breaking news
Tamil Nadu
-
100 రోజులు ఆడిన శ్రీలీల మూవీ.. ఇప్పుడు తమిళంలో..
వైరల్ వయ్యారి శ్రీలీల (Sreeleela) త్వరలో శివకార్తికేయన్కు జంటగా పరాశక్తి చిత్రంతో తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. దీనికంటే ముందు 'కిస్ మీ ఇడియట్' అనే చిత్రంతో తమిళ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఇది ఆమె కన్నడంలో నటించిన రెండవ చిత్రం కిస్కు రీమేక్ కావడం గమనార్హం. కన్నడలో కిస్ మూవీ 2019లో విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. విరాట్ కథానాయకుడిగా నటించిన ఇందులో రోబో శంకర్, నాంజిల్ విజయమన్, అస్వతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఏపీ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జయశంకర్ రామలింగం ఛాయాగ్రహణం, ప్రకాష్ నిక్కి సంగీతాన్ని అందించారు. కథేంటంటే?మాతృకకు పనిచేసిన డైరెక్టర్ అర్జున్ తమిళ వర్షన్కూ పని చేస్తున్నారు. కిస్ మీ ఇడియట్ చిత్రం సెప్టెంబర్ 26వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు మీడియాకు వెల్లడించాడు. 'కాలేజీలో చదువుకునే శ్రీలీల తన తోటి విద్యార్థులతో కలిసి ఆట పట్టించినందుకు గాను ప్రిన్సిపల్ ఆమెను తరగతి గది నుంచి ఒక రోజు బహిష్కరిస్తాడె. దీంతో కోపంతో బయటికి వచ్చిన శ్రీలీల కళాశాల వెలుపల ప్రిన్సిపల్ ఫొటో ఉన్న బ్యానర్పై రాయి విసురుతుంది. ఆ రాయి అటుగా వస్తున్న విరాట్ కారుపై పడటంతో అద్దం పగులుతుంది. తప్పని స్థితిలో..దీంతో శ్రీలీలను విరాట్ నష్టపరిహారంగా రూ.4 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తాడు. అంత డబ్బు తన వద్ద లేదని శ్రీలీల ప్రాధేయ పడితే ఒక ముద్దు ఇవ్వు లేదా తన వద్ద రెండు నెలలు సహాయకురాలిగా పనిచేయమని చెబుతాడు. దీంతో శ్రీలీల అతని వద్ద రెండు నెలలు సహాయకురాలుగా పనిచేయడానికి అంగీకరిస్తుంది. అలా శ్రీలీల విరాట్పై ప్రేమ పెంచుకున్న తరుణంలో గడువు పూర్తి కావడంతో ఆమెను పని నుంచి తొలగిస్తాడు. ఆ తర్వాత ఆమె లేకుండా తాను ఉండలేనన్న భావన విరాట్కు కలుగుతుంది అలాంటి వారి ప్రేమ ఫలించిందా ? లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కిస్ మీ ఇడియట్ రూపొందింది అని దర్శకుడు చెప్పారు. -
పార్క్ స్థలం ఆక్రమణపై కౌన్సిల్లో ఫిర్యాదు
తిరువళ్లూరు: పార్క్ స్థలం అక్రమణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ థామస్ డిమాండ్ చేయగా, ఆక్రమణలపై ప్రశ్నించవద్దని పిర్యాదు చేసిన కౌన్సిలర్కు లంచం ఎరచూపిన వ్యవహరంపై ఆడియో ప్లే చేయడంతో కలకలం రేపింది. తిరువళ్లూరు మున్సిపాలిటి సమావేశం చైర్పర్సన్ ఉదయమలర్ పాండ్యన్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి కమిషనర్ దామోదరన్, వైస్ చైర్పర్సన్ రవిచంద్రన్తో పాటూ అన్ని శాఖలకు చెందిన అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే రోడ్లు, తాగునీటి సదుపాయం, సబ్వే మురుగునీటి స్టోరేజ్ కేంద్రం నుంచి నీరు బయటకు వెళ్లడానికి పైపుల అమరిక లాంటి సమస్యలపై చర్చించారు. అనంతరం కౌన్సిలర్ థామస్ రాజ్కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీకి చెందిన విలువైన పార్క్ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని విక్రయించారు. పార్క్ స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడానికి మున్సిపల్ అధికారులే అనుమతి ఇచ్చి భారీగా లబ్ధిపొందారు. ఈ విషయంపై గత మున్సిపల్ ఎన్నికల్లో తాను ప్రశ్న లేవనెత్తితే వారిపై చర్యలు తీసుకోకుండా కొందరు అధికారులు తన వద్దకు స్థలాన్ని ఆక్రమించుకున్న వ్యక్తిని రాయబారానికి పంపారు. ఇకపై పార్క్ స్థలం ఆక్రమణపై నోరు మొదపవద్దని తననూ ఫోన్లో కోరడంతో పాటూ భారీగా లంచం ఆశచూపారని వివరించారు. అయితే థామస్ లేవనెత్తిన ఆరోపణలపై కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాము ఎవ్వరిని రాయభారానికి పంపలేదని, కౌన్సిలర్ చేసిన పిర్యాదుపై త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో మళ్లీ కౌన్సిలర్ లేచినిలబడి తాను చేసిన ఆరోపణలు అవాస్తమని కమిషనర్ సమాధానమిచ్చారు. కానీ నాతో మాట్లాడిన ఆడియో ఉందంటూ కౌన్సిల్ సమావేశంలో ఆడియోనూ ప్లేచేయడంతో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. విషయంపై జోక్యం చేసుకున్న చైర్పర్సన్, త్వరలోనే పార్క్ స్థలం ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో శానిటరీ అధికారి మోహన్ కౌన్సిలర్లు అరుణ, సుమిత్ర పాల్గొన్నారు. -
తిరుత్తణిలో మీతో స్టాలిన్
తిరుత్తణి: తిరుత్తణి మున్సిపల్ పరిధిలోని 20, 21వ వార్డులకు సంబంధించి మీతో స్టాలిన్ పథకం శిబిరం శనివారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో 13 శాఖల అధికారులు, 43 రకాల వైద్య సేవలకు సంబంధించి శిబిరం నిర్వహించారు. శిబిరంలో 20, 21 వార్డులకు సంబంధించి స్థానికులు పాల్గొని ఆయా శాఖల అధికారులకు దరఖాస్తులు అందజేశారు. శిబిరంలో మున్సిపల్ చైర్పర్సన్ సరస్వతి, వైస్ చైర్మన్ సామిరాజ్ పాల్గొని ప్రారంభించారు. శాఖల వారీగా ఏర్పాట్లను పరిశీలించి, అర్జీలకు సంబంధించిన అర్హులకు ప్రభుత్వ సర్టిపికెట్లు చైర్పర్సన్ సరస్వతి అందజేశారు. ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహించిన శిబిరంలో మహిళలకు హక్కు పథకం ద్వారా రూ. వెయ్యి మాసాంతర ఆర్థిక సాయం, ఉచిత ఇంటి పట్టాలు, రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు, రెవెన్యూ సర్టిఫికెట్లు సహా వివిధ సేవలకు సంబంధించి 754 దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
బ్లాక్మెయిల్కి పాజిటివ్ టాక్
తమిళసినిమా: నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బ్లాక్ మెయిల్. శ్రీకాంత్, బిందు మాధవి, తేజు, అశ్విని, లింగ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం.మారన్ కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. జేడీఎస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై అమల్రాజ్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది దీన్ని జి. ధనుంజయన్కు చెందిన క్రియేటివ్ ఎంటర్టైనర్స్ సంస్థ తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేసింది. కథ వాస్తవానికి ఈ చిత్రం కావాల్సింది అయితే ఆలస్యంగా విడుదలైన మంచి జరిగిందనే ఆనందాన్ని నిర్మాతల వర్గం వ్యక్తం చేస్తుంది. బ్లాక్మెయిల్ చిత్రానికి క్రిటిక్స్ నుంచి సద్వివిమర్శలు రావడంతో పాటూ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రిపోర్ట్ వస్తోందని ఎగ్జిబిటర్లు పేర్కొనడం విశేషం. ఓ ప్రముఖ ఎగ్జిబిటర్ బ్లాక్ మెయిల్ చిత్రం గురించి తన స్పందన వ్యక్తం చేస్తూ బ్లాక్ మెయిల్ చిత్రానికి మొదటి రోజు నుంచి ప్రేక్షకుల రాక అధికం అయిందని పేర్కొన్నారు. ఆసక్తికరమైన కథ, కథనాలు, మనసును కదిలించే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నట్లు ప్రేక్షకులు పేర్కొంటున్నారని చెప్పారు. చిత్రానికి ప్రేక్షకుల రాక అధికం అవుతుండడంతో అధిక షోలను ప్రదర్శించాలని నిర్ణయించినట్లు ఆ ఎగ్జిబిటర్ పేర్కొన్నారు. చిత్తానికి మంచి ఆదరణ లభించడంతో నిర్మాతల వర్గం తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చిత్ర విడుదల ఆలస్యమైన తమకు మంచి జరిగిందనే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని నిర్మాత అమల్ రాజు పేర్కొన్నారు. -
83 శాతం అర్జీల పరిష్కారం
సాక్షి, చైన్నె: మీతో స్టాలిన్ శిబిరాలతో 83 శాతం విజ్ఞప్తులు పరిష్కరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల వద్దకే ప్రభుత్వ పథకాలను దరి చేర్చే దిశగా, వివిధ సేవలను ముంగిటకు తీసుకెళ్తూ మీతో స్టాలిన్ శిబిరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. అధికారులు, కార్యాలయాల చుట్టు జనం తిరగాల్సిన పని లేకుండా ఈ శిబిరాలు మరింత దోహదకరంగా మారి ఉన్నాయి. 46 రకాల ప్రభుత్వ సేవలు ఈ శిబిరాల ద్వారా అందిస్తున్నారు. వీటికి వచ్చే ఫిర్యాదులను సీఎం స్టాలిన్ స్వయంగా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. మరో రోజులో తొలి విడత శిబిరాల ప్రక్రియను ముగించి, మలి విడత దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఈ పరిస్థితులలో శనివారం ఈ శిబిరాలలో వచ్చిన ఫిర్యాదులు తదితర అంశాలపై సీఎం స్టాలిన్ ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించారు. పరిష్కారాలు.. ఈ శిబిరాల ద్వారా 14,54,517 దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చినట్టు , ఇందులో 7,23,482 పరిష్కరించినట్లు సమీక్షలో తేలింది. మరో 5,97,534 పరిగణనలోకి తీసుకుని ఉండడంతో ఈ శిబిరాల ద్వారా 83 శాతం అర్జీలను క్లియర్ చేసినట్లు వెల్లడించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖ, సహకార శాఖ, ఆది ద్రావిడర్ సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ , గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ శాఖలకు వచ్చిన విజ్ఞప్తులపై మరింత శ్రద్ధ వహించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ రంగంలో రైతు ప్రయోజనాల దిశగా సమస్యలు వెంటనే పరిష్కరించ బడాలని ఆదేశించారు. రేషన్ కార్డులలో చిరునామా మార్పునకు సంబంధించ్లి, ఇంటి, స్థల పట్టాలకు సంబంధించిన విజ్ఞప్తులను అత్యవసరంగా పరిగణించాలని సూచించారు. కలైంజ్ఞర్ మహిళా హక్కు పథకానికి మరింత ప్రాధాన్యతను ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రజల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, అదనపు ప్రధాన కార్యదర్శి అముద, ఆర్థిక శాఖ కార్యదర్శి టి. ఉదయచంద్రన్, తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సీఎం స్టాలిన్ ఆదివారం కృష్ణగిరిలో పర్యటించనున్నారు. ఇక్కడ రోడ్ షో నిర్వహణకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా, డీఎంకేను తాకడం ఎవరి తరం కాదని, డీఎంకే అంటే ఒక ఉద్యమం అని పేర్కొంటూ, సీఎం స్టాలిన్ కేడర్కు లేఖ రాయడం గమనార్హం. డీఎంకే నీడను ఎవ్వరు తాకను కూడా తాకలేరని హెచ్చరించారు. -
క్లుప్తంగా
వ్యాపారవేత్త దారుణ హత్య అన్నానగర్: మధురైలోని పార్క్ టౌన్ 2వ వీధి నివాసి రాజ్ కుమార్. నగరంలోని మునిచలై ప్రాంతంలో పార్శిల్ సర్వీస్ కంపెనీని నడుపుతున్నాడు. ఇతని భార్య పేరు చంద్రకళ. వీరికి సందీప్ అనే కుమారుడు ఉన్నాడు. రాజ్ కుమార్ శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తన భార్యకు ఫోన్ చేసి, ‘‘ఆఫీస్ పని అయిపోయింది, నేను దుకాణానికి వెళ్లాలి. ప్రధాన రహదారికి రా.. షాపింగ్ తర్వాత, ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్లవచ్చు’’ అని చెప్పాడు. దీని తర్వాత, చంద్రకళ ఇంటికి వెళ్లడానికి ప్రధాన రహదారిపైకి వెళ్లారు. తర్వాత తన భర్త ద్విచక్ర వాహనం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ రాజ్కుమార్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో చనిపోయి పడి ఉన్నాడు. దీనితో షాక్కు గురైన చంద్రకళ కేకలు వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు రాజ్కుమార్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఈ హత్య వృత్తిపరమైన శత్రుత్వం వల్ల జరిగిందా లేదా మరేదైన కారణం అనే దానిపై కేసు నమోదు చేసి, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 100 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు కొరుక్కుపేట: చెన్నపురి దేవాంగ సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న దేవాంగ డెవలప్ మెంట్ ఫండ్ తరపున 100 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, మెరిట్ అవార్దులు అందజేశారు. చైన్నె పాత చాకలి పేట బసవయ్య వీధిలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ప్రార్థన మందిరం వేదికగా శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్యులు డాక్టర్ కె. షణ్ముగం, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్ న్యూఢిల్లీ (న్యాయ) సభ్యులు మన్ని కె షణ్ముగసుందరం, పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్, ఎరుక్కువోయ్ –తిరువళ్లూరు జిల్లా ప్రధానోపాధ్యాయులు మూలికి షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ కార్యవర్గ సభ్యుల సమక్షంలో 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. విద్యార్థినిపై అత్యాచారం కేసులో తండ్రి, ప్రియుడి అరెస్టు అన్నానగర్: పొల్లాచ్చి సమీపంలో పాఠశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆమె తండ్రి, ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన రాజన్ (58) (పేరు మార్చాం) తన కుటుంబంతో కోయంబత్తూర్ జిల్లాలోని పొల్లాచ్చి సమీపంలోని ఓ గ్రామంలో నివసించి కూలీగా పనిచేసేవాడు. ఇతని 15 ఏళ్ల కుమార్తె ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆ విద్యార్థిని పొల్లాచ్చి బస్టాండ్ సమీపంలో నివసిస్తూ ఆ ప్రాంతంలోని ఓ టీ దుకాణంలో పనిచేసే కవియరసన్ (21) ప్రేమించుకుంటున్నారు. కవియరసన్ ఆ అమ్మాయితో లైంగికంగా ప్రవర్తించి, ఆమెను వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లి, ఆమైపె అత్యాచారం కూడా చేశాడు. ఈ విషయం అమ్మాయి తండ్రికి తెలిసింది. అతను దానిని ఉపయోగించి బాలికను బెదిరించి, ఆమెను తన కుమార్తైపెనే అత్యాచారం చేశాడు. దీని తరువాత, బాలిక పొల్లాచ్చి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో, విద్యార్థినిపై ఆమె తండ్రి, కవియరసన్ అత్యాచారం చేశారని తేలింది. తదనంతరం, విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఆమె తండ్రి, ఆమె ప్రియుడు కవియరసన్ను పోలీసులు అరెస్టు చేసి, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి కోయంబత్తూరు సెంట్రల్ జైల్కు తరలించారు. లైంగిక దాడి కేసులో వృద్ధుడికి 20 ఏళ్ల జైలు అన్నానగర్: బాలికను లైంగికంగా వేధించిన వృద్ధుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విరుదునగర్ జిల్లాలోని కరియాపట్టి గ్రామానికి చెందిన పంచ పాండి (51). 2023లో ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు ఆధారంగా, అరుప్పుకోటై ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. శ్రీవిల్లిపుత్తూరులోని జిల్లా పోక్సో కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత, న్యాయమూర్తి పుష్పరాణి శనివారం తీర్పు వెలువరించారు. అందులో, బాలికను లైంగికంగా వేధించిన పంచపాండికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 30 వేల జరిమానావిధించారు. భవనంపై నుంచి పడి ప్రభుత్వ బస్సు డ్రైవర్ మృతి అన్నానగర్: చైన్నెలోని ఒరగడం, అంబత్తూరులోని ఎస్.వి. నగర్ ప్రాంతంలో నివసించే జాన్ ఫెర్నాండెజ్ (47) ప్రభుత్వ బస్సు డ్రైవర్. శుక్రవారం రాత్రి తన ఇంటి మొదటి అంతస్తును శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో అతను తనకు తెలియకుండానే మొదటి అంతస్తు నుంచి పడిపోయాడు, తలకు బలమైన గాయం అయ్యి, తీవ్ర రక్తస్రావం కావడంతో అతను ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇది చూసిన అతని భార్య రోజ్ మేరీ జాన్ ఫెర్నాండెజ్ను రక్షించి, సమీపంలోని ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందిన తర్వాత, తదుపరి చికిత్స కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్చింది. అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న జాన్ ఫెర్నాండెజ్ చికిత్స అందక శనివారం వేకువజామున మరణించాడు. ఈ ఘటనపై అంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లగేజీ వ్యాన్ను ఢీకొన్న ప్రభుత్వ బస్సు
వేలూరు: లగేజీ వ్యాన్ను ప్రభుత్వ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తిరువణ్ణామలై జిల్లా సెంగం సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. సెంగం నుంచి తిరువణ్ణామలైకి ప్రభుత్వ బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. బస్సు తిరువణ్ణామలై సమీపంలోని మేల్ఆన్మలై వద్ద వెళుతుండగా తిరువణ్ణామలై నుంచి బెంగళూరు వెళుతున్న లగేసీ వ్యాన్ను అతి వేగంగా డీకొంది. ఈ ప్రమాదంలో మినీ లగేజీ వ్యాన్ డ్రైవర్ మణి(27) అక్కడికక్కడే మృతిచెందాడు. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సెంగం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో మృతుడు మణి, అతనితో వచ్చిన వారందరూ తిరువణ్ణామలైకి చెందిన వారుగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేపాల్ నుంచి 116 మంది రాక
●తమిళులను రక్షించిన తమిళనాడు ప్రభుత్వం కొరుక్కుపేట: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు, నేపాల్లో చిక్కుకున్న తమిళుల పరిస్థితిని పర్యవేక్షించడానికి, వారికి అవసరమైన సహాయం అందించడానికి, వారిని తిరిగి తీసుకురావడానికి న్యూఢిల్లీలోని తమిళనాడు హౌస్లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ , నేపాల్లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయంతో తమిళనాడు ప్రయాణికులను తిరిగి తీసుకురావడానికి న్యూఢిల్లీ , తమిళనాడు హౌస్ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. నేపాల్ను సందర్శించిన తమిళనాడు నుంచి 116 మంది సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇంకా నేపాల్లో చిక్కుకున్న తమిళులు తమ వివరాలను అందించడానికి, నేపాల్లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యుల పరిస్థితిని తెలుసుకోవడానికి న్యూఢిల్లీలోని తమిళనాడు హౌస్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించవచ్చని టెలిఫోన్ నంబర్ 011–24193300, మొబైల్ నంబర్: 928951 6712, prcofficetnh@fmai.com,tnhour-e@tn.gov.in ద్వారా మరిన్ని వివరాలు పొందవచ్చునని ప్రభుత్వం పేర్కొంది. స్టాలిన్ ఆరోగ్య సంరక్షణ శిబిరం కొరుక్కుపేట: చైన్నె కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాలిన్ వైద్య శిబిరం మాధవరం మండలం 29వ వార్డు జీఎన్ డీలోని ప్రైవేట్ కళాశాల ఆవరణలో జరిగింది. మంత్రి సుబ్రమణియన్ పాల్గొని హెల్త్ కేర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన సీఎం స్టాలిన్ ఆరోగ్య శిబిరంలో ప్రజలకు అందిస్తున్న కేంద్రాలను సందర్శించి, చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత, ముఖ్యమంత్రి సమగ్ర వైద్య బీమా కార్డు , వికలాంగులకు గుర్తింపు కార్డులు జారీ చేశారు. కార్మిక సంక్షేమం నైపుణ్యాభివృద్ధి శాఖ తరపున, ఆయన అసంఘటిత కార్మికులకు సంక్షేమ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. మాధవరం మున్సిపల్ కౌన్సిల్ అసిస్టెంట్ గణేశన్, జోనల్ కమిటీ చైర్మన్ నందగోపాల్, చంద్రన్, కౌన్సిలర్లు కార్తికే ఏలు మలై, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్రికెటర్ అశ్విన్, దర్శకుడు వెట్రిమారన్కు.. గౌరవ డాక్టరేట్లు ప్రదానం కొరుక్కుపేట: క్రికెటర్ అశ్విన్, దర్శకుడు వెట్రిమారన్కు గౌరవ డాక్టరేట్లును వేల్స్ ఇన్స్టిట్యూట్ తరపున ప్రదానం చేశారు. చైన్నెలోని పల్లవరంలో ఉన్న వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆట్స్ 15వ స్నాతకోత్సవం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరై క్రికెట్లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ అశ్విన్, సినీ పరిశ్రమలో అద్భుత విజయం సాధించిన శ్రీ గోకులం గ్రూప్ వ్యవస్థాపకుడు ఛైర్మన్ ఎ.ఎం. గోపాలన్, అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి జాతీయ అవార్డులు గెలుచుకున్న దర్శకుడు వెట్రి మారన్కు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మొత్తం 4,992 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వేల్స్ ఎడ్యుకేషన్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రీతా గణేష్, రిజిస్ట్రార్ డాక్టర్.పి.శరవణన్, వైస్ ఛాన్సలర్ డాక్టర్.ఎం.భాస్కరన్, అసోసియేట్ ఛాన్సలర్ డాక్టర్.ఎ.జ్యోతి మురుగల్, ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. 15 నుంచి మురుగునీటి శుద్ధి కేంద్రం మూత తిరువొత్తియూరు: గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ తరపున జీవా రైల్వే మురుగునీటి ప్రధాన పంపింగ్ పైప్లైన్ మార్పిడి పనుల కారణంగా సెప్టెంబర్ 15, 16 తేదీల్లో పురసైవాక్కం మురుగునీటి శుద్ధి కేంద్రం పనిచేయదని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు చైన్నె మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు విడుదల శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మురుగునీటి ప్రధాన పంపింగ్ పైప్లైన్ను మార్చే పనులు చేపడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
రామన్న, అన్బుమణికి పోలీసుల చెక్
సాక్షి, చైన్నె: వివాదాలకు కేంద్రంగా మారిన పీఎంకేలోని రాందాసు, అన్బుమణి రాందాసులకు ఇక చెక్పెట్టే దిశగా పోలీసులు వ్యూహాలకు పదును పెట్టారు. ఈ ఇద్దరి వివాదంతో కేడర్రెండుగా చీలి ఎక్కడికక్కడ కయ్యానికి కాలుదువ్వుతుండటాన్ని పరిగణించి వీరి నేతృత్వంలో జరిగే వేర్వేరు కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకూడాదన్న నిర్ణయానికి వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్య జరుగుతున్న సమరంలో క్లైమాక్స్కు చేరిన విషయం తెలిసిందే. అన్బుమణిని పార్టీ నుంచి రాందాసు తొలగించారు. తనను తొలగించే అధికారం ఎవ్వరికీలేదంటూ అన్బుమణి దూకుడు ప్రదర్శిస్తున్నారు.ఈ పరిణామాలతో రాందాసు, అన్బుమణి మద్దతుదారులు కయ్యానికి కాలు దువ్వే విధంగా దూకుడుగా ముందుకెళ్తున్నారు. వన్నియర్ సంఘం, పీఎంకే సమావేశాలు అంటూ వేర్వేరుగా కార్యాచరణలో ఉంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దిండివనం వన్నియర్ సంఘం కార్యాలయం ఆవరణలో జరిగిన రగడను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు రాందాసు, అన్బుమణిలకు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకున్నారు. వీరి కార్యక్రమంలో దిండివనంలో వన్నియర్ సంఘం నేతృత్వంలో జరిగే వేడుకలో రాందాసు, అన్బుమణి పాల్గొనకుండా నిషేధం విధించే విధంగా ఆ జిల్లా కలెక్టర్కు పోలీసు యంత్రాంగం సిఫార్సులు చేయడం గమనార్హం. -
ప్రభుత్వ బస్సు అద్దాలు ధ్వంసం
తిరుత్తణి: ప్రభుత్వ బస్సు కండెక్టర్పై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసిన ఘటనకు సంబందించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుత్తణి పోలీసుల కథనం మేరకు.. పొదటూరుపేట ప్రభుత్వ బస్సు డిపోకు చెందిన రూట్ నెంబర్ 27బి టౌన్బస్సు శనివారం సాయత్రం 5.10 గంటలకు తిరుత్తణి బస్టాండు నుంచి మహాన్ కాలికాపురానికి బయల్దేరింది. బస్సు డ్రైవర్గా పద్మనాభన్, తాత్కాలిక కండెక్టర్గా నరేష్ విధులు నిర్వహించారు. బస్సులో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా వుండడంతో పాటూ విద్యార్థులు సైతం ప్రయాణం చేశారు. కొంతమంది విద్యార్ధులు పుట్బోర్డులో వేలాడుతూ.. కంబీలు పట్టికుని ప్రమాదకరంగా ప్రయాణం పట్ల కండెక్టర్ విద్యార్థులను లోపలికి రావాలని హెచ్చరించడంతో వారు కండెక్టర్తో గొడవకు దిగి దాడిచేసి బస్సు నుంచి దిగి వెళ్లిపోయారు. కొంత సేపటికి బైకుపై బస్సును వెంబడించి వెనుక వైపు అద్దాలు ధ్వంసం చేసి పరారయ్యారు. ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మరో బస్సులో ప్రయాణికులను పంపించి కండెక్టర్పై దాడిచేసి అద్దాలు ధ్వంసం చేసిన విద్యార్థులకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నాన్ మొదల్వన్ మరింత విస్తృతం
సాక్షి, చైన్నె : నాన్ మొదల్వన్ పథకం మేరకు నైపుణ్యాభివృద్ధి సంస్థ, బహ్రెయిన్ అహ్లియా విశ్వవిద్యాలయంతో పాటూ మరికొన్ని విద్యా సంస్థల మధ్య శనివారం ఒప్పందాలు జరిగాయి. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో మరికొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. చైన్నెలోని నందంబాక్కం వర్తక కేంద్రంలో అంతర్జాతీయ తమిళ ఇంజినీర్స్ ఫోరం కార్యక్రమం జరిగింది. తమిళనాడు నైపుణ్యాభివృద్ధి సంస్థ, బహ్రెయిన్కు చెందిన అహ్లియా విశ్వవిద్యాలయంతో కలిసి నాన్ మొదల్వన్ పథకం కార్యక్రమాలను విస్తృతం చేసే దిశగా ఇందులో ఒప్పందాలు జరిగాయి. విద్యార్థులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించడానికి ఈ ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ తమిళ ఇంజినీర్స్ అసోసియేషన్ సమావేశంలో విద్యా, శిక్షణా ఒప్పందాలు జరగడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు మెరుగైన శిక్షనతో ఉపాఽధి, ఉద్యోగ అవకాశాల కల్పన నాన్ మొదల్వన్ లక్ష్యంగా గుర్తు చేస్తూ ఇటీవల సీఎం స్టాలిన్ విదేశీ పర్యటన గురించి వివరించారు. ఎవరికి వారు వారి వారి రంగాలలో నిపుణులు అని పేర్కొంటూ, ఇంజినీర్లు మల్టీ–టాలెంటెడ్ పర్సన్స్ అని కితాబు ఇచ్చారు. దేశంలోనే అత్యధిక మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారని గుర్తు చేస్తూ, ఇందులో తమిళనాడు మరింత ముందంజలో ఉందన్నారు. ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్య కాదు, విద్యార్థులకు మెరుగైన శిక్షణతో ఉద్యోగ కల్పనలోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు వివరించారు. టైడల్ పార్క్, ఐటీ కారిడార్లు, ఆటోమొబైల్ హబ్ల రూపకల్పతో ఉపాధి అవకాశాలు విస్తృతం అయ్యాయన్నారు. తమిళనాడు, తమిళ సమాజం అభివృద్ధే లక్ష్యంగా విస్తృత పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మంత్రులు శివశంకర్, అన్బిల్ మహేశ్ పొయ్యామొళి, అంతర్జాతీయ తమిళ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సి. సెల్వం, పి. కృష్ణ జగన్, అహ్లియా విశ్వవిద్యాలయ అధ్యక్షుడు డాక్టర్ మన్సూర్ అలాలి, కువైట్ ప్రజా రవాణా ప్రతినిధి మన్సూర్ అల్ సయీద్, మాల్దీవుల ఆర్థిక అభివృద్ధి మాజీ మంత్రి, ఫయేజ్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా వీరపాండియన్
సాక్షి, చైన్నె : రాష్ట్ర సీపీఐ కార్యదర్శి ఎం వీరపాండియన్ నియమితులయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ముత్తరసన్ వ్యవహరిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పదవీ కాలం ముగియడంతో కొత్త కార్యదర్శి ఎంపిక శనివారం జరిగింది. చైన్నె చూలైమేడులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి టీ రాజా, జాతీయ కార్యదర్శులు కె నారాయణ, అనిరాజా, ముత్తరసన్తో పాటుగా 110 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఇందులో కామేడ్ర్ ఎం. వీర పాండియన్ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఇది వరకు ఆయన డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరించే వారు. 40 సంవత్సరాలు ఆయన సీపీఐకు సేవలు అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయ్యారు. వీర పాండియన్రాష్ట్ర కార్యదర్శిగానే ఎన్. పెరియ స్వామి, టీఎం మూర్తి, పి పద్మావతి, కె శాంతనం, వహిద నిజాం, శివపుణ్యం, ఎం రవి, రామస్వామి, ఆర్ముగం, కన్నగి, రవీంద్రనాఽథ్, సెల్వరాజ్, టీ రామచంద్రన్, తదితర 31 మంది రాష్ట్ర కార్యనిర్వహఖ కమిటీని నియమించారు. ఈసందర్భంగా కొత్త కార్యదర్శికి డీఎంకే అధ్యక్షుడు , సీఎం స్టాలిన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగంతో పాటుగా డీఎంకే కూటమి పార్టీల నేతలు శంభాకాంక్షలు తెలియజేశారు. -
చోరీ సెల్ఫోన్లు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు
వేలూరు: చోరీ చేసిన సెల్ఫోన్లను కొనుగోలు చేసినా, విక్రయించిన సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మయిల్వాగనం అన్నారు. వేలూరు జిల్లా వ్యాప్తంగా సెల్ఫోన్లు పోగొట్టుకున్న యజమానులకు సెల్ఫోన్లు అప్పగించే కార్యక్రమం ఎస్పీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం సీఈఐఆర్ వంటి పోర్ట్ల్ ద్వారా గుర్తించిన సుమారు రూ. 50 లక్షల విలువ చేసే మొత్తం 250 సెల్ఫోన్లను వాటి యజమానులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇది వరకే తొమ్మిది విడతలుగా సెల్ఫోన్లను గుర్తించి వాటి యజమానులకు అప్పగించామన్నారు. ఇప్పటి వరకు రూ. 3 కోట్ల 38 లక్షల 94,400 విలువ చేసే సెల్ఫోన్లను కనిపెట్టడం జరిగిందన్నారు. చోరీ చేసిన సెల్ఫోన్లను సెల్ఫోన్ దుకాణదారులు కొనుగోలు చేస్తున్నారని, ఇకపై చోరీ సెల్ఫోన్లను కొన్నా, విక్రయించినా కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో సెల్ఫోన్లు చోరీ జరగడం కొంత వరకు తగ్గిందన్నారు. ఇటీవల కాలంలో అధికంగా సెల్ఫోన్లో బ్యాంకు ఎటీఎం, ఆధార్ కార్డు, ఫొటో వంటి వాటి ఫొట్లోను భద్రపరుచుకుంటున్నారని, దీంతోసెల్ఫోన్ చోరీ చేసిన వారు సులభంగా బాధితుల బ్యాంక్ ఖాతాను కూడా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. వీటిపై యజమానులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం యజమానులకు సెల్ఫోన్లను అప్పగించారు. ఆయనతో పాటూ అదనపు ఎస్పీలు అన్నాదురై, భాస్కరన్, ఇన్స్పెస్పెక్టర్ రజనీకాంత్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్కుమార్, మలర్ తదితరులున్నారు. -
మయూర వాహనంపై.. సుబ్రహ్మణేశ్వరుడి చిద్విలాసం
తిరుత్తణి: ఆవణి నెల కృత్తిక సందర్భంగా శుక్రవారం రాత్రి ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామి మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు. వివరాలు..తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆవణి నెల కృత్తిక సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు తిరుత్తణికి చేరుకున్నారు. చాలా మంది ఆడికృత్తిక సందర్భంగా కావళ్లు చెల్లించలేని పరిస్థితుల్లో ఆవణి కృత్తిక సందర్భంగా కావళ్లు చెల్లించేందుకు కొండ ఆలయంకు పోటెత్తారు. మెట్ల మార్గంలో కొండకు భక్తులు చేరుకోగా, ఘాట్రోడ్డులో వాహనాల రద్దీ నె లకొంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం తెల్ల వారు వరకు భక్తజనంతో పాటూ హారంహర నామస్మరణ నెలకొంది. రాత్రి 8 గంటలకు శ్రీవళ్లి, దేవసేన సమేత ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామి విశిష్ట పుష్పలంకరణలో వెండి నెమలి వాహనంలో కొలువుదీరారు. మాడ వీధుల్లో అశేష సంఖ్యలో గుమిగూడిన భక్తజనం నడుమ స్వామికి కర్పూర హారతుతో మాడ వీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా భక్తులు స్వామిని దర్శించుకుని పరవశం చెందారు. ఉదయం నుంచి రాత్రి వరకు 70 వేల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉచిత క్యూలైన్లో స్వామి దర్శనానికి 3 గంటల సమయం పట్టగా, రూ. 100 ప్రత్యేక దర్శన మార్గంలో రెండు గంటల సమయంలో స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. -
కాంతారలో ప్రత్యేక పాట కోసం..
తమిళసినిమా: కన్నడంలో రూపొందిన కాంతార చిత్రం కర్ణాటకలోనే కాకుండా అన్ని దేశవ్యాప్తంగా అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని హోమ్ బలే సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆ చిత్రానికి ఫ్రీక్వెన్సీగా కాంతారా చాప్టర్– 1 పేరుతో అత్యంత భారీ బడ్జెట్లో బ్రహ్మాండంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేక పాటను ఇటీవల రికార్డ్ చేశారు. ఆ పాటను జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత నటుడు, గాయకుడు దిల్జిత్ దోసంజ్ పాడడం విశేషం. ఈ సందర్భంగా ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కాంతారా వంటి అద్భుతమైన చిత్రాన్ని రూపొందించిన తన సోదరుడు రిషబ్ శెట్టికి తన ప్రణామాలు అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. అదేమిటి అన్నది ఇప్పుడే చెప్పలేనని అయితే వారాహరూపం అనే పాట ధ్వనిస్తున్నప్పుడు మాత్రం ఆనందభాష్వాలు వచ్చాయన్నారు. ఇకపోతే త్వరలో తెరపైకి రానున్న కాంతార చాప్టర్ –1 లో పాడిన అనుభవం మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు బి. అజనీష్ లోకనాథ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. ఒక్క రోజులోనే ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. దీంతో నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి, గాయకుడు దిల్జిత్ దోసంజ్, హోమ్ బలే ఫిలిమ్స్ కాంబోలో రూపొందిన ఈ చిత్ర ఆల్బమ్పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రం అక్టోబర్ రెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. -
పోషకాహార అవగాహన డ్రైవ్
సాక్షి, చైన్నె : జాతీయ పోషకాహార వారోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో డయాలసిసి క్లినిక్స్ నేతృత్వంలో అవగాహన డ్రైవ్ను విజయవంతంగా నిర్వహించారు. కిడ్నీ సంరక్షణ దిశగా అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్లో భాగంగా ఉన్న అపోలో డయాలసిస్ వైద్యుల బృందం వారం రోజులు ఈ డ్రైవ్ ను నిర్వహించింది.విద్యా కార్యక్రమాలు, రోగులకు అవగాహన అంటూ మల్టీ ఛానల్ అవగాహన ప్రచారాలను సైతం నిర్వహించారు. అపోలో డయాలసిస్ క్లినిక్స్ సీఓఓ ఎం సుధాకరరావు, నెఫ్రాలజిస్టు డాక్టర్ నిత్య శ్రీ నందగోపాల్, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ అగర్వాల్ నేతృత్వంలో విజయవంతంగా ఈ డ్రైవ్ సాగింది. ఈ సందర్భంగా శనివారం వారు ఈ డ్రైవ్ విజయవంతం గురించి పేర్కొంటూ, విద్యా వీడియోలు, వెబినార్లు, రోగికి సంబంధించిన అంశాలు,రోగుల సంరక్షకులకు అనుసరించాల్సిన ఆరోగ్య అంశాలు, ఇలా అనేక అవగాహన కార్యక్రమాలతో ముందుకెళ్లామని వివరించారు. -
ఇంటి స్థలాలు కేటాయించాలని నిరసన
సేలం: జూలై 10న నామక్కల్ జిల్లాలోని వరుకూరం పట్టి ప్రాంతంలో 33 మంది ట్రాన్స్జెండర్ మహిళలకు నివాస స్థలాలను కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో వారు శనివారం స్థలాన్ని సందర్శించడానికి వెళ్లిన ట్రాన్స్జెండర్ మహిళలను గ్రామస్తులు ఆపి, భూమికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వారు తమ ఉత్పత్తులను ఎండబెట్టడానికి, మేకలు, పశువులను మేపడానికి, వ్యవసాయ అవసరాలకు భూమిని ఉపయోగిస్తున్నారని, ఆ భూమిని ట్రాన్స్జెండర్ మహిళలకు ఇవ్వకూడదని నినాదాలు చేశారు. నల్ల జెండాలు ఊపి నిరసన తెలిపారు. ఈ నిరసన కారణంగా ఆ ప్రాంతంలో దాదాపు మూడు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయనా రెవెన్యూ శాఖ సర్వేయర్లు తమ సర్వే పనులను పూర్తి చేయడం గమనార్హం. -
కోలీవుడ్లో సత్తాచాటుతున్న యువ నటుడు
తమిళసినిమా: ఏ రంగంలోనైనా ప్రతిభే ప్రామాణికం. పట్టుదలతో ప్రయత్నిస్తే ఫలితం కచ్చితంగా ఉంటుంది. అలా స్వయం కృషితో ఎదుగుతున్న యువ నటుడు సిద్ధార్ధ శంకర్. డాక్టర్ కావాలని యాక్టర్ అయిన నటుల్లో ఈయన ఒకరు. మలేషియాలో పుట్టి పెరిగిన తమిళ కుటుంబానికి చెందిన ఈయన డాక్టర్ విద్యను రెండేళ్లు చదివి ఆ తర్వాత నటనపై ఆసక్తి కలగడంతో వైద్య విద్యను మధ్యలోనే ఆపేసి నటుడుగా అవతారం ఎత్తారు. కోరిక తనకు కొంచెం ముందే కలిగితే యాక్టింగ్ డాన్సింగ్ ఫైటింగ్ రంగాలలో శిక్షణ తీసుకునే వాడినని అవేవీ లేకుండానే నటుడిగా మారినట్లు సిద్ధార్థ శంకర్ పేర్కొన్నారు. అయితే ఆ తరువాత నటుడు నాజర్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందినట్లు చెప్పారు. ఆయన కళ్లతో చక్కని హావభావాలు పలికించగలనని తనను ప్రశంచించారన్నారు. అలా విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన సైతాన్ చిత్రంతో తాను నటుడిగా పరిచయం అయినట్లు చెప్పారు. మలేష్ యాదవ్ ఒక మిత్రుడి ద్వారా విజయ్ అంటోని పరిచయమయ్యారని, ఆ తర్వాత తామిద్దరం తరసు జిమ్లో కలుసుకునేవారమని చెప్పారు. అప్పుడు ఆయన్ని అవకాశాల కోసం అడిగే వాడినని అలా సైతాన్ చిత్రంలో కీలకపాత్రను పోషించే అవకాశాన్ని కల్పించారని చెప్పారు. ఆ తర్వాత కొలై, గడారం కొండాన్, ఐంగరన్,నిలావుక్కు ౠన్ మేల్ ఎన్నడీ కోపం,మదరాసి చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న మంచి కథ పాత్రల్లో నటించినట్లు చెప్పారు. అదేవిధంగా హిందీలో పరం సుందరి చిత్రంలో నటి జాన్వీ కపూర్కు జంటగా నటించినట్లు చెప్పారు. గుడారం కొండాన్ చిత్రం షూటింగ్ సమయంలో విక్రమ్తో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్కు తాను చిన్నతనం నుంచి అభిమానినని, మదరాసి చిత్రాల్లో శివకార్తికేయన్, విద్యుత్ జమ్వాల్, బిజీ మీనన్, రుక్మిణి వసంత్ వంటి స్టార్స్తో నటించడం మంచి అనుభవమని, వారినుంచి చిన్న చిన్న విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. హీరోగా అవకాశాలు వేస్తే నటించడానికి రెడీ అన్నారు. తెలుగు వంటి ఇతర భాషల్లోనూ నటించాలని ఉందనే ఆకాంక్షను సిద్ధార్థ శంకర్ వ్యక్తం చేశారు. -
క్లుప్తంగా
అత్తిమాంజేరిపేటలో జాతర సందడి పళ్లిపట్టు: అత్తిమాంజేరిపేటలో ఐదురోజుల గంగమ్మ జాతర శనివారం వేడుకగా ముగిసింది. అత్తిమాంజేరిపేటలో గంగమ్మ జాతరను శనివారం కోలాహలంగా నిర్వహించారు. జాతరలో భాగంగా శుక్రవారం నెల్లికుండ్రం, శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంగీత విభావరి, మనస్సుకు నచ్చిన పాటలు, ఆధ్యాత్మికత నిండిన పాటలకు సంబంధించి నిర్వహించిన పాటల పోటీలు గ్రామీణులను అమితంగా ఆకట్టుకున్నాయి. జాతరను గ్రామీ ణులకు వినోదాన్ని ఆస్వాదించే కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిన లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్లు కదిరవన్, రామచంద్రన్, నెల్లికుండ్రం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శరవణన్, కార్యదర్శి కోవలన్, కోశాధికారి భూపతి, పారిశ్రామికవేత్త దేవరాజ్ ఘనంగా సత్కరించారు. మహిళకు లైంగిక వేధింపులు – యువకుడి అరెస్ట్ తిరువొత్తియూరు: వేళచ్చేరిలో మహిళ స్నానం చేస్తున్న సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. చైన్నెలోని వేలచ్చేరి ప్రాంతంలో 35 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమె తన ఆడపిల్లతో కలిసి ఇంట్లోని బాత్రూంలో స్నానం చేస్తుండగా, పక్క ఇంట్లో నివసిస్తున్న ఎడ్విన్ అనే యువకుడు ఆమె స్నానం చేస్తుండగా తొంగిచూసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై బాధితురాలు వేలచ్చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపి ఎడ్విన్ను అరెస్టు చేశారు. ఆమ్నీ బస్సు స్వాధీనం వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని క్రిష్టియన్ పేటలోని ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఆర్టీఓ చెక్పోస్టు ఉంది. ఇక్కడ ఆంధ్రా నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తుంటారు. ఈక్రమంలో శనివారం ఉదయం ఎంవీఐ సుమేష్ ఆధ్వర్యంలో చెక్పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహంచారు. ఆ సమయంలో ఆంధ్రా నుంచి నుంచి వచ్చిన ఆమ్నీ బస్సు పత్రాలను తనఖీ చేశారు. రిజిస్టర్లోని నంబర్, ఆమీ బస్సు నంబర్ వేర్వేరుగా కనిపించాయి. రిజిస్టర్ నంబర్ను పరిశీలించగా అది మహారాష్ట్ర నంబర్గా తేలింది. ఆంధ్ర, విజయవాడకు చెందిన ఒకరు బస్సును కొనుగోలు చేసి నకిలీ తమిళనాడు నంబర్ స్టిక్కర్ అతికించి తిరువణ్ణామలైకి ప్రయాణికులకు తీసుకొస్తున్నట్లు తెలిసింది. నకిలీ రిజిస్ట్రేషన్తో వచ్చిన ఆమ్నీ బస్సును స్వాధీనం చేసుకొని ఆర్టీఓ కార్యాలయానికి తరలించారు. కార్మికుల ఆందోళన తిరువొత్తియూరు: తిరువొత్తియూరు టైర్ ఫ్యాక్టరీ వద్ద 2వ రోజు కూడా కార్మికుల నిరసన, ప్రవేశ ద్వారం వద్ద నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు..తిరువొత్తియూరు విమ్కో నగర్లోని ఓ ప్రైవేట్ టైర్ ఫ్యాక్టరీలో సుమారు 850 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వైద్య బీమా పథకానికి డబ్బు ఇవ్వడానికి యాజమాన్యం నిరాకరించడంతో కార్మికులు సమ్మె చేపట్టారు దీనితో, యాజమాన్యం కార్మికులను కంపెనీకి తీసుకురావడానికి, వెనక్కి పంపడానికి ఏర్పాటు చేసిన బస్సు, క్యాంటీన్ వంటి ప్రాథమిక సౌకర్యాలను నిలిపివేసింది. దీంతో కార్మికులు శుక్రవారం నిరసన తెలిపారు. దానిని కొనసాగిస్తూ, శనివారం ఉదయం కార్మికులు పనికి వచ్చినప్పుడు ఫ్యాక్టరీ గేటు తెరవలేదు. దీనిని ఖండిస్తూ, కార్మికులు 2వ రోజు ప్రవేశ ద్వారం వద్ద కూర్చుని నిరసన నినాదాలు చేశారు. యాజమాన్యం గేటు తెరవాలి.. వైద్య బీమా నిధిని అందించాలి.. అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. కాగా ఈ విషయంపై కార్మిక సంఘం, పోలీసులు కలిసి యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షల విరాళం తిరుమల: తమిళనాడు రాష్ట్ర మంత్రి కెఎన్ నెహ్రూ టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షలు శనివారం విరాళంగా అందించారు. నవంబర్ 9న తన పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు అన్నప్రసాదం వితరణకు అయ్యే ఖర్చు రూ 44 లక్షలు విరాళం ఇచ్చారు. ఆయన ప్రతినిధి సురేష్ శనివారం తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. -
జన జాతర!
