Tamil Nadu
-
‘టీవీకే’ రోబోను చూశారా? సందడి మాములుగా లేదుగా!
చెన్నై: కోయంబత్తూరులో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. రోబోతో ఓట్ల వేట మొదలుపెట్టింది. టీవీకే కండువా ధరించిన ఒక రోబోను రంగంలోకి దించారు. సౌత్ చెన్నై అభ్యర్థి సెంథిల్ కుమార్కు మద్దతుగా రోబో ప్రజలకు అభివాదం చేస్తూ.. వారితో కరచాలనం చేస్తూ సందడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత విజయ్ క్షేత్రస్థాయి ప్రచారంలో తక్కువగా పాల్గొంటుండటంతో అభ్యర్థులు వినూత్న పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు తిరువెరుంబూర్లో అభ్యర్థి విజయ్ కార్డ్బోర్డ్ కటౌట్ను ఉపయోగించారు. కుంభకోణంలో హోలోగ్రామ్ ఏఐ సాంకేతికతతో ప్రచారం నిర్వహించారు. కొలత్తూరులో విజయ్ పోలికలతో ఉన్న వ్యక్తితో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కోయంబత్తూరు సౌత్లో ఇప్పుడు రోబో ప్రచారం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి విజయ్ కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే పర్యటించడంతో విపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.ఈ విమర్శలపై విజయ్ స్పందిస్తూ.. పోలీసులు, కొందరు అధికారులు చివరి నిమిషంలో టీవీకే కార్యక్రమాలకు అనుమతులు నిరాకరిస్తున్నారంటూ ఆరోపించారు. కేవలం సంప్రదాయ ప్రచార పద్ధతులపైనే తాము ఆధారపడలేదని, ఇప్పటికే తమిళనాడులోని ప్రతి ఇంటిలోనూ సానుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా.. నేటితో(ఏప్రిల్ 21, మంగళవారం) ప్రచార గడువు ముగియనుంది.ఈ చివరి రోజున విజయ్ సౌత్ చెన్నైలో రోడ్షో నిర్వహించడంతో పాటు చెన్నైలోని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పోలింగ్ ఏప్రిల్ 23 (గురువారం) ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరగనుంది. ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సంగీత కచేరీలు, థియేటర్ ప్రదర్శనలు లేదా ఇతర వినోద కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయకూడదన్నారు. ఎన్నికల అంశాలను టీవీలు, సినిమాలు, ఎఫ్.ఎమ్. రేడియోలు, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్(ట్విట్టర్) వంటి ఏ మాధ్యమం ద్వారా కూడా ప్రసారం చేయకూడదన్నారు. ఎల్రక్టానిక్ రూపంలో వచ్చే సంక్షిప్త సందేశాల, ఇంటర్నెట్ ప్రచారాలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. गजब,अभिनेता विजय चुनाव प्रचार में एडवांस टेक्नोलॉजी का बखूबी इस्तेमाल कर रहे है....अब चुनाव प्रचार में रोबोट को उतार दिया है....यह शायद भारत में संभवत पहला चुनाव होगा, जिसमें रोबोट वोट मांग रहा है....कोयंबटूर साउथ सीट में यह रोबोट विजय की पार्टी के लिए कैंपेन कर रहा है... pic.twitter.com/UmSmlk1Vh9— Dinesh Dangi (@dineshdangi84) April 20, 2026 -
ఐటీతో నిర్బంధం
సాక్షి, చైన్నె : ఆదాయ పన్ను శాఖ ద్వారా తనను ప్రచారంలోకి వెళ్లనివ్వకుండా నిర్బంధించారని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు సెల్వ పెరుంతగై నివాసం, ఆయన బంధువుల ఇళ్లపై జరిగిన ఆదాయపు పన్ను శాఖ విస్తృత దాడులలో నిమగ్నమైంది. ఈ దాడుల రూపంలో తనను ప్రచారంలోకి వెళ్లనివ్వకుండా నిర్భంధంలో ఉంచారని వెలుపలకు వచ్చిన సెల్వ పెరుంతొగై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. మమ్మల్ని అణచివేయలేరు శ్రీపెరంబుదూర్ లోని తన నివాసంతో పాటు స్నేహితులు, బంధువుల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేయడాన్ని సెల్వపెరుంతగై తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచార చివరి దశలో తనను కట్టడి చేసేందుకే కేంద్రం ఈ కుట్రకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటనకు వస్తున్నారని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకు స్వాగతం పలికి, పలు బహిరంగ సభలకు (కులచల్, నాంగునేరి తదితర ప్రాంతాలకు) తనే స్వయంగా తీసుకెళ్లాల్సి ఉందని వివరించారు. అయితే, తాను రాహుల్ గాంధీని కలవకుండా ఉండేలా, విమానాలన్నీ వెళ్లిపోయే వరకు ఇంట్లోనే నిర్భందించి ఆ తర్వాత అధికారులు వెనుతిరిగారని ఆరోపించారు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను భయపెట్టి, ప్రచారం చేయకుండా గృహనిర్బంధం చేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. మమ్మల్ని ఎంతగా అణచివేయాలని చూస్తే, అంత బలంగా తిరిగి లేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని . బీజేపీ అండతో ఉన్న అన్నాడీఎంకే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు‘ అని ఆయన ఆరోపించారు. దాడులకు వచ్చిన అధికారుల్లో కనీసం ఒక్కరు కూడా తమిళం మాట్లాడేవారు లేరని, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన అరాచకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీ కార్యాలయంలో సోదాలు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంకు శివగంగ జిల్లా కారైక్కుడిలో కార్యాలయం ఉంది. ఇక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోమవారం ఉదయం హఠాత్తుగా సోదాలు చేశారు. ఈ సోదాలలో రూ. 13 లక్షలు నగదు పట్టుబడినట్టు సమాచారం. ఈ నగదును అధికారులు లెక్క పెడుతున్న సమయంలో మోటారు సైకిళ్లపై వచ్చి కొందరు బలవంతంగా లాక్కెల్లినట్టుగా వార్తలు రావడం కొత్త చర్చకు దారి తీసింది.సీఎం స్టాలిన్ ఖండన సెల్వపెరుంతొగైను టార్గెట్ చేసిన ఐటీ అధికారులు వ్యవహరించిన దూకుడును సీఎం ఎం.కే. స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా కొన్ని గంటల సమయం కూడా లేని తరుణంలో, ప్రతిపక్షాలను ముట్టడించి భయపెట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. ఓటమి భయంతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకానికి తమిళనాడు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు‘ అని స్టాలిన్ తన ఎక్స్పేజి ద్వారా హెచ్చరించారు.అయితే, ఆదాయ పన్ను శాఖ అధికారులు తాము ఆయన ఇంట్లో సోదాలు చేయలేదని వాదిస్తుండటం బట్టి చూస్తే, వచ్చి వెళ్లిన వారెవ్వరో అన్న చర్చ జోరందుకుంది. -
డీఎంకేకు బుద్ధి చెప్పాలి
– బీజేపీ నేత అన్నామలై తిరువళ్లూరు: మహిళా బిల్లును అడ్డుకున్న డీఎంకేకు మహిళలే బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర మాజీ అద్యక్షుడు అన్నామలై పిలుపు నిచ్చారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అశ్విన్ అలియాస్ రాజసింహా మహేంద్రకు మద్దతుగా అన్నామలై సోమవారం ఉదయం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, అన్నాడీఎంకేతో సహా కూటమి నేతలు సమన్వయంతో పని చేసి ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఆవడిలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తరువాత మంత్రి అయినా కూడా ఆవడి అబివృద్ధి ముందుకు సాగించడం లేదని వాపోయారు. మంత్రిగా ఆవడి నాజర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత పాడిపరిశ్రమతో సహా అన్ని శాఖలను అవినీతిమ యం చేశారని ఆరోపించారు. ఆమ్స్ట్రాంగ్ హత్యకేసు లో కీలక నిందితుడు అరుల్, అన్నావర్శిటీలో విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడిన నేరస్తులకు డీఎంకే కార్యాలయం, నాజర్ ఆశ్రయం ఇచ్చారన్నారు. అలాంటి వ్యక్తులను మళ్లీ గెలింపించవద్దని ఆయన పిలుపు నిచ్చారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ఆవడి నియోజకవర్గ అబివృద్ధి కోసం ఒక్క ప్రశ్న కూడా లేవనెత్తని ఒకే శాసనసభ్యుడు నాజర్ అని, అలాంటి వ్యక్తిని ఓడించాలని ఆయన పిలుపు నిచ్చారు. ఆవడిలో బీజేపీ విజయం సాధిస్తే రోడ్డు, సబ్వే మురికి కాలువలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా పోలీసులు, ఎయిర్హోస్టెస్ను సైతం లైంగికంగా వేధించడం ద్వారా తమిళనాడుకు రావాలన్న వారిలో అభద్రతాభావం నెలకొందని ఆరోపించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో 20 వేల హత్యలు, 39 వేలకు పైగా లైగింక వేధింపుల కేసులు నమోదయ్యాయని ఆయన గుర్తు చేశారు. డీఎంకే కూటమిలో విభేదాలు పెరిగిందని, విజయకాంత్ ఆత్మ ప్రేమలతలో ప్రవేశించి డీఎంకే హయాంలో జరుగుతున్న అక్రమాలను ఆమె నోటితోనే చెప్పించారన్నారు. బీజేపీ కూటమికి అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆస్తుల గోప్యతపై విచారణ
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ నేతల నామినేషన్ల వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. పలువురు ప్రముఖ అభ్యర్థులు తమ ఆస్తులు, కంపెనీల వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని దాఖలైన పిటిషన్లను విచారించేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ అంగీకరించింది. దర్శకుడు సుందర్.సిపై తాజాగా పిటిషన్ మధురై సెంట్రల్ నియోజకవర్గం నుండి అన్నాడీఎంకే కూటమిలో పుదియ నీతి కట్చి తరపున పోటీ చేస్తున్న ప్రముఖ దర్శకుడు సుందర్.సి తన నామినేషనన్లో సమాచారాన్ని దాచిపెట్టారని షకిలా అనే ఓటరు పిటిషన్ వేశారు. సుందర్.సి కి చెందిన టెలి మీడియా, మూవీస్, సినిమాక్స్ సంస్థలలో ఆయనకున్న వాటాలను, ఆ సంస్థల ద్వారా వస్తున్న కోట్ల రూపాయల ఆదాయాన్ని వెల్లడించలేదని పిటిషనర్ ఆరోపించారు.దీనిపై ఆదాయపు పన్ను శాఖతో విచారణ జరిపించాలని కోరారు. జాబితాలో విజయ్, ఇతర ప్రముఖులు కేవలం సుందర్.సి మాత్రమే కాకుండా, మరికొంతమంది కీలక నేతలపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. వీరిపై కూడా విచారణ జరపాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, అభ్యర్థి ఆదవ్ అర్జున, అన్నాడీఎంకే మాజీ మంత్రులు జయకుమార్, తంగమణి, విజయభాస్కర్, సి.వి. షణ్ముగం, ఆర్.బి. ఉదయకుమార్, దిండిగల్ శ్రీనివాసన్, బీజేపీ అభ్యర్థులు తమిళిసై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్ వంటి వారిపై ఇప్పటికే కోర్టుకు పిటిషన్లు చేరి ఉండటం గమనార్హం. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ. ధర్మాధికారి, న్యాయమూర్తి జి. అరుల్ మురుగన్ ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తులు, ఈ కేసులను విచారణకు స్వీకరిస్తామని ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ, ప్రధాన పార్టీల నేతలపై, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ వంటి వారిపై ఇలాంటి ఆరోపణలు రావడం రాజకీయంగా చర్చ ఊపందుకుంది. కోర్టు ఇచ్చే ఆదేశాలు అభ్యర్థుల అర్హతపై లేదా ఎన్నికల విషయంలో ఏదేని ప్రభావం చూపించేనా అన్నది వేచి చూడాల్సిందే. కాగా విజయ్ విషయంలో ఆదాయపన్ను శాఖ కోర్టుకు వివరణ సమర్పించింది. మిగిలిన కేసులకు సంబంధించి వివరణ ఇవ్వాల్సి ఉంది. -
డీఎంకే కుట్రలు చిత్తు
సాక్షి, చైన్నె: ఎడప్పాడి నియోజకవర్గంలోని జలకంఠాపురం, చెట్టిమాంగురిచ్చి, ఎడప్పాడి, కొంగణాపురం ప్రాంతాల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సుడిగాలి పర్యటన చేశారు. జలకంఠాపురంలో జరిగిన సభలో పీఎంకే నేత రాందాసుతో కలిసి ప్రసంగించారు. పార్టీలను చీల్చే కుట్ర అన్నాడీఎంకేను నిర్వీర్యం చేసేందుకు డీఎంకే ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదన్నారు. అదే విధంగా పీఎంకేను చీల్చాలని డీఎంకే చూసిందని ఆరోపించారు. అన్బుమణి రామదాస్ ఆ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టి కాపాడుకున్నారన్నారు. అన్నాడీఎంకే, పీఎంకేలను ఓడించలేరన్నారు. స్టాలిన్ పాలనపై విమర్శలు సీఎం స్టాలిన్ తన కొడుకును ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడంపైనే దృష్టి పెట్టారు తప్ప, ప్రజల సంక్షేమం ఆయనకు పట్టడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ ఎన్నికలతో డీఎంకే పాలనకు చరమగీతం పాడడం ఖాయమని, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పళణి స్వామి విన్నవించారు. పళనిస్వామి ముఖ్యమంత్రి మహిళలకు, తల్లులకు రక్షణ ఉండాలంటే ఎడప్పాడి పళనిస్వామి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, మరో రెండు వారాల్లో తమిళనాడులో కచ్చితంగా అధికార మార్పిడి జరుగుతుందని తన ప్రసంగంలో అన్బుమణి వ్యాఖ్యలు చేశారు. -
మురుగన్ క్షేత్రంలో పోటాపోటీ
తమిళులు ఎవరికీ తలొగ్గరు తమిళులు ద్రవిడ సిద్ధాంతానికి తప్పా,మరో సిద్ధాంతానికి తలొగ్గరని ఏఐసీసీ నేత రాహుల్ గాంఽధీ వ్యాఖ్యానించారు. ఎంతో బలమైన శక్తిగా ఉన్న అన్నాడీఎంకే నేత బానిసగా మారడండటం చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్యాకుమారి జిల్లాలో పర్యటించిన రాహుల్ గాంధీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, తీవ్ర విమర్శలు గుప్పించారు. వేలూరు కోట కోసం హోరాహోరీ 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలనలో బొమ్ము నాయకులు మైదాన ప్రాంతంలో నిర్మించిన వేలూరు కోట, నేటికీ భారతదేశంలోని అత్యుత్తమ కందకం కలిగిన కోటల్లో ఒకటిగా ఉంది. ఈ నగరంలో ప్రస్తుతం రాజకీయ సమరం అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. తిరుత్తణి నియోజకవర్గంలో రాజకీయ పోరు రసవత్తరంగా సాగుతోంది. నియోజకవర్గంలోని పళ్లిపట్టు, తిరుత్తణి, తిరువలంగాడు మండలంలోని తిరుత్తణి నియోజకవర్గం పరిధిలోని ఏడు గ్రామ పంచాయతీల్లో తెలుగు వారు అధిక సంఖ్యలో నివశిస్తున్నారు. వీరు అభ్యర్థుల గెలుపులో కీలకం కానున్నారు. -
ఏజెంట్లకు అలర్ట్ వార్నింగ్
● 75 వేల మందితో స్టాలిన్ టెలీకాన్ఫరెన్స్ ● అన్నానగర్ పార్కులో వాకింగ్ సాక్షి, చైన్నె: ఓటింగ్ సమయం దగ్గర పడడంతో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సోమవారం తన నివాసం నుంచి అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బూత్ ఎజెంట్లకు అలర్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఏక కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 వేల మంది డీఎంకే బూత్ ఏజెంట్లతో మాట్లాడారు. ద్రావిడ మోడల్ 2.ఓ షురూ అన్న ధీమాతో స్టాలిన్ ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఓ వైపు స్టాలిన్, మరో వైపు యువజన నేత, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, పార్టీ డిప్యూటీ ప్రధానకార్యదర్శి కనిమొళి ప్రచారంలో దూసుకెళ్తూ వస్తున్నారు. డీఎంకే కూటమి పార్టీల నేతలు సైతం సుడిగాలి పర్యటనలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మెగా కాల్ రూపంలో డీఎంకే బూత్ ఏజెంట్లకు స్టాలిన్ అలర్ట్ వార్నింగ్ ఇవ్వడం ప్రాధాన్యతకు దారి తీసింది. మధ్యాహ్నం 12 గంటలకు ’మెగాకాల్’ సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అత్యాధునిక సాంకేతికత ఆధారంగా టెలీకాన్ఫరెన్స్ ద్వారా స్టాలిన్ క్షేత్రస్థాయి బూత్ ఏజెంట్లతో సంభాషించారు. పార్టీ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున నేరుగా ఏజెంట్లతో మాట్లాడటం ఇదే తొలిసారి కావడంతో కేడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ఫోన్ కాల్ సందర్భంగా సీఎం స్టాలిన్ ముఖ్యంగా పలు అంశాలను చర్చించారు. ఆ మేరకు నియోజకవర్గాల పరిస్థితి, ప్రతి బూత్ పరిధిలో ప్రజల నాడి ఎలా ఉంది? డీఎంకే పట్ల ఓటర్ల అభిప్రాయం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఓట్ల చీలిక నివారించే దిశగా ప్రభుత్వ అనుకూల ఓట్లు ఇతర పార్టీలకు చీలిపోకుండా చూడటానికి తీసుకున్న చర్యల గురించి ఆరా తీశారు. ఎన్నికల చివరి నిమిషం పనులే గెలుపును నిర్ణయిస్తాయి అని ఆయన నొక్కి చెప్పారు. ఓటరు జాబితాను సరిచూసుకోవడం నుండి ఓటర్లను పోలింగ్ బూత్లకు రప్పించే వరకు ప్రతి అంశంపై దిశానిర్దేశం చేశారు. ఏజెంట్లకు ’అలర్ట్’ వార్నింగ్ పోలింగ్ రోజున ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్టాలిన్ ఆదేశించారు: ఓటింగ్ యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అని నిరంతరం గమనించాలని, పోలింగ్ ముగిసే వరకు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా బూత్ వద్దే ఉండాలని సూచించారు. ఎన్నికల రోజున ప్రతి నిమిషం అప్రమత్తత అవసరమని పిలుపునిచ్చారు. కాగా ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు నేరుగా బూత్ ఏజెంట్లతో స్టాలిన్ మాట్లాడటం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, ఉదయాన్నే సీఎం స్టాలిన్ అన్నానగర్ టవర్ పార్కు పరిసరాలలో వాకింగ్కు వెళ్లారు. ఈసందర్భంగా ఆయనకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. -
కౌంటింగ్ కేంద్రాల్లో తనిఖీలు
తిరువళ్లూరు: కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను మరో రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రతాప్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీకి ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఎన్నికల అనంతరం గుమ్మిడిపూండి, పొన్నేరి, తిరుత్తణి, తిరువళ్లూరు తదితర నాలుగు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను సెవ్వాపేట పాలిటెక్నిక్ కళాశాల, పూందమల్లి, అంబత్తూరు, ఆవడి, మధురవాయల్, మాధవరం, తిరువొత్తియూరు ఆరు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను వేపంబట్టులోని శ్రీరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరచి, మే 4న కౌటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కలెక్టర్ ప్రతాప్ ఏర్పాట్లును సోమవారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లను ముమ్మరంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. అనంతరం పనులపై ఆఽరా తీశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కించే ప్రాంతంలోని బాక్సులను పరిశీలించారు. అనంతరం ఈవీఎంలు భద్రపరచే కేంద్రాలతో సహా ఇతర పనులను ఆరా తీసి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ఘనంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అవార్డుల ప్రదానం
పురస్కారం ప్రదానం కొరుక్కుపేట: నాలెడ్జ్ పార్ట్నర్ అయిన వీఐటీ చైన్నె, కన్స్ట్రక్షన్ ఆకాడమీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక కన్ స్ట్రక్షన్ ఇండస్ట్రీ అవార్ుడ్స 2025 ప్రదానోత్సవం చైన్నెలోని మ్యూజిక్ ఆకాడమీ వేదికగా ఘనంగా జరిగింది. కన్స్ట్రక్షన్ అకాడమీ ఆర్గనైజర్ సిందుభాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇస్రో శాటిలైట్ సెంటర్ –బెంగళూరు మాజీ డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ మయిల్స్వామి అన్నాదురై , ప్రత్యేక అతిథులుగా వీఐటీ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జివి సెల్వం , నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మాజీ అడ్వైజర్ డాక్టర్ వి తిరుప్పుగళ్ తదితరుల జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్స్ట్రక్షన్ రంగంలో విశేష సేవలను అందిస్తున్న పలువురికి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అవార్ుడ్స–2025 లను డాక్టర్ మైయిల్ స్వామీ అన్నాదురై చేతుల మీదుగా ప్రదానం చేశారు .చైన్నె టింబర్ అండ్ ప్లేడ్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.రాజశేఖర్కి జీవితసాఫల్య పురస్కారంను అందజేశారు. అనంతరం మైల్ స్వామి అన్నాదురై మాట్లాడుతూ నిర్మాణ రంగం ప్రసుత్తం కొత్త ఒరవడిని సంతరించుకుందని అన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని వినూత్న రీతిలో నిర్మాణాలు సాగుతుండటం స్వాగతించదగినదని అన్నారు. అంతకుముందు చైన్నె టింబర్ అండ్ ప్లేడ్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.రాజశేఖర్ ప్రత్యేక ప్రసంగం చేశారు. కలప సుస్థిరత, కలపను ఎలా గుర్తించాలి..? తదితరఅంశాలపై మాట్లాడి ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా కన్స్ట్రక్షన్ అకాడమీతో వీఐటీ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ ,క్రెడాయ్, ఆర్కిటెక్ట్స్అసోసియేషన్, సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ,వివిధ నిర్మాణ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
తిరువళ్లూరు సమీపంలో వరుస చోరీలు
నగదు మాయం తిరువళ్లూరు: కడంబత్తూరు సమీపంలో వరుసగా ఒకేరోజు ఐదు నివాసాల్లో చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కావాంగొలత్తూరు గ్రామానికి చెందిన రైతు మణి(69). ఇతను వేపంబట్టులోని బంధువు వివాహానికి ఆదివారం రాత్రి వెళ్ళి సోమవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే ఇంటికి రాగానే తలుపులు పగలగొట్టి వుండడంతో పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఇంటిని పరిశీలించగా బీరువాలో వుంచిన పది సవర్ల బంగారు నగలు, కిలో వెండితో పాటు 35 వేల రూపాయల నగదు మాయమైట్టు నిర్ధారించారు. అదే ప్రాంతానికి చెందిన గుణశేఖరన్. ఇతను ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలో వుంచిన 15 సవర్ల బంగారు నగలు, కిలో వెండి 12 వేల రూపాయలు ఎత్తుకెళ్లినట్టు నిర్దారించారు. దీంతో పాటు అదే ప్రాంతానికి చెందిన శివభూషణం ఇంట్లో సైతం పది వేల నగదు, ఎనిమిది సవర్ల బంగారు నగలను, జయశంకర్కు చెందిన ఇంట్లో మూడు సవర్ల బంగారు నగలను ఎత్తుకెళ్లినట్టు నిర్ధారించారు. మొత్తానికి ఐదు ఇళ్లులో 33 సవర్ల బంగారు నగలు, నగదును ఎత్తుకెళ్లినట్టు నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి అక్కడ సేకరించిన ఆధారాల ద్వారా విచారణనూ ముమ్మరం చేశారు. -
ఉరివేసుకుని ఆత్మహత్య
అన్నానగర్: తిరువెరుంబూర్ సమీపంలోని వెంగూర్ కలైంజ్ఞర్ కాలనీ నివాసి గోవిందస్వామి కుమారుడు నందకుమార్ (26). ఇతను క్యాటరింగ్ చదువుకున్నాడు. ప్రస్తుతం, అతను ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలోని కలెక్షన్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అతను ఇంట్లోని గదిలో ఉండగా, అతని నాయనమ్మ మారియమ్మల్ అతన్ని భోజనానికి పిలిచింది. కానీ నందకుమార్ భోజనానికి రాలేదని తెలుస్తుంది. తరువాత, మధ్యాహ్నం సుమారు 2 గంటలకు, మారియమ్మల్ నందకుమార్ కోసం వెతికినప్పుడు, అతని చెప్పులు ఇంటి బయట ఉన్నాయి. వంటగదిలోపల తాళం వేసి ఉంది. ఇది చూసి, దీంతో దిగ్భ్రాంతి చెందిన ఆమె వెనుక తలుపు గుండా వెళ్లి వంటగది వెనుక తలుపును తట్టింది, కానీ తెరువలేదు. ఆమె ఏడుస్తూ, గట్టిగా అరిచింది. వెంటనే, ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపును పగులగొట్టి చూడగా నందకుమార్ వంటగదిలోని ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. ఈ విషయం గురించి తిరువెరుంబూర్ పోలీసులకు వెంటనే సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని నందకుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం పరీక్ష కోసం దువాక్కుడి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అనంతరం పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సేలం: నామక్కల్ జిల్లాలోని కొల్లిమలై జిల్లా, అరియూర్ పంచాయతీలోని దేవకై పట్టి నివాసి దేవరాజ్. అతని కుమారుడు కామేష్ (13), బనంజట్టు పట్టికి చెందిన పరమశివం వాసి అయిన అతని కుమారుడు వర్ణీష్ (13), అలందూర్ పలపాడి గ్రామానికి చెందిన సురేష్ వాసి అయిన అతని కుమారుడు హరికరణ్ (13). ఈ ముగ్గురు అబ్బాయిలు సెమ్మెట్లోని ప్రభుత్వ ఉన్నత సెకండరీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. ఇటీవల వార్షిక పరీక్షలు పూర్తయినందున పాఠశాలకు వేసవి సెలవులు ఇచ్చారు. దీని తరువాత, కామేష్, వర్ణీష్, హరికరణ్ అనే ముగ్గురు బాలురు సోమవారం అలందూర్ పలపాడి గ్రామానికి వెళ్లారు. అనంతరం, ఆ ముగ్గురు బాలురు బరైకుళి అనే ప్రదేశంలోని ఒక చెరువులో స్నానం చేశారు. ఆ తర్వాత, ఆ ముగ్గురు బాలురు చెరువులోని అత్యంత లోతైన భాగానికి వెళ్లి నీటిలో మునిగిపోయారు. వారి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు బాలురను రక్షించడానికి పరుగెత్తుకొచ్చారు. అయినప్పటికీ, ఆ ముగ్గురు బాలురు నీటిలో మునిగి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అక్కడి ప్రజల సహాయంతో ఆ ముగ్గురు బాలుర మృతదేహాలను వెలికితీసి పోస్ట్మార్టం కోసం సెమ్మేడు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనకు సంబంధించి సెంగరై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోవై రాజకీయాల్లో.. సరికొత్త మార్పు
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల అనంతరం కోయంబత్తూరు రాజకీయాల్లో సరికొత్త మార్పు రాబోతోందని నటుడు, మక్కల్ నీది మయ్యం నేత, ఎంపీ కమలహాసన్ వ్యాఖ్యానించారు. కోయంబత్తూరు జిల్లా పరిఽధిలోని పలునియోజకవర్గాలలో డీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ముందుగా కోయంబత్తూరు (కోవై) దక్షిణ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీకి మద్దతుగా కమల్ హాసన్ ఓటర్లను ఆకర్షించే దిశగా ముందుకెళ్లారు. కోయంబత్తూరుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది నా ప్రజల నియోజకవర్గం కోవై దక్షిణ నియోజకవర్గంలో తాను తిరగని వీధి లేదని, ఇక్కడి ప్రజలు తనపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిదని కమల్ అన్నారు. గతంలో ఒక్క పైసా ఖర్చు చేయకుండానే ప్రజలు తనకు ఓట్లు వేశారని, అదే ప్రేమ ఇప్పుడు సెంథిల్ బాలాజీకి కూడా లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోయంబత్తూరులో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి తన ఎంపీ నిధుల నుండి రూ. 1.12 కోట్లు కేటాయించినట్లు కమల్ వెల్లడించారు. ఇది సహాయం కాదని, తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. 15 పార్టీలను ఏకం చేయడం కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాదని, సీఎం స్టాలిన్ గొప్ప మనసుకి ఇది నిదర్శనమని కొనియాడారు. డీఎంకేను ఓడించాలని చూసే వారికి బాస్ (యజమాని) ఉత్తరాదిలో ఉన్నారంటూ బీజేపీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.కోయంబత్తూరుకు మెట్రో రైలు కావాలని కోరితే, తగినంత జనాభా లేదని సాకులు చెబుతున్నారని, అయితే, ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం మెట్రో సదుపాయాలు కల్పిస్తోందని ఆయన మండిపడ్డారు. గతంలో ఇక్కడ గెలిచిన వారు ఇప్పుడు నియోజకవర్గం మారడమే సెంథిల్ బాలాజీ విజయానికి నిదర్శనమని (సిట్టింగ్ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ను ఉద్దేశించి) వ్యాఖ్యానించారు. తమిళనాడు సత్తా ఏంటో గత లోక్సభ ఎన్నికల్లోనే చూపించామని, ఏప్రిల్ 23న మళ్లీ నిరూపిస్తాం అని కమల్ హాసన్ పిలుపునిచ్చారు. అనంతరం, ఆయన అవినాశి (ఎస్సీ) నియోజకవర్గ డీఎంకే అభ్యర్థి డాక్టర్ కోకిలమణి తరపున కూడా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పు రాబోతోందని కమల్ హాసన్ పదే పదే తన ప్రసంగంలో స్పష్టం చేయడం గమనార్హం. -
మురుగన్ క్షేత్రంలో పోటాపోటీ
తిరుత్తణి: నియోజకవర్గంలోని పళ్లిపట్టు, తిరుత్తణి, తిరువలంగాడు మండలంలోని తిరుత్తణి నియోజకవర్గం పరిధిలోని ఏడు గ్రామ పంచాయతీల్లో తెలుగు వారు అధిక సంఖ్యలో నివశిస్తున్నారు. నియోజకవర్గంలో 337 పోలింగ్ బూత్లు ఉండగా, 2.65 లక్షల ఓటర్లు వున్నారు. ప్రధానంగా నేత పరిశ్రమ, వ్యవసాయం నియోజకవర్గ ప్రజల ప్రధాన జీవనాధారంగా ఉంది. తిరుత్తణి మున్సిపాలిటీ, పళ్లిపట్టు, పొదటూరుపేట టౌన్ పంచాయతీలు తిరుత్తణి నియోజకవర్గంలో పట్టణ ప్రాంత పరిధిలో ఉన్నాయి. దాదాపు 60 వేల మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. వారిలో 20 వేల మంది కమ్మ కులస్తులు ఉన్నారు. అదే సమయంలో నేత పరిశ్రమపై ఆధారపడిన సెంగుంద మొదలియార్లు 70 వేల ఓటర్లు, వన్నిరెడ్లు 50 వేల ఓటర్లు ఉన్నారు. దీంతో పాటు దళితులు 40 వేల ఓటర్లు, యాదవులు 25 వేల ఓటర్లు ప్రధాన కులాలుగా తిరుత్తణి నియోజకవర్గంలో నివశిస్తున్నారు. గతంలో తిరుత్తణిలో డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, పీఎంకే పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు. చివరగా 2011లో అన్నాడీఎంకే కూటమిలో డీఎండీకే అభ్యర్థిగా అరుణ్సుబ్రహ్మణ్యం పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రామన్పై పైచెయ్యి సాధించి విజయం సాధించారు. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థిగా చంద్రన్, అన్నాడీఎంకే అభ్యర్థిగా హరి పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో చంద్రన్ 29 వేల మెజారిటీతో గెలుపొందారు. తిరుత్తణి నియోజకవర్గంలో వన్నియర్లు, మొదలియార్ల మధ్య పోటీ ఉండేది. చివరి ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల అభ్యర్థులుగా పోటీ చేసిన చంద్రన్, హరి ఇద్దరూ వన్నిరెడ్లు కావడంతో పార్టీలు పరంగా ఓట్లు చీలాయి. దీంతో డీఎంకే అధికారంలోకి రావాలన్న ఆశయంతో పార్టీ శ్రేణులు కలిసికట్టు పోరాటంతో చంద్రన్ను ఎమ్మెగా గెలిపించాయి. తొలిసారి గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలు భిన్నంగా ఉన్నాయి. అప్రమత్తమైన హరి పార్టీ కూటమి బలంతో పాటు కులం కార్డును ప్రయోగిస్తున్నారు.తిరుత్తణి మురుగన్ ఆలయం టీవీకే అభ్యర్థి సత్యమూర్తి నామ్ తమిళర్ అభ్యర్థి చంద్రన్ తిరుత్తణి మురుగన్ క్షేత్రంలో కులాభిమానం, భాషాభిమానం కార్డులను ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో విజయం ఎటు వైపు వస్తుందో నిర్ణయించడం సవాల్గా మారింది. ఆంఽధ్రాకు కూతవేటు దూరంలోని తిరుత్తణి నియోజకవర్గంలో తమిళం. తెలుగు ప్రజలు పాలు, నీరులా కలిసిమెలిసి నివశిస్తున్నారు. ఈ స్థితిలో విజయంపై ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
నేటి సాయంత్రం నుంచి నిబంధనలు కఠినం
– ఎన్నికల కమిషన్ ఆదేశాలు సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనున్న నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుండి ఏప్రిల్ 23 పోలింగ్ ముగిసే వరకు ’ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951’ సెక్షన్ 126 ప్రకారం కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ ప్రకటించారు. ఈ వివరాలను సోమవారం ఆమె మీడియా ద్వారా వివరించారు. ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదు. వాటిలో పాల్గొనడం కూడా నేరం అని హెచ్చరించారు. సంగీత కచేరీలు, థియేటర్ ప్రదర్శనలు లేదా ఇతర వినోద కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయకూడదన్నారు. ఎన్నికల అంశాలను టీవీలు, సినిమాలు, ఎఫ్.ఎమ్. రేడియోలు, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్(ట్విట్టర్) వంటి ఏ మాధ్యమం ద్వారా కూడా ప్రసారం చేయకూడదన్నారు. ఎలక్ట్రానిక్ రూపంలో వచ్చే సంక్షిప్త సందేశాల, ఇంటర్నెట్ ప్రచారాలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. కఠిన శిక్ష నిబంధనలను ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయని హెచ్చరించారు. నియోజకవర్గ ఓటర్లు కాని పార్టీ కార్యకర్తలు, నాయకులు సాయంత్రం 6 గంటల లోపు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించారు.కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్లలో బయటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే అంశంపై అధికారులు తనిఖీలు చేస్తారని వివరించారు. స్టార్ క్యాంపెయినర్లతో సహా అభ్యర్థులకు ప్రచారం కోసం ఇచ్చిన వాహనాల అనుమతి సాయంత్రం 6 గంటలతో రద్దవుతుందన్నారు. ఇక, పోలింగ్ రోజున అభ్యర్థి సొంత వినియోగానికి ఒక వాహనం, ఎలక్షన్ ఏజెంట్ కోసం ఒక వాహనం, కార్యకర్తల కోసం మరొక వాహనం అంటూ మొత్తం మూడింటికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడానికి లేదా తీసుకురావడానికి వాహనాలను ఉపయోగిస్తే శిక్ష తప్పదన్నారు. పార్టీ ఎన్నికల కార్యాలయాలు పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ల దూరంలో మాత్రమే తాత్కాలికంగా ఉండాలని, ఇక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉంటుందన్నారు.పోలింగ్ఏప్రిల్ 23 (గురువారం) ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరుగుతుందన్నారు. తమిళనాడులో శాంతియుతమైన , పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ కోసం ప్రజలు, రాజకీయ పార్టీలు నిబంధనలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
అన్బుమణి ప్రచారంలో విద్యారాణి టెన్షన్
సాక్షి, చైన్నె: మెట్టూరు సమీపంలోని మేచేరి బస్టాండ్ వద్ద అన్నాడీఎంకే అభ్యర్థి వెంకటాచలం తరపున పీఎంకే నేత అన్బుమణి ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో నామ్ తమిళర్ పార్టీ అభ్యర్థి విద్యా రాణి (స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె) తన మద్దతుదారులతో జెండాలు పట్టుకుని అన్బుమణి ప్రసంగిస్తున్న వేదిక వైపు దూసుకెళ్లడం ఉత్కంఠకు దారి తీసింది. అన్బుమణి ఆగ్రహం: విద్యా రాణి తనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అన్బుమణి రామదాస్ స్పందిస్తూ.. ‘ఇక్కడ నాటకాలు ఆడవద్దు‘ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. వెంటనే పోలీసులను పిలిచి వారిని పంపించివేయాలని కోరారు. పోలీసుల జోక్యం: భద్రతా సిబ్బంది విద్యా రాణిని వారించినప్పటికీ, ఆమె అక్కడి నుండి వెళ్లేందుకు నిరాకరించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఆమెను, ఆమె మద్దతుదారులను బలవంతంగా అక్కడి నుండి తరలించారు. రోడ్డుపై బైఠాయింపు: పోలీసుల చర్యతో కన్నీరు పెట్టుకున్న విద్యారాణి, తన మద్దతుదారులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. తనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో వాదించారు. అనంతరం పోలీసులు ఆమెను, మరో 20 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మీడియాతో విద్యా రాణి మాట్లాడుతూ ద్విచక్ర వాహన ర్యాలీ కోసం ముందస్తు అనుమతి తీసుకున్నాం. కానీ అన్బుమణి ప్రచారానికి అడ్డుకున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దర్యాప్తు ముమ్మరం
25 మంది కార్మికుల ప్రాణాలను బలిగొన్న భారీ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించడమే కాకుండా, వ్యవహారం కోర్టుకు చేరడంతో అధికారులు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి సంస మేనేజింగ్ డైరెక్టర్ గోవింద రావును ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు. విరుదునగర్ చేరుకున్న చేరుకున్న గోవిందరావు సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని స్వయంగా సందర్శించారు. పేలుడు ఎలా సంభవించింది? అక్కడ భద్రతా నిబంధనలు పాటించారా? లేదా? అనే కోణంలో ప్రాథమిక విచారణ చేపట్టారు. అనంతరం విరుదునగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుగపుత్ర సమక్షంలో బాణసంచా తయారీదారుల సంఘం ప్రతినిధులతో ప్రత్యేక అధికారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.సాక్షి, చైన్నె: విరుదునగర్ జిల్లా కట్టనార్పట్టిలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీ పేలుడులో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న మరో ఇద్దరు మహిళలు సోమవారం మరణించారు. వీరిద్దరినీ సేర్వైకారన్ పట్టికి చెందిన పేచ్చియమ్మాల్ (51), తిరుత్తంగల్కు చెందిన పంచవర్ణం (56)గా గుర్తించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ భారీ పేలుడులో రాత్రి వరకు 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారణ అయ్యింది. తాజాగా ఈ ఇద్దరి మరణంతో మొత్తం మృతుల సంఖ్య 25కు చేరింది. మరణించిన వారిలో ఇప్పటివరకు 21 మందిని గుర్తించగా, మిగిలిన 4 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఈ ఘోర ప్రమాదంతో విరుదునగర్ పరిసర గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. బాధితులను ఆదుకోవాలని ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలను పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విరుదునగర్ ఆస్పత్రి వద్ద మంత్రులు తంగం తెన్నరసు, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ తదితరులు తిష్ట వేశారు. అధికారులతో సంప్రదింపు జరుపుతూ, మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం బాధితులకు అప్పగించే దిశగా ముందుకెళ్లారు. కోర్టుకు వ్యవహారం.. విరుదునగర్ సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విచారణ చేపట్టింది. ఈ ప్రమాదాన్ని కోర్టు సుమోటోగా స్వీకరించి విచారించాలని న్యాయవాది కరుణానిధి కోరారు. న్యాయమూర్తులు సతీష్కుమార్, జ్యోతిరామన్ ధర్మాసనం ముందు ఉదయం ఈ అభ్యర్థన వచ్చింది. ఎన్నికల సమయం కావడంతో అధికారులు, నేతలు ఎవరూ ప్రమాద స్థలాన్ని సందర్శించడం లేదని, బాధితులకు సరైన పరిహారం కూడా ఇంకా అందలేదని న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు,‘ఇప్పటికే ఈ అంశంపై ఒక కేసు నమోదైందని, ప్రభుత్వం కూడా నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. బాధితులకు పరిహారం అందించడంలో జాప్యం ఎందుకు జరుగుతోంది?అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన, ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు బదిలీ కావడంతో వివరణ ఇవ్వడానికి సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. నిని అంగీకరించిన న్యాయమూర్తులు, పరిహారం చెల్లింపుపై పూర్తి వివరాలతో మంగళవారం నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కఠిన చర్యలు అవసరం సాత్తూరు, శివకాశి ప్రాంతాల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడం దురదృష్టకరమని, వీటిని అరికట్టడానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ అండదండలతో కొందరు నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. ఏ పార్టీ వారైనా సరే, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు ప్రస్తుతం ఇచ్చే పరిహారాన్ని మరింత పెంచాలని ఆయన కోరారు. అలాగే ఫ్యాక్టరీ యజమానులు , కార్మికులు ఇద్దరూ అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. కట్టనార్పట్టి పేలుడు ఘటనతో మిన్నంటిన రోదనలు కార్మికులకు శిక్షణ తప్పనిసరి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు బాణసంచా కార్మికులకు వృత్తిపరమైన శిక్షణ తప్పనిసరిగా ఇవ్వాలని, పరిశ్రమ నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. మృతుల కుటుంబ సభ్యులతో కూడా గోవింద రావు చర్చలు జరిపారు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పరిహారం ప్రక్రియలో కొన్ని సాంకేతిక అంశాలు ఉన్నాయని, అయితే వీలైనంత త్వరగా బాధితులకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
క్లుప్తంగా
వేలూరు: రాజకీయాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే టీఎన్ 2026 చిత్రం విడుద ల చేసినట్లు సినీ డైరెక్టర్, నటుడు తంబి రామ య్య అన్నారు. వేలూరులోని విష్ణు సినిమా థియేటర్లో ఈ సినిమాను ఆ సినీ బృందం పాఠకులతో కలిసి సినిమాను తిలకించారు. అనంతరం ఆ బృందం విలేకరులతో మాట్లాడుతూ ఈ సినిమాను కుటుంబమంతా కలిసి చూసే విధంగా ఈ సినిమా కామెడి ఎంటర్టైనర్గా ఉందన్నారు. ఈ సినిమాలో తాము ఎవరినీ ఉద్దేశించి వ్యక్తిగతంగాను నొప్పించడానికి సినిమా తీయలేదన్నారు. ఈ చిత్రంలో కేవలం ప్రజలను అలరించడానికి మాత్రమే రూపొందించడం జరిగిందన్నారు. అనంతరం ప్రేక్షకులకు పలు సంక్షేమ పథకాలతో పాటు పంచె చీరలను పంచి పెట్టారు. కార్యక్రమంలో టీఎన్ 2026 సినీ దర్శకుడు ఉమాపతి, నటుడు నటరాజన్, సినీ బృందం పాల్గొన్నారు. సాక్షి, చైన్నె: చైన్నెలోని ఇండియన్ స్క్వాష్ అకాడమీలో గత ఐదు రోజులుగా ఉత్కంఠభరితంగా సాగిన హెచ్సీఎల్ స్క్వాష్ టూర్ సోమవారం ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 16 నుండి 20 వరకు జరిగిన ఈ టోర్నీలో ఏడు దేశాల నుండి 48 మంది క్రీడాకారులు తలపడ్డారు. పురుషులు, మహిళల విభాగాల్లో తలా 6,000 అమెరికన్ డాలర్ల ప్రైజ్మనీ కోసం జరిగిన పోటీల్లో అత్యున్నత స్థాయి క్రీడానైపుణ్యాన్ని క్రీడాకారులు ప్రదర్శించారు. పురుషుల విభాగంలో భారత్కు చెందిన సూరజ్ కుమార్ చంద్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియాకు చెందిన జెయోంగ్మిన్ ర్యూను ఓడించి టైటిల్ కై వసం చేసుకున్నారు. మహిళల విభాగంలో ఈజిప్ట్ క్రీడాకారిణి రౌకై యా ఒత్మాన్ తన దూకుడైన ఆటతీరుతో మలేషియాకు చెందిన హర్లీన్ టానన్పై విజయం సాధించి ఛాంపియన్గా నిలిచారు. ఈ టోర్నీ ముగింపు సందర్భంగా హెచ్సీఎల్ గ్రూప్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ సుందర్ మహాలింగం ,స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ సైరస్ పొంచాలు విజేతలకు ట్రోఫీ, నగదు బహుమతి అందజేశారు. కొరుక్కుపేట: వజ్రాభరణాల విక్రయంలో దక్షిణాదిలో పేరుగాంచిన లలితా జువెలరీ మార్ట్ తన 63వ షోరూంను సోమవారం చైన్నెలో ప్రారంభించింది.చైన్నె టి.నగర్ ఉస్మాన్ రోడ్డు పనగల్ పార్కు వద్ద వున్న ప్రధాన షోరూమ్ పక్కనే రెండో నూతన షోరూమ్ను ఆ సంస్థ అధినేత డాక్టర్ ఎం. కిరణ్ కుమార్ దంపతులు జ్యోతిప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం. కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. తను ఆభరణాల విక్రయవేత్తగా తను ఎక్కడ జీవితం ప్రారంభించానో , దాని పక్కనే మరో కొత్త షోరూం ప్రారంభించడం ఆనందంగా వుందన్నారు. ప్రత్యేకించి అక్షయతృతీయ రోజున ఈ కొత్త లలితా జువెలరీ షోరూమ్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకుని వచ్చినట్టు తెలిపారు. షోరూం ప్రారంభోత్సవం, అక్షయ తృతీయ సందర్భంగా లలిత జువెలరీ అన్ని బంగారు ఆభరణాలపై విలువ జోడింపు చార్జీలలో 1 శాతం తక్కువ ప్రత్యేక ఆఫర్ను అందిస్తోందన్నారు. -
పసిడి పండుగ
సాక్షి, చైన్నె: అక్షయ తృతీయ సందర్భంగా సోమవారం బంగారం కొనుగోళ్లు జోరుగా జరిగాయి. ఎన్నికల తనిఖీలు ఓ వైపు సాగినా, మరో వైపు బంగారం వర్తకులకు కాసుల వర్షం కురిపించింది. జనం తరలి రావడంతో జ్యువలరీస్ కిక్కిరిశాయి.ఇక, ఆలయాలలో పూజలు, వివాహ వేడుకలు సందడి సందడిగా జరిగాయి. వివరాలు.. ప్రజల్లో బంగారం (పసిడి)పై మోజు నానాటికీ పెరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం అక్షయ తృతీయ గడియ రోజు కావడం జనం దృష్టి బంగారం కొనుగోళ్ల మీద మరింతగా పడింది. అక్షయ తృతీయ పర్వదినాన కనీసం ఒక్క గ్రాము బంగారమైనా కొనుగోలు చేసి తీరాలన్న కాంక్షతో జనం జ్యువలరీస్ వైపుగా ఉదయాన్నే ఉరకలు తీశారు. ఈ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి తమ నట్టింట్లో అడుగు పెట్టినట్టేనని ప్రజలలో నమ్మకం పెరగడంతో అక్షయ తృతీయ రోజు బంగారు విక్రయదారులకు పండుగే అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. ముఖ్యమైన రోజు కావడంతో జనం ఉదయం నుంచి బంగారు దుకాణాల బాట పట్టారు. ముందుగా ఆలయాలలో, ఇళ్లల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆయా షోరూంల వైపుగా జనం తరలి రావడంతో, ప్రత్యేక డిజైన్లతో, సరికొత్త, ఆకర్షణీయమైన కలెక్షన్లను బంగారు నగలను, ప్లాటినం ఆభరణాల్ని, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి చిత్రాలతో బంగారం, వెండి కాయిన్స్, డాలర్లను కొలువు దీర్చారు. అలాగే అనేక షోరూంలు ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో జనం పోటెత్తారు. చైన్నెతో పాటుగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలలోని బంగారం దుకాణాల్లో వ్యాపారం జోరుగానే జరిగింది. ప్రజలు బంగారం కొనుళ్లకే కాదు, ఆలయాలలో పూజలకు సైతం జనం ప్రాధాన్యతను ఇచ్చారు. అక్షయ తృతీయను ఎంతో అదృష్టం కలిసొచ్చే శుభదినం, విజయసూచకంగా భావించే ప్రజలు ఉదయాన్నే ఇంటిళ్లి పాది ఆలయాలకు వెళ్లి దేవుళ్లను దర్శించుకున్నారు. అనేక ఆలయాలలో కొత్తజంటల వివాహ సందడి మిన్నంటింది. ఇక, భూములు, గృహాల కొనుగోలు రిజిస్ట్రేషన్లు సైతం జోరుగానే జరిగాయి. -
తమిళులు ఎవరికీ తలొగ్గరు..!
