటకం ఆడుతూ వచ్చిన ఇలాంటి వాళ్లనా పార్టీలో పెట్టుకోవాలంటూ సెంగొట్టయన్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు.మనస్సులో ఒకటి పెట్టుకుని, నాటకం ఆడుతూ వచ్చిన వారిలో ఇప్పుడు ఎలాంటి విషం అన్నది బయటకు వస్తుందో అన్న వ్యవహారంలో సెంగొట్టయన్ను తలదన్నే వాళ్లు మరొకరు లేరంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో గానీయండి, బహిరంగ సభలలో గానీయండి డీఎంకేకు వ్యతిరేకంగా ఇంత వరకు సెంగొట్టయన్ పల్లెత్తి మాట్లాడలేదని, కనీస విమర్శలు, ఆరోపణలు కూడాచేసిన దాఖలాలు లేవు అని వివరించారు. దీనిని బట్టి ఆయన డీఎంకేకు బీ–టీంగా వ్యవహరించారన్నది అర్థం చేసుకోవాలని సూచించారు. కాగా, సెంగొట్టయన్, పన్నీరు, టీటీవీ, శశికళలు ఒకే వేదికపైకి రావడంతో వారి వైపుగా పార్టీ వర్గాలు దృష్టి పెట్టకుండా ముందు జాగ్రత్తలలో పళణి నిమగ్నమైనట్టున్నారు. ఇందులో భాగంగా ఈనెల 5వ తేదీన పార్టీ జిల్లాల కార్యదర్శుల సమావేశానికి పిలుపు నివ్వడం గమనార్హం. ఏ–1 పళణి.. కొడనాడు కేసు గురించి ఈసందర్భంగా సెంగొట్టయన్ ప్రస్తావించారు. దివంగత అమ్మ జయలలిత జీవించి ఉన్న కాలంలో విశ్రాంతి తీసుకునే కొడనాడులో హత్య, దోపిడీ జరగడం విచారకరంగా పేర్కొంటూ, ఈ విషయంగా పళణి స్వామి ఎందుకు మౌనం వహిస్తున్నారో అని ప్రశ్నించారు. ఆయన ఈ వ్యవహారంలో గళం విప్పడం లేదంటూ, తాను డీఎంకేకు బీ టీఎం కాదు.. పళణి ఏ–1 అంటూ పరోక్షంగా కొడనాడు కేసు ప్రస్తావనను ఆయన తీసుకు రావడం చర్చకు దారి తీసింది. చిన్నమ్మ శశికళ నుంచి పళణి స్వామి ఎలా పదవిని తీసుకున్నారో అన్నది దేశం ఎరిగిన సత్యం అని, ద్రోహం తలబెట్టడంలో ఆయనకు సరిలేరెవ్వరు అని ధ్వజమెత్తారు. ద్రోహం తలబెట్టే విభాగంలో తమిళనాడులో నోబెల్ బహుమతికి పళణి స్వామి మాత్రమే అర్హుడు అని విమర్శించారు. కాగా, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ, కొడనాడు కేసు అంటే పళణికి ఎందుకు అంత భయం, ఆయన వణికి పోతున్నారని విమర్శించారు. అందరం ఏకం కాని పక్షంలో 2021లో ఎదురైన ఓటమి కంటే రెండింతలు ఘోరంగా 2026లో అన్నాడీఎంకే ఓటమి పాలు కావడంతథ్యమని వ్యాఖ్యలుచేశారు. దక్షిణ తమిళనాడులో అన్నాడీఎంకే ఇక గల్లంతయ్యే పరిస్థితులు తప్పదని హెచ్చరించారు. -
హీరోగా టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్.. తొలి ప్రాధాన్యత దానికే!
సీనియర్లు, జూనియర్లు, కొత్త దర్శకులు ఎవరైనాగానీ కంటెంట్ కొత్తగా ఉంటేనే వారి చిత్రాలు సక్సెస్ సాధిస్తాయి. ఇందుకు ఉదాహరణ టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం. ఈ చిత్రం ద్వారా అభిషన్ జీవింత్ (Abishan Jeevinth) దర్శకుడుగా పరిచయమయ్యారు. అంతేకాకుండా కీలకపాత్రను పోషించారు. ఈయనకు ఎలాంటి దర్శకత్వం అనుభవం లేదన్నది గమనార్హం. అయినప్పటికీ టూరిస్ట్ ఫ్యామిలీ అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. హీరోగా సినిమాతాజాగా అభిషన్ జీవింత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్ర షూటింగ్ కూడా పూర్తి అయింది. దీనికి ఆయన శిష్యుడు మదన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే దర్శక, నటుడు అభిషన్ జీవింత్ తాజాగా ఓ ఇంటివాడయ్యారు. స్నేహితురాలు అఖిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం శుక్రవారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈసందర్భంగా శనివారం ఉదయం ఈ నూతన దంపతులు చెన్నైలో మీడియాను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. డైరెక్షన్కే ప్రాధాన్యతఅనంతరం అభిషన్ జీవింత్ మీడియాతో ముచ్చటిస్తూ తాను దర్శకత్వం వహించిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రాన్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న చిత్ర షూటింగ్ పూర్తి అయిందని త్వరలోనే దానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. అయితే తనకు తగిన కథ లభిస్తేనే నటిస్తానని, తాను దర్శకత్వానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. త్వరలోనే తాను దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని అభిషన్ జీవింత్ తెలిపారు.చదవండి: ఒకప్పుడు హిట్ డైరెక్టర్స్.. కొత్త కబురెప్పుడు -
నిర్మాతగా యాక్టర్.. నెక్స్ట్ లెవల్ స్టార్ట్ అంటూ పోస్ట్
తమిళ నటుడు ఆరవ్ (Aarav) నిర్మాతగా మారారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఓ కాదల్ కణ్మణి చిత్రం ద్వారా ఆరవ్ నటుడిగా పరిచయం అయ్యారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఆ చిత్రంలో దుల్కర్ సల్మాన్కు మిత్రుడిగా నటించారు. ఆ తరువాత సైతాన్, విడాముయర్చి (పట్టుదల) వంటి కొన్ని చిత్రాల్లో నటించిన ఈయన మార్కెట్ రాజా, ఎంబీబీఎస్ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. బిగ్బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొని మరింత పాపులర్ అయిన ఆరవ్ ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తారు. ఆరవ్ స్టూడియోస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దీని గురించి తెలియజేస్తూ.. పలు ఏళ్లుగా ప్రేక్షకుల ప్రేమ, అంగీకారం లభించినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. అందమైన సినీ పరిశ్రమలో తననూ ఒక భాగంగా మార్చిందన్నారు. ఇప్పుడు ఆ ప్రయాణాన్ని నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లడానికి ఆరవ్ స్టూడియోస్ సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. మంచి కథలను చెప్పాలనే తపన, ఆసక్తి నుంచి ఈ సంస్థ పుట్టిందన్నారు. ఈ విజువల్స్, క్రియేటివ్ ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎవరూ చెప్పని సహజమైన కథలతో చిత్రాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. భగవంతుడి ఆశీస్సులు, సినీ ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి కథా చిత్రాలను నిర్మిస్తాననే నమ్మకంతో ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినట్లు ఆరవ్ తెలిపారు. View this post on Instagram A post shared by Arav (@actorarav) చదవండి: మహేశ్తో సందీప్ సినిమా? -
సెంగోట్టయన్కు ఉద్వాసన
– వేటు వేసిన పళణి సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే సీనియర్ నేత, ఎమ్మెల్యే కేఏ సెంగోట్టయన్ పార్టీ నుంచి ఉద్వాసన పలికారు. ఈ మేరకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి శుక్రవారం ప్రకటించారు. కొంగు మండలంలో గౌండర్ సామాజిక వర్గం బలమైన నేతగా సెంగోట్టయన్ అన్నాడీఎంకేలో ఉంటూ వస్తున్నారు. పళణి స్వామి సైతం ఇదే సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ, పార్టీలో ఆయన కంటే సీనియర్ సెంగోట్టయన్. దివంగత నేత ఎంజీఆర్, జయలలితల హయాంలో కొంగు మండలంలో సెంగోట్టయన్ చక్రం తిప్పేవారు. వారు జీవించి ఉన్నంత కాలం కొంగు మండలంలోని జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నాడీఎంకేకు కంచు కోటే. 2021 ఎన్నికల్లో అన్నాడీఎంకేకు అధికారం దూరమైనా, అత్యధిక సీట్లలో కొంగు మండలమే విజయాన్ని దరి చేర్చిందని చెప్పవచ్చు. ఈ కొంగు మండలంలో ఆది నుంచి కీలకంగా ఉంటూ వచ్చిన నేత ప్రస్తుతం పళనిస్వామికి వ్యతిరేకంగా స్వరం విప్పడం అన్నాడీఎంకేలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలతో పార్టీ పదవుల నుంచి తప్పించారు. తాజాగా దేవర్ జయంతి వేదికగా అన్నాడీఎంకే బహిష్కృత నేతలు పన్నీరు సెల్వం, టీటీవీ దినకరన్తో సెంగోట్టయన్ చేతులు కలిపారు. పన్నీరు, టీటీవీ, సెంగోట్టయన్, దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి శశికళలు ఒకే వేదిక మీదకు రావడం అన్నాడీఎంకేలో కొత్త చర్చకు దారి తీసింది. ఇక, అన్నాడీఎంకేలోని అసంతృప్తి వాదులందర్నీ తమ వైపునకు తిప్పుకుని, పళణి స్వామిని ఇరకాటంలో పెట్టే వ్యూహంతో వీరు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో సెంగోట్టయన్ను పార్టీ నుంచి తొలగిస్తూ పళణిస్వామి నిర్ణయం తీసుకున్నారు. ఇది కొంగు మండలం రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ప్రధానంగా గౌండర్ సామాజిక వర్గం రెండు ముక్కలయ్యే పరిస్థితి కొంగు మండలంలో నెలకొంది. తనను పార్టీ నుంచి తప్పించడం గురించి సెంగోట్టయన్ స్పందిస్తూ, ఇది ముందే ఊహించిన పరిణామం అని, తనను పార్టీ నుంచి తొలగించినా, తాను ఆనందంగానే ఉన్నట్టు వ్యాఖ్యానించారు. అదే సమయంలో చిన్నమ్మ శశికళ, దినకరన్, పన్నీరు, సెంగోట్టయన్ తదుపరి కార్యాచరణపై అన్నాడీఎంకే వర్గాలు నిశితంగా పరిశీలించే పనిలో పడ్డారు. అదే సమయంలో వీరికి బీజేపీ ఢిల్లీ పెద్దల మద్దతు అన్నది దక్కకుండా ముందు జాగ్రత్తలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా తిరునల్వేలిలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ను అన్నాడీఎంకే సీనియర్లు ఆర్బీ ఉదయకుమార్ నేతృత్వంలో వెళ్లి కలిసి రావడం గమనార్హం. -
సీబీఐ దర్యాప్తు వేగవంతం
సాక్షి, చైన్నె : కరూర్ ఘటనపై వేలుస్వామిపురంలోని స్థానికుల వద్ద నుంచి సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. స్థానిక పోలీసులు, స్థానికుల వద్ద సీబీఐ అధికారులు విచారించే పనిలో పడ్డారు. కరూర్లో గత నెల తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పెను విషాదం గురించి తెలిసిందే. ఇందులో 41 మంది మరణించగా 160 మంది గాయపడ్డారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. అలాగే సీబీఐ ఆదేశాల మేరకు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిటీ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. గత వారం విచారణ మందగించినా, గురువారం నుంచి వేగం పుంజుకుంది. సీబీఐ అధికారులు సంఘటనా స్థలంలో పలుసార్లు పరిశీలించారు. ఆ రోజు విధుల్లో ఉన్న స్థానిక పోలీసు అధికారుల నుంచి విచారణ మొదలెట్టారు. సంఘటన జరిగిన రోజున పరిస్థితి, విజయ్ వచ్చి వెళ్లినానంతరం చోటు చేసుకున్న పరిణామాల గురించి సమగ్రంగా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు సీబీఐ బృందానికి వివరించారు. అలాగే, సంఘటన జరిగిన ప్రాంతంలోని దుకాణాలు, స్థానికులను సైతం విచారించే పనిలో సీబీఐ అధికారులు నిమగ్నమయ్యారు. వీరందర్నీ ఒకరి తర్వాత మరొకర్ని తమకు కేటాయించిన కార్యాలయానికి పిలిపించారు. తొలుత అక్కడున్న దుకాణాల యాజమానులు తమ వద్ద ఉన్న సమాచారాలు సీబీఐ దృష్టికి తీసుకెళ్లారు. స్థానికులు , సంఘటనలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారి వద్ద పలు విషయాలను రాబట్టే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా విజయ్ పార్టీ కార్యాలయానికి మళ్లీ బాంబు బెదిరింపు రావడంతో బాంబు స్క్వాడ్ పరుగులు తీసి పరిశోధించింది. ఇక, కరూర్ ఘటన తదుపరి తమిళగ వెట్రి కళగం కోశాధికారి వెంకట్రామన్ పార్టీకి దూరంగా ఉన్నట్టు చర్చ ఊపందుకుంది. అదే సమయంలో ఆయన పేరు కోర్ కమిటీలో లేదు. దీంతో ఆయన తప్పుకున్నట్టే అన్న చర్చ ఊపందుకుంది. అయితే తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని వెంకట్రామన్ స్పష్టం చేశారు. -
వైభవంగా శ్రీవారి పుష్పయాగం
కొరుక్కుపేట: చైన్నె, పెరంబూరు పటేల్ రోడ్డులోని శ్రీవేంకటేశ్వర భక్త సమాజం (ఆనంద నిలయం) ఆధ్వర్యంలో శ్రీవారి పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. ప్రతి వేంకటేశ్వర స్వామివారికి పెద్ద ఎత్తున పెరటాసి ఉత్సవాలు, శ్రీవారి కల్యాణోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. సమాజం తరఫున 56వ వార్షిక పెరటాసి మాస ఉత్సవం, శ్రీనివాస కల్యాణ వైభవం, 48వ వార్షిక పెరంబూరు నుంచి తిరుమలకు పాదయాత్ర కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వేంకటేశ్వర స్వామివారికి కృతజ్ఞత తెలుపుతూ శ్రీవేంకటేశ్వర భక్త సమాజం అధ్యక్షుడు తమ్మినేని బాబు అధ్యక్షతన శ్రీవారి పుష్పయాగం గురువారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు. ఇందులో సువాసనలు వెదజల్లే 20 రకాల పువ్వులతో అభిషేకం చేశారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త డి. జంబు, అడ్వకేట్ వెంకటశేషయ్య హాజరయ్యారు. శ్రీవేంకటేశ్వర భక్త సమాజం ఉపాధ్యక్షుడు కే వెంకట్రాజు, కార్యదర్శి ఎస్ వెంకట్రామన్, కోశాధికారి పి. కోదండ రామయ్య, సంయుక్త కోశాధికారి హెచ్ వెంకటరమణుడు పాల్గొన్నారు. సుమారు 200 మంది భక్తులు పాల్గోని గోవిందా గోవిందా అంటూ శ్రీవారి సేవలో తరించారు. చివరిగా భక్తులకు అన్న ప్రసాదాలను అందజేశారు. -
సీజనల్ వ్యాధులపై దృష్టి
సాక్షి, చైన్నె : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు విస్తృతం చేశామని ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్ తెలి పారు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా వంటి జ్వరాలు కట్టడిలో ఉన్నాయన్నారు. ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమై 15 రోజులైనట్టు తెలిపారు. వర్షాల సీజన్లో వచ్చే వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు విస్తృతం చేశామన్నారు. ఇప్పటి వరకు 16,648 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా 76 వేల మంది ప్రయోజనం పొందినట్టు తెలిపారు. ఈ శిబిరాల ద్వారా జ్వరాల తీవ్రత అధికంగా ఉన్న కేసులను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో జ్వరాల వ్యాప్తిని కట్టడి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఏ ప్రాంతంలోనైనా సరే ముగ్గురు జ్వరంతో ఉన్నట్టు తెలిసిన పక్షంలో తక్షణం అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం డెంగీ బారిన 18,725 మంది పడ్డారని, వీరిలో తొమ్మిది మంది మరణించినట్టు పేర్కొన్నారు. తాజాగా డెంగీ, మలేరియా, చికున్ గున్యా జ్వరాలు కట్టడిలో ఉన్నాయని తెలిపారు. ఎవరైనా జ్వరంతో బాధ పడుతుంటే తక్షణం ఆస్పత్రులకు వెళ్లి వైద్యులను సంప్రదించాలని, సొంత వైద్యం మానుకోవాలని హితవు పలికారు. -
బకింగ్ హామ్తో వరద ముప్పు
– అధికారులు ప్రత్యేక దృష్టి సాక్షి, చైన్నె : బకింగ్ హామ్ కాలువ రూపంలో వర ద ముప్పు రానున్న కాలంలో చైన్నెకు ఏర్పడే ప్ర మాదం ఉందన్న హెచ్చరికలు రావడంతో అధికా ర యంత్రాంగం అలర్ట్ అయింది. ఈ వ్యవహారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించే పనిలో ప డ్డారు. చైన్నె ఈశాన్య రుతుపవనాల సీజన్లో వ రద ముంపునకు గురి కాకుండా జాగ్రత్తలను అధి కారులు విస్తృతం చేసిన విషయం తెలిసిందే. కూ వం, అడయార్ నదీ తీరాల్లో పూడిక తీత ముగించారు. ఆ తీరం వెంబడి ప్రాంతాలను ఎప్పటిక ప్పుడు పరిశీలిస్తున్నారు. అలాగే, అడయార్ నది ముఖ ద్వారం వద్ద సైతం పూడిక తీత శరవేగంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బకింగ్ హామ్ కాలువను అధికారులు మరిచినట్టుగా సమాచారం వెలువడింది. బకింగ్హామ్ కాలువ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, చైన్నెలో 31 కి.మీ దూరం ఈ కాలువ ప్రవహిస్తోంది. ఓఎంఆర్ రోడ్డులో జరుగుతున్న మెట్రో రైలు పనుల దృష్ట్యా, అనేక చోట్ల బకింగ్ హామ్ కాలువలో చెత్త చెదారాలు చేరగా, మరికొన్ని కొన్ని చోట్ల పూడిక తీత అస్సలు సాగలేదన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇక, మైలాపూర్, మందవెలి, రాయపేట, అడయార్ పరిసరాల్లో కాలువ ఆక్రమణకు గురైనట్టుగా వెడల్పు తగ్గింది. తాజాగా కూవం, అడయార్లో వరదపై దృష్టి పెట్టిన అధికారులు, బకింగ్ హామ్ను గాలికి వదిలేసిన దృష్ట్యా, ఈసారి దక్షిణ చైన్నె పరిధిలోని వరద ముంపు తప్పదన్న హెచ్చరికలు తెర మీదకు వచ్చాయి. అలాగే పళ్లికరణై పరిసరాల్లో సైతం నెలకొన్న పరిస్థితులతో ఈ సారి చైన్నె నగరంలో ఐటీ సంస్థలతో పాటుగా పలు కార్యాలయాలు, ఎత్తైన భవనాలతో నిండిన తరమణి పరిసరాలకు బకింగ్ హామ్ కాలువ రూపంలో వరద ముంపు తప్పదన్న సామాజిక కార్యకర్తల హెచ్చరికతో అఽధికారులు అలర్ట్ అయ్యారు. బకింగ్ హామ్ తీరంపై పరిశీలనకు కసరత్తు చేపట్టారు. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం బయలు దేరేందుకు కొంత సమయం పట్టే అవకాశాలున్న దృష్ట్యా, అంతలోపు బకింగ్ హామ్ తీరంలో ముందు జాగ్రత్తల దిశగా పరుగులు తీస్తున్నారు. -
పిల్లలను కడతేర్చి.. తండ్రి ఆత్మహత్య
వేలూరు: భార్యపై అనుమానంతో వ్యక్తి ఇద్దరు పిల్లలను హత్య చేసి, తను ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరువణ్ణామలై జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా తెల్లూరు గ్రామం పిల్లయార్ ఆలయ వీధికి చెందిన క్రిష్ణన్(44), పూంగొడి దంపతులకు కయల్వియి(9), నిదర్శన్(7) ఇద్దరు పిల్లలున్నారు. క్రిష్ణన్ పలు సంవత్సరాల క్రితం చైన్నెకి కుటుంబ సభ్యులతో వెళ్లి, పలు చోట్ల కూలి పనులు చేసుకునే వాడు. క్రిష్ణన్ తన భార్యపై అనుమానం ఏర్పడడంతో తరచూ ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగేవి. దీంతో పూంగొడి తన భర్తను వదిలి పుట్టింటికి వెళ్లింది. గత ఆరు నెలలుగా పూంగొడి భర్త, ఇద్దరు పిల్లలను వదిలి పెట్టి వెళ్లడంతో ఇద్దరు పిల్లలతో ఉన్న క్రిష్ణన్ మనో వేదనకు గురయ్యాడు. ఇదిలావుండగా దీపావళి పండుగకు తన ఇద్దరు పిల్లలతో సొంత గ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి చైన్నెకి వెళ్లలేదు. భార్య లేని కారణంగా తరచూ మద్యం సేవించే వాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన క్రిష్ణన్ బంధువుల ఇంట్లో ఆటలాడుతున్న ఇద్దరు పిల్లలను పిలిచి ఇద్దరికి భోజనం వడ్డించాడు. అనంతరం ముగ్గురూ కలిసి ఇంట్లో తలుపులు వేసుకుని నిద్రించారు. ఇద్దరు పిల్లలు తన తండ్రి పక్కనే పడుకుని గాఢంగా నిద్ర పోయారు. అర్ధరాత్రి సమయంలో తల దిండుతో ఇద్దరి పిల్లల ముఖంపై అదిమి ఇంట్లోనే హత్య చేశాడు. అనంతరం ఒక లేఖను రాసి పెట్టి ఇంట్లోని ఫ్యాన్కు ఉరి వేసుకుని క్రిష్ణన్ ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి తలుపులు తెరవక పోవడంతో స్థానికులు సేత్తుపట్టు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరు పిల్లలు మృత దేహాలుగా కనిపించడంతోపాటు క్రిష్ణన్ ఫ్యాన్కు వేలాడుతుండడాన్ని గమనించి మృత దేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంట్లో పరిశీలించగా ఒక లేఖ ఉండగా పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ లేఖను చదివారు. అందులో తన భార్యకు పిల్లలపై ఏ మాత్రం ప్రేమ లేదని, వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వదిలి పెట్టిందని, దీంతోనే తన పిల్లలు అనాథలుగా బతకడం ఇష్టం లేక పోవడంతోనే ఇద్దరు పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ లేఖలో రాశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కయల్వియి(ఫైల్) తండ్రి క్రిష్ణన్(ఫైల్) నిదర్శన్(ఫైల్) -
మీతో స్టాలిన్కు వినతుల వెల్లువ
– ఒకే రోజు పది వేలకు పైగా వినతులు తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన మీతో స్టాలిన్ శిబిరానికి ఒకే రోజు పది వేలకు పైగా వినతులు వెల్లువల్లా వచ్చి పడ్డాయి. ప్రజల వద్దకే పాలను తీసుకొచ్చేలా అన్ని శాఖలకు చెందిన అధికారులను ఒకే చోట సమన్వయం చేసి ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే పూండి యూనియన్లోని కై వండూర్, కడంబత్తూరు యూనియన్లోని దిగువనల్లాటూరు, సేలై, తిరునిండ్రవూర్, పాక్కం, ఆవడి, అంబత్తూరు, గుమ్మిడిపూండి, పొన్నేరి, పూందమల్లి సహా 40 ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి రేషన్కార్డులు, ఆధార్ మార్పులు చేర్పులు, పట్టా, పక్కాగృహాలు, ఉచిత ఇంటి స్థలం, జనన మరణ ధ్రువీకరణ, ఆదాయం, కుల, శాశ్వత నివాసాలకు చెందిన సర్టిఫికెట్ల కోసం వినతులను ప్రజలు ఆయా శాఖలకు చెందిన అధికారులకు సమర్పించారు. కై వండూరు, దిగువ నల్లాటూరు గ్రామాల్లో జరిగిన శిబిరానికి ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కై వండూరులో ఏల్ల తరబడి నివాసం వుంటున్న ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతూ స్థానికులు వినతి పత్రం సమర్పించారు. శిబిరంలో ఆర్డీఓ రవిచంద్రన్, తహసీల్దార్ బాలాజి, ఆర్ఐ దినేష్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మెడికల్ క్రైమ్ ఇతివృత్తంతో అదర్స్
తమిళసినిమా: ఆదిత్య మాధవన్, గౌరీకిషన్ జంటగా నటించిన చిత్రం అదర్స్. నటి అంజుకురియన్, మునీష్కాంత్, హరీశ్ పెరడీ, మాలా పార్వతి, జగన్, ఆర్.సుందర్రాజన్ ముఖ్యపాత్రలు పోషించారు. గ్రాండ్ పిక్చర్స్ సంస్థ తో కలిసి అప్ 7 వెంచర్స్ అధినేత అధిరాజ్ పురుషోత్తమన్ నిర్మించిన చిత్రం అదర్స్. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రానికి అభిన్ హరిహరన్ దర్శకత్వం వహించారు. జిబ్రాన్ సంగీతం, అరవింద్సింగ్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నవంబర్ 7న తెరపైకి రానుంది. గురువారం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు అబిన్ హరిహరన్ మాట్లాడుతూ ఏడాది శ్రమ తరువాత ఈ స్థాయికి చేరుకున్న చిత్రం ఇదని చెప్పారు. ఆడిషన్ సమయంలోనే హీరో ఆధిత్య మాదవన్ అదరగొట్టారని అన్నారు. గౌరి కిషన్, అంజుకురియన్, హరీశ్ పెరడీ ఉత్తమ నటనను ప్రదర్శించారని చెప్పారు. అరవింద్సింగ్ పెద్ద చాయాగ్రాహకుడు అయినా తన ఊహలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారని చెప్పారు. జిబ్రాన్ సంగీతం ఈ చిత్రానికి పెద్ద బలం అని అన్నారు. ఒక మంచి చిత్రం ప్రేక్షకుల్లోకి వెళ్లడానికి మీడియా పాత్ర చాలా ఉంటుందని, తాము ఒక మంచి చిత్రాన్ని నిర్మించామని, నవంబర్ 7న విడుదల చేస్తున్న ఈ చిత్రానికి మీ ఆదరణ కావాలని సహ నిర్మాత ఆదిరాజ్ పురోషత్తమన్ అన్నారు. -
లంచం కేసులో ఇద్దరి అరెస్ట్