ఎన్నికల రథంపై నుంచి ప్రసంగిస్తున్న విజయ్ సాక్షి, చైన్నె : గత ఏడాది తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రకటించిన విజయ్ తాజాగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లే దిశగా కార్యక్రమాలను విస్తృతం చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రెండు మహానాడులను జయప్రదం చేసుకున్న విజయ్, శనివారం తిరుచ్చి వేదికగా ఎన్నికల ప్రచార పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఉదయం తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్న విజయ్ ప్రత్యేక ప్రచార రథంలోకి ఎక్కి అభిమానులను పలకరిస్తూ ముందుకు సాగారు. విజయ్ ఎలాంటి రోడ్ షోలు నిర్వహించేందుకు వీలు లేదని ముందుగానే పోలీసులు ఆంక్షలు విధించిన దృష్ట్యా, ఆయన ప్రత్యేక ప్రచార రథంలోపలే కూర్చుని తన కోసం వేచి ఉన్న కేడర్ను, ప్రజలకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. ఊహించని రీతిలో జన సందోహం.. విజయ్కు తిరుచ్చి ఎన్నికల ప్రచార పర్యటనకు గంట సమయాన్ని మాత్రమే పోలీసులు కేటాయించారు. అయితే పోలీసులే కాదు, తమిళగ వెట్రి కళగం వర్గాలు సైతం ఊహించని రీతిలో జన సందోహం తండోపతండాలుగా పోటెత్తారు. విమానాశ్రయం నుంచి టీవీఎస్ టోల్ గేట్ మీదుగా మరక్కడై ఎంజీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని, ఇక్కడ జరిగే ప్రసంగంతో ఎన్నికల ప్రచారాన్ని విజయ్ శ్రీకారం చుట్టేందుకు ముందుగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. విమానాశ్రయం నుంచి ఈ మరక్కడై ప్రాంతం 6 కి.మీ దూరంలో ఉంది. అయితే ఊహించని రీతిలో తిరుచ్చిల్లోకి అభిమానం తరలి రావడంతో కట్టడి చేయలేని పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా జన సందోహం, ఏ రోడ్డు చూసినా ఇసుకేస్తే రాలనంతంగా అభిమానులు , ప్రజలు తరలి రావడంతో విజయ్..., విజయ్...., సీఎం..సీఎం అన్న నినాదాలు మార్మోగాయి. విజయ్ మరక్కడైకు వచ్చేలోపు అక్కడక్కడ రద్దీలో వేచి ఉన్న వాళ్లు స్పృహ తప్పారు. గాంధీ మార్కెట్ మార్గంలో సుమారు ఆరుగురు స్పృహ తప్పడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడక్కడ యువతీ, యువకులు పార్టీ జెండాతో నృత్య ప్రదర్శనలను హోరెత్తించారు. విజయ్ ప్రచార రథంపై పువ్వుల వాన అనేక చోట్ల కురిసింది. విజయ్ వెళ్లే మార్గంలోని భవనాలు, చెట్లు, హోర్డింగ్ల పైకి సైతం అభిమానులు ఎక్కేశారు. ఆయన్ని చూడాలనే ఉత్సహంతో రంకెలు వేశారు. జన సాగరంలో తిరుచ్చి మునిగినట్టుగా పరిస్థితి నెలకొనడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం తప్పలేదు. కేంద్రమాజీ మంత్రి పి చిదంబరం సైతం గంట పాటుగా ట్రాఫిక్లో ఇరుక్కు పోయారు. విమానాశ్రయానికి వెళ్లాల్సిన ప్రయాణీకులు మరింతగా ఇబ్బంది పడ్డారు. తరలి వచ్చిన అభిమానుల్ని కట్టడి చేయలేక తమిళగ వెట్రి కళగం వర్గాలే కాదు, పోలీసులు సైతం చోద్యం చూడక తప్పలేదు. తిరుచ్చి విమానాశ్రయంలో 9.40 గంటల ప్రాంతంలో అడుగు పెట్టిన విజయ్ మిగిలిన 6 కి.మీ దూరాన్ని ఐదు గంటల పాటుగా ప్రయాణించి మరక్కడైకు మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం మరక్కడై పరిసరాలలోని దుకాణాలన్ని మూత బడ్డాయి. ఉదయం 10.30–11.30 గంటల వరకే విజయ్ సభకు అనుమతి ఇచ్చారు. జన సాగరాన్ని దాటి 2.45 గంటలకు ఇక్కడకు వచ్చిన ఆయన తొలిసారిగా ప్రచార రథం పైకి వెళ్లి తన కోసం వేచి ఉన్న జనం, అభిమానుల్ని విజయ్ పలకరించారు. అభివాదం తెలుపుతూ 20 నిమిషాల పాటూ ప్రసంగించారు. దివంగత నేతలు పెరియార్, అన్నా, ఎంజీఆర్లు తిరుచ్చి నుంచే తమ రాజకీయ వ్యవహారాలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. తిరుచ్చి అంటే మలుపునకు వేదిక అని వ్యాఖ్యలు చేస్తుండగా, సాంకేతిక సమస్య కారణంగా మైక్ పని చేయలేదు. లైవ్లో విజయ్ ప్రసంగం కోసం ఎదురు చూసిన వారందరికి నిరాశ తప్పలేదు. విజయ్ ప్రచార రథానికి సమీపంలో ఉన్న వారికి మాత్రమే ఆయన ప్రసంగం వినే అవకాశం దక్కింది. ఆదిలోనే మైక్ అడ్డంకులు ఎదురైనా విజయ్ మాత్రం తన ప్రసంగాన్ని చకచకా ముగించారు. మత సామరస్యానికి ప్రతీక తిరుచ్చి గడ్డ అని పేర్కొంటూ, ఇక్కడి ప్రజల్ని చూసి వెళ్దామని తాను వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు. కొన్ని మట్టిని తాకితే చాలా మంచిదని, కొన్నిమంచి కార్యక్రమాలు ఇక్కడి నుంచే చేపడితే మరింత మంచిదని పెద్దలు చెప్పి ఉన్నారని పేర్కొంటూ, అందుకే తిరుచ్చిలో తాను ఎన్నికల ప్రచారం కు శ్రీకారం చుడుతున్నానని వ్యాఖ్యలు చేశారు. ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్లే ముందు, యుద్ధంలో గెలవడానికి దేవతా మూర్తులు ఆలయానికి వెళ్లి పూజించే వారని గుర్తు చేశారు. ఆదిశగా ఎన్నికలకు వెళ్లే ముందు నేను తన వాళ్లని చూడటానికి ఇక్కడకు వచ్చానని పేర్కొన్నారు. తిరుచ్చికి చాలా చరిత్ర ఉందని, పెరియార్ నివసించిన ప్రదేశం కూడా అంటూ గుర్తు చేశారు. మలైకోట్టై ఉన్న ప్రదేశం కూడా తిరుచ్చి అంటూ ఇక్కడి జన సందోహాన్ని చూస్తుంటే తన హృదయం పులకించిందని,భావోద్వేగం కలుగుతున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ‘ఎటు చూసినా జనమే. ఏ వీధులలో చూసినా ఇసుకేస్తే రాలనంతంగా జన సందోహం. 6 కి.మీ దూరాన్ని దాటేందుకు ఐదు గంటల సమయం.’ ఇది దళపతి విజయ్కు అభిమానుల నీరాజనం. తిరుచ్చి జన సాగరంలో కలిసినట్టుగా శనివారం తమిళగ వెట్రి కళగం నేత విజయ్ ఎన్నికల ప్రచార శంఖారావం పర్యటన పరిస్థితి. ఎవ్వరూ ఊహించని రీతిలో తరలి వచ్చిన అభిమానుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ, పోలీసు ఆంక్షలకు అనుగుణంగా పూర్తి స్థాయి రాజకీయ ప్రచారంలోకి విజయ్ ముందడుగు వేశారు. హామీలు ఏమయ్యాయి..? 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 505 ఎన్నికల హామీలు ఇచ్చిందని, వాటిలో ఎన్ని నెరవేర్చారు? అని ప్రశ్నించారు. డీజిల్ ధర రూ. 3 తగ్గింపు ఎక్కడ, నెలవారీ విద్యుత్ బిల్లుల లెక్కింపు ఎక్కడ, విద్యార్థుల విద్యా రుణాల రద్దు ఏమయ్యాయి? , ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు, పాత పెన్షన్ పథకం, 2 లక్షల ప్రభుత్వ ఖాళీలను భర్తీ.... ఇవన్నీ ఏమయ్యాయి? అని డీఎంకే పాలకులను ప్రశ్నించారు. ప్రశ్నలు సంధించినా డీఎంకే నుంచి స్పందన ఉండదని, సీఎం గారు , ఓ మారు తిరుచ్చి ప్రజల గొంతు వినండి అంటూ అభిమానుల నినాదాలను హోరెత్తింప చేశారు. డీఎంకే సభ్యుడికి చెందిన ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ జరిగిందని ఆరోపిస్తూ, బస్సుల్లో మహిళలకు ఉచితంగా అనుమతిస్తూ ’ఓసీ, ఓసీ’ అని వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. విద్య, విద్యుత్, ఆరోగ్యసంరక్షణ వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడం, మహిళల భద్రత, చట్టపరమైన సమస్యలపై పడకుండా, ఆచరణాత్మకమైనది ఏదైనా సరే అమలు చేసే విధంగా తన పయనం ఉంటుందంటూ ఎన్నికలలో విజయం ఖాయం. మళ్లీ కలుద్దాం అంటూ 20 నిమిషాలలో ప్రసంగాన్నిముగించారు. ఇక్కడి నుంచి విజయ్ ప్రచార రథం మళ్లీ జాతీయ రహదారి వైపుగా వెళ్లే వరకు జనాన్ని కట్టడి చేయలేక పోలీసులు అవస్థలు పడాల్సి వచ్చింది. తిరుచ్చి – తంజావూరు జాతీయ రహదారి నుంచి అరియలూరు, పెరంబలూరు వైపుగా విజయ్ ప్రచార ప్రయాణం సాగింది. తిరుచ్చిలో ఆలస్యం కావడంతో ఇక్కడ కూడా నిర్ణీత సమయంలో కాకుండా, ఆలస్యంగా ప్రచార పయనాన్ని విజయ్ కొనసాగించాల్సి వచ్చింది. విజయ్ గణనీయంగానే ఓట్లను సాధించే అవకాశం ఉందని, తాజాగా తరలి వచ్చిన జన సందోహాన్ని చూసి వీసీకే నేత, ఎంపీ తిరుమా వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ స్పందిస్తూ వచ్చిన అభిమానం అంతా ఓటుగా మారేనా అన్నది వేచి చూడాల్సిందేనని వాఖ్యానించారు. బీజేపీ మహిళా నేత తమిళి సై సౌందరరాజన్ స్పందిస్తూ, విజయ్కు ఊహించని రీతిలో జనం వచ్చారని, ఇదంతా అభిమానమే అని వ్యాఖ్యలు చేశారు. -
పార్టీ నుంచి కొడుకును గెంటేసిన తండ్రి
అనుకున్నదే జరిగింది. తండ్రికొడుకుల పవర్ పాలిటిక్స్ తారా స్థాయికి చేరాయి. తనకు కంట్లో నలుసులా తయారైన సొంత కొడుకుపై ఎట్టకేలకు చర్య తీసుకున్నారు రాజకీయ కురువృద్ధుడు డాక్టర్ ఎస్ రాందాస్. పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) పార్టీ నుంచి తన కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ అన్బుమణిని పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు.విల్లుపురం జిల్లాలోని తైలపురంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. అన్బుమణిపై క్రమశిక్షణా కార్యాచరణ కమిటీ 16 అభియోగాలు మోపిందని తెలిపారు. వివరణ కోరుతూ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు అన్బుమణి స్పందించలేదని, గడువు పొడిగించినా కూడా ఆయన నుంచి సమాధానం రాలేదన్నారు. షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వడానికి ఆయన వద్ద సరైన సమాధానాలు లేకపోవడం వల్లే అన్బుమణి స్పందించలేదని భావిస్తున్నామన్నారు. పార్టీ నియమ నిబంధనల ప్రకారం ఆయనను.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగిస్తున్నామని, ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల కొంత మంది తన కొడుకుతో చేతులు కలిపారని, వారంతా తాను తయారు చేసిన నాయకులేనని.. వారిని క్షమించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.కొత్త పార్టీ పెట్టుకో..తన కుమారుడిని పీఎంకే నుంచి బహిష్కరించినా పార్టీకి ఎటువంటి నష్టం కలగబోదని రాందాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. పీఎంకే నుంచి తప్పించడంతో ఇప్పుడు అన్బుమణి సొంతంగా కొత్త పార్టీ (New party) పెట్టుకోవచ్చని సలహాయిచ్చారు. పీఎంకే తాను స్థాపించిన పార్టీ అని, దీనిపై తన కొడుకుతో సహా ఎవరికీ హక్కు లేదన్నారు.ఆ నిర్ణయం చెల్లదు: బాలుపీఎంకే పార్టీ నుంచి అన్బుమణిని బహిష్కరించడాన్ని ఆయన మద్దతుదారులు వ్యతిరేకించారు. రాందాస్ నిర్ణయం చెల్లదని అన్బుమణి మద్దతుదారుడు బాలు అన్నారు. చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. 'పార్టీ నిబంధనల ప్రకారం.. సభ్యులను తొలగించడం, సమావేశాలు నిర్వహించడం, ఏవైనా నిర్ణయాలు తీసుకోవడం వంటి అధికారం జనరల్ కౌన్సిల్ ద్వారా ఎన్నుకోబడిన అధ్యక్షుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి, పార్టీ వ్యవస్థాపకుడు చేసిన ప్రకటన చెల్లద'ని ఆయన వాదించారు. మామల్లపురంలో ఆగస్టు 9న జరిగిన జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా అన్బుమణి, ప్రధాన కార్యదర్శి వడివేల్ రావణన్, కోశాధికారిగా ఎం. తిలగబామ మరో ఏడాది కొనసాగేందుకు ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలిపారు. జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించామని వెల్లడించారు. పార్టీ అంతర్గత ఎన్నికలు వచ్చే ఏడాది ఆగస్టులో జరుగుతాయన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశం ప్రకారం అన్బుమణి రాందాస్ (Anbumani Ramadoss) పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, మిగతా వారి మాటలు నమ్మెద్దని మీడియాను బాలు కోరారు.చదవండి: అన్నాడీఎంకే కలకలం.. రంగంలోకి అమిత్ షా!ఏం జరగబోతోంది?తాజా పరిస్థితుల నేపథ్యంలో పీఎంకే పార్టీలో ఏం జరగబోతోందనే చర్చ తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తండ్రి నుంచి అన్బుమణి పార్టీ లాగేసుకుంటారా లేదా కొత్త పార్టీ పెడతారా అనేది చూడాలి. అన్బుమణి చర్యలను బట్టి చూస్తే ఆయన పార్టీని హస్తగతం చూసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. మరోవైపు పార్టీని తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు రాందాస్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ పేరు, జెండా, చిహ్నంను రక్షించుకునేందుకు బుధవారం నాడు మద్రాసు హైకోర్టులో కేవియేట్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ తమదంటూ ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తే ముందుగా తన వాదనలు వినాలని, తన వివరణ తప్పనిసరిగా స్వీకరించాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థించారు. -
మాతృత్వానికి వెనుకంజ
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో మాతృత్వానికి యువతులు దూరం అవుతున్నారు. పిల్లలను కనకూడదన్న నిర్ణయంతో ఎక్కువ శాతం మంది ఉన్నట్టుగా పరిశీలనలో వెలుగు చూసింది. ఇందుకు అనుగుణంగా గత ఏడాది శిశు జననాలు గణనీయంగా తగ్గాయి. కేవలంలో 8 లక్షల మంది పిల్లలు జన్మించి ఉన్నారు. మాతృత్వం కోసం పరితపించే వారెందరో. తమ కంటూ ఓ బిడ్డ కోసం ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరిగే వారు మరెందరో. వివాహమైన జంటలకు చెందిన కుటుంబాలు అయితే, మనవళ్లు, మనవరాళ్లను ఎత్తుకోవాలన్న కాంక్షతో దేవుళ్లకు మొక్కేవారెందరో. ఇలాంటి తరుణంలో ఆధునిక యువత పిల్లలను కనేందుకు ముందుకు రావడం లేదన్నది తాజా నివేదికలో వెలుగు చూసి ఉంది. విద్యా వంతులు, వివిధ ప్రొఫెషన్స్లలో పనిచేస్తున్న యువతీ, యువకులు లివింగ్ టుగెదర్ అంటూ కాలం గడిపే పనిలో పడ్డారు. అలాగే, మరెన్నో జంటలు వివాహాలైన కొన్నాళ్లకే విడాకులు బాటలో పయనిస్తున్నాయన్నది స్పష్టమై ఉంది. ఇందుకు తగినట్టుగా గత ఏడాది శిశు జననాలు రాష్ట్రంలో గణనీయంగా తగ్గింది. కుటుంబ నియంత్రణను ప్రభుత్వాలు ఇది వరకు విజయవంతంగా అమలు చేసినా, తాజాగా ద్రావిడ మోడల్ సీఎం స్టాలిన్తో పాటుగా పలు రాష్ట్రాల సీఎంలు పిల్లలను కనండీ అంటూ కొత్త జంటలకు వేదికలెక్కి విన్నవించే పనిలో పడ్డారు. మనస్తత్వం మార్చుకోవాలి..ఆధునిక యుగంలో కొత్త సంస్కృతి ఓ వైపు ఉంటే, మరో వైపు వివిధ సమస్యలు, ఆర్థిక పరమైన అంశాలతో పిల్లలను కనేందుకు జంటలు ఆలోచిస్తున్నట్టుగా సైతం తాజా పరిశీలనలో వెలుగు చూసింది. ఆధునిక తరంలో శిశు జననాలు తగ్గుతుండడం కలవరాన్ని రేపుతోంది. 2019 నుంచి ఈ తగ్గుముఖం సాగుతున్నట్టు ఆరోగ్య శాఖ నివేదిక స్పష్టం చేస్తోంది. 2020లో తొమ్మిది లక్షల మంది పిల్లలు రాష్ట్రంలో జన్మించారు. 2022, 2023లో సంఖ్య అదే దరిదాపులలో ఉన్నా, 2024లో మరింతగా తగ్గి ఉండటం గమనార్హం. గత సంవత్సరం 8 లక్షల మంది పిల్లలే రాష్ట్రంలో జన్మించి ఉన్నారు. గతంతో పోల్చి తే లక్షల మంది పిల్లల జననాలు తగ్గాయి. అదే సమయంలో ప్రసవ సమయంలో మరణించే గర్భిణి తల్లుల సంఖ్య క్రమంగా తగ్గింది. 2019లో 58 మంది మరణించగా, తాజాగా ఈ సంఖ్య 35కు తగ్గింది. శిశు మరణాలు సైతం తగ్గి ఉన్నా, జననాల సంఖ్య గత ఏడాది లక్ష తగ్గడం గమనార్హం. ఈ విషయంగా ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటూ, పిల్లలను కనడం అనేది జంటల వ్యక్తిగతం అని, వారు తమ మనస్తత్వాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
యాన్ ఆర్డినరీ మెన్ ప్రోమో విడుదల
తమిళసినిమా: ఛార్మింగ్ కథానాయకుడు రవి మోహన్ ఇప్పుడు అనేక అవతారాలు ఎత్తుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి చిత్రం ద్వారా ప్రతి నాయకుడిగా అవతారమెత్తారు. ఈ చిత్రం విడుదలకు ముందే రవి మోహన్ స్టూడియోస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి ఒకేసారి దర్శక నిర్మాతగా పరిచయం అవుతున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఇటీవల చైన్నెలోని ఓ స్టార్ హోటల్లో భారీ స్థాయిలో నిర్వహించారు. ఆ వేదికపై తాను సంస్థలో నిర్మించే మూడు చిత్రాల వివరాలను వెల్లడించారు. అందులో ఒకటి రవి మోహన్ మెగాఫోన్ పట్టే చిత్రం. నటుడు యోగిబాబు హీరోగా రవి మోహన్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యాన్ ఆర్డినరీ మెన్ అనే టైటిల్ను నిర్ణయించారు. దీనికి జాయ్ సరోలా ఛాయాగ్రహణం, హైడ్రో సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా రవి మోహన్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం యాన్ ఆర్డినరీ మెన్ చిత్రం ప్రోమోను విడుదల చేశారు. నటుడు యోగిబాబు పాత్రను పరిచయం చేసే ఈ ప్రోమో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ చిత్రంతో పాటు రవి మోహన్ తన సంస్థలో రూపొందనున్న బ్రోకోడ్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటితో పాటూ మరో చిత్రాన్ని రవి మోహన్ స్టూడియోస్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. -
19న తెరపైకి శక్తి తిరుమగన్
తమిళసినిమా: సంగీత దర్శకుడు, కథానాయకుడు, ఎడిటర్, నిర్మాత, దర్శకుడు ఇలా పలు రంగాల్లో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు విజయ్ ఆంటోని. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించి, సంగీతాన్ని అందించి నిర్మించిన చిత్రం శక్తి తిరుమగన్. నటి తృప్తి రవీంద్ర నాయకిగా నటించిన ఈ చిత్రానికి అరువి చిత్రం ఫేమ్ అరుణ్ ప్రభు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఇది విజయ్ ఆంటోని నటించిన 25 వ చిత్రం. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమిళంతో పాటూ తెలుగులోనూ భద్రకాళి పేరుతో ఈ నెల 19వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శక్తి తిరుమగన్ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇంతకు ముందు విజయ్ ఆంటోని హీరోగా చిత్రాలు చేసిన దర్శకులు, చేయనున్న దర్శకులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేదికపై విజయ్ ఆంటోని మాట్లాడుతూ తాను ఇప్పటివరకు 19 చిత్రాల్లో హీరోగానూ, కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లోనూ నటించానని చెప్పారు. ఒక విధంగా శక్తి తిరుమగన్ తాను నటించిన 25వ చిత్రం అని చెప్పారు. దర్శకుడు అరుణ్ ప్రభును తానే పిలిపించి కథ చెప్పమని అడిగానని, అయితే మొదట ఆయన చెప్పిన కథ అస్సలు అర్థం కాలేదు అని, అయితే ఆ తరువాత దర్శకుడు పూర్తిగా వివరించారని చెప్పారు. ఇది సమకాలీన రాజకీయాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందని చెప్పారు. దీని తరువాత శశి దర్శకత్వంలో నూరుసామి చిత్రంలో నటించనున్నానని, ఆ చిత్రం కూడా బాగుంటుంది అని చెప్పారు. తనకు కథానాయకుడిగా నటించడం కంటే, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా చిత్రాలు చేయడమే ఇష్టం అన్నారు. పలు చిత్రాలు నిర్మించి పలువురు ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించానని, అందుకోసం తన విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ సంస్థను పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చనున్నట్లు చెప్పారు. -
మొబైల్ క్లీనిక్ సేవ
ఊపిరితిత్తుల వ్యాధులను ముందుగా గుర్తించి, చికిత్స అందించే విధంగా ఉచిత మొబైల్ లంగ్ క్లీనిక్సేవలకు వడపళని కావేరి ఆస్పత్రి గురువారం శ్రీకారం ట్టింది. చైన్నె పోరూర్, పూందమల్లి, అరుంబాక్కం, కోడంబాక్కం, వడపళణి, కోయంబేడు, వలసరవాక్కం, విరుగంబాక్కం, పెరంబూరులతో పాటుగా చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, అరక్కోణం, వేలూరు, కారైకాల్,పుదుచ్చేరి తదితర 30 ప్రాంతాలలో ఉచిత స్క్రీనింగ్ సౌకర్యాలతో ఈ మొబైల్ క్లీనిక్ సేవలు అందించనున్నది. ఈ మొబైల్ వాహనాన్ని గురువారం ఆస్పత్రి సహ వ్యవస్థాపకుడు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్, సినీ నటుడు తంబిరామయ్య, పల్మోనాలజిస్టు డాక్టర్ సెల్విలు జెండా ఊపి ప్రారంభించారు. –సాక్షి,, చైన్నె -
ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
తిరుత్తణి: మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ జంయితి సందర్భంగా ఉపాధ్యాయులను డాక్టర్ రాధాకృష్ణన్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగలో ప్రసిద్ధి చెంది శ్రీ దత్తసాయి ఆలయం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులతో పాటూ సమాజకు సేవలందిస్తున్న ప్రముఖులను ఎంపిక చేసి సత్కరించే కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఆలయ చైర్మన్ శ్రీసాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రపంచ దేశాల శాంతిదూత రాజేష్కన్నా పాల్గొని పళ్లిపట్టు ఆదర్శ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్ముగంతో పాటు ఆధ్యాత్మికం, సంగీతం. కళలు, సేవాభావంలో ప్రత్యే క గుర్తింపుతో సేవలందిస్తున్న ప్రముఖులు 30 మందికి అవార్డుతో ఘనంగా సత్కరించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బాబాకు విశేష అభిషేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 500 మందికి అన్నదానం పంపిణీ చేశారు. -
96 చిత్ర దర్శకుడితో ఫహద్ ఫాజిల్
తమిళసినిమా: కొన్ని రేర్ కాంబినేషన్ చిత్రాలు అనూహ్యంగా సెట్ అవుతుంటాయి. 96 చిత్రంతో మెగా ఫోన్ పట్టి కెమెరామన్ ప్రేమ్ కుమార్ ఆ చిత్రంతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా నటి త్రిషకి రీ ఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి. ఆ తరువాత కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలు పోషించిన మెయ్యళగన్ చిత్రం చేసి ప్రేమ్ కుమార్ మరో సక్సెస్ సాధించారు. ఇలా చాలా జాగ్రత్తగా చిత్రాలు చేస్తున్న ప్రేమ్ కుమార్తో చిత్రాలు చేయడానికి హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారనే చెప్పాలి. తాజాగా నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా ప్రేమ్ కుమార్ ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈయనకు ఇటీవల ఫహద్ ఫాజిల్ను కలిసి 45 నిమిషాల పాటు కథను చెప్పినట్లు, అది ఆయనకు బాగా నచ్చినట్లు సమాచారం. దీంతో తమిళంలో రూపొందనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. కాగా ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా నటుడు ఫహత్ ఫాజిల్ ఇటీవల వడివేలుతో కలిసి నటించిన మారీశన్ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. -
నేడు 3 మండలాల్లో తాగునీటి సరఫరా నిలిపివేత
తిరువొత్తియూరు: చైన్నె మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ,మురుగు నీటి బోర్డు గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. అందులో చైన్నెలోని తిరు.వి.కా. నగర్ మండలంలోని పట్టాలం, స్ట్రారస్ రోడ్డులో, కిల్పాక్కం తాగునీటి శుద్ధి కర్మాగారం నుంచి తాగునీటిని సరఫరా చేసే ప్రధాన తాగునీటి పంపింగ్ పైప్లైన్కు సంబంధించిన పనులు నేడు (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 13వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వరకు జరుగుతాయి. దీని కారణంగా, పనులు జరిగే సమ యంలో తండైయార్పేట మండలంలోని తండై యార్పేట, కాసిమేడు, చాకలి పేట ప్రాంతా లు, అలాగే రాయపురం మండలంలోని కాసి మేడు, చాకలి పేట తిరు.వి.కె.నగర్ మండలంలోని ఓట్టేరి, ఐనావరం, పట్టాలం, నమ్మళ్వార్పేట, పుళియంతోపు ప్రాంతాలలో తాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అవసరం మేరకు తాగునీటిని నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అదనపు తాగునీటి అవసరం ఉంటే, https://cmwssb.in.gov.in వెబ్సైట్లో ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలనిసూచించారు.వాచ్మన్ను హత్య చేసి: మృతదేహాన్ని బావిలో పడేసిన నిందితులువేలూరు: తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలో అరుంగల్దుర్గం గ్రామానికి చెందిన కలీల్కు చెందిన భూమి ఉంది. ఇక్కడ తిరుపత్తూరుకు చెందిన సయ్యద్ ముజీబ్ కుమారుడు అస్కర్ బాషా(38) నాలుగు సంవత్సరాలుగా వాచ్మన్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అస్కర్ బాషా గురువారం బావిలో మృతదేహంగా కనిపించాడు. వీటిపై స్థానికులు ఆంబూరు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మృత దేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి విచారణ జరిపారు. ప్రాథమిక విచారణలో అక్కడే పనిచేస్తున్న రాజస్థాన్కు చెందిన అనిల్కుమార్, ఆదీద్ కలిసి అస్కర్ బాషాను హత్య చేసి మృత దేహాన్ని బావిలో వేసి అక్కడ నుంచి పరారీ అయినట్లు తెలిసింది. దీంతో రాజస్థాన్కు చెందిన ఇద్దరు కార్మికుల కోసం గాలిస్తున్నారు. అయితే హత్యకు కారణాలు ఏమిటి, ఎందుకు హత్య చేశారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.రూ.8 లక్షల దోపిడీకి యత్నంతిరువొత్తియూరు: చైన్నె మన్నడి ప్రాంతానికి చెందిన అసరాత్ హుస్సేన్ (39). అతని అన్న ఆసిఫ్ అలీ (42). వారి స్నేహితులు తౌఫిక్ అబ్దుల్ రజాక్. వీరు ఖతార్లో పనిచేస్తున్నారు. బుధవారం చైన్నెకి వచ్చిన తౌఫిక్, అబ్దుల్ రజాక్ మన్నడి మూర్ వీధిలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో బస చేశారు. వీరు ఖతార్ నుంచి వచ్చేటప్పుడు 5 ఖరీదైన సెల్ఫోన్లను తీసుకొచ్చారు. డబ్బు అవసరం కావడంతో సెల్ఫోన్లను అమ్మి ఇవ్వమని ఆసిఫ్ అలీకి చెప్పారు. దీని ప్రకారం, ఆసిఫ్ అలీ తన తమ్ముడు అసరాత్ హుస్సేన్కు సెల్ఫోన్లు ఇచ్చి, వాటిని అమ్మి డబ్బు తీసుకురమ్మని పంపాడు. దీని ప్రకారం, పారిమునైలోని ఈవినింగ్ బజార్లోని ఓ దుకాణంలో సెల్ఫోన్లను అమ్మి, రూ 8 లక్షల తీసుకొని అసరాత్ హుస్సేన్ బైక్పై మన్నడికి బయలుదేరాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నలుగురు వ్యక్తుల ముఠా అతన్ని అడ్డగించి కత్తి చూపించి బెదిరించి డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో, అప్రమత్తమైన అసరాత్ హుస్సేన్ బైక్ను కింద పడేసి పారిపోయాడు. ఈ ఘటనపై నార్త్ బీచ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఒకే రోజు వరుసగా ఐదు ఇళ్లల్లో దొంగతనంసేలం: నామక్కల్ తిరుచెంగోడ్ సమీపంలోని రింగ్ రోడ్లో ఉన్న ఇడయార్పాలయం గ్రామంలో గురువారం తెల్లవారుజామున వరుసగా ఐదు ఇళ్లలో దొంగతనం జరిగింది. నగలు, డబ్బు, ఇత్తడి పాత్రలు, వెండి ఉంగరాలు, టీవీఎస్ ఎక్స్ఎల్ ద్విచక్ర వాహనం, ఎలక్ట్రిక్ మోటారులను దుండగులు దొంగలించుకుని పోయారు. గ్రామంలో దాదాపు 150 ఇళ్లు ఉన్నాయి. గురువారం వేకువజామున ఒకే రోజు వరుసగా ఐదు ఇళ్లలో చోరీ జరిగింది. గురువారం ఆటో డ్రైవర్ శక్తివేల్ (36), గ్రామంలోని గుడి ఇంట్లో నివసించే మెకానిక్ విజయకుమార్ (38), ప్రైవేట్ కళాశాలలో క్యాషియర్గా పనిచేస్తున్న గోపాల్ (35), శివగామి, అగియోర్ ఇళ్ల తాలాలు పగలగొట్టి ఇత్తడి పాత్రలు, బంగారు నగలు, రూ. 10,000 దోచుకున్నారు. ఒక ప్రైవేట్ కళాశాలలో మెకానిక్గా పనిచేస్తున్న గోపాల్ (35) ఇంటిని పడగొట్టి, ఇంటి బయట పార్క్ చేసిన టీవీఎస్ ఎక్సెల్ 100 వాహనాన్ని కూడా దొంగిలించారు. ఓ ప్రైవేట్ కళాశాలలో పనిచేసే థానప్పన్ ఇంట్లో నుండి విద్యుత్ మోటారును కూడా దొంగిలించారు. తిరుచెంగోడ్ గ్రామీణ పోలీసులు వేలిముద్ర నిపుణులను పిలిపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మహత్యల నియంత్రణపై అవగాహన సదస్సు
వేలూరు: విద్యార్థినులు ఆత్మహత్యల నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలని తమిళనాడు సైన్స్ మూవ్మెంట్ జిల్లా కార్యదర్శి, కాట్పాడి జూనియర్ రెడ్క్రాస్ కార్యదర్శి జనార్ధనన్ అన్నారు. వేలూరులోని డీకేఎం మహిళా డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర విభాగం, తమిళనాడు సైన్స్ ఉద్యమం, వేలూరు హెల్పింగ్ హార్ట్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ వారంలో భాగంగా అండర్ స్టాండింగ్ యంగ్ హార్ట్స్ అనే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని గత 2003వ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఇంటర్నేషణల్సొసైటీ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ ద్వారా స్థాపించబడిందన్నారు. విద్యార్థినులు క్షణికావేశంతో వచ్చిన కోపాలతో నిరుత్సాహం చెందకుండా నిర్భయంగా ఉండాలన్నారు. ఎటువంటి సమస్య వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తిని సంపాదించుకోవాలన్నారు. అనంతరం విద్యార్థినులకు వీడియో క్లిపింగ్, ముగ్గుల పోటీలు, పెయింటింగ్, పెన్షల్ డ్రాయింగ్, వ్యాసరచన వంటి పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి మణినాదన్, ప్రిన్సిపాల్ డాక్టర్ భానుమతి, మెంటల్ హెల్త్ కౌన్సిలర్ డాక్టర్ సుబైదా సుల్తానా, అన్బు ఉల్లంగల్ ఆర్గగనైజేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్, మహిళా న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షురాలు జమున, కళాశాల ప్రొఫెసర్ శశికళ తదితరులు పాల్గొన్నారు. -
స్వావలంబన ఆధారంగా సార్వభౌమాధికారం
– డాక్టర్ శ్రీధర్ వెంబు సాక్షి, చైన్నె : జాతీయ సార్వభౌమాధికారం సాంకేతికత, స్వాలంబనపై ఆధారపడి ఉంటుందని జోహొ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు , సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ వెంబు వ్యాఖ్యానించారు. యుద్ధాలు యుద్ద భూమిలోనే కాదు, సాంకేతిక రంగంలో కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాటాన్ కొలత్తూరు వేదికగా ఎస్ఆర్ఎం ఐఎస్టీ ప్లాగ్ షిప్ టెక్నో– మేనేజ్మెంట్ ఫెస్ట్ 19వ ఆరుష్–2025 బుధవారం ప్రారంభమైంది. 14వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుంచి ఇంజినీరింగ్, టెక్నాలజీ విద్యార్థులు తరలి వచ్చిన తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు. హ్యాక్థాన్లు, సాంకేతిక సవాళ్లు, ఎంట్రర్ ప్రెన్యూర్ షిప్ బూట్ క్యాంప్లు, స్టార్టప్ షోకేష్లు, విధాన చర్చలు,నిపుణుల ఉపన్యాసాలు, రన్ ఫర్ జీరో వేస్ట్, సాంస్కృతిక , నాయకత్వం చర్చలు జరగనున్నాయి. ఎస్ఆర్ఎం గ్రూప్ వ్యవస్థాపక చాన్స్లర్ డాక్టర్ టీఆర్ పారివేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ ఉత్సవాలను చీఫ్ సైంటిస్టు డాక్టర్ శ్రీధర్ వెంబు, పద్మభూషన్ డాక్టర్ ఏ శివధాను పిళ్లై ప్రారంభించారు. శ్రీధర్ వెంబు తన ప్రసంగంలో అధునిక ప్రపంచంలో సాంకేతిక స్వావలంబన గురించి వివరించారు. జాతీయ సార్వభౌమాధికారం సాంకేతికత, స్వావలంబనపై ఆధారపడి ఉందన్నారు. జీపీఎస్, ఆపరేటింగ్ సిస్టమ్లు లేదా చాట్ జీపీటీ వంటి ప్లాట్ ఫారమ్లపై ఆధార పడలేదమని వ్యాఖ్యానించారు. వీటిని క్షణాలలో తొలగించేందుకు వీలుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రో వైస్ చాన్స్లర్ డాక్టర్ నితిన్ ఎం నాగర్కర్ తదితరులు పాల్గొన్నారు. -
20 గ్రామాల్లో జాతర సందడి
పళ్లిపట్టు: పళ్లిపట్టు మండల వ్యాప్తంగా 20 గ్రామాల్లో మంగళవారం జాతర సందడి నెలకొంది. పొదటూరుపేట, జంగాళపల్లె. బొమ్మరాజుపేట, చవటూరు, కేశవరాజుకుప్పం, గొళ్లాలకుప్పం, కాకళూరు, అత్తిమాంజేరిపేట సహా 20 గ్రామాల్లో జాతరను కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో విద్యుద్దీపాలంకరణ కనువిందు చేసింది. మంగళవారం రాత్రి అమ్మవారిని గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా మేకలను బలిదానం చేసి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం గ్రామ వీధుల్లో కొలువైన అమ్మవారికి మహిళలు కుంభం సమర్పించి దర్శించుకున్నారు. సాయంత్రం ఊరేగింపుగా తరలించి చెరువుల్లో నిమజ్జనం చేశారు. పొదటూరుపేటలోని మారియమ్మన్ జాతర సందర్భంగా బుధవారం ఉదయం పొన్నియమ్మన్ను పట్టణ వీధుల్లో ఊరేగించారు. మహిళలు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకున్నారు. అదే సమయంలో నడివీధిలో కొలువైన మారియమ్మన్కు మహిళలు కుంభం వేసి దర్శించుకున్నారు. పాండ్రవేడు గ్రామంలో జాతర సందర్భంగా సందడి నెలకొంది. బొమ్మరాజుపేట గ్రామంలో జాతర సందర్భంగా బాణసంచా సంబరాలు ఆకట్టుకున్నాయి. బొమ్మరాజుపేటలో బాణసంచా సంబరాలు, పొదటూరుపేటలో మారియమ్మన్కు కుంభం సమర్పిస్తున్న మహిళలు -
ఘనంగా రామన్ పుట్టినరోజు వేడుకలు
పళ్లిపట్టు: టీఎంసీ రాష్ట్ర కోశాధికారి, పళ్లిపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రామన్కు ఆ పార్టీ అధ్యక్షుడు జీకే.వాసన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ రామన్ పళ్లిపట్టు ఎమ్మెల్యేగా పదేళ్ల పాటు విశిష్ట సేవలందించారు. అతని హయాలో పళ్లిపట్టు ప్రాంతంలో రోడ్లు, ప్రభుత్వ భవనాలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు తీసుకొచ్చారు. ప్రధానంగా ప్రజలకు రవాణా సౌకర్యం కోసం బస్సు డిపోతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు వీలుగా బస్సు సేవలు, బ్యాంకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రజల మధ్య డాక్టర్ రామన్ విశిష్ట గుర్తింపు పొందారు. ఈక్రమంలో బుధవారం జన్మదిన వేడుకలు జరుపుకున్న డాక్టర్ రామన్ను పొదటూరుపేటలోని అతని నివాసంలో కలుసుకున్న టీఎంసీ నాయకులతోపాటు వివిధ పార్టీల శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో టీఎంసీ అధ్యక్షుడు జీకే.వాసన్ ఫోన్ ద్వారా డాక్టర్ రామన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైక్లు – ఇద్దరి మృతితిరువొత్తియూరు: కల్లకురిచ్చి జిల్లా ఉలుందూర్పేట సమీపంలోని అతనూర్ గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు గోవిందన్ (30) ఎలక్ట్రీషియన్. మంగళవారం సాయంత్రం అతనూర్, కుచిపలై రోడ్డుపై బైక్పై వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న బైక్ అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోవిందన్, మరో బైక్పై వెళ్తున్న భువనూర్ గ్రామానికి చెందిన అలాషన్ కుమారుడు సుబ్బరాయన్ (35) ఇద్దరూ మతి చెందారు. ఈ ప్రమాదంలో బైక్లో వస్తున్న భువనూర్ గ్రామ మాజీ పంచాయతీ అధ్యక్షుడు బాలకన్నన్ కుమారుడు సెల్వగణపతి (26) కి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఉలుందూర్పేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఉలుందూర్పేట బి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బాలికను వివాహం చేసుకున్న టీచర్కు జైలుఅన్నానగర్: కృష్ణగిరి జిల్లాలోని తేన్ కనికొట్టై సమీపం కుంతుకొట్టై పంచాయతీలోని ఈరిచెట్టియారి గ్రామానికి చెందిన వేల్ మురుగన్ (26) అంజెట్టి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో తాత్కాలిక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆ బాలిక ప్రస్తుతం 5 నెలల గర్భవతి. చికిత్స కోసం కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినప్పుడు, ఆ బాలిక వయస్సు కేవలం 15 ఏళ్లు అని తేలింది. ఈ విషయం పై బాలల సంక్షేమ అధికారులు దర్యాప్తు నిర్వహించారు. తదనంతరం, తేన్ కనికొట్టై ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అతనిపై పోక్సో కేసు నమోదు చేసి, బుధవారం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తరువాత అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి ధర్మపురి జైలుకు తరలించారు.బైక్ను ఢీకొన్న బస్సు – ఇద్దర మృతితిరువొత్తియూరు: దిండుగల్ సమీపంలో బుధవారం ఉదయం మోటారుసైకిల్ను ప్రభుత్వ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాలు.. దిండుగల్ జిల్లా శానార్పట్టి సమీపం పూవకిళవన్పట్టికి చెందిన తంగవేల్ కుమారుడు బాలసుబ్రమణి (25). ఇతను వడమదురైలోని ఓ ప్రైవేటు మిల్లులో పనిచేస్తున్నాడు. ఇతని బంధువు తిరుచ్చి జిల్లా వయ్యంపట్టికి చెందిన తంగపిళ్లై కుమార్తె భువనేశ్వరి (22). బుధవారం ఉదయం బాలసుబ్రమణి తన మోటారుసైకిల్పై భువనేశ్వరిని ఎక్కించుకొని దిండుగల్ వైపు వస్తున్నాడు. గోపాల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోకి వస్తుండగా, నత్తం వైపు వస్తున్న ప్రభుత్వ బస్సు వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలో ఉన్నవారు వారిద్దరినీ చికిత్స కోసం అంబులెన్స్లో ద్వారా దిండుగల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అయితే మార్గమధ్యంలోనే బాలసుబ్రమణి, భువనేశ్వరి మృతి చెందారు.ఆన్లైన్లో రూ.2,683 కోట్ల మోసం – 2.35లక్షల మంది బాధితులుకొరుక్కుపేట: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో రూ.2,683 కోట్లు ఆన్లైన్న్ ద్వారా మోసపోయారు. మొత్తం 2.35లక్షల మంది తమ నగదును కోల్పోయారు. ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. గత సంవత్సరం 1.27లక్షల మంది సైబర్ మోసం ద్వారా రూ.1,673 కోట్లు పోగొట్టుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు, 1.9లక్షల మంది నగదును పోగొట్టుకున్నారని రికవరీ చేసిన డబ్బులో రూ.772 కోట్లను సైబర్ నేరస్థులు స్తంభింపజేశారు, అందులో రూ.4 కోట్లు మాత్రమే రికవరీ అయ్యాయి. -
చైన్నెలో మెక్సికన్ జాతి కోతి
తిరువొత్తియూరు: చైన్నె తిరువొత్తియూర్లోని కాలడిపేటై కొత్త వీధిలో మంగళవారం రాత్రి మెక్సికన్ జాతికి చెందిన స్పైడర్ కోతి తిరుగుతున్నట్లు చైన్నె పోలీసు నియంత్రణ గదికి సమాచారం అందింది. దీంతో తిరువొత్తియూరు పోలీస్ సబ్–ఇన్స్పెక్టర్ నేతృత్వంలో పోలీసులు వెళ్లి పరిశీలించారు. అది స్పైడర్ జాతి కోతి అని తెలిసింది. వేలచ్చేరి అటవీ శాఖ ఉద్యోగులు దాన్ని చాకచక్యంగా పట్టుకుని, అటవీ శాఖ అధికారులు తెచ్చిన బోనులో బంధించి తీసుకెళ్లారు. దాన్ని వండలూర్ జంతు ప్రదర్శనశాలలో అప్పగించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.చింతచెట్టును ఢీకొట్టిన కారు – దంపతుల మృతితిరువొత్తియూరు: తేని జిల్లాలో కారు చింత చెట్టును ఢీ కొట్టిన ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. వివరాలు.. తేని జిల్లా కదమలైకుండు కావేరి తొట్టం ప్రాంతానికి చెందినవారు మరియప్పన్ 62.అతని కుమార్తె తన కుటుంబంతో రాజపాళయం సమీపంలోని శివగిరిలో నివసిస్తుంది. ఆమె ఇంటిలో శుభ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఇందులో పాల్గొనేందుకు మారియప్పన్, అతని భార్య మాయా కృష్ణమ్మల్ (52), సోదరి సురులి యమ్మల్ (51), చిన్న కుమారుడు అశోక్కుమార్ (37), బంధువులు విజయభారతి (30), చిత్ర (28), సర్విన్ (9) మంగళవారం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కారులో వెళ్లారు. బుధవారం ఉదయం, వారి కారు ఉసిలంపట్టి సమీపంలోని మధురై–తేని ప్రధాన రహదారిపై వేగంగా వెళుతోంది. ఆ సమయంలో కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి చింత చెట్టును ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో, కారు ముందు కూర్చున్న మరియప్పన్, వెనుక సీట్లో ప్రయాణిస్తున్న అతని భార్య మాయకృష్ణమ్మల్ ఇద్దరూ కారులో చిక్కుకుని నుజ్జునుజ్జు అయ్యి మృతి చెందారు.జ్ఞాపక శక్తి కోల్పోయి తిరుగుతున్న వృద్ధురాలి రక్షింపుతిరువొత్తియూరు: జ్ఞాపకశక్తి కోల్పోయి చైన్నెలో తిరుగుతున్న ఉత్తరమేరూర్కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలిని పోలీసు బృందం రక్షించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. విచారణలో, రక్షించబడిన వృద్ధురాలు తన పేరు మరియమ్మాళ్ అని, అయితే ఇంటి చిరునామా మాత్రం తెలియదని చెప్పింది. మరియమ్మాళ్ కొద్దిగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించి, ఆమెను 08.09.2025న చికిత్స కోసం మానసిక సంరక్షణ కేంద్రంలో చేర్పించి సంరక్షించారు. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు ఉత్తరమేరూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మరియమ్మాళ్ను మంగళవారంఆమె కుమార్తె గెంగమ్మాళ్, (50) భర్త కృష్ణన్కు అప్పగించారు. కాగా ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు స్వచ్ఛంద సేవకులు, సహాయం చేసిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.భార్యను చంపి భర్త ఆత్మహత్యఅన్నానగర్: విల్లుపురం జిల్లాలోని సెంజి సమీపంలోని పసుమలై తంగల గ్రామానికి చెందిన నమశ్శివాయం (60). ఇతని భార్య పద్మావతి (55) . ఈమె సెంజిలోని ఓ ఉర్దూ పాఠశాలలో పోషకాహార నిపుణురాలిగా పనిచేస్తున్నారు. వీరికి పాండురంగల్ (33 ), పాండియ రాజన్ (31) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పాండురంగల్ వివాహిత. ఈ స్థితిలో రోజూ సెంజిలో పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే పద్మావతి, సాధారణంగా తన భర్తతో కలిసి వ్యవసాయ భూమికి వెళ్లి ఆవులకు నీళ్లు పెట్టడం వంటి పనులు చేసి, రాత్రికి ఇంటికి తిరిగి వస్తుంది. ఈ నేపథ్యలంో మంగవారం సాయంత్రం, ఎప్పటిలాగే, నమచివాయం, పద్మావతి తమ ఇంటికి సమీపంలోని పొలానికి వెళ్లి రాత్రి 8 గంటల వరకు ఇంటికి తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన బంధువులు స్వయంగా చూడటానికి వెళ్లినప్పుడు, పద్మావతి అక్కడి వాగులో మునిగిపోయి కనిపించింది. నమశ్శివాయం సమీపంలోని వేపచెట్టుకు ఉరికి వేలాడుతున్నాడు. ఇద్దరినీ రక్షించి వెంటనే సెంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు ఇద్దరూ అప్పటికే చనిపోయారని చెప్పారు. ఈ విషయం సత్యమంగళం పోలీసులకు సమాచారం అందింది. పోలీసుల దర్యాప్తులో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవని, ఘటన జరిగిన రోజు భార్య భార్యాభర్తలకు ఘర్షణ జరిగిందని ఇందులో నమశ్శివాయం భార్య పద్మవతిని నీటిలో ముంచి చంపి, తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.నేటి నుంచి బయో మెట్రిక్ స్క్రీనింగ్కొరుక్కుపేట: తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి ఇమ్మిగ్రేషన్ విభాగంలో కొత్త బయోమెట్రిక్ స్క్రీనింగ్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఇది మొదటి దశలో తిరుచ్చి, లక్నో సహా విమానాశ్రయాల్లో అమలు చేయనున్నారు. ఇందుకోసం, తిరుచ్చి విమానాశ్రయంలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రయాణికుల వివరాలను మొదటి ట్రిప్ సమయంలో బయోమెట్రిక్గా నమోదు చేస్తారు. భవిష్యత్తులో ఇమ్మిగ్రేషన్ తనిఖీలను సరళమైన పద్ధతిలో త్వరగా నిర్వహించవచ్చని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభమై గురువారం నుంచి ప్రయాణికులకు ఈ ప్రక్రియ సులభతరం, మరింత ప్రభావవంతంగా ఉంటుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. -
విజయ్ ప్రజలతో మాట్లాడితే చాలు
వేలూరు: టీవీకే అధ్యక్షుడు విజయ్ బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడాలని రాష్ట్ర మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గం పరిధిలోని 12వ వార్డు కనిఅముదం కల్యాణ మండపంలో మీతో స్టాలిన్ పథకం కార్యక్రమం బుధవారం ఉదయం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అక్కడికక్కడే అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోర్టు తీర్పు ప్రకారం తాము కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేస్తామని ప్రస్తుతం ప్రకటించదని అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా వర్షాలు కురిసి నీరు బాగా ఉందన్నారు. ప్రస్తుతం తమిళుడైన సీపీ రాధాక్రిష్ణన్ ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని ఆయనకు తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే పరిస్థితి గురించి విలేకరులు ప్రశ్నించగా వాటి గురించి తాను మాట్లాడేందుకు తాను సిద్ధంగా లేదన్నారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ పర్యటన గురించి విలేకరులు ప్రశ్నించగా ఆయన ఎప్పుడు పర్యటకు వచ్చినా తమకు భయం లేదని ప్రజల వద్దకు వచ్చి నేరుగా మాట్లాడితే చాలన్నారు. ప్రజల వద్దకు రావడానికి ఎందుకు శని, ఆదివారాలు అన్నారు. మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్కుమార్, జోన్ చైర్మన్ పుష్పలత, తహసీల్దార్ జగదీశ్వరన్ పాల్గొన్నారు. -
13,14 తేదీల్లో తిరువణ్ణామలైలో ఆధ్యాత్మిక సదస్సు
– లక్ష కంటే ఎక్కువ మంది పాల్గొనే అవకాశం కొరుక్కుపేట: తిరువణ్ణామలైలో ఈనెల 13, 14 తేదీలలో రెండు రోజుల పాటూ వేద ఆగమ దేవర ఆధ్యాత్మిక సాంస్కృతిక సదస్సు జరుగనుంది. ఈ కార్యక్రమం కంచి కామకోటి పీఠం అధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో పాటూ ఆదినామములు, శివాచార్యుల సమక్షంలో జరుగుతుందని నిర్వాహకులు చైన్నె ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఈ సదస్సుకు శ్రీవిల్లిపుత్తూరులోని సడగోప రామానుజ జీయర్ , శ్రీపురంలోని శ్రీశక్తి అమ్మవారు, నారాయణీపీఠం, స్వర్ణ దేవాలయం, వెల్లూరు, మేల్మరువత్తూరు అధిపరాశక్తి పీఠంలోని అరుళ్తిరు సెంథిల్కుమార్ అడిగలర్, రత్నగిరిలోని శ్రీ బాలమురుగన్ ఆదిమయి స్వాములు, కలవై శ్రీ సచ్చిదానంద స్వామి పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో మొదటి రోజు ఈ నెల13 వ తేదీ శనివారం, ఉదయం తమిళనాడు వ్యాప్తంగా 1,008 మంది శివాచార్యులు పాల్గొని మహా శివపూజ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం స్వామితో పాటు ఆధ్యాత్మిక భక్తులు శ్రీసేవ్వాడైశ్రీ స్వచ్ఛంద సేవకులు పాల్గొని గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కతిక ఊరేగింపు జరుగుతుందన్నారు. దీని తరువాత, సాయంత్రం, ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుల ప్రసంగాలు చేసి తమ ఆశీర్వాదాలను అందిస్తారని పేర్కొన్నారు. రెండవ రోజు, 14వ తేదీ ఆదివారం ఉదయంలోక కళ్యాణం కోసం తిరువిళక్కు (పవిత్ర దీపం) పూజ, శ్రీ లలితా సహస్రనామం ,కాంచీ మహాపెరియవ, జీయర్ స్వామిగళ్, తమిళనాడులోని అన్ని ఆధీనాలు, శివాచార్యులు, అలాగే సన్నిదానాలు ఇందులో పాల్గొంటారు. జస్టిస్ రామసుబ్రమణ్యం (మానవ హక్కుల కమిషన్ చైర్మన్) , ఇతర ప్రముఖ వ్యక్తులు కూడా ప్రసంగిస్తారు. దీని తరువాత, శివాచార్యులు, గురువులు, ఆధ్యాత్మిక నాయకులు, సేవ్వాడై స్వచ్ఛంద సేవకులు అన్ని వర్గాల ప్రతినిధులను సత్కరించి జ్ఞాపికలను అందిస్తారని తెలిపారు ప్రత్యేకించి ఆ రోజు సాయంత్రం, మాస్ట్రో ఇళయరాజా కుమారుడు కార్తీక్ రాజా భక్తి సంగీత కచేరీ జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 14ని ప్రపంచ సాంస్కృతిక సామరస్య దినోత్సవంగా కూడా పాటించనున్నారని. ఈ సదస్సును ఇళవరసు పట్టం డాక్టర్ పిటి. రమేష్ గురుక్కల్, అరుల్మిగు అరుణాచలేశ్వర ఆలయం, తిరువణ్ణామలై, చీఫ్ ఆర్గనైజర్ శ్రీతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నారని , ఉత్సవ కమిటీ సభ్యులు, జగదీష్ కడవుల్ తదితరులు ఏర్పాటు పర్యవేక్షిస్తారని వెల్లడించారు. -
బ్యాంకు ఉద్యోగి అనుమానాస్పద మృతి
తిరువళ్లూరు: బ్యాంకు మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగి అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళలు మప్పేడులోని బ్యాంకును ముట్టడించి ఆందోళన చేశారు. తిరువళ్లూరు జిల్లా కూవం గ్రామానికి చెందిన దప(35). ఈమె మప్పేడు ఇండియన్ బ్యాంకులో కాంట్రాక్ట్ ఉద్యోగి. ఈమె ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వడం, స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళల నగదును బ్యాంకులో జమ చేయడం వంటి పనులు చేస్తుంటారు. ఈనెల 14న ఈమెకు వివాహం జరగనున్న క్రమంలో మంగళవారం సాయంత్రం అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరిక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే దీప స్వయం ఉపాధి సంఘాలకు చెందిన నగదు, ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన నగదు రూ.కోటి మేరకు మోసానికి పాల్పడిందని తెలిసింది. దీప మృతి చెందిన క్రమంలో స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళలు, ఉపాధి కూలీలు మప్పేడులోని ఇండియన్ బ్యాంకును బుధవారం ఉదయం ముట్టడించారు. పలు మహిళా స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళల పేరిట భారీగా రుణాలను దీప తీసుకున్నట్టు నిర్ధారించారు. ఈ నగదును సంబంధిత మహిళలే చెల్లించాలని బ్యాంకు అధికారులు తేల్చిచెప్పడంతో వారు ఆందోళనకు దిగారు. తమ ప్రమేయం లేకుండా రుణాలను ఎలా ఇస్తారని బ్యాంకు అధికారులను మహిళలు నిలదీశారు. విషయం తెలుసుకున్న బ్యాంకు ఉన్నతా ధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. రెండు రోజుల్లో స్వయం ఉపాధి సంఘాలకు చెందిన లావాదేవీలు, రుణాలు పొందిన వివరాలు, ఉపాధి కూలీల వేతనాలపై స్టేట్మెంట్ తీసి విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. దీప మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైవిధ్య భరిత కథా చిత్రంగా 2కాయల్
తమిళసినిమా: స్వచ్ఛమైన ప్రేమకు దశాబ్దాలుగా అడ్డుగా మారుతున్నవి కుల మతాలే. అలా మతపిచ్చికి ఒక అందమైన కుటుంబం ఎలా ఛిన్నాభిన్నం అయ్యిందన్న ఇతివృత్తంతో రూపొందిన చిత్రం కాయల్. జే స్టూడియో పతాకంపై ధేసు సుందరమారన్ నిర్మించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను దమయంతి నిర్వహించారు. నటి అనుమోల్, లింగేశ్, గాయత్రి, రమేష్ తిలక్, స్వాగత, ఐసక్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జస్టిన్ సంగీతాన్ని కార్తీక్ ఛాయాగ్రహణంను అందించారు. పోలీస్ అధికారి కూతురు గాయత్రి. కూతురు అంటే తండ్రికి కూతురంటే అమితమైన ప్రేమ.ఆమె లింగేష్ ప్రేమించుకుంటారు. గాయత్రి తన ప్రేమను తండ్రికి చెబుతుంది. ఆయన కూడా ఆమె ప్రేమకు పచ్చజెండా ఊపుతాడు. అయితే వారి పెళ్లి జరగదు. గాయత్రి తన మేనమామ కొడుకుని పెళ్లి చేసుకుంటుంది. అలాంటిది అనూహ్యంగా గాయత్రి ఆత్మహత్యకు పొల్పడుతుంది. అందుకు కారణాలు ఏమిటి? ఆ తరువాత గాయత్రి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటీ ? లింగేష్ను వన్ సైడ్గా ప్రేమించిన మరో యువతి ఏమైంది? పోలీస్ అధికారి కొడుకు స్నేహితుడు, సైక్యారిస్ట్ అయిన రమేష్ తిలక్ వారి కుటుంబానికి ఇచ్చిన సలహా ఏమిటీ? ఇత్యాది పలు అసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం కాయల్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. -
కీచ్చళంలో స్టాలిన్ శిబిరం
పళ్లిపట్టు: పళ్లిపట్టు మండలంలోని కీచ్చళం గ్రామంలో మీతో స్టాలిన్ శిబిరం మంగళవారం నిర్వహించారు. కీచ్చళం, జంగాళపల్లె, నెడిగళ్లు గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. శిబిరంలో ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి ప్రజలు అందజేసిన అర్జీలకు సంబంధించి పరిశీలన చేశారు. మహిళలకు ప్రతినెలా రూ.1000 ఆర్థికసాయం ద్వారా లబ్ధిపొందేందుకు వచ్చిన వినతిపత్రాలపై అధికారులు వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకోవాలని, అలాగే రెవెన్యూ, పంచాయతీరాజ్శాఖ సహా ప్రధాన శాఖల ద్వారా విచ్చిన వినతిపత్రాలకు వెంటనే స్పందించి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. ఆరోగ్యశాఖ ద్వారా గర్భిణులకు పౌష్టికాహార కిట్లు, పంచాయతీరాజ్శాఖ ద్వారా కలైంజర్ ఇళ్ల నిర్మాణం పథకం ద్వారా అర్హులకు వర్క్ ఆర్డర్లు పంపిణీ చేశారు. మండల డీఎంకే కార్యదర్శి రవీంద్ర. తహసీల్దార్ భారతి, బీడీఓలు అర్పుదరాజ్, అరుల్, డీఎంకే నేతలు గోపి, శివానందం పాల్గొన్నారు. -
ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం
కొరుక్కుపేట: ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యమని ఆరోగ్యశాఖా మంత్రి ఎం.సుబ్రమణియన్ అన్నారు. తమిళనాడు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం తరఫున బుధవారం చైన్నెలోని కలైవానర్ అరంగంలో హెచ్ఐవీ ఎయిడ్స్, లైంగికంగా సంక్రమించే వ్యాధులపై అవగాహన ప్రచారం జరిగింది. మంత్రి సుబ్రమణియన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సెంథిల్కుమార్, డిప్యూటీ మేయర్ మహేష్కుమార్, వైద్యవిద్య డైరెక్టర్ సుగంధి రాజకుమారి, ప్రజారోగ్య డైరెక్టర్ సోమసుందరం పాల్గొని మాట్లాడారు. మంత్రి సుబ్రమణియన్ మాట్లాడుతూ హెచ్ఐవి, ఎయిడ్స్ గురించి అవగాహన పెంచుతామని ప్రతిజ్ఞ చేసి ప్రత్యేక ప్రసంగం చేశారు. 7,877 మంది పిల్లలకు పోషకాహారం, విద్య సాయం కోసం నెలకు రూ.1000 అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు, రూ.2 కోట్ల 23 లక్షలు అందించామని చెప్పారు. 2030 నాటికి, కొత్త హెచ్ఐవీ, ఎయిడ్స్ రహిత సమాజాన్ని సృష్టించే లక్ష్యంతో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నేటి నుంచి ఎటువంటి రుసుము లేకుండా ఉచిత హెచ్ఐవీ, ఎయిడ్స్ ,ఇతర లైంగిక సంక్రమణ వ్యాధులకు చికిత్స, పరీక్షలను అందించడానికి నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి మంజూరు చేశామని చెప్పారు. దేశంలో హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాప్తి 0.23 శాతం, తమిళనాడులో ఇది 0.16 శాతానికి తగ్గిందని, భవిష్యత్తులో తమిళనాడు హెచ్ఐవీ ఎయిడ్స్ లేని రాష్ట్రంగా మారాలని పేర్కొన్నారు. తమిళనాడులో లక్షా 37 వేల కొత్త హెచ్ఐవీ సంక్రమణ కేసులు నమోదయ్యాయి. కార్యక్రమాన్ని ఎయిడ్స్ మ్యూజిక్ అసోసియేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ తమిళ్సెల్వన్ నిర్వహించారు. హెచ్ఐవీ బాధితుల సంఖ్య తగ్గుముఖం వేలూరు: అవగాహనతోనే జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులు పూర్తిగా తగ్గారని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు అధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో మానవ హారం, పాఠశాల విద్యార్థులకు మారథాన్ పోటీలు బుధవారం ఉదయం నిర్వహించారు. ముందుగా కలెక్టరేట్ నుంచి వేలూరు నేతాజీ స్టేడియం వరకు జరిగిన మారథాన్ అవగాహన పోటీలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను సాటి మానవులుగా చూడాలన్నారు. సమాజం నుంచి వారిని బహిష్కరించడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్ బాధితులపై ప్రత్యేక శ్రద్ధ వహించి అవసరమైన మందులను సరఫరా చేస్తుందన్నారు. వేలూరు జిల్లాలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య పూర్తిగా తగ్గిందన్నారు. గతంలో జిల్లాలో ఐదు శాతం బాధితులుండగా ప్రస్తుతం వాటి శాతం పూర్తిగా లేనట్లు సర్వేలు చెపుతున్నాయన్నారు. జిల్లాలో ఎయిడ్స్ భాదితులు లేకుండా చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. మనకు తెలియకుండా ఈ వ్యాధి శోకే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ రక్త పరిశోధనలు చేసుకోవడం మంచిదన్నారు. ఎయిడ్స్ బాధితులను కాపాడేందుకు పలు పరిశోధనలు చేస్తున్నారని అందులో భాగంగా పలు టీకాలను కనిపెట్ట వచ్చునన్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలో రోడ్డులో మానవహారంగా నిలిచి ప్రతిజ్ఞ చేశారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహణ కల్పించేందుకు నర్సింగ్ సిబ్బంది వద్ద అవగాహన కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మేయర్ సుజాత, జిల్లా ఆరోగ్యశాఖ అధికారి భరణీధరన్, ఎయిడ్స్ కంట్రోల్ విభాగం రీజినల్ మేనేజర్ కీర్తిక, జిల్లా స్పోర్ట్స్ అధికారి సుబ్రమణియన్, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మిడిల్ క్లాస్ హీరోల కథతో..