బాధ కలుగుతోందని వ్యాఖ్య సాక్షి,చైన్నె: తమిళులు ద్రవిడ సిద్ధాంతానికి తప్పా,మరో సిద్ధాంతానికి తలొగ్గరని ఏఐసీసీ నేత రాహుల్ గాంఽధీ వ్యాఖ్యానించారు. ఎంతో బలమైన శక్తిగా ఉన్న అన్నాడీఎంకే నేత బానిసగా మారడండటం చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్యాకుమారి జిల్లాలో ఉదయం పర్యటించిన రాహుల్ గాంధీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, రాష్ట్రంలోని అన్నాడీఎంకే తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే, తూత్తుకుడి జిల్లా శ్రీ వైకుంఠం, తిరునల్వేలి నాంగునేరిలలో సాయంత్రం జరిగిన సభలోనూ ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యల తూటాలను పేల్చారు. బీజేపీ ఒకే దేశం, ఒకే భాష, ఒకే చరిత్ర నినాదంతో ముందుకెళ్తోందన్నారు. తమిళ భాషకు సుదీర్ఘమైన చరిత్ర ఉందన్నారు. ఢిల్లీ నుండి తమిళనాడును పాలించాలని వారు కలలు కంటున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే – బీజేపీకి ఒక సాధనం తమిళనాడులో ఒకప్పుడు బలంగా ఉన్న అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు బానిసగామారి ఉందన్నారు.ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితిని చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. తమిళనాడు అభివృద్ధిలో గతంలో కీలక పాత్ర పోషించిన అన్నాడీఎంకేను ఇప్పుడు బీజేపీ చేజిక్కించుకుందన్నారు. ఆ పార్టీ నేతలు అవినీతిలో కూరుకుపోయి ప్రధాని మోదీకి లొంగిపోయారని పేర్కొన్నారు.. బీజేపీ తమిళనాడులోకి ప్రవేశించడానికి అన్నాడీఎంకే ఒక సాధనంలా ఉపయోగపడుతోందని ఆయన ఆరోపించారు. ద్రవిడ సిద్ధాంతాన్ని అసహ్యించుకునే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను తమిళులు ఎన్నటికీ అంగీకరించరని, వారికి లొంగిపోరని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే 10 ఏళ్లు ఆగాల్సిన అవసరం లేదని, తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికలు కేవలం అధికారం కోసం కాదని, తమిళనాడు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటమని ఆయన ఉద్ఘాటించారు. బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సమరం అని వ్యాఖ్యలు చేశారు. -
తమిళనాడులో మళ్లీ డీఎంకే ప్రభుత్వమే!
– అరవింద్ కేజ్రీవాల్ ధీమా సాక్షి, చైన్నె: డీఎంకే కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చైన్నెకు వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, తమిళనాడులో మళ్లీ స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధికి పట్టం: గత ఐదేళ్ల డీఎంకే పాలనలో తమిళనాడు అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధించిందన్నారు. తన మిత్రుడు స్టాలిన్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో స్టాలిన్ భారీ మెజారిటీతో విజయం సాధించి, మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు‘ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. అయితే, స్టాలిన్ అందుకు లొంగకపోవడం వల్లే బీజేపీ ఆయనను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. స్టాలిన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల తమిళనాడు దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుతోందని ఆయన కొనియాడారు. స్టాలిన్ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకమే ఈ ఎన్నికల్లో డీఎంకేను మళ్లీ గెలిపిస్తుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఒకే దేశం..ఒకే సంస్కృతి బీజేపీ అజెండా..! – తమిళనాడు ప్రచారంలో రాహుల్ గాంధీ సాక్షి,చైన్నె : తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్యాకుమారి తూత్తుకుడి జిల్లాలోని డీఎంకే, కాంగ్రెస్ కూటమి, అభ్యర్థులకు మద్దతుగా సోమవారం రెండు చోట్ల ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తమిళనాడులోని అన్నాడీఎంకే తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల భాషలు, సంస్కృతులు, చరిత్ర సమానంగా గౌరవించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని రాహుల్ తెలిపారు. అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మాత్రం ఒకే దేశం, ఒకే భాష, ఒకే చరిత్ర ఉండాలని కోరుకుంటున్నాయని మండిపడ్డారు. తమిళ భాషకు సుదీర్ఘమైన చరిత్ర ఉందన్నారు. ఢిల్లీ నుండి తమిళనాడును పాలించాలని బీజేపీ కంటున్న కలలు నెరవేరబోవమన్నారు. తమిళనాడులో ఒకప్పుడు బలంగా ఉన్న అన్నాడీఎంకేను తాజాగా కేసుల పేరిట లొంగ దీసుకుని, వారి ద్వారా తమిళనాడులోకి చొరబడే వ్యూహంతో బీజేపీ ఉందని, తమిళులు ఎన్నడూ ఇతరులకు తల వంచే ప్రసక్తే లేదని వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను తమిళులు ఎన్నటికీ అంగీకరించరని స్పష్టంచేశారు. మణిపూర్లో జరుగుతున్న అంతర్గత పోరును ప్రస్తావిస్తూ, బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పళనిస్వామికి రజనీ అభిమానుల మద్దతు సాక్షి, చైన్నె:అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామిని సోమవారం సేలం నివాసంలో రజనీకాంత్ అభిమాన సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సేలం జిల్లా రజనీ అభిమాన సంఘం కార్యదర్శి పారప్పట్టి కనకరాజ్ నాయకత్వంలో సుమారు 500 మందికి పైగా రజనీ అభిమానులు ఎడప్పాడి పళనిస్వామిని కలిశారు. ఎన్నికల బరిలో ఉన్న అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీకి మద్దతు ప్రకటించిన రజనీ అభిమానులకు పళనిస్వామి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో, రజనీకాంత్ అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకేకు మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది. -
వైభవంగా మహా కుంభాభిషేకం
వేలూరు: రాణిపేట జిల్లా వాలాజ సమీపంలోని సువర్ణపేట గ్రామంలో వెలిసిన శ్రీ భసవేశ్వరర్, లింగేశ్వరర్, వినాయకుడు, పెరుమాల్ దైవాలతో కొలువైన పురాతన ఆలయంలో 12 సంవత్సరాల అనంతరం నూతనంగా పునరుద్ధరించి అష్ట బందన మహా కుంబాభిషేకం అతి వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక యాగ గుండాలు ఏర్పాటు చేసి మొదటి కాల యాగ పూజలు జరిగింది. అనంతరం విఘ్నేశ్వర పూజ, గణపతి హోమం, లక్ష్మిహోమం, ధన నవగ్రహ హోమం, వాస్తు శాంతి హోమంతో పాటు నాల్గవ కాల యాగ పూజలను శివాచార్యుల వేద మంత్రాల నడుమ నిర్వహించారు. అనంతరం ఉదయం ఆలయంలో గో పూజ, గజ పూజ, నాడి సందానం, పవిత్ర అగ్నిపూజ, ప్రధాన హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం వివిధ పుణిద నదుల నుంచి తీసుకొచ్చిన పుణిద నీటిని కళశాల్లో ఉంచి ప్రత్యేక యాగ పూజలు నిర్వహించి మేళ తాళాల నడుమ శివాచార్యులు, గ్రామస్తులు కళశ నీటిని ఊరేగింగా తీసుకెళ్లి ఆలయ రాజ గోపురంపైకి వెళ్లి కలశ నీటిని పోసం కుంబాభిషేకాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. -
వేలూరు కోట కోసం హోరాహోరీ
దీర్ఘకాలిక డిమాండ్లు వేలూరు: 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలనలో బొమ్ము నాయకులు మైదాన ప్రాంతంలో నిర్మించబడిన వేలూరు కోట, నేటికీ భారతదేశంలోని అత్యుత్తమ కందకం కలిగిన కోటలలో ఒకటిగా నిలిచి ఉంది. ఈ నగరం బ్రిటిష్ కాలం నాటి చారిత్రక ఆనవాళ్లను తనలో ఇముడ్చుకుంది. వీటిలో 1806లో కోట లోపలే జరిగిన మొదటి భారత స్వాతంత్య్ర సంగ్రామం(వేలూరు తిరుగుబాటు) జరిగిన ప్రదేశం. శతాబ్ధాల చరిత్ర కలిగిన, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎంసీ ఆసుపత్రి, వంద సంవత్సరాలకు పైగా నిలిచి ఉన్న మార్కెట్, మొదటి ప్రపంచ యుద్ధంలో సేవలందించిన వేలూరు సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన గడియారం స్తంభం కోట ప్రాంగణంలో ఉన్న 150 ఏళ్ల నాటి సెయింట్ జాన్స్ చర్చి, 125 ఏళ్ల నాటి ఊరీస్ కళాశాల, రాణి విక్టోరియా పాలన 50వ వార్షికోత్సవం సందర్భంగా వేలూరులో నిర్మించిన విక్టోరియా స్మారక స్తంభం వంటివి ఉన్నాయి. చైన్నె, బెంగళూరు మహానగరాల మధ్య నెలకొని, వేలూరు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా వెలుగొందుతోంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేలు 1952 నుండి శాసనసభ ఎన్నికలలో పాల్గొంటూ వస్తున్న వేలూరు, ప్రస్తుతం తన 17వ ఎన్నికను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు, కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, డీఎంకే 8 సార్లు, అన్నాడీఎంకే 2 సార్లు విజయం సాధించగా స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోసారి విజయాన్ని దక్కించుకున్నారు. వీఎం దేవరాజ్ 1980, 1984 మరియు 1989 ఎన్నికలలో వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. అదేవిధంగా సి.జ్ఞానశేఖరన్ 1991, 1996, 2001 మరియు 2006 ఎన్నికలలో హ్యాట్రిక్ విజయాలను సాధించారు. ఎంపీ సారథి 1957, 1967, 1971 సంవత్సరాలలో విజయాలను సాధించారు. 2026 ఎన్నికల రణరంగం ప్రస్తుత శాసనసభ ఎన్నికలలో, ప్రస్తుత ఎమ్మెల్యే డీఎంకే తరఫున కార్తీకేయన్ మూడవసారి పోటీ చేస్తుండగా, ఎస్ఆర్కే అప్పు అన్నాడీఎంకే పార్టీ తరఫున రెండవసారి పోటీ చేస్తున్నారు. టీవీకే (తమిళగ వెట్రి కజగం) తరఫున వినోద్ కన్నన్ నామ్ తమిళర్ పార్టీ అద్వర్యంలో కళాశాల విద్యార్థిని సోనియాతో సహా మొత్తం 15 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు తమ సొంత పార్టీలలోనే తీవ్రమైన అంతర్గత రాజకీయ కుట్రలను ఎదుర్కొంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం వారు హోరాహోరీగా పోరాడుతున్నారు. టీవీకే అభ్యర్థి ఓట్ల కోసం విజిల్ ఊదుతూ వార్డుల వారీగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. దీంతో డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థుల్లో ఆందోళన కలిగించింది. ఆయన ఎవరి ఓటు బ్యాంకును చీల్చుతారోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నామ్ తమిళర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కళాశాల విద్యార్థిని సోనియా చేపట్టిన ఇంటింటి ప్రచార ప్రయత్నాలు నిజంగా ప్రశంసనీయం.మొదలియార్లు, వన్నియర్లు, షెడ్యూల్డ్ కులాల వారు ప్రధాన వర్గాలుగా ఉన్నప్పటికీ, విజయం లేదా ఓటమి అనే తుది ఫలితాన్ని నిర్ణయించడంలో ముస్లిం వర్గం కీలక స్థానాన్ని కలిగి ఉంది. అన్నాడీఎంకే: ఎస్ఆర్కే అప్పు టీవీకే అభ్యర్థి వినోద్ఖన్నా డీఎంకే అభ్యర్థి పి.కార్తికేయన్ వేలూరు నియోజక వర్గ ఓటర్లు పురుషులు 103,205 మహిళలు 111,252 ఇతరులు 47 మొత్తం 214,504 -
పోటెత్తిన అభిమానం
తిరువళ్లూరు: టీవీకే అధినేత విజయ్ జిల్లాలో చేపట్టిన రోడ్డుషోకు ప్రజలు అభిమానులు బ్రహ్మఽరథం పట్టారు. ఎన్నికల ప్రచారానికి కేవలం ఒక్కరోజు వ్యవధి మాత్రమే ఉన్న క్రమంలో జిల్లాకు వీఐపీల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం తిరువళ్లూరు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల మీధుగా టీవీకే అధినేత విజయ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. చైన్నె నుంచి జిల్లాకు పూందమల్లి వద్ద ప్రవేశించిన విజయ్కు మద్దతుదారులు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కోలప్పన్చ్చేరి వద్ద తిరువళ్లూరు అభ్యర్ది డాక్టర్ అరుణ్కుమార్కు మద్దతుగా రోడ్డుషో నిర్వహించారు. అనంతరం పాలవేడుకు చేరుకుని అక్కడ పూందమల్లి అభ్యర్థి కుట్టి అలియాస్ ప్రకాష్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రకాష్కు ఓట్లు వేసి గెలిపించాలని ఒక్కమాటతో ప్రచారాన్ని ముగించారు. అనంతరం అభిమానుల కోలాహలం మద్య తన రోడ్డుషోను కొనసాగించారు. నెమలిచ్చేరికి చేరుకున్న తరువాత అక్కడ భారీగా అభిమానులు తరలివచ్చి స్వాగతం పలికారు. దీంతో పాటు చోళవరం వద్ద గుమ్మిడిపూండి అభ్యర్ది విజయకుమార్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం వండలూరు, జనపసత్రం క్రాస్రోడ్డు, నల్లూరు, కారనూడై, ఆత్తూరులోనూ అభిమానుల నడుమ రోడ్డుషో నిర్వహించారు. చైన్నెలోని విల్లివాక్కం, విరుగంబాక్కం తదితర నియోజకవర్గాలలో విజయ్ రోడ్షో నిర్వహించారు. -
అందుకే మహిళా బిల్లును ఓడించాం: రాహుల్ గాంధీ
కన్యాకుమారి: మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించిన పాపం విపక్షాలదే అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకుని అసంబద్ధంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలనుకున్న బీజేపీ పన్నాగాన్ని అడ్డుకున్నామని చెప్పారు. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి, పార్లమెంటులో ఓడించామని వెల్లడించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కన్యాకుమారిలో బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్డీఏ సర్కారు ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు.''మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయాలని కొద్ది రోజుల క్రితం పార్లమెంటులో ప్రధానమంత్రి చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో దేశ ఎన్నికల వ్యవస్థను మార్చాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లు తెచ్చారు. ఏన్డీఏ ప్రతిపాదించిన పునర్విభజనతో తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం బలహీనపడుతుంది. ఇది రాష్ట్రాల సమాఖ్యకు వ్యతిరేకంగా జరిగిన దేశద్రోహ చర్య. అందుకే మేము మహిళా బిల్లును వ్యతిరేకించి, పార్లమెంటులో ఓడించాం. దేశంలోని ఏ ప్రాంత ప్రాతినిధ్యాన్నైనా తక్కువ చేసే ప్రయత్నాలను ఎప్పటికీ ఒప్పుకోమ''ని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని లోక్సభలో మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు, చిన్న రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే కుట్రగా రాహుల్ గాంధీ వర్ణించారు. కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది అసలు మహిళా బిల్లు కానే కాదని కొట్టిపారేశారు.చదవండి: హమ్మయ్య! అమిత్ షా నవ్వారు.. రాహుల్ గాంధీ సరదా కామెంట్స్ -
విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తమిళ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ విడాకుల కేసుని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు.. సోమవారం విచారణ చేపట్టింది. ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతా విజయ్ పర్యటిస్తున్నారని, భద్రతా కారణాలు, ఇతర కార్యక్రమాల వల్ల కోర్టుకు రాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు వివరించారు. మరోవైపు సంగీత కూడా కోర్టుకు రాలేదు. ఈ క్రమంలోనే ఇరువర్గాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. కేసు విచారణని వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)గతంలోనే ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరవ్వాలని విజయ్కి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. కానీ సోమవారం.. ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టులో తాజా పిటిషన్ దాఖలు చేసి విచారణని వాయిదా వేయాలని కోరారు. ఈ క్రమంలోనే ఇరుపక్షాల అభ్యర్థన మేరకు ఈ విడాకుల కేసు విచారణని జూన్ 15వ తేదీకి వాయిదా వేశారు.27 ఏళ్లుగా వివాహ బంధంలో ఉన్న విజయ్-సంగీత.. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు ఇదివరకే తెలియజేశారు. విడాకులకు సంబంధించిన కీలక అంశాలైన భరణం, ఆస్తుల పంపకంపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్, భద్రతకు సంబంధించిన విషయాలపై స్పష్టమైన ఒప్పందానికి వచ్చారట. అయితే ఆర్థికపరమైన వివరాలు ఏవి కోర్టుకు సమర్పించిన పిటిషన్లో పొందుపరచలేదు.(ఇదీ చదవండి: నేను అడిగాను.. కానీ వాళ్లు ఛాన్స్ ఇవ్వలేదు: 'రాకా' గురించి ఆర్య) -
విజయ్.. ఇక ఆరంభిద్దామా!
తమిళనాడులో సినీ తారల రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎంజీఆర్, జయలలిత, సినీ నేపథ్యం ఉన్న కరుణానిధిలు సూపర్ సక్సెస్ అయ్యారు. శివాజీ గణేశన్, విజయకాంత్, కమల్ హాసన్ వంటి కొందరు మాత్రం ఒక స్థాయి వరకే పరిమితం అయ్యారు. రజనీ కాంత్ లాంటి బడా సూపర్ స్టార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టకుండానే వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో మరో అగ్రనటుడు విజయ్ ఎంట్రీ ‘మార్పు’ తేవొచ్చనే అంచనాలను రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయ వాతావరణానికి మళ్లీ సినిమా రంగు పులుముకుంది. అధికార పార్టీ డీఎంకే పశ్చిమ తమిళనాడు నిజయోకవర్గాల ప్రచారానికి తన మిత్రుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ను రంగంలోకి దించింది. అయితే ఇది విజయ్కు చెక్ పెట్టే వ్యూహంలో భాగమేనన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. ఆదివారం రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ కోయంబత్తూరులో డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ తరఫున ప్రచారం చేశారు. మన నియోజకవర్గం అంటూ ఉద్వేగంగా మాట్లాడిన ఆయన.. మెట్రో ప్రాజెక్టును నిరాకరించిన కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో టీవీకే అనేది అక్కడ పోటీలోనే లేదన్నట్లు కమల్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. కోయంబత్తూరు ప్రతిపక్ష అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే ఈసారి ఎలాగైనా దానిని చేజక్కించుకునేందుకు కమల్ను ముందు ఉంచింది. కమల్కు ఈ నియోజకవర్గంతో వ్యక్తిగతంగా అలాగే రాజకీయంగానూ అనుబంధం ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తన ప్రచారంలో ఆ విషయాన్ని ప్రస్తావించిన కమల్.. బాలాజీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత తనదేనని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. తమిళనాట టీవీకే అధినేత విజయ్కి యువత, మహిళలు, జెన్జీ ఓటర్లలో విపరీతమైన ఆదరణ ఉంది. అందుకు తగ్గట్లే.. హోలోగ్రామ్లు, కటౌట్లు, సోషల్ మీడియా ద్వారా ఆయన తన ప్రచారాన్ని విస్తృతస్థాయిలో ఉధృతం చేశారు. పైకి పట్టనట్లే కనిపిస్తున్నప్పటికీ.. విజయ్ ప్రచారాన్ని డీఎంకే సీరియస్గానే తీసుకుంది. విజయ్ ఈ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం, త్రిచీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్లో డీంఎకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య ప్రధాన పోటీ ఉంది. త్రిచీ ఈస్ట్ డీఎంకేకు బలమైన స్థానమే అయినా టీవీకే ఎంట్రీతో పోటీ ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో.. కమల్ను ‘స్టార్’ క్యాంపెయినర్గా సీన్లో ఉంచింది. కమల్ ఇప్పటికే చెపాక్–తిరువల్లిక్కేని నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కోసం ప్రచారం చేశారు. మరో 15 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం బ్యాలెన్స్ ఉంది. ఇందులో పెరంబూర్, త్రిచీ ఈస్ట్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో విజయ్ను కమల్ హాసన్ నేరుగా టార్గెట్ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. కరూర్ తొక్కిసలాట, జన నాయగన్ చిత్రానికి సెన్సార్ నిరాకరణ అంశాల్లో విజయ్కు కమల్ హాసన్ నేరుగా మద్దతు ఇచ్చారు. అయితే ఇప్పుడు డీఎంకే కోసం ఆయన దళపతిని విమర్శించాల్సిన పరిస్థితి. అదే జరిగితే.. విజయ్ కూడా లోకనాయకుడి(ఉళగ నాయగన్)పై ఎదురు దాడి చేయాల్సి వస్తుంది. అంటే.. ఇదంతా తమిళనాడులో స్టార్ల మధ్య నేరుగా రాజకీయ పోరాటాన్ని ఆసక్తికరంగా మార్చుబోతోందన్నమాట. -
విజయ్-సంగీత విడాకులు.. రూ. 250 కోట్లు అడిగారా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. టీవీకే పార్టీనీ స్థాపించి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవ్వగానే.. సతీమణి సంగీత విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని పిటిషన్లో పేర్కొంది. ఈ విడాకుల కేసు నేడు (ఏప్రిల్ 20) చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణకు రానుంది. అయితే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని.. ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరవుతానంటూ విజయ్ తన లాయర్తో పిటిషన్ దాఖలు చేయించాడు. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.ఇదిలా ఉంటే.. విజయ్-సంగీత జంట పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శనివారం చెన్నైలో ఇరువురి లాయర్లు కలిసి చర్చలు జరిపారు. విడిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని..సెటిట్మెంట్ కింద సుమారు రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరినట్లు వార్తలు వస్తున్నాయి. కుమారుడు, కుమార్తెలకు కూడా సెటిల్మెంట్ ఇవ్వాలని సంగీత కోరుతుందట. అయితే విజయ్ మాత్రం రూ.35 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే కుమారుడు, కుమార్తెల బాగోగులు తాను చూసుకుంటానని అంటున్నాడట. అయితే ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కోర్టు విచారణలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. -
15 వేల డమ్మీ చెక్లు స్వాధీనం
తిరువళ్లూరు: తాంబరం నుంచి తిరుత్తణి వైపు వెళుతున్న 15 వేల డమ్మీ చెక్కులను తనిఖీ బృందాలు ఆదివారం స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు ఏప్రల్ 23న జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో డబ్బుతోపాటు ఇతర వస్తువులతో ప్రలోభాలకు గురిచేయకుండా నిరోదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే ఆదివారం పూందమల్లి నియోజకవర్గంలోని మూలకరై వద్ద తనిఖీ బృందాలు చేస్తున్న సమయంలో మినీ గూడ్స్ లారీల్లో 15 వేల డమ్మీ చెక్కులు వుండడాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇవి తిరుత్తణి అన్నాడీఎంకే అభ్యర్థికి చెందినవిగా భావిస్తున్నారు. ఓటర్లకు పంచడానికి తీసుకెళుతున్నట్టు నిర్ధారించిన అధికారులు వాటిని సీజ్ చేసి విచారణను ముమ్మరం చేశారు. -
ధైర్యవంతురాలు.. నా స్నేహితురాలు
సాక్షి, చైన్నె : డీఎంకే కూటమి తరపున విరుదాచలంలో పోటీ చేస్తున్న డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ విజయానికి మద్దతుగా డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ నేత కనిమొళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రేమలత గురించి ఆసక్తికర వ్యాఖ్యలను కనిమొళి చేశారు. కరువేప్పిలంకురిచ్చి లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. కెప్టెన్ విజయకాంత్ ఎంత ధైర్యంగా, సామాన్య ప్రజల మనిషిగా జీవించారో, ప్రేమలత కూడా అంతే ధైర్యవంతురాలు అని వివరించారు. ఆమె తన కు చిరకాల మిత్రురాలు అని, ఇక విరుదాచలం నియోజకవర్గం సీఎం సోదరి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంగా మారుతుందన్నారు. ఇక్కడున్న అన్ని సమస్యలు, కోరికలన్నీ నెరవేర్చే స్థానంలో ఆమె ఉంటార్ఙు అని వివరించారు. బీజేపీ కూటమిని ఎందుకు వీడారంటే? ప్రేమలత బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి డీఎంకేతో చేతులు కలపడానికి గల కారణాలను కనిమొళి వివరించారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా తమిళనాడుకు అన్యాయం చేసేలా నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని జొప్పించారని ఆమె ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం చెప్పే అబద్ధాలను భరించలేకే సోదరి ప్రేమలత అక్కడి నుంచి బయటకు వచ్చారన్నారు. మహిళా బిల్లు ముసుగులో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కాలని చూస్తున్న వారికి తామంతా కలిసి సరైన బుద్ధి చెప్పామన్నారు. ఎడప్పాడిపై విమర్శలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిపై కూడా కనిమొళి విరుచుకుపడ్డారు. పళనిస్వామికి రాష్ట్ర హక్కుల కంటే తన స్వార్థమే ముఖ్యమని, ఆయన కేవలం అధికార దాహంతో ఇతరులకు బానిసగా ఉండాలని కోరుకుంటున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకేకు పరాజయం తప్పదని ఆమె జోస్యం చెప్పారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రేమలత రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారని, ఆమె నియోజకవర్గంలో ప్రచారం చేయడం తనకు సంతోషంగా ఉందని కనిమొళి వ్యాఖ్యలు చేశారు. -
సామాజిక న్యాయం కోసం మన పోరాటం
కొంగు నగరం రేసులో వీఐపీలు కొంగు మండలంలో ప్రధాన నగరంగా ఉన్న కోయంబత్తూరులో తాజాగా నాలుగు హాట్ సీట్లపై అందరి దృష్టి పడింది. ఇందులో రెండు స్థానాలలో అన్నాడీఎంకే, డీఎంకేకు చెందిన ఇద్దరు కింగ్ మేకర్లు పోటీ పడుతున్నారు. దీంతో ఎవర్నీ గెలుపు వరిస్తుందో అన్న ఉత్కంఠ తప్పడం లేదు.ఓటేసేందుకు దివ్యాంగులకు వాహన సౌకర్యం ●ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాటు చైన్నె జిల్లా ఎన్నికల అధికారి కుమారగురుబరన్ అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం ఓటింగ్ జరిగేలా చూసేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ పరిస్థితిలో, దివ్యాంగులు, వయోవృద్ధులైన ఓటర్లకు కూడా తమ ఇళ్ల నుంచే పోస్టల్ ఓట్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హోసూర్లో నిర్వహించిన శ్రీ ఇండియా కూటమి ప్రచార బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో కేంద్రాన్ని టార్గెట్ చేశారు. -
అభ్యర్థుల జాబితాతో బ్యానర్లు
సాక్షి, చైన్నె: ఎన్నికల సందర్భంగా ఓటర్లలో ఎలాంటి అయోమయం ఎదురు కాకుండా ఉండేందుకు, అన్ని పోలింగ్ కేంద్రాల ప్రవేశ ద్వారాల వద్ద అభ్యర్థుల పేర్లు, వారి క్రమసంఖ్యతో కూడిన పెద్ద పోస్టర్లను ప్రదర్శిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రకటించింది. ఇందుకు కారణం పెరంబూరులో నెలకొన్న పరిస్థితే. పెరంబూర్లో అసలు ఏం జరిగింది? చైన్నె పెరంబూర్ నియోజకవర్గం నుండి శ్రీతమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు 16వ స్థానంలో ఉంది. అయితే, గతంలో ఎన్నికల సంఘం నోటా (ఎవరికీ ఓటు వేయడం ఇష్టం లేదు) పై అవగాహన కోసం ముద్రించిన పాత కరపత్రాల్లో శ్రీనోటాశ్రీ 16వ స్థానంలో ఉంది. ఎవరో పాత కరపత్రాలను ఇప్పుడు పంపిణీ చేయడంతో, 16వ నంబరు విజయ్ దేనా లేక నోటాదా? అని ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల సంఘం వివరణ ఈ వివాదంపై ఎన్నికల అధికారులు స్పష్టతనిచ్చారు. ఒక ఈవీఎంలో కేవలం 16 బటన్లు మాత్రమే ఉంటాయని వివరించారు. . అభ్యర్థులు 15 కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే నోటా 16వ స్థానంలో ఉంటుందన్నారు. పెరంబూర్ నియోజకవర్గంలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, ఈ దృష్ట్యా ్ట అక్కడ 3 ఈవీఎంలను ఉపయోగిస్తున్నామన్నారు. నోటా అనేది మూడవ ఈవీఎంలోని చివరి బటన్ (అంటే 48వ స్థానం)లో ఉంటుంది. విజయ్ పేరు 16వ స్థానంలో ఎందుకు? అక్షర క్రమం ప్రకారం విజయ్ పేరు చివరలో రావడంతో ఆయనకు 16వ క్రమసంఖ్య కేటాయించారు. అది మొదటి ఈవీఎంలోని చివరి బటన్ కావడం గమనార్హం. తాజా గందరగోళం నేపథ్యంలో ఇతర నియోజకవర్గాలలో అత్యధికంగా ఈవీఎంలను ఉపయోగించే చోట అధికారులు జాగ్రత్త పడ్డారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, పోలింగ్ కేంద్రం బయట ఉండే జాబితాను చూసి ఓటు వేయాలని అధికారులు సూచించారు. -
వారసత్వం అంటే హోదా కాదు.. బాధ్యత
సాక్షి, చైన్నె: ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైన్నె విభాగం ఆధ్వర్యంలో ‘బియాండ్ జనరేషనన్స్ – ద స్ట్రెంగ్త్ ఆఫ్ లెగసీ – హెరిటేజ్’ అనే అంశంపై స్ఫూర్తిదాయకమైన చర్చా కార్యక్రమం జరిగింది. ఆ విభాగం చైన్నె ఛైర్పర్సన్ డాక్టర్ అమూల్య రావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి బరోడా మహారాణి రాధికా రాజే గైక్వాడ్, అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్పర్సన్ డాక్టర్ ప్రీతా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారసత్వం – ఆధునికతపై చర్చ తరతరాలుగా వస్తున్న విలువలు, సంప్రదాయాలను ఆధునిక కాలానికి అనుగుణంగా ఎలా మలచుకోవాలనే అంశంపై ఈ ఇద్దరు ప్రముఖ మహిళా అతిథులు తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు.రాధికా రాజే గైక్వాడ్ తన ప్రసంగంలో వారసత్వం అనేది కేవలం ఒక బిరుదు కాదు, మనకంటే గొప్పదైన ఒక సంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత అని పేర్కొన్నారు. ఒక తరం గనుక మన సంప్రదాయాలను పాటించడం ఆపివేస్తే, అవి శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. సంప్రదాయం అనేది బ్రతికి ఉండాలి, కాలానికి అనుగుణంగా మారాలి, పర్యాటకం అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది మన సంస్కృతిని కాపాడుతూ ఎంతోమందికి జీవనోపాధిని అందిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2026–2027 సంవత్సరానికి సంబంధించిన ‘ఫ్లో కనెక్ట్’ మిషనన్ రాజే, డాక్టర్ ప్రీతా రెడ్డి సంయుక్తంగా విడుదల చేశారు. -
ఉలిక్కిపడ్డ.. విరుదునగర్!
సాక్షి, చైన్నె: ఎన్నికల వేళ సర్వత్రా ప్రచార బిజీలో ఉంటే ఆదివారం సాయంత్రం విరుదు నగర్ జిల్లానే ఉలిక్కి పడే రీతిలో బాణసంచా పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఈ ఘోర బాణాసంచా ప్రమాదంతో పది కి.మీ దూరం భూమి కంపించినట్టుగా బాణా సంచాల మోత మోగింది. ఐదేళ్లలో ఇదే అతిపెద్ద ప్రమాదం విరుదునగర్ సమీపంలోని కట్టనార్పట్టి వద్ద జరిగిన శ్రీవనజ బాణాసంచా తయారీ కేంద్రంశ్రీ పేలుడు ఉదంతం తమిళనాడును ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 23కి చేరింది. గత ఐదేళ్ల కాలంలో బాణాసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఇది ఒకటిగా నమోదైంది. పేలుడు సంభవించిన సమయంలో శబ్దం ఎంత బీభత్సంగా ఉందంటే.. ఘటనా స్థలానికి 10 కిలోమీటర్ల దూరం వరకు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద ధాటికి కార్మికుల శరీరాలు చిద్రమై పడి పోవడం అక్కడి భీభత్స పరిస్థితికి అద్దం పడుతోంది. కారణాలు: ఇరుకై న గదుల్లో ఎక్కువ మంది కార్మికులు పనిచేయడం, నిబంధనలకు విరుద్ధంగా శక్తివంతమైన పేలుడు పదార్థాలను వాడటం వల్లనే ఇంతటి నష్టం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. గత ఐదేళ్లలోని ప్రధాన ప్రమాదాలు తమిళనాడు బాణసంచా హబ్గా ఉన్న విరుదునగర్ జిల్లాలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2021 ఫిబ్రవరిలోఅచ్చాంకుళం గ్రామంలోని శ్రీ మరియమ్మల్ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 27 మంది మరణించారు. ఇదే ఇప్పటివరకు అతిపెద్ద ప్రమాదం. 2023 అక్టోబర్ హోసూర్ సమీపంలోని అత్తిపల్లి వద్ద బాణాసంచా లోడ్ దించుతుండగా జరిగిన పేలుడులో 14 మంది దుర్మరణం పాలయ్యారు. 2023 అక్టోబర్లో శివకాశి సమీపంలోని రెంకపాళయంలో జరిగిన ప్రమాదంలో 10 మంది (9 మంది మహిళలు) మరణించారు.2024 ఫిబ్రవరిలో వెంబకోట సమీపంలోని ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 10 మంది కార్మికులు మృతి చెందారు. 2025లో విరుదునగర్ జిల్లాలో మొత్తం 16 ప్రమాదాలు జరగ్గా, 37 మంది మరణించారు.2026లో ఇప్పటివరకు కేవలం నాలుగు నెలల్లో పలు ప్రమాదాలు జరిగాయి.ఇందులో అతి పెద్ద ప్రమాదం తాజాగా చోటు చేసుకోవడంతో కలవరం తప్పడం లేదు. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధిస్తున్నా, తనిఖీలు చేస్తున్నా.. ఇలాంటి ఘోరకలి పదే పదే పునరావృతం కావడం కార్మిక కుటుంబాల్లో తీవ్ర భయాన్ని, శోకాన్ని నింపుతోంది. -
ఉత్తరంలో వానతి పట్టు సాధించేనా..
కోయంబత్తూరు ఉత్తరం నియోజకవర్గం మరో వీఐపీ స్థానం. ఇక్కడ బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ పోటీ చేస్తున్నారు. ఆమె కోయంబత్తూరు దక్షిణం నుంచి తాజగా ఉత్తరంకు మకాం మార్చుకున్నారు. వాస్తవానికి ఈ స్థానం అన్నాడీఎంకే కంచుకోట. ఈసారి పట్టుబట్టి మరీ ఈ సీటును వానతీ శ్రీనివాసన్ దక్కించుకున్నారు. మరుద మలయం మురుగన్ ఆలయం కొలువైన ఈ స్థానంలో మొత్తం ఓటర్లు: 2,96,939, వీరిలో పురుషులు: 1,45,849, మహిళలు: 1,51,061, ఇతరులు 29 మంది ఉన్నారు. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ అభ్యర్థిగా వీఐపీ వానతీ శ్రీనివాసన్ ఇక్కడ పోటీలో ఉన్నప్పటికీ హఠాత్తుగా ఏర్పడ్డ అనారోగ్య కారణాలతో ఆమె ఆస్పత్రిలో కొన్నాళ్లు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆమెకు మద్దతుగా బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై మొదలు కీలక నేతలు ఇక్కడ తిష్ట వేసి ప్రచారంలో నిమగ్నం కావడం విశేషం. గత ఎన్నికలలో కేవలం 4 వేల ఓట్లతో ఓటమి పాలైన దురై సెంతమిళ్ సెల్వన్ ఈ సారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికలలో ఓడిన తనకు ఈ సారి ఓటర్లు పట్టం కట్టడం ఖాయం అన్న ధీమాతో ఉన్నారు. బీజేపీ, డీఎంకే అభ్యర్థులు ఈ నియోజకవర్గంలో సముజ్జీలుగా ఉండటంతో సమరం హోరాహోరీగా మారింది. ఇక, ఓట్ల చీలిక దిశగా ఎన్టీకే అభ్యర్థి నర్మద మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విజయ్ టీవీకే అభ్యర్థిగా సంపత్ కుమార్ పోటీలో ఉన్నారు. ఉత్తరం అభ్యర్థులు: దురై సెంతమిళ్ సెల్వన్(డీఎంకే), వానతీశ్రీనివాసన్(బీజేపీ), నర్మద(ఎన్టీకే), సంతప్కుమార్(టీవీకే) -
క్యాన్సర్ విజేతల కోసం రేలాలో ‘కదిర్’
సాక్షి, చైన్నె: క్యాన్సర్ చికిత్స రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, రేలా హాస్పిటల్ క్యాన్సర్ విజేతల కోసం శ్రీకదిర్శ్రీ అనే సరికొత్త సర్వైవర్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. కేవలం చికిత్స అందించడమే కాకుండా, చికిత్స తర్వాత రోగులు సాధారణ జీవితం గడపడానికి అవసరమైన శారీరక, మానసిక మద్దతును అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా ప్రకటించారు. ఈ ప్రోగ్రామ్ కింద ఆంకాలజిస్టులు, పునరావాస నిపుణులు, పోషకాహార నిపుణులు, కౌన్సెలర్లు ఒక బృందంగా ఏర్పడి రోగులకు చికిత్స అందిస్తారన్నారు. క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టకుండా ముందుగానే గుర్తించడం, చికిత్స వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ నిర్వహించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆస్పత్రి చైర్మన్ ప్రొఫెసర్ మొహమ్మద్ రేలా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నేడు అందుబాటులోకి వచ్చిన అధునాతన చికిత్సల వల్ల క్యాన్సర్ జయించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అయితే, చికిత్స పూర్తయిన తర్వాత కూడా వారు ఎదుర్కొనే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం చాలా ముఖ్యంగా పేర్కొన్నారు. అందుకుఏ ‘కదిర్’ ప్రోగ్రామ్ ద్వారా క్యాన్సర్ విజేతలు తమ సాధారణ జీవితంలోకి ఆత్మవిశ్వాసంతో తిరిగి వెళ్ళేలా మేము తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేలా హాస్పిటల్లో చికిత్స పొంది క్యాన్సర్ను జయించిన అనేకమంది బాధితులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
అంకిత భావం, నైపుణ్యం మేళవింపుతోనే న్యాయం
సాక్షి, చైన్నె : న్యాయమూర్తుల అంకితభావం, న్యాయవాదుల వృత్తిపరమైన నైపుణ్యం పరస్పరం తోడైనప్పుడే సామాన్య ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన న్యాయం అందుతుందరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. మదురై జిల్లా కోర్టు ప్రాంగణంలో రూ. 166 కోట్ల వ్యయంతో నిర్మించిన 18 కోర్టు గదుల అదనపు భవనాన్ని, అలాగే మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ అదనపు అతిథి గృహాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎం. ధర్మాధికారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మద్రా సు హై కోర్టు, మధురై ధర్మాసనం న్యాయమూర్తులు , సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థకు వెన్నెముక ఈసందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ దేశ న్యాయ వ్యవస్థకు జిల్లా కోర్టులే వెన్నెముక అని, ఉన్నత న్యాయస్థానాలు చట్టాలను రూపొందించినప్పటికీ.. వాటికి ప్రాణం పోసేది దిగువ కోర్టులేనని కొనియాడారు. ఆధునిక వసతులతో కూడిన భవనాలు కేసుల జాప్యాన్ని తగ్గించి, న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని మరింత బలపరుస్తాయని తెలిపారు. నేర, సివిల్ , రాజ్యాంగపరమైన కేసుల పరిష్కారంలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ అద్భుతమైన కృషి చేస్తోందని ప్రశంసించారు. న్యాయమూర్తుల సందేశం.. జస్టిస్ జె.కె. మహేశ్వరి మాట్లాడుతూ, కోర్టు భవనాలు కేవలం కట్టడాలు మాత్రమే కాదని, న్యాయవాదులు నిజాయితీతో వాదించినప్పుడే అవి న్యాయ దేవాలయాలుగా మారుతాయన్నారు. యువ న్యాయవాదులు ఈ–ఫైలింగ్ వంటి సాంకేతిక మార్పులకు అనుగుణంగా సిద్ధం కావాలని సూచించారు. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ మాట్లాడుతూ, న్యాయం అనేది త్రాసులా నిష్పక్షపాతంగా ఉండాలని, కన్నగి కాలం నాటి నుంచే న్యాయం పొందడం సులభతరంగా ఉండేదని గుర్తుచేశారు. జస్టిస్ ఆర్. మహదేవన్ మాట్లాడుతూ, న్యాయస్థానాల నిర్మాణం కేవలం అధికారం మాత్రమే కాదు, అది ప్రజల బాధలను తొలగించే బాధ్యత అని పేర్కొన్నారు. మద్రాస్ హైకోర్టు సీజే జస్టిస్ ఎస్.ఎం. ధర్మాధికారి మాట్లాడుతూ.. ప్రస్తుతం రూ. 166 కోట్లతో మూడు అంతస్తుల్లో 18 కోర్టు గదులను నిర్మించామని, భవిష్యత్తులో దీనిని 10 అంతస్తులకు విస్తరించి మొత్తం 30 కోర్టు గదులను అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసిన తమిళనాడు ప్రభుత్వం , ప్రజా పనుల విభాగానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జస్టిస్ ఎస్.ఎం. సుబ్రమణ్యం, జస్టిస్ ధనపాలన్, మదురై బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
కొండ దిగువ గ్రామంలో విషాదం
●ఇంట్లోనే ప్రసవం, తల్లి, బిడ్డ మృతి తిరువొత్తియూరు: కొండ దిగువ గ్రామంలో ఇంట్లోనే ప్రసవం జరగడంతో తల్లి, నవజాత శిశువు ఇద్దరూ మరణించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాలు.. ధర్మపురి జిల్లా అరూర్ కోట్టపట్టి సమీపంలోని మలైయడివార గ్రామంకు చెందిన వారు చెన్నకృష్ణన్ కూలీ. ఆయన భార్య పళనియమ్మాళ్ (38). వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో, తమకు మగ సంతానం కావాలని ఆ దంపతులు ఆశపడ్డారు. పళనియమ్మాళ్ నాలుగోసారి గర్భం దాల్చారు. నిండు గర్భిణిగా ఉన్న ఆమెకు శనివారం రాత్రి అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. కొండ దిగువ గ్రామం కొండ ప్రాంతంలో ఉండటం వల్ల సరైన రవాణా సౌకర్యాలు లేవు. దీంతో స్థానిక మహిళలే ఆమెకు ప్రసవం చేశారు. ఆమెకు మళ్లీ ఆడపిల్ల పుట్టింది. అయితే పుట్టిన కొద్దిసేపటికే ఆ ఆడశిశువు మరణించింది. మరోవైపు పళనియమ్మాళ్ కూడా స్పృహ కోల్పోయి మృతి చెందారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన చెన్నకృష్ణన్, కోట్టపట్టి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించారు. ప్రభుత్వ వైద్యులు, నర్సులు అక్కడికి చేరుకుని పరీక్షించగా, పళనియమ్మాళ్ అప్పటికే మరణించినట్లు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అన్నాడీఎంకే అభ్యర్థులు వినూత్నంగా, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ చైన్నెకి చెందిన న్యాయవాది సుందర వడివేల్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో.. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థులు తమకు మద్దతుగా ప్రచా రం చేస్తూ, రూ. 2,000, రూ. 10,000 విలువైన బ్యాంకు చెక్కుల తరహాలో ఉన్న నకిలీ కరపత్రాల ను ప్రజలకు పంపిణీ చేస్తున్నారని వివరించారు. అన్నాడీఎంకేకు ఓటు వేస్తే ఈ నగదు అందుతుందనే భ్రమను కల్పిస్తూ ఓటర్లను మోసం చేస్తున్నార ని ఆయన ఆరోపించారు. ఇలాంటి కుటిల మార్గాల ద్వారా ఎన్నికల్లో ప్రభావం చూపడం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అవినీతి కిందకు వస్తుందని, ఇది ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, సదరు అన్నాడీఎంకే అభ్యర్థులు , పార్టీ శ్రేణులపై కఠిన చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని న్యాయవాది సుందర వడివేల్ కోర్టును కోరారు. ఈ పిటిషన్ త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది. సాక్షి, చైన్నె: స్మార్ట్ఫోన్ల విక్రయాలకే పరిమితం కాకుండా, దేశ మానవ వనరుల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించే విధంగా ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రోగ్రామ్ను శాంసంగ్ ఇండియా విజయవంతం చేసింది. దీని ద్వారా తమిళనాడులో 5,000 మంది యువతకు అత్యాధునిక సాంకేతికతలో శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్లో పాల్గొన్న వారిలో 70 శాతం కంటే ఎక్కువ మంది మహిళలే ఉండటం గమనార్హం. జాతీయ స్థాయిలో మహిళల భాగస్వామ్యం 48 శాతంగా ఉంటే, తమిళనాడులో అది అంతకంటే ఎక్కువగా ఉండటం మహిళా సాధికారతకు నిదర్శనంగా శాంసంగ్ సౌత్ వెస్ట్ ఆసియా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.పి. చున్ తెలిపారు. ఆదివారం ఈ ఈ ప్రోగ్రామ్ కింద యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా ,కోడింగ్ ప్రోగ్రామింగ్లలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సామాజిక బాధ్యత ఖర్చుల కోసం ఖర్చును భారీగా పెంచింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 144 కోట్లుగా ఉన్న నిధులను, 2025–26 నాటికి రూ. 193 కోట్లకు పెంచినట్టు వివరించారు.యువతలో సృజనాత్మకతను పెంపొందించి, వారు సామాజిక సవాళ్లను ఎదుర్కొనేలా సిద్ధం చేయడమే తమ లక్ష్యం్ఙ అని పేర్కొన్నారు. -
కొంగు నగరం రేసులో వీఐపీలు
సాక్షి, చైన్నె : కొంగు మండలంలో ప్రధాన నగరంగా ఉన్న కోయంబత్తూరులో తాజాగా నాలుగు హాట్ సీట్లపై అందరి దృష్టి పడింది. ఇందులో రెండు స్థానాలలో అన్నాడీఎంకే, డీఎంకేకు చెందిన ఇద్దరు కింగ్ మేకర్లు పోటీ పడుతున్నారు. దీంతో ఎవర్నీ గెలుపు వరిస్తుందో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. వివరాలు.. పశ్చిమ తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్, కరూర్, ఈరోడ్, సేలం, నామక్కల్ జిల్లాలను కొంగు మండలంగా పిలవడం జరుగుతున్నది. ఈ జిల్లాలకు ప్రధాన కేంద్రంగా కోయంబత్తూ రు ఉంది. రాజధాని నగరం చైన్నె తదు పరి రాష్ట్రంలో రెండో స్థానంలో అతి పెద్ద నగరం ఇది ఉంది. పారిశ్రామికంగా, పర్యాటకంగా, రమణీయత కు ప్రతి కూలంగా ఉన్న అనేక ప్రదేశాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నాలుగింటిపై అందరి దృష్టి ఉంది. ఇందులోనూ తొండాముత్తూ రు, కోయంబత్తూరు ఉత్తరం, కోయంబత్తూ రు దక్షిణం, పొల్లాచ్చిలు ఉన్నాయి. ఈజిల్లాలోని మరో వీఐపీ నియోజకవర్గంగా పొల్లాచ్చి ఉంది. ఇక్కడ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాన్ని అన్నాడీఎంకేకు చెందిన పొల్లాచ్చి వీ జయరామన్ సొంతం చేసుకుని ఉన్నారు. తాజా గా నాలుగో సారి విజయం కోసం సిద్ధమయ్యారు. ఈయన్ను అడ్డుకునేందుకు డీఎంకే అభ్యర్థిగా కె నిత్యానంద , ఎన్టీకే అభ్యర్థిగా సెంథిల్, టీవీకే అభ్యర్థిగా జీ రామనాథన్ ఉన్నారు. ఇక్కడ 2,02,015 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామాలతో నిండిన ఈనియోజకవర్గంలో ప్రత్యర్థులుగా ఎందరున్న గెలుపు తనదే అన్న ధీమాతో పొల్లాచ్చి వి. జయరామన్ ఉండటం గమనార్హం. దక్షిణంలో డీఎంకే కింగ్ మేకర్ కొంగు మండలం ఇన్చార్జ్గా డీఎంకేలో వి. సెంథిల్ బాలాజీ కీలకంగా ఉన్నారు.ఆయన ద్వారానే సీఎం స్టాలిన్ ఇక్కడ వ్యూహాలకు పదును పెడుతూ వస్తున్నారు.తన సొంత జిల్లా కరూర్ను వదులకుని కోయంబత్తూరుపై సెంథిల్ బాలాజీ గత కొంత కాలంగా దృష్టి కేంద్రీకరించారు. అదే సమయంలో ఈ సారి ఎన్నికలలో కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం అభ్యర్థిగా సెంథిల్ బాలాజీని రంగంలోకి దించారు. ఇక్కడ సెంథిల్ బాలాజీ పోటీ చేస్తుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ తన మకాంను ఉత్తరానికి మార్చుకున్నారు. అదే సమయంలో ఉత్తరం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అమ్మన్ కే అర్జున్ గతంలో తనను రెండు సార్లు గెలిచిపించిన దక్షిణం వైపుగా దృష్టి పెట్టి సెంథిల్ బాలాజీకి గట్టి పోటీ ఇచ్చే దిశగా అవతరించారు. కొంగు మండలంలోని అన్నాడీఎంకే కంచుకోటలన్నింటిని బద్దలు కొట్టడం లక్ష్యంగా వి. సెంథిల్ బాలాజీ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న సెంథిల్ బాలాజీ క్షేత్ర స్థాయిలో డీఎంకేను బలోపేతం చేయడంలో సఫలీకృతులయ్యారు. అదే సమయంలో ఈ ఎన్నికలలో కొంగు మండలం డీఎంకే గుప్పెట్లోకి చేరినపక్షంలో కింగ్ మేకర్గా ఆయన అవతరించడం ఖాయం. అయితే, సెంథిల్ను ఓడించేందుకు స్థానికేతరుడు అన్న నినాదాన్ని బలంగా ప్రజలలోకి అన్నాడీఎంకే అభ్యర్థి అమ్మన్ అర్జునన్ తీసుకెళ్తున్నారు. ఈ సముజ్జీల మధ్య సమరంలో ఓట్ల చీలికలో కీలక పాత్ర పోషించే దిశగా ఎన్టీకే తరపున వీ పేరరివాలన్, టీవీకే తరపున వీ సెంథిల్ కుమార్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 1,86,509 మంది ఓటర్లు ఉన్నారు. సమస్యలన్నది పక్కన పెడితే, సామాజిక బలం అన్నది గెలుపునకు కీలకంగా ఉండటం గమనార్హం. -
వారు వస్తే, వీరి వారసత్వానికి ఎసరు!