తిరువళ్లూరు: ప్రమాదానికి గురైన వాహనాన్ని విడిపించడానికి లంచం తీసుకున్న ఎస్ఎస్ఐ సహా ఇద్దరిని ఏసీబీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా తారాచ్చి ప్రాంతానికి చెందిన అజిత్కుమార్. ఇతని వాహనం నెలరోజుల క్రితం ప్రమాధానికి గురైంది. ఈ సంఘటనపై ఊత్తుకోట పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు. ఈక్రమంలో వాహనాన్ని విడిపించాలని పోలీసులను అజిత్కుమార్ కోరాడు. అయితే వాహనాన్ని విడిపించడానికి రూ.10వేలు ఇవ్వాలని ఎస్ఎస్ఐ భాస్కరన్, డీటీపీ ఆపరేటర్ సుకుమార్ డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడానికి నిరాకరించిన అజిత్కుమార్ తిరువళ్లూరు ఏసీబీ పోలీసులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు గురువారం సాయంత్రం రూ.10వేలను ఇస్తున్న సమయంలో అక్కడే ఉన్న డీఎస్పీ గణేషన్ నేతృత్వంలోని ఏసీబీ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గంజాయి కేసులో ఒకరు.. అన్నానగర్: రైలులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్రన్ జోన్ జాయింట్ కమిషనర్ దిశా మిట్టల్ ఆదేశాల మేరకు, అన్నానగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ బాలసుబ్రమణియన్ నేతృత్వంలోని మద్య నిషేధ పోలీసులు గురువారం సాయంత్రం పెరంబూరు రైల్వేస్టేషన్న్లో రహస్యంగా నిఘా ఉంచారు. ఆ సమయంలో, ఒక యువకుడు రెండు బ్యాగులతో రైలు దిగాడు. పోలీసుల అనుమానించి అతన్ని పట్టుకుని బ్యాగులను తనిఖీ చేశారు. అందుతో గంజాయి ఉన్నట్టు గుర్తించి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. విచారణలో ఒడిశాలోని మణిపాల్కు చెందిన ష్మికాంత్నాథ్ (32) అని, ఇతను ఒడిశా నుంచి చైన్నెకి గంజాయి సరఫరా చేస్తున్నాడని తెలిసింది.అతని నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు, అతన్ని ఎగ్మూర్ కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. స్నేహితుడిపై దాడి కేసులో ఒకరు.. తిరువొత్తియూరు: చోరీ చేసిన వాహనం కోసం స్నేహితుడిపై దాడి చేసిన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె, ఐనావరం, నెహ్రూజ్యోతినగర్కు చెందిన లత (55) కుమారుడు శ్రీరామ్ కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున ఓటేరి నమ్మాళ్వార్ పేట, సుబ్బరాయన్ 4వ వీధికి చెందిన పార్థిబన్ (23) అనే తన స్నేహితుడితో కలిసి బైక్పై లత ఇంటికి వచ్చి శ్రీరామ్ను లేపి, తాను దొంగిలించిన సెల్ఫోన్ను విక్రయించి ఇవ్వమని కోరాడు. అలాగే ఇంతముందు ఇచ్చి ఉన్న చోరీ చేసిన వాహనాన్ని తిరిగి ఇవ్వమని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అందుకు శ్రీరామ్, సెల్ఫోన్న్ను విక్రయించలేనని పార్థిబన్ చోరీ చేసిన వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లిపోయారని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన పార్థిబన్, దాచి ఉంచిన కత్తితో శ్రీరామ్పై దాడి చేశాడు. అంతేకాకుండా, అక్కడ నిలబడి ఉన్న శ్రీరామ్ ద్విచక్ర వాహనానికి పెట్రోల్ పోసి, నిప్పంటించి పారిపోయాడు. దీనిపై ఫిర్యాదు మేరకు ఓటేరి పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం ఉదయం పార్థిబన్ను అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్పై యువకుడి దాడి తిరువొత్తియూరు: రైల్వే భద్రతా దళం పోలీసుపై దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె, ప్యారిస్ ప్రాంతానికి చెందిన వినయ్ ఆర్పీఎఫ్గా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం ఒక కేసు విచారణ నిమిత్తం ప్యారిస్ లోని బర్మాబజార్ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న తిరువొత్తియూరుకు చెందిన చంద్రు అనే యువకు డు వినయ్తో గొడవపడి దాడి చేశాడు. దీనిపై ఫిర్యాదు మేరకు నార్త్బీచ్ పోలీస్స్టేషన్న్ పోలీసులు కేసు నమోదు చేసి చంద్రును శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. అరెస్టయిన ఎస్ఐ భాస్కరన్, సుకుమార్ -
యువత సాంకేతికతను ఉపయోగించాలి
కొరుక్కుపేట: పెద్దలు, సమాజం, వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడంలో యువత సాంకేతికతను ఉపయోగించాలని చైన్నెలోని రాయల్ థాయ్ కాన్సులేట్ జనరల్ రాచా అరిబార్గ్ పిలుపునిచ్చారు. వీఐటీ చైన్నెలో టెక్నోవిట్ 10వ వార్షిక ఎడిషన్ శుక్రవారం ప్రారంభమైంది. విద్యార్థులు అనేక సాంకేతిక కార్యక్రమాల పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతదేశమంతటా, థాయిలాండ్, పోలాండ్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీనన్స్, మయన్మార్, తైవాన్, ఉజ్బెకిస్తాన్ తదితర 10 దేశాల నుంచి 10 వేల మందికి పైగా విద్యార్థులు మూడు రోజుల టెక్నో వీఐటీ 2025 కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి రాచా అరిబార్గ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. హెచ్సీఎల్టెక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రినన్స్ జయకుమార్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. వీఐటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవీ సెల్వం అధ్యక్షత వహించారు. అరిబార్గ్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ , సైన్స్ రంగాల్లో పనిచేసే యువత వృద్ధులకు, సమాజానికి సహాయం చేయడానికి , వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి కూడా దోహదపడాలన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు పొందిన జ్ఞానం వారు నేర్చుకున్న దానికంటే మించి ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా, డిజిటల్ అంతరం తీవ్రమైన సమస్యగా ఉందని, యువకులు, వృద్ధుల మధ్య జ్ఞాన అంతరం ఉందన్నారు. దీన్ని తొలగించడానికి పెద్దలతో కొంత సమయం గడపాలని, లేకుంటే వారు వెనుకబడిపోతారని, వారి దైనందిన జీవితంలో సాంకేతికతను ఉపయోగించలేరని చెప్పారు. యువత తమ కుటుంబాల్లోని వృద్ధులతో , సమాజంలోని ఇతరులతో తరచుగా సంభాషించాలని విజ్ఞప్తి చేస్తూ, వారి జీవితాలను మెరుగుపరుచుకోవాలని కోరారు. మూడు రోజుల పాటు 150కి పైగా సాంకేతిక కార్యక్రమాలు జరుగనున్నాయన్నారు. మొత్తం బహుమతుల విలువ రూ. 10 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. వీఐటీ చైన్నె ప్రో వైస్ చాన్సలర్ డాక్టర్ టి.త్యాగరాజన్, వీఐటీ చైన్నె డైరెక్టర్ డాక్టర్ కె.సత్యనారాయణన్, అదనపు రిజిస్ట్రార్ డాక్టర్ పి.కె. మనోహరన్ కూడా హాజరయ్యారు. -
7న క్రిస్టినా కదిర్వేలన్
తమిళసినిమా: శ్రీలక్ష్మీ డ్రీమ్ ఫ్యాక్టరీ పతాకంపై డా.ఆర్.ప్రభాకర్ స్థపతి నిర్మించిన చిత్రం క్రిస్టినా కదిర్వేలన్. దీనికి మిస్టర్ డెల్లా క్రియేషన్స్ అధినేత కార్తీక్ వీరప్పన్ సహా నిర్మాతగా వ్యవహరించిన ఈచిత్రంలో కౌశిక్ రామ్, ప్రతిభ జంటగా నటించారు. సింగంపులి, గంజాకరుప్పు,జయకుమార్, అరుళ్ డీ.శంకర్, టీఎస్ఆర్, సిల్మిషమ్ శివ, జనని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా ఎస్జేఎన్.అలెక్స్ పాండ్యన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రహత్ మునుసామి చాయాగ్రహణంను, ఎన్ఆర్.రఘునందన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నవంబర్ 7న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. గురువారం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించారు. దర్శకుడు ఎస్ఆర్.ప్రభాకరన్, విజయ్శ్రీ, మైఖెల్ కే.రాజా ఆడియోను ఆవిష్కరించారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ క్రిస్టినా కదిర్వేలన్ అనే పేరును పెట్టి ఇంతవరకూ చేసిన పయనాన్ని తాను విమాన పయనంగా భావిస్తున్నానన్నారు. రెండేళ్ల పాటు ఈ చిత్రం కోసం శ్రమించినట్లు చెప్పారు. ఈ చిత్ర నిర్మాతలు బంగారం లాంటివారని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన 20 నిమిషాల నిడివిని సెల్ఫోన్లోనే కార్తీక్ వీరప్పన్కు చూసించానని ,అవి చూసిన ఆయన ఎమోషన్ అయ్యి, ఇప్పటి వరకూ సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు. ఇది విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. సంగీత దర్శకుడు ఎన్ఆర్.రఘునందన్ చాలా మంచి సంగీతాన్ని అందించారని చెప్పారు. -
ఫోర్డ్ పునరాగమనం
సీఎం స్టాలిన్ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న కంపెనీ ప్రతినిధులు సాక్షి, చైన్నె : అమెరికా పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మళ్లీ తమిళనాడులోకి ప్రవేశించింది. చెంగల్పట్టు జిల్లా మరమలై నగర్లో నెక్ట్స్ జనరేషన్ వెహికల్ ఇంజిన్ల తయారీ లక్ష్యంగా రూ.3,250 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు శుక్రవారం సచివాలయంలో సీఎం స్టాలిన్ సమక్షంలో జరిగాయి. తమిళనాడు భారతదేశంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, వివిధ రంగాల్లో తయారీ, ఎగుమతుల్లో అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తున్న విషయం తెలిసిందే. 2024–25 ఆర్థిక సర్వే మేరకు పెట్టుబడులను ఆకర్షించడంలో, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పించడంలో, తమిళనాడు దూసుకెళుతున్నట్టు తేలింది. 2030 నాటికి తమిళనాడు ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు చేర్చడం లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షించడంలో విస్తృత కార్యాచరణతో పాలకులు ముందుకెళుతున్నారు. ఫోర్డ్తో అవగాహన ఒప్పందం చెంగల్పట్టు జిల్లా మరమలైనగర్లో ఫోర్డ్ కార్ల తయారీ పరిశ్రమ ఉంది. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు గత కొన్నేళ్లుగా కార్ల ఎగుమతి జరిగింది. అయితే, గత పాలనలో చోటు చేసుకున్న పరిణామాలతో క్రమంగా ఫోర్డు యాజమాన్యం ఉత్పత్తిని తగ్గించుకుంది. తాజాగా పూర్తిస్థాయిలో ఉత్పత్తి ఆగడంతో ఫోర్డు మూతపడే పరిస్థితి నెలకొంది. గత ఏడాది సెప్టెంబర్లో అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం స్టాలిన్ ఫోర్డు సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. తమిళనాడులో ఉత్పత్తికి మళ్లీ శ్రీకారం చుట్టాలని కోరారు. ఇందుకు తమ వంతుగా పూర్తి సహకారం, ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. మరమలైనగర్లో మళ్లీ ఉత్పత్తి ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని విన్నవించారు. ఇందుకు ఫోర్డ్ యాజమాన్యం స్పందించింది. తాజాగా పునాగమనం చేస్తూ రూ.3,250 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఫోర్డు తయారీ ప్లాంట్లో మళ్లీ ఉత్పత్తి ప్రక్రియతోపాటుగా తాజా పెట్టుబడితో కార్ల ఇంజిన్ తయారీ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది. తద్వారా 600 మందికి ఉపాధి కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందం సచివాలయంలో సీఎం స్టాలిన్ సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, పరిశ్రమలు, పెట్టుబడి, వాణిజ్యశాఖ మంత్రి టీఆర్బీ రాజా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, వాణిజ్యశాఖ కార్యదర్శి వీ అరుణ్రాయ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ దారేస్ అహ్మద్, ఫోర్డ్ కార్పొరేషన్ గ్లోబల్ డైరెక్టర్ మార్టిన్ ఎవెరిట్, వైస్ ప్రెసిడెంట్ మాథ్యూ కోటిలోస్కీ, థాయిలాండ్ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సిమోనెట్టా వెర్డి, డైరెక్టర్ (ప్రొడక్షన్) ధీరజ్ దీక్షిత్, డైరెక్టర్ శ్రీపత్ భట్, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. నాడు కార్ల కంపెనీల్లో దిగ్గజం ఫోర్డ్. చెంగల్పట్టు జిల్లా మరమలై నగర్ కేంద్రంగా విలాసవంతమైన కార్లను తయారు చేసి, విదేశాలకు సైతం ఎగుమతి చేసింది. అలాంటి కంపెనీ తమిళనాడు నుంచి నిష్క్రమణ దశకు చేరింది. అయితే సీఎం స్టాలిన్ ప్రత్యేక చొరవ తీసుకుని, ఫోర్డ్ పునరాగమనానికి కృషి చేశారు. దీంతో ఆ సంస్థ మళ్లీ తమిళనాట పెట్టుబడులకు సిద్ధమైంది. ఇందుకు సీఎం స్టాలిన్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి చిచ్చు పెట్టొద్దు: సీఎం ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ ఎన్నికల ప్రచార సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తమిళనాట కొత్త చర్చకు దారి తీశాయి. బీహారీలను డీఎంకే వేధిస్తున్నట్టుగా పీఎం వ్యాఖ్యానించడాన్ని పరిగణించిన సీఎం స్టాలిన్ ఎక్స్ పేజీ వేదికగా ఎదురు దాడి చేశారు. ప్రధానమంత్రి తన బాధ్యతలను మరచిపోకూడదని హితవు పలికారు. ఇలాంటి ప్రసంగాలతో తన బాధ్యత, గౌరవాన్ని కోల్పోకూడదని సూచించారు. తమరు ఎక్కడికి వెళ్లినా, అది ఒడిశా అయినా, బిహార్ అయినా సరే తన రాజకీయం కోసం తమిళనాడు, తమిళ ప్రజలను వాడుకోవడం భావ్యమా? అని ప్రశ్నించారు. తమిళులపై ఎందుకు ఇంత ద్వేషం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవిధ్యభరితంగా, భిన్నత్వంలో ఏకత్వాన్ని కనుగొనే గర్వించదగ్గ భారతదేశంలో హిందువులు, ముస్లింల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం, తమిళులు, బిహార్ ప్రజల మధ్య శత్రుత్వాన్ని సృష్టించేలా వ్యవహరించడం వంటి రాజకీయ కుట్రలను ఆపుకోవాలని హితవు పలికారు. దేశ సంక్షేమంపై దృష్టి పెట్టాలే గానీ, రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు తగవని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రధాని చేసిన వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. ఉద్యోగాల్లో స్కామ్ వెలుగులోకి వచ్చిన దృష్ట్యా, దాన్ని డైవర్షన్ చేయడానికి ప్రధాని చేసిన వ్యాఖ్యలను తెర మీదకు తెచ్చారని ధ్వజమెత్తారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందిస్తూ, ప్రజలను రెచ్చగొట్టే పనిలో ఉన్నట్టుందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా కోయంబత్తూరులో తమిళులను అవమానిస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతి పక్ష నేత పళణిస్వామి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడానికి కొందరు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. -
డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలకాలి
వేలూరు: పట్టణంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పర్యటన సందర్భంగా కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి, ఘనంగా స్వాగతం పలకాలని డీఎంకే జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే నందకుమార్ అన్నారు. ఈనెల 4వ తేదీన డిప్యూటీ సీఎం వేలూరుకు చేరుకుని ప్రజలకు వివిధ శాఖల ద్వారా సంక్షేమ పథకాలను అందజేయనున్నారని చెప్పారు. దీంతో వేలూరులోని డీఎంకే పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నందకుమార్ మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ వేలూరు జిల్లాలో డీఎంకే నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొని, ప్రసంగించనున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లాలోని కార్యకర్తలు, యువకులు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి, పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అలారగే జిల్లా సరిహద్దులోనూ కార్యకర్తలు ఎక్కడికక్కడే స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రత్యేక ఓటర్ల సారంశ సవరణ పథకాన్ని అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం యోచిస్తుందని నిర్వహకులు వారి రహస్య ఉద్దేశాలను ఓడించి, నిజంగా అర్హత కలిగిన ఓటర్లను చేర్చడానికి చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలను సభ్యులు ఆమోదించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కార్తికేయన్, అములు, జెడ్పీ చైర్మన్ బాబు, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్కుమార్, డివిజన్ కార్యదర్శులు తనికాచలం, జ్ఞానశేఖరన్, గజేంద్రన్, ఏరియా కార్యదర్శులు వన్నియరాజ, పరమశివం, లోకనాథన్ పాల్గొన్నారు. -
కొత్త తరగతి గదుల అప్పగింత
కొరుక్కుపేట: చైల్డ్–ఫ్రెండ్లీ స్కూల్స్ ప్రాజెక్ట్లో భాగంగా, చైన్నెలోని ఆలపాక్కంలో ఉన్న ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్కు కొత్తగా నిర్మించిన మూడు తరగతి గదులను వాణిజ్య అండ్ ప్రభుత్వ రంగ సంస్థలకు సేవలందిస్తున్న గ్లోబల్ కన్సల్టింగ్ టెక్నాలజీ, గైడ్హౌస్ సంస్థ పాఠశాల నిర్వాహకులకు అప్పగించింది. ఈ కార్యక్రమంలో గైడ్హౌస్ సీనియర్ నాయకులు జాన్సాద్, గైడ్హౌస్ ఇండియా భాగస్వామి, కంట్రీ హెడ్ మహేంద్ర రావత్, గైడ్హౌస్ భాగస్వామి వినయ్సింగ్, జస్వంత్ బంగేరా, నవీన్కుమార్, బాలచందీరన్, సాజి జచారియా, శివశంకరి శంకరన్, అరుల్ సాజిన్ తదితరులు పాల్గొని కొత్త తరగతి గదులను అప్పగించారు. ఈ. మూడు కొత్త తరగతి గదులు విద్యార్థుల అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరచడానికి, విద్యాభివృద్ధికి సురక్షితమైన, ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని అందించడానికి రూపొందించినట్లు గైడ్ హౌస్ ప్రతినిధులు వెల్లడించారు. -
క్లుప్తంగా
స్వదేశీ మిట్రల్ క్లిప్తో పురోగతి సాక్షి, చైన్నె : స్వదేశీ మిట్రల్ క్లిప్(మైక్లిప్)తో పురోగతి సాధించామని రేడియల్ రోడ్డులోని కావేరి ఆస్పత్రి చీఫ్ కార్డియాలజిస్టు డాక్టర్ అజిత్ పిళ్లై తెలిపారు. మైక్లిప్ను ఉపయోగించి తమిళనాడులో తాము 58 ఏళ్ల రోగికి నిర్వహించిన శస్త్ర చికిత్స గురించి శుక్రవారం మీడియాకు వివరించారు. ఈ క్లిప్తో హార్ట్ వాల్వ్ రిపేర్తో చారిత్రాత్మక మైలురాయిని సాధించామన్నారు. 58 ఏళ్ల మహిళ తీవ్రమైన గుండె జబ్బుతో బాధ పడుతూ రాగా, మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తితో ఆమెకు మిట్రల్ క్లిప్ పరిక రం–మైక్లిప్ను ఉపయోగించి శస్త్రచికిత్సను విజయవంతం చేశామన్నారు. అధునాతన గుండె సంరక్షణను ఈ విధానం అందుబాటులోకి తెచ్చిందన్నారు. వినూత్న నిరసన సాక్షి, చైన్నె : తాంబరం కార్పొరేషన్ సిబ్బంది శుక్రవారం వినూత్న నిరసనకు దిగారు. తాంబరం కార్పొరేషన్ పాలక మండలి సమావేశం శుక్రవారం జరిగింది. ఇందులో అన్నాడీఎంకే సభ్యులు వినూత్నంగా కుక్క, ఆవు బొమ్మలతో కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. ఇందుకు కారణం రోడ్లపై ఆవులు, కుక్కలు స్వైర విహారం చేస్తుండడంతో వాహనచోదకు లు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇలా వివరించారు. చైన్నె బీచ్ల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు కొరుక్కుపేట: మోంథా తుపాన్ కారణంగా చైన్నెలో సముద్రం ఉప్పొంగింది. దీనికితోడు రెండు రోజులుగా నిరంతర వర్షాల కురవడంతో, అడయార్ నది నీటి మట్టం పెరిగింది. దీంతో చైన్నె తీరప్రాంతాల్లో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. చైన్నె లోని పట్టినం పాక్కం నుంచి మెరీనా వరకు తీరప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు, మద్యం సీసాలు, విరిగిన థర్మోకోల్ పేరుకుపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు తీరప్రాంతంలో నివసించే ప్రజలకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తున్నాయి. పర్యావరణాన్ని నాశ నం చేస్తున్నాయి. చైన్నె తీరం వెంబడి పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో అవి అలలపై తెలియాడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరకముందే తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నేడు సెయింట్ జార్జ్ కేథడ్రల్ చర్చి పునఃప్రారంభం కొరుక్కుపేట: చైన్నె సెయింట్ జార్జ్ కేథడ్రల్ చర్చిని నవంబర్ ఒకటో తేదీన పునఃప్రారంభించనున్నారు. చైన్నెలోని జెమిని వంతెన సమీపంలో ఉన్న సెయింట్ జార్జ్ కేథడ్రల్ చర్చి, చైన్నెలోని పురాతన క్రైస్తవ చర్చిల్లో ఒకటి. దీనిని చైన్నె ఆర్చ్ డియోసెస్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) నిర్వహిస్తోంది. 210 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చిలో క్రైస్తవ మిషనరీలు నిర్మించాలని నిర్ణయించి, చర్చి అసలు రూపం మార్చకుండా పునరుద్ధరించడానికి ప్రణాళిక రూపొందించారు. గత జనవరిలో పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పునరుద్ధరణ పనిలో ఐఐటీ మద్రాస్కు చెందిన ప్రొఫెసర్ అరుణమెన్న వంటి నిపుణులు పాల్గొన్నారు. ఆధునీకరించిన ఈ చర్చిని నవంబర్ 1న పున ప్రారంభించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. బూత్కు ఐదుగురు న్యాయవాదులు –టీఆర్సీ యూనియన్ నిర్ణయం కొరుక్కుపేట: చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి, టీఆర్సీ యూనియన్లోని 234 నియోజకవర్గాల్లో, బ్రాంచ్, ఏరియా వారీగా న్యాయవాదులను నియమించను న్నారు. 234 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ బూత్లకు టీఆర్సీ తరఫున న్యాయవాదులను నియమిస్తారు. ఈ విషయంలో టీఆర్సీ న్యాయవాదుల బృందం సంప్రదింపుల సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు పనయూర్లోని టీఆర్సీ ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. తమిళనాడు అంతటా ఉన్న టీఆర్సీ న్యాయవాదుల బృందం సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. చైర్మన్ విజయ్ పట్టుబట్టడంతో, జనరల్ సెక్రటరీ ఎన్.ఆనంద్ నిర్వాహకులు సమావేశంలో పాల్గొని సలహాలు అందిస్తారు. బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ కొరుక్కుపేట: అలందూర్ వద్ద రూ.1.50 కోట్లతో ఆధునిక బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను మంత్రి అన్బరసన్ ప్రారంభించారు. హైవే శాఖ తరఫున, అలందూర్ మెట్రో రైల్వేస్టేషన్ ఎదురుగా, అలందూర్ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి రూ.కోటి 50 లక్షల అంచనా వ్యయంతో ఒక రహదారిని నిర్మించారు. ఈ ప్రాంతంలో ఆధునిక బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది. అలందూర్ జోనల్ కమిటీ చైర్మన్ ఎన్.చంద్రన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. చైన్నె హైవేస్ డిపార్ట్మెంట్ మానిటరింగ్ ఇంజినీర్ శరవణన్ సెల్వం, డివిజనల్ ఇంజినీర్ తిరునావుక్కరసు పాల్గొన్నారు. -
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
వేలూరు: సమాజంలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాలని వేలూరు వీఐటీ యూనివర్శిటీ ఉపాధ్యక్షుడు శేఖర్ విశ్వనాథన్ అన్నారు. వీఐటీ యూనివర్సిటీ, ప్రిన్సిలా రియోనియన్ యూనివర్సిటీ సంయుక్తంగా ప్రవేశపెట్టిన ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ, పీజీ కోర్సులను 25 మంది విద్యార్థినీ విద్యార్థులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారికి సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం వేలూరు వీఐటీ యూనివర్సిటీలోని రాజాజీ భవన్లో నిర్వహించారు. ఇందులో వీఐటీ ఉపాధ్యక్షుడు శేఖర్ విశ్వనాథన్ ముఖ్య అతిథిగా హాజరై సర్టిఫికెట్లు అందజేసి, ప్రసంగించారు. ఈ కోర్సులు అభ్యసించే విద్యార్థినీ విద్యార్థులు బయటకు వెళ్లినప్పుడు మన సమాజం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గం చూపాలన్నారు. వీఐటీ కార్యనిర్వహణ డైరెక్టర్ సంధ్యా పెంటారెడ్డి, మాజీ డైరెక్టర్ విజయలక్ష్మి, ప్రిన్సిలా రియోనియన్ ఆర్గనైజర్ చట్టారో గ్రీస్, ఫ్రాన్కో భారత ఉపదూత మేరి రూసెట్ పాల్గొన్నారు. ఇందులో ముఖ్య అతిథిగా ప్రాన్స్ దేశ పుదుచ్చేరి, చైన్నె ఉపదూత ఏటిన్ రోలాండ్ పిగ్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. గౌరవ అతిథులుగా కేంద్ర ప్రభుత్వ సైన్స్ విభాగం మాజీ కార్యదర్శి రామస్వామి, వీఐటీ వైస్ చాన్సలర్ కాంచన, రిజిస్టార్ జయభారతి తదితరులు పాల్గొన్నారు. -
వేలూరు, తిరువణ్ణామలైలో ఇందిరాగాంధీ వర్ధంతి
వేలూరు: తిరువణ్ణామలై, వేలూరు జిల్లాల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జరుపుకున్నారు. ముందుగా వేలూరు అన్నా రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు టీకా రామన్ అధ్యక్షతన జిల్లా కోశాధికారి సీకే దేవేంద్రన్, ఉపాద్యక్షుడు పీపీ చంద్రప్రకాష్, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు వాహీద్బాషా, ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తరంజన్ తదితరులు ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశంలోనే మొదటి మహిళా ప్రధానిగా ఎన్నికై ఉక్కు మనిషిగా పేరుగాంచిన ఏకై క నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. అనంతరం కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కాట్పాడి గుణశీలన్, మహిళా నాయకురాలు కాంచన, అరియూరు సోము, రగు, తులసి, తదితరులు పాల్గొన్నారు. అలాగే తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాల్లోనూ కార్యకర్తలు ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. -
