Tamil Nadu
-
టీవీకే విజయ్ సంచలనం సృష్టిస్తారా?
మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు... అధికారంలోకి ఎవరు?నేడు తమిళనాడు ఎన్నికల ఓట్ల కౌంటింగ్ఉదయం 8 గంటల నుంచి ఓట్లని లెక్కించనున్న సిబ్బంది234 స్థానాల్లో ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికలు5.73 కోట్ల మంది ఓటర్లలో ఓటు హక్కు వినియోగించుకోగా.. తమిళనాడులో రికార్డ్ స్థాయిలో 85 శాతం పోలింగ్రాష్ట్రవ్యాప్తంగా 62 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘంమొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి 8.30 నుంచి ఈవీఎం ఓట్లను కౌంట్ చేయనున్న అధికారులుమ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు... అధికారంలోకి ఎవరు వస్తారనేది ఉత్కంఠడీఎంకే, ఏఐ డిఎంకె కూటమి, విజయ్ టీవీకే పార్టీల మధ్య ప్రధాన పోటీకౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, ప్రత్యేకించి కేంద్ర బలగాలతో పహారారాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ విధుల్లో మొత్తం 3.6 లక్షల మంది సిబ్బందిప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు, సీసీటీవీ పర్యవేక్షణలో కౌంటింగ్కొళత్తూరు నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్, ఎడప్పాడి నుంచి మాజీ సీఎం పళని స్వామి, చెపాక్-తిరువల్లికేని నుంచి ఉదయ్ నిధి స్టాలిన్ పోటీపెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, తెంకాసి జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన ఎన్నికల సంఘంఅక్కడ భారీగా పోలీసు భద్రత ఏర్పాటుహంగ్ ఏర్పాటయ్యే అవకాశం అంటూ సర్వేలు వెల్లడిక్యాంప్ రాజకీయాలకు తెరలేపిన టీవీకేమహాబలిపురం వద్ద రిసార్ట్లు బుక్ చేసిన టీవీకే అధినేత విజయ్గెలిచిన అభ్యర్థులు వెంటనే రిసార్ట్కి రావాలని ఆదేశం..ఆసక్తిగా మారిన తమిళ రాజకీయాలురాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగింది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేతోపాటు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డీఎంకే అధినేత స్టాలిన్ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టిన విపక్ష అన్నాడీఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డీఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్పోల్స్ స్పష్టం చేయగా, విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది.తమిళనాట ఓట్ల లెక్కింపునకు సమగ్రమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలుండగా, కౌంటింగ్కు మొత్తం 62 కేంద్రాలు సిద్ధం చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, 85.15 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. కౌంటింగ్ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను నియమించింది. -
ప్రశాంత కౌంటింగ్పై అవగాహన
తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఓట్లు సోమవారం లెక్కించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గతనెల 23న పోలింగ్ నిర్వహించారు. పోలింగ్లో నమోదైన ఓట్లు ఈవీఎంలను రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో సీల్ వుంచి కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. తిరుత్తణి, తిరువళ్లూరు, గుమ్మడిపూండి, పొన్నేరి నియోజకవర్గాల్లో నమోదైన ఈవీఎంలను సెవ్వాపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం లెక్కించనున్నారు. ఈక్రమంలో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలకు రక్షణతోపాటు భద్రత పట్ల భరోసా కల్పించే విధంగా అవగాహన ర్యాలీ తిరుత్తణిలో శనివారం సాయంత్రం నిర్వహించారు. తిరుత్తణి ఏఎస్పీ శుభమ్ దిమాన్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం స్థానిక ప్రధాన వీధుల్లో ర్యాలీగా వెళ్లి ప్రజలకు కౌంటింగ్ ప్రశాంతంగా వుండేందుకు సంబంధించి అవగాహన కల్పించారు. పాలసముద్రం: మండలంలోని క్రిష్ణజమ్మాపురం పంచాయతీ బలిజకండ్రిగ గ్రామంలో వెలసిన చెవుటి గంగమ్మకు ఆదివారం పాలాభిషేకం, అంబలి పోసే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం అర్చకుడు ఆమ్మవారి ఎదుట కలశాన్ని ఏర్పాటుచేసి గణపతి హోమం, నవగ్రహ హోమం, శాంతి హోమం చేపట్టారు. హోమంలో ఉంచిన కలశాల నీటితో అమ్మవారిని అభిషేకించారు. 10 గంటలకు ప్రతి ఇంటి నుంచి మహిళలు అంబిలి, పాలు, పసుపు నీటి బిందెలతో నయ్యాడి వాయిద్యాలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. వాటితో అమ్మవారికి అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సోమవారం పూలగెరిగను ఊరేగించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. -
కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి
తిరువళ్లూరు: జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన క్రమంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు. తిరువళ్లూరు, గుమ్మిడిపూండి, పొన్నేరి, తిరుత్తణి, మాధవరం, మధురవాయల్, తిరువొత్తియూరు, ఆవడి, అంబత్తూరు తదితర పది అసెంబ్లీ స్తానాలకు గత 23న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం గుమ్మిడిపూండి, పొన్నేరి, తిరుత్తణి, తిరువళ్లూరు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను సెవ్వాపేట పాలిటెక్నిక్ కళాశాలలోనూ, ఆవడి, అంబత్తూరు, తిరువొత్తియూరు, మాధవరం, మధురవాయల్, పూందమల్లి నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను పెరుమాట్టులోని శ్రీరామ్ కళాశాల, విద్యామందిర్ కేంద్రాల్లో భద్రపరిచి అక్కడ మూడెంచల భద్రతను ఏర్పాటు చేశారు. కాగా ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ప్రారంబించనున్నారు. 8.30 గంటలకు ఈవీఎంలను లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. కౌంటింగ్ కేంద్రాలకు సెల్ఫోన్ అనుమతించబోమని స్పష్టం చేశారు. -
తిరుత్తణిలో గాలీవాన బీభత్సం
తిరుత్తణి: తిరుత్తణిలో ఆదివారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించింది. కొండ ఆలయంలో ఇనుప క్యూల పందెళ్లు కూలడంతోపాటు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. తిరుత్తణి ప్రాంతంలో వారం రోజుల నుంచి ఎండల తీవ్రతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం నుంచి అగ్నినక్షత్రం ప్రారంభం కానుండడంతో జనం తీవ్ర ఆందోళన చెందారు. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతోపాటు గాలీవాన తీవ్ర ప్రతాపం చూపింది. గంటలపాటు తేలికపాటి వర్షంతో పెనుగాలులు వీచాయి. దీంతో కొండ ఆలయంలో ఇనుప పందెళ్లు నేలకొరిగాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలడంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వర్షంతో వేడితో తల్లడిల్లిన జనం కాస్త ఉపశమనం పొందారు. పట్టణంలో 3గంటలపాటు పట్టణంలో విద్యుత్ సేవలకు అంతరాయం చోటుచేసుకుంది. -
ఆ ఇద్దరి కాంబోలో చిత్రం ఎప్పుడంటే?
తమిళసినిమా: మణిరత్నం చిత్రాలకు ఆయనే పెద్ద బ్రాండ్. ఏస్ దర్శకుడిగా పేరు గాంచిన ఈయన ఎన్నో సూపర్హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అందులో రజనీకంత్ దళపతి, కమలహాసన్ నాయకన్ వంటి యాక్షన్ ఎంటర్టెయినర్ చిత్రాలు, ముంబాయి ,గీతాంజలి వంటి ప్రేమ కథా చిత్రాలు ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ వంటి చారిత్రాత్మక చిత్రం తరువాత మణిరత్నం చేసిన థక్లైఫ్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై పూర్తిగా నిరాశ పరచింది. దీంతో చిన్న గ్యాప్ తీసుకుని మళ్లీ ఒక విభిన్న ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవతున్నారు. ఇందులో విజయ్సేతుపతి, సాయిపల్లవి జంటగా నటించనున్నారు. లైకా ప్రొడక్షన్స్, మెడ్రాస్ టాకీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రం మే నెలలో సెట్పైకి వెళ్లనుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ప్రారంభం కొంచెం ఆలస్యం కానుందని సమాచారం. జూన్గానీ, జూలైలో గానీ ఈ చిత్రం సెట్పైకి వెళ్లనుందని తాజా సమాచారం. దీనికి కారణం దర్శకుడు మణిరత్నం ఇంకా చిత్ర కథనాన్ని పూర్తి చేసే పనిలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో పక్క లైకా ప్రొడక్షన్స్ ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సమస్యలనే ప్రచారం సాగుతోంది. ఇందులో ఏది నిజ మో తెలియదు గానీ కొత్త చిత్రం షూటింగ్ మరో నెలలో ఉంటుందని భావి స్తున్నారు. -
సురక్షిత ప్రయాణానికి సహకరించండి
సాక్షి, చైన్నె : సురక్షితమైన, సౌకర్యవంతమైన , చట్టబద్ధమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి ప్రయాణికులందరూ రైలు ఎక్కడానికి ముందే సరైన టికెట్లు తీసుకోవాలని దక్షిణ రైల్వేకు చెందిన చైన్నె డివిజన్ విజ్ఞప్తి చేసింది.సరైన టికెట్తో ప్రయాణించడం కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాదని, అది ఒక సామాజిక బాధ్యత కూడా అని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇది రైల్వే సేవలను మెరుగుపరచడమే కాకుండా, ముందుగా ప్లాన్ చేసుకుని ప్రయాణించే ప్రయాణికుల హక్కులను కాపాడుతుందని స్పష్టం చేశారు. సరైన టికెట్లు లేకుండా ప్రయాణించడం వల్ల రైళ్లలో రద్దీ పెరిగి, ఇతర ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు దెబ్బతింటాయని వెల్లడించారు. టికెట్ తనిఖీల్లో కీలక గణాంకాలు ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడటానికి , టికెట్ లేని ప్రయాణాలను అడ్డుకోవడానికి చైన్నె డివిజన్ పరిధిలోని సబర్బన్ (లోకల్), ఎక్స్ప్రెస్ , ప్రత్యేక రైళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీలలో టికెట్ లేని ప్రయాణాలు , నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన వారిపై 12.24 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ కఠినమైన చర్యల ద్వారా రైల్వే శాఖ రూ.65.16 కోట్ల జరిమానా వసూలు చేసింది. ఇది రైల్వే శాఖ నిర్దేశించుకున్న వార్షిక లక్ష్యం కంటే ఎక్కువ కావడం గమనార్హం. డిజిటల్ టికెటింగ్ పద్ధతులను వాడండి ప్రయాణికులు జరిమానాలు, చట్టపరమైన చర్యల బారిన పడకుండా ఉండటానికి రైల్వే స్టేషన్ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందే సరైన టికెట్లు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టికెట్లను రైల్ ఒన్ వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా బుక్ చేసుకోవాలని కోరారు. ఇవే కాకుండా, ప్రధాన రైల్వే స్టేషన్లలో ఉన్న ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు (, కౌంటర్ల ద్వారా కూడా టికెట్లను పొందవచ్చు అని, అందరికీ సురక్షితమైన , ఆహ్లాదకరమైన రైలు ప్రయాణాన్ని అందించేందుకు ప్రయాణికులందరూ సహకరించాలని చైన్నె రైల్వే డివిజన్ కోరింది. -
తిరుత్తణి ఆలయానికి తగ్గిన రద్దీ
తిరుత్తణి: వేసవి ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతోపాటు సోమవారం నుంచి అగ్ని నక్షత్రం ప్రారంభం సందర్భంగా తిరుత్తణి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం, సెలవు రోజులు భక్తుల రద్దీ వుండేది. దీంతో మూడు గంటల పాటు వేచివుడి భక్తులు స్వామి దర్శనం చేసుకునేవారు.అయితే వేసవి ఎండల తీవ్రత విపరీతంగా పెరిగి వేడి గాలులతో పాటు నిప్పుల సెగలు చోటుచేసుకోవడంతో జనం ఉదయం పది గంటలకు పైబడి ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు మొహం చాటేస్తున్నారు. దీంతో ప్రదాన నగరాల్లో సైతం పగటి సమయాల్లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా తగ్గింది. పాఠశాలలకు సెలవు, ఆదివారం అయినా భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో కనిపించింది. అర్ధగంటలో స్వామి దర్శనం చేసుకున్నారు. ఎండల తీవ్రతతో భక్తులకు ఆలయ నిర్వాహకులు మజ్జిగ, తాగునీరు సరఫరా చేశారు. -
‘రెటికాన్ 2026’
ఆధునిక చికిత్స విధాన వేదికగా సాక్షి,చైన్నె : అత్యాధునికి చికిత్సల విధానాలు, కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచే విధంగా రెటికాన్ 2026 ఆదివారం చైన్నెలో జరిగింది. డాక్టర్ అగర్వాల్స్ రెటినా ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫ్లాగ్షిప్ సైంటిఫిక్ కాన్ఫరెన్స్ ‘రెటికాన్ 2026’ 16వ ఎడిషన్ ను విజయవంతంచేశారు. రెటినా (కంటి వెనుక భాగంలోని పొర), విట్రియస్ సంబంధిత వ్యాధుల నిర్ధారణ, అత్యాధునిక చికిత్సా విధానాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. భారతదేశంతో పాటు విదేశాల నుంచి విట్రియో–రెటినల్ నిపుణులు, జనరల్ ఆప్తమాలజిస్టులు, పరిశోధకులు, ఆప్తమాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు సహా 1,000 మందికి పైగా ప్రతినిధులు ఈసదస్సుకు హాజరయ్యారు. మీనాక్షి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ సి. శ్రీధర్ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ అమర్ అగర్వాల్, చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్విన్ అగర్వాల్, విట్రియో–రెటినల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ ఖత్రి తదితరులు పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి విచ్చేసిన సుమారు 50 మంది ప్రముఖ వక్తలు మెడికల్ , సర్జికల్ రెటినాకు సంబంధించిన వివిధ అంశాలపై శాసీ్త్రయ ప్రసంగాలు చేశారు. రెటినా సంబంధిత రక్తనాళాల వ్యాధుల చికిత్సలో వస్తున్న మార్పులు, శస్త్రచికిత్సల్లో వస్తున్న సరికొత్త పద్ధతులపై విలువైన సమాచారాన్ని అందించారు. ప్రొఫెసర్ డాక్టర్ అమర్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెటినా నిపుణులు, పరిశోధకులను ఒకే తాటిపైకి తీసుకురావడానికి ‘రెటికాన్’ ఒక అద్భుతమైన వేదికగా మారిందన్నారు. అగ్రశ్రేణి వైద్యుల విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా సరికొత్త ఆవిష్కరణలకు ఇది నాంది పలుకుతుందన్నారు.. వైద్యులకు నిరంతర విద్యను అందించడం ద్వారా రోగులకు మెరుగైన చికిత్సను అందించడమే లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరిశోధకులు, నిపుణులను అవార్డులతో సత్కరించారు. -
మా కల నెరవేరింది..!
తమిళసినిమా: బహుభాషా నటీమణుల్లో మేఘనరాజ్ ఒకరు. ఈ కన్నడ భామ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో కథానాయకిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలో కాదల్ సొల్ల వందేన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. కన్నడ నటుడు, అర్జున్కు బంధువు అయిన నటుడు చిరంజీవి సార్జాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2017లో వీరి పెళ్లి జరిగింది. కాగా అనూహ్యంగా చిరంజీవి సార్జా గత 2020లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన బ్రతికి ఉండగానే నటి మేఘనరాజ్ గర్బం దాల్చారు. పెళ్లి అయిన తరువాత నటనకు దూరంగా ఉన్న మేఘనరాజ్ మగబిడ్డకు జన్మనిచ్చారు. కాగా చాలా గ్యాప్ తరువాత ఈమె మళ్లీ నటించడానికి సిద్దం అయ్యారు.అలా తమిళంలో రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్– 2 చిత్రంలో మేఘనరాజ్ కీలక పాత్రను పోషించినట్లు ప్రచారం జరిగింది. దాన్ని నిజం చేసే విధంగా ఆ చిత్ర షూటింగ్లో ఆమె తన బిడ్డతో కలిసి నటుడు రజనీకాంత్తో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందులో నా భర్త చిరంజీవి సార్జా నటుడు రజనీకాంత్కు వీరాభిమాని. ఆయనతో కలిసి నటించాలన్నది మా చిరకాల కల. ఈ ఏడాది మా 8వ వివాహ వార్షికోత్సవం. ఇప్పుడు మా చిరకాల కల నెరవేరింది. ఇది నా సినీ జీవితంలో మైలు రాయి. అది మీ వల్లే సాధ్యం అయ్యింది ( భర్తను ఉద్దేశించి). అని నటి మేఘనరాజ్ ఉద్వేగంగా పేర్కొన్నారు. దీంతో జైలర్ 2 చిత్రంలో ఈమె పాత్ర ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంటోంది. -
నిఘా నీడలో ‘నీట్’
సాక్షి, చైన్నె: ఈ పరీక్షకు వ్యతిరేకంగా, పరీక్షల భయంతో ప్రతి ఏటా ఇక్కడి విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుండటం కలవరాన్ని రేపుతూ వస్తున్నది. ఆది నుంచి ఈ పరీక్షను పాలకులు వ్యతిరేకిస్తున్నా ఫలితం శూన్యం. అయినా, పరీక్షలను విద్యార్థులు ఎదుర్కోక తప్పడం లేదు. నీట్కు వ్యతిరేకంగా ఇటీవలి అసెంబ్లీ సమావేశాలలో సైతం తీర్మానం చేశారు. అదే సమయంలో గత అన్నాడీఎంకే హయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల కోసం నీట్లో 7.5 శాతం ప్రత్యేక రిజర్వేషన్ను కేటాయించడం స్థానిక విద్యార్థులకు కాస్త ఊరట. తాజాగా ఎన్నికల నేపథ్యంలోదీనిని 10 శాతం పెంపునకు పార్టీలు వాగ్దానాలు చేసి ఉన్నాయి. కట్టుదిట్టమైన ఆంక్షలతో.. 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఎంబీబీఎస్, బీడీఎస్, తదితర వైద్య కోర్సులలో చేరాలన్న ఆంక్షతో ఉన్న విద్యార్థుల కోసం ఆదివారం కట్టుదిట్టమైన భద్రత, ఆంక్షల నడుమ పరీక్ష రాష్ట్రంలో జరిగింది. రాష్ట్రంలోని చైన్నె, కోయంబత్తూరు, కడలూరు, తిరుప్పూర్, కరూర్, మదురై, నామక్కల్, సేలం, తంజావూరు, తూత్తుకుడి, ,తిరునల్వేలి, వేలూరు, విరుదునగర్, దిండుగల్, తిరుచ్చి, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు తదితర 31 జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలలో పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. చైన్నెలో అయితే, సుమారు 40 కేంద్రాలలో పరీక్షా ఏర్పాట్లు చేశారు. ముందుగా విద్యార్థులు పన్నెండు గంటలలోపే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రాలను సరి చూసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఈసారి విద్యార్థులు పకడ్భందీ ముందు జాగ్రత్తలోనే వచ్చారు. కట్టుదిట్టమైన ఆంక్షలు, భద్రత నడుమ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను లోనికి అనుమతించారు. ఆథార్, హాల్ టికెట్లను పరిశీలించినానంతరం లోనికి అనుమతించారు. ముందుగానే హెచ్చరికలు చేసిన దృష్ట్యా, విద్యార్థులు అలెర్ట్గానే పరీక్షకు హాజరయ్యారు. ప్రతి విద్యార్ధిని ప్రవేశ మార్గంలోనే కాదు, లోపల సైతం క్షుణ్ణంగా తనిఖీల అనంతరం పరీక్షా కేంద్రంలో కేటాయించిన గదుల్లోకి అనుమతించారు. చైన్నెలో ఎండ భగ భగ మంటున్నా విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరారు. విద్యార్థులకు తోడుగా వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు అప్పటి వరకు సమీపంలోని చెట్ల కింద వేచి ఉన్నారు. పరీక్ష అనంతరం బయటకు వచ్చిన పిల్లలను ఆనందంగా దగ్గరకు చేర్చుకుని, పరీక్షలు ఎలా రాసారో అని వాకబు చేశారు. బైక్పై ఎక్కించుకుని వెళ్లిన మహిళా కానిస్టేబుల్ పుదుచ్చేరి టెక్నాలజికల్ యూనివర్సిటీ పరీక్ష కేంద్రం వద్ద మరో ఘటన జరిగింది. మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో ఒక విద్యార్థిని నడుచుకుంటూ పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా, సమయం మించిపోతోందని గమనించిన మహిళా కానిస్టేబుల్ భాగ్యలక్ష్మి, వెంటనే తన టూవీలర్పై ఆ విద్యార్థినిని ఎక్కించుకుని నిమిషాల వ్యవధిలో పరీక్షా కేంద్రం లోపలికి చేర్చారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇద్దరు విద్యార్థినుల భవిష్యత్తును కాపాడిన పుదుచ్చేరి పోలీసుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుదుచ్చేరిలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు సంఘటనలు పోలీసుల మానవత్వాన్ని చాటిచెప్పాయి. పాత హాల్ టికెట్తో వచ్చి ఆందోళనలో పడ్డ ఓ విద్యార్థినికి, అలాగే పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్న మరో విద్యార్థినికి పోలీసులు చేసిన సాయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. పుదుచ్చేరి ప్రాంతంలో మొత్తం 9 కేంద్రాలలో నీట్ పరీక్ష జరిగింది. కృష్ణానగర్కు చెందిన కనిష్క అనే విద్యార్థిని భారతీదాసన్ ప్రభుత్వ మహిళా కళాశాలలోని పరీక్షా కేంద్రానికి చేరుకుంది. అయితే, ఆమె పొరపాటున గత సంవత్సరం రాసిన పరీక్షకు సంబంధించిన పాత హాల్ టికెట్ తీసుకొచ్చింది. దీంతో అధికారులు ఆమెను లోపలికి అనుమతించలేదు. ఈ విషయాన్ని కనిష్క బయటకు వచ్చి తన తండ్రికి చెప్పడంతో ఆయన హుటాహుటిన కొత్త హాల్ టికెట్ తీసుకురావడానికి ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో సమయం మధ్యాహ్నం 1.30 గంటలు దాటడంతో పరీక్ష నిబంధనల ప్రకారం అధికారులు గేట్లు మూసివేశారు. తండ్రికి ఫోన్ చేసినా కలవకపోవడంతో ఆ విద్యార్థిని తీవ్ర ఆందోళనకు గురై ఏడవడం ప్రారంభించింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు, ఇతర విద్యార్థులు ఆమెను ఓదార్చారు. గేటు మూసే చివరి నిమిషంలో ఆమె తండ్రి కొత్త హాల్ టికెట్తో అక్కడికి చేరుకున్నారు. సమయం మించిపోతున్నప్పటికీ, అక్కడున్న పోలీసులు, అధికారులు వేగంగా స్పందించి, గేటు తెరిచి ఆమెను పరీక్ష రాయడానికి లోపలికి పంపించారు. -
కనుల పండువగా అళగర్ దశావతారం
సాక్షి, చైన్నె: ప్రపంచ ప్రసిద్ధి చెందిన మధురై చిత్తిరై ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం రాత్రంతా జరిగింది. వైగై నది ప్రవేశ కార్యక్రమాన్ని ముగించుకున్న తదుపరి మండుక మహర్షికి శప విమోచనం కల్పించిన కళ్లలగర్ స్వామివారికి దశావతారోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. మదురై చిత్తిరై ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. దశావతారాల వైభవం ఉత్సవాల క్రమంలో భాగంగా కళ్లలగర్ వండియూర్ పెరుమాళ్ ఆలయంలో బస చేశారు. అక్కడి నుండి శేష వాహనంపై బయలుదేరిన స్వామి వారు, వైగై నదిలోని తేనూరు మండపానికి చేరుకుని పూర్వజన్మ వృత్తాంతం ప్రకారం మండూక మహర్షికి శాప విమోచనం ప్రసాదించారు. ఆ తర్వాత రామరాయర్ మండపానికి చేరుకున్న స్వామి వారికి రాత్రంతా దశావతార పూజలు జరిగాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువ జాము వరకు లక్షలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారి దశావతారోత్సవం జరిగింది. మత్స్య, కూర్మ, వామన, రామ అవతారాల్లో స్వామి వారిని అలంకరించి పూజలు చేశారు. వేకువ జామున అద్భుతమైన మోహినీ అలంకారంలో భక్తులకు స్వామి వారు దర్శనమిచ్చారు. చివరగా కృష్ణుడి రూపంలో అవతరించిన అళగర్ స్వామి రామరాయర్ మండపం నుండి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారి ఈ దశావతార రూపాలను చూసి భక్తులు పులకించిపోయారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రామరాయర్ మండపంలో అనంతరాయల రాజ పల్లకిపై స్వామి వారి ఊరేగింపు వైభవంగా జరిగింది.రాత్రి 10 గంటల సమయంలో మన్నార్ సేతుపతి మండపంలో స్వామి వారికి ప్రత్యేక తిరుమంజనం (అభిషేకం) నిర్వహించారు. పూలపల్లకి సేవ సోమవారం వేకువ జామున 2.30 గంటలకు తాళ్లకుళంలోని ప్రసిద్ధ కరుప్పన్నస్వామి ఆలయ సన్నిధిలో స్వామి వారు పుష్ప పల్లకిపై భక్తులకు దర్శనమిస్తారు. పల్లకి సేవ అనంతరం, అళగర్స్వామి వారు తిరిగి అళగర్ మలైకు బయలు దేరి వెళ్తారు.మంగళవారం అప్పన్ తిరుపతి మీదుగా స్వామి వారి ఊరేగింపు కొనసాగుతుంది. బుధవారం అళగర్ కొండకు చేరుకున్న తర్వాత నిర్వహించే ప్రత్యేక శాంతి పూజలతో ఈ ఏడాది మధురై చిత్తిరై ఉత్సవాలు అధికారికంగా ముగుస్తాయి. -
‘అగ్ని నక్షత్రం’ షురూ
సాక్షి, చైన్నె : తమిళనాడులో మార్చి నెలాఖరు నుంచే ఎండల తీవ్రత , వడగాలులు గణనీయంగా పెరిగాయి. అయితే తూర్పు , ఆగ్నేయ దిశల నుండి వీస్తున్న గాలుల కారణంగా పశ్చిమ కనుమలు, దక్షిణ జిల్లాల్లో అక్కడక్కడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాలలో రామనాథపురం, విరుదునగర్, మదురై, తేని, పుదుక్కోట్టై, శివగంగ, తిరుప్పూర్, కోయంబత్తూరు, ఈరోడ్, నీలగిరి, పెరంబలూరు, సేలం జిల్లాల్లో భారీ వర్షాలు అనేక చోట్ల నమోదయ్యాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి చల్లని వాతావరణం నెలకొంది. అయితే, ఉత్తర తమిళనాడులో మాత్రం భానుడు ఏ మాత్రం తగ్గలేదు. తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జనం విల విలలాడుతున్నారు. సోమవారం నుంచి ఈప్రభావంమరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం పకటించింది. నేటి నుంచి అగ్ని నక్షత్రం ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ’ఎల్ నినో’ పరిస్థితుల వల్ల బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీని ప్రభావంతో సోమవారం నుంచి మే 28 వరకు ’అగ్ని నక్షత్రం’ (కత్తెర) నెల ప్రారంభం కానుంది. ఈ కాలంలో తమిళనాడు వ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతుండటం వల్ల ఉత్తర తీర జిల్లాల్లో మే నెల మూడో వారం వరకు అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటిపూట ఎండలు మండిపోయినా, సాయంత్రం వేళల్లో కురిసే వర్షాల వల్ల రాత్రి పూట చల్లబడే అవకాశం ఉంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని వైద్యులు సూచించారు. శరీర వేడిని తగ్గించుకోవడానికి మజ్జిగ, పండ్ల రసాలు,తగినంత నీరు ఎక్కువగా తాగాలని సూచించారు. ఈదురు గాలుల దాడి తిరుప్పూర్, తిరుచ్చి, పెరంబలూరు, కరూర్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులు బీభత్సం సృష్టించారు. తిరుప్పూర్ రహదారిలో ప్లెక్సీ ఊడి పడటంతో ఓ మోటారు సైకిలిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. తిరుచ్చి, తిరువెరుంబూర్, లాల్గుడి తదితర ప్రాంతాల్లో గంటకు పైగా కురిసిన వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో పలు ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెరంబలూరు, కరూర్లో వీచిన బలమైన గాలులతో పట్టణంలోని పలుచోట్ల ఏర్పాటు చేసిన హోర్డింగులు, ప్రకటనల బ్యానర్లు చిరిగిపోయాయి. కాగా, అకాల వర్షాలు తాము సాగు చేసిన నువ్వులు, ఉల్లి, మినప పప్పు వంటి పంటలకు ఎంతో మేలు చేస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. -
వైభవంగా వసంతోత్సవం –2026
కొరుక్కుపేట: చైన్నెలోని మైలాపూరు కపాలీశ్వరాలయంలో వసంతోత్సవం–2026 వైభవంగా ప్రారంభమైంది. సరస్వతి విద్యా సాంస్కృతిక ట్రస్టు, కపాలీశ్వరాలయం సంయుక్తంగా దివంగత మాజీ ప్రధాన ట్రస్టీ రవి గరియాలి జ్ఞాపకార్థం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సి. నాగప్పన్, అమెరికాకు చెందిన లింకన్ గ్లోబల్ న్యాయ సంస్థ వ్యవస్థాపకుడు ఆర్ ప్రభాకరన్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వసంతోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలలో కళా, సాంస్కృతిక రంగాలలో ప్రతిభావంతులకు అవార్డులు ప్రదానం చేశారు. నగర ప్రముఖులు రోజా కన్నన్ కు ఇందిరా గరియాలి స్మారక అవార్డు, సేలం ఇస్కాన్ అధ్యక్షుడు శ్రీ గోకుల చంద్రదాసుకు శ్రీకాశీనాథ గరియాలి అవార్డు, చైన్నె సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ డా సి. హరిహరన్కు ’సంస్కృత సేవా భాస్కర పురస్కారం, సుకన్యా రవీందర్కు విశిష్ట ఆచార్య పురస్కారం, కాశ్మీరీ సాంస్కృతిక కార్యకర్త పోష్కర్నాథ్ రైనాకు ’కాశ్మీర్ రత్న’ పురస్కారం, శైవ సిద్ధాంత పండితుడు ఎస్.కుంజితపాదంకు ఇంజనీర్ కుప్పురాజ్ పురస్కారం’ వేదపండితుడు కల్వకుంట్ల భార్గవాచార్యులకు శ్రీకాశీనాథ్ గరియాలి పురస్కారం ప్రదానం చేశారు. సరస్వతి విద్యా సాంస్కృతిక ట్రస్టు నిర్వాహకురాలు ప్రియదర్శిని రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈనెల10వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో పలు సంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. -
క్లుప్తంగా
తిరువొత్తియూరు: మదురై సమీపంలో ఇద్దరు యువకులు దారుణంగా హత్యకు గురయ్యారు. తిరుమంగళం, ఆస్టిన్పట్టి పోలీస్ స్టేషన్ పరిమితిలో ఉన్న సంబకుళం మలుపు సమీపంలో కప్పలూరు మదురై బైపాస్ రోడ్డు మధ్యలో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండడాన్ని ఆదివారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆస్టిన్ పట్టి పోలీసులు, రోడ్డు మధ్యలో పడి ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి 30 ఏళ్ల యువకుడని, అతని శరీరంపై నరికిన గాయాలు ఉండడాన్ని చూసి పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం నిలయూర్ సంబకుళం రోడ్డులోని వన్నన్ పారై సమీపంలో మరో పురుషుడి మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్పీ అన్షుల్ నగర్ నేతృత్వంలోని ఆస్టిన్ పట్టి పోలీసులు అక్కడికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. వేలూరు: వేలూరు ఉమ్మడి జిల్లాలోని మొత్తం 15 పరీక్ష కేంద్రాల్లో 5,736 మంది విద్యార్థులు ఆదివారం నీట్ పరీక్షలకు హాజరయ్యారు. వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై, విల్లుపురం, క్రిష్ణగిరి జిల్లాలకు చెందిన మొత్తం 5,736 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల వద్ద అధికారులు, పోలీసులు కఠినంగా తనిఖీలు చేశారు. విద్యార్థులు బంగారు ఆభరణాలు ధరించేందుకు నిషేధం విధించడంతో విద్యార్థులు చేసేది లేక పరీక్ష కేంద్రాల ఎదుట తల్లిదండ్రుల వద్ద తీసి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం విద్యార్థులను మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీలు చేశారు. విద్యార్థినుల విద్యార్థులు వెంట్రుకలకు రబ్బరు బ్యాండు లేకుండా పరీక్షా కేంద్రాలకు అనుమతిచ్చిరు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. తిరువొత్తియూరు: విక్రవాండి సమీపంలో ఓ వ్యాన్ టైర్ అకస్మాత్తుగా పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈక్రమంలో డ్రైవర్తో సహా 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు.. చెంగల్పట్టు జిల్లా మేల్మరువత్తూరుకు చెందిన గణేశన్ (52), అతని తమ్ముడు పెరుమాళ్ (47) కుటుంబాలకు చెందిన 10 మంది సభ్యులు ఈ వ్యానులో ప్రయాణిస్తున్నారు వీరంతా కుంభకోణం సమీపంలోని ఒక దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ఈ వ్యాన్ విలుపురం జిల్లా విక్రవాండి వారాహ నది వంతెనపై వస్తున్న సమయంలో వ్యాన్ కుడి వైపు వెనుక టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. వెంటనే డీజిల్ ట్యాంక్ వద్ద మంటలు అంటుకుని వ్యాన్ అంతా వ్యాపించాయి. డ్రైవర్ బాలచందర్ అప్రమత్తతతో వ్యాన్ను పక్కకు ఆపారు. లోపల ఉన్న 10 మంది ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తిరువొత్తియూరు: తిరుప్పూర్ జిల్లా పల్లడం సమీపంలోని రోడ్డుపై ఏర్పాటు చేసిన భారీ ప్రకటన (అడ్వర్టైజ్మెంట్) బ్యానర్ అకస్మాత్తుగా విరిగి పడడంతో, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పల్లడం దాని పరిసర ప్రాంతాలలో ఆదివారం బలమైన ఈదురు గాలులు వీచాయి. ఆ సమయంలో రోడ్డు పక్కన ఉన్న భారీ బ్యానర్ గాలి వేగాన్ని తట్టుకోలేక అకస్మాత్తుగా చినిగి రోడ్డుకు అడ్డంగా పడింది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న వారికి బ్యానర్ ముఖానికి తగలడంతో, వారు నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పడిపోయారు.గాయపడిన ఇద్దరినీ స్థానికులు రక్షించి, చికిత్స నిమిత్తం పల్లడం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. అన్నానగర్: ఊత్తంగరై సమీపంలో వృద్ధుడినిని హత్య చేసి, వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్ప డిన కేసులో, నెల రోజుల తర్వాత యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కృష్ణగిరి జిల్లాలోని ఉతన్కరై పక్కన ఉన్న ఒపకవలస ప్రాంతంలో గత నెలలో తన ఇంట్లో నిద్రిస్తున్న 75 ఏళ్ల వృద్ధుడిని హత్య చేసి, అతని 70 ఏళ్ల భార్యపై లైంగికదాడి చేసి పారిపోయిన గుర్తుతెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ స్థితిలో పోలీసులు అదే ప్రాంతానికి చెందిన మణికంఠన్ (24)ను అరెస్టు చేశారు. హత్యకు గురైన వృద్ధుడి భూమిలో బావి తవ్వేందుకు మణికంఠన్ గత కొన్ని నెలలుగా ఆ ప్రాంతానికి వస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పోలీసులు అతడిని తరచూ విచారిస్తున్నారు. -
జయలలిత లాగానే త్రిష
తమిళసినిమా: ఇప్పుడు సినీ, రాజకీయరంగాలు నటి త్రిష చుట్టూనే తిరుగుతున్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. కారణం ఈమెకు నటుడు, తమిళగ వెట్రికళగం పార్టీ అధ్యక్షడు విజయ్కు మధ్య ఉన్న స్నేహమే. ఈ స్నేహాన్ని కొందరు వేరే విధంగానూ భావిస్తుంటారు. ఈమె తాజాగా సూర్యకు జంటగా నటించిన కరుప్ప చిత్ర ఆడియో వేడుక ఇటీవల మదురైలో జరిగింది. ఈ కార్యక్రమంలో త్రిష పాల్గొనలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కరుప్పు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి తనను ఎవరూ ఆహ్వానించలేదని త్రిష చెప్పారు. ఇకపోతే ఈమె గురించి మరో నటి వనితా విజయకుమార్ ఒక భేటీలో పలు ఆసక్తికరమైన విషయాలను పేర్కొన్నారు. అందులో ముఖ్యంగా విజయ్, త్రిషల వ్యవహారం గురించి మాట్లాడడం ఆసక్తిగా మారింది. విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేయడానికి కారణమే త్రిష. విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధిస్తారు. అందులో ఒక స్థానానికి రాజీనామా చేసి త్రిషను పోటీ చేయిస్తారు. త్రిష అందుకు అర్హురాలే. జయలలిత మాదిరిగానే త్రిష కూడా చర్చ్ పార్క్ పాఠశాలలోనే చదువుకున్నారు. ఆమె రాజకీయ నాయకురాలు కావడానికి అర్హురాలు. విజయ్కు, త్రిషకు మధ్య ఉన్న బంధాన్ని పక్కన పెట్టి వారి తెలివి, ప్రతిభను మాత్రమే చూడండి. విజయ్, త్రిష మధ్య ఉన్న బంధాన్ని కొందరు కించపరచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అని వనితా విజయకుమార్ పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల షకీలా కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఇకపోతే త్రిష ఇటీవల తన ఇన్స్టాలో నా నెల (మే నెల) ప్రారంభమైంది. అని పేర్కొన్నారు. ఆమె మాటలకు చాలా అర్థాలు ఉన్నాయి. సోమవారం తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. విజయ్ విజయం తథ్యం అనే ధీమాను త్రిష వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. ఇకపోతే ఇదే రోజు త్రిష జన్మదినం కావడం మరో విశేషం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆమె అలా పేర్కొని ఉంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
క్లుప్తంగా
జారి పడి ప్రైవేట్ ఉద్యోగి మృతి అన్నానగర్: కన్యాకుమారి జిల్లాకు చెందిన అరుణ్కుమార్ (30)తిరువళ్లూరు సమీపంలో ని మేల్ నల్లత్తూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో ఆఫీస్ వర్కర్గా పనిచేస్తున్నాడు. ఇందుకోసం, ఇతను ఎరై యాయమంగళం గ్రామంలో ఉంటు పని చేస్తు వచ్చాడు. ఈ స్థితిలో, ఆదివారం ఉదయం పని ముగించుకున్న తర్వాత, అతను సుమారు 5.40 గంటలకు తన ద్విచక్ర వాహ నంపై ఎరై యాయమంగళంలోని తన ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో, మనవాళనగర్ వర్క్షాప్ సమీపానికి వెళ్తుండగా అతను కాలు జారి కిందపడిపోయాడు. అతని దవడకు దెబ్బ తగలడంతో తిరువళ్లూరు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అక్కడ ఎలాంటి చికిత్స ఫలించక అరుణ్ కుమార్ మరణించాడు. మనవాళ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డీఆర్బీసీసీసీ హిందూ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా కొరుక్కుపేట: చైన్నె నగర శివారుప్రాంతమైన పట్టాభిరామ్లో ఉన్న ధర్మమూర్తి రావు బహదూర్ కలవల కన్నన్ చెట్టి హిందూ కళాశాల(డీఆర్బీసీసీసీ)కు ఈ విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్వయం ప్రతిపత్తి హోదా కల్పించింది. ఈ విషయాన్ని కళాశాల నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. తద్వారా కళాశాల స్వతంత్రంగా పాఠ్య ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్ను తయారు చేయవచ్చు. విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడటంతో పాటు పరీక్షల ఫలితాలు త్వరగా విడుదలవుతాయి. డిగ్రీలను మద్రాసు విశ్వవిద్యాలయం ఆమోదించి మంజూరు చేస్తుంది. డిగ్రీ, సర్టిఫికెట్ కోర్సులు తదితర వివిధ విద్యా కార్యక్రమా లను ప్రవేశపెట్టే అవకాశం కలుగుతుంది. విద్యార్థులకు ఉద్యోగావకాశాలను పెంచడానికి తోడ్పడుతుంది. ౖ కళాశాలకు తెలుగు మైనా దిటీ హోదా ఉన్నందున తెలుగు విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి ఇక్కడ చేరితే అనేక అవకాశాలుంటాయని , బీఏ తెలుగు కోర్సు చదివితే ఉద్యో గావకాశాలను కల్పించే దిశగా కొన్ని మార్పు లు, సాంకేతికతతో కూడిన సబ్జెక్ట్లను ప్రవేశపెడతామని ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి వెంకటేశ పెరుమాళ్, డైరెక్టరు డాక్టర్ ఎన్. రాజేంద్ర నాయుడు, ప్రధాన అధ్యాపకులు డాక్టర్ జి. కల్విక్కరసి పేర్కొన్నారు. బైక్ను ఢీకొన్న లారీ – దంపతుల దుర్మరణం అన్నానగర్: బైక్ను లారీ ఢీకొన్న ప్రమాదంలో గర్భిణి అయిన భార్య, భర్త దుర్మరణం చెందారు. కడలూరు జిల్లాలోని దిట్టకుడి సమీపంలో ఉన్న ఇడైచెరువాయి గ్రామానికి చెందిన జయరామన్ కుమారుడు తిరుమల్ (33). ఇతను పెరంబలూరు జిల్లాలోని డామ్ వి.కలత్తూరు పోలీస్స్టేషన్న్లో కానిస్టేబుల్. ప్రస్తుతం ఇతను పెరంబలూరు ఎస్పీ కార్యాలయంలో రైటర్గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య రమ్య (27). ఈమె ఆరు నెలల గర్భవతి. వీరికి ఒక కుమార్తె ఉంది. ఈ పరిస్థితిలో రమ్య వైద్య పరీక్ష కోసం బైకులో దంపతులు ఇద్దరు విరుదాచలం వెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని శనివారం రాత్రి పట్టణానికి తిరిగి బయలుదేరా రు. దిట్టకుడి సమీపం పట్టూరు వద్ద వెళుతుండగా లారీ బైకును ఢీకొంది. ప్రమాదంలో తిరుమల్ , రమ్య ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందా రు. పోలిసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ అస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని వ్యక్తి మృతి తిరువళ్లూరు: బైక్ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. తిరువళ్లూరు జిల్లా తిరువూరు గ్రామం జగజ్జీవన్రామ్ వీఽధికి చెందిన డానియల్బాబు(55). ఇతడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు వున్నారు. ఈ క్రమంలో తిరువూరు నుంచి తిరువళ్లూరులోని మార్కెట్ కు కూరగాయలు కొనుగోలు చేయడానికి బైక్ లో బయలుదేరాడు. పట్టణంలోని సీవీ నాయు డు రోడ్డులో వెళుతుండగా వెనుక నుంచి వచ్చి న టిప్పర్ బైక్ను డీకొంది. ఈ ప్రమాదంలో డానియల్బాబు సంఘటన స్థలంలో మృతిచెందాడు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని శవపరిక్ష నిమిత్తం తిరువళ్లూరు మెడికల్ కళాశాలకు తరలించి అక్కడ పంచనామ నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రౌడీ హత్య కేసులో ఆరుగురు అరెస్ట్ తిరువొత్తియూరు: పుదుచ్చేరి సమీపంలోని మాంబాక్కంకు చెందిన పుగలేంది అనే రౌడీ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పుగలేందిపై ఇప్పటికే హత్య, హత్యాయత్నం వంటి పలు కేసులు ఉన్నాయి. ఆయనకు, అదే ప్రాంతానికి చెందిన జార్జ్ ఫెర్నాండెజ్ అతని వర్గానికి మధ్య ఎవరు పెద్ద రౌడీ అనే విషయంలో చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. పుగలేంది తన స్నేహితుడు జయరాజ్తో కలిసి మోటార్ సైకిల్పై తిరువణ్ణామలై నుంచి తిరిగి వస్తుండగా, జార్జ్ ఫెర్నాండెజ్ ముఠా కారుతో వారిని ఢీకొట్టింది. కింద పడిపోయిన పుగ లేందిని ఆ ముఠా కత్తులతో అతి దారుణంగా నరికి హత్య చేశారు కాగా ఓ సరస్సు సమీపంలో దాగి ఉన్న ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. వారిలో జార్జ్ ఫెర్నాండెజ్ (24), రాజీ (33), దిలీప్ (25), అరవిందన్ (22), నరేష్ కుమార్ (21), అభిషేక్ (19) ఉన్నారని పోలీసులు తెలిపారు. -
జైలర్-2 తెలుగు హక్కులపై భారీ చర్చ
సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్-2 సినిమాకు తెలుగు హక్కుల ధరను రూ.60 కోట్లుగా మేకర్స్ నిర్ణయించారు. జైలర్ చిత్రం తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో దాని సీక్వెల్కు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఆ విజయాన్ని బట్టి సీక్వెల్కు భారీ రేట్లు చెప్పడం సహజమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే జైలర్కు ముందు, ఆ తర్వాత రజనీకాంత్కు తెలుగులో పెద్ద విజయాలు లేకపోవడం గమనార్హం. రజనీకాంత్ నటించిన 'కూలి' చిత్రం తెలుగు రైట్స్ రూ.52 కోట్లకు (జీఎస్టీతో కలిపి) అమ్ముడయ్యాయి. వేట్టయాన్ సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చాయి. కానీ పెద్దగా కలెక్షన్లు మాత్రం రాలేదు. ఈ లెక్కలన్నీ పరిశీలించి జైలర్-2కు రూ.60 కోట్ల రేటు ఫిక్స్ చేశారు. దాంతో జైలర్-2కు ఇంత మొత్తానికి బిజినెస్ జరుగుతుందా అనే చర్చ మొదలైంది.జూన్ 12న థియేటర్లలోకి రానున్న జైలర్-2కు ముందు రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల కానుంది. ఆ సినిమా బ్లాక్బస్టర్ అయితే జైలర్-2కు థియేటర్లు దొరకడం కష్టమవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల చివరి రేటు అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. తమిళ దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్లో విగ్రహాల స్మగ్లింగ్ చేసే సిండికేట్కు ఎదురెళ్లే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా రజనీకాంత్ కనిపించనున్నారు. ఈ కథలో ఎస్జే సూర్య కొత్త విలన్గా పరిచయం కానున్నారు. -
విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..!