సాక్షి, చైన్నె: మహిళలు అధిక సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చి నిర్ణయాధికారాల్లో భాగస్వాములవుతే తమ వారసత్వ రాజకీయ ఆధిపత్యం బలహీనపడుతుందని డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు భయపడుతున్నాయని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ విమర్శించారు. ఆదివారం మధురైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా సాధికారతపై ద్వంద్వ ప్రమాణాలు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను వ్యతిరేకించడం ద్వారా డీఎంకే, కాంగ్రెస్ల అసలు రంగు బయటపడిందన్నారు. మహిళలకు అధికారం ఇవ్వాలని వేదికలపై గొప్పగా మాట్లాడే ఈ పార్టీలు, పార్లమెంటులో మాత్రం అడ్డుకుంటున్నాయి. సామాన్య కుటుంబాల నుంచి వచ్చే మహిళలు పార్లమెంటులోకి అడుగుపెడితే తమ ఏక ఛత్రాధిపత్యానికి సవాల్ విసురుతారన్నదే వారి భయం ఎద్దేవా చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం నియోజకవర్గాల పునర్విభజనపై డీఎంకే, కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు: తమిళనాడులో ఎంపీ స్థానాలు 39 నుంచి 59కి పెరిగే అవకాశం ఉండేదన్నారు. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న 129 స్థానాలు పునర్విభజన తర్వాత 195కి పెరిగేవి అని వివరించారు. ఈ బిల్లులను అడ్డుకోవడం వల్ల, 2026 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే తమిళనాడుకు కేవలం 29 సీట్లు మాత్రమే వచ్చే ప్రమాదం ఉందని, దీనికి డీఎంకే, కాంగ్రెస్లే బాధ్యత వహించాలనిహెచ్చరించారు. పునర్విభజన ద్వారా రిజర్వ్డ్ స్థానాల సంఖ్య 131 నుంచి సుమారు 205కి పెరిగే అవకాశం ఉండేదని, ఆ అవకాశాన్ని కూడా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని మంత్రి మండిపడ్డారు. ఈసమావేశంలో సిని నటీ , బీజేపీ మహిళా నేత కస్తూరి తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక నగరంలో బ్రహోత్సవం
చిత్తిరై ఉత్సవాలు సాక్షి, చైన్నె: ఆధ్యాత్మిక నగరం మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చిత్తిరై బ్రహోత్సవ వైభవం ఆదివారం ప్రారంభమైంది. నగరం అంతా పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా కొత్త శోభ సంతరించుకుంది. ఉదయం శివాచార్యుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా జరిగిన పూజాది కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహనం జరిగింది. ఈ సందర్భంగా శివనామస్మరణతో మదురై తిరువీధులు మర్మోగాయి. మదురై పేరు వింటే అందరికీ గుర్తుకొచ్చేది మీనాక్షి అమ్మవారి సన్నిధి. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారుగా ఇక్కడ కొలువు దీరి ఉన్నది సాక్షాత్తు ఆ పార్వతీ దేవి అవతారమే. ఈ మేరకు ప్రతి ఏటా మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చైత్రమాస (చిత్తిరై) ఉత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. ఇక్కడ ఏడాది పొడవున ఉత్సవాలు జరిగినా, చిత్తిరై ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. తమిళనాడు నుంచే కాదు, పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం లక్షలాదిగా భక్తులు మదురై వైపుగా పోటెత్తుతారు. అందుకే ఆధ్యాత్మిక నగరం మదురై నగరంలో పండుగ శోభ సంతరించుకునే విధంగా బ్రహ్మోత ఏర్పాట్లు చేశారు. ధ్వజారోహణం.. ధ్వజారోహణంతో ఆదివారం బ్రహ్మోత్సవాలకు చుట్టారు. వేకువ జాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి వారిని వేర్వేరుగా బంగారు సింహాసనంలో అధిష్టింప చేసి ఆలయం ఆవరణలో ధ్వజ స్థంబంవద్దకు తీసుకొచ్చారు. స్వామి, అమ్మవారులు అక్కడ ఆశీనులు కాగా, శివాచార్యులనేతృత్వంలో 56 అడుగుల ఎత్తులో ఉన్న బంగారు ద్వజ స్థంబం వద్ద విశిష్ట పూజలు, అభిషేకాలు జరిగాయి. 12 రోజుల పాటుగా వైభవోపేతంగా జరిగే చిత్తిరై బ్రహ్మోత్సవాలకు శాస్రోక్తంగా పూజలతో శ్రీకారం చుడుతూ ధ్వజారోహణం జరిగింది. ఈ సమయంలో భక్తులు శివనామ్మ సర్మణను మర్మోగించారు. బ్రహోత్సవ వైభవంలో ప్రతి రోజు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ప్రతి రోజు మాసి వీధుల్లో అమ్మ వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈనెల 26వ తేది తేదిన అమ్మవారి పట్టాభిషేకం, 27 తేదీన దిగ్విజయం, 28వ తేదిన మీనాక్షి, సుందరేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం 29వ తేదిన రథోత్సవం, 30 తేదిన తీర్థవారి కార్యక్రమాలు జరగనున్నాయి. మే 1వ తేది కళ్లలగర్ స్వామి వారి వైగై నదీ ప్రవేశ ఉత్సవం జరగనుంది. చిత్తిరై ఉత్సవాలతో మదురైలో పండుగ శోభ సంతరించుకుంది. నగరం అంతా విద్యుత్ దీప కాంతుల మయం చేశారు. -
క్లుప్తంగా
సాక్షి, చైన్నె: బీచ్ ఇసుకలోనూ సునాయాసంగా ఎంజీ మెజెస్టోర్ ప్రయాణం సాగించే విధంగా చైన్నెలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని పట్టి పులం తీరంలో ప్రదర్శనను విజయవంతంచేశారు. ఎంజి మోటార్ ఇండియా తన సరికొత్త ఎస్యూవీగా మేజర్ను రూపొందించింది. దీని సామర్థ్యాన్ని చాటే విధంగా చైన్నెలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డు వెంబడి ఉన్న పట్టిపులం తీరప్రాంతంలో ప్రదర్శించింది. కఠినమైన బీచ్ భూభాగం వదులుగా ఉండే ఇసుక దిన్నెలలో అత్యంత సునాయాసంగా దూసుకుపోతూ తన ఆఫ్–రోడ్ నైపుణ్యాన్ని ఈ వాహనం చాటుకుంది.ఆఫ్–రోడ్ మోడ్స్లో 10 డ్రైవింగ్ మోడ్లు ఏర్పాటు చేశారు. ఇసుకలో ప్రయాణించడానికి సాండ్ మోడ్, కఠినమైన ఉపరితలాలపై పట్టు కోసం ‘క్రావల్ కంట్రోల్’ మోడ్ ప్రత్యేక ఆకర్షణ తీర్చిదిద్దారు. తిరువొత్తియూరు: తిరుమావళవన్ ఎన్నికల ప్రచారంలో విద్యుత్ షాక్ కొట్టి యువకుడు మతి చెందిన ఘటన విషాదం నింపింది. వివరాలు.. తిట్టకుడి నియోజకవర్గ డీఎంకే అభ్యర్థికి మద్దతుగా విడుతలై చిరుతైగల్ కట్చి( వీసీకే ) పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొనేందుకు తిట్టకుడి సమీపంలోని పుడియూరు గ్రామానికి చెందిన ఇళంగోవన్ కుమారుడు అజిత్ (19) వచ్చారు. ఆ సమయంలో అజిత్ పార్టీకి చెందిన ఇనుప జెండా కరన్రు పట్టుకున్నారు. దురదష్టవశాత్తూ ఆ జెండా కర్రపైన ఉన్న విద్యుత్ తీగలకు తగలడంతో అజిత్ విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే చుట్టుపక్కల వారు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అజిత్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధవీకరించారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరువొత్తియూరు: కరూర్ జిల్లా, చిన్న ఆండాంకోవిల్ ప్రాంతానికి చెందిన కష్ణమూర్తి (25) కొబ్బరి బొండం వ్యాపారి. 2020 సెప్టెంబర్ 18న కరూర్–కోయంబత్తూర్ రోడ్డులో వ్యాపారం చేసుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో మొత్తం 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కరూర్ జిల్లా సెషన్స్ కోర్టులో జరిగిన విచారణ అనంతరం న్యాయమూర్తి ఈ క్రింది విధంగా తీర్పునిచ్చారు. హత్యా నేరానికి పాల్పడిన గోకులకష్ణన్, దురైపాండి, ప్రేమ్కుమార్, మణికంఠన్, కేశవన్, అరవింద్కుమార్, తమిళరసన్, అజిత్, సెంథిల్ అనే 9 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. సరైన ఆధారాలు లేని కారణంగా కావ్య రమేష్, కలైసెల్వన్, విమల్ బషీర్ అనే ముగ్గురిని కోర్టు విడుదల చేసింది. శిక్ష పడిన 9 మందిని ప్రస్తుతం తిరుచ్చి సెంట్రల్ జైలుకు తరలించారు. కొరుక్కుపేట: ఆలయాల నిర్మాణం చేపట్టడం పూర్వజన్మ సుకృతం అని అజంతా సంస్థ అధినేత అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర రావు అన్నారు.చైన్నైశివారు ప్రాంతం మన ఊరు ప్రాంతంలో జగదాచార్య సహస్రాబ్ది స్మారక సభ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఆళ్వార్ ఆచార్యర్ మందిరం నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి . ఇందులో ఐదు సన్నిధులలో ఒక భాగం విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ మేరకు ఆదివారం చైన్నె పుదుపేట్లోని నాథముని హాలు వేదికగా చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీలతో, దాతలు, ఆలయ ట్రస్టీ లు, ప్యాట్రన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సభ వ్యవస్థాపకులు ఊసూరు నందకుమార్, ఊసూరు లత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అజంతా డాక్టర్ కే శంకర రావు, ప్రత్యేక అతిథిగా బీఎల్ కుమారవేల్, ఆలయ ప్యాట్రన్, గోపురం కుంకుమ అధినేత వైవీ హరికృష్ణా పాల్గొన్నారు. -
క్లుప్తంగా
ఓటేసేందుకు దివ్యాంగులకు వాహన సౌకర్యం – ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాటు కొరుక్కుపేట: చైన్నె జిల్లా ఎన్నికల అధికారి కుమారగురుబరన్ అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం ఓటింగ్ జరిగేలా చూసేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ పరిస్థితిలో, దివ్యాంగులు, వయోవృద్ధులైన ఓటర్లకు కూడా తమ ఇళ్ల నుంచే పోస్టల్ ఓట్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. అధికారులు రెండు రోజులపాటు వారు తమ ఇళ్ల నుంచే ఓట్లను నమోదు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా, పోలింగ్ కేంద్రాలకు ప్రయాణించి ఓటు వేయడాన్ని సులభతరం చేయడానికి ఇప్పుడు వాహన సౌకర్యాలు కల్పించారు. దివ్యాంగులు, వయోవృద్ధులైన ఓటర్లు తమ ఓటు నమోదు చేసుకోవడాన్ని సులభతరం చేసేందుకు, వారికి వారి నివాస ప్రాంతాల వరకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. చైన్నె జిల్లాలోని మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రత్యేక ఏర్పాటు చేశారు. వాహన సౌకర్యాలు అవసరమైన వారు 1950 నంబర్లో జిల్లా సమాచార కేంద్రాన్ని, అలాగే 18004257012 నంబర్లో జిల్లా ఎన్నికల కార్యాలయ నియంత్రణ గదిని సంప్రదించాల ని కోరారు. ఈ ఉచిత వాహన సౌకర్యాన్ని పొందడానికి దివ్యాంగులు కూడా సంక్షేమ అధికారులు శరవణకుమార్ (సెల్: 9443968097), శ్రీనివాసన్ (సెల్:9841696693)లను సంప్రదించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి కుమారగురుబరన్ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించి టీవీకే ప్రచారం తిరుత్తణి: పవిత్ర పుణ్యక్షేత్రంలో నిబంధనలు ఉల్లంఘించి టీవీకే శ్రేణులు పార్టీ జెండాలతో ప్రచారం చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. రెండు రోజులు మాత్రమే ప్రచారానికి సమయం వున్నందున రాజకీయ పార్టీల అభ్యర్ధులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా తిరుత్తణి టీవీకే అభ్యర్థికి మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు ఏకంగా తిరుత్తణి కొండ ఆలయంలో మాడ వీధుల్లో ఆదివారం ఉదయం పార్టీ జెండాలతో వెళ్లి ప్రచారం నిర్వహించడం వివాదస్పదమైంది. ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయ మాడ వీధుల్లో టీవీకే కేడర్ ప్రచారంపై ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం పళ్లిపట్టు: తిరుత్తణిలో తనను గెలిపిస్తే పళ్లిపట్టులో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని అన్నాడీఎంకే అభ్యర్థి హరి హామి ఇచ్చారు. తిరుత్తణి నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరి పళ్లిపట్టు సెంట్రల్ మండల కార్యదర్శి కృష్ణమనాయుడు ఆధ్వర్యంలో కోణసముద్రం, అత్తిమాంజేరిపేట, నొచ్చిలి, పాతకుప్పం, కొత్తకుప్పం, అత్తిమాంజేరి గ్రామాల్లో ఆదివారం ప్రచారం నిర్వహించారు. నొచ్చిలి బస్టాండులో హరికి మహిళలు ఘనస్వాగతం పలికారు. యూనియన్ కార్యదర్శి కృష్ణమనాయుడు క్రేన్ ద్వారా గజమాలతో హరిని సత్కరించారు. అన్నాడీఎంకే ప్రభుత్వ పథకాలను మళ్లీ అమల్లోకి తీసుకొచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. మండల అన్నాడీఎంకే కార్యదర్శి టీడీ.శ్రీనివాసన్, జిల్లా మాజీ కౌన్సిలర్ శాంతిప్రియ, జంగాళపల్లె చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగువారి మద్దతు కోరిన దుర్గా స్టాలిన్ కొరుక్కుపేట: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు ఓటర్లు సైతం కీలకంగా మారారు. విల్లివాక్కం అభ్యర్థి కార్తిక్ మోహన్కు మద్దతుగా సీఎం స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ శనివారం ప్రచారం చేశారు. విల్లివాక్కంలోని ఓ ప్రయివేటు కల్యాణ మండపం వేదికగా తెలుగువారి మద్దతు కోరుతూ తెలుగు నేతలతో ఆమె సమావేశమయ్యారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్, రెడ్డియార్, కమ్మ నాయుడు ఆది ఆంధ్ర, ఆర్యవైశ్య అసోసియేషన్ల నేతలతో ఆమె మాట్లాడారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తమిళనాడు అధ్యక్షుడు తాళ్లూరు సురేష్ అఖిలన్, విల్లివాక్కం డీఎంకే అభ్యర్థి కార్తిక్మోహన్ సతీమణి శృతి పాల్గొన్నారు. -
చైన్నెకి.. సూపర్–6
స్టాలిన్తో సంస్థల ప్రతినిధులు సాక్షి, చైన్నె: తేనాంపేటలోని అన్నా అరివాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సంస్థాగత కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సమక్షంలో ఈ పోస్టర్ను ఆవిష్కరించారు. చైన్నెని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రకటించిన ఈ శ్రీసూపర్–6శ్రీలో అంశాలను పొందు పరిచారు. మొత్తంగా 20 వాగ్దానాలు ఉన్నపట్టికీ ఇందులో ఆరింటికి తొలి ప్రాధాన్యతగా పరిగణించారు. క్రైస్తవ సంస్థల మద్దతు అన్నాఅరివాలయంలో సీఎం స్టాలిన్తో సీఎస్ఐ తదితర క్రైస్తవ సంస్థలకు చెందిన ఫాస్టర్లు, బిషప్లు , బ్రదర్లు సీఎం స్టాలిన్తో భేటీ అయ్యారు. సుమారు 20 మందికి పైగా ప్రతినిధులు స్టాలిన్ను కలిశారు. తమ మద్దతును డీఎంకే కూటమికి ప్రకటించారు. సూపర్ –6ను ఆవిష్కరిస్తున్న స్టాలిన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమిళనాడు రాజధాని నగరం చైన్నె కోసం ప్రత్యేకంగా సూపర్ –6 ప్రణాళికలను డీఎంకే రూపొందించింది. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ రాజధాని చైన్నె నగరం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘చైన్నె సూపర్–6’ పేరిట ఆరు ప్రధాన ఎన్నికల వాగ్దానాలను ఆదివారం చైన్నెలో విడుదల చేశారు. -
తొండముత్తూరులో అన్నాడీఎంకే కింగ్ మేకర్ వేలుమణి
కోయంబత్తూరు జిల్లాలోని అత్యంత కీలకమైన వీఐపీ నియోజకవర్గంగా తొండా ముత్తూరు ఉంది. ఇక్కడ మొత్తం ఓటర్లు: 2,93,324, వీరిలో పురుషులు: 1,41,641, మహిళలు: 1,51,577, ఇతరులు 106 మంది ఉన్నారు. అన్నాడీఎంకేలో పళణి స్వామి తర్వాత కీలకంగా ఉన్న నేత ఎస్పీ వేలుమణి ఇక్కడ నాలుగో సారి విజయం దిశగా ఉరకలు వేస్తున్నారు.అన్నాడీఎంకేలో శక్తివంతమైన నాయకుడైన వేలుమణి గెలుపును అడ్డుకునే దిశగా డీఎంకే తరపున ఇక్కడ కొత్త ముఖంగా కార్తికేయన్ పోటీలో ఉన్నారు. కొంగు మండలం డీఎంకే ఇన్చార్జ్గా ఉన్న సెంథిల్ బాలాజీ వ్యూహాలకు అనుగుణంగా కార్తికేయన్ ఓట్ల వేటలో ఉన్నారు.ఇక, విజయ్ టీవీకే తరపున సతీష్ రాజ్ పోటీలో ఉన్నారు. ఈ అభ్యర్థి ఎస్పీ వేలుమణి రాజకీయ గురువైన కేపీ రాజు కుమారుడు కావడం గమనార్హం. డీఎంకే, టీవీకేలోని యువ నేతలైన ఈ అభ్యర్థులు అత్యంత బలమైన నేతగా ఉన్న ఎస్పీ వేలుమణిని ఢీ కొట్టేందుకు సర్వాస్త్రాలను ఒడ్డుతున్నారు. ఇక, మైనారిటీ ఓట్లను గురి పెట్టి ఇక్కడ వ్యూహాత్మకంగా అభ్యర్థిని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) నేత సీమాన్ రంగంలోకి దించారు. ఆ పార్టీ తరపున రజబు నిషా మైనారిటీలను కలుపుకుని ఓట్ల వేటలో దూసుకెళ్తున్నారు. అన్నాడీఎంకే కంచుకోటను బద్దలు కొట్టే దిశగా సీఎం స్టాలిన్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టడం గమనార్హం. అన్నాడీఎంకేలో వేలుమణిపై అసంతృప్తితో ఉన్న స్థానిక నేతలందరూ సతీష్ రాజ్ వెంట తిరుగుతుండటంతో సమరం నువ్వా..నేనా..అన్నట్టుగా మారింది. ‘పొల్లాచ్చి’లో తిరుగు లేనట్టేనా..? -
స్వతంత్ర అభ్యర్థే పార్టీకి దిక్కు
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సేలం జిల్లాలోని కీలకమైన ఎడప్పాడి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి కె. ప్రేమ్కుమార్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ అధికారికంగా ప్రకటించారు. ప్రేమ్కుమార్ను టీవీకే అభ్యర్థిగా భావించి టీవీ చిహ్నంలో ఓట్లు వేసి గెలిపించాలని విన్నవించారు. ఎడప్పాడి నియోజకవర్గంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ టీవీకే అభ్యర్థిగా అరుణ్కుమార్ను విజయ్ నిలబెట్టారు. అయితే, నామినేషన్ దాఖలు తదుపరి ఆయన పత్తా లేకుండా పోయారు. నామినేషన్ సైతం తిరస్కరణకు గురైంది. మొక్కుబడిగానే ఆయన నామినేషన్ దాఖలు చేసినట్టు టీవీకే వర్గాలు గుర్తించారు.దీంతో ఆయన్ను పక్కన పెట్టారు. అదే నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న తన అభిమాని ప్రేమ్కుమార్ను తాజాగా టీవీకే అభ్యర్థిగా గుర్తించే పనిలో పడ్డారు. అయితే, సమయం మించిన దృష్ట్యా,ఆయనకు కేవలం మద్దతును ప్రకటిస్తూ విజయ్ ప్రకటన చేశారు. సొంత మనిషికే జై కొట్టండి.. ఎడప్పాడి నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారాలు అంటూ విజయ్ లేఖ విడుదల చేశారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమ్కుమార్ మన అభిమాన సంఘం మాజీ నాయకుడు, మన సోదరుడు. ఈ ఎన్నికల్లో మన పార్టీ తరపున ప్రేమ్కుమార్ను ఏకగ్రీవంగా సమర్థించాలని నిర్ణయించుకున్నాం. ఆయనకు కేటాయించిన శ్రీటెలివిజన్శ్రీ (టీవీ) గుర్తుపై ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాన్ఙు అని పేర్కొన్నారు.అలాగే, పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణపై విజయ్ ఘాటుగా స్పందించారు. శ్రీకుటిల మార్గాల్లో గెలవాలని చూస్తూ, టీవీకే గుర్తును అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పేలా ప్రేమ్కుమార్ విజయం ఉండాల్ఙి అని పిలుపునిచ్చారు. కాగా ఈనియోజకవర్గంలో మాజీ సీఎం పళనిస్వామి (అన్నాడీఎంకే), కాశీ (డీఎంకే) వంటి ఉద్ధండులు బరిలో ఉండగా, విజయ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి రంగంలోకి దిగడంతో చివరిక్షణంలో రాజకీయ సెగను పెంచినట్లయ్యింది. -
ఘనంగా 50వ పట్టభద్రుల దినోత్సవం
సాక్షి, చైన్నె: ప్రముఖ విద్యాసంస్థ అగర్చంద్ మాన్ముల్ జైన్ (ఏ.ఎం. జైన్) కళాశాల తన స్వయం ప్రతిపత్తి విభాగం 50వ పట్టభద్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ చారిత్రాత్మక వేడుకలో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు చెందిన 1,461 మంది విద్యార్థులు డిగ్రీలను అందుకున్నారు. మూడు సెషన్లుగా జరిగిన ఈ వేడుకకు ఇస్రో మాజీ డైరెక్టర్ డాక్టర్ మైల్ స్వామి అన్నాదురై ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఇతర సెషన్లలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హరి పరంధామన్ , డెక్సియన్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ రాజగోపాలన్ (ఇద్దరూ ఈ కళాశాల పూర్వ విద్యార్థులే) అతిథులుగా విచ్చేశారు.2024 బ్యాచ్కు చెందిన 34 మంది విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో టాప్–10 ర్యాంకులు సాధించారు. ఆర్ట్స్, కామర్స్, సైన్స్, మేనేజ్మెంట్ విభాగాలతో పాటు క్రిమినాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ మరియు విజువల్ కమ్యూనికేషన్ వంటి ఆధునిక కోర్సులలో విద్యార్థులు పట్టాలు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ మైల్ స్వామి అన్నాదురై మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్తుపై నమ్మకంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, సమాజానికి మేలు చేసే ఆవిష్కరణల వైపు దష్టి సారించాలని ఆయన కోరారు. కళాశాల అసోసియేట్ సెక్రటరీ హేమంత్ పి. చోర్డియా మాట్లాడుతూ.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తాము ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు. -
సూపర్ –6లోని ప్రధానాంశాలు
1. మెరుగైన ప్రజా సౌకర్యాలు ,మెట్రో వాటర్ కనెక్షన్ లేని ప్రాంతాలకు ఆర్ఓ ప్లాంట్ల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు పంపిణీ. అన్ని నివాస ప్రాంతాల్లో హై–మాస్ట్ వీధి దీపాల ఏర్పాటు. కళలు, సంగీతం , సంస్కృతి కోసం ప్రపంచస్థాయి సాంస్కృతిక తిక కేంద్రం నిర్మాణం. 2. రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, మెట్రో , రైల్వే స్టేషన్లను అనుసంధానిస్తూ 1,000 కొత్త మినీ బస్సుల ప్రారంభం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ట్రాఫిక్ మేనేజ్మెంట్. దీనివల్ల ప్రయాణ సమయం 25 శాతం తగ్గుతుందని అంచనా. 3. గడువులోగా మౌలిక సదుపాయాల పూర్తి, 2027 నాటికి ఎన్నూర్ – పూంజేరి పెరిఫెరల్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పూర్తి. 2028 నాటికి మెట్రో రైలు విస్తరణ , వర్షపు నీటి కాలువల పనుల పూర్తి. 2029 నాటికి ప్రపంచస్థాయి ప్రమాణాలతో విశాలమైన ఫుట్పాత్లు, నీడను ఇచ్చే చెట్లతో అందమైన రహదారుల నిర్మాణం. 4. వీధి కుక్కల సమస్యకు శాసీ్త్రయ పరిష్కారం లక్ష్యంగా జంతువుల జనన నియంత్రణ ( కేంద్రాల సంఖ్యను మూడు రెట్లు పెంచడం. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరిన్ని యానిమల్ షెల్టర్ల ఏర్పాటు. 5. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, ఏఐ, యానిమేషన్, గేమింగ్ రంగాల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు. రూ. 10,000 కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం. సుమారు 20,000 హై–పెయిడ్ (అధిక వేతనం) ఉద్యోగాల కల్పన. 6. గ్లోబల్ టాలెంట్ గేట్వే పేరిట చైన్నె యువతకు ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ, పరిశోధనా కేంద్రాలు. అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటూ చైన్నెని కేవలం ఒక నగరంగానే కాకుండా, ప్రపంచ స్థాయి ప్రతిభకు వేదికగా మారుస్తామని ఈ సందర్భంగా స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. -
గట్టిగా మాట్లాడి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే జరిమానా
– మెట్రో రైలు సంస్థ ప్రకటన తిరువొత్తియూరు: మెట్రో రైలులో తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడం లేదా వారి ప్రశాంతతకు భంగం కలిగించేలా ప్రవర్తించడం శిక్షార్హమైన నేరం. ముఖ్యంగా, సెల్ఫోన్లో గట్టిగా మాట్లాడటం, హెడ్ఫోన్స్ లేకుండా పాటలు వినడం లేదా వీడియోలు చూడటం, మెట్రో రైళ్లు , ప్రాంగణాల్లో లౌడ్స్పీకర్లనుఉపయోగించడం వంటివి నేరాలుగా పరిగణించబడతాయని మెట్రో అధికారులు ఆదివారం ఏ ప్రకటనలో స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే ప్రయాణికులకు రూ. 500 వరకు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. తోటి ప్రయాణికుల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అందరూ తప్పనిసరిగా హెడ్ఫోనన్స్ను ఉపయోగించాలని సూచించారు. మెట్రో రైలు, ప్రాంగణాల్లో గట్టిగా మాట్లాడటం వంటివి నివారించాలని తెలిపారు. ఇంటెలిజెన్స్ ఐజీ బదిలీ ● సెంథిల్ వేలన్ స్థానంలో అవినాష్ కుమార్ సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో మరో కీలక మార్పు చేపట్టింది. ఇంటెలిజెన్స్ విభాగం ఐజీగా పనిచేస్తున్న సెంథిల్ వేలన్ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో అవినాష్ కుమార్ ఐపీఎస్ ను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల వేళ వరుస మార్పులు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 3 రోజులు మాత్రమే గడువు ఉన్న తరుణంలో తాజా నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త ఐజీగా నియమితులైన అవినాష్ కుమార్ తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఎన్నికల సంఘం తన ఆదేశాల్లో పేర్కొంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే లక్ష్యంతో గత కొద్ది రోజులుగా తమిళనాడులోని కీలక అధికారులను ఎన్నికల సంఘం వరుసగా మారుస్తూవ స్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం స్థానంలో సాయికుమార్ను నియమించారు. డీజీపీ (శాంతి భద్రతలు): వెంకటరామన్ బదిలీ కాగా, ఆయన స్థానంలో సందీప్ రాయ్ రాథోడ్ బాధ్యతలు చేపట్టారు. చైన్నె పోలీస్ కమిషనర్గా ఉన్న అరుణ్ను మార్చి, అబిన్ దినేష్ మోడక్ను నియమించారు. ఏసీబీ డీజీపీ డేవీడ్సన్ దేవాశీర్వాదంతో పలు జిల్లాల కలెక్టర్, ఐపీఎస్లు, కమిషనర్లను బదిలీ చేశారు. తాజాగా ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ విభాగం అత్యంత కీలకమైనది కావడంతో, ఈ బదిలీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్సాహంగా పోస్టల్ బ్యాలెట్ ● చైన్నెలో తరలి వచ్చిన పోలీసులు సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యే పోలీసు అధికారుల కోసం ఏర్పా టు చేసిన పోస్టల్ బ్యాలెట్ (తపాలా ఓటు) తొలి దశ పోలింగ్ చైన్నెలో అత్యంత ఉత్సాహంగా జరి గింది. తమ నియోజకవర్గాల్లో ఎన్నికల రోజున విధుల్లో ఉండాల్సి రావడంతో, పోలీసులు ముందుగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 16 కేంద్రాల్లో పోలింగ్ చైన్నె జిల్లా పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధులకు సంబంధించి మొత్తం 22,248 మంది పోలీసులు, హోంగార్డులను నియమించారు. వీరి కోసం ఎన్నికల సంఘం రెండు విడతల్లో ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా శనివారం మొదటి విడత పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచి పొద్దుపోయే వర కు పోలీసులు ఉత్సాహంగా తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందు కోసం విల్లివాక్కం, అన్నా నగర్, పెరంబూర్ సహా 16 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ అంతా సీసీటీవీ కెమెరాల నిఘాలో, రిటర్నింగ్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా సాగింది. కాగా, తొలి విడతలో ఓటు వేయలేకపోయిన పోలీసుల కోసం సోమవారం రెండో విడత తపాలా ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులందరూ 100 శాతం ఓటుహక్కును వినియోగించుకోవాలి. ఎవరూ కూడా తమ ప్రజాస్వామ్య బాధ్యతను మర్చిపోకూడదు అని చైన్నె నగర పోలీ స్కమిషనర్ అబిన్దినేష్ మోడక్ పిలుపు నిచ్చారు. -
తిరుత్తణి ఆలయంలో రద్దీ
తిరుత్తణి: చిత్తిరై కృత్తిక సందర్బంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం భక్తజన సందడి నెలకొంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం కృత్తిక సందర్భంగా వేకువజామున మూలవర్లకు సుగంద ద్రవ్యాలతో అభిషేక పూజలు చేపట్టి పట్టు వస్త్రాలతో పాటూ బంగారు. వజ్రాభరణాలతో అలంకరించారు. కృత్తికతో పాటు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభంతో పాటు ఆదివారం కావడంతో భక్తులు తిరుత్తణి ఆలయంకు పోటెత్తారు. కొండ ఆలయంకు వాహనాలు పోటెత్తడంతో ట్రాఫిక్ పరిష్కరించే విధంగా బస్సులు, వ్యాన్లు, కార్లను కొండ ఆలయంకు వెళ్లేందుకు ఆంక్షలు విధించి ఆలయం ద్వారా ఉచిత బస్సుల సేవలు చేపట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. కొండ ఆలయ మెట్లు మార్గంతో పాటు ఘాట్రోడ్డు ద్వారా భక్తులు కొండ ఆలయ మాడ వీధుల్లో పోటెత్తారు. -
సామాజిక న్యాయం కోసం మన పోరాటం
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హొసూర్లో నిర్వహించిన శ్రీ ఇండియా కూటమి ప్రచార బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించడమే కాకుండా, ద్రావిడ సిద్ధాంతాల ప్రాముఖ్యతను వివరించారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం , అందరికీ సమానమైన అభివృద్ధికి నిలయమైన ఈ గడ్డపై నిలబడి ప్రసంగించడం తనకు గర్వంగా ఉందన్నారు. హొసూర్ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది, దీనిని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తాం అని స్టాలిన్ పేర్కొన్నారు. నేను ఒంటరిని కాదు ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ.. నేను ఒంటరిగా ఉన్నానని కొందరు అంటున్నారు. కానీ నేను ఒంటరిని కాదు.. నాకు కోట్లాది మంది ప్రజల మద్దతు ఉంది. భారతదేశానికే గౌరవం, హేతువాదం, క్రమశిక్షణను నేర్పిన పెరియార్, అన్నాదురై, కలైజ్ఞర్ కరుణానిధిల ఆశయాలు నా వెన్నంటే ఉన్నాయి. ఇది వారి సిద్ధాంతాలతో పునీతమైన మట్ట్ఙి అని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. మహిళా సాధికారత డీఎంకే ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న వారసత్వ రాజకీయాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఇది ప్రజాస్వామ్యమని, ప్రజలే తమను ఎన్నుకున్నారని, తాము ప్రజల సేవకులమని ఆయన పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన హొసూర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ప్రచారసభలో స్టాలిన్తో పాటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే తదితరులు పాల్గొన్నారు. అనంతరం చైన్నెకు చేరుకున్న స్టాలిన్, ఇక్కడి పలు నియోజకవర్గాలలో రోడ్ షో నిర్వహించారు. ఒకే సమయంలో ఓ వైపు స్టాలిన్, మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రోడ్ షో చేపట్టారు. -
డీఎంకే బూత్ ఏజెంట్లకు బంపర్ ఆఫర్
– డీఎంకే భూపతి నగదు ప్రకటన తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి డిపాజిట్ కోల్పేయే బూత్లో ఉన్న డీఎంకే ఏజెంట్లకు రూ.1.50 లక్ష బహుమతి అందజేస్తానని డీఎంకే మాజీ జిల్లా కార్యదర్శి భూపతి కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. డీఎంకే కూటమిలో తిరుత్తణిలో డీఎండీకే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కృష్ణమూర్తినాయుడుకు మద్దతుగా తిరుత్తణి మున్సిపాలిటీ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులతో పాటు కూటమి పార్టీల శ్రేణులు వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం 20వ వార్డులో ప్రచారం చేశారు. ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే వున్నందున కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి డీఎంకేను గెలిపించాలని ఓటర్లను అభ్యర్తిస్తున్నారు. పట్టణంలోని ఎన్నికల బూత్లలో అన్నాడీఎంకే డిపాజిట్ కోల్పోయే బూత్లోని డీఎంకే ఏజెంట్లకు రూ.1.50 లక్ష, అత్యధిక ఓట్లు సాధించే బూత్లకు రూ.లక్ష బహుమతి అందజేస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. నగర కార్యదర్శి వినోద్కుమార్, వైస్ చైర్మన్ స్వామిరాజ్ పాల్గొన్నారు. -
అధికారంలోకి రాగానే కార్తీకదీపం వెలిగిస్తాం!
రాజ్నాథ్ సింగ్ సాక్షి, చైన్నె: తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే తిరుప్పరం కుండ్రంలో ఘనంగా కార్తీక దీపం వెలిగిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. తెన్కాశి జిల్లా వాసుదేవనల్లూరు బీజేపీ అభ్యర్థి ఆనందన్ అయ్యసామి తరపున పులియంగుడిలో నిర్వహించిన రోడ్ షోలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ధర్మంపై డీఎంకే దాడి.. డీఎంకే ప్రభుత్వం మన విశ్వాసాలను నిరంతరం అవహేళన చేస్తోందన్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు విచారకరంగా పేర్కొన్నారు. తిరుప్పరంకుండ్రం మురుగన్ ఆలయంలో దీపం వెలిగించేందుకు వచ్చిన భక్తులను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అడ్డుకుంటోందని, తమ కూటమి అధికారంలోకి రాగానే అక్కడ దీప ప్రజ్వలన చేస్తాం అని రాజ్నాథ్ స్పష్టం చేశారు. అప్పుల ఊబిలో తమిళనాడు ఈరాష్ట్రం తాజా అప్పు రూ. 10.27 లక్షల కోట్లకు చేరిందని, అయితే, డీఎంకే రూపంలో ప్రజలకు జరిగిన మేలేమీ లేదని విమర్శించారు. గత 11 ఏళ్లలో కేంద్రం తమిళనాడుకు రూ. 11 లక్షల కోట్లు ఇచ్చిందని, ఆ సొమ్ము ప్రజలకు చేరకుండా డీఎంకే నేతల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. ఎన్డీయే అధికారంలోకి రాగానే ప్రజల సొమ్మును రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు. కల్లకురిచ్చి కల్తీ సారాయి మరణాలు, చిన్నారులపై నేరాలు, దళితులపై దాడులు పెరగడం స్టాలిన్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని రాజ్నాథ్ అన్నారు. నియోజకవర్గానికి ఒక సారాయి మాఫియా తయారైందని, వాటిని వేళ్లతో సహా పెకిలిస్తామని హెచ్చరించారు. తమిళనాడు ప్రజలు మార్పును, అభివృద్ధిని కోరుకుంటున్నారని, రేపు మనదే..! అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం రామనాథపురం, తిరునల్వేలిలో పలు నియోజకవర్గాలలో ఓపెన్ టాప్ వాహనంలో పర్యటించారు. -
బీజేపీతోనే మహిళలకు న్యాయం
సాక్షి, చెన్నై: లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్, డీఎంకే లు మహిళలకు ద్రోహం చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రమే మహిళలకు న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోదకురిచి నియోజకవర్గ బీజేపీ కృతికా శివకుమార్కు మద్దతుగా ఆదివారం జరిగిన రోడ్షోలో ప్రసంగించారు. అధికార డీఎంకే చేస్తున్న కుటుంబ రాజకీయాలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. తన కొడుకు ఉదయనిధిని ముఖ్యమంత్రిని చేయడంపై స్టాలిన్ దృష్టిపెట్టారని, ఈ కుటుంబ రాజకీయాలు రాష్ట్ర ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మేలు చేయలేవని షా ఆరోపించారు. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె.పళనిస్వామి నాయకత్వంలో ఎన్డీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏఐఏడీఎంకే–బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరుస్తామని, తమిళనాడుకు పూర్వ వైభవం తీసుకొస్తామబని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న మద్దతుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
ఏళ్ల అనుబంధం
డీఎంకే–కాంగ్రెస్ది తిరువళ్లూరు: డీఎంకే–కాంగ్రెస్ మద్య అనుబంధం నలభయ్యేళ్ల నాటిదని, ఎవ్వరు కుట్ర చేసినా తమ బంధాన్ని విడదీయలేరని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని జరిగిన భారీ బహిరంగ సభకు రాహుల్గాంధీతోపాటు డీకే శివకుమార్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ మతతత్వ పార్టీలు తమ బంధాన్ని విడదీయడానికి కుట్రలు చేస్తున్నాయన్నారు. తమిళనాడులో వచ్చే ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించిన ఆయన ఇండియా కూటమికి అండగా తమిళ ప్రజలు నిలబడాలని పిలుపునిచ్చారు. ఆంగ్లేయుల కాలంలో కూడా విద్యార్థులను పాఠశాలలో చేర్పించే సమయంలో మాతృభాషను అడిగి బడిలో చేర్చుకున్నారని, అయితే ప్రస్తుతం తమిళనాడులో హిందినీ బలవంతంగా రుద్దడం సరికాదని వ్యాఖ్యానించారు. హిందీ భాషను వ్యతిరేకించడంతో పాటు శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తమిళనాడు ఎంపీలు ధీటుగా ఎదుర్కొని ఓడించారని ప్రశంసించారు. అనంతరం ఆవడి నాజర్(డీఎంకే), తిరువళ్లూరు వీజీ రాజేంద్రన్(డీఎంకే), గుమ్మిడిపూండి టీజే గోవిందరాజన్(డీఎంకే), పొన్నేరి దురైచంద్రశేఖర్(కాంగ్రెస్), మాధవరం సుదర్శనం(డీఎంకే), వేళచ్చేరి అసన్ మౌలాన(కాంగ్రెస్), పూందమల్లి కృష్ణస్వామి(డీఎంకే) తదితరులను పరిచయం చేశారు. వారికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అద్యక్షుడు సెల్వపెరుందగై, పార్లమెంట్ సభ్యుడు శశికాంత్సెంథిల్, డీసీసీ అధ్యక్షుడు శశికుమార్, యువజన కాంగ్రెస్ విభాగం రాష్ట్ర కార్యదర్శి దివాకర్ తదితరులు పాల్గొన్నారు. వాగ్వాదం రాహుల్ సభకు వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే పోలీసులు లోపలికి అనుమతించారు. అయితే తనీఖీలు మరీ ఆలస్యం కావడంతో పాటు ఎండలో చాలాసేపు నిలబడాల్సి రావడంతో పోలీసులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. తామేమీ బాంబులతో రాలేదని, అయినా తనీఖీల పేరిట ఎందుకు ఎండలో నిలబెడుతున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విషయం ఎంపీ శశికాంత్ సెంథిల్కు చేరడంతో మైక్ తీసుకుని రాహుల్గాంధీ వచ్చే సమయం అయ్యిందని, దయచేసి తనీఖీలను వేగంగా నిర్వహించి, క్లియర్ చేయాలని పోలీసులకు సూచించారు. పోలీసులు జనాలను తనిఖీ చేయకుండానే వెనుక సీట్లకు పంపారు. చాయ్.. అచ్చా భాయ్ పొన్నేరిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి వచ్చిన రాహుల్గాంధీకి పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. వేదిక వద్దకు వచ్చిన రాహుల్ పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమం ముగియగానే వేదిక వద్ద ఏర్పాటు చేసిన రూమ్కు చేరుకుని కాస్త సేదదీరారు. ఈ సమయంలో రాహుల్కు జింజర్ టీని కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ విభాగం నేత ఖలీల్ రహ్మాన్ అందించారు. మొదట వద్దన్న రాహుల్ తరువాత టీ తీసుకుని కాస్త రుచి చూసి ఛాయ్ అచ్చా ఖలీల్భాయ్ అంటూ భుజం తట్టి ముందుకు సాగారు. -
మైలం ఓటర్ల మనసు గెలిచేదెవరో..?