మత్తు మాత్రల కేసులో నైజీరియన్ అరెస్టు
తిరువళ్లూరు: మత్తు మాత్రలు తరలించిన నైజీరియాకు చెందిన వ్యక్తిని మనవాలనగర్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి, గుట్కా, మత్తుమాత్రలు జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి ఎస్పీ వివేకానందశుక్లా ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేశారు. సాయంత్రం సమయంలో వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి మనవాలనగర్ ప్రాంతంలో ఇన్స్పెక్టర్ ఫరూక్ నేతృత్వంలో పోలీసులు తనీఖీ చేస్తున్న సమయంలో అనుమానస్పదంగా వెళ్తున్న బుల్లెట్ వాహనాన్ని ఆపి సోదాలు నిర్వహించారు. వాహనంలో సుమారు లక్ష రూపాయలు విలువ చేసే మత్తు మాత్రలు ఉన్నట్టు నిర్ధారించి, అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో నైజీరియాకు చెందిన మైఖేల్నంబిగా గుర్తించారు. ఇతను తిరుపూర్లోని గార్మెంట్స్లో దుస్తులను కొనుగోలు చేసి నైజీరియాకు ఎగుమతి చేస్తున్నట్టు తెలిసింది. ఇతను చైన్నెలో మత్తుమాత్రలను కొనుగోలు చేసి, యువతే లక్ష్యంగా విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. మత్తుమాత్రలను తిరువళ్లూరులో విక్రయించడానికి తీసుకొస్తున్న సమయంలో అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
పెళ్లి రోజే వధువు మృతి
పళ్లిపట్టు: నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆ కుటుంబంలో పెను విషాదం మిగిల్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పళ్లిపట్టు సమీపంలోని అత్తిమాంజేరిపేట గ్రామానికి చెందిన రాము పళ్లిపట్టు ప్రభుత్వ మహోన్నత పాఠశాల టీచర్. అతని కుమారుడు మణి(27) ఇంజినీరు. అతనికి సమీప బంధువు తిరుత్తణి సమీపంలోని మద్దూరు గ్రామానికి చెందిన పాండురంగన్ కుమార్తె సంధ్య(21)తో ఇరు కుటుంబీకుల సమక్షంలో వివాహం నిశ్చయించారు. ఆమె బీకాం చదువుకుంది. బలిజకండ్రిగలోని టీటీడీ కల్యాణ మండపంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం రిసెప్షన్, శుక్రవారం ఉదయం కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. వివాహ వేడుకల్లో భాగంగా అత్తిమాంజేరిపేటలోని వరుడి ఇంటికి చేరుకున్న నవ వధువు గురువారం ఉదయం స్నానం చేసేందుకు వెళ్లారు. ఎంత సేపటికీ స్నానపు గది నుంచి రాకపోవడంతో అనుమానించి, తలు పు తట్టి చూశారు. సమాధానం లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా స్నానపు గదిలో పడి ఉన్న వధువును చూసి దిగ్భ్రాంతి చెందారు. వెంటనే అక్కడున్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపా రు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు. స్నానపు గదిలో నవ వధువు జారిపడి మృతి చెందినట్లు యువతి తండ్రి పాండురంగన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వీటీఓఎల్లో ఐఐటీ మద్రాసు పురోగతి
సాక్షి, చైన్నె: దేశ తదుపరి తరం విమాన సాంకేతికతను పెంచేందుకు, బలపరిచేందుకు హైబ్రీడ్ రాకెట్ థ్రస్టర్లతో వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్(వీటీఓఎల్)లో ఐఐటీ మద్రాసు పురోగతిని సాధించింది. హార్డ్వేర్ ఇన్ ది లూప్ సిమ్యులేషన్ అనే ప్రభావ వంతమైన పద్ధతిని ఉపయోగించి ఈ ప్రయోగాత్మక అధ్యయనం జరిగినట్టు గురువారం ఐఐటీ మద్రాసు వర్గాలు ప్రకటించాయి. ఇది సంక్లిష్ట వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, పరిరక్షించడానికి ఉపయోగకరమైనా, ఖర్చుతో కూడుకున్న సౌకర్యవంతమైన సాధనంగా ప్రకటించారు. ఇది మానవ రహిత లేదా మానవ సహిత అన్వేషణ మాడ్యుల్ గ్రహ ల్యాండింగ్ నుంచి వీటీఓఎల్ విమానం భౌగోళ ల్యాండింగ్ వరకు అన్ని క్రాఫ్ట్లకు కీలకమైన లక్షణంగా పేర్కొన్నారు. సురక్షితమైన నిలువు ల్యాండింగ్లను నిర్ధారించడానికి టచ్ డౌన్ వేగం ఒక ముఖ్యం అని, నిలువు ల్యాండింగ్ ప్లాట్ ఫామ్ల కోసం హైబ్రీడ్ రాకెట్ మోటారును ఉపయోగించడంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసినట్టు పేర్కొన్నారు. ఐఐటీ మద్రాసులోని ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ పీఏ రామకృష్ణ, డాక్టర్ జోయెల్ జార్జ్ మన్తారా, అనంద్ భద్రన్లు కలిసి రాసిన ఈ అధ్యయన నివేదికను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ సైన్సెస్లో పొందు పరిచారు. ఈ విషయంగా పీఏ రామకృష్ణ మాట్లాడుతూ,తమ పరిశోధన మేరకు విమానం నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేందుకు వీలు కల్పిస్తుందన్నారు. పొడవైన రన్ వేలు వంటి మౌలిక సదుపాయాల అవసరం లేదంటూ, వీటీఓఎల్ సామర్థ్యం పొడవైన రన్ వేలు, పెద్ద విమానాశ్రయాలతో పని లేకుండా మారుమూల ప్రాంతాలలోని కఠినమైన భూభాగాలకు టేకాఫ్, ల్యాండింగ్కు అవకాశం కల్పిస్తుందన్నారు. వీటీఓఎల్ వ్యవస్థ వాణిజ్య అప్లికేషన్ కోసం టెక్నాలజీ రెడీనెస్ లెవల్(టీఆర్ఎల్)కు చేరుకున్న తర్వాత , అది పౌర, సైనిక విమానయానం రెండింటిలోనూ గేమ్ చేంజర్ అవుతుందన్నారు. ఒక పెద్ద విమానాశ్రయం లేదా ఎయిర్ బేస్ కంటే బహుళ ప్రదేశాలకు వాయు రవాణాను వికేంద్రీకరించడానికి సహాయ పడుతుందన్నారు. -
అటవీ గ్రామాల ప్రజలకు ఆపన్న హస్తం
సాక్షి, చైన్నె: నీలగిరి జిల్లాలోని కోతగిరి, గూడలూరు అటవీ గ్రామాల ప్రజలకు సాయం అందించే విధంగా సీక్ ఫౌండేషన్ ఆపన్న హస్తం అందించింది. ఇక్కడి ప్రజలు తక్షణ వైద్య సేవలను వినియోగించుకునేందుకు వీలుగా అంబులెన్స్లను, రవాణా సేవలకు లోడ్ వ్యాన్ను సిద్ధం చేసి అందజేశారు. రూ. 50 లక్షలతో కూడిన ఈ వాహనాలతో పాటుగా వారి జీవితాలలో వెలుగు నింపే విధంగా కుట్టు మిషన్లు తదితర వాటిని అందజేశారు.సెయింట్ బ్రిట్టోస్ అకాడమీ విద్యార్థులు రోజుకు ఒక్క రూపాయి చొప్పున స్వచ్ఛందంగా కూడబెట్టిన మొత్తంతో పాటూ తాము సమకూర్చిన నిధులతో వీటిని కొనుగోలు చేసినట్టు సీక్ ఫౌండేషన్వ్యవస్థాపకురాలు డాక్టర్ విమలా బ్రిట్టో తెలిపారు. గురువారం కోతగిరి, గూడలూరు ప్రాంతాలలోని పెద్దలకు ఈ వాహనాలకు సంబంధించిన తాళాలను అప్పగించారు. కుట్టుమిషన్లు, ఇతర వస్తువులను అందజేశారు. నీలగిరి గిరిజన సంక్షేమ సంఘం కార్యదర్శి అల్వాస్, సీక్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ థామస్ పొన్రాజ్ పాల్గొన్నారు. కాగా, గూడలూరులో గిరిజన కుటుంబాలకు 20 ఇళ్ల నిర్మాణానికి ఈ సందర్భంగా తోడ్పాటు అందించారు. అటవీ ప్రాంతాల్లోని ప్రజల అత్యవసర వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్లను, ఇతర సేవల నిమిత్తం లోడ్ వ్యాన్ను ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. -
మోటివేట్ చేసే ఐఏఎస్ కన్నమ్మ
తమిళసినిమా: వాణిజ్య విలువలతో కూడిన చిత్రాల ఒరవడిలో మంచి సందేశాత్మక కథా చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రం ఐఏఎస్ కన్నమ్మ. పట్టుదలతో శ్రమిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చునని అందుకు పేదరికమే కాదు ఎలాంటి సమస్యలు అడ్డుకావని చెప్పే కథాశంతో తెరకెక్కిన చిత్రం ఇది. ఒక కుగ్రామంలో ఇంటింటికీ వెళ్లి బట్టలు తీసుకెళ్లి ఉతికే ఒక పేద తండ్రి కూతురు ఒక పూట కడుపునిండా తినడానికి కూడా లేనంత పేదరికాన్ని అనుభవిస్తుంది. అలాంటి చిన్నారికి ప్రజాసేవకుడు అయిన ఆ గ్రామ పెద్ద అండగా నిలుస్తాడు. దీంతో ఈ చిన్నారి తన జీవిత లక్ష్యమైన కలెక్టర్ ఎలా అయ్యిందీ అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం ఐఏఎస్ కన్నమ్మ. అయితే తను ఈ స్థాయికి చేరుకోవడానికి అడుగడుగునా ఎన్ని కష్టాలు అనుభవించింది, ఎన్ని అవమానాలు భరించింది, వాటిని ఎలా ఎదురొడ్డింది అనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రం ఐఏఎస్ కన్నమ్మ. చక్కని మోటివేషన్తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తాయప్పస్వామి ఫిలింస్ పతాకంపై టి.రాజాచోళన్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించి ప్రధాన పాత్రను పోషించి నిర్మించారు. నటి ప్రిన్సీ, ఆట్టుకుట్టి, అరవంద్బాబు ముఖ్యపాత్రలను పోషించిన ఈ చిత్రానికి కేశవన్ చాయాగ్రహణం, అరవింద్బాబు సంగీతాన్ని అందించారు. ఈచిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. -
ఐ లవ్యూ అనగానే ఓకే చెప్పేశా
తమిళసినిమా: జీవితంలో ప్రతి ఒక్కరికీ తొలి ప్రేమ అనుభవాలు ఉంటాయి. అవి తలుచుకుంటే మధురానుభూతి కలుగుతోంది. అలాంటి అనుభూతిని నటి అనుష్క గుర్తు చేసుకున్నారు. దక్షిణాది చిత్ర సీమలో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ హీరోయిన్లలో ఈమె ఒకరు. ఈ భామ వయసు 43 ఏళ్లు. 2005లో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బె బెంగళూరు బ్యూటీ మొదటి చిత్రం సూపర్. నాగార్జునకు జంటగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. సైజ్ జీరో చిత్రంలో నటించడానికి ఈమె బరువు పెరిగారు. ఆ తరువాత ఆ సమస్య నుంచి బయట పడలేకపోయారు. కాగా కారణాలేమైనా ఇటీవల చిత్రాల్లో నటించడం తగ్గించారు. ఈమె తాజాగా నటించిన ఘాటి చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కాగా ఇప్పుడు కాత్తనర్ అనే ఒకే ఒక్క మళయాల చిత్రం ఈమె చేతిలో ఉంది. అదే అనుష్క నటిస్తున్న తొలి మలయాళ చిత్రం అన్నది గమనార్హం. కాగా అనుష్క ప్రేమ గురించి చాలా ప్రచారం వైరల్ అయ్యింది. కానీ ఇప్పుటికీ ఈ భామ అవివాహితగానే ఉన్నారు. కాగా ఇటీవల ఒక భేటీలో ఈమె తన తొలి ప్రేమ వ్యవహారాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఆరో తరగతి చదువుతున్న సమయంలో ఒక కుర్రాడు తన వద్దకు వచ్చి ఐలవ్యూ అని చెప్పారన్నారు. అప్పట్లో ఐ లవ్యూ అంటే అర్థం ఏమిటో కూడా తెలియని వయసన్నారు. అయినా ఆ కుర్రాడు అలా చెప్పడంతో తాను వెంటనే ఓకే చెప్పేశానన్నారు. అదే ఇప్పటికీ తన జీవితంలో అందమైన జ్ఞాపకం అని నటి అనుష్క పేర్కొన్నారు. కాగా ఈ భామ తాజాగా ఒక తెలుగు చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఆత్మను ప్రేమించిన యువకుడు
తమిళసినిమా: కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. అందుకోసం నూతనతరం సరి కొత్త ప్రయోగాలతో చిత్రాలను చేయడానికి ముందుకు వస్తోంది. అలా రూపొందిన తాజా చిత్రం మెసెంజర్. ప్రేమ గుడ్డిది అంటారు. అయితే అదే ప్రేమ ఆత్మలను కూడా ప్రేమించేలా చేస్తుంది అనే ఇతి వృత్తంతో తెరకెక్కిన చిత్రం మెసెంజర్. ఒక యువకుడి ప్రేమను బ్రేకప్ చెప్పిన యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో ఆ భగ్నప్రేమికుడు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడతాడు. సరిగ్గా అలాంటి సమయంలో అతని ఫోన్కు ఒక మెసేజ్ వస్తుంది. అందులో ప్లీజ్ ఆత్మహత్య చేసుకోకండని ఉంటుంది. ఆ మెసేజ్ ఎవరు పెట్టారు? అది ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలను తెలుసుకున్న ఈ యువకుడికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అవి ఏమిటి అనే పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం మెసెంజర్. మరణించిన ఒక యువతి ఆత్మను యువకుడు ప్రేమించడంతోపాటు, కనిపించని ఆ ఆత్మనే పెళ్లి చేసుకుంటానని అతని తల్లిని ఒప్పించడం వంటి అంశాలు నమ్మశక్యం కాకపోయినా, దర్శకుడు ఫాంటసీని జోడించి ఆసక్తిగా తెరకెక్కించడం వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. శ్రీరామ్ కార్తీక్, మనీషాశ్రీ, ఫాతిమానజీమ్, హీరోహీరోయిన్లుగా నటించిన ఇందులో వైశాలి రవిచంద్రన్ ముఖ్యపాత్రలను పోషించారు. రమేశ్ ఇళనగమణి కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీవీకే.ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై పి.విజయన్ నిర్మించారు.ఈ చిత్రాన్ని తమిళనాడులో యాక్షన్ రియాక్షన్ సంస్థ అధినేత జెనీశ్ విడుదల చేస్తున్నారు. -
ముంపు ప్రాంతవాసులకు సహాయకాల పంపిణీ
తిరువళ్లూరు: జిల్లాలోని నత్తంబేడు, తిరునిండ్రవూర్ తదితర ముంపు ప్రాంతాల వాసులకు మంత్రి నాజర్ బుధవారం ప్రభుత్వ సహాయకాలు పంపిణీ చేశారు. తిరునిండ్రవూర్లో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతాప్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మంత్రి నాజర్ హాజరై బియ్యం, కూరగాయలు, రొట్టెలు, దుస్తులు తదితర సామగ్రి అందజేశారు. అనంతరం మంత్రి నాజర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలను చేపట్టిందన్నారు. ముంపు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి అన్ని సదుపాయాలను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణస్వామి, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్, డిప్యూటీ డైరెక్టర్ యువరాజ్, ఆర్డీఓ రవిచంద్రన్ పాల్గొన్నారు. -
5 లేదా 10 శాతం నిర్మాతలకు ఇవ్వాలి
వళ్లువన్ చిత్ర ఆడియోను ఆవిష్కరించిన ఆర్కే.సెల్వమణి, ఆర్వీ.ఉదయకుమార్, పేరరసు, సినీ ప్రముఖులతో యూనిట్ సభ్యులు తమిళసినిమా: ఆరుపడై ప్రొడక్షన్స్ పతాకంపై శైల్కుమార్ నిర్మించిన చిత్రం వళ్లువన్. శంకర్ సాఽరథి దర్శకత్వం వహించిన ఇందులో సేతన్ శీను, నటి ఆస్నా జవేరి జంటగా నటించారు. మనోబాలా, సాయిదీనా, దీప, రామచంద్రన్, మీసై రాజేంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అశ్వత్ సంగీతం, సురేశ్బాల చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, ఫెప్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి, ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, కే.రాజన్ తదితర సినీ ప్రముఖలు పాల్గొని, ఆడియోను ఆవిష్కరించారు. చిత్ర దర్శకుడు శంకర్ సారథి మాట్లాడుతూ అమాయక ప్రజలు శిక్షించబడరాదని డా.అంబేడ్కర్ చట్టాలను తీసుకొచ్చారన్నారు. అయితే చట్టాల్లోని మంచి విషయాలను మరచి, అందులోని లొసుగులను అడ్డం పెట్టుకుని తప్పించుకుని తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. అలా చట్టాన్ని చేతిలోకి తీసుకుని తప్పులు చేసే వారిని ఎవరు శిక్షిస్తారు? అన్న ఇతి వృత్తంతో రూపొందించిన చిత్రం వళ్లువన్ అని చెప్పారు. ఫెప్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి మాట్లాడుతూ చిత్రం ట్రైలన్ను చూస్తే కమర్శియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా అనిపించిందన్నారు. గత 10 ఏళ్లలో సుమారు 2500 చిత్రాలు విడుదలయ్యాయని, వాటిలో 2వేల చిత్రాలను నిర్మిచింది చిన్న నిర్మాతలేనని పేర్కొన్నారు. అలా వాళ్లే తమకు అన్నం పెడుతున్నారన్నారు. అయితే ఇన్నేళ్లుగా మొదటి చిత్రాన్ని తీసిన 2 వేల మంది నిర్మాతలు కనిపించకుండాపోయారన్నారు. ఒక్క సంగీత దర్శకుడు కన్నుమూస్తే ఆయనకు కుటుంబానికి రాయల్టీ వస్తుందన్నారు. కానీ నిర్మాతలకు ఎలాంటి గ్యారెంటీ లేదన్నారు. అందువల్ల తమ ఉన్నతికి కారణం అయిన నిర్మాతలకు హీరోలు తమ ఆదాయంలో 5 లేదా 10 శాతం నిర్మాతలకు చెల్లించేలా ఒక సిస్టం తీసుకు వస్తే బాగుంటుందనే అబిప్రాయాన్ని ఆర్కే.సెల్వమణి వ్యక్తం చేశారు. -
కనులపండువగా శివసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
తిరువొత్తియూర్: శ్రీవళ్లి, దేవసేన సమేత శివసుబ్రహ్మణ్యస్వామివారి తిరుకల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. చైన్నె పాతచాకలిపేట బసవయ్య వీధిలో ఉన్న కపిల వినాయక దేవస్థానంలో స్కంధ షష్ఠి లక్షార్చన వైభవాలు–2025 ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ వేడుకలు జరుగుతుండగా ప్రతిరోజు అభిషేకాలు, దీపారాధన చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి శ్రీవళ్లి దేవసేన సమేత శివసుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సవానికి మహిళలు, పెద్దలు, చిన్నారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులందరికీ ప్రసాద వినియోగం చేశారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న మహిళలు విశేషాలంకరణలో శివసుబ్రహ్మణ్యస్వామి -
సమస్యల పరిష్కారానికి ధర్నా
వేలూరు: దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తమిళనాడు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు సంయుక్తంగా వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు జ్ఞానశేఖరన్ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి వినోద్కుమార్ మాట్లాడారు. గ్రామ పంచాయతీలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా రూ.10 వేలు వేతనం చెల్లించాలని, వేతనం ఇవ్వడాన్ని కాంట్రాక్టులు వదలకుండా గ్రామ పంచాయతీనే నేరుగా ఇచ్చేలా చూడాలన్నారు. అలాగే గ్రామ పంచాయతీలోని కార్యదర్శులకు ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్యాంకుల నుంచి పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేసే పంపు ఆపరేటర్లకు రూ.15 వేలు వేతనం ఇవ్వాలని తదితర మొత్తం 15 డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశ్వనాథన్, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
విజయవంతంగా స్ట్రోక్ రివర్సల్ ప్రోగ్రామ్
సాక్షి, చైన్నె : చైన్నెలోని కావేరి ఆస్పత్రిలో స్ట్రోక్కు గురైన వందలాది మందికి సకాలంలో అందించిన వైద్య చికిత్సలు, సంరక్షణ, ప్రాణ రక్షణ గురించి వివరించే రీతిలో నాలుగున్నర గంటల స్ట్రోక్ రివర్సల్ ప్రోగ్రామ్ బుధవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐఏఎస్ అధికారి డాక్టర్ విజయ కార్తికేయన్ ప్రారంభించారు. స్ట్రోక్కు గురైన వారికి గంటలలోపు చికిత్స అందించేలా ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండేళ్లలో చైన్నె అంతటా కావేరి హాస్పిటల్ స్ట్రోక్ బృందాలు 956 స్ట్రోక్ కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. ‘ఒకరికి స్ట్రోక్ వచ్చినప్పుడు, ప్రతి నిమిషం ముఖ్యమైనదని, గడిచే ప్రతి క్షణం వేలాది మెదడు కణాల నష్టాన్ని సూచిస్తుందని ఈసందర్భంగా వడపళనిలోని కావేరీ హాస్పిటల్లోని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ పెరియకరుప్పన్ తెలిపారు. రోగులు త్వరగా ఆస్పత్రికి చేరుకుంటే ప్రాణాలను కాపాడగలమన్నారు. స్ట్రోక్ చికిత్స అనేది సైనన్స్, కచ్చితత్వం సమష్టి కృషికి సంబంధించినదని రేడియల్ రోడ్లోని కావేరి హాస్పిటల్లోని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ (న్యూరో) సీనియర్ కన్సల్టెంట్ – క్లినికల్ లీడ్ డాక్టర్ జి సతీష్ తెలిపారు. ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మాట్లాడుతూ తమ లక్ష్యం స్ట్రోక్కు చికిత్స చేయడమే కాదు, దానికి నగరం ప్రతిస్పందనను మార్చడం అవశ్యమన్నారు. ప్రతి పౌరుడు సంకేతాలను గుర్తించి స్ట్రోక్కు సిద్ధంగా ఉన్న వెంటనే ఆస్పత్రికి చేరుకోగలిగితే, ప్రాణాలు నిలుపుకోవచ్చన్నారు. -
కలెక్టర్ హోదాలో పాఠశాలకు పూర్వవిద్యార్థిని
కొరుక్కుపేట: తన చదువుకున్న పాఠశాలకు కలెక్టర్ హోదాలో అందరిని ఆశ్చర్య పరిచింది ఓ పూర్వ విద్యార్థిని. ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం ప్రాంతానికి చెందిన సెన్నియప్పన్ కారు డ్రైవర్గా జీవ నం సాగిస్తున్నాడు. అతని భార్య సుబ్బులక్ష్మి ఉంది. వారి కుమార్తె వాన్మతి ఉంది. ఆమె సత్యమంగళంలోని ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ స్కూల్లో 3 నుంచి 12వ తరగతి వరకు చదువుకుంది. ఆమె చదువుకునే సమయంలో అప్పటి కలెక్టర్ ఉదయచంద్రన్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఆ సమయంలో ఆయనకు ఇచ్చిన గౌరవాన్ని చూసి, వాన్మతి తాను కూడా కలెక్టర్ కావాలని నిర్ణయించుకుంది. ఆమె పట్టుదలతో చదివి, ఐఏ ఎస్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. ప్రస్తుతం, వాన్మతి మహారాష్ట్రలోని ఒక జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ పరిస్థితిలో వాన్మతి తన స్వస్థలం సత్యమంగళం ప్రాంతానికి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె చదువుకున్న ప్రభుత్వ బాలికల హయ్యర్ సె కండరీ స్కూల్కు వచ్చింది. ప్రధానోపాధ్యాయు డు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. విద్యార్థులతో మాట్లాడుతూ కలెక్టర్ను చూసిన తర్వాత కలెక్టర్ కావాలనే ఆశయంతో తాను చదువుకున్నానని చెప్పింది. -
నాణ్యత లోపించిందని రాస్తారోకో
వేలూరు: రోడ్డు పనుల్లో నాణ్యత లోపించిందని గ్రామస్తులు రాస్తారోకో చేశారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 60 వార్డుల్లో భూగర్భ డ్రైనేజీ పనులతోపాటు కావేరి తాగునీటి పైపులైన్ పనులు జరుగుతున్నాయి. అయితే కొన్ని వార్డుల్లో మాత్రమే పనులు పూర్తి అయినప్పటికీ అధికమైన వార్డుల్లో పనులు గత ఐదేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాల్లోని రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారాయి. ఇదిలాఉండగా పది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉండడంతో కాట్పాడి ప్రాంతంలోని తిరునగర్లో వర్షపు నీటితో పాటు, డ్రైనేజీ నీరు కలుషితమై వీధుల్లోకి చేరింది. దీంతో వీధుల్లోని రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారాయి. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కార్పొరేషన్ అధికారులు ఈ ప్రాంతాలను తనిఖీ చేసి స్మార్ట్ సిటీ పథకం కింద పనులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో బుధవారం ఉదయం కార్పొరేషన్ అధికారులు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే పనుల్లో నాణ్యత లేదని నాసిరకంగా రోడ్డు పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు రాస్తారోకో నిర్వహించడంతో పాటు పనులు చేస్తున్న జేసీబీ యంత్రాన్ని అడ్డుకొని పనులను నిలిపివేయాలని నినాదాలు చేశారు. విషయం తెలిసి కార్పొరేషన్ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింప జేశారు. -
క్లుప్తంగా
