Tamil Nadu
-
అందుకే విజయ్ గెలిచారు: స్టాలిన్
చెన్నై: తమిళనాడులో రాజకీయం వేడెక్కింది. టీవీకే విజయ్ ప్రభుత్వంపై డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం కేవలం డీఎంకే దయతోనే నడుస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని స్టాలిన్ ఒక రాజకీయ పవనంగా కాకుండా 'సినిమా సునామీ'గా అభివర్ణించారు. ఓటర్లు రాజకీయ విశ్వాసంతో కాకుండా, ఒక ప్రముఖ సినీ నటుడిపై ఉన్న ఉత్సాహంతోనే విజయ్కు మద్దతు ఇచ్చారని ఆయన వాదించారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..‘తమ అభిమాన నటుడు విజయ్ ఒక పార్టీని ప్రారంభించాడనే ఉత్సాహంతో ప్రజలు ఓటు వేశారు. కొద్ది రోజుల్లోనే ఈ ఆటబొమ్మపై వారికి ఆసక్తి పోతుంది. ఒక బిడ్డ తన తల్లి కోసం వెతికినట్లే, ఓటర్లు చివరికి మళ్లీ డీఎంకే కోసం వెతుకుతారు’ అని జోస్యం చెప్పారు.అలాగే, టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి స్థిరత్వం లేదు. విజయ్ పార్టీ సొంతంగా 118 సీట్ల మెజారిటీ మార్కును దాటడంలో విఫలమైంది. వారు కనీసం మెజారిటీ కూడా సాధించలేకపోయారు. తమిళనాడు ప్రభుత్వం మా దయ వల్లే మనుగడ సాగిస్తోంది. ఏ క్షణంలోనైనా, ఏ రోజైనా అది కూలిపోవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. కచ్చితంగా ఈ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగదు’ అంటూ బాంబు పేల్చారు.#WATCH | "நிச்சயமாக இது 5 ஆண்டு காலம் நடைபெறக்கூடிய ஆட்சி அல்ல.. ஜனநாயகத்தில் இந்த தீர்ப்பு சினிமா கவர்ச்சிக்கு சாதகமாக அமைந்திருக்கிறது என்பதே உண்மை.."-திமுக இளைஞரணி அமைப்பாளர் கூட்டத்தில் திமுக தலைவர் மு.க.ஸ்டாலின் பேச்சு#SunNews | #MKStalin | #DMK pic.twitter.com/cGwa5sDeg4— Sun News (@sunnewstamil) May 24, 2026ఇదే సమయంలో అన్నాడీఎంకే రాజకీయాలను ప్రస్తావిస్తూ.. అన్నాడీఎంకేను చీల్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, అవన్నీ విఫలమయ్యాయని స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి అస్థిరంగా ఉందని పేర్కొన్నారు. మిత్రపక్షాలకు మద్దతు ఇవ్వడం గురించి ప్రస్తావిస్తూ, కమ్యూనిస్టు పార్టీలు, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) వంటి పార్టీలు మొదట్లో టీవీకే ప్రభుత్వానికి బయటి నుంచి మాత్రమే మద్దతు ఇచ్చాయి. కానీ, ఆ తర్వాత మంత్రివర్గంలో చేరాయని ఆయన పేర్కొన్నారు.ఇక, ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 మంది సభ్యులున్న సభలో మెజారిటీ మార్కుకు అది కొద్దిలో ఆగిపోయింది. ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే పార్టీలు డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా పోటీ చేశాయి. అయితే, ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే ఐదు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సంపాదించే ప్రయత్నంలో విజయ్కు వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఇచ్చాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 133 స్థానాలు గెలుచుకున్న డీఎంకేకు ఈ ఎన్నికలు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ఈసారి ఆ పార్టీ కేవలం 59 స్థానాలకే పరిమితమైంది. స్టాలిన్ స్వయంగా కొలత్తూరు నియోజకవర్గం నుంచి ఓటమి చవిచూశారు. -
‘వాళ్లను ఎప్పటికీ మన దరిదాపుల్లోకి రానివ్వద్దు’
చెన్నై: తమిళగ వెట్రి కజగం (టీవీకే)కి కాంగ్రెస్ మద్దతు తెలపడంపై డీఎంకే నేత, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే క్యాడర్ అండతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంతో సీట్లు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ నేతలకు కనీస కృతజ్ఞత, మర్యాద" లేదంటూ డీఎంకే యువజన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మండిపడ్డారు. డీఎంకే ఇకపై కాంగ్రెస్ను ఎప్పటికీ నమ్మకూడదన్నారు."కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకోవడానికి డీఎంకే క్యాడరే కారణం. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు వారికి ఓటు వేశారు. కానీ ఈరోజు కొన్ని పదవుల కోసం వారు మాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా పారిపోయారు. వాళ్లను ఎప్పటికీ మన దరిదాపుల్లోకి రానివ్వద్దు. అతి త్వరలోనే తమిళనాడు ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారు" అంటూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుగుదలకు కూడా కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన విమర్శలు గుప్పించారు. "దేశవ్యాప్తంగా బీజేపీ విజయాలకు ప్రధాని మోదీ, అమిత్ షాలే కారణమని నేను అనుకునేవాడిని. కానీ భారత్లో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఇప్పుడు స్పష్టమవుతోంది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మా నాయకుడు ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ను తన భుజాలపై మోశారు" అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. యువతకు, ముఖ్యంగా జెన్ జెడ్ (Gen Z) ఓటర్లకు రాజకీయంగా అవగాహన కల్పించాలని, కుటుంబాలు, తొలిసారి ఓటు వేసే వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంచాలని డీఎంకే యువజన విభాగం కార్యకర్తలను ఉదయనిధి స్టాలిన్ కోరారు. -
’వద్దే వద్దు’.. త్రిషాకు సీఎం విజయ్ చెక్..!
సాక్షి, చెన్నై : రాజ్యసభ, అసెంబ్లీ ఎప ఎన్నికలపై టీవీకే అధినేత, సీఎం విజయ్ దృష్టి పెట్టారు. ఈ రెండు స్థానాలను గుప్పెట్లోకి తెచ్చుకునే దిశగా కసరత్తులు మొదలయ్యాయి. అధికార పగ్గాలతో చరిత్ర సృష్టించిన తమ పార్టీ, రాజ్యసభలోనూ అడుగు పెట్టేందుకు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే, తిరుచ్చి తూర్పులో జరగనున్న ఉప ఎన్నికలలో మాజీ ఐఏఎస్ అధికారి సహాయంను పోటీలో పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు చర్చ జరుగుతోంది. రాజ్యసభ గెలుపు సమీకరణాలు ఇవే.. అన్నాడీఎంకేకు చెందిన సీవీ షణ్ముగం రాజీనామాతో ఉప ఎన్నికల అనివార్యమైంది. జూన్ 1 నుంచి నామినేషన్లు, జూన్ 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి కసరత్తు మొదలెట్టారు. సాధారణంగా తమిళనాడు నుండి ఓ రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోవడానికి 34 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. అయితే, ప్రస్తుతం ఒకే ఒక్క స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండటంతో, గెలుపునకు 50 శాతానికి పైగా ఓట్లు (అంటే 117 ఓట్లు) అవసరమవుతాయి. ప్రస్తుతం అసెంబ్లీలో మొత్తం 233 మంది సభ్యులు ఉన్నారు. (ముఖ్యమంత్రి విజయ్ తాను గెలిచిన రెండు స్థానాలలో ఒకటైన తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది).ప్రస్తుతం అధికార టీవీకే పార్టీకి 107 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, వీసీకే , సీపీఎం,సీపీఐల మద్దతు ఇస్తే టీవీకే అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే కానుంది. అటు అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతు కూడా విజయ్ పారీ్టకే ప్రస్తుతానికి ఉందని చెప్పవచ్చు. ఈ దృష్ట్యా ఈస్థానం కైవసానికి విజయ్ వ్యూహాలకు పదును పెట్టారు. కాంగ్రెస్లోని తన మిత్రుడు ప్రవీణ్ చవ్రర్తికి సీటు ఇస్తే కూటమి పార్టీలలో ఏదేని విబేధాలు తలెత్త వచ్చు అని భావిస్తున్నారు. దీంతో టీవీకేకు చెందిన ఒక ముఖ్య నేతను లేదా తమకు వెన్నంటి ప్రోత్సహం ఇచ్చిన అన్ని రంగాలలో నిష్ణాతుడైన ఓ ముఖ్య ప్రముఖుడ్ని రాజ్యసభకు పంపించేందుకు విజయ్ కసరత్తులు చేపట్టినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికపై ఉత్కంఠ మరోవైపు సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక నగారా మోగనుంది. ఇక్కడ మాజీ ఐఏఎస్ అధికారి సహాయంను పోటీలో పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. డీఎంకే తరపున ఇక్కడ మాజీ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యామొళి పోటీ చేయవచ్చ అనే సంకేతాల నేపథ్యంలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు విజయ్ సిద్ధం అవుతున్నారు. తొలుత లాల్గుడిలో ఓడిన కూపా కృష్ణన్ పేరు వినిపించినా ఆయనకు బోర్డు పదవి దక్కింది. సినీ నటి త్రిషా పేరిట పోటీ అంటూ వస్తున్న ప్రచారానికి చెక్ పెట్టే దిశగా మాజీ ఐఏఎస్ అధికారులపై విజయ్ దృష్టి పెట్టి ఉన్నారు. నిజాయితీకి మారు పేరుగా ఉన్న సహాయం పోటీకి నిరాకరించిన పక్షంలో మరో ఐఏఎస్ అధికారి పోటీలో పెట్టేందుకు తగ్గ ప్రయత్నాలు సాగుతుండటం గమనార్హం. -
విజయ్ మాస్టర్ ప్లాన్.. కర్ణాటకలో టీవీకే ఎంట్రీ?
తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ పేరు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. ఎన్నికల్లో భారీ విజయంతో టీవీకే విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లోకి టీవీకే ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి విజయ్ నేతృత్వంలోని టీవీకే సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో టీవీకే గేమ్ ప్లాన్ ఏంటంటే..తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. తమిళనాడుకు బయట కూడా పార్టీ విస్తరణపై విజయ్ ఫోకస్ చేశారని రాజకీయ వర్గాల చర్చ నడుస్తోంది. దక్షిణాదిలో ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై టీవీకే ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటకలో బరిలోకి దిగాలనే టీవీకే ప్లాన్ చేస్తోంది. బెంగళూరు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కొత్త రాజకీయ అవకాశాలను పరీక్షించుకునేందుకు సిద్దమైనట్టు వార్తలు బయటకు వచ్చాయి. బెంగళూరులో 50 వార్డుల్లో పోటీ చేసి తన బలం పరీక్షించుకోవాలని యోచిస్తోంది. ఇక, ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే విజయ్ స్వయంగా బెంగళూరులో ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇది పార్టీకి పెద్ద మద్దతు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక స్థాయిలో విజయాలు సాధిస్తే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీవీకే అడుగుపెట్టే అవకాశం ఉంది.TVK might contest Bengaluru Local Polls in Karnataka as per Asianet. pic.twitter.com/RSYX5fSRYw— News Algebra (@NewsAlgebraIND) May 23, 2026కర్ణాటకలో టీవీకేకు అవకాశాలు..1. బలంతమిళ ఓటర్ల ఆధారం: బెంగళూరులో సుమారు 15–20 లక్షల తమిళ మాట్లాడే ప్రజలు ఉన్నారని అంచనా. వీరిని లక్ష్యంగా చేసుకోవడం టీవీకే ప్రధాన వ్యూహం.విజయ్ అభిమాన సంఘాలు: బెంగళూరులో విజయ్కు పెద్ద అభిమాన వర్గం ఉంది. అభిమాన సంఘాలు ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తున్నాయి. వీరిని అభ్యర్థులుగా నిలబెట్టడం ద్వారా టీవీకేకు బలమైన గ్రాస్రూట్ నెట్వర్క్ లభిస్తుంది.2. సవాళ్లుస్థానిక సమస్యలు: బెంగళూరులో నీటి సమస్య, ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు వంటి స్థానిక అంశాలపై స్పష్టమైన అజెండా లేకపోతే టీవీకేకు పెద్ద పార్టీలతో పోటీ కష్టమవుతుంది.ప్రతిష్టాత్మక పార్టీలు: కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఇప్పటికే బలమైన స్థావరాన్ని కలిగి ఉన్నాయి. టీవీకేకు మొదటి దశలో వార్డుల స్థాయిలో మాత్రమే ప్రభావం చూపే అవకాశం ఉంది.ప్రాంతీయ గుర్తింపు: టీవీకే తమిళనాడు ఆధారిత పార్టీ కావడంతో, కర్ణాటకలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందే అవకాశం లేదు.టీవీకే బలం..ప్రాంతాలు: శివాజి నగర్, హలసూరు, వివేక్ నగర్, ఈజిపుర, మడివాల, శాంతినగర్ వంటి వార్డుల్లో తమిళ ఓటర్ల ప్రభావం ఎక్కువ.ఓటు బ్యాంక్: ఈ ఓటర్లు సాధారణంగా కాంగ్రెస్ లేదా జేడీఎస్ వైపు మొగ్గు చూపుతారు. టీవీకే ప్రవేశం వల్ల ఈ ఓటు బ్యాంక్ విభజించే అవకాశం ఉంది.ప్రాంతీయ విస్తరణ: తమిళనాడు, పుదుచ్చేరి తర్వాత, కర్ణాటకలో కూడా తన ప్రభావాన్ని విస్తరించడం.అయితే, ఇప్పటివరకు కర్ణాటక రాజకీయాల్లో ప్రత్యక్ష ఎంట్రీపై టీవీకే అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ కర్ణాటకలో టీవీకే.. తమిళ ఓటర్ల ఆధారం మరియు విజయ్ ప్రజాదరణను బలంగా ఉపయోగించుకుంటే, స్థానిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయి. కానీ, స్థానిక సమస్యలపై స్పష్టమైన అజెండా లేకపోతే, పెద్ద పార్టీలతో పోటీ చేయడం కష్టతరం అవుతుంది. ఈ నేపథ్యంలో టీవీకే పోటీ చేస్తుందా? ఒకవేళ బరిలో నిలిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
కాంగ్రెస్ టార్గెట్.. స్టాలిన్ కీలక నిర్ణయం
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్.. కాంగ్రెస్ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు అలవాటే అని డీఎంకే యువజన సమావేశంలో తీర్మానం చేశారు. ఇతరుల శ్రోమను దోచుకుని ద్రోహం చేయడం కాంగ్రెస్కు పరిపాటేనని శివాలెత్తారు.కాగా, అన్నా అరివాలయంలో డీఎంకే యువజన రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఆ విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయ నిధి స్టాలిన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ముఖ్య నిర్వాహకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చాలాకాలం తర్వాత యువజన సమావేశానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తాజాగా హాజరు కావడం విశేషం. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, ఓటమికి గల కారణాలు, జిల్లాలలో నెలకొన్న పరిస్థితులు, యువతకు పెద్ద పీట వేసే విధంగా మున్ముందు చేపట్టనున్న అంశాలగురించి ఇందులో చర్చించారు.అలాగే, యువత సామాజిక మాధ్యమాలను ప్రచార అస్త్రాలుగా విస్తృతం చేయాలని ఈ సందర్భంగా స్టాలిన్ పలు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. అలాగే ఆ పార్టీ నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా సైతం నినాదాలు చేశారు. ఇందులో ప్రధాన తీర్మానంగా వెన్నుపోటు కాంగ్రెస్కు ఖండన అని నిరసనను వ్యక్తం చేశారు. ఇతరుల శ్రమను దోచుకుని, చివరకు ద్రోహం చేయడం కాంగ్రెస్కు అలవాటేనని మండి పడ్డారు. డీఎంకేకు కాంగ్రెస్ తీవ్ర ద్రోహం చేసిందని, ఆ పార్టీని ఎట్టి పరిస్థితులలోనూ క్షమించ వద్దు అని పార్టీ అధిష్టానానికి యువజన సమావేశం విన్నవించింది. ప్రయాణించే పడవకే చిల్లు పెట్టే మేధావులు కాంగ్రెస్ వాదులు అని హేళన చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ఉప ఎన్నికపై టీవీకే దృష్టి
సాక్షి, చైన్నె : రాజ్యసభ, అసెంబ్లీ ఎప ఎన్నికలపై టీవీకే అధినేత, సీఎం విజయ్ దృష్టి పెట్టారు. ఈ రెండు స్థానాలను గుప్పెట్లోకి తెచ్చుకునే దిశగా కసరత్తులు మొదలయ్యాయి. అధికార పగ్గాలతో చరిత్ర సృష్టించిన తమ పార్టీ, రాజ్యసభలోనూ అడుగు పెట్టేందుకు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే, తిరుచ్చి తూర్పులో జరగనున్న ఉప ఎన్నికలలో మాజీ ఐఏఎస్ అధికారి సహాయంను పోటీలో పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు చర్చ జరుగుతోంది. రాజ్యసభ గెలుపు సమీకరణాలు ఇవే.. అన్నాడీఎంకేకు చెందిన సీవీ షణ్ముగం రాజీనామాతో ఉప ఎన్నికల అనివార్యమైంది. జూన్ 1 నుంచి నామినేషన్లు, జూన్ 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి కసరత్తు మొదలెట్టారు. సాధారణంగా తమిళనాడు నుండి ఓ రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోవడానికి 34 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. అయితే, ప్రస్తుతం ఒకే ఒక్క స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండటంతో, గెలుపునకు 50 శాతానికి పైగా ఓట్లు (అంటే 117 ఓట్లు) అవసరమవుతాయి. ప్రస్తుతం అసెంబ్లీలో మొత్తం 233 మంది సభ్యులు ఉన్నారు. (ముఖ్యమంత్రి విజయ్ తాను గెలిచిన రెండు స్థానాలలో ఒకటైన తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది). ప్రస్తుతం అధికార టీవీకే పార్టీకి 107 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, వీసీకే , సీపీఎం,సీపీఐల మద్దతు ఇస్తే టీవీకే అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే కానుంది. అటు అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతు కూడా విజయ్ పార్టీకే ప్రస్తుతానికి ఉందని చెప్పవచ్చు. ఈ దృష్ట్యా ఈస్థానం కై వసానికి విజయ్ వ్యూహాలకు పదును పెట్టారు. కాంగ్రెస్లోని తన మిత్రుడు ప్రవీణ్ చవ్రర్తికి సీటు ఇస్తే కూటమి పార్టీలలో ఏదేని విబేధాలు తలెత్త వచ్చు అని భావిస్తున్నారు. దీంతో టీవీకేకు చెందిన ఒక ముఖ్య నేతను లేదా తమకు వెన్నంటి ప్రోత్సహం ఇచ్చిన అన్ని రంగాలలో నిష్ణాతుడైన ఓ ముఖ్య ప్రముఖుడ్ని రాజ్యసభకు పంపించేందుకు విజయ్ కసరత్తులు చేపట్టినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికపై ఉత్కంఠ మరోవైపు సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక నగారా మోగనుంది. ఇక్కడ మాజీ ఐఏఎస్ అధికారి సహాయంను పోటీలో పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. డీఎంకే తరపున ఇక్కడ మాజీ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యామొళి పోటీ చేయవచ్చ అనే సంకేతాల నేపథ్యంలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు విజయ్ సిద్ధం అవుతున్నారు. తొలుత లాల్గుడిలో ఓడిన కూపా కృష్ణన్ పేరు వినిపించినా ఆయనకు బోర్డు పదవి దక్కింది. సినీ నటి త్రిషా పేరిట పోటీ అంటూ వస్తున్న ప్రచారానికి చెక్ పెట్టే దిశగా మాజీ ఐఏఎస్ అధికారులపై విజయ్ దృష్టి పెట్టి ఉన్నారు. నిజాయితీకి మారు పేరుగా ఉన్న సహాయం పోటీకి నిరాకరించిన పక్షంలో మరో ఐఏఎస్ అధికారి పోటీలో పెట్టేందుకు తగ్గ ప్రయత్నాలు సాగుతుండటం గమనార్హం. -
జూన్ 1న పాఠశాలలు పునః ప్రారంభం
సాక్షి, చైన్నె: జూన్ 1న పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో ఏర్పాట్లపై విద్యా మంత్రి రాజ్ మోహన్ దృష్టి పెట్టారు. చింతాద్రి పేట ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ పాఠశాలను శనివారం సందర్శించారు. 2026–2027 విద్యాసంవత్సరానికి గానూ విద్యార్థులకు పంపిణీ చేయనున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు, పాఠశాల యూనిఫారాలు, స్కూల్ బ్యాగులు తదితర వస్తువులను పాఠశాలలకు నేరుగా సరఫరా చేసే ప్రక్రియను ఆయన స్వయంగా తనిఖీ చేశా రు. తమిళనాడు వ్యాప్తంగా అన్ని రకాల పాఠశాలలు జూన్ 1వ తేదీన పునఃప్రారంభం కానున్నాయని ఈసందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2026–2027 విద్యాసంవత్సరంలో విద్యార్థులకు అందించాల్సిన ఉచిత విద్యా సామగ్రిని ఇప్పటికే అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలకు రవాణా చేశామన్నారు. ప్రస్తుతం ఆయా జిల్లా కేంద్రాల నుండి నేరుగా పాఠశాలలకు ఈ వస్తువులను చేరవేసే పనులు ముమ్మరంగా సాగు తున్నాయని వివరించారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎస్. కన్నప్పన్, ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ పి.ఎ. నరేష్, చైన్నె జిల్లా ముఖ్య విద్యాధికారి కబీర్ , విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. మహిళపై ఆటోడ్రైవర్ లైంగిక వేధింపులు అన్నానగర్: మహిళకు లైంగిక వేధింపులు ఇచ్చిన ఆటో డ్రైవర్ పై ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించిన ఇన్స్పెక్టర్లతో సహా ఐదుగురు పోలీసు అధికారులను విధుల నుండి తొలగించారు. వివరాలు.. శివగంగ జిల్లాలోని దేవకోట్టైకి చెందిన మాధవన్ అలియాస్ తంగస్వామి (48), ఆటో డ్రైవర్. సంఘటన జరిగిన రోజు, 36 ఏళ్ల మహిళ అతని ఆటో ఎక్కింది. మాధవన్ ఆటోను ఒక నిర్మానుష్య ప్రాంతానికి నడిపి, ఆ మహిళను లైంగికంగా వేధించాడని తెలుస్తోంది. దిగ్భ్రాంతికి గురైన ఆ మహిళ అక్కడి నుంచి పారిపోయి ఏడుస్తూ, జరిగినదంతా తన భర్తకు చెప్పింది. ఆ తర్వాత, ఆ మహిళ, ఆమె భర్త ఫిర్యాదు చేయడానికి దేవకోట్టై నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. కానీ అక్కడి పోలీసులు ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించి, మహిళా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసుకోమని వారికి చెప్పారు. దీంతో వారు మహిళా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడి పోలీసులు వారిని నగర పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసుకోమని చెప్పినట్లు తెలుస్తుంది. ఇలా భార్యాభర్తల మూడు రోజులుగా తిప్పిస్తున్నే ఉన్నారు. దీంతో వారు మధురైకి వచ్చి పోలీస్ ఐజీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సరైన దర్యాప్తు జరపాలని ఐజీ ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆటో డ్రైవర్ మాధవన్ను శనివారం అరెస్టు చేశారు. ఫిర్యాదు స్వీకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసుల పై కూడా విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు సరైన సమాచారం అందించని దేవకోట్టై నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ దురైరాజ్, స్పెషల్ సబ్–ఇన్స్పెక్టర్ జయ, ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గీతా లక్ష్మి, స్పెషల్ సబ్–ఇన్స్పెక్టర్ రాజేశ్వరి , స్పెషల్ సెల్ పోలీస్ కానిస్టేబుల్ చందన కృష్ణన్ ఈ ఐదుగురిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. రామనాథపురం డీఐజీ మణివన్నన్, శివగంగై జిల్లా ఎస్పీ శివప్రసాద్ ఆదేశించారు. -
జాతీయస్థాయి పోటీలకు దారుశిల్పి శ్రీనివాసరావు
సాక్షి, చైన్నె: చైన్నె ముగిలివాకానికి చెందిన ప్రముఖ దారుశిల్పి కడియం శ్రీనివాసరావు గత 35 ఏళ్లుగా తన శిల్పకళ నైపుణ్యంతో ఎన్నో అవార్డులు, రివార్డులతో పాటు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలో పాల్గొనడానికి బర్మా టేక్ వుడ్తో బ్రహ్మాండ నాయకుడైన విష్ణు విగ్రహాన్ని అద్భుత రీతిలో రూపొందించారు. ఇందులో అష్టలక్ష్మిలతో కూడిన ద్వారపాలకు లు, గరుడ, హనుమాన్, ఏనుగులు, తామర, శంకుచక్రాలతో వైవిధ్యభరితంగా రూపొందించారు. గతంలో ఇండియన్ క్రాఫ్ట్ కౌన్సిల్ ద్వారా అవార్డును ఆయ న అందుకున్నారు. ఈయన రూపొందించిన రాముడు శ్రావణ కుమారుడు విగ్రహాన్ని ఢిల్లీ సమీపాన గల ద్వారక మధుర బృందావనంలో ప్రతిష్టించడం జరిగింది. అలాగే తమిళనాడు పూంబుహార్ స్టేట్ అవార్డును, యుటిలిటీ అవార్డును, టీం అవార్డును అందుకున్నారు, అలాగే కాంచీపురం లో కళా సాంస్కృతిక అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ స్వస్థలం విజయనగరం జిల్లా, కొత్తూరు గ్రామం అని, ప్రస్తుతం చైన్నెలో నివాసముంటున్నట్లు తెలిపారు. తమ పూర్వీకుల నుంచి ఐదు తరాలుగా ఈ వృత్తిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో కళాఖండాలు రూపొందించాలన్నదే తన ధ్యేయమని తెలిపారు. -
రిజర్వాయర్లలో 7.5 టిఎంసీల నీరు నిల్వ
తిరువళ్లూరు: చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టం సుమారు 7.50 టీఎంసీల మేరకు నిల్వ వున్న క్రమంలో వేసవి నాటికి నీటి కొరత వుండదని రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి, పీడబ్ల్యూడీ కార్యదర్శి సత్యబ్రత సాహూ వెల్లడించారు. తిరువళ్లూరు జిల్లాలోని పూండి సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్, కాంచీపురంలోని చెమరంబాక్కం రిజర్వాయర్లను అధికారులతో కలిసి శనివారం సాయంత్రం పరిశీలించారు. పూండి రిజర్వాయర్ వద్దకు వచ్చిన సత్యబ్రత, కాలువలు, తెలుగు–గంగ ప్రాజెక్టు కాలువలు, షట్టర్ల పనితీరుతో పాటూ ఇతర అంశాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న ఆనకట్ట, రిజర్వాయర్ల ప్రతిపాదనలపై సైతం ఆరా తీశారు. గతంలో వరదల వల్ల కొట్టుకపోయిన బ్రిడ్జిలు, ఆనకట్టలు, వాటి మరమ్మతు పనుల పురోగతిపై సైతం వివరాలను సేకరించారు. తిరువళ్లూరు, కాంచీపురం తదితర జిల్లాలో ప్రధానంగా నాలుగు రిజర్వాయర్ల నిర్మాణం చేయాలన్న ప్రతిపాధన ప్రభుత్వం వద్ద ఉందని, వీటికి సుమారు రూ.1,500 నుంచి రెండువేల కోట్లు రూపాయల మేరకు ఖర్చు అయ్యే అవకాశం వుందని వివరించారు. ఇందుకు జోక్యం చేసుకున్న సాహూ, అంత పెద్దమొత్తంలో కేటాయింపులపై సీఎం వద్ద చర్చించి నిర్ణయం తీసుకుందామని అధికారులకు వివరించారు. నీటి కొరత వుండదు తనిఖీ అనంతరం సత్యప్రదసాహూ మీడియాతో మాట్లాడుతూ ప్రజాపనులశాఖ కార్యదర్శిగా నియమితులైన తరువాత తాను చైన్నెకు నీటిని అందించే ప్రాజెక్టులను తనిఖీ చేస్తున్నామని ఈసందర్భంగా ఆయన తెలిపారు. చెమరంబాక్కం, పూండీ రిజర్వాయర్లను పరిశీలించామని, తనిఖీల్లో తమకు సంతృప్తికరంగా ఉందన్నారు. చెమరంబాక్కంరెడ్హిల్స్, చోళవరం, కన్నన్కోట–తేరువాయి కండ్రిగ, పూండి తదితర రిజర్వాయర్లలో 7.5 టిఎంసీల నీరు నిల్వవుంది. ప్రతి నెలా చైన్నెకు తాగునీటి అవసరాల కోసం 1.50 టీఎంసీల నీరు అవసరం వుంది. ప్రస్తుతం వున్న నీరు మరో ఐదు నెలలకు సరిపడుతుంది. త్వరలోనే వర్షాకాలం రానున్న క్రమంలో నీటి ఎద్దడి వుండదని ఈసందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కాగా తనిఖీల్లో కలెక్టర్ ప్రతాప్, చీఫ్ ఇంజినీర్ పొదుపనితిలగం అధికారులు పాల్గొన్నారు. -
పండ్లు, కూరగాయలపై సీఎం విజయ్ కళాఖండాలు
చైన్నెస్ అమృత విద్యార్థులు కొరుక్కుపేట: ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్ సినీ జీవితం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు గల స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని తెలుపుతూ చైన్నెస్ అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు పండ్లు, కూరగాయలతో వినూత్న రీతిలో సీఎం విజయ్ కళాఖండాలను రూపొందించి అబ్బురుపరిచారు. ముఖ్యమంత్రికి మిత్రుడైన నటుడు సంజీవ్ , చైన్నెస్ అమృత గ్రూప్ ఆఫ్ ఇన్్ స్టిట్యూషన్స్ ఛైర్మన్ ఆర్.భూమినాథన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.చైన్నెలోని రాయపేటలో ఉన్న చైన్నెస్ అమృత ఇంటర్నేషనల్ ఏవియేషన్ కాలేజీలో జరిగిన ఈ కార్యక్రమంలో, విద్యార్థులు పూర్తిగా కూరగాయలు , పండ్లతో చెక్కిన కళాత్మక శిల్పాల ద్వారా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రస్థానాన్ని కళ్ళకు కట్టేలా ప్రదర్శన ఇచ్చారు.ఈ ప్రదర్శనను నటుడు సంజీవ్, ఇనిస్టిట్యూట్ ఛైర్మెన్ ఆర్. భూమినాథన్ ప్రారంభించారు. విజయ్ తొలి చిత్రం నాలైయ తీర్పు నుండి జననాయగన్ వరకు గల మైలురాళ్లకు ప్రాతినిథ్యం వహిస్తూ మొత్తం 69 శిల్పాలను రూపొందించారు. అసాధారణమైన సృజనాత్మకత, అంకితభావం , జట్టుకృషిని ప్రతిబింబిస్తూ, చైన్నెస్ అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు 10 రోజుల పాటు ఎంతో శ్రద్ధగా ఈ శిల్పాలను రూపొందించటం విశేషం. ఈ సందర్భంగా నటుడు సంజీవ్ విద్యార్థుల అద్భుతమైన కళా నైపుణ్యాన్ని, కృషిని ప్రశంసించారు. -
నరువిలో నర్సుల దినోత్సవం
వేలూరు: ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేలూరు నరువి ఆస్పత్రిలో చైర్మన్న్ జీవి సంపత్ అధ్యక్షతన కొవ్వొత్తులు వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఆస్పత్రిలో రోగులకు విశిష్ట సేవలు అందించిన నర్సులను అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులను ప్రేమతో పలకరించి వైద్య సేవలు అందజేస్తామని రోగులు మనస్సు బాధపడకుండా చూసుకుంటామని నర్శింగ్ సిబ్బందిచే ప్తిజ్ఞ చేయించారు. చైర్మన్ మాట్లాడుతూ దేశంలో అన్ని సేవలకన్నా నర్సుల సేవ మరవరాదన్నారు. ప్రమాదంలో ఉన్న వారిని డాక్టర్ల కన్నా ముందుగా నర్సులే చూస్తారని వారితో ప్రేమగా మాట్లాడి వారికి అవసరమైన వైద్య సేవలు అందజేయాలని తెలిపారు. రోగులను దైవంగా భావించాలన్నారు. ఆస్పత్రి ఉపాధ్యక్షులు అనిత, కార్యనిర్వహణ డైరెక్టర్ డాక్టర్ పాల్హెండ్రీ, డాక్టర్ అరవింద్నాయర్, జీఎం నితిన్ సంపత్, మెడికల్ సూపరింటెండెంట్ జాకప్ జోస్, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
2027 నవంబర్కి..
సాక్షి, చైన్నె : గడిచిన ఆర్థిక సంవత్సరంలో చైన్నె, కామరాజర్ (ఎన్నూర్) రెండు ప్రధాన ఓడరేవులు కలిసి మొత్తంగా 107 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి సరికొత్త రికార్డు సృష్టించాయని చైన్నె పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఎస్. విశ్వనాథన్, కామరాజర్ పోర్ట్ చైర్మన్ జె.పి. ఐరిన్ సింథియా తెలిపారు. ఇందులో చైన్నె పోర్ట్ 57.9 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగా, కామరాజర్ పోర్ట్ 49.08 మిలియన్ టన్నుల రవాణా చేసిందన్నారు. ఈ రెండు పోర్టుల ఉమ్మడి కార్యాచరణ ఆదాయం రూ. 2,400 కోట్లు దాటగా, వీటి క్యాపిటల్ వ్యయం (మూలధన వ్యయం) వెయ్యి కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు. ఇందులో చైన్నె పోర్ట్ రూ. 1,185 కోట్ల కార్యాచరణ ఆదాయాన్ని ఆర్జించడమే కాకుండా, పోర్ట్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 434 కోట్ల నికర మిగులు ఆదాయాన్ని నమోదు చేసిందని వివరించారు. అదేవిధంగా, కామరాజర్ పోర్ట్ రూ. 1,239 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. దేశంలోని ప్రధాన ఓడరేవులలోనే అత్యంత తక్కువ ఆపరేటింగ్ రేషియో (25.48శాతం) నమోదు చేసిన పోర్టుగా నిలిచిందని తెలిపారు. దీని ఎబిట్టా ( వడ్డీ, పన్నులు, తరుగుదలకు ముందు ఆదాయం) చరిత్రలోనే మొదటిసారిగా రూ. 1,000 కోట్ల మార్కును దాటి రూ. 1,071.63 కోట్లకు చేరిందన్నారు. ఔటర్ హార్బర్ ప్రాజెక్ట్ రూ. 10,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న చైన్నె పోర్ట్ ఔటర్ హార్బర్ ప్రాజెక్ట్ కు సంబంధించి రైట్స్ సంస్థ ప్రస్తుతం ట్రాఫిక్ సర్వేలు, అధ్యయనాలు చేస్తోందన్నారు. ఎరస్రముద్రం ప్రాంతంలో నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇరాన్–అమెరికా మధ్య వివాదాల కారణంగా ముడి చమురు దిగుమతుల్లో ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ, ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని అధిగమించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఇక్కడి నుండి గల్ఫ్ దేశాలకు జరిగే వాహనాల ఎగుమతుల్లో సుమారు 6 నుండి 7 లక్షల టన్నుల వరకు ప్రభావం పడిందన్నారు. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి , ఎగుమతిదారులను ఆదుకోవడానికి అదనపు స్టోరేజ్ (వేర్హౌస్) సదుపాయాలను, టారిఫ్ రాయితీలను (కట్టణ సలహా) కల్పిస్తున్నట్లు వివరించారు. మౌలిక వసతుల విస్తరణ – కీలక ప్రాజెక్టులుచైన్నె పోర్టుకు వచ్చే భారీ సరుకు రవాణా వాహనాల (కంటైనర్ లారీలు) ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు నిర్మిస్తున్న పోర్ట్–మధురవాయల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను 2027 నవంబర్ నాటికి పూర్తి చేయడానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కామరాజర్ పోర్టులో భారీ నౌకల రాకపోకలకు వీలుగా రూ. 440 కోట్ల వ్యయంతో 6వ విడత లోతైన డ్రెడ్జింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. దీని ద్వారా తాజాగా 2.44 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన అతిపెద్ద నౌకలు కూడా ఇక్కడకు వచ్చేందుకు వీలుందన్నారు. -
కొనసాగుతున్న విద్యుత్ కోతలు
తిరుత్తణి: తిరుత్తణి శివారులో మూడు రోజులుగా విద్యుత్ కోతతో తాగునీటి సమస్య తీవ్రం కావడంతో ఆగ్రహం చెందిన స్థానికులు శనివారం రెండు ప్రాంతాల్లో రాస్తారోకో చేశారు. తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో గురువారం గాలివాన బీభత్సానికి చెట్లు నేలకొరిగి విద్యుత్ స్తంభాలు కూలి విద్యుత్ వ్యవస్థ అతలాకుతలమైంది. దీంతో తిరుత్తణి, పళ్లిపట్టు, ఆర్కేపేట పరిసర ప్రాంతాల్లో 20 గంటల పాటు విద్యుత్కు అంతరాయం చోటుచేసుకుంది. విద్యుత్శాఖ సిబ్బంది మూకుమ్మడిగా కృషిచేసి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయితే తిరుత్తణి మున్సిపాలిటీలోని కుమారకుప్పం, పాపిరెడ్డిపల్లెలో కూలిన విద్యుత్ స్తంభాలు తొలగించి విద్యుత్ సేవలు కల్పించకపోవడంతో తాగునీటికి కష్టాలు తీవ్రమయ్యాయి. రాత్రుల్లో నిద్ర లేక చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్రహం చెందిన పాపిరెడ్డిపల్లె ప్రజలు పొదటూరుపేట రాష్ట్ర రహదారిలో శనివారం సాయంత్రం రాస్తారోకో చేశారు. దీంతో ఆ ప్రాంతంలో వాహన సేవలు స్తంభించాయి. క్వారీకి వెంటనే విద్యుత్ సరఫరా అందించిన అధికారులు తమ ప్రాంతంలో మూడు రోజులుగా విద్యుత్ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే విధంగా తెక్కళూరులో మూడు రోజులుగా విద్యుత్ కోతలతో ఆ ప్రాంతం వాసులు రాస్తారోకో చేసి విద్యుత్శాఖ అధికారుల తీరుకు నిరసన తెలిపారు. తెగిన విద్యుత్ తీగ తొలగింపులో అలసత్వం పళ్లిపట్టు యూనియన్లోని రామానాయుడు కండ్రిగ, సీఎన్ కండ్రిగ గ్రామాల్లో మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేక గ్రామీణులు చీకట్లో జీవిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయితే రామానాయుడు కండ్రిగ ప్రదాన రోడ్డులో తెగిపడిన హై ఓల్టేజ్ విద్యుత్ తీగ తొలగింపునకు విద్యుత్ శాఖ సిబ్బంది చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ కరోనా భయం..?