సాక్షి, చైన్నె: రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో కీలక పార్టీ తరపున చక్రం తిప్పుతున్న నేత తాజాగా ఆ పదవి కన్నా, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొనసాగడం ముఖ్యం అన్న నిర్ణయానికి వచ్చేసినట్టున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలోకి వస్తే మంత్రి పదవీ కెబినెట్ హోదాలో దర్జాగా కొనసాగ వచ్చు అన్న ధీమాతో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి సీవీ షణ్ముగం ఈ సారి మైలం నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. ఇక్కడి సామాజిక వర్గం ఓటు కలిసి వస్తాయన్న ఆశతో ఆయన పోటీలో నిలబడితే అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి వెంకటేషన్ డీఎంకే కూటమిలో డీఎండీకే అభ్యర్థిగా రేసులో నిలవడం పోటీ రసవత్తరంగా మారింది. వివరాలు.. తిరువణ్ణామలై, విల్లుపురం జిల్లాల మేళవింపుతో ఉన్న ఆరణి లోక్సభ నియోజకవర్గంలో మైలం అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. వెనుకబడిన ప్రాంతంగా, కేవలం కుల సమీకరణలు రాజ్య మేలుతున్న ప్రాంతంగా ఉన్న మైలంలో ఎన్నికల సమరం వేడెక్కింది. ఇక్కడ కొండమీదున్న మైలం మురుగన్ ఆలయం ప్రసిద్ది చెంది ఉంది. 2008 పునర్ వ్యవస్థీకరణ తదుపరి కొత్తగా ఆవిర్భవించిన ఈ నియోజకవర్గంలో తొలి ఎన్నికలలో అన్నాడీఎంకే గెలిచింది. 2016లో డీఎంకే విజయకేతనం ఎగుర వేయగా, 2021లో పీఎంకే అభ్యర్థి శివకుమార్ గెలిచారు. ఈ నియోజకవర్గాన్ని గురి పెట్టి సీవీ షణ్ముగం తీవ్ర ప్రయత్నాలు చేసి చివరకు సఫలీకృతుడయ్యారు. తాజాగా ఇక్కడ 2,12,788 మంది ఓటర్లు ఉన్నారు. గెలుపును నిర్ణయించే అంశాలు ఇవే.. కుల సమీకరణాలే ఈ నియోజకవర్గంలో కీలంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలతో కూడిన ఈ పరిసరాలలో వన్నియర్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువే. పీఎంకే లో వివాదాల నేపథ్యంలో ఈ ఓట్లు సి.వి. షణ్ముగం వైపు ఉంటాయా లేదా చీలిపోతాయా? అన్నది వేచి చూడాల్సిందే. ఇక, డీఎంకే కూటమి ఓట్లు వెంకటేశన్కు ఏకపక్షంగా పడతాయా..? లేదా..? అనే సందిగ్ధం నెలకొంది. ఇక, తాలూకా ఏర్పాటు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన వంటి సమస్యలెన్నో గ్రామీణ ప్రాంతాలలో ఇక్కడ ఉన్నాయి. మెలం మురుగన్ ఆలయం ఎమ్మెల్యే కావాలన్న ఆశతో.. రాజ్యసభ సభ్యుడిగా, అన్నాడీఎంకేలో కీలక నేతగాఉన్న సీవీ షణ్ముగం మైలం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన విల్లుపురం నుంచి రెండు సార్లు గెలిచారు. హ్యాట్రిక్ కోసం 2021లో ప్రయత్నించగా ఓటమి పాలయ్యారు. దీంతో తన మకాంను మైలంకు మార్చుకున్నారు. ఓ వైపు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ, మరో వైపు మైలం నియోజకవర్గంపై తన పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో, తన సామాజికవర్గంతో మమేకం అయ్యేవిధంగా ముందుకు సాగారు. ప్రస్తుతం మైలం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అన్నాఎంకే అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారంటీ కావడంతోనే ఆయన ఎమ్మెల్యే పదవికి పోటీలో ఉండడం గమనార్హం. ఇక, డీఎంకే కూటమిలో ఈ సీటును డీఎండీకేకు కేటాయించారు. కూటమి బలం, కెప్టన విజయకాంత్పై ఈ పరిసరాలలో ఉన్న సానుభూతి తననను గెలిపిస్తుందన్న ఆశతో ఉన్నారు.ఇక, విజయ్ పార్టీ నుంచి టీవీకే తరపున విజయ్ నిరంజన్ పోటీ చేస్తున్నారు. యువత ఓట్లు, మార్పును ఆశిస్తున్న వారిని గురి పెట్టి ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. సీమాన్ ఎన్టీకే తరపున విజయ్ విక్రమ్ పోటీలో ఉన్నారు. మధ్యతరగతి, విద్యావంతుల ఓట్లపై దృష్టి పెట్టారు. కాగా ప్రధాన సమరం సీవీ షణ్ముగం, వెంకటేషన్ మధ్య నెలకొంది. -
స్టాలిన్ను ఇంటికి పంపడం ఖాయం
సాక్షి, చైన్నె: అరాచకాలు, అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిన ‘లిమిటెడ్ కంపెనీ’ డీఎంకేను ఈ ఎన్నికల్లో ప్రజలు ‘లిమిట్’ చేసి, ఇంటికి పంపడం ఖాయమని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ప్రచారానికి ఆటంకాలు అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని టీవీకే అభ్యర్థుల ప్రచారానికి డీఎంకే అడ్డంకులు సృష్టిస్తున్నదని విజయ్ ఆరోపించారు. ప్రచార అనుమతులను చివరి నిమిషంలో రద్దు చేయడం, అనుమతి పత్రాలను ఆలస్యంగా ఇవ్వడం వంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. టీవీకే కేవలం రోడ్లపై చేసే ప్రచారాన్నే నమ్ముకోలేదని, తమిళనాడులోని ప్రతి ఇంట్లో ప్రజలే స్వచ్ఛందంగా తమ తరపున ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారిందని, అవినీతి శక్తులు, పాసిస్టు శక్తులు త్వరలోనే ‘విజిల్’ (టీవీకే గుర్తు) ప్రభంజనంలో కొట్టుకుపోవడం ఖాయం‘ అని ధీమా వ్యక్తం చేశారు. హద్దులు లేకుండా అవినీతి చేస్తూ, అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్న ‘లిమిటెడ్ కంపెనీ’ డీఎంకే అధికారానికి ఈ ఎన్నికల్లో ప్రజలు చెక్ పెడతారని ఆయన అన్నారు. ‘ప్రజలారా.. ఈ వేషధారులను నమ్మకండి, అప్రమత్తంగా ఉందాం. విజయం సాధించి చరిత్ర సృష్టిద్దాం అని విజయ్ పిలుపునిచ్చారు. కాగా, విజయ్ ఈనెల 20,21 తేదీలలో తిరుచ్చిలో విస్తృతంగా పర్యటించేందుకు నిర్ణయించారు. ప్రచారంలో విజయ్ దిశానిర్దేశం మార్చే కుట్ర ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం డీఎంకేకు అలవాటేనని, పెట్టుబడుల పేరుతో డీఎంకే ప్రభుత్వం ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని విజయ్ విమర్శించారు.పెరియార్, కామరాజర్, అన్నాదురైలు నాటిన సామాజిక న్యాయం, సామరస్య బీజాలు ఈ మట్టిలో బలంగా ఉన్నాయన్నారు. ఇలాంటి లౌకిక గడ్డపై పాసిస్టు శక్తులు పాచికలు అసాధ్యమన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న డీఎంకేకు మరోసారి అవకాశం దక్కడం కల్లేనని ఆయన స్పష్టం చేశారు. -
21 నియోజకవర్గాలకు 184 మంది పోటీ
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6వ తేదిన జరగనున్న నేపద్యంలో నామినేషన్లు దాఖ లు ఈనెల 12 నుంచి 19వ తేది వరకు జరిగింది. ఈ సందర్బంగా వివిద రాజకీయ పార్టీలు, స్వత్యంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు పునః పరిశీలన, తిరష్కరణలు పూర్తి కావడంతో తుది జాబితాను అధికారులు సిద్దం చేశారు. ఇదిలా ఉండగా కాట్పాడి నియోజక వర్గంలోని కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ షణ్మగ సుందరం, ఎస్పి సెల్వకుమార్లు మంగళవారం ఉదయం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలోని 21 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొత్తం 184 మంది బరిలో ఉన్నట్లు తెలిపారు. తిరుపత్తూరు జిల్లాలో మాత్రం నాలుగు నియోజకవర్గాల్లో 113 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో 59 నామినేషన్లు తిరష్కరించడం జరిగిందన్నారు. అదే విధంగా వేలూరు జిల్లాలో ఐదు నియోజక వర్గాల్లో మొత్తం 71 మంది బరిలో ఉన్నారు. వీరిలో వేలూరులో 17 మంది, కాట్పాడిలో 15, అనకట్టులో 14, కేవీ కుప్పంలో 10, గుడియాత్తంలో 15 మంది బరిలో ఉన్నారు. అదే విధంగా రాణిపేట జిల్లా లో మొత్తం 59 మంది పోటీలో ఉండగా అరక్కోణంలో 13 మంది, షోళింగర్లో 20 మంది, రాణిపేటలో 14 మంది, ఆర్కాడులో 12 మంది పోటీలో ఉన్నట్లు తెలి పారు. ఇదిలా ఉండగా షోళింగర్, వేలూరు అసెంబ్లీ నియోజక వర్గాల్లో మాత్రం అధికంగా అభ్యర్థులు పోటీలో ఉండగా రెండు ఈవీఎం మిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఈవీ ఎం మిషన్లోను 15 మంది అభ్యర్థుల పేరుతో పాటు ఒక నోటాకు బటన్ ఉంటుందని ఓట ర్లు వీటిని పరిశీలించి ఓట హక్కును వినియోగించుకోవాలన్నారు. -
క్లుప్తంగా
అన్నానగర్: రామనాథపురం జిల్లాలోని పుదుమడం బీచ్ లో కోస్ట్ గార్డ్, కస్టమ్స్ శాఖ సంయుక్తంగా శనివారం తెల్లవారుజామున నిర్వహించిన సోదాల్లో ఓ సరుకు రవాణా వాహనం నుంచి అధికారులు 35,000 వీదేశీ సిగరెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విదేశీ సిగరెట్ల విలువ కోటి రూపాయలు. ఈ సిగరెట్లను పడవ ద్వారా శ్రీలంకకు అక్రమంగా తరలించనున్నట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ మురుగన్ను అరెస్టు చేశారు. ఈ సిగరెట్ల అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠా, దాని కీలక స్థావరాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వేలూరు: రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపంలోని కరికందాగల్ గ్రామానికి చెందిన అరుణ్కుమార్(23)లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు సమీపంలోని మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన నరేష్(25) కూడా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం అరుణ్కుమార్ సెయ్యారు నుంచి ఆర్కాడు వైపునకు లారీని నడుపుతున్నాడు. అదే విధంగా నరేష్ ఆర్కాడు నుంచి సెయ్యారుకు లారీ తీసుకెళ్తున్నాడు. ఈ రెండు లారీలు ఆర్కాడు సమీపంలోని కలవై క్రాస్ రోడ్డు వద్ద వస్తున్న సమయంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో రెండు లారీలో ఉన్న డ్రైవర్లు ఇనుప కమ్మీల్లో చిక్కుకొని అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో రెండు లారీలను వేరు చేసి మృతదేహాలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సాక్షి, చైన్నె: పర్యాటకులకు మలేషియాను మరింత చేరువ చేసేందుకు ప్రముఖ పర్సనలైజ్డ్ ట్రావెల్ ప్లాట్ఫామ్ పిక్యువర్ట్రైల్, మలేషియా పర్యాటక శాఖ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. చైన్నెలోని మలేషియా కాన్సుల్ జనరల్ కె.శరవణ కుమార్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను ప్రవేశపెట్టారు. ప్రయాణికులు మలేషియా పర్యటనకు వెళ్లి వచ్చాక, ఆ ఖర్చును 3 నుండి 9 నెలల సులభ వాయిదాలలో చెల్లించే విధంగాచర్యలు తీసుకున్నారు. పాత పద్ధతిలో ఉండే ఒకే రకమైన ప్యాకేజీలు కాకుండా, భారతీయుల అభిరుచులకు తగ్గట్టుగా ప్రత్యేకంగా రూపొందించిన పర్యటనలను ఈ ప్లాట్ఫామ్ను వేదిక చేశారు. ప్రముఖ ఎయిర్లైన్స్ భాగస్వామ్యంతో విమాన టిక్కెట్లపై ప్రత్యేక రాయితీలను కూడా ఈ ఒప్పందం ద్వారా అందించనున్నారు. కార్యక్రమంలో పిక్యువర్ ట్రైల్ సీఈఓ హరిగణపతి, మలేషియా టూరిజం డైరెక్టర్ హిషాముద్దీన్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. తిరుమల: తమిళనాడు రాష్ట్రం చంగల్ పట్టు ప్రాంతానికి చెందిన ఆదర్శ్(12) అలిపిరి మెట్ల మార్గంలో సుమారు 2500వ మెట్టు వద్ద తప్పిపోయాడు. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏవీఎస్వో లు స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తిరుమలలోని పీఏసీ –2 ప్రాంతంలో బాలుడు కనిపించినట్లు విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. అనంతరం ఆదర్శ్ను సురక్షితంగా లేపాక్షి సర్కిల్లోని విజిలెన్స్ కార్యాలయానికి తీసుకువచ్చి ఎవీఎస్వో వెంకట శివకుమార్, కృష్ణయ్య సమక్షంలో అతని బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా టీటీడీ విజి లెన్స్ సిబ్బందికి బాలుడి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. తప్పిపోయిన బాలుడిని త్వరితగతిన గుర్తించి సురక్షితంగా అప్పగించిన విజిలెన్స్ సిబ్బందిని టీటీడీ ఉన్నతాధికారులు అభినందించారు. తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 69,049 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,842 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.57 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాల్సి ఉంది. -
ప్రజలు మార్పును ఆశిస్తున్నారు
కొరుక్కుపేట: రాష్ట్ర ప్రజలు ప్రభు త్వ మార్పును ఆశిస్తున్నారని నటుడు ఎం.శరత్కుమార్ అన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, నటుడు ఎం.శరత్కుమార్ అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా విరుదునగర్లో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలు ఢిల్లీ, తమిళనాడు కోసమే జరుగుతున్నాయని, డీఎంకే పాలనలో మాదకద్రవ్యాల సంస్కృతి పెరిగిందన్నారు. దీని కారణంగా బాలికల నుండి వృద్ధ మహిళల వరకు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, తాము ప్రచారం చేస్తున్న అన్నిచోట్లా ప్రజల తిరుగుబాటును గమనిస్తున్నామన్నారు. ప్రతిచోటా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. తమిళనాడు ప్రజలు ప్రభుత్వ మార్పును ఆశిస్తున్నారని, డీఎంకే–బీజేపీ కూటమి బలమైనదని, ఈ ఎన్నికల్లో విజయం ఖాయమని తెలిపారు. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని నిరసన వేదికగా మార్చి సానుభూతి తరంగాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యతో దక్షిణ రాష్ట్రాలు ప్రభావితమవుతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, భారత ఆర్థిక వ్యవస్థను 10వ స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకువచ్చింది మోడీనేనన్నారు. కరోనా కాలంలో వ్యాక్సిన్లు అందించి, ప్రజలను కాపాడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ప్రధానమంత్రి మోడీనే అని తెలిపారు. ఒక బిల్లును తీసుకువచ్చి, చర్చించకుండా తగలబెట్టడం ఎలా సమంజసమని ప్రశ్నించారు. తాను 28 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, టీవీకే నాయకుడు విజయ్ గురించి మాట్లాడాలనుకోవడం లేదన్నారు. ముందు ఆయన తనను తాను నిరూపించుకోవాలని, రాజకీయాలకు కేవలం ముఖ సౌందర్యం మాత్రమే సరిపోదన్నారు. నటులు రాజకీయాల్లోకి రావచ్చు, కానీ వారు క్షేత్రస్థాయిలో ఏమి చేస్తారనే దాని గురించే మనం మాట్లాడగలమని ఆయన మాట్లాడారు. -
క్లుప్తంగా
పండ్ల మాలతో స్వాగతం తిరువొత్తియూరు: తాంబరం ఏఐఏడీఎంకే అభ్యర్థి సిట్లపాక్కం ఎస్.రాజేంద్రన్కు, మధ్య ప్రాంత పార్టీ కార్యదర్శి ఎల్లార్ సెలియన్ నాయకత్వంలో ఇరుంబులియూర్ 60వ వార్డులో, జిల్లా యువజన విభాగం జాయింట్ సెక్రటరీ లాయర్ యు.వినోద్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. జిల్లా అమ్మా పేరవై కార్యదర్శి జి.ఎస్. పురుషోత్తమన్ సమక్షంలో ఆయనకు క్రేన్ ద్వారా అనాస పండ్ల మాలను వేసి సత్కరించారు. 500 మందికి పైగా మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. మాజీ మంత్రి టి.కె.ఎం.చిన్నయ్య, కూటమి పార్టీల నేతలు వి.ఎన్. వేణుగోపాల్, కుప్పుసామి, కృష్ణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులకు స్వేచ్ఛనిస్తా! కొరుక్కుపేట: రాయపురం నియోజకవర్గంలో ప్రధాన అభ్యర్థిగా పోటీ చేస్తున్న టి.జయకుమార్ రెండు ఆకుల గుర్తు కోసం ఓట్లు అభ్యర్థిస్తూ వీధుల్లో పర్యటిస్తున్నారు. ఆయనకు స్వాగతం పలకడానికి దారి పొడవునా ప్రజలు తరలివచ్చారు. రాయపురంలో పోలీసులను కొట్టిన ఘటన టెలివిజన్లో ప్రసారం చేయబడింది. ఈ పాలనలో పోలీసులకు గౌరవం లేదని, వారు పాలనలో మార్పు కోరుకుంటున్నారని, పోలీసులే రాజకీయ జోక్యం కోరుకుంటున్నారని తెలిపారు. రాయపురంలో ఏదో పందెం నడుస్తోందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక, పోలీసులను స్వేచ్ఛగా వారి పని చేసుకోనిస్తానని హామీ ఇచ్చారు. రాయపురంలో తన గెలుపు అవకాశాలు పదిలంగా ఉన్నాయని, ప్రచారం చేస్తున్నప్పుడు, అర కిలోమీటరు పరిధిలోనే ప్రజలు, వలంటీర్లు గుమిగూడుతున్నారని తెలిపారు. మిత్రపక్షాల సభ్యులు కూడా వస్తున్నారని, ఇది తాను భారీ విజయం సాధిస్తాననే నమ్మకాన్ని ఇచ్చిందన్నారు. రాయపురంలో గంజాయి చాలా ఎక్కువగా ఉందని, శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. సామాన్య ప్రజలు ఆశించే ప్రశాంతమైన జీవితం లేదని, ఎన్నో లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు. తాను లంచాలు తీసుకోనని, ఈ విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని, ప్రజలకు చాలా మేలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. రూ.కోటి టాస్మాక్ నగదు సీజ్ తిరువొత్తియూరు: తాంబరం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి దినేష్ నాయకత్వంలో పోలీసులు తాంబరం–వేలచ్చేరి ప్రధాన రహదారిలోని సెంబక్కం ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాల సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. అప్పుడు ఆ మార్గంలో వచ్చిన ఒక వ్యాన్ను ఆపి అధికారులు తనిఖీ చేయగా, అందులో కట్టల కొద్దీ నగదు ఉంది. దీనిని గమనించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆ నగదును స్వాధీనం చేసుకుని తాంబరం తహశీల్దార్ కార్యాలయంలో అప్పగించారు. అక్కడ రెవెన్యూ కోర్టు అధికారి మురళీ, తహశీల్దార్ నటరాజ్, సేలయూర్ ఇన్స్పెక్టర్ ఢిల్లీబాబు సమక్షంలో నగదును తీసుకువచ్చిన రాజేష్(30), కపిలన్(42) అనే వ్యక్తులను విచారించారు. అప్పుడు వారు, ప్రభుత్వ మద్యం దుకాణాల టాస్మాక్ నుండి వసూలు చేసిన నగదును అంబత్తూరుకు తీసుకువెళుతున్నట్లు తెలిపారు. అధికారులు ఆ నగదును లెక్కించగా, అందులో రూ 1 కోటి 20లక్షల 60 వేల 717 ఉన్నట్లు తేలింది. అయితే ఆ నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు (పత్రాలు) లేకపోవడంతో పాటు, నగదు తీసుకువచ్చిన వారు చెప్పిన సమాచారంలో పొంతన లేకపోవడంతో అధికారులు ఆ నగదును సీజ్ చేశారు. అనంతరం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించి, నగదుతో పాటు ఆ ఇద్దరు వ్యక్తులను వారికి అప్పగించారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ నగదుపై తదుపరి విచారణ జరుపుతున్నారు. పంచెలు స్వాధీనం సేలం: నామక్కల్ జిల్లా, తిరుచెంగోడు సమీపంలోని ఒక ఇంట్లో దాచి ఉంచిన 7,000 ధోవతులను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. నామక్కల్ జిల్లాలోని తిరుచెంగోడు సమీపంలో ఉన్న ఊంజనై గ్రామంలోని బావి తోటలో నివసించే కేఎండీ పార్టీ సభ్యుడు గురుస్వామి ఇంటి వద్ద, ఒక కంటైనర్ లారీలో పెద్ద మొత్తంలో బహుమతుల ప్యాకేజీలను నిల్వ ఉంచారని నామక్కల్ జిల్లా ఎన్నికల నియంత్రణ ఆఫీసుకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో నామక్కల్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దుర్గామూర్తి ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టాలని ఫ్లయింగ్ స్క్వాడ్ను ఆదేశించారు. శనివారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి వెట్రివేల్ నేతృత్వంలో సాయుధ పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురుస్వామి ఇంటిపై దాడి చేశారు. పార్కింగ్ స్థలంలోని ఒక గదిలో 37 కట్టలలో దాచి ఉంచిన 7,000 ధోవతులను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ధోవతులను తిరుచెంగోడు రిటర్నింగ్ ఆఫీసర్, రెవెన్యూ డివిజనల్ కమిషనర్ అయిన లెనిన్కు అప్పగించారు. తిరుచెంగోడు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
● హక్కులను పరిరక్షించుకోండి ● ఓటర్లకు పీఎం మోదీ పిలుపు
సాక్షి,చైన్నె: తమిళనాడుకు ఎక్కువ ఎంపీ సీట్లు రావడం డీఎంకేకు ఇష్టం లేదని, హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తున్న ఈ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం కోయంబత్తూరులో ఎన్డీఏ కూటమికి మద్దతుగా మోదీ ప్రసంగించారు. వేదికపై కోయంబత్తూరు, పరిసర జిల్లాలోని ఎన్డీఏ అభ్యర్థులను ఓటర్లకు పరిచయం చేశారు. ఈసందర్భంగా మోదీ ప్రసంగిస్తూ, నియోజకవర్గాల పునర్విభజన రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగితే, తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న సీట్ల కంటే మరిన్ని ఎక్కువ ఎంపీ స్థానాలు లభిస్తాయన్నారు. దీని వలన దేశ రాజకీయాల్లో తమిళనాడు బలం పెరుగుతుందన్నారు. అయితే, తమిళనాడు శక్తి పెరగడం డీఎంకేకు ఏమాత్రం ఇష్టం లేదని మోదీ విమర్శించారు. సంస్కృతికి ప్రాధాన్యత తన ప్రసంగాన్ని కోయంబత్తూరు గ్రామ దేవత కోనియమ్మన్, మరుదమలై మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) పేర్లను స్మరిస్తూ వ్యాఖ్యలు చేశారు. తమిళ సంస్కృతి , సంప్రదాయాలను గౌరవించడం తమ బాధ్యతని పేర్కొన్నారు. కొత్త ఆశలు – కొత్త శక్తి అన్నది త మిళ నూతన సంవత్సరం వేళ తమిళనాడు రాజకీయాల్లో మార్పు మొదలైందన్నారు. ప్రజలు కొత్త ఆశలతో ఎన్డీయే వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. డీఎంకే, కాంగ్రెస్ కూటమి కేవలం ‘ద్వేషపూరిత రాజకీయాలకే‘ పరిమితమయ్యాయని మండది పడ్డారు. కేంద్ర ప్రభుత్వం అందించే అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రజలకు అందకుండా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. ఎన్డీయే కూటమిదే అధికారం ఎన్డీఏ కూటమిదే తమిళనాట అధికారం అని పేర్కొంటూ భారీ మెజారిటీతో గెలిపించడం ప్రజల బాధ్యతగా వ్యాఖ్యలు చేశారు. డీఎంకేకు రాష్ట్ర అభివృద్ధి కంటే కుటుంబ రాజకీయాలకే ఎక్కవ అని మండి పడ్డారు. ఢిల్లీ పార్లమెంట్లో తమిళనాడు గొంతు బలంగా వినబడాలనేదే బీజేపీ లక్ష్యం అని, తమిళనాడు ప్రజల ప్రయోజనాల కంటే తమ స్వార్థ రాజకీయాలే డీఎంకేకు ముఖ్యంగా మండి పడ్డారు. నియోజకవర్గాల విభజన ద్వారా తమిళనాడుకు వచ్చే అదనపు బలాన్ని చూసి వారు భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కొంగు మండలం కూటమి కోట అన్నాడీఎంకే ప్రధానకార్య దర్శిపళణి స్వామి ప్రసంగిస్తూ , కొంగు మండలంలోని 23 స్థానాల్లోనూ తామే గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. తిరుప్పూర్, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామన్నారు. ఈ ఎన్నికలు కేవలం అధికారం కోసం మాత్రమే కాదని, తమిళనాడును దోచుకుంటున్న ఒక కుటుంబానికి (డీఎంకే), రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమని ఆయన పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలికేందుకే ఈ కూటమి ఏర్పడిందని స్పష్టం చేశారు. -
మహిళా లోకం స్టాలిన్ను ఎన్నటికీ క్షమించదు
సాక్షి, చైన్నె: పార్లమెంటులో 33శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడమే కాకుండా, ఆ అపజయాన్ని బాణసంచా కాల్చి , స్వీట్లు పంచి వేడుకగా జరుపుకోవడం విచారకరం అని పీఎంకే నేత అన్బుమణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో . స్టాలిన్ చరిత్రలో ఒక శ్రీద్రోహిశ్రీగా నిలిచిపోతారని ఆయన విమర్శించారు. శనివారం అన్బుమణి మాట్లాడుతూ మహిళా సాధికారతకు అడ్డుకట్ట మహిళలకు రాజకీయ అధికారం దక్కకుండా చేయడంలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు గత 33 ఏళ్లుగా కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే స్టాలిన్, మహిళలకు అన్యాయం చేయడంలో మాత్రం ముందున్నారని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన వలన తమిళనాడు సీట్లు తగ్గుతాయని స్టాలిన్ ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. వాస్తవానికి తమిళనాడు సీట్లు 39 నుండి 59కి పెరుగుతాయని ప్రధాని, హోం మంత్రి పార్లమెంటులో హామీ ఇచ్చినా స్టాలిన్ మొండిగా వ్యవహరించారని మండిపడ్డారు. మహిళా వ్యతిరేక మనస్తత్వం: మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టడం స్టాలిన్కు ఇష్టం లేదని, వారు ఎప్పుడూ వంటింటికే పరిమితం కావాలనే శ్రీపెన్నడిమైశ్రీ (మహిళా బానిసత్వ) బుద్ధి ఆయనలో ఉందని ఘాటుగా విమర్శించారు. బిల్లు వీగిపోవడం వల్ల వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుకు వెళ్లాల్సిన 20 మంది తమిళ మహిళల అవకాశాన్ని స్టాలిన్ చెడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడాన్ని బాణసంచా కాల్చి సంబరం చేసుకోవడం స్టాలిన్ లోని శ్రీశాడిజంశ్రీకు నిదర్శనమని అన్బుమణి అన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూదుల ఊచకోతను చూసి హిట్లర్ ఎలాగైతే ఆనందించాడో, మహిళల రాజకీయ ఎదుగుదల దెబ్బతినడం చూసి స్టాలిన్ అలాగే సంతోషిస్తున్నారని విమర్శించారు. -
అన్నాడీఎంకే నమూనా చెక్కులు
సేలం: ఆత్తూరు సమీపంలో అన్నాడీఎంకే సభ్యులు పంపిణీ చేసిన మోడల్ చెక్ బుక్ను ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకున్నారు. సేలం జిల్లాలోని ఆత్తూరు నియోజకవర్గం పరిధిలోని కీరిపట్టిలో ఏఐఏడీఎంకే కార్యనిర్వాహకులు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రదేశాలకు సంబంధించిన మోడల్ చెక్కులను ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో ప్రచురితమయ్యాయి. దీని అనంతరం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ తంబూరాజ్ ఆదేశాల మేరకు, ఎన్ని కల ఫ్లయింగ్ స్క్వాడ్లు కీరిపట్టి ప్రాంతంలో దాడులు నిర్వహించాయి. కీరిపట్టిలో రూ.10,000, రూ.2,000 విలువైన శాంపిల్ చెక్కులను పంపిణీ చేస్తున్న ఇద్దరు మహిళలను ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. వారి నుంచి 100 శాంపిల్ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి కలవతి మల్లియకరై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
తమిళ హక్కుల రక్షణలో తగ్గేది లేదు
సాక్షి, చైన్నె:తమిళుల హక్కుల పరిరక్షణలో తగ్గేది లేద ని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. నియోజకవర్గాల పున ర్ వ్యవస్థీకరణ బిల్లు ద్వారా తమిళనాడు ప్రజలను తమ సొంత దేశంలోనే శరణార్థులను చేయాలని చూసిన బీజేపీకి, వారికి వత్తాసు పలుకుతున్న అన్నాడీఎంకేకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వీగిపోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ విపక్ష కూటమి నేతలకు, ప్రజలకు శనివారం కృతజ్ఞతలు తెలియజేశారు. చీకటి చట్టంపై విజయం డీలిమిటేషన్ అనే చీకటి చట్టానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం విజయం సాధించిందన్నారు. దీని వలన కలిగే ప్రమాదాన్ని ఏడాది క్రితమే గుర్తించి, ఇండియా కూటమి నేతలను ఏకం చేశామన్నారు. నల్లజెండాల నిరసన నుండి దిండిగల్లో నిప్పురవ్వ వరకు.. ఆ సెగ పార్లమెంటును తాకిందన్నారు. 12 ఏళ్ల మోదీ పాలనలో ఒక రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి అని పేర్కొంటూ, ఇది బీజేపీ పతనానికి ఆరంభమని పేర్కొన్నారు. ఉత్తర–దక్షిణ విభజనను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్న వారికి ఇది సరైన సమాధాన ం అని అన్నారు. మహిళా రిజర్వేషన్లపై విమర్శ మహిళా రిజర్వేషన్ల ముసుగులో ఈ చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ చూసిందని, అయితే మహిళలే ఈ మో సాన్ని కనిపెట్టి ఓడించారని పేర్కొన్నారు. ఇప్పుడున్న నియోజకవర్గాల సంఖ్యతోనే తక్షణమే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా మమతా బెనర్జీ, కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ వంటి జాతీయ నేతలందరికీ స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, పినరయి విజయన్ వంటి దక్షిణాది ముఖ్యమంత్రుల సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజనను సమర్థించిన ఎడప్పాడి పళనిస్వామి బృందం తమిళనాడుకు ద్రోహం చేసిందన్నారు. ఆయన ఢిల్లీకి ఏజెంట్గా మారిపోయారని స్టాలిన్ మండిపడ్డారు. గతంలో హిందీ వ్యతిరేక పోరాటాల నుండి నేటి హక్కుల పోరాటం వరకు డీఎంకే ఎప్పుడూ ముందుంటుందని, 2026 ఎన్నికల్లో బీజేపీ–అన్నాడీఎంకే కూటమికి ఘోర పరాజయం తప్పదన్నారు. బనియన్ కార్మికులతో సమావేశం తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం స్టాలిన్ శనివారంతిరుపూర్లో పర్యటించారు.. ఈ సందర్భంగా ఆయన అకస్మాత్తుగా ఒక ప్రైవేట్ బనియన్ కంపెనీని సందర్శించి, అక్కడ పనిచేస్తున్న మహిళా కార్మికులతో ముఖాముఖి చర్చించారు. ప్రస్తుతం అందుతున్న మహిళా హక్కుల పథకం గురించి ఆరా తీశారు. ‘ద్రావిడ మోడల్ 2.0‘ ప్రభుత్వం ఏర్పడగానే, ఈ భత్యాన్ని రూ. 2000లకు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆయన అడిగి తెలుసుకున్నారు. కార్మికుల డిమాండ్లను తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని, ప్రభుత్వం ఏర్పడగానే వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. స్టాలిన్ -
● స్టాలిన్ను లొంగ దీసుకోవడం ఎవరి తరం కాదు ● కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టీకరణ
సాక్షి, చైన్నె: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ను బెదిరించడం లేదా లొంగదీసుకోవడం ప్రధాని మోదీ, అమిత్ షా తరంకాదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. శనివారం తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు మద్దతుగా తిరువళ్లూరు జిల్లా పొన్నేరి, షోళింగర్, తిరుచ్చి జిల్లా తురైయూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. సుడిగాలి పర్యటనతో శనివారం సాగిన ప్రచారాలలో రాహుల్గాంధీ తమిళులను ఆకర్షించే విధంగా ప్రసంగించారు. బొమ్మ ముఖ్యమంత్రి కుట్ర ఈ ఎన్నికలు సాధారణమైనవి కావని రాహుల్ పేర్కొన్నారు. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని తొలగించి, తమ మాట వినే ఒక ‘బొమ్మ ముఖ్యమంత్రి’ని కూర్చోబెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. గతంలో అన్నాడీఎంకే ఒక గొప్ప పార్టీగా ఉండేది, ఇప్పుడు అది బీజేపీకి మాస్క్గా మారిపోయిందని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన మహిళా బిల్లు ముసుగులో నియోజకవర్గాల పునర్విభజనను తీసుకురావడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల గళాన్ని పార్లమెంటులో నొక్కేయాలని బీజేపీ చూసిందన్నారు. కానీ విపక్షాలన్నీ కలిసి ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టాయన్నారు. తమిళనాడుతో తనకున్నది కేవలం రాజకీయ సంబంధం కాదని, ఇది ప్రేమతో కూడిన బంధం అని వ్యాఖ్యానించారు. తన నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ కాలం నుండి కొనసాగుతున్న అనుబంధమన్నారు. తాను ఢిల్లీలో తమిళ ప్రజల ప్రతినిధిగా, సైనికుడిగా పనిచేస్తానన్నారు. తమిళనాడు కోసం గళమెత్తుతానని రాహుల్ భావోద్వేగంగా ప్రసంగించారు. తమిళనాడు గడ్డతో కాంగ్రెస్కు విడదీయరాని బంధం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. హస్తినలో తమిళుల సైనికుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం విస్తృతంగా పర్యటించారు. -
మణప్పారైపై మంత్రుల దృష్టి
సాక్షి, చైన్నె: తిరుచ్చి మణప్పారై నియోజకవర్గంలో కూటమి తరఫున పోటీ చేస్తున్న మనిదనేయ మక్కల్ కట్చి అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే అబ్దుల్ సమద్పై సొంత పార్టీలోనే కాకుండా ప్రజల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో డీఎంకేలో కలవరం మొదలైంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మంత్రులు కె.ఎన్.నెహ్రూ, అన్బిల్ మహేష్ పొయ్యామొళి రంగంలోకి దిగారు. స్థానిక డీఎంకే నేతల అసంతృప్తి మణప్పారై సీటును వరుసగా కూటమి పార్టీలకే కేటాయిస్తుండడంతో స్థానిక డీఎంకే నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమకు అవకాశం రాకపోవడంతో వారు ప్రచారంలో ఉత్సాహం చూపించకుండా వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా అబ్దుల్ సమద్ గత ఐదేళ్లలో తమ ప్రాంతాలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని ఆరోపిస్తూ, ఆయన ప్రచారానికి వెళ్లిన చోటల్లా అడ్డుకునే పనిలో పడ్డారు. కొన్ని పంచాయతీలలో వివాదాల నేప థ్యంలో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మంత్రుల బుజ్జగింపులు పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన అబ్దుల్ సమద్.. జిల్లా మంత్రులు నెహ్రూ, అన్బిల్ మహేష్లకు ఫిర్యాదు చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా మంత్రులు నియోజకవర్గంలో పర్యటిస్తూ స్థానిక నేతలను శాంతింపజేస్తున్నారు. శనివారం ప్రచారంలో పాల్గొన్న మంత్రి నెహ్రూ మాట్లాడుతూ.. గతసారి లాగే ఈసారి కూడా అందరూ కలిసికట్టుగా ఉండి అబ్దుల్ సమద్ను గెలిపించాలని కోరారు. అవకాశం రాని స్థానిక నేతలు గోవిందరాజన్, రామస్వామి, బాలసుబ్రమణి వంటి వారికి భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుందని బుజ్జగించారు. మంత్రుల ఆదేశాల మేరకు తాము అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని డీఎంకే కార్యకర్తలు చెబుతున్నప్పటికీ, లోలోపల అసంతృప్తి కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. మరోవైపు, మంత్రుల జోక్యంతో ప్రస్తుతం డీఎంకే శ్రేణులు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నాయని ఆ పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి అల్తాఫ్ తెలిపారు. -
రంజని పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: ప్రముఖ రచయిత్రి, గాయని డా. గుమ్మడి రామలక్ష్మి రచించిన రంజని గజళ్ల పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. ఐఐటీ మద్రాసులోని ఐసీఎస్ ఆర్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ఆచార్య పద్మశ్రీ కామకోటి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అలాగే మద్రాసు విశ్వవిద్యాలయం మెరీనా క్యాంపస్ డైరెక్టర్, తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు గౌరవ అతిథిగా, వీణావాయిద్యకారిణి, కళాకారిణి శారదా తోటతరణి, ఆత్మీయ అతిథిగా , తెలుగు తరుణి అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసల రమణి, రేణుకా కామకోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా విద్యార్థి మోక్షజ్ఞ, ప్రార్థనా గీతం ఆలపించారు. అల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత సుష్మిత సభకు అతిథులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి హాజరయ్యారు. విద్యార్థుల డీన్, ప్రొఫెసర్ గుమ్మడి సత్యనారాయణ కామకోటిని శంకర రావుని,తోటతరణిని శాలువాతో సత్కరించారు. రచయిత్రి రామలక్ష్మి, శారదా తోటతరణిని, కాసల రమణిని, రేణుకా కామకోటిని సన్మానించారు. తర్వాత కామకోటి రంజని గజళ్ళ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, రంజని అనేది రాగం పేరు అని, రంజని రాగం అంటే తనకు చాలా ఇష్టం అన్నారు. ఐఐటి మద్రాసులో ఆచార్యులు శాస్త సాంకేతికంగా కృషి చేసి అభివృద్ధిని సాధిస్తుంటే రామలక్ష్మి తన సృజనాత్మకతతో సంగీతం సాహిత్యం పట్ల ప్రగతిని సాధిస్తున్నారని ప్రశంసించారు. సంగీత దర్శకుడు ఇళయరాజా విద్యార్థులకు సంగీతం నేర్పించడానికి ప్రత్యేక భవనం నిర్మిస్తున్నామని, ఆవరణలో విద్యార్థులు , అందరికోసం ఒత్తిడి తగ్గించడానికి ఆహ్లాదకరమైన వాతావరణంతో మ్యూజిక్ ఫౌంటైన్ నిర్మిస్తున్నామని, అది ఏడు వారాలు ఏడు రాగాలతో సంగీతం వినిపిస్తుందని తెలిపారు. -
అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి
– జస్టిస్ పి.ఎన్. ప్రకాష్ సాక్షి, చైన్నె: యువత అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీఎన్ ప్రకాష్ పిలుపునిచ్చారు. శ్రీరామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో శనివారం స్నాతకోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. డెంటల్, ఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ తదితర విభాగాలకు చెందిన 421 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకున్నారు. మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.ఎన్.ప్రకాష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అవినీతి రహిత భారతం విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేసినానంతరం జస్టిస్ పీఎన్ ప్రకాష్ మాట్లాడారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం ఒకటి అని, యువత అవినీతికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడాలని పిలుపునిచ్చారు. కేవలం అకడమిక్ మార్కుల కంటే ఆచరణాత్మక నైపుణ్యాలు వృత్తి పరంగా రాణించడానికి దోహదపడతాయని తెలిపారు. గ్రాడ్యుయేషన్ అనేది నేర్చుకోవడానికి ముగింపు కాదని, నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని విద్యార్థులకు సూచించా రు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాల జీ వంటి ఆధునిక సాంకేతికతలను కేవలం వినియోగదారులుగా మాత్రమే కాకుండా, వాటిలో కొత్త ఆవిష్కరణలు చేసే సృష్టికర్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ వర్సిటీ ప్రో–ఛాన్సలర్ ఆర్.వి.సెంగుట్టువన్, ట్రస్టీ సంయుక్త వెంకటాచలం, డీన్ డాక్టర్ హెచ్.తమిళ సెల్వన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బస్సు బోల్తా వేలూరు:తిరువణ్ణామలై నుంచి సుమారు 30 మందికి పైగా ప్రయాణికులతో ప్రభుత్వ బస్సు శనివారం ఉదయం విల్లుపురం బయలు దేరింది. ఈ బస్సులో తిరుచ్చి జిల్లా లాల్కుడి గ్రామానికి చెందిన కనకరాజ్(40) ప్రయాణం చేశాడు. ఇతను సమయపురంలోని ఒక హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. బస్సు వేట్టవలం వద్ద వెళ్తున్న సమయంలో డ్రైవర్ అదుపు తప్పి బస్సు రోడ్డుపై అటు ఇటు వెల్లి వెల్లి రోడ్డు పక్కన ఉన్న పల్లంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు లో ప్రయానం చేసిన కనకరాజ్ అక్కడిక్కడే మృతి చెందగా సుమారు 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీటిని గమనించిన స్థానికులు వెంటనే వేట్టవలం పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరువణ్ణామలైలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కనకరాజ్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. -
రోడ్డుపై తిరగలేవు..!
సేలం : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళయంలో శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, టీవీకే కన్వీనర్ సెంగోట్టయ్యన్పై ఆయన వ్యక్తిగత విమర్శలు చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సెంగోట్టయ్యన్ గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రవర్తన సరిగ్గా లేదని, స్వయంగా ఆయన భార్య, కుమారుడే సచివాలయానికి వచ్చి జయలలితకు ఫిర్యాదు చేశారని ఈపీఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫిర్యాదుల వల్లే అప్పట్లో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. అలాంటి వ్యక్తిని తన మంత్రివర్గంలోకి తీసుకుని పెద్ద తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వల్ల సింధు రవిచంద్రన్ వంటి ఎందరో నేతలు ఇబ్బందులు పడ్డారని, పార్టీని వీడారని ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారు ఎవరైనా ’అమ్మ’ (జయలలిత) శైలిలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. డీఎంకే గూఢచారి అసెంబ్లీలో డీఎంకేకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేని సెంగోట్టయ్యన్, నిజానికి ఒక డీఎంకే గూఢచారి అని మండిపడ్డారు. స్టాలిన్ సమక్షంలో ఆయన వ్యవహరించిన తీరును ఎండగడుతూ, ఆయన అన్నాడీఎంకేకు విధేయుడు కాదని తేల్చి చెప్పారు. రాజకీయంగా మాట్లాడటం మానేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే, తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ బయటపెడతానని సెంగోట్టయ్యన్ను హెచ్చరించారు. అప్పుడు గోబిచెట్టి పాళయం రోడ్ల మీద నడవలేవు, ప్రజలు నీపై ఉమ్మివేస్తారు అని ఈపీఎస్ ఘాటుగా హెచ్చరించారు. -
బిల్లు వీగిపోవడం మనకు దక్కిన విజయం
సాక్షి, చైన్నె: పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన వీగి పోవడం డీఎంకేకు దక్కిన సగం విజయం మాత్రమేనని, మిగిలిన సగం విజయం ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమిని గెలిపించడం ద్వారానే సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తిరుచెంగోడ్ నియోజకవర్గ కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి అభ్యర్థి ఈశ్వరన్కు మద్దతుగా ఆయన శనివారం ప్రచారం నిర్వహించారు.నామక్కల్లో సీఎం స్టాలిన్ నల్ల చట్టం (డీలిమిటేషన్) ప్రతిని తగులబెట్టారని గుర్తు చేస్తూ, ఆ సెగ దేశమంతటా వ్యాపించి, చివరకు పార్లమెంటులో ఆ బిల్లు వీగిపోయేలా చేసిందన్నారు. ఇది తమిళనాడు పోరాటానికి దక్కిన విజయం.గా వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే సీఎం స్టాలిన్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై సంతకం చేశారని గుర్తు చేశారు. పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, 10 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ వంటి పథకాలను అమలు చేశామని తెలిపారు. గత ఐదేళ్లలో కేంద్ర బడ్జెట్లో తమిళనాడుకు ఒక్క పథకం కూడా ఇవ్వలేదని, అసలు శ్రీతమిళనాడుశ్రీ అనే పేరే బడ్జెట్లో కనిపించలేదని మండిపడ్డారు. అందుకే బీజేపీ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఎడప్పాడి పళనిస్వామి బీజేపీకి తీవ్ర బానిసగా మారి పోయారన్నారు. -
ఉదయ నిధిని సీఎంగా అంగీకరించే ప్రసక్తే లేదు!