కారు ఢీకొని దంపతులు దుర్మరణం తిరువొత్తియూరు: కారు ఢీకొన్న ఘటనలో నడిచి వెళుతున్న దంపతులు దుర్మరణం చెందారు. ఈ ఘటన నత్తం వద్ద చోటుచేసుకుంది. దిండుక్కల్ జిల్లా నత్తం సమీపం పచ్చాలై ప్రాంతానికి చెందిన రాజా (50). ఇతని భార్య పెసలి (45). వీరి కుమార్తె ఇంటి సమీపంలోనే వేరుగా ఉంటోంది. మంగళవారం రాత్రి కూతురి ఇంట్లో ఉండి, బుధవారం తెల్లవారుజామున తమ ఇంటికి వెళ్లడానికి నత్తం–తువరన్కురిచ్చి జాతీయ రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో నత్తం నుంచి చైన్నె వైపు వెళ్తున్న కారు వారిని ఢీకొంది. ఈఘటనలో దంపతులు ఇద్దరు సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న నత్తం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం దిండుగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, కారు డ్రైవర్ను మాడసామిని అరెస్ట్ చేశారు. విద్యుత్షాక్తో డీఎంకే నేత.. తిరువళ్లూరు: విద్యుత్షాక్కు గురై డీఎంకే యువజన విభాగం ఉపకార్యదర్శి శిలంబరసన్ మృతిచెందాడు. తిరువళ్లూరు జిల్లా పేంబాక్కం ప్రాంతానికి చెందిన దురైకుమారుడు శిలంబరసన్(35). ఇతను డీఎంకే యువజన విభాగం ఉప కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇతడికి వివాహమై భార్య, కుమార్తె వున్నారు. ఈక్రమంలో ఇరుళంజేరిలోని తన దుకాణం వద్దకు బుధవారం వెళ్లిన శిలంబరసన్ తెగిపడిన విద్యుత్ వైర్ను తొక్కడంతో షాక్కు గురై సంఘటన స్థఽలంలోనే మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కోత యంత్రం పడి వడ్రంగి.. తిరువొత్తియూరు: తిరునిన్రవూరులో కోత కోసే యంత్రం పడి వడ్రంగి కార్మికుడు మరణించాడు. తిరునిన్రవూరు పళ్లక్కళని తిరు.వి.క.నగర్కు చెందిన కార్తీక్ (33) వడ్రంగి పని చేస్తూ జీవనం సాగించేవాడు. అతనికి పెళ్లి కాలేదు. అతని తండ్రి ఢిల్లీ అనారోగ్య కారణాలతో నాలుగేళ్ల కిందట మరణించాడు. కార్తీక్ తల్లి భాను (60)తో కలిసి నివసిస్తున్నాడు. ఈ పరిస్థితిలో మంగళవారం కార్తీక్ తన ఇంట్లో పాడైపోయిన చెట్టు కోసే చేతి యంత్రాన్ని బాగు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ సమయంలో యంత్రం పని చేయడంతో, అది అతని చెయ్యి, మెడ, ముఖం భాగాల్లో పడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కార్తీక్ సంఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న తిరునిన్రవూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కార్తీక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఏనుగు దాడిలో రైతు.. తిరువొత్తియూరు: కృష్ణగిరి సమీపంలో అడవి ఏనుగు దాడిలో ఒక రైతు మృతి చెందాడు. మృతదేహంతో గ్రామస్తులు రహదారి దిగ్బంధం చేయడంతో తీవ్ర కలకలం రేగింది. కృష్ణగిరి జిల్లా నార్లపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్ (50) రైతు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి తన పొలానికి కాపలాగా వెళ్లాడు. ఆసమయంలో అక్కడ ఉన్న ఒక అడవి ఏనుగు వేణుగోపాల్ను అడ్డగించి దాడి చేసింది. దాడిలో తీవ్రంగా గాయపడిన వేణుగోపాల్ అక్కడికక్కడే మృతిచెందాడు. బుధవారం ఉదయం అటుగా వెళుతున్న ప్రజలు వేణుగోపాల్ మృతి చెంది ఉండడాన్ని చూసి గ్రామస్తులకు సమాచారం అందజేశారు. వెంటనే గ్రామస్తులు అడవి ఏనుగుల కారణంగా తమ ప్రాణాలకు రక్షణ కరువైందని పేర్కొంటూ మృతదేహాన్ని రహదారిపై ఉంచి రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ మురళి ఆందోళనకారులతో చర్చలు జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మరణంలోనూ వీడని బంధం –భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి అన్నానగర్: అరియలూర్ సమీపంలో భార్య మరణాన్ని తట్టుకోలేని భర్త కూడా స్పృహతప్పి పడిపోయి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. అరియలూర్ జిల్లా ఉదయర్పాళయం సమీపం అయ్యప్పన్ నాయకన పేటై కోయిల్ వీధిలో వర్థనసామి (64), భార్య రాణి (57) దంపతులు ఉన్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్ని రోజులుగా రాణి అనారోగ్యంతో బాధపడుతోంది. మంగళవారం ఉదయం 5 గంటలకు ఆమె మరణించింది. సాయంత్రం రాణి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. భార్య మరణంతో దుఃఖంలో ఉన్న వర్థనసామి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు. దీంతో అతని బంధువులు దిగ్భ్రాంతి చెంది, ఆయన వద్దకు వెళ్లి చూసేసరికి, అతను చనిపోయినట్లు గుర్తించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. ఏనుగు మృతిపై విచారణ తిరువొత్తియూరు: మేట్టుపాళయం వద్ద అగడ్త (ఊబి)లో కూరుకుపోయి మగ ఏనుగు మృతిపై అటవీ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం – ఊటీ రోడ్డులో ఓడనురై రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా పక్కన తిరుమలైరాజ్ అనే వ్యక్తికి చెందిన వ్యవసాయ భూమి ఉంది. దాని పక్కన ఉన్న ఊబి లో బుధవారం ఉదయం ఒక అడవి ఏనుగు మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఫారెస్ట్ రేంజర్ శశికుమార్ నేతృత్వంలోని అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఈ విషయంపై జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ జయరాజ్కు సమాచారం అందించారు. అటవీ పశువైద్యులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. -
వైభవంగా కాలభైరవస్వామి హోమం
తిరుపతి కల్చరల్: కపిలేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శ్రీకాలభైరవ స్వామి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని శ్రీకపిలేశ్వరాలయంలో నెల రోజులు హోమ మహోత్సవాలు చేపట్టారు. ఇందులో భాగంగా యాగశాలలో బుధవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి సమర్పించారు. గురువారం నుంచి నవంబర్ 7 వరకు శ్రీకామాక్షి అమ్మవారి చండీ హోమం నిర్వహించనున్నారు. హోమానికి బుధవారం సాయంత్రం అంకురార్పణ చేశారు. ఇందులో పాల్గొనాలనుకునేవారు రూ.500లు చెల్లించి టికెట్ తీసుకోవాలని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
హార్ట్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయ్
కొరుక్కుపేట : యువ జనాభాలో స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని అపోలో ఆస్పత్రి వైద్యులు అన్నారు. 25 ఏళ్ల పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు స్ట్రోక్ బారిన పడుతున్నట్టు వెల్లడించారు. చైన్నెలోని నుంగంబాక్కంలో అపోలో ఆస్పత్రికి చెందిన అపోలో అడ్వాన్సుడ్ స్ట్రోక్ నెట్వర్క్ ఆధ్వర్యంలో స్ట్రోక్పై అవగాహన కల్పించారు. నగరమంతటా స్ట్రోక్ రోగులకు వేగవంతమైన రోగ నిర్ధారణ, చికిత్సను నిర్ధారించడానికి రూపొందించబడిన సమగ్రమైన, ప్రోటోకాల్ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్టు అపోలో వైద్యులు వెల్లడించారు. అపోలో ఆస్పత్రి చైన్నె రీజియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఇళన్ కుమరన్ మాట్లాడుతూ 25 ఏళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారని, యువ జనాభాలో స్ట్రోక్ కేసులు ఎక్కువగా వస్తున్నందున, స్ట్రోక్ కేర్లో ముందస్తు గుర్తింపునకు అపోలో హాస్పిటల్స్ స్ట్రోక్ నెట్వర్క్ ప్రారంభించినట్టు తెలిపారు. చైన్నెలోని గ్రీమ్స్లేన్లోని అపోలో హాస్పిటల్స్లో న్యూరో ఎండోవాస్కులర్ సర్జరీ హెడ్ డాక్టర్ శ్రీనివాసన్ పరమశివం, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సతీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని స్ట్రోక్ పై అవగాహన కల్పించారు. -
ఉద్యోగం పేరుతో రూ.13 లక్షల మోసం
వేలూరు: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.13 లక్షలు మోసం చేసిన వ్యక్తిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మయిల్వాగనం ఆధ్వర్యంలో గ్రీవెన్సెల్ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఇందులో కాట్పాడి సమీంలోని వెప్పలై గ్రామానికి చెందిన గోవిందస్వామి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా తన కుమారుడు ప్రదీప్రాజ్ పదవ తరగతి వరకు చదువుకొని వ్యవసాయం చేసుకుంటున్నాడన్నాడని తెలిపారు. అయితే తమ గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ సిపాయి తన కుమారుడికి గ్రామ పరిపాలన అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి తన వద్ద పలు విడతలుగా రూ.13 లక్షలు తీసుకున్నట్లు పేర్కొన్నాడు. నెలలు గడుస్తున్నా ఎటువంటి సమాధానం చెప్పడం లేదన్నారు. దీనిపై నిలదీస్తే హత్యా బెదిరింపులు ఇస్తున్నాడన్నారని తెలిపారు. స్పందించిన ఎస్పీ విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పలు సమస్యలపై బాధితులు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. -
220 మినీ ఏసీ బస్సులు
సాక్షి, చైన్నె : చైన్నెలో మెట్రో రైల్వేస్టేషన్ల పరిసర మార్గాలను అనుసంధానించేలా మినీ ఏసీ బస్సులను నడిపేందుకు రవాణా సంస్థ నిర్ణయించింది. 220 బస్సుల కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించారు. రాజధాని నగరంలోని మెట్రో, ఎలక్ట్రిక్, ఎంటీసీ బస్సులతో పాటుగా క్యాబ్, ఆటో తదితర రవాణా సేవలన్నీ ఒకే గూటిలోకి తీసుకొచ్చేలా చైన్నె ఇంటిగ్రేటెడ్ మెట్రో పాలిటన్ ట్రాన్స్పోర్టు అథారిటీ (సీయూఎంటీఏ) పర్యవేక్షణలో ప్రత్యేక యాప్ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. అన్ని రవాణా సేవలకు ఒకే టికెట్ అన్నట్టుగా క్యూర్ కోడ్ టికెట్తో మల్టీ మోడల్ సేవ దిశగా రూపకల్పన చేసిన చైన్నె ఒన్ యాప్ను సీఎం స్టాలిన్ గత నెలలో ఆవిష్కరించారు. ఈ పరిస్థితుల్లో మెట్రో సేవలను వినియోగిస్తున్నవారు మరీ ఎక్కువ అవుతుండడంతో వారు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా మినీ బస్సుల సేవలను నగరంలో కల్పించాలని నిర్ణయించారు. ప్రస్తుతం చైన్నెలో విమానాశ్రయం నుంచి కోయంబేడు మీదుగా సెంట్రల్కు, అలాగే, ఆలందూరు మీదుగా అన్నాసాలై వెంబడి సెంట్రల్ – విమ్కో నగర్ వరకు మెట్రో సేవలు అందిస్తున్నారు. కొన్ని మార్గాల్లో ప్రజలకు ఆయా స్టేషన్ పరిసరాల్లోకి వెళ్లేందుకు వీలుగా మినీ బస్సులు నడుపుతున్నారు. ఇవి చాలీ చాలనంతంగా ఉండడంతో ప్రయాణికులు క్యాబ్లు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీనిని పరిగణించిన రవాణా సంస్థ మినీ బస్సులను కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. మరో ఏడాదిన్నర లేదా, రెండేళ్లలో మరో మూడు మార్గాలలోనూ మెట్రో రైలు పట్టాలెక్కించనున్న నేపథ్యంలో ఆయా మార్గాలను అనుసంధానించేలా రోడ్డు రూట్ మ్యాప్నకు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా తొలుత 220 మినీ ఏసీ బస్సులను కొనుగోలు చేసి మెట్రో ప్రయాణికులు, స్టేషన్ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలకు వారు రోడ్డు మార్గంలో చేరేందుకు వీలుగా ఏసీ బస్సులను మరికొన్ని నెలలో నడిపే దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు. అలాగే, డిజిటల్ రవాణా కార్డుల సేవలను విస్తృతం చేయడానికి చర్యలు చేపట్టారు. -
ఎస్ఐఆర్కు వ్యతిరేకత
సాక్షి, చైన్నె : ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా డీఎంకే కూటమి పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ఈ ప్రక్రియను వీడాలని డిమాండ్ చేశాయి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. నవంబర్ 4వ తేదీ నుంచి ఇంటింటా ఈ పరిశీలన జరగనున్నది. ఈపరిస్థితుల్లో అన్ని జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు బుధవారం సమావేశమయ్యారు. ఇందులో ఎస్ఐఆర్కు డీఎంకే, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, నామ్ తమిళర్ కట్చిలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. బీజేపీ, అన్నాడీఎంకేలు ఆహ్వానించాయి. ఇక ఆయా రాజకీయ పక్షాల కీలక నేతలతో సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ సాయంత్రం సమావేశమయ్యారు. ఇందులో డీఎంకే తరఫున ఆర్ఎస్ భారతీ నేతృత్వంలోని బృందం, అన్నాడీఎంకే తరఫున జయకుమార్ నేతృత్వంలో బృందం, కాంగ్రెస్ తరఫున తంగబాలు నేతృత్వంలోని బృందం, బీజేపీ తరఫున కరాటే త్యాగరాజన్ నేతృత్వంలో బృందం అంటూ, వీసీకే, నామ్ తమిళర్ కట్చి, డీఎండీకే, ఆమ్ ఆద్మీ, తదితర గుర్తింపు పొందిన పార్టీల నాయకులు హాజరయ్యారు. ఎస్ఐఆర్ ప్రక్రియను గురించి సమగ్రంగా పార్టీలకు అర్చనా పట్నాయక్ వివరించారు. అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమయంలో డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ తదితర కూటమి పార్టీలన్నీ ఎస్ఐఆర్కు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఈ ప్రక్రియను వీడాలని డిమాండ్ చేశాయి. ఇక, బీజేపీ, అన్నాడీఎంకేలు ఈ ప్రక్రియ సక్రమంగా జరిగే రీతిలో చర్యలు తీసుకోవాలని కోరాయి. ఇదిలా ఉండగా ఎస్ఐఆర్కు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం సైతం వ్యతిరేకతను వ్యక్తం చేయడం గమనార్హం. అదే సమయంలో నవంబర్ 2వ తేదీన ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా జరగనున్న అఖిల పక్ష సమావేశానికి హాజరుకావాలని కోరుతూ డీఎంకే నేత పూచ్చి మురుగన్ పనయూరులో విజయ్ను స్వయంగా కలిసి ఆహ్వానం పలకడం విశేషం. కాగా డీఎంకే అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యేందుకు నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ నిర్ణయించారు. -
5న టీవీకే సర్వ సభ్య సమావేశం
విజయ్ లేఖ సాక్షి, చైన్నె: నెల రోజుల తర్వాత తమిళగ వెట్రి కళ గం కార్యక్రమాలు మళ్లీ వేగం పుంజుకోనున్నాయి. నవంబర్ 5వ తేదీన మహాబలిపురం వేదికగా ప్రత్యేక సర్వ సభ్య సమావేశానికి ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ పిలుపు నిచ్చారు. టీవీకే విజయాన్ని ఎవరూ ఆపలేరని, తరలిరండి అని కేడర్కు లేఖాస్త్రం సందించారు. కరూర్ ఘటన తర్వాత నెల రోజులు విజయ్ పార్టీ కార్యక్రమాలు స్తంభించిన విషయం తెలిసిందే. బాధితులకు చైన్నెలో పరామర్శ, తదుపరి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు విజయ్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పార్టీ కోసం ప్రత్యేకంగా నియమించిన కోర్ కమిటీతో బుధవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం గురించి ఇందులో చర్చించి నిర్ణయాలు తీసుకున్నా రు. ఈ సమావేశానంతరం మీడియా తో ఆ పార్టీ సంయు క్త కార్యదర్శి నిర్మల్ కుమార్ మాట్లాడు తూ తొలి నిర్వాహ క కమిటీ సమావే శం జరిగిందని, ఇ ది పార్టీకి వెన్నెముక లాంటి కోర్ కమిటీ అని వ్యా ఖ్యానించారు. తదుపరి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం గురించి చర్చించామన్నారు. కరూ ర్ ఘటన జరిగిన సమయంలో తమ నిర్వాహకులను బలవంతంగా పోలీసులు బయటకు పంపించేశారని, తమ వాళ్లపై దాడి కూడా జరిగిందని, త మకు పోలీసుల ద్వారా ఇక న్యాయం లభించదని నిర్ధారించుకున్న తర్వాత కోర్టును ఆశ్రయించామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. విజయ్ కరూర్ పర్యటనకు అనుమతి దక్కలేదన్నారు. అనుమతుల కోసం ఎన్నో అడ్డంకులు సృష్టించారని, నాటకాలను రక్తి కట్టించారని విమర్శించారు. ఈ భేటీ తదుపరి విజయ్ కేడర్కు లేఖ రాశారు. సర్వ సభ్యం భేటీ కొంత రాజకీయ నిశబద్ధం తరువాత మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా, మీతో మాట్లాడాలనుకుంటున్నా.. అని కేడర్కు విజయ్ ఆ లేఖలో పిలుపు నిచ్చారు. ఈనెల 5వ తేదీన మహాబలిపురం వేదికగా పది గంటలకు పార్టీ ప్రత్యేక సర్వ సభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగాయని, వాటిని చిన్నాభిన్నం చేశామని పేర్కొంటూ, పార్టీకి సైన్యం మీరే, తమిళనాడుకు ప్రజలే కవచం అని వ్యాఖ్యానించారు. టీవీకే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, నెల రోజుల మౌనం సాక్షి అని పేర్కొంటూ, తదుపరి అడుగులు జాగ్రత్తగా వేయాలని, చేపట్టాల్సిన పనుల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుందామని, ఇదే తన ఆహ్వానం అని పిలుపు నిచ్చారు. -
ప్రజారక్షణే ప్రథమ కర్తవ్యం
గృహ లబ్ధిదారుకు తాళం అందజేస్తున్న సీఎం స్టాలిన్ ‘ప్రజల ఆనందమే ప్రభుత్వానికి ముఖ్యం. వారి రక్షణే మా ప్రథమ కర్తవ్యం. ప్రజలను ఎలా రక్షించాలో తమకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునేందుకు అనేక కుట్రలు సాగుతున్నాయి. తీవ్ర నిరాశతో విరక్తి అంచునకు చేరిన నేతలు మాకు హితబోధ చేయాల్సిన అవసరం లేదు.’ అని సీఎం స్టాలిన్ అన్నారు. కల్ నీర్కుళం పంచాయతీలో విద్యార్థిని ప్రేమ కుటుంబం కోసం నిర్మిస్తున్న ఇంటి పనులను స్వయంగా పరిశీలించిన సీఎం, అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. సాక్షి, చైన్నె : ప్రజారక్షణే ద్రావిడ మోడల్ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని, తమకు ఇతరులెవరూ హిత బోధ చేయాల్సిన అవసరం లేదని సీఎం ఎంకే స్టాలి న్ వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి విరక్తి అంచున ఉంటూ అబద్ధాలను వల్లివేస్తున్నారని ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీఎం ఎంకే స్టాలిన్ బుధవారం తెన్కాసి జిల్లాలో పర్యటించారు.‘కలైంజ్ఞర్ డ్రీమ్హోమ్ ప్రా జెక్ట్’ కింద, కల్ నీర్కుళం పంచాయతీలో విద్యార్థిని ప్రేమ కుటుంబం కోసం నిర్మాణంలో ఉన్న ఇంటి పనులను సీఎం స్వయంగా పరిశీలించారు. చైన్నెలో జరిగిన విద్యావేడుకలో తమకు సొంతిల్లు కట్టించి, ఇవ్వాలని సీఎంను విద్యార్థి ప్రేమ అభ్యర్థించిన వి షయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ఇల్లు మంజూరు చేశారు. ఆ పనులను పరిశీలించారు. ప్రే మ తల్లి ముత్తులక్ష్మి, తండ్రి ఎస్ రామస్వామిని ప రామర్శించి వారితో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్కు పిల్లలు కర్ర సాము విన్యాసంతో ఆహ్వానించారు. అదే సమయంలో సీ ఎం సైతం కర్ర సాముతో అలరించారు. అనంతరం తెన్కాసిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం స్టాలిన్ హాజరయ్యారు. కలైంజ్ఞర్ డ్రీమ్ హోమ్ లక్షో లబ్ధిదారైన సెంగోట్టై సమీపంలోని లాతూరు గ్రా మానికి చెందిన ఎం సుమతికి ఇంటి తాళం అందజేశారు. ఇదే వేదికపై తెన్కాసి జిల్లాలో రూ.141 కోట్ల తో పూర్తి అయిన 117 పనులను సీఎం ప్రారంభించారు. రూ.291 కోట్లతో చేపట్టనున్న 83 కొత్త పనులకు శంకుస్థాపన చేశారు. రూ.582 కోట్లు విలువైన సంక్షేమ పథకాలను 2,44,461 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ప రిపాలన శాఖ మంత్రి కేఎన్ నెహ్రు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఐ పెరియస్వామి, రెవెన్యూ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పీ గీతా జీవన్, అటవీ శాఖ మంత్రి ఆర్ఎస్ రాజకన్నప్పన్, పాడి పరిశ్రమల శాఖ మంత్రి మనో తంగరాజన్, ఎంపీలు కనిమొళి, రాబర్డ్ బ్రూస్, రాణి శ్రీకుమార్, ఎమ్మెల్యేలు రాజా, అబ్దుల్ వహాబ్, సదన్ తిరుమలైకుమార్, పళని నాడార్, పంచాయతీరాజ్ శాఖ అ దనపు ముఖ్యకార్యదర్శి గగన్దీప్ సింగ్ బేడీ, తెన్కా సి జిల్లా కలెక్టర్ ఏకే కమల్ కిషోర్ హాజరయ్యారు. పది కొత్త పనులు నాలుగున్నర సంవత్సర కాలంలో తెన్కాసి జిల్లా ప్రగతికి చేసిన పనులను గుర్తు చేస్తూ , కొత్తగా పది వాగ్దానాలు సీఎం స్టాలిన్ ఇచ్చారు. కొత్తగా ఆవి ర్భవించిన తెన్కాసి జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం కోసం రూ.15 కోట్లతో బ్రహ్మాండ భవనం నిర్మించనున్నామని ప్రకటించారు. శంకరన్కోయిల్ సమీపంలోని నల్లూరులో మహిళలకు మరింత ఉ పాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా గురుకల్ప ట్టి పారిశ్రామికవాడలో రూ. 52 కోట్లతో కొత్త తాగునీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నామని, ది వ్యాంగుల కోసం రూ. 2 కోట్లతో ఇంటిగ్రేటెడ్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నామని, కడయం పంచాయతీ యూనియన్కు రూ. 6 కోట్లతో కొత్త భవనం, శివగిరి, కడయనల్లూరు, శంకరన్కోవిల్, తిరువెంగడం సర్కిల్లోని రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి రూ.12 కోట్లతో ప్రాజెక్టు, రూ.4 కోట్లతో శివశైలం ఆనకట్ట పునరుద్ధరించనున్నామని తెలిపారు. అలాగే రూ. 4 కోట్లు వాటర్ ట్యాంక్ల అప్ గ్రేడ్, సెంగోట్టై సర్కిల్లోని అడవి నైనార్కోయిల్ రిజర్వాయర్ పరిసరాలలోని కాలువలు, చెరువులను రూ. 5 కోట్లతో అభివృద్ధి చేయడం, రూ. 2 కోట్లతో వీరకేరళంబుదూర్ తాలూకాలోని మరంతై కాలువ పునరుద్ధరణ, ఆలంకులంలో ప్రభుత్వ మహిళా కళాశాల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రూ. ఒక కోటితో సౌకర్యాలు కల్పించనున్నామని ప్రకటించారు. ప్రజల ఆనందమే ప్రభుత్వానికి ముఖ్యం అని, ప్రజా రక్షణ కోసమే తొలి ప్రాధాన్యత అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విద్యార్థి ప్రేమ కుటుంబ సభ్యులతో సీఎం స్టాలిన్, ఇంటి నిర్మాణ పనుల పరిశీలన పిల్లలతో కలిసి కర్రసాము చేస్తున్న సీఎం స్టాలిన్ విరక్తి అంచున పళణి ప్రతి పక్ష నాయకుడు పలణిస్వామి తీవ్ర నిరాశతో విరక్తి అంచునకు చేరి ఉన్నారని ఎద్దేవా చేశారు. తమిళనాడులో తాజాగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని వివరిస్తూ, ఈ వర్షాల రూపంలో ఎదురయ్యే విపత్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు అన్ని జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉన్నామన్నారు. అయితే, వీటిని అభినందించాల్సిన ప్రతిపక్ష నేత పని గట్టుకుని రాజకీయాలు చేస్తూ, విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఇటీవల కాలంగా ఆయన పూర్తిగా అబద్దా ల కోరుగా మారి ఉన్నారని ధ్వజమెత్తారు. నాలుగు సంవత్సరాలలో 42 లక్షల 61 వేల 386 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తాము కొనుగోలు చేస్తే, తప్పుడు లెక్కలతో వాటిని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పళణి స్వామి నుంచి అబబ్ధాలు, ద్రోహం తప్ప మరేమీ ఆశించలేమని పేర్కొంటూ, అవసరం అయితే, వరి సేకరణ గురించి గణాంకాలు పరిశీలించుకోవాలని హితవు పలికారు. తానూ రైతు బిడ్డ అని చంకలు గుద్దుకునే పళని స్వామి నిజంగానే చిత్తశుద్ధి అనేది ఉండి ఉంటే, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చినానంతరం మూడు ప్రకృతి వైపరీత్య విలయాలను ఎదుర్కొన్నామని గుర్తు చేస్తూ, ఈ సమయంలో తాము ఏ మేరకు చర్యలు తీసుకున్నామో అన్నది ప్రజలకే తెలుసని పేర్కొన్నారు. ప్రజలను ఎలా రక్షించాలో తమకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునేందుకు అనేక కుట్రలు సాగుతున్నాయని వివరిస్తూ, ఇందులో ఎస్ఐఆర్ కూడా ఉందన్నారు. తమిళనాట ఓటమి అన్నది బీజేపీ నిర్ధారించుకుందని, అందుకే కొత్త యుక్తులతో దొడ్డి దారి ప్రయత్నాలు చేస్తుందని మండి పడ్డారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా నవంబర్ 2వ తేదిన జరిగే అఖిల పక్ష సమావేశానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు తరలిరావాలని పిలుపునిచ్చారు. అక్కడ కాశి...ఇక్కడ తెన్కాసి ఈ కార్యక్రమంలో సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ పశ్చిమ కనుమలలోని ప్రకృతి రమణీయతను నింపుకున్న తెన్కాసి ప్రత్యేకతలను గుర్తు చేశారు. ఉత్తరాన కాశీ ఉంటే, దక్షిణాన తెన్కాసి ఉందని, ఇక్కడ కొలువై ఉన్న కాశీ విశ్వనాథ ఆలయం ఒక అద్భుతమైన ప్రదేశం అన్నారు. ఈ ఆలయానికి 19 ఏళ్ల తరువాత బ్రహ్మాండ వేడుకగా కుంభాభిషే కం నిర్వహించే అవకాశం ద్రావిడ మోడల్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. విద్యార్థిని ప్రేమ ఇంటికి వెళ్లి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇదే వేదికపై, లక్షో లబ్ధిదారైన సుమతి ముత్తుకుమార్కు ఇంటి తాళం అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి కుటుంబానికి సొంతిల్లు, గుడిసెల రహితంగా గ్రామాలను తీర్చిదిద్దే పనులు మరింత వేగం పుంజుకోనున్నాయని తెలిపారు. ద్రావిడ మోడల్ పాలనలో అన్ని విధాలుగా, అన్ని రంగాలో తమిళనాడు ముందుకు దూసుకెళుతోందని పేర్కొన్నారు. అందరికీ అన్నీ అనే లక్ష్యంతో అన్ని జిల్లాల అభివృద్ధిపై తానే స్వయంగా దృష్టి సారిస్తూ వస్తున్నాయనని తెలిపారు. -
కష్ట పడితే ఉన్నత స్థానానికి..
– ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ వ్యాఖ్య సాక్షి, చైన్నె : కష్టపడే ప్రయత్నం చేయకుండా ఉంటే ఎలా ఉన్నత స్థానానికి ఎదుగుతారని, అందుకే ప్రతి ఒక్కరూ కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. మంగళవారం కోయంబత్తూరులో పర్యటించిన ఉప రాష్ట్రపతి, బుధవారం తిరుప్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా సీపీ రాధాకృష్ణన్కు సత్కార కార్యక్ర మం జరిగింది. ఇందులో ఆయన ప్రసంగిస్తూ, రాజకీయాల్లో హెచ్చుతగ్గులన్నవి ఉంటాయని, అయితే, దేవుని సంకల్పం భిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉంటానని ఎన్నడూ అనుకోలేదని, అయితే రాజకీయాల్లో రాణించే అవకాశం తనకు దక్కిందన్నారు. ఈ ప్రయాణంలో ఎందరో తన భుజం తట్టి అభినందించారని గుర్తుచేశారు. రాజకీయాల్లో కష్టపడకుండా ఏదీ దరి చేరదని, కష్టపడితే ఉన్నత స్థానానికి చేరుకుంటారని అన్నారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని సత్యం, ధర్మం వైపుగా ప్రయాణం ఉండాలని, ఉన్నత స్థానానికి ఎదగాలన్న ఆలోచనతో శ్రమపై దృష్టి పెట్టి ముందడుగు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీపీ రాధాకృష్ణన్ను బీజేపీ తమిళనాడు కోఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్రెడ్డి పుష్పగుచ్ఛంతో సత్కరించారు. అనంతరం పలువురు ప్రముఖులు సీపీఆర్ను సత్కరించారు.వికసిత్ భారత్ వైపు దేశం సాక్షి, చైన్నె : 2047 వికసిత్ భారత్ వైపుగా దేశం దూసుకెళుతోందని వక్తలు వ్యాఖ్యానించారు. వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ చైన్నె క్యాంపస్లో బుధవారం జరిగిన సదస్సులో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, పద్మ విభూషణ్ డాక్టర్సీ రంగరాజన్ ప్రసంగిస్తూ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశ హోదాను సాధించడానికి డేటా ఆధారిత రోడ్ మ్యాప్ను రూపొందించారన్నారు. విద్య సంబంధిత అంశాలు, ఆర్థిక విద్యపై పాఠశాలల నిబద్ధతను గురించి వివరించారు. వికసిత్భారత్ ప్రయాణం, ిస్తిరత్వం, సమానత్వంతో వృద్ధిని గుర్తు చేశారు. వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ విద్యా సంస్థ చాన్సలర్ డాక్టర్ ఏఎస్ గణేషన్ అధ్యక్షత ప్రసంగంలో విద్య ద్వారా జాతీయ అభివృద్ధికి విశ్వవిద్యాలయాల పాత్ర కీలకమన్నారు. విద్యాసంస్థ ఉపాఽధ్యక్షులు అనురాధాగణేశన్, బోర్డు ఆఫ్ మేనేజ్ మెంట్ సభ్యుడు సురేష్ శామ్యూల్, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈడీ అధికారుల ఎదుట నటుడు కృష్ణ తమిళసినిమా: మాదక ద్రవ్యా ల వాడకం కేసు లో గత మే నెల లో సినీ నటుడు కృష్ణ, శ్రీకాంత్ ను చైన్నె మాద క ద్రవ్య నిరో ధక శాఖ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో 15 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించిన ఈ ఇద్దరు నటులు షరతులతో కూడిన బెయిల్పై విడుదలయ్యారు. కాగా సంచలనం కలిగించిన ఈ కేసుపై చైన్నెలోని ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మాదకద్రవ్యాలను వాడుతున్న వారి వివరాలను సేకరించే విషయంలో భాగంగా నటుడు శ్రీకాంత్, కృష్ణను విచారించదలచినన ఈడీ అధికారులు ఇటీవల వారిని నేరుగా ఈడీ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేశారు. దీంతో నటుడు కృష్ట బుధవారం ఉదయం చైన్నెలోని ఈడీ కార్యాలయానికి హాజర య్యారు. ఆయన్ని ఈడీ అదికారులు పలు కోణాల్లో విచారించినట్లు సమాచారం. నిఘా నీడలో పసుంపొన్ ! సాక్షి, చైన్నె: రామనాథపురం జిల్లా కౌముది సమీపంలోని పసుంపొన్ గ్రామాన్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో అత్యధిక జనాభా కలిగిన ముక్కుళత్తూరు సామాజిక వర్గ ప్రజల ఆరాధ్యుడు పసుంపొన్ ముత్తు రామలింగదేవర్ గురుపూజోత్సవం ఇక్కడ జరుగుతోంది. గురువారం ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం ఎంకే స్టాలిన్తోపాటు పలు రాజకీయపక్షాల నేతలు, పలు జిల్లాల నుంచి ఆ సామాజిక వర్గ ప్రజలు తరలి రానున్నారు. దీంతో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో 8 వేల మందితో ఇక్కడ భద్రత కల్పించారు. -
● పోలీసులకు ఈడీ లేఖ ● విచారణకు ప్రతిపక్షాల పట్టు ● అక్రమాల ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం
ఉద్యోగాల్లో అక్రమాలు సాక్షి, చైన్నె: రాష్ట్ర నగరాభివృద్ధి, నీటి పారుదల శాఖల్లో గత ఏడాది జరిగిన 2,538 ఉద్యోగాల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు సమా చారాలు వెలుగులోకి వచ్చాయి. తాము జరిపిన ఓ సోదాలో లభించిన ఆధారాల మేరకు ఈ వివరాలను ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు తమిళనాడు పోలీసులకు లేఖ రూపంలో తెలియజేయడం చర్చకు దారి తీసింది. 2024లో 2,538 పోస్టుల భర్తీలో పెద్ద ఎత్తున లంచం తాండవం చేసిందని, రూ. 25లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పోస్టులను అమ్ముకున్నట్టు ఈడీ పేర్కొన్నట్టుగా వెలువడిన సమాచారం చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంపై ప్రతి పక్షాలు విచారణకు పట్టుబట్టే పనిలో పడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్న అర్హులైన వారికి ఉద్యోగాలు దరి చేరడం లేదని బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాల్లో అవినీతి, అక్రమాలు జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయని, తాజాగా ఈడీ ఈ అక్రమాన్ని గుర్తించడం తీవ్రంగా పరిగణించాల్సిన అవశ్యం ఉందన్నారు. ఈ అక్రమాలపై సీబీఐ విచారణ లేదా, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పీఎంకే నేత అన్బుమణి స్పందిస్తూ, ప్రభుత్వ ఉద్యోగాల్లో రూ.888 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఆరోపించారు. ప్రతి ఉద్యోగానికి లంచం తాండవం చేసి ఉందని, ఈ మొత్తం హవాల రూపంలో పలు మార్గాల్లో ప్రయాణించిన్నట్టు వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందిస్తూ అనర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలు అప్పగించడం తాజాగా తేటతెల్లమైందని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈడీ నుంచి తమకు ఎలాంటి లేఖ అందలేదని ఐఎఎస్ అధికారి కార్తికేయన్ స్పష్టం చేశారు. మంత్రి కేఎన్ నెహ్రు స్పందిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, అన్ని పరీక్షలు పగడ్బందీగా నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. -
2 వేలమంది కనుమరుగు... హీరోలే కాపాడాలి: దర్శకుడు
ఆరుపడై ప్రొడక్షన్స్ పతాకంపై శైల్కుమార్ నిర్మించిన చిత్రం వళ్లువన్. శంకర్ సారథి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సేతన్ శీను, నటి ఆస్నా జవేరి జంటగా నటించారు. మనోబాలా, సాయిదీనా, దీప, రామచంద్రన్, మీసై రాజేంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అశ్వత్ సంగీతం, సురేశ్బాల చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించారు. డైరెక్టర్ స్పీచ్ఈ కార్యక్రమంలో దర్శకుడు, ఫెఫ్సీ (దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య) అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి, ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, కే.రాజన్ తదితర సినీ ప్రముఖలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ సారథి మాట్లాడుతూ.. అమాయక ప్రజలను రక్షించేందుకు డా.అంబేడ్కర్ చట్టాలను తీసుకొచ్చారన్నారు. అయితే చట్టాల్లోని మంచి విషయాలను మరచి, అందులోని లొసుగులను అడ్డం పెట్టుకుని దుండగులు తప్పించుకుని తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. 10 ఏళ్లలో 2500 సినిమాలుఅలా చట్టాన్ని చేతిలోకి తీసుకుని తప్పులు చేసే వారిని ఎవరు శిక్షిస్తారు? అన్న ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం వళ్లువన్ అని చెప్పారు. ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తే కమర్శియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా అనిపించిందన్నారు. గత 10 ఏళ్లలో సుమారు 2,500 చిత్రాలు విడుదలయ్యాయని, వాటిలో 2వేల చిత్రాలను నిర్మిచింది చిన్న నిర్మాతలేనని పేర్కొన్నారు.2 వేల మంది నిర్మాతలు కనుమరుగుఅలా వాళ్లే తమకు అన్నం పెడుతున్నారన్నారు. అయితే ఇన్నేళ్లుగా మొదటి చిత్రాన్ని తీసిన 2 వేల మంది నిర్మాతలు కనిపించకుండాపోయారన్నారు. ఒక్క సంగీత దర్శకుడు కన్నుమూస్తే ఆయనకు కుటుంబానికి రాయల్టీ వస్తుందని, కానీ నిర్మాతలకు ఎలాంటి గ్యారెంటీ లేదన్నారు. అందువల్ల తమ ఉన్నతికి కారణం అయిన నిర్మాతలకు హీరోలు తమ ఆదాయంలో 5 లేదా 10 శాతం చెల్లించేలా ఒక సిస్టం తీసుకువస్తే బాగుంటుందనే అబిప్రాయాన్ని ఆర్కే.సెల్వమణి వ్యక్తం చేశారు.చదవండి: ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రం ఇది -
కుమారుడిని చంపి ఆత్మహత్య చేసుకున్న ఆడిటర్
సాక్షి, చెన్నై: ఆడిటర్గా పనిచేస్తున్న వ్యక్తి స్టాక్ మార్కెట్లో తీవ్ర నష్టాలు చవిచూడటంతో మనస్తాపం చెంది భార్య గొంతుకోసి, కుమారుని గొంతు నులిమి ఆ తర్వాత రైలు కిందపడి ఆత్మహత్మ చేసుకున్నాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన నవీనఖన్నా (42) అన్నానగర్ లోని ఓ ఫ్లాట్లో ఉంటున్నాడు. తేనాంపేటలోని సెంట్రల్ కంప్రోల్టర్, ఆడిటర్ జనరల్ కార్యాలయంలో ఆడిటర్గా పనిచేస్తున్నాడు. ఈయనకు తల్లి భువనేశ్వరి, భార్య నివేదిత (30), కుమారుడు లావిన్ కన్నన్ (7) ఉన్నారు.నివేదిత పెరంబూరులోని లోకో ఆఫీసులో సూపర్వైజర్ పనిచేస్తున్నారు. సోమవారం నవీన్ బయటకు వెళ్లిన అనంతరం తల్లి భువనేశ్వరికి ఫోన్ చేసి భార్య, కుమారుడు చాలాసేపు నిద్రపోతారని, రాత్రి 11 గంటల వరకు ఇబ్బంది పెట్టొద్దని చెప్పి, ఫోన్ కట్ చేశాడు. అనుమానం వచ్చిన తల్లి బెడ్రూమ్ తలుపు తట్టినా తెరవకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, లావిన్ కన్నన్ చనిపోయి ఉన్నాడు. మెడ తెగిపోయిన నివేదితకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో కీల్పాకం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈక్రమంలోనే నవీన్ చెన్నైలోని విల్లివాక్కం రైల్వేస్టేషన్ సమీపంలో ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అయితే తాను పనిచేసే కార్యాలయంలో మాజీ సైనికోద్యోగులకు ఇవ్వాల్సిన కోట్లాది రూపాయల సొమ్మును దుర్వినియోగం చేసి, ఆ డబ్బును షేర్ మార్కెట్లో పెట్టినట్టు విచారణలో వెల్లడైంది. నష్టాలు రావడంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొదట తన బిడ్డ గొంతు నులిమి చంపి, ఆపై కత్తితో భార్య గొంతు కోసినట్టు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి
చెన్నై: రామనాథపురంలోని ఓంశక్తి నగర్కు చెందిన సుబ్రమణియన్ కుమారుడు దీపన్ కుమార్ (30) ఖత్తార్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. తనతో పాటూ పనిచేసే ఫిలిప్పీన్స్ యువతి అర్ష (28) తో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ 5 సంవత్సరాలు కొనసాగింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని తరువాత, దీపన్ కుమార్ తన స్వస్థలంలో తమిళ సాంస్కృతిక ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలనే కోరికను అర్షకు వ్యక్తం చేశాడు. ఆమె దీనికి అంగీకరించింది. ఈ క్రమంలో సోమవారం వీరి వివాహం తమిళ సాంస్కృతి ఆచారాల ప్రకారం రామనాథపురంలో ఘనంగా జరిగింది. -
ముంపు బాధితులకు కలెక్టర్ పరామర్శ
వేలూరు: వేలూరు జిల్లాలో వారం రోజులుగా తరచూ వర్షాలు కురుస్తుండటంతో వేలూరు కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇల్లలోకి చేరింది. దీంతో ఆ ప్రాంతంలో నివశిస్తున్న నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కనసాల్పేట, ఇందిరానగర్, అరియూరు, ముళ్ళిపాల్యం, గాంధీనగర్, జీవానగర్, వీజీరావ్ నగర్ వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు వారం రోజులుగా తగ్గడం లేదు. కార్పొరేషన్ సిబ్బందిచే మోటర్లు ద్వారా నీటిని తొలగిస్తున్నప్పటికీ ఉబరి నీరు అధికంగా రావడంతో నీటిమట్టం తగ్గడం లేదు. దీంతో ఆ ప్రాంతంలోని నివాసితులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలు, కల్యాణ మండపాల్లో ఉంచి వారికి అవసరమైన కనీస వసతులతో పాటూ భోజన వసతులను జిల్లా యంత్రాంగం చేస్తుంది. అదేవిధంగా నీరు అధికంగా చేరిన ప్రాంతాల్లో మంగళవారం ఉదయం కూడా మోటార్లు ద్వారా తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. నీరు చేరిన ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి అక్కడున్న ప్రజలకు వైద్య పరీక్షలు చేయడంతో పాటూ బ్లీచింగ్ చల్లడం, వీధులను శుభ్రం చేయడం వంటి పనిలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ముంపు బాధితులను కలెక్టర్ సుబ్బలక్ష్మి, మేయర్ సుజాత, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణన్ నేరుగా వెళ్లి పరామర్శించడంతో పాటు వారికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
నిండుకుండల్లా.. ఆనకట్టలు
తిరువళ్లూరు: కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని అన్ని ఆనకట్టలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఆనకట్టల నుంచి మిగులు జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి భారీ నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటూ ఆంధ్ర, వేలూరు తదితర ప్రాంతాల నుంచి భారీగా కూవం, కుశస్థలి, ఆరణియార్ ద్వారా భారీగా వరద నీరు వస్తుండడంతో జిల్లాలోని పూండి, పుళల్, చెమరంబాక్కం, చోళవరం, తేరువాయి కండ్రిగ–కన్నన్కోట రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయింది. దీంతో మిగులు జలాలను రిజర్వాయర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని సుమారు వందకు పైగా చెరువుల్లో 75 శాతం పైగా నీరు చేరింది. గ్రామాల్లోని బావులు, చెరువులు, కొలనులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈక్రమంలోనే జిల్లాలో రిజర్వాయర్లు, చెరువుల తరువాత స్తానంలో ప్రధాన నీటి వనరుగా వున్న ఆనకట్టలు పూర్తిగా నిండిపోయాయి. భారీగా నీటినిల్వ.. సురుటుపళ్లి చెక్డ్యామ్లో వంద మిలియన్ ఘనపరిమాణం, పనపాక్కం చెక్డ్యాడ్లో 10.97 మిలియన్ ఘణపరిమాణం, కల్పట్టులో 9.15 మిలియన్ ఘణపరిమాణం, చెంగాత్తుకుళం చెక్డ్యామ్లో 138 మిలియన్ ఘణపరిమాణం, పాళేశ్వరం చెక్డ్యామ్లో 98.84 మిలియన్ ఘనపరిమాణం, ఏఎన్కుప్పం చెక్డ్యామ్లో 98.55 మిలియన్ ఘనపరిమాణం, లక్ష్మీపురం చెక్డ్యామ్లో 300 మిలియన్ ఘణపరిమాణం, రెడ్డిపాళ్యం చెక్డ్యామ్లో 150 మిలియన్ ఘనపరిమాణం, ఆండార్మఠం డ్యామ్లో 22.60 మిలియన్ ఘనపరిమాణంతో పాటూ మొత్తం 927.31 మిలియన్ ఘనపరిమాణంలో నీటి నిల్వ ఉంది. దీంతో పాటూ తామరపాక్కం, పుట్లూరు, పుదుసత్రం, పింజివాక్కం, ఏకాటూరు చెక్డ్యామ్లు సైతం పూర్తిగా నిండి మిగులు జలాలు కిందికి వదిలి వెళ్ళుతున్నాయి. చెక్డ్యామ్లు పూర్తీ స్తాయి నీటి మట్టానికి చేరిన క్రమంలో సమీప ప్రాంతాల్లోని బావులు, బోర్లులలో నీరు పుష్కలంగా లబించే అవకాశం ఉంది. ఇదేవిధంగా భూగర్భ జలాలు సైతం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. అయితే కూవం, కుశస్థలి, ఆరణియార్ ద్వారా జిల్లాకు భారీగా వరద నీరు వస్తోంది. ఇదే సమయంలో అదనపు ఆనకట్టలు లేకపోవడంతో రోజులకు రెండు టీఎంసీల చొప్పున నీరు వృథాగా పోతోందని పలువురు రైతులు వాపోతున్నారు. అదనపు ఆనకట్టలను నిర్మించాలని కోరుతున్నా పాలకులు సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా గత కొద్ది రోజుల క్రితం వరకు నీరు లేక ముళ్ల పొదలతో నిర్మానుష్యంగా కనిపించిన ఆనకట్టలు ప్రస్తుతం జళకళతో కళకళాడుతుండడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లాలో 554.6మిమీల వర్షపాతం
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా 554.60 మి.మీల వర్షపాతం నమోదు కాగా అఽత్యధికంగా పొన్నేరిలో 72మి.మీ, అత్యల్పంగా ఆర్కే పేటలో 4.6మిమీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 554.60 మి.మీల వర్షపాతం నమోదైంది. సరాసరిన 36.97 మి.మీల వర్షపాతం నమోదైంది. కాగా తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రెండు గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు పది పశువులు నీటిలో కొట్టుకపోయాయి. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా చెరువులకు భారీగా నీరు చేరుతోంది. -
క్లుప్తంగా
కారు దగ్ధం తిరువొత్తియూరు: అడయారులో కారుకు మంటలు అంటుకొని దగ్ధమైంది. ఈ ప్రమాదం నుంచి తండ్రీ, కూతురు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు.. తెలంగాణకు చెందిన వెంకటేశ్వర కుమార్తె పోరూరులో ఉంటూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ మెడిసిన్ చదువుతోంది. సోమవారం ఆమె చదువు పూర్తయిన సందర్భంగా ఆమెను తీసుకెళ్లడానికి తండ్రి వెంకటేశ్వర కారులో వచ్చారు. తండ్రీకూతుళ్లు సోమవారం రాత్రి బీసెంట్ నగర్ బీచ్ నుంచి మెరీనా బీచ్ వైపు కారులో బయలుదేరారు. అడయారు ఆవిన్ సెంటర్ దగ్గరకు రాగానే కారు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారును ఆపి దిగిపోయారు. కొద్దిసేపటికే కారు మొత్తం మంటల్లో కాలిపోయింది. తిరువాన్మియూర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. శాస్త్రి నగర్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. అప్పు చెల్లించలేదని కిడ్నాప్ తిరువొత్తియూరు: అప్పు చెల్లించలేదని ఓవ్యక్తిని దుండగలు కిడ్నాప్ చేశారు. విల్లుపురం జిల్లా, వనత్తి గ్రామానికి చెందిన శివ (40) వ్యవసాయం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం బంధువుల వద్ద కొంత నగలు అప్పుగా తీసుకున్నాడు. అప్పును తిరిగి చెల్లించకపోవడంతో అప్పుఇచ్చిన వారు మంగళవారం ఉదయం 8 గంటలకు అతని ఇంటి వద్దకు వెళ్లి మాట్లాడారు. ఆ సమయంలో చర్చలు సఫలం కాకపోవడంతో ఐదుగురు శివను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విల్లుపురం పోలీసులు కారును వెంబడించారు. పోలీసులు పట్టుకుంటారని భయపడి కారును రోడ్డుపై రాంగ్ రూట్లో నడిపారు. ఆ సమయంలో రోడ్డుపై వచ్చిన మూడు బైకులను ఢీకొట్టి చైన్నె– జాతీయ రహదారి వైపు వేగంగా వెళ్లారు. శివను, అతని కారును విల్లుపురం జాతీయ రహదారి జానకిపురం వద్ద వదిలిపెట్టి మరో కారులో పారిపోయారు. పోలీసులు శివను రక్షించి అతని వద్ద విచారణ జరుపుతున్నారు.. ఇంజినీర్ హత్య తిరువొత్తియూరు: శివగంగై జిల్లాలో ఇంజినీర్ను హత్య చేసిన సంఘటనపై చర్యలు తీసుకోవాలని బంధువులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. శివగంగై జిల్లా, కారైకుడి సమీపంలోని అరియకుడి ప్రాంతానికి చెందిన సుబ్రమణియన్ కుమారుడు పళనియప్పన్ (34) సివిల్ ఇంజినీర్. ఇతను బీజేపీ జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా పనిచేశాడు. ఇతనికి అరియకుడి, ఇలుప్పకుడి ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో వాణిజ్య సముదాయంలో అద్దెకు ఉన్న వ్యక్తికి, పళనియప్పన్న్కు మధ్య దుకాణాన్ని ఖాళీ చేయడంపై కక్షలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో సోమవారం పళనియప్పన్ పొన్ నగర్ ప్రాంతంలో తాను నిర్మిస్తున్న ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో ఆరుగురు ఇంట్లోకి వెళ్లి పళనియప్పన్న్పై కత్తులతో దాడి చేశారు. గాయపడ్డ అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పళనియప్పన్ మృతిచెందాడు. విషయం తెలిసి కారైకుడి కళనివాసల్లోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఎదుట బంధువులు రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేశారు. అన్నానగర్లో కొత్త పరిశోధన కేంద్రం సాక్షి, చైన్నె ఆర్తి స్కాన్ అండ్ ల్యాబ్ ఆధ్వర్యంలో చైన్నె అన్నానగర్లోని సెంటర్లో వైటల్ ఈన్సైట్స్ అనే భారతదేశపు మొట్టమొదటి దీర్ఘాయువు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆర్తి స్కాన్ వ్యవస్థాపక చైర్మన్ వి.గోవిందరాజన్ సమక్షంలో ప్రఖ్యాత స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, ఎ.టి.రాజామణి ప్రారంభించారు. గోవిందరాజన్ పనితీరును వివరించారు. నగలు దోపిడీ స్నేహితుడి సహా యువతి అరెస్ట్ తిరువొత్తియూరు: అరియలూర్ జిల్లా తురై సమీపంలో ప్రభుత్వానికి చెందిన రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇక్కడ ఈనెల 16వ తేదీన 60 ఏళ్ల మద్ధుడిపై ఓ మహిళ ఆమె స్నేహితుడు దాడి చేసి అతని వద్ద ఉన్న 6.5 సవర్ల నగలను దోచుకెళ్లారు. పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. వృద్ధుడి నుంచి నగలు దోచుకెళ్లిన అరియలూర్ జిల్లా ఆండిమటంకు చెందిన కలైయరసి (35), జయం గొండానికి చెందిన నవీనన్కుమార్ (30)ను సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 సవర్లు నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరినీ రిమాండ్కు తరలించారు. జంట హత్యల కేసులో ఐదుగురికి జీవిత ఖైదు అన్నానగర్: మాంసం దుకాణం వివాదంలో జరిగిన జంట హత్య కేసులో ఐదుగురికి డబుల్ జీవిత ఖైదు విధిస్తూ సోమవారం కోయంబత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోయంబత్తూరులో అక్టోబర్, 2015న జంట హత్యలు జరిగాయి. దీనికి సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు రెండేళ్ల క్రితం ఒక ప్రమాదంలో మృతిచెందాడు. కేసు విచారణ కోయంబత్తూరు 5వ సెషన్న్స్ కోర్టులో జరుగుతోంది. సోమవారం కేసు విచారించిన న్యాయమూర్తి శివకుమార్ నేరం రుజువు కావడంతో ఐదుగురికి జీవిత ఖైదు విధించారు. -
డీబీసీ కేంద్రంలో మొలకెత్తిన వరి
పళ్లిపట్టు: డీబీసీ కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి బస్తాలు గిడ్డంగికి తరలించక పోవడంతో వర్షానికి తడిచి మొలకెత్తి నిరుపయోగంగా మారుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పళ్లిపట్టు యూనియన్లోని రైతులు సాగు చేసిన వరి పంటను దిగుబడి చేసి బొమ్మరాజుపేట, నొచ్చిలి, వడకుప్పం ప్రభుత్వ డీబీసీ కేంద్రాల్లో విక్రయించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి బస్తాలను నిల్వ వుంచే కేంద్రాలు నిండిపోవడంతో ఆరు బయట వుంచారు. ఈక్రమంలో గత కొద్ది రోజులుగా వర్షం కురుస్తున్న క్రమంలో వరి బస్తాలకు అధికారులు కవర్లు కప్పి వుంచారు. అయితే భారీ వర్షంతో వర్షపు నీరు లోపలికి ప్రవేశించి వరి తడిచి ముద్దవుతోంది. వడకుప్పంలో డీబీసీ కేంద్రానికి బయట 500 బస్తాలు పది రోజుల నుంచి వుండడంతో వర్షానికి తడిచింది. బస్తాలు ముద్దగా మారి మొలకలు రావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డీబీసీ కేంద్రాల్లో బయట వున్న వరి బస్తాలను వెంటనే తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పాండ్రవేడు గ్రామానికి చెందిన రైతు నందకుమార్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి బస్తాలు తరలించడంలో ఆలస్యం చోటుచేసుకుంటుండడంతో వర్షానికి నిరుపయోగంగా మారుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
వైభవం.. సుబ్రహ్మణ్యస్వామి తిరుకల్యాణం
తిరువళ్లూరు: కందషష్టి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో వళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి తిరుకల్యాణ ఉత్సవం మంగళవారం ఉదయం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు సూరసంహారం, ఏడవ రోజు ఉదయం స్వామివారి తిరుకల్యాణ ఉత్సవం వైభవంగా జరిగింది. తిరుకల్యాణ ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆరుగంటలకు మంగళవాయిద్యం, ఏడు గంటలకు అభిషేకం, 8 గంటలకు ప్రత్యేక ఆరాధన, 9 గంటలకు తిరుమురై, తిరుపుగల్ ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం 10.30 గంటలకు తిరుకల్యాణ ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాగా ఉత్సవాల్లో పాల్గొన్న వారికి మంగళసూత్రాలతోపాటు ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు అందజేశారు. సేలంలో.. సేలం: ఈరోడ్లోని తిండల్ వేలాయుధస్వామి ఆలయంలో వేలాయుధస్వామికి, వళ్లి,దేవసేన సమేతంగా తిరుకల్యాణం జరిపించి ఉత్సవ రూపంలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. -
ప్రయాణికురాలిని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
సేలం: ఈరోడ్ రైల్వే స్టేషన్కు రోజూ వందకు సగటున పైగా రైళ్లు వస్తాయి. ఈ పరిస్థితిలో మంగళవారం తెల్లవారుజామున ఈరోడ్ నుంచి చైన్నె సెంట్రల్ వెళ్లే ఏర్కాడ్ ఎక్స్ప్రెస్ రైలు ఈరోడ్ రైల్వే స్టేషన్లోని మూడవ ప్లాట్ఫారం నుంచి బయలుదేరింది. ఆ సమయంలో దాదాపు 20 ఏళ్ల వయసున్న ఓ మహిళ పరిగెడుతూ కదులుతున్న రైలు ఎక్కడానికి యత్నించారు. ఈక్రమంలో అకస్మాత్తుగా అదుపు తప్పి, కిందపడి, రైలు, ప్లాట్ఫారమ్ మధ్య ఇరుక్కుపోయి వేలాడుతోంది. ఇది చూసి తోటి ప్రయాణికులు కేకలు వేశారు. ఆ సమయంలో, పెట్రోలింగ్లో ఉన్న జగతీసన్ అనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ సకాలంలో స్పందించి ఆ ప్రయాణికురాలిని లాగి, ఆమె ప్రాణాలను కాపాడాడు. దీంతో ప్రయాణీకురాలు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ దృశ్యాలన్నీ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. గంజాయితో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మహిళ అరెస్టు అన్నానగర్: మూలపుదూర్ ప్రాంతానికి చెందిన గణేషన్ భార్య ముత్తులక్ష్మి (51) సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం లో పిటిషన్ సమర్పించడానికి సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. ఆమె తీసుకెళ్తున్న బ్యాగును పోలీసులు తనిఖీ చేసినప్పుడు, అందులో 10 గ్రాముల గంజాయి ఉన్నట్లు గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు. నకు చర్మ వ్యాధి ఉన్నందున తనకు తెలిసిన వ్యక్తి ఈ (గంజాయి) స్థానిక మందుగా ఇచ్చాడని కూడా ఆమె పోలీసులకు చెప్పింది. అది గంజాయి అని నాకు తెలియదు? అని ఆమె చెప్పింది. అయినా పోలీసులు ముత్తులక్ష్మి అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
‘ఎస్ఐఆర్’పై కసరత్తు
సాక్షి, చైన్నె: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) కసరత్తు రాష్ట్రంలో మొదలయ్యాయి. ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ మంగళవారం సమావేశమయ్యారు. నవంబర్ 4వ తేదీ నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు నెల రోజుల పాటూ ఇంటింటా పరిశీనలు, జాబితాలో సవరణలపై దృష్టి పెట్టేందుకు చర్యలు చేపట్టారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలను తమిళనాడు ఎదుర్కోబోతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో రాష్ట్రంలోని ఓటరు జాబితాను సవరించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్చర్యలు తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 68,467 పోలింగ్ కేంద్రాలు న్నాయి. పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 10.21 లక్షల ఓటర్లు, 962 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలు వచ్చే ఏడాది ఎన్నికలను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఇక్కడ ఓటరు జాబితా సవరణపై ఎన్నికల యంత్రాంగం దృష్టి పెట్టింది. తమిళనాడులో చేపట్టాల్సిన పనులు, ఇతరాత్రా అంశాల గురించి ఎన్నికల అధికారులతో అర్చనా పట్నాయక్ సమావేశమయ్యారు. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులకు పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. నవంబర్3వ తేదీలోపు అన్ని కసరత్తులు ముగించి నవంబర్ 4 నుంచి నెల రోజుల పాటూ ఇంటింటా సమగ్ర పరిశీలనకు సిద్ధమయ్యే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా పోరాటానికి డీఎంకే నేతృత్వంలోని అఖిల పక్ష సమావేశానికి నిర్ణయించారు. తమిళనాడులో ప్రజల ఓటు హక్కును కాలరాసే విధంగా కుట్ర పన్ని ఉన్రాని, దీనికి వ్యతిరేకంగా రాజకీయ పక్షాలన్నీ ఏకమై, ప్రజల మద్దతుతో పోరాటానికి నిర్ణయించారు. నవంబర్ 2వ తేదీన డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఈ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా ఎస్ఐఆర్ను రూపంలో డీఎంకేలో గుబులు బయలుదేరిందని, వారి మోసాలు ఎక్కడ బయట పడుతాయో అన్న ఆందోళన పెరిగినట్టుందని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆరోపించారు. -