తమిళసినిమా: స్టార్స్ను నమ్మి చేసే చిత్రాలు, కథలను నమ్మి తెరకెక్కించే చిత్రాలు అంటూ రెండు రెండు రకాలు రూపొందుతుంటాయి. కాగా స్టార్స్ నటించే కమర్షియల్ కథా చిత్రాలకు మాస్ ప్రేక్షకులు ఎక్కువగా చూస్తుంటారు. అదే మంచి కంటెంట్తో కూడిన కథ చిత్రాలను కుటుంబ సమేతంగా చూసి ఆనందిస్తారు. ఇలా మంచి కథాంశంతో రూపొందుతున్న చిత్రం మిడిల్ క్లాస్. ధనవంతులు అన్ని రకాల సౌకర్యాలతో జీవించే ఈ ప్రపంచంలో.. ఎక్కువగా గుర్తింపు లేని ఇండియాలోని మిడిల్ క్లాస్ హీరోల ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ఇది అని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఇన్స్టాల్మెంట్, రుణమాఫీ, 1బి హెచ్కే వంటి అంశాలు, కలలు వంటి అంచాలతో కూడిన ఎమోషన్లతో కూడిన వినోద భవిత కథాచిత్రంగా మిడిల్ క్లాస్ కుటుంబాల జీవన విధానాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందని చెప్పారు. ఇది కథ కాదని ఒక్కో రూపాయిని లెక్క కట్టుకుంటూ చిన్న చిన్న విషయాలతో సంతోషపడుతూ ఇంటి రుణాన్ని తీసుకున్న దానికంటే ఎక్కువగా ఇన్స్టాల్మెంట్ భారాన్ని మోసే మిడిల్ క్లాస్ ప్రజల జీవన విధానాన్ని అత్యంత సహజత్వంతో చూపే కథ చిత్రం చెప్పారు. ఇది పలువురు జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుందన్నారు. మిడిల్ క్లాస్ దంపతులుగా నటుడు మునీష్ కాంత్ విజయలక్ష్మి నటిస్తున్నారని వీరితోపాటూ కాళీ వెంకట్, రాధా రవి, ఖురేషి, మాళవిక అవినాష్, కోడంగి వడివేలు, వేల రామ్మూర్తి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. వర్ధమాన ప్రతిభావంతులను గుర్తించడంలో పేరు గడించిన దివంగత నిర్మాత ఢిల్లీబాబు నమ్మకాన్ని పొందిన ఈ చిత్ర కథను అదేస్థాయిలో రూపొందిస్తున్నట్లు ని ర్మాతలు దేవ్,కెవి దురై పే ర్కొన్నారు. దీనికి సుదర్శన్ శ్రీనివాసన్ ఛాయాగ్రహ ణం, ప్రణవ్ మునిరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
క్రైమ్, థ్రిల్లర్గా పెణ్కోడ్
తమిళసనిమా: మంచి కంటెంట్తో కూడిన చిత్రాలకు కేరాఫ్ అంటే మాలీవుడ్ అనే అంటారు. అక్కడ స్టార్ హీరోల కంటే కథలను నమ్మి చిత్రాలను చేస్తున్నారు. అవి మంచి విజయాలను సాధిస్తున్నాయి. అలా మాలీవుడ్ చిత్ర బృందం తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కిస్తున్న చిత్రం పెణ్కోడ్. రాజ్ పుత్తణల్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో అరుణ్ సాకో, షరీష్దేవ్ హీరోలుగా నటిస్తుండగా లక్ష్మీశాంత, సోనా నాయికలుగా నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ఆడ, మగ ఒకటి కాదని, ఇద్దరూ వేర్వేరు గుణాలు కలిగినవారని మనోతత్వవేత్త జి.కృష్ణమూర్తి అంటారన్నారు. మగవాడు రెండు కళ్లతో చూస్తే, సీ్త్ర ఒక్క హృదయంతో చూస్తుందన్నారు. ఇలా ఆడ, మగ వాళ్ల దృష్టిలో భావాలు వేర్వేరుగా ఉంటాయన్నారు. అలాంటి అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం పెణ్కోడ్ అని చెప్పారు. ఆస్త్రియా మూవీ ప్రొడక్షన్స్, జేఎన్కేఎల్ క్రియేషన్స్ సంస్థల అధినేతలు పవిత్ర ఆర్.ప్రసన్న, జయ్ నిత్యాకాశీ లక్ష్మీ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను మంగళవారం జిత్తన్ రమేశ్ విడుదల చేసి యూనిట్ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని పెణ్కోడ్ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆయనకు చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపారు. -
రోడ్డు విస్తరణ పనులతో భవనాల కూల్చివేత
తిరువళ్లూరు: తిరువళ్లూరు–ఊత్తుకోట రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇరువైపులా వున్న భవనాలను అధికారులు జేసీబీ సాయంతో కూల్చివేశారు. తిరువళ్లూరు–ఊత్తుకోట రోడ్డు విస్తరణ పనులను అధికారులు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే రోడ్డుకు ఇరువైపులా వున్న భవనాలను కూల్చివేయడంతో పాటూ భూసేకరణ చేపట్టారు. అయితే కొందరు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో విస్తరణ పనులు నిలిచిపోయింది. ఈక్రమంలో భవన యజమానులకు పరిహారం అందించినా ఇంత వరకు ఖాళీ చేయకపోవంతో అధికారులు బుధవారం ఉదయం పోలీసుల సాయంతో కట్టడాలు తొలగించారు. ఈ సమయంలో భవన యజమానులు, పోలీసులు రెవెన్యూ ఉద్యోగులకు మద్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొంది. అయితే భారీ పోలీసు బందోబస్తు నడుమ కట్టడాలను తొలగించారు. వేడుకగా డీఎంకే నేత పుట్టినరోజు పళ్లిపట్టు: డీఎంకే పళ్లిపట్టు మండల మాజీ కార్యదర్శి పి.రవీంద్రనాఽథ్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలురువు శుభాకాంక్షలు తెలిపారు. వెలిగరం గ్రామంలోని రవీంద్రనాఽథ్రెడ్డి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. పళ్లిపట్టు నార్త్ మండల కార్యదర్శి సీజే.శ్రీనివాసన్, పట్టణ కార్యదర్శి సెంథిల్కుమార్, సెంట్రల్ మండల కార్యదర్శి బీడీ చంద్రన్ సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. -
మంతనాల్లో సెంగోట్టయన్ బిజీ
సాక్షి, చైన్నె: గోబి చెట్టి పాళయంలోని తన నివాసంలో రాజకీయ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి మద్దతు దారులతో సెంగ్టోయన్ బుధవారం నుంచి మంతనాలలో మునిగారు. అందరి అభిప్రాయాలను స్వీకరిస్తూ వస్తున్నారు. ఆయన వద్దకు పెద్దసంఖ్యలో మద్దతు దారులు తరలి వస్తున్నారు. అన్నాడీఎంకేలో సమన్వయం, సమష్టి, ఐక్యత నినాదాన్ని అందుకున్న పదవులను సీనియర్ నేత సెంగోట్టయన్ పోగొట్టకున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి చర్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సెంగ్టోయన్ మంగళవారం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్లను కలిసి వచ్చారు. ఢిల్లీ పెద్దల ముందు తన వాదనను, అభిప్రాయాలను ఉంచి ఈరోడ్కు వచ్చిన సెంగ్టోయన్ బుధవారం ఉదయం నుంచి పొద్దు పోయే వరకు మద్దతు దారులతో సమావేశాలతో బిజీ అయ్యారు. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ గురించి మద్దతు దారులతో మాట్లాడుతూ, వారి అభిప్రాయాలను సెంగోట్టయన్ స్వీకరిస్తూ వస్తున్నారు. అలాగే పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలందర్నీ ఒక చోట చేర్చే దిశగా పోన్ మంతనాలు సైతం ఆయా నేతలతో సాగుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. పళణి స్వామికి సెంగోట్టయన్ విధించిన పది రోజుల గడువు ఈనెల 15వతేదీ ముగియనుంది. ఆ తదుపరి సెంగోట్టయన్ పరిణామాలు, బాట ఎలా ఉంటుందో అన్న చర్చ ఊపందుకుంది.సూపర్ చైన్నె పోటీలకు దరఖాస్తుల ఆహ్వానంసాక్షి, చైన్నె : చైన్నె భవిష్యత్తును, సృజనాత్మకతను, అత్యాధునిక సాంకేతికతను ఒకే వేదిక మీదకు తెచ్చే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో (ఏఐ) కళా పోటీలకు అవకాశం కల్పించారు. రీ ఇమాజిన్ చైన్నె ఏఐ ఆర్ట్ ఎగ్జిభిషన్గా జరగనున్న ఈ కార్యక్రమ వివరాలను బుధవారం సూపర్ చైన్నె ఎండీ రంజీత్ రాథోడ్ స్థానికంగా ప్రకటించారు. ఏఐ మేళవింపుతో చైన్నె భవిష్యత్తును ఊహించడం లక్ష్యంగా, నిరంతర అభివృద్ధిని కాంక్షిస్తూ స్కైలైన్ నుంచి శక్తి వంతమైన సంస్కృతి వరకు ఏఐ సాధానాల శక్తిగా వ్యక్తికరించే విధంగా జరగనున్న ఈ పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. సెప్టెంబరు 30 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నామని, విశిష్ట ప్యానెల్ ద్వారా ఎంపిక చేసే టాప్ 25 కళాకృతులను ది ఏఐ ఆర్ట్ షోలో ప్రదర్శించడం జరుగుతుందని వివరించారు. దరఖాస్తులను, ఆవిష్కరణలను హెలో ఎట్ సూపర్ చైన్నె .కామ్కు పంపించాలని సూచించారు.ఐదు చోట్ల ఈడీ దాడులుసాక్షి, చైన్నె : చైన్నెలో బుధవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు ఐదుచోట్ల సోదాలలో నిమగ్నమయ్యారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో ఎన్పోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు తరచూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేసి సోదాలు నిర్వహిస్తూ రావడం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పరిస్థితులలో బుధవారం ఉదయాన్నే చైన్నెలో ఐదుప్రాంతాలను ఈడీ అధికారులు ఎంపిక చేసుకున్నారు. అడయార్, వేళచ్చేరి ,వెస్ట్ మాంబళం, మేడవాక్కం తదితర ఐదు చోట్ల పొద్దుపోయే వరకు సోదాలు జరిగాయి. ఈ నివాసాలను ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త బిష్ణోయ్ , ఓ ప్రముఖ వైద్యురాలు ఇందిరకి సంబంధించినవిగా విచారణలో వెలుగు చూశారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు నిఘా నీడలో జరుగుతున్నాయి.మురుగు నీటి శుద్ధీకరణకు స్వదేశీ సాంకేతికత– ఐఐటీ మద్రాసు ఆవిష్కరణసాక్షి, చైన్నె: దేశీయంగా తదుపరి తరం మురుగు నీటి శుద్ధీకరణ సాంకేతికతను ఐఐటీ మద్రాసు స్టార్టప్ జేఎస్పీ ఎన్విరో అభివృద్ధి చేసింది. ఈ వివరాలను బుధవారం ఐఐటీ మద్రాసు వర్గాలు ప్రకటించాయి. తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని పరిశ్రమలలో ఈ పరిశోధనను విజయవంతంగా అమలు చేశారు. ఈ సాంకేతికత ప్రయోజనాలను లండన్లోని వెస్ట్మినిస్టర్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందిన జెఎస్పీ ఎన్విరో సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ ప్రియదర్శిని మణి వివరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో మురుగునీటిని శుద్ధి చేసే సాంకేతికత ఇది అని పేర్కొన్నారు. స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు, ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి డాక్టర్ విటీ ఫిదాల్కుమార్ పేర్కొంటూ, ప్రస్తుత సాంకేతికతలతో ఉన్న ముఖ్యమైన తేడాలను వివరించారు. సాంప్రదాయ ఏరోబిక్ వ్యవస్థలు మురుగు నీటిలోకి ఆక్సిజన్ను పంప్ చేయడానికి పెద్ద మొత్తంలో విద్యుత్ను వినియోగిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ దేశీయ సాంకేతికత బెడ్స్టీఎం ఆక్సిజన్ లేకుండా పనిచేస్తుందని, ఎలక్ట్రోడ్ భర్తీలు తరచూ అవసరం లేదన్నారు. బీఈఏడీఎస్(బెడ్స్) విద్యుత్, రసాయనాలను ఉపయోగించకుండా మురునీటిని శుభ్ర పరుస్తుందని వివరించారు. ఈరోడ్, పెరుందురైలలోని రెండు పారిశ్రామిక యూనిట్లలో విజయవంతంగా ఈ టెక్నాలజీ అమలు చేశామన్నారు. -
‘సీమాన్’ కసరత్తు
సాక్షి, చైన్నె: లోక్సభ ఎన్నికలలో తన కంటూ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఉందని మరోమారు నిరూపించుకున్న నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో మరింత బలాన్ని చాటే దిశగా కసరత్తులలో పడ్డారు. 130 మందితో అభ్యర్థుల జాబితాను ఆయన సిద్ధం చేసి ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. వీరంతా 30 ఏళ్లలోపు యువతీ, యువకులే అని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు.. పార్టీ ఆవిర్భావ కాలం నుంచి ప్రతి ఎన్నికలలోనూ సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి ఒంటరిగా పోటీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. క్రమంగా ఆ పార్టీ తన ఓటు బ్యాంక్ను పెంచుకుంటూ వస్తోంది. లోక్సభ ఎన్నికల సమయంలో అయితే, ఆ పార్టీ ఓటు బ్యాంక్ మీద ప్రభావం పడే విధంగా వ్యూహాలు, కుట్రలు జరిగాయి. ఆది నుంచి ఆపార్టీ పోటీ చేస్తూ వచ్చిన చెరుకు రైతు చిహ్నం లోక్సభ ఎన్నికలలో దూరం చేశారు. అయినా ఏ మాత్రం తగ్గని సీమాన్ మైక్ చిహ్నం చేతికి అంది పుచ్చుకుని ఒంటరిగా పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలోని 40 స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టారు. ఇందులో 20 మంది మహిళలను నిలబెట్టి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచా రంలో సీమాన్ ఉరకలు తీశారు. ఇందుకు తగిన ఫలితం ఓటు బ్యాంక్ ద్వారా దక్కించుకున్నారు. ఈసీ గుర్తింపు సైతం.. అంతేకాదు, ఎన్నికల కమిషన్ గుర్తింపును సైతం సీమాన్ పార్టీ దక్కించుకుంది. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కనీసం 35 వేల నుంచి 80 వేల మధ్య ఓట్లను ఆ పార్టీ సాధించడం విశేషం. అలాగే, బీజేపీ, అన్నాడీఎంకే కూటముల అభ్యర్థులకు చుక్కలు చూపించే రీతిలో 7 నియోజకవర్గాలలో మూడో స్థానాన్ని కై వసం చేసుకునే విధంగా నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు అధిక ఓట్లను సాధించారు. ఇదే ఊపుతో 2026 అసెంబ్లీ ఎన్నికలలో బలాన్ని మరింతగా చాటే దిశగా సీమాన్ వ్యూహాలకు పదును పెట్టారు. ఇందుకోసం ముందుగానే అభ్యర్థుల ఎంపిక కసరత్తులలో నిమగ్నమై ఉన్నారు. యువతీ, యువకులను ఈ సారి పెద్ద సంఖ్యలో ఎన్నికల బరిలో నిలబెట్టే విధంగా జాబితా కసరత్తులు జరుగుతున్న ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 130 నియోజకవర్గాలకు అభ్యర్థులను సీమాన్ ఖరారుచేసినట్టు, ఇందులో 30 ఏళ్లలలోపు యువతీ, యువకులు అధికంగా ఉన్నట్టు ఓ నేత పేర్కొనడం గమనార్హం. ఈ జాబితాలో 65 మంది యువకులు, 65 మంది యువతులు ఉండడం గమనార్హం. మిగిలిన నియోజకవర్గాలకు స్థానికంగాపార్టీకి ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న మేధావులు, విద్యావంతులను నిలబెట్టే వ్యూహంతో కసరత్తుల వేగాన్ని సీమాన్ పెంచి ఉన్నారు. ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించి, ప్రజలల్లోకిప్రచార పర్యటనకు సైతం ఆయన రూట్ మ్యాప్ స్వయంగా రూపొందించుకుంటుండడం గమనార్హం. -
నిఘా వలయంలో పరమకుడి
సాక్షి, చైన్నె : రామనాథపురం జిల్లా పరమకుడి పరిసరాలను 7 వేల మంది పోలీసులతో నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. ఇక్కడికి ఆరు వందల ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక కార్యకర్త ఇమాన్యుయేల్ శేఖర్ సంస్మరణ దినోత్సవం గురువారం పరమకుడిలో జరగనుంది. గతంలో ఇక్కడ చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిణామాలతో ఏటా ఇమాన్యుయేల్ జయంతి, సంస్మరణ దినోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా తాజాగా పరమకుడిని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. ఇక్కడకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రులు తంగం తెన్నరసు, రాజకన్నప్పన్తో పాటుగా పలు పార్టీల నేతలు తరలి రానున్నారు. దీంతో పరమకుడి పరిసర మార్గాలను నిఘా వలయంలోకి తెచ్చారు. నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాలను జన సందోహం ఇక్కడకు పెద్దఎత్తున తరలి రావడం పరిపాటే. ఈ దృష్ట్యా, ఆరు వందల ప్రత్యేక బస్సులను పరమకుడికి నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. డ్రోన్ల ద్వారా సైతం భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పరమకుడిలో 200 మంది పోలీసు అధికారులతో పాటూ 7 వేల మంది సిబ్బంది భద్రతా విధులలో ఉన్నారు. భద్రతా విధుల్లో పోలీసులు -
పోరాటంతో దక్కిన న్యాయం
సాక్షి, చైన్నె: నాలుగు సంవత్సరాల పోరాటం తర్వాత కుటుంబ పెన్షన్ను ఓ సిఫాయి కుటుంబం దక్కించుకుంది. భారత సైన్యంలో విల్లుపురం జిల్లా సెంజికి చెందిన కె. దురైస్వామి 1971లో సిపాయిగా పనిచేశారు. ఎడమ కాలుకు గాయం కావడంతో 1975లో సైన్యంలో కొనసాగ లేక పోయారు. ఆయనకు వైకల్య పెన్షన్ అందుతూ వచ్చింది. 2021లో దురైస్వామి మరణించాడు. ఆర్మీ నుంచి వచ్చినానంతరం పూంగోదైను దురై స్వామి వివాహం చేసుకున్నప్పటికీ, ఆమె పేరును సర్వీసు రికార్డులలో చేర్చలేదు. దీంతో కుటుంబ పెన్షన్ చెల్లించ లేని పరిస్థితి ఏర్పడింది. 2021 కోవిడ్ కాలం కావడంతో ఏమి చేయలేని పరిస్థితిలో అధికారులు సైతం పడ్డారు. ఆ తదుపరి పూంగోదై పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ ఆర్మీలోని సంబంధిత విభాగం అధికారుల చుట్టూ తిరిగింది. చివరకు పీసీడీఏ(పెన్షన్లు)విభాగం అధికారి ప్రయాగ్ రాజ్ను కలిసి విన్నవించారు. ఆమె కష్టాలను విన్న అధికారి ప్రయాగ్ రాజ్ ఈ ఏడాది జూన్లో పూంగోదైకు అనుకూలంగా కుటుంబ పెన్షన్ చెల్లింపునకు ఆదేశాలు ఇచ్చారు. పూంగోదై, ఆమె కుమారుడు జయకుమార్ నాలుగు సంవత్సరాల పాటుగా చేసిన పోరాటానికి ప్రస్తుతం న్యాయం దక్కింది. పూంగోదైకు నెలకు రూ. 13,950 కుటుంబ పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే, దురైస్వామి మరణం తర్వాత నుంచి ఉన్న బకాయిగా కుటుంబ పెన్షన్కు గాను రూ. 4,64,408కు గాను చెక్కను అధికారులు అందజేశారు. ఈ చెక్కును పూంగోదై తరపున ఆమె కుమారుడు అధికారుల నుంచి అందుకున్నారు. -
నయనతారను వెంటాడుతున్న కోర్టు కేసులు
తమిళసినిమా: పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. ముఖ్యంగా దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా వెలుగొందుతున్న ఈ భామ దర్శకుడు విఘ్నేశ్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి సరోగసీ విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలు కూడా కలిగారు. కాగా ఆ మధ్య నయనతార ప్రేమ, పెళ్లి అంశాలతో కూడిన తన చిన్న బయోపిక్ను నయనతార బియాండ్ ది ఫెరీ టేల్ పేరుతో డాక్కుమెంటరిని రూపొందించారు. దీన్ని నెట్ ఫ్లిక్ ఓటీటీ సంస్థ భారీ మొత్తం చెల్లించి స్ట్రీమింగ్ హక్కులను పొంది ప్రసారం చేసింది. అక్కడి వరకూ బాగానే ఉన్నా, ఆ డాక్యుమెంటరీ చిత్రంలో నటుడు ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీదాన్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఆయన అనుమతి లేకుండా పొందుపరినందుకు ధనుష్ రూ. 10 కోట్లు చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు విచారణలో ఉండగానే తాజాగా అదే డాక్కుమెంటరిలో చంద్రముఖి చిత్రంలోని కొన్ని సన్నివేశాలను అనుమతి లేకుండా పొందుపరిచారంటూ ఏబీ ఇంటర్నేషనల్ సంస్థ అధినేతలు చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తమ చిత్రంలోని సన్నివేశాలను తమ అనుమతి పొందకుండా నయనతారకు చెందిన డాక్కుమెంటరీలో పందుపరిచారని, అందుకు గానూ నష్టపరిహారంగా రూ. 5 కోట్లు చెల్లించాలని ఆదేశించాలని పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తి సెంథిల్ కుమార్ సమక్షంలో విచారణకు వచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై చర్చలు జరుపుతున్నట్లు డార్క్ స్టూడియోస్ సంస్థ తరపున హాజరైన న్యాయవాది పేర్కొన్నారు.అయితే ఇప్పటి వరకూ ఎలాంటి చర్చలు జరపలేదని సిటీషన్ దారుడి తరపు న్యాయవాది వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో రిట్ పిటీషన్ దాఖలు చేయాలని డార్క్ స్టూడియోస్ సంస్థకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి అక్టోబర్ 2లో విచారణ జరుపుతామంటూ పేర్కొన్నారు. దీంతో నయనతార ధనుష్ పిటిషన్తో పాటూ ఇప్పుడు ఏబీ ఇంటర్నేషనల్ సంస్థ పిటిషన్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
మళ్లీ కోర్టుకు పీఎంకే పంచాయితీ
– రామన్న కేవియేట్ పిటిషన్ దాఖలు సాక్షి, చైన్నె: పీఎంకే వివాదాల పంచాయితీ మళ్లీ కో ర్టుకు చేరింది. ఈ సారి పార్టీ పేరు, జెండా, చిహ్నంను రక్షించుకునేందుకు ముందస్తు వ్యూహంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు కేవియేట్ పిటిషన్ ను హైకోర్టులో బుధవారం దాఖలు చేశారు. వివరాలు.. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన త నయుడు అన్బుమణి మధ్య సాగుతున్న అధికార స మరం గురించి తెలిసిందే. నాయకులు, కేడర్ రెండు బృందాలుగా ఈ వివాదం పుణ్యమా విడి పోయి ఉ న్నారు. సీనియర్లు అయితే, ఈ ఇద్దరి మధ్య నలిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్బుమణిని పార్టీ నుంచి బయటకు పంపించేందుకు రాందాసు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. రెండు సార్లు క్ర మ శిక్షణ కమిటీ నోటీసులు పంపినా, అన్బుమణి నుంచి సమాధానం రాక పోవడాన్ని రాందాసు తీ వ్రంగా పరిగణించారు. అన్బుమణిని బయటకు ప ంపించిన పక్షంలో పార్టీని హైజాక్ చేస్తారేమో అన్న బెంగ రాందాసులో ఉన్నట్టు సమాచారం. రాందాసు వెన్నంటి సీనియర్లు ఉన్నా, యువ రక్తం అంతా అన్బుమణి చుట్టూ ఉండటంతో ఎక్కడ పార్టీని తన గుప్పెట్లోకి ఆయన తెచ్చుకుంటారో అన్న బెంగ రాందాసు మద్దతు దారుల్ని వీడడం లేదు. ముందు జాగ్రత్తగా.. ఇది వరకు రాందాసు శిబిరానికి పోటీగా అన్బుమణి పీఎంకే సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా కోర్టును రామన్న తట్టినా ప్రయోజనం శూన్యం. అన్బుమణి తన నేతృత్వంలో సర్వ సభ్య సమావేశాన్ని విజయవంతంచేసుకుని, నేతల పదవీ కాలాలన్నీ మరో ఏడాది పొడిగించుకున్నారు. అదే సమయంలో రాందాసు సైతం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన అన్ని అధికారాలు తనకే అని చాటుకున్నారు. ఈపరిణామాలు ఓ వైపు ఉంటే, మున్ముందు ఎదురయ్యే పరిస్థిలతో ఎక్కడ పార్టీ పేరు, జెండా, చిహ్నంను అన్బుమణి తన గుప్పెట్లోకి తెచ్చుకుంటాడోనన్న బెంగతో ముందస్తు జాగ్రత్తలో రాందాసు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా అన్బుమణికన్నా ముందుగా హైకోర్టు తలుపు తట్టారు. పార్టీ పేరు, చిహ్నం, జెండాను తన గుప్పెట్లో తీసుకునేందుకు అన్బుమణి తీవ్ర ప్రయత్నాలలో ఉన్న సమాచారంతో రాందాసు మేల్కొని ముందుగానే బుధవారం హైకోర్టులో కేవియేట్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ పేరు, జెండా, చిహ్నం విషయంగా అన్బుమణి గానీ, మరెవరైనా గానీ పిటిషన్ దాఖలు చేసిన పక్షంలో ముందుగా తన వాదనను వినాలని , తన వివరణను తప్పని సరిగా స్వీకరించాలని ఆ కేవియేట్ పిటిషన్ ద్వారా న్యాయ స్థానాన్ని రాందాసు అభ్యర్థించారు. -
గీత కార్మికుడి ప్రశ్నలతో పళణికి ఇరకాటం
సాక్షి, చైన్నె : గీత కార్మికుడి రూపంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి ఇరకాటంలో పడ్డారు. ఆ కార్మికుడు ప్రశ్నల వర్షం కురిపించడంతో పళణి స్వామిలో ఆగ్రహం కనిపించింది. వివరాలు.. తమిళనాడు, తమిళ ప్రజలను రక్షిద్దామన్న నినాదంతో పళణిస్వామి ప్రజా చైతన్య యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. నాలుగో విడత యాత్ర బుధవారం కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి పరిధిలోకి చేరింది. ఇక్కడి రైతులతో పళణిస్వామి ప్రత్యేక సమావేశానికి నిర్ణయించారు. ఇక్కడ కొబ్బరి రైతులు మరీ ఎక్కువగానే ఉన్నారు. అన్ని వర్గాల రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అందరి సమస్యలను పళణి స్వామి ఆలకించారు. ఈ సమయంలో ఓ కల్లుగీత కార్మికుడు పళణిస్వామిని ఇరకాటంలో పడేస్తూ ప్రశ్నలను సంధించాడు. కల్లు గీతకు నిషేధం విధించి దశాబ్దాలు కావస్తోందన్నారు. ఇది వరకు అధికారంలో ఉన్నప్పుడు తమరెందుకు కల్లుగీతకు అనుమతి ఇవ్వలేదో స్పష్టం చేయాలని నిలదీశాడు. దీంతో పళణి స్వామి ఇరకాటంలో పడ్డాడు. వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోనని, 8 కోట్ల మంది ప్రజల సమస్యలు ఉన్నాయని దాట వేసే పనిలో పడ్డారు. అయితే, ఆ గీతకార్మికుడు పట్టువదలని విక్రమార్కుడి వలే ప్రశ్నలను ఎక్కుబెట్టడంతో పళణికి ఆగ్రహం వచ్చేసింది. సమస్యలు వినేందుకు తాను ఇక్కడకు వచ్చానని, సమస్యలు ఉంటే తెలియజేయాలని, అర్థం చేసుకోవాలని సున్నితంగా మందలించారు. అయినా, ఆ గీత కార్మికుడు తగ్గక పోవడంతో పక్కనే ఉన్న సీనియర్ నేత ఎస్పీ వేలుమణి, పొల్లాచ్చి విజయరామన్ ఆ కార్మికుడికి నచ్చ చెప్పే విధంగా వ్యాఖ్యల తూటాలను పేల్చక తప్పలేదు. అదే సమయంలో పలువురు రైతులు సైతం ప్రశ్నల తూటాలను పేల్చడంతో సమావేశంలో గందరగోళం, ఉత్కంఠ తప్పలేదు. కాగా ఈ సమావేశానంతరం పళణిస్వామి మాట్లాడుతూ, 2026 ఎన్నికలతో రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమ గీతం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. -
తమిళనాడులో ఏపీ ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తమిళనాడులోని కృష్ణగిరిలోని కేఆర్పీ ఆనకట్టపై నుంచి దూకి నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటకు చెందిన అత్త శారదమ్మాళ్ (75), అల్లుడు లక్ష్మణమూర్తి (50), ఆయన భార్య జ్యోతి (45), కుమార్తె కీర్తిక (20) ఆనకట్టలోని చిన్న స్లూయిస్ గేట్ల దగ్గర నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. శారదమ్మాళ్, లక్ష్మణమూర్తి ఆనకట్టలోని నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. జ్యోతి, కీర్తికను సమీపంలోని మత్స్యకారులు రక్షించి కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. -
‘అందరికీ ఏఐ 2.ఓ’
సాక్షి, చైన్నె : అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2. ఓ పేరిట అన్ని తరగతుల పాఠశాలల ఉపాధ్యాయులకు స్వయం ప్లస్ ఉచిత ఏఐ కోర్సులను విస్తరించేందుకు ఐఐటీ మద్రాసు నిర్ణయించింది. ఇందుకోసం ఉచిత ఏఐ కోర్సుల రెండవ దశ కిండర్ గార్టెన్ నుంచి ప్లస్–2 వరకు ఉపాధ్యాయులు దృష్టి పెట్టే విధంగా దరఖాస్తుల నమోదుకు చర్యలు తీసుకుంది. అక్టోబరు 10 చివరి రోజుగా నిర్ణయించారు. ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఆన్లైన్ మోడ్లో స్వయం ప్లస్ ద్వారా ఈ కోర్సులను అందించనున్నారు. గతంలో అందించిన ఐదు కోర్సులతో పాటు (భౌతిక శాస్త్రంలో ఏఐ, రసాయన శాస్త్రంలో ఏఐ, అకౌంటింగ్లో ఏఐ, ఏఐతో క్రికెట్ అనలిటిక్స్ పైథాన్ ఉపయోగించి ఏఐ) ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్ అనే కొత్త కోర్సును ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. వీటి వ్యవధి 25 నుంచి 45 గంటల మధ్య ఉంటుందని ఉచితంగా అందించబడుతోందని, సర్టిఫికేషన్ కోరుకునే వారు నియమించబడిన కేంద్రాలలో ప్రొక్టార్డ్ పరీక్షల ద్వారా నామమాత్రపు రుసుముతో కోర్సును పొందవచ్చని ప్రకటించారు. బోధన, మూల్యాంకనం, విద్యార్థులను మెరుగుపరచడానికి అవసరమైన ఏఐ జ్ఞానం, ఆచరణాత్మక సాధనాలను పొందడానికి ఉపాధ్యాయులు, ఆశావహులైన ఉపాధ్యాయులు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. ఈ కోర్సులు ఏఐ విద్యను అన్ని విభాగాలలో కలుపుకొని, అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నిరకాల విద్యార్థులకు.. ఇవి ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం మాత్రమే కాకుండా కళలు, సైనన్స్, వాణిజ్యం, ఇతర రంగాల నుంచి నేర్చుకునేవారి కోసం కూడా రూపొందించబడిందని వివరించారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మంగళవారం క్యాంపస్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇతర వాటాదారుల సమక్షంలో కొత్త ఏఐ కోర్సును ప్రారంభించారు. ఆరు కోర్సులకు దరఖాస్తుల చివరి తేది అక్టోబరు 10గా ప్రకటించారు. ఈ క్రింది లింక్ ద్వారా pm u&rp@rwayam2.ac.in, httpr://rwayam& pur.rwayam2.ac.in/ai&gor&a&courrer వెబ్ సైట్లో నమోదు చేసుకోవచ్చు అని సూచించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వి. కామకోటి మాట్లాడుతూ, ‘కృత్రిమ మేధస్సు అభ్యాస భవిష్యత్తును పునర్ నిర్మిస్తోందన్నారు. తరగతి గదుల్లోకి ఈ మార్పును తీసుకురావడం దిశగా ఏఐ నైపుణ్యాలతో ఉపాధ్యాయులను సన్నద్ధం చేయడం ద్వారా విద్యను బలోపేతం చేయడమే కాకుండా దేశ నిర్మాణానికి కూడా దోహదకరంగా ఉంటుందన్నారు. భారతదేశం అంతటా ఉన్న పాఠశాల ఉపాధ్యాయులను దరఖాస్తు చేసుకోవచ్చు అని, ఈ చొరవ నుంచి ప్రయోజనం పొందమని ఆహ్వానిస్తున్నామని ఐఐఖీ మద్రాస్ డీన్ (ప్లానింగ్) ప్రొఫెసర్ ఆర్. సారథి ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. ఏఐ లేదా కోడింగ్లో ముందస్తు అనుభవం అవసరం లేదని, ప్రాథమిక డిజిటల్ అక్షరాస్యత, నేర్చుకోవడానికి ఉత్సాహం ఉంటే సరిపోతుందన్నారు. -
సప్తగిరి ఎక్స్ప్రెస్కు ఎల్హెచ్బీ కోచ్లు
సాక్షి, చైన్నె: చైన్నె– తిరుపతి సప్తగిరి ఎక్స్ప్రెస్ ప్రయాణికుల కోసం సౌకర్యం, భద్రత పెంపు దిశగా దక్షిణ రైల్వే చర్యలు తీసుకుంది. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ప్రస్తుతం ఉన్న రైలు రేక్ కోచ్లను ఎల్ హెచ్బీ(లింక్ – హాఫ్మన్– బుష్) కోచ్లుగా మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. వివరాలు.. ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ నుంచి తిరుపతి మధ్య రాక పోకలు సాగే సప్తగిరి ఎక్స్ప్రెస్ సెప్టెంబరు 20వ తేదీ నుంచి ఎల్హెచ్బీ కోచ్లతో నడవనున్నట్టు దక్షిణ రైల్వే మంగళవారం ప్రకటించింది. ఎల్హెచ్బీ కోచ్లుగా మార్చనున్న దృష్ట్యా, 16053/16504, 16057/6058 నెంబర్లతో డాక్టర్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్– తిరుపతి– డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ మధ్య సప్తగిరి రైలు నడుస్తుందని పేర్కొన్నారు. అలాగే ఒక ఏసీ చైర్ కోచ్, 10 చైర్ కార్ కోచ్, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, ఒక సెకండ్ క్లాస్ కోచ్(దివ్యాంగులకు అనుకూలంగా), ఒక లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ కోచ్గా రైలు పట్టాలు ఎక్కుతుందని వివరించారు. అలాగే కాచీగూడా – చెంగల్పట్టు – కాచీగూడా ఎక్స్ప్రెస్లో ఓ స్లీపర్ క్లాస్ కోచ్ స్థానంలో ఓ ఏసీ త్రీ టైర్ కోచ్ను డిసెంబర్ 6వ తేదీ నుంచి చేర్చానన్నారు. కాకినాడ పోర్ట్ – చెంగల్పట్టు – కాకినాడ పోర్ట్ సర్కార్ ఎక్స్ప్రెస్లో ఒక స్లీపర్ క్లాస్ కోచ్ స్థానంలో ఒక ఏసీ త్రీ టైర్ కోచ్ డిసెంబరు 7 నుంచి చేర్చనున్నారు. కాచీగూడా – పుదుచ్చేరి– కాచీగుడా ఎక్స్ప్రెస్లో ఒక ఏసీ త్రీ టైర్ కోచ్ ను ఒక స్లీపర్ కోచ్ స్థానంలో డిసెంబర్ 5 నుంచి అమల్లోకి తీసుకు రానున్నారు. కాకినాడ పోర్టు – పుదుచ్చేరి –కాకినాడ పోర్టు సర్కార్ ఎక్స్ప్రెస్లో ఒక స్లీపర్ కోచ్ స్థానంలో ఒక ఏసీ త్రీ టైర్ కోచ్ను డిసెంబరు 8 నుంచి చేర్చనున్నారు. అలాగే, బెంగళూరు – నాగర్ కోయిల్ – ఎస్ఎంబీటీ బెంగళూరు ఎక్స్ప్రెస్లోనూ ఒక స్లీపర్ కోచ్ స్థానంలో ఒక ఏసీ త్రీ టైర్ కోచ్ను డిసెంబరు 4 నుంచి చేర్చనున్నట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. -
ఇష్టంతో చదివితే.. విజయం తథ్యం
కొరుక్కుపేట: విద్యార్థులు ఇష్టపడి చదవితే విజయం సాధించడం ఖాయం అని ఎస్కేపీడీ పాఠశాల పూర్వ విద్యార్థి, ఊరా గ్రూప్ ఛైర్మన్ ఊరా లక్ష్మీ నరసింహరావు అన్నారు. శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం అండ్ ఛారిటీస్ నిర్వహణలోని ఎస్కేపీడీ బాలుర ప్రాథమిక, ఉన్నత పాఠశాల 108వ వార్షికోత్సవం మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. పాఠశాలల కరస్పాండెంట్ ఎస్ ఎల్ సూదర్శనం అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వూరా లక్ష్మీ నరసింహరావు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. తాను ఇదే పాఠశాలలో పూర్వ విద్యార్థినని, తాను చదువుకున్న విధానం, ఉపాధ్యాయుల బోధన తదితర పలు అంశాలను గుర్తు చేస్తూ ప్రసంగించారు. విద్య అనేది ప్రతీ ఒక్కరికీ చాలా అవసరం దానిని ఇష్టంతో చదివితే జీవితంలో విజయం సాధిస్తారని హితవుపలికారు. సంగీతంపై తనకు ఉన్న ఆసక్తితో విశ్వ కళా సంగమ అనే సంస్థను స్థాపించి తద్వారా కళాసేవ చేస్తున్నట్లు తెలిపారు. నార్త్ చైన్నె డీఈవో ఎలిల్ అరసి ప్రత్యేక అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు ఈ రమేష్ , ఓ. లీలారాణి వార్షిక నివేదిక సమర్పించారు. అనంతరం అతిథులతో కలసి పబ్లిక్ పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రోలింగ్ షీల్డ్ లు, బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
ఆమ్నీ బస్సులో రూ. 4.42 కోట్లు స్వాధీనం
అన్నానగర్: చైన్నె మన్నడి నుంచి పరమకుడికి వెళుతున్న ప్రైవేట్ ఆమ్నీ బస్సులో పెద్ద మొత్తంలో డబ్బు రవాణా చేస్తున్నట్లు చెంగల్పట్టు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందింది. దీంతో సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మధురాంతకం సమీపంలోని అత్తూర్ టోల్ బూత్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆచారి పక్కం పోలీసులు చైన్నె నుంచి వస్తున్న ప్రైవేట్ ఆమ్నీ బస్సులో సోదాలు చేయగా.. మధురైలోని కామరాజ్ సాలై నివాసి అయిన గణేశన్ 4 పెద్ద సంచులతో రూ. 3.92 కోట్లు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఈ డబ్బు కారైకుడికి చెందిన ఓ వ్యాపారవేత్తదని తెలిసింది. అదే బస్సులో ఉన్న చైన్నెలోని తిరువళ్లికేనికి చెందిన అంబ్రోస్ బ్యాగులో రూ. 50 లక్షల నగదును గుర్తించారు. ఈ డబ్బు రామనాథపురం జిల్లా పుత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తిదని సమాచారం. కానీ ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు వారి వద్ద లేవు. దీని తర్వాత, పోలీసులు రూ.4 కోట్ల 42 లక్షలను స్వాధీనం చేసుకుని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. ఇది హవాలా నగదా..? అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. 23 నుంచి గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సాక్షి, చైన్నె: ఆన్లైన్ వర్తకం వేదికగా అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఈనెల 23వ తేదీన ప్రారంభం అవుతుందని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. పండుగ సీజన్లను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు విస్తృత ఎంపిక కోసం అన్ని రకాల వస్తువులను అమెజాన్లో కొలువు దీర్చనున్నామని మంగళవారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రకటించారు. దేశంలోనే అతి పెద్ద షాపింగ్ వేడుకగా అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఉండబోతున్నట్టు ఽధీమా వ్యక్తం చేశారు. జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో పలు రకాల కొత్త ఉత్పత్తులు సైతం కొలువు దీర్చనున్నామని , ఈ వస్తువుల డెలవరీ కోసం కొత్తగా 45 డెలవరీ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇందులో తమిళనాడులోని మరైమలై, తిరుచ్చి, ఆంధ్రప్రదేశ్లో నర్సిపట్నం, వంటి టైర్ 2, టైర్ 3 నగరాలు ఉన్నాయని ప్రకటించారు. ఇటీవల 12 కొత్త పుల్ ఫిల్మెంట్ సెంటర్లు, 6 కొత్త స్టార్టింగ్ సెంటర్లతో నెట్వర్క్ సేవలను విస్తరించామని గుర్తుచేశారు. ఆపరేషన్స్ విభాగం ఉపాధ్యక్షుడు అభినవ్ సింగ్ మాట్లాడుతూ, వినియోగదారుల కోసం అన్ని రకాల వస్తువులు తీసుకు రావడమే కాదు, ఆనందాన్నిసైతం కలిగించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. పళణితో ఈరోడ్ నేతల భేటీ సేలం: ఈరోడ్ రూరల్ వెస్ట్ జిల్లా నిర్వాహకులు పెద్దసంఖ్యలో మంగళవారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో సమావేశయ్యారు. సెంగోట్టయన్ను ఆ జిల్లా కార్యదర్శి పదవి నుంచి పళణిస్వామి తప్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఏకే సెల్వరాజ్ను ఇన్చార్జ్గా నియమించారు. ఈ పరిస్థితులలో ఈరోడ్ రూరల్ వెస్ట్ జిల్లాలోని అందియూరు, గోపి చెట్టి పాళయం, భవానీసాగర్ తదితర అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ముఖ్య నేతలందరూ పళణిస్వామిని కలవడం ప్రాధాన్యతకు దారి తీసింది. సేలం హైవే నగర్లోని పళణిస్వామి నివాసానికి మంగళవారం వెళ్లి మరీ తమ మద్దతు తెలియజేశారు. ఆయన్ను సత్కరించారు. వీరంతా సెంగోట్టయన్కు వ్యతిరేకంగా జిల్లాలో పావులు కదిపే పనిలో పడటంతో ఈరోడ్ రాజకీయం రసవత్తరంగా మారినట్లయ్యింది. చైన్నె పోలీసు కమిషనర్ నేతృత్వంలో స్పెషల్ గ్రీవెన్స్ డే తిరువొత్తియూరు: చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ పోలీసుల ఫిర్యాదుల పరిష్కార ప్రత్యేక శిబిరంలో 146 మంది పోలీసు అధికారులు, సిబ్బంది నుంచి ఫిర్యాదులను స్వీకరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ అరుణ్ ఫిర్యాదుల పరిష్కార ప్రత్యేక శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు కమిషనర్ (ఇనన్ఛార్జ్: హెడ్ క్వార్టర్స్) జి. కార్తికేయన్, ఐ.పి.ఎస్., డిప్యూటీ కమిషనర్లు శ్రీనాథ్, ఐ.పి.ఎస్., (సైబర్ క్రైమ్), బి. గీత (హెడ్ క్వార్టర్స్), పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చదువుకున్న పాఠశాలకు పేరు తీసుకురావాలి
వేలూరు: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భవిష్యత్లో ఉన్నత విద్యను అభ్యసించి చదివిన పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలని పాఠశాల కమిటీ చైర్మన్, కార్పొరేటర్ అన్బు అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో సుమారు 1000 మంది విద్యార్థులకు తన సొంత ఖర్చులతో గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం విద్యార్థులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తారకేశ్వరి, టీచర్లు బాబు, జనార్ధనన్, విద్యార్థులు పాల్గొన్నారు. గుర్తింపు కార్డులను అందజేస్తున్న చైర్మన్ అన్బు -
గాయాలైనా షూటింగ్ పూర్తి చేశారు..!