సాక్షి,చైన్నె: తమిళనాడులో గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరం, జలుబు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణంగా వచ్చే జ్వరాలు 3 లేదా 4 రోజుల్లో తగ్గిపోయేవి. అయితే, ప్రస్తుతం వస్తున్న జ్వరం వారం దాటినా తగ్గకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కరోనా సోకినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉండేవో.. ఇప్పుడు కూడా అదే తరహాలో తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు ఉండటంతో, మళ్లీ కరోనా మహమ్మారి వ్యాపిస్తోందా? అనే భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఎండల తీవ్రత – పెరుగుతున్న రోగాలు తమిళనాడు వ్యాప్తంగా గత కొన్ని వారాలుగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. దీనివల్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోవడం వంటి సమస్యలతో చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మరోవైపు, టైఫాయిడ్, డెంగ్యూ వంటి రకాల జ్వరాలతో బాధపడుతూ అనేకమంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అనుమానాలపై ఆరోగ్య శాఖ స్పందన మళ్లీ కరోనా వ్యాపిస్తోందా? అనే అనుమానాలపై ప్రజారోగ్య శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. తమిళనాడులో డెంగీ సహా అన్ని రకాల జ్వరాలను అదుపు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాధారణంగా ఏ జ్వరానికై నా ప్రాథమిక లక్షణాలు ఒకేలా (దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు) ఉంటాయన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో పెద్దఎత్తున పరీక్షలు చేసినట్లు ఇప్పుడు ప్రతి ఒక్కరికీ చేయడం లేదన్నారు. అయితే, ఎవరికై నా తీవ్రమైన లక్షణాలు ఉండి, కరోనా పరీక్ష అవసరమని భావిస్తే.. వారికి కచ్చితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రులకు సూచించామన్నారు. అలాగే జ్వరంతో బాధపడుతున్న రోగులు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరితే, వారికి తప్పకుండా పరీక్షలు చేస్తామని ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేశారు. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారు సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. -
మైనారిటీలను విమర్శిస్తే సహించం
సాక్షి, చైన్నె : మైనారిటీలు వేసిన ఓట్ల రూపంలోనే ప్రస్తుతం డీఎంకే అనేక నియోజకవర్గాలలో గెలిచిందని, కావాలంటే లెక్కలేసుకుని చూసుకోండి అంటూ ఐయూఎంఎల్ నేత ఖాదర్ మొహిద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే కూటమిలో దశబ్దాల పాటుగా ప్రయాణించిన ఐయూఎంఎల్ తాజాగా ఆ కూటమిని వీడిన విషయం తెలిసిందే. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో ఐయూఎంఎల్ భాగస్వామ్యం కావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యే షాజహాన్ మంత్రి అయ్యారు. తమను వీడిన ఐయూఎంఎల్ను టార్గెట్ చేస్తూ డీఎంకే వర్గాలు తీవ్రంగా విరుచుకు పడటం మొదలెట్టాయి. మైనారిటీలకు కవచంగా ఉన్న డీఎంకేకు ద్రోహం చేశారన్న ఆరోపణలు బయలు దేరాయి. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం ఓ మీడియాకు ఆ ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ జాతీయ అధ్యక్షుడు ఖాదర్ మొహిద్దీన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఎంకేపై ఎదురు దాడి చేయడం గమనార్హం. మైనారిటీలో ఓట్లతోనే డీఎంకే అనేక చోట్ల గెలిచిందని, కావాలంటే లెక్కలేసుకుని చూసుకోండి అని హితవు పలికారు. తమను విమర్శించే అర్హత ఎవ్వరికీ లేదన్నారు. తీవ్రంగా విమర్శిస్తే, అందుకు ఘాటుగా స్పందించేందుకు సైతం తాము వెనుకాడబోమన్నారు. డీఎంకేకు మైనారిటీల ఓటు బ్యాంకే రక్షణ కవచంగా ప్రస్తుత ఎన్నికలలో నిలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. -
ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి
వేలూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రతి టీచర్ కష్టపడి పనిచేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పది పరీక్ష ఫలితాల్లో వందశాతం మార్కులు సాధించిన విద్యార్థులకు, పాఠశాల ప్రధానోపాద్యాయులకు అభినందన, అవార్డు ల ప్రదానోత్సవ కార్యక్రమం వేలూరు కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఆమె మాట్లాడుతూ పది ఫలితాల్లో వేలూరు జిల్లా వెనుకంజలో ఉందని, మొదటి స్థానానికి తీసుకొచ్చేందుకు కృషిచేయాలన్నారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచడమే లక్ష్యంగా విద్యా బోధన చేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, హెచ్ఎంలను అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. విద్యాశాఖ సీఈఓ ప్రేమలత, విద్యాశాఖ అధికారులు సెంథిల్కుమార్, కేశవన్, హెచ్ఎంలు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
రైతుపై నాటు తుపాకీతో కాల్పులు
సాక్షి, చైన్నె: తమిళనాడులోని కరూర్ జిల్లా కడవూర్ సమీపంలో శనివారం ఉదయం వెలుగుచూసిన సంఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ పొలం పనులలో ఉన్న ఒక రైతుపై గుర్తుతెలియని దుండగుడు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రైతు ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరూర్ జిల్లా కడవూర్ తాలూకా సేవప్పూర్ పరిధిలోని వలయాపట్టి గ్రామానికి చెందిన మురుగన్ కుమారుడు కరుణైగిరి (48) రైతు. శుక్రవారం రాత్రి సుమారు పది గంటల సమయంలో కరుణైగిరి తన పొలానికి వెళ్లారు. అర్థరాత్రి వేళ పనులలో ఉన్న ఆయనపై చీకట్లో మాటువేసిన ఒక గుర్తుతెలియని వ్యక్తి, నాటు తుపాకీతో ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తుపాకీలోని సుమారు 10 తూటాలు (బాల్రస్ గుండ్లు) ఆయన నడుము, వెన్ను భాగంలోకి బలంగా దూసుకెళ్లాయి. దీంతో ఆయన రక్తపు మడుగులో అక్కడికక్కడే పడి పోయారు. కాల్పుల శబ్దం విని స్థానికులు, తోటి రైతులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన కరుణైగిరిని రక్షించి, చికిత్స నిమిత్తం దిండిగల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు వైద్య సేవలు అందుతున్నాయి. ఈ ఘాతుకంపై సమాచారం అందుకున్న పాలవిడుతి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
జూలైలో తెరపైకి జీడీ నాయుడు
తమిళసినిమా: నటుడు మాధవన్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం జీడీ నాయుడు. వర్గీస్ ములన్ పిక్చర్ , ట్రికలర్ ఫిలింస్ సంస్ధలు కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. వాస్తవ ఘటనలతో ఇప్పటి వరకూ చెప్పన కథాంశాలతో రూపొందించే కథా చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి యదార్ధ కథంతో రూపొందిస్తున్న చిత్రం జీడీ.నాయుడు. కృష్ణకుమార్ రామకుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం ఇండియన్ ఎడిసన్గా పేరుగాంచిన వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్ అనబడే జీడీ.నాయుడు జీవిత ఇతివృత్తంతో తెరకెక్కుతోంది. జీడీ.నాయుడు జీవితంలో ఒక ముఖ్య అధ్యాయంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన విప్లవాత్మక ఆలోచనలు, మార్గదర్శకాలుగా నిలిచే ఘటనల కారణంగా ఆయన్ని ఇండియాలోనే ఒక తెగసీగా కీర్తీంచేలా చేశాయని దర్శకుడు తెలిపారు. జాతీయ అవార్డును గెలుచుకున్న రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ చిత్రం తరువాత వర్గాస్ ములన్ పిక్చర్స్,ట్రికలర్ ఫిలింస్ సంస్ధల అధినేతలు నటుడు మాదవన్, సరితా సరితామాధవన్, వర్గీస్ ములన్, విజయ్ ములన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. మాధవన్ టైటిల్ పాత్రను పోషిస్తున్న ఇందులో నటుడు సత్యరాజ్, ప్రియమణి, జయరాం,దుషారా విజయన్ తంబిరామయ్య, వినయ్రాయ్,కరుణాకరన్ ముఖ్య పాత్రలు పోషించారు. కాగా షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. కాగా జీడీ. నాయుడు చిత్రాన్ని తమిళనాడులో ఎజీఎస్ సంస్థ విడుదల చేయనుంది. -
క్లుప్తంగా
భేటీలో స్టాలిన్ సాక్షి, చైన్నె: వెన్నుపోటు కాంగ్రెస్ పార్టీకి అలవాటే అనిడీఎంకే యువజన సమావేశంలో తీర్మానం చేశారు. ఇతరుల శ్రోమను దోచుకుని ద్రోహం చేయడం కాంగ్రెస్కు పరిపాటేనని శివాలెత్తారు. అన్నా అరివాలయంలో డీఎంకే యువజన రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఆ విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయ నిధి స్టాలిన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ముఖ్య నిర్వాహకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చాలాకాలం తర్వాత యువజన సమావేశానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తాజాగా హాజరు కావడం విశేషం. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, ఓటమికి గల కారణాలు, జిల్లాలలలో నెలకొన్న పరిస్థితులు, యువతకు పెద్ద పీట వేసే విధంగా మున్ముందు చేపట్టనున్న అంశాలగురించి ఇందులో చర్చించారు. యువత సామాజిక మాధ్యమాలను ప్రచార అస్త్రాలుగా విస్తృతం చేయాలని ఈసందర్భంగా స్టాలిన్ పలు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. అలాగే ఆ పార్టీ నేత రాహుల్గాంధీకి వ్యతిరేకంగా సైతం నినాదాలు చేశారు. ఇందులో ప్రధాన తీర్మానంగా వెన్నుపోటు కాంగ్రెస్కు ఖండన అని నిరసనను వ్యక్తం చేశారు. ఇతరుల శ్రమను దోచుకుని, చివరకు ద్రోహం చేయడం కాంగ్రెస్కు అలవాటేనని మండి పడ్డారు. కాంగ్రెస్ డీఎంకేకు తీవ్ర ద్రోహం చేసిందని, ఆ పార్టీని ఎట్టి పరిస్థితులలోనూ క్షమించ వద్దు అని పార్టీ అధిష్టానానికి యువజన సమావేశం విన్నవించింది. ప్రయాణించే పడవకే చిల్లు పెట్టే మేధావులు కాంగ్రెస్ వాదులు అని హేళన చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అన్నానగర్: చైన్నెలోని ముగలివాక్కం ప్రాంతానికి చెందిన దినకరన్ కుమారుడైన గుణ (38). ఇతను చైన్నెలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. ఇతను తన కుటుంబంతో కలిసి వేసవి సెలవుల కోసం తెన్ కాశీ జిల్లాలోని కడైయం సమీపంలో ఉన్న మడతూరులోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం, గుణ తన కుటుంబం, బంధువులతో కలిసి నైల్లె జిల్లాలోని అంబై చిన్న శంకరన్ ఆలయం వద్ద ఉన్న తామిరబరణి నదిలో స్నానం చేయడానికి ఒక వ్యాన్లో వెళ్లారు. అందరూ నదిలో స్నానం చేస్తుండగా, గుణ అనుకోకుండా నదిలోని లోతైన భాగంలోకి వెళ్లి మునిగిపోయాడు. ఇది చూసిన కుటుంబ సభ్యులు అతడిని కాపాడటానికి ప్రయత్నించారు. అయితే, వారు అతడిని రక్షించలేకపోయారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న వెంటనే, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, నదిలో మునిగిపోయిన గుణ మృతదేహాన్ని వెలికితీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పళ్లిపట్టు: Ð]l*i GÐðl$ÃÌôæÅ AÆý‡$׊æ-çÜ$-{º-çßæÃ-׿Ņ Æ>f-MîSĶæ$ {ç³Ä¶æ*׿… ï³G…-MóSÌZ {´ëÆý‡…À…_ Ð]lĶæ* yîlG…yîlMóS, A¯é² yీ G…yîlMóS. ½iõ³ §éÓÆ> sîæÒ-MóSMýS$ ^ólÆý‡yýl… ç³rÏ ¯ðlsìæ-f¯]l$Ï ¡{Ð]l BÆøç³-׿Ë$ VýS$í³µ-çÜ$¢¯é²Æý‡$. ÑÐ]lÆ>-Ë$.. †Æý‡$Ð]l-â¶æ*Ï-Æý‡$MýS$ ^ðl…¨¯]l ¯éÅĶæ$Ðé¨ AÆý‡$-׊æ-çÜ${ºçßæÃ-׿Ņ MýS$ÌS-´ë-Ç-tV> VýS$Ç¢…ç³# ´÷…¨¯]l ï³G…-MóSÌZ ™èl¯]l Æ>f-MîSĶæ$ {ç³Ä¶æ*׿… Ððl¬§ýlË$ ò³sìæt MðSò³-t¯ŒS Ñf-Ķæ$-M>…™Œæ Æ>f-MîSĶæ*ÌZÏ ÐðlË$-VýS$-™èl$¯]l² ÆøkÌZÏ B ´ëÈtÌZ ^ólÇ hÌêÏ M>Æý‡Å-§ýlÇØV> ç³§ýlÒ »ê«§ýlÅ-™èlË$ ^ólç³sìæt 2011ÌZ yîlG…yîlMóS GÐðl$Ã-ÌôæÅV> VðSË$´÷…§éÆý‡$. Ar$ ™èlÆý‡$-Ðé™èl fĶæ$-ÌSÍ-™èl™ø ÑfĶæ$-M>…™Œæ Ñ¿ôæ-¨…-^èl-yýl…™ø yîlG…-yîlMóS GÐðl$Ã-ÌôæÅË$ A¯é²-yîlG…MóS ^ólÆý‡-yýl…™ø ÐéÇ Ð]lÆý‡-çÜÌZ AÆý‡$-׊æ-çÜ${ºçßæÃ… OòÜ™èl… ^ólÆ>Æý‡$. 2021 ™èlÆý‡$-Ðé™èl A¯é²-yîl-G…MóS A«¨-M>Æý‡… MøÌZµ-Ð]l-yýl…™ø ™èl¯]l Æ>fMîSĶæ$ VýS*yéÆý‡… Ð]l*Ça ½gôæ-ï³ÌZ ^ólÆ>Æý‡$. {ç³çÜ$¢™èl… Æ>çÙ‰…ÌZ sîæÒMóS A«¨M>-Æý‡…-ÌZMìS Æ>Ð]l-yýl…™ø Ð]l$äÏ ´ëÈt MýS…yýl$Ðé Ð]l*Ça sîæÒMóS M>Æý‡$z ïÜÓMýS-Ç…-^éÆý‡$. Æ>f-MîSĶæ*ÌZÏ íܧ骅-™éË$, ÑË$Ð]lË$ ç³rÏ HÐ]l*{™èl… ÑË$-Ð]lË$ ÌôæMýS A«¨-M>-Æý‡Ðól$ ç³Æý‡Ð]l*-Ð]l-«¨V> ¿êÑ…_ Gç³µsìæ-MýS-糚yýl$ ´ëÈt MýS…yýl$-ÐéË$ AÆý‡$׊æ-çÜ${º-çßæÃ-׿Ņ Ð]l*Æó‡a-çÜ$¢¯]l²r$Ï ¯ðlsìæ-f¯]l$Ï ÑÐ]l$-ÇØ-çÜ$¢-¯é²Æý‡$. అన్నానగర్: పాత కక్షల కారణంగా ఓ యువ కుడిని దారుణంగా నరికి చంపారు. అతని సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. మనలి పుదునగర్ సమీపంలోని ఓల్డ్ నాపాలయం, పెరుమాళ్ కోవిల్ వీధికి చెందిన ప్రసాద్(27) పై మనాలి పుదునగర్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయి. ఇతని అన్న నవీన్. మనలిపుదునగర్ లోని ఎం.ఆర్.ఎఫ్ నగర్ ప్రాంతంలో ఒక బంధువు ఇంట్లో జరిగిన అంత్యక్రియలకు హాజరై శుక్రవారం రాత్రి ఆ ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో, ఇంటి పొదల దగ్గర దాక్నొని ఉన్న ఒక రహస్య ముఠా, కత్తులతో సహా ప్రాణాంతక ఆయుధాలతో ఆ అన్న, తమ్ముడి పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు. అతని సోదరుడు నవీన్ తీవ్ర గాయాలతో ప్రాణాలకు పోరాడుతున్నాడు. మనలిపుదునగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నవీన్ను రక్షించి, చికిత్స కోసం ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. -
కాలిన గాయాలతో యువతి మృతి
– విచారణకు తండ్రి డిమాండ్ తిరుత్తణి: తిరుత్తణి మున్సిపాలిటీ పరిధిలోని కుమారకుప్పం నివాసి అయిన సుధాకర్ (27), ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి మూడేళ్ల క్రితం ఉమా మహేశ్వరి (22) అనే మహిళతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒకటిన్నర సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఉదయం ఇంట్లో స్నానం చేసి వచ్చిన ఉమా మహేశ్వరి, బాత్రూంలోకి వెళ్లి కేకలు వేయడం ప్రారంభించింది. కేకలు విన్న ఇరుగుపొరుగు వారు పరుగెత్తుకెళ్లి తిరుత్తణి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆమెను చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స పొందిన అనంతరం, తదుపరి చికిత్స కోసం ఆమెను తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. స్నానం కోసం ఆన్ చేసిన హీటర్ లీక్ అయి పేలిపోవడంతో, సమీపంలో ఉన్న కిరోసిన్ డబ్బాకు నిప్పంటుకుని ఆ యువతి సజీవ దహనం అయినట్లు చెబుతున్నారు. అయితే, తన కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి తండ్రి పళనిలోని తిరుత్తణి పోలీస్ స్టేషన్లో సరైన విచారణ జరపాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి యువతి మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. -
‘కోవై’లో కలకలం రేపిన బాలిక హత్య
సాక్షి, చైన్నె:కోయంబత్తూరులో ఇంటి బయట ఆడు కుంటున్న 10 ఏళ్ల బాలిక అదృశ్యం కావడం, మరుసటి రోజు మృత దేహంగా తేలడం పెను కలకలాన్ని రేపింది. ఆ బాలికపై లైంగిక దాడి జరిగినట్టు వెలుగులోకి రావడంతో రాత్రంతా పలు చోట్ల ఆందోళనలు కొనసాగాయి. అధికార టీవీకేపై ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోయడంతో కేసును సీఎం విజయ్ ఓ సవాల్గా తీసుకున్నారు. డీజీపీ సందీప్ రాయ్ రాథోర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఐజీ రమ్యభారతీతో పాటూ ఎస్పీ పవన్కుమార్రెడ్డి తదితరుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఉరకలు తీశాయి. 24 గంటలలో నిందితులు ఇద్దర్ని అరెస్టు చేశాయి. కాళ్లు చేతులు విరిగిన స్థితిలో ఆస్పత్రిలో నిందితులను చేర్పించారు. కేసు వివరాలు.. కోయంబత్తూరు జిల్లా సూలూరు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ వచ్చింది. ఈనెల 21వ తేది సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక అదృశ్యమైంది. దీంతో పరిసరాలలో గాలించినా ఫలితం లేక పోవడంతో పోలీసులను బాలిక తల్లిదండ్రులు ఆశ్రయించారు. సూలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆ పరిసరాలలోని సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో శుక్రవారం సాయంత్రం సూలూరు సమీపంలోని ఓ చెరువు గట్టు పొదళ్లలో బాలిక మృతదేహంగా బయట పడింది. బాలిక శరీరంపై గాయాలు ఉండటంతో లైంగిక దాడి జరిగినట్టు వెలుగు చూసింది. దీంతో నిందితులను అరెస్టు చేయాలంటూ ఎక్కడికక్కడ ఆందోళనలు బయలుదేరాయి. బాలిక మృత దేహాన్ని మార్చురీకి తరలించినా, పోస్టుమార్టం చేయనివ్వకుండా అడ్డుకున్నారు. నిందితులను ఎన్కౌంటర్ చేయాలంటూ శుక్రవారం అర్ధరాత్రి వరకు సూలూరు పరిసరాలలో ఆందోళనలు సాగాయి. 24 గంటల్లోనే ఛేదించాం: ఐజీ రమ్య భారతి 10 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి, దారుణంగా హత్య చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కోయంబత్తూరు ఐజీ రమ్య భారతి సాయంత్రం మీడియా సమావేశంలో వివరించారు. 21వ తేదీ సాయంత్రం 5 గంటల సమ యంలో ఇంటి బయట ఆడుకుంటున్న 10 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా కనిపించకుండా పోయిందని రాత్రి 8:30 గంటలకు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారన్నారు. అర్ధగంటలోనే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారని, ఐదు ప్రత్యేక బృందాలు విచారణను వేగవంతం చేశాయన్నారు. సీసీటీవీ ఫుట్టేజీ, మొబైల్ సిగ్నల్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించామన్నారు. నాగపట్నం జిల్లాకు చెందిన కార్తీ (33) అనే వ్యక్తి బాలికను తన వెంట తీసుకెళ్లిన ట్టు స్పష్టమైన ఆధారాలు లభించాయన్నారు. కన్నంపాళెం ప్రాంతంలోని మరియా రోజ్ గార్డెన్ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో అతను ఉన్నట్టు గుర్తించి, చుట్టుముట్టి అరెస్టు చేశామన్నారు. తమ నుంచి తప్పించుకునే క్రమంలో పై అంతస్తు నుంచి కిందపడి అతని కుడి చేయి, కుడి కాలు విరిగాయన్నారు. అతడిని ఆస్పత్రికి తరలించి విచారించగా, మరో వ్యక్తి కూడా కేసులో ఉన్నట్టు తేలిందన్నారు. పళ్లపాళెం ప్రాంతానికి చెందిన కార్తీ స్నేహితుడైన మోహన్ (30)ను అరెస్టు చేశామన్నారు. కార్తీ ఆ బాలిక ఇంటి పక్కనే నివాసం ఉన్నట్టు విచారణలో తేలిందన్నారు. బాలికకు ఆశ చూపి నమ్మించి జనసంచారం లేని చోటుకు తీసుకెళ్లానని, అక్కడ ఆమైపె లైంగిక దాడి (బలాత్కారం) చేసినట్లు అతడు అంగీకరించారని వివరించారు. ఈవిషయం బయటకు వస్తుందనే భయంతో కన్నంపాళెం చెరువు సమీపంలోని ఒక కొబ్బరి తోటలోకి తీసుకెళ్లి బాలిక గొంతు నొక్కి హత్య చేసినట్లు తమకు కార్తీ వివరించాడన్నారు. ఈ నేరంలో ప్రధాన నిందితుడు కార్తీకి మోహన్ సహకరించినట్టు, అతడ్ని తప్పించే ప్రయత్నం చేసినట్టు తేలిందన్నారు. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, నగరంలో మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందే ఆర్థిక సహాయం (పరిహారం) త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులపై త్వరితగతిన చార్జీషీట్ నమోదు చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. లైంగిక దాడి చేసి హతమార్చినట్టు వెలుగులోకి.. ప్రభుత్వానికి సవాలుగా..ఈ కేసు సీఎం విజయ్ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డారు. ఇది ‘రీల్స్’ ప్రభుత్వం కాదు.. ’రియల్’గా వ్యవహరించండి అని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి విరుచుకు పడ్డారు. బాలిక అదృశ్యమైన వెంటనే సమాచారం ఇచ్చినా, పోలీసులు సకాలంలో స్పందించకపోవడం ఈ ప్రభుత్వ పరిపాలనా లోపానికి, శాంతిభద్రతల క్షీణతకు అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం కేవలం మహిళల భద్రత అంటూ ప్రచారాలకే పరిమితం కాకూడదని మండి పడ్డారు. ఇక, ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అయితే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని విరుచుకు పడ్డారు. టీవీకే సర్కారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి 12 రోజుల పాటుగా జరిగిన హత్యలు, దోపిడీలు, లైంగిక దాడి కేసులను వివరిస్తూ, ఇదేనా శాంతి భద్రతల పరిరక్షణ, అబలకు రక్షణ అని ప్రశ్నించారు. అలాగే, అమ్మమక్కల్ మున్నేట్రకళగం నేత టీటీవీ దినకరన్, పీఎంకే నేత రాందాసు వంటి వారు సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో సీఎం విజయ్ స్వయంగా ట్వీట్ చేస్తూ నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని ప్రకటించారు. ఈ ఘటనపై అత్యంత వేగంగా, సమగ్రంగా విచారణ జరిపి, తక్షణమే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించానని తెలిపారు. . మహిళలు, చిన్న పిల్లలపై జరిగే ఇలాంటి అరాచకాలకు ఒడిగట్టే వారికి చట్టం ప్రకారం కఠినమైన శిక్ష పడేలా కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా మంత్రి సంపత్ తదితరులతో పాటుగా డీజీపీ సందీప్ రాయ్ రాథోర్ సైతం కోయంబత్తూరుకు శనివారం ఉదయాన్నే ఉరకలు తీశారు. బాధితులను పరామర్శించారు. కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. -
చెత్త రహిత నగరంగా చైన్నె!
సాక్షి, చైన్నె : చైన్నె మహానగరపాలక సంస్థ కొత్త కమిషనర్గా రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన సమీరన్ నగరాభివృద్ధిపై తన ప్రణాళికలను శనివారం ప్రకటించారు. చైన్నెని సుందరంగా, పచ్చదనంతో కూడిన చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు పలు విషయాలను వివరించారు. నగర సుందరీకరణ ప్రాజెక్టులు గతంలో నిలిచిపోయిన చైన్నె సుందరీకరణ పనులను తిరిగి ప్రారంభిస్తామన్నారు. నగరంలోని పార్కులు, బహిరంగ ప్రదేశాలను పునరుద్ధరిస్తామన్నారు. ఫ్లైఓవర్ల (ఫ్లైఓవర్ల కింది భాగం) కింద చెత్త వేయకుండా నిరోధించి, అక్కడ అందమైన పెయింటింగ్లు, రంగురంగుల దీపాలు ఏర్పాటు చేసి, మొక్కలు నాటుతామని వివరించారు. ముందస్తు పనులు అక్టోబర్లో ప్రారంభమయ్యే ఈశాన్య రుతుపవనాల కంటే ముందే నగరంలో వర్షపు నీటి పారుదల పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మందకొడిగా సాగుతున్న పనులను వేగవంతం చేస్తామన్నారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. చైన్నె నగర హరిత ప్రాజెక్టు ద్వారా పార్కులు, ఆట స్థలాలను అభివృద్ధి చేస్తామని వివరించారు. అమ్మ క్యాంటీన్ల నాణ్యత పెంపు ముఖ్యమంత్రి విజయ్ ఆదేశాల మేరకు అమ్మ క్యాంటీన్లలో ఆహార నాణ్యతను మెరుగుపరచడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. రాత్రి వేళల్లో తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నానని చెప్పారు. ఒక తనిఖీలో ఓ చోట కుక్కర్ లేదని తెలియడంతో మరుసటి రోజే కొనుగోలు చేయించామన్నారు. క్యాంటీన్లలో వంటకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామనివివరించారు.. ప్రస్తుతం ప్యాక్ చేసిన ఆహారం కాకుండా, అక్కడికక్కడే తాజా ఆహారాన్ని తయారు చేసి అందించేలా అధికారులకు రోజూవారీ తనిఖీలు నిర్వహించాలని సూచించామన్నారు. -
డీఎంకే కూటమిని కాపాడే శక్తి నాకు లేదు!
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకే నేతృత్వంలోని కూటమిని కాపాడే అంతటి బలం, శక్తి నాకు లేవు అని వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, అనివార్య పరిస్థితుల వల్లే తాము టీవీకే ప్రభుత్వంలో భాగస్వామ్య నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్కు కూడా బాగా తెలుసనని పేర్కొన్నారు. వివరాలు.. తమిళనాడులో సరికొత్త రాజకీయ సమీకరణాలు మారుతున్న సమయంలో శనివారం తిరుమావళవన్ మీడియాతో మాట్లాడారు. టీవీకే కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం, డీఎంకేతో బంధంపై ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పదవులపై ఆశతో కాదు.. కాలం తెచ్చిన మార్పు తమ పార్టీ తీసుకున్న నిర్ణయం వెనుక ఎలాంటి పదవీ కాంక్ష లేదని తిరుమావళవన్ స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వ మంత్రివర్గంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ , వీసీకే పార్టీలు చేరాలని టీవీకే అధినేత నుంచి ఆహ్వానం అందిందన్నారు. దీనిపై తమ పార్టీ శ్రేణులు, కీలక నేతలతో సుదీర్ఘంగా చర్చించామని, ఈ నెల 8న జరిగిన పార్టీ ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో మెజారిటీ సభ్యులు మంత్రివర్గంలో చేరడమే సరైన నిర్ణయమని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు గుర్తు చేశారు. తనను కూడా వ్యక్తిగతంగా మంత్రి పదవి చేపట్టాలని ఒత్తిడి వచ్చినప్పటికీ, తాను దానికి అంగీకరించలేదన్నారు. చివరకు పార్టీ తరపున వన్నియరసును మంత్రి పదవికి సిఫార్సు చేయాలని తుది నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇది పదవుల కోసం చేసిన పని కాదని, ప్రస్తుత తమిళనాడు రాజకీయ సంక్షోభం దృష్ట్యా తీసుకున్న అనివార్య నిర్ణయంగా అభివర్ణించారు. కూటమి విచ్ఛిన్నంకు కుట్ర డీఎంకే కూటమిని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరిగాయని, ఎన్నికలకు ముందు కూటమిని కాపాడటానికి తాను శతవిధాలా ప్రయత్నించినట్లు తిరుమావళవన్ వివరించారు. ఎన్నికల సమయంలో ఎవరితో ప్రయాణించాలనేది ఆయా పార్టీల వ్యూహాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్నికలకు ముందు డీఎంకే నేతృత్వంలోని లౌకిక కూటమి బలంగా ఉండాలని తాను గట్టిగా నిలబడ్డాననని పేర్కొన్నారు. తనను ఏ ఒక ట్రంప్ కార్డ్గా వాడుకుని డీఎంకే కూటమిని ము క్కలు చేయడానికి పలు శక్తులు, కుల–మత సంస్థలు తీవ్రంగా ప్రయత్నించాయని తెలిపారు. తనను రెచ్చ గొట్టాలని చూశాయని, అయితే, ఎక్కడా లొంగకుండా కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. నాకు శక్తి లేదు ఎన్నికల తర్వాత ఈ కూటమిని కాపాడే శక్తి తనకు లేదన్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని గానీ, లెఫ్ట్ (కమ్యూనిస్టు) పార్టీలు తీసుకున్న నిర్ణయాలను గానీ అడ్డుకునే బలం కూడా తనకు లేదన్నారు. ప్రస్తుతం తమిళనాడు ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనను కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తిరుమావళవన్ స్టాలిన్ రాజకీయ పరిణతికి నిదర్శనం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాకుండా అడ్డుకోవడానికే తాము కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చినట్టు తిరుమావళవన్ వెల్లడించారు. ఒక పార్టీని స్థాపించి, దానిని పదేళ్లపాటు క్రమశిక్షణతో నడపడం అంత తేలికై న విషయం కాదన్నారు. తమ కూటమి నాయకుడు ఎంకే స్టాలిన్ దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్లామన్నారు. ఆయన ఆశీస్సులు, సమ్మతితోనే తాము కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ప్రకటించామన్నారు. ‘మీరు ఈ నిర్ణయం తీసుకోకూడదు’ అని అన్నా.. స్టాలిన్ ఎక్కడా మమ్మల్ని అడ్డుకోలేదని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని, ఆయన ఎంతో పరిణతితో వ్యవహరించారని వివరించారు. మనం ఐక్యంగా ముందుకు సాగుదాం, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మనం అడ్డంకిగా మారాల్సిన అవసరం లేదు.. అని స్టాలిన్ చెప్పారని గుర్తు చేశారు. ఇది ఆయన రాజకీయ పరిణతికి, హుందాతనానికి నిదర్శనంగా అభివర్ణించారు. చివరగా, వీసీకే ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు సోషల్ మీడియా వేదికగా తనపై, తన రాజకీయ సమగ్రతపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి విమర్శలను తాము అస్సలు ఖాతరు చేయబోమని తిరుమావళవన్ ఘాటుగా సమాధానమిచ్చారు. -
ప్రత్యక్ష పర్యవేక్షణలో.. ఆలయాలు
సాక్షి, చైన్నె : తమిళనాడులోని ఆలయాలన్నింటినీ ఇకపై మైక్రో మేనేజ్మెంట్ (సూక్ష్మ స్థాయి పర్యవేక్షణ) పద్ధతి ద్వారా తన ప్రత్యక్ష పర్యవేక్షణలోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ మంత్రి ఎస్. రమేష్ ప్రకటించారు. వివరాలు.. తిరుచ్చిలోని భారతీదాసన్ రోడ్డులో ఉన్న ప్రముఖ చారిత్రక చక్రవర్తి పెరుంబిడుగు ముత్తరైయర్ జయంతి ఉత్సవాల్లో శనివారం మంత్రి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముత్తరైయర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రవిశంకర్, పట్టణ గృహనిర్మాణ అభివృద్ధి బోర్డు అధ్యక్షుడు కూపా కృష్ణన్, జిల్లా కలెక్టర్ శరవణన్, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ మధుబాలన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి రమేష్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మా సిద్ధాంతం లౌకిక సామాజిక న్యాయం మతం, కులం, డబ్బు, భాష, లింగం అనే ఎలాంటి వివక్ష లేని సమాజ స్థాపనే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. తమ పార్టీ అధినేత విజయ్ ముందుంచిన లౌకిక సామాజిక న్యాయ సిద్ధాంతమే తమ విధానం అన్నారు. ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ను తమ సిద్ధాంత నాయకులుగా అంగీకరిస్తూ, ఆ ఆశయాలను గుండెల్లో నింపుకుని ప్రజాసేవలో ముందుకు సాగుతున్నామరన్నారు. డబ్బు, కులం చూసి పదవి ఇవ్వలేదు తమ నాయకుడు (విజయ్) తమ పదవులు ఇచ్చింది కులమో, డబ్బో చూసి కాదన్నారు. ప్రజలకు సేవ చేయాలనే గుణాన్ని చూసి మాత్రమే ఈ అవకాశం కల్పించారన్నారు. ఇక్కడ కులాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, ప్రజల కోసం సేవ చేయాలనే సంకల్పాన్ని మాత్రమే చూడాలన్నారు. ప్రజలంతా తమ అధినేతను చూసి ఓటేశారు తప్పతమ ముఖాలు చూసి కాదన్నారు. సినిమా తెరపై విజయ్ని చూసేటప్పుడు ఎవరూ కులమతాలు చూడలేదని, రాజకీయాల్లోనూ ప్రజలు మమ్మల్ని అలాగే చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆలయాల ఆస్తుల రక్షణ – అవినీతిపై ఉక్కుపాదం దేవాదాయ శాఖ పరిధిలో ఎలాంటి అవినీతిని సహించేది లేదని మంత్రి రమేష్ హెచ్చరించారు. ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ఎవరూ కూడా అవినీతికి పాల్పడటానికి లేదా అధికార దుర్వినియోగానికి ఒడిగట్టడానికి వీల్లేదన్నారు. మైక్రో మేనేజ్మెంట్ విధానం ద్వారా ప్రతి చిన్న విషయాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. ఇప్పటివరకు ఆలయాల్లో ఎలాంటి అక్రమాలు జరిగి ఉంటే వాటన్నింటినీ సరిదిద్ది, దేవాదాయ శాఖను ఒక ఆదర్శవంతమైన శాఖగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఆలయాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ప్రశాంతమైన మనసుతో స్వామివారిని దర్శించుకుని వెళ్లేలా రద్దీ నియంత్రణ చర్యలు చేపడుతామన్నారు. సుదీర్ఘ సమయం క్యూలైన్లలో వేచి ఉండే పరిస్థితిని తగ్గిస్తామన్నారు. అలాగే ఆలయాలకు సంబంధించిన భూములు, ఆస్తుల ఆక్రమణలపై నిరంతరం సమీక్షలు జరిపి, ఆక్రమిత భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తామని వివరించారు. మందుగా శ్రీరంగం, తిరువానైకోవల్ ప్రాంతాల్లోని భూగర్భ (అడిమనై) భూ వివాదాలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి అంగీకరించారు. ఈ సమస్య పరిష్కారానికి గానూ అధికారులతో చర్చిస్తున్నట్టు వివరించారు. -
తిరువలంగాడులో ఘనంగా జాతర
తిరుత్తణి: తిరువలంగాడులోని అంబేడ్కర్ నగర్లో ఏటా మందవెళి అమ్మన్ జాతర వేడుకలు కోలాహలంగా నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటూ నిర్వహించే జాతర వేడుకలు సందర్భంగా శుక్రవారం భక్తులు కంకణాలు ధరించారు. శనివారం 301 మంది మహిళలు పాల్గొన్న పాల బిందెల ఊరేగింపు చేపట్టారు. పాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం పుష్పాలతో అమ్మవారిని అలంకరించి మహాదీపారాధన పూజలు చేపట్టి దర్శించుకున్నారు. సాయంత్రం మహిళలు దీప పూజలు చేపట్టారు. వేడుకలు సందర్భంగా అమ్మవారి ఆలయంతో గ్రామ వీధులు విద్యుదీపాలతో అందంగా ముస్తాబు చేసారు. -
మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్పై ఈడీ దృష్టి
ప్రభుత్వానికి లేఖ సాక్షి, చైన్నె: తమిళనాడులో అవినీతి కేసుల దర్యాప్తు వేగం పుంజుకుంటోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై డీఎంకే మాజీ మంత్రి, తిరుచెందూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తమిళనాడు ప్రభుత్వానికి శనివారం అధికారికంగా లేఖ రాసింది. ఇప్పటికే మరో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీపై దర్యాప్తునకు అనుమతి కోరిన ఈడీ, తాజాగా అనితా రాధాకృష్ణన్ పేరును కూడా చేర్చడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కేసు నేపథ్యం ఇదీ.. 2001 నుండి 2006 వరకు మంత్రిగా పనిచేసిన కాలంలో అనితా రాధాకృష్ణన్ తన ఆర్థిక వనరులకు మించి రూ. 2 కోట్ల, 7 లక్షల, 96 వేల, 384 విలువైన ఆస్తులను అక్రమంగా కూడబెట్టారని అవినీతి నిరోధక శాఖ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అనితా రాధాకృష్ణన్, ఆయన కుటుంబ సభ్యులపై విడిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. కోర్టులో బదిలీ వివాదం ఈ కేసు ప్రస్తుతం తూత్తుకుడి ప్రత్యేక న్యాయస్థానంలో విచారణలో ఉంది. అయితే, ఈ ఆస్తుల సమీకరణ కేసును మదురైలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం కేసుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను తూత్తుకుడి కోర్టు గత ఏడాది డిసెంబర్ 11న తిరస్కరించింది. దీనిపై ఈడీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. కేసును మదురై ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయడన్ల్ల ప్రాసిక్యూషన్కు ఎలాంటి నష్టం వాటిల్లదని. ఎన్ఫోర్స్మెంట్ శాఖ కేసుల విచారణ కోర్టుకు ఇతర అవినీతి కేసులను కూడా విచారించే అధికారం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి విచారణ కోసం తమిళనాడు ప్రభుత్వ అనుమతి కోరుతూ ఈడీ లేఖ రాయడం గమనార్హం. -
విజయ్ ఖాతాలోకి మొదటి ఎంపీ స్థానం
సాక్షి, చెన్నై : తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు సి.వి. షణ్ముగం తన పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీ స్థానానికి జూన్ 18న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మెల్యే పదవి కోసం రాజీనామా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సి.వి.షణ్ముగం మైలం నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకే సమయంలో అటు ఎమ్మెల్యేగా, ఇటు రాజ్యసభ ఎంపీగా రెండు పదవుల్లో కొనసాగలేరన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన మే 7వ తేదీన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సి.పి.రాధాకృష్ణకు వ్యక్తిగతంగా సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించి, ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించడంతో ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నికకు చర్యలు తీసుకుంది. ఉప ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో జూన్ 1 నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 8గా పేర్కొన్నారు. 9వ తేదీ పరిశీలన, 11వ తేదీన ఉపసంహరణ ప్రక్రియలు జరగనున్నాయి. పోలింగ్: జూన్ 18 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు) జరగనుంది. ఓట్ల లెక్కింపు – ఫలితాల ప్రకటన అదే రోజు సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమై ప్రకటిస్తారు. సాధారణంగా రాజ్యసభ ఎంపీల పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది. అయితే, ఇది ఉప ఎన్నిక (మధ్యంతర ఎన్నిక) కావడంతో, ఇప్పుడు ఎన్నికయ్యే కొత్త ఎంపీ సి.వి. షణ్ముగం మిగిలిన పదవీకాలమైన జూన్ 29, 2028 వరకు మాత్రమే ఎగువ సభలో కొనసాగతారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. టీవీకే ఖాతాలోకి మొదటి ఎంపీ స్థానం రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారన్న విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమికి అత్యధిక సంఖ్యాబలం (ఎమ్మెల్యేల మెజారిటీ) ఉంది. ఈ దృష్ట్యా ఉప ఎన్నికలో టీవీకే నిలబెట్టే అభ్యర్థి విజయం సాధించడం నల్లేరుపై నడకే కానుంది. దీని ద్వారా తమిళనాడులో సరికొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్ పార్టీ, ఢిల్లీలోని రాజ్యసభలోనూ అడుగుపెట్టి తన ఉనికిని చాటనుంది. ఈ స్థానానికి టీవీకే తరఫున రాజ్యసభకు వెళ్లే ఆ అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, విజయ్ సన్నిహితుడైన ప్రవీణ్ చక్రవర్తి రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్టు తెలిసింది. -
సోషల్ మీడియాలో రచ్చ.. స్టాలిన్ హెచ్చరిక
సాక్షి, చైన్నె: వీసీకే, ఐయూఎంఎల్లు టీవీకే కూటమి ప్రభుత్వంలో చేరడంపై డీఎంకే శ్రేణులు ఎవరూ కఠిన పదజాలంతో విమర్శలు చేయవద్దని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. తమిళనాడు నూతన మంత్రులుగా ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేసిన వీసీకే ఎమ్మెల్యే వన్నియరసు, ఐయూఎంఎల్ ఎమ్మెల్యే షాజహాన్న్లకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, డీఎంకే కూటమిని వీడి వీసీకే, ఐయూఎంఎల్లు టీవీకే ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం డీఎంకే వర్గాలలో ఆగ్రహాన్ని రేపాయి. టీవీకే కేబినెట్లో వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు చేరుతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే డీఎంకే ఎంపీ ఎ.రాజా ఒక వివాదాస్పద ట్వీట్ చేశారు. ఇందులో పైకి ఎదగడానికి నిచ్చెనగా ఉపయోగపడిన వారు, సమాజంలోని మూఢత్వాన్ని, కుల వివక్షను అంతమొందించాల్సిన ’చిరుత పులులు’ (వీసీకే పార్టీ చిహ్నాన్ని ఉద్దేశించి), కేవలం ఒక విజిల్’ శబ్దానికి లొంగిపోయి మద్దతు ఇస్తున్నాయంటే, పెళ్లి చేసుకున్న భర్తను పక్కనబెట్టి, వేరే చోటు వెతుక్కున్నట్లే..పెరియార్ సిద్ధాంతాల ప్రకారం సరైన సమయం కోసం వేచి చూద్దాం, కానీ పోరాడుతూనే ఉంటాం. విజయం మనదే అని వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతమైన ఆగ్రహానికి దారితీసింది. అత్యంత అభ్యంతరకరమైన పదజాలంతో ఈ ట్వీట్ ఉందంటూ నెటిజన్లు, ఇతర రాజకీయ నాయకులు రాజాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివాదం ముదరడంతో ఆయన ఆ పోస్ట్ను వెంటనే తొలగించారు. ఆయన మరో ట్వీట్ చేస్తూ ‘నా ఇంటి పెరట్లోని కొబ్బరి చెట్టు అవతలి వైపునకు వంగి, ఎదురింటి వారికి కొబ్బరి నీళ్లు అందిస్తే... సాహిత్యంలో దాన్ని ముడత్తెంగు’ (వంగిన కొబ్బరి చెట్టు) అంటారు! కానీ రాజకీయాల్లో దీనికి ఏం పేరు పెట్టాలి? వర్ధిల్లాలి తమిళం అని పేర్కొన్నారు. ఈ రెండో ట్వీట్ కూడా ప్రస్తుతం తీవ్ర విమర్శలకు గురవుతోంది. రాజా చేసిన ఈ రెండు వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతను చూపిస్తున్నాయని విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేసే పనిలో పడ్డారు. తొలి ఆ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో డీఎంకే తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అదే సమయంలో డీఎంకే, వీసీకే వర్గాల మధ్యమాటల తూటాలు పేలడం ఉధృతమైన నేపథ్యంలోనే, పరిస్థితి మరింత చేయి దాటకుండా ఉండేందుకు డీఎంకే అధినేత స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆ రెండు పార్టీలను సిద్ధాంత మిత్రులుగా అభివర్ణిస్తూ, తమ పార్టీ శ్రేణులకు సంయమనం హెచ్చరిక జారీ చేశారు.స్టాలిన్ ట్వీట్లో హెచ్చరికలుఈ మేరకు స్టాలిన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ను పంచుకున్నారు. ‘మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన మన సిద్ధాంతపరమైన మిత్రులు వన్నియరసు, షాజహాన్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. తమ రాజకీయ నిర్ణయాలను తామే నిర్దేశించుకునే హక్కు ఏ రాజకీయ పార్టీకై నా ఉంటుందని, కాబట్టి డీఎంకే కార్యకర్తలు, నాయకులు ఎవరూ కూడా ఈ తరుణంలో ఇతరులను నొప్పించేలా, బాధించేలా కఠినమైన మాటలు మాట్లాడకూడదని విజ్ఞప్తిచేశారు. మంచిని అభినందిస్తూ, లోపాలను ఎత్తిచూపే ఒక బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మనం పనిచేద్దాం’ అని స్టాలిన్ పేర్కొన్నారు. -
హామీని నిలబెట్టుకున్న విజయ్.. వచ్చే వారం ఢిల్లీకి సీఎం
సాక్షి, చైన్నె: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా, ప్రభుత్వానికి, రాజకీయ వ్యవహారాలకు సంబంధించి తనకు సలహాలు అందించేందుకు ఇద్దరు ప్రత్యేక సలహాదారులను నియమించారు. వీరిలో ఒకరు ప్రముఖ జాతీయ రాజకీయ వ్యూహకర్త జాన్ ఆరోగ్యస్వామి ఉన్నారు. సీఎం విజయ్ తన రాజకీయ సలహాదారుగా ఆయన్ను నియమించుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం గెలుపు వ్యూహాల్లో ఈయన కీలక పాత్ర పోషించారు. ప్రముఖ సలహాదారు విష్ణు రెడ్డిని ఇతర ప్రభుత్వ, పాలనాపరమైన విషయాల కోసం సలహాదారుడిగా నియమించుకున్నారు. కాగా, జ్యోతిష్కుడు, టీవీకే అధికార ప్రతినిధి రతన్ పండిట్ను ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారిగా నియమించగా, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆ నియామకాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు నిపుణులను అధికారికంగా రంగంలోకి దిగారు.వచ్చే వారం ఢిల్లీకి సీఎం విజయ్తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ మొదటిసారిగా వచ్చే వారం ఢిల్లీలో పర్యటించనున్నారు. క్యాబినెట్ విస్తరణ ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ఆయన ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాష్ట్ర అభివృద్ధి నిధులు, మేఘాదాతు ఆనకట్ట వివాదంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను కూడా విజయ్ కలవనున్నారు. తమిళనాడు ప్రభుత్వం అందించిన రూ. 65 లక్షల ఆర్థిక సహాయంతో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన తిరువళ్లువర్’ విగ్రహాన్ని సీఎం విజయ్ ఆవిష్కరించనున్నారు. అలాగే జూన్ 11న ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఆయన హాజరుకానున్నారు.సీఎంఓ ప్రత్యేక ఈ–మెయిల్ ఐడీలు విడుదలముఖ్యమంత్రి విజయ్ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే ప్రజల వినతిపత్రాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు సచివాలయానికి రాకుండానే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించేందుకు అధికారిక ఈ–మెయిల్ ఐడీలను ప్రభుత్వం విడుదల చేసింది.హామీని నిలబెట్టుకున్నసీఎం విజయ్చెప్పింది చేస్తాడు.. చేసింది చెబుతాడు’ అనే నినాదంతో సీఎం విజయ్ పెట్టిన సోషల్ మీడియా పోస్టులు ప్రస్తుతం తమిళనాడులో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. విక్రవాండిలో జరిగిన టీవీకే మొదటి రాజకీయ మహానాడులో తాము అధికారంలోకి వస్తే మిత్రపక్షాలకు పరిపాలనలో భాగస్వామ్యం (సంకీర్ణ ప్రభుత్వం) కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మాట ఇచ్చినట్లుగానే, తాజాగా వీసీకే నాయకుడు వన్నియరసు, ఐయూఎంఎల్ నాయకుడు షాజహాన్లను క్యాబినెట్ మంత్రులుగా చేర్చుకుని, తమిళనాడు రాజకీయాల్లో ఒకే పార్టీ సర్వాధికారాల సంస్కృతిని మార్చి, సరికొత్త విప్లవాత్మక సంకీర్ణ యుగానికి విజయ్ తెరలేపారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ పోస్టు వైరల్గా మారింది.620 అమ్మ క్యాంటీన్ల’ పునరుద్ధరణకు ఆదేశంపేద ప్రజల ఆకలి తీర్చేందుకు గతంలో ప్రారంభించబడిన అమ్మ క్యాంటీన్లను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. చైన్నె కార్పొరేషన్ పరిధిలోని 383 అమ్మ క్యాంటీన్లు,ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని 237 అమ్మ క్యాంటీన్లను అత్యుత్తమ వసతులతో పునర్నిర్మించి, పేదలకు నిరంతరాయంగా తక్కువ ధరకే ఆహారం అందించాలని సీఎం ఆదేశించారు -
స్టాలిన్-పళనిది కలేనా?