వరద బాధితులను ఆదుకోవాలి
వేలూరు: వేలూరు కార్పొరేషన్లోని వరద బాధిత ప్రాంతాలను గుర్తించి వారిని ఆదుకునేందుకు పారిశ్రామిక వేత్తలు, దాతలు ముందుకు రావాలని బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తియాయిని అన్నారు. వేలూరు కార్పొరేషన్లోని కన్సాల్పేట పూర్తిగా నీటితో నిండిపోవడంతో అక్కడి బాధితులను పాత బైపాస్ రోడ్డులోని సహాయ శిబిరంలో ఉంచారు. దీంతో బీజేపీ పార్టీ ఎస్సీ, ఎస్టీ విభాగం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏకే శరవణకుమార్ ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసర వస్తువులతోపాటు దుస్తులు, ఆహార పదార్థాలు, వంటి సంక్షేమ పథకాలు పంపిణీ చేశారు. ఇందులో హాజరైన ఆమె బాధితులను తమ వంతు ఆదుకుంటామన్నారు. ఇదే తరహాలోనే అన్ని ప్రాంతాల్లోని శిబిరాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం బాధితులను పరామర్శించడంతోపాటు వారికి పలు వస్తు సామగ్రిని అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దశరథన్, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు కలైమగల్ ఇళంగోవన్, రోటరీ క్లబ్ కార్యదర్శి ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షులు చక్రవర్తి, రమేష్ పాండియన్, ఐటీ విభాగం ఇన్చార్జ్ నందకుమార్, విఘ్నేష్ పాల్గొన్నారు. -
కమనీయం.. మురుగన్ కల్యాణోత్సవం
తిరుత్తణి: స్కంధషష్టి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం మురుగన్ కల్యాణోత్సవం కోలాహలంగా నిర్వహించారు. భారీ వర్షం సైతం లెక్క చేయకుండా భక్తులు కొండ ఆలయానికి చేరుకుని స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. వివరాలు.. తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో 22న స్కంధషష్టి వేడుకలు ప్రారంభమయ్యాయి. వారం పాటూ నిర్వహించిన వేడుకల సందర్భంగా రోజూ మూలవర్లకు విశేష అభిషేక ఆరాధన పూజలతో పాటూ ప్రత్యేక అలంకరణతో మహాదీపారాధన చేపట్టారు. కావడి మండపంలో శ్రీవళ్లి, దేవసేన సమేత షణ్ముఖర్కు సుగంధ పుష్పాలతో అలంకరించి లక్షార్చన పూజలు జరిగాయి. వేడుకల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం కల్యాణ మురుగన్ కల్యాణోత్సవం నిర్వహించారు. భారీ వర్షం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో భక్తులు కొండ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ నిర్వాహకులతో పాటూ భక్తులు కల్యాణోత్సవానికి సంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలు, పూజా సామాగ్రి, పుష్పాలు, పండ్లు వరుసగా తీసుకొచ్చి కావడి మండపం తీసుకొచ్చారు. ఆలయ ప్రదాన అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కావడి మండపంతో పాటు వెలుపల వేచివున్న భక్తులు హారంహర నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అధికారులు పసుపు,కుంకుమ. మాంగళ్యం. ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ చైర్మన్ శ్రీధరన్, జాయింట్ కమిషనర్ రమణి ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు సంయుక్తంగా స్కంధషష్టి వేడులకు ఏర్పాట్లు చేశారు.2026 ఆలయ క్యాలెండర్ విడుదల తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ 2026 సంవత్సరం క్యాలెండర్ను కొండ ఆలయంలో ట్రస్టు బోర్డు చైర్మన్ శ్రీధరన్ విడుదల చేశారు. మురుగన్ ఫొటోలతో పాటూ ఆధ్యాత్మిక వివరాలతో కూడిన మాసాంత క్యాలెండర్ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ. 100 చెల్లించి భక్తులు సుబ్రహ్మణ్యస్వామి ఆలయ క్యాలెండర్ను కొనుగోలు చేశారు. -
కోవైకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
సాక్షి, చైన్నె: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మంగళవారం కోయంబత్తూరుకు వచ్చారు. ఆయనకు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ఇటీవల ఉ ప రాష్ట్రపతి పదవిని అధిరోహించిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించినానంతరం ఆయన ఇంత వరకు తమిళనాడుకు రాలేదు. గత నెలాఖరులోరావాల్సి ఉండగా, కరూర్ విషాద ఘటన నేపథ్యంలో వాయిదా పడింది. ఈ పరిస్థితులలో ఆయన మంగళవారం కోయంబత్తూరుకు వచ్చారు. ఉప రాష్ట్రపతిగా ప్రపథమంగా తమిళనాడుకు వచ్చిన సీపీ రాధాకృష్ణన్కు కోయంబత్తూరు విమానాశ్రయంలో బ్రహ్మరథం పట్టేవిధంగా ఆహ్వానం పలికారు. మంత్రులు ముత్తుస్వామి, స్వామి నాధన్ల నేతృత్వంలో అధికారిక ఆహ్వానం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్తో పాటూ బీజేపీ వర్గాలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొడీస్సీయా ఆడిటోరియంలో కోయంబత్తూరులో పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశానికి సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పదవీ అన్నది తన ఒక్కడికే దక్కిన గౌరవం కాదని, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత మిళులకు దక్కిన గౌరవంగా వ్యాఖ్యలు చేశారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూపిస్తానని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఎదగాలన్న కాంక్షతో ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నాలలో ఉన్నారని వివరించారు. గతంలో ఝార్కండ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టాలని ప్రదాని నరేంద్రమోదీ తనకు సూచించారని, దీనిని తాను ఊహించలేదని, ఇది దేవుడిచ్చిన వరంగా భావించినట్టు పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల నిరంతర ఆశీస్సులతో ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టానని గుర్తుచేశారు. అనంతరం కోయంబత్తూరులో జరిగిన పలు కార్యక్రమాలను ముగించుకుని తిరుప్పూర్కు వెళ్లారు. -
బోస్ వెంకట్ నూతన చిత్రం
ఒప్పంద పత్రాలతో బోస్ వెంకట్, వి.మదియళగన్, యువన్ శంకర్రాజా, కన్నన్రవి తమిళసినిమా: ఇంతకుముందు కన్నిమేడం, సార్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన నటుడు బోస్ వెంకట్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం మంగళవారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కేఆర్జీ మూవీస్ పతాకంపై కన్నన్రవి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎక్స్ట్రా ఎంటర్టెయిన్మెంట్ సంస్థ అధినేత వి.మదియళగన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత 35 ఏళ్లుగా దుబాయిలో ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తున్న కన్నన్ రవి తన కేఆర్జీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న 7వ చిత్రం ఇది కావడం గమనార్హం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి యువన్ శంకర్రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు బోస్ వెంకట్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథ ప్రేమ, కుటుంబ అనుబంధాలు, సమాజం వంటి పలు ముఖ్య అంశాల గురించి చర్చించే విధంగా ఉంటుందన్నారు. భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ చిత్రం సినీ పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచి పోతుందన్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. ఈ చిత్రంలో సంగీతదర్శకుడు యువన్ శంకర్రాజాతో కలిసి పనిచేయడం సంతోషకరమన్నారు. చిత్రాన్ని త్వరలోనే సెట్పైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు బోస్వెంకట్ పేర్కొన్నారు. -
పగటి కలలు
బీజేపీవి.. తమిళ గడ్డపై డీఎంకే ఉన్నంత కాలం బీజేపీ కలలన్నీ.. పగటి కల్లలే అవుతాయని, వాటిలో ఏ ఒక్కటీ నెరవేర నివ్వబోమని డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. 2026 ఢిల్లీని ఢీకొట్టే డీఎంకే ప్రభుత్వమా? బానిస పాలనా? అన్నది తేల్చే రీతిలో తమిళనాడు రక్షణను ధ్రువీకరించే ఎన్నికలు కాబోతున్నాయని అభిప్రాయపడ్డారు. సమావేశం వేదికపై డీఎంకే నేతలు, ప్రసంగిస్తున్న స్టాలిన్ సాక్షి, చైన్నె: చైన్నె శివారులోని మహాబలిపురంలోని ఓ రిసార్ట్ వేదికగా మంగళవారం డీఎంకే నేతృత్వంలో ‘నా పోలింగ్ బూత్ ఓ విజయవంతమైన పోలింగ్ బూత్’ నినాదంతో శిక్షణ సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల పనులను పోలింగ్ బూత్స్థాయిలో నుంచి వేగవంతం చేసే దిశగా ఈ కొత్త కార్యక్రమాన్ని డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. తమిళనాడును అన్ని విధాలుగా అణగ దొక్కే ప్రయత్నంలో మోసపూరిత వ్యూహాలకు, కుట్రలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒడిగడుతోండడాన్ని తిప్పి కొట్టే రీతిలో ఈ శిక్షణలో నేతలు వ్యాఖ్యల తూటాలను పేల్చారు. పోలింగ్ బూత్లలో స్థానికంగా బలం, విజయాన్ని నిర్ధారించే విధంగా, ఆయా నియోజకవర్గాలలో స్థానికంగా పోలింగ్ బూత్ల వారీగా బలాన్ని చాటుకునే రీతిలో జరిగిన ఈ సమావేశానికి జిల్లాల కార్యదర్శులు, ఇన్చార్జ్లు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పరిశీలకులు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు యూనియన్, నగర, ప్రాంతీయ , పట్టణ సంఘాల కార్యదర్శులు హాజరయ్యారు. డీఎంకే ప్రదాన కార్యదర్శి దురై మురుగన్, కోశాధికారి కేఎన్నెహ్రూ, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కనిమొళి, కేఎన్ నెహ్రూ, తిరుచ్చి శివ, ఐ. పెరియస్వామి, యువజన ప్రధాన కార్యదర్శి ఉదయనిధి సీఎం స్టాలిన్తో పాటూ వేదికపై కూర్చుని పలు సూచనలు, సలహాలు తమ వ్యాఖ్యల ద్వారా తెలియజేశారు. పొరాడుదాం.. తమిళనాడు కోసం బీజేపీతో పోరాడుతూనే ఉంటామన్నారు. ‘మనం గెలుస్తాం‘ అన్న నినాదాన్ని తమిళనాడు అంతటా ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, దివంగత నేతలు పెరియార్, అన్నా, కరుణానిధిల బాటలో ఆత్మగౌరవం నినాదంతో ఫాసిజ బీజేపీకి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం కొనసాగుతుందన్నారు. ఎన్నో పోరాటాలలతో విజయం సాధించామని, హక్కులను సాధించుకున్నామని గుర్తు చేస్తూ, పాసిస్టులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వాటిని సమర్థంగా తిప్పి కొడుదామన్నారు. డీఎంకేలోని కేడర్, నాయకుడి ముఖాలలో తాను సూర్యోదయాన్ని చూస్తున్నానని పేర్కొంటూ, ఈ శిక్షణ తదుపరి వారివారి పోలింగ్ బూత్లలో గెలుపును నిర్ధారించే విధంగా ముందుకు సాగాలని ఆదేశించారు. రోజూ సాయంత్రం పోలింగ్ బూత్లలో సమావేశాలు నిర్వహించాలని, ప్రజలతో మాట్లాడాలని, ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుని జిల్లాల కార్యదర్శుల ద్వారా తనకు సమాచారం పంపించాలని సూచించారు. ప్రతి వారం పంపించే ఈ నివేదికను తాను స్వయంగా పరిశీలిస్తానని, తానే స్వయంగా స్థానికంగా ఉన్న వారితో మాట్లాడుతానని వివరిస్తూ, ఇందుకు సమాయత్తం అయ్యే విధంగా ప్రతి బూత్ కమిటీ సభ్యుడు ప్రతిజ్ఞతో ప్రజలలోకి దూసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో ఫీల్డ్ వర్క్ ముందంజలో ఉండాలని, ఏడోసారి అధికారం తథ్యం అన్నది నిర్ధాంచుకుందామన్నారు. తమిళనాడు ఆత్మగౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుదామని, తమిళనాడును, జాతి శత్రువులను, తమిళ ద్రోహులను తరిమి కొడుదామని, మన భూమిని, భాషను, గౌరవాన్ని మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. డీఎంకే కూటమి అన్ని స్థానాలలో విజయ ఢంకా మోగించే విధంగా ప్రతిఒక్కరి పని తీరు ఉండాలని సూచించారు. తమిళనాడు ఇప్పుడు సామాజిక, రాజకీయ, ఆర్థికంగా దండయాత్రను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, అన్ని విధాలుగా అన్యాయం తలబెట్టే ప్రయత్నాలు విస్తృతం అయ్యాయని వివరించారు. ఈ దాడిని తిప్పికొట్టే శక్తి మనకు ఉందని పేర్కొంటూ, ఈ భూమిపై డీఎంకే ఉన్నంత కాలం ఢీ కొడుతూనే ఉంటుందన్నారు. తాజాగా స్పెషల్ ఇంటెన్సివ్ ఓటరు జాబితా(ఎస్ఐఆర్) సవరణ పేరిట కొత్త ఎత్తుగడులు వేసి ఉన్నారని, దీనిపై అప్రమత్తత అవశ్యమని, బీహార్ పరిణామాలను గుర్తెరిగి ఓటరు జాబితా సవరణను నిశితంగా పరిశీలించాలని, ప్రజల ఓటుహక్కును పరిరక్షించాలని పిలుపునిచ్చారు. బీజీపీకి బానిసగా మారి, అమిత్ షాకు అన్నాడీఎంకేను తాకట్టు పేట్టేసిన పళణి స్వామి తాజా చర్యలు తమిళనాడు ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరని పేర్కొంటూ, తమిళనాడుకు వ్యతిరేకంగా ఆయన సాగిస్తున్న అవకాశవాదాన్ని ప్రజలలోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఏడోసారి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని, తమిళనాడును శాశ్వతంగా పరిపాలించడానికి డీఎంకేకు మాత్రమే అర్హత ఉందని నిరూపించుకునే విధంగా శ్రమించాలని పిలుపునిచ్చారు.పగటి కలలు నెరవేరనివ్వం.. ఈ భూమిపై డీఎంకే ఉన్నంత కాలం బీజేపీ పగటి కలలు నిజం కావు అని స్పష్టం చేస్తూ సమావేశంలో సీఎం స్టాలిన్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. 2026లో జరగబోయే ఎన్నికలు కీలక మలుపు కావాలని పేర్కొంటూ, ఇందులో డీఎంకే ప్రభుత్వమా.. లేదా ఢిల్లీకి తలవంచే బానిస ప్రభుత్వమా? అన్నది నిర్ణయించుకోవాలని ఓటర్లకు సూచించారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ లక్ష్యాలను సాధించేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉండాలని సూచించారు. ఇదే అసలైన ఉద్యమం అని ఇందులో రోజూ పనిచేస్తూనే ఉండాలని, నా పోలింగ్ బూత్ ఒక విజయపు పోలింగ్ బూత్ అన్న నినాదాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. అందరి సమష్టి కృషితో ఆరోసారి డీఎంకే పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని, ఏడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తంచేశారు. 2019లో సవాళ్లను అధిగమించి ప్రభుత్వాన్ని గొప్ప విజయవంతో ఏర్పాటు చేసుకున్నామని, 2026లో ద్రావిడ మోడల్ 2.ఓ అందరి కృషితో, తమిళనాడు ప్రజల మీద ఉన్న నమ్మకంతో కొనసాగుతుందని తాను స్పష్టం చేస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ద్రావిడ మోడల్ పాలనలో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేశామని, ప్రతి ఇంట్లోకి పథకాలతో ప్రవేశించామని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సాధించని స్థాయిలో విజయాలు సొంతం చేసుకున్నామని వివరించారు.ఈ విజయాలతోనే ధైర్యంగా ఉండగలుగుతున్నట్టుగా పేర్కొన్నారు. -
ముగ్గురు ప్రొఫెసర్లకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ – 2025
కొరుక్కుపేట: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ నుంచి ముగ్గురు ప్రొఫెసర్లు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025’ కు ఎంపికయ్యాయి. సైనన్స్, టెక్నాలజీ రంగాల్లో విశేష ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన వారికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్లను అందిస్తూ వస్తున్నారు. 2025 సంవత్సరానికి గాను రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025లను శాస్త్ర పరిశోధన విభాగాల్లో అద్భుత నైపుణ్యాలు ప్రదర్శించిన ముగ్గురు ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్లను వరించింది. ఇందులో ఐఐటీ మద్రాస్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ తలప్పిల్ ప్రదీప్తో పాటూ ప్రొఫెసర్ మోహనశంకర్ శివప్రకాశం, ప్రొఫెసర్ శ్వేత ప్రేమ్ అగర్వాల్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025కు ఎంపికై న ముగ్గురు ప్రొఫెసర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆగని బాంబు బెదిరింపుల పర్వం సాక్షి, చైన్నె : బాంబు బూచీలు పోలీసులను వెంటాడుతున్నాయి. మంగళవారం పలు చోట్ల వచ్చిన బెదిరింపు మెయిల్స్, కాల్స్తో పోలీసులు పరుగులు తీశారు. గత నెల రోజులుగా చైన్నెలో అక్కడ, ఇక్కడ బాంబులు ఉన్నాయంటూ వస్తున్న బెదిరింపు మెయిల్స్ పోలీసులకు సవాలుగామారిన విషయం తెలిసిందే. ఈ బెదిరింపు ఇస్తున్న వారిని పసిగట్టడం శ్రమగా మారింది. ఇది వరకు సీఎం, డిప్యూటీ సీఎంలతోపాటూ కీలక వ్యక్తులు, నాయకుల ఇళ్లు, కార్యాలయాలకు సైతం బెదిరింపు వచ్చింది. తాజాగా సినీ నటులు రజనీకాంత్, ధనూష్, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత సెల్వ పెరుంతొగై నివాసాలకు బెదిరింపు వచ్చాయి. ఇక బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామిని హతమారుస్తామంటూ డీజీపీ కార్యాలయానికి ఈ మెయిల్రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని చోట్లా సోదాలు జరపగా, ఎక్కడ ఎలాంటి బాంబు అన్నది లభించ లేదు. ఇక, సుబ్రహ్మణ్య స్వామికి భద్రత పెంచేందుకు చర్యలు చేపట్టారు. 8 నుంచి క్విజ్ పోటీలు సాక్షి, చైన్నె: బాటిల్ ఆఫ్ బ్రెయిన్స్ పేరిట ఇంటర్ స్కూల్ క్విజ్ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు కాసాగ్రాండ్ ఆహ్వానం పలికింది. నవంబర్ 8 నుంచి జరగనున్న ఈ క్విజ్ పోటీలు చైన్నెలోని పాఠశాలల విద్యార్థుల ప్రతిభను చాటే విధంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు 6 నుంచి 9 తరగతుల వారై ఉండాలని సూచించారు. విద్యార్థులను ఆరు జట్లుగా విభజించి పోటీలను నిర్వహించున్నామని, ఆశావహులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాసాగ్రాండ్కో.ఇన్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు అని సూచించారు. విజేతలకు ప్రతిష్టాత్మక ట్రోఫీతో పాటు రూ.1.50 లక్షల బహుమతి, రన్నర్ జట్టుకు రూ.80 వేలు అందజేయనున్నామని ప్రకటించారు. -
తప్పిన మోంథా ముప్పు
మోంథా గండం నుంచి చైన్నె మహానగరం దాని శివారు జిల్లాలు గట్టెక్కాయి. ఈ తుపాన్ ప్రభావంతో మంగళవారం కూడా చిరు జల్లులు కురిశాయి. ఆవడి, ఎన్నూరు పరిసరాలలో అయితే, భారీ వర్షం పడింది. అయితే భారీ వర్షాల ముప్పు తప్పడంతో ఎలాంటి గండం ఎదురు అవుతుందో..? అన్న ఉత్కంఠతో అధికార యంత్రాంగం క్షణ..క్షణం అప్రమత్తంగా వ్యవహరించింది. సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలలో ఇప్పటికే ఆశాజనకంగా వర్షాలు పడ్డ విషయం తెలిసిందే. చైన్నె, శివారులలోని రిజర్వాయర్లు ఇప్పటికే నిండు కుండలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో నెలకొన్న మోంథా రూపంలో చైన్నె, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం తదితర ఉత్తర తమిళనాడులోని జిల్లాలపై వర్షం ప్రభావం ఉంటుందని వాతావరణ పరిశోధకులు అంచనా వేశారు. ఇది చైన్నెకు సమీపంలో ప్రయాణించి ఆంధ్రా వైపుగా వెళ్తుందని తొలుత భావించారు. అయితే మోంథా తుపాన్ చైన్నెకు సమీపంలో కాకుండా, కాస్త దూరంగానే ప్రయాణించడంతో గండం తప్పినట్లయ్యింది. సోమవారం నుంచి చైన్నె, శివారు జిల్లాలో చిరు జల్లుల వర్షం పడుతూనే వచ్చింది. మంగళవారం కూడా ఇది కొనసాగింది. సుమారు 35 గంటల పాటూ చైన్నె, శివారులలో చిరు జల్లులతో వాన నిరంతరాయంగా కురిసింది. అప్పుడప్పుడూ అనేక చోట్ల ఈదురు గాలులు కాస్త వణికించాయి. అయితే ఉత్తర చైన్నె పరిధిలో కొన్నిచోట్ల, తిరువళ్లూరు జిల్లా పరిధిలో మరికొన్ని చోట్ల తెరపించి తెరపించి వర్షం పడింది. తిరునెండ్రవూరు, ఆవడి పరిసరాలు, ఎన్నూరు పరిసరాలలో భారీ వర్షం పడింది. ఎన్నూరులో 13 సెం.మీ వర్షం పడింది. ఆవడి పరిసరాలలోని కొన్ని చెరువులు నిండు కుండగా మారడంతో అక్కడి ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఎన్నూరు పరిసరాలలోనే ఇదే పరిస్థితి నెలకొనడంతో నీటి తొలగింపునకు అధికారులు ఉరకలు తీశారు. మంగళవారం రాత్రి సమయంలో చిరు జల్లుల వాన సైతం ఆగినట్టైంది. మోంథా రూపంలో ప్రభావం లేనప్పటికీ, మరో వారం పది రోజులు గాలిలో తేమ తగ్గే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నవంబర్ రెండో వారంలో మళ్లీ వర్షాలకు అవకాశం ఉన్నట్టు వాతావరణ పరిశోధకులు పేర్కొంటున్నారు. నవంబర్, డిసెంబర్ నెలలలో రెండు తుపాన్లకు అవకాశం ఉన్నట్టు, వీటి ప్రభావం తమిళనాడుపై అధికంగాఉండవచ్చని భావిస్తున్నారు. ఇక ఈశాన్య రుతు పవనాలతో పశ్చిమ కనుమలలో తేని, తెన్కాశి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాలలో వర్షాలు కొనసాగుతున్నాయి. అప్రమత్తంగా.. మోంథా రూపంలో భారీ వర్షం కురిసిన పక్షంలో ఎదుర్కొనే విధంగా మంగళవారం అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించారు. సబ్ వేలు, లోతట్ట ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి విపత్తు ఎదురు అవుతుందో అన్న ఉత్కంఠతో అప్రమత్తంగా ముందడుగు వేశారు. ఎమర్జెన్సీ కంట్రోల్ రూంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తిష్ట వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే పలుచోట్ల పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. సుమారు 54 వేల మందికి ఆహారం ప్యాకెట్లను అందజేశారు. ఎన్నూరు పరిసరాలలో సముద్రం కోతకు గురి కాకుండా ఇసుక బస్తాలను సిద్ధం చేసి ఆగమేఘాలపై కట్టడిచర్యలు అధికారులు తీసుకున్నారు. ఇక ఆంధ్రా వైపుగా వెళ్లే అనేకరైళ్ల సేవలలో మార్పులు చేశారు. చైన్నె సెంట్రల్ – హౌరా, విశాఖపట్నం, విల్లుపురం– ఖరగ్ పూర్, చైన్నె సెంట్రల్ – హౌరా సూర్ ఫాస్ట్ మెయిల్, తిరుచ్చి – హౌరా, తదితర రైళ్లుందులో ఉన్నాయి. అలాగే, పలు విమానాల సేవలు రద్దు చేశారు. ఆంధ్రా వైపుగా వెళ్లే ఆరు విమాన సేవలు రద్దు కాగా, మరో ఆరు విమానాల వేళలో మార్పులు చేశారు -
డీఎంకేను సాగనంపుదాం!
సాక్షి, చైన్నె: డీఎంకేను ఇంటికి పంపిద్దామని ప్రజలకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పిలుపు నిచ్చారు. కరూర్ ఘటన పరిణామాలతో నెల రోజులుగా విజయ్ ప్రజా సమస్యలపై ఎలాంటి స్పందన లేకుండా ఉంటూ వచ్చారు. రాజకీయ కార్యక్రమాలు కూడా ముందుకు సాగలేదు. ఈ పరిస్థితులలో సోమవారం కరూర్ బాధితులను చైన్నెకు పిలిపించి పరామర్శించారు. ఆయన తీవ్ర ఉద్వేగంతో తమను పరామర్శించినట్టుగా బాధితులు అనేక మంది పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో నెల రోజుల తర్వాత ప్రజా సమస్యపై స్పందిస్టూ విజయ్ ప్రకటన విడుదల చేశారు. వరి కొనుగోలలో నిర్లక్ష్యాన్ని వివరిస్తూ, పేదల కడుపు కొట్టడమే కాకుండా, రైతులను కన్నీటి మడుగులో ముంచుతున్న డీఎంకేను ఇంటికి పంపిద్దామని ప్రజలకు పిలుపు నిస్తూ ఈ ప్రకటన చేశారు. అదేవిధంగా వర్షాల నేపథ్యంలో ఎదురు అవుతున్న సమస్యలను వివరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. -
జ్వరంతో శిశువు మృతి
తిరువొత్తియూరు: చైన్నె ఆవడి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న రాజశేఖర్ ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. అతనికి అనన్య ఏడాది వయసున్న ఓ కుమార్తె ఉంది. గత కొన్ని రోజులుగా చిన్నారి జ్వరంతో బాధపడుతోంది. మంగళవారం ఉదయం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆవడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనే అనన్య మరణించింది. ఆవడి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. కొత్త కారు ఆవిష్కరణ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటారు ఇండియా ప్రెసిడెన్షియల్ ఎంజీ ఎం9ను సిద్ధం చేసింది. దీనిని మ్యూజిక్ మాస్ట్రో శంకర్ మహాదేవన్తో పాటూ ఎంజీ మోటారు ఇండియా వర్గాలు ఆవిష్కరించాయి. – సాక్షి, చైన్నె -
కుల గణన నిర్వహించాలి
వేలూరు: తమిళనాడులో కుల జనాభా గణన సర్వేలు చేపట్టి వన్నియర్లకు న్యాయం చేయాలని పీఎంకే పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్కుమార్ అన్నారు. వేలూరులో పీఎంకే పార్టీ యువజన విభాగం సమావేశం జిల్లా అధ్యక్షుడు బాలాజీ అధ్యక్షతన జరిగింది. ఆయన కార్యకర్తలకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ కుల ఆధారిత జనాభా గణన నిర్వహించి అన్ని వర్గాలకు రిజర్వేషన్లను అందజేయాలన్నారు. వేలూరు జిల్లాలోని అనకట్టు నియోజకవర్గంలో అటవీ ప్రాంతవాసులతోపాటు రైతులు అధికంగా వ్యవసాయ పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారని ఆ ప్రాంతంలో శీతల గిడ్డంగి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. పార్టీ మహిళా అధ్యక్షురాలు, వేలూరు కార్పొరేటర్ బాబీ కదిరవన్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి పార్టీలోని యువకులు సైనికుల్లా పని చేయాలన్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోను పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి అధికంగా పార్టీలో చేర్పించేందుకు కంకణం కట్టుకోవాలన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి వారికి సాయం చేసేందుకు కృషిచేయాలన్నారు. పార్టీలో వర్గ విభేదాలు వదిలి కలిసికట్టుగా పనిచేస్తే పీఎంకే విజయం తథ్యమన్నారు. అనంతరం సమావేశంలో సభ్యులు పది తీర్మానాలను ఆమోదించారు. సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి ఎన్టీ షణ్ముగం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశన్, జిల్లా కార్యదర్శి జగన్, రాజేష్కుమార్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి తిరువళ్లూరు: 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 13 ఏళ్లు జైలు శిక్షతో పాటూ రూ.16 వేలు జరిమానా విధిస్తూ తిరువళ్లూరు జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా ఒరగడం ప్రాంతానికి చెందిన ఆళగరసన్(37). ఇతను గత 2019వ సంవత్సరంలో తిరుములైవాయల్ ప్రాతంలో నివాసం ఉంటున్న తమ సమీప బంధువైన 13 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లి లైగింక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం బెయిల్పై వున్న నేపథ్యంలో కేసు విచారణ తిరువళ్లూరు పోక్సో న్యాయస్థానంలో సాగింది. విచారణ పూర్తి కావడంతో న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. 13 బాలికపై లైగింక దాడికి పాల్పడిన అళగరసన్కు 13 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. అనంతరం నిందితుడిని పుళల్ జైలుకు తరలించారు. అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి అన్నానగర్: రామనాథపురంలోని ఓంశక్తి నగర్కు చెందిన సుబ్రమణియన్ కుమారుడు దీపన్ కుమార్ (30) ఖత్తార్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. తనతో పాటూ పనిచేసే ఫిలిప్పీన్స్ యువతి అర్ష (28) తో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ 5 సంవత్సరాలు కొనసాగింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని తరువాత, దీపన్ కుమార్ తన స్వస్థలంలో తమిళ సాంస్కృతిక ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలనే కోరికను అర్షకు వ్యక్తం చేశాడు. ఆమె దీనికి అంగీకరించింది. ఈ క్రమంలో సోమవారం వీరి వివాహం తమిళ సాంస్కృతి ఆచారాల ప్రకారం రామనాథపురంలో ఘనంగా జరిగింది. 13 సవర్ల నగలు చోరీ అన్నానగర్: చైన్నె సమీపం అంబత్తూరులోని జ్ఞానమూర్తి నగర్ ప్రాంతంలో నివసించే బ్యూలా (46) ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. ఈమె తల్లి ప్రేమ, ఆమె సోదరితో నివసిస్తుంది. వీరి ఇంటి కింద రేవతి తన కుటుంబంతో నివసిస్తోంది. ఈనేపథ్యంలో రేవతి బ్యూలా తల్లి ప్రేమతో మాట్లాడుతున్నట్లు నటిస్తుండగా.. రేవతి కుమార్తె ప్రేమ ఇంటిలోనికి చొరబడి చాకచక్యంగా 13 సవర్ల నగలు దొంగిలించింది. దీంతో బ్యూలా 16వ తేదీన అంబత్తూరు క్రైమ్ బ్రాంచ్లో ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా, అంబత్తూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రేమ తనకు రేవతిపై అనుమానం ఉందని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో, దీపావళి సందర్భంగా రేవతి తన స్వస్థలం శ్రీవిల్లిపుత్తూర్కు వెళ్లింది. దీపావళి తర్వాత చైన్నెకి తిరిగి వచ్చిన తర్వాత, అంబత్తూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. దర్యాప్తులో భాగంగా నగలు దొంగిలించినట్లు తల్లి, కుమార్తె అంగీకరించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి, వారి నుండి 13 సవర్ల నగలను స్వాధీనం చేసుకున్నారు. రేవతిని పుళల్ జైలుకు, ఆమె 15 ఏళ్ల కుమార్తెను జువైనల్ హోంకు పంపించారు. బాలుడి దారుణ హత్య ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు అన్నానగర్: చోళవరం సమీపంలో 17 ఏళ్ల బాలుడిని అతని చేతులు, కాళ్లు కట్టి, గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లాలోని చోళవరం పక్కన ఉన్న ఆలమతిలోని దీరన్ చిన్నమలై వీధికి చెందిన బాబు (17) వెల్డింగ్ కార్మికుడు. బాబు కుటుంబం ఆరు నెలల క్రితం అద్దె ఇంటికి మారింది. బాబు తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లారు. బాబు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సోమవారం రాత్రి నుంచి బాబు సోదరుడు అతనికి ఫోన్ చేస్తున్నాడు, కానీ అతను ఫోన్ తీయకపోవడంతో, తన స్నేహితుడిని వచ్చి చూడమని అడిగాడు. అతడు లోపల తాళం వేసి ఉన్న ఇంటి తలుపు పగలగొట్టి చూడగా, బాబు చేతులు, కాళ్లు కట్టేసి, గొంతు కోసి మృతి చెందినట్లు గుర్తించి చోళవరం పోలీసులకు సమాచారం అందించారు. చోళవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం చైన్నెలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. -