తమిళసినిమా: సినిమాల చిత్రీకరణ థియేటర్ నుంచి చూసే వారికి వినోదంగా ఉంటాయి. అన్ని రంగాల్లో మాదిరిగా ఇక్కడా సాధక బాధలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే షూటింగ్లు ప్రాణాలతో చెలగాటమే. ఒక్కోసారి పెద్ద మూల్యమే చెల్లించే పరిస్థితే నెలకొంటుంది. అలా కొద్దిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు మురుగా అశోక్. ఈయన ఇంతకుముందు మురుగా, పిడిచ్చిరుక్కు, కోళి కూవుదు, గ్యాంగ్స్ ఆఫ్ మెడ్రాస్, మాయతిరై ,ఆర్ యు ఓకే బేబీ వంటి పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించారన్నది గమనార్హం. కాగా తాజాగా మురుగ అశోక్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వడ మంజువిరట్టు. అన్నగారు పిక్చర్స్ పతాకంపై ప్రళయ స్వామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ దర్శకత్వం బాధ్యతలను సంగిలి. సీసీఏ నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ, కుటుంబ అనుబంధాలు, వీరత్వం, సంస్కృతి, సాంప్రదాయాలు వంటి అంచనాలతో కూడిన కథా చిత్రంగా ఉంటుందన్నారు. వీటిలో మంజువిరట్టు క్రీడ ప్రధానంగా ఉంటుందన్నారు. (మంజువిరట్టు అంటే ఎద్దుల పరుగుల పోటీలు అని అర్థం) ఈ చిత్ర షూటింగ్ను దిండుక్కల్, అంజుకుళి పట్టి ప్రెసెంట్ ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. కాగా చివరిగా నటుడు మురుగా అశోక్ పందెపు ఎద్దుతో నటించాల్సిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు అనూహ్యంగా ఎద్దు అతడిపై దాడి చేసింది. దీంతో ఎగిరి దూరంగా పడ్డ మురుగా అశోక్ పొట్టభాగంలో తీవ్ర గాయాలకు గురయ్యారని చెప్పారు. వెంటనే ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు చెప్పారు. దీంతో షూటింగును రద్దు చేద్దామని భావించామని, అయితే మురుగా అశోక్ మరుసటి రోజు ఉదయాన్నే షూటింగ్కు సిద్ధం అయ్యారని చెప్పారు. తాము వద్దని ఎంత వారించినా ఆయన నిర్మాత డబ్బు, కళా దర్శకులు బృందం వేసిన సెట్, పందెపుటెద్దుల సంరక్షకులు, జూనియర్ ఆర్టిస్టులు అంటూ మొత్తం చిత్ర యూనిట్ శ్రమ తన వల్ల వృథా కావడం ఇష్టం లేదంటూ షూటింగ్లో పాల్గొని పూర్తి చేసినట్లు చెప్పారు. -
కలెక్టర్కు వ్యతిరేకంగా వీఏఓల నిరసన
తిరువళ్లూరు: అనుమతి లేకుండా చేస్తున్న మట్టి తవ్వకాలను అడ్డుకున్న వీఏఓను వీఆర్కు పంపడాన్ని నిరసిస్తూ తమిళనాడు గ్రామ నిర్వాహణ అధికారుల సంఘం ఆధ్వర్యంలో వీఏఓలు తాహశీల్దార్ కార్యాలయంలో నేలపై కూర్చుని నిరసనకు దిగారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కొప్పూరు వీఏఓగా విశ్వనాథన్(45) విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 6న కలెక్టర్ మౌఖిక ఆదేశాలతో ప్రవేటు సంస్థ మట్టి తవ్వకాలను కొప్పూరు చెరువులో చేపట్టింది. అయితే సరైన అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న వీఏఓ అక్కడికి వెళ్లి మట్టి తవ్వకాలకు సంబంధించిన ఉత్తర్వులను చూపాలని కోరారు. అయితే మట్టి తవ్వకాలు చేస్తున్న ప్రవేటు సంస్థ కలెక్టర్ మౌఖిక ఆదేశాలతోనే తాము తవ్వకాలు చేస్తున్నట్టు సమాధానం ఇచ్చి తవ్వకాలను కొనసాగించారు. ఇందుకు స్థానికులు, వీఏఓ అడ్డు చెప్పడంతో విషయం కలెక్టర్కు చేరింది. దీంతో కలెక్టర్ ప్రతాప్ నేరుగా వీఏఓను ఫోన్లో పిలిచి తాను ఆదేశాలు ఇస్తే ఎలా అడ్డుకుంటారు. వీఏఓగా అక్కడ ఎలా పని చేస్తారో చూస్తానంటూ హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వీఏఓ విశ్వనాథన్ను స్థానిక బాధ్యతల నుంచి తప్పించి వెయిటింగ్ లిస్టుకు పంపుతూ ఆర్డీవో రవిచంద్రన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆగ్రహించిన వీఏఓ విశ్వనాథన్, తమిళనాడు గ్రామ నిర్వాహణ అధికారుల సంఘం ప్రతినిధులతో కలిసి మంగళవారం ఉదయం తాహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని న్యాయం చేయాలని కోరారు. అయితే తాహశీల్దార్ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వీఏఓలు తాహశీల్దార్ కార్యాలయంలోనే నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఆర్డీవో రవిచంద్రన్ వీఏఓలతో దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. అనంతరం విశ్వనాథన్ను అక్కడే విధులు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయడంతో వీఏఓలు ఆందోళననూ విరమించారు. కాగా వీఏఓల ఆందోళనతో తాహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
డీఎస్పీ విడుదల
సాక్షి, చైన్నె: కాంచీపురం శాంతి భద్రతల విభాగం డీఎస్పీ శంకర్ గణేష్ను విడుదల చేయాలని మద్రాసు హైకోర్టు మంగళవారం ఆదేశించింది. దీంతో కాంచీపురం కోర్టు చర్యలు విమర్శలకు దారి తీసినట్లయ్యింది. వివరాలు. కాంచీపురంలోని ఓ బేకరిలో జరిగిన గొడవకి సంబంధించి డీఎస్పీ శంకర్ గణేషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ దాఖలైన పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. సాయంత్రం జరిగిన వాదనల అనంతరం డీఎస్పీని అరెస్టు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో కోర్టు పోలీసులు యూనిఫాంతో ఉన్న ఆయన్ని అరెస్టుచేశారు. అయితే, బయటకు రాగానే ఇతరపోలీసుల సాయంతో ఆయన అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు. అయితే తాను తప్పించుకుని వెళ్ల లేదంటూ జైలులో లొంగి పోయారు. ఈ పరిస్థితులలో కాంచీపురం కోర్టు చర్యలు విమర్శలకు దారి తీశాయి. వ్యక్తిగత వ్యవహారం ఈ కేసులో ఉన్నట్టుగా ఆరోపణలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. డీఎస్పీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం వంటి పరిణామాలను తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం ద్వారా అప్పీలు పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. వాదనల సమయంలో కాంచీపురం జిల్లా కోర్టు న్యాయమూర్తి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు, చట్టాన్ని ఉల్లంఘించినట్టు, కేవలం ఈ వ్యవహారంలో వ్యక్తిగత విభేదాలకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు న్యాయమూర్తి సతీష్కుమార్ బెంచ్ డీఎస్పీని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
జిల్లాల పర్యటనకు ‘ఉదయ’ శ్రీకారం
సాక్షి, చైన్నె: డీఎంకేను మళ్లీ అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ జిల్లాల పర్యటనకు మంగళవారం శ్రీకారం చుట్టారు. కాంచీపురం నుంచి తన ప్రచార అధికారిక ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ కార్యక్రమంలో రూ.12.45 కోట్లతో పూర్తి చేసిన 9 ప్రాజెక్టులను, రూ.25.27 కోట్ల అంచనాతో కొత్తగా చేపట్టనున్న మరో 13 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ. 215 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను 4,997 మంది లబ్ధిదారులకు అందజేశారు. కాంచీపురంలోని ఓ ప్రైవేట్ వివాహ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో మంత్రులు శ్రీ ఎం.ఆర్.కె. పన్నీర్ సెల్వం, ఆర్. గాంధీ, శాసనసభ సభ్యులు కె. సుందర్, సీవీఎంపీ ఎళిలరసన్, జిల్లా కలెక్టర్ కళైచెల్వి మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో సాగుతున్న ప్రగతి, సంక్షేమ పథకాల గురించి చర్చించారు. మధ్యాహ్నం తర్వాత పార్టీ వర్గాలు, యువజన నేతలతో భేటీ అయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, లబ్దిదారులకు అన్ని పథకాలు చేరే విధంగా అధికారుల ద్వారా చర్యలు తీసుకోవాలని నేతలను ఉదయ నిధి ఆదేశించారు. ఇక, రోజుకో జిల్లాలో ఉదయ నిధి పర్యటన జరగనుంది. -
క్లుప్తంగా
తిరువొత్తియూరు: చైన్నె సూళైమేడు ప్రాంతంలో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ద్విచక్ర వాహనంతో ప్రమాదం సృష్టించిన హోంగార్డును పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె సూళైమేడు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి హోంగార్డు విఘ్నేష్ (24) తన ద్విచక్ర వాహనంతో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో విఘ్నేష్ మద్యం తాగి ఉన్నట్లు తేలింది. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక స్థానికుల ఫిర్యాదు మేరకు సోమవారం డ్యూటీలో ఉన్న అరుంబాక్కం రోడ్డు గస్తీ పోలీసు అధికారి విజయకుమార్ ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న హోంగార్డు విఘ్నేష్ పోలీసుపై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. దీంతో పోలీసు అధికారి విజయకుమార్ సూళైమేడు పోలీస్ స్టేషనన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మద్యం మత్తులో పోలీసు అధికారిపై దాడి చేసిన హోంగార్డు విఘ్నేష్ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు: ట్రాక్ను దాటే క్రమంలో రైలు ఢీకొని వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా పుట్లూరు అంబేడ్కర్ నగర్ ప్రాంతానికి చెందిన మణి(67) వ్యవసాయ కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లి ఇంటికి తిరుగు ప్రయాణమైన క్రమంలో రైల్వే ట్రాక్ దాటడానికి యత్నించాడు. ఈ సమయంలోనే ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వచ్చిన ఇన్స్పెక్టర్ రవిచంద్రన్ మృతదేహాన్ని కై వసం చేసుకుని శవపరిక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సాక్షి, చైన్నె: దక్షిణ భారత థ్రిల్లర్గా డిటెక్టివ్ ఉజ్వలన్ తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషలలో ప్రీమియర్గా సెప్టెంబర్ 12న లయన్స్ గేట్ ప్లేలో విడుదల కానున్నది. ఈ వివరాలను మంగళవారం స్థానికంగా ప్రకటించారు. డిటెక్టిక్ ఉజ్వలన్ డార్క్ కామెడీ, హర్రర్, మిస్టరీతో విచిత్ర అంశాలతో రూపుదిద్దుకున్నట్టు వివరించారు. ధ్యాన్ శ్రీనివాసన్ విచిత్రమైన డిటెక్టివ్గా ఉజ్వలన్ పాత్రను పోషించారని, నూతన ద్వయం ఇంద్రనీల్, గోపీకృష్ణన్, రాహుల్ జీ దర్శకతవంలో వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్స్పై సోఫియా పాల్ డిటెక్టివ్ ఉజ్వలన్ను నిర్మించినట్టు పేర్కొన్నారు. ఈ చిత్ర ప్రదర్శన గురించి నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ పేర్కొంటూ, డిటెక్టివ్ ఉజ్వలన్ ప్రేక్షకులు మెచ్చే పాత్రగా, సరికొత్త హృదయ స్పందనతో ఉంటుందని వివరించారు. తిరువొత్తియూరు: కొడుంగయూరు ఎళిల్ నగర్కు చెందిన మణికంఠన్. అతని వద్ద నుంచి ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు సెల్ ఫోన్ను లాక్కుని పారిపోయారు. ఈ ఘటనపై మణికంఠన్ కొడుంగయ్యూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి సెల్ఫోన్ అపహరించిన అముల్రాజ్, సంతోష్ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్ను, ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. తిరువొత్తియూరు: విధి నిర్వహణలో ఉత్తమ సేవలను అందించిన పోలీసు అధికారులను, సిబ్బందిని స్వయంగా చైన్నె నగర పోలీస్ కమిషనర్ అరుణ్ పిలిచి బహుమతులిచ్చి అభినందించారు. వివరాలు.. 2015వ సంవత్సరంలో అడయార్ పోలీస్ జిల్లాలో నివసిస్తున్న 9 సంవత్సరాల బాలికపై జరిగిన లైంగిక వేదింపు కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్న తరమణి మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీమతి.ఎన్.ధర్మ నేతృత్వంలోని బృందాన్ని అభినందించారు. అలాగే చెన్నై నగర పోలీస్, –1 సెయింట్ థామస్ మౌంట్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జి.కరికాలన్ అందిన సమాచారం మేరకు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ కరికాలన్, కానిస్టేబుళ్లు డి.బాలాజీ, ముని స్వామి ఆలందూరులోని ఓ లాడ్జికి వెళ్లి తనిఖీలు నిర్వహించి, గంజాయి కలిగి ఉన్న 17 సంవత్సరాల యువకుడిని విచారణ జరిపి, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ బృందాన్ని కూడా కమిషనర్ అభినందించారు. తిరువొత్తియూర్లోని ప్రజా ఫిర్యాదుల శిబిరంలో మూర్ఛ వచ్చిన 2 సంవత్సరాల చిన్నారిని సకాలంలో ఆసుపత్రిలో చేర్చిన స్పెషల్ సబ్–ఇన్స్పెక్టర్కు మారిదురై ను పిలిపించి రికార్డు అందజేశారు. -
ప్రజల్లోకి విజయ్
సాక్షి, చైన్నె: ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టేందుకు తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు,సినీ నటుడు విజయ్ సిద్ధమయ్యారు. నాలుగు నెలల పాటూ ప్రజల్లో తాను ఒక్కడ్నే అన్నట్టుగా మెలిగే రీతిలో పర్యటన రూట్మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఈనెల 13 నుంచి డిసెంబరు 20వ తేదీ వరకు జరిగే విజయ్ పర్యటనకు భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీ కార్యాలయంలో మంగళవారం టీవీకే నేతలు విజ్ఞప్తి చేశారు. వివరాలు.. తమిళగ వెట్రికళగంతో గత ఏడాది రాజకీయాలలోకి వచ్చిన విజయ్ ఈ ఏడాది తన కార్యాచరణను విస్తృతం చేసుకున్నారు. పార్టీ తరపున రెండు మహానాడులను జయప్రదం చేశారు. గత నెల మదురైలో జరిగిన మహానాడులో ప్రజలలోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరిస్థితులలో తన ప్రచార పర్యటన ఇతర పార్టీల నేతల తరహాలో కాకుండా భిన్నంగా నిర్వహించేందుకు విజయ్ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. తన పర్యటనకు మీట్ ది పీపుల్ అన్న ట్యాగ్ను తగిలించారు. బహిరంగ సభలు,రోడ్ షోల రూపంలో ఉరకలు తీసే రీతిలో పర్యటనలకు తమిళగ వెట్రికళగం వర్గాలు షెడ్యూల్ను రూపొందించాయి. ఈ షెడ్యూల్ను డీజీపీ కార్యాలయంలో సమర్పించారు. విజయ్ రెండు మూడు సార్లు బయటకు వచ్చిన సందర్భంలోనే వేలాదిగా అభిమాన లోకం దూసుకొచ్చిన దృష్ట్యా, ఈసారి భద్రతను కోరుతూ ముందుగా చర్యలు చేపట్టారు. 13 నుంచి డిసెంబర్ 20 వరకు బహిరంగ సభలు ఈనెల 13వ తేదీన తిరుచ్చిలో విజయ్ పర్యటన ప్రారంభం కానుంది. డిసెంబరు 20వ తేదీ వరకు ఆయన ప్రజలలోనే ఉండబోతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ తరపున టీవీకే వర్గాలు డీజీపీ కార్యాలయంలో షెడ్యూల్ వివరాలతో జాబితాను సమర్పించి భద్రత కల్పించాలని కోరారు. అనుమతులు మంజూరు చేయాలని విన్నవించారు. విజయ్ పర్యటన అత్యధికంగా బహిరంగ సభల రూపంలోనే ఉండడం గమనార్హం. ఈనెల 13వ తేదీన తిరుచ్చి, పెరంబలూరు, అరియలూరులలో పర్యటించనున్నారు. 20వ తేదీన నాగపట్నం, తిరువారూర్, మైలాడుతురై, 27వ తేదీన తిరువళ్లూరు, చైన్నె ఉత్తరం, అక్టోబరు 4,5 తేదీలలో కోయంబత్తూరు, నీలగిరి, తిరుప్పూర్, ఈరోడ్, 11వ తేదీన కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, 18వ తేదీన కాంచీపురం, వేలూరు, రాణిపేట, 25వ తేదీన చైన్నె దక్షిణం, చెంగల్పట్టు, నవంబర్ 1న కృష్ణగిరి, ధర్మపురి, తిరుపత్తూరు, 8వ తేదీన కళ్లకురిచ్చి, విల్లుపురం, తిరువణ్ణామలై , 15వ తేదీన తెన్కాశి, విరుదునగర్, 22వ తేదీన కడలూరు, 29న శివగంగై, రామనాధపురం, డిసెంబరు6న తంజావూరు,పుదుకోట్టై, 13న నామక్కల్, కరూర్, సేలం, 20వ తేదీన దిండుగల్, తేని, మదురై, బహిరంగ సభలు జరగనున్నాయి. వీక్ ఎండ్ షో.. వారంతంలో సినిమాలు విడుదలయ్యేట్టుగానే విజయ్ సైతం తన పర్యటనలను వారాంతంలో పెట్టుకోవడం గమనార్హం. నాలుగు నెలలు కాలం నెట్టుకు వచ్చే దిశగా ఈ బహిరంగ సభలకు సిద్ధమైనట్టుగా ఉంది. ఈనెల 13 నుంచి డిసెంబరు 20వ తేదీ వరకు విజయ్ బహిరంగ సభలు ప్రతి శనివారం జరగనున్నడం గమనార్హం. అక్టోబరు 4,5 తేదీలలో మాత్రం శని, ఆదివారం ప్రజల ముందుకు రానున్నారు. ఈ పర్యటన వీక్ ఎండ్ షో అంటూ విమర్శలు గుప్పించే వాళ్లు కూడా ఉండటం గమనార్హం. అదేసమయంలో పర్యటన అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్న తమ వాళ్లపై పోలీసులు అక్రమ కేసులుపెడుతుండడాన్ని విజయ్ తీవ్రంగా ఖండించే పనిలోపడ్డారు. -
విజయాలెందుకు సాధించడం లేదంటే..
వైరముత్తు, తంగర్బచ్చన్లతో పడమాండ మా వీర చిత్ర యూనిట్ తమిళసినిమా: నటుడు, నిర్మాత, దర్శకుడు వి గౌతమన్ కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన తాజా చిత్రం పడైమాండ మావీరా. నటుడు సముద్రఖని, పూజిత పొన్నాడ, ఇళవరసు, బాహుబలి ప్రభాకర్, శరణ్య పొన్వన్నన్, ఆడుగళం నరేన్, మన్సూర్ అలీ ఖాన్, రెడిన్ కింగ్స్లీ మధుసూదన్ రావ్, విశాల్ గళ్ రవి, సాయి దీనా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి గోపి జగదీశ్వరన్ ఛాయాగ్రహణం, జీవీ.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని, శ్యామ్ సీఎస్ నేపథ్య సంగీతాన్ని అందించారు. డీకే ప్రొడక్షనన్స్ పతాకంపై నిర్మల సరవణరాజ్ ,ఎస్ కృష్ణమూర్తి నిర్మించిన ఈ చిత్రానికి వి గౌతమన్, ఈ. కురన్ ముదన్, యుయం.ఉమాదేవన్, కె భాస్కర్, కే.పరమేశ్వరి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గీత రచయిత వైరముత్తు, దర్శకుడు తంగర్ బచ్చన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కథానాయకుడు బి. గౌతమన్ మాట్లాడుతూ తాను ఎదగాలన్న సదుద్దేశంతో ఈ చిత్ర నిర్మించిన నిర్మాత బృందానికి ధన్యవాదాలు అన్నారు. ఈ చిత్రం కోసం ఎంతగానో శ్రమించిన నటీనటులు, సాంకేతిక వర్గానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. తమిళ మట్టిలో పుట్టిన ఎవరు ఉన్నత జాతికి చెందినవారు కారు, ఎవరు దళిత జాతికి చెందిన వారు కాదని అందరూ ఒక తల్లి బిడ్డలే అని చెప్పే చిత్రం ఇది అని పేర్కొన్నారు. గీత రచయిత వైరముత్తు మాట్లాడుతూ దర్శకుడు, వీ.గౌతమన్ కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు. ఈరోజుల్లో ఏడాదికి 200 చిత్రాలు విడుదలవుతున్నా, అందులో పది చిత్రాలు మాత్రమే విజయానికి దగ్గరవుతున్నాయన్నారు. మన చిత్రాలు విజయం సాధించకపోవడానికి కారణం దర్శక నిర్మాతలు సమాజంలోని కథలను కాకుండా పాత చిత్రాలనే.. కొత్త చిత్రాలుగా చేయడమేనని వైరముత్తు పేర్కొన్నారు. -
అన్నాడీఎంకేలో కలకలం.. రంగంలోకి అమిత్ షా!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో తమిళనాట రాజకీయ కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. ఎన్నికల బరిలో దిగేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అధికార డీఏంకే మరోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్ష అన్నాడీఎంకే ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది. అగ్ర కథానాయకుడు విజయ్.. తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్ తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని అన్నాడీఏంకే గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీతో జట్టు కట్టింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె పళనిస్వామితో (Edappadi K Palaniswami) పాటు బీజేపీ అగ్ర నేతలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ నాయకుడు అమిత్ షా.. తమిళనాడుకు వరుస పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నవంబర్ నుంచి వరుస పర్యటనలు చేపట్టేలా కసరత్తు జరుగుతోంది.ఇదిలావుంటే పార్టీలో అంతర్గత విభేదాలు అన్నాడీఎంకేకు తల నొప్పిగా మారాయి. పళనిస్వామి వ్యవహారంపై సొంత పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి, సీనియర్ నేత కేఏ సెంగోట్టయన్ (KA Sengottaiyan) పట్ల వ్యవహరించిన తీరును అన్నాడీఎంకే నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనను పార్టీ పదవుల నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. పళనిస్వామి ఒంటెత్తు పోకడలతో నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.అసలేం జరిగింది?పార్టీని వదిలిపెట్టిన వారిని, బహిష్కరించిన వారిని మళ్లీ అక్కున చేర్చుకోవాలని సెంగోట్టయన్ పిలుపు ఇవ్వడంతో అన్నాడీఏంకేలో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్టీ అధినేత పళనిస్వామికి సెంగోట్టయన్ వ్యాఖ్యలు ఏమాత్రం రుచించలేదు. దీంతో ఆయనను పార్టీ పదవుల నుంచి తప్పించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఈరోడ్ రూరల్ పశ్చిమ జిల్లా కార్యదర్శి పదవి నుంచి సెంగోట్టయన్ను తీసిపారేశారు. అక్కడితో ఆగకుండా ఆయన మద్దతుదారులపైనా కొరడా ఝళిపించారు. సెంగోట్టయన్ మద్దతురాలైన మాజీ ఎంపీ సత్యభామను పార్టీ పదవుల నుంచి తొలగించారు.పార్టీ మంచి కోరే..పళనిస్వామి నిర్ణయంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతా కలిసి సమిష్టిగా పోరాడితే అధికారంలోకి వస్తామన్న ఉద్దేశంతోనే తాను మాట్లాడానని అన్నారు. పార్టీ మంచి కోరే ఐక్యత రాగం అందుకున్నానని, మరో అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. ఎటువంటి వివరణ అడకుండానే తనను పార్టీ పదవులకు దూరం చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సెంగోట్టయన్ వ్యాఖ్యలను బహిష్కృత నేతలతో పాటు బీజేపీ, డీఎండీకే పార్టీలు స్వాగతించగా.. పళనిస్వామి ఫైర్ కావడం చర్చనీయాంశంగా మారింది.ఓపీఎస్ భరోసా!సెంగోట్టయన్కు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ బాసటగా నిలిచారు. సెంగోట్టయన్కు తన మద్దతు ఉంటుందని, ఆయనను త్వరలో కలుస్తానని పన్నీర్ సెల్వం (Panneerselvam) ప్రకటించారు. జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ కూడా తెర ముందుకు వస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే అసంతృప్త నాయకులందరూ ఒక వేదికపైకి వచ్చే అవకాశముందన్న వాదనలు విన్పిస్తున్నాయి.చదవండి: డీఎంకేకు నిద్రలేకుండా చేస్తున్న విజయ్!రంగంలోకి అమిత్ షా!అన్నాడీఎంకే పార్టీలో రేగిన దుమారాన్ని కట్టడి చేసేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) రంగంలోకి దిగినట్టు కనబడుతోంది. మంగళవారం సెంగోట్టయన్ను ఢిల్లీకి పిలిపించుకుని ఆయనతో మాట్లాడారు. అమిత్ షాతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయినట్టు సెంగోట్టయన్ వెల్లడించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేయడానికి, బహిష్కృత అన్నాడీఎంకే నేతలను తిరిగి చేర్చుకోవడంపై తన అభిప్రాయాలను వారితో పంచుకున్నానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో సెంగోట్టయన్ భవిష్యత్ కార్యాచరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
డీఎంకేకు నిద్రలేకుండా చేస్తున్న విజయ్!
విమర్శలు, వ్యంగ్యాస్త్రాలను(ట్రోల్స్+మీమ్స్) పట్టించుకోకుండా తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం దిశగా సినీ హీరో విజయ్ అడుగులేస్తున్నారు. మీట్ ది పీపుల్ పేరిట ఈ శనివారం నుంచి రాష్ట్ర పర్యటనలు చేపట్టనున్నారు. అయితే జనాల్లోకి వెళ్లే క్రమంలో.. తమిళనాడు డీజీపీకి ఆయన ఓ లేఖ రాశారు. తన పర్యటనల రిత్యా అవసరమైన భద్రత కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారాయన. ఈ క్రమంలో సంచలన ఆరోపణలకే దిగారాయన. తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK)కు బలమైన పునాది వేయడం మాత్రమే కాదు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో అధికార కైవసమే లక్ష్యంగా విజయ్ అడుగులేయబోతున్నారు. సెప్టెంబర్ 13వ తేదీన తిరుచ్చి నుంచి ప్రత్యేక ప్రచార రథం బయల్దేరనుంది. అలా మొత్తం 38 జిల్లాల్లో పర్యటిస్తూ.. ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలతో (సభలు, సమావేశాలు, ర్యాలీలు, ముఖాముఖి, రౌండ్ టేబుల్ మీటింగ్స్) నిర్వహిస్తుంది. డిసెంబర్ 20వ తేదీన మధురైలో సభ ద్వారా టీవీకే విజయ్ మీట్ ది పీపుల్ పర్యటన ముగియనుంది. అయితే.. టీవీకే చర్యలతో అధికార డీఎంకే నేతలకు నిద్రలేకుండా పోతోందని విజయ్ అంటున్నారు. టీవీకే కేడర్పై వరుసగా కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారాయన. ఆ పార్టీ కార్యదర్శి ఆనంద్తో పాటు తిరుచ్చి పార్టీ విభాగం నేతలపైనా తాజాగా కేసు నమోదు అయ్యింది. అయితే.. ఈ పరిణామంపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీకేకు అధికారంలో ఉన్నపార్టీ భయపడుతోందా? అని ప్రశ్నించారాయన. డీఎంకే ఇప్పుడు టీవీకే గురించే ఆలోచించడం మొదలుపెట్టింది. 24 గంటలూ అదే ఆలోచనతో ఉంటోంది. ఆ పార్టీ నేతలకు నిద్ర కరువైంది. ఈ క్రమంలోనే పోలీసులపై ఒత్తిడి చేస్తూ కేసులు పెట్టిస్తోంది. కొంపదీసి.. టీవీకేకు డీఎంకే భయపడుతోందా? అని ప్రశ్నించారాయన. తమిళనాడు రాజకీయాల్లో తారలకు ప్రజలు అధికారం కట్టబెట్టడం కొత్తేం కాదు. శివాజీ గణేషన్, విజయ్కాంత్, శరత్కుమార్, కమల్హాసన్.. ఇలా ఎందరో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రజినీకాంత్ లాంటి భారీ ఫ్యాన్ఫాలోయింగ్ ఉన్న తార ఆ దిశగా అడుగు వేసినట్లే వేసి.. వెనక్కి వెళ్లిపోయారు. అయితే.. ఎంజీఆర్, జయలలిత ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు. వీళ్లందరితో పోల్చుకుంటే.. విజయ్కు ఇప్పుడున్న మాస్ ఫాలోయింగ్ చాలాచాలా ఎక్కువే. ఆ అభిమానాన్నే ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని విజయ్ ఉవ్విళ్లూరుతున్నారు.తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, విజయ్ చేపట్టిన “మీట్ ది పీపుల్” పర్యటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయ్ గత ఏడాది రాజకీయాల్లోకి అడుగుపెట్టి, రెండు మానాడు(మహానాడు)లను విజయవంతంగా నిర్వహించారు. మదురైలో జరిగిన రెండో మహానాడులో ప్రజల మధ్యకి వస్తున్నట్టు ప్రకటించి.. రాజకీయ ప్రత్యర్థి డీఎంకే, సైద్ధాంతిక విరోధి బీజేపీ లతోనే తమ పోరాటం అని కుండబద్దలు కొట్టారు. తాను, తన టీవీకే ఏ కూటమిలో భాగం కాబోమని.. కలిసొచ్చే పార్టీలకు రేపు అధికారం గనుక దక్కితే వాటా ఇస్తామని చెప్పారు. విజయ్ ఈ ప్రకటన అక్కడి రాజకీయాల్లో అలజడి రేపింది. పలు పార్టీలోని సీనియర్ నేతలు విజయ్ ఆఫర్కు టెంప్ట్ అవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో అసంతృప్త నేతలతో పాటు ఓట్ షేరింగ్ ఉన్న పార్టీలు, కుల ఓట్లను రాబట్టే పార్టీలు సైతం విజయ్ టీవీకేతో కూటమిగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి. ప్రజల సమస్యలపై నేరుగా స్పందించేందుకు, వారి అభిప్రాయాలను స్వీకరించేందుకు ఈ పర్యటనను ప్రజా ఉద్యమంగా మార్చాలని విజయ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ మీట్ ది పీపుల్పై అధికార డీఎంకే ఓ కన్నేసింది. విజయ్ పర్యటనను నిశితంగా పరిశీలించాలని, ప్రత్యర్థి వ్యూహానికి చెక్ పెట్టేలా పునరాలోచనలు చేయాలని ఆ పార్టీ అధినేత, సీఎం స్టాలిన్ సీనియర్లకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే టీవీకే కేడర్పై ఈ సమయంలోనే కేసులు నమోదు అవుతుండడంతో డీఎంకేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విజయ్ మాత్రం ఇలాంటివాటికి వెనకడుగు వేయబోనని అంటున్నారు. 1967లో అన్నాదురై కాంగ్రెస్ ఆధిపత్యానికి గండికొట్టినట్లు.. 1977 అన్నాడీఎంకేతో ఎంజీఆర్ డీఎంకేను గద్దె దించినట్లు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిపోరుతో అధికారం కైవసం చేసుకుని తానూ చరిత్ర సృష్టిస్తానని చెబుతున్నారు. జనంలోకి వెళ్తున్న విజయ్.. రెండు నెలలపాటు నాన్స్టాప్ పర్యటనలు చేపట్టబోతున్నారు. మొదటి విడతలో 10 జిల్లాల్లో పర్యటించేందుకు రూట్మ్యాప్ సిద్ధం చేశారు. శనివారం కీలక కార్యక్రమాలు జరుగుతాయి. ఆదివారం ఒకే ఒక్క కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యలో సెప్టెంబర్ 27, అక్టోబర్ 25వ తేదీన చెన్నైకి విజయ్ చేరుకుంటారు. పార్టీ ప్రకటన నుంచి మానాడు విజయవంతం దాకా.. విజయ్ వెంట నడిచింది యువతే. కాబట్టి యువత మద్దతుతోనే తన పర్యటనలను విజయవంతం చేసుకోవాలని విజయ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: విజయ్ టీవీకే.. ఆ పార్టీకే ఫ్లస్ -
మేకల సంతకు పోటెత్తిన గ్రామీణులు
పళ్లిపట్టు: పొదటూరుపేట పరిసర ప్రాంతాల్లో జాతర పురస్కరించుకుని నిర్వహించిన మేకల సంతలో రూ.పది లక్షలకు పైగా మేకల వ్యాపారం నిర్వహించారు. పొదటూరుపేట, పాండ్రవేడు, కేశవరాజుకుప్పం, గొళ్లాలకుప్పం, పుణ్యం, జంగాలపల్లె, కాకళూరు, చవటూరు సహా 20కు పైబడిన గ్రామాల్లో మంగళవారం జాతర వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పొదటూరుపేటలో సోమవారం మేకల సంత నిర్వహించారు. ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా తదితర ప్రాంతాల నుంచి మేకల కాపరులు, వ్యాపారులు వాహనాల్లో సంతకు మేకలు తీసుకొచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు మేకల సంత నిర్వహించారు. మేకలు ధరలు అధికంగా పలికినా గ్రామీణులు వెనుకాడకుండా కొనుగోలు చేశారు. మేకల ధరలు పెరగడంపై గ్రామీణులు మాట్లాడుతూ.. జాతర వేడుకల్లో అమ్మవారికి మేకలు బలిదానం చేయాలని మొక్కుల మేరకు చాలా మంది మేకలు కొనేందుకు ఆసక్తి చూపుతారు. దీంతో వ్యాపారులు ధరలు పెంచి విక్రయించారు. పది కేజీల మేక రూ.12 వేలకు విక్రయించారు. మాంసం దుకాణాల్లో కేజీ మటన్ రూ.700 నుంచి 800 వరకు విక్రయిస్తున్న క్రమంలో మేకల సంతలో భిన్నంగా ధరలు పెంచి విక్రయించారు. అయినా అమ్మవారికి మెక్కులు చెల్లించాలనే కోరిక మేరకు ధరలు ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు పది లక్షల రూపాయలకు పైబడిన వ్యాపారం జరిగినట్లు వ్యాపారులు తెలిపారు. -
గ్రీవెన్స్డేలో 383 వినతులు
తిరువళ్లూరు: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్డేలో 383 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్రీవెన్స్డేను నిర్వహించారు. గ్రీవెన్స్డేకు అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు వినతిపత్రాన్ని సమర్పించారు. పట్టాలు కోసం 39 వినతులు, పక్కాగృహాల కోసం 10, ఉపాధి కోసం 28, మౌలిక సదుపాయాలతో సహా ఇతర వాటి కోసం 275 వినతులతో కలిపి మొత్తం 383 వినతులు వచ్చాయి. వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు బదిలీ చేసిన కలెక్టర్ ప్రతాప్, వాటిని తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం దాదాపు గంటపాటు అధికారులతో గత వారం స్వీకరించిన వినతులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ సురేష్, పీఏజీ వెంకట్రామన్, స్పెషల్ తహశీల్దార్ బాలమురుగన్తోపాటు పలువురు పాల్గొన్నారు. గ్రీవెన్స్డేకు రెవెన్యూ, పోలీసులు, పీడబ్ల్యూడీ, గ్రామీణాబివృద్ధి, అగ్నిమాపకశాఖ, ఎడ్యుకేషన్, సర్వేయర్ విభాగం తదితర అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. -
బాలికపై లైంగిక వేధింపులు
అన్నానగర్: సేలంలో 16 ఏళ్ల బాలికను క్రీడా పోటీలకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించి పోలీసులు కోచ్ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అతని తమ్ముడి కోసం వారు వెతుకుతున్నారు. సేలం సమీపంలోని సిద్ధనూర్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక అక్కడి ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమె తైక్వాండో శిక్షణ పొందుతోంది. ఆ బాలిక పోటీలలో పాల్గొనడానికి అనేక ప్రదేశాలకు వెళుతోంది. గత 6వ తేదీన తిరువారూర్లో జరిగిన పోటీలో పాల్గొంది. సేలం శివనందపురంలో ఆ బాలికతో సహా అనేక మందికి శిక్షణ ఇచ్చే మాస్టర్ విజయకుమార్(44) తీసుకుని వెళ్లాల్సి ఉంది. తన కుటుంబ అంత్యక్రియలకు హాజరు కావడానికి వెళ్లినందున, అతని తమ్ముడు వెండి పని చేస్తున్న గణేషన్(42) వారితో పాటు అతని స్థానంలో పంపించారు. ఆ సమయంలో పోటీకి వెళ్లిన బాలికను గణేశన్ లైంగికంగా వేధించాడని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న విజయకుమార్ తిరువారూర్ వెళ్లి బాధితురాలిని ఈ సంఘటనను బయటపెట్టవద్దని బెదిరించాడని తెలిసింది. దీనిపై ఆమె తన తల్లిదండ్రులకు ఈ సంఘటనపై చెప్పింది. షాక్ అయిన తల్లిదండ్రులు వెంటనే సూరమంగళం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు పోలీసులు గణేషన్ మీద, మాస్టర్ విజయకుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తరువాత విజయకుమార్ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న గణేషన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. -
జననాయగన్ లోడింగ్
విజయ్తో నటి పూజాహెగ్డే తమిళసినిమా: కొన్ని చిత్రాలకు ప్రచారం అవసరమే ఉండదు. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాల గురించి నిత్యం ఏదో వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది. ఆ చిత్రాల అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తారు కాబట్టి వద్దంటే ప్రచారం చేస్తుంటారు. అలాంటి స్టార్ హీరోలలో నటుడు విజయ్ ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం జననాయగన్. ఇదే ఈయన నటించే చివరి చిత్రం కావడంతో దీనికి సంబంధించిన చిన్న విషయం అయినా ప్రచారం మాత్రం భారీగా ఉంటుంది. విజయ్ సరసన నటి పూజాహెగ్డే నటిస్తున్న ఇందులో నటి మమితాబైజూ, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ తదితర ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన తెరపైకి రానుందన్న ఒక అధికారిక ప్రకటన మినహా మరో విషయం ఇప్పటి వరకూ వెలువడలేదు. తాజాగా జననాయగన్ చిత్రానికి సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్తో కూడిన వీడియోను దర్శకుడు హెచ్.వినోద్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. అందులో దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. సాధారణంగా హీరో, హీరోయిన్, దర్శకుల పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ల ప్రకటనలను విడుదల చేస్తుంటారు. అయితే జననాయగన్ చిత్ర యూనిట్ మాత్రం వీడియోతో సరి పెట్టుకుంది. అయినప్పటికీ జననాయగన్ లోడింగ్ అంటూ నెటిజన్లు ప్రచారం జేస్తుండడం విశేషం. ఇది పక్కా మాస్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని సమాచారం. -
త్వరితగతిన డీజీపీ నియామకం
– ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం సాక్షి, చైన్నె: గత నెలాఖరులో పదవీ విరమణ పొందిన శంకర్ జివాల్ స్థానంలో శాంతి భద్రతల విభాగానికి పూర్తి స్థాయిలో కొత్త డీజీపీని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. గత నెల రోజులకు పైగా డీజీపీ నియామక జాబితా చర్చలో సీనియర్ ఐపీఎస్లు సీమా అగర్వాల్, రాజీవ్ కుమార్, సందీప్ రాయ్ రాథోడ్, అభయ్కుమార్సింగ్, వన్నియ పెరుమాళ్, మహేశ్కుమార్ అగర్వాల్, జి.వెంకటరామన్, వినీత్ దేవాంగడే, సంజయ్ మాథూర్ పేర్లు ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో శంకర్ జివాల్ పదవీ విరమణతో వెంకటరామన్కు శాంతి భద్రతల విభాగం ఇన్చార్జ్ డీజీపీ పదవిని తాత్కాలికంగా అప్పగించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ ఎంపికలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించ లేదన్న ఆరోపణల నేపథ్యంలో వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. తమిళనాడు ప్రభుత్వం పంపించిన జాబితా మేరకు యూపీఎస్సీ చైర్మన్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ త్వరితగతిన జాబితాలోని పేర్లను పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని సూచించారు. యూపీఎస్సీ సిఫారసు మేరకు రెగ్యులర్ డీజీపీని నియమించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. -
డీఎంకే వైపు యువత చూపు
తిరుత్తణి: యువకులు పెద్ద సంఖ్యలో డీఎంకేలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఎమ్మెల్యే చంద్రన్ తెలిపారు. తిరుత్తణి నార్త్ మండల డీఎంకే కార్యదర్శి విజయకుమార్ ఆధ్వర్యంలో తిరువలంగాడు మండలానికి చెందిన అన్నాడీఎంకే, పీఎంకే, టీవీకే, ఎన్ఎంకే పార్టీలకు చెందిన 50 మంది యువకులు డీఎంకేలో చేరే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఎన్ఎన్ కండ్రిగలోని డీఎంకే మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరువళ్లూరు జిల్లా డీఎంకే కార్యదర్శి, తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొన్నారు. డీఎంకేలో చేరేందుకు ముందుకొచ్చిన యువకులకు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వ విధానాలతో యువకులు పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. భవిష్యత్తు యువతదేనని, కష్టపడి పనిచేసే వారికి డీఎంకేలో గుర్తింపు ఉంటుందన్నారు. కుల మతాలకు డీఎంకే అతీతమని, పార్టీ సిద్ధాంతాలతో కష్టపడి చిత్తశుద్ధితో పని చేస్తే తగిన గుర్తింపు వస్తుందని తెలిపారు. -
లైట్స్ ఆఫ్ చేసి.. చీకట్లో అలా..