చెన్నై: విమానం నుంచి దూకడం అంటే అది నిజంగా చాలా ప్రమాదకరమైన చర్య. అయినప్పటికీ, ప్రపంచంలో కొన్ని అరుదైన సంఘటనల్లో ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు తెరిచి బయటకు దూకిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు విమానం నుంచి దూకిన ఘటన చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అస్వస్థతకు గురైన ఆ ప్రయాణికుడు.. ఎమర్జెన్సీ డోర్ తెరిచి కిందికి దూకేశాడు. ఈరోజు(ఆదివారం, మే 3వ తేదీస్త్ర తెల్లవారుజామున ఎయిర్ అరేబియా విమానం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఓ ప్రయాణికుడు వాంతులు చేసుకున్నాడు. ఇలా రెండుసార్లు వాంతులు చేసుకున్న తర్వాత భయపడి పోయిన సదరు ప్రయాణికుడు.. అత్యవసర ద్వారం ఓపెన్ చేసి అక్కడ నుంచి కిందకు దూకేశాడు. విమానం ల్యాండ్ అయ్యి టాక్సీవేపై కదులుతున్న సమయంలో కాబట్టి ఆ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు విమానాశ్రయ అదికారులు తెలిపారు. ఆ ప్రయాణికుడు విమానం నుంచి దూకిన వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే స్వల్పంగా గాయపడినట్లు పేర్కొన్నారు. అతనికి ప్రాథమిక చికత్స అందించారు. ఈ ఘటనతో ప్రధాన రన్వే ఒక గంట పాటు మూసేశారు. కొన్ని విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ప్రయాణికుడు విమానంలో రెండు సార్లు వాంతులు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. ఇది అతని మానసిక, శారీరక స్థితి ప్రభావం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంచితే, సాధారణంగా బలమైన లాకింగ్ సిస్టమ్ ఉండే ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు ఎలా తెరవగలిగాడు? అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. భద్రతా లోపాలు ఉన్నాయా? అనే కోణంతో పాటు ప్రయాణికుడి మానసిక స్థితిని పరీక్షీస్తున్నారు. -
బాలికను బెదిరించి లైంగికదాడి
అన్నానగర్: విల్లుపురం జిల్లా, కొంగంపట్టు నివాసి అయిన రజినీశంకర్ (25) వివాహితుడు. ఇతను చైన్నెలోని ఆదాంబాక్కంలో అద్దె ఇంట్లో ఆన్లైన్ డెలివరీ వర్కర్గా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి ఓ మహిళ ఆ ఇంట్లో పనిచేస్తోంది. 27వ తేదీన ఆ మహిళ అనారోగ్యం పాలవడంతో, రజినీశంకర్ ఐటీఐ చదువుతున్న తన 17 ఏళ్ల కుమార్తెను ఆమె స్థానంలో పనిమనిషిగా పంపించింది. విద్యార్థిని ఆదాంబాక్కంలోని రజనీశంకర్ ఇంట్లో పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆ తర్వాత అతను ఆ విద్యార్థినిని బైకుపై ఆమె ఇంటికి తీసుకెళ్లాడు. అంతకు ముందు, రజనీశంకర్ తన సోదరుడి ఇంటి నుంచి ఏదో తీసుకురావాలని చెప్పి ఆమెను బైకుపై తీసుకెళ్లాడు. సోదరుడి ఇంట్లో విద్యార్థినిని బెదిరించి, లైంగికదాడి చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థిని ఈ విషయం తన తండ్రికి చెప్పి ఏడ్చింది. అనంతరం, మడిపాక్కం ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా, మహిళా పోలీసులు రజినీ శంకర్ను అరెస్టు చేసి విచారించారు. విచారణలో, అతను విద్యార్థినిని బెదిరించి బలవంతంగా లైంగికదాడి చేసినట్లు తెలిసింది. దీని తర్వాత, పోలీసులు పోక్సో సెక్షన్ కింద కేసు నమోదు చేసి రజనీశంకర్ను అరెస్టు చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
క్లుప్తంగా
సంగీతం అర్థం చేసుకోవాలి కొరుక్కుపేట: సంగీతం కేవలం నేర్చుకుంటే సరిపోదని దాన్ని అర్థం చేసుకోవాలని మ్యూజికాలజిస్ట్ డాక్టర్ ఎస్ఎల్ రమేష్ అన్నారు. చైన్నె వేదికగా పృథ్వి సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ ఎల్ఎస్.రమేష్ ప్రత్యేక సంగీత కార్యక్రమం జరిగింది. ఇందులో ఆయన కర్ణాటక సంగీతంలోని కొన్ని రాగాలు, వెస్ట్రన్ నోట్స్లోని స్కేల్స్ తో అతి సులువుగా మ్యూజిక్ కంపోజ్ ఎలా చేయొచ్చో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఐఐటీ డిప్యూటీ డైరెక్టర్.సెంథిల్ గారు, ఎస్పీ.వసంతలక్ష్మి, బాలాంత్రపు లావణ్య దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పృథ్వీ సంస్థ వ్యవస్థాపకులు, డైరెక్టర్ శివకుమార్, కళైమామణి మాధవపెద్ది రమణమూర్తి, తమిళ రచయిత.ఇళంగోవన్ పాల్గొన్నారు. బస్సు కింద పడి చిన్నారి మృతి తిరువొత్తియూరు: ధర్మపురి జిల్లాలో ఇంటి ముందు అనుకుంటున్న 2 ఏళ్ల చిన్నారి బస్సు చక్రం కింద పడి మృతి చెందింది. ధర్మపురి జిల్లా, పాలకోడ్ సమీపంలోని స్వామియార్ నగర్ ప్రాంతానికి చెందిన కూలీ కార్మికులు కుమార్ – కావ్య దంపతుల 2 ఏళ్ల కుమార్తె వినోదిని. ఈ చిన్నారి తన ఇంటి ముందు ఆడుకుంటోంది. పాలకోడ్ బస్సు నిలయం నుండి బెల్ రాంపట్టికి వెళ్లాల్సిన 19వ నంబర్ సిటీ బస్సు పాడవడంతో, దానికి బదులుగా 4వ నంబర్ బస్సును నడిపారు. ఆ బస్సు స్వామియార్ నగర్ ప్రాంతంలో వెళ్తుండగా, ఇంటి ముందు ఆడుకుంటున్న వినోదినిపై బస్సు వెనుక చక్రం ఎక్కింది. దీంతో ఆ చిన్నారి తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. సమాచారం అందుకున్న మారండహళ్లి పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.కారు ఢీకొని ఇద్దరు.. తిరువొత్తియూరు: కారు ఢీకొని ఇద్దరు మహిళలు మృతిచెందారు. బైక్ నడుపుతున్న వ్యక్తి కాలు తెగిపోయింది. కడలూరు జిల్లా బన్రూటి సమీపం ఉరైయూర్కు చెందిన రంజిత (28), మల్లిక (28). వీరిద్దరూ కీరైకొల్లైలోని ముంత మామిడి తోటల్లో జీడిపప్పు వలిచే కూలీలు. వీరు ప్రతిరోజూ బస్సులో కొల్లుకారన్కుటైకి వెళ్లి అక్కడి నుంచి తమతో పాటు పనిచేసే కాడాంబులియూర్ గ్రామానికి చెందిన అరుణ్ (45) అనే వ్యక్తి బైక్లో తోటలకు వెళ్లేవారు. శనివారం యథావిధిగా బైక్ వెళుతుండగా కీరైకొల్లై బస్టాప్ సమీపంలో అరుణ్ బైక్ను కుడివైపునకు తిప్పాడు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంజిత, మల్లిక అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ నడుపుతున్న అరుణ్ కాలుపూర్తిగా తెగిపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు కారు డ్రైవర్ను అరెస్టు చేయాలని కోరుతూ రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేశారు. పిడగు పడి 10 మందికి గాయాలు అన్నానగర్: మంగళాదేవి కన్నగి ఆలయంలో చిత్తిరై తిరువిళ్ ఉత్సవం జరుగుతుండగా పిడుగుపడి 10 మంది గాయపడ్డారు. తేని జిల్లాలోని కూడలూరు సమీపంలో తమిళనాడు–కేరళ సరిహద్దులో మంగళాదేవి కన్నగి ఆలయం ఉంది. ఆలయంలో చిత్తిరై తిరువిల్ ఉత్సవం శుక్రవారం జరిగింది. ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలు జరుగుతుండగా ఆలయం వద్ద పిడుగు పడింది. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన సాయుధ పోలీసు అధికారి అన్సార్, కేరళకు చెందిన శ్రీలక్ష్మి చేతికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే కేరళ వైద్య కళాశాలలో చేర్పించారు. ఎస్ఐను కత్తితో బెదిరించిన యువకుడి అరెస్ట్ తిరువొత్తియూరు: గుమ్మడి పూండి సమీపంలో సబ్ ఇన్స్పెక్టర్కు కత్తిని చూపి బెదిరింపులు ఇచ్చిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని రెట్టాంబెడు నుండి చోళవరం వైపు వెళ్లే రహదారిపై శుక్రవారం సబ్ ఇన్స్పెక్టర్ బలరామన్ , కానిస్టేబుల్ దినేష్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా రోడ్డు పక్కన నిలబడి ఉన్న చిన్న చోళవరం గ్రామానికి చెందిన పాత నేరస్తుడు సంతోష్ (23)ని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద గంజాయి వున్నట్టు తెలిసింది. దీంతో అతని వద్ద 100 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతనిని విచారణ చేస్తున్న సమయంలో సంతోష్ కత్తితో సబ్ ఇన్స్పెక్టర్ బలరామన్ను చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం. ఫిర్యాదుపై గుమ్మిడిపూండి పోలీసులు సంతోష్ను అరెస్టు చేశారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
చెట్టినాడ్ డాక్టర్ మీనా ముత్తయ్య కన్నుమూత
సాక్షి, చైన్నె : చెట్టినాడ్ రాజకుటుంబానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, కుమార రాణి డాక్టర్ మీనా ముత్తయ్య(91) శనివారం కన్నుమూశారు. ఆమె మరణంపై సీఎం ఎం.కె. స్టాలిన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వివరాలు.. 1934 సెప్టెంబర్ 25న జన్మించిన డాక్టర్ మీనా ముత్తయ్య దాతృత్వానికి , విద్యా సేవకు మారుపేరైన రాజరీక కుటుంబం నుండి వచ్చారు. అన్నామలై విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు డాక్టర్ రాజా సర్ అన్నామలై చెట్టియార్కు ఆమె మనవరాలు. అలాగే డాక్టర్ ఎం.ఏ.ఎం. ముత్తయ్య చెట్టియార్కు భార్య. ఆమె క్వీన్స్ మేరీస్ కాలేజీ నుండి ఎకనామిక్స్లో బీఏ, హిస్టరీలో ఎంఏ పట్టా పొందారు. ఆమె నాయకత్వంలో చెట్టినాడ్ విద్యాశ్రమం చైన్నెలోనే అత్యంత ప్రసిద్ధ విద్యా సంస్థలలో ఒకటిగా ఎదిగింది. ఉన్నత విద్యకు ప్రోత్సాహం పాఠశాల విద్యతోనే ఆగకుండా, కుమారరాణి మీనా ముత్తయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ను స్థాపించి ఉన్నత విద్యను సైతం విస్తరించారు. చారిత్రక తంజావూరు చిత్రకళకు ఆమె మళ్లీ ప్రాణం పోశారు. తంజావూరు పెయింటింగ్స్ మూలాలు, వాటి అభివృద్ధిపై ఆమె డాక్టరేట్ పూర్తి చేశారు. పెరియార్ మణియమ్మై విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ ప్రదానం చేసింది. లివింగ్ క్రాఫ్ట్ ట్రెజర్ అవార్డు తంజావూరు పెయింటింగ్ను ప్రోత్సహించినందుకు గానూ తమిళనాడు ప్రభుత్వానికి చెందిన ’పూంబుహార్ ’ సంస్థ 2016–17 సంవత్సరానికి లివింగ్ క్రాఫ్ట్ ట్రెజర్ ప్రతిష్టాత్మక అవార్డును అందించింది. 2018లో జరిగిన మద్రాస్ వీక్ వేడుకల్లో ఆమెను ఈ గౌరవంతో సత్కరించారు.డాక్టర్ మీనా ముత్తయ్య విద్యతో పాటు అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ‘సీజన్ ఆఫ్ షేరింగ్‘ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో సేవాభావాన్ని పెంపొందించారు. అన్నామలై పాలిటెక్నిక్ భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ అక్షరాస్యతను ప్రోత్సహించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కనడుకాతన్లో ’కుమారరాణి మీనా ముత్తయ్య మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్’ను ఏర్పాటు చేశారు. విద్యా, కళా, సామాజిక రంగాల్లో ఆమె చేసిన అపారమైన సేవలను స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు. సీఎం నివాళి సీఎం స్టాలిన్ ఎక్స్పేజీ వేదికగా నివాళులర్పించారు. వ్యక్తిగతంగా కూడా ఆమె తమ కుటుంబంతో ఎంతో మంచి స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారన్నారు. గత 2018వ సంవత్సరంలో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా ఆమె హాజరై ప్రసంగించారని గుర్తు చేస్తూ, కుమారరాణి మీనా ముత్తయ్య మరణం భర్తీ చేయలేనిదని పేర్కొన్నారు. ఆమె మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు, ఆమె స్థాపించిన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ముఖ్యమంత్రి స్టాలిన్ తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. -
ఓట్ల లెక్కింపు న్యాయబద్ధంగా చేపట్టాలి
సాక్షి, చైన్నె : ఓట్ల లెక్కింపు ప్రక్రియ న్యాయ బద్ధంగా జరగాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను టీవీకే విజ్ఞప్తి చేసింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని, ఈ కేంద్రాలకు ఒక కి.మీ దూరం నుంచే ఇతరులను అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ఫలితాల లెక్కింపు రోజున, ఆ తర్వాత అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలు, తదుపరి చర్యలపై టీవీకే అధినేత విజయ్ కేడర్కు శుక్రవారం దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఏ సమయంలోనైనా సరే, వెంటనే పనయూర్కు వచ్చి తనను కలవాలి అని విజయ్ సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు , అభ్యర్థులు నిర్మల్కుమార్, సెంగోట్టయన్, విల్సన్,ఆధవ్ అర్జున వంటి నేతలు తమ సూచనలు ఇచ్చారు. ఎన్నికల ఫలితాల సమయంలో డీఎంకే అసాధారణ పరిస్థితులను సృష్టించే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఓటమి భయంతో డీఎంకే ఏదైనా చేయవచ్చు అని అలెర్ట్ చేశారు. అలాగే, ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత న్యాయంగా, పారదర్శకంగా జరగాలని కోరుతూ ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందజేయడమే కాకుండా, టీవీకే నాయకులు, కార్యకర్తలకు అదనపు భద్రత కల్పించాలని డీజీపీకి లేఖ పంపించారు. ఇక, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవాలను ప్రతిబింబించడం లేదని, 4వ తేదీ ఫలితాలలో ప్రజా తీర్పు కీలకం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించడం గమనార్హం. భద్రత పెంచాలి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 62 ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించాలని, లెక్కింపు కేంద్రాల చుట్టూ ’స్టైరెల్ జోన్’ ఏర్పాటు చేయాలని టీవీకే ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున కోరారు. ఈ మేరకు ఆయన తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి శివజ్ఞానంలను రాష్ట్ర సచివాలయంలో కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. స్టైరెల్ జోన్ ఏర్పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడడానికి ప్రతి లెక్కింపు కేంద్రం చుట్టూ కిలోమీటరు పరిధిలో ప్రజలు గుమిగూడకుండా ఆంక్షలు విధించాలని (స్టైరెల్ జోన్ ఏర్పాటు చేయాలని) లేఖలో కోరారు. ఇప్పటికే శ్రీరంగం నియోజకవర్గంలోని 139వ నంబర్ టీవీకే పార్టీ కార్యాలయానికి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని, ఈ ఘటన ప్రింట్ , విజువల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైందని ఆధవ్ అర్జున గుర్తు చేశారు. టీవీకే పార్టీకి చెందిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా అడ్డుకోవడానికి, కౌంటింగ్ కేంద్రాల వద్ద అలజడులు సృష్టించడానికి కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రణాళికలు వేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులోని మొత్తం 62 కౌంటింగ్ కేంద్రాల వద్ద తగినంత మంది సాయుధ పోలీసు సిబ్బందితో పటిష్టమైన భద్రత కల్పించాలని, కౌంటింగ్ కేంద్రాల వద్ద టీవీకే అభ్యర్థులు, ఏజెంట్ల వ్యక్తిగత భద్రతకు భరోసా కల్పించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు పారదర్శకంగా, శాంతియుతంగా వెలువడేలా ఈ విషయాన్ని అత్యంత అత్యవసరమైనదిగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా విజయ్ శనివారం వేలంకన్ని, నాగుర్ దర్గాలను సందర్శించనున్నట్టు తెలిసింది. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో చివరకు ఆ పర్యటనను విజయ్ రద్దు చేసుకున్నట్టు సమాచారం. ఎన్నికల అధికారికి వినతి పత్రం ఇచ్చి వస్తున్న ఆధవ్ అర్జున, విజయ్ -
తమిళనాట మరో సంచలన సర్వే
సాక్షి, చెన్నై: తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ మరో ఎంజీఆర్ అయ్యేనా అన్నది మరికొన్ని గంటల వ్యవధిలో తేలనుంది. ఈ నేపథ్యంలో మరో ఎగ్జిట్ పోల్లోనూ విజయ్కే అధికారం ఖాయం అని స్పష్టం కావడం చర్చనీయాంశమైంది. వివరాలు.. తమిళనాడులో మెజారిటీ సర్వే సంస్థలు అధికార డీఎంకేకు అనుకూలంగా ఫలితాల్ని ఇచ్చాయి.అయితే యాక్సిస్ మై ఇండియా, మరికొన్ని స్థానిక చిన్న సంస్థలు, సామాజిక మాధ్యమాలో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం వైపే ప్రజలు మొగ్గు చూపారని స్పష్టం చేస్తున్నాయి. ఈ సమయంలో శనివారం మాజీ ఐపీఎస్ అధికారి పి. రవి బృందం నిర్వహించిన నియోజకవర్గాల వారీగా ఎగ్జిట్ పోల్ సర్వే ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. విజయ్ పార్టీకి 121 స్థానాలు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పి. రవి బృందం తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమగ్రంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వే అంచనా ప్రకారం, విజయ్ నాయకత్వంలోని టీవీకే ఏకంగా 41 శాతం ఓట్లను సాధించి, 121 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత, ముఖ్యంగా 18–40 ఏళ్ల వయస్సు గల ఓటర్లు టీవీకే వైపు బలంగా నిలిచారని ఈ నివేదిక పేర్కొన్నారు.ఐదు దశాబ్దాల ఆధిపత్యానికి బ్రేక్ సుమారు ఐదు దశాబ్దాలుగా తమిళనాడును పాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల కంటే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ వైపు యువ ఓటర్లు ఎక్కువగా ఆకర్షితులయ్యారని ఈ సర్వే విశ్లేషించడం గమనార్హం. ఇక యాక్సిస్ మై ఇండియా విజయ్ పార్టీకి 98 నుండి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే తెలిపింది. మాజీ ఐపీఎస్ పి. రవి టీమ్ సర్వేతో పాటూ యాక్సిస్ మై ఇండియా సర్వేలు విజయ్కు అనుకూలంగా రావడంతో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు అప్రమత్తమయ్యాయి. మే 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తమ ఏజెంట్లు, అభ్యర్థులకు సూచించాయి. -
కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు సిద్ధం
వేలూరు: వేలూరు జిల్లాలోని ఐదు కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. వేలూరు జిల్లాలోని వేలూరు, అనకట్టు, కాట్పాడి, కేవీ కుప్పం, గుడియాత్తం అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన ఈవీఎంలను వేలూరు తందైపెరియార్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. అదేవిధంగా ఈనెల 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి సుబ్బలక్ష్మి నేరుగా పరిశీలించి వసతులపై సంబంధిత అధికారుల వద్ద ఆరా తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పార్టీ ఏజెంట్లుగా నియమించరాదన్నారు. గుర్తింపు కార్డును చూపించి లోనికి వెళ్లే విధంగా చూడాలన్నారు. గుర్తింపు కార్డు లేకుంటే ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించవద్దన్నారు. -
కౌంటింగ్ ఏర్పాట్లు వేగవంతం
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 24 గంటలే సమయం ఉంది. దీంతో ఏర్పాట్లను వేగవంతం చేశారు. శనివారం ఏర్పాట్లను ప్రత్యేక పర్యవేక్షకులు, పోలీసు అధికారులు పరిశీలించారు. గత నెల 23వ తేదీన జరిగిన పోలింగ్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. 5.73 కోట్ల మంది ఓటర్లలో రికార్డు స్థాయిలో 85 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో యువత పెద్ద ఎత్తున తరలిరావడంతో ఓటింగ్ శాతం 90 శాతానికి పైగా నమోదైంది. 62 కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాటు: రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 62 ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలన్నీ ప్రస్తుతం కేంద్ర భద్రతా దళాల పూర్తి ఆధీనంలో ఉన్నాయి. ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్లను ఉంచిన 234 స్ట్రాంగ్ రూములకు 4 అంచెల పటిష్టమైన భద్రతను కల్పించారు. స్ట్రాంగ్ రూముల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించడానికి సీసీటీవీ, టీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆయా కేంద్రాలలో నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ ఏర్పాట్లు వేగవంతం చేశారు. అలాగే, ఎన్నికల ఫలితాల వేళ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు తమిళనాడు పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది పోలీసులను భద్రతా విధుల్లో నిమగ్నం చేశారు. చైన్నె నగరంలోనే 20,000 మంది పోలీసు అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. కాగా ఎన్నికల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడులోని ఒక్కో నియోజకవర్గానికి ఒకరు చొప్పున 234 మంది రాష్ట్రేతర పరిశీలకులను నియమించింది. వీరందరూ శనివారం తమిళనాడుకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను, లెక్కింపు సన్నాహాలను పర్యవేక్షించారు. -
పుదుచ్చేరి కిరీటం ఎవరికి?
సాక్షి, చైన్నె : ఎప్పుడూ వేగంగా రాజకీయ సమీకరణాలు మారే పుదుచ్చేరిలో ఈసారి మళ్లీ ముఖ్యమంత్రి రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో ఇక్కడ విజయ్ టీవీకే ఓట్లు చీల్చేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే రంగన్న మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టకుండా బీజేపీ ఎలాంటి అడ్డంకులు సృష్టించేనో అన్న చర్చ ఊపందుకుంది. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అధికారం చేపట్టేందుకు 16 స్థానాలు అవసరం. ఈసారి ఎన్డీయే కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోబోతోందని ప్రధాన సర్వేలు అంచనా వేస్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా ఎన్డీఏ కూటమికి 16 – 20 , ఇండియా కూటమికి 6 – 8, విజయ్ టీవీకేకు 2 – 4, ఇతరులకు 1 – 3 సీట్లు వస్తాయని ప్రకటించాయి. అలాగే ప్రజాపోల్ ఎన్డీఏకు 19 – 25, ఇండియా కూటమికి 6 – 10 , పీపుల్స్ పల్స్ ఎన్డీఏకు 16 – 19, ఇండియా కూటమికి 10 – 12, విజయ్ టీవీకేకు 1, ఇతరులకు 1 – 2 వస్తాయని ప్రకటించారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో, తన మాస్ రాజకీయంతో ప్రజల్ని ఆకర్షించడంలో సీఎం , ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి సఫలీ కృతులయ్యారు. అన్ని వయసుల వారిలో, ముఖ్యంగా మహిళలు , వయోజన ఓటర్లలో రంగస్వామిపై ఆదరణ చూపించారని సర్వేలు తేల్చాయి. ఇక, ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన అంశం నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం తొలి ఎన్నికల్లోనే ఒంటరిగా బరిలోకి దిగిన 1–4 స్థానాలు గెలుచుకోవచ్చు అని కొన్ని సర్వేలు తేల్చడం గమనార్హం. రంగన్న సీఎం అయ్యేనా గత 2021 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 16 స్థానాలు గెలుచుకుని అధికారాన్ని దక్కించుకోగా, ఈసారి కూడా అదే జోరును కొనసాగించేలా కనిపిస్తున్నది. ఈ ఎన్నికల్లో రంగస్వామికి చెందిన ఎన్ఆర్ కాంగ్రెస్ 16 స్థానాల్లో, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేశాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్ 16 స్థానాల్లో, డీఎంకే 14 స్థానాల్లో బరిలోకి దిగాయి. పుదుచ్చేరిలో మరోసారి రంగస్వామి సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, సీఎంగా రంగస్వామి కొనసాగేనా అన్న చర్చ తెర మీదకు వచ్చింది. ఎవరికి ఎన్ని సీట్లు అధికంగా వస్తాయో వారే సీఎం అభ్యర్థి అని, ఎవరు సీఎం సీటులో కూర్చోవాలో అన్నది కేంద్రం నిర్ణయిస్తుందని పదే పదే బీజేపీ స్థానిక నేతలు పేర్కొంటూ రావడం గమనార్హం. ఇక్కడ బీజేపీకి ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యే ఉండటం కలిసి వచ్చే అంశంగా మారింది. దీంతో సీఎం ఎవరు ఉంటారో? అన్న చర్చ ఇప్పడే ఊపందుకుంది. అదే సమయంలో రంగస్వామిని కాదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరేదైనా వ్యూహ రచన చేసిన పక్షంలో పాత మిత్రుడైన డీఎంకేతో పాటుగా ఇతరులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్లాన్–బీని రంగన్న సిద్ధం చేసుకున్నట్టుగా ఇప్పటికే సంకేతాలు వెలువడటం గమనార్హం. సీఎం ఎవరన్నది పక్కన పెడితే, పుదుచ్చేరిలోనూ విజయ్ పాదం మోపడం, తన బలాన్ని చాటే విధంగా ఓట్లను చీల్చే అవకాశం ఉందని సర్వేలు పేర్కొంటుండటం ఆహ్వానించ దగిన విషయమే. ఇక ఈ ఎన్నికలలో వైద్యలింగం నేతృత్వంలో ఇండియా కూటమి ముందుకెళ్లినా, కాంగ్రెస్, డీఎంకే మధ్య సక్యత కొరవడటం మళ్లీ అధికారాన్ని ఈ కూటమి కోల్పోవాల్సిన పరిస్థితి రావడం గమనార్హం. -
రిలీజ్ కాకముందే అవార్డు
తమిళసినిమా: కొన్ని చిత్రాలు థియేటర్లోకి రాకముందే ప్రపంచస్థాయిలో గుర్తింపును పొందుతాయి. అలాంటి వాటిలో తాజాగా చోటు సంపాదించుకున్న చిత్రం ఎన్నవిలై. అవును ఈ చిత్రం గత ఏప్రిల్ 30వ తేదీన ఢిల్లీలో జరిగిన దాదా సాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో తమిళ చిత్రాల కేటగిరీలో ఉత్తమ స్క్రీన్ప్లే అవార్డును గెలుచుకుంది. దీని గురించి చిత్ర దర్శక నిర్మాతలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కళామయ ఫిలిమ్స్ పతాకంపై కేథేష్.వి నిర్మించిన ఈ చిత్రానికి సజీవ్ పళూర్ దర్శకత్వం వహించారు. కరుణాస్, నిమీషా సజయన్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో వైజీ మహేంద్రన్, పూర్ణిమాభాగ్యరాజ్, మోహన్రామ్, సొల్లుసభ స్వామినాథన్, దీపా శంకర్, మొట్టై రాజేంద్రన్, నక్సలైట్లు కవి ముఖ్యపాత్రలు పోషించారు. అవార్డులకు రివార్డుల మధ్య దూరాన్ని తగ్గించే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రం ఎన్న విలై. ఈ చిత్రం విడుదలకు ముందే దాదా సాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ స్క్రీన్ప్లే అవార్డును గెలుచుకోవడం గర్వంగా ఉంది. సామాజిక రాజకీయ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్ర షూటింగ్ను 56 ప్రదేశాల్లో నిర్వహించాం. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. -
కామెడీగా పరిమళ అండ్ కో
తమిళసినిమా: ఇప్పటివరకు కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పాండిరాజ్ తాజాగా కామెడీ, డ్రామా నేపథ్యంలో చిత్రం చేయడం విశేషం. ఈ చిత్రానికి పపరిమళ అండ్ కో అనే టైటిల్ నిర్ణయించారు. ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న తలైవన్ తలైవి చిత్రం తర్వాత పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. దీన్ని లైట్ ఆఫ్ ప్రొడక్షన్న్స్ అధినేత సుభాష్కరన్, తమిళ్ కుమరన్ ప్రొడక్షన్న్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత తమిళ్కుమరన్, పసంగ ప్రొడక్షన్న్స్ అధినేత పాండిరాజ్ కలిసి నిర్మించడం విశేషం. పాండిరాజ్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో జయరాం, ఊర్వశి ప్రధాన పాత్రలు పోషించగా సంతోష్ శోభన్ కీలకపాత్రను పోషించారు . ఆయనకు జంటగా సంజనాకష్ణమూర్తి నటించగా, మరో జంటగా చండీ, ఆనందిక నటించారు. దర్శకుడు మిష్కిన్ వైవిధ్య విభిన్నమైన పాత్రలో పోషించారు. చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ మేడే సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. చైన్నె, కోయంబత్తూర్ నుంచి పాలక్కాడు వరకు పయనించే థ్రిల్లర్ కామెడీ కథా చిత్రంగా పరిమళ అండ్ కో ఉంటుందన్నారు. త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. పరిమళ అండ్ కో ఫస్ట్లుక్ పోస్టర్ -
జబల్పూర్ ఘటనలో ఐదుగురు తమిళుల మృతి
సాక్షి, చైన్నె: వేసవి సెలవులలో ఆనందంగా గడిపేందుకు వెళ్లిన తమిళనాడుకు వారు మధ్య ప్రదేశ్లో మరణించిన సమాచారం తిరుచ్చి, కోయంబత్తూరులలోని బంధువులలో విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉన్న బర్గి డ్యామ్ వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తమిళులు జలసమాధి అయ్యారు. ఈ విషాద ఘటన తమిళనాడులోని తిరుచ్చి , కోయంబత్తూరు ప్రాంతాల్లో తీవ్ర శోకాన్ని నింపింది. కోయంబత్తూరు వాసులు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ తుపాకుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కామరాజ్ ఆహ్వానం మేరకు, కోయంబత్తూరుకు చెందిన అతని అన్నయ్య పరి మేళలగన్ తన భార్యాపిల్లలు వేసవి సెలవుల కోసం జబల్పూర్ పంపించాడు. తన తమ్ముడితో తన కుటుంబ సభ్యులంతా కలిసి బర్గి డ్యామ్ను సందర్శించేందుకు వెళ్లారు. డ్యామ్ అందాలను చూసేందుకు వీరంతా సుమారు 40 మంది పర్యాటకులతో కలిసి ఓ పడవ ఎక్కారు. పడవ ప్రయాణం మొదలైన మొదటి 300 మీటర్లు ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. అయితే, అకస్మాత్తుగా సుడిగాలి తరహాలో వీచిన బలమైన గాలుల వల్ల పడవ ఒక్కసారిగా నీటిలో బోల్తా పడింది. పడవ బోల్తా పడటంతో అందులోని వారంతా నీటిలో పడిపోయారు. లైఫ్ జాకెట్లు ధరించిన వారు నీటిపై తేలుతూ ప్రాణాల కోసం పోరాడగా, జాకెట్లు సరిగ్గా లేని వారు , ధరించని వారు నెమ్మదిగా నీటిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో కామరాజ్ (39) తిరుచ్చి జిల్లా నవలపట్టుకు చెందిన వ్యక్తి (మధ్యప్రదేశ్ ఫ్యాక్టరీ ఉద్యోగి), ఆయన భార్య కరుక్కాళి (38), ఆయన చిన్న కుమారుడు తమిళ్వేందన్ (5) మరణించారు. అలాగే, కామరాజర్ ఆహ్వానం మేరకు కోయంబత్తూరు నుంచి వెళ్లిన సోదరుడు పరి మేళలగన్ భార్య సౌభాగ్యవతి,ఆమె కుమారుడు మయూరన్(8) మరణించారు. కామరాజ్ పెద్దకుమారుడు పువి తరుణ్(11), సోదరుడు పరిమేళలగన్ కుమార్తె తమిళిని (7)ను రక్షించారు. కన్నీరు మున్నీరైన ఐటీ ఉద్యోగి కోయంబత్తూరులోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న పరిమేలళగన్, తన భార్యాపిల్లలు క్షేమంగా తిరిగి వస్తారని ఆశించాడు. కానీ భార్య , కుమారుడి మృతదేహాలను చూసి ఆయన కన్నీరు మున్నీరయ్యారు. ప్రాణాలతో బయటపడిన తన కుమార్తె తమిళినిని , సోదరుడి పెద్ద కుమారుడు పువితరణ్ను గుండెలకు హత్తుకుని రోదించిన తీరు అక్కడ ఉన్న వారిని కలిచివేసింది. ఈ ఇద్దరికీ పరిమేళలగన్ పెద్ద దిక్కు అయ్యాడు. వీరి మృత దేహాలను ఎయిర్ అంబులెన్స్ ద్వారా తమిళనాడులోని తిరుచ్చికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఇక్కడున్న ఆప్తులు, కుటుంబీకులు తీవ్ర శోకంలో మునిగారు. -
చైన్నె అమృతలో ఎయిర్ఏషియా క్యాంపస్ రిక్రూట్మెంట్
సాక్షి, చైన్నె: చైన్నె నగరంలోని చైన్నె అమృత ఇంటర్నేషనల్ ఏవియేషన్ కాలేజీలో ఎయిర్ఏషియా క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను తొలిసారిగా నిర్వహించిందని ఆ ఇన్స్టిట్యూట్ ఛైర్మెన్ భూమినాథన్ తెలిపారు. ఈ విషయంపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తొలిసారిగా, ఎయిర్ఏషి యా చైన్నెలోని అమృతలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను నిర్వహించి, చైన్నెలో విమానయాన పరిశ్రమ సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయిని నెలకొల్పిందన్నారు. ఆసియాలోని ప్రముఖ విమానయాన సంస్థలలో ఒకటైన ఎయిర్ఏషియా సంస్థ విద్యార్థులకు నేరుగా ఉద్యోగ అవకాశాలను అందిస్తుందన్నారు. విమానయాన, ఆతిథ్య విద్యారంగంలో నిరూపితమైన ట్రాక్ రికార్డుతో, చైన్నెకి చెందిన అమృత 31,651 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించిందన్నారు. కార్యక్రమంలో, కౌలాలంపూర్లోని ఎయిర్ఏషియా రెడ్క్యూ, ఏఓసి లైన్ మెయింటెనెనన్స్ విభాగాధిపతి శరవణన్ రాజ్ మునుస్వామి , విద్యార్థులతో సంభాషించి, విమానయాన వృత్తులు, కార్యాచరణ నైపుణ్యం, ఎయిర్ఏషియాలోని అంతర్జాతీయ అవకాశాలపై అవగాహన పెంచారు. క్యాంపస్ డ్రైవ్లో ఎంపికై న అభ్యర్థులు ఎయిర్ఏషియాలో 6 నెలల ఇంటర్న్షిప్ తో పనితీరు ఆధారంగా తక్షణ ఉద్యోగ అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైన్నె అమృత ఛైర్మెన్ భూమినాథన్ సమక్షంలో మలేషియా మాజీ మంత్రి, పెరాక్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ డాటో సెరి డాక్టర్. ఎస్.కె. దేవమణి చేతులమీదుగా చైన్నె అమృతలో కొత్త ఆడిటోరియాన్ని ప్రారంభించారు. -
శేష వాహనంపై పార్థసారథి
కొరుక్కుపేట: చైన్నెలోని ట్రిప్లికేన్ పార్థసారథి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శనివారం శేష వాహనంపై కొలువుదీరి స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. భక్తులు స్వామికి కర్పూర హారతులు పట్టి దర్శించుకున్నారు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య అన్నానగర్: చెంగల్పట్టు జిల్లా సింగపెరుమాళ్ ఆలయం పక్కన ఉన్న శెట్టిపునియాం గ్రామానికి చెందిన వినాయకం అలియాస్ వైల్లె (30) డ్రైవర్. ఇతనికి రాజ్ అనే ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. అతను గ్రామంలోని పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం, వేసవి సెలవుల్లో యువరాజ్ ఇరుగుపొరుగు పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో, ఇంటి వెనుక ఆడుకుంటున్న యువరాజ్ అనుకోకుండా అక్కడి బావిలో పడిపోయాడు. కొడుకును కోల్పోయానేమోనని కలకలం చెందిన వినాయగం, అతని కోసం చాలా చోట్ల వెతికింది. అప్పుడు, బావి దగ్గర యువరాజ్ చెప్పులు పడి ఉండటం చూసి, అనుమానంతో బావి వైపు వెతకగా, అతను చనిపోయి కనిపించాడు. పొరుగువారి సహాయంతో యువరాజు మృతదేహాన్ని వెలికితీసి ఖననం చేశారు. కుమారుడి మరణంతో వినాయగం తీవ్ర దుఃఖానికి లోనయ్యాడు. ఈ పరిస్థితిలో అతను శనివారం అదే బావిలోకి దిగడానికి ఉపయోగించే రెండు నల్లరాతి స్తంభాల మధ్య లుంగీతో ఉరి వేసుకున్నాడు. సింహ పెరుమాళ్ ఆలయ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడు పుష్ప పల్లకీలతో భవని
వేలూరు: చిత్ర పౌర్ణమిని పురస్కరించుకుని వేలూరులో జలకంఠేశ్వరాలయం నుంచి వివిధ విద్యుత్ దీపాలంకరణ మధ్య శుక్రవారం రాత్రి ఏడు పుష్ప పల్లకీలతో కూడిన భవని వచ్చింది. ప్రతి సంవత్సరం చిత్ర పౌర్ణమి రోజున వేలూరులో వివిధ వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో పుష్ప పల్లకీలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయం అద్వర్యంలో అకిలాండేశ్వరి సమేద జలకంఠేశ్వరుడి పుష్ప పల్లకీ, బియ్యం మండీ వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో సేన్బాక్కం సెల్వ వినాయకుడి పుష్ప పల్లకీ, బెల్లం మండీ వ్యాపారుల సంఘం నేతృత్వంలో తోటపాళ్యం తారకేశ్వరర్ పుష్ప పల్లకీ, వనిగర్ సంఘం ఆధ్వర్యంలో సుందర వినాయకుడి పుష్ప పల్లకీ, పూల మండీ వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో లక్ష్మి వినాయకుడి పుష్ప పల్లకీ సహా మొత్తం ఏడు పుష్ప పల్లకీలను కోట మైదానం వద్దకు తీసుకొచ్చి వివిధ విద్యుత్ దీపాలతో అలంకరించి పట్టణంలోని లాంగ్ బజారులో భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం పిల్టర్బెడ్ రోడ్డు, బజారు వీధి తదితర ప్రాంతాల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి కోట మైదానం ఊరేగింపు చేరుకుంది. వీటిని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా రాత్రి 12 గంటల వరకు పట్టణంలో మూడు చోట్ల ఆర్కే స్ట్రా ఏర్పాటు చేసి భక్తులను ఆకట్టుకుంది. -
డీఎంకే హెల్ప్ డెస్క్ సేవలు
సాక్షి, చైన్నె: కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించేందుకు , వారికి సహాయం చేసేందుకు డీఎంకే విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. దీనిని శనివారం అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ప్రారంభించారు. వివరాలు.. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ హెల్ప్ డెస్క్ పనిచేయనుంది. దరఖాస్తులు నింపడం, సరైన కళాశాలను ఎంచుకోవడం ఉన్నత విద్యకు సంబంధించిన సలహాలు, సూచనలను ఈ కేంద్రం ద్వారా విద్యార్థులకు ఉచితంగా అందిస్తారు. అందరికీ ఉపయోగపడేలా సేవలు డీఎంకే విద్యార్థి విభాగం కార్యదర్శి వీరమణి జయకుమార్ మీడియాతో మాట్లాడారు. 2026–27 విద్యా సంవత్సరానికి గానూ డీఎంకే విద్యార్థి విభాగం తరఫున ఈ హెల్ప్డెస్క్ సేవలను ప్రారంభించామన్నారు. ప్లస్–2 పూర్తి చేసి కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు తమిళ విద్యార్థి వేదిక ద్వారా అవసరమైన అన్ని మార్గదర్శకాలు అందుతాయన్నారు. విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నాన్ మొదల్వన్, తమిళ్ పుదల్వన్’ వంటి పథకాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, వాటి ద్వారా వారు లబ్ధి పొందేలా సహాయం చేస్తామన్నారు. డీఎంకే విద్యార్థి విభాగం ఎంతో బలంగా ఉందని, ఎలాంటి పార్టీ వివక్ష లేకుండా విద్యార్థులందరికీ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ పనుల కోసం తమిళనాడు వ్యాప్తంగా 500 మంది విద్యార్థులను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. సెల్వ పెరుంతొగై భేటీ టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై స్టాలిన్తో సమావేశమయ్యారు. ఆయన ఒక్కరు మాత్రమే అన్నా అరివాయలయానికి వచ్చి స్టాలిన్ను కలవడం గమనార్హం. ఆయన్ని పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు ఏఐసీసీలో జరుగుతున్నట్టు, తనకు పదవి వద్దని సెల్వ పెరుంతొగై స్వచ్ఛందగా రాజీనామా చేసినట్టుగా సమాచారాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ లేకుండా కేవలం సెల్వ పెరుంతొగై ఒక్కరే స్టాలిన్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి అధ్యక్షుడు కొంగు ఈశ్వరన్, పొల్లాచ్చి నియోజకవర్గ అభ్యర్థి నిత్యానందంతో కలిసి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ను కలిసి మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, డీఎంకే కూటమి విజయం ఖాయమని క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి డీఎంకే కూటమి మరిన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. డీఎంకే పార్టీ సొంతంగా మెజారిటీతో వస్తుందన్నారు. -
వీసీకే శ్రేణుల మధ్య కొరవడిన ఐక్యత
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదలకు సమయం ఆసన్నం అవుతోన్న సమయంలో వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ శనివారం విడుదల చేసిన ఓ వీడియో సందేశం కొత్త చర్చకు దారి తీసింది. ఇందులో ఎన్నికల క్షేత్రంలో పార్టీ పనితీరు ఫలితాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనేక నియోజకవర్గాలలో వీసీకే శ్రేణుల మధ్య ఐక్యత కొరవడిందన్న సమాచారాలు వేదన కలిగిస్తోందన్నారు. కూటమి విజయం ఖాయం ఆ వీడియోలో తిరుమావళవన్ స్పందిస్తూ..ఎన్నికల ఫలితాల కోసం అందరిలాగే తాము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. వీసీకే పోటీ చేసిన స్థానాల్లోనే కాకుండా, భాగస్వాములుగా ఉన్న డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమి అఖండ విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. తాను సుమారు వీసీకే అభ్యర్థులతో పాటు, కూటమి పార్టీల అభ్యర్థుల తరఫున ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు విస్తృతంగా ప్రచారం చేశానని గుర్తు చేశారు. ఈ క్షేత్ర పర్యటనల్లో ప్రజలు డీఎంకె కూటమికి భారీగా మద్దతు ఇస్తున్నారనే నిజం స్పష్టంగా కనిపించిందన్నారు. ఐక్యత ఏదీ ఎన్నికల్లో వీసీకే శ్రేణులు అన్ని నియోజకవర్గాల్లో చాలా క్రమశిక్షణతో పని చేశారన్నారు. అయితే, కేవలం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం నాయకులు, కార్యకర్తల మధ్య ఐక్యత లోపించినట్లు సమాచారం అందుతోందన్నారు. దీనిపై పార్టీ పరంగా అంతర్గత విచారణ, సమీక్ష జరుగుతోందన్నారు. ఏదేమైనప్పటికీ మిత్ర పక్ష అభ్యర్థులు కోసం పార్టీ శ్రేణులు చేసిన ఎన్నికల కృషి ఎంతగానో అభినందించ దగిన విషయంగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో సమీక్ష సమావేశం తాజా ఎన్నికల సరళిపై చర్చించేందుకు , భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు త్వరలోనే జిల్లా కార్యదర్శుల సమావేశం, ఎన్నికల కార్యవర్గ కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తిరుమావళవన్ తన వీడియో సందేశంలో స్పష్టం చేశారు. తాము పోటీ చేసిన 8 స్థానాల్లోనూ వీసీకే తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా తిరుమా చేసిన వ్యాఖ్యలలో మిత్ర పక్షాల అభ్యర్థులు పోటీలో ఉన్న చోట్ల ఐక్యత కొరవడినట్టుగా వ్యాఖ్యలు చేయడం బట్టి చూస్తే, వీసీకే వర్గాలు కూటమి పార్టీలకు మద్దతుగా పనిచేసినట్టా? లేదా? లన్న చర్చ ఊపందుకుంది. -
కడలూరులో జీఆర్టీ షోరూమ్
కొరుక్కుపేట: ఆభరణాల విక్రయరంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంటున్న జి.ఆర్.టి. జ్యువెలర్స్, తమ కడలూరు షోరూమ్ను ఇంపీరియల్ రోడ్లోని మరింత పెద్ద, వైభవమైన ,అధునికమైన షోరూమ్కు తరలించినట్టు జి.ఆర్.టి. జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జి.ఆర్. ఆనంద్ అనంతపద్మనాభన్ తెలిపారు . ఈ ఘన ప్రారంభోత్సవం కడలూరులోని ఆభరణ ప్రియులకు ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు .ఈ కొత్త ఆరంభాన్ని పురస్కరించుకుని, జీఆర్టీ జ్యువెలర్స్ తమ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. వినియోగదారులు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు రూ.250 తగ్గింపు, పాత బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రూ. 100 అదనంగా, సోలిటైర్లు మినహా వజ్రాలు, కట్ చేయని వజ్రాల విలువపై 12.5శాతం తగ్గింపు, వెండి వస్తువులపై వేస్టేజ్ (విఏ) పై 25శాతం తగ్గింపు, వెండి ఆభరణాల ఎంఆర్పి పై 10 శాతం తగ్గింపును పొందవచ్చని ,ఈ ప్రత్యేక ప్రయోజనాలు వినియోగదారులకు కొత్త షోరూమ్కు మారడాన్ని మరింత లాభదాయకంగా చేస్తాయని జి.ఆర్.టి. జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జి.ఆర్. ఆనంద్ అనంతపద్మనాభన్ తెలిపారు. -
వరల్డ్ వెజ్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారం
సాక్షి, చైన్నె : శాకాహారానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థ ’వరల్డ్ వెజ్ కౌన్సిల్’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం చైన్నెలోని జరిగింది. మ్యూజిక్ అకాడమీలో జరిగిన వేడుకలో కౌన్సిల్ నూతన అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఎస్. మహావీర్ చంద్ బొత్రా, అంతర్జాతీయ కార్యదర్శిగా సుధాకర్ నారాయణస్వామి అంతర్జాతీయ కోశాధికారిగా ఆర్. మురళీ రావు బాధ్యతలు స్వీకరించారు. మేఘాలయ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్. వైద్యనాథన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా 1959లో దివంగత రుక్మిణి దేవి అరుండేల్ ఒక స్వచ్ఛంద , రాజకీయేతర సంస్థగా ది ఇండియన్ వెజిటేరియన్ కాంగ్రెస్ అనే పేరుతో స్థాపించారు. సభ్యత్వం అంతర్జాతీయంగా విస్తరించడంతో 2012లో దీని పేరును ’వరల్డ్ వెజ్ కౌన్సిల్’గా మార్చారు. శాకాహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించడం, ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తులపై శాకాహారానికి గుర్తుగా ఉండే ’గ్రీన్ డాట్’ (పచ్చని చుక్క) తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వాలకు సూచనలు చేయడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఈ సంస్థకు భారతదేశంతో పాటు యూకే, యూఎస్ఏలలో 2000 మందికి పైగా సభ్యులు ఉన్నారు. న్యాయం అనేది కీలకం ముఖ్య అతిథి జస్టిస్ ఎస్. వైద్యనాథన్ ప్రసంగిస్తూ, ‘న్యాయం అనేది కేవలం కోర్టు గదులకే పరిమితం కాదన్నారు. సమాజంలో కూడా అవసరం అని, అహింస అనే సిద్ధాంతంతో భారతదేశం ఎప్పుడూ శాకాహారానికి పుట్టినిల్లుగా ఉందన్నారు. శాకాహారం అనేది కేవలం ఆహార నియంత్రణ మాత్రమే కాదని,ఇది ఒక సంస్కారవంతమైన జీవన విధానంగా పేర్కొన్నారు. ఇది తోటి ప్రాణులపై సానుభూతిని, పర్యావరణ సమతుల్యతను పెంపొందిస్తుందన్నారు. ఈ సంస్థ శాకాహారంతో పాటు ప్లాస్టిక్ రహిత జీవనాన్ని కూడా ప్రోత్సహించాలని పిలుపు నిచ్చారు.ఈ సంస్థ మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు ఎన్. తారాచంద్ దుగర్ మాట్లాడుతూ.. ‘ఆక్స్ఫర్డ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల పరిశోధనల ప్రకారం, శాకాహారులలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 33 శాతం తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. నూతన అధ్యక్షుడు మహావీర్ చంద్ బొత్రా మాట్లాడుతూ, తాము మాంసాహారులకు వ్యతిరేకం కాదు, కానీ శాకాహారం వల్ల కలిగే అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ అంతర్జాతీయ కార్యదర్శి ఎస్. శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. -
స్టాలిన్కు షాకిస్తూ.. విజయ్పై పొగడ్తల వర్షం!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. డీఎంకే, అన్నాడీఎంకే, ఈ మధ్యలో టీవీకే.. ఎవరికి వారే అధికారం తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ముందస్తుగా క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.విజయ్ టీవీకే పార్టీపై స్టాలిన్ మిత్రుడు, ఎండీఎంకే(Marumalarchi Dravida Munnetra Kazhagam) అధినేత వైకో ప్రశంసలు గుప్పించారు. విజయ్ ఈ ఎన్నికల్లో మ్యాజిక్ చేసే అవకాశం లేకపోలేదని అన్నారాయన. ‘‘టీవీకే తమిళ రాజకీయాల్లో ఓ శక్తిగా అవతరించింది. రాబోయే రోజుల్లో ఇక్కడి రాజకీయాల్లో గణనీయమైన ప్రభావం చూపగలదు. ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం లేకపోలేదు’’ అని వైకో అభిప్రాయపడ్డారు.ఈ సందర్భగా విజయ్కు ఉన్న ప్రజాదరణను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. యువత, మహిళలు, ముఖ్యంగా ఫస్ట్టైమ్ ఓటర్లలో విజయ్కి అశేష అభిమానులు ఉన్నారని చెప్పారు. అదే సమయంలో.. ద్రవిడ ఉద్యమం తమిళనాడు రాజకీయాల్లో శాశ్వత శక్తిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.1994లో డీఎంకే నుంచి విడిపోయి ఎండీఎంకే స్థాపించారు వైకో. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్తో చేతులు కలిపి పోటీ చేశారు. ఎండీఎంకేకు నాలుగు సీట్లు కేటాయించగా.. అందులో మూడు సీట్లను డీఎంకే గుర్తు(ఉదయించే సూర్యుడు), మరో అభ్యర్థిని స్వంత గుర్తుతో వైకో బరిలోకి దించారు. ఇదిలా ఉంటే..ఎన్నికల అరంగేట్రంలోనే టీవీకే గణనీయమైన ప్రభావం చూపవచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. మిగతా సర్వేలు డబుల్ డిజిట్ రావొచ్చని అంచనా వేస్తుంటే.. యాక్సిస్ మై ఇండియా (Axis My India) ఎగ్జిట్ పోల్స్ మాత్రం 98–120 సీట్లు గెలుచుకుని అధికారం కైవసం చేసుకుంటుందని తెలిపింది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఇప్పుడు అధికార మిత్రకూటమి సీనియర్ నేత వైకో ప్రశంసలు గుప్పించడంతో విజయ్ అభిమానులు ఉబ్బితబ్బిబైపోతున్నారు.ఏప్రిల్ 23న జరిగిన తమిళనాడు పోలింగ్లో 85.1% ఓటింగ్ నమోదైంది. అయితే.. యువత, కొత్త ఓటర్ల భాగస్వామ్యం పెరగడం TVKకి అనుకూలంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.తమిళనాడులో విజయ్కి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. యాక్టింగ్ పీక్స్లో ఉండగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, యువతను ఆకర్షించే వాగ్దానాలు చేయడం ఆయనకు అదనపు బలం ఇస్తున్నాయి. విద్యార్థులకు స్టైపెండ్లు, స్టార్టప్ రుణాలు, మత్తు పదార్థాల రహిత రాష్ట్రం వంటి హామీలు ఆయన ప్రచారంలో ప్రధానంగా నిలిచాయి.డీఎంకే ఆధ్వర్యంలోని కూటమి రెండోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఇదే ఖరారు చేశాయి. మరోవైపు అన్నాడీఎంకే వరుస ఓటముల తర్వాత తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ తన తొలి ఎన్నికలోనే అన్నాదురై, ఎంజీఆర్ల విజయదుందుభి మోగించవచ్చనే భారీ అంచనాలు నెలకొన్నాయి. -
అంచనాలు నిజమయ్యేనా?