సాక్షి, చైన్నె: ఉదయనిధిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమిళ ప్రజలు ఎన్నటికీ అంగీకరించరని కేంద్ర మంత్రి, తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. తమిళ సంస్క్కతికి, మహిళలకు వ్యతిరేకంగా మనస్తత్వం కలిగిన ఉదయనిధి స్టాలిన్ను తమిళనాడు ప్రజలు ఎప్పటికీ క్షమించబోరన్నారు. నీలగిరి జిల్లా ఊటీ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి భోజరాజన్కు మద్దతుగా ఆయన శనివారం ప్రచారం నిర్వహించారు. కూటమి విజయం ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలోని జాతీయ ఎన్డీఏ ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తుందన్నారు. మే 4న కొత్త ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు సేవ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్టాలిన్ కుటుంబం వలన తమిళనాడులో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. స్టాలిన్, ఉదయనిధి, శబరీశన్, కనిమొళి ఇలా ఒకే కుటుంబం చేతిలో పాలన బందీ అయిందన్నారు. టాస్మాక్ (మద్యం), భూ కేటాయింపులు ఇలా ప్రతి శాఖలోనూ అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.. ఉద్యోగాల కోసం లంచాలు తమిళనాడులో యువత ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది ప్రజలకు ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. స్టాలిన్ తన వారసుడు ఉదయనిధిని ముందుగా ఉప ముఖ్యమంత్రిని చేసి, ఈ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిని చేయాలనే పథకం పన్నారని, అయితే, ప్రజలు ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. ఒకే కుటుంబం సాగిస్తున్న అవినీతి, అధ్వాన్నపు పాలన త్వరలోనే ముగుస్తుందని, బీజేపీ అన్నాడీఎంకే, పీఎంకే, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం తదితర తదితర కూటమి పార్టీలన్నీ ఒకే కుటుంబంలా ప్రజల కోసం శ్రమిస్తున్నాయన్నారు. కాగా, ఊటికి హెలికాఫ్టర్లో మంత్రి వచ్చారు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్వర్గాలు ఆయన హెలికాఫ్టర్ను, ఆయన కోసం సిద్ధం చేసిన వాహనాలను తనిఖీలు చేశాయి. -
ఆగస్టు 27 నుంచి శ్రీవ్యాసాశ్రమ శతజయంతోత్సవాలు
పరిపూర్ణానందగిరి స్వామి ఏర్పేడు: మండల కేంద్రంలోని మహర్షి సద్గురు మలయాళ స్వామి స్థాపించిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీవ్యాసాశ్రమం శతజయంతోత్సవాలు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు వైభవంగా జరుగుతాయని వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి శనివారం తెలిపారు. ఆయన వ్యాసాశ్రమంలోని అధిష్టాన మందిరంలో మాట్లాడుతూ మలయాళ స్వామి ఏర్పేడులో శ్రీవ్యాసాశ్రమాన్ని నెలకొల్పి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతజయంతోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలుత మే నెల 2వ తేదీ నుంచి ఉత్సవాలు జరపాలని భావించినా, అనివార్య కారణాల రీత్యా ఉత్సవాలు ఆగస్టు 27వ తేదీ నుంచి జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. శ్రీవ్యాసాశ్రమం ప్రాంగణంలో జరగనున్న ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి అనేక మంది పీఠాదీశులు, మఠాదీశులు, సాధు మహర్షులు హాజరు కానున్నారని తెలిపారు. వారం రోజుల పాటు విశేష యాగపూజలు, హోమాలు, సద్గురువుల ఉపన్యాసాలు తదితర కార్యక్రమాలు జరగనున్నట్లు వెల్లడించారు. దేశ, విదేశాల నుంచి విచ్చేసే వ్యాసాశ్రమ భక్తులకు వారం రోజులు ఆశ్రమంలో వసతి, అన్నదానం వంటి సౌకర్యాలను కల్పిస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాలకు హాజరై సద్గురు మలయాళ స్వామి దివ్యాశీస్సులు పొందాలని కోరారు. -
స్వార్థంతోనే బిల్లును వ్యతిరేకించారు
సాక్షి, చెన్నై: తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఒక గొప్ప ప్రయత్నమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీల విద్వేష, నీచ రాజకీయాల వల్ల ఆ బిల్లు పట్టాలు తప్పిందని అన్నారు. అధికారం కేవలం తమ కుటుంబాల చేతుల్లోనే ఉండాలన్న స్వార్థంతోనే విపక్షాలు మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని, బిల్లు క్రెడిట్ను ప్రతిపక్షాలే తీసుకోవాలంటూ వ్యక్తిగతంగా అభ్యర్థించానని చెప్పారు. అయినా సరే విపక్షాలు మద్దతు ఇవ్వలేదన్నారు. సాధారణ కుటుంబాల్లో జన్మింంచిన ఆడబిడ్డలు అత్యున్నత చట్టసభలకు అధిక సంఖ్యలో రావాలని కోరుకున్నట్లు తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తూ ఈ గొప్ప ప్రయత్నం సాకారం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలే అందుకు కారణమని మండిపడ్డారు. బిల్లు ఆమోదం పొంది ఉంటే సామాన్య కుటుంబాలకు చెందిన ఎంతోమంది తమిళ మహిళలు ఎంపీలుగా, ఎమ్మెల్యేలు అయ్యేవారని.. 2011 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడుకు లోక్సభలో మరెన్నో సీట్లు వచ్చేవని తెలిపారు. కానీ, ఇదంతా జరగడం డీఎంకేకు ఇష్టం లేదని ప్రధానమంత్రి ఆరోపించారు. -
మోదీ గుట్టు ట్రంప్కు తెలుసు
సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియంత్రిస్తున్నారని.. మోదీ మాత్రం తమిళనాడును నియంత్రించాలని చూస్తున్నారని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ విమర్శించారు. తమిళనాడులో అధికారం దక్కించుకోవడానికి అన్నా డీఎంకేను గుప్పిట పట్టారని చెప్పారు. ప్రధాని మోదీ మన రైతులను, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఇతర దేశాలకు అమ్మేశారని, మన ఇంధన భద్రతను పరాయి దేశాలకు అప్పగించారని, మన డేటాను కూడా పంచిపెట్టారని ఆరోపించారు. శుక్రవారం పార్లమెంట్లో మోదీ ముఖంలో ఆత్మవిశ్వాసం లోపించడం చూశా మని అన్నారు. ఆయన ప్రతిపక్షాలకు ముఖం చూపించలేకపోయారని, పక్కన కూర్చుండిపోయారని చెప్పారు. మోదీ అమెరికా నియంత్రణలో ఉండటమే అందుకు కారణమని తేల్చిచెప్పారు. మన దేశాన్ని అమ్మేయడానికి భారత్–అమెరికా ఒప్పందంపై ప్రధాని సంతకం చేశారని ఆక్షేపించారు. తమిళనాడులోని రాణిపేట, పొన్నేరి, తిరుచిరాపల్లిలో శనివారం ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ట్రంప్ ఎలా చెబితే అలా మోదీ తలవంచే పరిస్థితి ఉందన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా మోదీని ట్రంప్ నియంత్రిస్తున్నారని చెప్పారు. మోదీ ఆర్థిక లావాదేవీలు, అదానీతో మోదీకి ఉన్న బంధం గురించి ట్రంప్కు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. దేశాన్ని పరిరక్షించుకోవడానికే శుక్రవారం లోక్సభలో ప్రతిపక్షాలు డీలిమిటేషన్ బిల్లును ఓడించాయని రాహుల్ గాంధీ అ న్నారు. పార్లమెంట్లో తమిళనాడు ప్రాతినిధ్యాన్ని తగ్గించాలన్నదే అసలు ఉద్దేశమని విమర్శించారు. దక్షిణ రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల బలాన్ని తగ్గించడానికే బీజేపీ ఈ పునరి్వభజన చర్య చేపట్టిందని ధ్వజమెత్తారు. తమిళనాడును కాపాడుకోవాలంటే డీఎంకే నేతృత్వంలోని కూటమిని ఎన్నికల్లో గెలిపించాలని రాహుల్ కోరారు. -
టీచర్ ఇంట దొంగలు పడ్డారు
చెన్నై: వల్లియూర్లో ఎన్నికల శిక్షణకు వెళ్లిన ఒక ఉపాధ్యాయురాలి ఇంట దొంగలు పడ్డారు. 21 సవర్ల విలువైన నగలు చోరీ చేశారు. వివరాలు.. నెల్లై జిల్లా, వల్లియూర్, రామలక్ష్మి నగర్కు చెందిన రోసారియో భార్య సహాయుజిన్ శాంతి (58) ఏర్వాడి ప్రభుత్వ బాలికల పాఠశాలలో టీచర్గా పని చేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, పోలింగ్ కేంద్రాల అధికారులుగా పనిచేసే ఉపాధ్యాయులకు గురువారం వల్లియూర్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి సహాయుజిన్ శాంతి వెళ్లారు. అలాగే తన పోస్టల్ బ్యాలెట్కు కూడా అక్కడ నమోదు చేసుకున్నారు. తిరిగి సాయంత్రం ఇంటికి ఆమె వచ్చా రు. ఇంట్లోని బెడ్రూమ్లో బీరువా తెరచి ఉండటం, అందులో ఉన్న వాటిని చెల్లాచెదురుగా చేసి పడేసి ఉండటంతో ఆందోళన చెందారు. బీరువాను పరిశీలించి చూడగా అందులో ఉన్న 50 సవర్ల నగల్లో దాదాపు 21 సవర్ల బంగారు నగలు చోరీ చేసినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 21 లక్షలు. దీనిపై తన భర్తకు ఆమె సమాచారం ఇవ్వడంతో అతను ఇంట్లో పనిచేస్తున్న వారిని ప్రశ్నించాడు. తామేమీ చోరీ చేయలేదని వారు పేర్కొనడంతో చివరకు వల్లియూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ ఇంటిలోని నిఘా కెమెరా ఫుటేజీని పరిశీలించారు.ఆ ఇంట్లో పనిచేస్తున్న కొంతమంది మహిళల బంధువులు ఇద్దరు వచ్చి వెళ్లినట్లు తేలింది. దీని ఆధారంగా పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసు కుని విచారణ చేస్తున్నారు. -
తల్లే నరరూప రాక్షసి.. 95 ఏళ్ల జైలు విధించిన కోర్టు
అన్నానగర్: మైనర్ బాలికపై సామూహిక లైంగికదాడి చేసిన ముగ్గురికి జైలు శిక్ష, దీనికి సహకరించిన బాలిక తల్లికి 95 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శివగంగై పోక్సో కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. వివరాలు.. శివగంగై జిల్లా తిరుపత్తూరు ప్రాంతానికి చెందిన అక్బర్ అలీ అంబలం (71), డ్రైవర్. అరియలూరుకు చెందిన శరవణన్ (41) కూలీ. పుదుక్కోట్టై జిల్లా అళగియనాయకిపురం గ్రామానికి చెందిన మురుగేషన్ (55). ముగ్గురూ కలిసి 2021లో 15 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక తల్లి కూడా దీనికి సహకరించడం గమనార్హం! తిరుపత్తూరు అఖిల మహిళా పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. అక్బర్ అలీ, శరవణన్, మురుగేశన్, బాలిక తల్లి మరో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. శివగంగైలోని పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు శుక్రవారం తుది విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి గోకుల్ మురుగన్, నిందితుడు అక్బర్ అలీ అంబలానికి 50 ఏళ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా, శరవణకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, మురుగేషన్కు 25 ఏళ్లు జైలు, రూ.11 వేలు జరిమానా, బాలిక తల్లికి 95 ఏళ్లు జైలు శిక్ష, రూ.5వేల జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు. మిగతా ఇద్దరు మహిళలను నిర్దోషులుగా విడుదల చేశారు. బాధితురాలికి నష్టపరిహారంగా రూ. 5 లక్షలు చెల్లించాలని కూడా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
జననాయకన్ చిత్రం ఎలా లీక్ అయ్యిందంటే..?
తమిళసినిమా: నటుడు, వీటీకే పార్టీ అద్యక్షుడు విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జననాయకన్. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఇందులో నటి మమితబైజు, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత జన వరి 9వ తేదీ విడుదల కావలసి ఉన్నా, సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 11న చిత్రం మొత్తం ఇంటర్నెట్లో లీక్ అయ్యి యావత్ చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. దీంతో దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్ర నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేయడంతో చైన్నె సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఆరుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తాజాగా మరో ముఖ్యులైన ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిని విచారణ చేయడంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. జననాయకన్ చిత్రాన్ని ఎడిటింగ్ చేసిన చైన్నెలోని ఒక స్టూడియో నుంచే చిత్రం లీక్ అయ్యిందని తెలిసింది. చిత్రం కొంత భాగం ఎడిటింగ్ బాధ్యతలను ఒక సహాయ ఎడిటర్కు అప్పగించడంతో అతనే చిత్రాన్ని పూర్తిగా రికార్డ్ చేసి ఒక నిర్మాతకు ఇచ్చాడని, ఆ నిర్మాత జననాయకన్ చిత్రాన్ని ఇంటర్నెట్లో లీక్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని సమాచారం. దీంతో ఈ వ్యవహారంలో మరెవరి ప్రమేయమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జైలర్ 2 చిత్రంలో రజనీకాంత్ తమిళసినిమా: ఇటీవల చిత్రాలు విడుదలకు ముందే కొన్ని సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో లీక్ అవడం పరిపాటిగా మారి నిర్మాతలకు ఇదో సమస్యగా మారింది.. ఇటీవల నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయకన్ చిత్రం పూర్తిగా ఇంటర్నెట్లో లీక్ కావడం యావత్ చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. దీనిపై సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం జైలర్–2 చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలతో కూడిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో లీక్ అయ్యి వైరల్ అవుతోంది. దీంతో షాక్కు గురైన చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ వీడియోను నిలువరించడానికి తాము ఒక ప్రత్యేక బృందాన్ని నియమించి తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నామని ప్రకటించింది. అంతేకాకుండా లీక్ అయిన ఆ వీడియోను ఇతర వెబ్సైట్లలో ప్రసారం చేయడంగానీ, ఇతరులకు పంపడం గానీ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తాము తీసుకునే చర్యలకు చిత్ర నిర్మాణ సంస్థ ఎలాంటి బాధ్యత వహించదదని సన్ పిక్చర్స్ సంస్థ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. -
రసవత్తర పోరు
హోసూరు.. ● హోసూరు కార్పొరేషన్గా మారినా, పెరుగుతున్న నేరాలను అదుపు చేయడానికి తగినంత మంది పోలీసులు లేరు. ● ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య నెలకొంది. ● రూ. 20 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ పువ్వుల ఎగుమతి కేంద్రం రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ● టమాటాలు, కూరగాయల నిల్వ కోసం కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు. ● బెంగళూరు–హోసూర్ మెట్రో రైలు ప్రాజెక్టు, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, ఈఎస్ఐ ఆసుపత్రిని ఆధునీకరించాలనే విజ్ఞప్తులు పెండింగ్లో ఉన్నాయి. ● హోసూరులో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం పనులకు పచ్చటి పంట పొలాలను స్వాఽధీనం చేసుకోకూడదన్న నినాదం మార్మోగుతోంది.తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లోని హోసూరు బహు భాషల సమ్మేళనంతో నిండి ఉన్నా, ఇక్కడ తెలుగు ఓటరే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అందుకే ఇక్కడ అచ్చతెలుగు నాయకుడు బాలకృష్ణారెడ్డి అన్నాడీఎంకే అభ్యర్థిగా, తెలుగు సంతతికి చెందిన సత్య డీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యలో టీవీకే అభ్యర్థిగా వేందర్ కరసన్ అలియాస్ వడివేలు, ఎన్టీకే అభ్యర్థిగా స్టాలిన్ పోటీలో ఉన్నారు. సాక్షి, చైన్నె మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గం పరిసరాలు పారిశ్రామికంగా ప్రగతి పథంలో ఉన్నాయి. సుమారు మూడు వేలకు పైగా చిన్న, మధ్య తరహా, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. వాచీలు, ద్విచక్ర , నాలుగు చక్రాల వాహనాల తయారీతో పాటు, ఆపిల్ ఐఫోన్ తయారీ యూనిట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి చల్లని వాతావరణం, సారవంతమైన భూములు వ్యవసాయానికి ఎంతో అనుకూలం. రోజా, ఇతర పువ్వులను ఇక్కడ అధికంగా సాగు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. చంద్రచూడేశ్వర స్వామి దేవాలయం, రాజాజీ జన్మస్థలమైన తొరపల్లి తదితర చారిత్రక ప్రాంతాలు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ పరిధిలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎక్కువే. తొమ్మిది సార్లు ఆ పార్టీ గెలిచింది. ఆ పార్టీకి చెందిన తెలుగు నాయకుడు గోపినాథ్ మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎంపీగా లోక్సభకు వెళ్లారు. ఇక్కడ తమిళం, కన్నడ, తెలుగు, ఉర్దూ మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్నారు. ఓటర్ల వివరాలు మొత్తం ఓటర్లు 3,38,295 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,69,099, మహిళలు 1,69,124, ఇతరులు 72 మంది ఉన్నారు. ఇక, వన్నియర్లు (12%), షెడ్యూల్డ్ కులాలు (13%), నాయుడు (11%), గౌడ (10%) ఇతర వర్గాల వారు 54% మంది ఉన్నారు. అభ్యర్థుల నేపథ్యం కాంగ్రెస్ కంచుకోటను 2016లో అన్నాడీఎంకే అభ్యర్థిగా బాలకృష్ణారెడ్డి బద్దలు కొట్టారు. అదృష్టం కలిసి రావడంతో మంత్రి కూడా అయ్యారు. అదే సమయంలో దురదృష్టం కూడా ఆయన్న వెంటాడింది. ఎప్పుడో జరిగిన ఓ కేసులో ఆయనకు జైలు శిక్ష పడడంతో అనర్హత వేటు పడి, పదవిని కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో ఈ స్థానాన్ని డీఎంకే కై వసం చేసుకుని అప్పటి నుంచి తన గుప్పెట్లో పెట్టుకుంది. తాజాగా తన గుప్పెట్లోకి నియోజకవర్గాన్ని తీసుకునేందుకు అన్నాడీఎంకే అభ్యర్థిగా బాలకృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు. తెలుగు ఓటర్ల మద్దతే కాదు, ఇతర సామాజిక వర్గాలు, కూటమి బలంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అదే సమయంలో ఈయన్ను ఢీ కొట్టే విధంగా బలమైన అభ్యర్థిని డీఎంకే నిలబెట్టింది. 2021లో ఇక్కడ గెలిచిన డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్కు ఈ సారి సీటు ఇవ్వలేదు. ఆయనకు బదులుగా గతంలో ఉప ఎన్నికలలో గెలిచిన, హోసూరు మేయర్గా ఉన్న సత్యను ఎంపిక చేశారు. ఈయన కూడా తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో సమరం రసవత్తరంగా మారింది. మేయర్గా ఆయనకు హోసూరు నగరం సుపరిచితం కావడంతో ఓట్ల వేటలో దూసుకెళ్తున్నారు. ఇక్కడ నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) అభ్యర్థిగా స్టాలిన్, విజయ్ తమిళగ వెట్రి కళగం (టీవీకే) వేందర్ కరసన్ (అలియాస్) వడివేలు పోటీలో ఉన్నారు. అయితే ప్రధాన సమరం అన్నది డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే నెలకొంది.ఇవీ సమస్యలు -
పురాణాల నేపథ్యంలో భగవాన్
తమిళసినిమా: నటుడు ఆరిఅర్జునన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భగవాన్. నటి పూజిత పొన్నాడ హీరోయిన్గా నటిస్తున్న ఇందులో జేమ్స్ బారెట్, సంతోష్ ప్రతాప్, ఆడుగళం నరేన్, ఢిల్లీ నారాయణన్, అలెక్స్, అభిషేక్, సత్య, మాస్టర్ పాండి, అజయ్ తాతా, జగధీశ్ జీవీ.కృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అమ్మన్యా మూవీస్ పతాకంపై జీవీ మంజునాథ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.కాళింగన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ.. ఈ ప్రపంచంలో మనకు అర్థం కాని పలు విషయాలు ఉన్నాయని, వాటిలో ఎన్నో రహస్యాలు ఉంటాయన్నారు. మనం అంతా భగవంతుడిని పూజిస్తామనీ, ఈ లోకాన్ని ఏలేది భగవంతుడు అయితే ఆయన ఎవరు, ఆయన ఒక రూపం మాత్రమేనా, లేక వేరేదా? అలాగైతే ఇలుమ్నాటి ఎవరు? ఇలాంటి పలు ప్రశ్నలకు బదులే ఈ చిత్రానికి కేంద్రబిందువు అని అన్నారు. మనకు తెలియని ప్రాచీన చరిత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని పౌరాణిక థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. భగవాన్ ఒక సాధారణ కథా చిత్రం కాదని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేదిగా ఉంటుందని అన్నారు. మహాభారతంలోని కొంత భాగం కూడా ఇందులో ఉంటుందని తెలిపారు. ఒక సాధారణ జీవిగా చూసే బల్లిని ఇందులో ఒక ముఖ్య పాత్రగా చూపించినట్లు చెప్పారు. ఒక కొత్త ఆలోచనతో విభిన్న కథాంఽశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. దీనికి మురు గన్ శరవణన్ ఛాయాగ్రహణంను, సంగీతాన్ని ప్రసన్ బాల, నేపథ్య సంగీతాన్ని యువరాజ్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే నెలలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా సెవెంత్ స్టూడియోస్ సంస్థ అధినేత కన్నన్ విడుదల చేస్తున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. -
కోల్పోయినవారికే విలువ తెలుస్తుంది
తమిళసినిమా: జీవితంలో ప్రతి ఒక్కరికీ ప్రతి సంఘటన ఒక అనుభవమే. అలాంటి అనుభవాలు చాలా పాఠాలు నేర్పుతాయి. కోల్పోయిన వాటి విలువలను తెలియ జేస్తాయి. ఒక చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే ఇక్కడ చాలా కథలు వెలుగు చూస్తాయి. అలాంటి పలు అనుభవాలను కలిగిన నటీమణుల్లో రెజీనా ఒకరు. అచ్చ తమిళ అమ్మాయి–2005 కండనాళ్ మొదల్ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును పొందన ఈ భామ ఆ తరువాత తమిళంలో పాటు, తెలుగు, కన్నడం, హిందీ తదితర భాషల్లో నటిస్తూ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నారు. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు. అయితే కథానాయకిగానే కాకుండా నటనకు అవకాశం ఉంటే ప్రతినాయకిగానూ నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. 35 ఏళ్ల ఈ భామ ఇప్పటికీ అవివాహితే. ఈమె ఇటీవల తన ఇన్స్టాలో ప్రేమ గురించి తెలిపారు. అందులో ‘నూతన రోజు, అయితే అదే రోజే నేను ప్రేమ కు సరెండర్ అయ్యాను. జరిగేది జరగడం అని భావించడాన్ని కొందరు బలహీనంగా భావిస్తున్నారు. అయితే ప్రేమ అనేది ఒక ప్రశాంతతో కూడిన బలం. ప్రతి రోజు మీ కోసం మీరు చిరునవ్వుతో లేచి నిలబడాలి. మీరు ప్రేమను అందించడానికి అర్హులు అనేది ఎప్పుడూ గుర్తుంచుకోండి. దాన్ని సాధారణంగా భావించరాదు. ప్రేమించడంలోనూ, ప్రేమించబడడంలోనూ ఉండే సంతోషం మనకు తెలియడానికి కారణం, దాన్ని కోల్పోవడంలోఉండే బాధ మనకు తెలుసు అన్నదే’ అని నటి రెజీనా పేర్కొన్నారు. ఈమె పోస్ట్కు కారణం ఏమిటి, స్వానుభవమా? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నటి రెజీనా ఫ్లాష్బ్యాక్, మూక్కుత్తి అమ్మన్–2, ది వైవ్స్, హిందీలో సెక్షన్ 108 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
హార్మొనీ ఫర్ హోప్
సాక్షి, చైన్నె: హిందుస్థాన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆధ్వర్యంలో హార్మొనీ ఫర్ హోప్–2026 పేరుతో సంగీత విభావరి చైన్నెలో ఘనంగా జరిగింది. అంతర్జాతీ య ప్రఖ్యాత కీబోర్డ్ మాంత్రికుడు స్టీఫెన్ దేవస్సీ తన అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ వేడుకకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. సంగీతం ద్వారా ప్రపంచ శాంతిని, సామరస్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గిండి, కరపాక్కం, పదూర్, పడపాయ్ క్యాంపస్లకు చెందిన విద్యార్థులు,టీచర్లు పాల్గొన్నారు. హిందుస్థాన్ బ్యాండ్ బిలీవర్, ఛాన్స్ ఇల్లా చైన్నె, రాక్ ఆన్ తదితర పాటలతో ఉత్సాహాన్ని నింపారు. సూపర్ సింగర్ ఫేమ్ మాస్టర్ ఆర్.పి.క్రిషాంగ్ ‘పాపా మేరే జాన్’, ‘రథమారే’ తదితర హిట్ సాంగ్స్తో అలరించారు. సంగీతం ద్వారా స్ఫూర్తిని నింపుతున్న స్టీఫెన్ దేవస్సీకి హిందుస్థాన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ తరఫున చైర్మన్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్ ‘మెసెంజర్ ఆఫ్ పీస్’(శాంతి దూత) బిరుదును ప్రదానం చేసి మాట్లాడారు. కళలు, సంస్కృతితో సామాజిక బాధ్యతను పెంపొందించడమే తమ లక్ష్యమన్నారు. హుండీ ఆదాయం లెక్కింపు తిరువళ్లూరు: శిరువాపురిలోని బాలసుబ్రమణ్య స్వామివారి ఆలయంలో గత నెలన్నర రోజుల్లో 83.82 లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్లోని శిరువాపురి ఆలయంలో ప్రసిద్ధి చెందిన శ్రీబాలసుబ్రమణ్య స్వామివారి ఆలయం ఉంది. నిత్యం వేలాది మంది భక్తులు వస్తుండడంతో రద్దీగా మారింది. ఈ నేపథ్యంలో గత 50 రోజుల్లో 83.82 లక్షల రూపాయల నగదుతో పాటు 51.300 మిల్లీగ్రాముల బంగారం, 4323 గ్రాముల వెండి కానుకలుగా వచ్చినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. -
ముమ్మరంగా తనిఖీలు
సాక్షి, చైన్నె: తమిళనాడు ఎన్నికల వేళ అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా భారీ మొత్తంలో ఎరచ్రందనం దుంగలతోపాటు కోట్ల విలువైన నగదు, బంగారం పట్టుబడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎరచ్రందనం స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చెంగల్పట్టు– విక్రవాండి సమీపంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా ఎరచ్రందనం దుంగలు పట్టుబడ్డాయి. చెంగల్పట్టు నుంచి విల్లుపురం మీదుగా తేని వైపు వెళ్తున్న ట్రక్కులను పోలీసులు తనిఖీ చేయగా, సిమెంట్ బస్తాల కింద దాచి ఉంచిన ఎరచ్రందనం బయటపడింది. ఈ ఎరచ్రందనం దుంగల విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇదే తనిఖీల్లో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాల్లో రహస్యంగా దాచి తరలిస్తున్న బంగారాన్ని కూడా అధికారులు గుర్తించారు. వీటిపై ఎన్నికల ఫ్లయింగ్స్క్వాడ్, అటవీ, పోలీసు శాఖలు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. రూ.900 కోట్లు స్వాధీనం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిరంతరం దాడులు నిర్వహిస్తున్నాయి. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 900 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం రూ.446.28 కోట్లు పట్టుబడగా, ఈసారి ఆ సంఖ్య ఇప్పటికే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. సరైన ఆధారాలు చూపిన వారికి రూ.400 కోట్ల విలువైన వస్తువులను తిరిగి ఇచ్చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అరప్పోర్ ఇయక్కం విమర్శలు ఈ భారీ స్వాధీనాలపై సామాజిక సంస్థ ‘అరప్పోర్ ఇయక్కం’ ప్రతినిధులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడ్డ నగదు, వస్తువులపై నమోదు చేస్తున్న ఎఫ్ఐఆర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆరోపిస్తున్నారు. -
ప్రచార హోరు
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంటోంది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రచార వేడి హోరా హోరీగా సాగుతోంది. కేవలం 3 రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో (ఏప్రిల్ 21 సాయంత్రంతో ముగియనుంది), ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన పార్టీల వ్యూహాలకు పదును పెట్టాయి. అన్నాడీఎంకే కూటమి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి అన్నీ తానై నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలో ఉన్నారు. తమ గత పాలనలోని విజయాలను, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మరిన్ని కొత్త పథకాలు తెస్తామని హామీ ఇస్తున్నారు. డీఎంకే అవినీతి, కుటుంబ పాలనను ఎండగట్టే విధంగా వ్యాఖ్యల తూటాలను పేల్చుతున్నారు. ఈ కూటమిలోని అభ్యర్థులకు మద్దతుగా పలువురు కేంద్రమంత్రులు తమిళనాడులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రచార సభలో రోడ్ షోలకు ఏర్పాట్లు జరిగాయి. బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సైతం కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఒంటరి పోరు విజయ్ (టీవీకే ), సీమాన్ ( ఎన్టీకే) అభ్యర్థుల కోసం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మార్పు కోరుకునే ఓటర్లే లక్ష్యంగా నటుడు విజయ్ ఓ వైపు సీమాన్ మరోవైపు వేర్వేరుగా తమదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. అవినీతి రహిత పాలన కోసం తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మండుతున్న ఎండలో.. అన్ని పార్టీల అభ్యర్థులకు వేసవి కాలంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వీధి వీధినా ప్రచారం రథాలలో దూసుకెళ్తున్నారు. పగటిపూట ఎండలు మండుతుండడంతో, అభ్యర్థులు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. ఉదయం 5 గంటలకే ప్రచారం మొదలు పెట్టేస్తున్నారు. ఓపెన్ టాప్ వ్యాన్లలో అభ్యర్థులు నిలబడి అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మధ్యాహ్నం కాస్త విరామం ఇచ్చి సాయంత్రం 4 గంటల తర్వాత అసలైన ప్రచార దూసుకెళ్తున్నారు. డప్పుల మోత, పార్టీ నినాద పాటల ఆలాపనతో వీధులన్నీ మార్మోగిపోతున్నాయి. ప్రచార ప్రదేశాలలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ, తమ చిహ్నాలను (గుర్తులను) ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలు జోరుగా సాగుతున్నాయి. 21వ తేదీన ప్రచారం ముగియనుండడంతో సుడిగాలి పర్యటనలో దూసుకెళ్లే పనిలో అభ్యర్థులు ఉన్నారు. శుక్రవారం అన్నీ మసీదుల వద్ద అభ్యర్థులు, వారి పార్టీల మద్దతుదారులు బారులు తీరి ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. వినూత్న రీతిలో ప్రచారాలు సైతం హోరెతుత్తున్నాయి. ఇక రాష్ట్రంలో 90 చోట్ల పోటీలో ఉన్న బీఎస్పీ అభ్యర్థుల సైతం తమదైన శైలిలో ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఓటర్ల సమస్యను వింటున్న డీఎంకే అభ్యర్థి స్పీకర్ అప్పావు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలే ప్రధాన అస్త్రంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే ఒక క్రమశిక్షణ కలిగిన కుటుంబం వంటిదని పేర్కొంటున్నారు. కేంద్రంలోని బీజేపీ, ప్రధాన ప్రతిపక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఉదయం వాకింగ్ రూపంలో ఓట్ల వేట, సాయంత్రం ప్రచార సభలతో స్టాలిన్ ముందుకెళ్తున్నారు. ఆయనకు తోడుగా డిప్యూటీ సీఎం, యువజన నేత ఉదయనిధి స్టాలిన్ ఓపెన్ టాప్ వాహనంలో రాష్ట్ర పర్యటనలో దూసుకెళ్తూ, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామిని టార్గెట్ చేస్తున్నారు. నియోజకవర్గాలలోని గ్రామాలను కలిపే విధంగా డీఎంకే ఎంపీ, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కనిమొళి కరుణానిధి ప్రచారంలో ఉన్నారు. తాజాగా పార్లమెంట్ సమావేశాల నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు. డీఎంకే కూటమి -
అంబత్తూరు డీఎంకే అభ్యర్థికి ఎంఆర్పీఎస్ మద్దతు
తిరువళ్లూరు: అంబత్తూరు శాసనసభ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పూర్ణిమకు ఎంఆర్పీఎస్ నేతలు కార్యకర్తలు మద్దతు పలికి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు నిరాకరించి అక్కడ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పూర్ణిమకు డీఎంకే అధిష్టానం సీటును కేటాయించింది. సీటు దక్కిన వెంటనే అందరిని కలుపుకుని డాక్టర్ పూర్ణిమ అంబత్తూరులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ పూర్ణిమను ఎంఆర్పీఎస్ నేతలు శుక్రవారం ఉదయం కలిసి సత్కరించారు. అనంతరం పట్టణంలో పూర్ణిమతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఉత్తర చైన్నె కార్యదర్శి జోసెఫ్, రాష్ట్ర కార్యనిర్వాహక అద్యక్షుడు కొండయ్య, ప్రధాన కార్యదర్శి సుకుమార్, నిర్వాహణ కార్యదర్శి భాస్కర్, ముకుందరావు, మోసస్, ఆనందరావు, సాల్మన్, బాబు, రామకృష్ణ, తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య వృత్తిలో విలువలకు కట్టుబడండి
సాక్షి,చైన్నె: వైద్య వృత్తిలో నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజత్ చంద్రకాంత్ ఉద్భోదించారు. దేశానికి సమర్థులే కాకుండా కరుణ, సామాజిక బాధ్యత కలిగిన వైద్యులు అవసరమని నొక్కి చెప్పారు.శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (శ్రీహెర్) 41వ స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చంద్రకాంత్ ప్రతిభావంతులైన విద్యార్థులకు 53 బంగారు పతకాలను ప్రదానం చేశారు. ఎంబీబీఎస్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ చాటిన డాక్టర్ జానవి శ్రీధర్ మూడు బంగారు పతకాలను అందుకున్నారు. డాక్టర్ అభిజత్ మాట్లాడుతూ, రోగుల బాధలను వైద్యులు సానుకూల దృక్పథంలో ఆలకించాలన్నారు. ప్రో–ఛాన్సలర్ ఆర్వీ సెంగూటువన్ వైద్య, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ విభాగాలలో పీహెచ్డీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులతో సహా 902 మంది పట్టభద్రులకు డిగ్రీలను ప్రదానం చేశారు. వార్షిక నివేదికను వైస్–ఛాన్సలర్ డాక్టర్ ఉమా శేఖర్ నివేదించారు. శ్రీ రామచంద్ర ఎడ్యుకేషనల్–హెల్త్ ట్రస్ట్ ట్రస్టీ సంయుక్త వెంకటాచలం, ప్రో వైస్ ఛాన్సలర్ మహేష్ వాకముడి, మెడికల్ కాలేజ్ డీన్ కె. బాలాజీ సింగ్, రిజిస్ట్రార్ సెంథిల్ కుమార్, డీన్ రీసెర్చ్ వెంకటాచలం, పరీక్షల నియంత్రణాధికారి పద్మావతి, డైరెక్టర్, ఫైనాన్స్–అకౌంట్స్ రవిశంకర్ పాల్గొన్నారు. -
అక్రమ క్వారీలపై విచారణ చేస్తాం
– అన్నాడీఎంకే అభ్యర్థి బీవీ రమణ తిరువళ్లూరు: రాష్ట్రంలో అధికార మార్పిడి ఏర్పడి అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే జిల్లాలోని అన్ని అక్రమ క్వారీల నిర్వహణపై విచారణ చేస్తామని అన్నాడీఎంకే తిరువళ్లూరు అభ్యర్థి బీవీ రమణ స్పష్టం చేశారు. తిరువళ్లూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి రమణ కడంబత్తూరులోని ప్రియాంకుప్పం, ఏగాటూరు, శ్రీదేవికుప్పం, విడయూరు, కారణి తదితర గ్రామాల్లో ఆ పార్టీ నేతలతో కలసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా సహకార సంఘాల ద్వారా అందజేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కావేరిరాజపురంతోపాటు ఇతర అక్రమ క్వారీలకు డీఎంకే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఇక్కడ నిబంధనలను విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారని తెలిపారు. మట్టి క్వారీల ద్వారా వచ్చిన నగదును ఎన్నికలకు డీఎంకే నేతలు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. వీటిపై దర్యాప్తు చేస్తామని, తాము అధికారంలోకి వస్తే అన్ని అక్రమాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నాడీఎంకే నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
● ఏఎన్ఎస్ సర్వేతో ఆనందం ● 178 స్థానాలలో గెలుపు బాటలో డీఎంకే
డీఎంకేలో సర్వే జోష్ సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డీఎంకే వర్గాలలో మంచి జోష్ నింపే విధంగా తాజాగా ఏఎన్ఎస్ సర్వే వివరాలు వెలుగు చూశా యి. ఇందులో తమిళనాడులో మళ్లీ డీఎంకే ప్రభంజనం సృష్టించబోతున్నట్టుగా సమాచారం వెలువడింది. తాజా సర్వే గణాంకాల ప్రకారం ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 178 స్థానాలను కై వసం చేసుకుని భారీ మెజారిటీతో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోనుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజులే సమయం ఉంది. ఎన్నికలకు ముందుగా వెలువడ్డ అనేక సర్వేలు డీఎంకేకు అనుకూలంగా ఫలితాల్ని ఇచ్చాయి. అదే సమయంలో ఎన్నికల నగారా మోగినానంతరం ప్రచార హోరు నేపథ్యంలో అన్నాడీఎంకేకు సైతం అనుకూలంగా సర్వేలు రావడంతో ఉత్కంఠ తప్పలేదు. అదే సమయంలో టీవీకే అధినేత విజయ్ కీలక శక్తిగా మారనున్నట్టుగా సర్వేలు పేర్కొంటూ వచ్చాయి. ఓటరు నాడి ఎటు అన్న ఉత్కంఠ నేపథ్యంలో తాజాగా వెలువడ్డ ఈ సర్వే వివరాలను డీఎంకే అనుకూల పత్రిక ప్రకటించింది. జోన్ల వారీగా అంచనాలు సర్వే నివేదిక ప్రకారం వివిధ ప్రాంతాల్లో డీఎంకే కూటమి పరిస్థితిని వివరించారు. ఇందులో చైన్నె జోన్లో 37 నియోజకవర్గాలకు డీఎంకే కూటమి 36 స్థానాల్లో పటిష్టంగా ఉండగా, అన్నాడీఎంకే ఒకే స్థానానికి పరిమితం కానున్నట్టు ప్రకటించారు. సెంట్రల్ జోన్లో 37 స్థానాల్లో 35 చోట్ల డీఎంకే గెలుస్తుందని సర్వేలో తేల్చారు. దక్షిణ జోన్లో 58 స్థానాలకు గాను 42 స్థానాల్లో డీఎంకే కూటమి ఆధిక్యంలో ఉన్నట్టు ప్రకటించారు. జిల్లా వారీగా క్లీన్ స్వీప్ అనేక జిల్లాల్లో డీఎంకే కూటమి 100 శాతం సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో వివరించారు. ఆ మేరకు చైన్నె జిల్లాలో 16 సీట్లు, తిరువళ్లూరు జిల్లాలో 10 సీట్లు, తంజావూరు 8 సీట్లు, కాంచీపురం 11 సీట్లు, నీలగిరి, కరూర్, తిరువారూర్, రామనాథపురం జిల్లాల్లోని అన్ని సీట్లను డీఎంకే గెలుచుకునే అవకాశం ఉందని ఆ సర్వే ద్వారా వివరించారు. విజయ్ ప్రభావం ఓట్ల శాతం పరంగా ఈసారి రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరంగా మారుతుందని ప్రకటించారు. డీఎంకే కూటమి 45.4 శాతం, అన్నాడీఎంకే కూటమి 35.3 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని వివరించారు. అయితే, నటుడు విజయ్ టీవీకే 11.5 శాతం ఓట్లు, సీమాన్ ఎన్టీకే 5.6 శాతం ఓట్లను దక్కించుకోనున్నట్టు పేర్కొన్నారు. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118 కాగా, సర్వే ప్రకారం డీఎంకే 178 సీట్లు సాధించి తిరుగులేని శక్తిగా అవతరించనున్నదని, అన్నాడీఎంకే 56 సీట్ల వద్ద నిలిచిపోయే అవకాశం ఉందని తాజా సర్వే పేర్కొంది. అయితే తుది ఓటరు తీర్పు అన్నది మే 4న వెలువడే ఫలితాల మేరకు ఉండబోతుండడం గమనార్హం. ఈ సర్వే తమకు అనుకూలంగా ఉండడంతో డీఎంకే వర్గాలలో జోష్ పెరిగింది. గెలుపు దిశగా మరింత ఉత్సాహంతో ప్రచారంచేసే పనిలో పడ్డారు. -
ఐఐటీలో ఒమేగా బాల్ ప్రారంభం
కొరుక్కుపేట: భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒమేగాబాల్ క్రీడను ఐఐటీ మద్రాస్ పరిచయం చేసింది. ఒమేగాబాల్ అనేది ఫుట్బాల్ లాగా వేగవంతమైన, వినూత్నమైన ఒక రకం. దీనిని మూడు గోల్స్తో వృత్తాకార మైదానంలో మూడు జట్లు ఆడతాయి. ఇందులో ప్రతి జట్టు ఒక గోల్ను కాపాడుకుంటూనే ఏకకాలంలో రెండు గోల్స్పై దాడి చేయవచ్చని ఐఐటీ మద్రాసు ప్రతినిధులు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ ప్రారంభోత్సవానికి గుర్తుగా ఇన్స్టిట్యూట్ జింఖానా, డీన్ (విద్యార్థులు) కార్యాలయం సంయుక్తంగా శుక్రవారం క్యాంపస్ ఫుట్బాల్ మైదానంలో అంతర్ కళాశాల ఒమేగాబాల్ టోర్నమెంట్ను నిర్వహించాయి. ఈ టోర్నమెంట్లో ఐఐటీ మద్రాస్ ఆరెంజ్, బ్లూ జట్లతో పాటు, లయోలా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గురునానక్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, డాక్టర్ అంబేడ్కర్ లా యూనివర్సిటీ, ది న్యూ కాలేజ్, నజరేత్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, సవిత యూనివర్సిటీ, వైఎంసీఏ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వంటి చైన్నెలోని ప్రముఖ సంస్థల జట్లు పాల్గొన్నాయి. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి ఒమేగాబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్ డీన్ (స్టూడెంట్స్) ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్.గుమ్మడి, ఐఐటీ మద్రాస్ స్పోర్ట్స్ అడ్వైజర్ ప్రొఫెసర్ శృతి దుబే, ఐఐటీ మద్రాస్ స్పోర్ట్స్ కో–అడ్వైజర్ ప్రొఫెసర్ సుధాకరన్ చంద్రన్, అధ్యాపకులు, విద్యార్థులు, నగరవ్యాప్తంగా ఉన్న కళాశాలల జట్లు హాజరయ్యాయి. దేశంలో క్రీడల ఆధారిత ప్రవేశాలను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఐఐటీ మద్రాస్ అని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి తెలిపారు. ఒమేగా బాల్ అనేది ఐఐటీ మద్రాస్ ప్రతిపాదించే నూతన ఆవిష్కరణ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందన్నారు . -
నమ్మలేని నలుపు చట్టం
సాక్షి, చైన్నె: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తక్షణమే పూర్తి స్థాయిలో ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎంకే నేతృత్వంలో డీలిమిటేషన్కు వ్యతిరేకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో శుక్రవారం ఈ అంశంపై సీఎం స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది నమ్మలేని నలుపు చట్టం నియోజకవర్గాల పునర్విభజనతో తమిళనాడులోని సీట్ల సంఖ్య తగ్గదని పార్లమెంటులో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే వారు చెబుతున్న మాటలకు, వారు ప్రవేశపెట్టిన బిల్లుకు అస్సలు పొంతన లేదని స్టాలిన్ విమర్శించారు. వీరి మాట ఒకటి, చేసే పని మరొకటి అని పేర్కొన్నారు. ఈ మోసపూరిత హామీని అస్సలు నమ్మబోమని స్పష్టం చేశారు. ఇది ఒక నమ్మలేని నలుపు చట్టం అని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో పెనుముప్పు కేంద్రం ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లులో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్కు అపరిమితమైన అధికారాలు ఇచ్చారని స్టాలిన్ ఆరోపించారు. దీనివలన కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలమైన సమయంలో, అనుకూలమైన రీతిలో రాష్ట్రాల నియోజకవర్గాల పరిధిని మార్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఒక పెద్ద కుట్ర అని ఆయన అభివర్ణించారు. చట్టపరమైన రక్షణ కావాలి గతంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజపేయి రాజ్యాంగ సవరణలు చేసి, నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్ల పాటు నిలిపివేసిన విషయాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం నోటి మాటలు కాకుండా, రాజ్యాంగబద్దమైన రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రానికి హెచ్చరిక సంఖ్యా బలం ఉంది కదా అనే అహంకారంతో తమ వ్యతిరేకతను కాదని ఈ బిల్లును ఆమోదిస్తే, దాని పర్యావసానాలను తమిళనాడులో ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇదిలాఉండగా ఈ పునర్విభజన అంశం తమిళనాడులో సెంటిమెంట్ అస్త్రంగా ఎన్నికల వేళ మారింది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలకు, నియోజకవర్గాల పునర్విభజనతో పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందన్న భయం ప్రజల్లో నెలకొన్నట్టైంది. దీనిని డీఎంకే ప్రచార అస్త్రంగా వాడుకుంటుండడం గమనార్హం. -
బరిలో హేమాహేమీలు
తమిళనాడులోని 234 స్థానాలలో కూటమిలోని మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లు పోగా 164 స్థానాలలో డీఎంకే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మిత్రులలో మరో 11 మంది డీఎంకే ఉదయసూర్యుడి చిహ్నంలో పోటీలో ఉన్నారు. దీంతో ఆ పార్టీ 175 స్థానాలలో పోటీ చేసినట్టైంది. 164 మందితో కూడిన డీఎంకే అభ్యర్థులలో 125 మంది పట్టభద్రులు ఉన్నారు. వీరిలో ప్రొఫెసర్లు 7 మంది, డాక్టర్లు 15 మంది, ఇంజినీర్లు 17 మంది, న్యాయవాదులు 29 మంది ఉన్నారు. అలాగే 18 మంది మహిళలకు పోటీ చేసే అవకాశం కల్పించారు. కొత్తగా 60 మందికి ఈ సారి స్టాలిన్ అవకాశం కల్పించారు. సిట్టింగ్లలో అనేక మందిని పక్కన పెట్టారు. ఇక మూడుసార్లు సీఎంగా పనిచేసిన మాజీ సీఎం పన్నీరుసెల్వంకు తేని జిల్లా బోడినాయకనూరు నియోజకవర్గాన్ని స్టాలిన్ కేటాయించారు. ఆయన్ను నమ్ముకుని అన్నాడీఎంకే నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వైద్యలింగం, మనోజ్ పాండియన్లకు వారి సిట్టింగ్ స్థానాల్లోనే అవకాశం కల్పించారు. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ చైన్నెలోని కొళత్తూరు నియోజవర్గం నాలుగో సారిగా పోటీ చేస్తున్నారు. ఆయన తనయుడు, డీఎంకే యువజన నేత, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రెండో సారిగా చేపాక్కం–ట్రిప్లికేన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక డీఎంకే ప్రధాన కార్యదర్శి , సీనియర్ మంత్రి దురై మురుగన్ వేలూరు జిల్లా కాట్పాడిలో ఏడోసారిగా, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, మరో సీనియర్ మంత్రి కేఎన్ నెహ్రు తిరుచ్చి వెస్ట్ నుంచి హ్యాట్రిక్ కోసం మళ్లీ పోటీలో దిగారు. కేబినెట్లోని 33 మందిలో ముగ్గురిని పక్కన పెట్టారు. మిగిలిన వారందరూ వారివారి సిట్టింగ్ సీట్లలో పోటీ చేస్తున్నారు. వీరిలో అనిత రాధాకృష్ణన్, గీతాజీవన్, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు, ఎస్.రఘుపతి, కేఆర్ పెరియకరుప్పన్, ఎంఆర్కే పన్నీరు సెల్వం, స్వామినాథన్, శేఖర్బాబు, ఎం.సుబ్రమణియన్, ఐ.పెరియస్వామి, ముత్తుస్వామి తదితర సీనియర్లు ఉన్నారు. అలాగే అసెంబ్లీ స్పీకర్ అప్పావు మళ్లీ వారివారి సిట్టింగ్ స్థానాలలో పోటీలో ఉన్నారు. అయితే, చివరి క్షణంలో వ్యూహాత్మకంగా రాణిపేట నియోజకవర్గం అభ్యర్థిగా సీటు తిరస్కరించబడ్డ మంత్రి గాంధీ పోటీ చేయక తప్పలేదు. ఇందుకు కారణం నామినేషన్ చివరి రోజున ఎన్నికల నుంచి ఆయన తనయుడు వినోద్గాంధీ తప్పుకోవడమే. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ అభ్యర్థిగా త్యాగ భూమి శ్రీపెరంబదూరులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై పోటీలో ఉన్నారు. ఒక్క ఛాన్స్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తాజాగా అన్నాడీఎంకే కూటమిలోని ఇద్దరు బీజేపీ నేతలపై అందరి దృష్టి పడింది. ఇందులో ఒకరు మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్. మరొకరు కేంద్ర సహాయమంత్రి ఎల్.మురుగన్. తమిళిసై సౌందరరాజన్ ఆమె తమిళనాడుకే కాదు, తెలంగాణ, పుదుచ్చేరికి సైతం సుపరిచితురాలే. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి బీజేపీలో పనిచేస్తున్నారు. తమిళనాడు పార్టీ అధ్యక్షురాలిగా సైతం సేవలు అందించారు. అయితే ఆమె ఆకాంక్ష అంతా ఒక్క సారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలన్నదే. అందుకే 2006,2011 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009, 2019 లోక్సభ ఎన్నికలలో సైతం పోటీ చేసినా అదృష్టం దక్కలేదు. చివరకు ఆమెకు తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఏక కాలం పనిచేసే అవకాశం దక్కినా, 2024 లోక్సభ ఎన్నికలలో పోటీ చేయాలని ఆ పదవికి రాజీనామా చేసినా అదృష్టం కలిసి రాలేదు. చివరకు చైన్నె మైలాపూర్ అసెంబ్లీ నుంచి ఒక్క ఛాన్స్ కోసం విస్తృతంగా ఓట్ల వేటలో ఉన్నారు. కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ 2021లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా తిరుపూర్ జిల్లా తారాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తదుపరి ఆయనకు మంత్రి పదవి దక్కినా, ప్రత్యక్ష ఎన్నికలలో గెలవాలన్న తపన వీడలేదు. 2024 లోక్సభ ఎన్నికలలో నీలగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన తాజాగా తిరుపూర్ జిల్లా అవినాశి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఇక తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అయితే తన స్వస్థలం తిరునల్వేలిని పక్కన పెట్టి, ఈసారి పొరుగు జిల్లా విరుదునగర్లోని సాత్తూరును ఎంపిక చేసుకుని పోటీలో ఉన్నారు. విజయ్(టీవీకే)పళనిస్వామి(అన్నాడీఎంకే)తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నేతలు పోటీలో ఉన్నారు. ద్రావిడ మున్నేట్ర కళగం(డీఎంకే), అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే)లలో సీనియర్ నేతలు, మంత్రులు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎందరో పోటీలో ఉన్నారు. ఉద్దండులంతా తమ ఎన్నికల జాతకాన్ని పరీక్షించుకోనున్నారు. – సాక్షి, చైన్నె -
దోపిడీ కుటుంబానికి.. ప్రజలకు మధ్య సమరం
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి శుక్రవారం అధికార డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సేలం జిల్లాలోని శంకగిరి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆయన చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు తమిళనాడును దోచుకుంటున్న కుటుంబానికి, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా వ్యాఖ్యానించారు. కుటుంబ పాలనపై దాడి ఈ ఎన్నికలు కేవలం పార్టీల మధ్య పోరాటం కాదని, తమిళనాడును దోచుకుంటున్న స్టాలిన్ కుటుంబానికి, రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమని ఆయన అభివర్ణించారు. స్టాలిన్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతోందని, ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. డీఎంకే హయాంలో తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలు విచ్చలవిడిగా పెరిగాయన్నారు. మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక హామీలు కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా తమిళనాడులో కూడా కుల గణన నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం రేషన్ షాపుల్లో నాణ్యత లేని బియ్యం ఇస్తున్నారని, అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. చేనేత, పవర్లూమ్ కార్మికులు, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. తమ హయాంలో అమలు చేసిన పథకాలను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తనపై ఉన్న కోపంతో తాను తీసుకొచ్చిన మంచి పథకాలను డీఎంకే ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. డీఎంకే ఇచ్చిన హామీలలో కనీసం నాలుగో వంతు కూడా నెరవేర్చలేదని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు. -
మా మధ్యే ప్రధాన పోటీ
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కై ్లమాక్స్కు చేరుకున్న వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ శుక్రవారం ఈరోడ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో అసలు పోటీ కేవలం ఎన్డీఏ, డీఎంకే మధ్య మాత్రమేనని, తకు ఇతరులు ఎవ్వరితోనూ పోటీ లేదంటూ స్పష్టం చేశారు. ఈరోడ్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. తమిళనాడులో బీజేపీ కూటమి గెలుపు కోసం అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారని తెలిపారు. శనివారం కోయంబత్తూర్లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగిస్తారన్నారు. మరుసటి రోజు ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోడ్ జిల్లా మొడక్కురిచ్చి అభ్యర్థి కృతిక శివకుమార్ తరఫున శివగిరిలో రోడ్ షో నిర్వహించనున్నారన్నారు. డీఎంకే డ్రామా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లుపై ఆయన స్పందించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, 33% మహిళా రిజర్వేషన్ల విషయంలో డీఎంకే డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. ఈ రిజర్వేషన్తో పురుషుల అవకాశాలు తగ్గవని ఆయన హామీ ఇచ్చారు. లోక్సభ స్థానాలను 850కి పెంచడం ద్వారా రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరుగుతుందని, దీనిని సీఎం స్టాలిన్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. గడిచిన ఐదేళ్లలో ప్రజల కోసం ఏమీ చేయని స్టాలిన్, కేవలం తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను ముఖ్యమంత్రిని చేయడమే ఏకై క లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. కేంద్రంతో అనవసర ఘర్షణ వైఖరి పెట్టుకుని రాష్ట్రానికి రావాల్సిన పథకాలను సాధించడంలో స్టాలిన్ విఫలమయ్యారని మండిపడ్డారు. -
కాన్సిటీ చిత్రంలో రారా రంగయ్య
తమిళసినిమా: నటుడు అర్జున్దాస్, అన్నా బెన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కాన్సిటీ.పవర్ హౌస్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంతో హరీష్ దురైరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నటు డు యోగిబాబు, వడివుక్కరసి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల మధ్య మంచి అంచనాలను రేకెత్తిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రంలోని రారా రంగయ్య అనే పల్లవితో సాగే కొరియన్ ఫ్యామిలీ సాంగ్ను యూనిట్ వర్గాలు విడుదల చేశాయి. మోహన్రాజ్ రాసిన ఈ పాటకు శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు. ఊరా లోకల్ పాటగా రూపొందిన ఈ పాటలో చిత్రంలోని ప్రముఖ నటీనటులందరూ నటించడం విశేషం! ఈ పాటలో సంగీతం, సాహిత్యం, చిత్రీకరణ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. చిత్రంలో ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. సరికొత్త కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్ర కఽథ నగర ప్రాంతంలో అప్పుల పాలైన ఒక మిడిల్క్లాస్ కుటుంబం ఇతివృత్తంతో సాగుతుందని చెప్పారు. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, వినోదం తదితర ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఫ్యామి లీ ఎంటర్టెయినర్ చిత్రం కాన్సిటీ అని చెప్పారు. చిత్ర షూటింగ్ను మంగుళూర్, చైన్నె, ముంబై ప్రాంతాల్లో చిత్రీకరించి పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్ డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చిందన్నారు. తాజాగా విడుదల చేసిన తొలి సింగిల్ సాంగ్ రారా రంగయ్య పాట విశేష ఆదరణ పొందుతోందని చెప్పారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
తొలిసారిగా పోటీలో..