ఆరు దశాబ్దాల తమిళనాడు రాజకీయ చరిత్రలో.. తొలిసారిగా ఏర్పడిన సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఎంతకాలం నిలుస్తుంది?. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ కొలువుదీరి రెండు వారాలు గడవక ముందే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకేలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు అంటూ ప్రకటలు చేస్తున్నాయి. వీటిపై టీవీకే స్పందించింది. “మాకు అధికార అనుభవం తక్కువ కావొచ్చు.. కానీ సిద్ధాంతాల విషయంలో మా నిబద్ధత చాలా బలంగా ఉంది” అంటూ ఘాటు బదులే ఇస్తోంది. ఇంతకాలం డీఎంకే, అన్నాడీఎంకేలు ద్రవిడ సిద్ధాంతం పేరు చెప్పుకుని ప్రజలను మభ్యపెట్టాయని.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని టీవీకే నేత, తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి అరుణ్రాజ్ ఆరోపించారు. అయితే.. విజయ్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం “సామాజిక న్యాయం, లౌకికవాదం, రాష్ట్ర హక్కుల పరిరక్షణ” అనే ఉమ్మడి సిద్ధాంతాలపై ఏర్పడిందని, కాబట్టి ఆ ఆలోచనలే ఉండబోవని చెప్పారాయన. చెన్నైలో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణమైనా కుప్పకూలుతుందన్న ప్రతిపక్షాలకు కౌంటర్ కూడా ఇచ్చారు. డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు వ్యవస్థను ఎలా ఉపయోగించుకోవాలో, అవినీతికి ఎలా వాడుకోవాలో బాగా నేర్చుకున్నాయి. అందుకే మాకు ప్రజలు ఓటేసి గెలిపించారు. మా కూటమి సాధారణ రాజకీయ పొత్తు కాదని, సిద్ధాంతాల కలయిక అని స్పష్టం చేశారు. టీవీకే, ఐయూఎంఎల్, వీసీకే కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం బయట నుంచి వామపక్షాల మద్దతుతో కొనసాగుతోంది. మొత్తం 234 స్థానాల అసెంబ్లీలో ఈ కూటమికి 121 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే బయట మద్దతు భవిష్యత్తులో సమస్య అవుతుందన్న వాదనను అరుణ్రాజ్ ఖండించారు. “ప్రజలకు మంచి పాలన అందిస్తే.. ప్రజాదరణ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కాబట్టి ప్రతిపక్షాలది కలే అని చెప్పొచ్చు. ఇక తమిళనాడులో ఇంతకాలం కూటములతో అధికారంలోకి వచ్చినా.. భాగస్వామ్య పార్టీలకు పాలనలో వాటా ఇవ్వలేదు. కానీ మా(టీవీకే పార్టీ) అధినేత విజయ్ మాత్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అధికారాన్ని పంచుకున్నారని చెప్పారు. దీనిని ఆయన “ప్రజాస్వామ్యానికి నిజమైన గౌరవం”గా అభివర్ణించారు. ఈ కారణాల వల్లే మా అధినేత కూడా అదే ధీమాతో ఉన్నారని అరుణ్ చెప్పుకొచ్చారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా టీవీకే ప్రభుత్వం వెనక్కి తగ్గదని అరుణ్రాజ్ స్పష్టం చేశారు. విద్యా నిధుల విడుదల, వన్నేషన్-వన్ ఎలక్షన్, సీఏఏ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. అయితే ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికీ సిద్ధమేనన్నారు.ఆరోగ్యశాఖ మంత్రిగా తన తొలి లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమేనని చెప్పారు. “డబ్బు లేక అప్పులు చేసినా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమ్మకం తగ్గింది. దాన్ని మళ్లీ పెంచాలి” అని అన్నారు.ఇదిలా ఉంటే.. విజయ్ తన కేబినెట్ విస్తరణను కూడా పూర్తి చేశారు. వీసీకే నుంచి ఓ దళిత నేత, ఐయూఎంఎల్ నుంచి మరో నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ‘రెయిన్బో క్యాబినెట్’ను విజయ్ రూపొందించారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
జాప్యం లేకుండా కొనుగోలు చేయాలి
తిరువళ్లూరు: జాప్యం లేకుండా వరికొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం తామరపాక్కం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమానికి సంఘం జిల్లా కార్యదర్శి సంపత్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, గోనె సంచీలు, ధాన్యాన్ని లోడింగ్, అన్లోడింగ్ కోసం వసూలు చేస్తున్న మామూళ్లను వెంటనే కట్టడి చేయాలని, వరిని తూర్పార పట్టడానికి రుసం వసూలు చేయడాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరను కల్పించామని చెబుతూనే 40 కిలోల బ్యాగుకు రూ.60 మేరకు అధికారులు వసూలు చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి రైతుల నుంచి గుంజుతున్న మొత్తాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. దీంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని సైతం డిమాండ్ చేశారు. సంఘం నేతలు రవి, తిరుపతి, శ్రీనివాసన్, రామమూర్తి, సంఘం నేతలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
క్లుప్తంగా
కామెంటేటర్ల కోసం అన్వేషణ సాక్షి, చైన్నె: క్రికెట్పై ఉన్న మక్కువను, అద్భుతమైన గళం, యువత ఆశయాలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ క్యారెట్లేన్ సంస్థ భాగస్వామ్యంతో టైమ్లింక్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘వాయిస్ హంట్ – కామెంటరీ బాక్స్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తర్వాత తరం అత్యుత్తమ క్రికెట్ కామెంటేటర్లను గుర్తించడానికి రూపొందించబడిన ఒక అద్భుతమైన వేదికగా దీనిని ప్రకటించారు. క్రికెట్పై దేశంలో ఉన్న విపరీతమైన క్రేజ్ను నేపథ్యంగా చేసుకుని, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెగా ఈవెంట్కు శుక్రవారం అన్నానగర్లోని తనిష్క్ ప్రాంగణంలో జరిగింది. ఉచిత ప్రత్యేక కామెంటరీ వర్క్షాప్ (శిక్షణ శిబిరం) పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు భారీ నగదు బహుమతులు, యువ ప్రతిభను ప్రోత్సహించడంలో, కేవలం పోటీగా మాత్రమే కాకుండా వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే అనుభవ వేదికలను సృష్టించడం టైమ్లింక్స్ లక్ష్యంగా నిర్వాహకులు ప్రకటించారు. వాయిస్ హంట్ అనేది కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, ఇది స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ (క్రీడా ప్రసారాల) అద్భుతమైన ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఒక ప్రధాన ద్వారం. క్రీడలపై ఉన్న మక్కువ మైక్రోఫోన్న్ను కలిసే వేదిక ఇది, ఇక్కడి నుంచే అద్భుతమైన గొంతులు భవిష్యత్తులో చెరగని గుర్తింపుగా మారుతాయి‘ అని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైక్ – తండ్రీకుమారుడు దుర్మరణం తిరువొత్తియూరు: విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ తండ్రీకుమారుడు మృతిచెందారు. భార్య మరో కుమారుడు సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వండలూర్–మీంజూర్ అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. చైన్నె శివారు నగర్మీంజూర్ ప్రాంతానికి చెందిన సతీష్ (34). ఇతని భార్య రంజని(28), కుమారుడు శైలేష్ (6) ,9 నెలల శిశువు హరిహరన్, బంధువు కీర్తన (16) సహా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే బైక్పై చైన్నె, రెడ్హిల్స్ సమీపం అలమాతిలో జరిగిన ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. వండలూర్, మీంజూర్ బైపాస్ రోడ్డులో వస్తున్న సమయంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో సతీష్, కుమారుడు శై లేస్ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని పోలీసులు చైన్నె స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. టాస్మాక్ ఉద్యోగుల ఆందోళన తిరువళ్లూరు: టాస్మాక్ ఉద్యోగులపై పోలీసులు నమోదు చేస్తున్న అక్రమ కేసులు, ప్రయివేటు వ్యక్తుల బెదిరింపుల నుంచి ఉద్యోగులకు భద్ర త కల్పించాలని కోరుతూ తమిళనాడు టాస్మాక్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి ఐక్యవేదిక ఆద్వర్యంలో శుక్రవారం ఉదయం ఽపెద్దకుప్పంలో ఆందోళన నిర్వహించారు. ఆందోళనకు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనశేఖర్ అద్యక్షత వహించగా, రాష్ట్ర కోశాధికారి గోవిందరాజ్, ఎస్టీ ఎస్సీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నాదురై హాజరై ప్రసంగించారు. ధనశేఖరన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా టాస్మాక్ ఉద్యోగులపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఒక వ్యక్తికి రెండు కంటే ఎక్కువ బాటిళ్లు విక్రయించినట్టు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని, రాత్రి సమయంలో పోలీసుల నుంచి మరింత వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు. తాము షట్టర్ మూసి లోపల లెక్కులు చూస్తున్నా వేధిస్తున్నారని ఆరోపించారు. టీవీకే నేతలు కొందరు సెల్ఫోన్లో వీడియో తీస్తూ తాము ఎంఆర్పీ రేట్లు కంటే ఎక్కువగా విక్రయిస్తున్నట్టు తప్పుడు పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నట్టు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సరికొత్త క్రియేటివ్ క్యాంపెయిన్ ఆవిష్కరణ సాక్షి, చైన్నె : ప్రముఖ డిజిటల్ ఇమేజింగ్ సంస్థలలో ఒకటైన కానన్ ఇండియా ప్రింటింగ్ను కేవలం డాక్యుమెంట్ల ముద్రణకే పరిమితం చేయకుండా, అద్భుతమైన సృజనాత్మకతకు, ఆత్మప్రకటనకు, సరికొత్త ఆలోచనలకు ఒక శక్తివంతమైన ఆయుధంగామలిచే విధంగా సరికొత్త ఇంటిగ్రేటెడ్ క్యాంపెయిన్న్ను ప్రారంభించింది. డిజిటల్ ప్రపంచంలో ప్రతిదీ స్క్రీన్లకే పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఈ క్యాంపెయిన్ ప్రత్యేకతను సంతరించుకున్నట్టు ఆ సంస్థ ఉపాధ్యక్షుడు సుకుమారన్, హవాస్ క్రియేటి వ్ ఇండియా డైరెక్టర్ అనుపమ రామస్వామి ప్రకటించారు. ఇళ్లలో తల్లిదండ్రులు, పిల్లలు కేవలం ఈ–మెయిళ్లు, స్క్రీన్లకు పరిమితం కాకుండా చేతులతో తాకగలిగే, క్రియేటివ్ వర్క్స్ వైపు మోగ్గుచూపే విధంగా ముందుకెళ్తున్నామన్నారు.హావాస్ క్రియేటివ్ ఇండియా పేరిట ఈ క్యాంపెయిన్ సాగనున్నదన్నారు. -
కోలాహలం.. రథోత్సవం
వేలూరు: స్థానిక సత్వచ్చారిలోని రోడ్డు గంగమ్మ రథోత్సవం శుక్రవారం కోలాహలంగా జరిగింది. ముందుగా రోడ్డు గంగమ్మకు ప్రత్యేక శిరస్సు పూజలు నిర్వహించి పుష్పాలంకరణలు చేసిన రథంలో ఆశీనులు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ ఊరేగింపుగా అమ్మవారిని సత్వచ్చారిలోని వీధుల్లోకి తీసుకొచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి రథాన్ని లాగారు. అదే విధంగా రథంపై భక్తులు బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రథాన్ని ఆలయం వద్దకు తీసుకొచ్చి ఆలయంలోని విగ్రహంపై శిరస్సును ఉంచి ప్రత్యేక పుష్పలంకరణలు నిర్వహించారు. భక్తులు పొంగళ్లు పెట్టి వివిధ వేషాలు దరించి అమ్మవారికి అంబలి, పట్టు వస్త్రాలను సమర్పించారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి
వేలూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అఽధికారులను ఆదేశించారు. వేలూరు కలెక్టరేట్లో జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష, వేలూరు జిల్లాలో నూతనంగా ఎంపికై న ఎమ్మెల్యేల పరిచయ కార్యక్రమం కలెక్టర్ అద్యక్షతన జరిగింది. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం నూతనంగా ఎంపికై న ఎమ్మెల్యేలు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సంక్షేమ పథకాలు జిల్లాలోని అర్హులందరికీ అందేలా అన్ని శాఖల అధికారులతో పాటు ఎమ్మెల్యేలు కూడా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఒ శివసుబ్రమణ్యం, సబ్ కలెక్టర్ సెంథిల్కుమార్, అదనపు ఎస్పీ పయణి, ఎమ్మెల్యేలు సుధాకర్, వినోద్కన్నన్, తెండ్రల్కుమార్, వేలయగన్, సింధు తదితరులు పాల్గొన్నారు. -
12న తెరపైకి చారుకేశి
తమిళసినిమా: పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన శీను రామస్వామి మంచి రచయిత కూడా. ఈయన పలు కథలను, నవలలను రాశారు. తాజాగా సినిమావిన్ ఆన్మ పేరుతో ఒక పుస్తకం రాశారు. దర్శకుడు శీను రామస్వామి ముఖ్యమంత్రి విజయ్కు ఒక విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో నేను తాజాగా రాసిన సినిమావిన్ ఆన్మ ( సినిమా అప్రిషియేషన్, ఎడ్యుకేషన్, అండ్ ఏ ఫ్యూ మోర్ ఎస్సెస్ ) పుస్తకాన్ని సంధ్య పబ్లికేషన్ సంస్థ ప్రచురణ చేసింది. ఇది నా సినిమా రచనా విద్య. పాఠశాలల్లో స్పోర్ట్స్, చిత్రలేఖనం వంటి ఫైనాన్న్స్ గురించి బోధిస్తున్నా రు. అయితే అందరూ క్రీడాకారులు గానో, చిత్ర లేఖ కళాకారులుగానో మారడం లేదు. మనలో నరనరాల్లో ఇమిడిపోయిన సినిమా గురించి సరైన అవగాహన కలిగించే తరగతులు లేవు. ముఖ్యంగా ఈతరం పిల్లలు ఎక్కువగా సెల్ఫోన్లతోనే ఉంటున్నారు. అలాంటి వారికి మంచి సినిమా ఏది అని తెలియజేయడం మన బాధ్యత. పిల్లలకు చిన్నతనంలోనే మంచి కథాంశం కలిగిన చిత్రాలను చూపించి వాళ్లలో సినిమా రచనా విద్య ముఖ్యమనే భావనను పెంపొందించాలనే బాధ్యత తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మనకు ఉంది. అలా పిల్లలకు చూపించాలనే సినిమావిన్ ఆన్మ పుస్తకాన్ని నేను రాశాను. సినిమా రచన విద్యను ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి విద్యార్థుల వరకు ఎలా నేర్పించాలి అని చెప్పే పుస్తకం. ఇది ఉపాధ్యాయులు, సినిమా విద్యార్థులు.యువత కోసం పుస్తకం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం అని పేర్కొన్నారు. తమిళసినిమా: వైజీ మహేంద్రన్, సత్యరాజ్, సముద్రఖని, తలైవాసల్ విజయ్, సుహాసిని మణిరత్నం, రమ్యా పాండియన్, రాజ్ అయ్యప్ప, మధువంతి అరుణ్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం చారుకేశి. దీన్ని వైజీ.మహేంద్రన్ నటించి ప్రాచుర్యం పొందిన నాటకాన్ని చిత్రంగా వెండి తెరపై ఆవిష్కరించారు అన్నది గమనార్హం. దర్శకుడు సురేష్కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవా సంగీతాన్ని అందించారు. అరుణ్ విజువల్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ఈ5 ఎంటర్టెయిన్మెంట్ సంస్థ అధినేత జే.జయకృష్ణన్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. చిత్ర ఆడియో, ట్రైలర్ను రజనీకాంత్ గురువారం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక వర్గంతో పనిచేయడం సంతోషకరమని చిత్ర దర్శకుడు సురేష్కృష్ణ పేర్కొన్నారు. బలమైన కథ, చక్కని అనుబంధాలు, మనసులో నిలిచి పోయే సంగీతం, అత్యుత్తమ కళాకారుల నటనా ప్రతిభ కలిగిన ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన థియేటర్ అనుభూతిని కలిగిస్తుందని సురేష్కృష్ణ తెలిపారు. ఆయన అని తెలియగానే సంతోసించా! సినిమాను విద్యగా మార్చండి -
పుష్ప ప్రదర్శన అదుర్స్!
సేలం : సేలం జిల్లా ఏర్కాడులోని అన్నాపార్క్లో 49వ వేసవి ఉత్సవం, పుష్ప ప్రదర్శనను జిల్లా కలెక్టర్ కె. ఇలంబగవత్, ఏర్కాడ్ ఎమ్మెల్యే పి.ఉషారాణి, సేలం వెస్ట్ ఎమ్మెల్యే లక్ష్మణ్, వీరపాండి ఎమ్మెల్యే ఎం.ఎస్. పళనివేల్ ప్రారంభించి సందర్శించారు. ఏర్కాడులో 49వ ఏర్కాడ్ వేసవి ఉత్సవం, పుష్ప ప్రదర్శన శుక్రవారం నుంచి గురువారం వరకు 7 రోజుల పాటు జరగనుంది. ఉద్యానవన శాఖ తరపున, అన్నా పార్క్ వ్యవసాయాన్ని పరిరక్షించడం, ప్రపంచానికి ఆహారం అందించడం అనే ఆలోచనను తెలియజేయడానికి, 90వేల గులాబీ రేకులతో ఒక సమీకృత వ్యవసాయ క్షేత్రాన్ని రూపొందించారు. ఇందులో తన ఆవులతో దున్నే రైతు, దూడతో ఉన్న పాడి ఆవు, ఒక మేక, ఒక కోడిపుంజు, ఒక కోడి, ఒక కుందేలు, ఒక బాతు, ఒక తేనెపట్టు, ఒక వ్యవసాయ గృహం పుష్పాలతో చిత్రీకరించారు. 45వేల గులాబీలతో టెడ్డీ బేర్ను వాస్తవికంగా రూపొందించారు. దేవకన్య పువ్వు బొమ్మను, భరతనాట్యం చేస్తున్న అమ్మాయిలను, ప్లూటో, గూఫీ అనే కార్టూన్ పాత్రలను పుష్పాలతో చేశారు. అలా వివిధ రూపాల్లో రూపొందించారు. రాత్రిపూట పార్కు లోపల అలంకార విద్యుద్దీపాల టవర్లను ఏర్పాటు చేశారు. అలాగే, ఉద్యానవనంలో పండ్లు, కూరగాయలు, పువ్వులు, ధాన్యపు పంటల నమూనాలను ప్రదర్శించారు. అదేవిధంగా, పర్యాటకులను ఆకర్షించడానికి వివిధ రకాల రంగురంగుల పువ్వులతో కూడిన 30వేలకు పైగా అలంకార పూల కుండీలను ప్రదర్శించారు. దీనికి అదనంగా, పూంపుహార్, ఆవిన్, పట్టు అభివృద్ధి శాఖ, పర్యాటక శాఖలు సహా అన్ని విభాగాలతో అమలు చేస్తున్న ప్రాజెక్టుల గురించి ప్రజలకు, పర్యాటకులకు తెలియజేయడానికి ప్రదర్శనశాలలు, భోజనశాలలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఒక్కరోజే 1.50లక్షల మంది పర్యాటకులు సందర్శించారని అధికారులు తెలిపారు. -
ఒప్పందం
సాక్షి,చైన్నె : విద్య, పారిశ్రామిక రంగానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించి, విద్యార్థులకు ఆచరణాత్మకమైన కార్పొరేట్ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఎస్ఆర్ఎమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్న్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ఎస్ఆర్ఎమ్ స్కూల్ ఆఫ్ లా, ప్రముఖ సెమీకండక్టర్ డిజైన్ సంస్థ టెస్సోల్వ్ సెమీకండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది. ఎస్ఆర్ఎమ్ఐఎస్టీ ప్రో విసి–లా డాక్టర్ వైఎస్ఆర్ మూర్తి, టెస్సోల్వ్ కో–ఫౌండర్ , ప్రెసిడెంట్ డాక్టర్ వీరప్పన్ ఈ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. -
కలెక్టరేట్ ఎదుట క్షుద్రపూజలు
వేలూరు: రాణిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట నల్ల దుస్తులతో కూడిన కోడి గుడ్డు, కొత్త దుత్త తదితర వాటిని ధ్వంసం చేసి క్షుద్రపూజలు చేసిన సంఘటన సంచలనం రేపింది. రాణిపేట జిల్లా సిప్కాట్లోని భారతినగర్లో కలెక్టర్ కార్యాలయం నడుస్తోంది. అయితే కలెక్టరేట్ ముఖ ద్వారంలోనే పోలీసులు 24 గంటలపాటు బందోబస్తులో ఉంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని ముఖ ద్వారం ఎదుట కోడి గుడ్డు, పసుపు, కుంకుమ, కొత్త దుత్త, నల్ల దుస్తులను ధ్వంసం చేసి ఉన్నారు. మరో కొత్త దుత్తలో పైన మాత్రం పగలగొట్టి కింద అడుగు భాగంలో నీటిని ఉంచారు. వీటిని గమనించిన కలెక్టరేట్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో క్షుద్రపూజలు చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కలెక్టరేట్ ఎదుట సీసీటీవీ కెమోరాలో ఏమైనా నమోదు అయిందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. -
తిరుత్తణిలో 24 గంటల విద్యుత్ కోత
తిరుత్తణి: తిరుత్తణి పట్టణంలో 24 గంటల విద్యుత్ కోతకు నిరసనగా పట్టణ ప్రజలు రాస్తారోకో చేపట్టి తమ నిరసన తెలిపారు. తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులు వీచి బీభత్సం సృష్టిచడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పట్టణంతోపాటు పలు గ్రామాల్లో గురువారం రాత్రంతా విద్యుత్ సేవల్లో అంతరాయం చోటుచేసుకోవడంతో ప్రజలు చిమ్మచీకట్లో ఉక్కపోత నడుమ నిద్రలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది రాత్రంతా పనిచేసి చెట్లు తొలగించి తెగిన విద్యుత్ తీగలు, స్తంభాలు మార్చి తెల్లవారుజామున అనేక ప్రాంతాలకు విద్యుత్ సేవలను పునరుద్ధరించారు. అయితే తిరుత్తణి మున్సిపాలిటీలోని కుమారకుప్పం, పాపిరెడ్డిపల్లె ప్రాంతాల్లో మాత్రం 24 గంటల గడిచినా విద్యుత్ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో ఆ ప్రాంతం ప్రజలు శుక్రవారం సాయంత్రం రాస్తారోకో చేపట్టారు. దీంతో తిరుత్తణి చిత్తూరు రాష్ట్ర రహదారిలో రాకపోకలు స్తంభించాయి. అలాగే తిరువలంగాడు ఆర్కేపేటలోని కృష్ణకుప్పం మేడు ప్రాంతాల్లో 24 గంటల పాటు విద్యుత్ కోతలతో ఆందోళన చెందిన జనం రాస్తారోకో చేపట్టి తమ నిరసన తెలిపారు. -
చైల్డ్ట్రస్ట్లో జనరల్ వార్డ్ పునరుద్ధరణ
సాక్షి, చైన్నె: పిల్లల ఆసుపత్రులలో ఒకటైన చైన్నెలోని కంచి కామకోటి చైల్డ్ట్రస్ట్ హాస్పిటల్లో అత్యాధునికంగా పునరుద్ధరించిన జనరల్ వార్డ్ను శుక్రవారం ప్రారంభించారు. హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా ఈ వార్డ్ ఆధునీకరణకు పూర్తి ఆర్థిక సహాయం అందించింది. ఈ నూతన జనరల్ వార్డ్ను హెచ్డీఎఫ్సీ ఏఎంసీ మానవ వనరుల విభాగం అధిపతి ఆలోక్ షియోపుర్కర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ట్రస్టీలు, ప్రముఖ వైద్యులు, సిబ్బంది, ఆహ్వానితులు పాల్గొన్నారు. సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన ఈ పునరుద్ధరణ ప్రాజెక్ట్ ద్వారా పాత జనరల్ వార్డ్ను పిల్లలకు నచ్చేలా, ఎంతో ఆహ్లాదకరంగా, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా, రోగులకు అనుకూలమైన వైద్య వాతావరణంగా తీర్చిదిద్దారు. మొత్తం 34 పడకల సామర్థ్యం ఉన్న ఈ జనరల్ వార్డు ఈ ఆసుపత్రిలోనే అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన ఇన్పేషెంట్ వసతిగా ప్రకటించారు. తమిళనాడుతోపాటు పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే ఆర్థికంగా వెనుకబడిన, పేద కుటుంబాల పిల్లలకు ఈ వార్డ్ ఎంతో ఆసరాగా నిలుస్తోందని వివరించారు. ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జనని శంకర్, ఫండ్రైజింగ్ హెడ్ శంకర్ రమణి తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. -
బాలమురుగన్ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేలూరు: రాణిపేట జిల్లా రత్నగిరి గ్రామంలో వెలసిన బాలమురుగన్ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ శివాచార్యుల వేద మంత్రాల నడుమ ఆలయంలోని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ధ్వంజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఆలయ బాలమురుగన్ అడిమై స్వామిజీ అధక్షతన శివాచార్యులు ధ్వజాస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి పుష్పాలతో అలంకరించారు. అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు పది రోజుల పాటు జరగనున్నాయి. ఈనెల 30న రథోత్సవం, జూన్1న స్వామి వారికి తీర్థవారి నిర్వహించి బ్రహ్మోత్సవాలను ముగించనున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి పరంధామకణ్ణన్, ఆలయ ప్రధాన అర్చకులు కేఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. -
విస్తరించిన విజయ్ కేబినెట్
షాజహాన్, వన్నియరసు చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్ అర్లేకర్, చిత్రంలో సీఎం విజయ్ సాక్షి, చైన్నె: రాష్ట్రంలో అధికార మార్పు నేపథ్యంలో డీఎంకేకు కాంగ్రెస్ ఇచ్చిన షాక్ ఇంకా మరవక ముందే తాజాగా అదే బాటలో వీసీకే, ఐయూఎంఎల్లు బంధాన్ని తెంచుకున్నాయి. టీవీకే ప్రభుత్వంతో ఏకమయ్యే విధంగా మంత్రి వర్గంలో ఈ రెండు పార్టీలు శుక్రవారం చేరాయి. దీంతో వీసీకే, ఐయూఎంఎల్లకు చెందిన వన్నియరసు, షాజహాన్ మంత్రులయ్యారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, వీసీకేలు గత పదేళ్లుగా పయనం సాగిస్తూ వస్తుంటే, ఐయూఎంఎల్ మాత్రం కొన్ని దశాబ్దాలుగా బంధాన్ని ముడివేసుకుని ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఈ పార్టీల పయనించినా, తాజాగా అధికార మార్పుతో కొత్త నిర్ణయాలు తీసుకోకతప్పలేదు. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ముందుగా కాంగ్రెస్ అధికారికంగా మద్దతు ఇవ్వగా, బయట నుంచి సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్లు మద్దతు ఇచ్చాయి. అయితే, మంత్రి వర్గంలోకి రావాలన్న టీవీకే ప్రభుత్వ ఆహ్వానానికి వీసీకే, ఐయూఎంఎల్లు స్పందించాయి. దీంతో కాంగ్రెస్ బాటలో వీసీకే, ఐయూఎంఎల్లు డీఎంకేకు కటీఫ్ చేప్పక తప్పలేదు. కూటమి నుంచి బయటకు వచ్చిన ఈ పార్టీలు ప్రభుత్వానికి పూర్తి మద్దతుతో అధికారంలో వాటాను పొందాయి. విజయ్ సంకీర్ణ ప్రభుత్వంలో శుక్రవారం వీసీకే, ఐయూఎంఎల్లు భాగస్వామ్యం కావడం రాజకీయంగా చర్చకు దారి తీసినా, డీఎంకేకు మాత్రం పెద్ద షాక్కే. మంత్రులుగా వన్నియరసు, షాజహన్ సీఎం విజయ్ నేతృత్వంలోని మంత్రివర్గంలో వీసీకే ఎమ్మెల్యే వన్నియరసు, ఐయూఎంఎల్ ఏ.ఎం. షాజహాన్న్ ఉదయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వీరితో పదవీ ప్రమాణ స్వీకారం, రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరికి సీఎం జోసెఫ్ విజయ్ తన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. వన్నియరసు విల్లుపురం జిల్లా దిండివనం నియోజకవర్గం నుంచి, షాజహాన్ తూత్తుకుడి జిల్లా పాపనాశం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరికి శాఖల కేటాయింపు కూడా పూర్తయ్యింది. షాజహాన్న్కు మైనారిటీ సంక్షేమ శాఖ, వన్నియరసుకు సామాజిక న్యాయశాఖ బాధ్యతలను అప్పగించారు. ఈ ఇద్దరి చేరికతో సీఎం విజయ్తో పాటు టీవీకే మంత్రి వర్గం సంఖ్య 35కు చేరింది. అధికారమే అన్ని తాళాలకు మాస్టర్ కీ: వన్నియరసు ఉద్వేగం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుగా వన్నియరసు మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇంతటి పెద్ద బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేత తిరుమావళవన్కు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలోని అన్ని సమస్యల తాళాలను అన్న్లాక్ చేయడానికి అధికారమే ఒక మాస్టర్ కీ అని డాక్టర్ అంబేడ్కర్ చెప్పారని గుర్తుచేశారు. మంత్రిగా ప్రజల ప్రశంసలు అందుకునేలా, అవినీతి రహితంగా, నిజాయితీగా పనిచేస్తానని వన్నియరసు స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వన్నియరసును సచివాలయంలోని చాంబర్లో సీటులో స్వయంగా తిరుమావళవన్ కూర్చోబెట్టారు. అనంతరం సీఎం విజయ్తో తిరుమావళవన్తో పాటు తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు కలిశారు. బుధవారం వరకు తొమ్మిది మంది మంత్రులే సీఎం విజయ్ కేబినెట్లో ఉన్నారు. గురువారం ఈ సంఖ్య పెరిగింది. తమిళగ వెట్రి కళగం పార్టీకి చెందిన శ్రీనాథ్, కమలి, విజయలక్ష్మి, రంజిత్కుమార్, వినోద్, రాజీవ్, రాజ్కుమార్, గాంతిరాజ్, మదన్ రాజా, జగదీశ్వరి, విజయ్ బాలాజీ, లోకేష్ తమిళ్సెల్వన్, విజయ్ తమిళన్ పార్థిబన్, రమేష్, కుమార్, తెన్నరసు, సంపత్కుమార్, ముహమ్మద్ పర్వేజ్, శరత్కుమార్, మరియ విల్సన్, విఘ్నేష్, కాంగ్రెస్కు చెందిన రాజేష్కుమార్, విశ్వనాథన్లతో కూడిన 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు సాయంత్రం వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు కూడా ప్రభుత్వంలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో, ఆ పార్టీలకు చెందిన ఇద్దరికి శుక్రవారం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. సీపీఎం, సీపీఐలు టీవీకే ఆహ్వానాన్ని తిరస్కరించాయి. ఇక, అన్నాడీఎంకేకు చెందిన 25 తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరికీ మంత్రి పదవి కేటాయించ లేదు. -
పుస్తకావిష్కరణ!
సాక్షి,చైన్నె : కంచి కామకోటి పీఠం 68వ జగద్గురు చంద్రశేఖరేంద్రసరస్వతి మహాస్వామి (కంచీ మహాపెరియవ) జీవితంలోని అత్యంత ఆధ్యాత్మిక, చారిత్రాత్మక ఘట్టాలను ఆవిష్కరిస్తూ రూపొందించిన సరికొత్త పుస్తకం యన్ నెంజు నిరయ పుగుందార్: శ్రీ కాంచీ మహా పెరియవాళుమ్ ఏకాంబరమాగియ నానుమ్ (పార్ట్–2) పేరిట చైన్నెలో శుక్రవారం ఈ పుస్తకం ఆవిష్కరించారు. శివ విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైన్నె టి. నగర్లోని వాణీ మహల్లో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మహాస్వామికి అత్యంత సన్నిహితుడు ఏకాంబరం ఈ గ్రంథాన్ని రచించారు. 20వ శతాబ్దపు అత్యంత విశిష్ట ఆధ్యాత్మిక యాత్రను కళ్లకు కట్టేలా ఆయన తన ప్రత్యక్ష అనుభవాలను పంచుకున్నారు. ఈ పుస్తకం ప్రధానంకంచి మహాస్వామి చేసినన సుదీర్ఘ పాదయాత్ర నేపథ్యంగా సాగుతుంది. 84 సంవత్సరాల వయస్సులో కూడా మహాస్వామి కాంచీపురం నుంచి సతారా వరకు 3,860 కిలోమీటర్ల మేర కాలినడకన చేసిన పాదయాత్ర గురించి వివరించారు. ఈ పుస్తకం ఒక సజీవ చారిత్రాత్మక రికార్డు. డాక్టర్ మణిద్రావిడ్ శాస్త్రి (మహామహోపాధ్యాయ – ప్రొఫెసర్), కె. జయరామకృష్ణన్ (పరిశ్రమల రంగ నిపుణులు),కె. చంద్రశేఖరన్ (న్యాయవాది, మద్రాసు హైకోరు), ఎన్. నారాయణన్ (తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్), పి. సురేష్ (ఎండీ, అరుణ్ ఎక్సెల్లో గ్రూప్) పాల్గొన్నారు. -
పోలీస్ కమిషనర్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, చైన్నె: కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో పోలీస్ శాఖలో భారీ బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి అమల్రాజ్ శుక్రవారం వేపేరిలోని కమిషనరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అమల్రాజ్ 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి, సేలం జిల్లాల్లో శాంతిభద్రతల విభాగంలో పనిచేసిన అపార అనుభవం ఈయనకు ఉంది. గతంలో తాంబరం కమిషనర్గా కూడా పనిచేశారు. ఈయన విశిష్ట సేవలకుగాను రాష్ట్రపతి పతకాన్ని కూడా అందుకున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ చైన్నె నగరంలో రౌడీయిజం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అణచివేసి, శాంతిభద్రతలను కాపాడడమే తన మొదటి ప్రాధా న్యత అని అన్నారు. మట్టి చరియలు పడి ఇద్దరి మృతి సాక్షి, చైన్నె : మదురైలో నిర్మాణంలో ఉన్న ప్రదేశంలో మట్టి చరియలు విరిగి పడి ఇద్దరు మహిళలు మృతిచెందారు. మదురై సులైమాన్ ప్రాంతంలో చిన్నస్వామి అనే వ్యక్తి సంబంధించిన స్థలంలో కల్యాణ మండపం, సినిమా థియేటర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాంక్రీట్ పనుల నిమ్తితం పెద్ద ఎత్తున గుంతలు ఇక్కడ తవ్వారు. శుక్రవారం ఇక్కడ పది మందికి పైగా కార్మికులు పనుల్లో ఉన్నారు. ఈసమయంలో హఠాత్తుగా మట్టి చరియలు విరిగి పడడంతో ఇద్దరు మహిళా కార్మికులు చిక్కుకున్నారు. వీరిని రక్షించడం కష్టతరంగా మారింది. మిగిలిన వారందరూ తప్పించుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అతికష్టంపై శ్రమించి ఇద్దరు మహిళల మృతదేహాలను వెలికి తీశారు. వీరు ఆ ప్రాంతానికి చెందిన ధనలక్ష్మి(40), లక్ష్మి(60)గా గుర్తించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. ప్రత్యేక చిహ్నంతోనే పోటీసాక్షి, చైన్నె: రానున్న ఎన్నికల్లో తాము ప్రత్యేక చిహ్నంతోనే పోటీ చేయనున్నామని మనిదనేయమక్కల్ కట్చి ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం జరిగిన ఆ పార్టీ సమావేశంలో తీర్మానించారు. మనిదనేయ మక్కల్ కట్చి అధ్యక్షుడు, ప్రొఫెసర్ ఎం.హెచ్. జవహిరుల్లా అధ్యక్షతన ఆ పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశం ఉదయం జరిగింది. ఇందులో మూడు ముఖ్య తీర్మానాలు ఆమోదించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అభ్యర్థుల విజయం కోసం కష్టపడిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కూటమి తరఫున నాగపట్టణం, మనప్పారై నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, సహకరించిన మిత్రపక్షాల నాయకులకు, ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మనిదనేయ మక్కల్ కట్చి పార్టీ మిత్రపక్షాల గుర్తులపై కాకుండా, తమ సొంత గుర్తుపైనే (ప్రత్యేక చిహ్నం) పోటీ చేయాలని తీర్మానించారు. కూటమి ప్రభుత్వం సాధ్యం కాదా? సాక్షి, చైన్నె : తమిళనాడులో కూటమి ప్రభుత్వం ఎప్పటికీ సాధ్యం కాదు అని మాట్లాడిన మాటలన్నింటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గట్టి సమాధానం ఇచ్చిందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విస్వనాథన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఆయన మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో మళ్లీ ‘కామరాజర్ పాలన’ను తీసుకురావాలనేది కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కలగా పేర్కొన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కాలంలో కూడా ఆ కల నెరవేరలేదని, తర్వాత సోనియా గాంధీ ఎన్నిసార్లు ప్రయత్నించినా అది సాధ్యపడలేదన్నారు. అయితే, ఇప్పుడు రాహుల్గాంధీ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, ఒక బలమైన కూటమి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయగలిగారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కాంగ్రెస్ తరఫున బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు మంత్రులం ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా పని చేస్తామనే మంచి పేరును సంపాదిస్తామన్నారు. ‘రాజకీయాల్లో విమర్శలు సహజమని, వాటిని స్వీకరిస్తామని, కానీ దిగజారుడు విమర్శలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పక్కనబెడుతుందన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం, ఉన్నత స్థానాలకు చేరుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తుందన్నారు. -
పదవుల కోసం మద్దతు ఇవ్వలేదు
సాక్షి, చైన్నె : ఎడపాడి పళనిస్వామే జనరల్ సెక్రటరీ , పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే తాము డిమాండ్లు ఉంచాం. అన్నాడీఎంకేలోఎటువంటి చీలిక లేదు, కేవలం కొన్ని అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయి’ అని మాజీ మంత్రి, తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న అన్నాడీఎంకే సీనియర్ నేత ఎస్.పి. వేలుమణి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు అన్నాడీఎంకే రాజకీయ వివాదంలో కొత్త ట్విస్టుకు దారి తీసింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 25 మంది ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ఆజ్ఞలను అసెంబ్లీ వేదికగా ధిక్కరించిన విషయం తెలిసిందే. వీరంతా టీవీకే ప్రభుత్వ సీఎం విజయ్కు విశ్వాస పరీక్ష సమయంలో తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకేలో విభేదాలు భగ్గుమన్నాయి. అన్నాడీఎంకే శాసన సభా పక్షనేత విషయంగా ఓ వైపు సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం శిబిరం, మరో వైపు పళణి స్వామి శిబిరం స్పీకర్ జేసీడీ ప్రభాకర్ వద్ద పంచాయతీ పెట్టాయి. దీంతో అన్నాడీఎంకే మళ్లీ ముక్కలైనట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే, తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా చట్టపరంగా చర్యలకు పళణిస్వామి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు టీవీకే మంత్రి వర్గంలో చోటు దక్కక పోవడం తాజాగా కొత్త ట్విస్టుకు దారి తీశాయి. పళణి స్వామిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన ఎస్పీ వేలుమణి శుక్రవారం కొత్త పంథాను అనుసరించే పనిలో పడ్డారు. చైన్నెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు అంశాలకు వివరణ ఇచ్చారు. అయితే, ఈ సారి విలేకరుల సమావేశంలో సీవీ షణ్ముగం కనిపించక పోవడం గమనార్హం. మంత్రి పదవుల కోసమే తాము టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామనే వార్తల్లో నిజం లేదన్నారు. మద్దతుకు కారణాలు: ప్రజలు టీవీకే పార్టీకి తమ మద్దతును అందించారని, డీఎంకే పార్టీని మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకించింది అన్నాడీఎంకే మాత్రమేనని, ప్రస్తుత టీవీకే వ్యూహం కూడా డీఎంకేకు వ్యతిరేకంగానే ఉందని వివరించారు. దీంతోపాటు, గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలనే ఉద్దేశంతోనే తాము వారికి మద్దతు ఇచ్చామన్నారు. పార్టీలో విభేదాలపై స్పందన తమకు ఎడపాడి పళనిస్వామే ఎప్పటికీ ప్రధాన కార్యదర్శి అని స్పష్టంచేశారు. కొందరు తమ మధ్య లేనిపోని విభేదాలు సృష్టిస్తూ, తప్పుడు వార్తలతో తీవ్ర గందరగోళాన్ని కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపై త్వరలోనే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు. తమిళనాడులో మళ్లీ అమ్మ పాలన రావాలనేదే లక్ష్యమని, దయచేసి తమపై తప్పుడు ప్రచారాలు చేయకండని వేలుమణి మీడియాకు విజ్ఞప్తి చేశారు. -
పవర్ కష్టాలు
సాక్షి, చైన్నె: చైన్నెతోపాటు పొరుగు జిల్లాలైన చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురంలలో విద్యుత్ కష్టాలు విస్తృతమయ్యాయి. గంటల తరబడి విచ్చలవిడిగా అమలవుతున్న విద్యుత్ కోతలు కలకలం రేపుతున్నాయి. ఎండల తీవ్రతకు తోడు, అర్ధరాత్రి వేళల్లో గంటల కొద్దీ కరెంట్ నిలిచిపోతుండంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించడంలో విద్యుత్ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గురువారం రాత్రి మూడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రజా నిరసనలు చెలరేగాయి. నరకప్రాయంగా మారిన రాత్రులు తీవ్రమైన ఉక్కపోత కారణంగా ఇళ్లలో ఉండలేక చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు నిద్రలేమితో అల్లాడిపోతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కరెంట్ ఆఫీసులకు ఫోన్ చేస్తే అధికారులు కనీసం సమాధానం ఇవ్వడం లేదని, కొన్నిచోట్ల ఫోన్ కనెక్షన్లను కూడా కట్ చేశారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని ముందే తెలిసినప్పటికీ, విద్యుత్ బోర్డు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ప్రజలు మండిపడుతున్నారు చైన్నెలో అర్ధరాత్రి రాస్తారోకోలు కొలత్తూరు, పెరంబూరు పరిధిలోని రాజమంగళం ప్రజలు అర్ధరాత్రి సమయంలో రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేశారు. తిరువొత్తియూర్– రాయపురం పరిసరాల్లోని విమ్కోనగర్, భరత్ నగర్, అంబేడ్కర్ నగర్ ప్రాంతాలలో జనం విద్యుత్ బోర్డు కార్యాలయాన్ని దిగ్బంధించారు. రాయపురం, కాసిమేడు, ఆర్కేనగర్ పరిధిలో గంటల పాటు కరెంట్ లేకపోవడంతో తాగునీటి సరఫరా సైతం పూర్తిగా నిలిచిపోయి ప్రజలు నీటి కోసం వీధుల్లోకి వచ్చారు. చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో పరిధిలోని పరిశ్రమలకు పూర్తి స్థాయిలో ఓల్టేజీతో కూడిన విద్యుత్ అందించలేని పరిస్థితి నెలకొనడంతో జనరేటర్లను వినియోగించక తప్పలేదు. ఉత్తర చైన్నెపరిధిలోని రాయపురంలో అయితే, టీవీకే ఎమ్మెల్యే విజయ్దాము ఇంటిని ముట్టడించడం గమనార్హం. ఈ విద్యుత్ కోతలపై మాజీ మంత్రి శివశంకర్ తీవ్రంగా స్పందించారు. పవర్ ప్రజలు చేతికి ఇచ్చారని, అయితే, పూర్తి స్థాయిలో పవర్ అన్నది ప్రజలకు ఇవ్వలేని దుస్థితిలో ఈపాలకులు ఉన్నారని మండిపడ్డారు. ఎండలు మండుతున్న సమయంలో పలు జిల్లాలలో జనం ఉక్కపోతకు గురవుతున్నారు. పలు జిల్లాల్లో 100–107 ఫారిన్ డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో ఏసీలు, ఫ్యాన్ల వాడకం పెరిగింది. మున్ముందు విద్యుత్ అవసరం రోజుకు 22 వేల మెగావాట్లను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తమిళనాడులో నిన్న సెమ్మలై.. నేడు ధనపాల్
సాక్షి, చెన్నై : మాజీ మంత్రి, సీనియర్ నేత సెమ్మలై బాటలో బరువెక్కిన హృదయంతో వైదొలుగుతున్నానని మాజీ స్పీకర్, సీనియర్ నేత పి. ధనపాల్ ప్రకటించారు. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో అంతర్గత కలహాలు మరింత ముదిరాయి. పార్టీలోని తాజా పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత, తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్ పి. ధనపాల్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ధనపాల్ అన్నాడీంకే ప్రభుత్వ హయాంలో 2012–2016 , 2016–2021 మధ్య కాలంలో దాదాపు 10 సంవత్సరాల పాటు స్పీకర్గా సుదీర్ఘ సేవలు అందించారు. ఆయన 1977, 1980, 1984, 2001 ఎన్నికలలో సంఖగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2001 జయలలిత క్యాబినెట్లో ఆహార, సహకార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2011లో రాశిపురం, 2016లో అవినాశి నియోజకవర్గాల నుండి విజయం సాధించారు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఆయనకు పోటీ చేసే అవకాశం కల్పించలేదు.రాజీనామా అనంతరం ధనపాల్ వ్యాఖ్యలు.. పార్టీకి రాజీనామా చేసినానంతరం ధనపాల్ ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. నేను సైకిల్పై తిరుగుతూ, రక్తం ధారపోసి నిర్మించిన పార్టీ ఈ రోజు ముక్కలైపోవడం చూస్తుంటే మనసు కలచివేస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలో ప్రస్తుతం సీనియర్లకు ప్రాధాన్యత లేదని, అందరినీ విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు కూడా తాజాగా పార్టీని తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని, ఈ రాజకీయ పరిస్థితులు సృష్టించిన తీవ్ర డిప్రెషన్ (మానసిక వేదన) వల్లే తాను అన్నాడీఎంకేకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.కాగా, తన కుమారుడు లోకేష్ తమిళసెల్వన్ టీవీకేలో చేరి, రాసిపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడని, కేబినెట్ విస్తరణలో అతను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కొంత ఉపశమనాన్ని ఇస్తోందని ఆనందం వ్యక్తంచేశారు. రెండు రోజుల క్రితం సీనియర్ నేత సెమ్మలై పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన బాటలో ధనపాల్ అడుగులు వేయడంతో అన్నాడీఎంకే నుంచి మరెంత మంది సీనియర్లు మున్ముందు తప్పుకోనున్నారో అన్న చర్చ ఊపందుకుంది. -
విజయ్ సర్కార్ దూకుడు.. వెలుగులోకి భారీ స్కాం
సాక్షి, చెన్నై: తమిళనాడు ఇంధన వనరులు, న్యాయశాఖ మంత్రి సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ నేతృత్వంలో తమిళనాడు విద్యుత్ బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన వరుస సమీక్షలలో భారీ స్కాం బయటపడింది. తమిళనాడు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఇటీవల జరిపిన నిధుల కేటాయింపులు, కొన్ని ప్రాజెక్టుల ఆమోదాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఎలాంటి పారదర్శకత లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అత్యంత అత్యవసరంగా కొన్ని సంస్థలకు అనుమతులు, నిధుల కేటాయింపులు మంజూరు చేసినట్లు మంత్రి జరిపిన విచారణలో తేలింది.ఇద్దరు కీలక అధికారుల సస్పెండ్ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో, శాఖాపరమైన నిష్పాక్షిక విచారణకు ఎలాంటి అడ్డంకులు కలగకుండా ఉండేందుకు , పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా ఇద్దరు అగ్ర శ్రేణి అధికారులను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం సీఎం విజయ్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెండ్ అయిన అధికారులలలో వి. కాసి – చీఫ్ ఫైనాన్షియల్ కంట్రోలర్ (రెవెన్యూ) , పి. చంద్రశేఖరన్ – చీఫ్ ఇంజనీర్ (సాంప్రదాయేతర ఇంధన వనరులు) ఉన్నారు. పరిపాలనాపరమైన దుర్వినియోగం, విధుల్లో అలసత్వం , నిధుల మంజూరులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వీరిద్దరిపై ఈ వేటు పడింది.రిటైర్డ్ డైరెక్టర్ పెన్షన్ బెనిఫిట్స్ నిలిపివేత ఈ అవినీతి ఆరోపణలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ రిటైర్డ్ డైరెక్టర్ (టెక్నికల్) ఎస్. మంగళనాథన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్పై ప్రభుత్వం కోరడా ఝుళిపించింది. ఆయనకు అందాల్సిన అన్ని రకాల పెన్షన్ ప్రయోజనాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇంధన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ అక్రమాలకు పాల్పడిన సదరు అధికారులందరిపై విద్యుత్ బోర్డు నిబంధనల ప్రకారం శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ అనంతరం తదుపరి కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.అధికార పగ్గాలుచేపట్టగానే, అవినీతిని నిర్మూలిస్తామన్న విజయ్ ప్రభుత్వం తాజాగా భారీ స్కాంను గుర్తించి ఇద్దరు కీలక అధికారులపై వేటు వేయడం ఇతర అధికారుల గుండెల్లో గుబులు రేకెత్తించింది. -
ఆసక్తికరం.. తమిళనాడు మంత్రుల నేపథ్యం!