సాక్షి, చెన్నై: అధికారం తమదే, విజయ్ సీఎం కావడం తథ్యమని ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించిన యాక్సిస్ మై ఇండియా గత అంచనాలు నిజమయ్యాయా అనే కోణంలో టీవీకే వర్గాలు అన్వేషణలో నిమగ్నమ్యాయి. మెజారిటీ సర్వే సంస్థలు అధికార డీఎంకే కూటమికే మళ్లీ పట్టం అని ప్రకటిస్తే, యాక్సిస్మై ఇండియా మాత్రం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు స్పష్టమైన విజయ అవకాశాలు ఉన్నాయని అంచనా వేయడం టీవీకే వర్గాల్లో జోష్ను నింపింది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరం. యాక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం విజయ్ నేతృత్వంలోని టీవీకే 98 నుంచి 120 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పారీ్టగా లేదా సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో గతంలో ఈ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యాయి?, ఏయే ఎన్నికల్లో వీరి అంచనాలు తప్పాయో అనే అంశంపై టీవీకే వర్గాలు సమీక్షించే పనిలో నిమగ్నం కావడం విశేషం.నిజమైన సందర్భాలెన్నో యాక్సిస్ మై ఇండియా గతంలో నిర్వహించిన పలు సర్వేలు ఎన్నికల ఫలితాలను చాలా ఖచ్చితంగా అంచనా వేశాయన్న చర్చ జరుగుతోంది. ఆ మేరకు 2019 లోక్సభ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి 339 నుంచి 365 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకుంటుందని ఈ సంస్థ అంచనా వేసిందని చెప్పవచ్చు. ఇందులో 353 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం గమనార్హం. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ 76 నుంచి 90 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని చెప్పి ఓటరు నాడిని స్పష్టంగా ముందే గ్రహించారని చెప్పవచ్చు. ఈ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 92 స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2023లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుందని చాలా సర్వేలు చెప్పగా.. యాక్సిస్ మై ఇండియా మాత్రం బీజేపీ 140 నుంచి 162 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఫలితం బీజేపీ వైపు ఉండడం గమనార్హం. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ కూటమి 178 నుంచి 200 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేయగా, ఈ కూటమి 235 స్థానాలలో విజయంతో అధికారం కైవశం చేసుకుంది. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో తీవ్రమైన పోటీ ఉంటుందని ఇతర సర్వేలు చెప్పగా.. యాక్సిస్ మై ఇండియా మాత్రం బీజేపీ 45 నుంచి 55 స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఇందుక అనుగుణంగా బీజేపీ 48 స్థానాలలో విజయం సాధించడం గమనార్హం. అదే సమయంలో అంచనాలు తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి 360 నుంచి 390 సీట్లు వస్తాయని అంచనా వేయడం ఫలితం 293 సీట్ల వద్దే ఆగింది. ఇప్పుడు తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మిగతా సర్వేలకు భిన్నంగా విజయ్ టీవీకే పారీ్టకి 98–120 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ఈ అంచనా నిజమై విజయ్ సరికొత్త చరిత్ర çసృష్టిస్తారా అనే ఎదురు చూపులలో టీవీకే వర్గాలు, అభిమానులు ఉన్నారు. ఈసర్వేనే కాదు, సామాజిక మాధ్యమాలలో సాగుతున్న సర్వేలన్నీ విజయ్కు అనుకూలంగా ఉండడంతో తుది తీర్పు మే 4వ తేదీ కోసం వేచి చూడక తప్పలేదు. ప్రజా మద్దతకు దైవబలం సైతం తోడు కావాలన్న కాంక్షతో విజయ్ తాజాగా ఆధ్యాతి్మక యాత్రలో ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శనివారం విజయ్ నాగపట్నం జిల్లాలో వేలాంకన్ని మాత ఆలయం, నాగూర్ దర్గాను సందర్శించేందుకు సిద్ధం కావడం విశేషం. -
సటెండ్రు మారుదు వానం అంటున్న జయ్
బ్రౌన్మణి ఫస్ట్లుక్ విడుదల తమిళసినిమా: ఉన్నట్టుండి రియోరాజ్ నిర్మాతగా అవతారమెత్తారు. ఈయన రమేష్ అనే ఆయనతో కలిసి రివర్ రూట్ స్టూడియోస్ అండ్ రెడ్లాక్ స్టూడియోస్ సంస్థలపై నిర్మిస్తున్న చిత్రం బ్రౌన్మణి. నటుడు రామ్ నిశాంత్, జేకే.కవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కదిరవన్ సంపత్ దర్శకత్వం వహిస్తున్నారు. పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి మంచి నిపుణులైన సాంకేతిక వర్గం పనిచేస్తున్నారని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ చిత్ర టైటిల్తో కూడిన ఫస్ట్లుక్ పోస్టర్ను నటుడు, నిర్మాత లియోరాజ్ శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాకు విడుదల చేసిన చిత్ర వివరాలను తెలుపుతూ చిత్ర షూటింగ్ దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. కుటుంబం స్నేహితుల నేపథ్యంలో సాగే వినోదభరిత కథా చిత్రం ఇదని తెలిపారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ, చిత్ర విడుదల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఈ చిత్రానికి కవిన్.జీటీ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండ గా, దేవ్ ప్రకాష్ రీగన్ సంగీతాన్ని, శక్తి సుబ్రహ్మణ్యన్ చాయాగ్రహ ణం అందిస్తున్నారు. బౌన్మణి ఫస్ట్లుక్ పోస్టర్ తమిళసినిమా: ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి పలు విజయవంతమైన చిత్రాలు నటించిన నటుడు జయ్ చిన్న గ్యాప్ తర్వాత కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం సటెండ్రు మారుదు వానం. నటి మీనాక్షి గోవిందరాజన్, నైతిక నటిస్తున్న ఇందులో యోగిబాబు, కేజీఎఫ్ ఫేమ్ గరుడరామ్, శ్రీమాన్, ఆదిత్య కదిర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు ఏఆర్.మురుగదాస్ వద్ద సర్కార్, దర్బార్ వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన బాబు విజయ్ ఈచిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. బీవీ ఫ్రేమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ఎం.నాధన్ చాయాగ్రహణం, గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర జరుపుకుంటోందని, చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్నాయని యూనిట్ వర్గాలు చెప్పాయి. ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేసినట్లు తెలిపారు. చిత్ర విడుదలపై అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. సటెండ్రు మారుదు వానంలో మీనాక్షి గోవిందరాజన్, జయ్ -
అంచనాలు నిజమయ్యేనా?
సాక్షి, చైన్నె: అధికారం తమదే, విజయ్ సీఎం కావడం తథ్యమని ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించిన యాక్సిస్ మై ఇండియా గత అంచనాలు నిజమయ్యాయా అనే కోణంలో టీవీకే వర్గాలు అన్వేషణలో నిమగ్నమ్యాయి. మెజారిటీ సర్వే సంస్థలు అధికార డీఎంకే కూటమికే మళ్లీ పట్టం అని ప్రకటిస్తే, యాక్సిస్మై ఇండియా మాత్రం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు స్పష్టమైన విజయ అవకాశాలు ఉన్నాయని అంచనా వేయడం టీవీకే వర్గాల్లో జోష్ను నింపింది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరం. యాక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం విజయ్ నేతృత్వంలోని టీవీకే 98 నుంచి 120 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా లేదా సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో గతంలో ఈ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యాయి?, ఏయే ఎన్నికల్లో వీరి అంచనాలు తప్పాయో అనే అంశంపై టీవీకే వర్గాలు సమీక్షించే పనిలో నిమగ్నం కావడం విశేషం. విజయ్ -
వైభవంగా ధ్వజారోహణం
సాక్షి, చైన్నె: 108 దివ్య దేశాలలో ఒకటైన చైన్నెలోని ట్రిప్లికేన్ పార్థసారథి స్వామి ఆలయంలో చిత్తిరై బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈనెల 10వ తేదీ వరకు పది రోజులపాటు కను ల పండువగా జరగనున్నాయి. ఈ ప్రసిద్ధ ఆలయంలో శ్రీవేంకటకృష్ణుడు (పార్థసారథి), రంగనాథుడు, నరసింహస్వామి, గజేంద్ర వరదరాజ పెరుమాళ్, కోదండరామ స్వామిలకు వేర్వేరు సన్నిధులు ఉన్నాయి. చిత్తిరై బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు గతనెల 29వ తేదీ రాత్రి అంకురార్పణం, 30వ తేదీన పుష్పపల్లకి సేవలు జరిగాయి. శుక్రవారం వేకువజాము నుంచి ఆలయంలో విశిష్ట పూజలు జరిగాయి. 4 గంటల నుండి 5 గంటల మధ్య కన్యా లగ్నంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని తిరు వీధులలో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు పలికారు. వాహన సేవలు చైన్నె నగరంలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారు వివిధ వాహనాలపై తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆదివారం స్వామివారి గరుడ సేవ ఉత్సవం కనుల పండువగా జరుగుతుంది. ఈనెల 5వ తేదీన మంగళవారం ఉదయం 8.30 గంటలకు పల్లకి నాచ్చియార్ తిరుక్కోలం హనుమంత వాహన సేవతో పాటుగా అదే రోజు రాత్రి గజ వాహన సేవ జరుగుతంది. ఈనెల 7వ తేదీన శ్రీ పార్థసారథి స్వామి తిరుతేర్ (మహారథోత్సవం) నిర్వహించనున్నారు. -
భక్తజన సాగరంలో వైగై నదీ తీరం
మీనాక్షి అమ్మవారి సన్నిధిలో మహోత్సవం ముగింపునకు ఒక రోజు ముందుగా అళగర్మలైలలో కళ్లలగర్ సన్నిధిలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఉత్సవంలో భాగంగా వైగై నదీ ప్రవేశాన్ని కనులార తిలకించేందుకు భక్త కోటి గురువారం రాత్రి నుంచే మదురైకు పోటెత్తారు. దీంతో మదురై నగరం రాత్రంతా భక్త జన సందోహంలో మునిగింది. గోవింద నామ స్మరణతో నగరం పులకించింది. తేనూర్ నుంచి బంగారు పల్లకిలో మదురైకు చేరుకున్న కళ్లలగర్కు గురువారం రాత్రంతా ప్రత్యేక పూజలు జరిగాయి. శుక్రవారం వేకువజామున పూజాది కార్యక్రమాలు ముగించుకున్న కళ్లలగర్ స్వామి సరిగ్గా 2.30 గంటలకు బంగారు అశ్వవాహనాన్ని అధిరోహించారు. శ్రీవిల్లి పుత్తూరు అండాల్ ఆలయం నుంచి ప్రత్యేకంగా సిద్ధం చేసి తీసుకొచ్చిన పూల మాలను ధరించి వైగై నదీ వైపు కదిలారు. పచ్చ వర్ణ పట్టు వస్త్రాలను ధరించి స్వామి ముందుకు సాగుతుంటే, లక్షలాది మంది భక్తులు స్వామి వారిని తనివి తీరా దర్శించుకునేందుకు ఎగబడ్డారు. పలు మార్గాల గుండా ప్రయాణించిన స్వామి వారికి సరిగ్గా 4 గంటల సమయంలో ఆహ్వానం పలుకుతూ ఎలుత్తాణికార వీధిలో వెండి అశ్వవాహనంలో వచ్చిన వీరరాఘవ పెరుమాల్ ఎదురుగా వచ్చారు. అక్కడి నుంచి సరిగ్గా 4.42 గంటలకు ఆళ్వార్పురం చేరుకున్న స్వామి వారు అనంతరం వైగై నదీ ప్రవేశం చేశారు. -
సేవలు ప్రశంసనీయం
కొరుక్కుపేట: చైన్నె ప్యారిస్ గిడ్డంగి వీధిలోని సదరన్ ఇండియా వైశ్య అసోసియేషన్ 122వ సంవత్సరంలో అడుగిడిన సందర్భంగా శుక్రవారం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు అజంతా డాక్టర్ కె. శంకర రావు అధ్యక్షత వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్జన్ కంపెనీ అధినేత బి.గౌతమ్ పాల్గొని అసోసియేషన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. శంకర రావు మాట్లాడుతూ సంఘానికి సొంత భవన నిర్మాణం పూర్తిచేసేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బీజేపీ యువజన విభాగం అధ్యక్షుఉ డా.ఎస్ జి సూర్య, అసోసియేషన్ సంయుక్త కార్యదర్శులు మద్ది నరసింహులు, పువ్వాడ అశోక్ కుమార్, కోశాధికారి పెసల రమేష్, ఉపాధ్యక్షులు మన్నారు ఉదయ్కుమార్, ఎం. కాశీవిశ్వనాథం పాల్గొన్నారు. -
నాగత్తమ్మన్ ఆలయంలో పాలాభిషేకం
తిరువళ్లూరు: చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని నాగత్తమ్మన్ ఆలయంలో పాలాభిషేకం శుక్రవారం ఉదయం వైభవంగా నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్ కన్నిగైపేర్ ప్రాంతంలో నాగత్తమ్మన్ ఆలయం ఉంది. ఆలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు 2024వ సంవత్సరంలో పునఃనిర్మించి కుంభాభిషేకం నిర్వహించారు. ఈక్రమంలో ఆలయంలో ప్రతి ఏటా చైత్రమాసం పౌర్ణమి రోజున పాలాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులోభాగంగానే శుక్రవారం చైత్ర పౌర్ణమి కావడంతో పాలాభిషేకం నిర్వహించారు. వంద మంది భక్తులు పాలతో వచ్చి అభిషేకం నిర్వహించారు. అనంతరం రాత్రి అమ్మవారికి ప్రత్యేక అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. -
క్లుప్తంగా
ప్రైమ్ డే–2026కు సన్నద్ధం సాక్షి, చైన్నె: ప్రతిష్టాత్మక ప్రైమ్డే–2026 వేడుక విక్రయాలను ఈ ఏడాది జూలై నెలలో నిర్వహించనున్నట్టు అమెజాన్ శుక్రవారం స్థానికంగా ప్రకటించింది. ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ఈ అతిపెద్ద షాపింగ్ పండుగ 10వ ఎడిషన్ కావడం విశేషంగా పేర్కొన్నారు. ఇందులో ప్రైమ్ సభ్యులు అద్భుతమైన ఆఫర్లు, భారీ తగ్గింపులు, కొత్త ఉత్పత్తుల లాంచ్లు, వినోదాన్ని ఆస్వాదించవచ్చని కంపెనీ తెలిపింది. ఈసందర్భంగా ప్రైమ్డే–2026 సందడి వివరాలను ప్రకటించారు. సవాళ్లు ఎదురైనా సానుకూల వృద్ధి సాక్షి, చైన్నె: అంతర్జాతీయంగా నెలకొన్న పశ్చిమాసియా సంక్షోభం వలన అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఏప్రిల్ 2026 నెలలో సానుకూల వృద్ధిని సాధించినట్టు , జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించింది. 2025, ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈసారి కంపెనీ 3 శాతం కంటే ఎక్కువ వార్షిక వృద్ధిని నమోదు చేసినట్టు ఆ సంస్థ ప్రతినిధి వివరించారు. పశ్చిమాసి యా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ సరఫరా దెబ్బతినడం, వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడడం వలన ఆటోమొబైల్ మార్కెట్లో డిమాండ్ తగ్గినప్పటికీ, కంపెనీ ఈ ఘనత సాధించడం విశేషంగా పేర్కొన్నారు. చెరువులో మునిగి తాతామనవడు మృతి తిరువొత్తియూరు: చైన్నె, పల్లికరనై సమీపంలో శుక్రవారం ఉదయం చెరువు లో స్నానం చేస్తున్న సమయంలో నీట మునిగి తాత,మనుమడు మృతి చెందారు. చైన్నె, పల్లికరణై సమీపంలోని నారాయణపురం, సెంగణి అమ్మన్ కోవెల వీధికి చెందిన వారు పెరుమాళ్ (60) ఇతను శుక్రవారం ఉదయం తన మనవళ్లు భరత్ (15), దినేష్ (14) లతో కలిసి స్నా నం చేయడానికి నారాయణపురం చెరువుకు వెళ్లారు.చెరువులో స్నానం చేస్తున్న సమయంలో, పెరుమాళ్ మనవడు భరత్ అనుకోకుండా లోతైన ప్రాంతానికి వెళ్లి బురదలో చిక్కుకున్నాడు. నీటిలో మునిగిపోతున్న మనవడిని చూసిన పెరుమాళ్, అతడిని కాపాడటానికి ప్రయత్నించారు. అయితే, ఆ ప్రయత్నంలో ఆయన కూడా బురదలో చిక్కుకుని నీటిలో మునిగిపోయారు.గట్టు మీద ఉన్న మరో మనవడు దినేష్ ఇది చూసి గట్టిగా కేకలు వేయడంతో, చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. వారు పెరుమాళ్ను బయటకు తీశారు, కానీ అప్పటికే ఆయన మరణించారు. బురదలో చిక్కుకున్న భరత్ మృతదేహాన్ని వెలికితీసేందుకు మేడవక్కం అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తనిష్క్ డైమండ్ సెంటర్ ఆవిష్కరణ సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని పశ్చిమ తాంబరంలో తనిష్క్ సరికొత్త డైమం్ సెంటర్గా విక్రయ కేంద్రాన్ని ప్రారంభించింది. టాటా గ్రూప్నకు చెందిన భారతదేశపు అతిపెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ తనిష్క్ తమిళనాడులో తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా సరికొత్త విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఆసంస్థ సీఈఓ అరుణ్ నారాయణ్, తమిళనాడు – కేరళ జ్యువెలరీ విభాగం బిజినెస్ హెడ్ నరసింహన్ వై.ఎల్ వివరించారు. తమిళనాడులో తనిష్క్ స్టోర్ల సంఖ్య దీంతో 66కు చేరగా, చైన్నె నగరంలోనే ఇది 24వ స్టోర్గా సరికొత్త మైలురాయిని అధిగమించిందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తనిష్క్ ప్రతినిధులు, విశేష సంఖ్యలో వచ్చిన కస్టమర్లు పాల్గొన్నారు. తనిష్క్ తన కస్టమర్ల కోసం ఒక ప్రత్యేకమైన ఆఫర్ను ప్రకటించారు. ప్రత్యేక కలెక్షన్లు , ఆకర్షణలతో అద్భుతమైన జ్యువెలరీ డిజైన్లు కొలువుదీర్చారు. తనిష్క్ డైమండ్ ఎక్స్పరైజ్ సెంటర్గా ఈ నూతన విక్రయ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐదు రకాల అత్యాధునిక పరికరాల ద్వారా వజ్రాల నాణ్యత, కాంతివంతమైన మెరుపు మరియు వాటిపై ఉండే లేజర్ మార్కింగ్లను కస్టమర్లు నేరుగా పరీక్షించుకోవచ్చు అనిఅరుణ్ నారాయణ్ సూచించారు. ప్రత్యేక బస్సుల్లో రద్దీ కొరుక్కుపేట: మే డే, చిత్ర పౌర్ణమి సందర్భంగా, తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థల తరఫున చైన్నె నుండి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. వరుసగా మూడు రోజుల సెలవు కారణంగా పట్టణం వెలుపల ప్రయాణాలు పెరిగే అవకాశం ఉన్నందున, కీలంబాక్కం, కోయంబేడు, మాధవరం బస్ స్టేషన్ల నుండి ఈ ప్రత్యేక బస్సులను నడిపారు. గురువారం నుండి శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల వరకు, 2,092 సాధారణ బస్సులు, 1,784 ప్రత్యేక బస్సులతో సహా మొత్తం 3,876 బస్సులు నడపబడ్డాయి. ఈ ప్రత్యేక బస్సుల ద్వారా ఒక్క రోజులోనే 2 లక్షల 13 వేల 180 మంది ప్రయాణికులు ప్రయాణించారు. అంతేకాకుండా, ప్రజల డిమాండ్కు అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడపడానికి రవాణా సంస్థ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇది కాకుండా, ప్రైవేట్ ఓమ్ని బస్సులలో 50 వేల మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించారు. -
క్లుప్తంగా
లైంగిక దాడి కేసులో నిందితుడికి జైలు శిక్ష తిరువళ్లూరు: పదకొండేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 27 సంవత్సరాల జైలుశిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా పోక్సో కోర్టు తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు ప్రాంతానికి చెందిన పదకొండేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన వెంకటేషన్ కుమారుడు ప్రేమ్కుమార్ గత 2024లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. అనంతరం బెయిల్పై విడుదలైన క్రమంలో కేసు విచారణ తిరువళ్లూరు పోక్సో కోర్టులో సాగింది. విచారణలో నిందితుడు నే రం చేసినట్టు రుజువు కావడంతో 27 సంవత్సరాల శిక్షతో పాటు పది వేల రూపాయల జరి మానా విధిస్తూ న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. అనంతరం నిందితుడిని పుళల్ జైలుకు తరలించారు. సైబర్ క్రైమ్లో 12 మంది అరెస్ట్ తిరువొత్తియూరు: సైబర్ క్రైమ్ ద్వారా మోసం చేసి సంపాదించిన డబ్బును విదేశాలకు పంపినందుకు రామనాథపురం, శివగంగ, విరుదునగర్ జిల్లాలకు చెందిన 12 మందిని చైన్నె సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన ప్రధాన కార్యాలయం నిర్వహించిన సుదీర్ఘ నిఘా, విచారణలో పలు రహస్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్లైన్ పెట్టుబడి మోసాలు, సైబర్ నేరాల ద్వారా అమాయక ప్రజల నుండి దోచుకున్న డబ్బును విదేశీ సైబర్ క్రైమ్ ముఠాలకు పంపే ఒక నెట్వర్క్ పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి గత మార్చి నెలలో రామనాథపురం జిల్లాకు చెందిన ఏడుగురు నిందితులను ప్రత్యేక బృందం ఇప్పటికే అరెస్టు చేసింది. పోలీసుల తదుపరి విచారణలో ఈ ముఠా 2025–2026 సంవత్సరాల్లో రూ.100 కోట్ల విలువైన సైబర్ నేరాల ఆదాయాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చి అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల ఆధీనంలో ఉన్న వాలెట్లకు బదిలీ చేసినట్లు తెలిసింది. దీనిని అనుసరించి చైన్నె నుండి వచ్చిన ప్రత్యేక బృందం రామనాథపురం జిల్లా దేవిపట్నం, పరమకుడి, సక్కరకోట్టై, శివగంగ, విరుదునగర్ ప్రాంతాలలో దాడులు చేసి 12 మందిని అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో ఒక మహిళ కూడా ఉంది. వీరందరినీ తదుపరి విచారణ నిమిత్తం చైన్నెకి తరలించారు. విదేశీ సిగరెట్లు స్వాధీనం అన్నానగర్: చైన్నెలోని పెరియమేడు ప్రాంతంలోని ఒక భవనంలో విదేశీ సిగరెట్లను అమ్మకం కోసం నిల్వ ఉంచుతున్నారని కస్టమ్స్ అధికారులకు రహస్య సమాచారం అందింది. దీని తరువాత కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఇలవరసన్ నేతృత్వంలోని అధికారులు శుక్రవారం ఉదయం సదరు భవనానికి వెళ్లి విచారణ జరిపారు. అక్కడ ఒక ట్రావెల్ కంపెనీ పేరుతో నడుస్తున్న కార్యాలయం తాళం వేసి ఉండటాన్ని వారు గమనించారు. కార్యాలయం తాళం పగలగొట్టి లోపల సోదా చేసిన, అధికారులు రూ.8 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. భవన యజమానిని ప్రశ్నించగా తాను ఆ కార్యాలయాన్ని ఒకరికి అద్దెకు ఇచ్చానని, 6 నెలల పాటు దానికి తాళం వేసి ఉందని అతను చెప్పాడు. దీంతో ఆ కార్యాలయాన్ని సీజ్ చేశారు. పెరియమేడు పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట మోసం తిరువళ్లూరు: ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట బాధితుడి నుంచి 59 లక్షల రూపాయలను వసూలు చేసి ఉడాయించిన ప్రైవేటు బ్యాంకు మేనేజర్తో పాటు ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా తిరువేర్కాడు ప్రాంతానికి చెందిన శంకర్ కుమారుడు కార్తీకేయన్(38)కు వాట్సాప్ ద్వారా ఇద్దరు యువకులు సంప్రదించి ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే మూడింతలు లాభం వస్తుందని నమ్మించారు. అతడి నుంచి సుమారు 59 లక్షల రూపాయలను వసూలు చేశారు. అనంతరం లాభం ఇవ్వకపోగా, ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని బాధితుడు పదేపదే కోరినా ఫలితం లేకపోయింది. దీంతో ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో మోసం చేసిన వ్యక్తులు తిరువణ్ణామలై ప్రాంతానికి చెందిన మహేంద్రకోటక్ బ్యాంకు మేనేజర్ మోనీష్రాజ్(26), తిరువళ్లూరుకు చెందిన విజయ్కార్తీక్(29)గా గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జూన్ వరకు తూత్తుకుడి– తాంబరం రైలు తిరువొత్తియూరు: తూత్తుకుడి–తాంబరం మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులను జూన్ నెల వరకు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపారు తూత్తుకుడి–తాంబరం స్పెషల్ (రైలు నం.06018) రైలు మే 4, 11, 18, 25, జూన్ 1, 8 తేదీలలో (సోమవారాలు) నడుస్తుంది. ఈ రైలు తూత్తుకుడి నుంచి రాత్రి 11.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది. అలాగే తాంబరం–తూత్తుకుడి స్పెషల్ (రైలు నం 06017) రైలు మే 5, 12, 19, 26, జూన్ 2, 9 తేదీలలో మంగళవారాలు నడుస్తుంది. ఇది తాంబరం నుంచి సాయంత్రం 3.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు తూత్తుకుడి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు మేలూరు, కోవిల్పట్టి, సాత్తూరు, విరుదునగర్, మధురై, దిండిగల్, తిరుచిరాపల్లి, తంజావూరు, కుంభకోణం, మయిలాడుదురై, చిదంబరం, విల్లుపురం, చెంగల్పట్టు వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి. ఈ సర్వీసును పొడిగించినందుకు తూత్తుకుడి జిల్లా ప్రయాణికుల సంక్షేమ సంఘం దక్షిణ రైల్వేకు కృతజ్ఞతలు తెలిపింది. -
కార్మికుల సంక్షేమానికి తేనాభిషేకం
వేలూరు: కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం రాణి పేట జిల్లా వాలాజలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలోని మూలవర్ ధన్వంతరి స్వామికి తేనాభిషేకం నిర్వహించారు. మే 1వతేదీన ప్రపంచం కార్మికుల దినోత్సవా న్ని పురస్కరించుకొని ధన్వంతరి పీఠంలో ప్రతి సంవత్సరం కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ధన్వంతరి ఆరోగ్య పీఠం పీఠాధిపతి డాక్టర్ మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికుల సంక్షేమం కోసం, ఆరోగ్యంగా ఉండాలని, కుటంబం సంక్షేమంగా ఉండాలని కోరుతూ పీఠంలోని మూలవర్కు తేనాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. మురళీధరస్వామిజీ మాట్లా డుతూ దేశానికి వెన్నెమొకగా కార్మికులు ఉన్నారన్నా రు. కార్మికులు సంక్షేమంగా ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుందన్నారు. దేశంలోని ఏ శాఖలోనైనా అభివృద్ధి సాధించాలంటే అది కార్మికులతోనే సాధ్యమన్నారు. అనంతరం కార్మికుల సంక్షేమం కోసం పలు పూజలు నిర్వహించారు. హోమ పూజల్లో ధన్వంతరి కుటుంబ సభ్యులు, కార్మికులు, భక్తులు పాల్గొన్నారు. -
నేను, దుషారా గొడవపడ్డాం
తమిళసినిమా: నటి దుషారా విజయన్ నేను గట్టిగానే కొట్టుకున్నాం. నాకు బాగా దెబ్బలు తగిలాయి అని నటి అదితిబాలన్ అన్నారు. వీరిద్దరూ కలిసి నటించిన వెబ్ సిరీస్ ఎగ్జామ్. వాల్ వాచర్ పతాకంపై దర్శక నిర్మాతల ద్వయం పుష్కర్ –గాయత్రి నిర్మించిన ఈ వెబ్ సిరీస్కు కథ, దర్శకత్వం బాధ్యతలను సద్గుణం నిర్వహించారు. ఇది ప్రైమ్ వీడియో ఒరిజినల్ వెబ్ సిరీస్ అన్నది గమనార్హం. అబ్బాస్ ముఖ్యపాత్ర పోషించిన 7 ఎపిసోడ్స్తో రూపొందిన ఈ సిరీస్ మే 15వ తేదీ నుంచి ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గురువారం మధ్యాహ్నం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న దుషారా విజయన్ మాట్లాడుతూ నేను ఇంతకు ముందు నటించిన సార్పట్ట పరంపరై చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యింది. ఆ తరువాత తాజాగా నటించిన ఎగ్జామ్ వెబ్ సిరీస్ అదే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండడం సంతోషంగా ఉంది. ఇందులో నటించడానికి ఎలాంటి ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నాను. ఇందులో నేను ఝాన్సీ అనే పోలీస్ అధికారిగా నటించాను. అదితిబాలన్ మాట్లాడుతూ తన పాత్ర మొదట్లో కొంచెం నెగిటివ్గా కనిపిస్తుంది. ఇప్పటికి అంతకంటే ఎక్కువ చెప్పలేను. ఈ సిరీస్లో చాలా ఫైట్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. నేను, దుషారా విజయన్ కొట్టుకున్నాం. చాలా దెబ్బలు కూడా తగిలాయి అని చెప్పారు. మధ్య తరగతి ప్రజల పెద్ద కల ప్రభుత్వ కొలువుల ఎంపిక. అందులో జరిగే అక్రమాలను ఆవిష్కరించే ఇతివృత్తంతో తెరకెక్కించిన సిరీస్ ఇది అని దర్శకుడు సర్గుణం పేర్కొన్నారు. అదితి బాలన్, దుషారా విజయన్ -
ఘనంగా మే డే
మే డే స్థూపం వద్ద సీఎం స్టాలిన్ వీరవందనం సాక్షి, చైన్నె : వాడవాడల్లో శుక్రవారం కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజకీయ పార్టీల అనుబంధ కార్మిక సంఘాల నేతృత్వంలో పేద కార్మికులకు సంక్షేమ పథకాల పంపిణీ చేశారు. చైన్నెలోని మేడే పార్క్కు నేతలు తరలి వచ్చారు. ఇక్కడి మేడే స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి వీర వందనం సమర్పించారు. రాష్ట్రంలోని కార్మిక లోకం వాడ వాడల్లో తమ మే డేను శుక్రవారం జరుపుకున్నాయి. కర్షక చిహ్నాలతో కూడిన జెండాలను ఎగుర వేశారు. అధికార డీఎంకే , ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేతోపాటు కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, సీపీఐ పార్టీల అనుబంధ కార్మిక సంఘాల నేతృత్వంలోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. ర్యాలీలు, జెండాల ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. పేద కార్మికులకు సంక్షేమ పథకాల పంపిణీ చేశారు. తమిళ మానిల కాంగ్రెస్ నేతృత్వంలో మేడే కార్యక్రమం కార్మికుల సంక్షేమ సహాయ దినోత్సవంగా నిర్వహించారు. కోయంబేడులోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా విజయకాంత్ జెండా ఎగుర వేసి, కార్మికులకు సహాయకాలను అందజేశారు. సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీనాయకులు వీర పాండియన్, ముత్తరసన్ జెండా ఎగుర వేశారు. ిసీపీఎం కార్యాలయంలో నేతలు షన్ముగం, బాలకృష్ణన్, ఎండీఎంకే కార్యాలయంలో నేతలు వైగో, కార్మిక జెండాలను ఆవిష్కరించారు. చింతాద్రి పేటలోని మేడే పార్క్లో ఉన్న స్మారక స్థూపానికి వీర వందనం సమర్పించేందుకు పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగైతో పాటుగా నేతలు తరలివచ్చి వీరవందనం సమర్పించారు. వీసీకే తరఫున పలువురు నేతలు తరలి వచ్చి వీర వందనం సమర్పించారు. అన్నాడీఎంకే కార్మాక విభాగం నేతృత్వంలోని నాయకులు సైతం తరలి వచ్చారు. సీఎం ఎంకే స్టాలిన్ తాను కార్మికుడ్ని అని చాటుకునే విధంగా ఎరుపు రంగం చొక్కా ధరించి వచ్చారు. మంత్రులు నెహ్రూ, శేఖర్బాబు, ఎంపీ రాజా , మేయర్ ప్రియ పాల్గొన్నారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు. నిరంతరం కార్మికులు దోపిడికి గురి అవుతున్నారని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. -
దైవ దర్శనానికి వెళుతూ మృత్యుఒడిలోకి..
సాక్షి, చైన్నె: అళగర్ స్వామి వైగై నది ప్రవేశం దర్శనాన్ని వీక్షించేందుకు బైక్లో బయలు దేరిన యువకులు ప్రమాదం బారిన పడి మృతిచెందారు. రెండు మోటారు సైకిళ్లు ఢీకొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. దిండిగల్ జిల్లా నత్తం ప్రాంతానికి చెందిన సల్మాన్ ఖాన్ (21), విశ్వ (21), విగ్నేష్ (22) ముగ్గురు స్నేహితులు. మదురైలో శుక్రవారం జరిగిన కల్లాళగర్ వైగై నది ప్రవేశం ఉత్సవాన్ని చూడడానికి నిర్ణయించారు. దీంతో గురువారం రాత్రి ఒకే బైక్పై నత్తం నుంచి మదురైకి ముగ్గురు బయలుదేరారు. అర్ధరాత్రి వీరు నత్తం ఫ్లైఓవర్పై వెళుతుండగా మదురైలోని ఒత్తక్కడై ప్రాంతానికి చెందిన మాదేశ్ (27) అనే యువకుడు తన బైక్లో అదే ఫ్లైఓవర్పై రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చి సల్మాన్ ఖాన్ బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు బైక్లపై ఉన్న నలుగురు యువకులు రోడ్డుపై తీవ్ర గాయాలతో పడిపోయారు. సమాచారం అందుకున్న తల్లాకుళం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మదురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సల్మాన్ఖాన్, విశ్వ, మాదేశ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందారు. విగ్నేష్ తీవ్ర గాయలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లాకుళం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మే 4న ప్రతిఫలం షురూ!
సాక్షి, చైన్నె: మే డే సందర్భంగా శుక్రవారం జరిగిన సభలో సీఎం ఎం.కె. స్టాలిన్ ప్రసంగించారు. తన పార్టీ శ్రేణులు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం మే 4న లభిస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మే 4న విజయం ఖాయం మేడే సందర్భంగా డీఎంకే నేతృత్వంలో సభ జరిగింది. ఇందులో స్టాలిన్ ప్రసంగిస్తూ , పార్టీ కార్యకర్తలు పడిన కష్టానికి తగిన ఫలితాన్ని ఈనెల 4వ తేదీన అందుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. తాను ఈ మాటలను ఏదో ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చెప్పడం లేదన్నారు. తన పార్టీ కార్యకర్తల కష్టాన్ని, వారి నిబద్ధతను నేను పూర్తిగా నమ్ముతున్నానని పేర్కొన్నారు. మే డే చరిత్ర – ద్రావిడ ఉద్యమ నేపథ్యం భారతదేశంలో మేడే వేడుకల ప్రాముఖ్యతను, తమ పార్టీకి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా స్టాలిన్ గుర్తుచేసుకున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మేడే వేడుకలను చైన్నెలోనే జరుపుకున్నారని గుర్తు చేశారు. అప్పట్లో సిందనై సెల్వన్ సింగారవేలర్ నాయకత్వంలో చైన్నెలో ఈ వేడుక మొదలైందన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సి.ఎన్.అన్నాదురై మే 1వ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన కరుణానిధి మేడేను జీతంతో కూడిన సెలవు దినంగా మార్చి చట్టం చేశారన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తమిళనాడులో మాత్రమే ఉన్న ఈ సెలవు దినాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కరుణానిధి పట్టుబట్టారని, నాటి ప్రధాని వి.పి.సింగ్ ఆ ప్రతిపాదనను అంగీకరించి, భారతదేశం అంతటా మే డేను జీతంతో కూడిన ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారని స్టాలిన్ గుర్తుచేశారు. ప్రస్తుతం చైన్నెలో ఉన్న మే డే పార్కును, అక్కడ ఉన్న స్మారక చిహ్నాన్ని కూడా కరుణానిధే స్వయంగా పర్యవేక్షించి నిర్మించారన్నారు. కార్మికుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం కరుణానిధి ఎంతటి నమ్మకంతో పనిచేశారో.. అదే నమ్మకాన్ని నిలబెడుతూ తన ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు.శుభవార్త అందుతుంది రెండు రోజుల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలందరికీ మంచి వార్త అందుతుందనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. ద్రావిడ మున్నేట్ర కజగం ప్రభుత్వం అందరికీ అన్నీ అనే సమ్మిళిత అభివృద్ధి సిద్ధాంతంపైనే పనిచేస్తున్నదన్నారు. భవిష్యత్తులోనూ ఇదే పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
రజనీ గుడిలో అభిషేకాలు
సాక్షి, చైన్నె: అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మేడే పురస్కరించుకుని మదురై జిల్లా తిరుమంగళంలో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆలయంలో శుక్రవారం విశేష పూజలు, అభిషేకా లు నిర్వహించారు. రజనీకాంత్కు వీరా భిమాని అయిన కార్తీక్ అనే మాజీ సైనికుడు తన ఇంటి వద్దే నల్లరాతితో రెండు విగ్రహాలను ప్రతిష్ఠించి ఈ రజనీ ఆలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. బాషా కటౌట్..16 రకాల అభిషేకాలు ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో మేడే వేడుకలను కార్తీక్ ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇందులోభాగంగా ఈ ఏడాది వేడుకలు జరిగాయి. రజనీకాంత్ నటించిన బాషా చిత్రంలోని ఆటోడ్రైవర్ గెటప్లో ఉన్న భారీ కటౌట్ను ఆలయంలో ఉంచి ప్రత్యేకంగా అలంకరించారు. రజనీకాంత్ విగ్రహాలకు 16 రకాల ద్రవ్యాలతో ఘనంగా అభిషేకం చేశారు. అభిషేకం అనంతరం కార్మికులందరి జీవితాలు సుభిక్షంగా సాగాలని, అందరికీ మేలు జరగాలని ప్రత్యేక హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. పూజల అనంతరం కార్మికులకు, భక్తులకు తీపి పదార్థాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రజనీ అభిమాని కార్తీక్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మేడే నాడు తమ కులదైవం లాంటి రజనీకాంత్ ఆలయంలో కార్మికులకు గౌరవార్థం ఈ వేడుకలను జరపడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. -
నీట్ విద్యార్థులకు హాల్ టికెట్లు
తిరువళ్లూరు: నీట్ పరీక్షల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లో చదువుతున్న 50 మంది విద్యార్థులకు హాల్టికెట్లను కలెక్టర్ ప్రతాప్ ఽశుక్రవారం అందజేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచిత నీట్ కోచింగ్తోపాటు ఉచిత భోజనం వసతులను ప్రభుత్వం కల్పించింది. ఇక్కడి విద్యార్థులకు హాల్టికెట్లను పంపిణీ చేసే కార్యక్రమం పట్టాభిరామ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతాప్ హాజరై హాల్టికెట్లను పంపిణీ చేశారు. సీఈఓ కర్పగం, డీప్యూటీ ఇన్స్పెక్టర్ పాండ్యన్ పాల్గొన్నారు. కార్మికుల జెండా ఆవిష్కరణ వేలూరు: వేలూరు ఉమ్మడి జిల్లాతో పాటు తిరువణ్ణామలై జిల్లాలో మే డే వేడుకలను కార్మిక నేతలు ఘనంగా నిర్వహించారు. వేలూరు సీఐటీయూ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి రామచంద్రన్ కార్మిక జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా బస్సు ట్రాన్స్పోర్టు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం పరశురామన్ అల్లాపురంలోని బస్సు డిపో ఎదుట జెండాను ఎగురవేశారు. వేలూరు జిల్లా ఆటో కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వసంతపురం నుంచి అన్నారోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం భవన నిర్మాణ కార్మికుల సంఘం అఖిల భారత అధ్యక్షుడు ఆర్టీ పయణి అధ్యక్షతన మండీ వీధి, సంఘ కార్యాలయం ఎదుట జెండాను ఎగురవేశారు. తిరుచెందూర్ హుండీ ఆదాయం రూ. 3.95 కోట్లు అన్నానగర్: తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి హుండీ ఆదాయం రూ.3.95కోట్లు లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో ప్రతి నెలా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను లెక్కిస్తారు. ఈ నేపథ్యంలో, గురువారం ఆలయ ప్రాంగణంలో కానుకలను సిబ్బంది లెక్కించారు. లెక్కింపులో రూ.3.95 కోట్ల నగదు, 803 గ్రాముల బంగారం, 17 కిలోల 765 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీని భక్తులు కానుకలుగా సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇరుళ కుటుంబీకులకు పక్కా ఇళ్లు తిరుత్తణి: తిరుత్తణి సమీపంలో నిరుపేద ఇరుళ కుటుంబీకులకు 15 పక్కా ఇళ్లు నిర్మించి అర్హులకు శుక్రవారం అప్పగించారు. తిరుత్తణి యూనియన్లోని బీరకుప్పం పంచాయతీలోని కొండ ప్రాంతంలో కనీస సదుపాయాలు లేకుండా 15 ఇరుల కుటుంబీకులు చీకటి బతుకులు పట్ల తెలుసుకున్న తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ వారితో రాత్రంతా గడిపి వారి కష్టాలు తెలుసుకున్నారు. వారికి కనీస సదుపాయాలు కల్పించాలనే ఆశయంతో పంచాయతీరాజ్ నిధుల నుంచి రూ.18 లక్షలతో విద్యుత్, తాగునీరు, రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించారు. దీంతో పాటు పక్కా ఇళ్లు నిర్మాణం కోసం మద్రాస్ రోటరీ క్లబ్ సంయుక్త సహకారంతో ప్రయివేటు సంస్థ ముందుకొచ్చి రూ.1.05 కోట్ల వ్యయంతో 15 పక్కా ఇళ్లు నిర్మించారు., ఎయిడ్ ఇండియా సంస్థ సమక్షంలో ఈ పనులు పూర్తి చేశారు. చీకటి గ్రామంలో వెలుగులు నింపి కనీస సదుపాయాలు పక్కా ఇళ్లు నిర్మించారు. శుక్రవారం నూతన ఇళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే చంద్రన్, రోటరీ క్లబ్ శ్రేణులు, ఎయిడ్ ఇండియా సంస్థ ప్రతినిధులు పాల్గొని కొత్త ఇళ్లు లబ్ధిదారులకు అందజేశారు. చీకటి అలుముకున్న తమ బతుకుల్లో వెలుగులు నింపిన ఎమ్మెల్యే చంద్రన్, స్వచ్ఛంధ సంస్థల నిర్వాహకులకు ఇరుళ కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. బైక్ అదుపుతప్పి ఎస్ఐ మృతి అన్నానగర్: బైక్ అదుపుతప్పి ఓ ఎస్ఐ మృతిచెందాడు. మదురై దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మదురైలోని తిరుపరంకుండ్రం త్యాగరాజర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. గురువారం, మదురై తిలగర్ దిడల్ పోలీస్ ఎస్ఐ బాలమురుగన్ భద్రతా కారణాల దృష్ట్యా బైక్లో లెక్కింపు కేంద్రానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి కళాశాల ప్రవేశ ద్వారాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలమురుగన్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కిటకిటలాడిన గిరివలయం
వేలూరు: చిత్ర పౌర్ణమిని పురస్కరించుకుని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ గిరివలయం రోడ్డు గురువారం రాత్రి పూర్తిగా భక్తులతో కిటకిటలాడింది. ఎటు చూసినా భక్త జనమే, ఎటు విన్నా హరోం హరా నామస్మరణమే వినిపించింది. గురువారం నుంచి శుక్రవారం రాత్రి వరకు గిరివలయం చుట్టి వచ్చి ఐదు గంటల పాటు క్యూలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. 20 లక్షలకు పైగా భక్తులు తిరువణ్ణామలై చేరుకోవడంతో భక్తులతో కిటకిటలాడింది. మాడ వీధుల్లో స్వామి వారికి భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఎస్పీ సుధాకర్ అద్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు, బస్సులను ఏర్పాటు చేశారు. 16 ప్రాంతాల్లో తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా 87 ప్రాంతాల్లో కారు పార్కింగ్ వసతి ఏర్పాటు చేశారు. స్వామి వారి దర్శనార్థం తిరువణ్ణామలైకి వచ్చిన భక్తుకలు గిరివలయం రోడ్డుతో పాటు ఆలయ ప్రాంగణం, అష్టలింగం ఆలయం ప్రాంతాల్లో దాతలతో పాటు ఆలయ నిర్వాహకులు, మజ్జిగ, నీరు, శీతల పానియాలను అందజేశారు. -
మానవత్వాన్ని అలవర్చుకోవాలి
సాక్షి, చైన్నె: విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా విద్యతోపాటు మానవత్వాన్ని కూడా అలవరుచుకోవాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అన్నారు. నీలగిరి జిల్లా ఊటీ లవ్డేల్లోని ప్రసిద్ధ లారెన్స్ పాఠశాల 168వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గవర్నర్ బహుమతులు అందజేసి ప్రసంగించారు. జాతీయ విద్యా విధానం దేశంలో నూతన జాతీయ విద్యా విధానం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో లారెన్స్ వంటి విద్యాసంస్థలు అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. విద్యా రంగంలో రాణించే వారిని ప్రోత్సహించాలని, వారి విజయం మొత్తం విద్యా వ్యవస్థ సాధించిన విజయమని వివరించారు. దేశ సేవ ముఖ్యం నేటి సమాజంలో విద్యార్థులు కేవలం అధిక మార్కు లు సాధించాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అయితే యువత చదువుతోపాటు మానవతా విలువలను పెంపొందించుకోవాలని, చదువు పూర్తయిన తర్వాత సమాజానికి, దేశానికి సేవ చేసే మనస్తత్వాన్ని కలిగి ఉండడం చాలా ముఖ్యమని పిలుపునిచ్చారు. ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యా అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ సూచించారు. కేవలం ఉద్యోగాలు వెతికే వారిలా కాకుండా, పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలలు, కళాశాలల్లో వ్యవస్థాపక అభివృద్ధి విభాగాలను ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే సరికొత్త ఆలోచనలను, సృజనాత్మకతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాల హెచ్ఎం డి.వి.ఎస్. రావు, పాఠశాల పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులుపాల్గొన్నారు. -
మరో 30 ఏళ్లు ఎడిసన్ అవార్డులు
తమిళసినిమా: చలన చిత్రానికి ఆరాధ్యుడైన థామస్ ఆల్వా ఎడిసన్ పేరును స్మరించుకునే విధంగా సెల్వకుమార్ ఎడిసన్ పేరుతో సినీ అవార్డుల వేడుకలను ఖాతా 17 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 17వ వార్షిక ఎడిషన్ అవార్డుల వేడుకను ఈ నెల 24న స్థానిక నందంబాక్కంలోని ట్రేడ్ సెంటర్లో బ్రహ్మాండంగా నిర్వహించతలపెట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజకీయనేత, సామాజిక వేత్త వేల్మురుగన్, రాధారవి, అంబిక, డాక్టర్ సీఎంకే రెడ్డి పాల్గొన్నారు. సీఎంకే రెడ్డి మాట్లాడుతూ ఈ ఎడిసన్ అవార్డుల వేడుకలను మరో 30 ఏళ్ల పాటు నిర్వహిస్తారని అన్నారు. తాను ఇటీవల యూఎస్ఏ వెళుతున్న సమయంలో ఒక్క నిమిషం నిడివి గల షార్ట్ ఫిలిం చూశానన్నారు. అందులో ఒక వ్యక్తి లోకల్ ట్రైన్లో పయనిస్తుండగా సిగరెట్ తాగాలనిపించడంతో జేబులో సిగరెట్ లేకపోవడంతో ఒక స్టేషన్లో రైలు ఆగగా రైలు దిగి ఎదురుగా ఉన్న దుకాణంలో సిగరెట్లు కొనుక్కుని రైలు బయల్దేరడంతో పరిగెత్తి ఎక్కేశాడన్నారు. కొంత దూరం వెళ్లిన తరువాత చేతిలో బ్యాగ్ లేకపోవడం గమనించారన్నారు. ఆ బ్యాగ్ను సిగరెట్ కొన్న దుకాణంలో పెట్టి తీసుకోకుండా వచ్చేశాడన్నారు. ఇటువంటి వ్యసనాలతో కలిగే నష్టానికి ఇంతకంటే నిదర్శనం వేరే ఏముంటుందని సీఎంకే.రెడ్డి పేర్కొన్నారు. -
గ్యాస్ ధర పెంపుతో గగ్గోలు
సాక్షి, చైన్నె: దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం నుంచి వర్తించేలా గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడంతో తమిళనాడులో వర్తకులలో ఆందోళన నెలకొంది. ఇక దుకాణాలను మూసి వేయడం లేదా అన్ని రకాల ఆహార పదార్థాలపై ధరలను పెంచడం తప్ప మరే గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరల హెచ్చుతగ్గులతో సాగుతుంది. గత కొంత కాలంగా వాణిజ్య సిలిండర్లు తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే అనేక దుకాణాలు వారంలో రెండుమూడు రోజులు తాళం వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో వర్తక సిలిండర్లపై భారం మోపడం చర్చకు దారి తీసింది. 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ.993 నుండి రూ.1,147 వరకు (నగరాల వారీగా) పెంచారు. చైన్నెలో గతంలో రూ.2,246.50 ఉండగా, ఇప్పుడు రూ.1,013 పెరిగి రూ.3,259.50 కు సిలిండర్ ధర చేరింది. ఇదే పరిస్థితి కాస్త హెచ్చుతగ్గులతో రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాలలో వర్తక సిలిండర్ల ధర నమోదైంది. దీంతో వర్తకులు, హోటల్ యజమానులు, టీ దుకాణదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ధరను అమాంతంగా పెంచేయడం బట్టి చూస్తే, ఇక దుకాణాలకు తాళం వేసుకోవడం లేదా, తమ మీద పడ్డ భారం నుంచి బయట పడేందుకు ధరల పెంపు అనివార్యంగా పేర్కొంటున్నారు. టీ, కాఫీ, హోటళ్లలో అన్ని రకాల ధరలు శనివారం నుంచి అమాంతంగా పెంచక తప్పదని వర్తక సంఘాలు ప్రకటించడం గమనార్హం. తాజాగా పెంపుతో ప్రజల మీద మరింత భారం పడ్డట్టు అయింది. ఈ పెంపును సీఎం స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. ప్రజల నడ్డి విరిచేందుకు కేంద్రంలోని పాలకులు సిద్ధమయ్యారని మండి పడ్డారు. ఈ పెంపును వెనక్కు తీసుకోవాలని డిమండ్ చేశారు. తాజాగా వర్తక సిలిండర్ల ధర పెంచిన కేంద్రం, మున్ముందు ఇళ్లకు ఉపయోగించే ఎల్పీజీతో పాటుగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతంగా పెంచే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. -
అదుపుతప్పి దూసుకెళ్లిన కారు
అన్నానగర్: కరూర్ జిల్లాలోని చెన్నిమలైపాలైయంకు చెందిన గుణశేఖర్(51) ఒక రైతు. ఇతని తల్లి భానుమతి(70). ఇతని సోదరి జయలక్ష్మి(46). వీరంతా గురువారం తిరుప్పూర్ జిల్లాలోని కాంగేయంలో ఉన్న ఒక బంధువును కలిసి కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. గుణశేఖరన్ కారు నడుపుతున్నాడు. వెల్లకోవిల్–కరూర్ జాతీయ రహదారి కూడలి వద్దకు చేరుకున్నప్పుడు కారు అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఒకానొక సమయంలో ఆ కారు రోడ్డు పక్కనే ఉన్న కురుక్కతి నివాసి సత్తివేల్ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ ఇంటి గోడ కూలిపోయింది. అనంతరం ఆ కారు ఇంటి ఆవరణలోని అరటి చెట్టును ఢీ కొట్టి ఆగిపోయింది.ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. భానుమతిని కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స అందక ఆమె మరణించింది. గుణశేఖరన్, జయలక్ష్మి చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
నీలగిరుల్లో వాన
సాక్షి, చైన్నె : రామేశ్వరం, ధనుస్కోటి తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కెరాటలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దీంతో పర్యాటకులు సముద్రంలోకి వెళ్లకుండా పోలీసులు నిషేధం విధించారు. రామేశ్వరం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ధనుస్కోటి , అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అరిచల్మునై అనే ప్రాంతాలు ఉన్నాయి. ధనుస్కోటిని చూడడానికి పర్యాటకులు, అరిచల్ మునై వద్ద పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ వేలాదిగా వస్తుంటారు. గత రెండు రోజులుగా ఈ పరిసరాలలో స్వల్పంగా కెరటాలు ఎగసి పడుతూ వచ్చాయి. శుక్రవారం ఇది మరింత ఎక్కువైంది. ధనుస్కోటిలోని దక్షిణ మన్నార్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ సముద్ర ప్రాంతం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. సముద్రపు అలల ధాటికి ధనుస్కోటి– అరిచల్ మునై జాతీయ రహదారి కోతకు గురికాకుండా ఏర్పాటు చేసిన రక్షణ కంచె రాళ్లు రోడ్డుపైకి కొట్టుకొచ్చాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతోపాటు బలమైన గాలులు వీస్తుండడంతో ధనుష్కోటి, ముకుందరాయర్ సత్రం, అరిచల్ మునై ప్రాంతాల్లో భక్తులు, పర్యాటకులు సముద్రంలో దిగి స్నానం చేయడాన్ని పోలీసులు పూర్తిగా నిషేధించారు.అకాల వర్షం కోయంబత్తూరు, నీలగిరి సహా 8 జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ ఒడిశా నుంచి మన్నార్ గల్ఫ్ వరకు, తమిళనాడు మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ప్రకటించారు. దీని ప్రభావంతో శనివారం నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూర్, తేని, దిండిగల్, ఈరోడ్, సేలం, నామక్కల్ జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచి, పిడుగులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించారు. అలాగే, 3వ తేదీన, నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లోని కొండ ప్రాంతాలు, తేని, దిండిగల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, 4వ తేదీన నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లోని కొండ ప్రాంతాలు, ఈరోడ్, సేలం, నామక్కల్, తిరుచ్చి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. అదే సమయంలో శుక్రవారం నీలగిరుల్లో అనేక చోట్ల వర్షం పడింది. తిరునెల్వేలి జిల్లా నాలుముక్కు, కాక్కాచ్చిలలో అత్యధికంగా 7 సెం.మీ చొప్పున వర్షం కురిసింది. దిండిగల్ జిల్లా పళనిలో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. తిరునెల్వేలి జిల్లా మాంజోలై, అంబసముద్రం, నీలగిరి జిల్లా వుడ్ బ్రయర్ ఎస్టేట్, చెరుముల్లి, ఈరోడ్ జిల్లా మొడక్కురిచ్చి ప్రాంతాల్లో 4 సెం.మీ చొప్పున వర్షం కురిసింది. కోయంబత్తూరులోనే అనేక చోట్ల అకాల వర్షం పడగా, రోడ్డుపై నీరు చేరడంతో యుద్ధప్రాతిపదికన తొలగించారు. -
కొడైకెనాల్ పర్యాటకులకు శుభవార్త
సాక్షి, చైన్నె: కొడైకెనాల్లోని అటవీ శాఖ నియంత్రణలో ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలను రెండు రోజుల పాటుగా పర్యాటకులు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ఉచితంగా సందర్శించవచ్చని దిండిగల్ జిల్లా కలెక్టర్ శరవణన్ ప్రకటించారు. ఉచిత సందర్శనకు దారితీసిన కారణం దిండిగల్ జిల్లాలోని ప్రముఖ హిల్ స్టేషన్ కొడైకెనాల్లో పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం అటవీ శాఖ ఇటీవల క్యూఆర్ కోడ్ ద్వారా ఒకే చోట ప్రవేశ రుసుము వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ విధానంతో గ్రీన్ వ్యాలీ పరిసర ప్రాంతాల్లో గంటల కొద్దీ తీవ్ర ట్రాఫిక్ జామ్ శుక్రవారం ఏర్పడింది. క్యూఆర్ కోడ్ విధానానికి నిరసనగా, పాత పద్ధతిలోనే ఏ పర్యాటక ప్రాంతానికి అక్కడ విడివిడిగా టిక్కెట్లు వసూలు చేయాలని డిమాండ్ చేస్తూ కొడైకెనాల్ టూరిస్ట్లు, వాహన డ్రైవర్లు ఈరోజుఉదయం నుంచి ఆందోళనకు దిగారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం పర్యాటకులు ఎక్కడకు వెళ్ల కుండా హోటళ్లు, రిసార్టులకు పరిమితం అయ్యారు. దీంతో సమస్యపై దిండిగల్ జిల్లా కలెక్టర్ శరవణన్ స్పందిస్తూ పర్యాటకుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు ప్రకటించారు. కొడైకెనాల్కు వస్తున్న పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శని, ఆదివారం రెండు రోజులపాటు అటవీ శాఖ ఆధ్వర్యంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను ఉచితంగా సందర్శించవచ్చు. ఎటువంటి టికెట్ తీసుకోనవసరం లేదని ప్రకటించారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఎలాంటి క్యూ లైన్లు లేకుండా పర్యాటకులు తక్షణమే టిక్కెట్లు పొందే కొత్త డిజిటల్ విధానం మే 4వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుందని కలెక్టర్ తెలిపారు. -
కాఫీ-టీ కలుస్తాయా?.. తమిళనాడులో ఏం జరగనుంది?