నటి అనుపమ పరమేశ్వరన్ తమిళసినిమా: ఒక్కొకరిది ఒక్కో అభిరుచి. ఇష్టాఇష్టాలు కూడా అంతే. పబ్లిక్గా సాధ్యం కాని ఇష్టాలను చాటుగా చేసి సంతృప్తి పడుతుంటాం. అలా తన ఇష్టం గురించి నటి అనుపమ పరమేశ్వరన్ చెప్పారు. ప్రేమమ్ అనే మలయాళ చిత్రంతో నలుగురు కథానాయికల్లో ఒకరిగా పరిచయమైన నటి అనుపమ పరమేశ్వరన్. ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా, ఈ అమ్మడిని తెలుగు ప్రేక్షకులే ఆదరిస్తున్నారు. తమిళంలో కొడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా ఇక్కడ పెద్దగా అవకాశాలు పలకరించలేదు. ఆ మధ్య రవిమోహన్కు జంటగా సైరన్ చిత్రంలో, ఇటీవల డ్రాగన్ చిత్రంలో నటించినా ఈమెకు పెద్దగా ఫలితం దక్కలేదు. తాజాగా మారిసెల్వరాజ్ దర్శకత్వంలో దవ్ విక్రమ్కు జంటగా నటించారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రంపై అనుపమ పరమేశ్వరన్ చాలా ఆశలు పెట్టుకున్నారనే చెప్పాలి. ఇకపోతే ఈమె తెలుగులో నటించి కిష్కింధపురి చిత్రం ఈ నెల 12వ తేదీన తెరపైకి రానుంది. హారర్ సన్నివేశాలు చోటు చేసుకున్న ఇందులో అనుపమ పరమేశ్వరన్ దెయ్యం గెటప్లో భయపెట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఈ అమ్మడు ఒక సమావేశంలో తనకు హారర్ కథా చిత్రాలంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. తాను చిన్నతనం నుంచే హారర్ కథా చిత్రాలను రహస్యంగా చూస్తానని చెప్పారు. తన తల్లిదండ్రులు నిద్రకు ఉపక్రమించిన తరువాత లైట్స్ ఆఫ్ చేసి చీకటిలో హారర్ కథా చిత్రాలను చూస్తానని చెప్పారు. మరి అలా తను ఇష్టపడే హారర్ కథాంశంతో రూపొందిన కిష్కింధపురి చిత్రం అనుపమ పరమేశ్వరన్ కేరీర్కు ఏ మాత్రం హెల్ప్ అవుతుందో చూడాలి. ఇటీవల ఈమె నటించిన పరదా చిత్రం పూర్తిగా నిరాశ పరిచిందన్నది గమనార్హం. -
హీరోయిన్కు విజయ్ అభిమానుల రక్ష
తమిళసినిమా: ఒక్కో సారి చిత్ర యూనిట్కు కష్టాలు ఎదురవుతుంటాయి. అలాంటి కష్టాన్నే ఇరవిన్ విళిగళ్ చిత్ర కథానాయిక ఎదుర్కొన్నారు. మహేంద్ర ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మహేంద్రన్ నిర్మిస్తున్న చిత్రం ఇరవిన్ విళిగళ్. సిక్కల్ రాజేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేంద్ర కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి నిమారే నటిస్తున్నారు. ఈమె కన్నడ చిత్రం బింగారాలో నటనకు జాతీయ అవార్డును అందుకున్నారు. నటుడు నిళల్గళ్ రవి, మస్కారా అస్మిత, గుంతాజ్, ఆన్సీ, చరణ్రాజ్, సిజర్ మనోహర్, ఈశ్వర్ చంద్రబాబు, కిళి రామచంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. సామాజిక మాధ్యమాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్ను వెళ్లిమలై ప్రాంతంలో నిర్వహిస్తుండగా అక్కడకు వచ్చిన కొందరు యువకులు హద్దు మీరి హీరోయిన్ నిమారే చేయి పట్టుకుని లాగుతూ గొడవ చేశారన్నారు. తాము ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదన్నారు. అప్పుడు అక్కడకు వచ్చిన నటుడు విజయ్ అభిమానులు కొందరు కల్పించుకుని షూటింగ్కు కోసం తెచ్చిన కొరడాతో వారిని తరిమి తరిమి కొట్టి ప్రారదోలారని చెప్పారు. ఈ సంఘటనతో నటి నిమారే చాలా భయపడిపోయారని చెప్పారు. ఇరవిన్ విళిగల్ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందనీ,త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. ఇరవిన్ విళిగళ్ చిత్రంలో నటి నిమారే తదితరులు -
సేవల విస్తరణ
కరూర్ వైశ్య బ్యాంక్ సేవలను రాష్ట్రంలో విస్తతం చేశారు. ఇందులో భాగంగా కోయంబత్తూరులోని నీలంబూర్ సెరయం పాళయం, మదురైలోని చింతామణిలోని నెడుంకుళంలో కొత్త శాఖలను సోమవారం ఏర్పాటు చేశారు. కోయంబత్తూరు శాఖను డిప్యూటీ కమిషనర్ హెచ్ఆర్ అండ్ సీఈ ఆర్ విజయలక్ష్మి, మదురై శాఖను వ్యవసాయ మార్కెంటింగ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ వి.మెర్సీ జయరాణ , మదురై మెడికల్ కళాశాల డైరెక్టర్ విధనలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరూర్ వైశ్య బ్యాంక్ ఎండీ రమేష్ బాబు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా తమకు 894 శాఖలు ఉన్నట్టు, మరింతగా బ్యాంకింగ్ సేవలను విస్తరించనున్నామని ప్రకటించారు. –సాక్షి, చైన్నె -
తిరువణ్ణామలైలో తీర్థవారి
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో స్వామివారికి సోమవారం ఉదయం తీర్థవారి నిర్వహించారు. ఆదివారం పౌర్ణమి కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరువణ్ణామలై 14 కిలోమీటర్లు దూరం శివుడిగా భావించే కొండను చుట్టి స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి చంద్రగ్రహణం పట్టడంతో స్వామివారికి శివాచార్యులు వేదమంత్రాలు నడుమ ఈశాన్య కోనేటి వద్దకు స్వామివారిని తీసుకెళ్లి తీర్థవారి నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి దీపారాధన పూజలు చేసి ఆలయానికి మేళతాళాల నడుమ తీసుకెళ్లారు. ఇది ఇలా ఉండగా చంద్రగ్రహణం పట్టడంతో ఉదయం నాలుగు గంటల నుంచి ఆలయ సిబ్బంది ఆలయాన్ని శుభ్రం చేశారు.పోస్టర్ల కలకలకంకొరుక్కుపేట: అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం దగ్గర ‘ఏకమైపోదాం. మనల్ని మనం నిరూపించుకుందాం’ అనే నినాదంతో శశికళ మద్దతుదారులు ఒక పోస్టర్ను అతికించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి సెంగోట్టయన్ను పళణిస్వామి తొలగించిన విషయం తెలిసిందే. అదే క్రమంలో సెంగోట్టయన్కు మద్దతుగా నిలిచిన మాజీ ఎంపీ సత్యభామను పార్టీ నుంచి తొలగించారు. ఈ క్రమంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం దగ్గర కలిసి పోరాడుదాం, గెలుద్దాం అంటూ వెలసిన పోస్టర్లు అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.భూగర్భ డ్రైనేజీ పనుల పరిశీలనవేలూరు: కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను కాలయాపన చేసే కాంట్రాక్టును వెంటనే రద్దు చేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం సర్కిల్ వద్ద జరుగుతున్న డ్రైనేజీ పనులను ఆమె తనిఖీ చేశారు. ఆ సమయంలో డ్రైనేజీ పనుల కోసం కాలువలు తవ్వి మట్టిని రోడ్డు పక్కన వేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ట్రాఫిక్ సమస్య అధికమవుతుందని అన్నారు. ఈ పనులను నెలల తరబడి ఎందుకు కాలయాపన చేస్తున్నారో అధికారులు విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ పనులు వేగవంతం చేసి పనులను వెంటనే పూర్తి చేయాలని లేని పక్షంలో కాంట్రాక్టర్ రద్దు చేయాలని కార్పొరేషన్ అధికారులు ఆదేశించారు. ఆమెతోపాటు కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, కార్పొరేషన్ అధికారులు ఉన్నారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన ప్రజా విన్నపాల దినోత్సవంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి అర్హులైన లబ్ధిదారులకు అక్కడికక్కడే సంక్షేమ పథకాలను అందజేశారు. కలెక్టర్తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఎంజీ కొనుగోలుదారులకు జీఎస్టీ ప్రయోజనాలుసాక్షి, చైన్నె: ఐసీఈ ఎస్యూవీ పోర్ట్ఫోలియోలోని ఆస్టర్, హెక్టర్, గ్లోస్టర్ ఈవీ వాహన కొనుగోలుదారులకు జీఎస్టీ ప్రయోజనాలను కల్పిస్తూ చర్యలు తీసుకున్నామని జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సోమవారం ప్రకటించింది. ఇటీవల కేంద్రం జీఎస్టీ తగ్గింపునకు చర్యలు తీసుకున్న దృష్ట్యా, ఆ ప్రయోజనాలు వాహన కొనుగోలుదారులకు కల్పిస్తూ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా స్థానికంగా ప్రకటన చేసింది. ఎంజీ ఎస్యూవీ బుక్ చేసుకోవడంపై ప్రయోజనాలు సెప్టెంబరు 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు వివరించారు. జీఎస్టీనీ హేతుబద్దీకరించాలనే ప్రభుత్వం నిర్ణయంతో కారు కొనుగోలుదారుల స్థోమత సవాలును నేరుగా పరిష్కరించే విధంగా తాము చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ప్రయోజనం తమ ఎస్యూవీ పోర్ట్ఫోలియో అంతటా విస్తరించడం ద్వారా వినియోగదారులకు మరింతగా అవకాశాలు కల్పించేందుకు వీలుందన్నారు. మరింత అందుబాబులో ఆకర్షణీయంగా వాహనాలను, ప్రయోజనాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినయ్ రైనా స్పష్టం చేశారు. -
నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు
తిరువళ్లూరు: నిబంధనలను అతిక్రమించి రైలులో ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే భద్రత ఇన్స్పెర్ చిత్రదేవి హెచ్చరించారు. రైలులో సురక్షిత ప్రయాణంపై ప్రయాణికులకు అవగాహన కల్పించే కార్యక్రమం తిరువళ్లూరు రైల్వేస్టేషన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రైల్వే ఇన్స్పెక్టర్ చిత్రదేవి మాట్లాడుతూ రైలు ప్రయాణం సురక్షితంగా సాగడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఫుట్బోర్డు ప్రయాణం ప్రమాదకరమని, కొందరు నిబంధనలు అతిక్రమించి ఫుట్బోర్డు ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ప్రయాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో పాటు గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే ఆహారం, తినుబండారాలను ఇస్తే వాటిని నిరాకరించాలని కోరారు. రైలులో పేలుడు పదార్థాలు, గంజాయి, గుట్కా తదితర నిషేధిత వస్తువుల అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. దీంతోపాటు రాత్రి సమయంలో మహిళ ప్రయాణికులు కిటికీల వద్ద కూర్చుని ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించడం, కిటికీలను మూసివేయడం, రైల్వేహెల్ప్లైన్ 139 నంబర్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైల్వే భద్రత అధికారులు, పోలీసులు, ప్రయాణికులు పాల్గొన్నారు. -
ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్
కొరుక్కుపేట: ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కీలంబాక్కం–చెట్టి పున్నియం మధ్య హై–లెవల్ వంతెన రానుంది. దీనిని రూ.3,200 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్టు అధికారులు వెల్లడించారు. పండుగలు, ప్రభుత్వ సెలవు దినాలలో తాంబరం గేట్ వద్ద 3 కి.మీ వరకు జీఎస్టీ రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూనే ఉంటుంది. చైన్నెకి ఇది ప్రధాన మార్గం కాబట్టి ట్రాఫిక్ ఎల్లప్పుడూ కనిపిస్తుంది. జీఎస్టీ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో రూ.3200 కోట్లుతో 18.4 కిలో మీటర్లు దూరానికి హై లెవల్ వంతెన ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. -
ప్రతి నాయకుడి పాత్రలంటే ఇష్టం
తమిళసినిమా: ప్రయత్న లోపం లేకుండా ప్రేమించిన వారిని సినిమా అక్కున చేర్చుకుంటుంది. అలా నిరంతర ప్రయత్నంతో నటుడయ్యారు శర్వా. ఈయన బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటుడు. న్యాయవాదిగా పట్టభద్రుడైన శర్వాకు నటనపై చిన్నతనం నుంచి ఎంతో ఆసక్తి. దీంతో ఒక పక్క చదువుకుంటూనే స్టేజీ నటుడిగా రాటు దేలారు. పలు స్టేజీ నాటకాలు ఆడిన ఈయన రెండు సీరియళ్లలోనూ నటించారు. అలా తాజాగా శర్వా ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ హార్ట్ బీట్. రెండు సీజన్స్, 200 ఎపిసోడ్స్తో ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్లో గుణ అనే పాత్రలో నటించిన శర్వా బాగా పాపులర్ అయ్యారు. ఈ వెబ్ సిరీస్ నాలుగైదు చిత్రాల్లో నటించినంత అనుభవాన్నిచ్చిందని శర్వా పేర్కొన్నారు. బయటకు వెళ్లితే అందరూ తనను గుణ అనే పిలుస్తున్నారనీ, అది తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. అదే విధంగా ఆర్కే నగర్, తమిళ్ రాకర్స్ సిరీసుల్లోనూ నటించిన శర్వా ఇప్పుడు వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నారు. నటుడు అధర్వ హీరోగా నటించిన దణల్ చిత్రంలో పోలీస్ అధికారిగా ముఖ్య పాత్రను పోషించారు. ఇది ఈ నెల 12వ తేదీన తెరపైకి రానుంది. అనేక ప్రయత్నాల ఫలితంగా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాననీ, తనదైన ప్రతిభతో మరిన్ని అవకాశాలను పొంది ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పిన శర్వా ప్రతినాయకుడి పాత్రల్లో నటించడం ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ఆ తరహా పాత్రలు అయితేనే నటనలో పలు పరిణామాలు చూపించగలమని అన్నారు. హార్ట్బీట్ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాననీ, అందువల్ల తెలుగు తదితర భాషల్లోనూ అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని శర్వా పేర్కొన్నారు. -
ఏఐపై పరిజ్ఞానాన్ని పెంచుకోండి
కొరుక్కుపేట: సాంకేతికత పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పైనా పరిజ్ఞానాన్ని పెంచుకోవాలనిని కాగ్నిజెంట్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్–బిగ్ డేటా అండ్ క్లౌడ్ ఎస్.కార్తికేయన్ అన్నారు. ఈ మేరకు ఎస్ఆర్ఎం ఐఎస్టీ–వడపళని క్యాంపస్లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం (ఎమర్జింగ్ టెక్నాలజీస్) ఆధ్వర్యంలో రెండు రోజుల ఎక్సావెర్సీ 2.0 అనే సింపోజియం సోమవారం ప్రారంభమైంది. ఈ సదస్సును ముఖ్యఅతిథిగా ఎస్.కార్తికేయన్ ప్రారంభించి మాట్లాడారు. వివిధ పరిశ్రమలలో ప్రోగ్రామింగ్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏఐపై బలమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలని సూచించారు. ముందుగా విభాగాధిపతి డాక్టర్ పి.చిత్ర స్వాగతోపన్యాసం చేయగా, సీఎస్ఈ(ఈ టెక్) హెడ్ డాక్టర్ ఎన్.భారతీ గోపాలస్వామి సదస్సు లక్ష్యాలను వివరించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సి.గోమతి ప్రత్యేక ప్రసంగం చేయగా, వందన సమర్పణను అసిస్టెంట్ ప్రొఫెసర్ దీప చేశారు. ఈ సింపోజియంలో దేశవ్యాప్తంగా 300 మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. -
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి కోర్టులో చుక్కెదురు
తమిళసినిమా: సంగీత దర్శకుడు ఇళయరాజా తన పాటలను ఇతరులెవరైనా తమ చిత్రాల్లో ఆయన అనుమతి లేకుండా ఉపయేగిస్తే కచ్చితంగా నష్ట పరిహారం కోరుతూ కోర్టుకెక్కుతారు. అలా తాజాగా ఆయన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంపై కోర్టుకెక్కారు. నటుడు అజిత్, త్రిష జంటగా నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ ఏడాది మొదట్లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇందులో సంగీత దర్శకుడు ఇళయరాజా తన చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఇళమై ఇదో ఇదో, ఒత్త రూపాయి దానే, ఎన్ జోడి మంజ కురువి అనే పల్లవులతో సాగే పాటలను ఆయన అనుమతి లేకుండా ఉపయోగించారు. దీంతో ఇళయరాజా తన అనుమతి పొందకుండా తన పాటలను ఉపయోగించడాన్ని ఖండిస్తూ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో రూ.5 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన చిత్ర నిర్మాతల వర్గం ఆ పాటలకు ఎవరి వద్ద అనుమతి పొందాలో వారి నుంచి అనుమతి పొందినట్లు, ఇళయరాజా ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ఇళయరాజా పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ఇళయరాజా పాటలను ఉపయోగించడాన్ని నిషేధించింది. ఈ కేసుపై చిత్ర నిర్మాతలు బదులు పిటీషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ రెండు వారాల తరువాత తదుపరి విచారణను జరుపనున్నట్లు పేర్కొంది. -
రెండు బైకులు ఢీకొని ఇద్దరి మృతి
తిరుత్తణి: బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. తిరుత్తణి సమీపంలోని మంగాపురం గ్రామానికి చెందిన ఆకాష్(27) ప్రయివేటు కంపెనీలో పనిచేసేవాడు. సోమవారం ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని తడుకుపేటకు చెందిన సమీప బంధువు దినేష్(27) మంగాపురానికి వచ్చి సాయంత్రం బైకులో ఆకాష్ను తీసుకుని మద్దూరు గేటు వద్దకు వెళ్లారు. అదే సమయంలో ఎదురుగా బైకులో వచ్చిన మద్దూరుకు చెందిన గోవిందరాజ్(28) అనే వ్యక్తి బైకు దినేష్ నడిపిన బైకు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో దినేష్, గోవిందరాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైకులో వెళ్లిన ఆకాష్కు తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతంలో నడిచి వెళ్లిన తడుకుపేటకు చెందిన మునిరత్నం(60) అనే వ్యక్తికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. రక్త గాయాలతో పోరాడుతున్న ఇద్దరిని అక్కడున్న వారు కాపాడి 108 ఆంబులెన్స్ సాయంతో తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం చైన్నెలోని రాజీవ్గాంధీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స పొందుతున్నారు. ప్రమాద స్థలం చేరుకున్న తిరుత్తణి పోలీసులు రోడ్డులో పడివున్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం అభ్యర్థిగా పళణి పేరు ప్రకటించ లేదు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె.పళణి స్వామిని కూటమి సీఎం అభ్యర్థిగా తాను ప్రకటించ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. ఇది కాస్తా అన్నాడీఎంకే వర్గాల్ని విస్మయంలో పడేసింది. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగుతూ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. ఇందుకు సమాధానం ఇచ్చే విధంగా సోమవారం తిరునల్వేలిలో నైనార్ నాగేంద్రన్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో అధికార మార్పు అవశ్యమని, రాష్ట్రాన్ని పట్టిన డీఎంకే అనే గ్రహణం త్వరలో వీడబోతున్నట్టు వ్యాఖ్యలు చేశారు. డీఎంకే మళ్లీ అధికారంలోకి రాకూడదన్న ఉద్దేశంతో బీజేపీ తీవ్రంగా పోరాడుతున్నట్టు వివరించారు. డీఎంకేకు ప్రత్యామ్నాయం రాష్ట్రంలో అన్నాడీఎంకే అని, అందుకే అన్నాడీఎంకేతో కలసి ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి అయినా, తమిళనాడులో అన్నాడీఎంకే నేతృత్వంలో కూటమి బలాన్ని పెంపొందించేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. అయితే దినకరన్ తనపై ఆధార రహిత ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినానంతరం అందరితో కలసి ముందుకెళ్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఒక సారి దినకరన్ గతాన్ని గుర్తెరగాలని హితవు పలికారు. ఈ సారి అధికారంలోకి తప్పని సరిగా రావాల్సిన అవశ్యం కూటమికి ఉందన్నారు. అయితే పళణిస్వామిని కూటమి సీఎం అభ్యర్థిగా తాను ఎన్నడూ ప్రకటించ లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్తా అన్నాడీఎంకే వర్గాల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. కూటమి సీఎం అభ్యర్థి పళణిస్వామి అని ఆది నుంచి అన్నాడీఎంకే వర్గాలు స్పష్టం చేస్తుంటే, తాజాగా మళ్లీ సీఎం అభ్యర్థి వ్యవహారంలో బీజేపీ నేతల డొంక తిరుగుడు వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. -
నేత్రదానంపై మానవహారం
సాక్షి, చైన్నె: నేత్ర దాన పక్షోత్సవాలను పురస్కరించుకుని డాక్టర్ అగర్వాల్స్ ఐ ఆస్పత్రి నేతృత్వంలో నేత్రదానాన్ని ప్రోత్సహించే విధంగా మానవహారాన్ని సోమవారం చైన్నెలో నిర్వహించారు. ప్రతి ఏడాది ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నేత్రదాన పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చైన్నెలోని డాక్టర్ అగర్వాల్స్ ఐ ఆస్పత్రి క్లినికల్ సర్వీసెస్ రీజినల్ హెడ్ డాక్టర్ ఎస్.సుందరి నేతృత్వంలో టీటీకే రోడ్డులోని ఆస్పత్రి నుంచి మానవహారం చేపట్టారు. ఇందులో డాక్టర్ అగర్వాల్స్ ఐ ఇనిస్టిట్యూట్ నుంచి ఆప్టో మెట్రిక్ విద్యార్థులు, వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది ప్లకార్డులను చేతబట్టి నేత్ర దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేత్ర దానం హెల్ప్ లైన్ నెంబర్ 94444 44844 ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ సుందరి మాట్లాడుతూ చాలా మంది యువకులు నేత్ర దానం ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. అందుకే ఈ కార్యక్రమం ద్వారా యువత నేత్ర దానం చేసేందుకు ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశంలోనే రెండో అతి పెద్ద ఐ బ్యాంక్ తమ ఆస్పత్రిలో ఉన్నట్టు, నేత్ర దానం కోసం నమోదు చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా తమ బ్యాంక్కు 2500 కంటే ఎక్కువ కార్నియా మార్పిడి అభ్యర్థనలు వస్తున్నాయని, ఇలాంటి వారికి నేత్ర దానం దోహదకారిగా ఉంటుందన్నారు. జనవరి నుంచి ఆగస్టు వరకు 2,255 నేత్రాలను సేకరించామని, మార్పిడి కోసం ముందుగా నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. -
ఉత్తమ న్యూస్రీడర్లకు అవార్డులు
సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వం నేతృత్వంలో ప్రప్రథమంగా న్యూస్ రీడర్లకు ఉత్తమ అవార్డులను సోమవారం ప్రదానం చేశారు. తమిళాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి స్వామినాథన్ ఈ అవార్డులను అందజేశారు. మీడియాలో వార్తలను కచ్చితంగా, అనర్గళంగా వ్యక్తీకరించే న్యూస్ రీడర్లు, ప్రత్యేక ఇంటర్వ్యూలతో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించే వ్యాఖ్యాతలను సత్కరించే విధంగా ప్రత్యేక అవార్డులను ప్రదానం చేయడానికి ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి అవార్డుతోపాటుగా రూ.25 వేలు నగదు బహుమతిని అందజేయడానికి చర్యలు తీసుకున్నారు. 2023–24 సంవత్సరానికి ఎంపికై న అర్హులైన న్యూస్ రీడర్లు, వ్యాఖ్యాతలను సత్కరించి, అవార్డులను ప్రదానం చేస్తూ మంత్రి స్వామినాథన్ చర్యలు తీసుకున్నారు. సోమవారం సచివాలయంలో డాక్టర్ వి.కె.సర్వోదయ రామలింగం, వేదవల్లి జగదీశన్, అరుణోదయ స్వర్ణ మేరి, పి.మోహన్రాజ్లను అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ కార్యదర్శి వి.రాజారామన్, తమిళ అభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎన్.అరుల్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ఐసీయూలోకి అన్నాడీఎంకే
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే త్వరలో ఐసీయూలోకి చేరి చికిత్స పొందబోతున్నట్టు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఎద్దేవా చేశారు. ఆరోగ్యశాఖ నేతృత్వంలో సైదా పేటలో రూ.28.75 కోట్లతో నిర్మించిన ఆస్పత్రిని సోమవారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిని సందర్శించారు. ఇక్కడున్న వసతులు, వైద్యపరంగా చికిత్సలపై ఆరా తీశారు. 120 పడకలతో ఇక్కడ బ్రహ్మాండమైన ఆస్పత్రిని నిర్మించిన ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్కు మరోసారి అభినందనలని వ్యాఖ్యలు చేశారు. సైదాపేట ప్రజలకు మాత్రమే కాకుండా పరిసరవాసులకు ఈ ఆస్పత్రి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ ద్రావిడ మోడల్ ప్రభుత్వానికి రెండు కళ్లు అని గుర్తు చేశారు. అందుకే ఈ రెండింటికి ప్రత్యేక ప్రాధాన్యతను సీఎం స్టాలిన్ ఇస్తూ వస్తున్నారని వివరించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో తమిళనాడు దూసుకెళ్తోందని పేర్కొంటూ, వివిధ వైద్య పథకాలను గుర్తుచేశారు. చైన్నె నగరం భారతదేశ వైద్య రాజధానిగా మారిందన్నారు. సైదాపేటకు పొరుగున ఉన్న గిండిలో కలైంజ్ఞర్ శత జయంతి స్మారకంగా రూ.240 కోట్లతో బ్రహ్మాండ ఆస్పత్రిగా రూపుదిద్దుకుని ఉన్నట్టు తెలిపారు. ఇది దక్షిణ తమిళనాడు పరిధిలోని ప్రాంతాలన్నింటికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారిందన్నారు. వైద్య రంగంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి వివిధ అవార్డులు, ప్రశంసలు దరి చేరుతున్నాయన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో తమిళనాడు నేడు భారతదేశానికే నాయకత్వం వహిస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. ఎప్పటికీ నెంబర్వన్ తమిళనాడు ఎప్పటికీ నంబర్వన్ అని నిరూపించే విధంగా తమ ప్రయాణం సాగుతోందన్నారు. తాను ప్రభుత్వ కార్యక్రమాలలో రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడనని తెలిపారు. అయితే ఇక్కడ ఒక్కవిషయం చెప్పదలచుకున్నట్టు వ్యాఖ్యలు చేశారు. అంబులెన్స్కు దారి ఇవ్వని వ్యక్తి తాజాగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామిని ఉద్దేశించి విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడికి తాను ఒక్కటే చెబుతున్నానని, త్వరలో అదే అంబులెన్స్లో ప్రయాణించే పరిస్థితి వస్తుందన్నది గుర్తెరగాలని హితవు పలికారు. త్వరలో అన్నాడీఎంకే ఐసీయూలో చేరడం ఖాయమని, అప్పుడు తాము అందించే చికిత్స ఎలా ఉంటుందో గుర్తెరుగుతారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. వ్యాధి రహిత సమాజాన్ని సృష్టించేందుకు ఆసుపత్రిని ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎం.సుబ్రమణియన్, కె.ఎన్.నెహ్రూ, ఎమ్మెల్యేలు తాయకం కవి, ఎస్.అరవింద్ రమేష్, కె.గణపతి, ఎ.ఎం.వి.ప్రభాకరరాజా, మెట్రోపాలిటన్ చైన్నె కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎం.మహేష్కుమార్, జోనల్ కమిటీ నాయకులు ఎం.కృష్ణమూర్తి, ఆర్.దురైరాజ్, నోలంబూర్ వి.రాజన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ పి.సెంథిల్కుమార్, జాతీయ ఆరోగ్య కమిషన్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ తంబురాజ్, తమిళనాడు హెల్త్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వినీత్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఐఏ ఆకస్మిక తనిఖీలు
కొరుక్కుపేట: తమిళనాడుతో సహా ఆరు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తమిళనాడుతో సహా చెంగల్పట్టులో అరెస్టయిన యువకులతో సంబంధం ఉన్నవారిని పట్టుకోవడానికి తూత్తుకుడిలో తనిఖీలు ముమ్మరం చేశారు. గత ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రదాడి తరువాత ఎన్ఐఏ హై అలెర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చైన్నెలోని ఒక మిల్లుపై ఉగ్రవాదుల దాడి జరిగింది. దీంతో ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వారిని పట్టుకోవడానికి దాడులు జరిగాయి. ఆ సమయంలో చెంగల్పట్టులో ఉంటున్న బిహార్ యువకుడు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడాలని యోచిస్తున్నట్టు కేంద్ర నిఘా సంస్థ తమిళనాడు పోలీసులకు సమాచారం అందించారు. దీని తర్వాత చెంగల్పట్టులో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో, పోలీసులు అగల్దూర్ మహ్మద్ అనే యువకుడిని(ఉగ్రవాద సంస్థలతో సంబంధం కలిగి ఉన్నాడు) అరెస్టు చేశారు. అతను బిహార్ రాష్ట్రానికి చెందినవాడు. అతను ఐటీఐ పూర్తి చేసి చెంగల్పట్టులో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లకు పెయింటర్గా పని చేస్తున్నాడని తెలింది. దీంతో పోలీసులు అతన్ని విచారించారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. బిహార్లోని 8 చోట్ల, ఉత్తరప్రదేశ్లోని 3 చోట్ల, కర్ణాటక, మహారాష్ట్రలోని ఒక్కొక్క చోట సోదాలు జరిగాయి. మొత్తం 6 రాష్ట్రాల్లోని 22 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. పాకశాస్త్ర కళాకారులకు కలైమామణి అవార్డులివ్వాలి సాక్షి, చైన్నె: పాకశాస్త్రం కూడా ఒక కళేనని, ప్రతీ ఏడాది కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కలైమామణి అవార్డులను తమకు కూడా ఇవ్వాలని సౌత్ ఇండియా చెఫ్స్ అసోసియేషన్ (సికా) అధ్యక్షుడు, పద్మశ్రీ గ్రహీత చెఫ్ దాము విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చైన్నె ట్రేడ్ సెంటర్ వేదికగా ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న 7వ ఎడిషన్ సికా కలినరీ ఒలింపియాడ్–2025 పోటీల ట్రోఫీలు, బ్రోచర్లను సోమవారం ఆవిష్కరించారు. ఇందులో పాల్గొన్న చెఫ్ దాముతోపాటు జనరల్ సెక్రటరీ చెఫ్ సీతారామ్ ప్రసాద్ మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సికా కలినరీ ఒలింపియాడ్కు దక్షిణ భారత సికా చాప్టర్లలో 3000 మందికి పైగా చెఫ్లు, 4 అంతర్జాతీయ జట్లు పోటీల్లో పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ నెల 19 నుండి 21 వరకు చైన్నె ట్రేడ్ సెంటర్ వేదికగా జరుగుతాయనిని అన్నారు. పాకశాస్త్రం కూడా ఒక కళ అని అందువల్ల కళాకారులకు అందించే కలైమామణి అవార్డును తమకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. చెఫ్లు అజిత్ జనార్దనన్, కాశీ విశ్వనాథన్, సుధాకర్ ఎన్.రావు, తిరులోగచందర్, మోహన కృష్ణన్, రాజేష్ రాధాక్రిష్ణన్ తదితరులు పాల్గొన్నారు. హరిద్వార్కు సెంగోట్టయన్ సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలోని పదవుల నుంచి తనను తప్పించడంతో మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక యాత్రపై సెంగోట్టయన్ దృష్టి పెట్టారు. కోయంబత్తూరు నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. తాను ఢిల్లీలో ఎవర్నీ కలవబోనని, తాను హరిద్వార్కు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. బహిష్కృతులు, బయటకు వెళ్లిన వారందర్నీ కలుపుకుని సమష్టిగా, సమన్వయంతో 2026 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొందామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి ఆ పార్టీ సీనియర్ నేత సెంగోట్టయన్ సూచించడం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆయన్ను పార్టీ పదవుల నుంచి పళణిస్వామి తప్పించారు. ఆయన మద్దతుదారులపై సైతం వేటు వేస్తూ వస్తున్నారు. కింది స్థాయిలో ఉన్న సెంగోట్టయన్ మద్దతుదారులు తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారు. అదే సమయంలో అసంతృప్తితో అన్నాడీఎంకేలో ఉన్న నేతలందర్నీ ఏకం చేయబోతున్నట్టు సెంగోట్టయన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ పరిస్థితులలో సోమవారం ఉదయం ఆయన ఢిల్లీకి బయల్దేరనున్న సమాచారంతో రాజకీయంగా చర్చ ఊపందుకుంది. ఢిల్లీలో ఆయన బీజేపీ నేతలను కలిసే అవకాశాలు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ చర్చకు ముగింపు పలికే విధంగా సెంగోట్టయన్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తాను ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శనకు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. మానసిక ప్రశాంతత కోసం హరిద్వార్ యాత్రకు ఏర్పాట్లు చేసుకున్నానని తెలిపారు. అయితే తాను ఢిల్లీలో ఎవర్నీ కలవబోనని, ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం, సంప్రదింపులు జరపాల్సిన పరిస్థితి తనకు లేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే అధికారంలోకి రావాలని తాను కోరుకుంటున్నానని, కేడర్ అభిప్రాయాలను తాను మనస్సు విప్పి మాట్లాడితే, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూడండి అని అసహనం వ్యక్తం చేశారు. తాను మరే ఇతర వ్యాఖ్యలు చేయబోనని, తాను ఆధ్యాత్మిక యాత్రకు బయల్దేరుతున్నట్టు, మళ్లీ చెబుతున్నానని, అందరూ కలిసి ఉండాలన్నదే తన అభిప్రాయమని వ్యాఖ్యలు చేశారు. -
మల్లైసత్యకు శాశ్వత ఉద్వాసన
సాక్షి, చైన్నె: ఎండీఎంకేలో మల్లై సత్యపై ఆ పార్టీ అధినేత వైగో వేటు వేశారు. ఆయన్ను శాశ్వతంగా పార్టీ నుంచి తొలగిస్తూ సోమవారం ప్రకటించారు. డీఎంకే నుంచి గతంలో చీలికతో ఆవిర్భవించిన పార్టీ మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కళగం(ఎండీఎంకే) అన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ వ్యవస్థాపకుడిగా, ప్రధాన కార్యదర్శిగా వైగో వ్యవహరిస్తున్నారు. ఆయన తనయుడు దురై వైగో రాజకీయ ప్రవేశంతో పార్టీ కోసం శ్రమించిన ముఖ్య నేతలందరూ బయటకు వెళ్లిపోయారు. వైగో నమ్మిన బంటుగా ఉంటూ వచ్చిన మల్లై సత్య ఎన్ని అటు పోట్లు ఎదురైనా పార్టీనే నమ్ముకుని ముందుకు సాగారు. తాను వైగోకు విశ్వాసపాత్రుడ్ని అంటూ ఆయనకు సేవలు చేసుకుంటూ వచ్చారు. అయితే దురై వైగో, మల్లై సత్య మధ్య వివాదం రాజుకోవడంతో ఎండీఎంకేలో వివాదానికి దారి తీసింది. ఈ వివాదం నేపథ్యంలో వైగో తన నమ్మిన బంటును ద్రోహిగా వ్యాఖ్యానించారు. దీనిని మల్లై సత్య తీవ్రంగా పరిగణించారు. తనకు న్యాయం కావాలంటూ మల్లైసత్య ఆందోళనకు సైతం దిగారు. పార్టీలోకి వచ్చి రాగానే దురైవైగోకు ప్రిన్సిపల్ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించడాన్ని అనేక మంది వ్యతిరేకిస్తూ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మల్లై సత్య వెన్నంటి నిలుస్తూ రావడంతో ఎండీఎంకేలో చీలిక తప్పదన్న చర్చ జోరందుకుంది. అదే సమయంలో గత నెల మల్లై సత్యను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ వైగో నిర్ణయం తీసుకున్నారు. వివరణ కోరుతూ ఆయనకు నోటీసులు పంపించారు. అయితే మల్లై సత్య స్పందించలేదు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సోమవారం వైగో నిర్ణయం తీసుకున్నారు. తనను పార్టీ నుంచి శాశ్వతంగా సాగనంపుతారని ముందే గ్రహించినట్టు, తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై మద్దతుదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు, ఈ నెల 15న కీలక నిర్ణయం ప్రకటిస్తానని మల్లై సత్య స్పష్టం చేశారు. -
హీరో విజయ్పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు!
నటి త్రిష.. తొలుత తమిళంలో జోడి అనే చిత్రంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలో నటించారు. ఆ తర్వాత సూర్యకు జంటగా మౌనం పేసియదే చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత విక్రమ్ సరసన నటించిన సామి చిత్రం త్రిషను స్టార్ హీరోయిన్ చేసింది. అంతే ఆ తరువాత కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవలసిన ఈ బ్యూటీకి కలగలేదు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అంటూ అన్ని భాషలలో నటిస్తూ అగ్ర కథానాయకిగా మారారు. ఈ 42 ఏళ్ల చెన్నై సుందరి ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడం గమనార్హం. అదేవిధంగా కథానాయకిగా 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు. చాలామంది హీరోయిన్ల మాదిరిగానే త్రిష కెరీర్లోను చాలా ఎత్తు పల్లాలు చోటుచేసుకున్నాయి. అలా పడి లేస్తూ తన కెరీర్ను పదిల పరుచుకుంటూ వస్తున్న త్రిష ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె సూర్యకు జంటగా నటిస్తున్న కరుప్పు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని దీపావళి సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న విశ్వంభర చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సమ్మర్లో బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం ఈమె చేతిలో కొత్త చిత్రాలు ఏమీ లేవు. ఇదిలా ఉంటే త్రిష త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటుడు విజయ్ త్రిషకు మంచి మిత్రుడు. అయితే స్నేహబంధం కొందరు వేరే విధంగా కూడా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి 2026లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకల్లో 25 ఏళ్ల సినీ కెరియర్ గాను నటి త్రిషకు స్పెషల్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తాను నటించిన ఒక్కో హీరో గురించి త్రిష మాట్లాడారు. నటుడు విజయ్ గురించి ఆమె మాట్లాడుతూ ఆయన నూతన పయనానికి గుడ్ లక్ అని పేర్కొన్నారు అదేవిధంగా విజయ్ కి ఎలాంటి కల ఉన్నా అది నెరవేరాలని, అందుకు ఆయన అర్హుడని, ఆయనకు తన శుభాకాంక్షలు అని అన్నారు. త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
నిషేధిత గుట్కా స్వాఽధీనం
– ఒకరి అరెస్టు తిరువళ్లూరు: కారులో నిషేధిత గుట్కాను తరలిస్తూ పోలీసులను చూడగానే కారును రోడ్డులో ఆపి వరి పొలంలో దాక్కుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పరారైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్న పోలీసులు, కారును సీజ్ చేసి 350 కిలోల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గుట్కా, గంజాయి, కల్తీమద్యం, మత్తుమాత్రల అక్రమ రవాణా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. శనివారం అనుమానాస్పదంగా వచ్చిన కారును ఊత్తుకోట చెక్పోస్టు వద్ద ఆపడానికి పోలీసులు యత్నించారు. అయితే ఆక్కడ కారును ఆపకుండా వేగంగా ఇద్దరు యువకులు ముందుకు సాగించారు. అనంతరం పెనాలూరుపేట పోలీసులు సైతం కారు ఆపే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. దీంతో పోలీసులు వైర్లెస్ ద్వారా పుల్లరంబాక్కం, తిరువళ్లూరు టౌన్, తాలుకా పోలీసులు, మనవాలనగర్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. పుల్లంరంబాక్కం వద్ద పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తించిన ఇద్దరు యువకులు కారును రివర్స్ చేసి పరార్ కావడానికి యత్నించారు. అయితే పోలీసులు వారిని వెంబడించడంతో పూండి వద్ద కారును ఆపి ఒకరు పూండి రిజర్వాయర్లోని ముళ్లపొదలు వైపు, మరొకరు వరి పొలాల్లో దాక్కున్నాడు. వరి పంటల్లో దాక్కుకున్న వ్యక్తిని గంట పాటు గాలించిన పోలీసులు, రాజస్థాఽన్కు చెందిన జగధీష్చౌదరి(26) అనే యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారయ్యాడు. కారును సీజ్ చేసిన పోలీసులు అందులో అక్రమంగా తరలిస్తున్న నిషేదిత గుట్కా 350 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. -
యఽథావిధిగా సుబ్రహ్మణ్యస్వామి దర్శనం
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం యథావిధిగా ఆలయంలో భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అనేక ఆలయాలు మూతపడ్డాయి. అయితే అందుకు భిన్నంగా తిరు త్తణి ఆలయం ఆగమ శాస్త్రం మేరకు గ్రహణం సమయంలోనూ ఆలయం తెరిచివుంచి భక్తులు స్వామిదర్శనం చేసుకోవడం పరిపాటి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం యథావిధిగా ఆలయం తెరిచి స్వామికి అభిషేక పూజలు నిర్వహించారు. ఆదివా రం సెలవుదినం కావడంతో భక్తులు అధికసంఖ్య లో స్వామి దర్శనం చేసుకున్నారు. అనేక ఆలయా లు సాయంత్రం మూతపడినప్పటికీ, తిరుత్తణి ఆలయంలో మాత్రం నిర్విరామంగా భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. రాత్రి 9 గంటల వరకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం స్వామికి ఏకాంత సేవ చేశారు. -
వైభవం..వీరరాఘవుడి పవిత్రోత్సవం
తిరువళ్లూరు: పట్టణంలోని వైద్య వీరరాఘవుడి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం ఉదయం తిరుమంజనం, యాగశాల పూజలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిఏటా వైద్యవీరరాఘఽవుడి ఆలయంలో పవిత్రోత్సవాలను ఏడు రోజుల పాటు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం, అలంకరణ, తిరుమంజనం, యాగశాల పూజలు, ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. కాగా పవిత్రోత్సవాలు 13వ తేదీన ముగియనున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
భక్తులతో గిరివలయం కిటకిట
వేలూరు: భక్తులతో గిరివలయం కిటకిటలాడింది. తిరువణ్ణామలై గిరివలం వెళ్లేందుకు భక్తులకు అవసరమైన సౌకర్యాలను ట్రాన్స్పోర్టు అధికారులు సిద్ధం చేశారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో ప్రతినెలా పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ఆలయం వెనుక ఉన్న కొండను 14 కిలోమీటర్లు నడిచి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అందులో భాగంగా ఆదివారం నుంచి అర్ధరాత్రి వరకు పౌర్ణమి సమయం ప్రకటించడంతోపాటు సెలవు రోజు కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఉదయం నుంచి భక్తులు తిరువణ్ణామలైకి చేరుకున్నారు. దీంతో బస్సుల్లో రద్దీ అధికంగా ఉండడంతో రవాణా అధికారులు అదనపు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. వీటితోపాటు రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కాట్పాడి చేరుకొని రైలులో తిరువణ్ణామలై చేరుకున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి చంద్రగ్రహణం కావడంతో ఉదయం నుంచే సాయంత్రం వరకు భక్తుల రద్దీ కిటకిటలాడింది భక్తుల రద్దీని బట్టి ఆలయ అధికారులు ఆలయంలో భక్తులకు ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశారు. -
టెట్ పరీక్ష రాయాల్సిన టీచర్ల వివరాల సేకరణ ముమ్మరం
తిరువొత్తియూరు: సుప్రీంకోర్టు ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) విషయంలో సంచలన తీర్పును వెలువరించింది. అందులో 2012కి ముందు విధుల్లో చేరిన ఉపాధ్యాయులు కూడా టెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొంది. ఈ ఉత్తర్వుల వల్ల, తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,38,000 మంది ఉపాధ్యాయులు, ప్రభుత్వ సహాయం పొందే పాఠశాలల్లో 38,000 మంది ఉపాధ్యాయులు సహా మొత్తం 1,76,000 మంది టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని ప్రాథమికంగా సమాచారం వెలువడింది. ఈ విషయంలో పాఠశాల విద్యాశాఖ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చలు జరుపుతున్న నేపథ్యంలో, ’టెట్’ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సిన ఉపాధ్యాయుల వివరాలను కచ్చితంగా సేకరించాలని ప్రణాళిక వేసింది. దాని ప్రకారం, ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే పాఠశాలల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన ఉపాధ్యాయుల వివరాలు, ఉత్తీర్ణత సాధించాల్సిన ఉపాధ్యాయుల వివరాలను సేకరించి, పాఠశాల విద్యాశాఖకు ఆయా జిల్లా ముఖ్య విద్యాధికారులు పంపాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంధుల కారు ర్యాలీ -
కన్నులపండువగా చక్రతాళ్వార్కు చక్రస్నానం