తమిళగ వెట్రికళగం ఆవిర్భావంతో ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ తొలిసారిగా చైన్నె శ్రీపెరంబదూరు, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, చైన్నె టీ నగర్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున విల్లివాక్కం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇక రెండు దశాబ్దాలుగా పార్టీ నడుపుతున్నప్పటికీ ప్రప్రథమంగా తన స్వస్థలం శివగంగ జిల్లా కారైక్కుడిలో నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) కన్వీనర్ సీమాన్ పోటీలో ఉన్నారు. అన్నాడీఎంకే కూటమిలో న్యూ జస్టిస్ పార్టీ తరఫున మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ మహిళా నేత, నటీ కుష్భు భర్త, సినీ నటుడు, దర్శకుడు సుందర్.సి తొలి సారిగా పోటీలో ఉన్నారు. ఆయన అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంలో పోటీ చేస్తుండడం విశేషం. -
అన్నాడీఎంకేకు గుణపాఠం చెప్పాలి
– మసీదులో డీఎండీకే అభ్యర్థి కృష్ణమూర్తినాయుడు ప్రచారం తిరుత్తణి: మతవాద బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకే కూటమికి మైనార్టీ ప్రజలు బుద్ధి చెప్పాలని, డీఎంకే కూటమిని గెలిపించి మళ్లీ సీఎంగా స్టాలిన్ను గెలిపించాలని తిరుత్తణి నియోజకవర్గ డీఎండీకే అభ్యర్థి కృష్ణమూర్తినాయుడు పిలుపునిచ్చారు. తిరుత్తణి నియోజకవర్గంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో డీఎండీకే అభ్యర్థిగా కృష్ణమూర్తినాయుడు పోటీ చేస్తున్నారు. అతను డీఎంకే కూటమి పార్టీల కార్యకర్తలతో కలిసి నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం వాకింగ్ చేసి ప్రచారం చేశారు.అనంతరం పట్టణంలోని దుకాణాలు, వ్యాపారులను కలుసుకుని ప్రచారం చేశారు. రైలు, బస్సు ప్రయాణికులను కలుసుకుని ఢమరుకం గుర్తుకు ఓట్లు అభ్యర్థించారు. మధ్యాహ్నం జుమ్మా మసీదుకి వెళ్లి ముస్లింలను కలుసుకుని ఓట్లు అడిగారు. మత సిద్ధాంతాలు నిండిన బీజేపీతో చేతులు కలిపి ఎన్నికలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకేకు గుణపాఠం చెప్పాలని, తనను గెలిపించి డీఎంకేను అధికారంలోకి తేవాలని కోరారు. జిల్లా డీఎంకే కార్యదర్శి చంద్రన్, మాజీ కార్యదర్శి భూపతి సహా అనేక మంది పాల్గొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు
తిరుత్తణి: తిరుత్తణి నియోజకవర్గంలో డ్యూటీ పోలీసులు పోస్టల్ బ్యాలట్ ఓట్లు ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 23న పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో తిరుత్తణి నియోజకవర్గంలోని పోలీసులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నవారికి పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓట్లు వేసే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓట్లు వేసేందుకు శుక్రవారం ఏర్పాట్లు చేశారు. 560 మంది పోలీసుల్లో తొలిరోజు 250 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
అన్నాడీఎంకే కీలక నేతలు
మిత్రులకు ఇచ్చిన సీట్లు పోగా 169 స్థానాలలో 42 మంది కొత్త ముఖాలు, మరో 46 మంది సిట్టింగ్లు, ఇతర ముఖ్య నేతలకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి సీట్లు కేటాయించారు. 17 మంది మహిళలకు ఛాన్స్ ఇచ్చారు. అయితే మాజీ స్పీకర్ ధనపాల్కు, మాజీ మంత్రులు సేవూరు రామచంద్రన్, వెల్లమండి నటరాజన్, వైగై సెల్వన్, సరోజ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు గోవింద స్వామి, రామచంద్రన్ రాణి, కబీర్ సెంథిల్, మహేంద్రన్ తదితరులతో పాటుగా 13 మందికి అవకాశం ఇవ్వలేదు. అన్నాడీఎంకేను పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్న తదుపరి ఎదుర్కొంటున్న ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికలో పళణి స్వామి వ్యూహాత్మకంగా అన్ని ప్రధాన జిల్లాలను కవర్ చేస్తూ, సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను పళణి స్వామి ఎంపిక చేశారు. ముఖ్యంగా డెల్టా, దక్షిణ జిల్లాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించారు. సేలం జిల్లా ఎడప్పాడి నియోజకవర్గంలో ఆరో సారిగా పళణి స్వామి పోటీలో ఉన్నారు. ఆయన తదుపరి పార్టీలో కీలకంగా ఉన్న కేపీ మునుస్వామి వేపనహల్లిలో, ఎస్పీ వేలుమణి కోయంబత్తూరు జిల్లా తొండా ముత్తురులో, నత్తం విశ్వనాథన్ నత్తంలో, పి.తంగమణి కుమార పాళయంలో, మైలంలో రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం, చైన్నె రాయపురంలో ఎనిమిదో సారిగా డి.జయకుమార్ తదితర కీలక నేతలు పోటీలో ఉన్నారు. -
డీఎంకే అభ్యర్థికి బుల్లితెర నటుల ప్రచారం
తిరువళ్లూరు: డీఎంకే అభ్యర్థి వీజీ రాజేంద్రన్కు మద్దతుగా బుల్లితెర నటుల బృందం శుక్రవారం ఉదయం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించింది. తిరువళ్లూరు డీఎంకే అభ్యర్థి వయలూరు, సూరకాపురం, కడంబత్తూరు, ముదుగూ రు, తిరుపందియూరు తదితర ప్రాంతాల్లో డీఎంకే అభ్యర్థి వీజీ రాజేంద్రన్ తన మద్దతుదారులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వీజీ రాజేంద్రన్కు మద్దతుగా బుల్లితెర నటులు రిషీకాంత్, రూపశ్రీ, అర్చన, ప్రేమీవెంకట్, భరత్ తదితరు లు ప్రచారం నిర్వహించారు. డీఎంకే అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను వివరిస్తూ ప్రచారం చే శారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలను వంద శాతం అమలు చేస్తామన్నా రు. ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తే నియోజకవర్గాన్ని మరింత అబివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి కొండజేరి రమేష్, ఇందిర విద్యాసంస్థ అదినేత ఇందిర రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
Tamil Nadu Survey: 178 స్థానాలలో గెలుపు బాటలో డీఎంకే
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డీఎంకే వర్గాలలో మంచి జోష్ నింపే విధంగా తాజాగా ఏఎన్ఎస్ సర్వే వివరాలు వెలుగు చూశా యి. ఇందులో తమిళనాడులో మళ్లీ డీఎంకే ప్రభంజనం సృష్టించబోతున్నట్టుగా సమాచారం వెలువడింది. తాజా సర్వే గణాంకాల ప్రకారం ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 178 స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీతో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోనుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజులే సమయం ఉంది. ఎన్నికలకు ముందుగా వెలువడ్డ అనేక సర్వేలు డీఎంకేకు అనుకూలంగా ఫలితాల్ని ఇచ్చాయి. అదే సమయంలో ఎన్నికల నగారా మోగినానంతరం ప్రచార హోరు నేపథ్యంలో అన్నాడీఎంకేకు సైతం అనుకూలంగా సర్వేలు రావడంతో ఉత్కంఠ తప్పలేదు. అదే సమయంలో టీవీకే అధినేత విజయ్ కీలక శక్తిగా మారనున్నట్టుగా సర్వేలు పేర్కొంటూ వచ్చాయి. ఓటరు నాడి ఎటు అన్న ఉత్కంఠ నేపథ్యంలో తాజాగా వెలువడ్డ ఈ సర్వే వివరాలను డీఎంకే అనుకూల పత్రిక ప్రకటించింది. జోన్ల వారీగా అంచనాలు సర్వే నివేదిక ప్రకారం వివిధ ప్రాంతాల్లో డీఎంకే కూటమి పరిస్థితిని వివరించారు. ఇందులో చెన్నై జోన్లో 37 నియోజకవర్గాలకు డీఎంకే కూటమి 36 స్థానాల్లో పటిష్టంగా ఉండగా, అన్నాడీఎంకే ఒకే స్థానానికి పరిమితం కానున్నట్టు ప్రకటించారు. సెంట్రల్ జోన్లో 37 స్థానాల్లో 35 చోట్ల డీఎంకే గెలుస్తుందని సర్వేలో తేల్చారు. దక్షిణ జోన్లో 58 స్థానాలకు గాను 42 స్థానాల్లో డీఎంకే కూటమి ఆధిక్యంలో ఉన్నట్టు ప్రకటించారు. జిల్లా వారీగా క్లీన్ స్వీప్ అనేక జిల్లాల్లో డీఎంకే కూటమి 100 శాతం సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో వివరించారు. ఆ మేరకు చెన్నై జిల్లాలో 16 సీట్లు, తిరువళ్లూరు జిల్లాలో 10 సీట్లు, తంజావూరు 8 సీట్లు, కాంచీపురం 11 సీట్లు, నీలగిరి, కరూర్, తిరువారూర్, రామనాథపురం జిల్లాల్లోని అన్ని సీట్లను డీఎంకే గెలుచుకునే అవకాశం ఉందని ఆ సర్వే ద్వారా వివరించారు. విజయ్ ప్రభావం ఓట్ల శాతం పరంగా ఈసారి రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరంగా మారుతుందని ప్రకటించారు. డీఎంకే కూటమి 45.4 శాతం, అన్నాడీఎంకే కూటమి 35.3 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని వివరించారు. అయితే, నటుడు విజయ్ టీవీకే 11.5 శాతం ఓట్లు, సీమాన్ ఎన్టీకే 5.6 శాతం ఓట్లను దక్కించుకోనున్నట్టు పేర్కొన్నారు. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118 కాగా, సర్వే ప్రకారం డీఎంకే 178 సీట్లు సాధించి తిరుగులేని శక్తిగా అవతరించనున్నదని, అన్నాడీఎంకే 56 సీట్ల వద్ద నిలిచిపోయే అవకాశం ఉందని తాజా సర్వే పేర్కొంది. అయితే తుది ఓటరు తీర్పు అన్నది మే 4న వెలువడే ఫలితాల మేరకు ఉండబోతుండడం గమనార్హం. ఈ సర్వే తమకు అనుకూలంగా ఉండడంతో డీఎంకే వర్గాలలో జోష్ పెరిగింది. గెలుపు దిశగా మరింత ఉత్సాహంతో ప్రచారంచేసే పనిలో పడ్డారు. -
జెన్జీ రూటు ఎటో!
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జెన్జీ(జనరేషన్ జెడ్) నిర్ణయాత్మక శక్తిగా అవతరించింది. యువతరం తమిళ రాజకీయాల్లో పెద్దమార్పునకు పునాది కాబోతుంది. 1.18 కోట్ల మంది యువ ఓటర్లు ఉండడంతో రాజకీయ పార్టీలు వారిని ఆకర్షించే పనిలో పడ్డాయి. తమిళనాడులోని మొత్తం ఓటర్లలో సుమారు 20 శాతం అంటే 1.18 కోట్ల మంది 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జెన్జీ ఓటర్లే ఉన్నారు. వీరి ఓట్లు గెలుపోటములను శాసించడంలో కీలక భూమిక పోషించనున్నాయి. జెన్ జెడ్ను ఆకర్షించేలా రాజకీయ పార్టీల వ్యూహాలు జెన్–జెడ్ ఓటర్లను ఆకర్షించే వ్యూహాలకు తమిళ రాజకీయ పార్టీలు పదునుపెట్టాయి. డీఎంకే ఆధునిక డిజిటల్ ప్రచారంలో నిమగ్నమైంది. ప్రభుత్వం కొనసాగింపు, అభివృద్ధి నినాదం ఇందులో కీలకంగా ఉంది. యువఓటర్లను ఆకర్షించే విధంగా ఉచిత ల్యాప్ టాప్లు, వైఫై సేవలు, ఉద్యోగకల్పన, ఉన్నతచదువుల కోసం నాన్ మొదల్వన్ పథకం ద్వారా ఉచిత వృత్తి శిక్షణ, పోటీ పరీక్షలకు శిక్షణే కాకుండా, పుదుమైపెన్, తమిళ్పుదల్వన్ పథకాల పేరిట నెలకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. అన్నాడీఎంకే విషయానికి వస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉన్నత చదువుల్లో రిజర్వేషన్లను 7.5% నుంచి 10%కి పెంచుతామని, ఆర్థిక సంక్షేమ పథకాల భరోసాను కీలకంగా చేసుకుంది. తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రంతో యువత, అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అందుకే విజయ్ ఈ తరం కోసం ఏఐ టెక్నాలజీ, ఫీజులమాఫీ అంటూ ముందుకు సాగుతున్నారు. నామ్ తమిళర్ కట్చి కన్వినర్ సీమాన్ అయితే తమిళ దేశం నిర్మాణం తదితర భావోద్వేగ అంశాలతో జెన్జీ ఓటర్ల కోసం కీలక ప్రకటనలు చేశారు. మునుపటి తరాల మాదిరిగా ఒక పార్టీకి వంశపారంపర్య విధేయులుగా ఉండకుండా, జెన్–జీ ఓటరు తాజాగా స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సమస్యల ఆధారిత ఓటింగ్ పార్టీల కంటే సమస్యలకే జెన్జీ ఓటర్లు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తాజా అంచనాలు చెబుతున్నాయి. నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు, మెరుగైన భవిష్యత్తు, సమాచార మూలాల విశ్లేషణకు జెన్జీ వార్తాపత్రికలతో పాటు సోషల్ మీడియా ద్వారా రాజకీయ అవగాహన పెంచుకుంటున్నారు. ఈ దృష్ట్యా యువ ఓటర్లు ఏకపక్షంగా ఉండకుండా చీలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలు కేవలం అధికార మార్పిడి కోసం మాత్రమే కాదు. రాబోయే 20 ఏళ్ల తమిళనాడు రాజకీయ గమనాన్ని నిర్ణయించే కొత్త తరం గళం కాబోతోంది. -
తమిళ పార్టీలకు చిక్కని ఓటరు నాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ద్రవిడవాదం తమిళ ప్రజల గుండెల్లో పాతు కుపోయింది. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) ఆ నినాదం దన్నుతోనే ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్నారు. దివంగత సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత బాటలోనే ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ కూడా ద్రవిడ సిద్ధాంతమే ప్రధానాస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.స్టాలిన్ మహా మెగా కూటమిజయలలిత మాదిరిగా వరుసగా తమిళనాట రెండోసారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలుస్తారా అన్నది ఈసారి ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి 21 పార్టీలతో మహా మెగా కూటమికి తెర తీశారు. స్టాలిన్తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ద్రావిడ మోడల్ 2.0 పాలన నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణులకు రూ.1,000 ప్రోత్సాహం వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్న వైనాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈసారి గెలిపిస్తే రూ.8,000 విలువైన కూపన్లు తదితర హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కంటే కొత్తగా బరిలో దిగిన సినీ నటుడు జోసెఫ్ విజయ్ డీఎంకేకు గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ స్టాలిన్ వదులుకోవడం లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను అందివచ్చిన అస్త్రంగా వాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లోక్సభ స్థానాల పెంపులో తమిళనాడుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయనుందంటూ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడం ద్వారా ప్రధాని మోదీని ఎదుర్కొంటున్న నేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డారు. మైనారిటీ ఓట్లు కూడ ఎంతో కొంత గట్టెక్కిస్తాయని డీఎంకే నమ్ముతోంది.అన్నా కూటమి ఆపసోపాలుఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, అన్బుమణి రాందాసు నేతృత్వంలోని పీఎంకే, జికే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాష్ట్రంలో పేట్రేగుతున్న హింస తదితరాలను అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన ప్రచారాస్త్రా లుగా మలచుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే మాదిరిగానే అన్నాడీఎంకేకు కూడా విజయ్ పార్టీ గుబులు పట్టుకుంది. ఆయన పార్టీ అంతిమంగా ఎవరి ఓట్లు చీలుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగానే బరిలో ఉన్న మరో సినీ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి కూడా ప్రధాన కూటముల ఓట్లను చీల్చేలా కన్పిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ఈసారి ఏకంగా 116 మంది మహిళలకు, ఒక ట్రాన్స్జెండర్కు కూడా టికెటిచ్చింది! వీరికి తోడు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ కూడా పలు నియోజకవర్గాల్లో బరిలో ఉంది!ఓటరు నాడి ఎటో..!ఈసారి తమిళ ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు! ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చిచెప్పలేకపో యాయి. కాకపోతే విజయ్ పార్టీ టీవీకే కనీసం 15 నుంచి 30 స్థానాల దాకా గెలుచుకోవచ్చని పలు సర్వేల్లో తేలింది. అయితే టీవీకే ప్రధాన కూటముల్లో దేని ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.మూడో శక్తిగా విజయ్తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో మూడో శక్తిగా అవతరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విజయ్కి ఉన్న ఆదరణనే టీవీకే నమ్ముకుంది. ఆ ఆదరణ ఏ మేరకు ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు విజయ్ని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రజాదరణ ఉన్న నేతలంటూ ఎవరూ లేకపోవడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. టీవీకేతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా చివరికి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేక పోయినా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదగాలన్న భావన టీవీకేలో కనిపిస్తోంది. పార్టీలో జోష్ నింపేందుకు విజయ్ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. యువత, మహిళల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఈసారి టీవీకే భారీగా గండి కొట్టవచ్చన్న విశ్లేషణలున్నాయి. -
ఇది ట్రైలర్ మాత్రమే: సీఎం స్టాలిన్
చెన్నై: లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవడం తమ విజయమని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. లోక్సభలో తమిళనాడు.. ఢిల్లీని ఓడించిందన్నారు స్టాలిన్. ఇది తమిళనాడుకు వ్యతిరేకంగా వచ్చిన బిల్లు అని, అది వీగిపోయిందన్నారు సీఎం స్టాలిన్. ఇదిట్రైలర్ మా త్రమేనని, ముందు అసలు సినిమా ఉందని సెటైర్లు వేశారు సీఎం స్టాలిన్.ఇక తెలంగాణ సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఐక్యత ముందు కేంద్రం తలవంచిందన్నారు. నల్ల బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయన్నారు. భారతదేశ చరిత్రలో ఈరోజు చిరస్మరణీయమని రేవంత్ పేర్కొన్నారు. బిల్లును ఓడించిన ప్రతిపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్.. దేశంలో ప్రజాస్వామ్య శక్తుల ఏకీకరణ జరిగిందని కొనియాడారు.ఇదీ చదవండి:ఓడిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు -
‘విద్యార్థినులు షార్ట్స్ ధరించి క్లాసులకు అటెండ్ కావొద్దు’
సాక్షి,చెన్నై: ‘నేను ఈ మధ్య ఓ విషయాన్ని గమనించాను. విద్యార్థినులు తరుచుగా షార్ట్స్ ధరించి క్లాసులకు అటెండ్ అవుతున్నారు. ఇలాంటి వస్త్రధారణ పట్ల అటు విద్యార్థులు, ఇటు ప్రొఫెసర్లు ఆకర్షణకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైంగిక వేధింపులకు ఆస్కారం కలిగిస్తాయంటూ తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ వి. నాగరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.వైస్ ఛాన్సలర్ వి.నాగరాజు వ్యాఖ్యలపై యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వైస్ చాన్సలర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని ప్లకార్డులు ప్రదర్శించారు. యూనివర్సిటీ అధికారులు మాత్రం.. విద్యార్థులకు ఓ తండ్రిలా మాట్లాడారే తప్పా.. విద్యార్థునులను కించ పరిచే ఉద్దేశం కాదని అన్నారు. ప్రస్తుతం ఛాన్సలర్ చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయమయ్యాయి.విద్యార్థినులు షార్ట్స్ ధరించడం లైంగిక వేధింపులను ఆహ్వానిస్తుంది అంటూ వైస్ ఛాన్సలర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు షార్ట్స్ ధరించి ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే వీసీ మాత్రం తాను చేసి వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు గర్వకారణంగా ఉందని చెప్పుకొచ్చారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బుధవారం యూనివర్సిటీ న్యాయవాద విద్యార్థులతో జరిగిన ఓ సాధారణ సమావేశంలో వైస్ ఛాన్సలర్ నాగరాజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమావేశానికి ఆయనతో పాటు, రిజిస్ట్రార్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ల డీన్లు, మహిళా సంక్షేమ కేంద్రానికి అధిపతిగా ఉన్న అధ్యాపకులతో సహా పరిపాలనలోని ఇతర సభ్యులు కూడా హాజరయ్యారు.తనపై విద్యార్థులు చేస్తున్న ఆరోపణల్ని వీసీ నాగరాజు ఖండించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ఏ వైస్-ఛాన్సలర్ కూడా డ్రెస్ కోడ్ పెట్టలేరు. కానీ నా అభిప్రాయం ప్రకారం, సంస్థ ప్రతిష్టను మెరుగుపరిచే విషయంలో విద్యార్థుల వస్త్రధారణ ఒక అంశం కావొచ్చని అన్నారు. విద్యార్థుల ప్రశ్నలను వారి అభిప్రాయాలుగా ఆయన కొట్టిపారేశారు. నేను ఏం మాట్లాడానో అర్థం చేసుకోకుండా విద్యార్థులు మీడియాతో మాట్లాడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార డీఎంకే ప్రభుత్వానికి వైస్ ఛాన్సలర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఇదో ట్రాప్.. మోదీ, అమిత్ షా హామీలను నమ్మలేం’
సాక్షి, చెన్నై: నియోజకవర్గాల పునర్విభజన బిల్లు విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి సంచలన ఆరోపణలకు దిగారు. ఈ బిల్లు తమిళనాడు ఉనికినే దెబ్బతీసేలా ఉందని అన్నారు. డీలిమిటేషన్పై మొదటి నుంచి ఆయన కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ బిల్లు పాస్ అయితే గనుక న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అంటున్నారాయన.‘‘లోక్సభ సాక్షిగా మోదీ, అమిత్ షా ఇచ్చిన హామీలను నమ్మలేం. నోటి మాటతో కాదు.. చట్ట సభల్లో రక్షణ కల్పించాలి. చట్ట సవరణ పేరుతో కొత్త కుట్రలు.. రాష్ట్రాల హక్కులు కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే కమిషన్కు అపరిమిత అధికారాలు కట్టబెట్టారు. ఇది రాజకీయ వ్యూహమే తప్ప.. దేశ ప్రయోజనం కోసం ఎంతమాత్రం కాదు. ..తమకు కావాల్సిన రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడమే వాళ్ల ఉద్దేశం. ఇది దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నంలో భాగంగా జాగ్రత్తగా వేసిన ఓ ఉచ్చు. జనాభా నియంత్రణ పాటించే ఇక్కడి రాష్ట్రాలకు శిక్షలా ఉంది. మెజారిటీ ఉందని ఏది పడితే అది చేయడం సరికాదు. ఈ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగదు’’ అని స్టాలిన్ ఉద్ఘాటించారు.డీలిమిటేషన్ను మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసుగులో చేస్తున్నారని కేంద్రంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాదిస్తున్నారు. అయితే.. కేంద్రం మాత్రం ఎలాంటి అన్యాయం జరగదని.. తమది భరోసా అని చెబుతోంది. పైగా డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు 125 నుంచి 195కి చేరతాయి అని బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. రాజ్యాంగ సవరణతో కూడిన ఈ బిల్లు పాస్ కావాలంటే సభలో 2/3 మెజారిటీ అవసరం. అంటే.. 360కి అవసరంకాగా ఎన్డీయే బలం 294నే ఉంది. ఇంకో 66 సీట్లు అవసరం. దీంతో మోదీ సర్కార్ ఎలా గట్టెక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
ప్రచార బాటలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే
సాక్షి, చైన్నె: డీఎంకే కూటమిలోని ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచార బరిలోకి దిగుతున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 18వ తేదీన తమిళనాడుకు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరుచ్చి జిల్లాలోని తురైయూర్లో కాంగ్రెస్ అభ్యర్థి లెనిన్కు మద్దతుగా భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ 28 చోట్ల పోటీ చేస్తున్న విషయం తెలిసింది. ఎన్నికల ప్రచార సమయం మరి కొద్ది రోజులలో ముగియనున్నది. ఇంత వరకు కాంగ్రెస్ అగ్ర నేతలు ఎవ్వరూ ప్రచారానికి రాక పోవడంతో అభ్యర్థులలో టెన్షన్ తప్పలేదు. ఈ పరిస్థితులలో ఎట్టకేలకు రాహుల్ గాంధి పర్యటన ఖరారు చేశారు. 18న ఢిల్లీ నుంచి చైన్నెకు వచ్చే రాహుల్గాంధీ హెలికాఫ్టర్ ద్వారా పొన్నేరి నియోజకవర్గంకు వెళ్లి, అక్కడి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం షోళింగర్లో జరిగే బహిరంగ సభకు హజరు అవుతారు. సాయంత్రం తిరుచ్చి తురయూర్లో జరిగే బహిరంగ సభకు హాజరు అవుతారు. ఇక్కడ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, రాహుల్ గాంధితో పాటుగా కూటమిలోని ఇతర పార్టీల నేతలందరూ ఒకే వేదికపై కనిపించే అవకాశాలు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఆ తదుపరి 20వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కన్యాకుమారి జిల్లాలోని కులచాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. -
‘విజయ్’ వరాల జల్లు
ప్రధాన వాగ్దానాలు సాక్షి, చైన్నె : తమిళగ వెట్రికళగం ఓటర్లకు వాగ్దానాల వాన కురిపించింది. చైన్నెలో జరిగిన కార్యక్రమంలో అభ్యర్థుల సమక్షంలో టీవీకే అధినేత విజయ్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. గృహాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం అన్న కీలక ప్రకటనను విజయ్ చేశారు. వివరాలు.. టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 234 స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టగా, ఓ చోట నామినేషన్ తిరస్కరణకు గురి అయింది. మిగిలిన చోట్ల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వీరికి మద్దతుగా విజయ్ జిల్లా కేంద్రాలలోని నియోజకవర్గాలను కలుపుతూ ప్రచార సభలు,రోడ్ షోలతో ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో తిరుప్పూర్, కన్యాకుమారి వంటి ప్రచార సభలలో కొన్ని ఆసక్తికర వాగ్దానాలను విజయ్ ప్రకటించారు. నేతన్న, రైతన్నల అభ్యున్నతిని కాక్షించే విధంగా వరాలు జల్లులు కురిపించారు. నేతన్నల కోసం ‘ఈ–కామర్స్’ విప్లవం, చేనేత రంగం కోసం ప్రభుత్వ ఈ–కామర్స్ పోర్టల్ను ఏర్పా టు చేస్తామని హామీ ఇచ్చారు. నేత కార్మికుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి నూలు ,రంగుల కొనుగోలుపై 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. అంతే కాదు, శాంతిభద్రతలను కాపాడే పోలీసుల పని ఒత్తిడిని తగ్గించేలా చర్యలు తీసుకుంటూ, రోటెటింగ్ పద్దతిలో సెలవులు అందజేస్తామని ప్రకటించి ఉన్నారు. అలాగే, రాష్ట్రంలో ఏ పార్టీ ఊహించని రీతిలో ఏఐ విప్లవాన్ని అనుకూలంగా మలచుకునేందుకు సైతం వాగ్దానాలు కురిపించారు. టీవీకే అధికారంలోకి రాగానే శ్రీతమిళనాడు సేవ ధృవీకరణ పథకం తో ఒక మొబైల్ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్తో సహా అన్ని ప్రభుత్వ సేవల కల్పన, జాలర్ల భద్రతకు భరోసాగా నిషేధ కాలంలో ఇస్తున్న రూ. 8 వేలు సాయాన్ని రూ. 20 వేలకు పెంపు, కడల్ తాయ్ ఇల్లం పేరిట సముద్ర తీరంలో ఉన్న గుడిసెలు, పాడు బడ్డ గృహాలను తొలగించి, వాటి స్థానంలో ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనే విధంగా గృహాలను నిర్మించి ఇస్తామని విరించారు. అలాగే, ఆధునిక యుగానికి అనుగుణంగా ఏఐ శాఖను సైతం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల వాగ్దానంగా మేనిఫెస్టోను గురువారం సాయంత్రం చైన్నెలో విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల మేనిఫెస్టో తొలి ప్రతిని రైతు నారాయణన్కు విజయ్ అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తమ మేనిఫెస్టో తిరుక్కురళ్లోని అరమ్, పొరుళ్, ఇన్బమ్ ఆధారంగా రూపొందించబడిందన్నారు. తాము చేయగలిగినవి మాత్రమే ఇందులో చెప్పామని, ఇతరుల మాదిరిగా ప్రజలను మోసం చేయమని స్పష్టం చేశారు. -
బ్యాలెట్ పేపర్ల ఏర్పాటు ప్రారంభం
తిరువళ్లూరు: ఈవీఎంలలో అభ్యర్థుల గుర్తులతో కూడిన బ్యాలెట్ పేపర్లను అమర్చే పనులను అధికారులు గురువారం నుంచి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు 23వ తేదీన జరగనున్నాయి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన క్రమంలో ప్రచారం సైతం తుదిదశకు చేరుకుంది. ఈక్రమంలో ఎన్నికలకు కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే వున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇప్పటికే అధికారులకు ఎన్నికల నిర్వాహణకు సంబందించి రెండు విడదతలుగా శిక్షణ సైతం పూర్తి చేశారు. ఈనేపథ్యంలో గురువారం ఈవీఎంలలో అభ్యర్థుల పేర్లు, గుర్తుతో కూడిన బ్యాలెట్ పేపర్లను అమర్చే పనులను అధికారులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈవీఎం, సీపీయూ, వీవీప్యాట్లను సరి చూసి తరువాత పేపర్లను అమర్చుతున్నారు. జిల్లాలో మూడువేలకు పైగా ఈవీఎంలు వున్న క్రమంలో ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో వుంచి పనులను చేస్తున్నట్టు కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. రెండు రోజుల్లో పనులను పూర్తి చేసి ఈవీఎంలను భద్రపరుస్తామని ఆయన తెలిపారు. -
బీజేపీ నియంతృత్వంగా వ్యవహరిస్తోంది
వేలూరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసి నియంతృత్యంగా వ్యవహరిస్తోందని మంత్రి, డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ నియోజక వర్గాల పునర్విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే పార్టీతో పాటు కూటమి పార్టీలకు చెందిన ప్రతినిధులు ఇంటిపై నల్ల జెండాలు కట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అందులో బాగంగా కాట్పాడి గాంధీనగర్లోని మంత్రి దురైమురుగన్ ఇంటి ముందు నల్ల జెండాను కట్టి నిరసనలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అన్నాడీఎంకే పార్టీ పూర్తిగా బీజేపి ఉచ్చులో చిక్కుగా ఉందన్నారు. బీజేపీ నియోజక వర్గాల పునర్విభజనను ఎన్నికల సమయంలో తీసుకు రావడం సరికాదన్నారు. ప్రజా అభిప్రాయం సేకరించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టాలన్నారు. ఒక రాష్ట్రం మద్దతు లేకుండా ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు పలు పథకాలను అమలు చేస్తూ పూర్తిగా ఇష్టానుసారంగా కేంద్ర ప్రభుత్వం నడిపించాలని చూస్తోందన్నారు. వీటిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తమ కూటమి పార్టీలకు చెందిన ప్రతినిధులు ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేసి కేంద్ర ప్రభుత్వ బిల్లుకు వ్యతిరేకత తెలుపుతున్నామన్నారు. డిప్యూటీ మేయర్ సునీల్కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు టీటా శరవణన్, డివిజన్న్ కార్యదర్శి పరమశివం, డీఎంకే శ్రేణులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
చైన్నె బీచ్లో జెల్లీఫిష్లు కొరుక్కుపేట: పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు, కాలుష్యం కారణంగా చైన్నె బీచ్లలో జెల్లీఫిష్లు అధిక సంఖ్యలో కనిపిస్తున్నాయి. జెల్లీఫిష్లు, అరుదైన ఎర్ర సముద్ర తాబేళ్లతో సహా అనేక సముద్ర జీవులు చైన్నె సహా సముద్ర ప్రాంతాలలో నివసిస్తాయి. వీటిలో, జెల్లీఫిష్లు సముద్ర చేపలలో అత్యంత అందమైనవి, ఉత్తేజకరమైనవి. విశాలమైన నీటి ఉపరితలం ఉన్న లోతైన సముద్ర ప్రాంతాలలో ఇవి సమృద్ధిగా నివసిస్తాయి. కాలుష్య వైవిధ్యం కారణంగా, ఇవి ఎక్కువగా చైన్నె తీరప్రాంతంలో ఉన్నాయి. వారం రోజులుగా జెల్లీఫిష్ల సంచారం అసాధారణంగా పెరిగిందని అక్కడి మత్స్యకారులు చెబుతున్నారు. దీనివల్ల చైన్నె , ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల నివాసితులకు అనేక సమస్యలు తలెత్తాయి. సముద్రంలో స్నానం చేయడానికి వచ్చే చాలా మంది పర్యాటకులను తేళ్లలాంటి జెల్లీఫిష్లు కుడుతున్నాయి, దీనివల్ల వారికి తీవ్రమైన నొప్పి, దురద, దద్దుర్లు వస్తున్నాయని చెబుతున్నారు. గాలి వేగంలో మార్పు కారణంగా, ప్రస్తుతం తీరంలో సమృద్ధిగా ఉన్న జెల్లీఫిష్లు పడవల్లోని జాలర్ల వలల్లో చిక్కుకుంటున్నాయి. వీటిని తాకిన వారికి ఒళ్లంతా దురద, ఛాతి నొప్పి, చేతులు, కాళ్ల నొప్పి వంటి సమస్యలు వస్తున్నాయని వెల్లడించారు. వేసవిలో వేడి పెరిగి, సముద్రపు ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ, ఇలాంటి జెల్లీఫిష్ సమూహాలు తరచూ కనిపిస్తాయని జాలర్లు అంటున్నారు. పులి దాడిలో మహిళ మృతి అన్నానగర్: పులి దాడిలో ఓ మహిళ మృతిచెందింది. నీలగిరి జిల్లాలోని అనుమాపురానికి చెందిన పార్వతి (55). గత 11వ తేదీ రాత్రి బంధువును కలిసేందుకు వెళుతుండగా అదృశ్యమైంది. అటవీ శాఖ, పోలీసులు ముమ్మరంగా గాలించారు. నాలుగు రోజుల తర్వాత, బుధవారం దట్టమైన అటవీ ప్రాంతంలో ఆమె శరీర భాగాలు లభ్యమయ్యాయి. తేయాకు తోటలో ఉన్న పులి ఆమైపె దాడి చేసి 3 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లిందని విచారణలో నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె శరీర భాగాలను పోస్ట్మార్టం కోసం ఊటీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దివ్యాంగుడు దారుణ హత్య అన్నానగర్: రాయితో కొట్టి దివ్యాంగుడిని దుండుగుడు హత్య చేశాడు. చైన్నెలోని సైదాపేట ప్రాంతానికి చెందిన మురుగన్ (40). దివ్యాంగుడైన ఇతను సైదాపేట రైల్వే స్టేషన్ సమీపంలోని రోడ్డుపై నివసించేవాడు. గురువారం, రైల్వేస్టేషన్ సమీపంలోని రోడ్డు పై మురుగన్ రక్తపు గాయాలతో శవంగా పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. విషయం తెలిసి సైదాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టానికి రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో, మురుగన్ నివసించే అదే వీధికి చెందిన నారాయణన్ (50) అనే వ్యక్తి అతడిని కొట్టి హత్య చేసినట్లు తెలిసింది. మద్యం మత్తులో జరిగిన వాగ్వాదంలోనే మురుగన్ను కొట్టి చంపినట్లు తెలిసింది. పోలీసులు నారాయణన్ను అరెస్టు చేశారు. గణనాథుని సన్నిధిలో అపోలో చైర్మన్ కాణిపాకం: అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి గురువారం కుటుంబ సమేతంగా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ వారు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. శ్రీవారి సేవలో ప్రముఖులు తిరుమల : తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు సేవించుకున్నారు. వీరిలో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. -
సెమీకండక్టర్ టెక్నాలజీలో ఆవిష్కరణలు
కొరుక్కుపేట: సెమీకండక్టర్ టెక్నాలజీ రంగంలో ఆవిష్కరణలు చేపట్టాలని విద్యార్థులకు అతిథులు పిలుపునిచ్చారు. ఎస్ఆర్ఎం ఐ ఎస్టీ వడపళని క్యాంపస్లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సిలికాన్ ఒడిస్సీ 2026– చిప్స్ భవిష్యత్తును రూపొందించడం, సిగ్మా కమ్యూనిటీ ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి స్టూడెంట్ సెమీకండక్టర్స్ చైన్నె చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనితా స్టాలిన్,మైక్రోచిప్ టెక్నాలజీ ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ మేనేజర్ అనుపమ పరిశ్రమకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలు, అభ్యాసం ప్రాముఖ్యతను వివరించారు. ఎఫ్ఈటీడీన్ డాక్టర్ సి.వి. జయకుమార్, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ ఎ. షిర్లీ ఎడ్వర్డ్, పూర్వ విద్యార్థుల వ్యవహారాల డైరెక్టర్ డాక్టర్ రత్నం, కోఆర్డినేటర్ డాక్టర్ వి.పి. కవిత పాల్గొన్నారు. -
కళాశాల విద్యార్థినిపై దాడి
–నలుగురి అరెస్ట్ తిరువళ్లూరు: సెమిస్టర్ పరీక్షల కోసం చదువుతున్న విద్యార్థిని గదిలోకి చొరబడి విచక్షనా రహితంగా కత్తులతో దాడి చేసిన వ్యవహారంలో నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని వల్లూరు వాలాజ నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆస్కార్. ఇతని భార్య సల్మా. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు. వీరిలో మొదటి కుమార్తె సుమయాఫాతీమా(18) స్థానికంగా వున్న ప్రయివేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. త్వరలో సెమిస్టర్ పరిక్షలు ప్రారంభం కానున్న క్రమంలో ఇంట్లో చదువుకుంటున్న ఫాతిమాపై నలుగురు యువకులు చొరబడి విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి పరారయ్యారు. వీరిలో ఒకరిని స్థానికులు వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణ అనంతరం మిగిలిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు అదే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు గంజాయి మత్తులో యువతిపై దాడి చేసినట్టు నిర్ధారించారు. అనంతరం పట్టుబడిన దేవన్ కుమారుడు ఢిల్లీబాబు(23), లోకేష్(22), తమిళరసు కుమారుడు ముత్తమిళ్సెల్వన్(24), అబ్దుల్సలాం కుమారుడు సిద్ధిక్(19)గా గుర్తించారు. వీరు అదే ప్రాంతంలో కత్తులతో హల్చల్ చేసి రీల్స్ చేయడం, స్థానికులను బెదిరింపులకు దిగడం లాంటి చర్యలకు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
డీఎంకే శ్రేణుల నిరసన
తిరువళ్లూరు: నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని అమలు చేయడం ద్వారా తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ డీఎంకే అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు తిరువళ్లూరులో నల్లబ్యాడ్జీలు ధరించి డీఎంకే శ్రేణులు నిరసన తెలిపారు. జనాభా ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే కేంఽద్రప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేయడం వల్ల రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలు తగ్గిపోయే ప్రమాదం వుందని, తద్వారా పార్లమెంట్లో తమిళనాడుకు ప్రాతినిత్యం తగ్గుతుందన్నది డీఎంకే ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన వద్దని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే ఆందోళనలకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ప్రతి ఇంటిపై నల్లా జెండాలు ఎగరవేయడంతో పాటు నల్లదుస్తులు ధరించి నిరసన చేపట్టాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే తిరువళ్లూరులో డీఎంకే ఆధ్వర్యంలో పట్టణంలోని డీఎంకే కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తిరువళ్లూరులో జరిగిన ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ హాజరై ప్రసంగించారు. డీఎంకే, కాంగ్రెస్, ఎండీఎంకే, డీఎండీకే, వీసీకే శ్రేణులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ వ్యాపారం పేరుతో కోటిన్నర మోసం
– నిందితుడి అరెస్ట్ అన్నానగర్: తిరువళ్లూరు జిల్లాలోని పెరుమల్ పట్టు ప్రాంతానికి చెందిన షాజీ (62). ఇతను పదవీ విరమణ చేసిన ఉద్యోగి. ఆన్లైన్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయ ని చెప్పే ఒక ప్రకటనను అతను చూశాడు. షాజీ అందులోని సెల్ ఫోన్ నంబర్ కు ఫోన్ చేయగా, అవతలి వైపు వారు చెప్పిన ప్రకారం, వారు పే ర్కొన్న బ్యాంకు ఖాతాలో రూ.1 కోటి 38 లక్షల 84 వేల 600ను వివిధ వాయిదాలలో పెట్టుబడిగా పెట్టారు. అయితే ఆ తర్వాత, అతని బ్యాంకు ఖాతాలోకి డబ్బు రాకపోవడంతో, అతను చెల్లించిన డబ్బును కూడా విత్ డ్రా చేసుకోలేకపోయాడు. తాను మోసపోయానని అతనికి తర్వాతే తెలిసింది. అతను వెంటనే ఆవడి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ సుభాషిని కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. దర్యాప్తులో, పుదుక్కోట్టై జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ మణికంఠ ప్రభు (30) ఒక నకిలీ సంస్థను ప్రారంభించి, దాని పేరు మీద బ్యాంకు ఖాతా తెరిచి, అందులో డబ్బు జమ చేసి, మోసగాళ్లకు సహకరించినట్లు వెల్లడైంది. దీని తర్వాత పోలీసులు గురువారం మణికంఠ ప్రభును అరెస్టు చేసి విచారిస్తున్నారు. నవీన్స్ గార్డెన్స్కు ప్రతిష్టాత్మక అవార్డు సాక్షి, చైన్నె : ప్రముఖ డెవలపర్ సంస్థ నవీన్స్ చైన్నె వలసరవాక్కంలోని ఆర్కాట్ రోడ్డులో నిర్మించిన నవీన్స్ హ్యాంగింగ్ గార్డెన్ ప్రాజెక్ట్కు గాను ప్రతిష్టాత్మక 17వ సీఐడీసీ విశ్వకర్మ అవార్డు 2026శ్రీ లభించింది. కన్ష్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా బెస్ట్ కన్ష్ట్రక్షన్ ప్రాజెక్ట్ విభాగంలో ఈ అవార్డును అందజేశారు. ప్రాజెక్ట్ అద్భుతమైన డిజైన్, వినూత్న నిర్మాణ శైలి, పర్యావరణ హితమైన విధానాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. నవిన్స్ టెక్నికల్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ పి.ఎన్. ఈ అవార్డును అందుకున్నారు. డీఎంకే, టీవీకే ఘర్షణ కొరుక్కుపేట: తంజావూరు జిల్లా, కుంభకోణం కార్పొరేషన్ పరిధిలోని తుక్కంపలైయ వీధిలో డీఎంకే, టీవీకే పార్టీ సభ్యులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో, ఓటర్లకు రూ.8 వేల విలువగల కూపన్లను పంపిణీ చేసిందని టీవీకే డీఎంకేపై ఆరోపణలు చేసి, డీఎంకేను ప్రశ్నించింది. దీంతో రెండు పార్టీల మధ్య ఘర్షణ చెలరేగింది. వార్డ్ 17 డీఎంకే కార్యదర్శి సభాపతి కుంభకోణం తూర్పు పోలీస్స్టేషన్న్లో ఫిర్యాదు చేశారు. రెండు పార్టీలకు చెందిన ఆరుగురు వ్యక్తులు గాయపడి, చికిత్స కోసం కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయమై పార్టీలు నియోజకవర్గ ఎన్నికల అధికారికి ఫిర్యాదు కూడా చేశాయి. ఆ ప్రాతిపదికన ప్రచారాన్ని జరగకుండా అడ్డుకున్నారు. టి.వి.కె. వినోద్, అభ్యర్థి నిర్వాహకుడు మురుగానందం , మరికొందరిపై దాడి జరిగింది, అదేవిధంగా, టీవీకే నిర్వాహకుడు మురుగానందం దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు అనుమతి లేకుండా కూపన్న్లను జారీ చేశారు. ప్రచారం సందర్భంగా వారిని అడ్డుకున్నందుకు అసభ్యకరమైన భాషలో మాట్లాడినందుకు డీఎంకే మున్సిపల్ కార్యదర్శి ఎస్పీ తమిళళగన్ , మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
లక్ష్మీకాంతన్ కొలై వళక్కు కోసం విజయ్సేతుపతి
తమిళసినిమా: నటుడు జీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లక్ష్మీ కాంతన్ కొలై వళక్కు. దయాళ్ పద్మనాభన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2 ఎం సినిమాస్ పతాకంపై వీ.శబరీస్ నిర్మిస్తుండగా దర్శకుడు దయాళ్ పద్మనాభన్ కు చెందిన డీ.పిక్చర్స్ సంస్థ సహనిర్మాణ బాద్యతలను నిర్వహిస్తోంది. నటుడు రంగరాజ్పాండే,నటి బ్రిగిడా సాగా, పరుత్తివీరన్ శరవణన్, మారన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దర్బుక శివ సంగీతాన్ని, ఎంవీ.పన్నీర్ సెల్వం ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. కాగా సస్పెన్ ,థ్రిల్లర్ ఇతి వృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు దయాళ్ పద్మానాభన్ తెలుపుతూ చిత్ర షూటింగ్ను చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నట్లు చెప్పారు. కాగా చిత్రంలోని ప్రధాన పాత్రలను నటుడు విజయ్సేతుపతి పరిచయం చేశారని, ఆ వీడియోకు ఇప్పుడు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. దీంతో చిత్రంపై ఆసక్తి పెరుగుతోందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారి అంచనాలను రీచ్ అయ్యే విధంగా లక్ష్మీకాంతన్ కొలై వళక్కు చిత్రాన్ని పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించినట్లు చెప్పారు. కాగా చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వివరాలతో పాటు, చిత్ర విడుదల గురించి త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. -
నేటి నుంచి వేసవి సెలవులు
సాక్షి, చైన్నె: వేసవి సెలవుల కాలాన్ని విద్యార్థులు అర్థవంతంగా, ప్రయోజనకరంగా గడపాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం నుంచి వేసవి సెలవులను ప్రకటించారు. తిరిగి జూన్ 1వ తేదీన పాఠశాలలు పునర్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, విద్యార్థుల భద్రత , ఆరోగ్యం దృష్ట్యా తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎస్. కన్నప్పన్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ముఖ్యమైన సూచనలు సెలవు రోజుల్లో సముద్రం, నదులు, సరస్సులు, చెరు వులు, కుంటల వద్దకు విద్యార్థులను స్నానానికి వెళ్లనివ్వవద్దని కోరారు. వేసవి తాపం ఎక్కువగా ఉన్నందున, బయట ఆడుకునే సమయంలో విద్యార్థులు ఎక్కువగా నీరు తాగేలా చూడాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లడం లేదా ఆరుబయట ఆటలు ఆడటం నివారించాలని సూచించారు. సెలవుల్లో విద్యార్థులు ఒంటరితనానికి గురికాకుండా చూడాలని, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆడుకోవడం, కలిసి భోజనం చేయడం , సంగీతం వినడం వంటి సామాజిక కార్యక్రమాల ద్వారా వారిని ఉత్సాహంగా ఉంచాలని వివరించారు. టీవీలు , సెల్ఫోన్ల ముందు ఎక్కువ సమయం గడపకుండా వారిని నియంత్రించాలని, విద్యార్థుల ఎదుగుదలకు సమతుల్య ఆహారం అవసరం అని పేర్కొంటూ, వారికి సంప్రదాయ ఆహార పదార్థాలను మరియు వేసవికి తగిన పండ్లను అందించాలన్నారు. పఠన ఆసక్తిని పెంచుదాం విద్యార్థులను దగ్గరలోని ప్రభుత్వ గ్రంథాలయాలకు తీసుకెళ్లి, రోజుకు కనీసం ఒక గంట సేపైనా పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలని, వారి ఆసక్తిని బట్టి కామిక్స్, జనరల్ నాలెడ్జ్, నీతి కథల పుస్తకాలను అందించాలని వివరించారు. అలాగే నైపుణ్యాల అభివృద్ధి దిశగా సంగీతం, నృత్యం, పెయింటింగ్ వంటి రంగాలలో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ సెలవుల్లో వాటిని నేర్చుకునేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతిరోజూ రెండుసార్లు పళ్లు తోముకోవడం, స్నానం చేయడం వంటి అలవాట్లను పెంపొందించాలని, పెద్దలను గౌరవించడం, వారికి సహాయం చేయడం వంటి విలువలను నేర్పించాలని కోరారు. పిల్లల వేసవి సెలవుల ప్రణాళికలో ఇవి తప్పకుండా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. -
అగర్వాల్స్ వైద్యులకు ప్రతిష్టాత్మక అవార్డులు
సాక్షి, చైన్నె : కంటి వైద్య రంగ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ స్థాయిలో మరోసారి మర్మోగించే విధంగా డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రికి చెందిన ఇద్దరు ప్రముఖ సీనియర్ వైద్యులు అంతర్జాతీయ స్థాయిలో అత్యున్న త అవార్డులను అందుకున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జరిగిన ’అమెరికన్ సొసైటీ ఆఫ్ కాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ’(ఏఎస్సీఆర్ఎస్) 44వ ఫిల్మ్ ఫె స్టివల్లో వీరికి ఈ గుర్తింపు లభించింది. అధునాతన కంటి శస్త్రచికిత్స పద్ధతులపై రూపొందించిన విద్యాపరమైన చిత్రాలకు గాను ఈ గౌరవం దక్కింది.. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ డైరెక్టర్ అతియా అగర్వాల్ ప్రథమ బహుమతిగా పర్పుల్స్ ఆఫ్ ఐరిస్ రిపేర్ చి త్రానికి అవార్డును అందుకున్నారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ అగర్వాల్స్ రిఫ్రాక్టివ్ అండ్ కార్నియా ఫౌండేషన్ చీఫ్ డాక్టర్ సూసన్ జాకబ్ రన్నరప్ అవార్డుగా ‘రీబ బ్లింగ్ ఇన్ కెరాటోప్లాస్టీ‘ చిత్రానికి అందుకన్నారు. ఈ అవార్డును అందుకున్న వైద్యులు గురువారం చైన్నెలో మీడియాతో మాట్లాడుతూ, గ్లోబల్ స్టేజ్పై ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ప్రధానంగా కంటి వైద్య రంగంలో మహిళా నాయకత్వానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. -
వృద్ధుల కోసం వ్యాక్సినేషన్ సెంటర్
సాక్షి, చైన్నె : వృద్ధులకు మెరుగైన నివారణ ఆరోగ్య సంరక్షణను అందించే దిశగా సమగ్ర వృద్ధుల సంరక్షణలో లక్ష్యంతో ‘గెరి కేర్’ సంస్థ, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ‘గెరియాట్రిక్ వ్యాక్సినేషన్ సెంటర్’ను చైన్నెలో ప్రారంభించింది. చైన్నెలోని టి.నగర్, ఆదంబాక్కం, అడయార్లోని గెరి కేర్ కేంద్రాలతో పాటు, ఆ సంస్థకు చెందిన అన్ని క్లినిక్లు నర్సింగ్ హోమ్స్లో ఈ వ్యాక్సినేషన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కేంద్రాన్ని 80 ఏళ్ల వృద్ధుడు, ప్రొఫెసర్ పి.ఎస్. చంద్రమౌళి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గెరి కేర్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీపతి రమేష్, పలువురు ప్రముఖ వైద్యులు ఆరోగ్య నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీపతి రమేష్ మాట్లాడుతూ.. వృద్ధులకు నివారణ ఆరోగ్య సంరక్షణ అనేది చాలా నిర్లక్ష్యం చేయబడుతోందన్నారు. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు ఉన్న వృద్ధులకు ఇన్సులేషన్, న్యూమోకాకల్ వంటి ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుందన్నారు.. సరైన సమయంలో వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా ఆసుపత్రిలో చేరే అవకాశాలను 40–60 శాతంవరకు తగ్గించవచ్చు అని తెలిపారు. -
ఎక్కివచ్చాం.. అయ్యాప్పా!