అన్నాడీఎంకే(ఎన్డీయే కూటమి)- టీవీకే పొత్తు చర్చల వేళ.. బీజేపీ సీనియర్ నాయకుడు అన్నామలై గతంలో చేసిన వ్యాఖ్యలు.. మళ్ళీ చర్చనీయాంశంగా మారాయి. అన్నామలై.. విజయ్ పార్టీతో (TVK) పొత్తు అసాధ్యమని గతంలో స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. కాఫీ, టీ కలిసిపోవు.. మేము సిద్ధాంతపరంగా విరుద్ధమంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికల ఫలితాలు హంగ్ అసెంబ్లీగా వస్తే, అన్నాడీఎంకే.. విజయ్ పార్టీతో పొత్తు గురించి ఆలోచించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.గతంలో ఓ వార్తా సంస్థతో జరిగిన ఇంటర్వ్యూలో ఒకవేళ అవసరమైతే విజయ్తో కలిసి పనిచేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందా?" అని అడగ్గా.. అన్నామలై ఘాటుగా స్పందించారు. "కాఫీ, టీ ఒకదానితో ఒకటి కలవవని నేను చాలాసార్లు చెప్పానంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఎడప్పాడి కె. పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే, విజయ్తో పొత్తు కోసం ప్రయత్నించవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ (తమిళగ వెట్రి కళగం) ఘనవిజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం, టీవీకే 98 నుండి 120 స్థానాలను గెలుచుకుని.. అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని చెబుతున్నాయి.ఒక సర్వే టీవీకేకు సుమారు 35 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది. ఇది అధికార డీఎంకేతో సమానంగా ఉందని.. అదే సమయంలో ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి 23 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేశారు. జేవీసీ (JVC) ఎగ్జిట్ పోల్ ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి స్పష్టమైన మెజారిటీని అంచనా వేయగా.. మెజారిటీ సర్వేలు మాత్రం పోరు హోరాహోరీగా ఉంటుందని సూచిస్తున్నాయి. వివిధ పోల్స్ సారాంశం ప్రకారం, డీఎంకే కూటమి 112 నుండి 129 స్థానాలను, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ 86 నుండి 103 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. తుది ఫలితాలు దగ్గరగా ఉంటే, టీవీకే 'కింగ్ మేకర్'గా మారే అవకాశముందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒకవేళ బీజేపీ విముఖత చూపినా, అన్నామలై వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఏఐఏడీఎంకేపై ఈ పరిస్థితి తీవ్ర ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరిగాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. పాత ప్రత్యర్థులు, కొత్త శక్తులు తమ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటారా? అన్నది ఆసక్తి కలిగిస్తోంది. -
ఆర్సీబీ vs జీటీ మ్యాచ్లో 240 సీసీటీవీ కెమెరాలు ఆఫ్..!
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటెన్స్ (జీటీ) జట్ల మధ్య చిన్నస్వామి క్రీడామైదానంలో ఈనెల 24న జరిగిన రాయల్ ఐపీఎల్ పోటీల సమయంలో 240 సీసీటీవీ కెమెరాల సర్క్యూట్ను కట్చేసిన ఘటనకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంస్థ (కేఎస్సీఏ) స్పషీ్టకరణను ఇచ్చింది. ఇది పూర్తిగా ప్రైవేట్ అమ్మకందారులతో కూడిన అంతర్గత వివాదంగా స్పష్టం చేసింది. క్రీడామైదానం భద్రతకు సంబంధించి సంబంధం లేదని వెల్లడించింది. అమ్మకందారుల, దాని ఉద్యోగుల మధ్య చెల్లింపులకు సంబంధించి భిన్నాభిప్రాయాలతో ఈ సమస్య ఉద్భవించిందని పేర్కొంది. హర్యాణాకు చెందిన ఎస్టీఏక్యూ టెక్నాలజీస్ సంస్థ ఆదిత్య భట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్రదుర్గ జిల్లా హిరియూర మంజునాథ్ (37), ఉత్తర ప్రదశ్ సుల్తాన్పుర అబ్దుల్ కలాం (19) అరెస్ట్ చేశారని పేర్కొంది. ‘క్రీడామైదానం భద్రత కోసం అమర్చబడిన సీసీటీవీ కెమెరాల నిర్వహణ బాధ్యతను ఐవీఎస్ డిజిటల్ సొల్యూషన్ అనే ఉప పంపిణీదారుల సంస్థకు ఇచ్చారు. ఆ సంస్థలో మంజునాథ్, అబ్దుల్ కలాం గతంలో పనిచేశారు. అయితే కంనెనీ నుంచి జీతం పెండింగ్ ఉంది, ఎంత అడిగినా జీతం ఇవ్వకపోవటంతో కోపగించుకొని ఈ కృత్యానికి పాల్పడ్డారు’. ఈ విషయం తనిఖీ ద్వారా తెలిసిందని పోలీసులు తెలిపారు. -
టీ20 జట్టులో చోటు దక్కకపోవడంతో క్రికెటర్ ఆత్మహత్య
సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో శిక్షణ పొందుతున్న క్రికెటర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్కు చెందిన కాశ్మీర్ కుమార్ చెన్నైలో జీఎస్టీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఇతని కుమార్తె ఏంజెల్ కంగావి (19) పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. ఆమె టీ20 జట్టులో చోటుకోసం ప్రయత్నించింది. ఎంపిక కాకపోవడంతో మనస్తాపం చెందింది. బుధవారం రాత్రి ప్రాక్టీస్ ముగించుకుని ఇంటికి వచ్చిన ఏంజెల్ ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంది. ఆమె రాసిన లేఖను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అందులో ‘చాలా కాలంగా నా జీవితాన్ని దేవుడే రాశాడు. నా చావుకు నేనే కారణం. నేను ఇతరులను నిందించాలనుకోవడం లేదు. అమ్మా, నాన్నా మీరు నాకు చాలా గుర్తొస్తున్నారు’ అని రాసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
విద్యార్థినిపై లైంగిక వేధింపులు
తిరువొత్తియూరు: నందంబాక్కం ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలిక, కోటూర్పురంలోని ఓ ప్రైవేట్ భరతనాట్య శిక్షణ కేంద్రంలో నృత్యం నేర్చుకుంటోంది. ఆ పాఠశాల నృత్య ఉపాధ్యాయురాలి భర్త, 60 ఏళ్ల ఉమా శంకర్, గత కొంతకాలంగా ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, తప్పుడు ఉద్దేశంతో ఆమెను వేధిస్తున్నట్లు సమాచారం. బుధవారం ఎప్పటిలాగే బాలిక నృత్య తరగతికి వెళ్ళినప్పుడు, ఉమా శంకర్ ఆమె దగ్గరకు వచ్చి ఏకాంతంగా మాట్లాడాలని పిలిచి లైంగికంగా వేధించాడు. దీనితో దిగ్భ్రాంతికి లోనైన బాలిక, ఇంటికి వెళ్లి తన తల్లికి విషయాన్ని వివరించింది. బాలిక తండ్రి ఎయిర్ఫోర్స్లో పనిచేసి పదవీ విరమణ చేసిన వ్యక్తి. వెంటనే బాలిక తల్లిదండ్రులు కోటూర్పురం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉమా శంకర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తిరువళ్లూరు: రోడ్డు ప్రమాదాల నివారణతోపాటు మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాలపై ఊత్తుకోట పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం గురువారం ఉదయం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ శక్తివేల్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు, మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఎస్ఐ శక్తివేల్ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా వాహనాలను నడపడం, మత్తుపదార్థాలు తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం వుందన్నారు. వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన సూచించారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా వుండాలని సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా వుండడానికి పుస్తకాలను చదవడం, క్రీడలపై ఆసక్తి పెంచుకోవడంపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అధికారులు, వాహనచోదకులు, స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
పుదుచ్చేరి బాలిక హత్య కేసులో కరుణాస్ దోషి
సాక్షి, చైన్నె: ఇంటి బయట ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికను అపహరించి లైంగిక దాడి చేసి హతమార్చిన కేసులో నిందితుడు కరుణాష్ను కోర్టు గురువారం దోషిగా తేల్చింది. 2024 మార్చి 2వ తేదీన పుదుచ్చేరి ముత్తియాల్పేట ప్రాంతానికి చెందిన 5వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలిక ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమైంది. మార్చి 4వ తేదీ రెండు రోజుల తర్వాత, బాలిక మృతదేహం ఇంటి సమీపంలోని ఒక కాలువలో లభ్యమైంది. బాలిక కాళ్లు, చేతులు కట్టేసి, ఒక దుప్పటిలో చుట్టి పడేసి ఉన్న స్థితిలో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన పెద్ద కలకలం రేపింది. ఈ కేసులో అదే ప్రాంతానికి చెందిన కరుణాస్ (19) ,వివేకానందన్(59)ను పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన వివేకానందన్ అదే ఏడాది సెప్టెంబర్ లో జైలులోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరుణాస్పై లైంగిక దాడి, కిడ్నాప్, హత్య, ఆధారాల విధ్వంసం వంటి సెక్షన్ల కింద పోలీసులు 540 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు. పోక్సో కోర్టు న్యాయమూర్తి సుమతి గురువారం తుది తీర్పునిస్తూ కరుణాస్ను దోషిగా ప్రకటించారు. నిందితుడికి ఎలాంటి శిక్ష విధించాలనే అంశంపై మే 5వ తేదీన ప్రకటిస్తామన్నారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని ప్రభుత్వ న్యాయవాది పచ్చయప్పన్ కోర్టును కోరారు. నిందితుడు కరుణాస్ -
వరల్డ్ వెజ్ కౌన్సిల్ అధ్యక్షుడి నియామకం
కొరుక్కుపేట: వరల్డ్ వెజ్ కౌన్సిల్ చైన్నె– 2026 సంవత్సరానికి కొత్త కార్యవర్గ బందాన్ని ప్రకటించింది. ఇందులో అంతర్జాతీయ అధ్యక్షుడిగా వైట్ ఫైర్ డైమండ్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ ఎండీ ఎస్. మహావీర్ చంద్ బోత్రా, అంతర్జాతీయ కార్యదర్శి డైరెక్టర్లుగా దేవినారాయణ్, ఎక్స్పోర్టర్స్ ప్రయివేటు లిమిటెడ్ ఎండీ సుధాకర్ నారాయణస్వామి నియమితులయ్యారు. అంతర్జాతీయ కోశాధికారి అండ్ డైరెక్టర్గా బృందావన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, చైన్నె సీఈఓ ఆర్. మురళీరావు, వ్యవస్థాపకుడు అంతర్జాతీయ అధ్యక్షుడు అండ్ డైరెక్టర్గా దుగర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైన్నె చైర్మన్ ఎన్. తారాచంద్ దుగర్ నియమితులైనట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
కనుల పండువగా మహాకుంభాభిషేకం
మహాకుంభాభిషేకంలో భక్తజనం పళ్లిపట్టు: పొదటూరుపేటలో ఆర్ముగస్వామి ఆలయ మహాకుంభాభిషేకం గురువారం కనుల పండువగా నిర్వహించారు. పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేట కొండపై ఆర్ముగస్వామి ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేసి మహాకుంభాభిషేకం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. అందులోభాగంగా కొత్తగా వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామికి ఆలయాలు, విమాన గోపురంతో, శిలలు ప్రతి ష్ఠించారు. దీంతో మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు మహాకుంభాభిషేకం వేడుకలు నిర్వహించారు. ఇందులోభాగంగా గురువారం శివాచార్యుల బృందం పవిత్ర పుణ్యతీర్థాల కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి మహాకుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మధ్యాహ్నం శ్రీవళ్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. సాయంత్రం శివపార్వతులు, వినాయకుడు, వళ్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవర్లను పట్టణ వీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతుపట్టి కొబ్బరికాయలు కొట్టి స్వామిని దర్శించుకున్నారు. -
కిటకిటలాడిన గిరివలయం
వేలూరు: చిత్ర పౌర్ణమిని పురష్కరించుకొని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ గిరివలయం రోడ్డు భక్తులతో కిటకిటలాడింది. ఈఏడాది చిత్ర పౌర్ణమి గురువారం రాత్రి 9.52 గంటలకు ప్రారంభమై శుక్రవారం రాత్రి 11.08 గంటలకు ముగుస్తుంది. కార్తీక దీపం తరహాలోనే చిత్ర పౌర్ణమికి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేశారు. అదేవిధంగా ఆలయంలోని అన్నామలైయార్ సమేత ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు చేశారు. ఇదిలాఉండగా చిత్ర పౌర్ణమి సమయంలో గిరివలయం రోడ్డులో కాలి నడకన వచ్చి స్వామి వారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అందులో బాగంగా 15 లక్షలకు పైగా భక్తులు తిరువణ్ణామలై చేరుకున్నారు. అనంతరం గిరివలయం వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో గురువారం రాత్రి తిరువణ్ణామలైలో ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడింది. అదేవిధంగా భక్తులు ఆలయంలోను బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు. మాడ వీధుల్లో స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా భక్తులు ఎలాంటి తొక్కిసలాట లేకుండా ఎస్పీ డాక్టర్ సుధాకర్ అధ్యక్షతన ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో పది రోజులు చిత్ర వసంతోత్సవాలు అతి వైభవంగా జరిగింది. ఇందులోభాగంగా స్వామివారు వివిధ పుష్పాలంకరణల మధ్య మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. పది రోజుల పాటు స్వామివారు వివిధ వాహనాల్లో తిరిగి అలసిపోవడంతో స్వామివారిని ఆలయ కోనేటిలో శివాచార్యుల వేద మంత్రాల నడుమ తీర్థవారి నిర్వహించారు. అనంతరం స్వామి వారిని భక్తుల దర్శనార్థం ఊరేగించారు. -
తిరుచెందూర్లో వేల్ ట్రెండ్
సాక్షి, చైన్నె: తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఇంకా కొద్ది రోజులే సమయం ఉన్న తరుణంలో, తిరుచెందూర్ మురుగన్ ఆలయంలో రాజకీయ ప్రముఖులు పూజలలో లీనం అవుతున్నారు. టీవీకే అధినేత విజయ్ బాటలో చేతిలో వేల్తో డీఎంకే మంత్రులు పలువురు దర్శనం చేసుకున్నారు. ఏప్రిల్ 28న తమిళగ వెట్రి కళగం అధినేత నటుడు విజయ్ తిరుచెందూర్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పూజారులు ఆయనకు 2 అడుగుల ఎత్తున్న వేల్ (మురుగన్ ఆయుధం) అందజేశారు. విజయ్ ఆ వేల్ను చేతబట్టి స్వామిని దర్శించుకోవడమే కాకుండా, శత్రువుల నాశనానికి ప్రతీకగా భావించే శత్రు సంహార మూర్తిని కూడా దర్శించుకుని యాగాది పూజలు చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పోటాపోటీగా మంత్రుల దర్శనం విజయ్ సందర్శన జరిగిన రెండు రోజులకే, తమిళనాడు మంత్రులు శేఖర్ బాబు , అనితా రాధాకృష్ణన్ తదితరులు గురువారం తిరుచెందూర్ ఆలయానికి చేరుకున్నారు. విజయ్కు 2 అడుగుల వేల్ను అందిస్తే, మంత్రులిద్దరికీ ఏకంగా 5 అడుగుల ఎత్తు ఉన్న వేల్ను పూజారులు అందజేశారు. వారు కూడా విజయ్ తరహాలోనే మూలవరునితో పాటు షణ్ముగర్, దక్షిణామూర్తి సన్నిఽధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, మురుగన్ భక్తులకు వేల్ అంటే విజయానికి చిహ్నం. ఎన్నికల ఫలితాలు మే 4న రానున్న నేపథ్యంలో, తమ ప్రత్యర్థులపై విజయం సాధించాలనే కోరికతోనే నాయకులందరూ శత్రు సంహార మూర్తిని దర్శించుకునేందుకు తిరుచెందూరు వైపుగా క్యూ కడుతుండడం విశేషం. విజయ్కు పోటీగా మంత్రులు పెద్ద వేల్ను పట్టుకున్నారా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. -
ఘనంగా ఐఐటీ మద్రాస్ 67వ ఇన్స్టిట్యూట్ డే
సాక్షి, చైన్నె: ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్ 67వ ఇన్స్టిట్యూట్ డే వేడుకలు గురువారం క్యాంపస్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వి. అనంత నాగేశ్వరన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సాంకేతికత, ప్రతిభ , భారతదేశ ట్రిలియన్ డాలర్ల లక్ష్యం అనే అంశంపై ప్రసంగించారు. ప్రస్తుతం దేశ జీడీపీ దాదాపు 3.91 ట్రిలియన్ డాలర్లుగా ఉందని, రాబోయే ఆరేళ్లలో ఇది 7.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని డాక్టర్ నాగేశ్వరన్ ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర శతాబ్ది వేడుకల నాటికి (2047) భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సాంకేతికత ప్రాధాన్యత లక్ష్యాలను సాధించాలంటే భారతదేశం సొంతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, ప్రపంచం సాంకేతికతను ఉచితంగా ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ఐఐటీల వంటి సంస్థలు అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు వేదిక కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో రాణించిన ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులకు ప్రతిష్టాత్మక అవార్డులను అందజేశారు. విశిష్ట పూర్వ విద్యార్థుల పురస్కారాలు ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ డి.కె. సునీల్, గోల్డ్మన్ శాక్స్ గ్లోబల్ కో–హెడ్ మహేశ్వర్ సైరెడ్డి సహా 11 మందికి ఈ పురస్కారాలు లభించాయి. అలాగే యంగ్ అలమ్నీ అచీవర్ అవార్డులు పెర్ప్లెక్సిటీ . ఏఐ కో–ఫౌండర్ , సీఈఓ డాక్టర్ అరవింద్ శ్రీనివాస్, డార్విబాక్స్ సీఈఓ జయంతి పాలేటి, గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టర్ సువినయ్ సుబ్రమణియన్ అందుకున్నారు. ఐఐటీ మద్రాస్ రికార్డులు.. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మాట్లాడుతూ.. వరుసగా ఏడవ ఏడాది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో శ్రీఓవరాల్శ్రీ కేటగిరీలో నంబర్ 1 స్థానాన్ని, ఇంజినీరింగ్ విభాగంలో వరుసగా పదవ ఏడాది ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే ఐఐటీ మద్రాస్ను ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీ నేషనల్ యూనివర్సిటీగా మార్చేందుకు ఐఐటీఎం గ్లోబల్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అత్యుత్తమ బోధన కనబరిచిన ప్రొఫెసర్లు, పరిశోధకులు, సిబ్బందికి కూడా వివిధ పురస్కారాలను అందజేసి సత్కరించారు. -
క్లుప్తంగా
అన్నానగర్: దైవ దర్శనానికి వెళుతూ కారు బోల్తాపడిన ఘటనో ఓ బాలిక మృతిచెందింది. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. చెంగల్పట్టు జిల్లాలోని తలంబూర్ స్మార్ట్ టౌన్ ప్రాంతానికి చెందిన రాజతిలక్ (37) గురువారం ఉదయ కుటుంబంతో కలిసి పళని మురుగన్ ఆలయానికి కారులో బయలుదేరాడు. దిండుక్కల్– తిరుచ్చి జాతీయ రహదారిపై వడమదురై సమీపంలోని కొప్పంపట్టి వద్ద వెళుతుండగా కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈప్రమాదంలో కారులో ఉన్న రాజతిలక్, అతని తండ్రి మురుగన్ (61), తల్లి సెన్బగవల్లి (58), భార్య తమిళసెల్వి (35), కుమార్తెలు వర్ణాసాసీ (11), ఆధ్యసాన్వి (7) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గాయపడ్డ వారిని దిండుక్కల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆధ్యసాన్వి మార్గమధ్యంలోనే మృతిచెందింది. పోలిసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరువళ్లూరు: వైద్యవీరరాఘవుడి ఆలయంలో జరుగుతున్న చైత్రమాసం బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిదవ రోజు గురువారం ఉదయం స్వామివారికి తీర్థవారి నిర్వహించారు. తిరువళ్లూరులోని శ్రీవైద్యవీరరాఘవుడి ఆలయంలో ప్రతి ఏటా చైత్రమాసంలో పది రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తొమ్మిదవ రోజు ఉదయం స్వామి వారికి ఆలయ పుష్కరిణిలో తీర్థవారి నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు విజయకోటి విమానసేవను కనుల పండువగా నిర్వహించారు. తిరువొత్తియూరు: చెంగల్పట్టు సమీపంలోని విలంగడుపాక్కం ప్రాంతానికి చెందిన పరందామన్(53) మేసీ్త్రగా పనిచేసేవాడు. ఇతనికి భార్య సెల్వి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పరందామన్కు మద్యంతాగే అలవాటు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బుధవారం కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో సెల్వి తన పిల్లలతో కలిసి సమీపంలోని తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. రాత్రి సమయంలో పరందామన్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో పరం దామన్ ఇంటికి అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఇంట్లోని గ్యాస్ సిలిండర్ కూడా పేలడంతో మంటలు తీవ్రమయ్యాయి. బయటకు రాలేక పరందామన్ ఇంట్లోనే చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమిళసినిమా: విక్రమ్ కథానాయకుడుగా నటించిన చిత్రం ధ్రువ నక్షత్రం.నటి నీతు వర్మ నాయకగా నటించిన ఇందులో సిమ్రాన్, రాధిక శరత్ కుమార్, పార్తీపన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2017లో ప్రారంభమయింది. 2018 లో విడుదల చేయడానికి ప్రణాళికలన సిద్దం చేశారు. అయితే కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా చిత్రం అనుకున్న ప్రకారం విడుదల కాలేదు. దర్శకుడు గౌతమ్ మేనన్ పలు విధాలుగా ప్రయత్నాలు చేసి 2023లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు అయితే అప్పుడు కూడా పలు ఆటంకాలు ఎదురయ్యాయి కాగా ఇటీవల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని మరో రెండు వారాల్లో దవనక్షత్రం చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ఇలాంటి పరిస్థితుల్లో ధ్రువ నక్షత్రం చిత్ర విడుదలపై నిషేధం విధించాలన్న పిటిషన్ గురువారం విచారించిన చైన్నె హైకోర్టు చిత్రాన్ని జూన్ 15వ తేదీని విడుదలకు అనుమతిని ఇస్తూ కొన్ని నిబంధనను విధించింది. ఈ చిత్రం వసూళ్ల వివరాలను తెలిపే విధంగా ప్రత్యేకంగా బ్యాంకులో ఖాతాను ప్రారంభించాలని అందులో చిత్ర ఆదాయ వ్యయ వివరాలను పొందుపరచడానికి ఒక వ్యక్తిని నియమించాలని, ఆ చిత్ర వసూళ్లను ఎవరు ఖర్చు చేయరాదని, అదేవిధంగా చిత్ర దర్శకుడు గౌతమ్ మేనన్ ,సహ నిర్మాతలు విడుదల చేయడానికి కావలసిన డబ్బులు ఇంతకుముందే ఆయన డాక్యుమెంట్స్ కుదవ పెట్టిన వారి నుంచి మరికొంత డబ్బు పొందాల్సి అవసరం ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా చిత్రాన్ని విడుదల చేసే ముందు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యంతో చర్చించాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఒకవేళ చిత్రాన్ని జూన్ 15వ తేదీ విడుదల చేయలేకపోతే ఆ కారణాలను న్యాయస్థానానికి వివరించాల్సి ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
కౌంటింగ్ కేంద్రాల్లో.. క్యూఆర్ కోడ్ నిఘా
సాక్షి, చైన్నె: ఓట్ల లెక్కింపు సమయంలో అనధికార వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి ఎన్నికల కమిషన్ వినూత్నమైన క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టింది. మే 04న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నుండి ఈ విధానం అమలులోకి తీసుకొస్తూ న్ణియించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద గుర్తింపును ధృవీకరించడానికి మూడు అంచెల భద్రతా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొదటి, రెండవ అంచెల్లో రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులను మాన్యువల్గా తనిఖీ చేస్తారు. మూడవ అంచె (కౌంటింగ్ హాల్ దగ్గర) వద్ద కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ధృవీకరణ పూర్తయ్యాక మాత్రమే లోపలికి అనుమతించేందుకు చర్యలు తీసుకున్నారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, లెక్కింపు సిబ్బంది, టెక్నికల్ సిబ్బంది, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు , కౌంటింగ్ ఏజెంట్లకు ఈ క్యూఆర్ కోడ్ కార్డులు తప్పనిసరి చేశారు. ఇక మీడియా ప్రతినిధుల కోసం ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన అధికార పత్రాల ఆధారంగానే వారికి ప్రవేశం కల్పిస్తారు. పారదర్శకత కోసమే.. గత ఏడాది కాలంగా ఎన్నికల సంఘం చేపట్టిన 30కి పైగా సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అత్యున్నత స్థాయి భద్రత, పారదర్శకత , సమర్థతను నిర్ధారించడానికి ఈ డిజిటల్ విధానం దోహదపడుతుందని ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పి. పవన్ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు పర్యవేక్షణ తమిళనాడు వ్యాప్తంగా 62 కౌంటింగ్ కేంద్రాలలో ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున మొత్తం 234 మంది ఇతర రాష్ట్రాల ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించారు. లెక్కింపు ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి తమిళనాడు వెలుపలి రాష్ట్రాల నుండి వచ్చిన ఐఏఎస్ అధికారులు ప్రతి టేబుల్ వద్ద జరిగే లెక్కింపును పర్యవేక్షిస్తారు. ఏదైనా రౌండ్ ఫలితాన్ని అధికారికంగా ప్రకటించాలన్నా లేదా అత్యవసర పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ పరిశీలకుల ఆమోదం , సంతకం తప్పనిసరి కానుంది. కాగా, ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది సిబ్బందిని నియమించారు. వీరికి ఇప్పటికే శిక్షణ ముగించారు. పెద్ద నియోజకవర్గాల్లో లెక్కింపు ఆలస్యం కాకుండా అదనపు టేబుళ్లను కూడా ఏర్పాటు చే యడానికి చర్యలు తీసుకున్నారు. భారీ భద్రత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు భిన్నంగా ఉండటంతో, లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం , రాష్ట్ర పోలీసులు అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మందిని భద్రతా విధులలోకి పోలీసులను నియమించారు. రాజధాని చైన్నెలో భద్రత కోసం 20,000 మంది పోలీసులను కేటాయించారు. 62 లెక్కింపు కేంద్రాల వద్ద కేంద్ర పారామిలిటరీ బలగాలు నిరంతరం పర్యవేక్షణలో ఉన్నాయి. -
సీమాన్కు మళ్లీ నిరాశేనా?
సాక్షి, చైన్నె : తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్పోల్ ఫలితాలు నామ్ తమిళర్ కట్చికి, ముఖ్యంగా సీమాన్కు గట్టి షాక్ ఇచ్చాయి. ఈ సర్వేల ప్రకారం సీమాన్ పార్టీ ఈసారి కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవచ్చు లేదా అతి తక్కువ స్థానాలకే పరిమితం కావచ్చు. ఏ సర్వే కూడా ఈ పార్టీకి నిర్ణయాత్మక శక్తి అన్న ఫలితాన్ని ఇవ్వలేదు. విజయ్ ఎఫెక్ట్తో నష్టం మార్పు కోరుకునే యువత ఓట్లు గతంలో నామ్ తమిళర్ కట్చికి పడేవి. అయితే ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి రావడంతో, సీమాన్ మద్దతుదారులుగా ఉన్న యువతలో చాలామంది విజయ్ వైపు మొగ్గు చూపారు. సీమాన్ ఓట్లను విజయ్ భారీగా చీల్చడం నామ్ తమిళర్ ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో యంత్రాంగం లోపం డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలకు ఉన్న బలమైన బూత్ కమిటీలు, గ్రామస్థాయి కార్యకర్తల నెట్వర్క్ నామ్ తమిళర్ కట్చికి లేదు. ఇది ఎన్నికల రోజున ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకురావడంలో ప్రతిబంధకంగా మారింది. ఒంటరి పోరాటం అనే సీమాన్ విధానం వల్ల తాజాగా కూడా ఒరిగిందేమీ లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సీమాన్ మాట్లాడే తీవ్రమైన తమిళ జాతీయవాదం కంటే, విజయ్ చూపిస్తున్న మార్పు అనే నినాదం కొత్త ఓటర్లను, సీమాన్ వెన్నంటి ఉన్న యువతను ఎక్కువగా ఆకర్షించినట్లు సర్వేలు సూచిస్తున్నాయి. సీమాన్ నామ్ తమిళర్ కట్చితో రెండు దశాబ్దాలు ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని 8 శాతం ఓట్లను సాధించారు. అయితే, ఆ ఓటు బ్యాంక్కు ఈ సారి పెద్ద గండం తప్పదని రాజకీయ వర్గాలుపేర్కొంటున్నాయి. అదే సమయంలో కారైక్కుడి నుంచి పోటీ చేసిన సీమాన్ తప్పని సరిగా నెగ్గాలని, ఇతరుల వరుసలో ఉన్న ఆరేడు సీట్లలో ఆ పార్టీకి చెందిన పట్టభద్రులు గెలవాలని ఆకాంక్షించే వారు తాజాగా ఉండటం విశేషం. -
ఏక కాలంలో గుండెకు 2 సంక్లిష్ట చికిత్సలు
సాక్షి, చైన్నె: శస్త్ర చికిత్సతో పని లేకుండా గుండెకు ఏక కాలంలో రెండు సంక్లిష్ట చికిత్సలను చైన్నె అడ యార్లోని ఎంజీఎం హెల్త్కేర్ మలర్ ఆసుపత్రి వైద్యులు విజయవంతం చేశారు. ఒకే రోగికి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా, కేవలం క్యాథెటర్ విధానం ద్వారా టావీ, డ్యూయల్ ఛాంబర్ లీడ్లెస్ పేస్మేకర్ అమర్చి ప్రాణాపాయం నుంచి కాపాడారు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మదన్ మోహన్ బృందం బుధవారం ఈ చికిత్స వివరాలను స్థానికంగా ప్రకటించారు.75 ఏళ్ల వృద్ధురాలికి గతంలో బైపాస్ సర్జరీ జరిగిందని, అయితే, తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది , మూడు నెలల్లో మూడుసార్లు స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రిలో చేరారని వివరించారు. పరిశోధనలో ఆమెకు గుండె ప్రధాన కవా టం కుంచించుకుపోవడం, గుండెలో ప్రసరణలో లోపం ఉన్నట్లు నిర్ధారణ చేశామన్నారు. వయస్సు గతంలో జరిగిన సర్జరీ దృష్ట్యా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం ప్రమాదకరమని భావించి అత్యాధునిక కనిష్ట ఇన్వాసివ్ పద్ధతిని ఎంచుకున్నట్టు తెలిపారు. కాలి రక్తనాళం ద్వారా క్యాథెటర్ను పంపి, పాడైపోయిన గుండె కవాటం స్థానంలో కొత్త కవాటాన్ని అమర్చామని, గుండె లయను సరిచేయడానికి ఎటువంటి వైర్లు లేదా సర్జరీ లేకుండా నేరుగా గుండె గదుల్లో రెండు చిన్న పరికరాలను అమర్చామన్నారు. ఇవి వైర్లెస్ సాంకేతికతతో పనిచేస్తాయని వివరించారు.శస్త్రచికిత్స లేకుండా కేవలం రక్తనాళాల ద్వారా జరిగిన ఈ ప్రక్రియ వల్ల రోగి వేగంగా కోలుకున్నారని ప్రకటించారు. ఆసుపత్రి సీఓఓ వేణుగోపాల్ భట్ మాట్లాడుతూ, భవిష్యత్తులో గుండె చికిత్సలు సర్జరీ లేకుండా ఇంతే కచ్చితత్వంతో జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
క్లుప్తంగా
అన్నాసాలైలో వీబీజే సరికొత్త ఫ్లాగ్షిప్ షోరూమ్ సాక్షి, చైన్నె : చైన్నెలోని అత్యంత కీలకమైన అన్నాసాలై ప్రాంతంలో తన పాత షోరూమ్ పక్కనే అత్యంత ఆధునిక హంగులతో ఈ కొత్త స్టోర్ను వీబీజే జ్యువలరీ ఏర్పాటు చేసింది. : ఇక్కడ బంగారం, విలువైన రాళ్లు , డైమండ్స్, సాలిటైర్, ప్లాటినం నగల కోసం ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. కేవలం ఎంపిక చేసిన నగలు మాత్రమే ప్రదర్శనలో ఉంచారు. వీబీజే మేనేజింగ్ పార్టనర్ అమరేంద్రన్ వుమ్మిడి, జితేంద్ర వుమ్మిడి మాట్లాడుతూ, తమ బ్రాండ్ వారసత్వాన్ని ఆధునిక కాలానికి అనుగుణంగా మార్చేందుకు ఈ స్టోర్ ఒక ప్రయోగమని తెలిపారు. రాబోయే రోజుల్లో వీబీజే తన ఉనికిని మరింత విస్తరించనుందన్నారు. కోయంబత్తూ రు, తిరుచిరాపల్లి (తిరుచ్చి). హైదరాబాద్లోని కీలక ప్రాంతాల్లో కొత్త స్టోర్లు ఏర్పాటు కానున్నాయన్నారు. అమెరికాలోని టెక్సాస్తో పాటూ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో కూడా తమ కార్యకలాపాలను విస్తరించనున్నామన్నారు. చైన్నె వైద్యుడికి అంతర్జాతీయ గుర్తింపు కొరుక్కుపేట: హృద్రోగ శస్త్రచికిత్సలపై విస్తత అధ్యయనం నిర్వహించిన నగరానికి చెందిన ఆక్సిమెడ్ హాస్పిటల్స్ డైరెక్టర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సామా అక్బర్ జరిపిన అధ్యయనానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రెండున్నర దశాబ్ధాల పాటు గుండెపోటుకు గురైన 15వేల మంది రోగుల వద్ద తీవ్ర పరిశీలనలు జరిపి, వారి జీవన కాలాన్ని పెంచేందుకు తీస కోవాల్సిన అదనపు చికిత్సలను ప్రతిపాదిస్తూ ఆయన ఈ అధ్యయనం నిర్వ హించారు. ఈ అధ్యయనం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ’జర్నల్ ఆఫ్ కార్డియాక్ ఫెయిల్యూలర్ ప్రచురితమైంది. ఆ సందర్భంగా హార్ట్ ఫెయి ల్యూరొసొసైటీ ఆఫ్ అమెరికా వార్షిక సమావేశంలో ఆయనను ప్రశంసా పత్రం అందించి ఘ నంగా సత్కరించినట్టు చైన్నెలో జరిగిన సమావేశంలో వెల్లడించారు. 127 గ్రాముల బంగారు పళ్లెం వితరణ కొరుక్కుపేట: కూతాండవర్ దేవాలయం కళ్లకురిచి జిల్లాలోని ఉలుందూర్పేట సమీపంలోని కూవాగంలో ఉంది. ఇది చాలా ప్రసిద్ధమైంది. ఈ ఆలయంలో ఏటా చిత్తిరై ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దానికి అనుగుణంగా, ఈ సంవత్సరం ఉత్సవం 14వ తేదీ న ప్రారంభమైంది. ఈ పండుగలోని ప్రధాన ఘట్టం, అనగా ప్రభువు కన్నులు తెరవడం ట్రాన్స్జెండర్లచే తాయెత్తు కట్టుకోవడం మంగళవారం జరిగింది. భారతదేశం నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వేలాది మంది ట్రాన్స్జెండర్లు తరలివచ్చా రు. అనంతరం, వారు అక్కడున్న హిందూ సమ్య ఛారిటబుల్ ట్రస్ట్ శాఖ అధికారులకు ఆ బంగారు పలకను అందజేశారు. ట్రాన్స్జెండర్లు మొత్తం 127 గ్రాముల బంగారు పళ్లెంను విరాళంగా ఇచ్చారు. దీని విలువ సుమారు రూ. 16 లక్షలు ఉంటుందని అంచనా. అధికారులు ఈ బంగారు పళ్లెంను కూతండవర్ ఆలయ ఖాతాలో జమ చేశారు. కలక్కాడ్ సమీపంలో విషాదం తిరువొత్తియూరు: నైల్లె జిల్లా కలక్కాడ్ సమీపం కీళ్ తువరై కుళం గ్రామానికి చెందిన మురుగన్ (45) తన కారులో పెట్రోల్ కొట్టించడానికి సిద్ధమయ్యారు. అప్పుడు అతని సోదరుడి కుమారుడు దురై పాండి (17) తాను వెళ్లి పెట్రోల్ వేసుకుని వస్తానని చెప్పడంతో, మురుగన్ అతనికి కారు ఇచ్చారు.దురై పాండి కారు తీసుకుని వెళ్తుండగా, బంధువుల పిల్లలైన కన్షిక (4), దినేష్ (10), ప్రదీప్ (9), విత్సిష్ (8) కూడా వస్తామని కారు ఎక్కారు. పెట్రోల్ పోయించుకుని తిరిగి వస్తుండగా, కలక్కాడ్ మంగళమ్మాల్ రహదారిపై కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గోతిలో బోల్తా పడింది.ఈ ప్రమాదంలో 4 ఏళ్ల చిన్నారి కన్షిక తల నలిగి అక్కడికక్కడే మరణించింది. కారు నడిపిన దురై పాండితో సహా మిగిలిన నలుగురు బాలురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని కలక్కాడ్, నాగర్కోయిల్ మరియు నైల్లె ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.కలక్కాడ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి మైనర్ బాలుడికి కారు ఇచ్చిన మురుగన్ కారు నడిపిన దురై పాండిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. -
విజయంపై విజయ్ ధీమా
సాక్షి, చైన్నె : అధికార పగ్గాలు చేపట్టే విషయంలో సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నప్పటికీ సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ అసెంబ్లీకి వెళ్లడం ఖాయం అన్న సంకేతాలు వెలువడ్డాయి. తిరుచ్చి ఈస్ట్లో ఆయన హోరా హోరీ సమరం ఎదుర్కొంటున్నప్పటికీ, చైన్నె పెరంబూరు ఓటర్లు ఆయనపై కరుణ చూపించినట్టు తాజా పరిశీలనలో తేలింది. ఎగ్జిట్ పోల్స్ రూపంలో తాజ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తూ, ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించే దిశగా విజయ్ అడుగులు సాగుతున్నాయి. ఈ పరిస్థితులలో విజయ్ రెండు చోట్ల పోటీ చేస్తున్న దృష్ట్యా, ఆయన ఎక్కడ విజయం సాధిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. తిరుచ్చి (ఈస్ట్)లో ఊగిసలాట ఈ వీఐపీ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్ టీవీకే అధినేత విజయ్ మధ్య పోటీ నువ్వా–నేనా అన్నట్లు ఉంది. డీఎంకే (ఇనిగో ఇరుదయరాజ్): 36శాతం, టీవీకే (జోసెఫ్ విజయ్) 35శాతం. అన్నాడీఎంకే (రాజశేఖరన్) 25శాతం, నామ్ తమిళర్ కట్చి (కృష్ణసామి) 4శాతం ఓట్లతో హోరా హోరీ సమరంలో ఉన్నట్టు తాజా పరిశీలనలో తేలింది. డీఎంకే , టీవీకే మధ్య కేవలం ఒక శాతం ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. విజయ్ రాకతో డీఎంకే ఓటు బ్యాంకులో భారీ చీలిక ఏర్పడింది. ఆఖరి నిమిషంలో ఓట్ల మార్పిడి జరిగితే విజయ్ ఇక్కడ విజయం సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టీవీకే కోటగా పెరంబూరు మారేనా..? చైన్నెలోని పెరంబూరులో విజయ్ ఆధిక్యంలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఇక్కడ డీఎంకేకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. టీవీకే (జోసెఫ్ విజయ్): 46శాతం, డీఎంకే ( ఆర్డీ శేఖర్): 40శాతం, అన్నాడీఎంకే కూటమిలోపీఎంకే (తిలకభామ)10 శాతం మేరకు, నామ్ తమిళర్ కట్చి (వెట్రి తమిళన్) 4శాతం ఓట్లు పొందే అవకాశం ఉందని తేలింది. పెరంబూరులో విజయ్ 6 శాతం ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఇక్కడి యువత , కార్మిక వర్గాల్లో విజయ్కు ఉన్న క్రేజ్ ఈ ఫలితాల్లో ప్రతిబింబిస్తోంది. మొత్తంగా చూస్తే విజయ్ పార్టీ ప్రధానంగా అన్నాడీఎంకే ఓటు బ్యాంకును తిరుచ్చి, పెరంబూరులో భారీగా దెబ్బతీస్తున్నట్టు స్పష్టం అవుతోంది. అభ్యర్థులకు మార్గదర్శకాలు విజయ్ రూపంలో భారీగా ఓట్ల చీలిక జరిగినట్టు అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, యాక్సిస్ మై ఇండియాతో సహా మరికొన్ని స్థానిక సర్వే సంస్థలు, సామాజిక మాధ్యమాలలో విజయ్ నేతృత్వంలోనే ప్రభుత్వం అని స్పష్టం చేశాయి. దీవంతో చైన్నె పనయూరులో ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులకు విజయ్ దిశానిర్దేశంతో కీలక సూచనలు చేయడం గమనార్హం. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్, వివిధ నియోజకవర్గాల అభ్యర్థులు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఉత్సాహభరిత వాతావరణం కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు టీవీకే కూటమికి అనుకూలంగా ఫలితాలు రావచ్చని (ఉదాహరణకు ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా అంచనాలు) పేర్కొనడంతో అభ్యర్థులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. విజయ్ అభ్యర్థులతో నేరుగా మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలా వ్యవహరించాలో పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుండి తుది ఫలితం ప్రకటించే వరకు లెక్కింపు కేంద్రం లోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఏవైనా సందేహాలు కలిగినా లేదా అవకతవకలు జరుగుతున్నాయని అనిపించినా, వెంటనే అక్కడి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని, అందరూ నమ్మకంతో ఉండండి. విజయం ఖాయం అని విజయ్ అభ్యర్థుల్లో ధైర్యాన్ని నింపినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, విజయ్ ఓట్ల లెక్కింపు రోజున తమిళనాట విజిల్ విప్లవం సృష్టించనున్నారని , విజయం ఖాయం. అధికారం ఖాయం అని ఆ పార్టీ కన్వీనర్ సెంగొట్టయన్ ధీమా వ్యక్తం చేశారు. -
పూజాహెగ్డే ప్రేమలో పడిందా?