సాక్షి, చెన్నై: సీఎం విజయ్ కేబినెట్లో కొత్తగా అడుగు పెట్టిన 23 మందిలో పలువురికి సంబంధించిన విద్యా ప్రయాణం, రాజకీయ అనుభవం తదితర వివరాలు వెలుగులోకి వచ్చాయి. అనేక మంది విజయ్ మక్కల్ ఇయక్కం నుంచే రాజకీయాలలోకి రాగా, మరి కొందరు వైద్యులు, న్యాయవాదులుగా, ఇంకొందరు రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఎన్. మరియా విల్సన్: తమిళనాడులో ప్రముఖ విద్యాసంస్థల అధినేత, దివంగత ‘జేప్పియార్’ అల్లుడు (జేప్పియార్ కుమార్తె రెజినా భర్త). జేప్పియార్ రెమిబాయ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా, జేప్పియార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యక్షుడిగా ఉన్నారు. పీహెచ్డీ పూర్తి చేశారు.ఏ. శ్రీనాథ్ : సీఎం విజయ్ అత్యంత ఆప్తమిత్రుడు. 1992లో విజయ్ కథానాయకుడిగా పరిచయమైన ’నాళైయ తీర్పు’ చిత్రం ద్వారానే శ్రీనాథ్ కూడా సినీరంగంలోకి ప్రవేశించారు. విజయ్తో కలిసి అనేక చిత్రాలలో నటించారు. ఎన్నికల్లో సీనియర్ డీఎంకె మంత్రి గీతా జీవన్ను తూత్తుకుడిలో ఓడించి సంచలనం సృష్టించారు. 52 ఏళ్ల శ్రీనాథ్ 12వ తరగతి చదివారు.ఎస్. కమలి : రాసిపురం ప్రాంతానికి చెందిన ఈమె కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ను ఓడించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ కేబినెట్లో అత్యంత పిన్న వయసు్కరాలైన మంత్రి ఈమె. 28 ఏళ్ల వయస్సులో మంత్రి అయిన కమలి ఇంగ్లీష్ లిటరేచర్లో పీజీ పూర్తి చేశారు.సి. విజయలక్ష్మి: టీవీకే పార్టీలో సీనియర్ మహిళా నాయకురాలు. అన్నాడీఎంకే సీనియర్ నేత పి. తంగమణిని ఓడించారు. రాజకీయాల్లోకి రాకముందు స్వయం ఉపాధి (సొంత బిజినెస్) చేసేవారు. 12వ తరగతి వరకు చదువుకున్నారు. డి. లోకేష్ తమిళసెల్వన్: అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ స్పీకర్ పి. ధనపాల్ కుమారుడు. గత లోక్సభ ఎన్నికల్లో నీలగిరి నుండి అన్నాడీఎంకే తరపున పోటీ చేశారు. తర్వాత టీవీకేలో చేరి, డీఎంకే మంత్రి మదివేందన్ను ఓడించారు. లయోలా కాలేజ్ నుండి బీకామ్, ఢిల్లీ ఐఐపీఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. పి. విశ్వనాథన్ (కాంగ్రెస్): చెంగల్పట్టు జిల్లాకు చెందిన ఈయన 2009–2014 మధ్య కాంచీపురం ఎంపీగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో సాధారణ (జనరల్) స్థానంలో పోటీ చేసి గెలిచిన ఒకే ఒక్క ఎస్సీ అభ్యర్థి ఈయనే కావడం విశేషం. మద్రాస్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేశారు.ఆర్. కుమార్ : ప్రముఖ పారిశ్రామికవేత్త. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈయన, ఇటీవల ప్రతిష్టాత్మక ఐఐఎం బెంగళూరు నుండి బిజినెస్ లీడర్íÙప్ కోర్సు చేశారు.విజయ్ తమిళన్ పార్తీబన్ : విజయ్ అభిమాన సంఘం (విజయ్ మక్కల్ ఇయక్కం) ద్వారా ఎదిగిన లాయలిస్ట్. సేలం పాత బస్టాండ్ వద్ద చిన్న మొబైల్ షాప్ నడుపుకునే స్థాయి నుండి నేడు పెద్ద షోరూమ్ అధినేతగా ఎదిగారు. విజయ్, బుస్సీ ఆనంద్కు అత్యంత నమ్మకస్తుడైన ఈయన 12వ తరగతి వరకు చదివారు.ఎస్. రాజేష్ కుమార్ (కాంగ్రెస్): కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత. కన్యాకుమారి జిల్లా కిళ్లీయూర్ నియోజకవర్గం నుండి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత. న్యాయశాస్త్రం చదివారు.డి. శరత్కుమార్: డీఎంకే కోటగా భావించే తాంబరంలో ఆ పార్టీ అభ్యర్థి ఆర్.ఎస్. కృతికా దేవిని 35,621 ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు. గతంలో సివిల్ కాంట్రాక్టర్గా పనిచేశారు. జైన్ కాలేజీ నుండి బీబీఏ పూర్తి చేసిన యువ ఎమ్మెల్యే.ఆర్.వి. రంజిత్ కుమార్ : కాంచీపురం ఎమ్మెల్యే, వయసు 50 ఏళ్లు. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.బి రాజ్కుమార్ : వయసు 46 ఏళ్లు. మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా. రియల్ ఎస్టేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.బి. మదన్ రాజా: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, సొంత వ్యాపారాలు ఉన్నాయి. విఘ్నేష్ : వయసు 38 ఏళ్లు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. సీసీటీవీ కెమెరాల వ్యాపారం చేసేవారు. గత 15 ఏళ్లుగా విజయ్ మక్కల్ ఇయక్కంలో పనిచేస్తున్నారు.వి. సంపత్కుమార్: కోయంబత్తూర్ నార్త్లో బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ను ఓడించి సంచలనం çసృష్టించారు. అన్నామలై వర్సిటీ నుండి ఎంబీఏ (డిస్టెన్స్) చేశారు.రాజీవి : వయసు 33 ఏళ్లు. వృత్తిరీత్యా డాక్టర్ (వైద్యుడు). టీవీకే యువ మంత్రుల్లో ఒకరు.గాంధీరాజ్: వయసు 52 ఏళ్లు. 12వ తరగతి చదివారు. సివిల్ కాంట్రాక్టర్గా ఉన్నారు.జెగదీశ్వరి.కె : గ్రాడ్యుయేట్. జర్నలిజం, మీడియా రంగంలో అనుభవం ఉంది. ఆర్. రమేష్ : 10వ తరగతి చదివారు, రియల్ ఎస్టేట్ వ్యాపారి.తెన్నరసు.కె : ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత. కమీషన్ ఏజెంట్గా వ్యవహరిస్తూ, విజయ్ వీరాభిమానిగా ఉంటూ వచ్చారు.మహమ్మద్ ఫర్వాజ్.జె : ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ విజయ్ అభిమానిగా ఉంటూ వచ్చారు.సామాజిక సమతుల్యత:కమలి, విస్వనాథన్, రాజ్మోహన్, లోకేష్ తమిళసెల్వన్, తెన్నరసు, గాంధీరాజ్, మదన్రాజాలు షెడ్యూల్ కులాలకు చెందిన నేతలు మంత్రులు కావడం విశేషం.మహిళా శక్తిగా: ఎస్. కమలి, సి. విజయలక్ష్మి, కీర్తన, జగదీశ్వరి కేబినెట్లో ఉన్నారు. ఈ మంత్రివర్గ కూర్పులో అట్టడుగు స్థాయి కార్యకర్తలకు, యువకులకు, విద్యాధికులకు, సామాజిక సమీకరణాలకు సీఎం విజయ్ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. -
దర్శనం.. నిరీక్షణం
నారాయణగిరి షెడ్ల వద్ద క్యూలో కిక్కిరిసిన భక్తులుతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం తీవ్ర స్థాయికి చేరుకుంది. శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు శిలాతోరణం దాటి గోగర్భం డ్యామ్ ప్రాంతం వరకూ కొనసాగడం చూస్తే భక్తుల తాకిడి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక, బుధవారం అర్ధరాత్రి వరకు మొత్తం 86,315 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 44,107 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ పరంగా రూ.3.94 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం తిరుమలలో సాధారణ సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు దాదాపు 30 గంటల సమయం పడుతోంది. మరోవైపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులు సుమారు మూడు గంటల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైంస్లాట్ టిక్కెట్లు పొందిన వారికి మాత్రం నిర్దేశిత సమయానికే దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికే క్యూలలోకి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అధిక రద్దీ కారణంగా క్యూల వద్ద భక్తులను దశలవారీగా మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో టీటీడీ లడ్డూ పంపిణీ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తోంది. లడ్డూ టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే కౌంటర్ల వద్దకు అనుమతిస్తున్నారు. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో తిరుమలలో వసతి సమస్య తీవ్రరూపం దాల్చింది. టీటీడీ అతిథి గృహాలు, కాటేజీలు, మఠాలు మాత్రమే కాకుండా వెయింటిగ్ హాళ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలోని పాచికాలవ గంగమ్మ గుడి ఆలయం నుంచి నారాయణగిరి షెడ్ల వరకు క్యూలలో వేచి ఉన్న భక్తులు.. క్యూలోకి ప్రవేశిస్తున్న భక్తులు -
తమిళనాడు విద్యుత్ బోర్డులో భారీ స్కాం
సాక్షి, చైన్నె: తమిళనాడు ఇంధన వనరులు, న్యాయశాఖ మంత్రి సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ నేతృత్వంలో తమిళనాడు విద్యుత్ బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన వరుస సమీక్షలలో భారీ స్కాం బయటపడింది. తమిళనాడు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఇటీవల జరిపిన నిధుల కేటాయింపులు, కొన్ని ప్రాజెక్టుల ఆమోదాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఎలాంటి పారదర్శకత లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అత్యంత అత్యవసరంగా కొన్ని సంస్థలకు అనుమతులు, నిధుల కేటాయింపులు మంజూరు చేసినట్లు మంత్రి జరిపిన విచారణలో తేలింది. ఇద్దరు కీలక అధికారుల సస్పెండ్ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో, శాఖాపరమైన నిష్పాక్షిక విచారణకు ఎలాంటి అడ్డంకులు కలగకుండా ఉండేందుకు , పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా ఇద్దరు అగ్ర శ్రేణి అధికారులను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం సీఎం విజయ్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెండ్ అయిన అధికారులలలో వి. కాసి – చీఫ్ ఫైనాన్షియల్ కంట్రోలర్ (రెవెన్యూ) , పి. చంద్రశేఖరన్ – చీఫ్ ఇంజనీర్ (సాంప్రదాయేతర ఇంధన వనరులు) ఉన్నారు. పరిపాలనాపరమైన దుర్వినియోగం, విధుల్లో అలసత్వం , నిధుల మంజూరులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వీరిద్దరిపై ఈ వేటు పడింది. రిటైర్డ్ డైరెక్టర్ పెన్షన్ బెనిఫిట్స్ నిలిపివేత ఈ అవినీతి ఆరోపణలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ రిటైర్డ్ డైరెక్టర్ (టెక్నికల్) ఎస్. మంగళనాథన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్పై ప్రభుత్వం కోరడా ఝుళిపించింది. ఆయనకు అందాల్సిన అన్ని రకాల పెన్షన్ ప్రయోజనాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇంధన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ అక్రమాలకు పాల్పడిన సదరు అధికారులందరిపై విద్యుత్ బోర్డు నిబంధనల ప్రకారం శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ అనంతరం తదుపరి కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.అధికార పగ్గాలుచేపట్టగానే, అవినీతిని నిర్మూలిస్తామన్న విజయ్ ప్రభుత్వం తాజాగా భారీ స్కాంను గుర్తించి ఇద్దరు కీలక అధికారులపై వేటు వేయడం ఇతర అధికారుల గుండెల్లో గుబులు రేకెత్తించింది. -
తిరుత్తణిలో గాలివాన బీభత్సం
తిరుత్తణి : తిరుత్తణి ప్రాంతంలో మండుటెండలు ప్రజలను అల్లాడిస్తుండగా గురువారం సాయంత్రం అకస్మాత్తుగా వీచిన బలమైన గాలుల కారణంగా చెట్లు కూకటివేళ్లతోసహా పెకిలించబడి ఇళ్లపైనా, విద్యుత్ స్తంభాలపైన కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి, ట్రాఫిక్కు ఆటంకం కలిగి, ప్రజలకు తీవ్ర ఇబ్బంది కల్గింది. తిరుత్తణి, పరిసర ప్రాంతాలు మూడు నెలలుగా మండుటెండలతో అల్లాడుతున్నాయి. ఈ పరిస్థితిల్లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుటెండలు, వేడి గాలులు కొనసాగాయి. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. గాలి బీభత్సానికి, తిరుత్తణి అమృతపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లే రహదారిపై ఉన్న ఒక ఇంటిపై వందేళ్ల నాటి మర్రిచెట్టు వేళ్లతో సహా కూలిపోయింది. దీంతో ఆ ఇల్లు, సమీపంలోని మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. అయితే, ఇంట్లో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే, ఆ ప్రాంత డీఎంకే నగర కౌన్సిలర్ మహేశ్వరి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించగా, విద్యుత్ అంతరాయం కారణంగా కూలిపోయిన చింతచెట్టును మున్సిపల్ కార్మికులు తొలగించారు. తిరుత్తణి నుంచి ఆర్కే పేటకు వెళ్లే రాష్ట్ర రహదారిలోని అకూర్ ప్రాంతంలో, గాలి వేగం కారణంగా 4 చింతచెట్లు వేళ్లతో పెకిలించబడి రోడ్లపై కూలిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. రహదారి శాఖ అధికారులు వెంటనే ప్రొక్లైన్ యంత్రం సాయంతో రోడ్డుపై వృక్షాలను తొలగించారు. చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలోని నెడుంబరం ప్రాంతంలో, గాలి కారణంగా అటుగా వెళ్తున్న కారుపై ఒక చెట్టు కూలింది. అయితే, కారులోని ప్రయాణికులు ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే ప్రొక్లైనర్తో కారుపై పడిన చెట్టును తొలగించారు. కనకమ్మసత్రం ప్రాంతంలో, జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక రేకుల టెంట్లలో ఉత్తర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారు. వారు బస చేస్తున్న గుడారాలు గాలి వేగానికి కొట్టుకుపోయి రోడ్డుపైన, వ్యవసాయ భూములపైనా పడిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై అరగంట పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుత్తణి చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు విరిగి దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. కూలిన వృక్షాలు కూలిన కరెంటు స్తంభాలు -
టీవీకే ప్రభుత్వంలోకి ఐయూఎమ్ఎల్
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తిక ర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం క్యాబినెట్ లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా చేరబోతోంది. తమ పార్టీ తరపున పాపనాశం నియోజకవర్గ ఎమ్మెల్యే ఏ.ఎమ్. షాజహాన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఐయూఎమ్ఎల్ జాతీయ అధ్యక్షుడు ఖాదర్ మొహిదీన్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఉదయం జరిగిన ప్రమాణ స్వీకారంలో ఐయూఎమ్ఎల్కు చోటు దక్కకపోవడంపై చర్చ నడుస్తున్న తరుణంలో, మధ్యాహ్నం ఆ పార్టీ రాష్ట్ర ప్ర తినిదులు అత్యవసర సమావేశం చైన్నెలో జరిగింది. అడగకుండానే దక్కిన అవకాశం ఈ సమావేశం అనంతరం మీడియాలో మాట్లాడిన ఖాదర్ మొహిదీన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడినప్పుడు తమ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలాంటి నిబంధనలు లేదా డిమాండ్లు పెట్టకుండా, బేషరతుగా మ ద్దతు ప్రకటించారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభు త్వం అద్భుతంగా నడుస్తోందన్నారు. తాము మంత్రి పదవుల గురించి అడగకపోయినా, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పెద్ద మనసుతో మమ్మల్ని సంప్రదించారని పేర్కొన్నారు. ఐయూఎమ్ఎల్ను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నామని, ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరిని మంత్రివర్గంలోకి పంపాలని కోరినట్టు తెలిపారు. ఇది తమకు ఊహించని శుభవార్త. అని ఆయన తెలిపారు. ఈ విషయమై కేరళలో ని ఐయూఎమ్ఎల్ అగ్రనాయకత్వంతో చర్చించినట్లు ఖాదర్ మొహిదీన్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వంలో ఐయూఎమ్ఎల్ చేరడాన్ని కేంద్ర కమిటీ కూడా ఆమోదించిందన్నారు. పార్టీకి ఉన్న ఇద్దరు ఎ మ్మెల్యేలకూ మంత్రి పదవులు ఎందుకు అడగకూడదనే ప్రతిపాదన వచ్చినట్లు ఆయన తెలిపారు. అయి తే, ప్రస్తుతానికి మొదట ఒకరిని మంత్రివర్గంలోకి పంపి, ఆ తర్వాత రెండో ఎమ్మెల్యే పదవి గురించి సీఎంతో మాట్లాడాలని నిర్ణయించామన్నారు. కాగా ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే పూర్తి అధికారాన్ని పార్టీ తనకు అప్పగించగా, పాపనాశం ఎమ్మెల్యే ఏ. ఎమ్. షాజహాన్ పేరును ఖరారు చేశామన్నారు. ఈ నిర్ణయంతో త్వరలోనే ఏ.ఎమ్.షాజహాన్ తమిళనా డు నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నార న్నది ఖాయమైంది. తద్వారా విజయ్ కేబినెట్లో మరో మిత్రపక్షానికి చోటు దక్కనుంది. షాజహా న్కు మైనారిటీ సంక్షేమ శాఖ అప్పగించే అవకాశాలు ఉన్నాయి. కాగా విజయ్ కేబినెట్లో తాము చేరబోతున్నామని వీసీకే నేత తిరుమాళవళవన్ గురువారం రాత్రి ప్రకటించారు. -
నిన్న సెమ్మలై.. నేడు ధనపాల్
సాక్షి, చైన్నె : మాజీ మంత్రి, సీనియర్ నేత సెమ్మలై బాటలో బరువెక్కిన హృదయంతో వైదొలుగుతున్నానని మాజీ స్పీకర్, సీనియర్ నేత పి. ధనపాల్ గురువారం ప్రకటించారు. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో అంతర్గత కలహాలు మరింత ముదిరాయి. పార్టీలోని తాజా పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత, తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్ పి. ధనపాల్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ధనపాల్ అన్నాడీంకే ప్రభుత్వ హయాంలో 2012–2016 , 2016–2021 మధ్య కాలంలో దాదాపు 10 సంవత్సరాల పాటు స్పీకర్గా సుదీర్ఘ సేవలు అందించారు. ఆయన 1977, 1980, 1984, 2001 ఎన్నికలలో సంఖగి రి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2001 జయలలిత క్యాబినెట్లో ఆహార , సహకార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2011లో రాశిపురం, 2016లో అవినాశి నియోజకవర్గాల నుండి విజయం సాధించారు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఆయనకు పోటీ చేసే అవకాశం కల్పించలేదు. రాజీనామా అనంతరం ధనపాల్ వ్యాఖ్యలు: పార్టీకి రాజీనామా చేసినానంతరం ధనపాల్ ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. నేను సైకిల్పై తిరుగుతూ, రక్తం ధారపోసి నిర్మించిన పార్టీ ఈ రోజు ముక్కలైపోవడం చూస్తుంటే మనసు కలచివేస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలో ప్రస్తుతం సీనియర్లకు ప్రాధాన్యత లేదని, అందరినీ విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు కూడా తాజాగా పార్టీని తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని, ఈ రాజకీయ పరిస్థితులు సృష్టించిన తీవ్ర డిప్రెషన్ (మానసిక వేదన) వల్లే తాను అన్నాడీఎంకేకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, తన కుమారుడు లోకేష్ తమిళసెల్వన్ టీవీకే లో చేరి, రాసిపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడని, కేబినెట్ విస్తరణలో అతను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కొంత ఉపశమనాన్ని ఇస్తోందని ఆనందం వ్యక్తంచేశారు. రెండు రోజుల క్రితం సీనియర్ నేత సెమ్మలై పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన బాటలో దనపాల్ అడుగులు వేయడంతో అన్నాడీఎంకే నుంచి మరెంత మంది సీనియర్లు మున్ముందు తప్పుకోనున్నారో అన్న చర్చ ఊపందుకుంది. -
అన్నా క్యాంటీన్లో నాణ్యత తనిఖీ
తిరువొత్తియూరు: చైన్నె కార్పొరేషన్లో 383 అమ్మ క్యాంటీన్లు నడుస్తున్నాయి. కొంతమంది పేదలు క్యాంటీన్లపై ఆధారపడి జీవిస్తున్నారు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో అమ్మ క్యాంటీన్లు పునరుద్ధరించబడ్డాయి. పాత సామగ్రిని మార్చి కొత్తవి కొనుగోలు చేశారు. దీంతో క్యాంటీన్లలో మళ్లీ జనం రద్దీ పెరగింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, అమ్మ క్యాంటీన్లలో ఆహార నాణ్యతను మెరుగుపరచాలని ఆదేశించారు. దీనిని అనుసరించి చైన్నె కార్పొరేషన్ కొత్త కమిషనర్ డాక్టర్ జి.ఎస్.సమీరన్, బుధవారం రాత్రి అన్నానగర్లోని టైలర్ రోడ్డులో ఉన్న క్యాంటీనన్కు వెళ్లిన కమిషనర్ తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న ప్రజలతో ఆహారం నాణ్యత గురించి చర్చించారు. వంట సామగ్రి నిల్వ, భోజన ప్రాంతాన్ని పరిశీలించారు. అదేక్రమంలో గురువారం ఉదయం తి.వి.క నగర్ మండలం 77వ వార్డులోని టి.మెయిల్స్ రోడ్డు క్యాంటీన్ లో కమిషనర్ సమీరన్ తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఉద యం అందించే టిఫిన్ తిని చూసి నాణ్యతను పరీక్షించారు. ఆహారాన్ని నాణ్యతగా అందించాలని ఆయన ఆదేశించారు. -
వృద్ధురాలి గొంతు నులిమి హత్య
తిరుత్తణి: ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలి ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి, ఆమె గొంతు నులిమి హత్య చేసి, బీరువాలో ఉంచిన ఆరున్నర సవర్ల నగలు, కిలో వెండి వస్తువులు, రూ. 30,000 వేలు విలువైన విద్యుత్ ఉపకరణాలను దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా, పుండి యూనియన్, పుత్తూరు పంచాయతీ పరిధిలోని ఝెల్లపాప నాయుడు పైట్టె గ్రామానికి చెందిన నాగయ్య భార్య సుకున (70). ఆమె భర్త చనిపోగా, కుమారుడు, కుమార్తె అమెరికాలో నివసిస్తున్నారు. దీంతో గ్రామంలోని ఇంట్లో సుకున ఒంటరిగా నివసిస్తోంది. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి ఆ వృద్ధురాలు ఎప్పటిలాగే ఇంట్లో నిద్రిస్తోంది. ఈ సమయంలో అర్ధరాత్రి నలుగురు వ్యక్తుల ముఠా ఒకటి వెనుక తలుపు పగలగొట్టి ఇంట్లోకి చొరబడింది. వారు ఆవృద్దురాలి గొంతు నులిమి, బెదిరించి, బీరువా తాళం పగలగొట్టి, ఆరున్నర సవర్ల నగలు, కిలో వెండి వస్తువులు, రూ. 30 వేల విలువైన ఇత్తడి వస్తువులు, విద్యుత్ ఉపకరణాలను దోచుకెళ్లారు. ఇరుగుపొరుగు వారు వచ్చి చూసేసరికి ఆ వృద్ధురాలి చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయి. గ్రామస్థులు వెంటనే కనకమ్మ చత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కనకమ్మ సత్రం పోలీసులు కేసు నమోదు చేసి దోపిడీపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా రెండు రోజుల క్రితం, తిరువలన్కాడ్ సమీపంలోని వీరరాఘవపురం గ్రామంలో, ఓ యువతి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని 10 సవర్ల తాళి గొలుసులను లాక్కున్నారు. ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దోపిడీ, తిరువేలాంగాడు ప్రాంతంలోని గ్రామస్తులలో భయాన్ని సృష్టించింది. -
క్లుప్తంగా
ఈతకు వెళ్లి మృతి చెందిన విద్యార్థికి.. 495 మార్కులు తిరువళ్లూరు: పదవ తరగతి పరీక్షలు ముగిసిన తరువాత ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన విద్యార్థి 495 మార్కులు సాధించి పాఠశాలలోనే టాపర్గా నిలిచిన సంఘటన కంటతడి పెట్టించింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి అయత్తూరు గ్రామానికి చెందిన బాబు. ఇతడికి మోనీక(17), అభిషేక్ (15) ఇద్దరు పిల్లలు వున్నారు. మోనీక కవరపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్టూ చదువుతుండగా, అభిషేక్ అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో పదవ తరగతి పరిక్షలు ముగిసిన తరువాత ఏప్రిల్ రెండున సరదగా ఈత కోసం వెళ్లిన విషాదకరంగా మృతి చెందాడు. ఈ క్రమంలో బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అభిషేక్ 495 మార్కులు సాధించి పాఠశాలలో టాపర్గా నిలిచాడు. దీంతో ఆ విద్యార్ధి జ్ఞాపకాలను స్మరించుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కంటతడి పెట్టుకున్నారు. లీజింగ్లో భారీ స్పేస్ల హవా సాక్షి, చైన్నె : నైట్ ఫ్రాంక్ ఇండియా 2026 మొద టి త్రైమాసికానికి సంబంధించిన చైన్నె ఆఫీస్ స్పే స్ మార్కెట్ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, చైన్నె నగరంలో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ (కార్యాలయాల అద్దెలు) మార్కెట్ ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు చేసింది. ము ఖ్యంగా 1,00,000 చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన భారీ కార్యాలయాల లీజింగ్.. మొత్తం లావాదేవీల్లో ఏకంగా 44 శాతం వాటాను కై వసం చేసుకుందని ప్రకటించారు. ఈ త్రైమాసికంలో చైన్నె నగరం మొత్తం 1.5 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ లీజింగ్ లావాదేవీలను నమోదు చేసిందన్నారు. లక్ష చదరపు అడుగుల కంటే పెద్దవైన కార్యాలయాల లీజింగ్ 0.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైందని, ఇది మొత్తం మార్కెట్లో 44శాతం వాటాగా ప్రకటించారు. దేశంలోని ప్రముఖ 8 నగరాల్లో నమో దైన మొత్తం భారీ ఆఫీస్ లీజింగ్లో చైన్నె నగ రం 3.6% వాటాను కలిగి ఉందన వివరించారు. చైన్నె ఆఫీస్ మార్కెట్లో చిన్న, మధ్యస్థ, భారీ స్థాయి కార్యాలయాలకు సమతుల్యమైన డిమాండ్ వ్యక్తమవుతోందని వివరించారు. తూత్తుకుడిలో మహిళా వ్యాపారి హత్య తిరువొత్తియూరు: తూత్తుకుడి అన్నానగర్ 12వ వీధికి చెందిన అముద (50) అనే మహిళ తన ఇంటి ముందు కిరాణా పాత ఇనుప సామాన్ల దుకాణం నడుపుతున్నారు. ఈమె భర్త భూపాలరాజా ఆటో డ్రైవర్. అముద కుమారుడు అరుణ్కుమార్ 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతను తరచుగా మద్యం సేవించి తన తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో అరుణ్కుమార్ భార్య తరపు బంధువులతో అముదకు గతంలో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో బుధవారం అముద తన దుకాణంలో ఉన్న సమయంలో, బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కత్తులతో విచక్షణారహితంగా నరికి పారిపోయారు. తీవ్ర గాయాలైన ఆమెను తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి అరుణ్కుమార్ భార్య సోదరుడు శంకర్ (32), అతని స్నేహితుడు మదన్కుమార్ (32) ఈహత్యకు పాల్పడినట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. పేడ పౌడర్ తాగి దంపతులు మృతి తిరువొత్తియూరు: కోయంబత్తూరు సింగనల్లూరు ఉప్పిలిపాళయం ఎం.జి.ఆర్ కాలనీ, కె.పి. ఆరుముగం వీధికి చెందిన గణేశన్ (62), ఆయన భార్య వసంతామణి (57). గణేశన్ కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. ఆయన గత కొంతకాలంగా నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో దంపతులిద్దరూ ధారాపురంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి కోయంబత్తూరు వస్తున్నారు. మార్గమధ్యంలో పుత్తరచ్చల్ గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్న కారును రోడ్డు పక్కన నిలిపి ఇద్దరూ ప్రమాదకర పేడ పౌడర్ తాగి స్పృహ తప్పారు. కారులో వారు అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పల్లడం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ నగలు ఇచ్చి మోసం చేశారని బ్యాంక్ ముందు ధర్నా తిరువొత్తియూరు: శివగంగ జిల్లా కారైకుడి సమీపంలోని కున్రకుడికి చెందిన మణిరాజా (29) అళగప్ప విశ్వవిద్యాలయంలో తాత్కాలిక ఉద్యోగి. ఇతను గత సంవత్సరం ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో 3 సవర్ల బంగారు నగలను తాకట్టు పెట్టి రూ.1.5 లక్షలు రుణం తీసుకున్నాడు. మే 12వ తేదీన వడ్డీతో సహా నగదు చెల్లించి తన నగలను తిరిగి తీసుకున్నాడు. అయితే మే 14న మళ్లీ అదే బ్యాంకులో ఆ నగలను తాకట్టు పెట్టడానికి వెళ్లగా, అక్కడి నగలు పరిశీలించే వ్యక్తి అవి నకిలీ నగలని, తాకట్టు పెట్టుకోలేమని చెప్పాడు.దీనిపై మణిరాజా పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో, తన కుటుంబంతో కలిసి బ్యాంకు ముందు ధర్నాకు దిగాడు. తాను అసలు నగలే ఇచ్చానని, తిరిగి తీసుకున్నప్పుడు బ్యాంకు సిబ్బంది నగలను మార్చి తనకు నకిలీ నగలు ఇచ్చారని అతను ఆరోపిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. -
ఆవడి ఎమ్మెల్యేతో భేటీ
కొరుక్కుపేట: తమిళగ వెట్రి కళగం (టీవీకే) –ఆవ డి శాసనసభ్యులు డా.ఆర్.రమేష్ కుమార్ను తమిళనాడు తెలుగు క్రైస్తవ అసోసియేషన్ అధ్యక్షులు డా.దేవప్రసన్న, నాయకులు రెవ.ఆదాము మద్దూరిలు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. వారిని శాలువాలతో సత్కరించి తెలుగు క్రైస్తవుల కు తెలుగు సంఘాలకు సంబంధించిన మెమోరాండంను ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ రమేష్ కుమార్ అందజేశారు. మెమోరాండంలోని విషయాలు వా రు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యం.డి.ఆరోన్, తాళ్ళూరి శరత్ బాబు, ఆవడి మోసెస్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో’ ఫస్ట్లుక్ విడుదల
తమిళసినిమా: ఏపీ ఇంటర్నేషనల్, విష్ణు విశాల్ స్టూడియోస్ సంస్థల అధినేతలు సంజయ్ అర్జున్ దాస్ వాద్వా, నటుడు విష్ణు విశాల్ కలిసి నిర్మించిన తాజా చిత్రం ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో. ఈ చిత్రం ద్వారా విక్కీ భాస్కర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన పలు లఘు చిత్రాలుతో పాటు చిత్రాలకు పని చేశారు. ఓహో ఎందన బేబీ చిత్రం ఫేమ్ నందన్ ప్రీతి అస్రాని జంటగా నటించిన ఈ చిత్రంలో నటి ఏంజెల్ మరియా,మోనీషా మోహన్, కరుణాకరన్, జాన్సన్ దివాకర్, నిఖిలా శంకర్,చేతన్,దేవదర్శిణి,అనుపమ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్, టీజర్ను విడుదల చేశారు. ఇది నవీన కాల యువత ప్రేమ, వారి జీవన విధానాన్ని మనసులను ఆకట్టుకునే ఫీల్ గుడ్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. విడుదలైన ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్లో జెన్ జీ తరాలను ఆకట్టుకునే జనరంజక, సన్నివేశాలు చోటు చేసుకోవడంతో చిత్రపరిశ్రమ నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. చిత్ర షూటింగ్ ను చైన్నె, వియత్నాం, పరిసర ప్రాంతాలలో నిర్వహించిన పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే చిత్ర ట్రైలర్, ఆడియో విడుదల వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి లూక్ జోస్ ఛాయాగ్రహణం, భరత్ శంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
కోర్టు ఆదేశాలతో మృతదేహాలను వెలికితీసి..
తిరువళ్లూరు: హైకోర్టు ఆదేశాల మేరకు ఓ ప్రాంతంలో పాతిపెట్టిన మూడు మృతదేహాలను వెలికితీసి ఉద్రిక్తతత నడుమ మరో శ్మశానంలో అధికారులు దహనక్రియలు నిర్వహించిన ఘటన తిరువళ్లూరు సమీపంలో తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. కడంబత్తూరు యూనియన్ ఉలుందై గ్రామ పంచాయతీ పరిధిలోని వడువూరు కాలనీ ఉంది. ఈ గ్రామం తిరువళ్లూరు జిల్లా పరిధిలోకి వస్తుండగా, కాంచీపురం జిల్లా సరిహద్దుకి సమీపంలో ఉంది. ఇక్కడ సుమారు 30 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఎవరైనా మృతి చెందితే సమీప ప్రాంతంలోకి శ్మశానంలో దహన క్రియలను నిర్వహించే వారు. అయితే శ్మశానం వున్నప్రాంతం కాంచీపురం జిల్లా కీళాయి గ్రామానికి పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దహనక్రియలు నిర్వహిస్తున్న ప్రాంతానికి సమీపంలో అదే ప్రాంతానికి చెందిన చక్రవర్తి అనే రైతుకు 5 ఎకరాల పొలం వుంది. సంబంధిత పొలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించడానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ పొలానికి సమీపంలో దహనవాటిగా ఉపయోగిస్తున్న ప్రాంతం కాంచీపురం జిల్లా కీళాయి పరిధిలోకి వస్తుందని, దీంతో పాటు శ్మశాన వాటిక ఉన్న ప్రాంతం నీటి ఆధారిత కాలువ కావడంతో అక్కడ మృతదేహాలను పూడ్చడానికి అనుమతించవద్దని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. ఈక్రమంలో తక్షణం అక్కడ వున్న మృతదేహాలను వెలికి తీసి తిరువళ్లూరు జిల్లా పరిధిలోని శ్మశానంలో పూడ్చాలని కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. అదే విధంగా వడవూరు గ్రామానికి చెందిన ప్రజలకు శాశ్వత శ్మశాన వాటికకూ స్థఽలం కేటాయించాలని ఆదేశించారు. ఉద్రిక్తత నడుమ హైకోర్టు ఆదేశాల ఆదేశాల మేరకు కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాకు చెందిన అధికారులు ఉలుందై గ్రామానికి గురువారం ఉదయం చేరుకున్నారు. శ్రీపెరంబదూరు సబ్కలెక్టర్ నల్లశివం, డీఎస్పీ కీర్తీవాసన్, తాహసీల్దార్ వసంతి తిరువళ్లూరు ఆర్డివో రవిచంద్రన్, తహసీల్దార్ బాలాజీ, ఇన్స్పెక్టర్ శీతాపతి నేతృత్వంలోని అధికారులు చేరుకున్నారు. గ్రామస్తుల వ్యతిరేకత మధ్యే మూడు మృతదేహాలను వెలిసి తీశారు. దీంతో స్థానికులకు, పోలీసులకు మద్య తీవ్ర ఉద్రిక్తత వాగ్వాదం నెలకొంది. ఉద్రిక్తత నడుమ మూడు మృతదేహాలను వెలిసి తీసి ఉలుందై గ్రామంలోని మరో శ్మశాన వాటికకూ తరలించారు. వాహనాన్ని అడ్డుకుని నిరసన వడవూరు గ్రామానికి చెందిన మృతదేహాలను వెలికితీసి మూడుకిలోమీటర్ దూరంలో ఉన్న ఉలుందై కాలనీలోని శ్మశానంలో దహనం చేయడానికి వాహనంలో తరలించారు. అయితే విషయం తెలుసుకున్న ఉలుందై గ్రామానికి చెందిన ప్రజలు మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ను అడ్డుకుని నిరసన చేపట్టారు. ఎక్కడో తీసిన మృతదేహాలను తమ గ్రామంలో పూడ్చవద్దని కోరుతూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆదేశాలు వున్నందన తామేమీ చేయలేమని ఆందోళకారులను పక్కకు నెట్టి వడవూరులో వెలికితీసిన మృతదేహాలను ఉలుందైలోని స్మశానంలో దహనక్రియలు చేపట్టారు. -
రూ. 4.45 కోట్ల విలువైన సెల్ఫోన్ల అప్పగింత
వేలూరు: చోరీ చేసిన సెల్ఫోన్లను కొనుగోలు చేసినా, విక్రయించిన సంబంధిత వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శివరామన్ అన్నారు. వేలూరు జిల్లా వ్యాప్తంగా సెల్ఫోన్లు పోగొట్టుకున్న యజమానులకు సెల్ఫోన్లు అప్పగించే కార్యక్రమం ఎస్పీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం సీఈఐఆర్ వంటి పోర్ట్ ద్వారా గుర్తించిన సుమారు రూ. 50 లక్షల విలువ చేసే మొత్తం 284 సెల్ఫోన్లను అందజేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 4.45 కోట్లు విలువ చేసే సెల్ఫోన్లు అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. అదనపు ఎస్పీలు పయణి, అన్నాదురై, ధనూష్కుమార్, డీఎశ్పీ ఇరుదయరాజ్, సైబర్ క్రైమ్ ఇన్స్పెపెక్టర్ కుమార్, ఎస్ఐ సతీష్కుమార్ తదితరులున్నారు. -
28న తెరపైకి ‘కాట్టాళన్’
తమిళసినిమా: ఆంటాని వర్గీస్, దుబారా విజయన్, కబీర్ సింగ్,సునిల్, సిద్ధిక్ భరత్ తివారీ, రాజ్ తిరందాస్, హరి శంకర్ నారాయణ్,ఆన్సన్ పాల్, సందీప్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం కాట్టాళన్. వీరితో పాటూ రెండు ఏనుగులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఇంతకు ముందు మార్కో వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత షెరీఫ్ ముహమ్మద్ నిర్మించారు. పౌల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొంటూ ఇది పూర్తిగా అడివిలో జరిగే స్మగ్లింగ్ ఇతివృత్తంతో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో నిర్మించబడిందని చెప్పారు. భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఉత్కంఠతను రేకెత్తిస్తుందన్నారు. ఇందులో రెండు ఏనుగులను అటవీశాఖ అధికారులు నుంచి అనుమతి పొంది నటించినట్లు చెప్పారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ఈ చిత్రాన్ని తమిళం, మలయాళంతో పాటు తెలుగు, కన్నడం, హిందీ భాషల్లోనూ ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీనికి రవి బస్రూర్ సంగీతాన్ని, రీనా దివే ఛాయాగ్రహణం అందించినట్లు చెప్పారు. -
మాజీ ప్రధాని రాజీవ్గాంధీకి ఘన నివాళి
తిరువళ్లూరు: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతిని తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. తిరువళ్లూరులోని డీసీసీ కార్యాలయంలో రాజీవ్గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించి దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు శశికుమార్ మాట్లాడుతూ రాజీవ్గాంధీ ఆశయాల కోసం కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని సూచించారు. అనంతరం హింసకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివాకర్, మైనారీటి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖలీల్రహ్మాన్, పార్టీ నేతలు దాస్, మోహన్రాజ్ పాల్గొన్నారు. వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో.. వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో రాజీవ్ చిత్ర పటాన్ని ఉంచి పూల మాల వేసి నివాళులర్పించారు. వేలూరులో కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకొని తీవ్ర వాదానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు వాహీద్బాషా అధ్యక్షతన రాజీవ్ చిత్ర పటాన్ని ఉంచి ఆయన సేవల్ని కొనియాడారు. నిరుపేద ప్రజలకు అవసరమైన పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలి పోయారన్నారు. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలతోనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఆయన చిత్ర పటాన్ని ఉంచి పూజిస్తున్నారన్నారు. దేశంలో తీవ్ర వాద శక్తులు లేకుండా చేసేందకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు టీకా రామన్, మూడవ డివిజన్ అద్యక్షులు రగు, ప్రధాన కార్యదర్శి బాలక్రిష్ణన్, కప్పల్మణి, కోణి కుమార్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అదేవిధంగా వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాలో తీవ్ర వాదానికి వ్యతిరేకంగా అధికారులు ప్రతిజ్ఞ చేశారు. రాజీవ్గాంధీ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు, వేలూరు: రాజీవ్ చిత్ర పటానికి పూల మాల వేసి ప్రతిజ్ఞ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు -
మలేషియా ర్యాపర్ ఆల్బమ్ ‘నావేరే లెవెల్’
తమిళసినిమా: ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్లలో దుమ్ము రేపుతున్నాయి. యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హిప్ హాప్ సాంగ్స్కు క్రేజ్ పెరుగుతోంది. తాజాగా అలాంటి హిప్ హాప్ మ్యూజికల్ పాటతో.. నా వేరే లెవెల్ ఆల్బమ్ రూపొంది, యూట్యూబ్ ఛానళ్లలో సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. మలేషియా ర్యాపర్ కిడ్ సాంతే ఆడి పాడి, సంగీతాన్ని అందించిన ఈ ఆల్బమ్ కు పార్తీపన్ రవి దర్శకత్వం వహించారు. దీన్ని సోనీ మ్యూజిక్ సంస్థ విడుదల చేసింది. దీనికి సంబంధించిన మీడియా సమావేశాన్ని బుధవారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించారు.ఇందులో పాల్గొని హిప్ హాప్ ర్యాపర్ కిడ్ సాంతే మాట్లాడుతూ ‘‘ ఈ పాట ద్వారా నన్ను నేను హీరోగానో, సంగీత దర్శకుడుగానో చూపించాలని కోరుకోవడంలేదు. తమిళనాడులోని నిజమైన హీరోలను. చూపించడానికే ఈ మ్యూజికల్ ఆల్బమ్ను రూపొందించాను. ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుస్తున్నారు. వారే మన జీవితంలో గుర్తింపుకు నోచుకోని నిజమైన హీరోలు. నేను చైన్నెకి వచ్చిన మొదటి సారి కారు పంక్చర్ అయినప్పుడు టైర్ మార్చడానికి ఒక ఆటో డ్రైవర్ సాయం చేస్తున్నప్పుడే నా వేరే లెవెల్ పాటకు బీజం పడింది. ఈ ఆల్బమ్ను విడుదల చేసిన సోనీ మ్యూజిక్ సంస్థకు ధన్యవాదాలు ‘‘ అని మలేషియా ర్యాపర్ కిడ్ సాంతే పేర్కొన్నారు. తమిళసినిమా: మహిళలకు అనుకూలంగా ఉండే చట్టాలను కొందరు మహిళలు తప్పుగా వాడుకుంటున్నారని నటి మీరా చోప్రా పేర్కొన్నారు. ఈ బాలీవుడ్ భామ ఇంతకు ముందు తమిళంలో మరుదమలై, అన్ఫే ఆరుయిలే, జాంబవాన్, తదితర చిత్రాల్లో కథానాయికిగా నటించారు. కాగా నటుడు రవి మోహన్, ఆయన భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆర్తి, ఆమె కుటుంబం తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు, తన పిల్లలను కూడా కలవకుండా చేస్తున్నారని, ఆ వేదనతో తాను రెండుసార్లు చేతి నరాలు కట్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇటీవల మీడియా ముందు వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. ఆర్తి నుంచి విడాకులు పొందే వరకు తాను సినిమాల్లో నటించనని కూడా ఆయన ప్రకటించారు. రవిమోహన్ వ్యవహారంపై పలువురు పలు విధాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నటి మీరా చోప్రా ఈ విషయంపై నటుడు రవి మోహన్ కు సపోర్ట్ గా మాట్లాడం విశేషం. ఆమె ఇటీవల ఒక వేదికపై మాట్లాడుతూ ‘‘ నటుడు రవి మోహన్ నాకు బాగా తెలుసు. సమీపకాలంలో ఆయన వివాహ రద్దు వార్తలను చూశాను. వివాహ ముగింపుకు ఎప్పుడూ మగవాళ్లే దోషులుగా ఉండరు. మహిళలకు అనుకూలంగా ఉండే చట్టాలను కొందరు మహిళలు తప్పుగా వాడుకుంటున్నారు. ఒక మగవాడి పక్కన ఉన్న న్యాయాన్ని ఆలకించాలి. నటుడు రవి మోహన్ చాలా మంచి వ్యక్తి, నిరాడంబరుడు. ఆయన పక్కన ఉన్న నీతి, న్యాయం గెలుస్తుంది అని నమ్ముతున్నాను ‘‘ అని నటి మీరా చోప్రా పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే నటుడు రవి మోహన్ ఇటీవల అయ్యప్ప స్వామి మాల ధరించి వ్రతం పాటిస్తున్నారు. నటి మీరా చోప్రా ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో ఫస్ట్లుక్ పోస్టర్ చట్టాలను కొందరు మహిళలు తప్పుగా..! -
సంకీర్ణ ప్రభుత్వానికి ఆహ్వానం
సాక్షి, చైన్నె : తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు, నూతన సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై విరుదా చలం నియోజకవర్గ ఎమ్మెల్యే, డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం విరుదాచలం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందే తాను ఒక విషయం స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం వస్తే దానిని స్వాగతిస్తామని డీఎంకే కూడా గతంలో పేర్కొందన్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు అయితే వచ్చిందన్నారు. కానీ, ఇది ప్రజలకు మేలు చేసే ఆరోగ్యకరమైన మార్పుగా ఉండాలిలన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి ఒంటరిగా పూర్తి మెజారిటీ లేనందువల్లే, మద్దతు ఇస్తున్న కూటమి భాగస్వామ్య పక్షాల అందరికీ మంత్రి పదవులు పంచుతున్నారని పేర్కొన్నారు. మేమూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతాం – మంత్రి అరుణ్రాజ్ స్పష్టీకరణ అన్నానగర్: తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి అరుణ్రాజ్ బుధవారం చైన్నెలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. అనంతరం మంత్రి అరుణ్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ.... ‘‘మేం ఆరోగ్య సంరక్షణ రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి విజయ్తో సంప్రదించాం. ఆ సమయంలో, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, సాధారణ రోగులకు ఉత్తమమైన చికిత్స అందించాలని ఆయన మాకు సలహా ఇచ్చారు. ప్రజలు చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రులలో, అన్ని రకాల నాణ్యమైన చికిత్సలు, మందులు ఎటువంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా ఉచితంగా అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులలోని మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవన్న ఆరోపణను నేను కాదనడం లేదు. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచడానికి మేము తక్షణ చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ శాఖనే మేం నమ్మకపోతే, ఇంకెవరు నమ్ముతారు? మేం కూడా చ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రులలోనే చికిత్స పొందుతాం’’ అని పేర్కొన్నారు. చైన్నె పోలీస్ కమిషనర్గా అమల్రాజ్ సాక్షి, చైన్నె: తమిళనాడు రాజధాని చైన్నె నగర పోలీస్ విభాగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. చైన్నె గ్రేటర్ పోలీస్ నూతన కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎ. అమల్రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో, పరిపాలనా, శాంతిభద్రతల సమీక్షలో భాగంగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఇందులో అత్యంత కీలకమైన చైన్నె సిటీ పోలీస్ కమిషనర్ బాధ్యతలను ప్రభుత్వం అమల్రాజ్కు అప్పగించింది. ఎ. అమల్రాజ్ తమిళనాడు క్యాడర్కు చెందిన అత్యంత సమర్థుడైన సీనియర్ ఐపీఎస్ అధికారి. గతంలో ఆయన రాష్ట్రంలోని పలు ముఖ్య జిల్లాలకు పోలీస్ సూపరింటెండెంట్ గా, కీలక నగరాలకు కమిషనర్గా సేవలు అందించారు చైన్నె కమిషనర్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన తిరుచ్చి, కోయంబత్తూర్ నగరాల పోలీస్ కమిషనర్గా, అడిషనల్ డీజీపీ క్యాడర్లో వివిధ కీలక విభాగాలలో పనిచేశారు. కాగా, ఎన్నికల సమయంలో చైన్నె పోలీసు కమిషనర్గా ఉన్న అరుణ్ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో అదనపు డీజీపీ హోదాలో ఉన్న అభిన్ దినేష్ మోదక్ను నియమించారు. ప్రస్తుతం ఆయన్ను తప్పించి గ్రేటర్ చైన్నె కమిషనర్గా అమల్ రాజ్కు బాధ్యతలు అప్పగించారు. త్రిభాషా విధానాన్ని ఆమోదించవద్దు – ముఖ్యమంత్రి విజయ్కి వైగో విజ్ఞప్తి కొరుక్కుపేట: ప్రధాని నరేంద్రమోదీ చేసిన త్రిబాషా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమోదించకూడదని సీఎం విజయ్కి ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి 1965లో భాషా విప్లవంగా చెలరేగింది. సింగతమిళన్ చిన్నస్వామి, ఆరంగనాథన్, రచయిత వీరప్పన్, కీరనూర్ ముత్తు, సత్యమంగళం ముత్తు, విరాలిమలై షణ్ముగం, మయిలాడుదురై సారంగ పాణి, పీలమేడు దండ పాణి హిందీని ఎదిరించి ప్రాణాలర్పించారు. ఈనేపథ్యంలో తాజాగా మోదీ ప్రభుత్వం పీఎంశ్రీ పథకం ద్వారా తమిళనాడులో త్రిభాషా విధానాన్ని, హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని ఎన్నటికీ అంగీకరించకూడదు అని ఆయన సీఎంకి సూచించారు. -
80 ఏళ్ల వృద్ధుడికి ఎల్వీఏడీ హార్ట్ పంప్ అమరిక..