ఆర్కే ఇంటర్నేషనల్ చిత్రం ప్రారంభం
నిర్మాత ఆర్కే రామకృష్ణ, దర్శకురాలు శాలిన్జోయాలతో చిత్ర యూనిట్ తమిళసినిమా: ఇంతకుముందు 17 జనరంజకమైన చిత్రాలను నిర్మించిన ఆర్కే ఇంటర్నేషనల్ సంస్థ అధినేత కేఎస్.రామకృష్ణ తాజాగా నిర్మిస్తున్న 18వ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల చైన్నెలో ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం ద్వారా మలయాళ నటి, దర్శకురాలు శాలిన్జోయాను కోలీవుడ్కు పరిచయం చేస్తున్నారు. ఈమె ఇంతకుముందు కన్నగి అనే చిత్రంలో నటించారు. అదేవిధంగా కుక్ విత్ కోమాలి కార్యక్రమంలో పాల్గొని పాపులర్ అయ్యారు. ఈ చిత్రంలో నక్సలైట్స్ చిత్రం ఫేమ్ అరుణ్, నటి బ్రిగిడా జంటగా నటిస్తున్నారు. ఎంఎస్.భాస్కర్, అరుళ్ దాస్, జావా సుందరేశన్, జాన్సన్ దివాకర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఇందులో నటి దేవదర్శిని వినూత్న పాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా అశ్విన్ కాక్కుమణు గౌరవ పాత్రలో నటిస్తున్నారు. చిత్ర వివరాలను నిర్మాత కేఎస్ రామకృష్ణ చెపుతూ తాజాగా శాలిన్జోయాను ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. శాలిన్ జోయా మాట్లాడుతూ ఒక గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఆ ప్రాంత ప్రజల జీవితాలను ఎలా మార్చేస్తుంది అనే విషయాన్ని వినోదాన్ని జోడించి ఫాంటసీ అంశాలతో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ప్రతిభావంతులైన కళాకారులు ,సాంకేతిక వర్గంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. మంచి కథా చిత్రాలను ఆదరించే తమిళ ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కె.రామ్చరణ్ చాయాగ్రహణం అందిస్తున్నారు. మొదట్లో చాలా భయపడ్డా! -
కర్నూలు ఘటన: ‘ఈ దుఖం నాతోనే ఉండిపోవాలి’
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురైన బస్సులో కరిగి ముద్దగా మారిన మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఏమని చెప్పాలి.. వారికి ఈ శరీరాన్ని ఎలా చూపాలి.. చూపితే వారు తట్టుకోగలరా.. ఇంతటి దుఃఖం మాతోనే ముగిసిపోనీ.. కర్నూలులోనే కుమారునికి అంత్యక్రియలు చేస్తాం’ అని ఆ తండ్రి బోరున విలపిస్తూ భావోద్వేగంతో చెప్పిన మాటలు కంటతడి పెట్టించాయి. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివారులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు.వీరిలో తమిళనాడులోని ధర్మపురం జిల్లా పాలక్కాడ్ తాలూకా మాదగేరి గ్రామానికి చెందిన రాజన్ మారప్పన్ కుమారుడు ప్రశాంత్ (29) కూడా ఉన్నాడు. ఇతను హైదరాబాద్లో చిప్స్ ఫ్యాక్టరీ నడుపుకుంటున్నాడు. అతడికి ఏడాదిన్నర క్రితమే వివాహం కాగా.. ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. స్వస్థలానికి వెళ్లి భార్యాపిల్లలను చూసేందుకు గురువారం రాత్రి హైదరాబాద్లో వి.కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. బస్సు కర్నూలు దాటగానే మంటల్లో కాలిపోయింది. ఇందులో ప్రశాంత్ సజీవదహనయ్యారు. సోమవారం తమిళనాడుకు చెందిన ప్రశాంత్ మృతదేహానికి కూడా కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు అధికారులను కోరారు. కర్నూలు నుంచి 800 కి.మీ. దూరంలో ఉన్న మాదగేరికి వెళ్లాలంటే రెండు రోజుల సమయం పడుతుందని.. మరణించి ఇప్పటికే మూడు రోజుల సమయం దాటిందని, ఇప్పుడు స్వగ్రామానికి వెళ్లేలోపు ఐదు రోజులు పూర్తవుతుందని తండ్రి రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కాలిపోయిన మాంసం ముద్దగా మారిన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు చూపించి వారిని మరింత క్షోభకు గురిచేయలేమని, కేవలం అస్థికలు మాత్రమే తీసుకెళ్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సద్గురుదత్త కృపాలయం గ్యాస్ క్రిమేషన్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించి అస్థికల్ని అందజేశారు. వాటిని ప్రశాంత్ తండ్రి రాజన్ మారప్పన్తో పాటు సోదరుడు మణి, స్నేహితులు తీసుకెళ్లారు. -
బైక్ను ఢీకొన్న బస్సు
యువకుడి మృతి తిరుత్తణి: బైకును బస్సు ఢీకొని యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన శోకాన్ని మిగిల్చింది. తిరువలంగాడు యూనియన్లోని నల్లాటూరు గ్రామానికి చెందిన సురేష్బాబు కుమారుడు కీర్తివాసన్(25) శ్రీపెరంబదూరులోని ప్రయివేటు కర్మాగారంలో విధులు నిర్వహించేవారు. యథాప్రకారం శనివారం బైకులో పనికి వెళ్లి రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి తిరుగు పయనమయ్యారు. చైన్నె తిరుపతి జాతీయ రహదారిలోని కనకమ్మసత్రం వద్ద ముందుగా వెళ్తున్న బైకును వెనుక వైపు వచ్చిన ప్రభుత్వ బస్సు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో కీర్తివాసన్కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న వారు కాపాడి తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంపై కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శిరువాపురిలో సూరసంహారం
తిరువళ్లూరు: స్కంధషష్టి ఉత్సవాల్లో భాగంగా శిరువాపురి మురుగన్ ఆలయంలో సోమవారం జరిగిన సూరసంహారం కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్లో చిన్నంబేడు శిరువాపురి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీబాలసుబ్రమణ్యం ఆలయం ఉంది. ఆలయంలో ప్రతి ఏటా స్కంధషష్టి ఉత్సవాలను ఏడు రోజులపాటు ఘనంగా నిర్వహించడం ఆవవాయితీ. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం పుష్పాలంకరణ నిర్వహించారు. అనంతరం 9వ కాలపూజలు, ప్రాకార ఊరేగింపు, కలఽశపూజలు, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం సాయంత్రం జోరువానలోనూ శూరసంహారం నిర్వహించారు. సూరసంహారం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. మంగళవారం ఉదయం అభిషేకం, చందనకాపు ఉత్సవం, సాయంత్రం స్వామివారికి తిరుకల్యాణం, రాత్రి ఎనిమది గంటలకు స్వామి వారి ఊరేగింపు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. -
పురాతన ఆలయంలో స్కంధషష్టి
కొరుక్కుపేట: చైన్నె జార్జిటౌన్లోని 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో స్కంధ షష్టి మహోత్సవం వైభవోపేతంగా సాగుతోంది. అందులో భాగంగా ఆరోరోజు సోమవారం సూరసంహార కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వర్షం కారణంగా ఆలయ మహామండపంలో ఈ సూరసంహార వేడుకలను చేపట్టారు. ఆలయ అర్చకులు భాస్కర పంతులు బృందం శ్రీసుబ్రమణ్యస్వామిని నెమిలి వాహనంపై వేంచేపు చేసి వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి పూజలు చేశారు. వందలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని శ్రీసుబ్రమణ్యస్వామి కృపకు పాత్రులయ్యారు. ఆలయ పాలకమండలి సభ్యులు భక్తులకు తగిన ఏర్పాటు చేసి ప్రసాద వినియోగం చేశారు. -
సర్దార్ జయంతికి యూనిటీ మార్చ్
తిరువళ్లూరు: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని తిరువళ్లూరు జిల్లాలోని ఆర్కేపేట, తిరువళ్లూరు తదితర రెండు ప్రాంతాల్లో యూనిటీ మార్చ్ పేరిట పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తిరువళ్లూరు జిల్లా యువ, మేరా భారత్ అధికారి నమ్మాల్ కృష్ణ వివరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ యువజన క్రీడా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐక్యత యాత్ర పేరిట యూనిటీ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లాలోని ఆర్కేపేట, తిరువళ్లూరు తదితర రెండు ప్రాంతాల్లో యూనిటీ మార్చ్ను నిర్వహించనున్నారు. జిల్లాలో జరిగే యూనిటీ యాత్రకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేసే కార్యక్రమం సోమవారం సాయంత్రం తిరువళ్లూరులోని క్రీడా మైదానంలో జరిగింది. కార్యక్రమానికి జిల్లా స్పోర్ట్స్ అధికారి సేతరామన్, కోఆర్డినేటర్ మీనాక్షిసుందరి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా యువజన, మేరా యువ భారత్ అధికారి నమ్మాల కృష్ణ హాజరై పోస్టర్ను విడుదల చేశారు. వివరాలను మీడియాకు వివరించారు. తిరువళ్లూరు జిల్లాలో ఆర్కేపేటలోని అన్నామలై ఆర్ట్స్ కళాశాల మైభారత్ తిరువళ్లూరు ఉమ్మడిగా స్థానికంగా ఉన్న పద్మావతి మహల్ నుంచి ఆర్కేపేట తాలూకా కార్యాలయం వరకు జరగనుంది. నవంబర్ ఐదున తిరుమురుగన్ ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాల, మైభారత్ ఉమ్మడిగా పూండి బైపాస్ నుంచి తిరువళ్లూరులోని స్పోర్ట్స్ మైదానం వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం యువతకు ఐక్యత, విలువలను తెలియజెప్పడమేనన్నారు. పాదయాత్రలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వారు మై భారత్ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోచ్చని తెలిపారు. జిల్లా స్థాయిలో యూనిటీ మార్చ్లు ముగిసిన తరువాత జాతీయ స్థాయిలో నవంబర్ 26 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు గుజరాత్ కరంసద్ నుంచి కేవడియాలోని యూనిటి ఆర్చ్ వరకు 152 కిమీ మేరకు పాదయాత్ర జరగనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి సేతురామన్, కోఆర్డినేటర్ మీనాక్షిసుందరి, ఎన్ఎస్ఎస్ డీఎల్ఓ కేశవులు, తిరుమురుగన్ కళాశాల ప్రిన్సిపల్ అముదాయి తదితరులు పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొన్న జేసీబీ
● భార్యాభర్తలు మృతి ● బంధువుల గృహ ప్రవేశానికి వెళ్తూ ఘటనఅన్నానగర్: ఓమలూరు సమీపంలో సోమవారం ఉదయం జేసీబీ వాహనం బైకును ఢీ కొట్టడంతో భార్యాభర్తలు మరణించారు. బంధువుల గృహప్రవేశానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని సిక్కం పట్టి గ్రామం పెరియకడం పట్టి ప్రాంతానికి చెందిన మురుగన్(40). ఇతని భార్య పార్వతి(32). ధర్మపురి జిల్లా పాలయంపుదూర్లో బంధువుల గృహ ప్రవేశం వేడుక కోసం సోమవారం ఉదయం ఓమలూరు నుండి బయల్దేరారు. ఓమలూరు దీవట్టి పట్టి పక్కన ఉన్న జోడుకులి దగ్గర జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, ఆ రోడ్డు వెంట ఒక జేసీబీ వాహనం వేగంగా ఆ బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ కిందపడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే దివట్టిపట్టి ఇన్స్పెక్టర్ సెంథిల్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం కోసం ఓమలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంధువుల గృహప్రవేశానికి వెళ్తుండగా భార్యాభర్తలు ప్రమాదంలో మరణించడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. -
డీఎంకే, కాంగ్రెస్ బంధం దేశానికి రక్ష
సాక్షి, చైన్నె : డీఎంకే, కాంగ్రెస్ల బంధం దేశానికి రక్ష అని, దేశాన్ని కచ్చితంగా రక్షించి తీరుతామని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. చైన్నెలోని అన్నా అరివాలయంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ నేత ఇంటి శుభ కార్య వేడుకలో స్టాలిన్ ప్రసంగించారు. డీఎంకే, కాంగ్రెస్లు కాలక్రమేనా వేర్వేరు మార్గాలలో ప్రయాణించినప్పటికీ, ప్రస్తుతం దేశ శ్రేయస్సు, సంక్షేమం కోసం ఐక్యతతో సమష్టిగా ముందడుగు వేస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీని ఈ సందర్భంగా పొగడ్తలతో ముంచెత్తుతూ, తనను ఎల్లప్పుడూ అన్నయ్యఅని పిలవడం జరుగుతోందన్నారు. ఇది కేవలం రాజకీయ స్నేహం కాదని, ఇది ఒక విధాన పరమైన సంబంధం కూడా అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే, కాంగ్రెస్లు కలిసి కట్టుగా ఈదేశాన్ని రక్షించి తీరుతాయని ధీమా వ్యక్తం చేశారు.తమకు దేశ రక్షణే ముఖ్యం అని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకత తమిళనాడులో ఎస్ఐఆర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంతో డీఎంకే కూటమి తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది. చట్టపరంగా దీనిని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే కూటమి పార్టీలు సమావేశానికి నిర్ణయించాయి. ఇదిలా ఉండగా ఎస్ఐఆర్ను అన్నాడీఎంకే ఆహ్వానించింది. న్యాయబద్ధంగా జరగాలని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కోరారు. ఇక ఎస్ఐఆర్తో బిహార్లో తొలగించిన లక్షలాది ఓట్లను ఇక్కడ(తమిళనాడు)లో చేర్పించే కుట్ర జరుగుతోందని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ధ్వజమెత్తారు. -
అందరూ సంయమనం పాటించాలి
కొరుక్కుపేట: అందరూ సంయమనం పాటించాలని తమిళనాడు లోకాయుక్త చైర్పర్సన్ జస్టిస్ పి.రాజమణిక్యం అన్నారు. సదరన్ రైల్వే ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ను పాటిస్తోంది. అందులో భాగంగా సోమవారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్ పి.రాజమాణిక్యం పాల్గొన్నారు. చైన్నెలోని సదరన్ రైల్వే ప్రధాన కార్యాలయంలో విజిలెన్స్ విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సదరన్ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్, ప్రధాన విభాగాల అధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అవేర్ నెస్ వీక్ను ప్రారంభించిన జస్టిస్ పి.రాజమాణిక్యం మాట్లాడుతూ ఈ సంవత్సరం విజిలెన్స్–మా భాగస్వామ్య బాధ్యత అనే థీమ్తో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అవినీతి, దుష్ప్రవర్తన, లంచం, నిధుల దుర్వినియోగాన్ని పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన వివిధ చట్టాల నిబంధనలను ఆయన వివరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో సదరన్ రైల్వే చురుకై న చర్యలను ప్రశంసించారు. రైల్వే కార్యకలాపాల సామర్థ్యాన్ని సమష్టిగా పెంచిన సాంకేతికత వినియోగం, నివారణ విజిలెన్స్ తనిఖీలు, వ్యవస్థాగత మెరుగుదలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్లో భాగంగా సదరన్ రైల్వే విజిలెన్స్ విభాగం ఇంటిగ్రిటీ బులెటిన్–2025ను విడుదల చేసింది. -
వీజే సిద్దూ స్వీయ దర్శకత్వంలో..
తమిళసినిమా: వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కె.గణేశ్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం డయంకరం. డిజిటల్ స్టార్గా పేరు గాంచిన వీజే.సిద్ధూ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా, దర్శకుడిగా పరిచయం కావడం విశేషం. ఈయన ఇంతకు ముందు డ్రాగన్ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించి, మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కాగా డయంకరం చిత్రం ద్వారా హీరోగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నట్టి, కాళీ వెంకట్, ఇళవరసు, నితిన్సత్య, హర్షద్ కాంత్, ఆదిత్య కధీర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. పి.దినేశ్ కృష్ణన్ ఛాయాగ్రహణం, సిద్ధుకుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలను సోమవారం ఉదయం స్థానిక నుంగంభాక్కంలోని ఎల్ఏ స్టూడియోలో ప్రారంభించారు. చిత్ర వివరాలను యూనిట్ వర్గాలు తెలుపుతూ ఇది కామెడీ ఎంటర్టెయిన్గా ఉంటుందన్నారు. నేటి యువత మనోభావాలు, ఏమోషనల్తో కూడిన హ్యూమర్ కలగలిపి అన్ని వర్గాలను అలరించే విధంగా డయంకరం చిత్రం ఉంటుందని పేర్కొన్నారు. చిత్ర ఆడియోను వేల్స్ మ్యూజిక్ ఇంటన్నేషనల్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నట్లు చెప్పారు. అదే విధంగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ చిత్ర పూజా కార్యక్రమాల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. -
ఆప్స్టేట్ మెడికల్ వర్సిటీతో వీఐటీ ఒప్పందం
వేలూరు: వేలూరు వీఐటీ యూనివర్సిటీ, అమెరికాలోని న్యూయార్క్ సిరిక్యూస్లోని ఒక ప్రభుత్వ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు వీఐటీ యూనివర్సిటీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకటనలో తెలిపిన విధంగా ఈ ఒప్పందం ఆరోగ్యశాస్త్రాలు, బయోమెడికల్ ఇంజినీరింగ్, మల్టీ డిసిప్లీనరి మెడికల్ కో–ఆపరేషన్ రంగాల్లో విద్య, పరిశోధనల్లో సహకారాన్ని సులభతరం చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకం చేసుకున్నారు. ఈ ఒప్పందంపై ఆప్స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ సి.అంబర్గ్, వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు శేఖర్ విశ్వనాథన్ సంతకం చేసుకున్నారు. ఈ ఒప్పందంతో కొత్త కొత్త పరిశోధనలు, అధ్యాపక విద్యార్థుల మార్పిడి ఉద్భవిస్తున్న బయోమెడికల్ రంగాలు, ట్రాన్స్లేషనల్ హెల్త్ కేర్ అని పిలువబడే బహుళ విభాగ వైద్య సహకారాలను సులభతరం చేస్తుంది. వీటితో పాటూ వీఐటీలోని వైద్య శాస్త్రాలు, ఇంజినీరింగ్ విభాగాన్ని వైద్య ఇంజినీరింగ్, వైద్య సాంకేతికలతో ప్రపంచ సహకారంలో కీలక పాత్ర వహిస్తుంది. అదేవిధంగా వీఐటీలోని విద్యార్థులు, ఫ్రొఫెసర్లు న్యూయార్క్లోని యూనివర్సిటీలో పలు పరిశోధనలు చేసేందుకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఇందులో వీఐటీ యూనివర్సిటీ వైద్య శాస్త్రాలు, ఇంజినీరింగ్ విభాగం డీన్ గీత ఉన్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. -
మాధవన్
మరో బయోపిక్లో తమిళసినిమా: బయోపిక్లు తెరకెక్కడం కొత్తేమీ కాదు. అయితే అన్ని బయోపిక్లో ప్రేక్షకారణ పొందడం లేదు. ఇంతకు ముందు మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్.ధోని, తమిళంలో కామరాజ్, జయలలిత తదితరుల జీవిత చరిత్రలు సినిమాగా తెరకెక్కాయి. అయితే వాటిలో కొన్ని చిత్రాలు మాత్రమే విజయం సాధించాయి. కాగా ఇంతకు ముందు ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త అంబి నారాయణన్ బయోపిక్ను రాకెట్రీ ది అంబి ఎఫెక్ట్ పేరుతో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈచిత్రంలో నటుడు మాధవన్ అంబి నారాయణన్ పాత్రను పోషించి, స్వీయ దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రం కమర్షియల్గా సక్సెస్ కావడంతో పాటూ విమర్శకుల ప్రశంసలను అందుకుని, జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకుంది. కాగా తాజాగా నటుడు మాధవన్ మరో బయోపిక్లో నటిస్తున్నారు. ఇండియన్ ఎడిసన్గా పేరు గాంచిన జీడీ నాయుడు జీవిత చరిత్రను జీడీఎన్ పేరుతో సినిమాగా తెరకెక్కుతోంది. ఈయన కోయంబత్తూర్కు చెందిన ప్రముఖుడు అన్నది గమనార్హం. పలు విషయాలను కనుగొని ఇండియన్ ఎడిసన్గా పేరుగాంచారు. ఈ చిత్రంలో జీడీ నాయుడుగా నటుడు మాధవన్ నటిస్తున్నారు. నటుడు సత్యరాజ్, జయరామ్, తంబిరామయ్య, నటి ప్రియమణి, దుషారా విజయన్, వినయ్రాయ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్న వర్గీస్ మూలన్స్ పిక్చర్స్ సంస్థతో కలిసి నటుడు మాధవన్కు చెందిన త్రికలర్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. కథ, దర్శకత్వం బాధ్యతలను కృష్ణకుమార్ రామకుమార్ నిర్వహిస్తున్నారు. గోవింద వసంత్ సంగీతాన్ని, అరవింద్.కె ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జీడీ నాయుడు స్వగ్రామం అయిన కోయంబత్తూర్లో శరవేగంగా జరుపుకుంటోంది. కాగా జీడీ నాయుడు చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ఆదివారం నటుడు మాధవన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. కారణం అందులో నటుడు మాధవన్ గుర్తుపట్టలేనంతగా జీడీ. నాయుడి గెటప్లో ఉండడమే. చిత్రాన్ని 2026లో సమ్మర్ స్పెషల్గా విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు. -
క్లుప్తంగా
ఘనంగా మహా కుంభాభిషేకం వేలూరు: వేలూరు కొత్త బస్టాండ్లోని పాలారు నది ఒడ్డున వెలసిన శ్రీఅంకాళ పరమేశ్వరి అమ్మన్ ఆలయ మహా కుంభాభిషేక వైభవం సోమవారం అతి వైభవంగా జరిగింది. ముందగా ఆలయ ప్రాంగణంలో రెండవ కాల యాగ పూజలతో పాటూ గోపూజ, గజ పూజ, లక్ష్మి పూజ, నవగ్రహ పూజ, కలశ పూజలు నిర్వహించారు. యాగ గుండం వద్ద వివిధ పుణిద నదుల నుంచి తీసుకొచ్చిన నీటిని కళశాల్లో ఉంచి వేద పండితుల వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలశ నీటిని ఆలయ రాజ గోపురం వద్దకు తీసుకెల్లి గోపురంపై కలశ నీటిని పోసి కుంభాభిషేక వైభవం నిర్వహించారు. అనంతరం కలశ నీటిని భక్తులపై చల్లారు. అనంతరం ఆలయంలో ఉంచిన అమ్మవారి విగ్రహానికి కలశ నీటిని పోసి పుష్పాలంకరణలు, దీపారాధన పూజలు చేశారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మోహన్, ఆలయ నిర్వహకులు శశికుమార్, ఆనంద్, గణేశన్, సురేష్కుమార్, సెంథిల్కుమార్, బలరామ్, కార్తీక్ పాల్గొన్నారు. రైలు ఢీకొని తండ్రీకొడుకు మృతి వేలూరు: తంజావూరు జిల్లాకు చెందిన రాజేష్(41) ఇతను తిరువలంలోని సున్నపుకారర్ వీధిలో కుటుంబ సభ్యులతో ఉంటూ హోటల్ నడుపుతున్నాడు. ఇతని కుమారుడు కిషోర్ (18) ప్రైవేటు ఇంజినీరింగ్ కళావాలలో విద్యను అభ్యసిస్తున్నాడు. తండ్రి, కొడుకు ఇద్దరూ కాట్పాడి సమీపంలోని తిరువలం వద్ద రైలు రోడ్డు దాటేందుకు యత్నించారు. ఆ సమయంలో అతి వేగంగా వచ్చిన ఎక్స్ప్రెస్ రైలు ఇద్దరినీ ఢీకొనడంతో తండ్రి, కుమారులు ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి రైలు ఇంజిన్ డ్రైవర్ కాట్పాడి రైల్యే పోలీసులకు సమాచారం అందజేయడంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం రైల్యే పోలీసులు కేసు నమోదు చేసి తండ్రి, కుమారుడు ఇద్దరూ రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందా..? లేక ఆత్మహత్య చేసుకునేందుకు రైలు ముందుకు వెళ్లారా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఎలక్ట్రీషియన్ నిజాయితీ సేలం: సేలం రెడ్డిపట్టి ప్రాంతంలో నివసిస్తున్న భాషా (58) ఎలక్ట్రీషియన్. ఆదివారం రాత్రి తన భార్య పర్వీన్తో కలిసి లీ బజార్ ప్రాంతానికి నడుచుకుంటూ వెళుతుండగా వంతెన కింద పడి ఉన్న ఓ హ్యాండ్బ్యాగ్ను చూశాడు. అందులో బంగారు తాయెత్తు, బ్రాస్లెట్, పర్సు, ఏటీఎం కార్డు, పాన్ కార్డు ఉన్నాయి. దీని తరువాత, బ్యాగ్ను దాని నిజమైన యజమానికి అప్పగించాలనే ఉద్దేశంతో, సోమవారం ఉదయం, అతని కుమారుడు ఆటో డ్రైవర్ అబ్దుల్లా, బ్యాగ్ను సేలం నగర పోలీసు డిప్యూటీ కమిషనర్ సుబ్రమణ్య బాలచంద్రకు అప్పగించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆ ఆభరణాలను నిజమైన యజమానులైన సెహ్వాయిపేట్కు చెందిన పూంగోతైకి అప్పగించి, భాషా, అతని భార్య పర్వీన్, అబ్దుల్లాలను అభినందించారు. చెరువులకు జలకళ తిరుత్తణి: ఈశాన్య రుతుపవనాలతో చెరువులు వేగంగా నిండుతున్నాయి. తిరుత్తణి సబ్ డివిజన్లో నీరు పారుదల శాఖకు చెందిన 79 చెరువులున్నాయి. చెరువునీటిపై ఆధారపడి చాలా మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. అలాగే కుశస్థలి నది భూగర్భజలాలపై ఆధారపడి నది తీర ప్రాంతాల రైతులు పంట సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చెరువులు వేగంగా నిండుతున్నాయి. తిరుత్తణి డివిజన్లో నీటి పారుదల శాఖకు చెందిన 79 చెరువుల్లో 31 చెరువులు పూర్తి సామర్థ్యం నిండాయి. ఇందులో తిరుత్తణిలో 9 చెరువులు, ఆర్కేపేటలో 16, పళ్లిపట్టులో 6 చెరువులు నిండినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని చెరువులు ఒకటి రెండు రోజుల్లో నిండనున్నట్లు తెలిపారు. చెరువులు వేగంగా నిండుతున్న క్రమంలో సాగునీటి ఎద్దడి లేకుండా పంటలకు నీరందే అవకాశం ఏర్పడడంతో రైతులు హర్హం వ్యక్తం చేస్తున్నారు. -
రోడ్ షోలకు అనుమతి లేదు
సాక్షి, చైన్నె: మార్గదర్శకాల రూపకల్పన జరిగే వరకు రాష్ట్రంలో ఎలాంటి రోడ్ షోలకు అనుమతి లేదని కోర్టులో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కరూర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం భుస్సీ ఆనంద్, నిర్మల్కుమార్లు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ఈ ఇద్దర్నీ విచారించేందుకు సీబీఐ సమన్లు జారీ చేసినట్టు సమాచారాలు వెలువడ్డాయి. కరూర్ ఘటనతో రోడ్ షోలు, బహిరంగ సభల నిర్వహణకు మార్గదర్శకాల రూపకల్పన దిశగా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కసరత్తులలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ పరిస్థితులలో సోమవారం మద్రాసు హైకోర్టులో కేసు విచారణకు రాగా, మార్గదర్శకాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. కొన్ని పార్టీలకు సభలకు అనుమతి ఇవ్వడం లేదంటూ న్యాయవాదులు వాదించారు. మార్గదర్శకాలను రూపొందించే వరకు ఎలాంటి రోడ్ షోలకు పార్టీలకు అనుమతి ఇవ్వబోమని హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో త్వరితగతిన మార్గదర్శకాల రూపకల్పనకు కోర్టు ఆదేశించింది. అలాగే ముందస్తు బెయిల్ కోసం తమిళగ వెట్రికళగం ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, సంయుక్త కార్యదర్శి నిర్మల్కుమార్లు దాఖలు చేసుకున్న పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఆ పిటిషన్ల విచారణను న్యాయమూర్తులు తిరస్కరించారు. అదే సమయంలో కరూర్ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు భుస్సీ ఆనంద్, నిర్మల్కుమార్ను విచారించేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరికి సమన్లు జారీ చేసి ఉండడం గమనార్హం. -
5 టన్నుల పుష్పాలతో షణ్ముఖర్కు పుష్పాంజలి
తిరుత్తణి: స్కంధషష్టి వేడుకల్లో ప్రధానమైన పుష్పాంజలి సోమవారం సాయంత్రం కనులపండువగా సాగింది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో 22న స్కంధషష్టి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఆరవ రోజైన సోమవారం పుష్పాలతో షణ్ముఖర్కు పుష్పార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరు, హోసూరు సహా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పుష్పాలు తీసుకొచ్చారు. అలాగే తిరుత్తణి పట్టణ పుష్పాల వ్యాపారులు సైతం స్వామి సేవకు పుష్పాలు అందజేశారు. స్థానిక సుందర వినాయకుడి ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను భక్తులు కొండ ఆలయంకు తరలించారు. సాయంత్రం 5 గంటటల సమయంలో సర్వాంగసుందరంగా అలంకరించిన షణ్ముఖర్కు అశేష భక్తజనం నడుమ దాదాపు 5 టన్నుల పుష్పాలతో స్వామికి పుష్పార్చన నిర్వహించి మహాదీపారాధన చేశారు. ఈ సందర్భంగా భక్తులు హరోంహర నామస్మరణతో స్వామిని దర్శించుకున్నారు. స్వామికి అర్చన చేపట్టిన పుష్పాలను భక్తులు పోటాపోటీగా తీసుకెళ్లారు. -
●ఆరోగ్య శిబిరాలు
ప్రముఖ ఎఫ్ఎంసీజీ గోల్డ్ విన్నర్ , కాశీశ్వరి రిఫైనరీ నేతృత్వంలో తమిళనాడు వ్యాప్తంగా ఆరోగ్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.9 కేంద్రాలలో 42 శిబిరాలను సోమవారం విజయవంతంగా నిర్వహించి, సమగ్ర ఆరోగ్య పరీక్షలను, చికిత్సను అందజేశారు. – సాక్షి, చైన్నె ●స్మార్ట్ స్టార్టప్ వెల్ టెక్ టీబీఐ స్టార్టప్, ఇన్వెస్టర్ సమ్మిట్ 2025ను స్మార్ట్ స్టార్టప్, పెట్టుబడులు – అభివృద్ధిలో ఏఐ ఉపయోగం గురించి చర్చించారు. వెల్టెక్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్, కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, ఆర్ అండ్ డీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మద్దతుతో జరిగిన ఈ సమ్మిట్కు ప్రతినిధులు గోపి కోటేశ్వరన్, గౌతమ్ సర్వేష్, గాయత్రి దేవి కల్యాణ రామన్, చేతన్ ప్రకాష్ సంచేటి, జిరామసుబ్రమణియన్, అతుల్శ్రీ,రాజేంద్రన్ హాజరయ్యారు. – సాక్షి, చైన్నె -
హన్సిక ట్రిప్.. ఎవరితో తెలుసా?