కొత్త చిత్రానికి విక్రమ్ప్రభు రెడీ తమిళసినిమా: మంచి కంటెంట్తో కూడిన కథా లభిస్తే విజయం సాధ్యమేనని తాజాగా సిరాయి చిత్రంతో నిరూపించిన నటుడు విక్రమ్ప్రభు. ఆ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు కథలు ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు ఆయన ఇటీవల ఒక వేదికపై చెప్పారు. అలా తాజాగా ఒక కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. ఈ చిత్రం ద్వారా సిద్ధార్థ్ అనే నూతన దర్శకుడికి అవకాశం కల్పించారు. ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో విక్రమ్ ప్రభుతో నటించే నటి, ఇతర నటీనటులు, సాంకేతిక ఎంపిక జరుగుతోందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ చిత్రం కథ విభిన్నంగా ఉంటుందని, కథనం కూడా కొత్తగా ఉంటుందని పేర్కొన్నారు. విక్రమ్ప్రభును మరో కోణంలో ఆవిష్కరించే కథా చిత్రంగా ఇది ఉంటుందంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం తరువాత విక్రమ్ప్రభు మరో కొత్త దర్శకుడితో పనిచేయడానికి అంగీకరించినట్లు సమాచారం. మొత్తంమీద సిరాయి చిత్రం ఈయన్ని మళ్లీ బిజీ చేసిందన్నమాట. న్యాయవాదిగా కీర్తిసురేష్ -
ఎగ్జిట్ పోల్స్ నమ్మవద్దు!
సాక్షి, చైన్నె: ఎన్నికల పోలింగ్ సరళిపై విడుదలవుతున్న ఎగ్జిట్ పోల్స్ తప్పుడు ప్రచారాలని, వీటిని చూసి కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి భరోసా ఇచ్చారు. ఈ మేరకు కేడర్కు గురువారం సాయంత్రం తన సందేశాన్ని ప్రకటన రూపంలో విడుదల చేశారు. కుట్రపూరిత ప్రచారం డీఎంకే పార్టీ కావాలనే కొన్ని సంస్థల ద్వారా తమకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయిసున్నదని పళనిస్వామి ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి పార్టీ శ్రేణులను నైతికంగా దెబ్బతీయడానికి డీఎంకే పన్నే కుట్రలో ఇది భాగమని ఆయన విమర్శించారు. చారిత్రక విజయాలు గతంలో 2011, 2016 ఎన్నికల సమయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా వచ్చాయని, అయితే, అప్పుడు అమ్మ (జయలలిత) నాయకత్వంలో ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఘనవిజయం సాధించామన్న విషయాన్ని గుర్తెరగాలని సూచించారు. ఈసారి కూడా అదే చరిత్ర పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే అరాచకాలపై నిఘా: ఓడిపోతామని స్టాలిన్కు అర్థమైపోయిందని, అందుకే కౌంటింగ్ సమయంలో గందరగోళం సృష్టించి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని పళనిస్వామి హెచ్చరించారు. అందుకే కార్యకర్తలు చివరి నిమిషం వరకు లెక్కింపు కేంద్రాల వద్దే ఉండి విజయాన్ని కాపాడుకోవాలని కోరారు. ‘రేపు మనదే.. తమిళనాడు మనదే.. ప్రజల సంక్షేమం కోసం పని చేసే అన్నాడీఎంకే ప్రభుత్వం రావడం ఖాయం’ అని పళనిస్వామి తన సందేశంలో వ్యాఖ్యలు చేశారు. దివంగత ఎంజీఆర్, జయలలిత ఆశీస్సులు తమకు పుష్కలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. 210 స్థానాల్లో విజయం: ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి 210 నియోజకవర్గాల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని, భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన ఽఽస్పష్టం చేశారు. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో పార్టీ ఏజెంట్లు, అభ్యర్థులు , కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ హాల్ లోపల అధికారులు ఇచ్చే ప్రతి రౌండ్ ఫలితాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. -
ఓ భావోద్వేగం
మదురైఉత్సవం సాక్షి, చైన్నె : మదురై చిత్రై తిరువిళా( ఉత్సవం)అన్న కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు... అదో భావోద్వేగం. మండూ వేసవిలో మదురై నగరం 15 రోజుల పాటు పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఆధునిక కాలంలో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లు, గేమింగ్ సెంటర్లు ఎన్ని వచ్చినా, మదురై చిత్తిరై తిరువిళా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. మదురై వాసులకు ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, వారి భాషలో చెప్పాలంటే ‘అదొక ఎమోషన్‘ అని ఆధ్యాత్మిక వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. నేడే ముఖ్య ఘట్టం మీనాక్షి అమ్మన్ సన్నిధిలో పట్టాభిషేకం, దిగ్విజయం, కల్యాణోత్సవం, రథోత్సవం అంగరంగ వైభంగా పూర్తి అయ్యాయి. చివరి రోజున గురువారం తీర్థవారి అత్యంత వేడుకగా జరిగింది. మీనాక్షి అమ్మవారి సన్నిధిలో ఉత్సవం ముగిసినా, మదురై ఉత్సవంలో మున్ముందు రోజులు మరిన్ని ముఖ్య ఘట్టాలు జరగనున్నాయి. అళగర్ వైగై నదీ ప్రవేశం, మండూక మునికి శాప విమోచనం . దశావతార ఉత్సవం అంటూ కనుల పండువగా సేవలు జరగనున్నాయి. శుక్రవారం జరిగే వైగై నదీ ప్రవేశం నిమిత్తం బుధవారం సాయంతం అళగర్ మలై నుంచి బయలు దేరిన స్వామి వారికి రాత్రంతా భక్త జనం దారి పొడవున ఆహ్వానం పలికారు. మతాలకు అతీతంగా అళగర్ స్వామికి నీరాజనాలు పలికారు. మూన్రుమావడి వద్ద భక్తులు స్వామివారికి ఘనంగా ’ఎదిర్ సేవ’ నిర్వహించారు. రాత్రి 8.30 గంటలకు స్వామి తల్లాకుళం ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అదే సమయంలో శ్రీ విళ్లిపుత్తూరు నుంచి ఆండాల్ అమ్మవారు ధరించిన మాలలను ఇక్కడకు తీసుకు వచ్చారు. అలాగే పట్టువస్త్రాలు, చిలుక మదురైకి చేరుకున్నాయి. సంప్రదాయం ప్రకారం, వైగై నదిలోకి దిగే ముందు కల్లాళగర్ ఈ మాలలను ధరిస్తారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, శ్రీరంగం ఉత్సవాల మాదిరిగానే మదురైలో కూడా ఆండాళ్ అమ్మవారి మాలను పెరుమాళ్ ధరించడం ఒక పవిత్ర ఆచారంగా జరుగుతున్నది. శుక్రవారం తెల్లవారుజామున 5.35 నుండి 5.55 గంటల మధ్య బంగారు గురప్రు వాహనంపై కల్లాళగర్ వైగై నదిలోకి దిగుతారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూడటానికి లక్షలాది మంది భక్తులు మదురైకు చేరుకుంటున్నారు. హైకోర్టు కీలక ఆదేశాలు ఉత్సవాల సమయంలో కొందరు అల్లరి మూకలు భక్తులపై చెప్పులు విసరడం వంటి అనాగరిక పనులకు పాల్పడుతున్నట్లు వచ్చిన పిటిషన్పై మదురై హైకోర్టు స్పందించింది: భక్తులపై చెప్పులు విసరడం లేదా అసభ్యంగా ప్రవర్తించడం వంటి పనులు చేసే వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. ఉత్సవ ప్రాంతం చుట్టూ 7 కిలోమీటర్ల మేర సాయుధ బలగాలు నిరంతరం పహారా కాయాలని, సుమారు 3000 మంది పోలీసులు రక్షణగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. సంస్కృతి – సామరస్యం ఈ పండుగ కేవలం హిందువులకు మాత్రమే పరిమితం కాదు. మదురైలోని ముస్లిం సోదరులు కూడా అళగర్ స్వామిని సాదరంగా ఆహ్వానిస్తారు. విల్లాపురంలో ఇస్లాం మతస్థులు అళగర్ కోసం వేచి ఉండడం మత సామరస్యానికి నిదర్శనం. అదేవిధంగా, గోరిపాళయం దర్గా ఉత్సవాల్లోనూ, చర్చి ఊరేగింపుల్లోనూ హిందువులు పాల్గొనడం మదురై ప్రత్యేకత. ఈ ఉత్సవాల సమయంలో మదురైలో ఎవరి ఇంట్లోనూ వంట చేయాల్సిన అవసరం ఉండదు. వీధి వీధినా పానకం, రోజ్ మిల్క్, పొంగల్, వడ వంటి ప్రసాదాలు, అన్నదానాలు నిరంతరం జరుగుతూనే వచ్చారు. పిల్లలకు మురుగన్, మీనాక్షి, కరుప్పుసామి వేషాలు వేసి తల్లిదండ్రులు మొక్కులు తీర్చుకున్నారు. మదురై చిత్తిరై తిరువిళా అనేది తమిళ గడ్డపై ఆధ్యాత్మికత, సంస్కృతి, మనుషుల మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే ఒక అద్భుతమైన జీవన అనుభవం. పాఠశాల సెలవుల్లో వచ్చే ఈ పండుగ, మదురై ప్రజలకు కొత్త ఉత్సాహాన్ని, నమ్మకాన్ని ఏటా అందిస్తూనే ఉంది. -
ఏడాదిలో 86 లక్షల వైద్య పరీక్షలు
సాక్షి, చైన్నె: వైద్య రంగంలో డయాగ్నోస్టిక్స్ విభాగంలో సరికొత్త విప్లవానికి అపోలో డయాగ్నోస్టిక్స్ డీజీ–స్మార్ట్ సెంట్రల్ రిఫరెన్స్ లాబొరేటరీ రికార్డు సృష్టించినట్టు నిర్వాహకులు ప్రకటించారు. గురువారం మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ. దక్షిణ, ఆగ్నేయ ఆసియాలోనే 4వ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ లాబొరేటరీగా ఇది రికార్డు సృష్టించిందని ప్రకటించారు. తమ డిజి–స్మార్ట్ ల్యాబ్ డయాగ్నోస్టిక్ పరిణామ క్రమంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు. ప్రతి శాంపిల్ వెనుక ఒక ప్రాణం ఉంటుందనే బాధ్యతతో తమ బృందం పనిచేస్తున్నట్టు వివరించారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్, జెనోమిక్ సైనన్స్ వంటి సాంకేతికతలను మరింతగా ఉపయోగించి వ్యక్తిగత చికిత్సలో కొత్త ఒరవడిని సృష్టిస్తాం అని తెలిపారు. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి డయాగ్నోస్టిక్స్ కేవలం కొందరికే పరిమితం కాకుండా, ప్రతి భారతీయుడికి అందాలనేదే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఏఐ ఆధారిత ఆటో–వ్యాలిడేషన్ సిస్టమ్స్ ద్వారా వైద్యులు వేగంగా , సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తున్నామని అని పేర్కొన్నారు. ఈ కేంద్రం ప్రతిరోజూ 40,000 శాంపిల్స్ పరీక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, గడిచిన 12 నెలల్లో ఈ ల్యాబ్ 86 లక్షల వైద్య పరీక్షలను నిర్వహించిందని వివరించారు. -
చతురంగవేట్టై కాంబో షురూ
తమిళసినిమా: నటుడు, చాయాగ్రాహకుడు నట్టి నటరాజన్ కథానాయకుడిగా నిలబెట్టిన చిత్రం చతురంగవేట్టై. ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకుడు. ఈయనకు ఇదే తొలి చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా హెచ్.వినోద్ను ప్రముఖ దర్శకుడిగా, నటుడు నట్టి నటరాజన్ను బిజీ హీరోగా మార్చిన చిత్రం అది. ఇటీవల విజయ్ హీరోగా జననాయగన్ చిత్రానికి దర్శకత్వం వహించిన హెచ్.వినోద్ ప్రస్తుతం కార్తీ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే నట్టి నటరాజన్ తాజాగా టీఎన్ 26 అనే సమకాలీన రాజకీయాలకు అద్దం పట్టే చిత్రంలో నటించి వార్తల్లో నిలిచారు. కాగా తాజాగా ఈయన నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి దర్శకుడు హెచ్.వినోద్ కథను అందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఆయన శిష్యుడొకరు దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా హెచ్ వినోద్, నట్టి నటరాజన్ హిట్ కాంబో ఇప్పుడు రిపీట్ కానుండడంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొనడం సహజమే. -
విస్తృత చర్చ..
ఎగ్జిట్ పోల్స్ గందరగోళం నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు , సీఎం ఎంకే స్టాలిన్ అలెర్ట్ అయ్యారు. కొన్ని సర్వేలు పూర్తిగా తమకు, మరికొన్ని సర్వేలు అన్నాడీఎంకేకు, ఇంకో రెండు సర్వేలు కొత్తగా ఆవిర్భవించిన విజయ్ పార్టీదే అధికారం అన్నట్టుగా సర్వే వివరాలను ప్రకటించాయి. దీంతో కౌంటింగ్ రోజున ప్రతి ఏజెంట్, ప్రతి అభ్యర్థి, మరింత జాగ్రత్తలతో అప్రమత్తంగా వ్యవహరించాలని నాయకులకు, కార్యకర్తలకు స్టాలిన్ సూచించారు. సాక్షి, చైన్నె : సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ ఏదో ఒక పార్టీవైపు మొగ్గుచూపుతాయి. కానీ ఈసారి ఎగ్జిట్పోల్ అంచనాలు ఎవరికీ అంతుచిక్కని విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని సర్వేలు అధికార డీఎంకే కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఇస్తుంటే, మరికొన్ని సర్వేలు విజయ్ టీవీకే రాకతో భారీగా ఓట్ల చీలిక జరిగినట్టు ప్రకటించాయి. గతంలో ఉన్న కేవలం డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే పోటీ అన్న పరిస్థితి మారి, విజయ్ ఎంట్రీతో ముక్కోణపు సమరాన్ని తలపిస్తున్నాయి. దీంతో తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మహిళలు – యువత ఓట్లపై ఆరా ప్రభుత్వం అందించిన మహిళా స్వయం సహాయక నిధి, మగళీర్ ఉరిమై తిట్టం, విడియల్ పయనం వంటి పథకాలు మహిళా ఓటర్లను ఆకర్షించాయా? లేక మార్పు కోరుతూ యువత విజయ్ వైపు మొగ్గు చూపారా? అనే అంశంపై తీవ్రంగా విశ్లేషించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. అలాగే యువతకు అందిస్తున్న పుదుమై పెన్, తమిళ్పుదల్వన్, ఉలగం వున్ కయ్యిల్, నాన్ మొదల్వన్ వంటి పథకాలతో లబ్ది పొందిన వారు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారా? లేదా మార్పు అన్న అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారా? అన్న విషయంపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు సమాచారం. ఇక, ఉత్తర తమిళనాడులో పీఎంకే, దక్షిణ తమిళనాడులో కుల సమీకరణలు, పశ్చిమ తమిళనాడు(కొంగు మండలం)లో పరిస్థితులను గురించి రీజినల్ ఇన్చార్జ్ల నుంచి సమాచారం సేకరించి, ఇక్కడ అన్నాడీఎంకే పట్టు ఈసారి సందిగ్ధమే ఉన్నట్లుగా పరిశీలనలో తేలిందని సమాచారం. చివరగా ఎన్ని గందరగోళాలు సృష్టించినా, అనుకూల, ప్రతికూల పోల్స్ వచ్చినా, అసలైన తీర్పు మాత్రం ఈవీఎంలలో ఉన్నట్టు, కౌంటింగ్ రోజున అప్రమత్తంగా వ్యవహరించని పక్షంలో నష్టం తప్పదని, జాగ్రత్తగా వ్యవహరించాలని నేతలకు స్టాలిన్ స్పష్టమైన హెచ్చరికలు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ మంత్రి దురై మురుగన్ స్పందిస్తూ, డీఎంకే గెలుపు ప్రకాశవంతంగా ఉందని, ఉదయ సూర్యుడికే ప్రజలు పట్టం కట్టారని, అధికారం తమదే అని ధీమా వ్యక్తంచేయడం విశేషం. డీఎంకే సంపూర్ణ మెజారిటీతో గెలుస్తుందని సీనియర్ నేత ఆర్ఎస్ భారతీ ధీమా వ్యక్తం చేశారు. ఇక డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ సైతం స్టాలిన్తో భేటీ అయ్యారు. ఎగ్జిట్ పోల్స్ ముగిసిన వెంటనే స్టాలిన్ తన పార్టీకి చెందిన ముఖ్య నేతలు, సీనియర్ మంత్రులు ,ఎన్నికల వ్యూహకర్తలతో భేటీ అయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, సీనియర్ మంత్రులు ఎంఆర్కే పన్నీరు సెల్వం, వేలు, పెరియకరుప్పన్, ముతుతస్వామి, మెయ్యనాథన్, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీలు, ఆర్ఎస్ భారతీ, టీకేఎస్ ఇలంగోవన్ వంటి నేతలు ఈ భేటీలో ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఓటింగ్ శాతం గురించి, చీలిక గురించి సుదీర్గ చర్చ జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఓట్ల లెక్కింపు రోజునకు సంబంధించిన వ్యూహాలకు పదునుపెట్టారు. మే 4న ఓట్ల లెక్కింపు సమయంలో అనుసరించాల్సిన జాగ్రత్తలు , ఏజెంట్లుగా నియమితులైన వారి గురించి ఆరా తీశారు. ప్రధానంగా కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే , డీఎండీకే తదితర కూటమి పార్టీల ఓట్లు డీఎంకేకు అనుకూలంగా పడ్డాయా..లేదా అన్న అంశం గురించి క్షేత్రస్థాయి నుంచి నివేదికలను తెప్పించుకుని మరీ స్టాలిన్ పరిశీలించినట్టు పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. -
తిరుత్తణి హుండీ ఆదాయం రూ.1.78 కోట్లు
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.1.78 కోట్లు లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ప్రతిరోజూ వేలాదిగా భక్తు లు విచ్చేసి స్వామి దర్శనం చేసుకుంటారు. తమ మొక్కులు చెల్లించే విధంగా హుండీల్లో కానుకలు చెల్లిస్తారు. భక్తులు చెల్లించిన హుండీల కానుకలను నెలకు ఒక్కసారి ఆలయ నిర్వాహకుల సమక్షంలో లెక్కిస్తారు. చివరి 34 రోజుల్లో భక్తులు హుండీల్లో వేసిన కానుకలను బుధవారం ఆలయ జాయింట్ కమిషనర్ రమణి సమక్షంలో వసంత మండపంలో లెక్కించారు. లెక్కింపులో రూ.1.78 కోట్ల నగదు, 532 గ్రాముల బంగారం, 7,258 గ్రాముల వెండిని కానుకగా చెల్లించినట్లు ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆశాజనకంగా ఇండియన్ బ్యాంక్ ఫలితాలు
సాక్షి ,చైన్నె: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఇండియనన్ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025–26 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.3,103 కోట్ల నికర లాభాలతో 5 శాతం వద్ధిని సాధించిందని ఆ బ్యాంక్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బినోద్ కుమార్ తెలిపారు.ఈ మేరకు చైన్నె ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఇండియన్ బ్యాంక్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో 2025–26 ఆర్ధిక సంవత్సరం క్యూ4 ఫలితాలును బినోద్ కుమార్ వెల్లడిస్తూ.. గతేడాది ఇదే సమయంలో రూ. 2,956 కోట్లుగా నమోదయ్యింది.ఈ ఏడాది రూ.3,103 కోట్లకు చేరుకుందన్నారు. గడిచిన క్యూ4లో రిటైల్ వ్యాపారం 18.72 శాతం పెరిగి రూ. 1,41, 396 కోట్లకు చేరిందన్నారు. మొండి బకాయిలు 1.98 శాతానికి తగ్గి ఆస్తుల నాణ్యత మెరుగు పడటం తో పాటు, బ్యాంక్ తన వాటాదారులకు ప్రతి షేరుకు రూ. 18.25 డివిడెండ్ను ప్రకటించిందన్నారు. మరో వైపు భవిష్యత్తు అవసరాల కోసం రూ. 5,000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. సాత్తాంకుళం కేసులో అప్పీల్కు అవకాశం సాక్షి, చైన్నె : తూత్తుకుడి జిల్లా సాత్తాంకుళం తండ్రీ కుమారులైన జయరాజ్, బెన్నిక్స్ల హత్య కేసులో మరణశిక్ష పడిన 9 మంది పోలీసులు జూన్ 1వ తేదీలోగా తమ అప్పీల్ పిటిషన్లను దాఖలు చేసుకోవచ్చని మదురై హైకోర్టు బెంచ్ ఆదేశించింది. 2020లో కరోనా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో సాత్తాంకుళం పోలీసులు జయరాజ్ , ఆయన కుమారుడు బెన్నిక్స్లను విచారణకు తీసుకెళ్లారు. పోలీసు కస్టడీలో వారిద్దరూ తీవ్ర హింసకు గురై మరణించారు. ఈ కేసును విచారించిన మదురై జిల్లా కోర్టు, ఇన్స్పెక్టర్ శ్రీధర్ సహా 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మరణశిక్షను ధ్రువీకరించాలని తమిళనాడు ప్రభుత్వం, సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లు గురువారం జస్టిస్ ఆనంద్ వెంకటేష్, జస్టిస్ రామకృష్ణన్ బెంచ్ ముందు విచారణకు వచ్చాయి. జైలులో ఉన్న 9 మంది నిందితులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. ప్రధాన నిందితుడైన మాజీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, అప్పీల్ పిటిషన్ సిద్ధం చేయడానికి 15 రోజులు పెరోల్ కావాలని కోరారు. అయితే జైలులో అన్ని సౌకర్యాలు ఉన్నాయని పేర్కొంటూ న్యాయమూర్తులు ఈ అభ్యర్థనను తిరస్కరించారు. నిందితులు తమ అప్పీల్ పిటిషన్లను జూన్ 1 లోగా సమర్పించేందుకు అవకాశం కల్పించారు. జూన్ 4 నుండి ఈ కేసుపై రోజూ విచారణ జరిపి త్వరగా తీర్పు వెలువరిస్తామని న్యామూర్తులు తెలిపారు. అలాగే సీబీఐ దాఖలు చేసిన అప్పీల్ కాపీలను నిందితులకు అందించాలని రిజిస్ట్రార్ను కోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. పార్సిల్ ఆదాయంలో చైన్నె రైల్వే రికార్డు సాక్షి,చైన్నె : దక్షిణ రైల్వేకు చెందిన చైన్నె డివిజన్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో పార్సిల్ సేవల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ మేరకు గురువారం ప్రకటించారు.నిర్దేశించిన వార్షిక లక్ష్యం రూ. 74.22 కోట్లు కాగా, దానినిమించి రూ 74.56 కోట్ల ఆదాయాన్ని సాధించినట్టు వివరించారు. గత ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ.70.68 కోట్లతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధిగా వివరించారు. భారత రైల్వే చరిత్రలో మొదటిసారిగా బి.సి.ఎన్ వ్యాగన్లను పార్సిల్ రవాణా కోసం డీమ్డ్ వి.పిగా మార్చి చైన్నె డివిజన్ రికార్డు సృష్టించిందన్నారు. ఏప్రిల్ 2025లో కొరుక్కుపేట, తాంబరం నుండి టాటా నగర్, రుద్రాపూర్ వంటి నగరాలకు 1,288 టన్నుల టైర్లను మూడు ప్రత్యేక రైళ్ల ద్వారా విజయవంతంగా తరలించినట్టు వివరించారు. ఈ ఏడాది 40 ఎస్.ఎల్.ఆర్ , 3 వి.పి కోచ్లను లీజుకు ఇచ్చినట్టు, ఇందులో 20 కొత్త ఎస్.ఎల్.ఆర్ ఒప్పందాలు ఉన్నాయని పేర్కొన్నారు. చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్లో పార్సిల్ ఆఫీస్ ఆధునీకరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, ముండియంబాక్కం, రాయపురం, తడ స్టేషన్లలో పార్సిల్ టెర్మినల్స్ అభివృద్ధి కోసం కొత్త పనులు ప్రారంభించనున్నామని తెలిపారు. -
పులి పిల్ల మృతి
అన్నానగర్: నీలగిరి అటవీ రిజర్వ్ పరిధిలోని అంభి డివిజన్ సమీపంలో ఉన్న అళగర్ కొండలలోని వ్యవసాయ క్షేత్రంలో ఏప్రిల్ 25వ తేదీన రెండు పులి పిల్లలు సంచరిస్తున్నాయని అటవీ శాఖకు సమాచారం అందింది. అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి 5 నెలల ఆడ పులి పిల్లను రక్షించారు. ఆ పులి పిల్లకు పశువైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు. అటవీ శాఖ అధికారులు మరో పులి పిల్ల కోసం కూ డా గాలిస్తుండగా, మంగళవారం దాన్ని రక్షించారు. అటవీ శాఖ అధికారులు ఆ పులి పిల్లకు చికిత్స అందిస్తున్నారు. ఇంతలో మొదట పట్టుబడిన పులిపిల్ల చికిత్స ఫలించక గురువారం మరణించింది. పోస్ట్మార్టం నిర్వహించి పూడ్చివేశారు. మరో పులి పిల్ల ను చికిత్స కోసం వండలూర్ జూకు తరలించారు. బావిలో పడి .. అన్నానగర్: నీలగిరి జిల్లా, కూడలూరు తాలూకాలోని ఓవెలి టౌన్ పంచాయతీ పరిధిలో, బార్వుడ్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఎస్–స్టేట్ ఏరియాలో పాడుపడిన బావిలో గురువారం ఓ పులి చనిపోయి కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న అటవీ శా ఖ అధికారులు వెళ్లి పరిశీలించారు. 10 అడుగుల లో తు బావిలో పులి, అడవి పంది చనిపోయి పడి ఉండడడంతో దర్యాప్తు చేపట్టారు. మగ పులి అడవి పందిని వేటాడేందుకు తరుముకుంటుండగా, ఆ అడవి పంది బావిలో పడి ఉండవచ్చని భావిస్తున్నారు. పులి కూడా పరిగెడుతున్న వేగం కారణంగా బావిలో పడి చనిపోయి ఉండవచ్చని భావించి పోస్టుమార్టం నిర్వహించి కళేబరాలను పూడ్చివేశారు. -
టీవీకే విజయ్ కీలక సూచనలు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల 4వ తేదీన జరుగనున్న కౌంటింగ్కు సంబంధించి టీవీకే అధినేత విజయ్.. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. ఆ రోజు జరిగే కౌంటింగ్కు సంబంధించి అభ్యర్థులు, ఏజెంట్లు ఉదయం ఆరుగంటల కల్లా ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. అలాగే ఒకసారి లోపలికి వెళ్లిన ఏజెంట్ కడవరకూ అక్కడే ఉండాలని, అత్యంత జాగ్రత్తగా కౌంటింగ్ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఏమాత్రం ఏమరపాటుకు గురైనా అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, అందుకుని అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రధానంగా అభ్యర్థులు గెలిచిన తర్వాత తన వద్దకు నేరుగా రావాలన్నారు. గెలిచిన అభ్యర్థుల కోసం తాను నిరీక్షిస్తూ ఉంటానని, మధ్యలో ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ పార్టీ ఆఫీస్కే రావాలన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపులో కీలకమైన ఫారమ్ 17C(పోలింగ్ కేంద్రాల వారీగా నమోదైన ఓట్ల సంఖ్య, లెక్కింపులో చూపిన ఓట్లతో సరిపోతుందా లేదా అనే విషయాన్ని ధృవీకరించే పత్రం)ని అభ్యర్థులు కచ్చితంగా సరిపోల్చుకోవాలన్నారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండి మభ్య పెట్టడానికి యత్నించే వారికి చెక్ పెట్టాలన్నారు. -
హాట్ న్యూస్: ఎన్డీయే కూటమితో విజయ్ పొత్తు!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు తేదీ దగ్గర పడుతున్న వేళ.. తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. డీఎంకే-అన్నాడీఎంకే-టీవీకే పార్టీలు ఇవాళ వరుస మీటింగ్లు పెట్టుకున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత సమీకరణాలు మారుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించిన టీవీకే అధినేత విజయ్.. ఇప్పుడు అదే ఎన్డీయే కూటమితో పొత్తుకు చేయి చాస్తాడా? అనే చర్చ జోరుందుకుంది. తమిళనాడులో డీఎంకే పార్టీదే మళ్లీ అధికారమని ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ సర్వేలు తేల్చి చెప్పాయి. ఒకటి రెండు మాత్రం అన్నాడీఎంకేకు అధికారం దక్కవచ్చని చెప్పాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే ప్రభంజనం తప్పదని.. ఆ పార్టీ ఏకంగా అధికారం కైవసం చేసుకుంటుందని చెప్పింది. అయితే మిగతా సర్వేలు మాత్రం విజయ్ పార్టీ డబుల్ డిజిట్ను కైవసం చేసుకోవచ్చని అంచనా వేశాయి. ఈ తరుణంలో.. విజయ్ పార్టీలో జోష్ కనబడుతోంది. సర్వేలు అంచనా వేసినట్లు.. నిజంగానే ఫలితాల్లో టీవీకే జోరు కొనసాగుతుందా? అనే చర్చ నడుస్తోంది. ఈ తరుణంలోనే పొత్తుల సమీకరణాలు తెర మీదకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకేతో పవర్షేరింగ్ కోసం విజయ్ చేతులు కలపబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ నిజంగా అదే జరిగితే.. తమిళ రాజకీయాల్లో విజయ్ నిర్ణయం సంచలనమనే చెప్పొచ్చు.వాస్తవానికి ఎన్నికలకు ముందు విజయ్ ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. అధికారంలో భాగం కోరుకునే పార్టీలను తాము ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో చిన్నచిన్న పార్టీల నేతలతో పాటు అన్నాడీఎంకేలో అసంతృప్తితో ఉన్న కీలక నేతలు కూడా టీవీకే వైపు మొగ్గు చూపించారు. చివరకు అధిష్టానం జోక్యంతో వాళ్లంతా మెత్తబడ్డారు. మరోవైపు టీవీకే కూడా అన్నాడీఎంకేతో పొత్తు ప్రయత్నాలు ఏనాడూ చేసింది లేదు. అయినప్పటికీ.. బీజేపీ, కాంగ్రెస్లు విజయ్తో పొత్తు కోసం ఉవ్విళ్లూరాయి. సరిగ్గా అదే టైంలో TVK–AIADMK కలిసి పని చేస్తాయంటూ ఓ ప్రచారం ఉధృతంగా జరిగింది. ఇది ఇరు పార్టీల శ్రేణుల్లో గందరగోళానికి దారి తీయడంతో.. అలాంటిదేం ఉండబోదని కీలక నేతలు స్పష్టత ఇచ్చారు. అయితే.. ఇప్పుడు కూడా అలాంటిదేం ఉండబోదని.. ఎగ్జిట్పోల్స్ తర్వాత మీడియా అత్యుత్సాహం, టీఆర్పీ మోజుతోనే కొత్త ఊహాగానాలు తెరపైకి వచ్చి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం కోసం బీజేపీతో పొత్తులో ఉన్న అన్నాడీఎంకేతో విజయ్ పొత్తుకు వెళ్తారా? అనేది ఇప్పటికైతే అనుమానామే. -
ఆ సినిమా సీన్ను రిపీట్ చేస్తున్న విజయ్!
కొన్ని దశాబ్దాల తమిళనాడు రాజకీయలు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య ద్విముఖ పోరాటంగా కొనసాగుతూ వచ్చాయి. మధ్యలో ప్రత్యామ్నాయంగా పార్టీలు పుట్టుకొచ్చినా.. అవి దీర్ఘకాలం ప్రభావం చూపెట్టలేకపోయాయి. కానీ ఈసారి ఆ సీన్లోకి అగ్రనటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఈలోపు.. ఎగ్జిట్పోల్ ఫలితాలు ఆసక్తికరమైన చర్చకు దారి తీశాయి. మెజారిటీ డీఎంకేకే తమిళ ఓటర్లు మళ్లీ పట్టం కడతారని తేల్చేశాయి. ఒకట్రెండు మాత్రం ప్రతిపక్ష అన్నాడీఎంకేకు అధికారం ఖాయమన్నాయి. అయితే ఆ సర్వేలే విజయ్ టీవీకే పార్టీ రెండంకెల ఫిగర్కు పరిమితం కావొచ్చని చెబుతూనే.. ఓటింగ్ శాతంపరంగా ఇంపాక్ట్ చూపించవచ్చని అంచనా వేశాయి. అయితే.. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రం అనూహ్యంగా విజయ్ టీవీకే అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతోందని పేర్కొంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ 98-120 మధ్య సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ సంఖ్య సాధారణ మెజారిటీకి మించి ఉండటంతో.. విజయ్ ముఖ్యమంత్రి పదవి వైపు దూసుకెళ్తున్నారని యాక్సిస్ మై ఇండియా ఛైర్పర్సన్ ప్రదీప్ గుప్తా వ్యాఖ్యానించారు.దీంతో విజయ్ అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. అయితే విజయ్ మాత్రం తొందరపాటు వద్దని.. సంయమనం పాటించాలని కేడర్కు, అభిమానులకు సూచిస్తున్నారు. పోలింగ్ తర్వాత ఇంటికే పరిమితమైన ఆయన.. ఫలితాలు దగ్గర పడుతున్నా కొద్దీ వరుసగా ప్రముఖ ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇవాళ టీవీకే తరఫున పోటీ చేసిన 234 మంది అభ్యర్థులతోనూ ఆయన భేటీ కానున్నారు. మురుగదాస్ డైరెక్షన్లో విజయ్ హీరోగా సర్కార్ అనే పొలిటికల్ డ్రామా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఓటు వాల్యూ ఏంటో చెప్పే మెసేజ్తో తెరకెక్కిందా చిత్రం. సినిమా క్లైమాక్స్లో.. తన తరఫున గెలిచిన వాళ్లతో ఓ మీటింగ్ పెట్టి సీఎం క్యాండిడేట్ను అనౌన్స్ చేస్తాడు విజయ్. ఈ నేపథ్యంలో నెట్టింట ఇవాళ్టి టీవీకే మీటింగ్పైనా అలాంటి పోలికతో చర్చ నడుస్తోంది. అయితే.. ఫలితాల తర్వాత ఎలా వ్యవహరించాలన్నదానిపై అభ్యర్థులకు విజయ్ దిశానిర్దేశం చేస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు ఈ మీటింగ్పై సెటైర్లు పేలుస్తున్నారు. టీవీకే ఇప్పటికే విజయ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎం కేండిడేట్ను కొంపదీసి విజయ్ మారుస్తారా? ఏంటి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. తమిళ దర్శకనిర్మాత ఎస్ఏ చంద్రశేఖర్ తనయుడిగా వెట్రి(1984) అనే మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్గా జోసెఫ్ విజయ్ వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆపై 18 ఏళ్ల వయసులో నాళఇయా తీర్పు(1992)తో హీరోగా మారాడు. రొమాంటిక్, మాస్ ఇమేజ్లతో అగ్రతారగా ఎదిగారు. ఒక పక్క మెసేజ్ ఓరియెంటల్ సినిమాలు వరుసగా తీస్తూనే.. మరోవైపు తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవతో గుర్తింపు దక్కించుకున్నారు. ఈ మధ్యలో తమిళనాడులో జరిగిన ప్రతీ పోరాటానికి, ఉద్యమానికి పార్టీలకతీతంగా ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అటుపై ఏకంగా తమిళగ వెట్రి కగళం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం దాకా.. విజయ్ అనుసరించిన వ్యూహం తమిళ ప్రజలను మరీ ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకట్టుకుంది. ఎవరితోనూ పొత్తు ఉండదని.. ఒంటరి పోరుకే సై అంటూ హాట్ చర్చకు దారి తీశారాయన. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా.. డీఎంకేను రాజకీయ శత్రువుగా అభివర్ణించుకుంటూ మధ్యలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు సాగారు. ఒకానొక దశలో.. తమిళనాట మార్పు టీవీకేతోనే సాధ్యం అనే పిలుపుపై జోరుగా చర్చ నడిచింది. అయితే ఎంజీఆర్, జయలలితలా.. విజయ్ మరో తమిళ రాజకీయాలను శాసించే సినీ తార అవుతారా? లేదా? అనేది ఫలితాలు వెల్లడయ్యేదాకా సస్పెన్స్గానే భావించాలి. -
భక్త జనసంద్రం..!
ఆధ్యాత్మిక నగరం మదురైలో మీనాక్షి సుందరేశ్వర స్వామి రథోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా సాగింది. దీంతో ఆధ్యాత్మిక నగరంలోని వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. హర..హర శంకర...మీనాక్షి సుందర అన్న నామస్మరణను భక్తులు మారుమోగించారు. కాగా చిత్తిరై ఉత్సవాల్లో మరో ప్రధాన ఘట్టం ‘కళ్లలగర్’వైగై నదీ ప్రవేశం శుక్రవారం నిర్వహించనున్నారు. రథోత్సవంలో పాల్గొన్న భక్తులుసాక్షి, చైన్నె: మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చిత్తిరై ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. మంగళవారం అమ్మవారి వివాహ మహోత్సవం అత్యంత వేడుకగా జరగ్గా, బుధవారం రథోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా వేకువ జామున ఆలయంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజాధి కార్యక్రమాలు జరిగాయి. అభిషేకాది పూజల అనంతరం స్వామి, అమ్మవార్లను వేర్వేరుగా అలంకరించారు. సర్వాలంకారంతో ఉన్న స్వామి అమ్మవార్లు రథంపై ఆశీనులై భక్తులకు దర్శనం ఇచ్చారు. అతిపెద్ద రథంలో సుందరేశ్వర స్వామి, మరో రథంలో మీనాక్షి అమ్మవారి ఆశీనులై ఆలయ మాడా వీధుల్లో ఊరేగారు. ఉదయం 6.30 గంటలకు బయలు దేరిన రథం మధ్యాహ్ననికి యథా స్థనానికి చేరింది. కీల్ మాసి వీధి నుంచి తెర్కు మాసి , మేల మాసి, వడక్కు మాసి వీధులలో అడుగడుగునా భక్త జనులు స్వామి, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు శంఖునాదాలు, కై లాస వాయిద్యాలను హోరెత్తించారు. భక్త కోటి హర..హర శంకర..మీనాక్షి సుందర అన్న శివనామ స్మరణ నడుమ స్వామి వారి రథం ముందుకు సాగగా, వెనుక అమ్మవారి రథం అనుకరించింది. వేలాదిగా భక్త జనం తరలి రావడంతో మదురై జన సంద్రంలో మునిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 2 వేల మందితో గట్టి భద్రతా ఏర్పాట్లను జిల్లా పోలీసు యంత్రాంగం చేసింది. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్లను ముందు జాగ్రత్తగా సిద్ధం చేశారు. మదురై నగరంలోని ఏ ఒక్క వాహనం అనుమతించ లేదు. అలాగే భక్తుల సేవలో పలు సంఘాలు తరలించాయి. రథం మార్గంలో ఉన్న మసీదుల వద్ద భక్తులకు రోస్ మిల్క్, మజ్జిగ పంపిణి చేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. మరెన్నో సంఘాలు సైతం ఎండ వేడి నుంచి ఉపశమనం కల్గించే విధంగా చలువ వస్తువుల్ని, పానీయాల్ని అందజేశాయి. ఇక మంగళవారం రాత్రి జరిగిన అమ్మవారి వాహన సేవలో భక్తులు మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి వేషాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్న పిల్లలకు సైతం కరుప్పన్న, అళగర్ స్వామి వేషాలతో ఆలయానికి తల్లిదండ్రులు తీసుకొచ్చారు.రేపు వైగై నదీ ప్రవేశం ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టం శుక్రవారం వైగై నదీ తీరంలో జరగనుంది. ఈ ఉత్సవం నిమిత్తం తేనూర్ నుంచి బుధవారం సాయంత్రం బంగారు పల్లకిలో కళ్లలగర్ స్వామి (పెరుమాల్) బయలు దేరారు. బంగారు పల్లకిలో ఆశీనుడైన రాత్రంతా ప్రయాణించిన స్వామి వారిని పలు గ్రామల గుండా ఊరేగిస్తూ ఉదయాన్నే మదురైకు చేర్చారు. రాత్రంతా దారి పొడవున భక్త జనులు కర్పూర హారతులు పట్టారు. మతాలకు అతీతంగా మార్గ మధ్యలో ఉన్న మసీదుల నుంచి స్వామి వారికి సారె అందజేశారు. అలాగే, ఆ మార్గంలోని పలు ఆలయాల వద్ద స్వామి వారిని ఆహ్వానిస్తూ పూజాధికార్యక్రమాలు జరిగాయి. మదురై కొండప్ప నాయకర్ మహల్కు గురువారం సాయంత్రం చేరుకునే అళగర్ స్వామికి ప్రత్యేక తిరుమంజనంతో పాటుగా రాత్రంతా విశిష్ట పూజలు జరుగుతాయి. శుక్రవారం ఉదయాన్నే బంగారు అశ్వరథంపై స్వామి వారు వైగై నదీ ప్రవేశానికి వెళ్లనున్నారు. ఇందు కోసం వైగై నదీ తీరంలో సర్వం సిద్ధం చేశారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలి వస్తారు కాబట్టి, గట్టి భద్రతా ఏర్పాట్లు చే శారు. ఆ పరిసరాల్ని నిఘా వలయంలోకి తెచ్చారు. -
పారదర్శకతే ప్రధాన లక్ష్యం
సాక్షి, చైన్నె : చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు నాలుగు రోజులే సమయం ఉండటంతో, ఎన్నికల కమిషన్ సన్నద్ధతను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా చైన్నెలో ఓట్ల లెక్కింపుపై అధికారులకు ఒక రోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్లో పారదర్శకతే లక్ష్యంగా పలు సూచనలు,సలహాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ వివరించారు. వివరాలు.. తమిళనాడు శాసనసభ ఎన్నికల తుది ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 85.15 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఇప్పుడు అందరి దష్టి మే 4న జరగనున్న ఓట్ల లెక్కింపుపైనే ఉంది. కౌంటింగ్ ఏర్పాట్లు మే 4వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం 8.30 గంటల నుండి ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఉదయం 9 గంటల నుండే తొలి ఫలితాల సరళి వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొ త్తం 62 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో సాధారణంగా 14 టేబుళ్లను, పెద్ద నియోజకవర్గాల్లో 20 నుండి 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పరిశీలకుల నియామకం ఓట్ల లెక్కింపులో పారదర్శకత కోసం భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడుతో సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన 234 మంది ఐఏఎస్ అధికారులను కౌంటింగ్ అబ్జర్వర్లుగా (పరిశీలకులుగా) నియమించింది. ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడు పర్యవేక్షణ చేస్తారు. ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత, ఈ పరిశీలకులు సంతకం చేసిన తర్వాతే ఆ రౌండ్ ఫలితాలను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు.: 62 కౌంటింగ్ కేంద్రాల వద్ద పారామిలిటరీ దళాలు రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సిసిటివి కెమెరాల నిఘాలో స్ట్రాంగ్ రూమ్లను భద్రపరిచారు.ఈ భద్రతా ఏర్పాట్ల గురించి, కౌంటింగ్ ఏర్పాట్లను గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్, డీజీపీ సందీప్ రాయ్ రాథోర్లు బుధవారం సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని సైతం నిర్వహించిన పకడ్బందీ చర్యలకు నిర్ణయించారు. భద్రతా విధులలో 80 వేల పోలీసులు, సీఆర్పీఎఫ్, పారా మిలటరీ నిమగ్నం కానున్నాయి. అలాగే దాదాపు లక్ష మంది ప్రభుత్వ సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్నారు. వారికి ఇప్పటికే అవసరమైన శిక్షణను పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఓట్ల లెక్కింపుపై అధికారులకు శిక్షణ చైన్నెలో ఓట్ల లెక్కింపుపై అధికారులకు ఒక రోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సహా సుమారు 1,000 మంది పాల్గొన్నారు. చైన్నె, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల నుండి అధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పుదుచ్చేరికి చెందిన నిపుణుడు జ్ఞానవేల్ ఓట్ల లెక్కింపు పద్ధతులను వివరించారు. పోస్టల్ ఓట్లు, సర్వీస్ (సైనిక) ఓట్లు ,ఈవీఎంలలోని ఓట్లను ఎలా లెక్కించాలో అధికారులకు ప్రాక్టికల్గా వివరించారు. కౌంటింగ్ ఏజెంట్లు పాటించాల్సిన నిబంధనలను తెలియజేశారు. వదంతులతో కలకలం చైన్నె లయోలా కాలేజీ కౌంటింగ్ కేంద్రంపై వదంతులు బయలు దేరడంతో సైబర్ క్రైమ్ పోలీసుల సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చైన్నెలోని లయోలా కళాశాల ఓట్ల లెక్కింపు కేంద్రం నుండి అంబులెన్స్లో ఈవీఎం యంత్రాలను రహస్యంగా తరలించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చైన్నె మెట్రోపాలిటన్ పోలీసులు ఖండించారు. వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏప్రిల్ 24వతేదీతెల్లవారు జామున లయోలా కళాశాలలోని విల్లివాక్కం కౌంటింగ్ కేంద్రంలో లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న శ్రీనివాసన్ (నిసాన్) అకస్మాత్తుగా ఫిట్స్ (మూర్ఛ) వచ్చి పడిపోయాడని, అతడిని ఆస్పత్రిలో చేర్పించడం కోసమే అంబులెన్స్ వచ్చినట్టు వివరణ ఇచ్చారు. కాగా, చైన్నెలో ఓట్ల లెక్కింపు కోసం 1,005 మంది సిబ్బంది ఎంపిక చేసినట్లు తెలిపారు. -
మెజారిటీ శాతం డీఎంకే వైపు మొగ్గు
జాతీయ స్థాయిలోని అనేక కీలక సంస్థలే కాకుండా, తమిళనాడులోని పలు టీవీ చానళ్లు, మరికొన్ని సంస్థలు సైతం సర్వేలు నిర్వహించాయి. ప్రజా నాడి ఏమిటో పసిగట్టే దిశగా ప్రయత్నించి ఎగ్జిట్ పోల్స్ రూపంలో ప్రకటించాయి. కొన్ని సంస్థలు మొబైల్ పోన్ల ద్వారా, యాప్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ చర్చల ద్వారా లభించిన సమాచారాలతో తమ సర్వే ఫలితాలను ప్రకటించాయి. ఇందులో మెజారిటీ శాతం డీఎంకే వైపే మొగ్గు చూపాయి. ఇందులో కీలక సంస్థలుగా ఉన్న పీపుల్స్ పల్స్, ఎన్డీటీవీ సర్వేలలో డీఎంకే కూటమికి 125 నుంచి 145, అన్నాడీఎంకే కూటమికి 65 నుంచి 80, టీవీకేకు 18–24, ఇతరులకు 2–6 సీట్ల వస్తాయని ప్రకటించారు. చాణుక్య స్ట్రాటజీస్ అయితే, డీఎంకేకు 145–160, అన్నాడీఎంకేకు 50–65, విజయ్ టీవీకేకు 13–18, ఇతరులకు 5–8 స్థానాలు లభిస్తాయని వివరించారు. అలాగే, న్యూ మ్యాట్రిక్స్ డీఎంకేకు 122–132, అన్నాడీఎంకేకు 87–110, టీవీకేకు 10–12, ఇతరులకు ఆరు స్థానాలు వస్తాయని ప్రకటించారు. రిపబ్లిక్ పీ మార్క్ డీఎంకేకు 125–145, అన్నాడీఎంకేకు 65–85, టీవీకేకు 16–26, ఇతరులకు 1–6 స్థానాలు దక్కుతాయని, అగ్ని సంస్థ సర్వేలో డీఎంకేకు 169, అన్నాడీఎంకేకు 64, విజయ్ టీవీకేకు ఒకటి, ఇతరులకు సున్నా అన్న సర్వే వివరాలను విడుదల చేశాయి. ఈ ఐదు కీలక సంస్థలు డీఎంకేకు అనుకూలంగా ఓటరు నాడీ అంటూ ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేయగా, మరో రెండు కీలక సంస్థలు అన్నాడీఎంకే వైపుగా మొగ్గు చూపడం గమనార్హం. అలాగే, మరికొన్ని సామాజిక మాధ్యమాలు కూడా అన్నాడీఎంకేకు గెలుపు అవకాశం అన్నట్టుగా సర్వేలను విడుదల చేశాయి. స్టాలిన్, విజయ్, పళణి స్వామి -
సీయూబీకి కొత్త సీఈఓగా విజయ్ ఆనంద్
సాక్షి, చైన్నె: సిటీ యూనియన్ బ్యాంక్ (సి యూ బి) ఒక కీలక నాయకత్వ మార్పును బుధవారం ప్రకటించారు. ఈ సంస్థలో 15 సంవత్సరాల విశిష్ట పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న డాక్టర్ ఎన్. కామకోటి స్థానంలో, విజయ్ ఆనంద్ మే 1 నుండి మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో డాక్టర్ కామకోటి మాట్లాడుతూ, 28 సంవత్సరాల బ్యాంకింగ్ అనుభవం కలిగిన ఆనంద్, 2023లో సీయూబీ లో ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా చేరి, 2024లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదోన్నతి పొందారని వివరించారు., సీయూబీ కి ముందు, ఆయన ఆర్బీ ఎల్ బ్యాంక్లో రిటైల్ అసెట్స్ విభాగానికి బిజినెస్ అండ్ కలెక్షన్న్స్ హెడ్గా పనిచేశారని పేర్కొన్నారు. కాగా సీయూబీ ఫౌండేషన్కు డాక్టర్ కామకోటి ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2010 –11 నుండి 2025– 26 ఆర్ధిక సంవత్సరం వరకు డాక్టర్ కామకోటి నాయకత్వంలో, సిటీ యూనియన్ బ్యాంక్ డిపాజిట్లు ఆరు రెట్లు, అడ్వాన్సులలో 87 రెట్లు వృద్ధి సాధించిందని ఈ సందర్భంగా వివరించారు. 1,000 శాఖలకు శాఖల విస్తరణ,నికర విలువ రూ.10,000 కోట్లు దాటిందని ఈ సందర్భంగా విజయ్ ఆనంద్ తెలిపారు. 2025–26 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో తన చరిత్రలోనే అత్యధిక త్రైమాసికంలో రూ. 360 కోట్ల నికర లాభం సాధించినట్టు ప్రకటించారు. -
సీనియర్ ఐఏఎస్ అధికారిణి జయశ్రీ వీఆర్ఎస్
సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వంలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి, ప్రస్తుతం సామాజిక సంక్షేమ ,మహిళా భివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జయశ్రీ మురళీధరన్ స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించారు. ముఖ్యమంత్రుల నమ్మకస్తురాలు జయశ్రీ మురళీధరన్ దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత హయాంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. జయలలితకు అత్యంత విశ్వసనీయ అధికారిణిగా ఆమెకు పేరుంది. ఆ తర్వాత ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయనకు కార్యదర్శిగా సేవలందించారు. ఇక ఆమె 2011 నుండి 2014 వరకు ఆమె తిరుచిరాపల్లి (తిరుచ్చి) జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో జయలలిత శ్రీరంగం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నందున, అక్కడ అనేక అభివృద్ధి ప్రాజెక్టులను జయశ్రీ మురళీధరన్ విజయవంతంగా అమలు చేశారు. తాజాగా సీఎం స్టాలిన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ’ఉదయం అల్పాహార పథకం’ అమలులో ఆమె కీలక పాత్ర పోషించారు. దీనికి సంబంధించిన మెనూ రూపకల్పన , పంపిణీ బాధ్యతలను ఆమె సమర్థవంతంగా నిర్వహించారు. సహకార సంఘాల రిజిస్ట్రార్గా, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా , దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఆమెకు అపారమైన అనుభవం ఉంది. వాస్తవానికి ఆమె జనవరి 2027లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని నెలల ముందే ఆమె వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఆమె దరఖాస్తును ఆమోదించడంతో బుధవారం విధుల నుంచి వైదొలగారు. ప్రభుత్వ సేవల నుండి విరమణ పొందిన తర్వాత, ఆమె ఓ ప్రముఖ పారిశ్రామిక సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల సమాచారం. -
కన్నీటితో స్వస్థలాలకు..