చంద్రగిరి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు ఆదివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన చేపట్టారు. అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్కు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత చక్రత్తాళ్వార్ను పల్లకీపై ఊరేగింపుగా పద్మ పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. దీంతో పవిత్రోత్సవాలను పరిసమాప్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజు, ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
ముగిసిన పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారం ముగిశాయి. మూల విరాట్కు పవిత్ర మాలధారణతో విశేష పూజలు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం యాగశాల నుంచి పవిత్రమాలలు విశేష పూజా ద్రవ్యాలను శ్రీకాళహస్తీశ్వరాలయ ఈఓ బాపిరెడ్డి, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా తీసుకెళ్లి వినాయకుడికి పవిత్రమాల సమర్పించారు. అనంతరం వినాయకుడు, జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామికి పవిత్రమాలల సమర్పణ వేడుకగా చేపట్టారు. యాగశాలలో శాంతి హోమ పూజలు, చండికేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయన్నారు. -
● 3 అంశాలతోనే పెట్టుబడుల వరద ● మరపురాని జ్ఞాపకాలతో తమిళనాడుకు ● లండన్ తమిళులలో సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: సీఎం ఎంకే స్టాలిన్ గత నెల విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. జర్మనీ, ఇంగ్లాండ్లో ఆయన పర్యటన ఆదివారం వరకు సాగింది. ఈ పర్యటన ద్వారా తమిళనాడులోకి రూ.15,516 కోట్ల పెట్టుబడులు తమిళనాడులోకి వచ్చాయి. తద్వారా 17,613 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. లండన్లో విదేశీ పర్యటనను ఆదివారం సీఎం ముగించారు. చివరగా ఇంగ్లాండ్లోని ప్రవాస తమిళుల నేతృత్వంలో తమిళ కల పేరిట జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీఎం స్టాలిన్తో పాటూ మంత్రి టీఆర్పీ రాజా, ప్రవాస తమిళ సంక్షేమ బోర్డు చైర్మన్ కార్తికేయ, ఓవర్సీస్ తమిళ్స్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ప్రముఖులుబ్రదర్ రామ్, పీ గాంధీ, సోదరుడు ముహమ్మద్ ఫైసల్, సెంథిల్ సహా నిర్వాహకులు, సీఎం సతీమణి దుర్గా స్టాలిన్ హాజరయ్యారు. తమిళ భాషా చిహ్నం.. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ ఓ యువత చిత్రమా! ఓ స్ఫూర్తిదాయకమైన ఇతిహాసమా! ఓ జలధార పుష్పమా! అన్న కవితతో ప్రసంగాన్ని అందుకున్నారు. తమిళులుగా జన్మించడం ఒక వరంగా పేర్కొంటూ, తమిళ భాషకు చిహ్నంగా ప్రపంచ వ్యాప్తంగా నలమూలలలో ఎక్కడో ఒక చోట తమిళుడు ఉన్నాడని వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్తో సహా వివిధ యూరోపియన్ దేశాలలో ఉన్న తమిళులందర్నీ చూస్తుంటే, ఎంతో ఆనందం కలుగుతున్నట్టు వివరించారు. ఈ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్ చిత్ర పటాన్ని ఆవిష్కరించడం గురించి ప్రస్తావిస్తూ, ఈ వేడుకకు వచ్చిన వారంరూ తమను తాము పరిచయం చేసుకుంటూ తమిళనాడులోని వివిధ పట్టాణాలు, నగరాల పేర్లను ప్రస్తావించారని పేర్కొన్నారు. మాతృ రాష్ట్రాన్ని వీడి ఇక్కడకు వచ్చి ఉన్నత స్థితికి చేరుకోవడం వెనుక ఎంతో శ్రమ అన్నది తప్పనిసరిగా ఉంటుందని ప్రస్తావిస్తూ, ప్రతిష్టాత్మక ఈ దేశంలో అందరూ ఆత్మగౌరవంతో ముందడుగు వేయాలని పిలుపు నిచ్చారు.తమిళులు ఉన్నత విద్యావంతులు, కష్టపడి పనిచేసేవారు అని పేర్కొంటూ, ఈ దేశంలో ఉన్న తమిళులందరూ వీటిని నిరూపించారని , ఇక్కడున్న అందర్నీ కలిసేందుకు తానకు భాగ్యం దక్కడం మరింత ఆనందంగా ఉందన్నారు. వదులుకోవద్దు.. తమిళులు ఎక్కడికి వెళ్లినా, మాతృ భాష, సంస్కృతిని వదులుకోవద్దని, అలాగే, ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం అన్న సూత్రాన్ని మరచి పోవద్దు అని సూచించారు. కొంత కాలంగా ఇంగ్లాండ్లో తమిళుల ఉనికి అన్నది పెరుగుతున్నట్టు వివరిస్తూ, ఇది తమిళులందరికీ గర్వకారణంగా పేర్కొన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులైన యువత, ప్రశాంత వాతావరణం రూపంలో తమిళనాడులోకి పెట్టుబడులల వరద పారుతోందన్నారు. ఇది తమిళనాడు గర్వకారణమైన చిహ్నం అని, రాయబారులుగా ఇక్కడకు వచ్చినప్రతి ఒక్కర్ని చూస్తుంటే, తమిళనాడు సమగ్రాభివృద్ధికి మీరే బాధ్యత అని వ్యాఖ్యానించారు. విదేశాలలో ఉన్న పిల్లలకు తమిళ పేర్లు ఉండడం మరింత ఆనందాన్ని కలిగిస్తున్నట్టు పేర్కొంటూ, తమిళ చైతన్యాన్ని నింపుతున్నందుకు అభినందనలు అని కొనియాడారు. వాస్తవానికి ఇక్కడున్న ప్రతి వ్యక్తితో విడివిడిగా మాట్లాడాలని ఉందని, ఇళ్లకు వచ్చి వెళ్లాలని ఉందని, తగినంత సమయం లేని కారణంగా అందర్నీ ఒకే చోట కలవాల్సి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. తమిళులు ఉన్నంతంగా ఉండాలని, తోటి తమిళులకు సహకారంగా ఉండాలని సూచించారు. తమిళనాడులో పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడి పారిశ్రామిక వేత్తలైన తమిళులు ముందుడుగు వేయాలని పిలుపు నిచ్చారు. తమిళుల చరిత్ర, సంస్కృతిని నేటి యువతరం మరవ కూడదని, తమిళనాడులోని కీలడి, గంగై కొండ చోళపురం మ్యూజియంలను సందర్శించి తమిళ వైభవాన్ని వీక్షించాలని కోరారు.ఐక్యతతో ఉందాం.. తమిళులు అందరూ ఐక్యత ఉండాలని, ప్రగతి పథంలో ప్రయాణించాలని పేర్కొంటూ, ఇందుకు తోడ్పాటుగా ద్రావిడ మోడల్ పాలన ఉందని సూచించారు. ప్రవాస తమిళుల శ్రేయస్సు కోసం తాము అనేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని వివరిస్తూ, జనవరి12 చైన్నె వేదికగా ప్రతి ఏటా జరిగే ప్రవాస తమిళ దినోత్సవ వేడుకలలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. విజయం అన్నది తమిళులు ఉనికిలోనే ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తమిళులు ప్రపంచానికి చెందినవారు అని, ప్రతి నగరంలో ఏదో ఒక చోట తమిళుడు ఉంటాడని, కులం, మతం, ధనిక, పేద అనే తేడాలు లేకుండా ఆప్యాయతను చాటుతుంటాడని వివరించారు. విదేశీ పర్యటనను ముగించుకుని చైన్నెకు సీఎం స్టాలిన్ బయలుదేరారు. సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు చైన్నెకు సీఎం చేరుకోనున్నారు. ఆయనకు బ్రహ్మారథం పట్టే విధంగా ఆహ్వానం పలికేందుకు మంత్రి అన్బరసన్ నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం నుంచి సీఎం నివాసం వరకు మార్గాలన్నీ డీఎంకే జెండాలతో నింపేశారు. సీఎంను ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున కేడర్ తరలి వచ్చి రోడ్డుకు ఇరువైపులా నిలబడి సీఎంను ఆహ్వానించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. -
పెన్నీ క్విక్ కుటుంబంతో భేటీ
తమిళనాడులోని తేని, మదురై, రామనాథపురం, శివగంగై, విరుదునగర్ జిలాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా బ్రిటీషు హయంలో కేరళ రాష్ట్రం ఇడిక్కిలో ముల్లైపెరియార్ జలాశయం నిర్మితమైన విషయం తెలిసిందే. ఈ జలాశయాన్ని అప్పటి బ్రిటీషు ఇంజినీర్ కల్నల్ జాన్ పెన్నీ క్విక్ నిర్మించారు. తన ఆస్తులను సైతం ఆయన ఈ నిర్మాణం కోసం వెచ్చించినట్టు చరిత్ర చెబుతోంది. ఆయనకు గౌరవం కల్పించే విధంగా తేనిలో స్మారక మందిరం, విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన సీఎం స్టాలిన్ పెన్నీ క్విక్ కుటుంబానికి చెందిన సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా సీఎం పేర్కొంటూ ముల్లై పెరియార్ జలాశయం ప్రజల హృదయాలను తాకిందని,ప్రజా జీవనాన్ని పెంపొందించిందని గుర్తుచేస్తూ, ఇదిపూర్తిగా పెన్నీ క్విక్ సహకారమే కారణంగా పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులను కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పెన్నీ క్విక్ స్వస్థలం కాంబెర్లీ పట్టణంలో ఆయన విగ్రహం ఏర్పాటుకు కుటుంబ సభ్యుల విజ్ఞప్తిని నెరవేరుద్దామన్నారు. జాన్ పెన్నీ క్విక్ కీర్తి చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. -
న్యూస్రీల్
అప్రమత్తం కాకుంటే పెను నష్టం సాక్షి, చైన్నె: అప్రమత్తం కాకుంటే పెనునష్టం తప్పదని అన్నాడీఎంకే వర్గాలను అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోమారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆయన వల్లే తాము ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినట్టు స్పష్టం చేశారు. పళణిస్వామి తన భుజాన నైనార్ మోస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షా అయితే, అందరూ ఐక్యంగా ఉండాలని, సమన్వయంగా పనిచేయాలని సూచిస్తే, నైనార్ భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పళణిస్వామిని కూటమి సీఎం అభ్యర్థిగా తాము అంగీకరించే ప్రసక్తే లేదని, అందుకే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామన్నారు. అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంను పళణి స్వామి చిద్రం చేశారని, పార్టీ వర్గాలు ఇకనైనా మేల్కొననని పక్షంలో రాజకీయంగా ముఖ్యనేతలకు నష్టాలు తప్పదని హెచ్చరించారు. పార్టీకి పెనునష్టం పొంచి ఉందని, పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై, కేడర్పై ఉందన్నారు. ఆలయాల మూత సాక్షి, చైన్నె: సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాలను మూసి వేశారు. ఆదివారం రాత్రి సుమారు తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి 2.30 గంటల వరకు చంద్రగ్రహణం అన్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని తిరుచ్చి, మదురై, తిరుచెందూరు, పళణి, తదితర ప్రాంతాలలోని శ్రీరంగం రంగనాథ స్వామి, శ్రీ విళ్లిపుత్తూరు ఆండాల్ అమ్మవారు, రామేశ్వరం రామనాథ స్వామి, సమయపురం మారియమ్మన్ , తిరుచెందూరు మురుగన్ వంటి అతిపెద్ద ఆలయాలు సాయంత్రం నుంచి మూసి వేశారు. చైన్నెలోని పార్థసారధి స్వామి, టీనగర్లోని శ్రీవెంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారు తదితర ఆలయాలను మూసి వేశారు. సోమవారం ఉదయం శుద్దీ చేసినానంతరం పూజలు ఆలయాలలో జరగనున్నాయి. యథాప్రకారం సేవలు సాగనున్నాయి. అయితే తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం, తిరుత్తణి మురుగన్ ఆలయాలు మూత పడకుండా యథాప్రకారం సేవలు జరిగాయి. అలాగే ఈరోడ్ జిల్లా తిరుచెంగోడులోని అర్ధనారీశ్వర ఆలయం కూడా మూతబడలేదు. యథా ప్రకారం పూజలు జరిగాయి. శ్మశానంలో గోతుల కలకలం సాక్షి, చైన్నె: ఓ శ్మశానంలో ఏకంగా ఒకేసారి 20 గుంతులు మృతదేహాలను పూడ్చేందుకు గాను.. తవ్వి ఉండడం ఆదివారం కలకలం రేపింది. వివరాలు.. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపంలోని ఉడుమలైలో విద్యుత్ శ్మశాన వాటిక ఉంది. దీనికి పక్కనే మృతదేహాలను ఖననం చేయడానికి మరో శ్మశానం ఉంది. ఈ పరిస్థితుల్లో గ్రామంలో పెద్దఎత్తున ఎలాంటి మరణాలు జరగనప్పటికీ ఏకంగా ఒకే సమయంలో 20 గోతులను మృతదేహాల ఖననం నిమిత్తం తవ్వి ఉండడం ఆదివారం వెలుగు చూసింది. గ్రామంలో ఓ మహిళ మరణించగా, ఆమె మృతదేహాన్ని ఖననం చేయడానికి వెళ్లిన గ్రామస్తులు ఇక్కడ 20 గోతులను తవ్వి ఉండడాన్ని చూసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పోలీసులు సైతం రంగంలోకి దిగడంతో కలకలం రేగింది. మృతదేహాలను ఖననం చేయడానికి ముందుగా సమాచారం ఇస్తే శ్మశానంలోని సిబ్బంది గుంతలను తవ్వడం సహజంగా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ముందుగానే 20 గుంతలు తవ్వి ఉండడం అనుమానాలకు దారి తీశాయి. దీంతో శ్మశానాన్ని పర్యవేక్షించి బాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎవరైనా మరణిస్తే గుంతులు తవ్వేందుకు మనుషులు దొరకడం లేదని, అందుకే ముందుగానే జేసీపీ ఉపయోగించి 20 గుంతలను తవ్వి పెట్టుకున్నట్టు అతడు ఇచ్చిన సమాచారం అందర్నీ విస్మయంలో పడేసింది. అయితే ఎవరైనా మరణించిన పక్షంలో ఆయా కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారంతో అంత్యక్రియలకు ముందుగా గోతులు తవ్వడం అనాదిగా వస్తోంది. అయితే సంప్రదాయనికి విరుద్ధంగా గోతులు తవ్వి ఉండడాన్ని పొల్లాచ్చి రెవెన్యూ అధికారులు తీవ్రంగా పరిగణించి వాటిని మట్టితో మళ్లీ పూడ్చేశారు. బాబు వద్ద పోలీసులు మరింతగా విచారిస్తున్నారు. -
రంగంలోకి శ్రీగాంధీ
సాక్షి, చైన్నె: తనయుడు అన్బుమణికి చెక్ పెట్టే వ్యూహంతో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఉన్నట్టు ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో అన్బుమణి స్థానంలో తన కుమార్తె శ్రీగాంధీని రంగంలోకి దించేందుకు రాందాసు సిద్ధమైనట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు.. పీఎంకేలో తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య సాగుతున్న వార్ తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అన్బుమణిని పార్టీ నుంచి తప్పించాల్సిందే అన్న నినాదాన్ని సీనియర్లు అందుకున్నారు. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు సైతం అన్బుమణి నుంచి స్పందన రాకపోవడంతో ఇక ఆయన్ను పార్టీ నిర్వాహక అధ్యక్షుడి పదవి నుంచి తప్పించే వ్యూహంలో రాందాసు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అదే సమయంలో అన్బుమణి స్థానంలో తన కుమార్తె శ్రీగాంధీని రాజకీయంగా రంగంలోకి దించేందుకు రాందాసు సిద్ధమైనట్టు పీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే పార్టీ సర్వసభ్య సమావేశంలోనూ, ఇతర సమావేశాల్లోనూ ఆమెకు రాందాసు తాజాగా ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నట్టు చెబుతున్నారు. అన్బుమణికి చెక్ పెట్టడమే లక్ష్యంగా రెండు రోజుల క్రితం ఆడుతురైలో శ్రీగాంధీ నేతృత్వంలో సమావేశానికి నిర్ణయించినట్టు పేర్కొంటున్నారు. అయితే ఈ సమావేశాన్ని భగ్నం చేసే విధంగా అక్కడి పార్టీ నేత మూకా స్టాలిన్పై దాడి జరిగిందని, అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఆడుతురై సమావేశాన్ని అడ్డుకోవడాన్ని రాందాసు తీవ్రంగా పరిగణించి ఉన్నారని, ఇక, పూర్తిస్థాయిలో శ్రీగాంధీ సేవలను పార్టీకి వినియోగించుకునేందుకు నిర్ణయించినట్టు చర్చ జరుగుతోంది. ఆమెకు పార్టీలో కీలక పదవి అప్పగించేందుకు సిద్ధమైనట్టు, ఇందుకు అనుగుణంగా ఒకటి రెండు రోజులలో అధికారికంగా రాందాసు ప్రకటన ఇవ్వబోతున్నట్టు ఓ నేత పేర్కొన్నారు. అన్బుమణికి రాజకీయంగా చెక్ పెట్టాలంటే శ్రీగాంధీ సేవలను వినియోగించుకోవాల్సిందేనని సీనియర్లు ఇచ్చిన సూచనకు అనుగుణంగా రాందాసు వ్యూహాలకు పదును పెట్టి ఉండడం మున్ముందు పీఎంకేలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. -
మనిదన్ దైవమాగలామ్లో సెల్వరాఘవన్
తమిళసినిమా: తుళ్లువదో ఇళమై చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన సెల్వరాఘవన్ ఆ తర్వాత కాదల్ కొండేన్, 7జీ రెయిన్బో కాలనీ, పుదుపేట్టై, ఆయిరత్తిల్ ఒరువన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. కాగా ఇటీవల నటుడిగా అవతారం ఎత్తిన ఈయన విజయ్ హీరోగా నటించిన బీస్ట్ చిత్రంలో కీలకపాత్రను పోషించారు. అదేవిధంగా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. కాగా తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం మనిదన్ దైవమాగలామ్. వ్యోమ్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై విజయ సతీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డెన్నిస్ మంజునాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఖుషి రవి నాయకిగా నటిస్తున్న ఇందులో వైజీ మహేంద్రన్, మైమ్ గోపి, కౌసల్య, సతీష్, లిత్రిక ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ ఆదివారం నటుడు ధనుష్ ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు. చిత్ర వివరాలను దర్శకుడు వివరిస్తూ ప్రశాంతతతో కూడిన ప్రకృతి కలిగిన ఒక గ్రామంలో ప్రజల సమైక్యతను దెబ్బతీసే సంఘటన చోటుచేసుకుంటున్నాయి. దీంతో అక్కడ ప్రజల జీవనం విచ్ఛిన్నం అవుతుందన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారి సమస్యల పరిష్కారానికి ఒక వ్యక్తి కృషిచేస్తారన్నారు. దీంతో ఆయన్ని దేవుడిగా అక్కడి ప్రజలు భావించే ఇతివృత్తంతో రూపొందిన కథ చిత్రం మనిదన్ దైవమాగలామ్ అని దర్శకుడు చెప్పారు. నిర్మాత విజయ సతీష్ మాట్లాడుతూ మంచి చిత్రాలతో కూడిన భారతీయ సినిమాను తయారు చేయాలని ప్రారంభించిన సంస్థ వ్యోమ్ ఎంటర్టెయిన్మెంట్ అని పేర్కొన్నారు. తమ సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రం టైటిల్ ఆవిష్కరించిన ధనుష్కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి రవివర్మ కే.చాయాగ్రహణం, ఏకే.ప్రియన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
నూతన స్వర్ణ రథానికి పూజలు
కొరుక్కుపేట: చైన్నె జార్జిటౌన్లోని మూడు శతాబ్దాల పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో భక్తుల కోర్కే మేరకు పాలకమండలి సభ్యులు కన్యకాపరమేశ్వరి అమ్మవారికి బంగారు రథం తయారు చేయించి భక్తుల కోర్కెను తీర్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం నూతన స్వర్ణ రథానికి పూజలు , హోమాలను ఆలయ అర్చకులు భాస్కర పంతులు బృందం సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. బంగారు రథం కోసం ఆలయం లోపల ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు. పూర్ణాహుతి అనంతరం అమ్మవారిని బంగారు రథంలో కొలువుదీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. జై వాసవీ ..జైజై వాసవీ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. బంగారు రథం తయారీకి విరాళాలను నగదు, వస్తువు రూపేనా అందించిన దాతలకి దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త కొల్లావేంకట చంద్రశేఖర్ అధ్యక్షతన పాలక మండలి సభ్యులు ఊటుకూరు శరత్ కుమార్ ,దేసు లక్ష్మీ నారాయణ , ఎస్ ఎల్ సుదర్శనం, సీఆర్ కిషోర్ బాబు, టీవీ రామకుమార్, తాతా బద్రీనాథ్ కలసి ఘనంగా సత్కరించారు. ఎస్కేపీడీ అండ్ చారిటీస్ సెక్రటరీ కిషోర్ బాబు ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఊటుకూరు శరత్కుమార్ మాట్లాడుతూ గత ఏడాది నవరాత్రి ఉత్సవాల్లో బంగారు తల్లికి బంగారు రథం పేరిట పథకాన్ని రూపొందించామన్నారు. తాము చేపట్టిన ఈ మహత్తర కార్యానికి దాతలు, భక్తులు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారికి స్వర్ణరథం ఏర్పాటుకు సహకరించినవారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో మహిళలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని బంగారు రథంలో కొలువుదీరిన వాసవీ అమ్మవారిని దర్శించుకుని తరించారు. -
ఆంధ్రా ఆణిముత్యం.. వెంకట కృష్ణారావు
కొరుక్కుపేట: తెలుగు భాష పరిరక్షణ, భూదానం, అన్నదానం, చట్ట సభల్లో శాసన సభ్యుడిగా, మంత్రిగా వ్యవహరించిన గాంధేయవాది మండలి వెంకట కృష్ణారావు ఆంధ్రరాష్ట్ర ఆణిముత్యం అని వక్తలు కొనియాడారు. చైన్నెలోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సభ, మైలాపూర్లోని పొట్టి శ్రీరాములు స్మారక భవన ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. స్వాగతోపన్యాసంను కమిటీ కార్యదర్శి, కోశాధికారి వి కృష్ణారావు చేయగా, సభకు భవన నిర్వాహక కమిటీ ఛైర్మన్ కాకుటూరు అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమ నిర్వాహణను కమిటీ సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య వ్యవహరించగా ఇందులో కమిటీసభ్యులు భువన చంద్ర, మాడభూషి సంపత్కుమార్, జేఎం నాయుడు, ఎంఎస్ లక్ష్మణ రెడ్డి , సంయుక్త కార్యదర్శి ఊరా శశికళ హాజరయ్యారు. ఈ వేడుకలకు అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అవని గడ్డ శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఏఐటీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డిలు పాల్గొని స్మారక భవనంలో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం నిర్వహణలో ఉన్న అమరజీవి భవనాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తామని, ఈ భవనంలో లైబ్రరీని ఆధునీకరించి ప్రజల వినియోగానికి తీసుకుని వచ్చిన అనిల్కుమార్ రెడ్డిని మాగుంట ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు సంఘల నాయకులు, తెలుగు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
● పదవి నుంచి తొలగింపు ● పళణి నిర్ణయం ● సెంగోట్టయన్ మద్దతు దారుల రాజీనామా పర్వం ● ఒకే వేదికపైకి అంతృప్తి వాదులు, బహిష్కృత నేతలు
సాక్షి, చైన్నె: సెంగోట్టయన్ వెన్నంటి కదిలిన మాజీ ఎంపీ సత్యభామను పార్టీ నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నిర్ణయం తీసుకున్నారు. దీంతో సెంగోట్టయన్ మద్దతు దారులంతా అన్నాడీఎంకేకు రాజీనామా చేసే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో అసంతృప్తి నాయకులు, బహిష్కృత నేతలను ఏకం చేసే దిశగా సెంగోట్టయన్ వ్యూహాలకు పదును పెట్టారు. అందర్నీ ఒకే వేదికపై తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వివరాలు.. ఐక్యత, సమష్టి, సమన్వయం అంటూ పార్టీ నుంచి బహిష్కరించబడ్డ వాళ్లు, బయటకు వెళ్లిన వాళ్లందర్నీ మళ్లీ ఏకం చేయాలంటూ మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగోట్టయన్ ఇచ్చిన పిలుపు పార్టీలోనే కాదు.. రాజకీయంగానూ చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి కన్నెర్ర చేశారు. ఆయన్ని పార్టీ పదవుల నుంచి తప్పించారు. అదే సమయంలో ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి సాగనంపే విధంగా చర్యలు చేపట్టారు. ఈపరిస్థితులలో సెంగోట్టయన్ వెన్నంటి కదలిన మాజీ ఎంపీ, తిరుచ్చి మాజీ మేయర్ సత్య భామపై సైతం పళణిస్వామి కన్నెర్ర చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు, ఈరోడ్ రూరల్ పశ్చిమ జిల్లా మహిళా విభాగం కార్యదర్శి పదవుల నుంచి వీ. సత్యభామను ఆదివారం తప్పించారు. సత్యభామ తదుపరి మరి కొందర్ని తప్పించే ందుకు పళణి నిర్ణయించిన సమాచారంతో సెంగోట్టయన్ మద్దతు దారులు అప్రమత్తమయ్యారు. తామే పదవులకు రాజీనామా చేస్తున్నామని ప్రకటిస్తూ , పార్టీ కార్యాలయానికి లేఖలు పంపించే పనిలో నిమగ్నం కావడం గమనార్హం. అసంతృప్తి నేతలతో.. పళణి స్వామి పార్టీలో నియంత వలే వ్యవహరిస్తుండడంపై సెంగోట్టయన్ తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. దీంతో పార్టీలో అసంతృప్తితో ఉన్న ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కొంగు మండలంలో బలమైన నేతగా ఉన్న సెంగోట్టయన్ ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల అభిప్రాయాలను సేకరిస్తూ వస్తున్నట్టు సమాచారం. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ మంత్రులు పళణి నిర్ణయానికి వ్యతిరేకత వ్యక్తంచేసినట్టు తెలిసింది. అదే సమయంలో అసంతృప్తితో ఉన్న ముఖ్య నేతలందరూ ఒక్క సారిగా పళణి నిర్ణయాన్ని ధిక్కరించే దిశగా వ్యూహ రచనలో ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈనెల 9న ఈరోడ్లో ఓ సమావేశానికి సైతం సెంగోట్టయన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారాలు వెలువడటం గమనార్హం. ఆ తదుపరి చిన్నమ్మ శశికళను సెంగోట్టయన్ కలిసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.సత్యభామ వంతు!సెంగోట్టయను కలుస్తా..సెంగోట్టయన్ను తాను కలవబోతున్నట్టు మాజీ సీఎం పన్నీరు సెల్వం ప్రకటించారు. అందర్నీ సమన్వయ పరిచే విధంగా సెంగోట్టయన్ చేపట్టే ప్రయత్నాలకు తన మద్దతు ఎల్లప్పుడు ఉంటుందన్నారు. ఆయన్ని కలిసి మరిన్ని విషయాలు మాట్లాడుతానని పేర్కొన్నారు. ఇక, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం టీటీవీ దినకరన్ సైతం సెంగోట్టయన్కు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ దృష్ట్యా, మరికొద్ది రోజులలో శశికళ, పన్నీరు, సెంగోట్టయన్, దినకరన్తో పాటూ అసంతృప్తితో ఉన్న ముఖ్య నేతలందరూ ఒకే వేదికపైకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు అనుగుణంగా దక్షిణ తమిళనాడులో పలు చోట్ల శశికళ, పన్నీరు, సెంగోట్టయన్, దినకరన్ చిత్ర పటాలతో పన్నీరు మద్దతు దారుడైన ఆశై తంబి పేరిట పోస్టర్లు హోరెత్తడం గమనార్హం. కాగా పార్టీకి , తనకు వ్యతిరేకంగా వ్యవహరించే ఏ ఒక్కర్నీ ఉపేక్షించబోనన్నట్టుగా పళణిస్వామి మరింత దూకుడు ప్రదర్శించనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తనకు ప్రజాదారణ పెరిగినట్టు గ్రహించిన ఆయన ఇక, ఎవరైనా సరే వ్యతిరేక గళం అందుకుంటే వేటు పడుద్ది అన్నట్టుగా ముందడుగు వేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు అనుగుణంగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు వాళ్లు కాదని, వారంతా పార్టీ నుంచి బహిష్కరించబడ్డ వారని, వారిని మళ్లీ అక్కున చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
కోల్డ్ కాల్ టైటిల్, టీజర్ విడుదల
తమిళసినిమా: మిస్టర్స్ వాక్ అవుట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేశవమూర్తి నిర్మిస్తున్న చిత్రం కోల్డ్ కాల్. ఈ చిత్రం ద్వారా తంబీదురై దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సిద్ధు మూడిమనణి,సంతోష్ ఎస్ఏ ,శ్రీ వైష్ణవ్, కృష్ణ విజయచంద్రన్, బాలాజీ రాజశేఖర్ ,శ్రీకాంత్ వి, అనిత రంగనాథ, నిషా హెగ్డే, కీర్తన పుల్కి తదితరులు ప్రధాని పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం శరవణన్ జీఎన్ ఛాయాగ్రహణం, ప్రణవ్ గిరిధరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర టైటిల్, టీజర్ లను ఆదివారం విడుదల చేశారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఆసక్తికరమైన ప్రత్యేక పరిస్థితులతో కూడిన కొత్త ప్రయత్నం ఈ చిత్రమని పేర్కొన్నారు. ఆసక్తికరమైన అంశాలతో కూడిన వినోద భరిత కథాచిత్రంగా కోల్డ్ కాల్ ఉంటుందని చెప్పారు. చిత్ర టైటిలే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పారు. ఇది విక్రయాలకు సంబంధించిన కథ చిత్రం కాకపోయినా ఇందులో వ్యాపారపరమైన కార్యాలయం కార్యక్రమాలు వ్యాపారానికి అతీతంగా చేసే విషయాల గురించి చర్చించే కథాచిత్రంగా ఉంటుందన్నారు. చిత్రంలోని ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఇందులో వినోదాన్ని సరదా సందర్భాల్లోనూ, గొడవలతోనూ, ప్రతికూల ఘటనల్లోనూ, భావద్రేకాలతోనూ, వివిధ కెమెరా కోణాలతోను పండించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. అయితే చిత్రం పూలిష్ గానూ, స్టాప్స్టిక్ కామెడీగానూ ఉండదన్నారు. ప్రతి సన్నివేశం సహజత్వంతో కూడి ఉంటుందన్నారు. కథాపాత్రలు తీయని అనుభూతిని కలిగిస్తాయని చెప్పారు. ఇది సస్పెన్స్తో కూడిన వైవిధ్య భరిత కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్న ఈ చిత్రం పది కాలాల పాటు ప్రేక్షకులకు గుర్తుండి పోతుందనే నమ్మకాన్ని నిర్మాత వ్యక్తం చేశారు. కోల్డ్ కాల్ చిత్రంలో అమిత రంగనాథ, సిద్ధు, మూలిమణి తదితరులు -
17 నుంచి పళణి 5వ విడత ప్రచారం
సాక్షి ,చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి 5వ విడత ప్రజా చైతన్య యాత్ర ఈనెల 17 నుంచి ప్రారంభం అవుతుందని ఆ పార్టీ కార్యాలయం ఆదివారం ప్రకటించింది. తమిళనాడు, ప్రజలను రక్షిద్దామన్న నినాదంతో పళణి స్వామి చేపట్టిన చైతన్య యాత్రకు విశేష స్పందన వస్తున్న విషయం తెలిసిందే. తన బలం పెరిగినట్టుగా గ్రహించిన పళణిస్వామి ప్రజలలోకి మరింతగా చొచ్చుకెళ్లే విధంగా యాత్రను వేగవంతం చేశారు. ప్రస్తుతం నాలుగో విడత ప్రచార ప్రయాణం సాగుతున్నది. ఈ పరిస్థితులలో ఈనెల 17 నుంచి ఐదో విడత ప్రచార రూట్ మ్యాప్ షెడ్యూల్ను ప్రకటించారు. ఈ యాత్ర ధర్మపురిలో మొదలు కానున్నది. పలు జిల్లాలో పర్యటించి కడలూరులో ఈనెల 26వ తేదీన ముగించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసి ఉన్నారు. ఇదిలా ఉండగా అన్నాడీఎంకే ఈరోడ్ రూరల్ పశ్చిమ జిల్లా తాత్కాలిక కార్యదర్శిగా తనకు బాధ్యతలు అప్పగించినందుకు పళణి స్వామిని కలిసి పార్టీ నేత ఏకే సెల్వరాజ్ ఆదివారం ఆశీస్సులు అందుకున్నారు. అలాగే తనకు వైద్య చికిత్సలు, శస్త్ర చికిత్సలు అందించి చేతులు తెప్పించినందుకు కృతజ్ఞతగా నారాయణ స్వామి అనే యువకుడు సైతం పళణిస్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నాడు. ఆదివారం పళణిస్వామి దిండుగల్ జిల్లాలో ప్రజా చైతన్య యాత్రతో దూసుకెళ్లారు. -
పీఎం మోదీ పర్యటనలకు కసరత్తు
సాక్షి, చైన్నె : ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్రంలో డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా కేంద్రంలోని ఎన్డీఏ పాలకులు వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడులో అన్నాడీఎంకే నేతత్వంలో కూటమిని ఏర్పాటు చేసి కార్యాచరణను వేగవంతం చేశారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమిళనాడుపై ప్రత్యేక దష్టి పెట్టి వరుస పర్యటనలు చేస్తూ వస్తున్నారు. పార్టీ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవసరం అయితే ఢిల్లీకి పిలిపించి మరీ సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ సైతం రాష్ట్రంలో వరుస పర్యటనలకు సన్నద్ధం అవుతున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి డిసెంబర్ వరకు ప్రధాని రాష్ట్రంలో వరుస పర్యటనలు చేయబోతున్నట్టు తెలిసింది. ఈ పర్యటనల కసరత్తులలో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నట్టు ఓ నేత పేర్కొన్నారు. నాలుగు నగరాలలో బహిరంగ సభలకు కార్యాచరణ చేస్తున్నారు. అంతలోపు కూటమిలోకి ముఖ్యమైన పార్టీలను ఆహ్వానించి, అందరినీ ఒకే వేదిక మీదుగా ప్రజలకు మోదీ పరిచయం చేసే వ్యూహంతో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ప్రధానంగా మోదీ సభలలో పళణిస్వామి ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మోదీ పర్యటన లోభాగంగా రోడ్షోలతో పాటూ బహిరంగ సభలకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు చైన్నె, కోయంబత్తూరు, మదురై, తంజావూరు నగరాలలో బహిరంగ సభకు వేదికలపై దష్టి పెట్టి ఉన్నారు. ఉత్తర తమిళనాడులోని జిల్లాలలకు వేదికగా చైన్నె, కొంగు మండలం జిల్లాలకు వేదికగా కోయంబత్తూరు, దక్షిణ తమిళనాడుకు వేదికగా మదురై, డెల్టా జిల్లాలకు వేదికంగా తంజావూరును ఎంపిక చేసిన భారీ బహిరంగ సభల నిర్వహణకు కసరత్తులు జరుగుతున్నట్టు మరో నేత పేర్కొన్నారు. -
తమిళనాడులో షాకింగ్ ఘటన.. మహిళను చెట్టుకు కట్టేసి..
కడలూరు: తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రుతి సమీపంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి.. దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఓ మహిళలను చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా దాడి చేయడంతో పాటు వివస్త్రను చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నలుగురు మహిళలలు కలిసి ఓ మహిళను ఆమె చీరతోనే చెట్టుకు కట్టేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.‘‘నువ్వు కుక్కతో సమానం’’ అంటూ బాధితురాలిని ఓ మహిళ అసభ్యకరంగా తిడుతుండగా, మరొకరు కర్రతో దాడి చేశారు. మరొ మహిళ ఆమె జట్టుపట్టుకుని లాగుతూ.. బాధితురాలి జాకెట్ను చించివేసింది. ఒక మహిళ ఈ దాడిని వీడియో తీస్తూ.. ఇలా చేస్తే జైలుకెళ్తారంటూ హెచ్చరించినా కూడా మిగతా వారు పట్టించుకోలేదు. సమారు 2.13 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఫుటేజ్ వైరల్గా మారింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు మహిళలో ఒకరు అరెస్టు కాగా, మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు.భూ వివాదం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న వారిని గాలించడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. దాడికి కుల వివక్ష కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
టీఎన్ రైజింగ్తో రూ. 15,516 కోట్లు పెట్టుబడి
సాక్షి. చైన్నె: టీఎన్ రైజింగ్ పేరిట జర్మనీ, ఇంగ్లాండ్ పర్యటనలలో తమిళనాడుకు రూ. 15,516 కోట్లుపెట్టుబడి వచ్చినట్టు సీఎంస్టాలిన్ ప్రకటించారు. దీని ద్వారా 17,613 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయని వివరించారు. గత నెలాఖరు నుంచి సీఎం స్టాలిన్ విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆదివారంతో ఆయన పర్యటననుముగించుకుని సోమవారం చైన్నెకు రాబోతున్నారు. ఈ పరిస్థితులలో తన పర్యటన గురించి , ఇందులో జరిగిన ఒప్పందాలను శనివారం సీఎం స్టాలిన్ ప్రకటించారు. లండనలో ఉత్సాహంగా పర్యటన జరిగిందంటూ హిందూజా గ్రూప్ తమిళనాట విద్యుత్ వాహన, బ్యాటరీ నిల్వ వ్యవస్థల కోసం 7,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. వెయ్యి మందికి దీని ద్వారా ఉపాధి దక్కనున్నట్టు పేర్కొన్నారు. ఆస్ట్రాజెనెకా కంపెనీ విస్తరణకు సంబంధించిన అవగాహన ఒప్పందం జరిగిందన్నారు. ఈ పర్యటనలలో రూ.15,516 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 17,613 ఉపాధి అవకాశాలు దక్కనున్నట్టు పేర్కొన్నారు. ఇవి అవకాశాలు, భవిష్యత్తు కలలకు కార్యాచరణ అని పేర్కొన్నారు.అత్యాధునిక పరిశోధన, ఏఐ–ఆధారిత ఆవిష్కరణలు , సాంకేతికత, ఆరోగ్య సంరక్షణలకు పెట్టుబడులు విస్తృతంగా వస్తున్నట్టు వివరించారు. అలాగే ఏరోస్పేస్తో సహా కీలక రంగాలలో అవకాశాలు మెరుగు, డీప్ టెక్, రైల్వేలు, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్లో దూసుకెళ్లనున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈప ర్యటనలో భాగంగా శనివారం తత్వ వేత్త కార్ల్ మార్క్స్ స్మారక చిహ్న వద్ద సీఎం స్టాలిన్ నివాళులర్పించారు. తత్వ వేత్త లక్ష్యాలను ఈసందర్భంగా గుర్తుచేశారు. -
వేటు పడింది!
అన్నాడీఎంకేలో ఐక్యత, సమన్వయ గళాన్ని అందుకున్న సీనియర్ నేత, ఎమ్మెల్యే సెంగోట్టయన్పై వేటు పడింది. రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శితో పాటూ ఈరోడ్ రూరల్ పశ్చిమ జిల్లా కార్యదర్శి పదవి నుంచి ఆయన్ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి తప్పించారు. ఈ ప్రకటన కాస్త విమర్శలకు దారి తీసింది. పార్టీ గెలుపు దృష్ట్యా, అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం నేరమా..? అని ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలో సెంగోట్టయన్ అత్యంత సీనియర్ నేత అన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామితో విబేధాలు, అసంతృప్తి అన్నది ఉన్నప్పటికీ సెంగోట్టయన్ అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్లాలన్న నినాదంతో, పార్టీలో చీలిక రాకూడదన్న ఉద్దేశంతో మౌనంగా ముందుకెళ్తూ వచ్చారు. ఈ పరిస్థితులలో శుక్రవారం ఆయన మనస్సు విప్పి మాట్లాడారు. అన్నాడీఎంకే 2026లో అధికారంలోకి రావాలంటే అందరూ ఏకం కావాల్సిందేనన్న సందేశాన్ని అందుకున్నారు. పార్టీ నుంచి బహిష్కరించ బడ్డ వాళ్లు, బయటకు వెళ్లిన వారందర్నీ మళ్లీ ఏకం చేయాలని సమిష్టి సమన్వయంతో ఎన్నికలను ఎదుర్కొంటే అధికారం మనదే అన్న అభిప్రాయాన్ని సెంగోట్టయన్ వ్యక్తం చేశారు. ఇందుకు గాను పళణికి పది రోజులు గడువు విధించారు. లేని పక్షంలో తానే స్వయంగా తన లాంటి వారందర్నీ ఏకంచేసి సమన్వయ పరుస్తానని హెచ్చరించారు. కాలమే సమాధానం.. తనను పార్టీ పదవుల నుంచి తప్పించడం గురించి సెంగోట్టయన్ మీడియాతో మాట్లాడారు. పార్టీ గెలవాలి, అధికారంలోకి రావాలన్న కాంక్షతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని, దీనిని పరిశీలించాల్సిన బాధ్యత ప్రధాన కార్యదర్శికి ఉందన్నారు. తాను ప్రత్యక్షంగా , స్వయంగా ఈ అభిప్రాయం తెలియజేశానని, చివరకు ప్రజాక్షేత్రం నుంచి కేడర్ మనస్సులోని మాటలను తాను మనస్సు విప్పి మాట్లాడటం తప్పా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో వివరణ కోరే అవకాశం అన్నది ఉంటుందని, ఇందుకు కూడా అవకాశం ఇవ్వకుండా తనను పార్టీ నుంచి తప్పించడం శోచనీయమన్నారు. తన వ్యక్తిగత సంక్షేమం కోసం అభిప్రాయాలను వ్యక్తం చేయలేదని, పార్టీ కోసం అన్న విషయాన్ని గుర్తెరగాలని పరోక్షంగా పళణి స్వామి హితవు పలికారు. అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందని, తనను పదవి నుంచి తొలగించడంలో ఎలాంటి బాధ లేదని, ఆనందంగానే ఉందన్నారు. అయితే, దీనిని తాను ఎదురు చూడలేదన్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలో ప్రజా చైతన్య యాత్ర ద్వారా తన బలం అన్నది పెరిగిందన్న ధీమాతో పళణి స్వామి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకేకు ఇక అన్నీ తానేనని, తనకు వ్యతిరేకంగా ఏదేని కుట్రలు, వ్యూహాలు పన్నే వారికి హెచ్చరికగా సెంగోట్టయన్ను ఆగమేఘాలపై పదవి నుంచి తప్పించినట్టు చర్చ జరుగుతోంది. అదే సమయంలో తదుపరి సెంగోట్టయన్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో, పది రోజులలో ఎలాంటి ప్రకంపన అన్నాడీఎంకేలో బయలు దేరనున్నదో అన్న చర్చ ఊపందుకుంది. పదవి నుంచి ఉద్వాసన.. సెంగోట్టయన్ చేసిన వ్యాఖ్యలను అన్నాడీఎంకే బహిష్కరణ నేతలు, బయటకు వెళ్లిన వారే కాదు, బీజేపీ, డీఎండీకేతో పాటుగా పలు పార్టీలు ఆహ్వానించాయి. సెంగోట్టయన్ నిర్ణయాన్ని ఆహ్వానించాయి. అయితే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి మాత్రం సెంగోట్టయన్ వ్యాఖ్యలు ఆగ్రహాన్ని తెప్పించాయి. శనివారం అన్నాడీఎంకే కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో సెంగోట్టయన్ను పదవుల నుంచి తప్పించడం గమనార్హం. సెంగోట్టయన్ వ్యవహరిస్తూ వచ్చిన పార్టీ నిర్వాహక కార్యదర్శి, ఈరోడ్ రూరల్పశ్చిమ జిల్లా కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. అలాగే, ఆయన మద్దతు దారులు పలువుర్ని పార్టీ పదవుల నుంచి తప్పించారు. ఈరోడ్ రూరల్ పశ్చిమ జిల్లా బాధ్యతలు తాతాల్కింగా పార్టీ నేత ఏకే సెల్వరాజ్కు అప్పగించారు. ఈ ప్రకటన సెంగోట్టయన్, ఆయన మద్దతు దారులకు పెద్ద షాక్గా మారింది. తాము అభిప్రాయాలను వ్యక్తం చేస్తే ఏకగా పదవుల నుంచి తప్పిస్తారా? అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించే పనిలో పడ్డారు. అదే సమయంలో పళణి నిర్ణయంపై అన్నాడీఎంకే మిత్రులు సైతం పరోక్షంగా విమర్శలు గుప్పించే పనిలో పడడం గమనార్హం. -
దేశ సేవకు.. సగర్వంగా..!
పరేడ్ సాక్షి, చైన్నె : చైన్నె సెయింట్ థామస్ మౌంట్లో ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో అధికారులు భారత ఆర్మీలో వివిధ హోదాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏటా ఇక్కడ శిక్షణ ముగించుకునే యువ అధికారులు పాసింగ్ అవుట్ పరేడ్తో దేశ సరిహద్దులలో సేవకు సన్నద్ధం కావడం జరుగుతుంటుంది. ఆ దిశగా ప్రస్తుతం శిక్షణ ముగించిన యువ అధికారులు శుక్రవారం జరిగిన సాహస విన్యాసాల ప్రదర్శనలో తమ ప్రతిభను చాటుకున్నారు. శిక్షణ కాలంలో నేర్చుకున్న యుద్ధ సాహసాలు, విన్యాసాలు సీనియర్ అధికారులు, తమ కుటుంబ సభ్యుల, ఆర్మీ వర్గాల సమక్షంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రెండవ రోజైన శనివారం ఉదయాన్నే పాసింగ్ అవుట్ పరేడ్ దేశభక్తిని చాటే విధంగా జరిగింది. పతకాలు.. పాసింగ్ అవుట్ పరేడ్ను ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, పీవీఎస్ఎం, ఏవీఎస్ఎం, సీఏఎస్ సమీక్షించారు. ఏసీఏ రాజ్ బిశ్వాస్కు స్వోర్డ్ ఆఫ్ ఆనర్, సిల్వర్ మెడల్ను ప్రదానం చేశారు. ఓటీఏ గోల్డ్మెడల్ను ఏయూఓ పరుదల్ తద్వాల్కు, క్యాంస పతకాన్ని బీయూఓ పరంజల్ దీక్షిత్కు ప్రదానం చేశారు. ఆఫీసర్ క్యాడెట్లను ఈసందర్భంగా అమర్ ప్రీత్ సింగ్ అభినందించారు. ముందుగా గౌరవ వందనం స్వీకరించారు. కొత్తగా ఆర్మీకి నియమితులైన వారు ఆదర్శప్రాయమైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం దేశానికి నిస్వార్థ సేవ, శ్రేష్ఠత కోసం స్థిరమైన ప్రయత్నం, ప్రధాన సైనిక విలువలు, అన్ని ప్రయత్నాలతో సాగిన స్వచ్ఛమైన కవాతు తరువాత, పిప్పింగ్ వేడుక ఒక గంభీరమైన ప్రతిజ్ఞను దర్పణంగా నిలిచింది. కొత్తగా నియమితులైన యువ అధికారుల భుజాలపై మెరిసే స్టార్ చిహ్నాలను అందజేసి అలంకరింప చేశారు. భారత రాజ్యాంగానికి విధేయత చూపుతూ, దేశాన్ని పూర్తిగా కాపాడటానికి కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.కొత్తగా నియమితులైన అధికారులు, తమ ర్యాంకులు , రెజిమెంటల్ హోదాలను ధరించి,దేశానికి, భారత రాజ్యాంగానికి విధేయత చూపుతూ గౌరవంగా సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని, దేశ గౌరవాన్ని కాపాడుతామంటూ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి ఆనందంగా సరిహద్దులకు ప్రయాణమయ్యారు. ముందుగా ఈ యువ అధికారులు కేరింతలు కొడుతు, గాల్లో బెలూన్లను ఎగుర వేస్తూ ఆనందాన్ని పరస్పరం పంచుకున్నారు. పరేడ్తో సరిహద్దులకు.. చైన్నె సెయింట్ థామస్ మౌంట్లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పరమేశ్వరన్ స్క్వేర్లో షార్ట్ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ వేడుక ఉదయం జరిగింది. ఇందులో 120 మంది యువ అధికారులు, 34 మంది మహిళా యువ అధికారిణులు ఉన్నారు. మార్షల్ ట్యూన్లకు ఆఫీసర్ క్యాడెట్ల కవాతు అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. ఆఫీసర్ క్యాడట్ల తల్లిదండ్రులకు, శిక్షణ అందించిన అధికారులకు గొప్ప క్షణంగా నిలిచే విధంగా ఒక సంవత్సర కాలం తాము నేర్చుకున్న ఇంటి గ్రేటెడ్ శిక్షణను యువ అధికారులు ప్రదర్శించారు. ఈ గర్వించదగ్గ యువ అధికారులు భవిష్యత్తు నాయకులుగా అవతరించే దిశగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో విదేశాలతో ఉన్న సత్సంబంధాల మేరకు ఇక్కడ మరో తొమ్మిది మంది యువ అధికారిణిలు, పన్నెండు మంది యువ అధికారులు సైతం శిక్షణ పొందడం విశేషం. భారత సైన్యం లోని వివిధ ఆయుధాలు, సేవలలోకి, స్ఫూర్తిని , త్యాగం దిశగా వీరంతా శిక్షణ పూర్తిచేశారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో స్నేహం , సహకార బంధాలను పెంపొందించడం లక్ష్యంగా ముందడుగు వేయనున్నారు. -
ఎవరు కావాలో తెల్చుకోండి!