తమిళసినిమా: ఒకప్పుడు క్రేజీ కథానాయకిగా వెలిగిన నటి హన్సిక. తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో 50 చిత్రాలకు పైగా నటించిన ఈ ముంబయి భామ ఆ మధ్య సోహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఇప్పటి వరకూ ఏ ఒక్క కొత్త చిత్రంలోనూ నటించలేదు. అయినప్పటికీ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల భర్తతో వివాదాలు అంటూ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దానికి బలం చేకూర్చే విధంగా నటి హన్సిక ఇటీవల దీపావళి పండగను ఒంటరిగానే జరుపుకోవడం, వివాహం అయిన రెండేళ్లలోనే భర్తను విడిచి తల్లితోనే ఉంటున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంపై హన్సిక ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. కాగా తాజాగా ఈ అమ్మడు రాజస్థాన్లోని రంతంబోర్ జాతీయ పార్క్ను తిలకించడానికి వెళ్లారు. అయితే ఆమె ఎవరితో కలిసి వెళ్లారో తెలుసా అమ్మ, సోదరుడితో కలిసి ఆ పార్క్కు వెళ్లారు. అక్కడ పులి, కుందేలు, ఎలుగుబంటులతో ఫొటోలు దిగారు. వాటిని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ విషయం అదికాదు. ఆ పార్క్కు హన్సిక తన తల్లి, సోదరుడితో కలిసి వెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారణం ఈసారి కూడా భర్త ఆమెతో లేకపోవడమే. దీంతో హన్సిక, సోహైల్ కతూరియా మధ్య వివేధాలు అనే ప్రచారం నిజమేనని అర్థమవుతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా హన్సిక తన సోదరుడి భార్యను గృహ హింసకు గురి చేసిందే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ టాప్ హీరోయిన్ ఇలాంటి వివాదాలకు తావు ఇవ్వడంతో హన్సిక పేరు వార్తల్లో నానుతోంది. అయితే ఇలాంటివన్నీ లెక్క చేయని ఈ అమ్మడు విహార యాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నటి హన్సిక -
కాలువల ఆక్రమణలతోనే ఇళ్లలోకి నీరు
వేలూరు: కాలువలు ఆక్రమణలకు గురి కావడంతోనే వరద నీరు ఇళ్లలోకి చేరి విష పురుగుల బాధతో ఇబ్బందులు పడుతున్నట్లు కాట్పాడికి చెందిన కుటుంబ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి,వినతిపత్రం అందజేశారు. సోమవారం వేలూరు కలెక్టరేట్లో ప్రజా విన్నపాల దినోత్సవం కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. కాట్పా డి సమీపంలోని తారాపడవేడు, గోపాలపురం వంటి ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా తమ ప్రాంతంలో వర్షం వస్తే నీరు వెళ్లేందుకు కాలువ ఉండేదని ప్రస్తుతం ఈ కాలువలను పూర్తిగా ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకోవడంతో నీరు ఇళ్ల మధ్యే నిల్వ ఉంటోందన్నారు. గత రెండు రోజులుగా కార్పొరేషన్ సిబ్బంది సరి చేస్తున్నప్పటికీ నీటిమట్టం తగ్గలేదన్నారు. వీటిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. వినతులను స్వీకరించిన అధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా వినతిపత్రాలు స్వీకరించిన కలెక్టర్ అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ మాలతి, సబ్ కలెక్టర్ సెంథిల్కుమార్ పాల్గొన్నారు. -
పవిష్ హీరోగా నూతన చిత్రం ప్రారంభం
తమిళసినిమా: నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన నటుడు పవిష్. ఈయన దనుష్ సోదరి కొడుకు కావడం గమనార్హం. ఈయన గత ఆరు నెలలుగా పలు కథలు వింటూ వర్చారని, చివరికి మహేశ్ రాజేంద్రన్ చెప్పిన కథ నచ్చడంతో ఆయన దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు ఆయన వర్గం పేర్కొన్నారు. కాగా మహేశ్ రాజేంద్రన్ ఇంతకు ముందు దర్శకుడు లక్ష్మణన్ వద్ద బోగన్, బూమి చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. కాగా పవిష్ కథానాయకుడిగా నటిస్తున్న రెండవ చిత్రం సోమవారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. జీ సినిమా మీడియా అండ్ ఎంటర్టెయిన్మెంట్ అధినేత దినేశ్రాజ్, క్రియేటివ్ ఎంటర్టెయినర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత డి.ధనుంజయన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి నాగదుర్గ ఈ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అవుతున్నారు. ఈ తెలుగింటి ఆడపడుచు యూట్యూబ్లో పాపులర్ అయ్యారు. పీజీ.ముత్తయ్య ఛాయాగ్రణం అందిస్తున్న ఈ చిత్రం ద్వారా థింక్ మ్యూజిక్ సిఫార్సుతో నూతన సంగీత దర్శకుడు పరిచయం కానున్నారని, ఆయన గురించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నారు. కాగా రొమాంటిక్ లవ్ కథాంఽశంతో రూపొందుతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు నటుడు ధనుష్ తండి దర్శకుడు కస్తూరి రాజా ముఖ్య అతిథిగా పాల్గొని యూనిట్కు శుభాకాంక్షలు అందించారు. చిత్ర షూటింగ్ను 2026 ఆరంభంలో పూర్తి చేసి సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి ప్రణాళికను రచించినట్లు నిర్మాతలు పేర్కొన్నారు. చిత్రం ఈ తరం యువతతో పాటూ కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. -
ఆదవ్కు.. ప్రమోషన్?
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగంలో ఆదవ్ అర్జునకు పదోన్నతి కల్పించేందుకు అధ్యక్షుడు విజయ్ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆయనకు ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న భుస్సీ ఆనంద్కు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పార్టీ పూర్తి బాధ్యతలు అప్పగించ బోతున్నట్టు సమాచారం. వివరాలు.. 2026 అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా సినీ నటుడు విజయ్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఆయన అభిమానులే పార్టీలో అధికంగా ఉన్నారు. జిల్లాలోని ముఖ్య అభిమాన నేతలకు పదవులను అప్పగించారు. పార్టీ పరంగా 120 జిల్లాలను ఏర్పాటు చేసి, కార్యదర్శులు,ఇతర నిర్వాహకులను నియమించారు. అలాగే, సుమారు 20కు పైగా అనుబంధ సంఘాలను సైతం ఏర్పాటు చేసి పార్టీ పరంగా కార్యక్రమాలు విస్తృతం చేశారు. తాను సైతం అంటూ ప్రజలలోకి చొచ్చుకెళ్తున్న సమయంలో కరూర్ లో చోటు చేసుకున్న పెను విషాదం ప్రచార పర్యటనకు కాస్త బ్రేక్ వేసింది. దీంతో పార్టీ పరంగా కొన్ని కీలక మార్పునకు విజయ్ నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ప్రధానంగా కొన్ని జిల్లాలో కార్యదర్శులను మార్చడమే కాకుండా, రాష్ట్ర స్థాయి కమిటీలోనూ కొన్ని కీలక మార్పునకు నిర్ణయించినట్టు చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆది నుంచి విజయ్ వెన్నంటి ఉంటూ వస్తున్న ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ను కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి రాజకీయాలకు పరిమితం చేయనున్నట్టు సమాచారం. ఆయన స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జునకు అప్పగించే అవకాశాలు ఉన్నట్ట్టు చర్చ ఊపందుకుంది. అలాగే, పార్టీ రాష్ట్ర స్థాయిలో కీలక పదవులలో ఉన్న వారిని సైతం మార్చి, రాజకీయంగా వ్యాఖ్యల తూటాలను పేల్చగలిగే వారిని నియమించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. -
హరో.. హర
రాష్ట్రంలోని తమిళ్ కడవుల్ ఆరుపడై వీడులన్నీ హరోం ..హర నామస్మరణతో సోమవారం మిన్నంటింది. భక్తుల జయ జయ ధ్వానాలు, హరోహర..., కందా.., వేలా.. నామస్మరణ మధ్య మురుగన్ సన్నిధుల్లో సూర సంహార ఘట్టం కనుల పండువగా సాగింది. ఇందులో తిరుచెందూరు సాగర తీరంలో అద్వితీయ ఘట్టం లక్షలాది మంది భక్తుల నడుమ జరిగింది. జయంతి నాథర్ సూరుడిని సంహరించిన ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించారు. సాక్షి, చైన్నె: తమిళ్ కడవుల్ మురుగన్కు ప్రసిద్ధి చెందిన ఆరుపడై వీడులు తమిళనాడులోనే ఉన్న విషయం తెలిసిందే. తిరుప్పర కుండ్రం ముత్తుకుమార స్వామిగా, పలముదిర్ చోళైలో మురుగన్గా, తిరుత్తణిలో బాలసుబ్రమణ్యన్గా, పళని దండయుధ పాణిగా, స్వామి మలైలో స్వామినాథన్, తిరుచెందూరులో జయంతి నాథర్గా కొలువై ఉన్న తమిళ్ కడవుల్కు స్కంధ షష్టి ఉత్సవాలు గత వారం రోజులుగా ఘనంగా జరుగుతూ వస్తున్నాయి. ఈ ఉత్సవాలలో ఆరవ రోజైన సోమవారం ఆలయాలలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు జరిగాయి. సూర సంహార ఘట్టాల అద్వితీయంగా జరిగాయి. అలాగే ఈరోడ్ గోబి చెట్టి పాళయం పచ్చమలై మురుగన్ ఆలయంలో , తేని కంబం సురులి వేలు అప్పన్ ఆలయం, మేల్ మలయనూరు మురుగన్ ఆలయం, కంచి వెల్లకోట్టై మురుగన్ ఆలయం, వడపళణి సుబ్రమణ్య స్వామి ఆలయాలలో సైతం స్కంధ షష్టి ఉత్సవాలలో భాగంగా సూరుడ్ని స్వామి వారు సంహరించే ఘట్టాలు జరిగాయి. ఈ సమయంలో హరోం..హర నామస్మరణ మిన్నటింది. తిరుచెందూరులో.. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ ఏటా స్కంధషష్టి అత్యంత వేడుకగా జరుగుతాయి. ఈ ఏడాది ఉత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. తొలి రోజున లక్షలాది మంది భక్తులు వత్రాన్ని ఆచరించి ఆలయ పరిసరాలలోని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఆరు రోజుల పాటూ ఆలయ పరిసరాల్లో భక్తిశ్రద్ధలతో పూజల్ని నిర్వహించిన భక్తులు సోమవారం తమ వ్రతాన్ని వీడారు. ఈ ఆరు రోజులు ఆలయంలో రోజూ విశిష్ట పూజలు, అభిషేకాలు జరిగాయి. సర్వాలంకరణలతో సెంథిల్ ఆండవర్, జయంతి నాథర్గా పిలవబడే మురుగన్ స్వామి వారు వళ్లి, దేవయాని సమేతంగా భక్తులకు దర్శనం ఇస్తూ వచ్చారు. స్కంధ షష్టి ఉత్సవాల్లో ఆరో రోజున అత్యంత ముఖ్య ఘట్టం సాగర తీరంలో అద్వితీయంగా జరిగింది. ఈ ఘటాన్ని తిలకించేందుకు ఆదివారం రాత్రి నుంచే నుంచే లక్షల్లో భక్తులు తిరుచెందూరుకు తరలి వచ్చారు. సముద్ర తీరం ఒడ్డున భక్తులు కూర్చుని ఈ ఘటాన్ని తిలకించే అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సముద్రంలోకి ఎవ్వరూ చొచ్చుకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తగా బారికెడ్లను ఏర్పాటు చేశారు. పడవలు, బోట్ల నుంచి భద్రతను పర్యవేక్షించారు. వేకువ జాము నుంచే.. వేకువ జామున ఒంటి గంటకు ఆలయంలో పూజాది కార్యక్రమాలు మొదలయ్యాయి. అభిషేయాలు, యాగాది పూజలతో స్వామివారి విశ్వరూప దర్శనాన్ని భక్తులకు దక్కింది. ఆలయ సంతోష మండపంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు సాగినానంతరం సూర సంహార ఘట్టానికి ఏర్పాట్లు చేశారు. భక్త జనం కందా...వేలా, హరోం..హర అన్న నామ స్మరణను మిన్నంటేలా నినదించడంతో పట్టు వస్త్రాలు ధరించి, వేలా యుధంను చేతబట్టి స్వామి వారు సాగర తీరం వైపుగా కదిలారు. ఈ సూరసంహార ఘట్టానికి పురాణాలలో ఉన్న ప్రత్యేక కథను చాటే విధంగా వేడుక కనుల పండువగా సాగింది.సూర సంహార ఘట్టం కనులపండువగా.. తారకాసురుడు అనే రాక్షసుడి ఆగడాలను అరికట్టేందుకే సుబ్రహ్మణ్య స్వామి భూమి మీద అవతరించినట్టు పురాణాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకు సుబ్రమణ్య స్వామిని తమిళ్ కడవుల్(తమిళ దేవుడు) అని భక్తులు పిలవడం జరుగుతోంది. పురాణ గాథను చాటే విధంగా జరిగిన అద్వితీయ ఘట్టాన్ని తిలకించేందుకు వచ్చిన భక్త జనంతో తిరుచెందూరు పులకించింది. ఆలయం, ఒడ్డు సముద్రంలోకి కలిసిందా..? అన్నట్టుగా పరిసరాలు మారాయి. ఇసుక వేస్తే రాలనంతంగా భక్తులు తరలి వచ్చి సూర సంహార ఘటాన్ని తిలకించారు. భక్త జన సమూహం మధ్యలోకి స్వామి వారు పచ్చ పట్టు, వజ్రాభరణాలను ధరించి రాగానే, శూరుడు(తారకాసురుడు) తన వీరంగాన్ని ప్రదర్శించే విధంగా క్షణాలలో వివిధ అవతరాలను మార్చుకుంటూ స్వామివారి సహనాన్ని పరీక్షించే రీతిలో ముందుకు సాగాడు. ఓపికగా సూరుడి వీరంగాలను వీక్షించిన స్వామివారు చివరకు తన వెండి వేలాయుధంతో సంహరించిన ఘట్టాన్ని చూసిన భక్తులు జయ జయ ధ్వానాలతో , హరో హర అంటూ, కందా...వేలా అన్న నినాదాల్ని మార్మోగించారు. సూర సంహార ఘట్టం అనంతరం భక్తులు సముద్ర స్నానం చేసిన ఆలయ సమీపంలోని నాలుగు బావి వద్దకు చేరుకుని ఆ నీటిని చల్లుకున్నారు. తదుపరి ఆలయంలో స్వామి వారి దర్శనానికి బారులుదీరారు. సముద్రం ఒడ్డున ఉన్న ఈ నాలుగు బావి నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. మిగిలిన చోట్ల నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ బావి నీటిని భక్తులు నెత్తిన చల్లుకుని ఆలయంలోకి వెళ్లడం ఆనవాయితీ. మలేషియా, సింగపూర్, శ్రీలంక వంటి దేశాలతో పాటూ తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు ఈ అద్వితీయ ఘటాన్ని ప్రత్యక్షంగా తిలకించినట్టు అంచనా. సూర సంహారం తదుపరి స్వామి వారికి అద్దాల భవనంలో విశేష అభిషేకాలు, పూజలు జరిగాయి. మంగళవారం అమ్మ వారి తపస్సు, స్వామి, అమ్మవార్ల వివాహ మహోత్సవం జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తూత్తుకుడి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. పోలీసులు నిఘాతో వ్యవహరించారు. రైల్వే, రవాణా సంస్థలు ప్రయాణీల కోసం ప్రత్యేక బస్సులు, రైళ్లను నడిపాయి. -
శ్రమ, ప్రతిభకు గుర్తింపే.. డిగ్రీపట్టా
సాక్షి, చైన్నె: ‘డిగ్రీపట్టా అనేది కేవలం ఒక కాగిత ముక్క మాత్రం కాదు..మీ శ్రమకు ఫలితం. మీ జ్ఞానానికి మీ ప్రతిభకు గుర్తింపు. ఇది కుటుంబంలోని అనేక తరాల కల...దీనిని సాకారం చేసుకోవడం వెల కట్టలేని ఆనందకర క్షణం’ అని విద్యార్థులను ఉద్దేశించి సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. తిరుచ్చిలోని భారతీ దాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (బీఐఎం) 33వ గ్రాడ్యుయేషన్ సోమవారం చైన్నెలో జరిగింది. మ్యూజిక్ అకాడమి వేదికగా జరిగిన ఈ వేడుకకు సీఎం ఎంకే స్టాలిన్ హాజరయ్యారు. 197 మందికి డిగ్రీలు, పతకాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి శంకర్, భారతీ దాసన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ చైర్మన్ రవి అప్పాస్వామి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు బాల భాస్కర్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎస్. జయకృష్ణ, పోసు్ట్రగాడ్యుయేట్ విభాగాధిపతి రాఘవేంద్ర, భారతీదాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ నిర్వాహకులు తదితరులు హాజరయ్యారు. జీవితం ఉజ్వలమయం.. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఎం ఎంకేస్టాలిన్ మాట్లాడుతూ ఇక్కడ పట్టభద్రులైన విద్యార్థులకు ఈ రోజు చాలా ముఖ్యమైనదని పేర్కొంటూ, ఈ జీవిత ప్రయాణంలో చేతిలో ఉన్న ’డిగ్రీ’ కేవలం కాగితం ముక్క కాదని, శ్రమకు ఫలితం, జ్ఞానం, ప్రతిభకు గుర్తింపు అని వ్యాఖ్యలు చేశారు. విద్యారంగంలో జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థానాన్ని బీఐఎం కలిగి ఉన్నట్టు వివరించారు. ఇక్కడ చదువుకున్న వారెందరో విద్య, వ్యాపారం, సామాజిక రంగాలలో ఉన్నత స్థానాలలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ జాబితాలో ఇక్కడున్న విద్యార్థులు సైతం ఉండాలని ఆకాంక్షించారు. దేశంలోనే ఉన్నత విద్యకు ఉత్తమ రాష్ట్రంగా తమిళనాడు అవతరించి ఉందన్నారు. ఉన్నత విద్యా పరంగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో అత్యుత్తమ విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయని వివరించారు. ఉన్నత విద్య కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తున్నట్టు గుర్తు చేస్తూ, ట్యూషన్ ఫీజు రాయితీలు, కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటు, పేద, సామాన్య విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను దరి చేర్చడమే కాకుండా, ప్రభుత్వం అమలు చేస్తున్న అల్పాహార పథకం, పుదుమైపెన్, తమిళ్ పుదల్వన్,నాన్ మొదల్వన్ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మహాకవి తిరువళ్లువర్ రచించిన తిరుక్కురల్లోని అనేక సూక్తులను విశదీకరించారు. ఇందులోని జీవిత పాఠాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, మరిచి పోకూడదని, ఏ కష్ట సమయంలో నైనా, నిజాయితీ, నమ్మకం, బాధ్యత వంటి విలువలు అనుసరించాలనిపిలుపునిచ్చారు. -
అలరించిన సురంజనా బోస్ సంగీత విభావరి
కొరుక్కుపేట:.శాసీ్త్రయ సంగీత కళలను పరిపోషిస్తున్న విశ్వకళా సంగమ ఆధ్వర్యంలో కలకత్తాకు చెందిన విధూషి సురంజనా బోస్ హిందుస్తానీ సంగీత విభావరితో అలరించింది. చైన్నె తిరువాన్మయూర్లోని కళా క్షేత్ర కళాశాల ప్రాంగణంలోని ఠాగూర్ హాల్ వేదికగా ఆదివారం రాత్రి హిందుస్తానీ సంగీత కచ్చేరి ఏర్పాటు చేశారు. విదూషి సురంజనా బోస్ దాదాపు 2 గంటల పాటూ హిందుస్తానీ కచేరితో సంగీత ప్రియులను మంత్రముగ్దులను చేశారు. ఆమె ఇంకా రాగశ్రీ రాగంలో సజ్ రంగ్ అనే పాట, పీలూతుమ్రీ, మాండ్ రాగంలో భజనల్లోని ప్రత్యేకమైన గీతాలు ఆలపించి శ్రోతలను పరవశింపజేశారు. ఆమెకు వాయిద్య సహకారాన్ని హార్మోనియంపై సందీప్ గుర్ములే, తబలాపై రామ్ ఖాద్సే అందించారు. ఈ సందర్భంగా కళాకారులను విశ్వకళా సంగమ వ్యవస్థాపకులు ఊరా లక్ష్మీ నరసింహారావు శాలువాలతో సత్కరించి అభినందించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వకళా సంగమ గత 25 సంవత్సరాలుగా హిందుస్తానీ సంగీతానికి పెద్దపీట వేస్తుందన్నారు. నార్త్ ఇండియా నుంచి గొప్పగొప్ప కళాకారులను తీసుకుని వచ్చి హిందుస్తానీ కచేరిలతో సంగీత ప్రియులను మైమరిపింప జేస్తున్నట్టు తెలిపారు. విశ్వకళా సంగమ 26 వ వార్షిక సంగీతోత్సవాలు రానున్న డిసెంబర్ 19 నుంచి 21వ తేది వరకు మూడు రోజులుపాటూ చైన్నె ఆళ్వార్ పేటలోని నారథగాన సభ వేదికగా నిర్వహిస్తామన్నారు. 250 రోజులు పూర్తి చేసుకున్న నిత్యాన్నదానం కొరుక్కుపేట: రాష్ట్ర ముఖ్య మంత్రి ఎం.కె. స్టాలిన్ 72వ పుట్టినరోజు సందర్భంగా 365 రోజలుపాటూ నిత్య అన్నదాన ప్రాజెక్టును దేవాదాయశాఖ మంత్రి పీకే శేఖర్ బాబు ప్రారంభించారు. ఫిబ్రవరి 19, 2026 వరకు, సంవత్సరంలో 365 రోజుల పాటూ వివిధ ప్రదేశాలలో రోజుకు సగటున 1000 మందికి అల్పాహారం అందించాలని ప్రణాళిక రచించారు. ఈ గొప్ప ప్రాజెక్టును మంత్రి పి.కె. శేఖర్బాబు నేతృత్వంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ చేతులమీదుగా కొళత్తూరులో ప్రారంభించారు. ఈ కార్యక్రమం సోమవారంతో 250వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. దీంతో కొలత్తూర్ వెస్ట్ ఏరియా, 64వ వార్డు కొలత్తూర్, ఎ.ఓ. కాలనీ 36వ కట్ రోడ్, లక్ష్మీ ఫార్మసీ దగ్గర , 64వ వార్డు, కొలత్తూర్ మెయిన్ రోడ్, టీచర్స్ గిల్డ్ రోడ్, మూకాంబిక అమ్మన్ ఆలయానికి సమీపంలోఏర్పాటు చేస్తున్నారు .ఈ కార్యక్రమానికి మంత్రి శివ మెయ్యనాథన్ ప్రత్యేక అతిథిగా హాజరై ప్రజలకు అల్పాహారం వడ్డించారు. ఈ అద్భుతమైన ప్రాజెక్టుకు ప్రజల నుండి మంచి ఆదరణ లభించింది. -
‘మోంథా’ జాగ్రత్తలు సిద్ధం
సాక్షి, చైన్నె: మోంథా తుపాన్తో రాష్ట్రంలోని అన్ని హార్బర్లలో ప్రమాద సూచికలను ఎగురవేశారు. అధికార యంత్రాంగం ముందు జాగ్రత్తలు సిద్ధం చేశారు. ఎంతపెద్ద వాన వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ధీమా వ్యక్తంచేశారు. ఈశాన్య రుతు పవనాలతో నేపథ్యంలో బంగాళాఖాతంలో మోంథా తుపాన్ ఉత్తర తమిళనాడులో పూర్తిగా వాతావరణాన్ని మార్చేసింది. విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, చైన్నె, రాణిపేట, వేలూరు, తిరువళ్లూరు జిల్లాలో సోమవారం ఉదయం నుంచి చిరు జల్లులతో వర్షం పడుతూ వచ్చింది. మోంథా ఆంధప్రదేశలోని కాకినాడలో తీరాన్ని మంగళవారం దాటుతున్నప్పటికీ, ఇది చైన్నెకు సమీపంలో ప్రయాణించే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేశారు. దీంతో చెంగల్పట్టు, కాంచీపురం, చైన్నె, తిరువళ్లూరు తదితర జిల్లాలలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అధిక ప్రభావం తిరువళ్లూరు జిల్లాపై ఉండేందుకు అవకాశాల నేపథ్యంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. సోమవారం రాత్రి సమయానికి చైన్నెకు 450 కి.మీ దూరంలో మోంథా కేంద్రీకృతమై, గంటకు సమారు 18 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్టు వాతావరణ అధికారులు ప్రకటించారు. ఈ ప్రభావంతోభారీ వర్షం పడ్డ పక్షంలో ముంపుప్రాంతాలలో బాధితులను ఆదుకునేందుకు ముందు జాగ్రత్తలు చైన్నె, శివారులలో సిద్ధం చేశారు. సిద్ధంగా ఉన్నాం.. ఉదయం నుంచి అధికారులు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రులు ఎం. సుబ్రమణియన్, కేఎన్ నెహ్రు, శేఖర్బాబు, మేయర్ ప్రియ తదితరులు వేర్వేరుగా చైన్నెలో ఉరకలు పరుగులతో ముందు జాగ్రత్తలను పరిశీలించారు. వ్యాసార్పాడి, తండయార్ పేట పరిసరాలలో డిప్యూటీ సీఎం పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ మోంథా తుపాన్ తమిళనాడుపై పెద్ద ప్రభావం ఉండదని భావించినా, ముందు జాగ్త్రతలు విస్తృతం చేసి ఉంచామన్నారు. ఉత్తర చైన్నె, తిరువళ్లూరులలో 8 సెం.మీ మేరకు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచనతో అందరం సమష్టిగా ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధమై ఉన్నామన్నారు. ఎంతపెద్ద వాన వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇదిలా ఉండగా వర్షాల సీజన్ నేపథ్యంలో రవాణా సంస్థ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. డ్రైవర్లు బస్సులను జాగ్రత్తగా నడపాలని, ప్రయాణీకుల భద్రతకు భరోసాకల్పించాలని సూచించారు. సురక్షిత ప్రయాణం దిశగా వర్షాల సమయంలో బస్సులను నడపాలని, ఎక్కడైనా రోడ్లపై అధిక నీరు ప్రవహిస్తున్నట్టు గుర్తిస్తే, తక్షణం సమాచారాలు ఇవ్వాలని, ప్రయాణికులకు పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు డ్రైవర్లు సిద్ధమై ముందడుగు వేయాలని సూచించారు. ఇక వర్షాల నేపథ్యంలో చైన్నెలో 405 శాశ్వత వైద్య శిబిరాలు, 166 మొబైల్ వైద్య శిబిరాల ద్వారా వైద్య సేవల విస్తృతానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆహారం, వైద్యం, తాగునీటి సౌకర్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కాగా, రెవెన్యూశాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, ఇతర అధికారులు ఎళిలగంలోనిస్టేట్ కంట్రోల్రూమ్కు పరిమితమయ్యారు. మోంథా కదలికను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వర్ష ప్రభావం ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటుందో ముందే గ్రహించి విస్తృత చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు.కూలిన చెట్టు తొలగింపు -
కరూర్ బాధిత కుటుంబాలకు విజయ్ ఓదార్పు
తమిళ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్ ఎట్టకేలకు కరూర్ బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. సోమవారం మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో వాళ్లను పరామర్శించి.. ఓదార్చి.. పరిహారం అందజేశారు. ఈ నేపథ్యంతో ఆ పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.కరూర్ తొక్కిసలాటకు నేటితో సరిగ్గా నెల రోజులు పూర్తైంది. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఈ ఘటన తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయ్.. బాధిత కుటుంబాలకు టీవీకే తరఫున పరిహారం కూడా ప్రకటించారు. అయితే అప్పటి నుంచి కరూర్ వెళ్లేందుకు ఆయనకు పోలీసుల నుంచి అనుమతి లభించడం లేదు. దీంతో.. దీంతో బాధిత కుటుంబాలనే మహాబలిపురంలోని ఓ రిసార్ట్కు రప్పించారు. బాధిత కుటుంబాల కోసం రిసార్ట్లో టీవీకే పార్టీ 50 గదులను బుక్ చేసింది. వాళ్లందరినీ విడివిడిగా కలిసి విజయ్ పరిహారం అందిస్తున్నారు. కరూర్లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది (Karur Stampede). ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందని ఆరోపిస్తూ.. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అటుపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణ కమిటీ ఆ దర్యాప్తును ఎప్పటికప్పుడు సమీక్షించనుంది. ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు (SOP) రూపొందించేవరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది.