సాక్షి, చైన్నె: కూవాగంలో గత కొద్ది రోజులు సందడి చేసిన హిజ్రాలు బుధవారం విషాదంతో స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి ఒప్పారి పెట్టారు. తెల్ల చీరలు ధరించి వితంతువులుగా మారి కూవాగం నుంచి తిరుగు పయనం అయ్యారు. ముందుగా కూత్తాండవర్ రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. అరవాన్ బలిదానంతో హిజ్రాలలో విషాదం నెలకొంది. వివరాలు.. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్ పేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో రెండు వారాల పాటూ చిత్తిరై ఉత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజులు హిజ్రాల సందడితో కూవాగం నిండింది. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున హిజ్రాలు తరలి వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. మంగళవారం సాయంత్రం కొత్త పెళ్లి కూతుళ్ల వలే ముస్తాభైన హిజ్రాలు కూత్తాండవర్ ఆలయం వద్దకు చేరుకోనున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా తాళి బొట్టు కట్టించుకుని ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. రాత్రంతా ఆట పాటలతో సందడి చేశారు. రథోత్సవంతో.. బుధవారం ఉదయం కూత్తాండవర్ రథోత్సవ సేవ ఘనంగా జరిగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా జన సందోహం తరలివచ్చారు. రథోత్సవ సేవ అనంతరం అరవాన్ బలిదానం జరిగింది. అరవాన్ను తమ ఆరాధ్యుడిగా భావించే హిజ్రాలు ఈ కార్యక్రమంతో ఒక్క సారిగా హిజ్రాలు విషాదంలో మునిగారు. తాము కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి కన్నీటి సంద్రంలో మునిగారు. ఏడుపులు పెడబొప్పలతో ఒప్పారి పెట్టారు. అక్కడి కొలనులో స్నానం చేసి తెల్ల చీరల్ని ధరించి తమ స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యారు. గత మూడు నాలుగు రోజులుగా హిజ్రాల సందడిలో మునిగిన కూవాగంలో చివరి రోజు సాగిన విషాద ఉత్సవంతో వితంతువులు అవతారంతో తమ స్వస్థలాలకు హిజ్రాలు వెనుతిరిగారు. -
అప్పుడే నేను ప్రశాంతంగా..
త్రిష తమిళసినిమా: ఇటీవల సెంటర్ ఆఫ్ ది మీడియాగా మారిన నటి త్రిష. చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ హాట్హాట్గా మారిన సంచలన నటీమణి ఈమె. రెండు దశాబ్దాలకు పైగా దక్షిణాది ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న నటి త్రిష. కోలీవుడ్లోని అతి కొద్దిమంది మోస్టెస్ట్ బ్యాచిలర్ నటిమణుల్లో త్రిష ఒకరు. ఈ విషయం కూడా ఈమెను వార్తల్లో నిలబెట్టడానికి ఒక కారణం కావచ్చు. నటుడు, తమిళగ వెట్రికళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఫ్రెండ్ కావడంతో ఈమె రాజకీయాల్లోనూ ఎక్కువగా నానుతున్నారు. దీంతో త్రిష రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్నారని, సినిమాలకు గుడ్బై చెప్పబోతున్నారని ప్రచారం జోరుగా సాగింది. అయితే నటనకు స్వస్తి చెప్పడం లేదని చెప్పే విధంగా ఇటీవలే ఒక తెలుగు చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. ఈమె మిత్రులతో కలిసి ఎంజాయ్ చేసే ఫొటోలు తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. త్రిష రాత్రి వేళల్లో మేలుకుని ఉంటారనే ప్రచారం ఉంది. ఇటీవల త్రిష తన ఇన్స్ట్రాగామ్లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో గంట నిద్ర కోల్పోతే, దాని నుంచి రికవరీ అవడానికి 4 రోజులు పడుతుంది. ఈ ప్రకారం లెక్కలు కడితే 2062 సంవత్సరంలోనే నేను ప్రశాంతంగా జీవిస్తారనే భావన కలుగుతోంది అని పేర్కొన్నారు. దీంతో త్రిష మాటల్లో అర్థం ఏమిటి ? అనే చర్చ జరుగుతోంది. త్రిషకు సరిగా నిద్ర పట్టడం లేదా, ఆమె మానసిక రుగ్మతకు లోనౌతున్నారా వంటి ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తున్నారు. -
ఫేస్బుక్లో పోస్ట్ చేసిన కవితే 29 చిత్రం
తమిళసినిమా: దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, కార్తీకేయన్ సాంతానంకు చెందిన స్టోన్బెంచ్ స్టూడియో, లోకేశ్ కనకరాజ్కు చెందిన జీ.స్క్వాడ్ సంస్థ కలిసి నిర్మించిన చిత్రం 29. మేయాదమాన్ వంటి విజయవంతమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన రత్నకుమార్ తాజాగా కథ, దర్శకత్వం బాద్యతలను నిర్వహించిన ఈ చిత్రంలో నటుడు విదు,నటి ప్రీతీ అస్రాని జంటగా నటించారు. నటుడు మహేంద్రన్, అవినాష్, ప్రేమ్కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 8వ తేధీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం చైన్నెలోని ఓ హోటల్లో నిర్విహించిన చిత్ర ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో దర్శకుడు లోకేశ్ కరకరాజ్, కార్తీక్సుబ్బరాజ్, కార్తికేయన్ సంతానం, ఆర్జే.బాలాజీ మొదలగు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు రత్నకుమార్ మాట్లాడుతూ ఈ చిత్రం రూపొందడానికి ముఖ్య కారణరం నిర్మాత కార్తీకేయన్ సంతానం అని పేర్కొన్నారు. మేయాదమాన్ చిత్రం తరువాత తాను చిన్న కవితను షేస్బుక్లో పోస్ట్ చేశానన్నారు. అంది చూసిన ఒక నిర్మాత దీన్నే కథఽగా తయారు చేసి చిత్రంగా చేయవచ్చునని, కాబట్టి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఆ కవితను వేరెవరూ కాపీ కొట్టకుండా వెంటనే తీసేయమని సలహా ఇచ్చారన్నారు. ఆ తరువాత తాను తయారు చేసిన కథను తమ స్టోన్బెంచ్ స్టూడియో సంస్ధలోనే చేయాలని నిర్మాత కార్తికేయన్ సంతానం పట్టు బట్టారన్నారు. అలా ఈ చిత్రం పట్టాలెక్కిందని చెప్పారు. లోకేశ్ కనకరాజ్ కథ కూడా వినకుండా ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకోవడానికి సిద్ధం అయ్యారన్నారు. ఒక 29 ఏళ్ల యువకుడి జీవితంలోకి 22 ఏళ్ల యువతి వస్తుందన్నారు. వారి మధ్య ప్రేమ, తదితర అంశాలతో కూడిన చిత్రం 29 అని చెప్పారు. రత్నకుమార్ మిత్రుడని కాకుండా, ఆయనలో మంచి కథకుడు ఉన్నాడని ఈ చిత్రం చేసినట్లు దర్శకుడు లోకేశ్ కనకరాజ్ పేర్కొన్నారు. -
కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తు
వేలూరు: కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. వేలూరు, అనకట్టు నియోజక వర్గాలకు వేలూరు తందై పెరియార్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరగనుంది. దీంతో కౌంటింగ్కు సంబందించి ఏర్పాట్లును జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు వేలూరు తొర్రపాడిలోని తందై పెరియార్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం ఆవరణంలో ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, టపాకాయలు పేల్చడం, ఎటువంటి ఆడంబరాలు చేయకుండా ఉండే విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ ద్వారంలోనే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి కార్యకర్తలను అనుమతించబోమన్నారు. అనంతరం ఈవీఎంలు భద్ర పరిచి సీల్ వేసిన ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటూ సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉంచిన రిజిస్ట్రర్లో సంతకాలు చేశారు. -
10 ఏళ్ల బాలుడి గుండె వద్ద 900 గ్రాముల కణితి
సాక్షి, చైన్నె: చైన్నెలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు ఒక క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 10 ఏళ్ల బాలుడి గుండె, ఊపిరితిత్తుల మధ్య భాగంలో పెరిగిన సుమారు 900 గ్రాముల భారీ కణితిని అత్యంత నైపుణ్యంతో తొలగించారు. ఈ అరుదైన విజయం గురించి ఆస్పత్రి వైద్య బృందంలోని పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ధినేష్ బాలాజీ డాక్టర్ నందిని, డాక్టర్ సెంథిల్ గణేష్, డాక్టర్ కార్తీక్ నారాయణన్ , డాక్టర్ సతీష్ చందర్ లు బుధవారం మీడియాకు వివరించారు. సదరు బాలుడు గత కొంతకాలంగా తరచూ ఛాతిలో ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ రావడమే కాకుండా సాధారణ జలుబు, దగ్గుగా భావించినప్పటికీ సమస్య తగ్గకపోవడంతో ఆసుపత్రిలో చేరినట్టు వివరించారు. పరిశోధనలో బాలుడి ఛాతిలో ఒక భారీ కణితి ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని 75 శాతం మేర తగ్గించడమే కాకుండా, గుండైపె తీవ్ర ఒత్తిడి కలిగిస్తున్నట్టు గుర్తించామన్నారు. పరిశోధనలో ఆల్ఫా–ఫెటోప్రోటీన్ స్థాయిలు 2,68,000 (సాధారణంగా 10 కంటే తక్కువ ఉండాలి) ఉన్నట్లు తేలిందని, ఇది కణితి తీవ్రతను సూచించిందన్నారు. దీంతో సాధారణంగా గుండె ఆపరేషన్లకు ఉపయోగించే ’స్టెర్నోటమీ’ పద్ధతిలో ఛాతిని తెరిచి, అతి క్లిష్టమైన ఈ సర్జరీని నిర్వహించామన్నారు. గుండెకు, ప్రధాన రక్తనాళాలకు ఎటువంటి హాని కలగకుండా కిలో బరువున్న కణితిని తొలగించామన్నారు. ఆ బాలుడు ఆరోగ్యంగా ఉన్నట్టు పేర్కొన్నారు. -
ఘనంగా దేవసేన కల్యాణోత్సవం
తిరుత్తణి: చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి దేవసేన కల్యాణోత్సవం కోలాహలంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని కల్యాణోత్సవం తిలకించి స్వామిని దర్శించుకున్నారు. వివరాలు.. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు 21న ద్వజారోహణంతో ప్రారంభమైయ్యాయి. వేడుకల సందర్భంగా మూలవర్లకు రోజూ అభిషేక పూజలు నిర్వహించి మహాదీపారాధన చేశారు. ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యేక అలంకరణలో రోజూ ఉయదం సాయంత్రం సమయాల్లో వాహన సేవల్లో కొలువుదీరి మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిద రోజైన మంగళవారం రాత్రి కొండ ఆలయంలోని వెనుక భాగంలో దేవసేన మండపంలో దేవసేన కల్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్న కల్యాణోత్సవానికి వీలుగా మహిళలు పట్టు వస్త్రాలు, పూజా సామగ్రి, పుష్పాలు, పండ్లు వరుసగా ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆలయ అర్చకులు దేవసేన కల్యాణోత్సవంను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవసేన కల్యాణోత్సవం నిర్వహించి అక్షింతలు వేసి కల్యాణోత్సవం చేపట్టగా భక్తులు హారంహర నామస్మరణతో స్వామివారి కల్యాణోత్సవం తిలకించి దర్శించుకున్నారు. -
జోరుగా పనసపండ్లు విక్రయాలు
తిరుత్తణి: పనసపండ్ల సీజన్ ప్రారంభం కావడంతో తిరుత్తణిలో పనసపండ్లను రాశులుగా పోసి వ్యాపా రులు విక్రయాలు నిర్వహిస్తున్నారు. తమిళంలో ముక్కని అంటే ముఖ్యమైన మూడు పండ్లుగా గుర్తింపు పొందిన మామిడి, అరటి, పనసపండ్లు. ఈ మూడు పండ్లు ప్రతి శుభ కార్యక్రమం విందులో వినియోగిస్తారు. దీంతో వీటికి ముక్కని అని తమిళనాట ప్రసిద్ది. కడలూరు జిల్లా బన్రూటి ప్రాంతం పనస తోటలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలోని పనసపండ్ల తోటలను రైతులు వ్యవసాయంగా సాగుచేస్తున్నారు. ఏడాదిలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు పనస సీజన్. బన్రూటి పనస అంటే దేశ వ్యాప్తంగా డిమాండ్ వుంది. పనస సీజన్ ప్రారంభంతో తిరుత్తణికి చెందిన వ్యాపారులు బన్రూటిలో వ్యాపారుల వద్ద నేరుగా కేజీ రూ.20 నుంచి 40 వరకు కొనుగోలు చేసి తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారు. తిరుత్తణిలో రహదారుల పక్కన, రైల్వేస్టేషన్, బస్టాప్, తిరుత్తణి కొండ ఆలయాల్లో కేజీ రూ.200 కు విక్రయిస్తున్నారు. దీంతో విక్రయాలు ఆశాజనకంగా వున్నట్లు వ్యాపారులు అంటున్నారు. -
జోరందుకన్న అరసన్ షూటింగ్
తమిళసినిమా: నటుడు శింబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం అరసన్. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.ధాను తన వి.క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రం కావడంతో అరసన్పై భారీ అంచనాలు నెలకుంటున్నాయి. నటుడు విజయ్సేతుపతి పోలీస్ అధికారిగా కీలక పాత్రను పోషిస్తున్న ఇందులో నటి ఆండ్రియా, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ను నిర్మాతల మండలి ఇటీవల నిలిపేసిన విషయం తెలిసిందే. నటుడు శింబు, నిర్మాత ఐసరిగణేశ్లకు మధ్య వివాదం కారణంగా అరసన్ చిత్ర షూటింగ్ను నిలిపేశారు. కాగా ఆ సమస్య పరిష్కారం కావడంతో అరసన్ చిత్రం షూటింగ్ ఇటీవల మళ్లీ ప్రారంభం అయ్యింది. ఉత్తర చైన్నె నేపధ్యంలో సాగే గ్యాంగ్స్టర్స్ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రం నటుడు శింబు ఇంతకు ముందు నటించిన చిత్రాలకు పూర్తిగా భిన్నంగా ఉంటుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చైన్నెలో శరవేగంగా జరుగుతోందని వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వరుసగా వెల్లడించనున్నట్లు తెలిపారు. -
షిరిడీలో విజయ్ పూజలు
● నేడు అభ్యర్థులతో భేటీకి నిర్ణయం సాక్షి, చైన్నె: తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ బుధవారం మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిరిడీలో సాయిబాబాను దర్శించుకున్నారు. గురువారం చైన్నెలో ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశానికి ఏర్పాట్లు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 233 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 85 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతటా పర్యటించిన విజయ్, ప్రస్తుతం ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. మంగళవారం ఆయన తమిళనాడులోని తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బుధవారం ఉదయం చైన్నె నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్ర చేరుకున్న విజయ్, అక్కడి నుంచి కారులో షిరిడీ వెళ్లారు. సాయిబాబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. షిరిడీలో విజయ్ను చూసిన అభిమానులు , భక్తులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. మే 4న ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆయన ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. గురువారం చైన్నెలో పార్టీ అభ్యర్థులతో సమావేశానికి విజయ్ నిర్ణయించారు. పనయూరులో సాయంత్రం 3 గంటల నుంచి ఈ సమావేశం జరగనుంది. -
ముగిసిన విశ్రాంతి!
–చైన్నెకి సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: కొడైకెనాల్లో 4 రోజుల విశ్రాంతి తదుపరి బుధవారం సీఎం స్టాలిన్ చైన్నెకు చేరుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాస్త విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 25న సీఎం స్టాలిన్ తన కుటుంబ సభ్యులతో చైన్నె నుండి ప్రత్యేక విమానంలో మధురై చేరుకుని, అక్కడి నుండి కారులో కొడైకెనాల్కు వెళ్లారు. అక్కడ పాంబార్పురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో బస చేశారు. పర్యటనలో భాగంగా రోజూ ఉదయం ముఖ్యమంత్రి వాకింగ్ చేస్తూ స్థానిక ప్రజలు, పర్యాటకులతో ముచ్చటించారు. వారితో కలిసి ఫొటోలు కూడా దిగారు. మంగళవారం ఆయన ఒక ప్రైవేట్ మ్యూజియాన్ని సందర్శించారు. ఆధ్యాత్మికం సీఎం స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ ఇతర కుటుంబ సభ్యులు కొడైకెనాల్లోని కురింజి ఆండవర్ ఆలయం, మారియమ్మన్ ఆలయం, పూంబా రై కుళందై వేలప్పర్ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వారు కొడై లేక్లో బోటు షికారు చేస్తూ గడిపారు. ఇక తన పర్యటనలో భాగంగా మంత్రులు ఐ. పెరియ స్వామి, చక్రపాణిలతో పాటూ డీఎంకే ముఖ్య నేతలతో స్టాలిన్ భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, బుధవారం ఉదయం 8.50 గంటలకు కొడైకెనాల్ నుండి కారులో బయలుదేరి మధురై విమానాశ్రయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మధురై నుండి ప్రత్యేక విమానంలో ఆయన చైన్నెకి బయలుదేరి వచ్చేశారు. సీఎం పర్యటన దృష్ట్యా కొడైకెనాల్ మార్గంలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. స్టాలిన్ వద్దకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్? గత నాలుగు రోజులుగా కొడైకెనాల్లోని ఆహ్లాదకర వాతావరణంలో గడిపిన స్టాలిన్, రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా చాలా ఉల్లాసంగా కనిపించారు. తనను కలిసిన మంత్రులతో మాట్లాడుతూ.. ఈ సెలవులు తనలో కొత్త శక్తిని నింపాయని, శారీరకంగా, మానసికంగా రిఫ్రెష్ అయినట్లు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. స్టాలిన్ విశ్రాంతిలో ఉన్నప్పటికీ, ఎన్నికల ఫలితాలపై జాతీయ స్థాయి అంచనాలపై నిరంతరం దృష్టి పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. డీఎంకే ఒంటరిగా శ్రీమ్యాజిక్ ఫిగర్శ్రీ సాధిస్తుందని కేంద్ర హోంశాఖ వర్గాలు అంచనా వేస్తున్నట్లుగా, ఇందుకు సంబంధించిన ఇంటెలిజెన్స్ నివేదిక స్టాలిన్కు చేరినట్టు సమాచారం. ఈ ఉత్సాహంతోనే చైన్నె చేరుకున్న స్టాలిన్, తదుపరి ప్రభుత్వంలో తన మంత్రివర్గ సహచరులు ఎవరు ఉండాలి? ఏయే శాఖల్లో మార్పులు చేయాలి? అనే దానిపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు చర్చ ఊపందుకుంది. -
లవ్ ఓ లవ్ షూటింగ్ పూర్తి
తమిళసినిమా: ఇంతకుముందు నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన యువ నటుడు పవీష్ నారాయన్ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం లవ్ ఓ లవ్. పాపులర్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ ఈ చిత్రంలో కథానాయికిగా నటించగా దర్శకుడు సెల్వరాఘవన్, దర్శకుడు కేఎస్.రవికుమార్, వనిత విజయకుమార్, రమ్య, ఆదిత్య ఖదిర్ ముఖ్యపాత్రలు పోషించారు. మహేష్ రాజేంద్రన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని జి సినిమా స్టూడియో అండ్ ఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత దినేష్రాజ్, క్రియేటివ్ ఎంటర్ టైనర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత జి.ధనుంజయన్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ చిత్రం ప్రేమ ఇతివృత్తంతో సాగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ ఇటీవల విజయ్ సేతుపతి విడుదల చేశారని, దీంతో చిత్రానికి మంచి ప్రచారం లభించిందన్నారు. ఈచిత్రాన్ని ఈ సమ్మర్లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి పిజీ.ముత్తయ్య చాయాగ్రహణం, ప్రదీప్.పీజే, వైపేపవే ద్వయం సంగీతాన్ని అందిస్తున్నారు. -
వేలూరు కలెక్టరేట్కు బాంబు బెదిరింపులు
వేలూరు: వేలూరు కలెక్టరేట్కు బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఈ మెయిల్ పంపారు. ఆ ఈ మెయిల్ను కలెక్టరేట్లోని అధికారులు చూడగా అందులో పేర్కొన్న విధంగా మంగళవారం బాంబు బెదిరింపు ఈ మెయిల్ పంపగా వాటిని పరిశీలించిన అధికారులు బాంబు స్క్వాడ్ను రప్పించి కలెక్టరేట్లో తనిఖీలు చేశారు. బాంబు ఏదీ కనిపించలేదని నిర్లక్ష్యంగా ఉండిపోయారు. అయితే బుధవారం పెట్టిన బాంబు తప్పకుండా పేలడం ఖాయమని హెచ్చరించి మెయిల్ పంపారు. వీటిని గమనించిన కలెక్టరేట్లోని అధికారులు వెంటనే వేలూరు ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు, డాగ్, బాంబు స్క్వాడ్ను రప్పించి తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే ఎటువంటి బాంబు కనిపించకపోవడంతో పోలీసులు, కలెక్టరేట్లోని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ బాంబు స్క్వాడ్ కలెక్టరేట్లోనే నిఘా పెట్టారు. ఇప్పటికే కలెక్టరేట్కు మూడు సార్లు బాంబు బూచి ఈ మెయిల్ రావడంతో ప్రస్తుతం మరోసారి రావడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
సెంథిల్ మెడకు ట్రాన్స్ఫార్మర్ల ఉచ్చు
సాక్షి, చైన్నె: డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ మెడకు ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలు అక్రమాల కేసు ఉచ్చు బిగియనుంది. ఈ కేసును ముందుకు తీసుకెళ్లే విధంగా విచారణను సీబీఐకు అప్పగిస్తూ మద్రాసు హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. విద్యుత్, ఎకై ్సజ్ శాఖమంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ మెడకు గతంలో అన్నాడీఎంకే హయాంలో రవాణా శాఖలో జరిగిన క్యాష్ ఫర్ జాబ్స్ కేసు ఉచ్చుగా మారిన విషయం తెలిసిందే. ఏడాది కాలం పైగా ఆయన జైలులో ఉండాల్సి వచ్చింది. మంత్రి పదవిని సైతం కోల్పోవాల్సి వచ్చింది. అయినా, ఆయన్ని డీఎంకే ఏన్నడూ వీడ లేదు. కొంగు మండలం పార్టీ ఇన్చార్జ్గా నియమించి అసెంబ్లీ ఎన్నికలలో కీలక పాత్రను పోషించే విధంగా చేసింది. ఈ పరిణామాలు ఓ వైపు ఉంటే, మరో వైపు విద్యుత్ మంత్రిగా సెంథిల్ బాలాజీ ఉన్న సమయంలో ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో అవినీతి కేసు తాజాగా తెర మీదకు రావడం గమనార్హం. కేసు నేపథ్యం ఇదీ.. 2021 నుండి 2023 మధ్య కాలంలో సెంథిల్ బాలాజీ విద్యుత్ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ సమయంలో సుమారు 45,000 ట్రానన్స్ఫార్మర్ల కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వ ఖజానాకు రూ. 397 కోట్ల నష్టం వాటిల్లిందని అరప్పోర్ ఇయక్కం అనే స్వచ్ఛంద సంస్థతో పాటు అన్నాడీఎంకే నాయకులు శరవణన్, రాజ్కుమార్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు కీలక ఆదేశాలు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ. ధర్మాధికారి, జస్టిస్ జి.అరుల్ మురుగనన్తో కూడిన ధర్మాసనం ఈ కేసును బుధవారం విచారించింది. ఈ అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు కేసును రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నుండి సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను రెండు వారాల్లోగా సీబీఐకి అందజేయాలని అవినీతి నిరోధక శాఖను ఆదేశించారు. సీబీఐ దర్యాప్తునకు తమిళనాడు విద్యుత్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం, అవినీతి నిరోధక శాఖ పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించారు. కేసును స్వతంత్ర సంస్థకు బదిలీ చేయడం అనేది కేవలం పారదర్శకత కోసమేనని, ఇది ఎవరినీ దోషులుగా నిర్ధారించినట్లు కాదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. సీబీఐ ఈ వ్యవహారంపై కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణను వేగవంతం చేయాలని కోర్టు ఆదేశించడంతో మున్ముందు రోజులలో మళ్లీ సెంథిల్ బాలాజీని ఇరకాటంలో పెట్టే దిశగా కేంద్రం పెద్దలు పావులు కదపడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. -
తిరువణ్ణామలైలో 16 తాత్కాలిక బస్టాండ్లు
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో జరిగే చిత్ర పౌర్ణమి వేడుకలకు తిరువణ్ణామలై పట్టణంలో మొత్తం 16 చోట్ల తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తర్పగరాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. తిరువణ్ణామలై చిత్ర పౌర్ణమి వేడుకలు గురువారం రాత్రి 9.52 గంటలకు ప్రారంభమై శుక్రవారం రాత్రి 11.08 గంటలకు ముగుస్తాయి. ఈ సమయంలో గిరివలయం రావాలని ఆలయ అధికారులు ప్రకటించిన విషయం విధితమే ఈ వేడుకలకు చిత్ర పౌర్ణమికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్ర, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపద్యంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్య రాకుండా ఆయా రోడ్లులోనే తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు పోలూరు మార్గంలో తిరువణ్ణామలై బైపాస్ సమీపంలోని శ్రీ ముకాంబిగై నగర్, ఎకేఎస్ నగర్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్లో భక్తులను దింపి వేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్తాయన్నారు. అదే విధంగా తిరుత్తణి, వేలూరు, కేజీఎఫ్, ఆర్కాడు, ఆరణి వంటి ప్రాంతాల నుంచి తిరువణ్ణామలై వచ్చే బస్సులు గిరివలయం రోడ్డు సమీపంలోని అన్నా విగ్రహం వద్ద తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవ్యలూరు పేట రోడ్డు, కాంచిపురం మేల్మరవత్తూరు రోడ్డు, వందవాసి, సేత్తుపట్టు, దిండివనం రోడ్డు, చైన్నె– పుదుచ్చేరి రోడ్డు, వేట్టవలం రోడ్డు, తిరుకోవిలూరు రోడ్డు వంటి ఆయా రోడ్లులోనే తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేశామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కేటాయించిన బస్టాండ్కు మాత్రమే రావాలని పట్టణంలో ట్రాపిక్ సమస్య రాకుండా చూడాలన్నారు. అదే విధంగా 90 చోట్ల కార్లు, బైకులకు ప్రత్యేక పార్కింగ్ వసతి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 4,300 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చిత్ర పౌర్ణమికి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో తమిళనాడు ట్రాన్స్పోర్టు అద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు 4.300 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ఏపీఎస్ఆర్టీ ఆధ్వర్యంలో 400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే చిత్రా పౌర్ణమికి ఐదు వేల మందితో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. -
తగ్గుతున్న రిజర్వాయర్ల నీటి మట్టం
అధికారుల అన్వేషణ తిరువళ్లూరు: చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్ల నీటి మట్టం వేగంగా తగ్గుతున్న క్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించారు. చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్లో పూండి సత్యమూర్తి సాగర్, పుళల్, చోళవరం, చెమరంబాక్కం, తేరువాయి కండ్రిగ–కన్నన్కోటై ప్రధాన రిజర్వాయర్లు వున్నాయి. కండలేరు రిజర్వాయర్ నుంచి వచ్చే కృష్ణాజలాలను పూండి రిజర్వాయర్లో నిల్వ వుంచి అక్కడ నుంచి చోళవరం, చెమరంబాక్కం, పుళల్ రిజర్వాయర్లకు నీటిని తరలించి అక్కడ శుద్ధీకరణ చేసిన తరువాత చైన్నె ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల ఎండలు మండుతున్న క్రమంలో రిజర్వాయర్ల నీటి మట్టం తగ్గుతోంది. దీంతో అధికారులు వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యామ్నయ చర్యలపై దృష్టి సారించారు. పూండి సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం మొత్తం 35 అడుగులు కాగా ప్రస్తుతం 31 అడుగుల మేరకు నీరు ఉంది. అదేవిధంగా చెమరంబాక్కం రిజర్వాయర్ మొత్తం నీటి మట్టం 24 అడుగులు కాగా ప్రస్తుతం 21.37 అడుగుల నీరు నిల్వ వుంది. అలాగే పుళల్ రిజర్వాయర్ నీటి మట్టం మొత్తం 21 అడుగులు కాగా ప్రస్తుతం 14.72 అడుగుల నీరు నిల్వ ఉంది. చోళవరం రిజర్వాయర్ మొత్తం నీటి మట్టం 18.86 అడుగులు కాగా ప్రస్తుతం 11.77 అడుగుల నీరు నిల్వ వుంది. -
విజయ్.. మరో ఎంజీఆర్!
చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో తమిళనాడు దశాబ్దాలుగా ద్విముఖ పోరుగా మారిన రాజకీయ చదరంగంలో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చి అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోందని యాక్సిస్ మై ఇండియా సంచలన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. బ్లాక్బస్టర్ సినిమాలతో సినీప్రియులను ఉర్రూతలూగించిన హీరో విజయ్ ఇకపై ముఖ్యమంత్రిగా తమిళనాడు పౌరులనూ పాలించబోతున్నారని బుధవారం ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడైంది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ తాజా ఎన్నికల్లో ఏకంగా 98 నుంచి 120 స్థానాల్లో గెలిచే వీలుందని ఎగ్జిట్పోల్ పేర్కొంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ సులభంగా సాధారణ మెజారిటీని సాధిస్తుందని యాక్సిస్ మై ఇండియా ఛైర్పర్సన్ ప్రదీప్ గుప్తా చెప్పారు. ఎన్నికల తర్వాత తమిళనాడులో ఎంజీఆర్లా, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్లా విజయ్ సినీరంగం నుంచి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోబోతున్నారని ఎగ్జిట్ పోల్ అంచనావేసింది. అరంగేట్రం అదిరేలా.. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీ సాధారణ మెజార్టీ కంటే తక్కువగా 92 నుంచి 110 స్థానాలకు పరిమితంకావొచ్చు. ఎన్డీఏ కూటమి 22 నుంచి 32 సీట్లు సాధించొచ్చు. టీవీకే మాత్రం విజయదుందుభి మోగించే వీలుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం...ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ 35 శాతం ఓట్లు సాధించనుంది. టీవీకే సైతం 35 శాతం ఓట్లు సాధించనుంది. అయితే సీట్లపరంగా చూస్తే డీఎంకే కంటే టీవీకే ఎక్కువ సీట్లను గెల్చుకోనుంది. అన్నాడీఎంకే 23 శాతం ఓట్లు సాధించి 22 నుంచి 32 చోట్ల గెలిచే ఆస్కారముంది. యువ ఓటర్ల ఓట్లే కీలకం.. ఎగ్జిట్ పోల్ గణాంకాల ప్రకారం చూస్తే టీవీకే పార్టీకి యువత మద్దతు ఎక్కువగా ఉంది. → 18–19 ఏళ్ల వయసులో తొలిసారిగాఓటేసిన యువ ఓటర్లలో 68 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేశామని చెప్పారు → 20–29 ఏళ్ల వయసు వారిలో 59 శాతం మంది విజయ్కే తమ మద్దతు అని వెల్లడించారు → 30–39 ఏళ్ల వయసు వారిలో 45 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేశామని తెలిపారు → విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టణ ఓటర్లలో ఏ పార్టీకి ఇంతటి మద్దతులేకపోవడం విశేషం మార్పు... అసలైన మంత్రం పాలనలో మార్పును కోరుకుంటూ ఓటేశామని 35 శాతం మంది ఓటర్లు తెలిపారు. మరీ ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకే విధానాలతో విసిగిపోయి మార్పు కోసమే విజయ్ వైపునకు మళ్లామని 77 శాతం మంది ఆయన మద్దతుదారులు తెలిపారు. కేవలం విజయ్ హుందాతనం, ఛరిష్మాను చూసి ఓటేశామని మరికొందరు చెప్పారు. కొత్తతరహా రాజకీయం, ప్రభుత్వ వ్యతిరేకత సైతం విజయ్కి కలిసిరావొచ్చని ఎగ్జిట్ పోల్ పేర్కొంది. కులాలు, మతాలకతీతంగా.. కులాలు, మతాలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా విజయ్కు ఓట్లేశారని ఎగ్జిట్ పోల్ అంచనావేసింది. ఓబీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, గ్రామీణ,పట్టణ ప్రాంత ఓటర్లు అందరూ టీవీకేకు పట్టం కట్టబోతున్నారని ఎగ్జిట్పోల్ విశ్లేషించింది. ఉపకులాల వారీగా చూసినా ఇతర పార్టీలతో పోలిస్తే విజయ్కు మద్దతు ఎక్కువగా కన్పించింది. ప్రచారకాలంలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే విజయ్కు హవా ఉన్నట్లు ప్రచారసభలకు వచ్చిన జనాలను బట్టి తెలుస్తోంది. తీరా పోలింగ్ సమయం సమీపించేనాటికి టీవీకే పట్ల అభిమానం అంతకంతకూ పల్లెలకూపాకిందని ఎగ్జిట్పోల్ తెలిపింది. ముఖ్యమంత్రిగానూ.. రాష్ట్రంలో తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండొచ్చనే ప్రశ్నకు ఓటర్లు విజయ్ పేరే ఎక్కువగా చెప్పారు. విజయ్ సీఎం కావొచ్చని 37 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి సీఎం కావొచ్చని 35 శాతం మంది అంచనావేశారు. తొలి ఎన్నికల్లోనే ప్రస్తుత సీఎంకు గట్టిపోటీ ఇచ్చేస్థాయికి విజయ్కు ప్రజాదరణ దక్కడం విశేషమని యాక్సిస్ మై ఇండియా ఛైర్పర్సన్ ప్రదీప్ గుప్తా చెప్పారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో తేలిందేంటంటే.. → ద్విముఖ పోరుగా ఉన్న తమిళనాడు ఎన్నికల్లో హఠాత్తుగా టీవీకే వచ్చి కీలకశక్తిగా మారుతోంది→ డీఎంకేకు క్షేత్రస్థాయిలో ఇప్పటికీ గట్టిపట్టున్నా ఆ పునాదులను టీవీకే పెకళించే అవకాశాలు మెండుగా ఉన్నాయి→ జయలలిత మరణం, పన్నీర్సెల్వం, పళనిస్వామి మధ్య విభేదాలు, పన్నీర్సెల్వం ని్రష్కమణ, అంతర్గత విభేదాలతో అన్నాడీఎంకే ప్రభ కోల్పోయింది→ విజయ్ పార్టీ శాశ్వతంగా రాష్ట్రరాజకీయాల్లో కీలకభూమిక పోషించే అవకాశం → తాజా ఎగ్జిట్పోల్ అంచనాలు నిజమైతే టీవీకే పార్టీ తమిళనాట కీలకరాజకీయ శక్తిగా ఎదుగుతుంది. భవిష్యత్తు ఎన్నికల్లోనూ కింగ్మేకర్గా మారొచ్చు. -
ఐడెంటిటీకి మరింత బ్యూటీ
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కూవాగం ఉత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన అందాల పోటీలో కోయంబత్తూరుకు చెందిన సూర్య కుట్టి విజేతగా నిలిచారు. తమిళనాడులోని విళ్లుపురంలో అట్టహాసంగా జరిగిన ఈ ట్రాన్స్ వేడుకలో ఆమె ‘మిస్ కూవాగం 2026’ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లను ఏకం చేసే ఈ సాంస్కృతిక వేదికపై సూర్యకుట్టి సాధించిన విజయం, ఆ కమ్యూనిటీ ఐడెంటిటీకి, ఆత్మవిశ్వాసానికి, కళాత్మక ప్రతిభకు అద్దం పడుతోంది.ట్రాన్స్ జెండర్ల ఆరాధ్య దైవమైన కూతాండవర్ వెలసిన కూవాగం గ్రామంలో ప్రతి ఏటా కూవాగం ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మహాభారతంలోని అరవాన్ (కూతాండవర్) బలి ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 14న ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలను సౌత్ ఇండియన్ ట్రాన్స్ జెండర్ అసోసియేషన్, తమిళనాడు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ, తమిళనాడు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి. అందులో భాగంగా కోయంబత్తూరుకు చెందిన సూర్య కుట్టి మిస్ కూవాగం 2026 టైటిల్ను గెలుచుకుని అందరినీ ఆనందంలో ముంచెత్తారు.ప్రథమ స్థానంలో సూర్యతమిళనాడు విళ్లుపురం మున్సిపాలిటీ మైదానంలో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 25 మంది పోటీదారులు మూడు దశల్లో తమ ఆత్మవిశ్వాసం, ప్రతిభను ప్రదర్శించారు. ర్యాంప్ వాక్లో, జడ్జిల ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో సూర్య కనబరచిన చాకచక్యం ఆమెకు కిరీటాన్ని తెచ్చిపెట్టింది. రెండో స్థానాన్ని మలేసియాకు చెందిన నిషా నిలబెట్టుకుంటే, పుదుచ్చేరికి చెందిన అనన్య మూడోస్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మరో ఏడుగురు ట్రాన్స్ జెండర్లకు ‘యంగ్ అచీవర్స్’ పురస్కారాలను కూడా అందజేశారు. అంతకుముందు జరిగిన ‘మిస్ తిరునంగై 2026’ పోటీలో చెన్నైకి చెందిన ఓమన మొదటి బహుమతి గెలుచుకోగా, సాయి శ్రీ, సుఖి తర్వాతి స్థానాల్లో నిలిచారు.దేశ విదేశాల నుంచి తమిళనాడులోని కూవాగం గ్రామంలో ఉన్న కూతాండవర్ దేవాలయంలో జరిగే ఈ ఉత్సవం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగానే కాకుండా, ట్రాన్స్ జెండర్ల సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా సింగపూర్, హాంగ్ కాంగ్ వంటి దేశాల నుంచి వేల సంఖ్యలో ట్రాన్స్జెండర్లు ఇక్కడికి చేరుకుని తమ ఆరాధ్య దైవాన్ని పూజిస్తారు.ఉనికిని చాటే వేదిక కూతాండవర్ ఆలయ ఉత్సవాల్లో భాగమైన ఈ మిస్ కూవాగం పోటీ కేవలం అందానికి మాత్రమే పరిమితం కాదు. ఇది ట్రాన్స్ జెండర్ల ఉనికిని చాటే ఒక గొప్ప వేదిక. ఈ వేదిక సూర్య కుట్టి సాధించిన విజయానికి, పట్టుదలకు కోయంబత్తూరు కీర్తికి నిదర్శనంగా నిలిచింది. ప్రముఖ సినీ నటులు, గాయకుల సమక్షంలో ఆమెకు ఈ గౌరవం లభించడం విశేషం. కుటుంబ మద్దతే మా బలంట్రాన్స్ జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలంటే ముందుగా కుటుంబం నుంచి మద్దతు లభించాలి. నా ఈ విజయం మరికొంత మంది ట్రాన్స్జెండర్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని అనుకుంటున్నాను. ప్రభుత్వం ప్రతిపాదించే చట్టాలు మా హక్కులను కాపాడేలా ఉండాలి. ట్రాన్స్ జెండర్ సమాజం పట్ల ఉన్న వివక్షను తొలగించి, హక్కుల కోసం పోరాడుతూ.. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలవడమే లక్ష్యం. -
విజయ్దే విజయం.. యాక్సిస్ మై ఇండియా సంచలన రిపోర్ట్
సాక్షి,చెన్నై: తమిళనాడులో టీవీకేదే విజయమంటూ యాక్సిస్ మై ఇండియా సంచలన రిపోర్ట్ విడుదల చేసింది. మెజార్టీ సర్వే సంస్థలకు భిన్నంగా టీవీకే చీఫ్ విజయ్దే ప్రభంజనమన్న ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్.. టీవీకే 98-120 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండో స్థానంలో డీఎంకే 92-100 సీట్లు సాధించే అవకాశముందని అభిప్రాయం పడింది. మొత్తానికి టీవీకేకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ ఇన్సైట్ సర్వే అంచనా వేసింది. డీఎంకే-122-140, ఏఐడీఎంకే-60-70, టీవీకే 30-40, ఇతరులు-4 సీట్లు గెలిచే అవకాశముందని పేర్కొంది. మాట్రిజ్ సర్వే.. డీఎంకే: 122-132, అన్నా డీఎంకే: 87-100, టీవీకే 10-12, ఇతరులు 0-6 సీట్లు సీట్లు వస్తాయని పేర్కొంది. డీఎంకే 134-141, అన్నా డీఎంకే 84-90, టీవీకే 4-8 సీట్లు సాధించే అవకాశముందని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. డీఎంకే రెండో సారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది. కాగా, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రం మిగతా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు విభిన్నంగా ఎగ్జిట్పోల్స్ ఫలితాలను ప్రకటించింది. టీవీకే 98-120 స్థానాల్లో గెలిచే అవకాశముందని చెప్పింది.తమిళనాడులో ఈసారి ప్రధాన పోటీ డీఎంకే , అన్నాడీఎంకే కూటముల మధ్య ఉన్నప్పటికీ, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభావంపైనే అందరి దృష్టి నెలకొన్న సంగతి తెలిసిందే విజయ్ పార్టీ చీల్చే ఓట్లు అధికార డీఎంకే కూటమిపై ప్రభావం చూపుతాయా లేక అన్నాడీఎంకే ఓటు బ్యాంక్ను దెబ్బతీస్తాయా అన్నది సోషల్ మీడియాలో ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. ఈ ముక్కోణపు సమరంలో కొన్ని నియోజకవర్గాల్లో విజయ్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్న అంచనాల నడుమ, ప్రధాన పార్టీలలో టెన్షన్ పెట్టిస్తోంది. ఇవాళ విడుదలైన పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని అంచనా వేయగా.. యాక్సిస్ మై ఇండియా మాత్రం విజయ్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. -