సాక్షి, చైన్నె: కూటమికి ఎవరు కావాలో అన్నది మీరే తెల్చుకోండి అని బీజేపీ పెద్దలకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ అల్టిమేటం ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్పై విరుచుకు పడ్డారు. అన్నాడీఎంకేలో చీలికతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఆవిర్భవించిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికలలో ఎన్డీఏతో పయనించిన ఈ పార్టీ నేత టీటీవీ దినకరన్ తాజాగా బయటకు వచ్చారు. ఇందుకు కారణం బీజేపీలోకి అన్నాడీఎంకే చేరికే. ఈ పరిణామాలతో టీటీవీతో పాటూ మాజీ సీఎం పన్నీరు సెల్వంను బీజేపీ పట్టించుకోవడం మానేసింది. దీంతో ఒకరి తర్వాత మరొకరు ఎన్డీఏ కూటమి నుంచి పన్నీరు, దినకరన్ బయటకు వచ్చారు. అయితే టీటీవీ దినకరన్, పన్నీరు సెల్వంను మళ్లీ కూటమిలోకి రప్పిస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇందుకు దినకరన్ ధీటుగా శనివారం స్పందించారు. షరతులు.. మీడియాతో టీటీవీ దినకరన్ మాట్లాడుతూ, వినాసకాలే విపరీత బుద్ధి, చెడకు రా..చెడేవు అన్నట్టుగా పళణి స్వామి తీరు అన్నాడీఎంకేలో ఉందని మండిపడ్డారు. ఇక, ఎన్డీఏ విషయానికి వస్తే, బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై ఉన్నంత కాలం మిత్ర పక్షాలతో సత్సంబంధాలతో మెలిగారని వివరించారు. అయితే నైనార్ నాగేంద్రన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టినానంతరం అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పీఎంకే అపాయింట్మెంట్ విషయంలో పన్నీరు సెల్వంకు తీవ్ర అన్యాయం తలబెట్టింది కాకుండా, అహంకారంతో నైనార్ వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. తమ వరకు కూటమి విషయంలో ఎన్డీఏకే తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అయితే ఈసారి షరతులు విధించడం ఖాయం అని స్పష్టం చేశారు. ఏం చేస్తారో చేసుకోండి, ఎవరు కావాలో వాళ్లే తేల్చుకోని అని కమలనాథుల కోర్టులోకే బంతిని నెడుతున్నా! అని వ్యాఖ్యలు చేశారు. తామంతా బిస్కట్ పార్టీ అని వ్యాఖ్యలు చేస్తున్నారని, తమ సత్తా ఏమిటో ఓట్ల రూపంలో తెలుస్తూనే ఉందిగా అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. విజయ్ రాజకీయాలోకి వచ్చారని, ఆయన నేతృత్వంలో కూటమి ఏర్పాటైన పక్షంలో బిస్కట్ పార్టీలు చేరడంలో తప్పే లేదంటూ వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఒక పార్టీ నాయకుడు అని, ఆయన్ని అవమానించే విధంగా ప్రశ్నలు సంధించ వద్దని మీడియాకు హితవు పలకడం గమనార్హం. -
చిన్నమ్మ చిక్కులు
●రంగంలోకి సీబీఐ సాక్షి, చైన్నె : దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ చక్కెర పరిశ్రమ కొనుగోలు సమస్యగా మారింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆమె పద్మావతి షుగర్స్ను కొనుగోలు చేసి బినామీ పేర్లతో నడిపిస్తుండటం సీబీఐ విచారణలో ఆధారాలతో తేట తెల్లమైంది. దీంతో చిన్నమ్మను విచారణ వలయంలోకి తెచ్చే కసరత్తులలో సీబీఐ ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. కాంచీపురంలో హిదేశ్ శివకన్ పటేల్ , ఆయన సోదరుడు దినేషన్ పటేల్ పద్మావతి షుగర్స్ పేరిట పరిశ్రమను నిర్వహిస్తూ వచ్చారు. ఈ పరిశ్రమ బ్యాంక్లో రుణం తీసుకుని మోసానికి పాల్పడినట్టుగా వచ్చిన ఫిర్యాదును తొలుత సీబీఐ పట్టించుకోలేదు. చివరకు బ్యాంక్ వర్గాలు కోర్టుకు వెళ్లడంతో ఈ ఫైల్ కదిలింది. సీబీఐ రంగంలోకి దిగి విచారణ జరపడంతో ఈ పరిశ్రమను 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో చిన్నమ్మ శశికళ కొనుగోలు చేసి ఉండటం వెలుగులోకి వచ్చింది. రూ. 450 కోట్లకు ఈ పరిశ్రమను కొనుగోలు చేసి ఉన్నారు. రూ. 500, రూ. 1000 పెద్ద నోట్లతో ఈ పరిశ్రమను కొనుగోలుచేసి బినామీ పేర్లతో నడిపిస్తూ వచ్చినట్టు సీబీఐ విచారణలో తేట తెల్లమైంది. 2019లో చిన్నమ్మ శశికళ నివాసంలో జరిగిన సోదాల సమయంలో లభించిన ఆధారాలు, తాజాగా బ్యాంక్ మోసానికి పాల్పడిన పద్మావతి షుగర్స్యాజమాన్యం వద్ద జరిపిన సోదాలలో అభించిన ఆధారాల ఆధారంగా ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సీబీఐ సన్నద్ధమైనట్టు సమాచారం వెలువడ్డాయి. చిన్నమ్మ శశికళకు ఇప్పటికే నోటీసులు జారీచేసినట్టుసంకేతాలు వెలువడ్డాయి. కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేయడానికి సీబీఐ నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడటంతో రానున్న కాలంలో చిన్నమ్మకు ఈ షుగర్ పరిశ్రమ ఉచ్చుగా మారే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. -
అక్రమంగా దుకాణాలను అద్దెకు ఇచ్చిన కౌన్సిలర్లపై చర్యలు
కొరుక్కుపేట: చైన్నెలో వీధి వ్యాపారులను నియంత్రించడానికి చైన్నె కార్పొరేషన్ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, పాఠశాలలు, కళాశాలలు, శ్మశానవాటికల సమీపంలో వ్యాపారాలు నిర్వహించడాన్ని నిషేధించారు. ఈ కొత్త నియమాలు తాజాగా అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు చైన్నె అన్నానగర్ 2వ అవెన్యూలోని 78 రోడ్డు సైడ్ దుకాణాలను తొలగించారు. ఒక వార్డులోని జనాభా శాతాన్ని బట్టి దుకాణాల సంఖ్యను చదరపు మీటరుకు పరిమితం చేశారు. ఆసుపత్రులకు 100 మీటర్ల దూరంలో ప్రధాన పరిపాలనా కేంద్రాలు, రవాణా కేంద్రాల నుంచి 150 కి.మీ దూరంలో కళాశాలలు పనిచేయడానికి అనుమతి లేదు. ఈ కొత్త నిబంధనలను ఉల్లంఘించి వీధుల్లో వ్యాపారాలు ఏర్పాటు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. అలాగే అక్రమంగా దుకాణాలను అద్దెకు ఇచ్చిన కౌన్సిలర్లపై చర్యలు తప్పవని స్ప,ష్టం చేశారు. రూ.7.50 కోట్ల విలువైన అంబర్గ్రీస్ సీజ్ కొరుక్కుపేట: రూ.7.5 కోట్ల విలువైన అంబర్గ్రీస్ (తిమింగళం ఉమ్ము)ను అక్రమంగా రవాణా చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దాని విలువ రూ.7.50 కోట్లు అని అంచనా వేశారు. వివరాలు.. వేల్ బ్లబ్బర్ (అంబర్గ్రీస్) అనేది తిమింగలాల జీర్ణవ్యవస్థ నుండి ఉత్పత్తి అయ్యే ఒక రకమైన ఘన పదార్థం. ఇది మందులు , ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. కొన్నిసార్లు దీనిని కోట్లాది రూపాయలకు విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో చిదంబరం నగర పోలీస్ స్టేషన్ కు రహస్యంగా అంబర్గ్రీస్ అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కారులోని ఓ వ్యక్తిని పట్టుకుని విచారించారు. పోలీసులు కారులో తెల్లటి గుడ్డ సంచిలో అంబర్గ్రీస్ ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు మైలదుత్తురైకి చెందిన రాజశేఖర్ (28)ను అరెసు చేశారు. 7 కిలోల 600 గ్రాముల అంబర్గ్రీస్ను స్వాధీనం చేసుకున్నారు. విజయ్కు అడ్డంకులు సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్కు ఆదిలోనే అడ్డంకులు బయలు దేరాయి. ప్రజల్లోకి చొచ్చుకెళ్లే విధంగా ఆయన మీట్ ది పీపుల్ ప్రజా క్షేత్రయాత్రకు పోలీసులు అనుమతుల వ్యవహారంలో మెళికలు పెట్టే పనిలో పడ్డారు. రెండు మహానాడులను విజయవంతం చేసుకున్న విజయ్ తాజాగా ప్రజలలోకి చొచ్చుకెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. పది రోజుల పర్యటనగా పలు జిల్లాలను కలుపుతూ మీట్ ది పీపుల్ కార్యక్రమానికి సన్నద్దమయ్యారు. ఈనెల 13వ తేదీన తిరుచ్చి శ్రీరంగంలో ప్రచార ప్రయాణం మొదలెట్టనున్నారు. అయితే విజయ్ రూట్ మ్యాప్కు సంబంధించిన సమగ్ర వివరాలను తిరుచ్చి పోలీసు యంత్రాంగానికి తమిళగ వెట్రి కళగం వర్గాలు సమర్పించి ఉన్నాయి. అయితే, విజయ్ ఓపెన్ టాప్ వాహనంలో బహిరంగ సభల నిర్వహణకు ఎంపికచేసిన వేదికల వద్ద అనుమతి ఇవ్వబోమని, వేదికలను మార్చుకోవాలని పోలీసులు సూచించడడం గమనార్హం. అలాగే, ఆయన రూట్ మ్యాప్లో మరిన్ని మార్పుల దిశగా పోలీసులు సూచనలు చేసి ఉండటంతో విజయ్ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ నేతకు తరలి వచ్చే జన సమూహంను ముందుగానేఊహించి ఈ మెళికలను పోలీసులు పెడుతున్నారని, యాత్ర అడ్డుకునే వ్యూహంతో ఉన్నట్టుందని మండి పడుతున్నారు. ఇంటెన్సివ్ కేర్లోనే నల్లకన్ను కొరుక్కుపేట: భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు నల్ల కన్ను గత నెల 22వ తేదీన ఇంట్లో పడిపోవడంతో తలకు గాయమైంది. చికిత్స కోసం ఆయనను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత 24వ తేదీన భోజనం చేస్తున్నప్పుడు ఊపిరి ఆడకపోవడంతో చైన్నెలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరిన నల్ల కన్నుకు వైద్యులు అతని వయస్సుకు తగిన రేటుతో చికిత్స అందించారు. అతనికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉందని వారు చెప్పారు. దానికి చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిందని డాక్టర్ చెప్పారు. అయితే, నల్లకన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ఉన్నారు. ప్రసుత్తం రెండు వారాలుగా ఆయన చికిత్స పొందుతుండడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను నిశితంగా పరిశీలిస్తున్నారు. నల్లకన్ను పరిస్థితిపై డీన్ శాంతరామ్ మాట్లాడుతూ నల్లకన్ను వయస్సు 100 ఏళ్లు గడిచిపోయాయని, వృద్ధాప్యం కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అయ్యాయని, ఇంటెన్సివ్ కంటి పరీక్ష చికిత్స ఆధారంగా, అతను ప్రస్తుతం స్పృహలో ఉన్నట్లు తెలిపారు. ఇతర రోగుల మాదిరిగా చికిత్స తర్వాత ఆయన ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తారో చెప్పలేమన్నారు. -
నివాస ప్రాంతాల్లో కాలం చెల్లిన మాత్రలు డంపింగ్
– స్థానికుల నిరసన తిరువళ్లూరు: నివాస ప్రాంతాల్లో కాలం చెల్లిన మాత్రలు, కూల్డ్రింక్స్ డంప్ చేయడానికి వచ్చిన లారీనీ అడ్డుకుని స్థానికులు ఆందోళన నిర్వహించారు. వివరాలు..తిరువళ్లూరు జిల్లా కాకలూరు ప్రాంతంలో సుమారు 10 వేల మంది నివాసం వుంటున్నారు. ఇక్కడ కాకలూరు సిప్కాట్, ఆవీన్పాల కేంధ్రాలు వున్నాయి. ఈ కేంద్రాలకు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు తరచూ కాలం చెల్లిన మాత్రలు, సిరంజిన్, కూల్డ్రింక్స్ను డంప్ చేస్తున్నారు. ఈ డంపింగ్ వల్ల స్థానికంగా వున్న ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూవున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కాలం చెల్లిన మాత్రలు, సుమారు పది టన్నులు విలువ చేసే రెండు లారీల్లో కూల్డ్రింక్స్ను లారీలో తీసుకుని రావడాన్ని గుర్తించిన స్థానికులు వాటిని అడ్డుకుని నిరసనకు దిగారు. సమాచారం అందుకుని ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు, తాహసీల్దార్ బాలాజీ, డిప్యూటీ తాహసీల్దార్ దినేష్ తదితరులు మాత్రలు, కూల్డ్రింక్స్ను డంప్ చేయవద్దని ఆదేశించి లారీలను వెనుక్కి తిప్పి పంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. -
క్లుప్తంగా
మణలిలో ట్రాఫిక్ రద్దీ తిరువొత్తియూరు: చైన్నె మణలి కామరాజర్ రోడ్డులో నీటి సరఫరా ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నందున గత 2 సంవత్సరాలుగా రోడ్డు దెబ్బతింది. అంతేకాకుండా, రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు పెరగడంతో వాహనాలు సజావుగా వెళ్లలేకపోతున్నాయి, దీంతో మణలి మార్కెట్ జంక్షన్ వద్ద తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇక కామరాజర్ రోడ్డు లో ట్రాఫిక్ నివారించడానికి, కార్లు, బైక్లు వంటి వాహనాలు మణలి పార్థసారథి వీధి, కె.కె.తాళై రోడ్డు మీదుగా వెళ్లి మాధవరం డైరీ ఫామ్ రోడ్డులో కలుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భూగర్భ మురుగునీటి ప్రాజెక్ట్ పనుల కోసం పోప్జాన్ గార్డెన్ ప్రాంతంలో రోడ్డు మూసివేశారు. దీంతో ఇరుకై న ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించాల్సి రావడంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. తిరువొత్తియూరు ఫ్యాక్టరీలో కార్మికుల నిరాహార దీక్ష తిరువొత్తియూరు: చైన్నెలోని తిరువొత్తియూరు విమ్కో నగర్లో పనిచేస్తున్న ఎం.ఆర్.ఎఫ్. ప్రైవేట్ టైర్ల తయారీ కర్మాగారంలో పనిచేస్తున్న 62 మంది ట్రైనీలు గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈనేపథ్యంలో తమను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేస్తూ, కార్మిక సంఘం నాయకుడు ఎళిల్ కెరోలిన్ నాయకత్వంలో కార్మిక సంఘం భవనం వద్ద కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ట్రైనీలను 4 సంవత్సరాలలో శాశ్వత ఉద్యోగులుగా చేయాల్సి ఉందని కానీ..యాజమాన్యం 6 సంవత్సరాలకు పైగా గడిచినా వారిని శాశ్వత ఉద్యోగులుగా చేయకపోవడంతో వారికి పని భారం పెరిగి, జీవనోపాధి దెబ్బతింటోందని వారు ఆరోపించారు. వెంటనే యాజమాన్యం వారిని శాశ్వత ఉద్యోగులుగా చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నారు. టాస్మాక్ ఉద్యోగిపై దాడి – నలుగురి కోసం గాలింపు అన్నానగర్: చెంగల్పట్టు జిల్లా మరైమలైనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవిందపురం ప్రాంతంలో ఓ టాస్మాక్ దుకాణం ఉంది. ఇక్కడ సేల్స్మెన్గా సింగపెరుమాళ్ ఆలయం పక్కన ఉన్న హనుమంతపురంలోని చందకుప్పం గ్రామానికి చెందిన రాజేంద్రన్ (48) రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు .ఈ స్థితిలో, శనివారం దాదాపు 25 ఏళ్ల వయస్సున్న నలుగురు వ్యక్తుల బృందం టాస్మాక్ దుకాణానికి మద్యం తాగడానికి వచ్చారు. వారు బీరు సీసాలు కొని దుకాణం దగ్గర కూర్చుని తాగుతున్నారు. ఆ సమయంలో టాస్మాక్ దుకాణం నుండి బీరు బాటిళ్లను దించే లారీ వచ్చింది, దీంతో వారిని వేరే చోటికి వెళ్లి తాగమని రాజేంద్రన్ చెప్పాడు. దీంతో ఇరువర్గాలు తీవ్ర వాగ్వాదానికి దిగాయి. కోపంతో ఆ నలుగురు రాజేంద్రన్పై తీవ్రంగా దాడి చేసి, పారిపోయారు. రాజేంద్రన్ను స్థానికులు అతన్ని రక్షించి సింగపెరుమాళ్ ఆలయ ప్రాంతంలోని ప్రభుత్వ అత్యవసర ఆసుపత్రికి తరలించారు. దీంతో రాజేంద్రన్ మరైమలైనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. విజయవంతంగా మారిటైమ్ సమ్మిట్ – మారిటైమ్ లా ఏర్పాటు సాక్షి, చైన్నె : వినాయక మిషన్ లా స్కూల్ సెంటర్ ఫర్ మారిటైమ్ లా, హోస్ట్లను ప్రారంభించింది. ఇందులో భాగంగా మారిటైమ్ లా సమ్మిట్ 2025 పయ్యనూర్ క్యాంపస్లో విజయంతంగా శనివారం నిర్వహించారు. వినాయక మిషన్ పరిశోధన , రాజ్యాంగ కళాశాల ఫౌండేషన్ ఓ మైలురాయి సాధించిందని ప్రకటించారు. ఈ మేరకు సెంటర్ ఫర్ మారిటైమ్లా (సీఎంఎల్)ను ప్రారంభించారు. అనంతరం మారిటైమ్ లా సమ్మిట్ కార్గో, కాంట్రాక్టులు , క్లెయిమ్ల కోసం కోర్సును చార్టింగ్ చేయడం అనే థీమ్పై 2025 సమ్మిట్ జరిగింది. ఈ ప్రారంభ సమావేశానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కుమార్ హాజరయ్యారు. డాక్టర్ ఎ. ఫ్రాన్సిస్ సహా ప్రముఖులు జూలియన్, సీనియర్ న్యాయవాది అమితవ (రాజా) మజుందార్ ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా డీన్ డాక్టర్ అనంత్ పద్మనాభన్ మాట్లాడుతూ, నాలుగు కేంద్రాల ద్వారా భవిష్యత్తు–కేంద్రీకృత న్యాయ విద్యను ముందుకు తీసుకెళ్లాలనే దృష్టి పెటాటమన్నారు. ప్రొఫెసర్ శరవణన్ ద్వారా రూపొందించబడిన విద్యా–పరిశ్రమ–విధాన సహకారాన్ని గుర్తుచేశారు. ఆ విద్యా సంస్థ చాన్స్లర్ డాక్టర్ ఎ.ఎస్. గణేషన్, ఉపాధ్యక్షులు డాక్టర్ అనురాధ గణేష్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ జె. సురేష్ సామ్యూల్తదితరులు సెంటర్ ఫర్ మారిటైమ్ లా ప్రారంభం గురించి వివరించారు. వీసీకే కార్యకర్తల ఘర్షణ తిరువొత్తియూరు: చైన్నెలోని మెరీనా బీచ్ రోడ్డులోని డీజీపీ కార్యాలయం సమీపంలో విడుదలై చిరుతైగల్ పార్టీ (వీసీకే) అధినేత ఎయిర్పోర్ట్ మూర్తి, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.వీసీకే అధినేత తిరుమావళవన్ గురించి ఎయిర్పోర్ట్ మూర్తి యూట్యూబ్లో అభ్యంతరకరంగా మాట్లాడినట్లు ఆరోపిస్తూ, వీసీకే కార్యకర్తలు ఎయిర్పోర్ట్ మూర్తిపై దాడి చేశారు. ఎయిర్పోర్ట్ మూర్తి కూడా వారిపై దాడి చేశాడు. డీజీపీ కార్యాలయం ముందు భద్రతా విధుల్లో ఉన్న ఒకే ఒక పోలీసు అధికారి దాడి చేస్తున్న వారిని ఆపడానికి ప్రయత్నించారు. ఈ దాడిలో వీసీకేకు చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. -
మదరాసి చిత్రానికి శంకర్ ప్రశంసలు
తమిళసినిమా: నటుడు శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మదరాసి. నటి రుక్మిణి వసంత్ నాయకి నిర్మించిన ఇందులో విద్యుత్ జమ్వాల్, బిజీ మీనన్, డాన్సింగ్ రోస్, సబీర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్ మురుగదాస్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మించింది. అనిరుధ్ సంగీతాన్ని అందించిన యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా స్టార్ డైరెక్టర్ శంకర్ మదరాసి చిత్రం పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన తన ఎక్స్ వీడియోలో పేర్కొంటూ మదరాసి చిత్రం పలు ఆసక్తికరమైన, నాటకీయ సంఘటనలతో కూడిన కథాంశంతో రూపొందిన చిత్రం అన్నారు. అందమైన వాణిజ్య అంశాలతో కూడిన ఎంటర్టైన్మెంట్ కథా చిత్రం అని పేర్కొన్నారు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చక్కని సందేశం, భావోద్రేకాలను చక్కగా తెరపై ఆవిష్కరించారన్నారు. ప్రేమ మార్గాన్ని, నేరబాటను కలిపి అద్భుతంగా చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారన్నారు. శివ కార్తికేయన్ పాత్ర చాలా భవిష్యభరితంగా ఉందన్నారు. దాన్ని ఆయన అద్భుతంగా ప్రదర్శించారని ప్రశంసించారు. ఈ చిత్రంలో యాక్షన్ హీరోగా శివకార్తికేయన్ అందర్నీ భ్రమింపచేశారన్నారు. అనిరు నేపథ్య సంగీతం చిత్రానికి బలాన్ని చేకూర్చిందని ప్రశంసించారు. కాగా శంకర్ ప్రశంసలకు మదరాసి చిత్ర నిర్మాత కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కల్యాణి ప్రియదర్శన్ -
నిబంధనలు అతిక్రమించి మట్టి తవ్వకాలు
– లారీలను ముట్టడించి ఆందోళన తిరువళ్లూరు: నిబంధనలను అతిక్రమించి మట్టి తవ్వకాలు చేస్తున్న క్వారీ నిర్వాహకుల తీరును ఖండిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పేరంబాక్కం గ్రామంలో ప్రభుత్వం మట్టి వెలికి తీయడానికి క్వా రీకి గత పది రోజుల క్రితం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రాంతంలో మాత్రమే మట్టి వెలికితీయాలి. మూడు అడుగుల కంటే ఎక్కువగా మట్టి తవ్వకాలు చేయకూడదు. సెలవురోజు ల్లో మట్టి తీయకూడదని ప్రభుత్వం నిబంధనలు విధించింది. అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్వారీ నిర్వాహకులు మట్టి వెలికితీస్తున్నట్టు స్థానికులు వాపోయారు. మూడు అడుగుల కంటే ఎక్కువగా మట్టిని తీస్తున్నారని, అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో కాకుండా మరో ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నారని ఆరోపిస్తూ లారీలను అడ్డుకుని స్థానికులు ఆందోళన చేశారు. దీంతో వందలాది లారీలు నిలిచిపోయాయి. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆందోళనకారులతో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు. అనంతరం లారీలు యథావిధిగా రాకపోకలు సాగించాయి. కాగా లారీలను అడ్డుకుని స్థానికులు ఆందోళనకు దిగడంతో గంట పాటు క్వారీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
ఆ నటికి
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా.. బేబీ గర్ల్ సూపర్ హీరో ఇమేజ్ తమిళసినిమా: వైవిధ్యభరిత కథా చిత్రాలకు పుట్టిల్లు బాలీవుడ్ అనే పేరు ఉంది. మలయాళం చిత్రాలు తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ కావడమో, లేదా అనువాదంగానో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతుండటం చూస్తున్నాం. అలా ప్రస్తుతం మాలీవుడ్ల ప్రముఖ కథానాయకులుగా రాణిస్తున్న నటులలో నివిన్ పాలి ఒకరు. ఈయన నటించిన చిత్రాలు కచ్చితంగా తమిళంలో విడుదలై మంచి విజయాన్ని పొందుతుంటాయి. కాగా తాజాగా నివిన్ పాలి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం బేబీ గర్ల్. ఇన్వెస్టిగేషన్ ఇతివృత్తంగా రూపొందుతున్న థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రం బేబీ గర్ల్. గరుడన్ చిత్రం ఫేమ్ అరుణ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనాలను నమ్మక రచయితలు బాబి, సంజయ్ ద్వయం అందించడం విశేషం. మ్యాజిక్ ఫ్యాన్స్ పతాకంపై లిస్టింగ్ స్టీఫెన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రంలో నటి లిజోమోల్ జోష్, సంగీత ప్రతాప్ నటిస్తున్నారు. నటుడు అభిమన్యు తిలకం అసిస్ నెడుమంగాడు, అశ్వంత్ లాల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తిరువనంతపురం, కొచ్చి ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుని షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని చిత్ర బందం తెలిపారు. ఇందులో నటుడు నివిన్ పాలి పాత్ర పవర్ ఫుల్ గానూ, వైవిధ్యంగొనూ ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్కు ఇప్పుడు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నారు. దీంతో బేబీ గర్ల్ చిత్రం ఎలా ఉంటుందని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంటుంది. -
టాస్మాక్ గోదాము ముట్టడి
తిరువళ్లూరు: మద్యం సేవించిన తరువాత ఖాళీ బాటిల్స్ను టాస్మాక్ దుకాణంలో అప్పగించి పది రూపాయలను పొందవచ్చన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టాస్మాక్ ఉద్యోగులు శనివారం ఉదయం గోదామును ముట్టడించి నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. బాటిల్స్ను వెనుక్కి తీసుకునే విధానం కోసం నూతనంగా భవనం, ఉద్యోగులు నియమించి అమలు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా తమకు పని ఒత్తిడి పెరగడంతో పాటూ అదనపు భారంగా మారిందని వాపోారు. తమ సమస్యలను పరిస్కరించని పక్షంలో కుటుంబ సభ్యులతో కలిసి నిరాహరదీక్ష చేపడుతామని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న టాస్మాక్ ఎస్ఆర్ఎం పన్నీర్సెల్వం,తాహశీల్దార్(టాస్మాక్) సెంథిల్కుమార్ తదితరులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. కోర్టు ఆదేశం కావడంతో తాము జోక్యం చేసుకోబోమని ఉద్యోగులు, కార్మికులకు ఉన్నత అధికారులు తేల్చిచెప్పారు. ప్రతి దుకాణంలోనూ బాటిల్స్ వెనుక్కి తీసుకునే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. దీంతో ఉద్యోగులు చేసేదేమీ లేక ఆందోళననూ విరమించి వెనక్కి వెళ్లిపోయారు. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో కుటుంబ సభ్యులతో కలిసి నిరసన చేపట్టాలని నిర్ణయించారు. కాగా టాస్మాక్ ఉద్యోగుల ఆందోళనతో గోదాము వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురుకాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బైకును ఢీకొన్న మినీ వ్యాన్
వేలూరు: బైక్ను, మినీవ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈఘటన తిరువణ్ణమలై జిల్లాలో చోటుచేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీపంలోని కేలూరు గ్రామానికి చెందిన మణికంఠన్(35) ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య మంజుల.ఈమె చెల్లెలు అముద(23). వీరి ముగ్గురూ కలిసి బైకులో ఆరణికి వెళ్లి కన్నమంగళం గ్రామానికి బైకులో వెళుతున్నారు. అదేసమయంలో వేలూరు నుంచి ఆరణి వైపు జామపండ్ల లోడుతో మినీవ్యాన్ వెళుతోంది. కొంగారంపట్టు గ్రామం వద్ద ఉన్న స్పీడ్ బ్రైకర్ను దాటుతుండగా అదుపుతప్పిన వ్యాన్ ఎదురుగా వస్తున్న మణికంఠన్ బైకును ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మణికంఠన్, అముద అక్కడికక్కడే మృతిచెందారు. మంజులకు తీవ్రగాయాలయ్యాయి. వ్యాన్ డ్రైవర్, క్లీనర్కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ ముగ్గురిని స్థానికులు వెంటనే వేలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలసి కన్నమంగళం పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో కన్నమంగళం రోడ్డులో ట్రాఫిక్ స్థంభించింది. -
అవయవదానంలో తమిళనాడు ఫస్ట్
తిరువళ్లూరు: అవయవాల దానం చేసే వారి సంఖ్య దేశంలోనే తమిళనాడు మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా ఆవడి మోరై గ్రామానికి చెందిన చెల్లప్పన్(53). బ్రెయిన్లో ఏర్పడిన సమస్యల కారణంగా కీళ్పాక్కం వైద్యశాలలో వుంచి వైద్యసేవలను అందించారు. అయితే చికిత్స ఫలించకపోవడంతో అతడు బ్రెయిన్డెడ్కు గురయ్యాడు. దీంతో చెల్లప్పన్ బంధువులు అవయువాలను దానం చేశారు. అవయవాలను దానం చేసిన వ్యక్తి మృతదేహానికి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం తరపున నివాళి అర్పించాల్సి ఉంది. ఇందులో భాగంగానే మోరై గ్రామానికి వచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం, మైనారీటి సంక్షేమశాఖ మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్, మాధవరం ఎమ్మేల్యే సుదర్శనం తదితరులు చెల్లప్పన్ మృతదేహం వద్ద సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మంత్రి సుబ్రమణియన్ మాట్లాడుతూ బ్రెయిన్డెడ్ అయిన వారి నుంచి అవయువాలను దానంగా స్వీకరించి వాటిని పలువురికి అమర్చి పునర్జీవనం ఇచ్చినట్లు వివరించారు. అవయవాలను దానం చేసే వ్యక్తి మృతదేహానికి ప్రభుత్వ తరపున నివాళులర్పించే ఉత్తర్వులను 2023లో ముఖ్యమంత్రి స్టాలిన్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే చెల్లప్పన్ మృతదేహానికి నివాళి అర్పించినట్టు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగానే అవయవదానంపై అవగాహన పెరిగిందన్నారు. ఏటా దేశంలోనే అవయవాలను దానం చేసే రాష్ట్రాలలో తమిళనాడు మొదటి స్థానంలో ఉందన్నారు. ఇప్పటి వరకు బ్రెయిన్డెడ్ అయ్యి అవయవాలను దానం చేసిన వారి సంఖ్య చెల్లప్పన్తో కలిసి 500 చేరిందన్నారు. భవిషత్లోనూ అవయవాలను దానం చేసే వారి సంఖ్య పెరుగుతుందన్న నమ్మకం తనకుందన్నారు. కాగా మంత్రి వెంట ఆరోగ్యశాఖ డైరెక్టర్ తోరణిరాజన్, అవయవదానం విభాగపు కమిషన్ కార్యదర్శి గోపాలకృష్ణన్, కీళ్పాక్కం వైద్యశాల డీన్ కవిత, డిప్యూటి డైరెక్టర్ ప్రియారాజ్, ప్రభాకరన్, ఆర్డీవో రవిచంద్రన్ పాల్గొన్నారు. -
రైలులో మత్తుమాత్రలు తరలింపు
–నలుగురి అరెస్ట్ తిరువళ్లూరు: రైలులో మత్తు మాత్రలను తరలించిన నలుగురిని స్పెషల్టీ మ్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి 3,200 మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి, మత్తుమాత్రలు, గుట్కా అక్రమంగా తరలించే వారిని కట్టడి చేయడానికి ఎస్పీ వివేకనందశుక్లా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా వుంచిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రైలులో మత్తుమాత్రలను తరలిస్తున్నట్టు నిఘా టీమ్ ఇన్స్పెక్టర్ సురేంద్రన్కు సమాచారం అందింది. పోలీసులు తిరువళ్లూరు రైల్వేస్టేషన్లో శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఆసమయంలో అనుమానాస్పదంగా రైలులో ప్రయాణిస్తున్న నలుగురి బ్యాగులను తని ఖీ చేశారు. అందులో 1.60 లక్షలు విలువ చేసే 3,200 మత్తు మత్తుమాత్రలు వున్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో పట్టుబడిన యువకులు చైన్నె బెసెంట్నగర్కు చెందిన దురైరాజ్(25), నటరాజన్(26) ఊరపా క్కం ప్రాంతానికి చెందిన విజయ్(22), తిరువాన్మియూర్కు చెందిన ఏలుమలై(29)గా గుర్తించారు. వీరు ఆంధ్రా నుంచి మత్తుమాత్రలను తీసుకొచ్చియువకులు, కళాశాల విద్యార్థులే లక్ష్యంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్టు నిర్ధారించారు. అనంతరం నలుగురిని అరెస్టు చేసి వారిని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించడంతోపుళల్ జైలుకు తరలించారు. -
ఘనంగా పోలీస్ దినోత్సవం
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 6న పోలీస్ దినోత్సవం జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. దీంతో వేలూరు జిల్లాలో పోలీస్ దినోత్సవాన్ని ఎస్పీ మయిల్వాగనం అధ్యక్షతన నేతాజీ మైదానంలో పోలీసు అధికారులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖలోని అన్ని విభాగాలకు చెందిన పోలీసులు, హోంగార్డులు వారి కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు క్రీడాపోటీలు, రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమాలను ఎస్పీ పరిశీలించారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులకు ఎస్పీ పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన పోలీసులకు బహుమతులను అందజేశారు. జిల్లాలోని పోలీసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఇంటింటికీ పథకాలను చేర్చుదాం!
– బీజేపీ నేతల నిర్ణయం సాక్షి, చైన్నె: కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఇంటింటా ప్రజల్లోకి తీసుకెళ్దామని బీజేపీ నేతలు నిర్ణయించారు. కోయంబత్తూరు సుందరపురంలోని సెల్వం మహల్లో తమిళనాడు బీజేపీ నేతృత్వంలో సేవ ల విస్తృతం లక్ష్యంగా సేవా సంగథాన్ పేరిట రాష్ట్ర స్థాయి వర్క్ షాపు శనివారం జరిగింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కో ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, జాతీయ ఇన్చార్జ్ అరవింద్ మీనన్, ప్రధాన కార్యదర్శి కేశవ్ వినాయకన్తో పాటూ సీనియర్ నేతలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. బృందాల వారీగా వీరికి వర్క్షాపు నిర్వహించి పలు సూచనలు,సలహాలు ఇచ్చారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, సేవా హి సంగథన్ స్పూర్తి గురించి వివరించారు. పీఎం మోదీ జన్మదినం, మహాత్మా గాంధీ జీ, లాల్ బహదూర్ శాస్త్రి జీ జయంతి వరకు నిర్వహించబడే సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక రోడ్మ్యాప్ను సిద్ధంచేసి వర్క్ షాపుకు హాజరైన వారికి అందజేశారు. పీఎం మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు , అందిస్తున్న పథకాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్దామని సూచించారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వ అవినీతి, దుష్పరిపాలనను బయటపెట్టడం లక్ష్యంగా ముందుకెళ్దామన్నారు. సేవ, సామాజిక సామరస్యం మరియు జాతి నిర్మాణం సందేశాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లా లని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటినీ చేరుకోవాలని సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని, ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతను బలోపేతం చేయాలన్న నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకున్నారు. -
అక్టోబర్ 2 నుంచి నెట్ ఫ్లిక్స్లో ‘ది గేమ్’
తమిళసినిమా: నటి శ్రద్ధ శ్రీనాథ్, సంతోష్ ప్రతాప్ ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ది గేమ్. యు నెవర్ ప్లే అలోన్. రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ను నెట్ ఫ్లిక్స్, అప్లాస్ ఎంటర్టైనర్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ సంస్థలు ఇంతకుముందు బ్లాక్ వారెంట్ అనే వెబ్ సిరీస్ నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాయి అన్నది గమనార్హం. కాగా ది గేమ్ వెబ్ సిరీస్లో నటి చాందిని, శ్యామ హరిణి ,బాలాహాసన్, సుభాష్ సెల్వం, వివియ చంద్ ధీరజ్, హేమ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ గురించి దర్శకుడు రాజేష్ ఎం సెల్వా తెలుపుతూ ఇది థ్రిల్లర్ కథ మాత్రమే కాదని మనం జీవిస్తున్న ప్రపంచంలో ప్రతిబింబించే జీవన విధానంలో రహస్యాలు, మారుతున్న నమ్మకాలు వంటివి చోటుచేసుకుంటాయన్నారు. అదేవిధంగా ప్రజలు ఎంచుకునే మార్గాలు, బాధింపు, నిజానికి మోసాలకు మధ్య బలహీనమైన గీత వంటి పలు ఆసక్తికరమైన అంశాలు ఉంటాయన్నారు. ఈ వెబ్ సిరీస్ను రూపొందించడానికి నెట్ఫ్లిక్స్, అప్లాస్ ఎంటర్టైనర్ సంస్థలు తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారన్నారు. నటీనటులు సాంకేతిక వర్గం పూర్తి సహకారాన్ని అందించారన్నారు. కాగా అక్టోబర్ రెండవ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటిటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్సిరీస్ ప్రేక్షకులు అందించే ఆదరణ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. -
పోలీసు అమర వీరులకు నివాళి
సేలం: సేలం నగర పోలీసుల తరపున కుమారస్వామిపట్టి సాయుధ దళాల మైదానంలో శనివారం పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు పోలీసులు నివాళులర్పించారు. ఆ తర్వాత వివిధ క్రీడా పోటీలు జరిగాయి. మద్రాస్ జిల్లా పోలీసు చట్టం సెప్టెంబర్ 6, 1859న అమల్లోకి వచ్చింది. ఆ రోజును పోలీసు దినోత్సవంగా జరుపుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ గత ఏప్రిల్లో అసెంబ్లీలో ప్రకటించారు. ఈమేరకు శనివారం తమిళనాడు అంతటా పోలీసు దినోత్సవాన్ని జరుపుకుంటారు. సేలం నగరంలో, అస్తంపట్టి, అమ్మపైట్టె, అన్నతనపట్టి, టౌన్, సూరమంగళం, కొండలంబట్టి అనే 6 వార్డుల తరపున పోలీసు కుటుంబాల పిల్లలకు క్రీడా పోటీలు, వ్యాస రచన, కవిత్వం వంటి వివిధ పోటీలు జరుగుతున్నాయి. కార్యక్రమంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ గౌతమ్ గోయల్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోటీల విజేతలను నగర పోలీసు కమిషనర్ అనిల్ కుమార్ గిరి సత్కరించి వారికి బహుమతులు అందజేశారు. -
క్లుప్తంగా
ప్రాణం తీసిన ఈత సరదా తిరువళ్లూరు: ఈత సరదా ఓ బాలుడి నిండు ప్రాణం తీసింది. తిరువళ్లూరు జిల్లా కై వండూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఆనందన్. ఇతని కుమారుడు సాలమోన్ స్థానికంగా వున్న పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం పాఠశాలకు సెలవు కావడంతో సమీపంలోని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లాడు. అక్కడ ఈత కొడుతూ చెరువలో మునిగిపోయాడు. గుర్తించిన స్థానికులు వెంటనే నీటి నుంచి సామోన్ను బయటకు తీసి తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు కేసు దర్యాప్తును చేస్తున్నారు. యువకుడిపై దాడి –ముగ్గురి అరెస్టు పళ్లిపట్టు: ప్రేమ వ్యవహారంలో యువకుడిపై దాడిచేసిన సంఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పొదటూరుపేట పోలీసుల కథనం మేరకు.. అత్తిమాంజేరిపేట గాంధీనగర్కు చెందిన శివ కుమారుడు బాలమురుగన్(23) పొదటూరుపేటలో సెల్ఫోన్ సర్వీసు దుకాణం నడుపుతున్నాడు. అతను శుక్రవారం రాత్రి గ్రామానికి శివారులో అతని మిత్రుడు జ్యోతిలింగంతో మాట్లాడుతుండగా అక్కడికి వెళ్లిన యువకులు ముగ్గురు బాలమురుగన్పై దాడిచేశారు. అడ్డుకున్న జ్యోతిలింగంను సైతం కర్రతో దాడిచేశారు. ఎస్ఐ సుగంధి కేసు నమోదు చేసి చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని తొట్టికండ్రిగ గ్రామానికి చెందిన దేవ(23) అనే యువకుడు ప్రేమ వ్యవహారంలో అతని మిత్రు లు బన్నీ, కిషోర్ తన వెంట తీసుకొచ్చి దాడిచేసినట్లు పోలీసులు విచారణలో తెలిసింది. తరువాత వారిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. మద్యం మత్తులో కారుకు నిప్పు తిరుత్తణి: మద్యం మత్తులో ఓ వ్యకి కారుకు నిప్పు పెట్టిన ఘటనలో కారు దగ్ధమైంది. ఈ ఘటన తిరువలంగాడు ప్రాంతంలో చోటుచేసుకుంది. పళయనూరు గ్రామానికి చెందిన నాగరాజు(45) ట్రావల్స్ నడుపుతున్నారు. ఇతను శనివారం ఇంటి వద్ద కారులో మద్యం తాగి సిగరెట్ వెలిగించి కారుకు నిప్పుపెట్టాడు. మంటల్లో కారు దగ్ధమైంది. తిరువలంగాడు పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని కారును పరిశీలించి విచారించగా నాగరాజు మద్యం మత్తులో నా కారు నాఇష్టం అని పోలీసుల వద్ద దురుసుగా మాట్లాడినట్లు తెలిసింది. కారు దగ్ధంకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని బాలిక మృతి తిరువొత్తియూరు: పోరూర్లో స్కూటీని ఇసుక లారీ ఢీకొన్న ఘటనలో ఓ బాలిక మృతిచెందింది. బాలికతో పాటు వెళ్తున్న స్నేహితురాలు, బంధువు అయిన మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చైన్నె పోరూర్కు చెందిన గణేష్ కుమార్తె యోగశ్రీ (10). ఈమె పోరూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. ఆమె స్నేహితురాలు అప్సియా (10). యోగశ్రీ బంధువు శారద (17). శనివారం ఉదయం శారద తన స్కూటీలో యోగశ్రీ, అప్సియాలను ఐయప్పన్తాంగల్లో ఉన్న ఫుట్బాల్ శిక్షణ కేంద్రానికి తీసుకెళ్తోంది. పోరూర్ సమీపంలో వెళుతుండగా, వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకులో వెళుతున్న ముగ్గురూ రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో లారీ యోగశ్రీ తలపై వెల్లడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందింది. అప్సియా, శారదకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోరూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కూల్చివేత పనులు ముమ్మరం తిరువొత్తియూరు: చైన్నెలో ప్రసిద్ధి చెందిన బ్రాడ్వే బస్స్టేషన్ ఉంది. ఈ నేపథ్యంలో, బ్రాడ్వే బస్స్టేషన్ , కురలగం భవనం పక్కన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్న్స్పోర్ట్ టెర్మినల్ , కార్యాలయ సముదాయం నిర్మించనున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో, బ్రాడ్వే బస్స్టేషన్ స్థానంలో రాయపురంలో తాత్కాలిక బస్స్టేషన్ ఏర్పాటు చేశారు. బ్రాడ్వే బస్స్టేషన్ ఉన్న స్థలంలో 9 అంతస్తుల వాణిజ్య సముదాయంతో కూడిన బస్స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. అదేవిధంగా, పక్కనే ఉన్న కురలగం భవనాన్ని కూల్చివేసి 10 అంతస్తుల వాణిజ్య సముదాయాన్ని నిర్మించనున్నారు. ఈ విధంగా, పురాతన కురలగం భవనాన్ని కూల్చివేసే పనుల్లో కార్మికులు నిమగ్నమై ఉన్నారు. బైకును దూడ ఢీకొని వ్యక్తి మృతి తిరుత్తణి: బైకును దూడ ఢీకొని ఓ ఆటోడ్రైవర్ మృతిచెందిన ఘటన శోకాన్ని మిగిల్చింది. అరక్కోణం సమీపంలోని పరమేశ్వమంగళం గ్రామానికి చెందిన బాలు(50) ఆటోడ్రైవర్. శనివారం ఉదయం తిరువలంగాడు సమీపంలోని వ్యాసపురం గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి బైకులో బయలుదేరి వెళ్లాడు. వ్యాసపురం క్రాస్ వద్ద వెళుతుండగా అడ్డంగా దూడ రావడంతో బైకును ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాలును స్థానికులు తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. తిరువలండగాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యువత స్వశక్తితో ఎదగాలి
కొరుక్కుపేట: యువత స్వశక్తితో ఎదగాలని రాష్ట్ర సమాచార సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ సేవల మంత్రి డాక్టర్ పళనివేల్ త్యాగరాజన్ పిలుపునిచ్చారు. వీఐటీ చైన్నె 13వ వార్షిక స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. స్నాతకోత్సవానికి మంత్రి డాక్టర్ పళనివేల్ త్యాగరాజన్ పాల్గొని ర్యాంక్ హోల్డర్లు, పీహెచ్డీ స్కాలర్లకు పతకాలు, డిగ్రీ పట్టాలను అందజేశారు. గౌరవ అతిథిగా చైన్నెలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ షెల్లీ సలేహిన్ హాజరయ్యారు. వీఐటీ వ్యవస్థాపక చాన్స్లర్ డాక్టర్ జి.విశ్వనాథన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్ విశ్వనాథన్, డాక్టర్ జి.వి. సెల్వం పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ యువత తమ సొంత దృక్పథాన్ని, మార్గాన్ని అనుసరించాలని హితవు పలికారు . చాన్స్లర్ డాక్టర్ జి. విశ్వనాథన్ మాట్లాడుతూ ఇంతమంది యువత నాణ్యమైన ఉన్నత విద్యను పొందగలిగారంటే, అది ప్రధానంగా తల్లిదండ్రుల పెట్టుబడి వల్లేనని, ఉన్నత విద్యలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. మొత్తం 6,581 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, స్కాలర్లు తమ డిగ్రీలను అందుకున్నారని వివరించారు. వీఐటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ వి.ఎస్. కాంచన, ప్రొ–వైస్ చాన్స్లర్ డాక్టర్ టి.త్యాగరాజన్, ప్రొ–వైస్ చాన్స్లర్ డాక్టర్ పార్థసారథి మాలిక్, రిజిస్ట్రార్ డాక్టర్ టి.జయభారతి పాల్గొన్నారు. -
చిరుత దాడిలో దూడ మృతి
వేలూరు: చిరుత దాడిలో దూడ మృతిచెందింది. వేలూరు జిల్లా అనకట్టు సమీపంలోని అంబుకాల్ గ్రామానికి చెందిన రంగన్ ఇతను పది ఆవులు, దూడలను పెంచుకుంటున్నాడు. ఈక్రమంలో గురువారం పశువులను మేతకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటి సమీపంలోని గుడిసెలో కట్టి ఇంట్లో నిద్రపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున దూడతో పాటు పశువులు ఉన్న ఫలంగా అరవడంతో రంగన్ ఇంటి నుంచి బయటకు వచ్చి చూశాడు. ఆ సమయంలో వింత శబ్దం వినపడడంతో విద్యుత్ సరఫరా లేక చీకటిగా ఉండడంతో కేకలు వేశాడు. వెంటనే చుట్టుపక్కల వారు అక్కడిక చేరుకొని చూడగా ఆ సమయంలో చిరుత దూడను చంపి అక్కడ నుంచి లాక్కెళ్లడాన్ని చూశారు. వెంటనే చిరుతను తరిమేందుకు మంటలు వేసి కేకలు పెట్టడంతో చిరుత అక్కడ నుంచి పరుగులు తీసింది. అక్కడకు వెళ్లి చూడగా అప్పటికే దూడ మృతిచెంది ఉండడాన్ని గమనించి పోలీసులకు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. -
తిరుచెందూర్ ఆలయానికి స్వర్ణ రథం
సాక్షి, చైన్నె : తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయానికి బంగారు రథం సిద్ధమైంది. దీనిని శుక్రవారం మంత్రులు శేఖర్బాబు, అనితా రాధాకృష్ణన్ ప్రారంభించారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరు సముద్ర తీరంలో సెంథిల్ నాధర్గా సుబ్రహ్మణ్యస్వామి ఆలయం కొలువై ఉన్న విషయం తెలిసిందే. ప్రసిద్ది చెందిన ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి పరిచే మాస్టర్ ప్లాన్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. నిత్యం వేలాదిగా తరలి వస్తున్న భక్తుల కోసం ప్రత్యేక నిర్మాణాలు, వసతులు వేగవంతం చేశారు. ఈపనుల నిమిత్తం గత ఏడాది స్వర్ణ రథోత్సవ సేవను నిలుపుదల చేశారు. ఈ కాలంలో స్వర్ణరథానికి మరింత మెరుగులు దిద్దారు. జీర్ణోద్ధరణపనులు ముగించి కుంభాభిషేకాన్ని ఇటీవల విజయవంతం చేశారు. ఈ పరిస్థితుల్లో స్వర్ణ రథోత్సవాన్ని 13 నెలల అనంతరం మళ్లీ పునరుద్ధరించారు. శుక్రవారం ఆలయంలో విశిష్ట పూజలు జరిగాయి. స్వర్ణరథంపై సెంథిల్నాదర్, వళ్లి దేవాసేన సమేతంగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ రథాన్ని మంత్రులు ప్రారంభించారు. -
సినిమా చుట్టూ ప్రతికూల పరిస్థితులు
దర్శకుడు శశి, శివ, విజయ్తో బ్లాక్మెయిల్ చిత్ర యూనిట్ తమిళసినిమా: సినిమా చుట్టూ ప్రతికూల విషయాలు జరుగుతున్నాయని నిర్మాత, పంపిణీదారుడు ధనుంజయన్ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్కుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బ్లాక్మెయిల్. ఎం.మారన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని జేడీఎస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై జయక్కొడి అమల్రాజ్ నిర్మించారు. నటి తేజూ అశ్విని నాయకిగా నటించిన ఇందులో గిరిజా హరి, రమేష్ తిలర్, ముత్తుకుమార్, లింగా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, గోకుల్ బినాయ్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 12వ తేదీన తెరపైకి రానుంది. దీన్ని తమిళనాడులో జి.ధనుంజయన్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రిరిలీజ్ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించారు. ఈ వేదికపై జీవీ ప్రకాశ్కుమార్ మాట్లాడుతూ యూనిట్ అంతా సిన్సియర్గా పని చేసిన చిత్రం ఇదన్నారు. దర్శకుడు మారన్ మంచి చిత్రాన్ని అందించారన్నారు. తనకు చాలా నచ్చిందన్నారు. అందరినీ ఆకట్టుకునే థ్రిల్లర్ కథా చిత్రంగా బ్లాక్మెయిల్ ఉంటుందని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ జి.ధనుంజయన్ మాట్లాడుతూ కొన్ని కారణాలతో ఈ చిత్ర విడుదల వాయిదా పడిందని, తాను చిత్రం చూసినప్పుడు చాలా నచ్చిందని అన్నారు. చిత్ర కథలో అందరికీ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. చిత్రంలో ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు, ఎలా కిడ్నాప్ చేస్తారనే పలు లేయర్లు చిత్రంలో ఉంటాయని చెప్పారు. ప్రేక్షకులకు మంచి చిత్రం చూసిన తృప్తి కలుగుతుందన్నారు. ఇకపోతే సినిమా చుట్టూ పలు ప్రతికూల విషయాలు జరుగుతున్నాయన్నారు. చిత్రాలపై దుష్ప్రచారం చేయడానికే ఒక టీమ్ ఏర్పాటు అయ్యిందన్నారు. వాటన్నింటినీ అధిగమించి ఒక చిత్రం విజయం సాధించాల్సి ఉంటోందన్నారు. అందుకే దయ చేసి సినిమాను మిస్ యూజ్ చేయవద్దని అన్నారు. మంచి చిత్రాలను సపోర్టు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో దర్శకుడు శశి, విజయ్, టి.శివ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
ధనుష్తో రొమాన్స్కు రెడీ
తమిళసినిమా: సినిమా ఎల్లలు దాటి చాలా కాలమైంది. అది సినీ తారలకు పెద్ద వరంగా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్లకు ప్రయోజనంగా మారింది. ఒక భాషల్లో అవకాశాలు తగ్గాయనుకుంటే వెంటనే మరో భాష నుంచి పిలుపు వస్తోంది. నటి మీనాక్షిచౌదరికి అలాంటి అదృష్టమే పట్టిందిప్పుడు. టాలీవుడ్లో వరుసగా చిత్రాలు చేసిన ఈ అమ్మడికి ప్రస్తుతం అక్కడ అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. చివరిగా ఈమె తెలుగులో నటించిన సంక్రాంతికి వస్తున్నాం మంచి విజయాన్ని సాధించింది. దీంతో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆమె కాదు, సినీ వర్గాలు అనుకున్నారు. అయితే అలాంటి పరిస్థితి రాలేదు. ఇక తమిళంలోకి విజయ్ ఆంటోని హీరోగా నటించిన కొలై చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తరువాత సింగపూర్ సెలూన్, విజయ్కు జంటగా ది గోట్ చిత్రాల్లో నటించారు. విజయ్కు జంటగా నటించే అవకాశం వచ్చినప్పుడు బాగా ప్రచారం పొందారు. కానీ, చిత్రంలో ఆమె పాత్ర మాత్రం పరిమితమే అయ్యింది. దీంతో ఇక్కడ కూడా అవకాశాలు అడుగంటాయి. అలాంటిది తాజాగా మరో లక్కీఛాన్స్ వరించిందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు ధనుష్. ఈయన నటించి, దర్శకత్వం వహించిన ఇడ్లీకడై చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ప్రస్తుతం హిందీ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ధనుష్ పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ధనుష్ నటిస్తున్న 54వ చిత్రం అన్నది గమనార్హం. దీని తరువాత అమరన్ చిత్రం ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తన 55వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని గోపురం ఫిలింస్ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే విడుదల చేశారు. కాగా ఈ చిత్రంలో ధనుష్కు జంటగా నటి మీనాక్షిచౌదరిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అదే విధంగా ఒక హిందీ చిత్రంలోనూ మీనాక్షిచౌదరి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మీనాక్షిచౌదరి -
సర్వేపల్లికి ఘన నివాళి
వేలూరు: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత గురువులపై ఉందని తమిళనాడు రిటైర్డ్ పాఠశాల, కళాశాల టీచర్స్ అసోషియేషన్ జిల్లా ఆర్గనైజర్ జనార్దన్ అన్నారు. వేలూరు టీచర్స్ భవనంలో ఆ సంఘం ఆధ్వర్యంలో టీచర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్తమ టీచర్లను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురువుగా విద్యాభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన ఆదర్శనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణ జయంతి దినోత్సవం రోజున గౌరవించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సమాజంలోని ప్రతిఒక్కరినీ బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపై ఉందన్నారు. ప్రభుత్వం టీచర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. మెడికల్ అలవెన్స్ అందజేయాలని, 80 సంవత్సరాలు దాటిన టీచర్లకు 20 శాతం పెన్షన్ పెంచాలని, డిమాండ్ చేశారు. రిటైర్డ్ టీచర్లు గోపాల క్రిష్ణన్, ఆర్ముగం, రఘునాథ్, ఉమ, జయలక్ష్మి, శశికుమారి, వినాయకం పాల్గొన్నారు. -
వడచైన్నె–2లో శింబు తొలి అడుగులు
తమిళసినిమా: వైవిధ్య కథా చిత్రాల దర్శకుడు వెట్రిమారన్. సంచలన నటుడు శింబు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ వి.క్రియేషన్స్. ఈ కాంబినేషన్లో చిత్రం రూపొందితే ఎలా ఉంటుంది? అదిరిపోదూ! అదే జరగబోతోందిప్పుడు. వెంట్రిమారన్, శింబుల కాంబోలో చిత్రం రూపొందబోతుందన్న ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. అదే సమయంలో ఈ చిత్రం డ్రాప్ అయ్యిందనే ప్రచారం సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. ఇలా ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టేశారిప్పుడు. వెట్రిమారన్, శింబుల కాంబోలో చిత్రం ఉంటుందని అధికారిక ప్రకటన వెలువడింది. గురువారం దర్శకుడు వెట్రిమారన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన శింబు హీరోగా చేసే చిత్రాన్ని వి.క్రియేషన్స్ సంస్థ అధినేత కలైపులి ఎస్.థాను నిర్మించనున్నారని, దీనికి వడచైన్నె–2 అనే టైటిల్ను నిర్ణయించినట్లు ఒక ప్రోమోను విడుదల చేశారు. అందులో శింబు తొలి అడుగులు వేసి, స్లోగా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఆయన నటించే 49వ చిత్రం ఇది. ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ కథా చిత్రంగా ఇది ఉంటుందని సమాచారం. కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న 47వ చిత్రం అన్నది గమనార్హం. కాగా ఈ చిత్రం కోసం శింబు 10 రోజుల్లోనే 10 కిలోల బరువు తగ్గి స్టైలిష్గా తయారయ్యారట. ఇందులో ఆయన రెండు గెటప్లలో కనిపించనున్నట్లు తెలిసింది. ఈ చిత్ర ప్రోమో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో వడచైన్నె–2 చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి. దర్శకుడు వెట్రిమారన్, శింబు -
గురువులను పూజించాలి
కొరుక్కుపేట: గురువులను అనునిత్యం పూజించాలి సభలో పాల్గొన్న వక్తలు వ్యాఖ్యానించారు. జనని సాంఘిక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. చైన్నె వ్యాసార్పాడి ఎంకేబీనగర్లోని జనని సంస్థ ప్రధాన కార్యాలయంలో సర్వేపల్లి చిత్రపటానికి జనని అధ్యక్షులు డాక్టర్ నిర్మల, ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో డాక్టర్ మనోజ, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ విస్తాలి శంకరరావు, శోభ, ఎర్రభనేని పట్టాభి రామయ్య, తమ్మినేని బాబు నివాళులర్పించారు. -
ప్లస్టూ విద్యార్థినిపై లైంగిక దాడి
తిరువొత్తియూరు: కన్యాకుమారి జిల్లా కులచల్ పాలపల్లం సమీపంలోని నీర్వక్కులి గ్రామానికి చెందిన థనీస్(25) అతను కరుకల్ చెలంగ్ కోణం రోడ్డులో వెల్డింగ్ దుకాణం నడుపుతున్నాడు. పాలపల్లం సమీపంలోని ఒక గ్రామానికి చెందిన ప్లస్టూ విద్యార్థిని టైప్ రైటింగ్ నేర్చుకోవడానికి ఆ ప్రాంతానికి వస్తుంది. ఆ సమయంలో విద్యార్థినితో థనీస్ మాట్లాడుతూ ఇద్దరూ స్నేహితులుగా మారారు. గత జూలై 4, 5వ తేదీలలో థనీస్ బాలికను బైక్పై వలుదళం పల్లంలోని ఒక ప్రైవేట్ పాఠశాల వెనుకకు తీసుకెళ్లాడు. అక్కడ అతను బాలికపై లైంగిక దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి దిగ్భ్రాంతి చెందారు. ఆమె వెంటనే కులచల్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి గురువారం అలంజిలో థనీస్ను అరెస్టు చేశారు. తరువాత అతన్ని పోక్సో కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. వైద్య విద్య ర్యాంకుల జాబితా విడుదల తిరువొత్తియూరు: ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య ప్రవేశానికి కౌన్సెలింగ్ పూర్తి చేసి విద్యార్థులు కళాశాలల్లో చేరారు. నీట్ మార్కుల ఆధారంగా ఈ కౌన్సెలింగ్ జరిగింది. ఆతర్వాత సిద్ధ, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, యోగా ప్రకృతి వైద్య డిగ్రీ కోర్సుల ర్యాంకు జాబితా శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. దీనిని ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్ విడుదల చేశారు. నీట్ కటాఫ్ మార్కుల ఆధారంగా విద్యార్థుల ర్యాంకు జాబితా తయారుచేసి విడుదల చేశారు. పేకాటరాయుళ్లు ఆరుగురి అరెస్ట్ సేలం: పేకాటాడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెరియసేమూర్ సమీపంలోని కల్లంగడు వాగు సమీపంలో కొందరు పేకాట ఆడుతున్నట్లు వీరప్పన్చత్రం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ స్థావరంపై పర్యవేక్షించి దాడి చేసి పేకాటాడుతున్న ఆరుగురిని పట్టుకున్నారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వారి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. 75 బస్తాల బియ్యం స్వాధీనం వడమాలపేట (పుత్తూరు): ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, 75 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ధర్మారెడ్డి కథనం మేరకు.. అక్రమ రవాణా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం రాత్రి వడమాలపేట మండలం, తడుకు రైల్వే స్టేషన్ క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఏపీ 39 డబ్ల్యూడీ 5318 నెంబరు గల బొలేరో లగేజ్ వెహికల్ను ఆపి తనిఖీ చేయగా అందులో 50 కేజీల బరువు గల 75 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాగలాపురం మండలం, బీరకుప్పం గ్రామానికి చెందిన దినేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ.1.35 లక్షలు ఉంటుందని లెక్కగట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సర్వ దర్శనానికి 24 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు నిండాయి. క్యూ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 59,834 మంది స్వామి వారిని దర్శించుకోగా 24,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
క్లుప్తంగా
కళాశాల విద్యార్థినికి లైంగిక వేధింపులు పళ్లిపట్టు: కళాశాల విద్యార్థినికి లైంగిక వేధింపులకు గురిచేసిన యువకుడిని పోలీసులు పోక్సో చట్టంపై అరెస్టు చేశారు. పళ్లిపట్టు పోలీసుల కథనం మేరకు.. కరింబేడు ప్రాంతానికి చెందిన యువతి ఆర్కేపేట ప్రాంతంలోని డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుకుంటున్నారు. కళాశాల బస్సులో ప్రయాణం చేసి, రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో యథాప్రకారం గురువారం కళాశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి నడిచి వెళ్తుండగా యువకుడు అడ్డుకుని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు బాలిక తల్లిదండ్రుల వద్ద చెప్పుకోగా పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పళ్లిపట్టు ఎస్ఐ రమేష్కుమార్ విచారణలో అరవాసపట్టడె గ్రామానికి చెందిన హేమంత్(27) బీజేపీలో మండల స్థాయిలో ఐటీ వింగ్ విభాగంలో మాజీ అధ్యక్షుడిగా విధులు నిర్వహించినట్లు తెలిసింది. అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 318 మంది పారిశుధ్య కార్మికులపై కేసు తిరువొత్తియూరు: చైన్నె మహానగర పాలక సంస్థ పారిశుధ్య పనులను ప్రైవేటుకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పారిశుధ్య కార్మికులు నిరసన తెలుపుతున్నారు. చైన్నె కార్పొరేషన్ కార్యాలయం ముందు కొన్ని రోజుల క్రితం జరిగిన నిరసనలో పాల్గొన్న పారిశుధ్య కార్మికులను కోర్టు ఆదేశాల మేరకు బలవంతంగా తొలగించారు. ఆ తర్వాత కూడా తమ డిమాండ్లను పారిశుధ్య కార్మికులు లేవనెత్తుతున్నారు. ఈ క్రమంలోనే చింతాద్రిపేట మే డే పార్కులో గురువారం పారిశుధ్య కార్మికులు ఆకస్మికంగా నిరసన తెలిపారు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు పారిశుధ్య కార్మికులను బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం అందరినీ కమ్యూనిటీ హాలులో ఉంచి గురువారం రాత్రి విడిచిపెట్టారు. ఈ నిరసన సమయంలో పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఇందులో ఒక మహిళా పారిశుధ్య కార్మికురాలికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అక్రమంగా గుమికూడినందుకు 318 మంది పారిశుధ్య కార్మికులపై చింతాద్రిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కార్మిక హక్కుల సంఘానికి చెందిన పుంజిబాబు, తమిళసెల్వన్, ఆనంద్లపై కేసు నమోదు చేశారు. చట్టవిరుద్ధంగా గుమికూడడంతోపాటు మరో 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ప్లస్ టూ విద్యార్థి ఆత్మహత్య తిరువొత్తియూరు: ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసి 4వ అంతస్తు నుంచి కిందకు దూకి ప్లస్టూ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుమంగళం, పార్క్ అవెన్యూ, మెయిన్ రోడ్లోని అపార్ట్మెంట్లో నివసిస్తున్న బాల్రాజ్, రిటైర్డ్ ఆర్మీ అధికారి. ఇతని భార్య నర్మద. పొన్నేరిలోని బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్. వారి కుమారుడు ప్రజిత్ (16) అన్నానగర్ పశ్చిమ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం అతను ఎప్పటిలాగే పాఠశాల నుంచి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ప్రజిత్ హఠాత్తుగా ఇంటి 4వ అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకాడు. తలకు తీవ్ర గాయాలైన ప్రజిత్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదిచూసి అపార్ట్మెంట్ వాసులు ప్రజిత్ తల్లిదండ్రులకు, తిరుమంగళం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రజిత్ తన ఇన్స్టాగ్రామ్లో వీడియోను పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆ వీడియోలో ‘నేను జీవించడం ఎవరికీ ఇష్టం లేదు. ఎవరూ నన్ను ఇష్టపడరు. కాబట్టి నేను జీవించాలనుకోవడం లేదు. అందరికీ గుడ్బై అని భావోద్వేగంతో మాట్లా డాడు. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో స్టేటస్గా కూడా పెట్టుకున్నాడు. ఇది చూసి అతని స్నేహితులు, కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పట్టాకత్తి పట్టుకుని రీల్స్ విడుదల –వ్యక్తి అరెస్ట్ తిరువొత్తియూరు: పట్టాకత్తి పట్టుకుని రీల్స్ చేసిన కండక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువారూర్ జిల్లా, ముత్తుపేట సమీపంలోని అలంగడు వల్లూవర్ సిల్లా ప్రాంతానికి చెందిన మునుస్వామి కుమారుడు పార్థసారథి (23) మినీ బస్సులో కండక్టర్. గురువారం పార్థసారథి పుట్టినరోజు. దీనికి సంబంధించి, అతను పట్టాకత్తి ఆయుధాలతో ఉన్న ఫొటోలు , రీల్స్ వీడియోలను తన ఫేస్బుక్ సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది. దీనిని చూసిన తిరువారూర్ ఎస్పీ కరుణ్ కరట్ ఆదేశాల మేరకు ముత్తుపేట పోలీసులు కేసు నమోదు చేసి పార్థసారథిని, అతనికి పట్టాకత్తిని ఇచ్చిన జాంబవానోడై మేలక్కాటుకు చెందిన శక్తివేల్ కుమారుడు అయ్యప్పన్ (22)లను గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి పట్టాకత్తిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఇద్దరిని తిరుత్తురైపూండి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
వారసుడు రెడీ!