సాక్షి, చైన్నె : భారతీయ వైద్యరంగంలో చైన్నెకి చెందిన ప్రముఖ ఆసుపత్రి ఎంజీఎం హెల్త్కేర్ సరికొత్త మైలురాయిని సృష్టించింది. తీవ్రమైన గుండె వైఫల్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 80 ఏళ్ల వృద్ధుడికి అత్యంత అధునాతన లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్(ఎల్వీఏడీ) అనే మెకానికల్ హార్ట్ పంప్ను విజయవంతంగా అమర్చారు. ఇంతటి వృద్ధాప్యంలో ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడం ఇదే ప్రపథమం అని ఎంజీఎం హెల్త్కేర్ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి విభాగం అధిపతి డాక్టర్ కె.ఆర్. బాలకృష్ణన్, కో–డైరెక్టర్ డాక్టర్ సురేష్ రావు వివరించారు. చైన్నెకి చెందిన సదరు రిటైర్డ్ ఉద్యోగి (80) గత కొంతకాలంగా గుండె చివరి దశ వైఫల్యంతో బాధపడుతున్నారని తెలిపారు. గుండెలోని ఎడమ జఠరిక శరీరాంతరానికి రక్తాన్ని పంపింగ్ చేయలేకపోవడంతో ఆయనకు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు. లంగ్స్ (ఊపిరితిత్తులు) లో నీరు చేరడం, కిడ్నీల పనితీరు క్షీణించడం, లో–బీపీ వంటి మల్టీ–ఆర్గాన్ సమస్యలు ఎదురయ్యాయని వివరించారు. రోగి వయసు 80 ఏళ్లకు దగ్గరగా ఉండటం, శరీరం చాలా బలహీనంగా మారడం , కిడ్నీలు దెబ్బతినడం వల్ల వైద్యులు గుండె మార్పిడి చికిత్సను నిరాకరించారు. దీనికి ప్రత్యామ్నాయంగా గుండె పంపింగ్ సామర్థ్యాన్ని పెంచే మెకానికల్ పంప్(ఎల్వీడీ)ని అమర్చాలని నిర్ణయించారు. ఈ అరుదైన, అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సను వైద్యుల బృందం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. శస్త్రచికిత్స అనంతరం మూడు వారాల పాటు ఆసుపత్రిలో కోలుకున్న రోగిని సురక్షితంగా డిశ్చార్జ్ చేశామన్నారు. -
విజయ్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణం.. చివర్లో ట్విస్టు!
చెన్నై: ఇటీవల తమిళనాడులో కొలువుదీరిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం.. తన క్యాబినెట్ను విస్తరించడంతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులుగా చాన్స్ దక్కింది. ఫలితంగా కాంగ్రెస్ ‘సుదీర్ఘ’ ఘనతను సొంతం చేసుకుంది. ఇలా ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ భాగస్వామ్యం కావడం తమిళనాడు చరిత్రలో 59 ఏళ్ల తర్వాతి ఇదే తొలిసారి. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో అది కాస్తా తమిళనాడు రాజకీయాల్లో అరుదైన ఘటనగా చేరిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన ఎస్. రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్లు విజయ్ మంత్రివర్గంలో చోటు దక్కడంతో దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకర కార్యక్రమం ఈరోజు(గురువారం, మే 21 వ తేదీ) జరిగింది. అయితే మంత్రిగా ఎస్ రాజేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ నామస్మరణలు చేయడం తమిళనాడులో కొత్త చర్చకు దారి తీసింది. ‘ ప్రజానాయకుడు కామరాజర్ వర్ధిల్లాలి, రాజీవ్ గాంధీ వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ వర్ధిల్లాలి’ అని ప్రమాణ స్వీకారం చివర్లో పేర్కొన్నారు. దీనిపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగం చివర్లో చోటు చేసుకున్న ఈ ట్విస్టుతో గవర్నర్ ఒక్కసారిగా తేరుకున్న గవర్నర్.. ఇది ప్రమాణ స్వీకారంలో భాగం కాదంటూ రాజేశ్కుమార్కు గుర్తు చేశారు. VIDEO | Tamil Nadu Cabinet expansion: During the swearing-in ceremony, Congress MLA Rajesh Kumar, while taking oath as minister, hailed Kamaraj, Rajiv Gandhi and Rahul Gandhi; Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar remarked, "Not part of the oath."(Full video available… pic.twitter.com/dT7TkpcxY5— Press Trust of India (@PTI_News) May 21, 2026 -
తమిళనాడు ఏఐ మంత్రి ఆయనే
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గురువారం మంత్రి వర్గాన్ని విస్తరించారు. కొత్తగా 23 మందికి తన కేబినెట్లో స్థానం కల్పించారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) నుంచి 21 మంది, కాంగ్రెస్ నుండి ఇద్దరు శాసనసభ్యులను మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో వీరితో గర్నవర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం విజయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ పాల్గొన్నారు. కొత్తగా చేరిన మంత్రులతో తమిళనాడు కేబినెట్లోని సభ్యుల సంఖ్య 33కి చేరింది. మంత్రివర్గ విస్తరణ జరడంతో ఇంతకుముందు ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు చేశారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలు కేటాయించారు. సీఎం విజయ్ కూడా తన దగ్గరున్న కొన్ని శాఖలకు కొత్త మంత్రులకు బదిలీ చేశారు. ఎన్నికల్లో హామీయిచ్చినట్టుగానే ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రిత్వ శాఖను తొలిసారిగా ఏర్పాటు చేశారు. డాక్టర్ ఆర్ కుమార్కు ఈ శాఖను కేటాయించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ శాఖను కూడా ఆయనకే అప్పగించారు. దేశంలోనే తొలి ఏఐ మంత్రిగా ఆర్ కుమార్ గుర్తింపు పొందనున్నారు. వేలచ్చేరి నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్కు కీలక శాఖలుకాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎస్. రాజేశ్కుమార్, పి. విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో 59 ఏళ్ల తర్వాత తమిళనాడు కేబినెట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం దక్కింది. రాజేశ్కుమార్ పర్యాటక శాఖ, విశ్వనాథన్కు ఉన్నతవిద్య శాఖ కేటాయించారు. ఇది ఊహించలేదు: ఐయూఎంఎల్తమను మంత్రి వర్గంలో చేరమని సీఎం విజయ్ ఆహ్వానిస్తారని ఊహించలేదని ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిదీన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీవీకే ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇచ్చామని, మంత్రి పదవుల కోసం తాము అడగలేదని చెప్పారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడకపోతే గవర్నర్ పాలన వస్తుందని, తద్వారా బీజేపీ పెత్తనం చెలాయిస్తుందనే ఉద్దేశంతోనే విజయ్కు మద్దతు ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, ప్రభుత్వంలో చేరడానికి యూఎంఎల్ అంగీకరించినట్టు తెలుస్తోంది. మంత్రి పదవికి తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. కాగా, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) అధికార పక్షంలో భాగం కావాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం వెల్లడించలేదు.చదవండి: యూపీ రాజకీయాల్లో కీలక పరిణామం! -
స్టాలిన్ కక్ష కడితే.. విజయ్ విముక్తినిచ్చాడు
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు హాట్ చర్చకు దారి తీసింది. గత ప్రభుత్వ హయాంలో అరెస్టై జైల్లో ఉన్న ప్రముఖ యూట్యూబర్ ‘సావుక్కు’ శంకర్ను తక్షణమే విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. శంకర్పై గూండా యాక్ట్ను ఎత్తేయాలని పోలీస్శాఖను ఆదేశించారు. దీంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సావుక్కు శంకర్(Savukku Shankar) అనే పేరు తమిళనాడులో రాజకీయాలు, మీడియా, ప్రజాస్వామ్య చర్చల్లోనూ తరచూ వినిపిస్తుంటుంది. సావుక్కు అంటే కొరడా అని అర్థం. విజిల్బ్లోయర్గా, సిస్టమ్కి బలైన వ్యక్తిగా ఆయన అక్కడి జనాలు భావిస్తుంటారు. అదే సమయంలో ఆయన నోటి దురుసును విమర్శించేవాళ్లు లేకపోలేదు. ఆయన ట్రాక్ రికార్డు చెప్పాలంటే.. గత ఐదేళ్ల కాలంలో ఏకంగా తొమ్మిదిసార్లు అరెస్ట్ అయ్యారు ఆయన. ఎవరీ సావుక్కు శంకర్.. ఆచిముత్తు శంకర్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి. విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగంలో క్లర్క్గా పని చేశారు. అయితే 2008లో తమిళనాట సంచలనం సృష్టించిన ఆడియో లీక్ కేసులో సస్పెండ్ అయ్యి.. దర్యాప్తు తదనంతరం ఉద్యోగం పొగొట్టుకున్నారు. ఆ స్కాంలో ఓ మంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఆపై సావుక్కు అనే వెబ్సైట్, యూట్యూబ్ చానెళ్ల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. అవినీతి, అధికార దుర్వినియోగం బయటపెట్టిన వ్యక్తిగా ఆయనకంటూ తమిళనాట ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలక్రమంలో ఆయన నోటి నుంచి నిజాలే వస్తాయని జనం భావించేంతగా పరిస్థితి చేరుకుంది. దీంతో వ్యవస్థ నుంచి ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలపై ఆయన చేసిన విమర్శలు, న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు.. ప్రజల్లో ఒక వర్గానికి ఆయనను ధైర్యవంతుడిగా చూపించాయి. అవినీతి వ్యతిరేకంగా పోరాడే యువత, ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నవారు ఈయనకు మద్దతుగా నిలిచేవారు. అదే సమయంలో.. మహిళలపై నోరు పారేసుకోవడం, వ్యక్తిగత దాడులు ఆయనపై కాస్త నెగెటివిటీని క్రియేట్ చేశాయి. డీఎంకే హయాంలో..2021లో స్టాలిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శంకర్పై వరుసగా కేసులు నమోదయ్యాయి. గూండాస్ యాక్ట్ కింద పలుమార్లు అరెస్టు కావడం, ఎన్డీపీఎస్ కేసులు ఎదుర్కొన్నప్పటికీ, కోర్టులు మాత్రం ఆయన్ని నిర్దోషిగా తీర్పునిస్తూ డీఎంకే ప్రభుత్వానికి మొట్టికాయలు వేసేవి. అంతెందుకు 2024లో, మద్రాస్ హైకోర్టు ఆయనపై ఉన్న ఓ సంబంధించి నిర్బంధాల్ని రద్దు చేసింది. దీంతో.. డీఎంకే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఆయన్ని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని తమిళ ప్రజలు భావించేవారు. ‘‘తప్పుడు కేసులతో స్టాలిన్ ప్రభుత్వం నా నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది’’ అంటూ స్వయంగా ఆయన కూడా ఆరోపించేవారు. ఈ ఏడాది పరువు నష్టం కేసులోనూ మద్రాస్ హైకోర్టు ఆయనకు బెయిల్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉండగానే..2026 ఏప్రిల్లో చెన్నై పోలీసులు గూండాస్ చట్టం కింద నిర్బంధం విధించారు. ఏపీలో అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకువచ్చే సమయంలో పోలీసులపై రాళ్లు విసిరారని కేసు పెట్టారు. అయితే ఈ కేసులో ఆయన నిర్దోషి అని విజయ్ ప్రభుత్వం గుర్తించింది. అడ్వైజరీ బోర్డు పరిశీలనలో ఆయన నిర్బంధానికి తగిన కారణం లేదని తేలడంతో విడుదల చేయాలని ఆదేశించింది. ఆయనపై ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. వాటిలో చిక్కులను పరిశీలించాక ఆయన్ని విడుదల చేయాలని పోలీసు శాఖకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడో విషయం ఏంటంటే.. సావుక్కు శంకర్ విజయ్నూ వదల్లేదు. కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే అధినేత తీరును ఏకిపారేస్తూ వీడియో సిరీస్ తీశాడు. వాటికి విపరీతంగా ఆదరణ దక్కింది. -
రూ.2,500 రూపాయలు ఎప్పుడు వస్తాయి..
చెన్నై: తన మనవడు, మనవరాలు చెప్పినందుకే టీవీకే పార్టీకి ఓటు చేశామని రూ. 2,500 ఎప్పుడు వస్తాయని ఒక మహిళ ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యేను ప్రశ్నించారు. శివగంగ జిల్లాలోని మనమదురై ప్రభుత్వ ఆసుపత్రిని టీవీకే ఎమ్మెల్యే ఇలంగోవన్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రాథమిక సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న చికిత్సను ఆయన పరిశీలించారు. ఆయన ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. తనిఖీ సమయంలో, మునియమ్మల్ అనే ఒక రోగి ఎమ్మెల్యేను ఇలా అడిగారు, ‘నా మనవడు, మనవరాలు అందరూ మీకు ఓటు వేయమని నన్ను అడిగారు. అందుకే మీకు ఓటు వేశాము. మేము కూడా మీరు రూ. 2,500 ఎప్పుడు ఇస్తారని ఎదురుచూస్తున్నాం అని అడిగారు.’ దీనికి ప్రతిస్పందనగా, ఎమ్మెల్యే ఇలంగోవన్, ‘ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 2,500 కంటే కూడా యువతకు ఉద్యోగాలు కల్పించడమే ముఖ్యం’ అని చెప్పారు. ఇది విని మునియమ్మాల్ నిరాశ చెందారు. -
తమిళనాడు.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కి అదృష్టం
చెన్నై: తమిళనాడులో సీఎం జోసెఫ్ విజయ్ మంత్రివర్గంలో మిత్రపక్షం కాంగ్రెస్ కూడా చేరబోతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎస్.రాజేశ్ కుమార్, పి.విశ్వనాథన్కు మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంగీకారం తెలిపారు. వారిద్దరూ ఈ నెల 21న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ బుధవారం వెల్లడించారు. ఈ క్రమంలో తమ పార్టీకి ఇది చరిత్రాత్మక సందర్భమని అన్నారు. 59 ఏళ్ల తర్వాత తమిళనాడు కేబినెట్లోకి తమ పార్టీ అడుగుపెడుతోందని స్పష్టంచేశారు. మరోవైపు విడుదలై చిరుతైగళ్ కట్చి(వీసీకే), ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలకు సైతం మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. అన్నా డీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సైతం మంత్రియోగం ఉందా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. గురువారం ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానిపై లోక్భవన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 1967లో అధికారం కోల్పోయింది. ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఆ పార్టీ పలు కూటముల్లో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చేరే అవకాశం రాలేదు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడంపై వేణుగోపాల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో రాజేశ్ కుమార్, పి. విశ్వనాథన్ గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారు పనిచేస్తారని విశ్వసిస్తున్నాం. రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ప్రజాహిత పరిపాలన లక్ష్యాలను వారు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా" అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్కు నిరాశే.. ఇక, తమిళనాడు రాజకీయాల్లో ఈ పరిణామానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే, 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేదు. 1952 నుంచి 1967 వరకు అప్పటి మద్రాస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. సి. రాజగోపాలాచారి, కె. కామరాజ్, ఎం. భక్తవత్సలం ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే, 1967లో డీఎంకే ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ద్రావిడ పార్టీల ఆధిపత్యం కొనసాగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ డీఎంకే, ఏఐఏడీఎంకేతో పొత్తులు పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంలో మాత్రం భాగస్వామ్యం కాలేదు. ప్రత్యేకంగా 2006-11 మధ్య డీఎంకే ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికార భాగస్వామ్యం కోరినా ఫలితం లేకపోయింది. -
గ్రామీణ సంక్షేమ శాఖకు 40 కొత్త వాహనాలు
సాక్షి, చైన్నె: తమిళనాడు వైద్య , గ్రామీణ సంక్షేమ సేవల డైరెక్టరేట్ ఉపయోగం కోసం రూ. 2.90 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 40 కొత్త వాహనాలను సీఎం జోసెఫ్ విజయ్ ప్రారంభించారు. బుధవారం చైన్నెలోని సెక్రటేరియట్ (సచివాలయం) వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం విజయ్ వాహనాల తాళాలను డ్రైవర్లకు అందజేసి, జెండా ఊపి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. స్వయంగా వాహనాన్ని నడిపి అందర్నీ ఆశ్చర్య పరిచారు. జిల్లా స్థాయిలో వైద్య సేవల పర్యవేక్షణను మరింత ముమ్మరం చేసేందుకు ఈ అధునాతన వాహనాలను కేటాయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, స్కాన్ సెంటర్లలో ప్రీ–నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ చట్టం 1994 ప్రకారం గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా అని తనిఖీ చేయడానికి, తమిళనాడు ప్రైవేట్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1997 నిబంధనల ప్రకారం అన్ని వైద్య సంస్థలు సక్రమంగా నమోదై నడుస్తున్నాయా లేదా అని పర్యవేక్షించడానికి, రాష్ట్రంలో ఎక్కడైనా నకిలీ వైద్యులు (రెక్ లెస్ క్వాక్స్) ఉన్నట్లు సమాచారం అందితే, తక్షణమే అక్కడికి చేరుకుని విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, విపత్తు సమయాల్లో అత్యవసర సేవలు పర్యవేక్షణకు ఈ వాహనాలు ఉపయోగకరంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో తమిళనాడు వైద్య , ప్రజా సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ కె.జి. అరుణ్రాజ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ , ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ థారేజ్ అహ్మద్ , అదనపు కార్యదర్శి డాక్టర్ ఎస్. ఉమ , గ్రామీణ సంక్షేమ సేవల డైరెక్టర్ డాక్టర్ చిత్ర పాల్గొన్నారు. ప్రత్యేక విభాగంలో హడావిడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జోసెఫ్ విజయ్ తొలిసారిగా తనిఖీలు నిర్వహించనున్న సమాచారంతో రాత్రికి రాత్రే అధికారులు ప్రత్యేక విభాగం రూపు రేఖల్ని మార్చేశారు. చైన్నెలోని ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగం (ప్రజల నుండి నేరుగా వినతిపత్రాలు స్వీకరించే కీలక శాఖ) కార్యాలయాన్ని రాత్రికి రాత్రే హడావిడిగా కంప్యూటర్లు, పరికరాలను తనిఖీ చేసి, శుభ్రం చేసి కొత్త లుక్ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి వస్తారని పాత్రికేయులు, అధికారులు గంటల తరబడి ఆత్రుతగా ఎదురుచూశారు. కానీ చివరి నిమిషంలో ఆయన రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. అయితే ఆయన రాకపోయినా కార్యాలయం మాత్రం కొత్త రూపాన్ని సంతరించుకుంది. అయోధ్యీదాసర్కు నివాళి ద్రవిడ ఉద్యమ ఆద్యుడు, సామాజిక విప్లవకారుడు పండిత అయోధ్యీదాసర్ 181వ జయంతిని పురస్కరించుకుని తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఆయనకు ఘన నివాళులర్పించారు. బుధవారం ఉదయం చైన్నె గిండిలోని గాంధీ మండపం ప్రాంగణంలో ఉన్న అయోధ్యీదాసర్ విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించారు. అయోధ్యీదాసర్ జీవిత విశేషాలు , సేవలను గుర్తు చేశారు. సామాజిక సంస్కర్త మాత్రమే కాకుండా.. ఒక అద్భుతమైన రచయిత, పరిశోధకుడు, చరిత్రకారుడు, ప్రసంగీకుడు, బహుభాషా కోవిదుడు నిపుణుడైన సిద్ధ వైద్యుడు , సమాజంలో కుల నిర్మూలన, సామాజిక విముక్తి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తిగా అభివర్ణించారు. ఈ నివాళిలో సీఎం విజయ్తో పాటూ మంత్రులు ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, సెంగోట్టయన్, వెంకటరమణన్, నిర్మల్కుమార్, రాజ్ మోహన్, టికే ప్రభు పాల్గొన్నారు. -
పుదుచ్చేరిలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ వేదికగా బుధవారం కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ఆసక్తికరంగా, పలు వినూత్న ఘటనలతో జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాత్కాలిక స్పీకర్ (ప్రోటెం స్పీకర్) అన్బళగన్ అధ్యక్షతన బుధవారం తొలి శాసనసభ సమావేశమైంది. మంగళం నియోజకవర్గం నుంచి ఎన్నికై న సీఎం రంగస్వామి తొలుత భగవంతుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రులు నమశ్శివాయం, మల్లాడి కృష్ణారావు కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ కార్యక్రమం అంతా అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల విలక్షణ ఘటనలతో సందడిగా మారింది. విజయ్ ఫోటో చూపించిన టీవీకే ఎమ్మెల్యే.. తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పుదుచ్చేరి ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకుంది. మణవేలి నియోజకవర్గం నుంచి గెలిచిన టీవీకే ఎమ్మెల్యే రాము ప్రమాణ స్వీకారం చేస్తూ, తన చేతిలో ఉన్న పార్టీ అధినేత విజయ్ ఫొటోను సభలో ప్రదర్శించారు. అలాగే ఏంబలమ్ నియోజకవర్గ ఎమ్మెల్యే మోహన్ దాస్ ప్రమాణ స్వీకారం చేస్తూ.. దేవుడితో పాటు తన రాజకీయ గురువు ఎన్.ఆర్ఙ్ (సీఎం రంగస్వామి) పేరును ప్రస్తావించారు. డీఎంకే ఎమ్మెల్యే విఘ్నేష్ కణ్ణన్ ప్రమాణ స్వీకారం ముగిశాక కణ్ణన్ కీర్తి వర్ధిల్లాలి అని నినాదం చేశారు. దీనిపై ప్రోటెం స్పీకర్ స్పందిస్తూ, ఎమ్మెల్యేలు ఉత్సాహంతో ప్రమాణ స్వీకార పత్రంలో లేని అదనపు మాటలు మాట్లాడుతున్నారని, అవన్నీ అసెంబ్లీ రికార్డుల్లోకి వెళ్ళవని స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారంలోనూ నిరసన అసెంబ్లీలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో ప్రధాన అంశం డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ కుమార్ ప్రమాణ స్వీకారం. బాహూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన తమిళంలో కాకుండా మలయాళంలో ప్రమాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరిలో ఫ్రెంచ్ భాషకు ఉన్న ప్రాధాన్యతను, ప్రస్తుత పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సెంథిల్ కుమార్ మొదట ఫ్రెంచ్ భాషలో ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి కోరారు. అయితే అసెంబ్లీ సెక్రటరీ దయాళన్.. ఫ్రెంచ్ భాషలో ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇక్కడ ఎలాంటి సాంప్రదాయం, నిబంధనలు లేవని చెప్తూ అనుమతి నిరాకరించారు. దీనికి నిరసనగా, ఫ్రెంచ్ భాషా ప్రాముఖ్యతపై అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఆయన తమిళానికి బదులుగా కేరళ అధికారిక భాష అయిన మలయాళంలో ప్రమాణ స్వీకారం చేసి తన నిరసనను నమోదు చేశారు. ఇదిలా ఉండగా పుదుచ్చేరిలోని మొత్తం 30 స్థానాల్లో ఎన్డీయే కూటమి రికార్డు స్థాయిలో మళ్లీ మెజారిటీ సాధించింది. ఇందులో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 12, బీజేపీ 4, అన్నాడీఎంకే 1, ఎల్జేపీ 1 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రతిపక్షంలో డీఎంకే 5, కాంగ్రెస్ 1, నేయం మక్కల్ కళగం 1, టీవీకే 2, ముగ్గురు స్వతంత్రులు గెలుపొందారు. సీఎం విజయ్తో మాట్లాడి స్థలం సేకరిస్తాం: రంగస్వామి పుదుచ్చేరి విమానాశ్రయ (ఎయిర్పోర్ట్) విస్తరణ పనుల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో మాట్లాడి, తమిళనాడు పరిధిలోకి వచ్చే భూమిని సేకరించి విస్తరణ పనులు చేపడతామని పుదుచ్చేరి సీఎం ఎన్. రంగస్వామి స్పష్టం చేశారు. పుదుచ్చేరి అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమిళనాడులో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అద్భుతంగా పని చేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ, పుదుచ్చేరికి చెందిన ఆనంద్కు తమిళనాడు క్యాబినెట్లో మంత్రి పదవి దక్కడం సంతోషకరం. ఎంతో అనుభవజ్ఞుడైన ఆయన మంత్రిగా రాణిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. విమానాశ్రయ విస్తరణ – అభివృద్ధి పుదుచ్చేరి ఎయిర్పోర్ట్ రన్వే విస్తరణకు తమిళనాడు పరిధిలోని భూములు అవసరం ఉన్న నేపథ్యంలో.. ఈ విషయంపై తమిళనాడు సీఎం విజయ్తో స్వయంగా మాట్లాడి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం రంగస్వామి తెలిపారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లుగానే పుదుచ్చేరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ శ్రీబెస్ట్ పుదుచ్చేరిశ్రీగా మారుతోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రూ. 100 కోట్ల బేరసారాల ఆరోపణలు పుదుచ్చేరిలో మంత్రి పదవి కోసం 100 కోట్ల రూపాయల బేరసారాలు జరిగాయంటూ మాజీ సీఎం నారాయణ స్వామి చేసిన ఆరోపణలపై రంగస్వామి స్పందించారు. ఆ బేరసారాలు ఎవరెవరి మధ్య జరిగాయో నారాయణ స్వామి స్పష్టంగా చెప్తే, దానిపై కచ్చితంగా విచారణ జరిపిస్తాం అని సవాల్ విసిరారు. పుదుచ్చేరికి కేంద్ర పాలిత ప్రాంతం నుంచి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా తీసుకురావడానికి తమ ప్రభుత్వం నిరంతరం ఒత్తిడి తెస్తూనే ఉంటుందని చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, కచ్చితంగా పుదుచ్చేరికి రాష్ట్ర హోదా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక, తన రాజీనామాతో ఖాళీగా ఉన్న తట్టాంచావడి నియోజకవర్గానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, కూటమి తరపున అభ్యర్థి ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని సీఎం రంగస్వామి పేర్కొన్నారు. -
పళ్లిపట్టులో జాతర సందడి
పళ్ళిపట్టు: పళ్లిపట్టులో గంగజాతర వేడుకలు సందర్భంగా మంగళవారం గ్రామదేవత కొళ్లాపురమ్మకు విశేష అభిషేక పూజలు చేపట్టి మహాదీపారాధన చేశారు. మహిళలు అంబలి నైవేద్యం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం గ్రామ దేవత కొళ్లాపురమ్మ మహిషాసురమర్ధిని అలంకరణలో పుష్పాలతో అలంకరించిన వాహనంలో కొలువుదీర్చి పట్టణ వీధుల్లో ఊరేగించారు. రాత్రి గంగమ్మతల్లిని బాణసంచా వేడుకలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టణ వీధుల్లో ఊరేగించారు. మహిళలు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించారు. బుధవారం మధ్యాహ్నం గంగమ్మతల్లిని బజారు వీధిలోని గాంధీ విగ్రహం వద్ద కొలువుదీర్చారు. మహిళలు కుంభం సమర్పించారు. యువత కాళి వేషదారణలో పట్టణ వీధుల్లో హల్చల్ చేశారు. సాయంత్రం 6 గంటలకు అశేష జనం నడుమ అమ్మవారిని పట్టణ వీధుల్లో ఊరేగించి నిమజ్జనంకు తరలించారు. -
మెడికల్ షాపుల నిర్వాహకుల ధర్నా
తిరువళ్లూరు: ఆన్లైన్ ద్వారా మందులు విక్రయించడాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు మెడికల్షాపు నిర్వాహకుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పెద్దకుప్పం రైల్వేస్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సంఘం రాష్ట్రకార్యదర్శి అశోక్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఆన్లైన్ ద్వారా మెడిషన్ విక్రయించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 44 వేల దుకాణాలపై ప్రభావం పడుతుందని, దీంతో పలువురు ఉపాధి కోల్పోయే ప్రమాదం వుందని వాపోయారు. మెడికల్షాపు నిర్వాహకులు, దుకాణాల్లో పనిచేసే కార్మికులు సైతం తీవ్రంగా నష్టపోయే అవకాశం వుందన్నారు. ఆన్లైన్లో కాలం చెల్లిన మందులు, నాణ్యత లేని మెడికల్ వస్తువులను సైతం విక్రయిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆన్లైన్లో మెడిషన్ విక్రయాలను వెంటనే కట్టడి చేయాలని నినాదాలు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. -
క్లుప్తంగా
సేలం సామాజిక కార్యకర్తకు టీవీకే పేరిట బెదిరింపులు కొరుక్కుపేట: సేలం వాసి అయిన సామాజిక కార్యకర్త పీయూష్ మానూస్ సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను విమర్శిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. దీనికి అనుగుణంగానే, గత కొన్ని రోజులుగా ఆయన ముఖ్యమంత్రి విజయ్పై కూడా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఆయన విజయ్ను వ్యతిరేకించారు. ఇది చూసిన తర్వాత, టీవీకే వారు ఫోన్లో ఆయనను చంపేస్తామని బెదిరించారు. పీయూష్ మంగళవారం దీని ఆడియోను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అలాగే తాను 2006 నుండి రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని, సేలంలో మంత్రిగా ఉన్న వీరపాండి ఆరు ముఖాల గురించి కూడా నేను తీవ్రంగా మాట్లాడానని పేర్కొన్నారు. కానీ ఒక్క రోజు కూడా ఒక్క వ్యక్తి కూడా నన్ను బెదిరించలేదని, టీవీకే సభ్యులు అత్యంత అవినీతికి పాల్పడుతున్నారని, ప్రజలు వారికి ఒక అవకాశం ఇచ్చారని, వారు దానిని దుర్వినియోగం చేస్తే, ఆ అవకాశం ఎక్కువ కాలం నిలవదని ఆయన సూచించారు. టాస్మాక్ దుకాణాల ఆవరణలో నిబంధనలతో కూడిన బ్యానర్లు కొరుక్కుపేట: దిండిగల్ జిల్లాలో 144 టాస్మాక్ దుకాణాలు పనిచేస్తుండేవి. వీటిలో, పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్టాండ్ల సమీపంలో పనిచేస్తున్న 26 టాస్మాక్ దుకాణాలను మూసివేశారు. అంతేకాకుండా, ఓ బాటిల్ మద్యంపై ధర కంటే రూ.10 అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణ చాలా కాలంగా ఉంది. అందువల్ల, దానిని సరైన ధరకు విక్రయించడం అవసరం. అదనపు ధరకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అయితే, వివిధ ప్రాంతాల్లో అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారు. దీని కారణంగా మద్యం ప్రియులకు, అమ్మకందారులకు మధ్య తరచుగా వాగ్వాదాలు, వివాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో అదనపు ధరకు మద్యం అమ్మకాలను శాశ్వతంగా నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో టాస్మాక్ షాపులో సరైన ధరకే మద్యం కొనుగోలు చేయవచ్చని, మీరు క్యూలో నిలబడి, నిర్ణీత ధరకంటే ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు చేసేలా తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తెలియజేస్తూ.. మద్యం షాపుల వద్ద బ్యానర్లను ఏర్పాటు చేశామని షాపు సిబ్బంది తెలిపారు. దీంతో మద్యం ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో రూ.1.73 కోట్ల మోసం తిరువొత్తియూరు: చైన్నె, పోరూర్ ప్రాంతానికి చెందిన యోగానంద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇతనికి ఫేస్బుక్ ద్వారా కోయంబత్తూరు కౌండంపాలయంకు చెందిన అన్బళగన్ (35) పరిచయమయ్యాడు. సిన్ చైన్ అనే యాప్ ద్వారా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే పెట్టుబడికి మూడు రెట్లు అధిక లాభం వస్తుందని అన్బళగన్ అతన్ని నమ్మించాడు. దీనిని నమ్మిన యోగానంద్, అన్బళగన్ సూచించిన 13 బ్యాంకు ఖాతాలకు వివిధ వాయిదాలలో మొత్తం రూ. 1 కోటి 73 లక్షల 48 వేల 330 బదిలీ చేశాడు. అయితే, చెప్పినట్లుగా లాభాలు రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన యోగానంద్, ఆవడి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ విభాగం ఇన్స్పెక్టర్ సుభాషిణి విచారణ చేపట్టి అన్బళగన్ను అరెస్ట్ చేశారు. విచారణలో అతను నకిలీ కంపెనీని ప్రారంభించి, ఒకే కంపెనీ పేరుతో వివిధ నగరాల్లోని బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. బాధితుడి నుంచి రూ. 13.86 లక్షలు నేరుగా అన్బళగన్ ఖాతాకే బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు తరలించారు. అలాగే ఈ మోసంతో సంబంధమున్న ఇతర రాష్ట్రాల వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. వేలూరు జిల్లాకు 32వ స్థానం వేలూరు: ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో వేలూరు జిల్లా 92.03 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 32వ స్థానంలో నిలిచింది. పది పరీక్ష ఫలితాలు బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో విడుదల చేశారు. వేలూరు జిల్లాలో 18,150 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందులో 16,704 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 92.03 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో వేలూరు 32వ స్థానంలో నిలిచింది. తిరుపత్తూరు జిల్లాలో మొత్తం 15,369 మంది పరీక్షలకు హాజరు కాగా అందులో 93.52 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాణిపేట జిల్లాలో 14,622 మంది పరీక్షలకు హాజరు కాగా 13,350 మంది ఉత్తీర్ణత సాధించి 85.48 శాతం సాఽధించారు. తిరువణ్ణామలై జిల్లాలో 30,934 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 90.46 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న 21 మంది ఖైదీలు పరీక్షలకు హాజరు కాగా వీరిలో మొత్తం 21 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఉపా ధ్యాయులు అభినందించారు. -
అన్నాడీఎంకే అధికారిక పత్రికగా పోర్వాళ్
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే పార్టీ అధికారిక దినపత్రికగా ‘పోర్వాళ్’( యుద్ధఖడ్గం)ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి బుధవారం ఆవిష్కరించారు. చైన్నెలోని తన నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ పత్రికకు సంబంధించిన మొదటి ప్రివ్యూ ప్రతిని ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె.పి. మునుస్వామి, మాజీ మంత్రులు ఎన్. దళవాయి సుందరం, ఓ.ఎస్. మణియన్, రాజేంద్ర బాలాజీ, అగ్రి కృష్ణమూర్తి, లాయర్ వింగ్ సెక్రటరీ ఇన్బదురై సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పత్రిక విడుదల వెనుక అసలు కథ ఇదే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి 53 స్థానాల్లో విజయం సాధించగా, అందులో అన్నాడీఎంకే ఒంటరిగా 47 స్థానాలను గెలుచుకుంది. అయితే ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని ప్రస్తుత పరిస్థితుల్లో.. అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష సమయంలో అన్నాడీఎంకేకు చెందిన సీనియర్ నేతలు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం నాయకత్వంలోని 25 మంది ఎమ్మెల్యేలు అనూహ్యంగా ’తమిళగ వెట్రి కళగం’ పార్టీకి మద్దతుగా ఓటు వేశారు. ఈ పరిణామంతో అన్నాడీఎంకేలో మళ్లీ తీవ్రమైన అంతర్గత సంక్షోభం మొదలైంది.‘నమదు అమ్మ’ స్థానంలో ‘పోర్వాళ్’ ఇప్పటివరకు అన్నాడీఎంకే అధికారిక పత్రికగా ‘నమదు అమ్మ’ చలామణిలో ఉండేది. అయితే, ప్రస్తుత పార్టీ సంక్షోభంలో ఆ పత్రిక ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా ఉన్న తిరుగుబాటు నేతలు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగంవర్గం గుప్పెట్లోకి చేరింది. ఈ నేపథ్యంలోనే తన పట్టును నిలుపుకోవడానికి , తన వర్గం వాదనలను, పార్టీ నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి పళణి ‘పోర్వాళ్’ అనే సరికొత్త పత్రికను రంగంలోకి దించారు. ఇకపై ఎడప్పాడి పళనిస్వామి అధికారిక కార్యక్రమాలు, ఆయన వర్గం వార్తలు ఈ కొత్త పత్రికలో ప్రముఖంగా ప్రచురితం కానున్నాయి. -
రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం
తిరుత్తణి: తిరువళ్లూరు, తిరుత్తణి మధ్య జాతీయ రహదారి విస్తరణ పనులు 2024లో ప్రారంభమై 2026లో పూర్తి కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 35 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. విస్తరణ పనుల కోసం రహదారిని కొన్నిచోట్ల మూసివేయడం, సర్వీస్ రోడ్డును నియంత్రించడానికి ముందుజాగ్రత్త చర్యలు లేకపోవడం వల్ల వాహనాలు తరచుగా ప్రమాదాలకు గురవుతూ, అనేక మరణాలకు దారితీస్తున్నాయి. తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా , వాణిజ్య సేవల్లో చైన్నె–తిరుపతి జాతీయ రహదారి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. చైన్నె, తిరుపతి మధ్య ఉన్న 133 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిపై వేలాది భారీ వాహనాలు, కార్లు, బస్సులు, ఇతర వాహనాలు రోజుకు 24 గంటలూ ప్రయాణిస్తాయి. రవాణా సౌకర్యాలు మరియు రహదారి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ఈ 2–లేన్ల రహదారిని 6–లేన్ల రహదారిగా ఆధునీకరించాలని భారత జాతీయ రహదారుల అథారిటీ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిర్ణయించింది. ఇందుకోసం, గత కొన్నేళ్లుగా ఈ రహదారిని వివిధ దశల్లో వెడల్పు చేశారు. దీనిలో భాగంగా, తిరుత్తణి సమీపంలోని తిరువళ్లూరు నుండి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న పొనన్పాడి వరకు ఉన్న 44 కిలోమీటర్ల పొడవైన 2–లేన్ల జాతీయ రహదారిని 4–లేన్ల రహదారిగా ఆధునీకరించడానికి రూ. 1.376 కోట్ల నిధిని కేటాయించారు. 2024లో పనులు ప్రారంభం కానున్నాయి. 2026 చివరి నాటికి ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం, ఒక ప్రైవేట్ కంపెనీ తరఫున 500 మందికి పైగా కార్మికులు, భారీ వాహనాలు, యంత్రాలను వినియోగిస్తున్నారు. అయితే, జాతీయ రహదారి ప్రాంతంలో నదులు, గ్రామాలు ఉండటం వల్ల పెద్ద సంఖ్యలో ఎత్తయిన వంతెనలు, చిన్న వంతెనలు, సొరంగాలు, అనుసంధాన రహదారులను నిర్మించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా, రహదారులను చదును చేయడానికి అధిక మొత్తంలో సరస్సు మట్టి అవసరం కావడం వల్ల రహదారి పనులలో జాప్యం పెరుగుతోంది. పనులు ప్రారంభమై 2 సంవత్సరాలు గడిచినా, కేవలం 35 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. రహదారి పనులను 100 శాతం పూర్తి చేసి, పూర్తిస్థాయి రవాణా సేవలను అందించడానికి కనీసం 3 నుండి 4 సంవత్సరాలు పడుతుందని అంచనా. ప్రయాణికుల అవస్థ.. జాతీయ రహదారిపై తిరుత్తణి నుండి తిరువళ్లూరు వరకు ఉన్న రెండు వరుసల రహదారిని కొన్ని చోట్ల ఒకే వరుస రహదారిగా మార్చారు. జరుగుతున్న రహదారి పనుల కారణంగా, రోడ్డు దెబ్బతిని పలుచోట్ల గుంతలుగా మారింది. సర్వీస్ రోడ్డును నియంత్రణ లేకుండా సగానికి తగ్గించారు. రహదారిపై హెచ్చరిక గుర్తులు లేకుండా పలుచోట్ల బ్యారియర్లు నిర్మించడం, వాహనాలను మళ్లింపు చేయడం కారణంగా తిరుత్తణి నుండి తిరువళ్లూరు వరకు 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అదనంగా అర్ధగంట సమయం పడుతోంది. జరుగుతున్న రహదారి పనుల కారణంగా, వాహన ప్రమాదాలు, మరణాలు తరచుగా సంభవిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట ప్రమాదాల సంఖ్య పెరిగింది. దీని కారణంగా, వాహనదారులు ఈ రహదారిపై ప్రయాణించడానికి భయపడుతున్నారు. వాహన ప్రమాదాలను నివారించడానికి, రహదారి విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతాలలో భద్రతను నిర్ధారించడం, వాహనాలు మలుపు తిరిగే ప్రదేశాలలో హెచ్చరిక బ్యానర్లను ఏర్పాటు చేయడం, రాత్రిపూట ఫ్లాషింగ్ లైట్లను అమర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. సర్వీస్ రోడ్డును నిర్మించాం.. ఈ అంశంపై – జాతీయ రహదారుల అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్ర రావు మాట్లాడుతూ.. తిరువళ్లూరు నుండి తిరుత్తణి సమీపంలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న పొన్పాడి వరకు 43 కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణ పనులు 2024 నుండి రోజుకు 24 గంటలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయన్నారు. దీనిని 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. రహదారి విస్తరణ పనుల కోసం భూసేకరణ, ఆక్రమణల తొలగింపులో జాప్యం జరుగుతోందని, చిన్న వంతెనలు, ఎత్తైన వంతెనలు, సబ్వేల నిర్మాణం కారణంగా ఈ ఆలస్యం చోటుచేసుకుందని స్పష్టం చేశారు. రవాణా సౌలభ్యం కోసం మేం ఒక సర్వీస్ రోడ్డును నిర్మించామన్నారు. ప్రమాదాలను నివారించడానికి ,వాహనదారుల భద్రతను నిర్ధారించడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా రహదారి పనులు జరుగుతున్నందున వాహనదారులు సర్వీస్ రోడ్డుపై తక్కువ వేగంతో ప్రయాణించాలని ఆయన సూచించారు. -
క్లుప్తంగా
కొరుక్కుపేట: తిరువారూర్ జిల్లా, ముత్తుపేటలో నివసించే హాజా ముహైదీన్ (38) ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్లో ముత్తుపేట్ ఏరియా రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి అతను తన కుటుంబంతో కలిసి ఇంట్లో నిద్రపోతున్నాడు. రాత్రి సుమారు 11.45 గంటలకు, ముత్తుపేట్ వీధికి చెందిన అబ్దుల్ బాసిత్ (20), అతని స్నేహితులు సాబిర్ అహ్మద్ (21), అబ్బాస్ (21) గంజాయి మత్తులో హాజా ముహైదీన్ ఇంటికి వెళ్లి తలుపుతట్టారు. హాజా మొయిదీన్ తలుపు తీయగా... అబ్దుల్ బాసిత్ తాను దాచిపెట్టిన బీర్ బాటిల్ను బయటకు తీసి హాజాముకైద్దీన్ తలపై కొట్టాడు, ఆ పగిలిన బాటిల్తో అతని కడుపులో, చాతిలో పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన హాజా ముహైదీన్ను తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయమై ముత్తుపేట పోలీసులు కేసు నమోదు చేసి, మంగళవారం రాత్రి ఇంట్లో దాక్కున్న అబ్దుల్ బాసిత్ను అరెస్టు చేసి విచారించారు. అనంతరం అతడిని తిరుత్తురై పూండి కోర్టులో హాజరుపరిచారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సాక్షి, చైన్నె: హెల్త్వాచ్ టెలిడయాగ్నోస్టిక్స్ అనుబంధ సంస్థ సీహెచ్సీ ఫార్మసీ చైన్నె నగరంలో తన నెట్వర్క్ను మరింత విస్తరించింది. బుధవారం ఆదంబాక్కం పరిసర ప్రాంత ప్రజల కోసం తన ఐదో సరికొత్త అవుట్లెట్ను ‘సీహెచ్సీ ఫార్మసీ మినీ’ ఫార్మెట్లో ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని ఆసంస్థ సీఎఫ్ఓ సీఏ జయశ్రీ కండీషన్, సంస్థ సీనియర్ ప్రతినిధులు, సిబ్బంది సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ సేవలను గురించి వివరించారు.ఈ మినీ ఫార్మట్ స్టోర్లను ఆధునిక కుటుంబాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేశామన్నారు. దీని ద్వారా క్లినిక్లకు వెళ్లే పనిలేకుండానే నాణ్యమైన మందులు, వెల్నెస్ ఉత్పత్తులు, హెల్త్కేర్ ఎస్సెన్షియల్స్తో పాటుగా ఇంటి వద్దకే హెల్త్కేర్ సేవలైన ల్యాబ్ టెస్టులు, బ్లడ్ శాంపిల్స్ కలెక్షన్, కార్డియాక్ మానిటరింగ్, డయాగ్నోస్టిక్స్, ఫిజియోథెరపీ, డాక్టర్ కన్సల్టేషన్, నర్సింగ్ కేర్ సేవలను నేరుగా రోగుల ఇంటి వద్దకే అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.సెంథిల్ కండీషన్, ఉపాధ్యక్షుడు పి. ఆనందకృష్ణన్ పాల్గొన్నారు. తిరువొత్తియూరు: మదురై జిల్లా తిరుమంగళం సమీపం సింధుపట్టిలో మేనల్లుడిని కరత్రో కొట్టి హత్య చేసిన మేనమామను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. సిద్దుపట్టి పోలీసు స్టేషన్ పరిధికి ఈచంపట్టికి చెందిన శక్తిమూర్తి (33) జేసీబీ యజమాని. ఇతనికి భార్య భారతి (30) . వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తంగమాయన్ (60), శక్తిమూర్తికి వరుసకు మేనమామ అవుతాడు. గత మే 1వ తేదీన శక్తిమూర్తి తన పిల్లలకు చెవులు కుట్టించే కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఈ వేడుకకు తంగమాయన్ హాజరు కాలేదు. దీనిపై ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు ఏర్పడి గొడవలు మొదలయ్యాయి. ఇటీవల తంగమాయన్ తన కుమార్తె లక్ష్మి నిర్వహించిన ఓ వేడుకకు శక్తిమూర్తి కుటుంబం వెళ్లలేదు. దీంతో వీరి మధ్య వివాదం మరింత ముదిరింది. మంగళవారం రాత్రి శక్తిమూర్తి తన భార్యతో కలిసి తంగమాయన్ ఇంటికి వెళ్లి ఈ విషయమై నిలదీశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, అది ఘర్షణకు దారితీసింది. ఆగ్రహానికి లోనైన తంగమాయన్, అక్కడ ఉన్న ఒక కరత్రో శక్తిమూర్తి తలపై బలంగా కొట్టాడు. శక్తిమూర్తిని మదురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం అతను మృతి చెందాడు. సింధుపట్టి పోలీసులు నిందితుడైన తంగమాయన్ను అరెస్ట్ చేశారు. సాక్షి, చైన్నె: లాజిస్టిక్స్ నెట్వర్క్లో పని చేస్తున్న సుమారు 90,000 మంది డెలివరీ అసోసియేట్ల ఆరోగ్యం, భద్రత, ఆర్థిక శ్రేయస్సు కోసం ఉచిత వైద్య బీమా, ఆరోగ్య సేవలను భారీగా విస్తరించినట్టు అమెజాన్ ఇండియా డైరెక్టర్ సలీమ్ మేమన్ బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా మెడిక్లెయిమ్, యాక్సిడెంట్ భీమా పరిమితులను పెంచడంతో పాటు ఉచిత ఓపీడీ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. రూ. 2,800 కోట్ల భారీ పెట్టుబడి ప్రణాళికలో భాగంగా ఈ వెల్నెస్ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్ ఖర్చుల కోసం మెడిక్లెయిమ్ పరిమితిని రూ. 1.5 లక్షలకు పెంచామన్నారు. దైనందిన వైద్య ఖర్చులు, డాక్టర్ ఫీజుల నిమిత్తం ఏడాదికి రూ. 10,000 వరకు ఓపీడీ కవరేజ్ కల్పించామన్నారు. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పరిమితిని రూ. 10 లక్షల వరకు విస్తరించామన్నారు. దీని ద్వారా ప్రమాదాల వల్ల కలిగే తాత్కాలిక లేదా శాశ్వత వైకల్యాలకు, ఆదాయ నష్టానికి ఆర్థిక రక్షణ లభిస్తుందన్నారు. ఈ ఆరోగ్య ప్రయోజనాలు డెలివరీ భాగస్వామితో పాటు వారి కుటుంబంలోని మరో ముగ్గురు సభ్యులకు వర్తిస్తాయని వివరించారు. -
క్రీడాకారులు.. ఉన్నత విద్యను పూర్తి చేయాల్సిందే..!