తమిళసినిమా: నటుడు యోగిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం సన్నిధానం పీఓ. ఈ చిత్రంలోని ఏరి వందోం అయ్యాప్పా(ఎక్కి వచ్చాం అయ్య ప్పా) అనే పల్లవితో సాగే తొలి పాటను యూనిట్ వర్గాలు విడుదల చేశారు. శబరిమలకు చెందిన భక్తిని, నమ్మకాన్ని, దానికి సంబంధించిన అందమైన సన్నివేశాలతో కూడిన భక్తుల మనసులను పరవశింపజేసే ఈ పాటను గీత రచయిత మోహన్రాజా రాశారు. గా యనీ గాయకులు అభిషేక్ రాజా, విష్ణురామ్ ఆలపించారు. ఏజీఆర్ సంగీత భాణీలను కట్టిన ఈ పాట ప్రే క్షకులను విశేషంగా ఆకట్టుకుంటోందని యూనిట్ స భ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. యోగిబాబు, రూపేష్ శెట్టి, వర్షా విశ్వనాధ్ ప్ర ధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో నటి సితారా, ప్రమోద్శెట్టి, మూనార్ రమేష్,గజరాజ్ ,రాజా రుద్రకొడి, సాధ్విక్, హశ్విన్ హాసన్, వినోద్సాగర్, కల్కీ రాజా, విశాలిని, దక్షికా లక్ష్మణన్, మధుసూదన్రావ్, మొదలగు పలువురు ముఖ్య పాత్రలను పోషించారు. సర్వదా సినీ కరేజ్, షీమోకా క్రియేషన్స్ సంస్థల అధినే తలు మధుసూదన్రావ్,వీ.వివేకానందన్,రామస్వామి వేలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి షబీర్ బదాన్ సహ నిరార్మతగా వ్యవహరిస్తున్నారు. కాగా అముద భారతి క థ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాని కి అజును అయ్యప్పన్ కథ,కధనాలను అందించారు. ఇది అందమైన అనుబంధాలతో కూడిన శబరిమల విశేషాలను, అయ్యప్ప భక్తులు ఎదుర్కొనే అనూహ్య సంఘటలు, తద్వారా వారి పయనంలో జరిగే పరిఱామాలను ఆవిష్కరించే అద్భుతమైన భక్తిరస కథా చిత్రంగా సన్నిధానం పీఓ చిత్రం ఉంటుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఇంతకు ముందు ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను దర్శకుడు చేరన్, నటి మంజువారియర్లు విడుదల చేశారని, ఆ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిందని చెప్పారు. కాగా తమిళం,తె లుగు, కన్నడం,మలయాళం భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని విదుదల తేదీని త్వరలోనే అ ధికారికంగా వెల్లడిస్తామని పే ర్కొన్నారు. -
బిగ్బాస్ హౌస్ నుంచి మరో హీరో
తమిళసినిమా: బిగ్బాస్ రియాలిటీ గేమ్ షో సినీ అవకాశాలకు మంచి వేదికగా మారుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ హౌస్ నుంచి వచ్చిన పలువురు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు.కాగా తాజాగా మరో బిగ్బాస్ కంటెస్ట్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆయన పేరు విక్కల్స్ విక్రమ్. ఈయన ఇంతకు ముందే స్టార్టప్ కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటిది తాజాగా లైట్ వెయిట్ బేబీ అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ఫిట్నెస్ మోడలింగ్ ఆర్తి కృష్ణ నాయకిగా పరిచయం అవుతున్నారు. దీనికి కేసీ గురు కథ,దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. హితా స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ సంతోష్.జీ, తిమ్మా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. ప్రమోద్ కొడియన్ ఛాయాగ్రహణంను, శరవణన్ సుబ్రమణియన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలోని ఒక నక్షత్రహోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోగా పరిచయం అవుతున్న నటుడు విక్కల్స్ విక్రమ్ మాట్లాడుతూ తాను స్టార్టప్ ఆర్టిస్ట్గా చిన్న చిన్న కార్యక్రమాలను నిర్వహిస్తుండగా బిగ్బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొనే అవకాశం వచ్చిందన్నారు. ఆ గేమ్షోలో చివరి వరకూ చేరుకునే విధంగా అభిమానులు ఆదరించారన్నారు. ఆ తరువాత లైట్ వెయిట్ బేబీ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పారు. తాను నటుడిగా పరిచయం అయిన 10 ఏళ్లకు హీరోగా నటించే అవకాశం వచ్చిందని చెప్పారు. ఈ చిత్ర టైటిల్ సోస్టర్ చూస్తేనే ఇది వినోదభరిత ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని అర్దం అయ్యిపోతుందన్నారు. చిత్ర దర్శకుడు కేసీ.గురు చిత్ర వివరాలను తెలుపుతూ ఈ నెల 24వ తేదీ నుంచి షూటింగ్ను నిర్వహించనున్నట్లు చెప్పారు. లైట్ వెయిట్ బేబీ అనేది ఇన్బ్యాలెన్ లైఫ్ అని చెబుతుందన్నారు. చిత్ర టైటిల్లో వెయిట్ లిఫ్ట్లో ఒక పక్క బరువు తక్కువగా, మరో పక్క బరువు ఎక్కువగా ఉన్నట్లే ఈ చిత్ర కథ ఉంటుందని చెప్పారు. కాగా ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడికి కృతజ్ఞలు అని ,ఈ చిత్రం ఎలా వస్తుందో నని ఆసక్తిగా ఉందని నటి ఆర్తికృష్ణ పేర్కొన్నారు. -
సాత్తూరులో.. ‘నైనార్’ నెగ్గేనా..?
సాత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. తన సొంత గడ్డ తిరునల్వేలి నుంచి సాత్తూరుకు మకాం మార్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్కు ఇక్కడి ఓటర్లు పట్టం కట్టేనా? అన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇందుకు కారణం ఈ నియోజకవర్గంలో పంచముఖ సమరం నెలకొనడంతో ఓట్ల చీలిక గెలుపును నిర్ధారించనుంది. సాక్షి, చైన్నె : విరుదునగర్ జిల్లాలోని సాత్తూరు శివకాశి తదుపరి బాణా సంచాల తయారీలో పేరు గడించి ఉంది. ఇక్కడి ప్రజలకు బాణా సంచా తయారీ పరిశ్రమలో పనులే ప్రధాన జీవనాధారంగా ఉంది. వర్షాల సీజన్లో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు ఎక్కువే. పూర్తిగా గ్రామాలతో నిండిన నియోజకవర్గంగా సాత్తూరు ఉంది. తెలుగు మాట్లాడే నాయుడు, నాడార్, దేవర్ సామాజిక వర్గం ఇక్కడ ఎక్కువే. మొత్తం ఓటర్లు 2,27,963 మంది ఉన్నారు. కర్మయోగి , మాజీ సీఎం కామరాజర్ ఇక్కడి నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు సార్లు అసెంబ్లీలో అడుగు పెట్టారు. ప్రస్తుత రెవిన్యూ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ గతంలో అన్నాడీఎంకే తరపున మూడు సార్లు, ఆ తదుపరి త్యాగమరుమలర్చి కళగం తరపున ఒక సారి, డీఎంకే తరపున రెండు సార్లు అసెంబ్లీకి వెళ్లారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ మూడు సార్లు గెలిచింది. కామరాజర్ తదుపరి ఇక్కడ డీఎంకే, అన్నాడీఎంకేలో పాగా వేశాయి. అన్నాడీఎంకే ఆరు సార్లు, డీఎంకే నాలుగు సార్లు, ఫార్వర్డ్ బ్లాక్ , త్యాగ మరు మలర్చి కళగం , ఎండీఎంకే ఒక సారి గెలిచాయి. 2021 ఎన్నికలలో డీఎంకే కూటమిలో ఎండీఎంకే అభ్యర్థి ఏఆర్ రఘురామన్ గెలిచారు. అయితే, ఈ సారి డీఎంకే ఇక్కడ పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. నైనార్కు ఛాన్స్ చిక్కేనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సాత్తూరులో పోటీ చేస్తున్నారు. ఇది వరకు ఆయన పలు మార్లు తిరునల్వేలిలో పోటీ చేశారు. దీంతో ఈ నియోజకవర్గం వీఐపీ జాబితాలోకి చేరినట్లయ్యింది. లోక్ సభ ఎన్నికలలో తిరునల్వేలి నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నైనార్కు ఓటమి తప్పలేదు. దీంతో ఆయన తన మకాంను సాత్తూరుకు మార్చేశారు. గత ఏడాది కాలంగా సాత్తూరు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులు చేస్తూ వచ్చారు. 2021లో అసెంబ్లీ ఎన్నికలలో తిరునెల్వేలిలో గెలిచిన నైనార్, సెంటిమెంట్ కారణంగా ఈ సారి సాత్తూరును ఎంపిక చేసుకున్నట్టు ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. అటు తన సామాజిక వర్గం ఓట్లు, ఇటు కూటమి ఓట్లపై నైనార్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన కోసం జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం సాత్తూరులో ప్రచారం నిర్వహించడం విశేషం. సవాలుగా ప్రత్యర్థులు నైనార్కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. డీఎంకే తరపున స్థానికుడైన అభ్యర్థి ఎ కడర్కరైరాజ్ పోటీలో ఉన్నారు. ఆయన విరుదునగర్ జిల్లా కౌన్సిల్ చైర్మన్గా పనిచేసిన అనుభవం కలిగిన నేత. స్థానికంగా పట్టున్న నాయకుడు కావడంతో సమరం హోరా హోరీ కానున్నది. గతంలో ఇక్కడ వరుస విజయాలతో దూసుకొచ్చిన మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ డీఎంకే అభ్యర్థి గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకోవడంతో సమరం రసవత్తరంగా మారింది. అదే సమయంలో నైనార్కు మరో అభ్యర్థి రూపంలోనూ తీవ్ర పోటీ అన్నది నెలకొన్నట్లయ్యింది. దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ మద్దతు దారుడైన ఇసక్కిరాజా పోటీలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టున్న ఇసక్కి రాజకు నైనార్ సామాజిక వర్గం ఓట్లు చీల్చే అవకాశాలు ఎక్కువే. పసుంపొన్ ముత్తురామలింగ దేవర్ పాదుగాప్పు ఇయక్కమ్ నేతగా ఇసక్కి రాజా ఉండటంతో ఆ సామాజికవర్గం ఆయన వెన్నంటి ఉన్నట్టే. యువత పై టీవీకే , ఎన్టీకే ఆశలు సామాజిక వర్గాల ఓట్లు, గ్రామీణ ఓట్ల కడర్కరై రాజ్, నైనార్, ఇసక్కి రాజాలు చీల్చుకుంటూ, ఇక్కడి యువతరం ఓటు బ్యాంక్ను టీవీకే గురి పెట్టింది. విజయ్ టీవీకే తరపున ఇక్కడ యువకుడైన అజిత్ ఓ వైపు నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) తరపున ఆనందరాజాలు మరోవైపు ఓట్ల వేటలో దూసుకెళ్తున్నారు. డీఎంకే , బీజేపీ వ్యతిరేక ఓట్లు, నవతరం, యువతరం ఓట్లను చీల్చే దిశగా ఈ ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కొత్త ఓటర్లు అత్యధికంగా విజయ్ టీవీకే వైపుగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నా, కళాశాల యువత ఎన్టీకే వైపు దృష్టిపెట్టడం ఖాయం. ఇందుకు కారణం, గతంలో కూడా ఎన్టీకేకు ఇక్కడ 13 వేల ఓట్లు రావడం గమనార్హం. ఇక్కడ పంచముఖ సమరంగా ఐదుగురు కీలక అభ్యర్థులు ఉన్నప్పటికీ సమరం అన్నది నైనార్ను ఢీ కొట్టే రీతిలో కడర్కరై రాజ్, ఇసక్కి రాజాలు దూసుకెళ్లడం ఖాయం. ఈ దృష్ట్యా, గణనీయంగా ఎవరు ఓట్లు సాధిస్తారో అన్నది వేచి చూడాల్సిందే. -
తమిళనాడుకు నష్టం లేదు!
సాక్షి, చైన్నె: లోక్సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ వల్ల తమిళనాడు సహా ఏ రాష్ట్రం కూడా ప్రభావితం కాదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. కోయంబత్తూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సిద్ధాపుదూర్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం స్పష్టమైన హామీ నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎవరికీ నష్టం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారని, ప్రజలు సంతోషించే విధంగానే ఈ ప్రక్రియ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకోవడానికే సీఎం స్టాలిన్ స్టాలిన్ పునర్విభజనను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతోనే స్టాలిన్ ఇలా చేస్తున్నారని విమర్శించారు. అధికారులకు హెచ్చరిక కోయంబత్తూరు ప్రజలు చైతన్యవంతులని, ఇక్కడ ఎక్కడా నల్లజెండాలు కనిపించడం లేదని అన్నారు. స్టాలిన్కు ఓటమి భయం పట్టుకుందని, అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిదంబరంపై ధ్వజం కేంద్రంలో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తమిళనాడుకు చిదంబరం ఏం చేశారని ప్రశ్నించారు. అన్నాడీఎంకే గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు. పునర్విభజన విషయంలో స్టాలిన్ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నిరసనల హోరు
బిల్లుకు వ్యతిరేకంగాబిల్లు ప్రతిని తగలబెడుతూ నినదిస్తున్న స్టాలిన్ సాక్షి, చైన్నె : పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో లోక్ సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడాన్ని ఆది నుంచి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యతిరేకిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు గురువారం డీఎంకే వర్గాలు తమ ఇళ్లపై నల్ల జెండాలను ఎగుర వేశారు. నల్ల చొక్కాలు, నల్ల వస్త్రాలు, బ్యాడ్జీలతో రోజంతా తమ నిరసనను కేంద్రానికి తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే కార్యకర్తలు ఇళ్ల ముందు, ఇళ్లపైన, పార్టీ కార్యాలయాలు, ముఖ్య ప్రదేశాలలో నల్లజెండాలు కట్టి, నల్లటి ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సేలం నుంచి నామక్కల్ వచ్చిన స్టాలిన్ ఉదయాన్న నల్లటి వస్త్రాలను ధరించి నిరసనలకు హాజరయ్యారు. నామక్కల్ పల్లి పాళయంలోని ఒక కార్యకర్త నివాసం ముందు నియోజకవర్గ పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా నల్లజెండాను ఎగురవేసి, అనంతరం ఆ బిల్లు ప్రతిని స్టాలిన్ తగలబెట్టారు. ఈ సందర్భంగా ‘తమిళనాడు పోరాడుతుంది, తమిళనాడు గెలుస్తుంది‘ అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన నామక్కల్ రైతు బజార్ను సందర్శించి నల్ల వస్త్రాలతోనే వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. మదురైలో జరిగిన నిరసనలో డీఎంకే యువజన నేత, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్తో పాటుగా పెద్ద ఎత్తున డీఎంకే వర్గాలు తరలి వచ్చిన నిరసన వ్యక్తం చేశారు. నల్ల జెండాలను ప్రదర్శించారు. నల్లటి వస్త్రాలు ధరించి ఆ బిల్లు నకలు పేపర్లను తగుల పెట్టారు. చైన్నెలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం ఆవరణలో పార్టీ నేత ఆర్ఎస్ భారతీ నేతృత్వంలో నిరసన ప్రదర్శనలో కేంద్రం తీరుపై నాయకులు తీవ్ర స్థాయిలో శివాలెత్తారు. ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఎన్నికలలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థులు నల్లటి వస్త్రాలతోనే కేంద్రంకు తమ నిరసనను తెలియజేస్తూ, ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. వాడ వాడలలో డీఎంకే వర్గాలు నల్ల జెండాలు ఎగుర వేసి నిరసనను విజయవంతం చేశారు.నిరసన జ్వాల మరింతగా వ్యాపించాలి ఈ నిరసనపై స్టాలిన్ స్పందిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ‘తమిళనాడు అంతటా నిరసన జ్వాలలు వ్యాపించాలి, ఫాసిస్ట్ బీజేపీ అహంకారం నశించాలి. నాడు తమిళనాడులో మొదలైన హిందీ వ్యతిరేక ఉద్యమ సెగ ఢిల్లీని తాకింది, వారు తలవంచే వరకు ఆ పోరాటం ఆగలేదు. నేడు తమిళులను సొంత దేశంలోనే శరణార్థులుగా మార్చే ఈ నల్ల చట్టం ప్రతిని కాల్చి మరో పోరాటాన్ని మొదలుపెట్టాను. ఈ నిప్పు ద్రావిడ దేశమంతా వ్యాపించి బీజేపీ అహంకారాన్ని అణచివేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. ఇక, ఈ నిరసనకు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, సీపీఎం నేత బాలకృష్ణన్, ఎండీఎంకే నేత వైగో తదితరులు మద్దతు ఇస్తూ, కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమిళనాడుకు అన్యాయం జరిగితే సహించబోమని, తీవ్ర పరిణామాలు తప్పదన్న హెచ్చరికలు చేశారు. -
ఈవీఎంలలో ఫొటోలు, గుర్తులు
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఎన్నికల కమిషన్ తన కార్యకలాపాలను వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఈవీఎంల అభ్యర్థులు పేర్లు, ఫొటోలు, గుర్తులను పొందుపరిచే పనులను ప్రారంభించింది. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు, వారి గుర్తులను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో పొందు పరిచే కార్యక్రమాన్ని ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల అధికారులు చేపట్టారు. కరూర్లో అత్యధికంగా 85 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో అదనపు ఈవీఎంలను ఒకదానికి మరొకటి అనుసంధానించే విధంగా గుర్తులను అమర్చారు. అంబాసముద్రంలో కనిష్టంగా కేవలం ఐదుగురు అభ్యర్థులు మాత్రమే ఇక్కడ పోటీలో ఉండడం గమనార్హం. 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ ఓటు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యే 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు , ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కేంద్రాలలో వీరు ఉత్సాహంగా పోస్టల్ ఓట్లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడుత పోలింగ్ శిక్షణ గురువారం జరిగింది. చైన్నె జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విధులు నిర్వహించే 19,604 మంది పోలింగ్స్టేషన్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. వీరంతా తమ తపాలా ఓట్లు నమోదు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కార్పొరేషన్ కమిషనర్ కుమారగురుబరన్ పెరంబూర్, కె.నగర్ కేంద్రాలను సందర్శించి శిక్షణను పర్యవేక్షించారు. శిక్షణలో ఈవీఎంల పనితీరు, వీవీ ప్యాట్లు, కంట్రోల్ పానల్ వినియోగం, నియమ నిబంధనల గురించి ఉన్నతాధికారులు వివరించారు. -
వివాదంలో అధవ్ అఫిడవిట్
మద్రాస్ హైకోర్టులో పిటిషన్ సాక్షి,చైన్నె: విల్లివాక్కం నియోజకవర్గ తమిళగ వెట్రి కళగం అభ్యర్థి అధవ్ అర్జున తన నామినేషన్ పత్రాల్లో ఆస్తి వివరాలను దాచిపెట్టారని, దీనిపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని కోరుతూ గురువారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విల్లివాక్కం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న జి. దేవరాజన్ ఈ పిటిషన్న్ను దాఖలు చేశారు. పిటిషనర్ పేర్కొన్న ప్రధానాంశాలు ఈవిధంగా ఉన్నాయి. నామినేషన్ ఫారం–26లో అభ్యర్థులు తమతో పాటు తమ భాగస్వామి ఆస్తులను కూడా తప్పనిసరిగా పేర్కొనాలని వివరించారు. అయితే, అధవ్అర్జున్ తన భార్య అధవ్ డైసీ పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడించలేదని ఆరోపించారు. రూ.117 కోట్ల విలువైన మార్టిన్ ప్రాపర్టీ డెవలపర్స్, రూ.123 కోట్ల విలువైన డామినెంట్ టవర్స్ వంటి వివిధ కంపెనీలలో డైసీ డైరెక్టర్గా ఉన్నారని, ఈ వివరాలను నామినేషన్న్లో పేర్కొనలేదని పిటిషన్న్లో పేర్కొన్నారు. ఈ ఆస్తుల్లో చాలా వాటిని ఈడీ ఇప్పటికే స్తంభింపజేసిందని పిటిషనర్ గుర్తు చేశారు. నామినేషన్ల పరిశీలన సమయంలోనే తాను దీనిపై ఫిర్యాదు చేసినా, ఎన్నికల అధికారి సరైన విచారణ జరపకుండానే తన ఫిర్యాదును తిరస్కరించారని దేవరాజన్ ఆరోపించారు. ఎన్నికల అధికారి జారీ చేసిన ఆ ఉత్తర్వును రద్దు చేయాలని, ఆస్తి వివరాలపై సమగ్ర విచారణకు ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ కేసు త్వరలోనే విచారణకు రానుంది. -
ఎన్టీకేకు ఊరట..!
సాక్షి, చైన్నె : నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) అభ్యర్థులకు పెద్ద ఊరట గురువారం కోర్టు ద్వారా లభించింది. ఆపార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించిన వ్యవసాయదారుడు(రైతు) చిహ్నంను స్తంభింప చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ చిహ్నంకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను న్యాయమూర్తులు తోసి పుచ్చారు. రాష్ట్రంలో ఎన్టీకే 234 స్థానాలలో పోటీ చేస్తోంది. ఇందులో 116 స్థానాలలో మహిళలు, ఒక చోట హిజ్రా కూడా పోటీలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల సంఘం నామ్ తమిళర్ పార్టీకి ’వ్యవసాయదారుడి’ గుర్తును కేటాయించింది. అయితే, ఇది తమ పార్టీ గుర్తు ’ఏర్ ఉలవన్’(నాగలి పట్టిన రైతు) గుర్తును పోలి ఉందని, దీనివలన ఓటర్లు గందరగోళానికి గురవుతారని పేర్కొంటూ జనతా పార్టీ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టులో వాదనలు జాతీయ పార్టీ అయిన జనతా పార్టీ 1977 నుండి ’ఏర్ ఉలవన్’ గుర్తును ఆది నుంచి పార్టీ చిహ్నంగా ఉపయోగిస్తోంది. తమ గుర్తును పోలి ఉన్న గుర్తును నామ్ తమిళర్ పార్టీకి కేటాయించడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆ పార్టీ తరపున దాఖలైన పిటిషన్పై విచారణ హైకోర్టులో గురువారం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. ధర్మాధికారి , న్యాయమూర్తి జి. అరుల్ మురుగన్ ధర్మాసనం ఈ కేసును విచారించారు. ఆ పార్టీ తరపున న్యాయవాదుల వాదన తదుపరి ఎన్నికల కమిషన్ తరపున వాదనలు వినిపించారు. ఇందలో జనతా పార్టీ ప్రస్తుతం తన ఎన్నికల కమిషన్ గుర్తింపును కోల్పోయిందని, దృష్ట్యా,’ఏర్ ఉలవన్’ గుర్తును తమ చిహ్నంగా అని కోరే హక్కు ఆ పార్టీకి లేదని వాదించారు.. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను కూడా గుర్తు చేశారు. జనతా పార్టీకి ’ఏర్ ఉలవన్’ గుర్తును, నామ్ తమిళర్ పార్టీకి ’వ్యవసాయదారుడి’ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని పిటిషనర్ కోర్టుకు సమర్పించలేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. గుర్తింపు కోల్పోయిన రాజకీయ పార్టీకి తమ పాత గుర్తుపై ఎలాంటి హక్కు ఉండదని సుప్రీంకోర్టు ఇచ్చిన గత ఉత్తర్వులను కోర్టు గుర్తు చేసింది.ఈ కారణాల రీత్యా, జనతా పార్టీ దాఖలు చేసిన పిటిషన్లో ఎలాంటి అంశాలు లేదని పేర్కొంటూ దానిని న్యాయమూర్తులు తోసి పుచ్చారు. -
ఓడరేవుల నగరంలో గెలుపెవరిదో?
సాక్షి, చైన్నె : దక్షిణ తమిళనాడులో అత్యంత కీలక నియోజకవర్గంగా తూత్తుకుడి ఉంది. చైన్నె తదుపరి ప్రధాన ఓడరేవు ఉన్న ఈ నగరంలో అసెంబ్లీ ఎన్నికల సందడి హోరెత్తుతోంది. ఈ నియోజకవర్గాన్ని కై వసం చేసుకునేందుకు డీఎంకే మహిళా నేత , మంత్రి గీతాజీవన్ హ్యాట్రిక్ దిశగా పరుగులు తీస్తున్నారు. ఆమె వేగానికి కళ్లెం వేసే రీతిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా చెల్ల పాండియన్, టీవీకే అభ్యర్థిగా విజయ్ మిత్రుడు శ్రీనాథ్, నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) అభ్యర్థిగా జాకబ్ దేవదాస్ అభిషేక్ పోటీ పడుతున్నారు. వివరాలు.. దక్షిణ భారతావనిలో ఆంగ్లేయులు కాలుపెట్టిన ఓడ రేవుల పట్టణం తూత్తుకుడి. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు, చారిత్రాత్మక ఘట్టాలకు వేదికగా నిలిచిన తూత్తుకుడి పేరిట లోక్సభ , అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి లోక్ సభకు డీఎంకే అభ్యర్థిగా కనిమొళి కరుణానిధి రెండుసార్లు పార్లమెంట్కు వెళ్లారు. తాజాగా తూత్తుకుడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు బాధ్యతలను కనిమొళి భుజాన వేసుకుని ఉన్నారు. ఎన్నికల చరిత్ర తూత్తుకుడి నియోజకవర్గం ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలలో డీఎంకే ఏడు, అన్నాడీఎంకే ఆరు సార్లు గెలిచాయి. ఒకప్పుడు కాంగ్రెస్ గుప్పెట్లో ఉన్న ఈ నియోజకవర్గం ద్రవిడ పార్టీల ఖాతాలోకి చేరాయి. నియోజకవర్గంలో మొత్తం 2,48,300 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,20,614, మహిళలు 1,27,623, ఇతరులు 63 మంది ఉన్నారు. నియోజకవర్గంలో నాడార్ సామాజిక వర్గం (36), ఫెర్నాండో (19), దేవేంద్రకుల వేళాళర్ (9), పిళ్ళైమార్ (8), ముస్లింలు (4) శాతంతో ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు. తూత్తుకుడి హార్బర్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఎన్నికల రేసులో అభ్యర్థులు డీఎంకే అభ్యర్థిగా మహిళా నేత, మంత్రి పీ గీతా జీవన్ పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఆమె ఐదవ సారిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె మూడు సార్లు గెలిచారు. అయితే, వరుస విజయాలతో ఈ సారి హ్యాట్రిక్ లక్ష్యంగా ఉరకలు తీస్తున్నారు. ఆమైపె నియోజకవర్గంలో వ్యతిరేకత లేక పోవడం కలిసి వచ్చే అంశం. అలాగే డీఎంకే కూటమి బలం ఆమెకు అనుకూలం. అందర్నీ కలుపుకుని వెళ్లే తత్వం కలిగిన ఆమె గెలుపును అడ్డుకునేందుకు అన్నాడీఎంకే అభ్యర్థిగా మాజీ మంత్రి చెల్ల పాండియన్ పోటీలో ఉన్నారు. 2011లో గెలిచిన మంత్రి పదవి చేపట్టిన ఆయన ఈ సారి గెలుపు కోసం తీవ్ర వ్యూహాలకు పదును పెట్టారు.అన్నాడీఎంకే ఓటు బ్యాంక్తో పాటుగా తన సామాజిక వర్గం చేయూతను ఇస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఇక, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా ఆర్ జాకబ్ దేవదాస్ అభిషేక్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ పార్టీకి ఇక్కడ 30 వేలకు పైగా ఓట్లు వచ్చాయి, ఈసారి కూడా చెప్పుకోదగ్గ ఓట్లు సాధించే అవకాశం ఎక్కువగానే ఉంది. ఇక, తమిళగ వెట్రి కళగం తరపున విజయ్స్నేహితుడైన సినీ నటుడు శ్రీనాథ్ పోటీలో ఉన్నారు. మాజీ మంత్రి జీఆర్ ఎడ్మండ్ బంధువైన శ్రీనాథ్ మైనారిటీ ఓట్లు, ప్రభుత్వ అసంతృప్తి ఓట్లు, విజయ్ చరిష్మా తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఓట్ల వేటలో ఉరకలు తీస్తున్నారు. ఈ రసవత్తర సమయంలో ఓటరేవుల నగరం తూత్తుకుడిలో జెండా ఎగుర వేసేదెవ్వరో అన్నది ఫలితాల వరకు వేచిచూడాల్సిందే. -
గాయని ఎస్పీ శైలజకు ఇసై కలైవాణి పురస్కారం
కొరుక్కుపేట: కళారంజని చారిటబుల్ ట్రస్ట్, కళారంజిని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఆధ్వర్యంలో 25వ వార్షిక తమిళ నూతన సంవత్సర , కళాకారుల పురస్కార ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాలలో విశేష సేవలను అందిస్తున్న ప్రముఖులకు ఈ సందర్భంగా పురస్కారాలను ప్రధానం చేశారు. కళారంజని చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, సంగీత దర్శకులు డాక్టర్ జే. శ్రీనిబాబు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చైన్నె మొగప్పైర్లో ఉన్న వెంకటేశ్వర వెడ్డింగ్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా కెవిజి ప్రాపర్టీస్ ప్రయివేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి. గోపాలకృష్ణన్ విచ్చేశారు. ఈ సందర్భంగా సంగీతానికి విశేష కృషి చేస్తున్న ప్రముఖ సినీ నేపద్య గాయని ఎస్పీ శైలజాని ఇసై కలైవాణి పురస్కారంతో సత్కరించారు. అలాగే సమాజ సేవలో రాణిస్తున్న ఐకాస్ టెక్నాలజీస్ అధినేత ఎం . శోభా రాజా కి డైనమిక్ లేడీ పురస్కారం, ఇంకా చిన్మయ మిషన్కు చెందిన శ్రీ స్వామి సురేశానందకి భక్తి రత్న పురస్కారం, శివాజీ రవికి సేవా కళారత్న పురస్కారం, హెచ్.ఎన్. నందిని సురేష్ కి నాట్య కళైవాణి పురస్కారాలతో సత్కరించారు. -
1,427 కేంద్రాల్లో వెబ్ కెమెరాలు
వేలూరు: జిల్లాలోని మొత్తం 1,427 పోలింగ్ కేంద్రాలను వెబ్ కెమెరాల ద్వారా నిఘా ఉంచనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి సుబ్బలక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం వేలూరులో పోలింగ్ సిబ్బందికి ఇస్తున్న శిక్షణ కేంద్రాన్ని ఆమె తనఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 5 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 1,427 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 193 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు పటిష్ట బందోబస్తు నడుమ పోలింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఇప్పటికే ఐదు చోట్ల నమూనా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఓట్లు వేయడంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆమె అనకట్టు నియోజకవర్గంలోని అరియూరులో పోలింగ్ సిబ్బంది శిక్షణను ఆమె తనఖీ చేశారు. అనంతరం పాఠశాలలోని పోలింగ్ కేంద్రాల్లో వసతులపై ఆరా తీశారు. -
వంద శాతం ఓటింగ్పై అవగాహన
తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్పై అవగాహన కల్పించే విధంగా దివ్యాంగుల అవగాహన ర్యాలీని తిరుత్తణిలో బుధవారం నిర్వహించారు. ప్రత్యేక ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుత్తణి కొత్త బస్టాండు వద్ద 70 మంది దివ్యాంగులు పాల్గొన్న ట్రై స్కూటర్ ర్యాలీని కలెక్టర్ ప్రతాప్ జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ బెలూన్లు గాలిలో ఎగురవేశారు. దివ్యాంగులు వంద శాతం ఓటు హక్కు వినియోగించుకుని ఇతరులకు స్ఫూర్తిగా వుండాలని ఆకాంక్షించారు. తహసీల్దార్ కుమార్, మున్సిపల్ కమిషనర్ కన్నియప్పన్, దివ్యాంగుల జిల్లా అధికారి కుమార్ పాల్గొన్నారు. -
కూవాగంలో హిజ్రాల పండుగ
సాక్షి, చైన్నె: కూవాగంలో హిజ్రాల వసంతోత్సవ వేడుకకు ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం కూత్తాండవర్ ఆలయంలో ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వివరాలు.. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలందూరు పేట సమీపంలోని కూవాగం గ్రామంలో కొలువు దీరిన కూత్తాండవర్ హిజ్రాలకు ఆరాధ్యుడు. ఈ ఆలయంలో ఏటా జరిగే ఉత్సవాలు దేశ విదేశాల్లోని హిజ్రాలు తరలి వస్తుంటారు. ఇక్కడి వేడుకకు మహాభారత యుద్ధగాధ ముడి పడి ఉందని పురాణాలు చెబుతాయి. ఇతిహాసం మేరకు మోహినీ అవతారంలో ఉన్న శ్రీకృష్ణుడిని వివాహమాడిన ఐరావంతుడిని తమ ఆరాధ్యుడిగా హిజ్రాలు కొలుస్తూ వస్తున్నారు. ఇక్కడ కొలువు దీరిన కూత్తాండవర్(ఐరావంతుడి) ఆలయంలో ప్రతి ఏటా చైత్రమాసంలో వేడుకల్ని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది ఉత్సవాలను అత్యంత వేడుకగా జరుపుకునేందుకు హిజ్రాలు సిద్ధం అవుతున్నారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువ జాము వరకు కూత్తాండవర్ సన్నిధిలో జరిగిన ప్రత్యేక పూజాధి కార్యక్రమాలతో ధ్వజారోహణం జరిగింది. ఆ పరిసర గ్రామాల్లోని ప్రజలు రాగి గంజిని తయారు చేసి కుండలు, బిందెల్లో పోసి ఊరేగించారు. స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. ఇక, ఉపవాస వ్రతంతో ఆలయ అర్చకులు రోజూ పూజలు నిర్వహించనున్నారు. పది రోజుల పాటూ పరిసర గ్రా మాల ప్రజలు ఆలయంలో వివిధ పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 28న పెళ్లి సందడి ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం హిజ్రాల పెళ్లి సందడి. అత్యంత వేడుకగా జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిజ్రాలు తరలి వస్తారు. ఈనెల 28వ తేదీన హిజ్రాల పెళ్లి సందడి కూవాగంలో నెలకొననుంది. ఈ వేడుక నిమిత్తం హిజ్రాలు కూవాగంకు పోటెత్తనున్నారు. వీరి బస కోసం అక్కడి లాడ్జీలు, గెస్ట్హౌస్లు, విడిదులు ముస్తాబు అవుతున్నాయి. హి జ్రాలకు అందాల పోటీలు సైతం ఇక్కడ జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజైన 29వ తేదీన కూత్తాండవర్ రథోత్సవం, హిజ్రాలు తాళి బొట్టు తెంచి వితంతువుగా మారే విషాద కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు, స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో హిజ్రాల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. -
క్లుప్తంగా
సాక్షి, చైన్నె: వోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బుధవారం పాపులర్ ఎస్యూవీ ’టెగన్ సరికొత్త అప్డేటెడ్ వెర్షన్ను ఆవిష్కరించింది. బుధవారం స్థానికంగా ఈ వివరాలను ఆ సంస్థ డైరెక్టర్ నితిన్ కోహ్లీ ప్రకటించారు. ఈ కొత్త మోడల్ 40కి పైగా కొత్త అప్డేట్లు, 9 రంగుల ఎంపికలు , పరిశ్రమలోనే మొదటిసారిగా 75 శాతం అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్తో వినియోగదారుల ముందుకు తీసుకొచ్చామన్నారు. . ఈ ఆఫర్ మే 31 వరకు బుక్ చేసుకునే కొత్త టైగన్ కార్లకు మాత్రమే వర్తిస్తుందని ప్రకటించారు. టైగన్ ఒక మూలస్తంభం అని, కొత్త అప్డేట్లు, ఆకర్షణీయమైన బైబ్యాక్ ప్రోగ్రామ్తో వినియోగదారులకు మరింత మెరుగైన విలువను అందించడమే లక్ష్యంగా పేర్కొన్నారు. అన్నానగర్: చైన్నెలోని రాయపేటలో అవ్వై షణ్ముగం రోడ్డులో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాల వంటగది నుంచి గ్యాస్ సిలిండర్లు చోరీకి గురయ్యాయి. ఈ విషయమై పాఠశాల యాజమాన్యం రాయపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిఘా కెమెరా ఫుటేజీని పరిశీలించగా, రాయపేటలోని ముత్తయతోట్టం ప్రాంతానికి చెందిన పెరుమాల్ (28) ఈ దొంగతనంలో పాల్గొన్నట్లు వెల్లడైంది. దీంతో బుధవారం పోలీసులు అతడిని అరెస్టు చేసి చోరీకి గురైన గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. కొరుక్కుపేట: ఇస్కాన్ చైన్నెలో భజన్ క్లబ్బింగ్ తొలి సంగీత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నగరవ్యాప్తంగా యువత నుండి అద్భుతమైన స్పందన, భారీ సంఖ్యలో భాగస్వామ్యం లభించింది.ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సమావేశంగా నిలిచింది. సంగీతం, నత్యం, మంత్ర ధ్యానం, సామూహిక భాగస్వామ్యం శక్తివంతంగా ఏకమవ్వడంతో వాతావరణం ఉత్సాహభరితంగా, ఆనందంగా, ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే విధంగా సాగింది. ప్రత్యేక ఆకర్షణగా, శ్రీ జయపతాక స్వామి మహారాజ్ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరై అందరినీ ఆశీర్వదించడం. సాక్షి, చైన్నె: దేశీయ డైరీ పానీయాల రంగంలో దూసుకెళ్తున్న ఉన్న కావిన్కేర్ తాజాగా బహుళ–బిలియన్ల విలువైన భారతీయ ఐస్ క్రీమ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన ప్రీమియం బ్రాండ్ ‘కావిన్స్’ పేరుతో సరికొత్త ఇన్ఫ్యూజన్–ఆధారిత ఐస్ క్రీమ్ శ్రేణిని చైన్నెలో బుధవారం ఆవిష్కరించింది.24 ఫ్లేవర్లు, 7 ఇన్ఫ్యూజన్ కేటగిరీలలో కలిపి 72 రకాల వైరెటీలను సంస్థ పరిచయం చేసింది. ఐస్ క్రీమ్ పార్లర్లలో లభించే విధంగా పండ్లు, చాక్లెట్లు, నట్స్ , భారతీయ స్వీట్లను నేరుగా ఐస్ క్రీమ్లో కలిపి ‘పార్లర్–శైలి’ అనుభూతిని నేరుగా వినియోగదారుల ఇళ్లకే అందించడం దీని ప్రత్యేకత అని ఆ సంస్థ చైర్మన్ సికే రంగనాథన్, బిజినెస్ హెడ్ శ్రీవత్సవ్కృష్ణమూర్తి తెలిపారు. దేశంలో ఐస్ క్రీమ్ ఇప్పుడు కేవలం సీజనల్ ట్రీట్ మాత్రమే కాదని, అది ఒక అనుభూతిగా మారిందన్నారు. వినియోగదారుల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా కావిన్స్తో ఈ విభాగంలోకి ప్రవేశించిందన్నారు. అన్నానగర్: సాత్తూరు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఆమ్ని బస్సు, బైకును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్లస్టూ విద్యార్థులు దుర్మరణం చెందారు. విరుదునగర్ జిల్లాలోని శివకాశి సమీపంలోని పెరనాయకన్పట్టికి చెందిన సెల్వం కుమారుడు గోకుల్ (17). ఇతను శివకాశిలోని ఒక ప్రైవేట్ మెట్రిక్యులేషన్ పాఠశాలలో ప్లస్టూ పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ స్థితిలో, గోకుల్ సెల్ఫోన్ పాడైపోవడంతో రిపేర్ చేసుకునేందుకు మంగళవారం మధ్యాహ్నం బైక్లో శివకాశికి వెళ్లాడు. దుకాణంలో రిపేర్కు ఇచ్చి శివకాశిలో తనతో పాటు చదువుకున్న సహ విద్యార్థులు ప్రసన్న (17), యువరాజ్ (17)లను కలిశాడు. గోకుల్ రాత్రి 9 గంటలకు తన స్నేహితులతో కలసి సెల్ఫోన్ దుకాణానికి వెళ్లి, సెల్ తీసుకున్నాడు. అనంతరం రాత్రి 11.45 గంటలకు, ఆ ముగ్గురూ బైక్లో టీ తాగడానికి దుకాణానికి వెళ్లారు. సాత్తూరు–కోవిల్పట్టి నాలుగు లేన్ల జాతీయ రహదారిలో వెళుతుండగా అదేసమయంలో వస్తున్న ఒక ప్రైవేట్ ఆమ్నిబస్సు బైక్ను ఢీకొంది. ఈప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న సాత్తూరు తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం సాత్తూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు పంపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారంలోకి వస్తే గాడిద పాలను ఎగుమతి చేస్తాం...!