తమిళసినిమా: సినిమా చాలా పవర్ఫుల్ మాధ్యమం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇందులోకి ఒక్కసారి ఎంటర్ అయితే వెనక్కి వెళ్లడం అసాధ్యమనే చెప్పాలి. ఇక వారసత్వానికి పెట్టింది పేరు సినిమా రంగం. ప్రస్తుతం రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలియని వారుండరు. అయితే ఆయన రాజకీయ కుటుంబానికి చెందినా, కెరీర్ మూలాలు మాత్రం సినిమానే. తొలుత నిర్మాతగా మారి రెడ్జెయింట్ మూవీస్ పతాకంపై పలు భారీ చిత్రాలను నిర్మించారు. ఆ తరువాత ఆయన హీరోగా అవతారమెత్తి పలు విజయవంతమైన చిత్రాలను చేశారు. కాగా తండ్రి ఎంకే.స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఉదయనిధి స్టాలిన్ సినిమాలకు స్వస్తి పలికి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆ తరువాత రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలో చిత్రాలు నిర్మించడం తగ్గించారు. తాజాగా ఉదయనిధి స్టాలిన్ తన వారసుడు ఇన్బనిధిని సినీ రంగప్రవేశం చేయిస్తున్నారు. ఈయన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థకు సీఈఓగా నియమించారు. ఇన్బనిది రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా పంపిణీ చేస్తున్న తొలి చిత్రం ఇడ్లికడై. ధనుష్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ ఒకటవ తేదీన విడుదల చేయనున్నారు. భవిష్యత్లో ఇన్బనిధి కూడా తండ్రి బాటలో హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి. ఆయన అందుకు తగిన శిక్షణ పొందుతున్నారు. దానికి సంబంధించిన వీడియోను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఆక్స్ఫర్డ్ వర్సిటీలో పెరియార్ చిత్రపటం
సాక్షి, చైన్నె: ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్కు లండన్లో అరుదైన గౌరవాన్ని కల్పించారు. ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ వర్సిటీలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. దీనిని సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం ఆవిష్కరించారు. జర్మనీ పర్యటన ముగించుకుని సీఎం స్టాలిన్ తాజాగా ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆక్స్ఫర్డ్ వర్సిటీని సీఎం సందర్శించారు. ఇక్కడ ప్రొఫెసర్ ఫైసల్ ప్రేమ్జీ, ప్రొఫెసర్ జిమ్ లెనిన్స్, విద్యావేత్త ప్రమీలా బెస్టర్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజతో కలిసి సదస్సకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెరియార్ చిత్రపటాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులను ఈ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తయారు చేస్తూ వస్తున్నట్టు గుర్తు చేశారు. ఇక్కడ ప్రసంగించే భాగ్యం తనకు దక్కడం మహాభాగ్యంగా వ్యాఖ్యానించారు. పెరియార్ ద్రావిడ సేవలను వివరిస్తూ, నేడు ప్రపంచవ్యాప్తంగా ఆయన అవసరం ఉందన్నది వాస్తవమని వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవ ఉద్యమం పెరియార్ సృష్టించిన ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రపంచీకరించడం లక్ష్యంగా ఇక్కడ సదస్సును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ద్రవిడ ఆత్మగౌరవ ఉద్యమ కొనసాగింపుగా కలైంజ్ఞర్ సేవలు, తన ప్రయాణాన్ని గుర్తు చేశారు. పెరియార్ ప్రపంచవ్యాప్తంగా నాస్తిక వాదాన్ని కాదు, హేతు వాదాన్ని ప్రోత్సహించారని వివరించారు. మానవ సమాజం కోసం ప్రపంచంలోని ప్రజలందరి కోసం ఆయన పయనం సాగిందన్నారు. పెరియార్ అంటే ఆత్మగౌరవం, హేతుబద్ధత, సమానత్వం, దాతృత్వం, రక్తబేధం లేదు, లింగ వివక్షత లేదు, స్వీయ–అభివృద్ధి, మహిళా పురోగతి, సామాజిక న్యాయం, లౌకిక రాజకీయాలు, శాసీ్త్రయ దృక్పథమని వివరించారు. ఆయన జ్ఞాన సాగరాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. సామాజిక న్యాయ విధానం తమిళనాడుకే కాదు, భారతదేశానికి కూడా వర్తిస్తుందని, భారత రాజ్యాంగం ఒక సమగ్ర సూత్రంగా పెరియార్ సాధ్యం చేశారని వివరించారు. ముందుగా హిందూజా గ్రూప్ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థతో ఒప్పందాలు జరిగాయి. తమిళనాడులో రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టే విధంగా ఒప్పందాలు జరిగాయి. అలాగే చైన్నెలో ఉన్న ఆస్ట్రాజెనెకా ప్రపంచ ప్రధాన కార్యాలయం, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సెంటర్ రూ.176 కోట్లతో విస్తరించేందుకు నిర్ణయించారు. సీఎం స్టాలిన్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. తమిళనాడుకు సీఎం విదేశీ పర్యటనతో తాజాగా మొత్తం రూ.13,016 కోట్ల పెట్టుబడి వచ్చినట్టైంది. -
చైన్నె వేదికగా ట్రయాథ్లాన్
సాక్షి, చైన్నె: చైన్నె వేదికగా దేశంలో తొలిసారిగా ట్రయాథ్లాన్ నిర్వహించనున్నారు. 2026 జనవరి 11న ఈస్ట్ కోస్టు రోడ్డులోని ఎంజీఎం బీచ్ రిసార్ట్లో ఈ రేస్ జరగనుంది. 5150ట్రయాథ్లాన్ చైన్నె పేరిట ఐరన్ మ్యాన్ ఇండియాతో కలిసి తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఈ రేష్ ఫార్మాట్ను తీసుకు రానున్నది. శుక్రవారం చైన్నెలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఈ రేస్ లోగోను ఆవిష్కరించారు. 2011లో తొలి సారిగా 5150 ట్రయాథ్లాన్ ప్రపంచ ఆదరణ పొందిందని, ఆ తదుపరి క్రమం తప్పకుండా జరుగుతూ వస్తున్న రేస్ తాజాగా తమిళనాడును వేదికగా ఎంపిక చేశామని ఐరన్ మ్యాన్ ఇండియా కంట్రీ హెడ్ దీపక్రాజ్, రేస్డిప్యూటీ డైరెక్టర్ ఆరతి స్వామినాథన్లు ప్రకటించారు. అథ్లెట్లకు కొత్త అవకాశాలను కల్పించే విధంగా రేసింగ్ ఫార్మాట్ను తీసుకొస్తున్నామని, రేస్ విభాగాలకు స్ప్రింట్ డ్యూయాథాన్గా 5 కి.మీ దూరం పరుగు, 20 కి.మీ దూరం సైకిల్, ఒలింపిక్ డ్యూయాథాన్ 10 కి.మీ పరుగు, 40 కి.మీ సైకిల్, ఐరన్ కిడ్స్ చైన్నె రేసులో 6–16 సంవత్సరాల్లోపు వారికి ఒకటి, రెండు, మూడు కి.మీ దూరాలలో రేస్లు నిర్వహించనున్నామని వివరించారు. ట్రయాథ్లాన్కు తమిళనాడు ప్రభుత్వం మూడు కోట్లను మంజూరు చేసినట్టు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. ఆసియాలో తమిళనాడును ఈ పోటీలకు ఎంపిక చేయడం ఆహ్వానిస్తున్నామన్నారు. 300 మంది ట్రయాథ్లెట్లు, 200 మంది డ్యూఅథ్లెట్లు, ఐరన్కిడ్స్ ఈ పోటీలలో భాగస్వామ్యం కానున్నారని వివరించారు. సీఎం స్టాలిన్ సారథ్యంలో ఇప్పటికే అనేక పోటీలను దిగ్విజయవంతంగా నిర్వహించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రేసును కూడా మరింత విజయవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్ర, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సభ్యకార్యదర్శి జె.మేఘనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆడుతురైలో ఉద్రిక్తత
సాక్షి, చైన్నె: తంజావూరు జిల్లా పరిధిలోని ఆడుతురైలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. ఆడుతురై మున్సిపాలిటీ చైర్మన్ మాకా స్టాలిన్పై పెట్రోబాంబు దాడి జరిగిన సమాచారంతో పీఎంకే వర్గాలు రెచ్చి పోయాయి. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్చేస్తూ రోడ్డెక్కారు. రోడ్డుపై టైర్లను తగలబెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అన్ని దుకాణాలు ఆడుతురైలో మూతపడ్డాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పీఎంకే వర్గాలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో పెద్ద ఎత్తున బలగాలను ఆడుతురైలో రంగంలోకి దించారు. పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకేకు పరాజయాలు తిరుత్తణి: పళనిస్వామి స్వలాభం కోసం అతని నేతృత్వంలోని అన్నాడీఎంకేకు పరాజయాలు మాత్రమే దక్కుతాయని మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ నరసింహన్ ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, మాజీమంత్రి సెంగోట్టయన్ శుక్రవారం విలేరులతో మాట్లాడారు. అన్నాడీఎంకేను విజయం వైపు తీసుకురావాలంటే ప్రధన కార్యదర్శి, చిత్తశుద్ధితో వ్యవహరించి పార్టీకి దూరమైన నాయకులను పార్టీలోకి తీసుకొచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. ఇందుకోసం ఎడపాడి పళనిస్వామికి పది రోజులపాటు సమయం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించిన సెంగోట్టయన్కు పార్టీలో వ్యతిరేకతతోపాటు ఒకవర్గం మద్దతు సైతం పలుకుతున్నది. దీంతో అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు మరింత పెరిగే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో అన్నాడీఎంకేలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్, ఢిల్లీ మాజీ ప్రతినిధిగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే నరసింహన్ శుక్రవారం తిరుత్తణిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పేదల కోసం ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించి, విజయం వైపు తీసుకెళ్లారని, అమ్మ జయలలిత పార్టీని మరింత పటిష్టం చేసి పదేళ్ల పాటు అధికారంలోకి తీసుకొచ్చి, దేశంలో మూడో అతిపెద్ద పార్టీగా అన్నాడీఎంకేను తీసుకెళ్లారని తెలిపారు. అయితే శశికళ మద్దతుతో సీఎంగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పళనిస్వామి తరువాత కాలంలో అధికారం తనకు మాత్రమే కావాలనే ఒంటెద్దు ధోరణిలో వ్యవహరించడంతో చాలా మంది నాయకులు పార్టీకి దూరం కావాల్సి వచ్చిందన్నారు. దీంతో పార్టీ పరాజయాల వైపు పయనిస్తున్నట్లు తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం కోసం నాయకులంతా ఏకం కావాలని అందుకు ఎడపాడి సిద్ధం కావాలని కోరారు. ఉత్తమ చిత్రాలకు వేదికగా టాటా ప్లే బింగే సాక్షి, చైన్నె: ఉత్తమ చిత్రాలకు వేదికగా టాటా ప్లే బింగే మారి ఉందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ ప్రయాణంలో తాజాగా దిగ్గజ నటుడు హీరో మమ్ముట్టికి సంబంధించిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి జాబితాను పొందు పరిచామని వివరించారు. అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే దృఢ సంకల్పం, నిజాయితీ కలిగిన న్యాయవాదిగా మమ్ముట్టి అద్భుతంగా నటించిన మౌనం సమ్మదం, గొప్ప హిట్లుగా నిలిచిన కన్నుర్ స్క్వాడ్తో పాటుగా దిగ్రేట్ ఫాదర్.. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో జాబితాలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ఓటీటీ యాప్లకు టాటా ప్లే బింగే ఒక్క సబ్స్క్రిప్షన్ ఉపయోగకరంగా ఉంటుందని, 30 కంటే ఎక్కువ వేదికలను ఉపయోగించుకునే అవకాశం కల్పించామని ప్రకటించారు. కాగిదపట్టరైలో పీహెచ్సీకి భూమి పూజ వేలూరు: వేలూరు కార్పొరేషన్ పరిధిలోని కాగిదపట్టరై సారధినగర్లో జాతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.75 లక్షల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించడానికి శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే కార్తికేయన్ భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పీహెచ్సీ ఏర్పాటు చేయడం ద్వారా రోగులకు చికిత్స చేసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. ఈ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్, చిన్న పిల్లల వార్డు, ప్రసూతి వార్డు వేర్వేరుగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేయర్ సుజాత, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, జోన్ చైర్మన్ వీనస్ నరేంద్రన్, కౌన్సిలర్ మురుగన్, కుమార్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవం..బ్రహ్మాండం!
కాణిపాకం: కాణిపాక స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజావరోహణంతో వైభవంగా ముగిశాయి. ఉదయం ఆలయ పుష్కరిణిలో త్రిశూలానికి శాస్త్రోక్తంగా పవిత్ర స్నానం చేయించారు. ముందుగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సిద్ధి, బుద్ధి, సమేత శ్రీవినాయకస్వామి ఉత్సవమూర్తులను, త్రిశూలాన్ని పురవీధుల్లో ఊరేగించి పుష్క రిణి వద్దకు చేరుకున్నారు. యాగశాలలో ఏర్పాటు చేసిన 108 కలశాలలోని తీర్థాలను పుష్కరిణిలో కలిపారు. అనంతరం త్రిశూలానికి పవిత్ర స్నానం చేయించారు. ఈ సందర్భంగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం వసంతోత్సవం నిర్వహించారు. శ్రీసిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్స వమూర్తులను మంగళ వాయిద్యాల నడుమున దేవ స్థానం సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు రంగు నీళ్లు చల్లుకుంటూ కోలాహలంగా ఊరేగించారు. తదుపరి యుగశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పర్యవేక్షణ యాగమూర్తికి భక్తితో ముగింపు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ధ్వజావరోహణంలో భాగంగా ఆలయంలోని స్వర్ణ ధ్వజస్తంభానికి అభిషేక పూజలు నిర్వహించారు. భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ధ్వజ స్తంభంపై నుంచి మూషక చిత్రపటాన్ని శాస్త్రోక్తంగా అవరోహణ చేశారు. వైభవంగా వడాయత్తు ఉత్సవం రాత్రి స్వామివారికి వడాయత్తు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి మూలవిగ్రహానికి భక్తితో అభిషేకం నిర్వహించి, పెసర పప్పు పాయసం, ఉద్ది వడలు నైవేద్యంగా సమర్పించి వడాయత్తు ఉత్సవాన్ని చేపట్టారు. అనంతరం స్వామివారికి ఏకాంత సేవను చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ పాల్గొన్నారు. వెల్నెస్ సెంటర్ -
గురువులకే మా మద్దతు
సాక్షి, చైన్నె: గురువులకే నిరంతరం ద్రావిడ మోడల్ ప్రభుత్వ మద్దతు ఉంటుందని డిప్యూటీ సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులందరికీ అండగా ఉంటామని, అందరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. 396 మంది ఉపాధ్యాయులను ఉత్తమ అవార్డులతో ఆయన సత్కరించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని విద్యా శాఖ నేతృత్వంలో చైన్నెలోని అన్నా శతజయంతి స్మారక గ్రంథాలయం ఆడిటోరియంలో జరిగింది. ఇందులో 396 మంది ఉపాధ్యాయులకు రాధాకృష్ణన్ పేరిట ఉత్తమ అవార్డులను ప్రదానం చేశారు. అలాగే, ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంపిక చేసిన 2,810 గ్రాడ్యుయేట్ టీచర్ల నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రులు ఎం సుబ్రమణియన్, పీకే శేఖర్బాబు, అన్బిల్ మహేశ్ పొయ్యామొళి, మేయర్ ప్రియ విద్యా శాఖ కార్యదర్శి చంద్రమోహన్, తమిళనాడు పాఠ్యపుస్తకాలు, విద్యా కార్పొరేషన్ చైర్మన్ దిండిగల్ ఐ.లియోని, పాఠశాల విద్యా డైరెక్టర్ ఎస్. కన్నప్పన్ హాజరయ్యారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి ప్రసంగిస్తూ, ఉపాధ్యాయులందరికి శుభాకాంక్షలు, అవార్డులు అందుకున్న వారికి అభినందనలు తెలియజేశారు. ఉపాధ్యాయులకు సంబంధించిన వివిధ డిమాండ్లను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, వీటిని కొన్నింటిని నెరవేర్చామని, మరికొన్ని సీఎం పరిశీలనలో ఉన్నట్టు వివరించారు. అన్ని డిమాండ్లను సీఎం స్టాలిన్ అమల్లోకి తీసుకొస్తారని భరోసా ఇచ్చారు. పదో తరగతి చదివే సమయంలో తన టీచర్ అంటే చాలా భయం అని గుర్తుచేస్తూ, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉపాధ్యాయులను చూసే అవకాశం వచ్చినా, ఆ భయం అన్నది ఇంకా అలాగే ఉందని వ్యాఖ్యానించారు. ఇక్కడున్న వాళ్లంతా సాధారణమైన వాళ్లు కాదని, అందరూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్న వారు కావడం తాను జాగ్రత్తగా మాట్లాడతానని, ఆమేరకు తనకు గురువు అంటే ఎంతో గౌరవం అని వివరించారు. ఈసందర్భంగా ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్, కలైంజ్ఞర్ కరుణానిది గురించి సీఎం స్టాలిన్ సైతం ఒక ఉపాధ్యాయుడిలా పనిచేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. సీఎం ప్రధానోపాధ్యాయుడైతే తామంతా ఆయన విద్యార్థులం అని గర్వంగా చెప్పుకుంటున్నట్టు తెలిపారు. విద్య ద్వారానే సామాజిక మార్పులు సాధ్యమవుతాయన్నది తమిళనాడులో నిరూపితమైందన్నారు. ఆ మేరకు శక్తివంతంగా విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దారన్నారు. నేటి యుగంలో సామాజిక న్యాయాన్ని పెంపొందించాలని, అన్యాయాన్ని వ్యతిరేకించాలని పేర్కొంటూ, ఈ రెండు సూత్రాలను విద్యార్థులకు మరింతగా నేర్పించాలని సూచించారు. రాష్ట్రం కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన కొత్త జాతీయ విద్యా విధానం గురించి ప్రస్తావిస్తూ, ఇక్కడ ద్విభాషకే చోటు అని స్పష్టం చేశారు. త్రిభాషా విధానాన్ని అనుసరించే ప్రసక్తే లేదని, అంగీకరించబోమన్నారు. గురువులకు అండగా ప్రభుత్వం ఉందని, ఎల్లప్పుడు అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే, క్రీడా మంత్రిగా తాను ఓ అభ్యర్థన పెడుతున్నానని, విద్యార్థులు క్రీడల్లోనూ రాణించే విధంగా తోడ్పాటు అందించాలని కోరారు. డాక్టర్ రాధాకృష్ణన్కు త్వరలో బ్రహ్మాండ విగ్రహం ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ముందుగా సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో నిరుపేద కళాకారులకు ఆర్థిక సహాయం ఉదయనిధి స్టాలిన్ అందించారు. 2,500 మంది కళాకారులకు నెలకు రూ.3వేలు అదనపు ఆర్థిక సహాయం అన్నది తమిళనాడు ఇయల్ఇసై నాటకమండ్రం ద్వారా అందజేశారు. -
ఘనంగా సర్వేపల్లి జయంతి వేడుకలు
తిరుత్తణి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వగ్రామంలో గ్రామస్తులు ఆయన జయంతి వేడుకలను వేడుకగా నిర్వహించారు. తిరుత్తణి శివారులోని వెంకటాపురంలో జన్మించిన డాక్టర్ రాధాకృష్ణన్ తిరుత్తణిలోని మర్రిమాను వీధిలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉన్నత విద్య అభ్యసించి, విద్యావేత్తగా, విద్యా పితామహుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా తన జీవిత ప్రయాణం ప్రారంభించి దేశ అత్యున్నత రాష్ట్రపతిగా సేవలందించినా ఉపాధ్యాయుడిగా చివరి శ్వాస వరకు సేవలందించారు. అతని పుట్టిన రోజును ప్రతిఏటా సెప్టెంబర్ 5న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయుల దినోత్సవంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి అవార్డులతో సత్కరిస్తున్నారు. రాధాకృష్ణన్ 138వ జయంతి సందర్భంగా శుక్రవారం తిరుత్తణి డాక్టర్ రాధాకృష్ణన్ బాలుర మహోన్నత పాఠశాలలో కాంస్య విగ్రహానికి పాఠశాల హెచ్ఎం బాలసుబ్రహ్మణ్యం సహా ఉపాధ్యాయులు ఘనంగా నివాళులర్పించారు. ఉపాధ్యాయులకు విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా వేడుకలు నిర్వహించారు. స్వగ్రామంలో జయంతి వేడుకలు వెంకటాపురం గ్రామంలో ప్రతిఏటా పుట్టిన గ్రామానికి కీర్తి తెచ్చిపెట్టిన డాక్టర్ రాధాకృష్ణన్కు గ్రామానికి చెందిన చంద్రన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం పరిపాటి. యథాప్రకారం గ్రామ శివారులో అలంకరించిన రాధాకృష్ణన్ చిత్రపటానికి గ్రామస్తులు ఘనంగా వాళులర్పించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, కవితల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. గ్రామస్తులకు అన్నదానం కార్యక్రమాన్ని మండల డీఎంకే కార్యదర్శి ఆర్దిరవి ప్రారంభించారు. -
వేడుకగా ఓనం పండుగ
వేలూరు: ఓనం పండుగను పురస్కరించుకుని వేలూరు తోటపాళ్యంలోని కేరళ సమాజంలో ఆ రాష్ట్రానికి చెందిన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగవల్లులు వేసి ఘనంగా జరుపుకున్నారు. ఓనం పండుగను కేరళ సమాజం కార్యదర్శి రాధాక్రిష్ణన్ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కేరళ రాష్ట్రానికి చెందిన మహిళలు ఇంటిముందు సంప్రదాయ పద్ధతిలో అత్తిపూలతో ముగ్గులు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 25 రకాల ఆహార పదార్థాలు తయారు చేసి బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టారు. మహిళలు ఓనం ఊంజల్ ఆడి, పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అలరించారు. అదే విధంగా తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాల్లోనూ కేరళీయులు ఓనం పండుగ వేడుకలను జరుపుకున్నారు. -
విద్య సేవమ్ సమ్మాన్ అవార్డులు ప్రదానం
కొరుక్కుపేట: చైన్నె, గోపాలపురంలోని డీఏవీ బాలికల సీనియర్ సెకండరీ స్కూల్లో లయన్న్స్ క్లబ్ ఆఫ్ మీనంబాక్కం, మిషన్ గురు దేవో భవ సంయుక్తంగా తొలి విద్యా సేవా సమ్మాన్ అవార్డులు –2025 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 20 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ను అవార్డులతో ఘనంగా సత్కరించారు. తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఇరైఅన్బు అవార్డులను ప్రదానం చేశారు. ప్రతి అవార్డు గ్రహీతకు రూ.21వేల నగదు బహుమతి లభించింది. విద్యా శంకర్ చక్రవర్తి, స్కూల్స్ డైరెక్టర్ శాంతి, మిషన్ గురు దేవో భవ సహ వ్యవస్థాపకుడు లెఫ్టినెంట్ అనిల్ ఖిచా, లయన్స్ క్లబ్ ఆఫ్ మీనంబాక్కం అధ్యక్షుడు బాలాజి పాల్గొన్నారు. -
సమన్వయ గళం
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకేలో ఐక్యత, సమన్వయం, సమష్టి నినాదం మళ్లీ తెరపైకి వచ్చింది. పార్టీ సీనీయర్ నేత సెంగోట్టయన్ తన మనస్సులోని మాటల్ని శుక్రవారం ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయం వేదికగా బయటపెట్టారు. అందర్నీ కలుపుకెళ్లాల్సిందేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి అల్టిమేటం ఇచ్చారు. ఇందుకు పది రోజుల గడువు కేటాయిస్తూ హెచ్చరికలు చేశారు. పార్టీలో చీలిక రాకూడదన్న ఉద్దేశంతో ఎన్నో త్యాగాలను తాను చేశానని, ఇక అందర్నీ సమన్వయ పరిచే బాధ్యతలు తన లాంటి వారందర్నీ ఏకం చేసి ముందడుగు వేయడానికి సిద్ధం అని ప్రకటించారు. అన్నాడీఎంకే నుంచి తొలుత శశికళ, టీటీవీ దినకరన్, మద్దతుదారులు బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. దినకరన్ నేతృత్వంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఆవిర్భవించడంతో అన్నాడీఎంకే కేడర్ ముక్కలైంది. ఆ తర్వాత మాజీ సీఎం పన్నీరుసెల్వంను బహిష్కరించడంతో కార్యకర్తల హక్కుల సాధన కమిటీ పేరిట అన్నాడీఎంకేను కై వసం చేసుకునేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కేడర్ ముక్కలైనా, సీనియర్లు తన వెన్నంటే అని చాటుకునే విధంగా ప్రజాచైతన్య యాత్రతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి పరుగులు తీస్తున్నారు. అయితే, 2019 నుంచి ఎదురవుతున్న వరుస ఓటముల నేపథ్యంలో అన్నాడీఎంకేను సమన్వయ పరచాల్సిన అవసరం ఉందని శశికళ ప్రయత్నాలు మొదలెట్టగా, ఇందుకు పన్నీరుసెల్వం సైతం మద్దతు ప్రకటించారు. అయితే, పళణి స్వామి ఏ మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే చేతిలోకి అధికారం దక్కాలంటే అందరూ ఐక్యత, సమన్వయంతో ముందడుగు వేయాల్సిన అవసరం ఉందంటూ సెంగోట్టయన్ సైతం స్పష్టం చేయడం గమనార్హం. ఎంజీఆర్, జయలలితను స్మరిస్తూ... మీడియా ముందుకు వచ్చిన సెంగోట్టయ్యన్ అన్నాడీఎంకేలోని పరిణామాలను వివరించారు. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత రాజకీయ పయనం, వారితో ఉన్న అనుబంధం గురించి గుర్తుచేశారు. తమకు వ్యతిరేకంగా వ్యూహాల్ని రచించిన వాళ్లనే ఎంజీఆర్, జయలలిత క్షమించి, కీలక పదవులలో ఉంచుకున్నారని వివరించారు. అక్కున చేర్చుకుందాం 2026 ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలంటే బయటకు వెళ్లిన వారందర్నీ అక్కున చేర్చుకోవాల్సిందే అని నినదించారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిన వారందర్నీ త్వరితగతిన ఏకం చేయాలని డిమాండ్చేశారు. పది రోజుల గడువు అన్నాడీఎంకే సమన్వయం, ఐక్యం, సమష్టి గళం అన్నది కీలకం అని, ఇందు కోసం కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సిందేనని హెచ్చరిస్తూ, పళణిస్వామికి పదిరోజుల గడువును సెంగోట్టయన్ విధించారు. అంతలోపు ప్రయత్నం జరగని పక్షంలో తన లాంటి వారందర్నీ ఏకం చేసి తామే ముందడుగు వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీజేపీ ఆహ్వానించడంతో మార్చిలో తాను కేంద్ర మంత్రులను కలిసిన మాట వాస్తవమేనని, కేంద్ర మంత్రి అమిత్ షా, నిర్మలా సీతారామన్లను బీజేపీ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు తాను వెళ్లి కలిసి వచ్చినట్టు మీడియా ప్రశ్నకు వివరించారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేస్తూ, ఇదేదో 2024 లోక్సభ ఎన్నికలలో చేసి ఉంటే 30 స్థానాల్లో విజయఢంకా మోగించి ఉండే వాళ్ల మని ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం అన్నాడీఎంకేకు అన్ని ఎన్నికలలో చిక్కులు , సమస్యలే ఉన్నాయని, అందుకే బయటకు వెళ్లిన వారందర్నీ కలుపుకుని ముందుకెళ్దామన్న నినాదాన్ని తాను అందుకున్నట్టు స్పష్టం చేశారు. ఈప్రకటన నేపథ్యంలో ఈరోడ్, తిరుప్పూర్, కొంగు మండలంలోని జిల్లాల్లో ఉన్న పన్నీరుసెల్వం మద్దతు ముఖ్య నేతలందరూ వెళ్లి సెంగోట్టయన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం విశేషం. పన్నీరు , చిన్నమ్మ అభినందనసెంగోట్టయ్యన్ ర్యాలీ పళణిస్వామి, సెంగోట్టయన్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనా, అన్నాడీఎంకేలో సెంగోట్టయ్యన్ సీనియర్. ఇటీవల తీవ్ర అసంతృప్తితో ఉంటూ వచ్చిన సెంగోట్టయన్ శుక్రవారం ఈరోడ్లోని గోబిచెట్టి పాళయంలో ఉన్న అన్నాడీఎంకే కార్యాలయంలో ఐక్యతా నినాదాన్ని అందుకున్నారు. పెద్ద ఎత్తున మద్దతు దారులతో కలిసి ఊరేగింపుగా సెంగోట్టయన్ కార్యాలయానికి రావడంతో ఆయన కొత్త పార్టీ పెట్టేనా అన్న చర్చ ఉదయాన్నే ఊపందుకుంది. ఆమేరకు మద్దతుదారులు కొన్ని కిలోమీటర్ల దూరం ర్యాలీగా సెంగోట్టయన్ వెన్నంటి కదిలి వచ్చింది. శశికళ ప్రధాన కార్యదర్శిగా జయలలిత కూటమి రెండు సార్లు విజయఢంకా మోగించి అధికారాన్ని రాష్ట్రంలో చేజిక్కించుకుందని వివరిస్తూ దురదృష్ట వశాత్తు అమ్మ అనంత లోకాలకు వెళ్లారని ఉద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ శశికళను అందరూ కలిసే ఎంపిక చేశామన్నారు. కాలానుగుణంగా చోటు చేసుకున్న పరిణామాలతో సీఎం ఎంపిక అనివార్యమైందని, ఈ సమయంలో పళణిస్వామి పేరును సీఎంగా శశికళ ఎంపిక చేశారని , ఇందుకు అందరం కట్టుబడి ఆమోదం తెలియజేశామన్నారు. అమ్మ మరణం తర్వాత తనకు రెండు అవకాశాలు వచ్చినా, వాటిని త్యాగం చేశానని పేర్కొన్నారు. సెంగోట్టయ్యన్ నినాదాన్ని మాజీ సీఎం పన్నీరు సెల్వం ఆహ్వానించారు. ఆయన తీసుకున్న నిర్ణయం, అడుగు అభినందనీయమన్నారు. శశికళ స్పందిస్తూ, అన్నాడీఎంకే రక్తం సెంగోట్టయ్యన్లో ప్రవహిస్తోందని, అందుకే ఆయన సరైన సమయంలో గళాన్ని వినిపించారని, అందరూ ఏకం అవుదామని పిలుపు నిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందిస్తూ, అన్నాడీఎంకేలో అందరూ ఏకం కావడం, ఐక్యంగా ముందడుగు వేయాలనుకోవడం మంచి విషయమేనని వ్యాఖ్యానించారు. పన్నీరు, టీటీవీని ఎన్డీఏ కూటమిలో చేర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. కాగా, సెంగోట్టయ్యన్ పూర్తి స్థాయిలో మనస్సు విప్పలేదని, ఇంకా పూర్తిగా విప్పాలంటూ వీసీకే నేత తిరుమావళవన్ వ్యాఖ్యానించారు. అయితే, అన్నాడీఎంకే తరఫు నుంచి నేతలు మౌనం వహించడం గమనార్హం. -
విద్యార్థులకు ఆర్థిక సాయం
తమిళసినిమా: సీనియర్ నటుడు, సూర్య, కార్తీల తండ్రి శివకుమార్ తన 10వ చిత్రం సందర్భంగా విద్యాసేవలకుగానూ విద్యా ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అర్హులైన పేద విద్యార్థులకు తన ఆర్థికసేవలను నిర్వహిస్తున్నారు. కాగా తాజాగా శివకుమార్ విద్యా ట్రస్ట్ 46వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం చైన్నె, టీ.నగర్లోని అగరం ఫౌండేషన్ ఆవరణలో నిర్వహించారు. ఆయన ఈ కార్యక్రమంలో 25 మంది పేద విద్యార్ధులకు తలా రూ.10వేల చొప్పున రూ.2.25 లక్షలను సాయంగా అందజేశారు. అదేవిధంగా దిండిగల్లో విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న తాయ్తమిళ్ పాఠశాలకు రూ.లక్ష, ధర్మపురి, విల్లుపురం తరువాత ప్రస్తుతం కృష్ణగిరి జిల్లా, ఆయూర్ వన ప్రాంతంలోని కొటకరైలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసి అక్కడ ఉపాధ్యాయుడిని నియమించడానికి రూ.15 లక్షల నిధిని అందించారు.అదే విధంగా సీనియర్ చిత్రలేఖ కళాకారుడు మణియం సెల్వన్ను అభినందించి ఆయనకు రూ.లక్ష అందించారు. తిరువణ్ణామలై జిల్లా ఐవ్వారు అటవీ ప్రాంతంలో మేల్నెల్లిమరత్తూర్ లోని పాఠశాలాభివృద్ధి కోసం రూ.40 వేలు ఆర్థికసాయం అందించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు సూర్య, కార్తీ, శివకుమార్ విద్య ట్రస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
తమిళసినిమా: తను కంపోజ్ చేసిన చిత్రాలను ఇతరులు తన అనుమతి లేకుండా వాడితే ఇళయరాజా వారిపై చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. కోర్టుకెళ్లి అయినా పోరాటం చేస్తున్నారు. అలా ఆయన తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంపై చైన్నె హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నటుడు అజిత్, త్రిష జంటగా నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రారంభంతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ఇళయరాజా సంగీతాన్ని అందించిన చిత్రాల్లోని పాటలను ఆయన అనుమతి లేకుండా వాడుకున్నారు. దీంతో ఇళయరాజా ఈ విషయంలో మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 8న విచారణ జరగనుంది. తిరుత్తణి: టీవీకే పార్టీకి చెందిన 25 మంది యువకులు ఎమ్మెల్యే చంద్రన్ సమక్షంలో శుక్రవారం డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఎన్నికల ప్రచారానికి పదునుపెట్టాయి. చేరికలు, వైదొలగడంలో పార్టీ నాయకులు ఆసక్తి చూపు తున్నారు. ఇందులో భాగంగా తిరువలంగాడు మండలానికి చెందిన విజయ్ పార్టీకి చెందిన యువకులు 25 మంది డీఎంకేలో చేరే కార్యక్రమం మండల డీఎంకే కార్యదర్శి విజయ్కుమార్ సమక్షంలో నిర్వహించారు. జిల్లా డీఎంకే కార్యదర్శి, ఎమ్మెల్యే చంద్రన్ సమక్షంలో యువకులు 25 మందిని డీఎంకేలో సభ్యులుగా చేర్చుకున్నారు. ఈ సందర్భంగా యువకులకు ఎమ్మెల్యే చంద్రన్ శాలువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డీఎంకేలో భవిత యువతదే అన్నారు. కొరుక్కుపేట: టైటిల్ డీడ్ సహా పత్రాలు పోతే అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర సమాచార కమిషనర్ ఆర్.ప్రియకుమార్ అన్నారు. చైన్నె, సెట్, కోయంబత్తూరుకు చెందిన అన్బువేల్ అనే వ్యక్తి చైన్నెలోని రాష్ట్ర సమాచార కమిషనర్కు సమాచార హక్కు చట్టం కింద అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో పేరూర్ తాలూకాలోని వాడవల్లి గ్రామంలోని భూమికి సంబంధించి కోయంబత్తూరు జిల్లా రెవెన్యూ కమిషనర్ ఫైల్ను అన్బు యాక్సెస్ చేయాలని కోరారు. డిసెంబర్ 5న, పిటిషన్ను విచారించిన రాష్ట్ర సమాచార కమిషనర్ ఆర్.ప్రియకుమార్, పిటిషనర్ శోధనలో అభ్యర్థించిన సమాచారం ఉన్న ఫైల్ అందుబాటులో లేదని కనుగొన్నారు. ఫైల్ అందుబాటులో లేదని, సమాచార అధికారి అందించిన సమాచారాన్ని అంగీకరించడానికి కమిషన్ నిరాకరించింది. ఫైల్ అందుబాటులో లేదని పబ్లిక్ అథారిటీకి తెలియజేస్తుంది. దీంతో రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాల మేరకు అన్ని స్థాయిల కార్యాలయాలు అజాగ్రత్త వహిస్తున్నారని ఇలాగే సాగితే వారిపై చర్యలు తప్పవని కమిషనర్ ఆర్. ప్రియకుమార్ వెల్లడించారు. తిరువొత్తియూరు: రవాణా, రహదారి భద్రతా కమిషనర్ ఒక విడుదల చేశారు. మిలాద్–ఉన్–నబి వరుస వారాంతపు సెలవులను పురస్కరించుకుని ప్రజలు బయటి ప్రాంతాలకు ప్రయాణించడానికి ప్రైవేట్ ఆమ్ని బస్సులను వినియోగించుకుంటారు. ఈ సమయంలో ప్రైవేట్ ఆమ్మీ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే, దానిని అరికట్టడానికి తమిళనాడు అంతటా ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వాహనాల తనిఖీ అధికారులు, రవాణా తనిఖీ చెక్ పోస్ట్ అధికారులు కలిసి ఒక ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేశారు. అధిక చార్జీలు వసూలు చేసే ఆమ్ని బస్సులను తనిఖీ చేసి, జరిమానాలు విధించి, వాహనాలను స్వాధీనం చేసుకుని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అన్నానగర్: తూత్తుకుడి జిల్లాలోని కోవిల్పట్టి సమీపంలోని ఇలుప్పయురాని ఎన్జీఓ కాలనీకి చెందిన గణేషన్ కుమారుడు మారిచెల్వం (31). ఇతను కోవిల్పట్టి రైల్వేస్టేషన్లోని ఆటోస్టాండ్లో ఆటో నడుపుతూ ఉండేవాడు. శుక్రవారం ఉదయం, షణ్ముగనగర్ శ్మశానవాటికలో ఆటోడ్రైవర్ మారిచెల్వం రక్తపు గాయాలతో హత్యకు గురయ్యాడు. అతని ఆటో కొద్ది దూరంలో ఆగి ఉంది. ఇది చూసిన స్థానికులు కోవిల్పట్టి తూర్పు పోలీస్స్టేషన్కు సమా చారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మారిసెల్వం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం కోవిల్పట్టి ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. ఆటోను కోవిల్పట్టి తూర్పు పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వారసుడొచ్చాడు.. ఎవరీ ఇన్బన్?
హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై' అక్టోబర్ 1న ధియేటర్లలో విడుదల కానుంది. తమిళనాడులో ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ విడుదల చేస్తున్నట్టు ధనుష్ 'ఎక్స్'లో వెల్లడించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థను ప్రస్తుతం తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ స్థాపించారు. సినిమాల నిర్మాణం, పంపిణీ చేస్తుంటుంది రెడ్ జెయింట్ మూవీస్. అయితే తాజా ప్రకటనలో ఉదయనిధి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇన్బన్ ఉదయనిధిని (Inban Udhayanidhi) సమర్పకుడిగా అందులో పేర్కొన్నారు. రెడ్ జెయింట్ మూవీస్ కొత్త సీఈవో అతడేనని వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి గురించి ఆరా మొదలైంది.ఎవరీ ఇన్బన్?ఇన్బన్ ఉదయనిధి.. దివంగత మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే మాజీ అధినేత కరుణానిధి (Karunadhini) ముని మనవడు. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు మనవడు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కుమారుడు. చిన్న వయసులోనే రెడ్ జెయింట్ మూవీస్ సీఈవోగా బాధ్యతలు భుజానకెత్తుకున్నారు. ఉదయనిధి 2002లో కిరుతిగను వివాహం చేసుకున్నారు. వారి ఇద్దరు పిల్లలు ఇన్బన్, తన్మయ. ప్రస్తుతం ఇన్బన్ వయసు 20 ఏళ్లు.రొనాల్డో ప్రేరణతో..ఫుట్బాల్ ఆటగాడైన ఇన్బన్.. భారత ఫుట్బాల్ క్లబ్ నెరోకాతో డిఫెండర్గా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత తొలిసారిగా వెలుగులోకి వచ్చాడు. దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ప్రేరణతో అతడు ఫుట్బాట్ను సీరియస్గా తీసుకున్నాడు. రియల్ మాడ్రిడ్ టీమ్కు వీరాభిమాని అని టైమ్స్ ఇండియా వెల్లడించింది. 'రొనాల్డో ఆటలో దూకుడు, అకింతభావం అంటే నాకెంతో ఇష్టం. రియల్ మాడ్రిడ్ మిడ్ఫీల్డర్లు లూకా మోడ్రిక్, సెమిరో తమ జట్టు కోసం పడే శ్రమ నన్ను ఆకట్టుకుంది. రియల్ మాడ్రిడ్ (Real Madrid) మ్యాచ్లన్నీ చూస్తాను. వారి ప్రత్యర్థుల మ్యాచ్లను కూడా చూస్తాన'ని అతడో సందర్భంలో చెప్పాడు.ప్రేమించడానికి భయపడొద్దుసినిమా పరిశ్రమలో అడుగు పెట్టడానికి చాలా కాలం ముందే ఇన్బన్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ యువతితో తాను కలిసివున్న ఫొటోలు 2023లో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎదుర్కొన్నాడు. అయితే దీని గురించి అతడు ఎక్కడా మాట్లాడలేదు. ఇన్బన్ తల్లి కిరుతిగ ఉదయనిధి (Kiruthiga Udhayanidhi) మాత్రం ట్విటర్లో నర్మగర్భంగా స్పందించారు. 'ప్రేమించడానికి, దాన్ని వ్యక్తీకరించడానికి భయపడవద్దు. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఇది ఒక మార్గం' అంటూ ఆమె ట్వీట్ చేశారు. కొడుకును వెనుకేసుకొచ్చేలా కిరుతిగ ట్వీట్ ఉందని అప్పట్లో జనాలు అనుకున్నారు. చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంతహీరో ధనుష్ విషెష్ఇన్బన్ తండ్రి ఉదయనిధి 2012లో 'ఒరు కల్ ఒరు కన్నడి' సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో తన కుమారుడికి జెయింట్ మూవీస్ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ ఘనమైన వారసత్వాన్ని కలిగిన ఇన్బన్ ఎలా ముందుకెళతాడో చూడాలి. కాగా, కొత్త ప్రయాణం విజయవంతం కావాలని ఇన్బన్కు హీరో ధనుష్ (Hero Dhanush) శుభాకాంక్షలు తెలిపారు. రెడ్ జెయింట్ మూవీస్ ప్రస్థానంరెడ్ జెయింట్ మూవీస్ ప్రస్థానం 2008లో ప్రారంభమైంది. విజయ్- త్రిష కాంబినేషన్లో ధరణి తెరకెక్కించిన కురువి సినిమాను ప్రొడక్షన్ హౌస్ మొదట నిర్మించింది. తర్వాత ఆధవన్ (2009), మన్మధన్ అంబు (2010), 7 ఓమ్ అరివు (2011), ఒరు కల్ ఒరు కన్నాడి (2012), నీర్పరావై (2012), వణక్కం చెన్నై (2013), మనితన్ (2016), మామన్నన్ (2023) సినిమాలను నిర్మించింది. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన కాదలిక్క నేరమిల్లై, కమల్ హాసన్-మణిరత్నంల థగ్ లైఫ్ సినిమాలను ఈ ఏడాది విడుదల చేసింది. ఇడ్లీ కడై సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయబోతోంది. IdliKadai – releasing across Tamil Nadu by @RedGiantMovies_Wishing Inban Udhayanidhi the very best on his new journey! pic.twitter.com/gFUTJgbFwm— Dhanush (@dhanushkraja) September 3, 2025 -
మీట్ ది పీపుల్ పేరిట విజయ్ పర్యటన
సాక్షి, చైన్నె: ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టనున్న తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు,సినీ నటుడు విజయ్ పర్యటనకు మీట్ ది పీపుల్ అన్న పేరును ఎంపిక చేసి ఉన్నారు. తిరుచ్చి నుంచి ఈ పర్యటనకు రూట్మ్యాప్ సిద్ధం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమిళగ వెట్రికళగంతో గత ఏడాది రాజకీయాలలోకి వచ్చిన విజయ్ ఈ ఏడాది తన కార్యచరణను విస్తృతం చేసుకున్నారు. పార్టీ తరపున రెండు మహానాడులను జయప్రదం చేసుకున్నారు. గత వారంమదురైలోజరిగిన మహానాడులో ప్రజలలోకి వస్తున్నట్టు ప్రకటించారు. ప్రజా క్షేత్రం నుంచి ఇక డీఎంకే, బీజేపీలకు ప్రశ్నలను సంధించనున్నట్టు ఽ వ్యాఖ్యలు చేశారు. అలాగే తన పర్యటన భిన్నంగా ప్రజలతో మమేకం అయ్యే విధంగానే ఉంటుందని, పూర్తిగా ఇది ప్రజా పర్యటనగా మారుతుందని ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఈనెల 15 లేదా 17 తేదీలలో పర్యటనకు విజయ్ సన్నద్ధం అవుతున్నట్టు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ఈ పర్యటనకు సంబంధించి గత రెండు రోజులుగా జిల్లాల కార్యదర్శులతో విస్తృతంగా సమావేశాలు పనయూరులోని పార్టీ కార్యాలయంలో జరుగుతూ వస్తున్నాయి. ఈ మేరకు ఉత్తర తమిళనాడులోని విల్లుపురంలో తొలి మహానాడు, కొంగు మండలం కోయంబత్తూరులో బూత్ కమిటీ మహానాడు, దక్షిణ తమిళనాడులో ప్రధాన కేంద్రంగా ఉన్న మదురైలో రెండో మహానాడు విజయవంతం చేసుకున్న నేపథ్యంలో ప్రజలలోకి చొచ్చుకెళ్లే ఈ యాత్రకు మీట్ ది పీపుల్ అని నామకరణం చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తమిళనాడులో సెంట్రల్ భాగంగా ఉన్న తిరుచ్చి నుంచి ఈ యాత్ర మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. తొలి విడతగా 10 జిల్లాలో విజయ్ పర్యటనకు రూట్ మ్యాప్ను సిద్ధం చేసి ఉన్నట్టుగా చెబుతున్నారు. అలాగే, విజయ్ యాత్రకు ప్రత్యేక ప్రచార రథం సిద్ధం చేసి ఉన్నట్టు, ఒకటి రెండు రోజులలో ఇది పనయూరుకు చేరుకోబోతున్నట్టు ఓ నేత పేర్కొన్నారు.