సాక్షి, చైన్నె : క్రీడాకారులు కేవలం ఆటలకే పరిమితం కాకుండా ఉన్నత విద్యను కచ్చితంగా పూర్తి చేయాలని, అప్పుడే క్రీడా కోటా కింద ఉద్యోగాలు పొందేటప్పుడు ఉన్నత స్థాయి అధికారి పోస్టులను ఎంపిక చేసుకోవడానికి వీలవుతుందని ప్రభుత్వ ప్రజాపనులు, క్రీడా శాఖ మంత్రి శ్రీ ఆధవ్ అర్జున పేర్కొన్నారు. పుదుచ్చేరిలో ఈ నెల 22 నుండి 29 వరకు జరగనున్న ఆల్ ఇండియా అండర్–18 జూనియర్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనబోయే తమిళనాడు జూనియర్ పురుషుల, మహిళల బాస్కెట్బాల్ జట్లు బుధవారం చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మంత్రిని కలిసి ఆశీస్సులు తీసుకున్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ‘మిమ్మల్ని చూస్తుంటే నా పాత బాస్కెట్బాల్ శిక్షణ రోజులు గుర్తొస్తున్నాయి. నేను కూడా మీలాగే ఒకప్పుడు క్రీడా హాస్టల్ విద్యార్థిగా, బాస్కెట్బాల్ ఆటగాడిగా ఉండి.. కష్టపడి చదివి, కఠిన శ్రమతో ఎదిగి ఈరోజు మీ ముందు క్రీడాశాఖ మంత్రిగా నిలబడ్డాను అని వ్యాఖ్యలు చేశారు. క్రీడల్లో రాణించడమే కాకుండా చదువుపై కూడా సమానంగా దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. క్రీడా ప్రాక్టీస్ ముగిసిన తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకుని, వెంటనే చదువుపై శ్రద్ధ పెట్టాలని, ఆత్మవిశ్వాసంతో ఆడి కోచ్లకు, తల్లిదండ్రులకు, తమిళనాడు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే విద్యార్థులు ఆడే మ్యాచ్లను తాను స్వయంగా వచ్చి వీక్షిస్తానని తెలిపారు. కార్యక్రమంలో క్రీడా శాఖ ప్రభుత్వ కార్యదర్శి సజ్జన్సింగ్ ఆర్. చవాన్ , క్రీడా అభివృద్ధి అథారిటీ సభ్య కార్యదర్శి జె. మేఘనాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పదిలో 92.75 శాతం ఉత్తీర్ణత
● 28వ స్థానంలో తిరువళ్లూరు జిల్లా తిరువళ్లూరు: పదో తరగతి ఫలితాల్లో తిరువళ్లూరుకు 28వ స్థానం దక్కగా, మొత్తం 92.75 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లా నుంచి 31,231 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 28,967 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలికలదే పైచేయిగా మారింది. ఈ ఏడాది మూడు శాతం ఎక్కువగా ఉత్తీర్ణత సాదించారు. ఫలితాలు వెలువడిన క్రమంలో చీఫ్ ఎడ్యుకేషన్ అధికారి కర్పగం పలువురు డీఈఓలు కలెక్టర్ ప్రతాప్ను కలిశారు. పలితాలపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేయగా, వచ్చే ఏడాది మరింత ఉన్నత ఫలితాలను సాధించాలని ఆయన సూచించారు. -
బజాజ్తో వీఐటీ ఒప్పందం
వేలూరు: వేలూరు వీఐటీ యూనివర్సిటీ, పునే బజాజ్ ఆటో ఫౌండేషన్ మధ్య ఇంజినీరింగ్లో డిప్లొమా పట్టభద్రులు, ఆఖరి సంవత్సరంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు అందజేసేందుకు ఇటీవల పరస్పర ఒప్పందం జరిగింది. వీటి ద్వారా బజాజ్ ఇంజినీరింగ్ ఆటో ఫౌండేషన్ శిక్షణ కేంద్రం వీఐటీ ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు. వీఐటీలో శిక్షణ కేంద్రం రూ.15 కోట్లతో ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి పరికరాలు, ఈ మొబిలిటి వంటి విభాగాల్లో అవసరమైన శిక్షణ అందజేసేందుకు అతి నవీన వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. వీఐటీ మెకానికల్ ఇంజినీరింగ్, వీఎల్ఎస్ఐ డిజైన్, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ వంటి విభాగాలకు చెందిన విద్యార్థులు ఈ కేంద్రం ద్వారా లబ్ధి పొందనున్నారు. చాన్సలర్ విశ్వనాథన్ విడుదల చేసిన ప్రకటనలో..విద్యార్థుల మేధాశక్తిని పెంచేందుకు ప్రాక్టికల్కు వీఐటీ అధిక ప్రాదాన్యత ఇస్తుందన్నారు. ప్రస్తుతం రూ.15 కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ కేంద్రం విద్యార్థులకు అవసరమైన అతి నూతన శిక్షణను అందజేసి వీఐటీ విద్యార్థుల మేధాశక్తిని పెంచి వారిని అభివృద్ధి చేస్తుందన్నారు. ఈసందర్భంగా బజాజ్ ఆటో ఫౌండేషన్ సీఎస్ఆర్ చైర్మన్ రమేష్, ఉపాధ్యక్షుడు సుధాకర్ కుడిబది, వీఐటీ ఉపాధ్యక్షుడు శంకర్ విశ్వనాఽథన్, శేఖర్ విశ్వనాథన్, కార్యనిర్వహణ డైరెక్టర్ సంధ్యాపెంటారెడ్డి, అసిస్టెంట్ ఉపాధ్యక్షులు కాదంబరి, వైస్ చాన్స్లర్ కాంచన, ప్రొ.చాన్స్లర్ పార్థసారథి మల్లిక్, రిజిస్ట్రార్ జయభారతి పాల్గొన్నారు. -
యూట్యూబర్ శంకర్పై గుండా యాక్ట్ రద్దు
● తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు సాక్షి, చైన్నె:తమిళనాడులో ప్రముఖ యూట్యూబర్, సామాజిక విశ్లేషకుడు సవుక్కు శంకర్ పై విధించిన గుండా చట్టాన్ని రద్దు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని స్పష్టం చేసింది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అవినీతి అక్రమాలు, అధికారిక దుర్వినియోగాలపై సవుక్కు శంకర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వరుస వీడియోలు చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. ప్రతిసారీ ఆయన కోర్టు నుండి బెయిల్ పొందుతూ వస్తుండటంతో, గత ఏప్రిల్ 9వ తేదీన అప్పటి చైన్నె సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు శంకర్పై ’గుండా యాక్ట్’ ప్రయోగించి పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రభుత్వ ఉత్తర్వులు .. సవుక్కు శంకర్ను గుండా యాక్ట్ కింద ముందస్తు నిర్బంధంలో ఉంచడానికి గల కారణాలను ప్రభుత్వం అడ్వైజరీ బోర్డు (సలహా మండలి) ముందు సమర్పించారు. ఈ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన సలహా మండలి, శంకర్ను గుండా చట్టం కింద జైల్లో ఉంచడానికి సరైన లేదా తగిన ఆధారాలు, కారణాలు లేవని తేల్చి చెప్పింది. అడ్వైజరీ బోర్డు నివేదిక ఆధారంగా ఆయనపై ఉన్న గుండా చట్టం నిర్బంధాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ కేసు పరంగా ఆయనను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వుల కాపీలను చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్, పుళల్ కేంద్ర జైలు సూపరింటెండెంట్, అడ్వైజరీ బోర్డు ఛైర్మన్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, జైళ్ల శాఖ డీజీపీలకుపంపించారు. -
అన్నా శతాబ్ది గ్రంథాలయంలో ఆకస్మిక తనిఖీ
సాక్షి, చైన్నె: తమిళనాడు పాఠశాల విద్య, తమిళ అభివద్ధి, సమాచార శాఖ మంత్రి రాజ్మోహన్ బుధవారం చైన్నె కోటూర్పురంలోని ప్రతిష్టాత్మక అన్నా శతాబ్ది గ్రంథాలయం ప్రాంగణాన్ని సందర్శించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బుధవారం జరిగిన ఈ తనిఖీల్లో గ్రంథాలయ మౌలిక వసతులు, వివిధ విభాగాల పనితీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే గ్రంథాలయ ప్రాంగణంలోని కళామందిరం (కలైయరంగం), సమావేశ మందిరం (కూట్టరంగం), సదస్సుల హాల్ (కరుత్తరంగం) , ‘సెంథమిళ్ శిల్పుల’ ఆడిటోరియంలను మంత్రి స్వయంగా సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న వసతులను, సాంకేతిక ఏర్పాట్లను సమీక్షించారు. గ్రంథాలయానికి వచ్చే పాఠకులు, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్ల (కల్పిడ వసతి) నిర్వహణ ఎలా ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. గ్రంథాలయ ఆవరణలోని ‘ఆవిన్’ మిల్క్ పార్లర్ను సందర్శించిన మంత్రి రాజ్మోహన్, అక్కడ పాలు తాగి నాణ్యతను పరీక్షించారు. అదే సమయంలో అక్కడ చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు, పాఠకులతో కాసేపు ముచ్చటించి, గ్రంథాలయంలో ఇంకా ఎలాంటి వసతులు కావాలో వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో మంత్రి వెంట పాఠశాల విద్యాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ చంద్ర మోహన్, ఉపాధ్యాయ నియామక బోర్డు చైర్మన్ ఎస్. జయంతి ఉన్నారు. -
ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి
● 94.31 శాతం ఉత్తీర్ణత ఖైదీల ఉత్తీర్ణత తమిళనాడులో పరీక్ష రాసిన 13,292 మంది దివ్యాంగులలో 11,416 మంది (85.89శఆతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే, పరీక్ష రాసిన 370 మంది ఖైదీలలో 354 మంది (95.68శాతం) పాసయ్యారు. ప్రైవేట్ అభ్యర్థులు 24,353 మంది హాజరు కాగా 8,744 మంది (35.91శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల విడుదలతో విద్యార్థులకు సమాచారాల్ని వాట్సాప్ ద్వారా, వెబ్సైట్ ద్వారా, రిజిస్టడ్ మొబైల్ నెంబర్లకు మెస్సేజ్ల ద్వారా తెలియజేశారు. సాక్షి, చైన్నె: ఎప్పటిలాగే ఈసారి కూడా పదోతరగతి ఫలితాల్లో బాలికలు అద్భుత ప్రతిభ కనబరిచారు. బాలుర కంటే బాలికలు 4.32శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత– 96.47శాతం (మొత్తం రాసిన 4,35,247 మందిలో 4,19,891 మంది పాస్)గా నమోదైంది. బాలుర ఉత్తీర్ణత– 92.15 శాతం (మొత్తం రాసిన 4,35,396 మందిలో 4,01,214 మంది పాస్). గత ఐదేళ్ల ఫలితాలను పరిశీలిస్తే తమిళనాడులో పదో తరగతి ఉత్తీర్ణత శాతం స్థిరంగా పెరుగుతూ రావడం విశేషం. ప్రభుత్వ పాఠశాలలు – 91.86శాతం, ఎయిడెడ్ పాఠశాలలు– 94.34శాతం, ప్రైవేట్ పాఠశాలలు 98.14శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. వంద శాతం ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,467 పాఠశాలలు ఉండగా, అందులో 5,171 పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో 1,931 ప్రభుత్వ పాఠశాలలు ఉండటం విశేషం. ఈ ఏడాది తమిళంలో 98.43శాతం ఉత్తీర్ణులు కాగా, 34 మంది 100కు వంద మార్కులు సాధించారు. ఇంగ్లీష్లో 99.44శాతం ఉత్తీర్ణులు కాగా, 92 మందికి 100/100 మార్కులు సాధించారు. గణితంలో 97.36శాతం మంది ఉతీర్ణులు కాగా, 3,194 మందికి 100/100 మార్కులు, సైన్స్లో 98శాతం ఉతీర్ణత మోదుకాగా 10,476 మందికి 100/100 మార్కులు, సోషల్ సైన్స్లో 97.93శాతం ఉత్తీర్ణులు కాగా, 3,336 మందికి 100/100 మార్కులు సాధించడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా పుదుక్కోట్టై జిల్లా అత్యుత్తమ ఫలితాలతో మొదటి స్థానంలో నిలిచింది. పుదుక్కోట్టే జిల్లాలో 97.57శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆ తదుపరి శివగంగ – 97.54శాతం, తంజావూరు – 97.41శాతం, తిరుచ్చి– 97.31శాతం, కన్యాకుమారి – 97.30శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. చైన్నె జిల్లా 92.34శాతం ఉత్తీర్ణతతో 29వ స్థానంలో నిలిచింది. కేంద్రపాలిత ప్రాంతాలైన కారైకాల్ 96.47శాతం, పుదుచ్చేరి 98.03శాతం ఉత్తీర్ణత సాధించాయి. పుదుచ్చేరిలో 7,061 మంది పరీక్ష రాయగా 6,922 మంది ఉత్తీర్ణులయ్యారు. కారైక్కాల్ పరిధిలోని 1,020 మంది పరీక్షకు హాజరు కాగా, 984 మంది ఉత్తీర్ణులయ్యారు.రీకౌంటింగ్, సప్లిమెంటరీకి అవకాశం తాత్కాలిక మార్కుల జాబితా ఈ నెల 22వ తేదీ నుంచి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించారు. అలాగే వారు చదువుకున్న పాఠశాలల నుంచి పొందేందుకు కూడా అవకాశం ఇచ్చారు. ఆన్సర్ షీట్ స్కాన్ కాపీ కోసం దరఖాస్తులు ఈనెల 22 నుండి 27వ తేదీ వరకు చేసుకోవచ్చు. సప్లిమెంటరీ పరీక్షల రిజిస్ట్రేషన్ ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫెయిల్ అయిన లేదా మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈ కాలపరిమితిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీవాల్యుయేషన్, రీటోటలింగ్ దరఖాస్తులు జూన్ 17 నుండి జూన్ 19 వరకు చేసుకోవచ్చు అని ప్రకటించారు. సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ జూలై 08 నుండి జూలై 15 వరకు జరుగుతుందని ముందుగానే తేదీ ప్రకటించేశారు. -
కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, చైన్నె : తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వంలో చేరాలని మద్దతు ఇస్తున్న పార్టీలను టీవీకే ప్రభుత్వం ఆహ్వానించడం చర్చకు దారి తీసింది. వివరాలు.. ప్రభుత్వం ఏర్పాటుతో విజయ్తో సహా కేవలం 10 మంది మాత్రమే కేబినెట్లో ఉన్నారు. ఖాళీగా ఉన్న మిగిలిన శాఖల భర్తీ కోసం విస్తరణ కసరత్తు జరుగుతున్నట్టు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ప్రస్తుతం టీవీకే ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇందులో 106 మంది టీవీకే ఎమ్మెల్యేలు కాగా, అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు 25 మంది ఉన్నారు. ఇక కాంగ్రెస్ 5, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్లకు చెందిన తలా ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగంలు మంత్రి పదవులు ఆశిస్తున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అయితే, వీరికి పదవులు ఇస్తే మద్దతుపై పునరాలోచించాల్సి ఉంటుందని సీపీఎం నేత షణ్ముగం హెచ్చరించడం గమనార్హం. వాస్తవానికి ఈ 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలలో 12 మంది పదవీ ఆశతో ఉన్నట్టు, వీరిలో ఏడుగురికి విజయ్ అవకాశం ఇవ్వవచ్చు అన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే వీరికి పదవులు ఇస్తే చట్టపరమైన చిక్కులు వచ్చి పడుతాయన్న ఆందోళన తప్పడం లేదు. అనర్హత వేటు భయం పార్టీ విప్ను ధిక్కరించి ఓటు వేసినందుకు గానూ, ఆ 25 మందిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వర్గం స్పీకర్కు , గవర్నర్కు వినతిపత్రం సమర్పించి ఉన్నాయి. చట్టపరమైన సమస్యలు , పార్టీ ఫిరాయింపుల ఆరోపణల నేపథ్యంలో వేలుమణి బృందానికి మంత్రి పదవులు ఇచ్చేందుకు తాత్కాలిక గవర్నర్ నిరాకరించినట్లు సమాచారం. లోక్భవన్కు వచ్చిన జాబితాలో తిరుగుబాటు ఎమ్మెల్యేల పేర్లు చూసి వెనక్కి పంపించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం నేపథ్యంలో అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం లేదన్న సమాచారాలు వెలువడ్డాయి. తాము అస్సలు మంత్రి పదవులు ఆశించ లేదంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేల ఒకరైన లీమా రోజు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అదే సమయంలో మంత్రి ఆధవ్ అర్జున ఇచ్చిన పిలుపు కొత్త చర్చకు దారి తీసింది. తమకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్లు మంత్రి వర్గంలోకి రావాలని ఆయన పిలుపు నివ్వడం గమనార్హం. కాంగ్రెస్కు రెండు బెర్తులు ఖరారువిజయ్ మంత్రివర్గంలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా కాంగ్రెస్కు 2 మంత్రి పదవులు దక్కడం ఖాయమైంది.కన్యాకుమారి జిల్లాకు చెందిన రాజేష్ కుమార్ లేదా తారకై కాఠ్పత్, అలాగే విశ్వనాథన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తమకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అన్నది పక్కన పెడితే, టీవీకే పార్టీ తరపున కొత్తగా 10 నుండి 12 మందిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందన్న సమాచారం వెలువడింది. ఇందులో అంబత్తూరు బాలమురుగన్, కల్లనై (మదురై నార్త్), పార్థిబన్ (సేలం సౌత్), మహమ్మద్ పర్వేజ్ (అరంతంగి),విజయ శరవణన్ (తంజావూరు),సంపత్ కుమార్ (కోయంబత్తూరు నార్త్), సత్యబామ (తిరుప్పూర్ నార్త్), కామాక్షి (పల్లవరం) పేర్లు తెరమీదకు వచ్చాయి. తమిళనాడు తాత్కాలిక గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళ నుంచి రాత్రి చైన్నెకు చేరుకున్నారు.దీంతో విజయ్ కొత్త మంత్రుల జాబితాను గవర్నర్కు సమర్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. లోక్ భవన్లో గురువారం ఉదయం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు సైతం సాగుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. -
టీవీకే ఆహ్వానంపై పరిశీలన
సాక్షి, చైన్నె: మంత్రి వర్గంలో చేరాలన్న టీవీకే పిలుపుపై వీసీకే తిరుమావళవన్ స్పందిస్తూ, తమ పార్టీవర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, కేబినెట్లో చేరాలనే ఆలోచన ఉంటే దానిపై వీసీకే స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని సీపీఎం నేత షణ్ముగం వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో మళ్లీ ఎన్నికలు రాకూడదని, గవర్నర్ చేతుల్లోకి అధికారం వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ప్రజల తీర్పును గౌరవిస్తూ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని, కార్మికులు, పేదల పక్షాన తమ గళం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటామని సీపీఐ రాష్ట్రకార్యదర్శి వీర పాండియన్ స్పష్టం చేశారు.మంత్రివర్గంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించడం టీవీకే నాయకత్వం ఉదారతకు నిదర్శనమని ఐయూఎంఎల్ నేత ఖాదర్ మోహిద్దీన్ వ్యాఖ్యానించకారు. కేబినెట్లో చేరడంపై తాము ఇంకా ఎలాంటి ముందస్తు నిర్ణయానికి రాలేదని, దీనిపై పార్టీ జాతీయ నాయకత్వంతో పాటు ముస్లిం సామాజిక వర్గ పెద్దలతో కూడా చర్చిస్తున్నామని తెలిపారు. పార్టీ హైపవర్ కమిటీ సమావేశం అనంతరం గురువారం ఉదయం 11 గంటలకు తమ తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని ఖాదర్ మొహిదీన్ వెల్లడించారు. ఆన్లైన్లో ఔషధాల విక్రయాన్ని నిషేధించాలి – వ్యాపారుల సంఘం డిమాండ్ కొరుక్కుపేట: ఆన్లైన్లో మందుల వ్యాపారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాలని తమిళనాడు వాణిజ్య, పారిశ్రామిక మండలి డిమాండ్ చేసింది. ఈమేరకు ఔషధ వ్యాపారులు బుధవారం చేస్తున్న దేశవ్యాప్త సమ్మెకు, తమిళనాడు వాణిజ్య, పారిశ్రామిక మండలిపూర్తి మద్దతును తెలియజేసింది. ఆన్ లైన్ వ్యాపారం దేశీయ వ్యాపారాన్ని పూర్తిగా నాశనం చేయగలదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇది దేశీయ వ్యాపారులను మాత్రమే కాకుండా, వ్యాపారులపై ఆధారపడిన ప్రజలను కూడా ప్రభావితం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు వాణిజ్య పారిశ్రామిక మండలి అధ్యక్షుడు సౌందరరాజన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలందరి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి. అదే న్యాయం అని పేర్కొన్నారు. ఆన్లైన్లో మాదకద్రవ్యాల వ్యాపారం చాలా ప్రమాదకరం అని అన్నారు. ఇప్పటికై నా ఆన్లైన్ ఫార్మాస్యూటికల్ వ్యాపారాన్ని తక్షణమే నిషేధించాలని కోరారు. ఇండియన్ బ్యాంక్కు గోల్డెన్ పీకాక్ అవార్డు సాక్షి, చైన్నె: బ్యాంకింగ్ రంగంలో అత్యాధునిక సాంకేతికతను జోడించి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ ఇండియన్ బ్యాంక్ ప్రతిష్టాత్మకమైన ‘గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – 2026 ను కై వసం చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆవిష్కరణల ద్వారా బ్యాంకింగ్ సేవలను డిజిటలైజ్ చేయడంలో చూపిన ప్రతిభకుగాను ఈ పురస్కారం దక్కింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్వహించిన నేషనల్ కన్వెన్షన్ ఆన్ బిజినెస్ ఎక్సలెన్స్ – లీడర్షిప్ సదస్సులో భాగంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇండియన్ బ్యాంక్ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమారి మిని టి. ఎం, చీఫ్ జనరల్ మేనేజర్ వాలెరి రాత్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్ వెంకట్ యల్లాపంతుల ఈ అవార్డును అందుకున్నారు. చైన్నె కార్పొరేషన్ తాగునీటి బోర్డుకొత్త ఎండీగా టి. ఆనంద్ కొరుక్కుపేట: ఐఏఎస్ అధికారి టి. ఆనంద్ను చైన్నె మెట్రోపాలిటన్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం గురువారం అధికారిక ఉత్తర్వు జారీ చేసింది. పరిపాలనా నైపుణ్యాలు కలిగిన ఆనంద్, ప్రస్తుతం డ్రింకింగ్ వాటర్ బోర్డుకు ఛైర్మన్గా ఉన్నారు. ఈ బోర్డు చైన్నె తాగునీటి అవసరాలను తీర్చడంలో, భూగర్భ మురుగునీటి ప్రాజెక్టులను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఐఏఎస్ అధికారిగా తనదైన ముద్ర వేసిన ఆయన, ఇప్పుడు చైన్నె మహానగరంలో తాగునీటి నిర్వహణ, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే కీలక బాధ్యతలను చే పట్టనున్నారు. వేసవి కాలం ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలో, చైన్నెకి నిరంతరాయంగా నీటి సరఫరాను నిర్ధారించే సవాలుతో కూడిన పనిని ఆయన యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నారు. ప్రభుత్వం చేసిన ఈ నాటకీయ నియామకాన్ని ఐఏఎస్ అధికారులు విస్తృతంగా స్వాగతించారు. -
సత్తా చాటిన పళ్లిపట్టు విద్యార్థి
● పదిలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం పళ్లిపట్టు: తాపీమేస్త్రి కుమారుడు పది ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో పళ్లిపట్టు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ద్వితీయ స్థానం సాధించి తన సత్తా చాటాడు. పళ్లిపట్టు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థిని ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో మార్చిలో నిర్వహించిన టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఇందులో కరింబేడు, వీసీఆర్ కండ్రిగ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎప్పటిలాగే బాలికలు హవా ప్రదర్శించారు. కాగా పళ్లిపట్టు ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాలలో టెన్త్ చదువుకున్న కీళ్కాళ్పట్టడ గ్రామానికి చెందిన తాపిమేస్త్రి కుమారుడు రోహిత్ పబ్లిక్ పరీక్షల్లో తమిళం 99, ఆంగ్లం 99. విజ్ఞానశాస్త్రం 100, సాంఘికశాస్త్రం 99 మార్కులతో 497 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోని ప్రభుత్వ పాఠశాలల స్థాయిలో ద్వితీయ స్థానం సాధించగా తిరువళ్లూరు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న తాపిమేస్త్రి కుమారుడు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచడంతో సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని పాఠశాలకు ఆహ్వానించిన ఉపాధ్యాయులు సత్కరించి అభినందనలు తెలిపారు. -
నన్ను ఇస్లామిక్గా మార్చేశారు
హబీబీ పోస్టర్ను ఆవిష్కరిస్తున్న సినీ ప్రముఖులు తమిళసినిమా: దర్శకుడు మీరాకదిరవన్ అంటే నాకు అతీతమైన అభిమానం. ఆయన లాంటి దర్శకుడిని, శ్రమజీవిని చూసి ఉండవచ్చు. అయితే ఆయన లాంటి వ్యక్తిని చూడడం అరుదే. నేను ఇంత వరకు చిత్రాల్లో నటించలేదు. అలాంటిది దర్శకుడు మీరా కదిరవన్ నాపై నమ్మకంతో హబీబీ చిత్రంలో నటింపజేశారు. నేను వెయ్యి శాతం హిందువును, అలాంటి నన్ను ఆయన ఇస్లామిక్గా మీరా కదిరవన్ కథ మార్చేసింది. హబీబీ చిత్రాన్ని నేను ఇంకా చూడలేదు. చిత్రాన్ని థియేటర్లో ప్రేక్షకుల్లో ఒకడిగా చూడాలనుకుంటున్నారు. నేను జీవించి ఉన్నంతకాలం చిత్ర పరిశ్రమలోనే ఉంటాననే నమ్మకాన్ని ఈ చిత్రం కలిగించింది. దర్శకుడు కస్తూరిరాజా తొలిసారిగా ప్రధాన పాత్రను పోషించిన చిత్రం హబీబీ. నేశం ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను మీరాకదిరవన్ నిర్వహించారు. మాళవిక మనోజ్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ సంస్థ అధినేత రాహుల్ ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. చైన్నెలో నిర్వహించిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరిరాజా పైవిధంగా పేర్కొన్నారు. దర్శకుడు అమీర్, వెట్రిమారన్, మిష్కిన్, సుశీంద్రన్, పాండిరాజ్ పాల్గొని. చిత్రం మంచి విజయాన్ని సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. -
కఠిన వర్కౌట్స్ చేస్తే..
తమిళసినిమా: తారలకు వర్కౌట్స్ చాలా ముఖ్యం. అందానికి అందం, ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం వర్కౌట్స్తో కలుగుతుంది. అందుకే చాలా మంది నటీమణుల ఎక్కువ సమయాన్ని వర్కౌట్స్కే కేటాయిస్తారు. ఈ విషయంలో హీరోయిన్లకు ఎదురయ్యే చిన్న సమస్య ఏమిటంటే కాస్త బొద్దుగా ఉంటే విమర్శిస్తారు. స్లిమ్గా తయారైతే శస్త్ర చికిత్సతో సన్నబడ్డారు అంటారు. ఇలాంటి విమర్శలే కీర్తిసురేష్ ఎదుర్కొన్నారట. పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న కథానాయకి కీర్తిసురేష్. అలాంటి నటి తాను ఎదుర్కొన్న బాడి షేప్ విమర్శల గురించి తొలిసారిగా ఇటీవల తన ఇన్స్ట్రాగామ్ వేదికగా పేర్కొన్నారు. నా ఫిట్నెస్ గురించి ఇప్పటివరకు మాట్లాడింది లేదు. ప్రతిరోజూ నా శరీరం గురించి చాలా నేర్చుకుంటూనే ఉంటాను. 2013లో నేను నటిగా రంగప్రవేశం చేసినప్పుడు నాకేమీ తెలియదు. చాలా మంది లాగానే నేనూ జిమ్ మనకు అవసరం లేదు అనుకునేదాన్ని. 2018లో మహానటి చిత్రంలో నటించిన తరువాత వచ్చిన బ్రేక్తో నేను ఎందుకు జిమ్కు వెళ్ల కూడదు అనే భావన కలిగింది. వర్కౌట్స్ చేయడం మొదలెట్టాను. దీంతో 9 నెలల్లో 10 కిలోల బరువు తగ్గాను. దీంతో ప్రేక్షకులు నన్ను శస్త్ర చికిత్స చేయించుకున్నానని చెప్పుకునేంతగా బరువు తగ్గడాన్ని గర్వంగా ఫీల్ అయ్యాను. అయితే నేను సహజ సిద్ధంగా వర్కౌట్స్ చేసి బరువు తగ్గితే శస్త్ర చికిత్స ద్వారా తగ్గినట్లు ప్రచారం జరగడం బాధనిపించింది అని కీర్తి ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ భామ నటించిన తమిళ చిత్రం కన్నెవెడి విడుదల కావలసి ఉంది. కీర్తిసురేష్ -
వివాదంపై టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వివరణ
సాక్షి, చెన్నై : తన పాత జ్యోతిష్య కార్యాలయంలో ప్రభుత్వ అధికారులతో నిర్వహించిన సమావేశం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీయడంతో, తమిళగ వెట్రి కళగం మహిళా ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంపై ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ సోషల్ మీడియా ట్రోల్స్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. వివాదం ఏమిటంటే..? ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ పరిధిలోని గౌండంపాళయం నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున కనిమొళి సంతోష్ విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రముఖ జ్యోతిష్యురాలిగా ప్రాచుర్యం పొందారు. ఇటీవల ఆమె ప్రజారోగ్యశాఖ అధికారులతో తన కార్యాలయంలో సమావేశమై, అందుకు సంబంధించిన మూడు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటోల్లో ఎమ్మెల్యే కనిమొళి పెద్ద లగ్జరీ సోఫాలో కూర్చోగా, ఆమెకు ఎదురుగా ప్రభుత్వ అధికారులు ప్లాస్టిక్ కురీ్చలలో కూర్చోవడం కనిపించింది. ప్రభుత్వ అధికారులను ఆమె అవమానించారంటూ నెటిజన్లు, ప్రతిపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వివరణ: ఈ వివాదంపై ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే, అందులోని అసలు నిజాన్ని వివరించారు. తాను రాజకీయాల్లోకి రాకముందు చాలా ఏళ్లుగా జ్యోతిష్యురాలిగా ప్రజలను కలుస్తున్న కార్యాలయం అని, తన జీవిత ప్రయాణంలో అది ఎంతో ముఖ్యమైన స్థలంగా పేర్కొన్నారు. తన కొత్త ఎమ్మెల్యే ఆఫీస్ పనులు (పెయింటింగ్, ఇతర పనులు) ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కొత్త ఆఫీస్ పనులు పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత ఆఫీస్ నుంచే ప్రజల సమస్యలను, అధికారులను కలిసి వినతులను స్వీకరిస్తున్నానని తెలిపారు. తనకు ప్రజాసేవే ముఖ్యం, ఆఫీస్ ఎక్కడ ఉందనేది కాదని వివరించారు. తాను అధికారులను ఇంటికి పిలిపించుకుని, ప్లాస్టిక్ కుర్చీలలో కూర్చోబెట్టి అవమానించానని కొందరు కావాల నే ట్రోల్ చేస్తుండడం అవాస్తవంగా పేర్కొన్నారు. -
పార్టీలో చేరిన రోజే టికెట్.. పరిశ్రమల శాఖ మంత్రిగా కీర్తన..!