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్.. విజయ్ సీఎం అవుతాడా?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇవాళతో (బుధవారం)తో ముగిసింది. పలు సంస్థలు ఎగ్జిట్పోల్స్ విడుదల చేశాయి. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ ఇన్సైట్ సర్వే అంచనా వేసింది. డీఎంకే-122-140, ఏఐడీఎంకే-60-70, టీవీకే 30-40, ఇతరులు-4 సీట్లు గెలిచే అవకాశముందని పేర్కొంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 84 శాతంపైగా ఓటింగ్ నమోదయ్యింది. గత 2021 ఎన్నికల కంటే 11 శాతం ఎక్కువగా ఓటింగ్ నమోదయ్యింది.మాట్రిజ్ సర్వే:DMK: 122-132ADMK: 87-100TVK: 10-12ఇతరులు 0-6ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్DMK 134-141AIDMK 84-90TVK 4-8టీవీకే విజయ్దే విజయం: యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్టీవీకే 98-120 స్థానాల్లో గెలిచే అవకాశంరెండో స్థానంలో డీఎంకే 92-100పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. అయితే 2016లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఏఐడీఎంకే వరుసగా రెండోసారి అధికారం చేపట్టారు. ఇప్పుడు డీఎంకే రెండో సారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది.తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. డీఎంకే కూటమి 125-145 స్థానాలతో అధికారం చేపట్టనుందని సర్వేలో తేలింది. ఏఐడీఎంకే 65-80 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. టీవీకే 18-24 స్థానాలు, ఇతరులు 2-6 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయి. డీఎంకే కూటమి 38.4 శాతం, ఏఐడీఎంకే 31.5 శాతం, టీవీకే 23.6 శాతం, ఇతరులు 6.5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఎన్నికల సర్వేలో 3 శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉంది.మహిళలు డీఎంకేకు 37.8 శాతం, ఏఐడీఎంకేకు 30.2 శాతం, టీవీకేకు 26 శాతం, ఇతరులకు 6 శాతం మద్దతివ్వగా, పురుషులు డీఎంకేకు 39.5 శాతం, ఏఐడీఎంకేకు 32.6 శాతం, టీవీకేకు 21.1 శాతం, ఇతరులకు 6.8 శాతం మద్దతిచ్చారు. 18 నుండి 24 ఏళ్ల మధ్య నూతన యువ ఓటర్లలో డీఎంకేకు 34.9 శాతం, ఏఐడీఎంకు 25.8 శాతం, టీవీకేకు 32.3 శాతం, ఇతరులకు 7 శాతం మద్దతిచ్చినట్టు సర్వేలో తేలింది. సినీ నటడు విజయ్ యువ ఓటర్లపై భారీ ఆశలు పెట్టుకున్నా అధికార డీఎంకే వైపు యువత మొగ్గు చూపినట్టు సర్వేలో వెల్లడైంది. డీఎంకే, ఏఐడీఎంకే ప్రత్యక్షంగా పోటీ పడకుండా వారి మిత్రపక్షాలు పోటీ పడిన స్థానాల్లో టీవీకే గట్టి పోటీ ఇచ్చిందని సర్వేలో తేలింది. ప్రధాన అభ్యర్థుల స్థానాలను పరిశీలిస్తే డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కొలతూరులో, ఏఐడీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి ఎడప్పాడిలో విజయం దిశగా కొనసాగుతున్నారు. మరో ఏఐడీఎంకే మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎన్నికల ముందు డీఎంకేలో చేరి బోడినాయకనూర్ నుండి పోటీ చేస్తుండగా అక్కడ టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా పెరంబూర్ నుండి గెలిచే అవకాశాలుండగా, ఈస్ట్ తిరుచిరాపల్లిలో వెనకబడినట్టు సర్వేలో తేలింది. డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చపాక్ నుండి పోటీ పడుతుండగా ఆయన అక్కడ టీవీకే పార్టీ నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. శ్రీపెరంబదూర్ నుండి పోటీలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సెల్వ అక్కడ టీవీకే చేతిలో వెనుకబడినట్టు సర్వేలో తేలింది.తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై మైలాపూర్లో బీజేపీ తరఫున పోటీ పడుతుండగా ఆమె టీవీకే చేతిలో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ నాగేందర్ పోటీ పడుతున్న సత్తూరులో ఆయన గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. సినీ నటడు దివంగత విజయ్కాంత్ సతీమణి, డీఎండీకే చీఫ్ ప్రేమలత గతంలో విజయ్కాంత్ గెలిచిన విరుదాచలం నుండి పోటీ పడుతుండగా ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.తమిళ రాజకీయాల్లో వృద్ధ నేత. కరుణానిధి సన్నితులైన 86 ఏళ్ల దురై మురుగన్ డీఎంకే తరఫున కాట్పడి నుండి పోటీ పడుతుండగా ఆయన ఇప్పుడు పదకొండవ సారి గెలిచే అవకాశాలున్నాయి. ఏఐడీఎంకే మిత్రపక్షం పీఎంకే చీఫ్ అన్బమణి రాందాస్ సతీమణి సౌమ్య అన్బమణి రాందాస్ ధర్మపురి నుండి పోటీ చేస్తుండగా ఆమె టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీవీకే, ఏఐడీఎంకే మధ్య చీలిపోతున్నాయి. టీవీకే, పీఎమ్కే (ఆర్), శశికళ కూటమితో ఏఐడీఎంకే నష్టపోతోంది. ముఖ్యంగా ఏఐడీఎంకే ట్రెడిషనల్ ఓటు బ్యాంకు అయిన తేవర్ శశికళ కూటమి, ఓపీఎస్ వల్ల, వన్నియార్ ఓటు పీఎమ్కే (ఆర్) పార్టీ వల్ల నష్టపోతుంది. తద్వారా గ్రాస్ రూట్లో ఏఐడీఎంకే చాలా స్థానాల్లో దెబ్బతింది. ఎస్సీ యూత్ టీవీకే ఆకర్షించగా, వీసీకే మద్దతుతో డీఎమ్కే తన ఎస్సీ ఓటు బ్యాంకు పదిలపరుకుంటుంది. విజయ్ వల్ల డీఎంకే కొంత క్రిస్టియన్ ఓట్లు కోల్పోపోతున్నప్పటికీ, ముస్లింలు డీఎంకే వైపే మొగ్గు చూపారు. డీఎంకే ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆ కూటమి వైపు మొగ్గు చూపారు. -
కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి
సాక్షి, చెన్నై : కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి మంగళవారం ఆనందోత్సాహాలతో జరిగింది. కూత్తాండవర్ ఆలయ పూజర్ల చేతుల మీదుగా తాళి కట్టించుకుని హిజ్రాలు ఆనందంలో మునిగి తేలారు. మిస్ కూవాగం 2026గా కోయంబత్తూరుకు చెందిన సూర్య ఎంపికయ్యారు. వివరాలు.. రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా ఉలుందూర్ పేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో బ్రహా్మత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హిజ్రాల వసంతోత్సవం వేడుక గత రెండు రోజులుగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్య కార్యక్రమం హిజ్రాల పెళ్లి సందడి నిమిత్తం దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున హిజ్రాలు కూవాగంకు చేరుకున్నారు. ఎటు చూసినా, ఎక్కడ చూసినా హిజ్రాల సందడిగా పరిసరాలు మారాయి. లాడ్జీలు, గెస్టు హౌస్లు, విడిదులు హౌస్ ఫూల్. అందగత్తెలకు తామేమి తక్కువ కాదన్నట్టుగా సింగారించుకుని హిజ్రాలు ముందుకు సాగారు. హిజ్రాల పెళ్లి సందడి నిమిత్తం ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున దుకాణాలు వెలిశాయి. పెళ్లికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు, తాళి బొట్ల ను హిజ్రాలు కొనుగోలు చేశారు. ఆంధ్రా, కేరళ, కర్నాటక, మహారాష్ట్రలతో పాటుగా విదేశాలకు చెందిన హిజ్రాలు సైతం ఈ ఏడాది పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం. మంగళవారం మధ్యాహ్నం తర్వాత కొత్త పెళ్లి కూతుళ్ల వలే ముస్తాభైన హిజ్రాలు కూత్తాండవర్ ఆలయం వద్దకు చేరుకోనున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా తాళి బొట్టు కట్టించుకుని ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. రాత్రంతా ఆలయం ఆవరణలో ఆట పాటలల్లో మునిగి తేలారు. ఇక, బుధవారం కూత్తాండవర్ రథోత్సవం జరగనుంది. ఆతర్వాత హిజ్రాలు వితంతువు వేషాలు ధరించి స్వస్థలాలకు బయలుదేరి వెళ్తారు. మిస్ కూవాగం ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మిస్ కూవాగం – 2026 అందాల ఫలితాలను ప్రకటించారు. మిస్ కూవాగం – 2026 గా కోయంబత్తూర్ సూర్య ఎంపికయ్యారు. దక్షిణ భారత ట్రా న్స్జెండర్ల సమాఖ్య ఆధ్వర్యంలో విల్లుపురం మున్సిపల్ మైదానంలో సోమవారం రాత్రంతా ఈ పోటీలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనేకమంది ట్రా¯Œన్స్జెండర్లు తమ ప్రతిభను చాటుకున్నారు. మిస్ కూవాగంగా ఎంపికైన కోయంబత్తూరు సూర్యకు రూ.51 వేలు, మలేషియాకు చెందిన నిషా రెండోస్థానానికి గాను రూ. 25 వేలు, పుదుచ్చేరికి చెందిన అనన్య మూడో బహుమతిగా రూ. 11 వేలు దక్కించుకున్నారు. దివంగత సీనియర్ ట్రా న్స్జెండర్ రాధా అమ్మాళ్ స్మరిస్తూ ముందుగా నివాళులరి్పంచారు. నటుడు మహేంద్రన్, నటి షనమ్ శెట్టి, నటుడు బాలా తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. -
ఘనంగా అగర్వాల్ సభ ప్లాటినం జూబ్లీ
– ప్రారంభించిన గవర్నర్ సాక్షి, చైన్నె: చైన్నెలో శ్రీ అగర్వాల్ సభ ప్లాటినం జూబ్లీ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ సామాజిక సంస్థగా ఉన్న శ్రీ అగర్వాల్ సభ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా చైన్నెలోని లేడీ ఆండల్ స్కూల్ ఆడిటోరియంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. బెంగళూరుకు చెందిన మిరాకిల్ ఆన్ వీల్స్ బృందం నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు. సమాజ సేవలో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులను, కమ్యూనిటీ సభ్యులను ఈ సందర్భంగా గవర్నర్ సత్కరించారు. ప్లాటినం జూబ్లీ ఛైర్మన్ విజయ్ కుమార్ గోయల్ 75 ఏళ్ల ప్రయాణం, సేవలను గురించి వివరించారు. ఈ కార్యక్రమం శ్రీ అగర్వాల్ సభ అధ్యక్షుడు సీతారామ్ గోయల్, ప్రధాన కార్యదర్శి బాల్ గోవింద్ గుప్తా, ఈవెంట్ ఛైర్మన్ అరుణ్ కుమార్ సుల్తానియా, మహిళా సమితి, మహిళా మండల్, యూత్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు. చివరగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ను సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ బస్సును ఢీకొన్న లారీ తిరువొత్తియూరు: దిండివనం సమీపంలో ప్రభుత్వ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా 40 మంది ప్రయాణికులు గాయాలయ్యాయి. వివరాలు.. నాగర్కోయిల్ నుండి చైన్నె వైపు వెళ్తున్న ప్రభుత్వ లగ్జరీ బస్సు, 40 మందికి పైగా ప్రయాణికులతో దిండివనం సమీపంలోని సాలవాతి వద్దకు చేరుకుంది. ఆ సమయంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద తిరువణ్ణామలై మార్గం నుండి పుదుచ్చేరి వైపు వెళ్తున్న లారీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ శక్తివేల్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో లారీ డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దిండివనం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడగా, వారిని చికిత్స కోసం దిండివనం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదం కారణంగా తిండివనం–తిరుచ్చి జాతీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోజుకు 20 వేల మెగావాట్లు సాక్షి, చైన్నె: రాష్ట్రంలో రికార్డు స్థాయికి విద్యుత్ వాడకం పెరిగింది. సాధారణంగా రోజుకు 16 వేల మెగావాట్లు ఉండే వాడకం మంగళవారం 20,000 మెగావాట్లకు చేరుకుంది. మే 4న అగ్ని నక్షత్రం మొదలయ్యే వేళ ఈవాడకం 22 వేల మెగావాట్లకు చేరే వకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.రాష్ట్రంలో భానుడు భగ.. భగ మండుతున్నాడు. ఎండ నుంచి ఉపశమనం కోసం జనం ఏసీల వాడకం పెరిగింది. దీంతో అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 4,000, సౌర విద్యుత్ ద్వారా 6,000, కొనుగోలు ఒప్పందాల ద్వారా 4 వేలు, స్వల్ప కాలిక కొనుగోలు ద్వారా 2 వేల మెగావాట్ల విద్యుత్ను పొందుతున్నారు. అదనంగా జలన, పవన విద్యుత్ ద్వారా ఉత్పత్తి అయ్యేవిద్యుత్ను పూర్తిగా రానున్న రోజులలో అంతరాయం అన్నది లేకుండా సరఫరా చేయడానికి చర్యలు చేపట్టారు. తాజాగా పెరుగుతున్న వాడకం, డిమాండ్కు అనుగుణంగా రాబోయే పది సంవత్సరాలకు ఉపయోగపడే రీతిలో కొత్త విద్యుత్ పథకాలకు తగ్గ ప్రణాళిక రూపకల్పనలో సైతం విద్యుత్ బోర్డు అధికారులుఉన్నారు. ఈ మేరకు 2026–27 నుండి 2035–36 వరకు రాబోయే పదేళ్ల కాలానికి విద్యుత్ డిమాండ్ సరఫరాను సమతుల్యం చేయడం కోసం ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమయ్యారు. బాలురు, బాలికలపై లైంగిక వేధింపులు – యువకుడికి 34 ఏళ్ల జైలు శిక్ష అన్నానగర్: సేలం జిల్లా, అమ్మపేట, భారతియార్ వీధి నివాసి అయిన మణి కంఠన్ (30) కూలీ. 2022లో 8 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించాడని పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, మణి కంఠనన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. విచారణ అనంతరం మణి కంఠన్ మరికొందరు బాలురు బాలికలను లైంగికంగా వేధించినట్లు తేలడంతో అతడికి 34 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
మంత్రి నెహ్రూపై కేసు నమోదుకు ఆదేశించలేదు
సాక్షి, చైన్నె: పురపాలక, నగరాభివృద్ధి శాఖలో జరిగిన అవకతవకల వ్యవహారంలో మంత్రి కే.ఎన్. నెహ్రూపై నేరుగా కేసు నమోదు చేయాలని తాము ఆదేశించలేదని, కేవలం ఆ అక్రమాలపై మాత్రమే దర్యాప్తునకు ఆదేశించామని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. కాగా పురపాలక, నగరాభివృద్ధి శాఖలో 2,538 మంది అసిస్టెంట్ , జూనియర్ ఇంజినీర్ల నియామకాల్లో సుమారురూ.634 కోట్ల మేరకు లంచం చేతులు మారినట్టుగా ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తాయి. ఈడీ దాడులలో లభించిన సమాచారం ఆధారంగా విచారణ నిమిత్తం డీజీపికి రాసిన లేఖతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా అన్నాడీఎంకే ఎంపీ ఇన్బదురై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్ నేతత్వంలోని ధర్మాసనం ఈ కేసును మంగళవారం విచారించింది. తన వాదనలు వినకుండానే కేసు నమోదుకు ఆదేశాలు ఇచ్చారని మంత్రి నెహ్రూ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.ఈసందర్భంగా న్యాయమూర్తులు స్పందిస్తూ తాము మంత్రిపై కేసు నమోదు చేయాలని ఎక్కడా పేర్కొనలేదన్నారు. కేవలం జరిగిన అవకతవకలపై మాత్రమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయమని చెప్పినట్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. వేసవి సెలవుల తర్వాతే విచారణ ఈ కేసులో లోతైన విచారణ అవసరమని భావించిన న్యాయమూర్తుల బెంచ్ తదుపరని విచారణను జూన్ 4వ వారానికి వాయిదా వేసింది. అదే సమయంలో కేసు నమోదుపై స్టే ఇవ్వాలని మంత్రి తరపు న్యాయవాదులు కోరగా, ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని బెంచ్ స్పష్టం చేసింది. నెహ్రూ -
ఎగ్జిట్ పోల్స్పై ఉత్కంఠ
సాక్షి, చైన్నె : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. దీంతో తమిళనాడు, పుదుచ్చేరిలలో ఎగ్జిట్ పోల్స్పై సర్వత్రా దృష్టి పడింది. బుధవారం సాయంత్రం తర్వాత పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్పోల్స్ ఎలా ఉండబోతున్నాయో అన్న ఉత్కంఠ నెలకొంది. వివరాలు.. తమిళనాడుకు పొరుగున ఉన్న పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9వ తేదీ ముగిసింది. ఇక్కడ కాంగ్రెస్ , డీఎంకే ఇండియా కూటమి, ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ ఎన్డీఏ కూటమి మధ్య ప్రధాన సమరం నెలకొంది. ఇక్కడ విజయ్ టీవీకే సైతం పోటీ చేయడంతో ఓట్ల చీలిక చర్చ జరుగుతున్నది. 92 శాతం మేరకు ఇక్కడ ఓటింగ్ జరగడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఎన్నికల తుది ప్రక్రియ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి వీలు లేదు కాబట్టి, ఉత్కంఠగా పుదుచ్చేరిలోని పార్టీల నేతలు ఎదురుచూస్తూ వచ్చారు. ఆ తదుపరి ఈనెల 23వ తేదిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక్కడ 86 శాతం మేరకు ఓటింగ్ జరిగింది. విజయ్ టీవీకే ప్రభావంతోనే ఓటు బ్యాంక్ పెరిగిందన్న చర్చ ఊపందుకు ని ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో గెలుపు గుర్రా లు ఎవరో అన్న ఉత్కంఠ, చర్చ గత వారం రోజులు రాష్ట్రంలో జరుగుతూ వచ్చాయి. ఈ పరిస్థితులలో బుధవారం పశ్చిమ బెంగాల్లో తుది విడత సమరం ముగియనున్నడంతో ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసినట్టే. దీంతో ఆయా సంస్థలు తమ ఎగ్జిట్పోల్స్ వివరాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోని టీవీ ఛానళ్లు, కొన్ని ప్రైవేటు సంస్థలు, జాతీయ స్థాయిలోని సంస్థలు అనేకం ఇప్పటికే తమ సర్వేను ముగించి ఉన్నాయి. తమ ఫలితాలను విడుదల చేయనున్నడంతో తమిళనాడులో, పుదుచ్చేరిలో ఎవరికి ఓటర్లు పట్టం కట్టే విధంగా ఎగ్జిట్ పోల్స్ వస్తాయో అన్న ఉత్కంఠ తో ఎదురుచూపులు పెరిగాయి. కౌంటింగ్ అధికారులకు శిక్షణ తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటింగ్ యంత్రాలను 62 కేంద్రాల్లో అత్యంత కట్టుదిట్టమైన నాలుగు అంచెల భద్రత మధ్య భద్రపరిచిన విషయం తెలిసిందే. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎన్నికల అధికారులు, సిబ్బందికి బుధవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. అన్ని కౌంటింగ్ కేంద్రాలలో ఈ శిక్షణ ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. విజయ్ ఫ్యాక్టర్ ఎవరికి లాభం? ఎవరికి నష్టం?తమిళనాడులో ఈసారి ప్రధాన పోటీ డీఎంకే , అన్నాడీఎంకే కూటముల మధ్య ఉన్నప్పటికీ, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభావంపైనే అందరి దృష్టి నెలకొంది. విజయ్ పార్టీ చీల్చే ఓట్లు అధికార డీఎంకే కూటమిపై ప్రభావం చూపుతాయా లేక అన్నాడీఎంకే ఓటు బ్యాంక్ను దెబ్బతీస్తాయా అన్నది సోషల్ మీడియాలో ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. ఈ ముక్కోణపు సమరంలో కొన్ని నియోజకవర్గాల్లో విజయ్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్న అంచనాల నడుమ, ప్రధాన పార్టీలలో టెన్షన్ మొదలైంది. వీటన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చే రీతిలో పోల్స్ ఉంటాయా? లేదా ఏకపక్షంగా ఉండబోతున్నాయా? అన్నది మరికొన్ని గంటలలో సర్వే ఫలితాలు స్పష్టం చేయబోతున్నాయి. ప్రస్తుతం కొడైకెనాల్లో ఉన్న సీఎం స్టాలిన్ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డ తదుపరి 30వ తేదీన చైన్నెకురానున్నారు. ఇక, సేలంలోని స్వగ్రామంలో ఉన్న అన్నాడీఎంకే పళణి స్వామి సైతం చైన్నెకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక టీవీకే అధినేత విజయ్ మంగళవారం తిరుచెందూరులో ప్రత్యేక పూజలు, శత్రు సంహార పూజలు నిర్వహించడమే కాకుండా షిరిడీ వెళ్లేందుకు సిద్ధం అవుతుండడం గమనార్హం. ఇక తొలిసారిగా ఎన్నికలలో నిలబడ్డ నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ కారైక్కుడిలో నెగ్గేనా అన్నది ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తాయో.. లేదో.. చూడాల్సి ఉంది. -
దక్షిణాసియాలోనే.. నంబర్–1గా తమిళనాడు
సాక్షి, చైన్నె: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 10.83 శాతం ఆర్థిక వృద్దిని తమిళనాడు తాజాగా నమోదు చేసిందని సీఎం స్టాలిన్ ప్రకటించారు. వరుసగా రెండో ఏడాది కూడా రెండంకెల ఆర్థిక వృద్ధిని నమోదు చేసి రికార్డు సృష్టించామన్నారు. తమిళనాడుకు ఇకపై పోటీ అన్నది ఇతర భారతీయ రాష్ట్రాలతో కాదని, దక్షిణాసియాలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదగడమే తమ లక్ష్యమని ప్రకటించారు. కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం తమిళనాడు ఆర్థిక పరిస్థితి వరుసగా రెండు సంవత్సరాలు రెండంకెల వృద్ధిరేటును నమోదు చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 11.19 శాతం, 2025–26 ఆర్థిక సంవత్సరానికి 10.83శాతం అంటూ 10 శాతానికి పైగా వృద్ధిని సాధించడం తమిళనాడు ప్రభుత్వ పరిపాలనా దక్షతకు నిదర్శనమన్న చర్చ తెర మీదకు వచ్చింది. ఇందుకు ఎక్స్ పేజీలో సీఎం స్టాలిన్ స్పందిస్టూ మంగళవారం ట్వీట్ చేశారు. విజయానికి మారు పేరు.. ‘తమిళనాడు అంటేనే విజయాలకు మారుపేరు. మా ద్రావిడ మోడల్’ పరిపాలనను అంకెల్లో కూడా నిరూపిస్తున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు.. మొదటి మూడేళ్లలో బలమైన పునాది వేసి, ఇప్పుడు వరుసగా రెండేళ్లు రెండంకెల వృద్ధిని సాధించామని ఈ విజయంలో భాగస్వాములైన ప్రజలందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. భారతదేశంలోనే కాకుండా, మొత్తం దక్షిణాసియాలోనే తమిళనాడును ప్రథమ స్థానంలో నిలబెట్టడం లక్ష్యంగా తెలిపారు. ప్రభుత్వ సమర్థవంతమైన నిర్వహణ, ప్రజల కష్టార్జితమే ఈ వృద్ధికి కారణమని సీఎం పేర్కొన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని మైలురాళ్లను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కొడైకెనాల్లో స్టాలిన్ సైక్లింగ్ కుటుంబంతో కలిసి కొడైకెనాల్లో ఐదు రోజుల విశ్రాంతి పర్యటనలో స్టాలిన్ ఉన్న విషయం తెలిసిందే.మూడవ రోజైన మంగళవారం వాకింగ్తో పాటూ సైక్లింగ్లో సీఎం దూసుకెళ్లారు. ఉదయాన్నే కొడైకెనాల్లోని ప్రసిద్ధ నక్షత్ర సరస్సు ప్రాంతంలో సీఎం స్టాలిన్ వాకింగ్ చేశారు. ఆ తర్వాత సరస్సు చుట్టూ సైకిల్ పై చక్కర్లు కొట్టారు. ప్రజలకు సూచనలు.. నడక సాగిస్తున్న సమయంలో తనను కలిసిన పర్యాటకులు, స్థానికులతో ఆయన ముచ్చటించారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తప్పనిసరిగా వాకింగ్ చే యాలని వారికి సూచించారు. తనను చూసేందుకు వచ్చిన ప్రజలకు ఆయన అభివాదం చేశారు. చాలా మంది పర్యాటకులు ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఆసక్తి చూపారు. మధ్యలో ఒక హోటల్ వద్ద ఆగి టీ తాగుతూ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఆయన మన్నవనూర్లోని కేంద్రప్రభుత్వ గొర్రెల పరిశోధనా కేంద్రం, కుందేళ్ల ఫారం, అటవీ శాఖ ఆధ్వర్యంలోని ఎకో టూరిజం సెంటర్ను సందర్శించారు. -
ధృవ్ సిక్స్ప్యాక్పై అనుపమ స్పందన
తమిళసినిమా: ఆదిత్యవర్మ చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన నటుడు విక్రమ్ వారసుడు ధృవ్. ఆ చిత్రం నిరాశపరచింది. ఆ తరువాత తండ్రి విక్రమ్తో కలిసి నటించిన మహాన్ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో ధృవ్ నటనకు మంచి మార్కులు పడ్డా ప్రేక్షకుల్లోకి వెళ్లలేదు. కాగా ఈ యువ నటుడు నటించిన మూడో చిత్రం బైసన్. మారిసెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి అనుపమ పరమేశ్వరన్ నాయకిగా నటించారు. ఇది గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక కబడ్డి కళాకారుడి ఇతి వృత్తంతో సాగే కథాంఽశంతో తెరకెక్కింది. ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో పాటు, నటుడు ధృవ్కు చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. దానితో పాటూ నటి అనుపమ పరమేశ్వరన్తో ప్రేమాయణం అనే ప్రచారానికి కారణం అయ్యింది. ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాంధించుకున్న నటి అనుపమ పరమేశ్వరన్. గత 2015లో ప్రేమలు అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన ఈ కేరళా కుట్టి ఎక్కువగా తెలుగులోనే అవకాశాలను అందుకుంటున్నారు. తమిళంలో ధనుష్కు జంటగా కొడి అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. కాగా ఇక్కడ కొన్ని చిత్రాలలోనే నటించిన అనుపమ పరమేశ్వరన్ చివరిగా నటించిన చిత్రం బైసన్. ఇందులో ఒక పల్లెటూరి యువతిగా నటించి మంచి మార్కులే కొట్టేశారు. కాగా ఇటీవల నటుడు ధృవ్ సిక్స్పాక్తో కూడిన తన బాడీబిల్డింగ్ ఫొటోతో కూడిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోకు మొదటి కామెంట్గా నటి అనుపమ పరమేశ్వరన్ ఫైర్ అనే ఎమోజీని పోస్ట్ చేశారు. ఆమె కామెంట్కు ఒక్క రోజులోనే 12 వేలకు పైగా లైక్స్ రావడం విశషం. అయితే ధృవ్ సిక్స్ప్యాక్ ఫొటోకు నటి అనుపమ పరమేశ్వరన్ ఫైర్ అంటూ రియాక్ట్ కావడం ఇప్పుడు ట్రోలింగ్కు దారి తీసింది. మరో ప్రేమ జంటా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
ధనుష్ హీరోగా సంజయ్ లీలా బన్సాలి చిత్రం?
సంజయ్ లీలా బన్సాలి తమిళ సినిమా: కోలీవుడ్లో స్టార్ హీరోగా రాణిస్తున్న నటుడు ధనుష్ బాలీవుడ్, హాలీవుడ్ను సైతం ఎప్పుడో టచ్ చేశారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన కర చిత్రం ఈ నెల 30న తెరపైకి రానుంది. ప్రస్తుతం అమరన్ చిత్రం ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత లబ్బర్బంతు చిత్రం ఫేమ్ తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. కాగా తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత సంజయ్ లీలా బన్సాలి నిర్మించనున్న భారీ చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యినట్లు సమాచారం. ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈయన ఇంతకు ముందు ఇరుంబు తిరై, హలో, సర్ధార్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా ఈయన ఇటీవల బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలి నిర్మించ తలపెట్టిన హిందీ చిత్రం రౌడీ రాధోర్– 2 చిత్రానికి గ్రౌండ్ వర్క్ చేసినట్లు, అయితే అది బడ్జెట్ కారణంగా సెట్పైకి వెళ్లలేదని సమాచారం. దీంతో మరో కొత్త చిత్రం చేయడానికి సిద్ధంకాగా దర్శకుడు పీఎస్.మిత్రన్ కథను రెడీ చేసినట్లు, ఇందులో మొదట టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ను నటింపజేయడానికి చర్చలు జరిగినట్లు టాక్. ఆ తరువాత తాజాగా నటుడు ధనుష్ హీరోగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం హిందీలో తెరకెక్కనుందా? లేక పాన్ ఇండియా చిత్రంగా రూపొందనుందా? అన్ని విషయంలో క్లారిటీ లేదు. ఇకపోతే నటుడు ధనుష్ ఇప్పటికే హిందీలో రాంజానా, అంత్రాంగి రే, తేరే ఇష్క్ మే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. కాగా తాజాగా సంజయ్ లీలా బన్సాలి నిర్మించనున్న చిత్రాన్ని అంతకు మంచి భారీ బడ్జెట్లో రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు, ఈ చిత్రం 2927 మొదటి భాగంలో ప్రారంభం కానుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన వెలువడాల్సి ఉంది. నటుడు ధనుష్ -
కోలీవుడ్లో మరో యువ హీరో
తమిళసినిమా: కోలీవుడ్లో పాత నీరు పారడం ఏమోగానీ, కొత్త నీరు మాత్రం ప్రవహిస్తూనే ఉంది. నవతరం నటులు తమ సత్తా చాటు కుంటున్నారు.అలా తాజాగా కథానాయకుడిగా ఎదుగుతున్న యువ నటుడు క్రితిక్మోహన్. ఈ చార్మింగ్ కుర్రాడు చిన్న వయసులోనే సినీ రంగప్రవేశం చేశాడు. తొమ్మిదవ తరగతి చదువుతున్న సమయంలోనే విజయ్ వసంత్ హీరోగా నటించిన అచ్చమిండ్రి అనే చిత్రంలో, చిన్న పాత్రలో మెరిశారు. ఆ తరువాత అవకాశాలు పలకరించినా చదువుకు ఇబ్బంది కలుగుతుందనే భావనతో నటనకు విరామం ఇచ్చారు. ఆ తరువాత సుబ్బురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన అంజామై చిత్రంలో నీట్ పరీక్ష కారణంగా బాధింపుకు గురైన ప్లస్ 2 విద్యార్దిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అదే కుర్రాడు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చిత్రంతో ఇద్దరు కథానాయకుల్లో ఒకరిగా అవతారమెత్తారు. గాంధీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఇందులో ఈ తరం ప్రేమికుడిగా, ప్రియురాలిని పెళ్లి చేసుకున్న యువకుడిగా నటించి అందరి ప్రశంసలు పొందుతున్నారు .ఈ చిత్రంలోని ప్రేమ సన్నివేశాల్లో, ఉద్వేగభరిత సన్నివేశాల్లో పరిణితి చెందిన నటనను ప్రదర్శించారు. కాగా ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం షూటింగ్ హోసూర్ సమీపంలో జరుపుకుంటోందని క్రితిక్మోహన్ చెప్పారు. ఇది చాలా ఆశ్యర్యానికి గురి చేసే యధార్థ ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న కథా చిత్రం అని పేర్కొన్నారు. మరి న్ని అవకాశాలు వస్తున్నాయని, కచ్చితంగా కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందుతానని కృతిక్ మోహన్ చాలా నమ్మకా న్ని వ్యక్తం చేస్తున్నారు. నటుడు క్రితిక్మోహన్ -
చైన్నెలో రోబోటిక్స్ గ్లోబల్ ఎక్సలెన్స్సెంటర్
సాక్షి, చైన్నె: దేశీయ సాంకేతిక విద్యా రంగంలో కొత్త ఒరవడి దిశగా చైన్నెలోని ఎస్ఆర్ఎం గ్రూప్ – ఈశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రపంచ స్థాయి రోబోటిక్స్ గ్లోబల్ ఎక్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏబీబీ రోబోటిక్స్ సంస్థ ఏర్పాటు చేసిన మూడవ కేంద్రం ఇది కావడం విశేషం. ఈ కేంద్రం కేవలం ల్యాబ్ మాత్రమే కాదు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిశోధనా కేంద్రం. ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఐ –ఎనేబుల్డ్ రోబోటిక్ సిస్టమ్స్లో 3డీ పిన్ పికింగ్, ప్యాలైటెజింగ్, స్పాట్ , ఆర్క్ వెల్డింగ్ వంటి క్లిష్టమైన పనులను చేసే రోబోలు, వర్చువల్ రియాలిటీ ఆధారిత సిమ్యులేషన్ సెల్స్, డిజిటల్ ట్విన్, అటానమస్ మొబైల్ రోబోలు, జనరేటివ్ ఏఐ, విజన్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్వంటివి ఇందులో ఉన్నాయి. విద్యార్థులకు ప్రయోజనాలు, స్టార్టప్లకు సరికొత్త అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు.ఈ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆ విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ ఆర్. శివకుమార్, ఏబీబీ రోబోటిక్స్ ప్రెసిడెంట్ సుబ్రత కర్మాకర్ , అదిత్యారామ్ గ్రూప్ ఎం.డి అదిత్యారామ్, అదానీ రియల్టీ సి.ఓ.ఓ అన్బు జయబాలన్తో పాటూ వైద్యులు, పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. -
రెండేసి చోట్ల పోటీపై దాఖలైన పిటిషన్ డిస్మిస్
సాక్షి, చైన్నె : ఒకే వ్యక్తి రెండు చోట్ల ఎన్నికలలో పోటీ చేసే విఽషయంపై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ విచారణను మంగళవారం న్యాయమూర్తులు తోసి పుచ్చారు. వివరాలు.. మదురైకి చెందిన మణి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం, అభ్యర్థులు అసెంబ్లీ లేదా లోకసభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ అభ్యర్థి రెండు చోట్లా గెలిస్తే, ఒక నియోజకవర్గానికి రాజీనామా చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఈ కారణంగా ఆ ఖాళీ అయిన స్థానానికి మళ్లీ ఉపఎన్నిక నిర్వహించాల్సి వస్తుందన్నారు. ఈ కారణంగా ప్రభుత్వానికి, అంటే ప్రజల సొమ్ముకు అనవసరమైన ఖర్చు అవుతోందని పిటిషనర్ వాదించారు. అందుకే రెండు చోట్ల పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఒకవేళ గెలిచి రాజీనామా చేస్తే ఆ ఉపఎన్నిక ఖర్చును తానే భరిస్తాను అన్న హామీ పత్రం తీసుకోవాలని ఆయన కోరారు. హైకోర్టు తిరస్కరణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్తో కూడిన ధర్మాసనం ఈపిటిషన్ను మంగళవారం విచారించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అభ్యర్థులు రెండు స్థానాల నుండి పోటీ చేయడానికి చట్టం స్పష్టంగా అనుమతిస్తోందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. రెండు చోట్ల పోటీ చేయడాన్ని సవాలు చేస్తూ గతంలో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసిందని గుర్తుచేశారు. ఆ తీర్పును పరిగణనలోకి తీసుకుంటూ హైకోర్టు కూడా ఈ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి నిబంధనలను మార్చడం లేదా కొత్తవి తీసుకురావడం అనేది ఈసీ లేదా చట్టసభల పరిధిలోని అంశమని, కోర్టులు ఇందులో జోక్యం చేసుకోలేవని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. -
క్లుప్తంగా
ఇంట్లోకి చొరబడి 76 ఏళ్ల వద్ధురాలిపై అత్యాచారం – 57 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ తిరువొత్తియూరు: చైన్నె, పులియంతోపు ప్రాంతంలో 76 ఏళ్ల వద్ధురాలు ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమెకు నలుగురు కుమారులు ఉన్నప్పటికీ, వారు సమీపంలోనే వేర్వేరుగా ఉంటున్నారు. ఆమె కుమార్తె రోజూ వచ్చి ఆమెకు స్నా నం చేయించి, భోజనం పెట్టి వెళ్తుండేవారు. ఈక్రమంలో, ఆదివారం ఆ వద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, అదే ప్రాంతానికి చెందిన మరుదప్పన్ (57) అనే ప్లంబర్ ఆమె ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పులియంతోపు మహిళా పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి మరుదప్పన్ను అరెస్టు చేశారు. అత్యాచారానికి గురైన వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించారు. 30 నుండి చైన్నె నుంచి ప్రత్యేక బస్సులు – చిత్రా పౌర్ణమి సందర్భంగా తిరువణ్ణామలైకి అదనపు బస్సులు తిరువొత్తియూరు: చిత్రా పౌర్ణమి ప్రత్యేకరోజును పురస్కరించుకుని తిరువణ్ణామలై ఆలయానికి వచ్చే భక్తుల కోసం తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. చిత్ర పౌర్ణమి గురువారం (ఏప్రిల్ 30) రాత్రి 9.50 గంటలకు ప్రారంభమై, శుక్రవారం రాత్రి 11.07 గంటలకు ముగుస్తుంది.ఈ నేపథ్యంలో చైన్నె, విల్లుపురం, దిండివనం, కాంచీపురం తిరువళ్లూరు వంటి ప్రధాన నగరాల నుంచి తిరువణ్ణామలైకి అదనపు బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే మే 1వ తేదీ శుక్రవారం కార్మిక దినోత్సవం సందర్భంగా సెలవు కావడంతో శని, ఆదివారాలతో కలిపి వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి. దీనివల్ల ప్రయాణికుల రద్దీ ఎక్కువ గా ఉంటోంది. దక్షిణ జిల్లాలకు వెళ్లే రైళ్లు ఇప్పటికే నిండిపోవడంతో, ప్రజలు ప్రభుత్వ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికులు రద్దీని తట్టుకోవడానికి ప్రభుత్వ రవాణా సంస్థ ఎస్ ఈటీసీ బస్సుల్లో ముందస్తుగా టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. తిరునాగేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం తిరువొత్తియూరు: కుండ్రత్తూరులో వెలిసిన తిరునాగేశ్వర ఆలయంలో రథోత్సవం మంగళవారం కోలాహలంగా జరిగింది కుండ్రత్తూరులో ప్రసిద్ధ తిరునాగేశ్వర స్వామి ఆలయంలో చిత్తిరై బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. నవగ్రహ స్థలాలలో రాహు స్థలంగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో, గత 22వ తేదీన ధ్వజారోహణంతో ఈ ఉత్సవా లు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటూ జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా, 7వ రోజైన మంగళవారం ఉదయం రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అలంకరించిన రథంపై తిరునాగేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీఎం అన్బరసన్, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై ఎంఎల్ఏ రథం తాడును లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. వారిని అనుసరిస్తూ వేలాది మంది భక్తులు హర ,హర మహా దేవ, నాగేశా అనే నామస్మరణలతో రథాన్ని ప్రధాన వీధుల గుండా లాగారు. ఈ ఉత్సవానికి హాజరైన భక్తులకు స్వచ్ఛంద సంస్థలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ, తాగునీరు, అన్నదానం ఏర్పాటు చేశారు. కుండ్రత్తూరు పోలీసులు భారీ భద్రతను పర్యవేక్షించగా, రథోత్సవం దృష్ట్యా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లించారు. వండలూరు – మీంజూర్ వెలుపల రింగ్ రోడ్డు మీదుగా వాహనాలను అనుమతించారు. సింగ్ హెల్త్తో అతుల్య సీనియర్ కేర్ ఒప్పందం కొరుక్కుపేట: వైద్య సేవలు, వృత్తిపరమైన శిక్షణ, పరిశోధన , విజ్ఞాన మార్పిడి రంగాలలో సహకారాన్ని అందిస్తున్న అతుల్య సీనియర్ కేర్, సింగపూర్లోని అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సంస్థ సింగ్హెల్త్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు మంగళవారం జరిగిన సమావేశంలో సింగ్ హెల్త్ ఇంటర్నేషనల్ కొలాబ్రేషన్ ఆఫీసు డైరెక్టర్ విజయరావు మాట్లాడుతూ సింగ్హెల్త్ అనేది అక్యూట్ హాస్పిటల్స్, స్పెషలిస్ట్ సెంటర్లు, పాలిక్లినిక్లు , కమ్యూనిటీ హాస్పిటల్స్తో కూడిన ఒక విస్తృతమైన సంస్థల నెట్వర్క్ను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. వృద్ధాప్య జనాభా కారణంగా పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా, వృద్ధుల సంరక్షణ నాణ్యతను , అందుబాటును మెరుగుపరచాలనే ఉమ్మడి నిబద్ధతను ఈ అవగాహన ఒప్పంద భాగస్వామ్యం ప్రతిబింబిస్తుందన్నారు. సీనియర్ లివింగ్ , కంటిన్యూమ్ కేర్లో అతుల్యకు ఉన్న నైపుణ్యాన్ని, సింగ్హెల్త్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన క్లినికల్, అకడమిక్ సామర్థ్యాలతో కలపడం ద్వారా, ఈ భాగస్వామ్యం రెండు సంస్థలలోనూ సంరక్షణ పంపిణీని బలోపేతం లక్ష్యంగా ముందుకెళ్ళుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అతుల్య సీనియర్ కేర్ సీఈఓ శ్రీనివాసన్, సింగ్ హెల్త్ డైరెక్టర్ లండన్ లుసీన్ ఓయ్ , ప్రతినిధి కృష్ణన్ కావ్య పాల్గొన్నారు. -
రిన్యూఎక్స్– 2026 సదస్సు ఆరంభం
కొరుక్కుపేట: భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తనపై దశాబ్దపు ప్రభావాన్ని సూచిస్తూ, చైన్నెలో రిన్యూఎక్స్ 2026 సదస్సు, ఎక్స్ పో సోమవారం ప్రారంభమైంది. ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటైన 10వ ఎడిషన్ ఎక్స్ పో చైన్నె ట్రేడ్ సెంటర్ వేదికై ంది. ‘‘ప్రభావవంతమైన దశాబ్దం – సమద్ధిగల భవిష్యత్తు’’ అనే పేరుతో సాగుతున్న ఈ సదస్సులో 200కు పైగా ప్రముఖ బ్రాండ్లు, 50 మందికి పైగా విశిష్ట వక్తలు, 8,000 మందికి పైగా పరిశ్రమ నిపుణులు పాల్గొంటున్నారు. ఇది సౌరశక్తి, శక్తి నిల్వ, బయో–ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్లు, మరియు అభివద్ధి చెందుతున్న స్వచ్ఛమైన సాంకేతికతల కోసం ఈ వేదికను ఒక కీలకమైన మార్కెట్ప్లేస్గా నిలుపుతోందని ఇన్ఫార్మా మార్కెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ ముద్రాస్ తెలిపారు. ఇందులో ఫ్రాస్ట్ అండ్ సల్లివన్, ఎకనామిక్ అనలిటిక్స్ అసోసియేట్ డైరెక్టర్ నేహా థామస్ , చైన్నె ఆస్ట్రేలియన్ కాన్సుల్–జనరల్ సిలై జాకీ ; తమిళనాడు సోలార్ ఎనర్జీ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. శివకుమార్ , ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా సీనియర్ గ్రూప్ డైరెక్టర్ – ఎనర్జీ పోర్ట్ఫోలియో రజనీష్ ఖత్తర్ సహా పలువురు ప్రముఖ పరిశ్రమ నాయకులు పాల్గొని మాట్లాడారు. -
నిర్మాణ రంగంలో సరికొత్త విప్లవం లక్ష్యం
సాక్షి, చైన్నె: నిర్మాణ రంగంలో సరకొత్త విప్లవానికి నాంది పలికే విధంగా స్లేట్ ఏఐ అనే కత్రిమ మేధా సాంకేతికతను ప్రవేశ పెట్టేందుకు డీఆర్ఏ సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా మంగళవారం కాలిఫోర్నియాకు చెందిన స్లేట్ టెక్నాలజీతో డీఆర్ఏ చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం గురించి డీఆర్ఏ ఎండీ రంజీత్రాథోడ్ మీడియాకు వివరించారు. సాధారణంగా నిర్మాణ రంగంలో పనులు ఎలా జరుగుతున్నాయో అనే నివేదికలు పాత పద్ధతిలో ఉంటాయని, అయితే, స్లేట్ ఏఐ వాడకం వలన ప్రాజెక్టు పనులు ముందే ప్లాన్ చేయడం, నాణ్యతను పెంచడం, వేగంగా పూర్తి చేయడం సాధ్యమవుతుందన్నారు. నిర్మాణ స్థలాల్లో వేర్వేరు భాషలు మాట్లాడే కార్మికులు ఉంటారని,ఈ ఏఐ వేదిక వాస్తవిక సమయాలలో వివిధ భాషల్లో సమాచారాన్ని అందిస్తూ టీమ్స్ మధ్య సమన్వయాన్ని సులభతరం చేస్తుందన్నారు. నాణ్యత తనిఖీలు, సేఫ్టీ అనలిటిక్స్ వంటి పనుల్లో జాప్యం జరగకుండా ముందుగానే అంచనా వేయడం వంటి అంశాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రస్తుతం చైన్నెలోని సుమారు 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జరుగుతున్న డీఆర్ఏ ప్రాజెక్టులలో ఈ కొత్త సాంకేతికతను అమలు కేస్తున్నామని ప్రకటించారు. ఇది 2,000 మంది కార్మికులు , 100 మంది సాంకేతిక సిబ్బందికి సహాయకారిగా ఉంటుందన్నారు. -
నిఽధి నెలవారీ ఖర్చు ఎంతో తెలుసా?