సాక్షి, చైన్నె : నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ బుధవారం చేసిన ఓ వాగ్దానం అందర్నీ విస్మయంలో పడేసింది. తమను అధికారంలోకి తీసుకొస్తే గాడి పాలను ఎగుమతి చేయించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. శివగంగ జిల్లా తిరుభువనం పరిధిలోని మానామధురై నియోజకవర్గంలో సీమాన్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.తిరుభువనం పార్టీ అభ్యర్థి పాల్కు మద్దతుగా జరిగిన ప్రచారంలో సీమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు ఓటేస్తే మద్యం దుకాణాలు మూసి వేస్తామన్నారు. ఈ ప్రాంతం ఉత్పత్తి అయ్యే కొబ్బరి పాలును అక్కడక్కడా అమ్ముతారని పేర్కొంటూ, వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు, రైతులకు మేకల ఫారాలు, పశువుల ఫారాలు, గాడిదల ఫారాలు ఏర్పాటు చేసుకునేందుకు సౌకర్యాలు కల్పిస్తారు. వీటి పాలను పలు ప్రాంతాలకు ఎగుమతి చేయిస్తామన్నారు. సీమాన్ -
విజయ్కి వ్యతిరేకంగా బీచ్లో జూలీ పోరాటం
– కేసు నమోదు తిరువొత్తియూరు: జల్లికట్టు ఆందోళన ద్వారా ప్రసిద్ధి చెందిన బుల్లి తెర నటి జూలీ, తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్కి వ్యతిరేకంగా చైన్నె మెరీనా బీచ్లో అనుమతి లేకుండా నిరసన తెలిపిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికే పెరంబూరు నియోజకవర్గంలో విజయ్ను విమర్శిస్తూ ప్రచారం చేసిన జూలీ, మంగళవారం సాయంత్రం మెరీనా ఔవయ్యార్ విగ్రహం వద్ద తన మద్దతుదారులతో కలిసి ఆకస్మికంగా నిరసనలో పాల్గొన్నారు. ఒక చేతిలో డీఎంకేకు ఓటు వేయండి అనే బ్యానర్ను, మరో చేతిలో విజయ్ను ఉద్దేశించి ఉడుత బొమ్మ వేసి దానిపై ’ఎక్స్’ గుర్తు వేసిన బ్యానర్ను పట్టుకుని ఆమె నినాదాలు చేశారు. ముఖ్యంగా, తమిళగ వెట్రికళగం ద్వారా మహిళలకు రక్షణ లేదు అనే వాక్యం ఉన్న ప్లకార్డును జూలీ పట్టుకోవడం విజయ్ అభిమానులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న మెరీనా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో నిరసన తెలిపిన జూలీతో సహా నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్నికల సమయంలో సరైన అనుమతి లేకుండా ప్రచారం చేయకూడదని సూచించిన పోలీసులు, ఆమె నుంచి క్షమాపణ లేఖ రాయించుకుని విడుదల చేశారు. రూ. 8 వేల కూపన్ల పంపిణీ – ఈసీకి ఆధారాలతో అన్నాడీఎంకే ఫిర్యాదు సాక్షి,చైన్నె : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. కోయంబత్తూర్ సౌత్, బర్గూర్, పాలక్కోడు , చైన్నె కొళత్తూరు తదితర పలు కీలక నియోజకవర్గాల్లో డీఎంకే నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రూ. 8 వేలు విలువైన కూపన్లను పంపిణీ చేస్తున్నారని అన్నాడీఎంకే ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. అన్నాడీఎంకే రాష్ట్ర న్యాయవాద విభాగం డిప్యూటీ సెక్రటరీ ఆర్.ఎ.ఎస్. సెంథిల్ వేల్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పంపిన ఫిర్యాదులో కూపన్ల పంపిణి గురించి వివరించారు. అధికారంలోకి వస్తే, ఫ్రిజ్,వాషింగ్ మిషన్ తదితర గృహోపకరణలను కొనుగోలు చేసుకోవచ్చని డీఎంకే ఎన్నికల వాగ్దానం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిని ముందుగానే అమలు పరిచే విధంగా డీఎంకే నాయకులు పలు నియోజకవర్గాలలో రూ.8 వేలు గిప్ట్ కూపన్ల పంపిణీలో నిమగ్నమైనట్టు వివరించారు. అనేక కీలక నియోజకవర్గాలలో ఈ పంపిణీ జోరుగా జరుగుతున్నట్టు, సీరియల్ నెంబర్లతో కూడిన కూపన్ల వివరాలను సైతం ఫిర్యాదులో పొందు పరిచారు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్లు ఈ కూపన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. కూప్లను పంపిణి ఆపకుంటే చర్యలు తప్పదన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. తమకు పట్టుబడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
సెంట్రల్ రైల్వేస్ట్టేషన్లో రూ. 44.83 లక్షల నగదు సీజ్
● బంగారు బిస్కెట్ల స్వాధీనం అన్నానగర్: చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్లో సరైన పత్రాలు లేకుండా తీసుకువచ్చిన రూ. 44.83 లక్షలు, బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, రైల్వే పరిరక్షణ దళం చైన్నెలోని రైల్వే స్టేషన్లలో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిశితంగా పర్యవేక్షిస్తోంది. సరైన పత్రాలు లేకుండా రైళ్లలో తీసుకువస్తున్న డబ్బు, బంగారం, వెండి కడ్డీలు, మాదకద్రవ్యాలను వారు స్వాధీనం చేసుకుని, వాటిని ఆదాయపు పన్ను శాఖకు, మాదకద్రవ్యాల నియంత్రణ విభాగానికి అప్పగిస్తున్నారు. ఈ స్థితిలో, మంగళవారం చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల వస్తువులను తనిఖీ చేయడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ మధుసూదన రెడ్డి నేతృత్వంలో పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో, సేలం నుంచి రైలులో సెంట్రల్ కు వచ్చిన జయరాజ్ (43) అనే ప్రయాణికుడిని తనిఖీ చేశారు. అతని బ్యాగులో 289 గ్రాముల బరువున్న 4 బంగారు బిస్కెట్లు, నగదు ఉన్నట్లు వెల్లడైంది. అయితే, అందుకు సంబంధించిన పత్రాలు అతని వద్ద లేవు. దీంతో రూ. ఏడున్నర లక్షల విలువైన బంగారు కడ్డీలను, రూ. 44.83 లక్షల నగదును స్వాధీనం చేసుకుని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు. సాక్షి,చైన్నె: సిలికాన్ కేథడర్ తదితర వైద్యపరికరాల తయారీలో పేరుగాంచిన జపాన్కు చెందిన క్రియేట్ మెడిక్ కో రాష్ట్రంలో తన ప్రత్యక్ష అమ్మకాలను ప్రారంభించినట్లు, దేశవ్యాప్తంగా విస్తరణ కార్యకలాపాలు చేపడుతున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు ఒసాము ఇమాజావా తెలిపారు. చైన్నెలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మెడి నిప్పన్ సంస్థ ద్వారా తమ అమ్మకాలు విరివిగా జరుగుతున్నాయని, తమిళనాట తమ సంస్థ కార్యాలయాన్ని కూడా ప్రారంభించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తారమైన వైద్య మౌలిక సదుపాయాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యులు అందుబాటులో ఉండటంతో తమ సంస్థ అమ్మకాలు 8 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యచికిత్సలకు సంబంధించిన వైద్య పరికరాలను కూడా తమ సంస్థ ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. సమావేశంలో క్రియేట్ మెడిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కట్సుయాకీ యామనే, డైరెక్టర్ కూసుకే సుటో తదితరులు పాల్గొన్నారు. సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఓటింగ్ యంత్రాలలో అభ్యర్థుల వివరాలను నిక్షిప్తం చేసే కీలక ఘట్టం గురవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఈవీఎంలు, వీవీప్యాట్లను కేటాయించేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రెండో దశ రాండమైజేషన్ ప్రక్రియ ఏప్రిల్ 11 నుండి 16 వరకు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. తదుపరి గురువారం నుంచి ఈవీఎంలలో అభ్యర్థుల పేర్లు, వారి ఎన్నికల గుర్తులను లోడ్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందరన్నారు. ఈ పనులన్నీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలోనే అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఏ పోలింగ్ కేంద్రానికి ఏ యంత్రాన్ని కేటాయించారో తెలిపే పూర్తి జాబితాను (సీరియల్ నంబర్లతో సహా) అభ్యర్థులందరికీ అందజేస్తామన్నారు. -
రోడ్ షోలతో విస్తృత ప్రచారం
సాక్షి, చైన్నె: ప్రసంగాలను పక్కన పెట్టి ప్రజలతో మమేకం అయ్యే రీతిలో బుధవారం రాష్ట్రంలో ప్రచారాన్ని నాయకలు హోరెత్తించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాగర్ కోయిల్ రోడ్లపై ప్రచార వాహనం నుంచి ప్రజలకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. ఇక, చైన్నెలోని టీ నగర్, థౌజండ్ లైట్స్ నియోజకవర్గాల పరిధిలోని రోడ్లు, వీధులలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ దూసుకెళ్లారు. సీఎం స్టాలిన్ యథా ప్రకారం వాకింగ్తో పాలక్కోడులో సైతం జనానికి దగ్గరయ్యే విధంగా ముందుకు సాగారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. అభ్యర్థులు ఓపెన్టాప్ వాహనాలలో సుడిగాలి ప్రచారంలో ఉన్నారు. ముఖ్య నేతల రాక తమిళనాడులో పెరిగింది. ఎన్డీఏ కూటమి మద్దతుగా కేంద్ర మంత్రులు ఓవైపు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మరో వైపు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. పళణికి మోదీ బెస్ట్ ఆఫ్ లక్ కన్యాకుమారి జిల్లాలో పోటీ చేస్తున్న అన్నాడీఎంకే, బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పీఎం నరేంద్ర మోదీ ప్రచారం నిర్వహించారు. బుధవారం సాయంత్రం తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో నాగర్ కోయిల్కు వచ్చిన ఆయనకు పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నరేంద్ర మోదీ, మాజీ అధ్యక్షులు అన్నామలై, పొన్రాధాకృష్ణన్లతో కలిసి ఒకే ఓపెన్ టాప్వాహనంలో రోడ్ షో నిర్వహించారు. సుమారు రెండు కీ.మీ దూరంలో ఈ రోడ్ షో జరిగింది. రోడ్డుకు ఇ రువైపులా ఉన్న జనానికి అభివాదం తెలుపుతు పీఎం మోదీ ముందుకు సాగారు. నాగర్ కోయిల్ జంక్షన్లోని దివంగత నేతలు అన్నాదురై, ఎంజీఆర్, కామరాజర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు, చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈసందర్భంగా ఆయన కన్యాకుమారి జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో మాట్లాడారు. అదే సమయంలో మనం గెలుస్తున్నాం అంటూ పళణి స్వామి బెస్ట్ ఆఫ్ లక్ అని పీఎం మోదీ శుభాకాంక్షలు తెలపడం విశేషం. చైన్నె రోడ్లలో విజయ్ షో టీవీకే అధ్యక్షుడు విజయ్ చైన్నె రోడ్లలో చక్కర్లు కొడుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. టీ నగర్లో పోటీ చేస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్కు మద్దతుగా పలు వీధులలో ఓపెన్ టాప్వాహనం ద్వారా చక్కర్లు కొట్టారు. ఆయన్ను చూసేందుకు జనం దారి పొడవున బారులు తీరారు. కొన్ని జంక్షన్లలో పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో వారిని కట్టడి చేయలేక పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఎక్కడప్రసంగాలకు తావివ్వకుండా పలు వీధుల గుండా విజయ్ ప్రచారం జరిగింది. అనంతరం థౌజండ్ లైట్స్ నియోజకవర్గం పరిధిలోని వీధులు, రోడ్లలో విజయ్ ప్రచార వాహనం దూసుకెళ్లింది. ఈ చిహ్నంను చూపిస్తూ, ప్రజలకు అభివాదం తెలుపుతూ,అభ్యర్థులను పరిచయం చేస్తూ విజయ్ రోడ్ షో ఆద్యంతం జనాకర్షణ దిశగా జరిగింది. సీఎం స్టాలిన్ వాకింగ్ ధర్మపురి జిల్లా పాలక్కోడులో ఉదయం సీఎం స్టాలిన్ వాకింగ్కు వెళ్తూ, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల్లో ఉత్సాహాన్ని నింపే విధంగా ఆయన నడుచుకుంటూ ముందుకు సాగారు. ఈ ప్రచారంలో ప్రజలు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అమితాసక్తి చూపారు. కోట వీధిలోని ముస్లిం సోదరుల నివాస ప్రాంతాల నుంచి ఆయన తన నడకను ప్రారంభించి ప్రజలను పలకరించారు. ప్రచారం సాగుతుండగా ఒక దంపతులు తమ బిడ్డకు పేరు పెట్టాల్సిందిగా కోరగా, ఆ చిన్నారికి సీఎం స్టాలిన్ ‘ద్రావిడన్’ అని పేరు పెట్టారు. ఇది అక్కడ ఉన్న వారిని విశేషంగా ఆకట్టుకుంది. పాలక్కోడు స్తూపి మైదానం, ప్రధాన బజారు వీధి, బస్టాండ్, టమాటా మండి వంటి రద్దీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. స్థానిక వ్యాపారులు, ప్రజలతో కరచాలనం చేస్తూ డీఎంకే కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇక, సాయంత్రం 5 గంటలకు తడంగం పంచాయతీ పరిధిలోని కోర్టు కాంప్లెక్స్ సమీపంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సభలో ధర్మపురి జిల్లాలోనిటి.ఎన్.వి. సెంథిల్ కుమార్ (పాలక్కోడు – డీఎంకే),జి.కె.ఎం. తమిళ్ కుమరన్ (పెన్నాగరం – కాంగ్రెస్), డాక్టర్ ఇలంగోవన్ (ధర్మపురి – డీఎండీకే), పళనియప్పన్ (పాపిరెడ్డిపట్టి – డీఎంకే),షణ్ముగం (అరూర్ – డీఎంకే) లకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. -
కాలనీలో రాధికా శరత్కుమార్
తమిళసినిమా: ఇటీవల తాయ్ కిళవి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నటి రాధికా శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కాలనీ. అదేవిధంగా నటి నయనతార ప్రధాన పాత్రను పోషించిన అరమ్ చిత్రం ఫేమ్ గోపి నయినార్ దర్శకత్వం వహించిన నూతన చిత్రం ఇది. ఈయన ఇంతకుముందు ర్శకత్వం వహించిన మనుషి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో తర్వాత కాలనీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అతిధి మూవీస్ పతాకంపై డాక్టర్ ఆర్.రంగనాథన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు లియో, రాధికా కుమారుడిగా నటించారు. అంజలినాయర్, ఎంఎస్.భాస్కర్ , చేతన్, ఆర్కే విజయమురుగన్, వినోద్ సాగర్, మూనార్ రమేష్, అజిత్ ఘోషి, రవి వెంకట్రావ్, జేకేఏ వెంకటేష్, దర్శకుడు తమిళ్, గీతా కై లాసం, బోస్ వెంకట్ ముఖ్యపాత్రలు పోషించారు. చిన్న విరామం తరువాత దేవా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్.దేవరాజ్ చాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను దర్శకుడు వెట్రిమారన్, విజయ్సేతుపతి కలసి విడుదల చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు గోపి నయినార్ తెలుపుతూ కుమారుడిని కోల్పోయిన తల్లి న్యాయం కోసం చేసే పోరాటమే ఈ చిత్రం అని చెప్పారు. త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. -
ఎల్ఐకే విడుదలవ్వడమే నాకు బ్లాక్ బస్టర్
నటుడు ప్రదీప్ రంగనాధన్, నటి కృతిశెట్టి, ఎస్జే.సూర్య, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తదితరులు తమిళసినిమా: నటుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఎల్ఐకే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) నటి కృతిశెట్టి నాయకిగా నటించిన ఇందులో నటుడు సీమాన్, ఎస్జే.సూర్య, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నటి నయనతారకు చెందిన రౌడీ పిక్చర్స్ సంస్థ, ఎస్ ఎస్. లలిత్కుమార్కు చెందిన సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. అనిరుధ్ సంగీతాన్ని, రవివర్మన్ ఛాయాగ్రణంను అందించిన ఈ చిత్రం గత వారం తెరపైకి వచ్చి సక్సెస్ఫుల్గా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో థ్యాంక్స్ గివింగ్ మీట్ను నడుస్తోంది. ఈ సమావేశంలో చిత్ర కథానాయకుడు ప్రదీప్ రంగనాధన్ మాట్లాడుతూ 2023లో దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఈ చిత్ర కథను చెప్పగానే అందులో నటించడానికి ఫిక్స్ అయ్యానన్నారు. ఆ తరువాత పలు మార్లు పలు ఆటంకాలను ఎదుర్కొని షూటింగ్ను పూర్తి చేసుకుందని చెప్పారు. దీంతో చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి కొరవడుతుందేమో, చిత్రంపై క్రేజ్ తగ్గుతుందేమోనని చాలా భయపడ్డామన్నారు. ఎట్టకేలకు ఎల్ఐకే చిత్రం విడుదలై ప్రేక్షకులను అలరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించడం తనకు మంచి అనుభవం అని నటి కృతిశెట్టి పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు విఽఘ్నేశ్ శివన్ మాట్లాడుతూ ఈ చిత్రం విడుదల కావడమే తనకు బ్లాక్ బస్టర్ అయినట్లు అని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రాన్ని నటుడు ప్రదీప్ రంగనాథన్ కెరీర్లో మరో రూ.100 కోట్ల క్లబ్లో చేర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందుకే ఈ చిత్రాన్ని మళ్లీ ఈనెల 17న విడుదల చేస్తున్నట్లుగా మరిన్ని వసూళ్లూ సాధించే విధంగా బూస్ట్ అప్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తమిళసినిమా: సామాజిక బాధ్యతతో కూడిన జనరంజక కథా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణతోపాటు, అంతర్జాతీయ స్థాయిలో అభినందనలు లభిస్తుంటాయి. అలా 2014లో విడుదలైన చిత్రం కుట్రం కడిదల్. బ్రహ్మ.జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జేఎస్కే సతీష్కుమార్ నిర్మించారు. తండ్రీకొడుకుల ఇతి వృత్తంతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పొందేవరకూ వెళ్లింది. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్గా కుట్రం కడిదల్–2 రూపొందింది. జేఎస్కే.సతీష్కుమార్ నిర్మించి ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రానికి ఎస్కే.జీవా దర్శకత్వం వహించారు. పాండియరాజన్ ఇంతకు ముందెప్పుడూ నటించని పాత్రను ఈ చిత్రంలో నటించారని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా అప్పుకుట్టి, బాలాజీ మురుగదాస్, దీపక్, పావల్, పీఎల్. తేనప్పన్, చాందిని తమిళరసన్, కీర్తీచావ్లా, విజీ చంద్రశేఖర్, లవ్లిన్, జోవిత లీవింగ్స్టన్, రోషన్ ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి కథనాన్ని ఎస్కే.జీవా, కేఎస్కే.సతీష్కుమార్ రచించారు. డీకే సంగీతాన్ని, సతీష్ .జీ చాయాగ్రహణం అందించిన ఈ చిత్ర షూటింగ్ను కొడైక్కానల్, దిండిగల్, నాగర్కోవిల్, చైన్నె ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వారు చెప్పారు. కుట్రం కడిదల్–2 చిత్రంలో సతీష్కుమార్, కీర్తీచావ్లా, విజీ చంద్రశేఖర్ కుట్రం కడిదల్ సీక్వెల్ రెడీ! -
చైన్నెలో రేపటి నుంచి పోస్టల్ ఓటింగ్
సాక్షి,చైన్నె: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చైన్నె జిల్లా ఎన్నికల అధికారి బుధవారం కీలక ప్రకటన చేశారు. ఈనెల 17, 18 తేదీలలో చైన్నెలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ ఓటింగ్ నిర్వహించనున్నామన్నారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు తమ ఇంటి నుంచే ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల సిబ్బంది నేరుగా వారి వద్దకే వెళ్లనున్నారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు , ఎన్నికల సిబ్బంది ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు వారికి కేటాయించిన కేంద్రాలలో పోస్టల్ ఓటు వేసుకునే అవకాశం కల్పించారు. కొత్త డీజీపీ నియామకంపై వివాదం తమిళనాడు కొత్త డీజీపీగా సందీప్ రాయ్ రాథోర్ నియామకంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మాజీ డీజీపీ శంకర్ జివాల్ పదవీ విరమణ తర్వాత, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కొత్త డీజీపీ ఎంపిక జరగాలని డీఎంకే వాదిస్తోంది. ఎన్నికల సమయంలో నియమించబడిన అధికారిని శాశ్వత ప్రాతిపదికన కొనసాగించడం చట్టవిరుద్ధమని, ఇతర రాష్ట్రాల్లో (పశ్చిమ బెంగాల్ వంటివి) అనుసరించిన పద్ధతినే ఇక్కడ కూడా పాటించాలని ఎన్నికల కమిషన్ను డీఎంకే డిమాండ్ చేసింది. ఖైదీలకు ఓటు హక్కు తమిళనాడులో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, జైళ్లలో ఉన్న నిర్బంధ ఖైదీలకు కూడా ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. గుండా చట్టం, జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయిన ఖైదీలకు మాత్రమే పోస్టల్ ఓటింగ్కు పచ్చజెండా ఊపారు. జైళ్ల శాఖ ఏడీజీపీ శంకర్ నేతృత్వంలో ఓటర్ల వివరాలు సేకరించారు. చాలా మంది ఖైదీలకు సరైన గుర్తింపు కార్డులు లేకపోవడంతో కొన్ని దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 15 మంది ఖైదీలు ఓటు వేయగా, ఈసారి ఆ సంఖ్య 132కి పెరగడం విశేషం. -
కోర్టుకు ఉదయనిధి అఫిడవిట్ వ్యవహారం
సాక్షి, చైన్నె: డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తన ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల వివరాల వ్యవహారం హైకోర్టుకు చేరింది. దర్యాప్తు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందించాలని ఆదాయపు పన్ను శాఖను చైన్నె హైకోర్టు ఆదేశించింది. ఉదయనిధి స్టాలిన్ పోటీ చేస్తున్న చేపాక్కం– ట్రిప్లికేన్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గానికి చెందిన ఓటరు కుమారవేల్ ఈ పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేశారు. పిటిషనర్ లేవనెత్తిన ప్రధానాంశాలు ఇవే 2021 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలో రూ. 7.36 కోట్ల పెట్టుబడి ఉన్నట్లు పేర్కొన్న ఉదయనిధి, ప్రస్తుతం (2026) ఎన్నికల అఫిడవిట్లో ఆ వివరాలను తెలపలేదని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ఆయన సతీమణి అదే సంస్థలోరూ 2.63 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు లెక్కలు చూపినట్టు వివరించారు. 2021లో స్నో హౌసింగ్ సంస్థకు రూ. 11.06 కోట్ల అప్పు ఇచ్చినట్లు చూపగా, తాజాగా అఫిడవిట్లో అది రూ. 10 కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్నారు. మిగిలిన రూ 1.06 కోట్లు తిరిగి చెల్లించారా లేదా అనే వివరాలు లేవని పిటిషనర్ వాదించారు. అలాగే, 2020కి ముందు రూ. 2 కోట్లుగా ఉన్న ఆదాయం, ప్రస్తుతం రూ. 10.98 కోట్లుగా ఉందని, ఈ భారీ పెరుగుదలపై సరైన వివరణలు లేవని ఆరోపించారు. విచారణకు కోర్టు స్వీకరణ ఈ పిటిషన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. ధర్మాధికారి, న్యాయమూర్తి జి. అరుళ్ మురుగన్ నేతృత్వంలోని బెంచ్ బుధవారం విచారణకు స్వీకరించింది. ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదుల తమ వాదనలో.. అభ్యర్థులు అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని, అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున దీనిపై ఎన్నికల పిటిషన్ మాత్రమే దాఖలు చేయగలరని పేర్కొన్నారు. పిటిషనర్ ఫిర్యాదులోని అంశాలపై విచారణ జరిపి ఏప్రిల్ 20 లోపు సమాధానం ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖను కోర్టు ఆదేశించింది. విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. కాగా, ఎన్నికల వేళ డిప్యూటీ సీఎం ఉదయ నిధి ఆస్తుల వివరాలపై కోర్టు విచారణకు ఆదేశించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అఫిడవిట్లో సమాచారం అసంపూర్తిగా ఉండటం ప్రజా ప్రాతినిథ్య చట్టానికి విరుద్ధమని పిటిషనర్ తన వాదనలో గట్టిగా వినిపించారు. -
ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి
తిరువళ్లూరు: జిల్లాలో ఎన్నికల విధులను నిర్వహించనున్న అధికారులు నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. తిరువళ్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు రానున్న 23న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అధికారులకు మూడుదశల్లో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. రెండవదశ శిక్షణ తరగతులు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ ఎన్నికల విధులను నిర్వహించే అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. మాక్పోలీంగ్తో పాటూ ఇతర వాటిపై ఏజెంట్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చిన తరువాతే ఓటింగ్ ప్రక్రియను ప్రారంబించాలని సూచించారు. దీంతో పాటూ పోస్టల్ బ్యాలెట్ను వందశాతం ఉపయోగించుకోవాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత సీల్ వేసే సమయంలో ఏజెంట్లుకు పూర్తీ సమాచారం ఇవ్వాలని సైతం సూచించారు. మొత్తం 19,224 మంది సిబ్బంది ఎన్నికల ప్రక్రియలో పాల్గొననున్నట్టు వివరించారు. -
లారీ – కారు ఢీ
● మహిళ మృతి అన్నానగర్: అవడి సమీపంలో జరిగిన లారీ కారు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. తాంబరం సమీపంలోని నందివరం ప్రాంతంలోని గూడువాంచేరికి చెందిన త్యాగు(41) ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇతని భార్య పేరు శాలిని (33). ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. తమిళ న్యూయర్ సందర్భంగా, త్యాగు, ఇతని భార్య శాలిని పూజ కోసం తిరువళ్లూరు జిల్లాలోని సిరువాపురి మురుగన్ ఆలయానికి వెళ్లారు. అనంతరం మధ్యాహ్నం వారు కారులో ఇంటికి తిరిగి వస్తుండగా, రెడ్ హీల్స్ సమీపంలోని కాట్టూర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ త్యాగు నడుపుతున్న కారు వెనుక టైరు అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి, రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీ వెనుక భాగాన్ని వేగంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ముందు సీటులో కూర్చున్న శాలిని తీవ్రంగా గాయపడి మరణించారు. త్యాగు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ఆవడి ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతురాలు శాలిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం పంపించారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్కు చెందిన లారీ డ్రైవర్ శివ(40)ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మత్స్యకారుడి వలలో తిమింగలం కళేబరం
అన్నానగర్: కులచల్ సమీపంలోని కొట్టిల్పాడు సముద్ర ప్రాంతంలో మంగళవారం జాలర్లు చేపలు పడుతుండగా, వారి వలలో కొన్ని పెద్ద చేపలు చిక్కుకున్నాయి. ఆ తర్వాత, వారు ఆ వలను ఒడ్డుకు లాగుతుండగా, రెండు భారీ తిమింగల సొరచేపలు అందులో చిక్కుకున్నట్లు తెలిసింది. ఈలోగా, సొరచేపలలో ఒకటి తప్పించుకుంది. మరో చేప చనిపోయింది. దీని తరువాత, జాలర్లు చనిపోయిన తిమింగల సొరచేపను ఒడ్డుకు లాగారు. ఆ చేప బరువు సుమారు 5 టన్నులు. ఈ సమాచారం విన్న తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు బీచ్ వద్ద గుమిగూడటం ప్రారంభించారు. ఈ విషయం గురించి అటవీ శాఖకు తెలియజేశారు. అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు నిర్వహించారు. ఈ విషయమై వారు మాట్లాడుతూ, ’కుమరి జిల్లాలోని అరేబియా సముద్రపు లోతైన ప్రాంతంలో భారీ తిమింగల సొరచేపలు అధిక సంఖ్యలో కనిపిస్తాయి. ఇటీవల సముద్ర ప్రవాహాలు, వాతావరణ మార్పుల కారణంగా అవి ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చిన సొరచేప జాలర్ల వలల్లో చిక్కుకుని ఇప్పుడు చనిపోయిందని తెలిపారు. దీని తర్వాత, అటవీ శాఖ చనిపోయిన సొరచేపకు పోస్ట్మార్టం పరీక్ష నిర్వహించి, దానిని బీచ్లో ఒక పెద్ద గొయ్యిని తవ్వి పూడ్చిపెట్టారు. -
ఈ సారైనా నన్ను గెలిపించండి
తిరుత్తణి: గత ఎన్నికల్లో తనను ఓడించిన ప్రజలు, ఈసారి మాత్రం తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే ప్రజల గొంతు వినిపిస్తానని వేడుకున్నారు. తిరుత్తణి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరి ఆర్కేపేట యూనియన్లోని పలు గ్రామాల్లో బుధవారం ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో తాను పోటీ చేసి మీ వద్దకు వచ్చి ఓట్లు అడిగాను. అయితే మీరు తనకు ఓట్లేయకుండా ఓడించారు. దీంతో ఐదేళ్లు నుంచి కష్టాలు చెందాను. మీపై నమ్మకంతో మరోసారి పోటీ చేస్తున్నాను.ఈ సారి ప్రజలు తనపై కరుణ వుంచి గెలిపిస్తారని నమ్ముతున్నాను. తనను గెలిపిస్తే నిత్యం మీతో వుంటూ అసెంబ్లీలో మీ గొంతు వినిపిస్తానని తెలిపారు. తనను గెలిపిస్తారా అని ప్రజలను హరి ప్రశ్నించగా చాలా మంది మౌనంగా వుండడంతో మౌనంగా వుంటే ఏమిటని ప్రశ్నించగా తనను ఈ సారి గెలిపిస్తారా అని మరోసారి అడగ్గా ఈ సారి రెండాకుల గుర్తుకు ఓట్లేసి గెలిపిస్తామని మహిళలు చెప్పడంతో అక్కడ నుంచి హరి మరో గ్రామంలో ప్రచారానికి బయల్దేరి వెళ్లారు. -
వైభవంగా తెప్పోత్సవం ఆరంభం
కొరుక్కుపేట: శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవి వసంతోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి .అందులో భాగంగా మూడు రోజుల పాటు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నారు మంగళవారం రాత్రి ఆలయ మహా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోనేరులో తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని విశేషంగా వివిధ రకాల పుష్పాలతో, స్వర్ణభరణాలతో వైభవంగా అలంకరించి తెప్పపై వేంఛేపు చేసి తెప్పోత్సవం ను కనుల పండువుగా నిర్వహించారు. చైన్నె నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి తెప్పోత్సవాన్ని తిలకించి తరించారు. ఆలయ పాలక మండల సభ్యులు తెప్పను లాగుతూ తన్మయత్వం పొందారు. భక్తులందరికీ ప్రసాద వినియోగం చేయగా, ఎస్కేపీడీ అండ్ చారిటీస్ కార్యదర్శి ఎం కిషోర్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
క్లిష్టమైన గుండె చికిత్సలకు ప్రత్యేక ప్రోగ్రామ్
సాక్షి, చైన్నె: వైద్య రంగంలో మరో ముందడుగు వేస్తూ, రేడియల్ రోడ్డులోని కావేరీ హాస్పిటల్ ’కాంప్లెక్స్ హై–రిస్క్ ఇండికేటెడ్ ప్రొసీజర్స్’ అనే అత్యాధునిక కార్డియాక్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు, ముఖ్యంగా తీవ్రమైన గుండెపోటు, హార్ట్ ఫెయిల్యూర్ కేసుల్లో మెరుగైన చికిత్స అందించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యంగా వైద్యులు ప్రకటించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో చీఫ్ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ అజిత్ పిళ్లై మాట్లాడుతూ, అమెరికా, యూరప్లోని అగ్రశ్రేణి కార్డియాక్ ఆసుపత్రుల తరహాలో ఇక్కడ బహుళ విభాగాలకు చెందిన నిపుణులు (మల్టీ డిసిప్లినరీ టీమ్) కలిసి పనిచేస్తారని ప్రకటించారు. ఇందులో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు, సర్జన్లు, అనస్థీషియాలజిస్టులు, క్రిటికల్ కేర్ నిపుణులు ఉంటారని వివరించారు. ఆసుపత్రికి అత్యవసర స్థితిలో వచ్చే రోగులను కేవలం 10 నుండి 15 నిమిషాల్లోనే పరీక్షించి, చికిత్స ప్రారంభించేలా ప్రోటోకాల్స్ రూపొందించామన్నారు. క్లిష్టమైన సర్జరీలు జరుగుతున్నప్పుడు గుండెకు తాత్కాలికంగా మద్దతు ఇచ్చేందుకు ఎక్మో, మైక్రో–యాక్సియల్ కార్డియాక్ పంప్స్ వంటి పరికరాలను ఇక్కడ ఉపయోగించడం జరుగుతుందన్నారు. ఆస్పత్రి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మాట్లాడుతూ, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులను కాపాడడంలో సమయపాలన , నైపుణ్యం చాలా ముఖ్యమన్నారు. ఈ విభాగం ద్వారా అంతర్జాతీయ స్థాయి గుండె చికిత్సలను రోగులకు మరింత దగ్గర చేస్తున్నామన్నారు. -
బీజేపీకి ఝలక్.. స్టాలిన్ వినూత్న నిరసన
చెన్నై: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మూడు ప్రధాన బిల్లులను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. మహిళా రిజర్వేషన్లు అమలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), కొత్త డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలను కలిగి ఉన్న ఈ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రం తీరు పట్ల వినూత్నంగా నిరసన తెలిపారు.పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. బిల్లుకు పూర్తిగా వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఎంకే స్టాలిక్ నల్ల దుస్తులు ధరించి నల్ల జెండాను ఎగురవేశారు. అలాగే, డీలిమిటేషన్ బిల్లు పేపర్లను కాల్చివేశారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా స్టాలిన్.. ‘ఈ ప్రతిఘటన తమిళనాడు అంతటా వ్యాపించాలి! ఫాసిస్ట్ బీజేపీ అహంకారం కూలిపోవాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్ల వద్ద నల్ల జెండాలు ఎగురవేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.Namakkal | DMK President and Tamil Nadu CM MK Stalin, wearing black attire, today hoisted a black flag in protest against the Centre's delimitation move. He also burned a copy of the proposed Delimitation bill. pic.twitter.com/AYno2V8UCn— ANI (@ANI) April 16, 2026అంతేకాకుండా.. గత హిందీ వ్యతిరేక ఆందోళనలతో పోలుస్తూ.. గతంలో తమిళనాడు నుండి వచ్చిన ప్రతిఘటన ఢిల్లీని లొంగిపోయేలా చేసిందని, అటువంటి ఉద్యమమే ప్రస్తుత ప్రతిపాదనను సవాలు చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ బిల్లు తమిళులను వారి సొంత భూమిలో శరణార్థులుగా మారుస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ అహంకారాన్ని అణచివేయడానికి ఈ ఆందోళన ద్రావిడ భూమి అంతటా వ్యాపిస్తుందని ఆయన అన్నారు. మరోవైపు.. డీఎంకే ఎంపీలు కూడా నల్ల దుస్తులు ధరించి నేడు పార్లమెంట్ సమావేశంలో పాల్గొననున్నారు.ఇదిలా ఉండగా.. పార్లమెంట్లో ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టనుండగా, ఒక్కో సభలో 18 గంటలపాటు చర్చకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం ఈ బిల్లులపై స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. డీలిమిటేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది. దీంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందుతుందా? లేక ప్రతిపక్షాల వ్యతిరేకతతో నిలిచిపోతుందా? అన్నది ఉత్కంఠగా మారింది.#WATCH | Chennai | Late DMK patriarch M. Karunanidhi's daughter, Selvi Karunanidhi, joins DMK protest against the Centre's proposed delimitation bill pic.twitter.com/EomzwcjQ4X— ANI (@ANI) April 16, 2026 -
తమిళ పార్టీలకు చిక్కని ఓటరు నాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ద్రవిడవాదం తమిళ ప్రజల గుండెల్లో పాతు కుపోయింది. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) ఆ నినాదం దన్నుతోనే ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్నారు. దివంగత సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత బాటలోనే ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ కూడా ద్రవిడ సిద్ధాంతమే ప్రధానాస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.స్టాలిన్ మహా మెగా కూటమిజయలలిత మాదిరిగా వరుసగా తమిళనాట రెండోసారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలుస్తారా అన్నది ఈసారి ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి 21 పార్టీలతో మహా మెగా కూటమికి తెర తీశారు. స్టాలిన్తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ద్రావిడ మోడల్ 2.0 పాలన నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణులకు రూ.1,000 ప్రోత్సాహం వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్న వైనాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈసారి గెలిపిస్తే రూ.8,000 విలువైన కూపన్లు తదితర హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కంటే కొత్తగా బరిలో దిగిన సినీ నటుడు జోసెఫ్ విజయ్ డీఎంకేకు గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ స్టాలిన్ వదులుకోవడం లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను అందివచ్చిన అస్త్రంగా వాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లోక్సభ స్థానాల పెంపులో తమిళనాడుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయనుందంటూ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడం ద్వారా ప్రధాని మోదీని ఎదుర్కొంటున్న నేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డారు. మైనారిటీ ఓట్లు కూడ ఎంతో కొంత గట్టెక్కిస్తాయని డీఎంకే నమ్ముతోంది.అన్నా కూటమి ఆపసోపాలుఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, అన్బుమణి రాందాసు నేతృత్వంలోని పీఎంకే, జికే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాష్ట్రంలో పేట్రేగుతున్న హింస తదితరాలను అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన ప్రచారాస్త్రా లుగా మలచుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే మాదిరిగానే అన్నాడీఎంకేకు కూడా విజయ్ పార్టీ గుబులు పట్టుకుంది. ఆయన పార్టీ అంతిమంగా ఎవరి ఓట్లు చీలుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగానే బరిలో ఉన్న మరో సినీ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి కూడా ప్రధాన కూటముల ఓట్లను చీల్చేలా కన్పిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ఈసారి ఏకంగా 116 మంది మహిళలకు, ఒక ట్రాన్స్జెండర్కు కూడా టికెటిచ్చింది! వీరికి తోడు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ కూడా పలు నియోజకవర్గాల్లో బరిలో ఉంది!ఓటరు నాడి ఎటో..!ఈసారి తమిళ ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు! ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చిచెప్పలేకపో యాయి. కాకపోతే విజయ్ పార్టీ టీవీకే కనీసం 15 నుంచి 30 స్థానాల దాకా గెలుచుకోవచ్చని పలు సర్వేల్లో తేలింది. అయితే టీవీకే ప్రధాన కూటముల్లో దేని ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.మూడో శక్తిగా విజయ్తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో మూడో శక్తిగా అవతరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విజయ్కి ఉన్న ఆదరణనే టీవీకే నమ్ముకుంది. ఆ ఆదరణ ఏ మేరకు ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు విజయ్ని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రజాదరణ ఉన్న నేతలంటూ ఎవరూ లేకపోవడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. టీవీకేతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా చివరికి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేక పోయినా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదగాలన్న భావన టీవీకేలో కనిపిస్తోంది. పార్టీలో జోష్ నింపేందుకు విజయ్ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. యువత, మహిళల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఈసారి టీవీకే భారీగా గండి కొట్టవచ్చన్న విశ్లేషణలున్నాయి. -
ఊహించని విషాదం.. పేలని బాంబును తన్నడంతో..
సింగ పెరుమాళ్: తమిళనాడులోని సింగపెరుమాళ్ కోయిల్ సమీపంలో రక్షణ రంగ నిషేధిత ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రెక్కింగ్కు వెళ్లిన విద్యార్థుల బృందం అక్కడ ఉన్న ఒక పేలని షెల్ను కదిలించడంతో అది ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. మరణించిన విద్యార్థిని బెంగళూరుకు చెందిన హిమాన్షు యాదవ్ (21)గా గుర్తించారు. ఈ విద్యార్థి ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇతని తండ్రి రమేష్ సింగ్ బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ క్వార్టర్స్లో ఉద్యోగి.ఏప్రిల్ 13న (సోమవారం) సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో ఆరుగురు విద్యార్థుల బృందం అనుమతి లేకుండా హనుమంతపురం ఫైరింగ్ రేంజ్ సమీపంలోని కొండపైకి ఎక్కారు. కొండపైకి చేరుకున్నాక వారికి ఒక లోహపు వస్తువు కనిపించింది. అది పేలని బాంబు అని తెలియక ఒక విద్యార్థి దానిని తన్నడంతో అది రాయికి తగిలి ఒక్కసారిగా పేలిపోయింది.దీంతో హిమాన్షు యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను వెంటనే పోతేరిలోని ఎస్ఆర్ఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని క్రమం తప్పకుండా ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తాయని.. ఆ సమయంలో పేలని షెల్ ఏదైనా అక్కడ ఉండిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సింగపెరుమాళ్ కోయిల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ పేలుడు పదార్థం అక్కడ ఎలా ఉండిపోయిందనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. -
దక్షిణాది ఒక్కటైతే దేశ రాజకీయాలే మారిపోతాయి: కేతిరెడ్డి
తమిళనాడు: దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఒక ఐక్య ఉద్యమం ప్రారంభమైంది. దేశ సమగ్ర అభివృద్ధికి కీలకంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వివక్షాత్మక విధానాలపై గళం విప్పాల్సిన అవసరం ఏర్పడిందని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి పేర్కొన్నారు. డిలిమిటేషన్ను ప్రస్తుతం వెంటనే అమల్లోకి తీసుకురాకూడదని, దక్షిణాది రాష్ట్రాల వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు.ఆ ప్రకటనలో కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ డిలిమిటేషన్ అంశంపై స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిపారు:“దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న అన్యాయాన్ని ఇక మేము సహించము. మా హక్కుల కోసం అవసరమైతే మరింత పెద్ద స్థాయిలో పోరాటం చేస్తాము.”దక్షిణాది రాష్ట్రాలు ఎప్పటికీ దేశాభివృద్ధికి వెన్నెముకగా నిలిచాయని, కానీ ప్రాతినిధ్యం, వనరుల పంపిణీ, విధానాల అమలు విషయంలో జరుగుతున్న వివక్షను ఇకపై సహించబోమని ఆయన అన్నారు. ఈ ఉద్యమం కేవలం ఒక ప్రాంతం కోసం కాకుండా — సమానత్వం, న్యాయం, ఫెడరల్ స్ఫూర్తి కోసం సాగుతున్న పోరాటమని స్పష్టం చేశారు.“దక్షిణాది ఒకటైతే దేశ రాజకీయ దిశ మారుతుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణాది వివక్షపై తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసినట్టు చెప్పారు.దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్న మొత్తం ఎంత, తిరిగి వాటికి లభిస్తున్న వాటా ఎంత అనే ప్రశ్న నేపథ్యంలో ఈ ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కర్ణాటక మరియు తమిళనాడు ముఖ్యమంత్రులు, అలాగే వివిధ ప్రతిపక్ష పార్టీ నాయకులను కలిసి దక్షిణాది హక్కుల పరిరక్షణ అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు.అందులో భాగంగా హోసూర్లో ధర్నా నిర్వహించినట్టు తెలిపారు. ముఖ్యంగా డిలిమిటేషన్ (పరిధుల పునర్విభజన) ప్రక్రియలో ఉత్తరాది రాష్ట్రాలకు పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని, దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్య పెరగడంలో అన్యాయం జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తప్పకుండా ప్రజలందరూ ఉప్పొంగే తరంగంలా ముందుకు వచ్చి ఉద్యమానికి సిద్ధం కావాలని, రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా కలిసి పోరాటం చేయాలని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి పిలుపునిచ్చారు. -
దక్షిణ రాష్ట్రాలకు ఇదేనా ప్రతిఫలం?
చెన్నై: మోదీ సర్కారు తలపెట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి ఫైర్ అయ్యారు. డీలిమిటేషన్పై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలు ఎగురవేయాలని తమిళనాడు ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించబోమని మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఈ మేరకు ఎక్స్లో వీడియో సందేశం విడుదల చేశారు."నల్ల జెండాలు ఎగరనివ్వండి! భారతదేశ ప్రగతికి దోహదపడినందుకు మాకు శిక్ష విధిస్తారా? తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు ఇదేనా ప్రతిఫలం? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లు.. తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక భారీ చారిత్రక అన్యాయం. డీలిమిటేషన్కు నిరసనగా రేపు తమిళనాడు వ్యాప్తంగా ఇళ్లపైనా, బహిరంగ ప్రదేశాల్లోనూ నల్ల జెండాలు ఎగురుతాయి. తమిళనాడు గళాన్ని గౌరవించి వెనక్కి తగ్గడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తే, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. డీఎంకే అధ్యక్షుడిగా, అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మగౌరవం గల తమిళుడిగా ఇది నా హెచ్చరిక'' అని స్టాలిన్ తన సందేశంలో పేర్కొన్నారు.ఎంపీలతో అత్యవసర భేటీనియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్లో చర్చకు రానున్న నేపథ్యంలో డీఎంకే ఎంపీలతో స్టాలిన్ ఈ రోజు ఉదయం అత్యవసర భేటీ నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఎంపీలతో ఆయన చర్చించారు. కాగా, గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్టాలిన్కు ఓటమి భయం: అన్నామలైస్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు అన్నామలై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో స్టాలిన్ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వివాదం చేస్తున్నారని ఆరోపించారు. కోయంబత్తూరులో అన్నామలై మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ వీలైనంత త్వరగా అమలు చేయాలని తమిళనాడు మహిళలు కోరుకుంటున్నారని చెప్పారు. తమిళనాడులో ఈసారి భారీ మెజారిటీతో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, డీఎంకే ప్రభుత్వం పోవాలని భావిస్తున్నారని చెప్పారు. భారీ మెజారిటీతో ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. உயரட்டும் கருப்புக்கொடி!தமிழ்நாடு போராடும்! தமிழ்நாடு வெல்லும்!இந்தியாவின் வளர்ச்சிக்காகப் பாடுபட்ட குற்றத்துக்காக தமிழ்நாடு உள்ளிட்ட தென்மாநிலங்களுக்குத் தண்டனையா? ஒன்றிய பா.ஜ.க. அரசு நாளை நாடாளுமன்றத்தில் கொண்டுவரவுள்ள #Delimitation சட்டத்திருத்தம் தமிழ்நாட்டுக்கும்,… pic.twitter.com/6gbEAHvNn4— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 15, 2026 చదవండి: గెలిస్తే ఏఐ యూనివర్సిటీ, మంత్రిత్వ శాఖ