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ నేతృత్వంలోని నూతన మంత్రివర్గంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్, ఎన్నికల మేనేజ్మెంట్ జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున, సీనియర్ నేత సెంగోట్టయన్ సహా మొత్తం 9 మంది మంత్రులుగా సోమవారం వారి వారి ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. ఈ హోదాలలో మంగళవారం నుంచి సమీక్షలు, సమావేశాలపై దృష్టి పెట్టారు. కాగా త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందిని తెలిసింది. ఇందులో మిత్రపక్ష పార్టీల ఎమ్మెల్యేలకూ అమాత్యయోగం దక్కనుందని సమాచారం.సాక్షి, చెన్నై : సీఎం విజయ్ కేబినెట్లో మరి కొంత మంది మంత్రులు బాధ్యతలు చేపట్టబోతున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి. తాజాగా తొమ్మిది మంది మంత్రులకు శాఖల కేటాయింపు పోగా, మరో 22 శాఖలకు మంత్రుల నియామకం జరగాల్సి ఉంది. ఇందులో కాంగ్రెస్కు రెండు, అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నట్టు, మిగిలిన పదవులలో టీవీకే ఎమ్మెల్యేలకు అవకాశంకల్పించేందుకు సీఎం విజయ్ నిర్ణయించినట్టు సమాచారం. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొత్త మంత్రుల జాబితా బుధవారం వెలువడే అవకాశం ఉందని, వారు గురువారం ప్రమాణస్వీకారం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజా 9 మంది మంత్రుల నేపథ్యం ఇదీ.. ఎన్. ఆనంద్ (బుస్సీ ఆనంద్) – గ్రామీణాభివృద్ధి – జలవనరుల శాఖ : 61 ఏళ్ల ఆనంద్ పుదుచ్చేరికి చెందినవారు. 2006లో పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బుస్సీ ఆనంద్గా గుర్తింపు పొందారు. తొలుత విజయ్ అభిమాన సంఘాల్లో చేరి, ఆ తర్వాత విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్, ఆపై విజయ్కు అత్యంత ఆప్తుడిగా మారారు. టీవీకే పార్టీలో అత్యంత కీలకమైన (రెండవ పెద్ద) నేతగా ఉంటూ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చెన్నైలోని టి.నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీని ద్వారా పుదుచ్చేరి, తమిళనాడు.. రెండు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆధవ్ అర్జున – పబ్లిక్ వర్క్స్ – క్రీడా శాఖ: తిరుచ్చికి చెందిన 43 ఏళ్ల ఆధవ్ అర్జున రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేట్. లాటరీ మారి్టన్ అల్లుడైన ఈయన, గతంలో ప్రశాంత్ కిశోర్తో కలిసి డీఎంకేకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆ తర్వాత ’వాయిస్ ఆఫ్ కామన్స్’ అనే సొంత వ్యూహ సంస్థను స్థాపించారు. వీసీకే పారీ్టలో డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేసి, అనంతరం టీవీకేలో చేరి విజయ్ నమ్మకస్థుడిగా మారారు. చెన్నైలోని విల్లివాక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కే.ఏ. సెంగోట్టయన్ (ఆర్థికశాఖ): మంత్రివర్గంలోనే అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత సెంకోట్టయన్ (77). ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయంకు చెందిన ఈయన, 1972లో ఎంజీఆర్ అన్నాడీఎంకే స్థాపించినప్పటి నుండి ఆ పారీ్టలో ఉన్నారు. గోబిచెట్టిపాళయం నియోజకవర్గం నుండి ఏకంగా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో జయలలిత, ఎడప్పాడి పళనిస్వామి మంత్రివర్గాల్లో రవాణా, పాఠశాల విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచిచన గోబి చెట్టి పాళయంలో మళ్లీ గెలిచి మంత్రి అయ్యారు. వెంకటరమణన్(ఆహారం, ఫౌరసరఫరాల శాఖ): మైలాపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వెంకటరమణన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ , న్యాయవాది. విజయ్కు సుదీర్ఘకాలంగా అత్యంత సన్నిహిత మిత్రుడు. ప్రస్తుతం టీవీకే పార్టీ కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమిళనాడు మంత్రివర్గంలో చాలా కాలం తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చోటు దక్కడం గమనార్హం. రాజ్ మోహన్ – పాఠశాల విద్యాశాఖ: చెన్నై విరుగంబాక్కంకు చెందిన రాజ్ మోహన్ (39) జర్నలిజం గ్రాడ్యుయేట్. విజయ్ టీవీ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్ ద్వారా సామాజిక అంశాలపై మాట్లాడుతూ పాపులర్ అయ్యారు. యాంకర్, నటుడు, వక్త అయిన ఈయన, 2023లో ’బాబా బ్లాక్ షీప్’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. టీవీకేలో చేరిన ఈయనకు పాలసీ ప్రొపగండా సెక్రటరీ పదవి దక్కింది. ఈ ఎన్నికల్లో ఎగ్మూర్ నియోజకవర్గం నుంచి గెలిచి పాఠశాల విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.డాక్టర్ అరుణ్రాజ్ ( ఆరోగ్య శాఖమంత్రి) : నామక్కల్ కుమారమంగళానికి చెందిన 46 ఏళ్ల అరుణ్రాజ్ మాజీ ఐఆర్ఎస్ అధికారి, వెద్యుడు. 2002లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈయన, సివిల్ సరీ్వసెస్ పాసైన తర్వాత కేంద్ర ఆదాయపు పన్ను శాఖలో (ఐఆర్ఎస్) పనిచేశారు. 2025లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని విజయ్ సమక్షంలో టీవీకేలో చేరారు. ప్రస్తుతం పార్టీలో పాలసీ ప్రొపగండా జనరల్ సెక్రటరీగా ఉంటూ, విజయ్కు పరిపాలనా పరమైన కీలక సలహాలు అందిస్తున్నారు.సి.టి.ఆర్. నిర్మల్ కుమార్(విద్యుత్, న్యాయ మంత్రి) ఉసిలంపట్టికి చెందిన నిర్మల్ కుమార్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, అలాగే క్రిమినాలజీ పోలీస్ అడ్మిని్రస్టేషన్లో పీజీ చేశారు. తొలుత ఆర్ఎస్ఎస్, ఆ తర్వాత బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. అన్నామలైతో విభేదాలతో 2023లో అన్నాడీఎంకేలో చేరి ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత 2025లో ఆ పార్టీని వీడి టీవీకేలో చేరారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉంటూ, మీడియాలో పార్టీ వాయిస్ను బలంగా వినిపిస్తూ మంత్రి అయ్యారు. కీర్తన – పరిశ్రమల శాఖ: కేవలం 29 ఏళ్ల వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కీర్తన ఎమ్మెస్సీ గ్రాడ్యుయేట్. గతంలో ప్రశాంత్ కిశోర్కు చెందిన ’ఐప్యాక్’ సంస్థలో పనిచేస్తూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో క్షేత్రస్థాయి వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ తర్వాత డీఎంకేకు చెందిన ’పెన్’ సంస్థలోనూ పనిచేశారు. 2025లో అక్కడి నుండి తప్పుకుని, స్వతంత్రంగా పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న తరుణంలో..ఈ ఏడాది మార్చి 28న టీవీకేలో చేరారు. చేరిన మరుసటి రోజే ఆమెకు టికెట్ దక్కడం, విజయం సాధించి ఇప్పుడు ఏకంగా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. కొత్త తరం వారికి అవకాశం కల్పించినట్టుగా తమకుకూడా మంత్రి ఛాన్స్ వస్తుదన్న ఆశతో అనేక మంది పట్టభద్రులైన సామాన్య ఎమ్మెల్యేలు ఎదురు చూస్తుండటం విశేషం.టి.కె. ప్రభు(ఖనిజ వనరులు): సాంప్రదాయ కాంగ్రెస్ కుటుంబానికి చెందిన టి.కె. ప్రభు వృత్తిరీత్యా వైద్యుడు. గతంలో తమిళనాడు కాంగ్రెస్ ఐటీ వింగ్లో కీలక నేతగా ఉండేవారు. ఇన్స్ట్రాగామ్ రీల్స్ ద్వారా మంచి ప్రజాదరణ పొందిన ప్రభు, టీవీకే స్థాపించిన తర్వాత అందులో చేరారు. ఈ ఎన్నికల్లో కారైకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్ను ఓడించి సంచలన విజయం నమోదు చేశారు. -
లంచంపై ఫిర్యాదు చేస్తే లక్ష బహుమతి!
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారా?. అవినీతి రహిత పాలన కోసం కఠిన చర్యలు అవలంభిచబోతున్నారా?. ఇందు కోసం తొలి అడుగు.. అవినీతి నిరోధక శాఖ ప్రక్షాళనతోనే ప్రారంభించబోతున్నారా?. లంచం అడిగినా అధికారులపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే నజరానా ఇవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. అవినీతి రహిత సమాజం నిర్మాణం కోసం విజయ్ సర్కార్ ప్రొత్సాహక పథకం తేబోతున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందులో భాగంగా.. అధికారులు ఎవరైనా వెయ్యి లంచం అడిగినా పిర్యాదు చేస్తే లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించినట్లు ఆ వార్త సారాంశం. అవినీతి ఫిర్యాదుల కోసం 24 గంటలు పని చేసేలా 1800 425 1555 టోల్ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారని.. అలాగే ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేస్తారన్నది ఆ కథనం సారాంశం. అంతేకాదు.. ఫిర్యాదుదారుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివ్వమని ప్రభుత్వం భరోసా ఇవ్వబోతోందట. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలించేందుకు అడుగులు వేశారని చెబుతున్నారు. ఇక ప్రభుత్వ శాఖల్లో రాజకీయ జోక్యం, అంతర్గత అవినీతి నిర్మూలించేందుకు చర్యలు చేపట్టినట్లు చర్చ నడుస్తోంది. ఇందుకుగానూ అన్ని శాఖలకు మూడు నెలల గడువు విధించారని.. పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెబుతున్నారు. మరోవైపు.. టెండర్లు, కాంట్రాక్టులు పారదర్శకత కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు ఆ కథనాలు ఊటంకించాయి. తమిళనాడు ప్రభుత్వం నుంచి ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు అవినీతి రహిత సమాజంలో ప్రజలను భాగస్వాముల్ని చేస్తూ సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయమంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. -
విజయ్కు కొత్త టెన్షన్!
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీవీకే విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే త్వరలో తమిళనాడు కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో, విజయ్ మంత్రి వర్గంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే ఎమ్మెల్యేలు చేరనున్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి విజయ్కు కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు సమాచారం.కాగా, తమిళనాడు ప్రభుత్వానికి అటు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, అన్నాడీఎంకే రెబల్స్కు మంత్రి పదవులు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వంలో అన్నాడీఎంకే చేరికను సీపీఎం వ్యతిరేకిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటామని సీఎం విజయ్కు అల్టిమేటం విధించినట్టు సమాచారం. దీంతో, సీఎం విజయ్కు కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉండగా.. సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్.. ప్రతీరోజూ ఏదొక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఎల్టీటీఈ వ్యవస్థాపకుడైన ప్రభాకరన్కు సీఎం విజయ్ నివాళులు అర్పించం చర్చనీయాంశంగా మారింది. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి నిషేధించబడ్డ సంస్థ వ్యవస్థాపకుడికి ఎలా నివాళులర్పిస్తారని విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్ది కీలక సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఆ గ్రూప్కు చెందిన సభ్యురాలే ఆత్మాహుతి బాంబు దాడితో రాజీవ్గాంధీ హత్యలో ప్రధాన పాత్ర పోషించింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన్ను హత్య చేశారు. ఆ నేపథ్యంలోనే ఎల్టీటీఈని బ్యాన్ చేసిందికాంగ్రెస్ ఏం చెబుతుంది?రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకరన్కు సీఎం స్థానంలో ఉన్న విజయ్ ఎలా నివాళులు అర్పిస్తారనేది బీజేపీ ప్రశ్న. దీనిపై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ ఏం చెబుతారని బీజేపీ నిలదీసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సీఎం కావడానికి కాంగ్రెస్తో పాటు పలు స్థానిక పార్టీలు సహకరించిన నేపథ్యంలో ఆ పార్టీలకు విజయ్ ఏం చెబుతారని బీజేపీ అడుగుతోంది.డిఫెన్స్లో టీవీకే.. ఈ అంశాన్ని టీవీకే సమర్థించుకునే పనిలో పడింది. తమ అధ్యక్షుడు, సీఎం విజయ్ అర్పించిన నివాళి కేవలం ప్రభాకరన్కు మాత్రమే కాదని, శ్రీలంకలో ఊచకోతకు గురైన వేలాది మంది తమిళులకు నివాళి అంటూ చెప్పుకొచ్చింది. అయితే, సీఎం స్థానంలో ఉన్న విజయ్ తెలుసో, తెలియకో చేసిన ప్రభాకరన్ నివాళుల అంశం.. ఇప్పుడు టీవీకే పార్టీకి కొత్త చిక్కులు తెస్తుందా అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ను ఇది కచ్చితంగా ఇరకాటంలో పడేస్తుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. -
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
మార్పు నినాదంతో ఘన విజయం సాధించిన విజయ్ అధికార పీఠం అధిరోహించడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని అంతా భావించారు. సినీ స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన.. పార్టీ పెట్టడం దగ్గరి నుంచి సీఎంగా ప్రమాణం చేసే వరకు ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేశారు. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. కానీ విజయ్ పాలనలో కనిపిస్తున్న శైలి ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది..తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అఖండ విజయం, సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు చర్చనీయాంశంగా మారాయి. ఈ దెబ్బకు ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. అంతెందుకు ఒకప్పుడు ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేసిన తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఇప్పుడు ఆయన పట్ల పాజిటివిటీ కనిపిస్తోంది. అందుకు ఇక్కడి ఓ స్టార్ కమ్ లీడర్తో కంపేరిజన్ కూడా ఓ కారణం కావొచ్చు. అయితే ఇదంతా సోషల్ మీడియా వల్లే. అదే సమయంలో.. విజయ్ శైలిలో సినిమాటిక్ టచ్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రమాణస్వీకార సమయంలో సెల్ఫీ వీడియో తీయడం.. ప్రతిపక్ష నేతలను కలవడం, పాలనాపరంగా దూకుడు నిర్ణయాలు, ఓ చైల్డ్ యాక్టివిస్ట్ రిక్వెస్ట్తో సచివాలయంలో కుర్చీపై వేసిన టవల్ను తీసేయడం, టిఫిన్ బాక్స్ తెచ్చుకుని భోజనం చేస్తున్నట్లు వైరల్ అయిన AI ఫోటోలు.. ఇలా ప్రతీది సోషల్ మీడియాను కుదిపేసినవే. అయితే తాజాగా దివ్యాంగుల సంఘాలతో జరిగిన మీటింగ్ వీడియో రీల్గా బయటకు రావడం.. దుమారం రేపింది.A Person is taking a selfie video while CM Joseph Vijay is conducting a meeting! Best of Luck to Tamil Nadu for this comedy show for next 5 Years pic.twitter.com/ntG5gRndRM— Amitabh Chaudhary (@MithilaWaaala) May 19, 2026పాలనా సమావేశాలకు సంబంధించిన వీడియోలు అధికారికంగా బయటకు రావడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరీ సినిమా ప్రమోషన్లా మార్చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులేమో.. విజయ్ నిజంగా ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడని, ఆయన సాదాసీదా జీవనశైలి ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి అని అంటున్నారు. అయితే.. అధికారిక సమావేశాలను రీల్లుగా మార్చడం, AI ఫోటోలు వాడటం, పాలనను ప్రచార వేదికగా మార్చడం సరైందేనా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో దివ్యాంగుల హక్కుల ఉద్యమకారుడు డా. పి. సిమ్మచంద్రన్ స్పందించారు. సీఎం అనుమతి తీసుని ఆ వీడియోను తీశా.. అందులో తప్పేముంది? అని అంటున్నారాయన. విజయ్ సినీ స్టార్ కావడం వల్ల ఆయన ప్రతి చర్యలోనూ ఒక సినిమాటిక్ ఇమేజ్ కనిపిస్తోంది. ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి పాలించాలని స్టాలిన్, రజనీకాంత్, కమల్హాసన్లాంటి సినీ ప్రముఖులు.. అలాగే ఇటు మిత్రపక్షాలు సూచిస్తున్నాయి. అయినా ఇప్పటికప్పుడు అందులోంచి ఆయన బయటపడలేకపోతున్నారు. అయితే ఇలాంటి చర్యలు ఆయనకు ప్రజాదరణను పెంచినా రాజకీయ విమర్శలకు అవకాశం ఇచ్చినట్లే అవుతోంది. “పాలనలో గంభీరత తగ్గిపోతుందా?”, “ప్రచారం హద్దు దాటుతోందా?” అనే విమర్శలకు గుప్పించేందుకు ప్రతిపక్షాలకు స్వయంగా విజయే ఆయుధం అందించినట్లు అవుతోంది.కొత్త కాదు కదా!రీల్ కల్చర్ అనేది కొత్తది కాదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యంగా యువ నాయకులు, సోషల్ మీడియా వేదికలను పాలనలో భాగం చేసుకుంటున్నారు. అంతెందుకు.. తెలంగాణ, ఏపీలో చోటామోటా నేతల దగ్గరి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సమావేశాలు,ప్రజా కార్యక్రమాలను రీల్ల రూపంలో షేర్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ముఖ్యమంత్రుల అధికారిక పేజీల్లో చిన్న వీడియోలు, రీల్స్ ద్వారా పాలనలోని నిర్ణయాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా “మన్ కీ బాత్” వంటి కార్యక్రమాలను డిజిటల్ కంటెంట్గా మార్చి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది కదా. అలాంటప్పుడు విజయ్ విషయంలోనే ఎందుకీ చర్చ?. తప్పా? ఒప్పా?.. అది నిర్ణయించాల్సింది..ఎన్నికల్లో ఆయన సాధించిన గెలుపు ఓ కారణం అయితే.. సినీ స్టార్ బ్యాక్గ్రౌండ్ మరో కారణంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ఆయన పాలనలో కనిపిస్తున్న ప్రతి చిన్న చర్య సినిమాటిక్ ఇమేజ్ బిల్డింగ్గా అంతా భావిస్తున్నారు. అందుకే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఇది ప్రజలకు చేరువ కావడానికి, పారదర్శకతను చూపించడానికి ఉపయోగపడవచ్చు. కానీ అదే సమయంలో, పాలనను సినిమాటిక్ ప్రచారంగా మార్చే ప్రమాదం కూడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఇదే పద్ధతి సాధారణంగా ప్రచార సాధనంగా మాత్రమే కనిపిస్తే.. విజయ్ విషయంలో అది ఆయన సినీ ఇమేజ్తో మిళితమై ప్రత్యేకంగా చర్చకు దారితీస్తోంది. సినీ స్టార్గా విజయ్ ప్రజలను ఆకట్టుకున్నారు. అలాగని పాలనలో కూడా అదే శైలి కొనసాగిస్తానంటే కాస్త కష్టమే. ఈ సినిమాటిక్ పాలన ప్రజాస్వామ్యానికి కొత్త శక్తి ఇస్తుందా? లేక ప్రచార హద్దులు దాటుతోందా? అనేది కాలమే నిర్ణయించాలి’’ అని తమిళ రాజకీయాలను అధ్యయనం చేస్తున్న తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు చెబుతున్నారు. -
గరుడుడిపై సుందరరాజ పెరుమాళ్ చిద్విలాసం
పళ్లిపట్టు: సుందరరాజ పెరుమాళ్ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన గరుడసేవను సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆర్కేపేటలో సుందరరాజ పెరుమాళ్ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా యి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు సోమవారం రాత్రి పుష్పాలతో సుందరరాజ పెరుమాళ్ను అలంకరించి గరుడ వాహనంలో కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు దీపారాధన పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, బాణసంచా సంబరాల నడుమ స్వామివారిని గ్రామ పుర వీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుని స్వామిని దర్శించుకున్నారు. మత్తుమాత్రల విక్రయం –యువకుడి అరెస్ట్ తిరువళ్లూరు: యువత, విద్యార్థులే లక్ష్యంగా మత్తుమాత్రలను విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా ఎస్కేబీ నగర్ ప్రాంతంలో విద్యార్థులు, యువతే లక్ష్యంగా మత్తుమాత్రలను విక్రయిస్తున్నట్టు ఆవడి పోలీసు కమిషనర్కు ఫిర్యాదు అందింది. సమాచారం అందుకున్న కమిషనర్ అక్కడ నిఘా వుంచాలని స్థానిక సీఐని ఆదేశించారు. దీంతో అక్కడ నిఘా ఉన్న పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి బ్యాగును తనిఖీ చేశారు. తనిఖీలో బ్యాగులో గంజాయి, మత్తుమాత్రలు, ఇంజెక్షన్లు వున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పట్టుబడిన వ్యక్తి అంబత్తూరుకు చెందిన చోళయప్పన్ కుమారుడు కేశవపెరుమాల్(22)గా గుర్తించారు. అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
ఆలయాల్లో ‘ప్రత్యేక దర్శన రుసుము’ రద్దు చేయాలి
సాక్షి, చైన్నె: తమిళనాడులోని హిందూ దేవాలయాలలో అమలులో ఉన్న ప్రత్యేక రుసుము (వీఐపీ) దర్శన విధానాన్ని పూర్తిగా రద్దు చేసేలా దేవాదాయ శాఖను ఆదేశించాలంటూ మద్రాస్ హైకోర్టులో ఒక ప్రజాహిత పిటిషన్ దాఖలైంది. విశ్వహిందూ పరిషత్ ఉత్తర తమిళనాడు విభాగం అధ్యక్షుడు పి. చొక్కలింగం ఈ పిటిషన్ను మంగళవారం దాఖలు చేశారు. రూ. 500 వరకు వసూలు తమిళనాడు హిందూమత దేవాదాయ శాఖ నియంత్రణలో ఉన్న ప్రధాన ఆలయాలలో రద్దీని నియంత్రించే నెపంతో, ఒక్కో టికెట్కు రూ. 500 వరకు వసూలు చేస్తూ ప్రత్యేక దర్శన విధానాన్ని కొనసాగిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఆలయాలలో డబ్బులు వసూలు చేసి ప్రత్యేక దర్శనాలు కల్పించడానికి ఎటువంటి చట్టపరమైన నిబంధనలు లేదా అనుమతులు లేవని పేర్కొన్నారు.1967 తర్వాత ద్రవిడ పార్టీలు అధికారంలోకి వచ్చిన నాటి నుండే ఈ వాణిజ్య పద్ధతి అమలులోకి వచ్చిందని ఆయన విమర్శించారు. సాధారణ భక్తులకు అన్యాయం ఈ రుసుము దర్శనాల కారణంగా పేద, సాధారణ భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నగదు ఆధారంగా భక్తుల మధ్య వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు.డబ్బు ఉన్నవారికే ముందస్తు దర్శనం కల్పించే ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేసేలా దేవాదాయ శాఖకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని వీహెచ్పీ నేత చొక్కలింగం కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
నీటిపై తేలుతూ 3 గంటలు టీవీకే ఎమ్మెల్యే యోగాసనం
సాక్షి, చైన్నె : తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వినూత్న రీతిలో తన మొక్కును తీర్చుకున్నారు. మధురై జిల్లా చోళవందాన్ నియోజకవర్గం నుండి టీవీకే తరపున పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే ఎమ్.వి. కరుప్పయ్య.. విజయ్ ముఖ్యమంత్రి కావాలని చోళవందాన్ పరిధిలోని ప్రసిద్ధ మారియమ్మన్ దేవతకు మొక్కుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో తన మొక్కును తీర్చుకోవడానికి కరుప్పయ్య సిద్ధమయ్యారు. మారియమ్మన్ ఆలయ వైశాఖ ఉత్సవాల ధ్వజారోహణ కార్యక్రమం సందర్భంగా.. కరుప్పయ్య ఆలంగొట్టారంలో ఉన్న ఒక వ్యవసాయ బావి వద్దకు చేరుకున్నారు. చేతిలో టీవీకే పార్టీ జెండాను పట్టుకుని బావి నీటిలోకి దిగి న ఆయన, నీటిపై వెల్లకిలా పడుకుని అసాధారణ రీతిలో తేలుతూ ఏకధాటిగా 3 గంటల పాటు యోగాసనం వేశారు. ఈ సాహసాన్ని చూసేందుకు స్థానికులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గతంలో జయలలిత కోసం కూడా.. కరుప్పయ్యకు ఇలా నీటిపై తేలుతూ మొక్కులు చెల్లించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన అన్నాడీఎంకేలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. అప్పటి ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ఆరోగ్యం కుదుటపడాలని, ఆమె మళ్లీ సీఎం కావాలని కూడా ఇలాగే సుదీర్ఘ సమయం పాటు నీటిపై తేలుతూ యోగాసనాలు వేసి రికార్డు సృష్టించడం గమనార్హం. -
మద్రాస్ హైకోర్టుకు.. 19 మంది కొత్త జడ్జిలు
సాక్షి, చైన్నె: మద్రాస్ హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడం కోసం మొత్తం 19 మంది పేర్లను సిఫార్సు చేస్తూ కొలీజియం తన ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో మొత్తం 75 న్యాయమూర్తుల పోస్టులకు గాను 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా గత ఏడాది 2025 అటు న్యాయమూర్తుల కోటా నుండి, ఇటు న్యాయవాదుల కోటా నుండి పలువురి పేర్లను సిఫార్సు చేయడం జరిగింది. జాబితాలకు కొలీజియం ఆమోదం.. సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపిన 19 మంది జాబితాలో 9 మంది జిల్లా కోర్టు న్యాయమూర్తులు, 10 మంది సీనియర్ న్యాయవాదులు ఉన్నారు. న్యాయమూర్తుల కోటా నుండి మద్రాస్ హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ ఎస్. అల్లితో పాటు జిల్లా న్యాయమూర్తులుగా పనిచేస్తున్న మురుగన్, సుమతి, తిరుమగళ్ చంద్రశేఖర్, ధర్మలింగం లింగేశ్వరన్, కార్తికేయన్ బాలతాండాయుధం, షణ్ముగం కార్తికేయన్, బాలుచామి మురుగేశన్, గుణశేఖరన్ పేర్లు ఉన్నాయి. అలాగే న్యాయవాదుల కోటా నుండిప్రముఖ న్యాయవాదులు ఎన్. రమేష్, జి.కె. ముత్తుకుమార్, రాజేష్ వివేకానందన్, శంకరనారాయణన్ రవికుమార్, నాగరాజన్ దిలీప్కుమార్, ఇ. మనోహరన్, కృష్ణ స్వామి గోవిందరాజన్, రజినీష్ పదియిల్, కె. అప్పాదురై, ఆర్. అనిత ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించిన ఈ 19 మంది జాబితాను తదుపరి నియామక ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలిపిన తర్వాత, భారత రాష్ట్రపతి నూతన న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను (గెజిట్ నోటిఫికేషన్) జారీ చేస్తారు. ఈ నియామకాలు పూర్తయితే మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తుల కొరత దాదాపుగా తీరనుంది. హైకోర్టు -
నేడు మెడికల్ షాప్లు బంద్
కొరుక్కుపేట: ఆన్లైన్లో మెడికల్ మందుల అమ్మకాలకు నిరసనగా తమిళనాడు డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ బుధవారం ఒక రోజు సమ్మెకు దిగనుంది. అక్రమ ఆన్న్లైన్ ఫార్మసీల కార్యకలాపాలను నిలిపివేయడంసహా పలు దీర్ఘకాలిక డిమాండ్లను చెబుతూ, అఖిల భారత డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చింది. దీనికి మద్దతుగా, బుధవారం తమిళనాడు వ్యాప్తంగా ఒకరోజు 40 వేల మెడికల్ షాప్లు మూసివేసి యజమానులు నిరసన తెలపనున్నారు. ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో తమిళనాడు డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ ఆన్లైన్లో మందులు అమ్మకాలను నిలిపేయాలని నిరసిస్తూ బుధవారం ఒక్క రోజు మెడికల్ దుకాణాలు మూసివేస్తున్నట్టు తెలిపారు. 40వేల మంది సభ్యులున్న తమిళనాడు డ్రగ్ డీలర్స్ అసోసియేషన్, కార్పొరేట్, ముఖ్యమైన ఫార్మసీలు కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేసింది. నకిలీ మందులను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దుకాణాల మూసివేత నేపథ్యంలో ప్రజలకు హాని కలిగించని మందుల నిల్వలు తగినంతగా ఉండేలా చూడాలని తమిళనాడు డ్రగ్ కంట్రోల్ బోర్డ్, సరఫరా విభాగంలోని జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ విషయమై, ఔషధ నియంత్రణ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్. గురుభారతి, ఆరోగ్య కార్యదర్శికి రాసిన లేఖలో అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలియజేశారని, అలాగే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని తమిళనాడు డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ తమిళనాడు ప్రభుత్వాన్ని కోరిందని వెల్లడించారు . -
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ నేతృత్వంలోని నూతన మంత్రివర్గంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్, ఎన్నికల మేనేజ్మెంట్ జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున, సీనియర్ నేత సెంగోట్టయన్ సహా మొత్తం 9 మంది మంత్రులు
సాక్షి, చైన్నె : సీఎం విజయ్ కేబినెట్లో మరి కొంత మంది మంత్రులు బాధ్యతలు చేపట్టబోతున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి. తాజాగా తొమ్మిది మంది మంత్రులకు శాఖల కేటాయింపు పోగా, మరో 22 శాఖలకు మంత్రుల నియామకం జరగాల్సి ఉంది. ఇందులో కాంగ్రెస్కు రెండు, అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నట్టు, మిగిలిన పదవులలో టీవీకే ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించేందుకు సీఎం విజయ్ నిర్ణయించినట్టు సమాచారం. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొత్త మంత్రుల జాబితా బుధవారం వెలువడే అవకాశం ఉందని, వారు గురువారం ప్రమాణస్వీకారం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజా 9 మంది మంత్రుల నేపథ్యం ఇదీ.. పెరిగిన ఆశావహుల సంఖ్య -
ఆయన్ని కించపరచ లేదు!
తమిళసినిమా: సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కడుప్పు. త్రిష నటించిన ఇందులో ఆర్జే. బాలాజీ ప్రతినాయకుడిగా నటించారు. శ్వాసిక, ఇంద్రన్, యోగిబాబు శివద, సుప్రీత్రెడ్డి, అనక, మాయా రవి, నట్టి నటరాజ్ ముఖ్యపాత్రులు పోషించారు. ఆర్జే.బాలాజీ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్సార్ ప్రకాష్బాబ, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. సాయి అభయంకర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గత 15న తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రంలో పాటల వ్యవహారంలో సంగీత దర్శకుడు ఇళయరాజా హక్కులను కోరుతూ కోర్టును ఆశ్రయించడాన్ని గుర్తుచేసే ఒక సన్నివేశం చోటు చేసుకుంది. ఈ విషయమై కరుప్పు చిత్ర నిర్మాణ సంస్థ మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో కడుప్పు చిత్రంలో ఇళయరాజా పేరును పొందుపరచడం అన్నది ఆ సన్నివేశాన్ని కొనసాగించే ఉద్దేశంతో యాదృచ్ఛికంగా జరిగిందే కానీ, 50 ఏళ్లకు పైగా సంగీత సామ్రాజ్యాన్ని పాలిస్తున్న సంగీత రారాజును కించపరచాలన్న భావన చిత్ర యూనిట్కు లేదు. ఎటువంటి దురుద్దేశం లేకుండా చోటుచేసుకున్న ఆ సన్నివేశం కారణంగా మీకు గానీ, మీ అభిమానులకు గానీ, మనసు గాయపడితే అందుకు మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. కరప్పులో సూర్య, త్రిష బ్లాస్ట్ నిజంగా బ్లాస్టే తమిళసినిమా: యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతిముకుందన్ ప్రధానపాత్రలు పోషించిన చిత్రం బ్లాస్ట్. ఇందులో జాన్ కొకెన్, అర్జున్ చిదంబరం, పవన్, బాలహాసన్, వినోద్సాగర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ కల్పత్తి ఎస్.అగోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పర్తి ఎస్.సురేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అర్చన కల్పతి క్రియేట్ ప్రొడ్యూసర్గాను, ఐశ్వర్య కల్పతి అసోసియేట్ క్రియేట్ ప్రొడ్యూసర్గాను బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రం ద్వారా సుభాష్ కె.రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ప్రదీప్ రంగనాథన్ శిష్యుడు అన్నది గమనార్హం. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని, అరుణ్ రాధాకష్ణన్ చాయాగ్రహణం అందించారు. ఈచిత్రం ఈనెల 28న తెరపైకి రానుంది. చిత్ర ఫ్రీ రిలీజ్ కార్యక్రమాన్ని సోమవారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. దర్శకుడు సుభాష్ కె.రాజ్ మాట్లాడుతూ దర్శకుడుగా చిత్త పరిశ్రమంలో ఇది తన తొలి అడుగని, ప్రదీప్ రంగనాథన్ నా సినీ గురువన్నారు. అర్జున్ మాట్లాడుతూ బ్లాస్ట్ చిత్రం నిజంగా బ్లాస్టే. నేను ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించినా కరాటే మాస్టర్ పాత్రలో నటించడం ఇదే మొదటిసారి. నేను చాలామంది కొత్త దర్శకులతో పని చేశాను. అయితే దర్శకుడు సుభాష్ చాలా తెలివైనవాడు ఆయన నటీనటుల నుంచి తనకు కావలసిన విషయాలను చాలా చక్కగా రాబట్టుకునే ప్రతిభ కలిగిన వాడని అర్జున్ పేర్కొన్నారు. -
సుబ్బయ్య హత్య కేసులో మలుపు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో కలకలం సృష్టించిన చైన్నె న్యూ రాలజిస్ట్ డాక్టర్ సుబ్బయ్య హత్య కేసు సుప్రీంకోర్టులో మలుపు తిరిగింది. నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సు ప్రీంకోర్టు పూర్తిగా రద్దు చేసింది. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ, నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష (జీవిత ఖైదు) విధిస్తున్నట్లు జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. కేసు నేపథ్యం ఇదీ 2013లో చైన్నె రాజా అన్నామలైపురంలో ఆస్తి వివా దం కారణంగా ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుబ్బ య్యను కిరాయి ముఠా దారుణంగా హత్య చేసింది. ఈ కేసులో ఆయన బంధువు పొన్ను స్వామి, ఆయన భార్య మేరీ పుష్పం, వారి కుమా రులు బాసిల్, బోరిస్, బాసిలిన్తో పాటు స్నేహితులు విలియమ్స్, డాక్టర్ జేమ్స్ సతీష్కుమార్, ఏసురాజన్, మురుగన్, శాంత ప్రకాష్ను పోలీ సులు అరెస్ట్ చేశారు. చైన్నె సెషనన్స్ కోర్టు ఈ కేసులో పొన్నుస్వామి సహా ఏడుగురికి మరణశిక్ష, ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. అయితే, దీనిపై అప్పీలుకు వెళ్లగా మద్రాస్ హైకోర్టు ఆధారాలు సరిగ్గా లేవంటూ నిందితులందరినీ విడుదల చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం, డాక్టర్ సుబ్బయ్య సతీమణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డాక్టర్ సుబ్బయ్య (ఫైల్), సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో మలుపు... కొత్త తీర్పు మద్రాస్ హైకోర్టు ట్రయల్ కోర్టు ఆధారాలను సరిగ్గా పరిశీలించకుండానే నిందితులను విడుదల చేసిందని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో గరిష్ట శిక్ష అయిన మరణశిక్షను విధించడం లేదని, అయితే నిందితులందరికీ యావజ్జీవ శిక్ష విధిస్తున్నామని కోర్టు తెలిపింది. వృద్ధులైన పొన్నుస్వామి, మేరీ పుష్పా తమ కుమారుల ప్రేరేపణ వల్లే ఈ నేరంలో భాగస్వాములయ్యారని కోర్టు అభిప్రాయపడింది. దీంతో వారు శిక్ష తగ్గింపు కోసం గవర్నర్కు విజ్ఞప్తి చేసుకోవచ్చని పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై తుది నిర్ణయం వచ్చే వరకు ఈ వృద్ధ దంపతుల జీవిత ఖైదును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. పొన్నుస్వామి, మేరీ పుష్పం మినహా మిగిలిన నిందితులందరూ తక్షణమే పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఎం సుందరేశ్ తీర్పు వెలువరించారు. -
‘పళణి’కి సంపూర్ణ మద్దతు
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళణిస్వామి మంగళవారం జిల్లాల కార్యదర్శులతో సమీక్షించారు. మెజారిటీ శాతం జిల్లాల కార్యదర్శులు పళణిస్వామికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు రెండు గ్రూపులుగా విడి పోయిన విషయం తెలిసిందే. ఇందులో 25 మంది టీవీకే చీఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. మిగిలిన 22 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వెన్నంటి నడుస్తున్నారు. తిరుగు బాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న సీనియర్ నేతలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి తదితరులు పళణి స్వామిని ప్రధాన కార్యదర్శిగా గద్దె దించి పార్టీని కై వశంచేసుకునే దిశగా వ్యూహాలు రచిస్తూ వస్తున్నారు. అదే సమయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు 25 మందిపై అనర్హత వేటు వేయించే దిశగా పళణి స్వామి ఉరకలు తీస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం ఓ వైపు పార్టీ జిల్లాల కార్యదర్శులతో పళణి స్వామి సమావేశం ఏర్పాటు చేయగా, మరో వైపు మద్దతు ఎమ్మెల్యేలతో సీవీ షన్ముగం, ఎస్పీ వేలుమణిలు మంతనాలలలో మునిగారు. సుదీర్ఘంగా సమీక్షఅసెంబ్లీ సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే ) పార్టీ తమ భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించింది. చైన్నె రాయపేటలోని అవ్వై షణ్ముగం సాలైలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయం ‘పురట్చి తలైవర్ ఎమ్.జి.ఆర్. మాళిగై’లో మంగళవారం అన్నాడీఎంకే జిల్లాల కార్యదర్శుల కీలక సమీక్షా సమావేశం జరిగింది. పార్టీ ప్రిసిడియం చైర్మన్ డాక్టర్ ఎ. తమిళ్మగన్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ఎడప్పాడి కె.పళనిస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు, పార్టీ ప్రధాన కార్యాలయ నిర్వాహకులతో విడివిడిగా ఉన్నత స్థాయి సంప్రదింపు జరిపారు. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. పళణి నాయకత్వానికి మద్దతు ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తమిళనాడు అంతటా సుడిగాలి పర్యటనలు చేసి, పార్టీ , కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేశారని నేతలు ప్రశంసించారు. ఆయన అలుపెరగని కృషి కారణంగా అన్నాడీఎంకే తరపున 47 మంది, కూటమి పార్టీల తరపున మరో ఆరుగుర మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారని గుర్తుచేశారు. ఈ విజయానికి పూర్తి కారకుడైన ఎడప్పాడి పళనిస్వామికి జిల్లా కార్యదర్శులు, పార్టీ ప్రధాన కార్యాలయ నిర్వాహకులు ఈ సమావేశంలో అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ ఎదుగుదల, బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటాల గురించి ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అదే సమయంలో ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై తామందరికీ పూర్తి నమ్మకం ఉందని, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు, సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని పార్టీ శ్రేణులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇక, పళణి స్వామి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దానికి కట్టుబడి ఉంటామని, ఇందుకు సహకరిస్తామని పుదుచ్చేరి అన్నాడీఎంకే నిర్వహకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు 25 మందిపై చట్ట పరంగా చర్యలకు అన్నాడీఎంకే జిల్లాల కార్యదర్శులే ముక్తకంఠంతో ఆమోదించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ సమావేశానికి అన్నాడీఎంకే పార్టీ పరంగా ఉన్న జిల్లాలో 80 జిల్లాలకు చెందిన కార్యదర్శులు హాజరైనట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, సీనియర్ నేత జయకుమార్ ఈ సమావేశానికి గైర్హాజరు కావడం చర్చకు దారి తీసింది. -
శిరువాపురి ఆలయంలో భక్తుల రద్దీ
తిరువళ్లూరు: శిరువాపురిలోని బాలసుబ్రమణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది. రెండు గంటలపాటు క్యూలో నిలబడి భక్తు లు స్వామి దర్శనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా శిరువాపురిలో బాలసుబ్రమణ్యస్వామి ఆలయం వుంది. ఆలయంలో ఏడువారాల పాటు మంగళవారం స్వామి వారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న నమ్మకం వుండడంతో భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం నుంచే భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. రెండు గంటల పాటు భక్తులు క్యూలో వేచివుండి స్వామి దర్శనం చేసుకున్నారు. సాయంత్రం స్వామికి 15 రకాల ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించి పుష్పాలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక దీపారాధన నిర్వహించిన తరువాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. -
సత్తా చాటిన సెవ్వాపేట క్రీడాకారులు
తిరువళ్లూరు: క్రిష్ణగిరి జిల్లా హొసూరులో జరిగిన జాతీయస్థాయి కుంఫూ పోటీల్లో తిరువళ్లూరు జిల్లా సెవ్వాపేటకు చెందిన క్రీడాకారులు తమ సత్తా చాటా రు. మొదటి స్థానంలో నిలవడంతో పాటు ఓవరాల్ చాంపియన్షిప్గా గెలిచి రికార్డు సృష్టించారు. క్రిష్ణగిరి జిల్లా హొసూరులో కుంఫూ జాతీయస్థాయి పోటీలు గత 16, 17 తేదీల్లో జరిగాయి. పోటీలకు దేశంమలోని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. 6 నుంచి 13 ఏళ్లు, 13 నుంచి 20 ఏళ్లు, 20 నుంచి 25 సంవత్సరాలు ఉన్న క్రీడాకారులకు మూడు కేటగిరిల్లో పోటీలను నిర్వహించారు. పోటీల్లో తిరువళ్లూరు జిల్లా సెవ్వాపేటకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. వారు జాతీయస్థాయిలో మొదటి స్థానం సాధించడంతోపాటు ఓవరాల్ చాంపియన్గా నిలిచారు. -
పార్టీ పతనానికి పళనిస్వామే కారణం
అన్నాడీఎంకే కార్యాలయం సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పరాజయానికి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఒంటెద్దు పోకడలే కారణమని మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు సి.వి. షణ్ముగం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీతో కూటమి ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనలను పళనిస్వామి అహంకారంతో తిరస్కరించారని ఆయన ఆరోపించారు. చైన్నెలో మంగళవారం ఎస్.పి. వేలుమణి, సి. విజయభాస్కర్ సహా పలువురు అన్నాడీఎంకే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సి.వి. షణ్ముగం సమావేశమయ్యారు. అనంతర సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పళనిస్వామి నాయకత్వంపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కూటమిని కావాలనే చెడగొట్టారు విలేకరుల సమావేశంలో సి.వి. షణ్ముగం మాట్లాడుతూ...అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసిందన్నారు.. 2019 నుండి పార్టీ వరుస ఓటములను ఎదుర్కొంటోందని, ఓటు బ్యాంక్ కూడా భారీగా పడిపోతోందని వివరించారు. ఈ నేపథ్యంలో బలమైన కూటమిని ఏర్పాటు చేయాలని తాము పళనిస్వామికి సూచించామన్నారు. ఎన్నికల సమయంలో తమిళగ వెట్రి కళగం తరఫున కూటమి చర్చల కోసం వచ్చిన ప్రతినిధులను పళనిస్వామి తీవ్రంగా అవమానించి పంపించి వేశారని ఆరోపించారు. కూటమి కుదరకూడదనే భావనతో వారిని దూరం పెట్టారని మండి పడ్డారు. అలాగే డీఎండీకే కేవలం అర శాతం ఓట్లు ఉన్న పార్టీ అని ఎగతాళి చేస్తూ కూటమి నుండి బయటకు పంపించారని, డాక్టర్ కృష్ణసామి వంటి మిత్రపక్ష నాయకులను కూడా పళనిస్వామి కలుపుకొని పోలేకపోయారని సీవీ షణ్ముగం మండిపడ్డారు. 31 మంది జిల్లా కార్యదర్శుల తొలగింపు చట్టవిరుద్ధం ఒకవైపు చర్చలకు సిద్ధమని చెబుతూనే, మరోవైపు జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన 31 మంది జిల్లా కార్యదర్శులను పళనిస్వామి ఏకపక్షంగా తొలగించడాన్ని షణ్ముగం తీవ్రంగా ఖండించారు. ఈ తొలగింపులు చట్టబద్ధంగా చెల్లవని స్పష్టం చేశారు. పార్టీ నిబంధనల ప్రకారం 5 వంతులలో ఒక వంతు మంది సభ్యులు సంతకాలు చేసి కోరితే, 30 రోజుల్లోగా జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, పళనిస్వామి సర్వాధికారిలా వ్యవహరిస్తూ దానికి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. తాము పార్టీకి ద్రోహం చేయలేదని, అన్నాడీఎంకేను మళ్లీ బలోపేతం చేయడమే తమ ఏకై క లక్ష్యమని షణ్ముగం స్పష్టం చేశారు. పళనిస్వామికి ధైర్యముంటే వెంటనే జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఓటమిపై బహిరంగంగా చర్చించాలని సవాల్ విసిరారు. అక్కడ మెజారిటీ సభ్యులు ఏది నిర్ణయిస్తే దానికి తాము కట్టుబడి ఉంటామని ప్రకటించారు. కాగా, ఈ అంతర్గత తిరుగుబాటుతో తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే భవిష్యత్తు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పదవికి ముప్పు వస్తేనే ’తప్పులు’ గుర్తొస్తాయా? పార్టీ నుండి తొలగించబడిన ఓ. పన్నీర్సెల్వం తాను ఎటువంటి పదవులు ఆశించడం లేదని, కేవలం సాధారణ కార్యకర్తగా ఉంటానని చెప్పినా పళనిస్వామి చేర్చుకోలేదని షణ్ముగం గుర్తుచేశారు. కానీ ఇప్పుడు తన పదవికి ముప్పు వచ్చేసరికి, తప్పు చేసిన వారు పశ్చాత్తాపంతో తిరిగి వస్తే చేర్చుకుంటాం అంటూ పళనిస్వామి ప్రకటనలు జారీ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముందే అందరినీ కలుపుకొని పోయి ఉంటే పళనిస్వామి తాజాగా ముఖ్యమంత్రి అయ్యేవారని, పార్టీని ముంచేసి ఇప్పుడు తానొక్కడే మంచివాడినని నిరూపించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. -
క్లుప్తంగా
ఎరువుల కొరత రాకుండా చూడండి ● ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ సాక్షి, చైన్నె: తమిళనాడులో 2026 ఖరీఫ్ సీజన్కు అవసరమైన యూరియా, డీఏపీ వంటి ఎరువులను ఎటువంటి అంతరాయం లేకుండా సరఫరా చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ మేరకు మంగళవారం ఆయన కేంద్రానికి అధికారిక విజ్ఞప్తి పంపారు. తమిళనాడులో వ్యవసాయ రంగ ప్రాధాన్యతను, ప్రస్తుత ఎరువుల కొరతను వివరిస్తూ సీఎం విజయ్ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అలాగే సీఎం విజయ్ను సచివాలయంలో పలువురు ప్రముఖులు కలిశారు. వీరిలో అపోలో ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రీతారెడ్డి, ఎండీ డాక్టర్ కవితారెడ్డి ఉన్నారు. అలాగే, తమిళనాడు దివ్యాంగుల సలహా కమిటీ సభ్యురాలు స్మిత సదాశివం, ఇతర ప్రతినిధులు జ్ఞాన భారతీ, హేమచంద్రన్, శరవణన్, తమిళనాడుకు కేటాయించిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ట్రైనీ ఆఫీసర్ల బృందం,ట్రాన్స్ జెండర్లహక్కుల కార్యకర్తలు గ్రేష్ భాను, బోర్న్టు విన్ డైరెక్టర్ శ్వేత సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. సిటీ బస్సులో గొడవ – వృద్ధుడిపై డ్రైవర్, కండక్టర్ దాడి తిరువొత్తియూరు: చైన్నె ఆళ్వార్పేటకు చెందిన కోటీశ్వరన్ (71) సామాజిక కార్యకర్త. సోమ వారం సాయంత్రం టి.నగర్ సమీపంలోని భారతీ నగర్ బస్టాప్ నుండి సిటీ బస్సు (నెం. 72ఈ) ఎక్కారు. తాను చూలైమేడు వెళ్లాలని ఆయన కండక్టర్తో చెప్పారు. అయితే బస్సు అటువైపు వెళ్లదని కండక్టర్ చెప్పడంతో, నేను ఇక్కడే దిగిపోతాను, బస్సు ఆపండి అని కోటీశ్వరన్ కోరారు. కానీ, బస్సు తర్వాత స్టాప్లోనే ఆగుతుందని, అప్పటి వరకు కచ్చితంగా టికెట్ తీసుకోవాలని కండక్టర్ బలవంతం చేశారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత టికెట్ తీసుకున్న కోటీశ్వరన్ లిబర్టీ బస్టాప్లో దిగారు. అప్పుడు ఆయన్ని వెంబడిస్తూ కిందకు దిగిన డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ కలిసి కోటీశ్వరన్పై దాడి చేసి, అక్కడి నుంచి బస్సుతో పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కోటీశ్వరన్ ప్రస్తుతం ఓమందూరార్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోడంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు ఢీకొని బాలుడి దుర్మరణం తిరువొత్తియూరు: ప్రభుత్వ బస్సు ఢీకొని తల్లి కళ్ల ముందే కుమారుడు మృతిచెందిన విషాదకర సంఘటన పుళల్ సమీపంలో చోటుచేసుకుంది. పుళల్ సమీపం కదిర్వేడు, భజన కోవెల వీధికి చెందిన దేవనాథన్ (44) ప్రైవేట్ కంపెనీలో మేనేజర్. ఇతని భార్య ప్రియ. ఈమె ద్విచక్ర వాహనంలో సోమవారం కుమారుడు నరేన్ తేజో (8)ను తీసుకుని ట్యూషన్న్ సెంటర్కు వెళ్లేందుకు బయలుదేరింది. కదిర్వేడు వినాయకపురం మీదుగా చెంగల్పట్టు – రెట్టేరి కదిర్వేడు వంతెన కింద వెళ్తుండగా, చైన్నె, ప్యారిస్ నుంచి చెంగల్పట్టు వెళుతున్న ప్రభుత్వ బస్సు బైక్ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లికుమారుడు రోడ్డుపై పడ్డారు. బస్సు బాలుడి తలపై దూసుకెళ్లడంతో నరేన్ తేజో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రియ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తన కళ్లముందే కుమారుడు మృతి చెందడంతో ఆమె బోరున విలపించారు. మాధవరం పోలీసులు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్, వ్యాసార్పాడికి చెందిన బాలగణేష్ (30)ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. బావిలోపడిన ట్రాక్టర్ ● బాలుడి మృతి ●మరొకరికి తీవ్రగాయాలు తిరుత్తణి: ఆగివున్న ట్రాక్టర్ ఎక్కి ఆడుకుంటూ బైక్ తాళంతో ట్రాక్టర్ ఆన్చేయగా ట్రాక్టర్ స్టార్టయి రివర్స్లో వెళ్లి బావిలో పడింది. ఈప్రమాదంలో ఆరేళ్ల బాలుడు మృతిచెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తిరుత్తణి సమీపం కాంచిప్కాడి గ్రామానికి చెందిన పన్నీరుసెల్వం (40 రైతు. ఇతని కుమారుడు రాకేష్(6). సోమవారం ఇంటి వద్ద నిలిపి ఉన్న ట్రాక్టర్పై రాకేష్, అదే గ్రామానికి చెందిన మునుస్వామి కుమారుడు యశ్విన్(5) ఆడుకుంటున్నారు. ఈక్రమంలో చేతిలో ఉన్న బైక్ తాళం తీసి రాకేష్ స్టార్ట్ చేశాడు. ట్రాక్టర్ స్టార్ట్ అయి వెనక్కి వెళ్లి అక్కడ ఉన్న పాడుబడిన బావిలో పడింది. ప్రమాదంలో ట్రాక్టర్ కిందపడిన రాకేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. యశ్విన్కి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు, అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని, గాయపడ్డ యశ్విన్కు బయటకు తీసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కనకమ్మసత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
క్లుప్తంగా
అమ్మ క్యాంటీన్లో భోజనం చేసిన ఎమ్మెల్యే – వసతులపై ఆరా కొరుక్కుపేట: తాంబరంలోని అమ్మక్యాంటీన్లలో ఎమ్మెల్యే శరత్కుమార్ పేదలతో కలసి భోజనం చేసి అందరిదృష్టిని ఆకర్షించారు. తాంబరం అసెంబ్లీ నియోజకవర్గంలో పశ్చిమ తాంబరంలోని షణ్ముగం రోడ్డులో, తూర్పు తాంబరంలోని సైలెయూర్ ప్రభుత్వ పాఠశాల సముదాయం, చెంబాకంలోని జోనల్ కార్యాలయం సమీపంలో అమ్మ క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. ఇక్కడ నాణ్యమైన ఆహారం, తాగునీటి సౌకర్యాలు లేవన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాంబరం ఎమ్మెల్యే శరత్కుమార్ మంగళవారం ఉదయం అమ్మ క్యాంటీన్లలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో, ఆయన అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల డిమాండ్లను విని, భోజనం చేయడానికి వచ్చిన సాధారణ ప్రజల ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే శరత్ కుమార్ కూడా సాధారణ ప్రజలకు వడ్డించిన ఆహారాన్ని తిని, దాని నాణ్యతను పరిశీలించారు. అదేవిధంగా తాంబరం అమ్మ క్యాంటీనన్లో భోజనం చేసి, ఆ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే శరత్కుమార్, షణ్ముగం రోడ్డులోని అమ్మ రెస్టారెంట్ పైకప్పు పగిలిపోయినట్లు గుర్తించారు. రెస్టారెంట్లోని శుద్ధి చేసిన తాగునీటి సరఫరా వ్యవస్థ, ఆర్ఓ మెషిన్ పాడయ్యాయి. చేతులు కడుక్కునే కొళాయిలలో కూడా నీరు రావడం లేదు. ఈ విషయంపై ఎమ్మెల్యే శరత్ కుమార్ వెంటనే ఫోన్లో అధికారులను సంప్రదించి, భోజనశాలల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవన నిర్మాణ కార్మికుడి అనుమానాస్పద మృతి అన్నానగర్: చైన్నెలోని మధురవాయల్లో ఒక నిర్మాణ కార్మికుడు అనుమానాస్పద పరిస్థితు ల్లో మరణించాడు. పోలీసులు అతని ప్రియు రాలిని తీవ్రంగ దర్యాప్తు చేస్తున్నారు. విల్లుపురం జిల్లాకు చెందిన కుమారవేల్. ఇతని భార్య కుమారి. వీరి కుమారుడు సిలంబరసన్ (24). వీరందరూ చైన్నెలోని మధురవాయల్లోని పల్లవన్ నగర్ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నివసిస్తూ నిర్మాణ పనులు చేసేవారు. సోమవారం రాత్రి సిలంబరసన్ అక్కడి గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న మధురవాయల్ పోలీసులు, సిలంబరసన్ అనుమానాస్పద రీతిలో మరణించి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అతని మెడకు గుడ్డ కట్టిన ఆనవాళ్లు ఉండడంతో, ఇది హత్య జరిగి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 18 ఏళ్ల యువతి సిలంబరసన్ను చివరిసారిగా కలిసి మాట్లాడినట్లు తేలింది. దీంతో ఆమెను ప్రశ్నించగా.. తమ మధ్య జరిగిన తగాదా తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది. కాగా పోస్టుమార్టం తర్వాత పూర్తి వివ రాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. మనవరాలిని కడతేర్చి అవ్వ ఆత్మహత్య సేలం: మనవరాలిని కడతేర్చి ఓ అవ్వ తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘట న సేలం జిల్లాలో చోటుచేసుకుంది. సేలం జిల్లా, కన్నన్ కురిచిలోని గోవిందస్వామి అయ్య ర్ వీధికి చెందిన అమ్మాని (65). ఈమెతో పుట్టుకతోనే ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు లేని దివ్యాంగ మనవరాలు ఉంటోంది. వీరిద్దరినీ చూసుకునే వారు ఎవరూ లేరు. దీంతో తీవ్ర నిరాశకు గురైన అమ్మాని, తన మనవరాలిని దగ్గరలోని బావిలో తీగకు వేలాడదీసి చంపి, ఆ తర్వాత తానూ అదే బావిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గుర్తించిన గ్రామస్తులు కన్నన్ కురిచి పోలీసులలకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి మృతదేహాలను పోస్ట్మార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. దివ్యాంగురాలిపై అత్యాచారం అన్నానగర్: పుదుక్కోట్టై సమీపంలో ఓ దివ్యాంగ మహిళను కారులో కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, ఆపై రోడ్డుపై పడేశారు. వివరాలు.. పుదుక్కోట్టై జిల్లాలోని కరంబకుడి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళ మాట్లాడలేని వికలాంగురాలు. ఇంకా పెళ్లి కాని ఈమె 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామంలోని ఒక రైస్ మిల్లులో పనిచేస్తోంది. సోమవారం సాయంత్రం, ఆమె పని ముగించుకుని ఆ ప్రాంతంలోని బస్టాండ్లో నిలబడి ఉంది. ఆ సమయంలో, కారులో వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఒంటరిగా నిలబడి ఉన్న ఆ మహిళను చూసి కారు ఆపి, గ్రామంలో దింపుతామని పిలిచారు. ఆమె నిరాకరించడంతో, వారు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. ఆ తర్వాత వారు చెరువు సమీపంలోని ఒక రహస్య ప్రదేశానికి వెళ్లి ఆ మహిళపై అత్యాచారం చేశారు.అనంతరం స్పృహ కోల్పో యిన ఆ మహిళను కారులో తీసుకెళ్లి కరంబకుడి–అళంగూడి రహదారిపై పడేసి వెళ్లిపోయారు. స్థానికులు ఆమెను రక్షించి పోలీసులకు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మనకొల్లై గ్రామానికి చెందిన కారు యజమాని, డ్రైవర్ అయిన శేఖర్ (53), అతని స్నేహితుడైన కూలీ మారి ముత్తు (52) అనే ఇద్దరు ఆ మహిళను కిడ్నాప్ చేసి, లైంగికదాడి చేసినట్లు తేలింది. పోలీసు లు మారిముత్తును అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కారుడ్రైవర్ శేఖర్ కోసం గాలిస్తున్నారు. గాయపడిన దివ్యాంగ మహిళను పుదుక్కోట్టైలోని ప్రభుత్వ రాణియార్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. -
డీఎంకేలోకి.. యూత్ కాంగ్రెస్ నేత
సాక్షి, చైన్నె : తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల తదనంతర పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ యూత్ కాంగ్రెస్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలీమ్ అల్ బుఖారీ మంగళవారం డీఎంకేలో చేరారు. చైన్నెలోని అన్నా అరివాలయంలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్టాలిన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, డీఎంకే అధికార ప్రతినిధి టి.కె.ఎస్. ఇలంగోవన్, లీగల్ సెల్ సెక్రటరీ ఎన్.ఆర్. ఇలంగోవన్, తిరుచ్చి సౌత్ జిల్లా కార్యదర్శి అన్బిల్ మహేష్ పొయ్యామొళి, పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శి పూచి మురుగన్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నిర్ణయంపై అసంతృప్తి ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీతో చేతులు కలిపింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అలీమ్ అల్ బుఖారీ తీవ్రంగా వ్యతిరేకించారు. కూటమి మార్పుపై ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. దీంతో క్రమశిక్షణా చర్యల కింద కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పార్టీలోని అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అలీమ్ అల్ బుఖారీ తాజాగా డీఎంకే గూటికి చేరారు. ఓటమిపై డీఎంకేలో అంతర్మథనం ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోవడంపై ఆ పార్టీ నాయకత్వం సమీక్షలు ప్రారంభించింది. ఓటమికి గల కారణాలను అన్వేషించేందుకు పార్టీ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి వెళ్లి క్షేత్రస్థాయిలో ఓటమికి గల కారణాలను విశ్లేషించి నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో, చైన్నె అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ అధ్యక్షతన సీనియర్ నాయకుల ఉన్నత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. ఈ భేటీలో డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కనిమొళి, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్. భారతి, మీడియా విభాగాధిపతి టి.కె.ఎస్. ఇలంగోవన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ఓటమి శాశ్వతం కాదని, శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రతి జిల్లాలోనూ త్వరలోనే సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. 23న యువజన విభాగం భేటీ మే 23న డీఎంకే యువజన విభాగం కీలక సమావేశంకు చర్యలు చేపట్టారు. చైన్నెలోని అన్నా అరివాలయం ’కలైంజ్ఞర్ ఆడిటోరియంలో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు. జూన్ 3వ తేదీన జరగనున్న మాజీ ముఖ్యమంత్రి, దివంగత కళాకారుడు కరుణానిధి జయంతి వేడుకల నిర్వహణతో పాటూ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నామన్నారు. జిల్లా, నగర, రాష్ట్ర ఆర్గనైజర్లు ,డిప్యూటీ ఆర్గనైజర్లు అందరూ తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరుకావాలని ఉదయనిధి స్టాలిన్ కోరారు. -
.............