తమిళసినిమా: నిధి అగర్వాల్ పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్నారు. అయితే నటిగా దశాబ్దానికి చేరువు అవుతున్నా, ఈ 33 ఏళ్ల మార్వాడీ బ్యూటీ ఇప్పటికీ సరైన గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నాని చెప్పక తప్పదు . అదే సమయంలో వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బాగానే సంపాందిస్తున్నా, ఐరన్లెగ్ అనే ముద్ర నుంచి ఇంకా బయట పడలేదు. ఇక ప్రేమ వ్యవహారంలోనూ బాగానే వార్తల్లో ఉంటున్నారు. ఆ మధ్య నటుడు శింబుతో ప్రేమాయణం అంటూ ప్రచారం వైరల్ అయ్యింది. అప్పుడామె ఆయనకు జంటగా ఈశ్వర్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం సక్సెస్ కాకపోయినా, ప్రేయాయణం వార్తలతో బాగానే పాపులర్ అయ్యారు. ఇక కోలీవుడ్లో ఈ బ్యూటీ నటించిన మరో చిత్రం భూమి. జయంరవికి జంటగా నటించిన ఆ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడంతో నిధి అగర్వాల్ కెరీర్కు ఏ మాత్రం ఉపయోగ పడలేదు. ఆ మధ్య తెలుగులో పవన్కల్యాణ్కు జంటగా నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నా, అది పూర్తిగా నీరుగార్చింది. ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. అదీ ఆఽశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తన వ్యక్తిగత నెల ఖర్చు గురించి ఒక భేటీలో నిధిఅగర్వాల్ పేర్కొన్నారు. అందులో ‘ నా నెల ఖర్చు ఎంతో తెలుసా ? అంటూ చెప్పడం ప్రారంభించారు. నా నెలవారి ఖర్చు రూ. 5 లక్షలు అని పేర్కొన్నారు. నా ట్రావెలింగ్, బస,డయిట్,జిమ్, ట్రైనర్, పార్లర్ ఖర్చులకే రూ. 5 లక్షలు అవుతుంది. ఇవి కాకుండా మేకప్, హెయిర్స్టైలింగ్, ఫోటోస్ వంటి ఖర్చులను కొన్ని సార్లు కార్యక్రమాల నిర్వాహకులు చెల్లించినా, కొన్ని సార్లు నేను భరించాల్సి ఉంటుంది’ అని నటి నిధి అగర్వాల్ పేర్కొన్నారు. -
ఘనంగా జయంతి వేడుకలు
కొరుక్కుపేట: సర్ త్యాగరాయ కళా పరిషత్, ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వాహక వర్గం సంయుక్త ఆధ్వర్యంలో సర్ పిట్టి త్యాగరాయశ్రేష్టి 175వ జయంతిని చైన్నె పాత చాకలి పేటలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సమాజ సభ్యులు మన్నప్ప మొదటి వీధిలో ఉన్న సర్ త్యాగరాయ మహోన్నత పాఠశాల నుంచి ఊరేగింపుగా టీహెచ్ రోడ్డులోని సర్ త్యాగరాయ ఉద్యానవనం వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న ఆయన విగ్రహానికి సమాజం అధ్యక్షుడు డాక్టర్ పి.నందివర్మన్, ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కమిటీ అధ్యక్షుడు, సంగీత గాయకుడు ఎంఆర్ సుబ్రమణ్యం పుష్పాంజలి ఘటించారు. తదనంతరం సర్ త్యాగరాయ కళాశాలలోని పెద్ద సర్ పిట్టి త్యాగరాయశ్రేష్టి, చిన్న సర్ పిట్టి త్యాగరాయశ్రేష్టి విగ్రహాలకు జక్కుల హరికృష్ణ, కోణంకి జనార్దనం, మన్ని వెంకటేశ్వర్లు, కేబీ సతీష్కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కళాశాల అభివృద్ధికి తోడ్పడిన పమ్మిరామస్వామి మూర్తులకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మద్రాసు నగరం ప్రప్రథమ మేయర్ సర్ పిట్టి త్యాగరాయ శ్రేష్టి మన తెలుగు వారైనందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని కొనియాడారు. -
ఒకే అంశంపై వేర్వేరు పిటిషన్లు వద్దు
మధురై ధర్మాసనం వ్యాఖ్య నిబంధనలు కఠినతరం సాక్షి, చైన్నె: విచారణలో ఉన్న విషయంపై వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయడం అనవసరం అని మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం వ్యాఖ్యలు చేశారు. విరుదునగర్ బాణసంచా తయారీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో బాధితులకు భారీ పరిహారం అందించాలన్న పిటిషన్పై న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. విరుదునగర్కు చెందిన విడియల్ వీర పెరుమాళ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 19న శివకాశి సమీపంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు పరిహారం చెలిచే విఽషయంగా కొన్నిసూచనలు చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 5 నుంచి 15 లక్షల వరకు నష్ట పరిహారం అందించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పరిహారంతో పాటు, బాధితుల కుటుంబాలకు ఉచిత విద్య, పునరావాసం కల్పించాలని , భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా బాణసంచా తయారీ పరిశ్రమలపై సాంకేతిక విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కోర్టు స్పందన – విచారణ వాయిదా ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సతీష్ కుమార్, జస్టిస్ జ్యోతి రామన్ ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకే రకమైన డిమాండ్లతో పదేపదే వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయడం అనవసరం అని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో ప్రజలు దీనిని తమ ప్రచారం కోసం వాడుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్నబాణా సంచా తయారీ పరిశ్రమల్లో ప్రమాదాలకు సంబంధించిన ఇతర కేసులతో ఈ పిటిషన్ను జత చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 8వ తేదీకి వాయిదా వేసింది. బాణసంచా తయారీపై ఆంక్షలు తమిళనాడులో వేడిగాలుల తీవ్రత పెరుగుతున్నందున, బాణసంచా తయారీలో వాడే రసాయనాల వల్ల ప్రమాదాలు జరగకుండా కేంద్ర పేలుడు పదార్థాల నియంత్రణ శాఖ కొత్త నిబంధనలు విధించింది. రసాయనాల మిశ్రమం, ముడి పదార్థాల శుద్ధిని ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్యే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎండ తీవ్రత పెరిగే మధ్యాహ్నం వేళల్లో పనులు చేయడం ప్రమాదకరమని ఈ నిర్ణయం తీసుకున్నారు. భద్రతా నియమాలను ఉల్లంఘించే కర్మాగారాల లైసెన్సులను రద్దు చేయడమే కాకుండా, వాటిని శాశ్వతంగా మూసివేస్తామని అధికారులు హెచ్చరించారు. విరుదునగర్, సాత్తూరు, శివకాశి పరిసరాల్లోని కొన్ని ప్రమాదకర పరిశ్రమలలో ప్రస్తుతానికి ఉత్పత్తిని నిలిపివేశారు. -
వేడుకగా రథోత్సవం
తిరువళ్లూరు: కూవం గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీత్రిపుర సుందరి సమేత త్రిపురాంతాక స్వామివారి ఆలయంలో రఽథోత్సవం సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కూవం గ్రామంలో దేవదాయశాఖకు చెందిన త్రిపుర సుందరి సమేత త్రిపురాంతక స్వామివారి ఆలయం ఉంది. ఆలయంలో ప్రతి ఏటా ఛైత్రమాసం బ్రహ్మోత్సవాలను పది రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే ఉత్సవాలు గత 21న ద్వజారోహణంతో ప్రారంభించారు. ఏడో రోజైన సోమవారం ఉదయం రథోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి స్వామివారు సమీపంంలోని మండపానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు అందుకుని అక్కడి నుంచి రథానికి చేరుకున్నారు. అనంతరం రథం నాలుగు మాడవీధుల్లో సాగింది. -
ముగ్గురికీ ఉపశమనం
సాక్షి, చైన్నె : ఎన్నికల నామినేషన్ ప్రమాణ పత్రం విషయంగా దాఖలైన పిటిషన్లను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. దీంతో టీవీకే అధినేత విజయ్, అన్నాడీఎంకే మాజీ మంత్రులు సీవీ షణ్ముగం, డి జయకుమార్లకు కేసుల నుంచి ఊరట కలిగినట్లయ్యింది. వివరాలు.. రాయపురంలో పోటీ చేసిన డి. జయకుమార్కు 2021లో రూ. 39.14 లక్షలుగా ఉన్న ఆస్తులు, 2026 నాటికి రూ. 70.73 లక్షలకు పెరిగాయని, ఈ పెరుగుదలపై ఆదాయపు పన్ను శాఖ విచారణ జరపాలని ప్రవీణ్ కుమార్ అనేఓటరు పిటిషన్ వేశారు. అలాగే మైలంలో పోటీ చేసిన సి.వి. షణ్ముగంకు గత ఐదేళ్లలో చరాస్తులు రూ. 12 లక్షల నుండి రూ. 60 లక్షలకు పైగా పెరిగాయని, ఎమ్మెల్యే ఆదాయానికి మించి ఈ పెరుగుదల ఉందని సెంథిల్ కుమార్ అనే ఓటరు కోర్టును ఆశ్రయించారు. అలాగే, విజయ్ తన భార్య సంగీతకు రూ. 12.6 కోట్ల అప్పు ఇచ్చినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారని, దీనిపై విచారణ జరపాలని మరొక పిటిషన్ దాఖలైంది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై వేర్వేరుగా విచారించింది. గతంలో ఇటువంటి అభ్యర్థనలతో వచ్చిన కేసులను కొట్టివేసిన దృష్ట్యా, ఈ పిటిషన్లను కూడా తిరస్కరించారు. దీంతో ఆముగ్గురికి కేసుల నుంచి ఊరట కలిగినట్లయ్యింది. -
పుదుచ్చేరిలో త్రిభాషా విధానం
సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక రాజకీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, ఎండీఎంకేలు తీవ్రంగా స్పందించాయి. వివరాలు.. నేషనల్ కరికులమ్ ఫ్రేమ్వర్క్ 2023 సిఫార్సుల మేరకు, 2026–27 విద్యాసంవత్సరం నుండి సీబీఎస్ఈ పాఠశాలల్లోని 6వ తరగతి విద్యార్థులకు మూడవ భాషను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనిని అమలు చేయడానికి పాఠశాలలకు కేవలం ఒక వారం సమయం మాత్రమే ఇచ్చింది. పలు పార్టీల అభ్యంతరాలు.. డీఎంకే పుదుచ్చేరి రాష్ట్ర ఆర్గనైజర్ శివ స్పందిస్తూ, బహుభాషా నైపుణ్యం పేరుతో హిందీని రుద్దుతున్నారని, దీనివలన విద్యార్థులపై భారం పెరుగుతుందని విమర్శించారు. పుదుచ్చేరికి ఉన్న ప్రత్యేక సాంస్కతిక గుర్తింపు అయిన ఫ్రెంచ్ భాషను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పుదుచ్చేరి డీఎంకే తరపున పెద్ద ఎత్తున ’భాషా హక్కుల పోరాటం’ నిర్వహిస్తామని ప్రకటించారు. అన్నాదురై హయాం నుండి ఉన్న ద్విభాషా విధానమే (తమిళం మరియు ఇంగ్లీష్) సరైనదని ఆయన స్పష్టం చేశారు. అన్నాడీఎంకే కార్యదర్శి అన్భళగన్ స్పందిస్తూ, పుదుచ్చేరిలో అన్నాడీఎంకే ఎప్పుడూ ద్విభాషా విధానానికే మద్దతు ఇస్తుందన్నారు. త్రిభాషా విధానం వలన విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడుతుందని, ప్రభుత్వం దీనిపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలని కోరారు.పుదుచ్చేరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. కాగా, ఎండీఎంకే నేత వైగో సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ, ఫ్రెంచ్ సంస్కృతికి చరమగీతం పాడే దిశగా కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
రోజుకో పేటెంటే లక్ష్యం
కొరుక్కుపేట: ఐఐటీ మద్రాసు వరుసగా రెండవ సంవత్సరం స్టార్టప్ శతమ్ సాధించి, రోజుకు ఒక పెటెంట్ ఊపును కొనసాగిస్తుందని ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి అన్నారు ఈ మేరకు ఐఐటీఎం క్యాంపస్లో జరిగిన ప్రపంచ ఐపీ దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, స్టార్టప్ వ్యవస్థాపకులతో సమావేశంలో కామకోటి పలు అంశాలపై మాట్లాడారు. ఐఐటీఎం ఇంక్యుబేషన్ సెల్ ద్వారా 112 స్టార్టప్లకు ఇంక్యుబేషన్ అందించడం, 2025–26 ఆర్థిక సంవత్సరంలో 431 పేటెంట్లను దాఖలు చేశామన్నారు. దీంతో డీప్–టెక్ ఆవిష్కరణ వ్యవస్థాపకతలో ఇనిస్టిట్యూట్ తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకుందన్నారు. ఈ విజయాలు డీప్–టెక్ వ్యవస్థాపకత, అనువర్తిత పరిశోధన, మేధో సంపత్తి సృష్టి రంగాలలో భారతదేశంలోని అగ్రగామి ఉన్నత విద్యా సంస్థలలో ఒకటిగా ఐఐటీ మద్రాస్ నిలిచిందన్నారు. తమ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, పూర్వ విద్యార్థులు, బయటి పారిశ్రామికవేత్తలు భారతదేశానికి, ప్రపంచానికి సేవ చేయగల సాంకేతికతలను, సంస్థలను సృష్టిస్తున్నారన్నారు. డీన్ (ఐసీఎస్ఆర్) ప్రొఫెసర్ మను తదితరులు పాల్గొన్నారు. -
కౌంటింగ్కు ముమ్మర ఏర్పాట్లు
వేలూరు: వేలూరు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్, వేలూరు జిల్లా ఎన్నికల అధికారి సుబ్బలక్ష్మి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కింపు మే 4న వేలూరు తందైపెరియార్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనుంది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి వేలూరులోని కౌంటింగ్ సెంటర్లోని ఏర్పాట్లను కలెక్టర్ సుబ్బలక్ష్మితో పాటూ ఉన్నతాధికారులు సోమవా రం కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారుల బృందం కౌంటింగ్ చేసే గది, కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీటివి కెమరాల నమో దు, ఇందుకు అసరమైన బందోబస్తు ఏర్పాట్లును పరిశీలించారు. ఈవీఎం మిషన్లు ఉంచిన ప్రాంతంలో ఉంచిన రిజిస్టర్లో సంతకాలు చేసి రోజూ ఎవరు వస్తున్నారు..? అనే విషయాన్ని పేర్లు నమో దు చేయాలని అధికారులను ఆదేశించారు. -
నమ్మకం ఉంటే పలు అద్భతాలు సాధ్యం
తమిళసినిమా: నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో కరుప్పు ఒకటి. నటుడు ఆర్జే బాలాజీ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించిన ఇందులో నటి త్రిష నాయకిగా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే నెల 14న తెరపైకి రానుంది.ఈ సందర్బంగా చిత్ర ఆడియోను ఆదివారం సాయంత్రం మదురైలో నిర్వహించారు. ఈ వేదికపై నటుడు సూర్య మాట్లాడుతూ ఈ చిత్రం ఇంత వరకు రావడానికి కారణం కరుప్పుస్వామినేనని భావిస్తున్నానన్నారు. మనిఫిపై భగవంతుడు ఉండగా జరిగే మార్పును తాను చూస్తున్నట్లు పేర్కొన్నారు. నమ్మకం ఉన్న చోట కచ్చితంగా అద్భుతాలు జరుగుతాయన్నారు. ఈ చిత్ర దర్శకుడు బాలాజీ ప్రతిభావంతుడని అన్నారు. తాను తనను సూర్యగానే చూస్తానని, ఆయన తనను దర్శకుడు, నటుడు,వర్గజాలకుడిగా చూసుకుంటారని అన్నారు. నిజం చెప్పాలంటే ఈ చిత్రంలో తాను హీరో కాదన్నారు. కరుప్పు స్వా మినే హీరో అని పేర్కొన్నారు. చిత్రం చూసేవాళ్లు మొదటి భాగాన్ని చాలా ఎమోషనల్గా చేస్తారని, రెండవ భాగాన్ని ధియేటర్ మూమెంట్స్ అధికంగా ఉంటాయని భావిస్తారన్నారు. మే 14న మీ చేతుల్లోనే ఉందని , కరుప్పు చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకాన్ని సూర్య వ్యక్తం చేశారు. కరుప్పు చిత్రాన్ని కచ్చితంగా అనుకున్న రోజునే విడుదల చేస్తామని దర్శకుడు ఆర్జే.బాలాజీ చెప్పారు. కాగా ఈ కార్యక్రమంలో నటి త్రిష పాల్గొనకపోవడం గమనార్హం. -
ఎల్పీజీ ట్యాంకర్ల సమ్మె సైరన్
సాక్షి, చైన్నె : దక్షిణ భారత ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ , ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మధ్య నెలకొన్న అద్దె బకాయిల వివాదం గ్యాస్ సరఫరాపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ఇందుకు కారణం లారీ ఓనర్స్ అసోసియేషన్ ట్యాంకర్ల సమ్మేకు పిలుపు నివ్వడంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇరాన్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చిన్న చిన్న దుకాణాలన్నీ ఇప్పటికే మూతపడ్డాయి. ఇంటికి గ్యాస్ సరఫరా సాగుతున్న వర్తక సిలిండర్లు ఎప్పుడు వస్తాయో ఎదురు చూడాల్సిన పరిస్థితి. అదే సమయంలో ఆటోలు, క్యాబ్లు గ్యాస్ కోసం బంకుల వద్ద గంటలతరబడి బారులు తీరాల్నిన పరిస్థితి నెలకొంది. ఈసమయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పరిధిలో నడుస్తున్న సుమారు 1,000 గ్యాస్ ట్యాంకర్లకు సంబంధించి దాదాపు రూ. 50 కోట్ల అద్దె బకాయిలు పెండింగ్లో ఉండటం తాజాగా వివాదానికి దారి తీసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ బకాయిలు చెల్లించకపోవడంతో, దక్షిణ మండల ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ ట్రక్కు యజమానుల సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. బకాయిలు చెల్లించే వరకు లోడింగ్కు సహకరించబోమని యజమానులు స్పష్టం చేశారు. నామక్కల్ కేంద్రంగా పనిచేసే ఈ అసోసియేషన్ ప్రతినిధులు ఇప్పటికే అధికారులకు లేఖ రాశారు. గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉందా? ట్యాంకర్ల సమ్మె సమాచారం ప్రజల్లో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే ఆందోళన మొదలైంది. అయితే దీనిపై ఏబీసీ అధికారులు వివరణ ఇచ్చారు. ట్యాంకర్ యజమానుల సంఘంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, బకాయి ఉన్న మొత్తాన్ని ఒకటి రెండు రోజుల్లోనే యజమానులకు చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రతి గ్యాస్ ఫిల్లింగ్ ప్లాంట్లో కనీసం 4 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతానికి వంటగ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఓసి స్పష్టం చేసింది. -
నాణ్యత, భద్రత, సేవే లక్ష్యం
సాక్షి, చైన్నె : నాణ్యత, భద్రత, సేవా, విశ్వసనీయతపై అదే అంకిత భావంతో తాము ముందుకు సాగుతున్నట్టు జాన్సన్ లిఫ్ట్స్ డైరెక్టర్ యోహాన్ కె జాన్ తెలిపారు. సోమవారం చైన్నెలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 వేల కోట్లు టర్నోవర్తో దేశంలోనే అతిపెద్ద ఎలివేటర్లు, ఎస్కలేటర్ల తయారీ సంస్థ అయిన జాన్సన్ లిఫ్ట్స్ తోషిబా జాన్సన్ ఎలివేటర్స్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ (టీజేఈఐ)లో తన ఈక్విటీ వాటాను పెంచుకుని మెజారిటీ వాటాదారుగా మారినట్టు తెలిపారు. జపాన్కు చెందిన తోషిబా ఎలివేటర్ అండ్ బిల్డింగ్ సిస్టమ్స్ కార్పొరేషన్ జాయింట్ వెంచర్లో ఒక విలువైన వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతుందని అన్నారు. జాన్సన్ సంస్థ, తోషిబా మధ్య 14 ఏళ్ల సహకారంతో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందన్నారు. ఇది భారత మార్కెట్కు ప్రపంచ స్థాయి వర్టికల్ మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో ఉమ్మడి నిబద్దతను మరింత బలపరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఈఐ మేనేజింగ్ డైరెక్టర్ విల్ఫ్రెడ్ మార్టిన్ క్లారెన్స్ పాల్గొన్నారు. -
వీధికుక్కలకు వ్యాక్సిన్లు
తిరువళ్లూరు: తిరువళ్లూరు సమీపంలో వీధికుక్కలు దాడి చేసి 8 మందిని గాయపర్చిన నేపథ్యంలో అధికారులు దిద్దుబాటు చర్యలను చేపట్టారు. గ్రామంలో సుమారు 45 వీధికుక్కలను గుర్తించి వాటికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని సోమవారం ఉదయం చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పూవనూర్, కల్లంబేడు తదితర గ్రామాల్లో వీధికుక్కలు దాడి చేసింది. వీధికుక్కలు దాడిలో గీత(32), సాయిచిన్నరాసు(28), కుప్పన్(52) కల్లంబేడు గ్రామానికి చెందిన శరవణన్(38), మణిమేఖలై(42) తదితరులు అదే గ్రామంలోని ఇటుకబట్టీలో పని చేస్తున్నారు. వీరిపై వీధికుక్కలు ఆదివారం దాడి చేసింది. కుక్కల దాడిలో గాయపడ్డ వారిని స్థానికులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ చికిత్సను అందించారు. ఈ క్రమంలో రెండు గ్రామాల్లోనూ వీధికుక్కల దాడిపై ఆరా తీసిన కలెక్టర్ ప్రతాప్ అక్కడ తక్షణం వ్యాక్సిన్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం రెండు బృందాలుగా ఏర్పడిన సిబ్బంది పూవనూర్, కల్లంబేడ తదితర రెండు గ్రామాల్లో ప్రత్యేక క్యాంపును నిర్వహించి 45 వీధికుక్కలకు వ్యాక్సిన్ను వేశారు. అదే విధంగా మంగళవారం ఉదయం పిల్లయార్కుప్పం, కూవం తదితర గ్రామాల్లోనూ వీధికుక్కలకు వ్యాక్సిన్ వేయనున్నట్టు కడంబత్తూరు బ్లాక్ మెడికల్ ఆఫీసర్ రవి, నటరాజన్ తదితరులు వివరించారు. -
పర్యాటకులతో సీఎం స్టాలిన్ ముచ్చట్లు
– కొడైకెనాల్ పర్యటనలో ఆసక్తి సాక్షి, చైన్నె: కొడైకెనాల్లో సీఎం స్టాలిన్ సోమవారం పర్యాటకులతో ముచ్చటించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత, సీఎం స్టాలిన్ తన కుటుంబంతో కలిసి 5 రోజుల విశ్రాంతి కోసం కొడైకెనాల్కు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా రెండవ రోజైన సోమవారం కొడైకెనాల్ మున్సిపాలిటీకి ప్రధాన నీటి వనరు అయిన మనోరంజితం రిజర్వాయర్ పరిసరాల్లో ఆయన సుమారు గంటసేపు వాకింగ్ చేశారు. సీఎం వాకింగ్ చేస్తున్నారని తెలుసుకున్న పర్యాటకులు, స్థానికులు ఆయనను చూసేందుకు రిజర్వాయర్ వెలుపల భారీగా తరలివచ్చారు. వాకింగ్ ముగించుకుని కారులో వెళ్తున్న సీఎం, ప్రజల ఉత్సాహాన్ని చూసి కారు ఆపి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా పర్యాటకులు ఆయనతో సెల్ఫీలు దిగి ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సీఎం సతీమణి దుర్గా స్టాలిన్ ప్రసిద్ధ కురింజి ఆండవర్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం సీఎం స్టాలిన్ తన కుటుంబ సభ్యులతో కలిసి కొడైకెనాల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడంతో పాటూ నక్షత్ర సరస్సులో బోటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా ఎన్నికల హడావుడి తర్వాత సీఎం తన సాధారణ రాజకీయ కార్యక్రమాలకు దూరంగా, కేవలం కుటుంబంతో గడిపేందుకే ఈ పర్యటనను కేటాయించారు. కొడైకెనాల్లోని చల్లని వాతావరణం మధ్య ఆయన ఉల్లాసంగా కనిపిస్తున్నారు. -
పెట్రోల్, డీజిల్కు పోటెత్తిన ఆంధ్రాజనం
తిరుత్తణి: ఆంధ్రాలో పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ఏర్పాటయ్యాయి. దీంతో ఆంధ్రా ప్రజలు సరిహద్దులోని తిరుత్తణి, పళ్లిపట్టు ప్రాంతాలకు సోమవారం పోటెత్తారు. ఇంధనం వాహనాలకు ఫుల్ చేసుకుని, క్యాన్లు, వాటిర్ బాటిళ్లలో నింపుకెళ్లారు. అమెరికా, ఇరాన్ యుద్ధ నేపథ్యంలో గత నెల దేశ వ్యాప్తంగా ఇంధన కొరత చోటుచేసుకుంది. అయితే ఆ తరువాత పరిస్థితి చక్కబడింది. తమిళనాడులో ఎల్పీజీ గ్యాస్ సమస్య తగ్గి వినియోగదారులకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ బంకుల్లో అందుబాటులో ఉంది. అయితే అందుకు భిన్నంగా ఆంధ్రాలో పెట్రోల్, డీజిల్ సమస్య తీవ్రం కావడంతో ఆ రాష్ట్రంలోని సగానికి పైగా బంకులు మూతపడ్డాయి. ప్రధానంగా తిరుత్తణికి సమీపంలోని సరిహద్దు ఆంధ్రా ప్రాంతం చిత్తూరు, పుత్తూరు, నగరి పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం తిరుత్తణి, పళ్లిపట్టు, ఆర్కేపేట, అత్తిమాంజేరిపేట, పొదటూరుపేట, కనకమ్మసత్రం ప్రాంతాల్లోని బంకులకు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలతోపాటు ప్రభుత్వ వాహనాలు, కార్లు బంకుల వద్ద క్యూకట్టి డీజిల్, పెట్రోల్ ఫుల్ చేసుకున్నారు. క్యాన్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ నింపుకుని వెళ్లారు. ఆంధ్రాలో ఇంధనం కొరతపై ఆంధ్రాకు చెందిన రైతు మాట్లాడుతూ వారం రోజులు పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉందని, రెండు రోజులు అన్నీ బంకులు మూతపడి నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో 20కిమీ దూరంలోని తమిళనాడు ప్రాంతం తిరుత్తణికి చేరుకుని బైకుకు పెట్రోల్ నింపినట్లు, రైతులు వరి దిగుబడి చేస్తున్న క్రమంలో వరికోత యంత్రాలకు, ట్రాక్టర్లకు డీజిల్ అవసరం కావడంతో క్యాన్లు తీసుకొచ్చి డీజిల్ నింపుకుని వెళ్తున్నామని తెలిపారు. -
వీరరాఘవునికి ప్రత్యేక అలంకరణ
తిరువళ్లూరు: ఛైత్రమాసం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం ఉదయం స్వామివారు వేణగోపాల నాచ్చీయార్ తిరుక్కోలం అలంకరణలో దర్శనమిచ్చారు. తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరరాఘవ స్వామివారి ఆలయం ఉంది. ఆలయంలో ప్రతి ఏటా ఛైత్రమాసం బ్రహ్మోత్సవాలను పది రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే గత 22న ధ్వజారోహణంతో ఉత్సవాలను ప్రారంభించారు. మూడో రోజు గరుడసేవను నిర్వహించారు. ఆరో రోజైన సోమవారం ఉదయం స్వామివారు శ్రీదేవి భూదేవిలతో కలిసి వేణుగోపాల నాచ్చీయార్ తిరుక్కోలం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉదయం ఐదు గంటలకు చూర్ణాభిషేకం, ఆరుగంటలకు వెండిసభ్రం, పదిన్నర గంటలకు తిరుమంజనం నిర్వహించారు. రాత్రి ఏడున్నర గంటలకు స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలకు విశేషంగా భక్తులు హాజరయ్యారు. -
బృహదీశ్వరుని సన్నిధిలో రథోత్సవం
సాక్షి, చైన్నె: తంజావూరు బృహదీశ్వరాలయంలో చిత్తిరై బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకలో భాగంగా సోమవారం రథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో కోలాహలంగా నిర్వహించారు. వివరాలు.. ప్రపంచ ప్రసిద్ది గాంచిన బృహదీశ్వర ఆలయంలో ఈనెల 13 నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రోజూ స్వామి వారు భక్తులకు వివిధ వాహన సేవల ద్వారా దర్శనం ఇచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 6.20 గంటలకు జిల్లా కలెక్టర్, ఇతర ప్రముఖులు రథాన్ని లాగి ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రథోత్సవం.. సాధారణంగా 19 అడుగుల ఎత్తు, 40 టన్నుల బరువుండే ఈ రథం, అలంకరణ తర్వాత 50 అడుగుల ఎత్తుకు, 43 టన్నుల బరువుకు చేరుకుంది. భక్తులు ‘ఆరూరా... త్యాగేశా...‘ అనే భక్తి నినాదాలతో తంజావూరు వీధులను మార్మోగించారు. రథంపై త్యాగరాజ స్వామి, కమలాంబాళ్ కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. రథోత్సవం సందర్భంగా తంజావూరు జిల్లాలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు స్థానిక సెలవు ప్రకటించారు. భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి వీలుగా రథం 14 చోట్ల ఆగేలా ఏర్పాట్లు చేశారు. డ్రైనేజీ కాలువలు ఉన్న చోట భక్తులు పడిపోకుండా ఇనుప కంచెలు ఏర్పాటు చేయడం విశేషం. కాగా, తంజావూరు బిడ్ టెంపుల్ రథోత్సవం కొన్ని దశాబ్దాల పాటూ గతంలో జరగలేదు. సుమారు 100 సంవత్సరాల తర్వాత 2015లో మళ్లీ పునఃప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా ఈ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. -
ఎన్నికల ప్రచారం కారణంగా ఆర్థికంగా వెసులుబాటు
– తప్పట్టం కళాకారుల ఆనందం సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారం కారణంగా తమకు ఆర్థిక వెసులుబాటు కలిగిందని చైన్నెకి చెందిన తప్పట్టం (డప్పు వాయిద్యం్ట) కళాకారులు సంతోష వ్యక్తం చేశారు. చైన్నెలో ఏ శుభకార్యమైనా, ఆలయ ఉత్సవాలైనా, రాజకీయ సభలైనా తప్పాట్టం కళాకారుల సందడి తప్పనిసరి. అయితే, ఈసారి ఎన్నికల ప్రచారం తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని వారు చెబుతున్నారు. రాజకీయ అభ్యర్థుల ప్రచారం మొదలవ్వడానికి ముందే ఈ కళాకారులు తమ వాయిద్యాలతో వీధుల్లో సందడి చేశారు. ఆ శబ్దాన్ని వినే ప్రజలు అభ్యర్థి వస్తున్నారని ఇళ్ల నుండి బయటకు వచ్చారు. సాధారణంగా ఓ కళాకారుడు నెలకు 7 నుండి 10 కార్యక్రమాల్లో పాల్గొని సుమారు రూ. 10,000 వరకు సంపాదిస్తారు. మిగిలిన రోజుల్లో పెయింటింగ్ వంటి ఇతర పనులకు వెళ్తుంటారు. 35 రోజుల సందడి ఈసారి ఎన్నికల షెడ్యూల్ కారణంగా సుమారు 35 రోజుల పాటు వరుసగా వీరికి అవకాశాలు వచ్చాయి. మార్చి 15 నుండి ఏప్రిల్ 21 వరకు రోజూ ఉదయం, సాయంత్రం ప్రచారాల్లో పాల్గొన్నారు.:ఈ ఎన్నికల సీజన్లో ఒక్కో కళాకారుడు సుమారు రూ. 45,000 వరకు సంపాదించినట్లు వారు తెలిపారు. అందుకే తమ పాలిట ఎన్నికలు అసలైన పెద్ద పండుగ (తిరువిళా) అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్చిచ్చుతో 5,000 ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధం అన్నానగర్: నీలగిరి జిల్లాలోని అవలాంచ్ అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పర్సాన్స్వేలి అటవీ ప్రాంతంలో గత 24వ తేదీన కార్చిచ్చు చెలరేగింది. ఎండ ప్రభావం, గాలి వేగం కారణంగా ఈ కార్చిచ్చు 20కి పైగా ప్రదేశాలకు వ్యాపించి, 5,000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని నాశనం చేసింది. 200 మందికి పైగా ప్రజలు కార్చిచ్చును ఆర్పే పనిలో నిరంతరం నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ, వారు మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాలి వేగం ఎక్కువగా ఉండడంతో హెలికాప్టర్ ద్వారా మంటలను ఆర్పే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దివ్యాంగులకు రైళ్లలో మరిన్ని సౌకర్యాలు – రైల్వే బోర్డు నిర్ణయం సాక్షి, చైన్నె: రైళ్లలో ప్రయాణించే దివ్యాంగులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దివ్యాంగుల కోసం కేటాయించిన ప్రత్యేక కోచ్లలో ప్రయాణించేందుకు యూనిక్ డిసబిలిటీ ఐడీ కార్డును అనుమతించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు రైల్వే బోర్డు జారీ చేసిన కన్సెషన్ పాస్ ఉన్నవారు మాత్రమే ప్రత్యేక కోచ్లలో ప్రయాణించేవారు. ఇప్పుడు నేషనల్ డిజెబిలిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జారీ చేసినయూడీఐడీ కార్డు ఉన్న దివ్యాంగులందరూ ఈ ప్రత్యేక బెర్తులు/కోచ్లలో ప్రయాణించవచ్చు. రైల్వే కన్సెషన్ పాస్ లేని వారు, సాధారణ టికెట్ కొనుగోలు చేసి తమ కార్డును చూపడం ద్వారా ప్రత్యేక కోచ్లలో ప్రయాణించడానికి అనుమతి పొందుతారు. దీనివల్ల రైల్వే కన్సెషన్ పాస్ లేని దివ్యాంగులు సాధారణ అన్రిజర్వ్డ్ కోచ్లలో రద్దీ మధ్య ప్రయాణించాల్సిన అవసరం తప్పుతుంది. రైల్వే బోర్డు హెచ్చరిక కాగా ఇదే సమయంలో దివ్యాంగులకు కేటాయించిన ప్రత్యేక కోచ్లలో ఇతరులు ప్రయాణించడంపై రైల్వే బోర్డు కఠినంగా వ్యవహరించనుంది. అనుమతి లేకుండా ఈ కోచ్లలో ప్రయాణించే సాధారణ ప్రయాణికులపై రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దివ్యాంగుల హక్కులను కాపాడటం ,వారి ప్రయాణాన్ని సులభతరం చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ప్రకటించిది. నీలగిరి, కోవైలకు అలర్ట్ సాక్షి, చైన్నె: భానుడు భగ..భగ మండుతున్న వేళ ఈ నెల 30 నుండి మే 2వతేదీ వరకు నీలగిరి, కోయంబత్తూరుతో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చైన్నె వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటించింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఇది కొంత ఉపశమనం కలిగించే సమాచారంగా మారింది. కన్యాకుమారి సముద్రం వరకు ఏర్పడిన వాతావరణ గాలి పీడన ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురువనున్నాయని తెలిపారు. 28వ తేదీ మంగళవారం పశ్చిమ కనుమల జిల్లాల్లో , తీర ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. 30వ తేది నుంచి నీలగిరి,కోయంబత్తూరు, ఈరోడ్, సేలం, ధర్మపురి, కృష్ణగిరిజిల్లాలో భారీ వర్షాలు అకాల తాండవం చేయవచ్చు అని వివరించారు. కాగా, గత వారం రోజులుగా తమిళనాడు,పుదుచ్చేరిలలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. సాధారణం కంటే 5 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఎక్కువగా నమోదు అవుతూ వచ్చాయి. ఇక చైన్నె, శివారు జిల్లాలో రానున్న రోజుల్లో భానుడి ప్రతా పం మరింత ఎక్కువగా ఉండే అవకాశాలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. -
క్లుప్తంగా
ప్రభుత్వ పాఠశాలలో అగ్నిప్రమాదం అన్నానగర్: విరుదునగర్లోని ఆర్ఆర్ నగర్ సమీపంలో ఉన్న తడంగం గ్రామంలోని ప్రభు త్వ యూనియన్ ఉన్నత పాఠశాలకు సోమ వారం ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యా రు. ఆ సమయంలో, ఒక తరగతి గదిలో పొగ రావడం గమనించి వారు అక్కడికి వెళ్లారు. ఆ గదిలోని చాపకు నిప్పంటుకుని, ఆ మంటలు అక్కడున్న వస్తువులకు వ్యాపిస్తుండటం చూసి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే ఆ గదిలోని వస్తువులు, క్రీడా పరికరాలు అగ్నిప్రమాదంలో ధ్వంసమయ్యాయి. సమర్థవంతంగా మెడికల్ ఇంటర్న్ చికిత్స సాక్షి, చైన్నె: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 23 ఏళ్ల యువకుడికి ఎస్ఆర్ఎం గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు సమర్థవంతంగా మెడికల్ ఇంటర్న్ చికిత్సలను అందించారు. సోమవారం ఈ వివరాలను డాక్టర్ పి. విజయన్, డాక్టర్ అబ్దుల్ హకీమ్, డాక్టర్ విష్ణు తేజ ముద్దుల నేతృత్వంలోని బృందం ప్రకటించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరిన సమంలో ఛాతీకి రెండు వైపులా గాయాలు, ఊపిరితిత్తులు కుచించుకుపోవడం, కాలేయం తినడం, ఛాతీలో రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తుల చుట్టూ గాలి లీక్ అవ్వడం, పొత్తికడుపులో రక్తస్రావం. ప్రమాద తీవ్రత కారణంగా గుండె కూడా దెబ్బతిని, రోగి షాక్లోకి వెళ్లి పోయినట్టు వివరించారు. సాధారణ చికిత్సలు చేసే సమయం లేక పోవడంతో ప్రాణరక్షణ చికిత్స – డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ పై దృష్టి పెట్టామన్నారు. ఇది ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు చేసే అత్యవసర శస్త్రచికిత్స అని, దీని ప్రధాన లక్ష్యం రోగిని పూర్తిగా నయం చేయడమేనని వివరించారు. సర్జరీ తర్వాత రోగిని వెంటిలేటర్ పై ఉంచి 48 గంటల పాటు నిశితంగా పర్యవేక్షించామన్నారు. రెండు వారాల ఇంటెన్సివ్ కేర్ తర్వాత పూర్తిగా ఆ యువకుడు కోలుకున్నట్టు తెలిపారు. ‘సాఫ్టెల్’ హోమ్ గ్రైండర్ ఆవిష్కరణ సాక్షి,చైన్నె : అలనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ ఇంట్లోనే అన్ని రకాల పిండి తయారీ కోసం సాఫ్టెల్ హోమ్ గ్రైండర్ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా మహిళల సౌకర్యార్తం తీర్చిదిద్దారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఈ ఆవిష్కరణ గురించి వివరించారు.గత 35 ఏళ్లుగా తయారీ రంగంలో విశేష అనుభవం ఉన్న సాఫ్టెల్, ఇప్పుడు ఆధునిక వంటగదికి సరిపోయేలా కాంపాక్ట్ పిండి మిల్లు పేరిట దీనిని రూపొందించింది. ఇందులో రాతితో గ్రైండింగ్ చేసే ప్రక్రియ ఉండటం వల్ల ధాన్యాల సహజ రుచి, పోషకాలు అలాగే ఉంటాయి. ఇది గంటకు 7.5 నుండి 10 కిలోల ధాన్యాలను పిండిగా మార్చగలదు. గంటకు కేవలం ఒక యూనిట్ విద్యుత్తును మాత్రమే వాడుకుంటుంది. వినియోగదారుల సౌకర్యార్థం ఫుల్లీ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్, మ్యాన్యువల్ అనే మూడు మోడళ్లలో దీనిని అందుబాటులోకి తెచ్చారు. అనారోగ్య సమస్యలతో ఆవేదన – పదవీ విరమణ పొందిన దంపతుల ఆత్మహత్య అన్నానగర్: తిరుప్పూర్ జిల్లాలోని ఉడుమలై ప్రాంతానికి చెందిన అరుముగం (78). ఇతని భార్య రుక్మణి (68). ఆమె ఉడుమలై ఆవిన్ పాలగంలో కార్యదర్శిగా పనిచేస్తుండేది. అరు ముగం అక్కడ సహాయకుడిగా పనిచేస్తు వచ్చా డు. పదవీ విరమణ తర్వాత, రుక్మణి, అరుముగం తమ కుమారుడు సెల్వకుమార్తో కలి సి జీవిస్తున్నారు. ఈ స్థితుల్లో, సెల్వకుమార్ తన కుమార్తె చదువుల కోసం 6 నెలల క్రితం తల్లిదండ్రులకు దూరమై, కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ సమీపంలో ఉన్న తన భార్య తెన్మొళి ఇంట్లో స్థిరపడ్డారు. రుక్మణి గత 15 సంవత్సరాలుగా కిడ్నీలో రాళ్ల కారణంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ కారణంగా, రుక్మణి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని తన భర్తకు చెప్పింది. దీంతో వారిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని అన్నూర్ సమీపంలోని రుక్మణి తల్లి ఇంటికి వచ్చారు. ఆదివారం అక్కడ వారు విషం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అక్కడికి చేరు కున్న రుక్మిణి మేనల్లుడు రితుబరన్, అపస్మారక స్థితిలో ఉన్న అరుముగం, రుక్మణిని రక్షించి ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. కానీ వారిద్దరూ మార్గమధ్యంలోనే మరణించారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కవితాత్మకంగా వెల్లిచుడరే పాట
తమిళసినిమా: చాలా చిత్రాల్లోని పాటలు సంగీత ప్రియులను అలరిస్తుంటాయి. అయితే కొన్ని మాత్రమే వారి హృదయాలను మీటుతాయి. అలా తాజాగా సంగీత ప్రియులను అలరిస్తున్న పాట వెల్లిచుడరే. నటుడు విష్ణువిశాల్, నటి మమితా బైజు జంటగా నటించిన ఇరండు వానం చిత్రంలోనిది ఈ పాట. దీపు నినన్ థామస్ సంగీతాన్ని అందించిన ఈ పాటను మద్రాషీ రాశారు. ఈ చక్కని మెలోడీ పాటకు సంగీతం, సాహిత్యం, స్వరకల్పన ప్రాణం అని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఈ పాట మళ్లీమళ్లీ వినేలా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టీజీ త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. దీనికి రామ్కుమార్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు విష్ణు విశాల్, దర్శకుడు రామ్కుమార్ కాంబోలో ఇంతకు ముందు ముండాసిపట్టి, రాక్షసన్ తదితర విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. దీంతో తాజాగా రూపొందిస్తున్న ఇరండు వానం చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం వివరాలను, చిత్ర విడుదల వివరాలను వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. -
వైభవంగా మహా కుంభాభిషేకం
పళ్లిపట్టు: పుణ్యం గ్రామంలో నూతనంగా నిర్మించిన సప్త కన్యల ఆలయ మహాకుంభాభిషేకం సోమవారం ఉదయం కోలాహలంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. పళ్లిపట్టు సమీపంలోని పుణ్యం గ్రామంలో గ్రామీణుల సంయుక్త సహకారంతో సప్త కన్యలకు ఆలయం నిర్మించారు. ఆలయ నిర్మాణపు పనులు పూర్తి కావడంతో శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజలపాటు మహాకుంభాభిషేకం వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా అర్చకులు యాగశాలలు ఏర్పాటు చేసి హోమగుండ పూజలు చేపట్టారు. సోమవారం ఉదయం మహాపూర్ణాహుతి హోమ పూజలు అనంతరం మేళ తాళాలతో భారీ సంఖ్యలో మహిళలు నడుమ పవిత్ర పుణ్యతీర్థాల కలశాలు బయల్దేరి సప్త కన్యల విగ్రహాలకు మహాకుంభాభిషేకం నిర్వహించారు. -
రేసులో మరి కొందరు !
సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రస్తుత అధ్యక్షుడు సెల్వపెరుంతొగై మార్పు ఖాయమన్నది స్పష్టమవుతోంది. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమించనున్నారన్న సమాచారం చైన్నెలోని టీఎన్సీసీ కార్యాలయం సత్యమూర్తి భవన్ చర్చకు దారి తీసింది. తన పదవికి రాజీనామా చేయడానికి సెల్వపెరుంతొగై నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డ విషయం తెలిసిందే. సెల్వపెరుంతొగై ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏఐసీసీ నేత రాహుల్ గాంధీలో నెలకొన్న అసంతృప్తి కారణంగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తప్పుగా అనువదించడం వివాదానికి దారి తీయడం, ఎన్నికల సమయంలో టీఎన్సీసీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరుపై ఢిల్లీ అధిష్టానం తీవ్రంగా పరిగణించినట్టు ఇప్పటికే సమాచారాలు వెలువడ్డాయి. అధ్యక్ష రేసులో పలువురు సెల్వ పెరుంతొగైను తప్పించి ఎంపీ మాణిక్యం ఠాకూర్కు అవకాశం ఇవ్వవచ్చు అన్న సంకేతాలు తొలుత వెలువడ్డాయి. అయితే గ్రూపురాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న కాంగ్రెస్లో అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు రేసులోకి దిగారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు, ఎంపీ కార్తీ చిదంబరం, మహిళ నేత, కరూర్ ఎంపీ జ్యోతిమణి, విరుదునగర్ ఎంపీ మాణిక్యం ఠాకూర్, ప్రస్తుతం పార్టీ శాసనసభా పక్ష నేతగా ఉన్న రాజేష్కుమార్ పాటు మాజీ అధ్యక్షులు తిరునావుక్కరసర్, కె.ఎస్. అళగిరి, తంగబాలు కూడా మళ్లీ అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారాలు వెలువడటంతో అధ్యక్ష పదవి హాట్ సీటుగా కాంగ్రెస్లో మారింది. అయితే, కొత్త వారికే అవకాశం ఇవ్వాలని ఢిల్లీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒకటి రెండు రోజుల్లోనే కొత్త అధ్యక్షుడి ప్రకటన వచ్చే అవకాశం ఉందని టీఎన్సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. పస్తుత అధ్యక్షుడిని మార్చాలనే విషయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ధృడంగా ఉన్నట్టు సత్యమూర్తి భవన్ వర్గాలు ఽస్పష్టం చేస్తున్నాయి. -
వివాహితుడితో ప్రేమాయణం
తిరువొత్తియూరు: కన్యాకుమారి జిల్లా ఆరుమనై సమీపంలో నర్సింగ్ చదువుతున్న ఒక యువతి, వివాహమై పిల్లలు ఉన్న ఒక వ్యక్తితో కలిసి మెడలో పూలమాలలతో పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆశ్రయం కోరిన సంఘటన సంచలనం కలిగించింది. కన్యాకుమారి జిల్లా అరుమనై సమీపంలోని చిదరల్ ప్రాంతానికి చెందిన అస్మి అనే విద్యార్థిని, కొన్ని రోజుల క్రితం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె కోసం వెతుకుతుండగా అస్మి సుజిన్ అనే వ్యక్తితో కలిసి మెడలో దండలతో పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమై రక్షణ కోరింది. విచారణలో సుజిన్కు ఇదివరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని, భార్యతో గొడవల కారణంగా విడిగా ఉంటున్నాడని తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న ఆమె తల్లిదండ్రులు పోలీసు స్టేషన్కు వచ్చి కుమార్తెను చూసి దిగ్భ్రాంతి చెందారు. సుజిన్కు వివాహం అయిందని పోలీసులు హెచ్చరించినప్పటికీ, అస్మి అతనితోనే వెళ్తానని మొండికేసింది. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు వారిని కలిసి వెళ్లడానికి అనుమతించారు. తిరువళ్లూరు: అడవి పందులను నివారించడానికి పెట్టిన నాటు బాంబులు పేలడంతో గేదెలు, పశువులు తీవ్రంగా గాయపడడంతో పాడి రైతులు బోరున విలపించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కొట్టయూర్లో ఎక్కువ మంది రైతులు వరి తదితర పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటలను రాత్రి సమయంలో అడవి పందులు ధ్వంసం చేస్తున్న క్రమంలో వాటిని నివారించడానికి గడ్డితో కలిపి నాటుబాంబులను రైతులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదివారం మేతకు వెళ్లిన పశువులు గడ్డిని మేయడానికి యత్నించడంతో నాటుబాంబులు పేలి గేదెలు పశువులకు గాయాలయ్యాయి. నోటి భాగం తీవ్రంగా దెబ్బతింది. గాయపడిన పశువులను చూసి పాడి రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అన్నానగర్: విరుదునగర్ సమీపంలోని కట్టనార్పట్టిలో ఉన్న వనజ టపాసుల కర్మాగారంలో గత 19 వ తేదీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 25 మంది దుర్మరణం చెందారు. సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసులకు కూడా కాలిన గాయాలవ్వగా, వారు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఎన్ని కల సమయం కావడంతో సహాయాన్ని వెంటనే ప్రకటించలేదు. దీనికి వ్యతిరేకంగా మరణించిన కార్మికుల కుటుంబాలు నిరసన తెలిపాయి. జిల్లా యంత్రాంగం వారితో చర్చలు జరిపిన అనంతరం, మొదటి విడతగా అధికారులు రూ. 5 లక్షల సహాయాన్ని అందించారు. కాగా ఫ్యాక్టరీ యజమాని ముత్తు మణికం, అతని భార్య ఈశ్వరిపై వచ్చక్కారపట్టి పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు. ఈ పరిస్థితిలో, ముత్తు మణికం కొన్ని రోజుల క్రితం విరుదునగర్ కోర్టులో లొంగిపోయాడు. అనంతరం, కోర్టు ఆదేశాల మేరకు అతడిని రిమాండ్కు పంపారు. పరారీలో ఉన్న ఈశ్వరిని వచ్చక్కారపట్టి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. -
మే 15 నుంచి ఫ్రైమ్లో ఎగ్జామ్
తమిళసినిమా: నటి దుషారా విజయన్, అతిథిబాలన్ కలిసి నటించిన వెబ్ సిరీస్ ఎగ్జామ్. వాల్వచ్చార్ ఫిలింస్ పతాకంపై దర్శక ద్వయం గాయత్రి పుష్కర్లు నిర్మించిన ఈ వెబ్ సిరీస్కు జాతీయ ఉత్తమ దర్శకుడు సర్గుణం దర్శకత్వం వహించారు. సస్పెన్స్, థ్రిల్లర్గా రూపొందిన ఇందులో నటుడు అబ్బాస్ కీలక పాత్రను పోషించారు. తమిళంలో పాటూ తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ తదితర 15 భాషల్లో అనువాదం చేసిన ఈ వెబ్ సిరీస్ను మే 15 నుంచి ప్రైమ్ టైమ్ ఓటీటీలో 140కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రియెటీవ్ ప్రొడ్రూసర్స్ గాయత్రి పుష్కర్ దీని గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ఈ ఎగ్జాయ్ సిరీస్ ద్వారా మనుషుల ఆశ, అవినీతి, చివరికి వారు ఎదుర్కొనే సమస్యలను తెలిపే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. చాలా గడ్డు పరిస్థితుల్లో బలహీన పడకుండా సమస్యలపై పోరాటం చేసే యువతి ఇతి వృత్తమే ఈ సిరీస్ ప్రధానాంశమని పేర్కొన్నారు. తమ సిరీస్ను ప్రైమ్ వీడియో ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ చేయనుండడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఈ సిరీస్ అందరికీ నచ్చుతందనే నమ్మకం తమకుందన్నారు. -
రమణీయం.. నాగేశ్వరుని రథోత్సవం
పళ్లిపట్టు: పెద్ద నాగపూండి నాగేశ్వరర్ ఆలయ ఛైత్రమాస బ్రహ్మోత్సవాల్లో ప్రసిద్ది చెందిన రథోత్సవం సోమవారం ఉదయం కనులవిందుగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథం లాగి మొక్కులు చెల్లించారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి అనుసంధానంలోని ఆర్కేపేట యూనియన్ పెద్ద నాగపూండిలో ప్రసిద్ధి చెందిన నాగవల్లీ సమేత నాగేశ్వరర్ ఆలయంలో ప్రతిఏటా ఛైత్రమాస బ్రహ్మోత్సవాలు వేడుకగా నిర్వహించడం పరిపాటి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు 21న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. దీంతో రోజూ స్వామికి అభిషేక పూజలు చేపట్టి ఉత్సవర్లు వాహన సేవల్లో గ్రామ వీధుల్లో ఊరేగారు. భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా 7వ రోజు శనివారం ఉదయం నాగవల్లీ సమేత నాగేశ్వరస్వామి పుష్పాలంకరణలో రథంపై కొలువుదీరారు. గ్రామీణులు పెద్ద ఎత్తున పాల్గొనగా కర్పూర హారతులతో రథాన్ని భక్తులు లాగి గ్రామవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు రథంపై ఉప్పు మిరియాలు వెదజెల్లి తమ మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ ప్రధాన వీధుల్లో నాగేశ్వరస్వామి ఊరేగి భక్తులను కటాక్షించారు. తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో రథోత్సవ వేడుకల ఏర్పాట్లు చేశారు. -
అర్జున్ హీరోగా ‘బ్లాస్ట్’
తమిళసినిమా: యాక్షన్ కింగ్గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు అర్జున్. పలు భాషల్లో హీరోగా నటించిన ఈయనలో మంచి దర్శకుడు, నిర్మాత ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కాగా ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటిస్తున్న అర్జున్ తాజాగా మరోసారి యాక్షన్ హీరోగా తెరపైకి రానున్నారు. ఇంతకు ముందు గోట్, లవ్ టుడే, డ్రాగన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేతలు కల్పాత్తి ఎస్.అఘోరం, కల్పాత్తి ఎస్.గణేశత, కల్పాత్తి ఎస్.సురేష్ తాజాగా నటుడు అర్జున్ హీరోగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నటి అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలు పోషించారు. నటుడు జాన్ కొక్కెన్, వివేక్ ప్రసన్న, అర్జున్ చిదంబరం తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా సుభాష్ కే.రాజ్ దర్శకత్వం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ శిష్యుడు కావడం గమనార్హం. కాగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న 28వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి బ్లాస్ట్ అనే టైటిల్ ను నిర్వహించారు.దీనికి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా దీనికి అరుణ్ రాధాకృష్ణన్ ఛాయాగ్రహణం, కేజీ ఎఫ్ చిత్రం ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు.