– వివాదంపై టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వివరణసాక్షి, చైన్నె : తన పాత జ్యోతిష్య కార్యాలయంలో ప్రభుత్వ అధికారులతో నిర్వహించిన సమావేశం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీయడంతో, తమిళగ వెట్రి కళగం మహిళా ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంపై ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ సోషల్ మీడియా ట్రోల్స్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.వివాదం ఏమిటంటే..?ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ పరిధిలోని గౌండంపాళయం నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున కనిమొళి సంతోష్ విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రముఖ జ్యోతిష్యురాలిగా ప్రాచుర్యం పొందారు. ఇటీవల ఆమె ప్రజారోగ్యశాఖ అధికారులతో తన కార్యాలయంలో సమావేశమై, అందుకు సంబంధించిన మూడు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటోల్లో ఎమ్మెల్యే కనిమొళి పెద్ద లగ్జరీ సోఫాలో కూర్చోగా, ఆమెకు ఎదురుగా ప్రభుత్వ అధికారులు ప్లాస్టిక్ కుర్చీలలో కూర్చోవడం కనిపించింది. ప్రభుత్వ అధికారులను ఆమె అవమానించారంటూ నెటిజన్లు, ప్రతిపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి.ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వివరణ:ఈ వివాదంపై ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే, అందులోని అసలు నిజాన్ని వివరించారు. తాను రాజకీయాల్లోకి రాకముందు చాలా ఏళ్లుగా జ్యోతిష్యురాలిగా ప్రజలను కలుస్తున్న కార్యాలయం అని, తన జీవిత ప్రయాణంలో అది ఎంతో ముఖ్యమైన స్థలంగా పేర్కొన్నారు. తన కొత్త ఎమ్మెల్యే ఆఫీస్ పనులు (పెయింటింగ్, ఇతర పనులు) ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కొత్త ఆఫీస్ పనులు పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత ఆఫీస్ నుంచే ప్రజల సమస్యలను, అధికారులను కలిసి వినతులను స్వీకరిస్తున్నానని తెలిపారు. తనకు ప్రజాసేవే ముఖ్యం, ఆఫీస్ ఎక్కడ ఉందనేది కాదని వివరించారు. తాను అధికారులను ఇంటికి పిలిపించుకుని, ప్లాస్టిక్ కుర్చీలలో కూర్చోబెట్టి అవమానించానని కొందరు కావాల నే ట్రోల్ చేస్తుండడం అవాస్తవంగా పేర్కొన్నారు. -
స్కూల్ బస్సులను వేగంగా నడపొద్దు
వేలూరు: ప్రైవేటు పాఠశాల బస్సులను అతి వేగంగా నడపకుండా విద్యార్థులను జాగ్రత్తగా తీసుకెళ్లాలని కలెక్టర్ సుబ్బులక్ష్మి డ్రైవర్లకు సూచించారు. కాట్పాడిలోని సన్బీమ్ పాఠశాల ఆవరణలో జిల్లాలోని ప్రైవేటు పాఠశాల బస్సుల కండిషన్లను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ స్కూల్ బస్సుల్లో విద్యార్థులను తీసుకెళ్లే సమయంలో అతి జాగ్రత్తగా తీసుకెళ్లే విధంగా బస్సులను కండిషన్గా ఉంచుకోవాలన్నారు. అదేవిధంగా పాఠశాల బస్సులను నడిపేందుకు అనుభవం ఉన్న సీనియర్ డ్రైవర్లను నియమించి ప్రతి బస్సుకు క్లీనర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం తాగి బస్సులను నడిపే డ్రైవర్ల లైసెన్స్లను రద్దు చేసేందుకు సిపారస్సు చేస్తామని హెచ్చరించారు. గత మూడేళ్లుగా జిల్లాలో ఎటువంటి ప్రమాదాలు జరగలేదని ఇదే పరిస్థితి కొనసాగేందుకు స్కూల్బస్సు డ్రైవర్లు సహకరించాలన్నారు. అనంతరం పాఠశాల బస్సులలను తనిఖీ చేశారు. వేలూరు డివిజన్ పరిధిలో 47 ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన 441 బస్సులను తనిఖీ చేశారు. ఆమెతో పాటు ఆర్టీఓ సుందర్రాజన్, విద్యాశాఖ సీఈఒ ప్రేమలత, అడిషనల్ ఎస్పీ పయణి, సబ్ కలెక్టర్ సెంథిల్కుమార్, విద్యాశాఖ అధికారులు, ఎంవీఐలు రాజ్కుమార్, ప్రైవేటు పాఠశాల, కళాశాలలకు చెందిన డ్రైవర్లు పాల్గొన్నారు. ముందుగా బస్సు డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. -
జాలర్ల వలలో మిస్టరీ వస్తువు
తిరువొత్తియూరు: పళవేర్కాడు సముద్రంలో చేపలు పడుతుండగా మత్స్యకారుల వలలో చిక్కుకున్న ఓ వస్తువు బాంబు అయి ఉండవచ్చనే అనుమానంతో కలకలం రేగింది. దీనిపై సమచారం మేరకు పోలీసులు ఆ వస్తువును స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. వివరాలు.. పొన్నేరి సమీపంలోని పళవేర్కాడు పరిసర ప్రాంతాల్లో ఉన్న 30కి పైగా మత్స్యకార గ్రామాల ప్రజలు పళవేర్కాడు సరస్సులో సముద్రంలో చేపలు పడుతుంటారు. సోమ వారం ఎప్పటిలాగే పశియావరానికి చెందిన దేవప్రకాష్ అనే వ్యక్తి తన పడవలో మరో నలుగురితో కలిసి సముద్రంలో వేటకు వెళ్లారు. సముద్రంలో కొంత దూరంలో వారు చేపలు పడుతుండగా వారి వలలో సుమారు 10 కిలోల బరువున్న ఇనుముతో చేసిన తుప్పు పట్టిన స్థితిలో ఉన్న బాంబు వంటి ఓ వస్తువు చిక్కుకుంది. దీనిని చూసి మత్స్యకారులు షాక్ అయ్యారు . వారు తిరుప్పాలైవనం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ మిస్టరీ వస్తువును స్వాధీనం చేసుకున్నారు. అది శిక్షణ సమయంలో ఉపయోగించిన బాంబా లేక రాకెట్ లాంచరా? నౌకాదళం ఓడ నుండి పొరపాటున పడిపోయిందా? లేదా ఎవరైనా విధ్వంసకర చర్యల కోసం దానిని ఉంచారా? అనే వివిధ కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం విజయ్కు సరికొత్త తలపోటు
తమిళనాడు సీఎం విజయ్ చేసిన పని ఇప్పుడు ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. టీవీకే పార్టీని స్థాపించి, సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్.. ప్రతీరోజూ ఏదొక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టాక మాజీ సీఎం స్టాలిన్ను కలవడం దగ్గర్నుంచీ ఆయన చేసిన ప్రతీ పని హైలైట్ అవుతూనే ఉంది. అయితే తాజాగా విజయ్ చేసిన పని మాత్రం విమర్శకుల నోళ్లకు పని చెప్పింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఎల్టీటీఈ వ్యవస్థాపకుడైన ప్రభాకరన్కు సీఎం విజయ్ నివాళులు అర్పించడమే. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి నిషేధించబడ్డ సంస్థ వ్యవస్థాపకుడికి ఎలా నివాళులర్పిస్తారని విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్ది కీలక సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఆ గ్రూప్కు చెందిన సభ్యురాలే ఆత్మాహుతి బాంబు దాడితో రాజీవ్గాంధీ హత్యలో ప్రధాన పాత్ర పోషించింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన్ను హత్య చేశారు. ఆ నేపథ్యంలోనే ఎల్టీటీఈని బ్యాన్ చేసిందివిజయ్ నివాళులు.. కాంగ్రెస్ ఏం చెబుతుంది?రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకరన్కు సీఎం స్థానంలో ఉన్న విజయ్ ఎలా నివాళులు అర్పిస్తారనేది బీజేపీ ప్రశ్న. దీనిపై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ ఏం చెబుతారని బీజేపీ నిలదీసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సీఎం కావడానికి కాంగ్రెస్తో పాటు పలు స్థానిక పార్టీలు సహకరించిన నేపథ్యంలో ఆ పార్టీలకు విజయ్ ఏం చెబుతారని బీజేపీ అడుగుతోంది. ఇది కేవలం ప్రభాకరన్కు మాత్రమే నివాళి కాదుఈ అంశాన్ని టీవీకే సమర్థించుకునే పనిలో పడింది. తమ అధ్యక్షుడు, సీఎం విజయ్ అర్పించిన నివాళి కేవలం ప్రభాకరన్కు మాత్రమే కాదని, శ్రీలకంలో ఊచకోతకు గురైన వేలాది మంది తమిళులకు నివాళి అంటూ చెప్పుకొచ్చింది.విజయ్కు సరికొత్త తలపోటుసీఎం స్థానంలో ఉన్న విజయ్ తెలుసో, తెలియకో చేసిన ప్రభాకరన్ నివాళుల అంశం.. ఇప్పుడు టీవీకే పార్టీకి కొత్త చిక్కులు తెస్తుందా అనే చర్చ మొదలైంది. ఏదో బొటాబొటీ మ్యాజిక్ ఫిగర్తో అందులోనూ కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ను ఇది కచ్చితంగా ఇరకాటంలో పడేస్తుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇప్పటికే మాజీ సీఎం స్టాలిన్.. విజయ్ ప్రభుత్వం విమర్శలు తీవ్రతరం చేశారు. విజయ్ ప్రభుత్వం ఎంతో కాలం సాగదనీ, తమిళనాడులో జరగబోయే రాజకీయ పరిణామాలకు డీఎంకే శ్రేణులంతా సిద్థంగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయ్ ప్రభుత్వం కూలుపోతుందని, ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చనే సంకేతాలిచ్చారు స్టాలిన్. ఈ తరుణంలోనే ఇది చోటు చేసుకోవడంతో టీవీకే శ్రేణుల్లో కలవరపాటుకు గురిచేస్తోంది. முள்ளிவாய்க்கால் நினைவுகளை இதயத்தில் ஏந்துவோம்! கடல் கடந்து வாழும் நம் தமிழ்ச் சொந்தங்களின் உரிமைகளுக்காக எப்போதும் துணை நிற்போம்!— TVK Vijay (@TVKVijayHQ) May 18, 2026 -
విజయ్ సర్కార్ ఏ క్షణమైనా కూలిపోవచ్చు
చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చని.. తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయి. ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చు. కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండాలి అని ఆయన పిలుపు ఇచ్చారు. అలాగే రాజకీయాల్లో ఓటమి తాత్కాలికమని.. డీఎంకే మళ్లీ బలంగా తిరిగి వస్తుందని పార్టీ శ్రేణుల్లో ఆయన ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.తమిళనాడులో సూర్యుడు (డీఎంకే గుర్తు) ఎప్పటికీ అస్తమించడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. కానీ మళ్లీ ప్రజల విశ్వాసాన్ని కచ్చితంగా గెలుచుకుంటాం అని స్టాలిన్ అన్నారు.అందుకే స్టాలిన్ కామెంట్లు!తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం చిన్న పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో మద్దతు విషయంలో పెద్ద హైడ్రామానే నడిచింది. చివరకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, అన్నాడీఎంకే రెబల్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మిత్రపక్షాల మద్దతు ఉపసంహరణ, లేదంటో విజయ్కు మద్దతు ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. ఈ రెండింటిలో ఏదైనా జరగొచ్చని స్టాలిన్ అంచనా వేస్తున్నారు. అందుకే ఆయన పై వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.ఇప్పటికే ఎన్నికల ఓటమి కారణాలను విశ్లేషించేందుకు స్టాలిన్ 36 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రజల నుంచి ప్రత్యక్ష అభిప్రాయాలను సేకరించి, పార్టీ బలహీనతలను గుర్తించనుంది. తద్వారా మళ్లీ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ఏం చేయాలో స్టాలిన్ వ్యూహ రచన చేస్తారని సమాచారం. అలాగే సోషల్ మీడియాలోనూ డీఎంకే వీక్గా ఉందని.. దానిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. -
టీవీకే విజయం : డిజిటల్ సునామీపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ చేతిలో ఓటమి పాలైన కొన్ని రోజుల తర్వాత, డీఎంకే (DMK) అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్.. బూత్ ఏజెంట్లను కూడా సరిగ్గా నియమించుకోకుండా, కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారా పిల్లలను ప్రభావితం చేసి ముఖ్యమంత్రి అయ్యారని స్టాలిన్ విమర్శించారు.VIDEO | Thanjavur, Tamil Nadu: DMK chief MK Stalin says, "TVK leader Vijay became CM by influencing children through Instagram, without even appointing booth agents properly."(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/HhI7ofAjeY— Press Trust of India (@PTI_News) May 18, 2026'డిజిటల్ సునామీ'తమిళనాడులోని తంజావూరులో జరిగిన ఒక సభలో స్టాలిన్ మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్లో పిల్లల ద్వారా పెద్దలను ప్రభావితం చేసిన టీవీకే విజయం సాధించిందన్నారు. ఇన్స్టా ఆధారిత ప్రచారం, పిల్లలు టీవీకేకు అనుకూలంగా ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేయడంలో డీఎంకే విఫలమైందన్నారు. తంజావూరులో ఒక వివాహవేడుకకు హాజరైన ఆయన మాట్లాడారు. ‘సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ను ఉపయోగించడం, వారి తల్లులు, తాతలు, పెద్దలను ప్రభావితం చేయడానికి పిల్లలతో ప్రచారం చేయించడం వంటివి ఉద్దేశపూర్వకంగానే చేశారు. దాన్ని మేం గ్రహించలేకపోయాం. ఇకపై ఇలాంటి చర్యలను ఓడించడానికి పార్టీ వ్యూహాలను రూపొందిస్తుంది’అని చెప్పారు. ఇదీ చదవండి: 120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశఅధికారం కోల్పోయినప్పటికీ డీఎంకే రాజకీయంగా ప్రాసంగికంగానే ఉందన్నారు. డీఎంకే పాలనలో ప్రారంభించిన సంక్షేమ పథకాలను కొత్త ప్రభుత్వం కొనసాగించడాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో పరిపాలనను ఇప్పటికీ తమ పార్టీ విధానాలే ప్రభావితం చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఎన్నికల ఓటమి తర్వాత తాను కుంగిపోలేదని, ఓటమి తరువాత సమయంలో డీఎంకే ఫీనిక్స్ పక్షిలా పుంజుకుంటుందని అన్నారు. ఇదీ చదవండి: ట్రంప్, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్అధికార కూటమి వ్యాపింపజేస్తున్న తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవాలని పార్టీ కార్యకర్తలను కోరారు. పాలనకు డీఎంకే ఆటంకం కలిగించదని హామీ ఇస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ను కూడా పంచుకున్నారు. ‘కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వారు పరిపాలిస్తున్నంత కాలం ఇబ్బంది పెట్టం. కానీ వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మాపై నిందారోపణలు చేస్తే, వివరణలు ఇస్తాం. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తే, నిజాన్ని బయటపెడతాం’అని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రతిరోజూ హత్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దోషులను గుర్తించి, వారిపై తగిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడి, శాంతిభద్రతలను పరిరక్షించడం పరిపాలనలో ప్రాథమిక కర్తవ్యం. ఈ వాస్తవాన్ని టీవీకే ప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి గ్రహించి, ఆ మేరకు చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: వింటేజ్ లుక్ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్కాగా ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 234 స్థానాలకు గాను 104 స్థానాలను గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేయగా, డీఎంకే 59 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది.ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది? -
ఘనంగా పుష్పపల్లకి ఉత్సవం
వేలూరు: వేలూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుడియాత్తం గంగమ్మ శిరస్సు జాతర ఈనెల 15వ తేదిన అతి వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాలను వేలూరు జిల్లా నుంచే కాకుండా ఆంధ్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన ఆదివారం రాత్రి పుష్పపల్లకి ఉత్సవం అతి వైభవంగా జరిగింది. ముందుగా గుడియాత్తం గోపాలపురం యువజన సంఘం ఆధ్వర్యంలో శివలింగం, వినాయకుడి స్వామిలను అలంకరించి పుష్పపల్లకిలో ఆశీనులను చేశారు. అప్పటికే పల్లకిలో ఉంచిన అమ్మవారిని పుష్పాలతో అలంకరించడంతో పాటూ పల్లకిలను మల్లెపూలతో అలంకరించారు. అదే విధంగా గుడియాత్తం తండ్రాంబట్టు పూల వ్యాపారుల సంఘం అద్వర్యంలో 69వ సంవత్సర పుష్పపల్లకి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పల్లకిని సుమారు 14 అడుగుల ఎత్తులో అలంకరించడంతో భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా భక్తులకు అమ్మవారికి కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఇదిలా ఉండగా రాత్రి పూర్తిగా ఐదు పుష్ప రథాలు గుడియాత్తంలోని పలు వీధుల్లో తిరిగాయి. ఈ పుష్ప పల్లకిల ముందు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో భక్తులను ఆకట్టుకుంది. -
మిత్రుడు పిలిస్తే కాదనగలమా!
తమిళసినిమా: మలయాళ చిత్రాలు తమిళంలోనూ ప్రేక్షకుల ఆదరణను పొందుతున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలా అక్కడ ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న చిత్రాన్ని తమిళంలో అదిరడి పేరుతో ఈ నెల 22న విడుదల చేయనున్నారు. అరుణ్ అనిరుధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్, బాసిల్ జోసఫ్, వినీత్ శ్రీనివాసన్, నటి రియా శిబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. బాసిల్ జోసఫ్, ఆనంద్.ఎస్ కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళంలో ఫైవ్ స్టార్ సెంథిల్ తమిళనాడులో విడుదల చేస్తున్నారు. కాగా అదిరడి చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఆదివారం చైన్నెలోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు. కార్యక్రమంలో యువ క్రికెట్ క్రీడాకారుడు సంజు సామ్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిత్ర కథానాయకుడు, నిర్మాతల్లో ఒకరైన బాసిల్ జోసఫ్ మాట్లాడుతూ తాను స్వయంగా తమిళంలో డబ్బింగ్ చేసిన చిత్రం ఇదని చెప్పారు. అదిరఢి అనే పదాన్ని చిన్న తనం నుంచి వింటూ వచ్చాననీ అదే పేరును తమ చిత్రానికి నిర్ణయించడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ చిత్రాన్ని స్టైట్ తమిళ చిత్రం అనిపించే విధంగా రూపొందించినట్లు చెప్పారు. మలయాళంలో మాదిరిగానే తమిళంలోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. క్రికెట్ క్రీడాకారుడు, తన మిత్రుడు సంజు సామ్సన్ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు థ్యాంక్స్ అన్నారు. ఈ చిత్రంలో ఒక గెస్ట్ రోల్ చేయమని సంజు సామ్సన్ కోరగా. ఆయన నిరాకరించారన్నారు. క్రికెట్ క్రీడాకారుడు సంజు సామ్సన్ మాట్లాడుతూ మిత్రుడు ఆహ్వానిస్తే రాకుండా ఉండగలమా? బాసిల్ జోసఫ్ తనకు మంచి మిత్రుడు అని పేర్కొన్నారు. ఆయన చిత్రాలు చూసి చిన్న చిన్న విమర్శలు చేస్తానన్నారు. ఈ చిత్రంలో తనను ఆటోడ్రైవర్గా చిన్న పాత్రలో నటించమని అడిగారని, పెద్ద పాత్ర అయితే నటించే వాడినన్నారు. ఇకపోతే ఈ చిత్రం తమిళంలోనూ మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
ఇన్స్టాగ్రామ్తో అధికారంలోకి వచ్చారు!
సాక్షి, చైన్నె : ‘సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ను ఉపయోగించుకుని, చిన్న పిల్లల ద్వారా వాళ్ల ఇళ్లలోని పెద్దలను, తల్లిదండ్రులను ప్రభావితం చేసి, పక్కా ప్లాన్తో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు..ఈ విషయం మన కంటికి కనిపించకుండా పోయింది’ అని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. తంజావూరులో జరిగిన పూండి కలైవాణన్ కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్న స్టాలిన్.. ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి, తమిళగ వెట్రి కళగం విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకే శకం ముగిసిపోలేదు ఎన్నికల్లో ఓటమి చెందినంత మాత్రాన డీఎంకే పని అయిపోయిందని కొందరు ప్రత్యర్థులు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారన్నారు. 1949లో ప్రారంభమైన డీఎంకే ఎన్నో విజయాలు, అపజయాలను చూసిందని, ఓడిపోయిన ప్రతిసారీ డీఎంకే ఫీనిక్స్ పక్షిలా పైకి లేచిందన్నారు.. ఇప్పటికీ ద్రవిడ మోడల్ పాలనే.. డీఎంకే 5 ఏళ్ల పాలనలో ప్రజల కోసం ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేసిందన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మన పథకాలనే కొనసాగిస్తోందన్నారు. ఆ రకంగా చూస్తే తమిళనాడులో ఇప్పటికీ ద్రవిడ మోడల్ పాలనే నడుస్తోందన్నారు. డీఎంకే సాధనలను ఎవరూ మార్చలేరని వ్యాఖ్యలు చేశారు. ఓటమిపై విశ్లేషణ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో పరిశీలించడానికి ఒక కమిటీని వేశామనాన్నారు. లోపాలను తెలుసుకోవడానికి ఒక వెబ్సైట్ను కూడా ప్రారంభించామన్నారు. ఇందులో ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పవచ్చు అని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కలవకుండా, కనీసం బూత్ ఏజెంట్లను కూడా సరిగ్గా నియమించకుండా కేవలం సోషల్ మీడియా ద్వారా కొందరు విజయం సాధించారని వివరించారు. ఇకపై మనం కూడా అలర్ట్గా ఉండి సోషల్ మీడియా వ్యూహాలతో వారిని తిప్పికొడతామన్నారు. డీఎంకే మరో ఐదేళ్లు అధికారంలో ఉండి ఉంటే మరిన్ని మంచి పనులు చేసేవాళ్లం అనే బాధ మాత్రమే ఉందన్నారు. అయినా సరే, ప్రజల తరఫున ఒక బలమైన ప్రతిపక్షంగా డీఎంకే అద్భుతంగా పనిచేస్తుందన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, రాబోయే రోజుల్లో మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
● తిరుమావళవన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె : ‘‘సామాజిక న్యాయం, పెరియార్ సిద్ధాంతాల నేల అని తమిళనాడును చెప్పుకుంటున్నప్పటికీ, ఇక్కడ ఇప్పటికీ కుల వివక్ష బిగుసుకు పోయిన వాస్తవం నుండి పూర్తిగా బయటపడలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఒక దళితుడు ముఖ్యమంత్రిగా అవతరించడం అంత సులభం కాదు’’ అని వీసీకే అధ్యక్షుడు, ఎంపీ తిరుమావళవన్ వ్యాఖ్యానించారు. సోమవారం చైన్నెలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉద్వేగ భరిత వ్యాఖ్యలు చేశారు. తమిళ రాజకీయాల్లో కుల ఆధారిత వాస్తవాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇక్కడి పరిస్థితులు నాకు బాగా తెలుసు. ఎవరో ఊహాత్మకంగా చెప్పిన మాటలను నమ్మి నేను రాజకీయ నిర్ణయాలు తీసుకోను’’ అని స్పష్టం చేశారు. డీఎంకే–అన్నాడీఎంకే కూటమిపై వివరణ ఈ రెండు పార్టీల మధ్య కూటమి ఏర్పాటుపై అధికారికంగా ఎవరూ తనతో చర్చించలేదని చెప్పారు. అయితే రాజకీయ వర్గాల్లో అలాంటి చర్చలు గుసగుసల రూపంలో వినిపించాయని వెల్లడించారు. ప్రస్తుతం తాము డీఎంకే కూటమిలోనే కొనసాగుతున్నామని, ఈనేపథ్యంలో డీఎంకే నాయకత్వాన్ని ఎప్పుడైనా కలిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. టీవీకే ప్రభుత్వానికి నిబంధనలేని మద్దతు సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు తాము వెలుపల నుంచి నిబంధనలేని మద్దతు అందించామని తిరుమావళవన్ తెలిపారు. ‘‘ఇద్దరు ఎమ్మెల్యేల కొరత కారణంగా ప్రభుత్వం ఏర్పడకుండా పోకూడదు. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు రావడం లేదా రాష్ట్రపతి పాలన విధించబడటం వంటి పరిస్థితులు తలెత్తకూడదనే ఉద్దేశంతో తాము ఈ మద్దతు ఇచ్చామన్నారు. అయితే మంత్రివర్గంలో భాగస్వామ్యం కావాలనే ఆలోచన తకు లేదు అని చెప్పారు.పదవుల కోరిక ఉంటే ముందే మద్దతు ఇచ్చేవాళ్లం’ పదవుల కోసం రాజకీయాలు చేయడం తమ లక్ష్యం కాదని ఆయన స్పష్టం చేశారు. తమకు అధికార ఆశ ఉండి ఉంటే, ముందే టీవీకేకు మద్దతు ప్రకటించేవాళ్లమని తెలిపారు. ఎన్నికల సమయంలో ఆర్ఎస్ఎస్ భావజాలానికి దగ్గరగా ఉన్నవారు అని విమర్శించిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, మద్దతు ప్రకటించే ముందు కూడా ఈ అభిప్రాయాన్ని టీవీకే నాయకత్వానికి తెలియజేశానన్నారు. తమిళ రాజకీయాల్లో కుల వాస్తవాలపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయం గురించి ఎంత చెప్పుకున్నా, క్షేత్రస్థాయి వాస్తవాలు వేరేలా ఉన్నాయి. అందుకే తమిళనాడులో ఒక దళితుడు ముఖ్యమంత్రి కావడం ఇప్పటికీ కఠినమైన రాజకీయ లక్ష్యంగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. -
అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి
వేలూరు: డీఎంకే అధిష్టానం తీసుకునే నిర్ణయానికి పార్టీ కార్యకర్తలు కట్టుబడి ఉండాలని ఆ పార్టీ వేలూరు జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే నందకుమార్ అన్నారు. వేలూరులోని డీఎంకే పార్టీ కార్యాలయంలో జిల్లాలోని డీఎంకే పార్టీ కార్యకర్తలు, కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నందకుమార్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడానికి కార్యకర్తలు నిరుత్సాహం చెందరాదన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లోను డీఎంకే పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ, ఇందుకు సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు నిరుత్సాహం చెందకుండా ఉండాలన్నారు. స్థానిక ఎన్నికల్లో ద్రావిడ మాడల్ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. జూన్ 3వ తేదీన కలైంజర్ కరుణానిధి 103 జయంతి వేడుకలను వేలూరు తూర్పు డివిజన్ పరిధిలో వైభవంగా నిర్వహించడంతో పాటూ నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలను అమలు చేశారు. సమావేశంలో వేలూరు కార్పొరేషన్ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కార్తికేయన్, జెడ్పీ చైర్మన్ బాబు, మాజీ ఎంపీ మహ్మద్ సఖీ, మేయర్ సుజాత, యూనియన్ కార్యదర్శులు గజేంద్రన్, సుందరపాండియన్, గణేష్ శంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బరువెక్కిన హృదయంతో.. పార్టీని వీడుతున్నా!
సాక్షి, చైన్నె: తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సెమ్మలై అన్నాడీఎంకేకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి సోమవారం పంపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంగ్ల పత్రికల హేళన పార్టీ అంతర్గత కలహాల వల్ల బజారున పడుతోందని ప్రముఖ ఆంగ్ల దినపత్రికలు సైత పరిహాసం ఆడుతుంటే మనసు తల్లడిల్లిపోతోందన్నారు. ’కర్పూరం కరిగిపోవచ్చు.. కానీ పార్టీ ఇలా కరిగిపోవాలా?’ అన్నదే నా అంతరాత్మ ఘోష‘ అని లేఖలో రాశారు. అవకాశాలు నిరాకరించినా జయలలిత మరణం తర్వాత తనకు పార్టీలో చాలా అవకాశాలు నిరాకరించబడ్డాయని, తొక్కిపెట్టే ప్రయత్నం జరిగిందని, అయినా తాను క్రమశిక్షణ గల కార్యకర్తగా లాయల్టీతో పనిచేశానని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత వాతావరణం చూస్తుంటే పార్టీలో కొనసాగడానికి మనస్సాక్షి అంగీకరించడం లేదన్నారు. రాజకీయాల్లో తనకు గుర్తింపునిచ్చిన ఆ ఇద్దరు గొప్ప నేతల ఆత్మలను క్షమాపణలు కోరుకుంటూ.. బరువెక్కిన హృదయంతో పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని సెమ్మలై పేర్కొన్నారు. సీఎం విజయ్ గురించి ప్రస్తావన ప్రస్తుత ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్.. అన్నాడీఎంకేను కనీసం ఒక పార్టీగా కూడా పరిగణించడం లేదన్నారు. దానికి ఆయనను తప్పుపట్టలేమన్నారు. పార్టీని ఒక బలమైన శక్తిగా చూపించడంలో ప్రస్తుత అన్నాడీఎంకే నాయకత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఎన్నికల ఓటమికి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కారణమనే విమర్శలను సెమ్మలై తోసిపుచ్చారు. ఆయన ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడి ప్రచారం చేశారని, కేవలం అంతర్గత కుమ్ములాటల వల్లే పార్టీ ఓడిపోయిందని స్పష్టం చేశారు. అలాగే మాజీ మంత్రి ఎస్.పి.వేలుమణి వెనుక బీజేపీ ఉందనే ఆరోపణలను కూడా ఆయన కొట్టిపారేశారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో అన్నాడీఎంకేలోని ఈ అంతర్గత సంక్షోభం మరియు సీనియర్ నేత సెమ్మలై నిష్క్రమణ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా అన్నాడీఎంకేలో పళణి స్వామి, సీవీ షణ్ముగం, ఎస్పీవేలుమణి శిబిరాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. పార్టీ కార్యాలయాలకు తాళాలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఆపార్టీ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. పార్టీ పరిస్థితిపై ఆందోళన ఎన్నికల తర్వాత పార్టీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన నాటి నుండి రక్తం ధారపోసిన లక్షలాది మంది కార్యకర్తలు కూడా ఇదే మానసిక స్థితిలో ఉన్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్ నిర్మించిన, జయలలిత కాపాడిన ఈ గొప్ప జాతీయ ఉద్యమానికి ఇలాంటి పరిస్థితి రావాలా? అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు రాజీనామా అనంతరం సెమ్మలై మీడియాతో మాట్లాడారు. నాయకుల ’ఈగో’నే పెద్ద మైనస్గా అభివర్ణించారు. పార్టీ రోజురోజుకూ బలహీనపడిపోతోంది. దానిని బలోపేతం చేయాలనే ఆలోచన నేటి ముఖ్య నాయకులకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే.. అధికారం కోసం ముఖ్య నేతల మధ్య ఉన్న ’ఈగో’ (అహంకారం). ఈ ఈగోనే పార్టీ ఎదుగుదలకు స్పీడ్ బ్రేకర్ లా మారిందని ధ్వజమెత్తారు. -
ఉచిత విద్యుత్ అమలుకు సన్నద్ధం
సాక్షి, చైన్నె : ముఖ్యమంత్రిగా విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే సంతకం చేసిన మొదటి కీలక హామీ.. ‘‘500 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే అన్ని గృహ విద్యుత్ కనెక్షన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం’’ అన్న విషయం తెలిసిందే. ఈ పథకం ఈనెల 10 విజయవంతంగా అమలులోకి వచ్చిన తీరును, దాని ప్రస్తుత స్థితిగతులను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. లో–వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం వేగంగా విస్తరిస్తున్న నగరాల అవసరాలు, పారిశ్రామిక వృద్ధి, , వ్యవసాయ ఉత్పత్తిని పెంచేందుకు రైతులకు అంతరాయం లేని విద్యుత్ను అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆర్థిక, సాంకేతిక సవాళ్లు ఉన్నప్పటికీ విద్యుత్ బోర్డు మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న లో–వోల్టేజ్ సమస్యలు, రోజువారీ వినియోగదారుల ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి తక్షణమే పరిష్కరించాలని సూచించారు. గరిష్ట విద్యుత్ సరఫరా రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 21,326 మెగావాట్లను ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా విజయవంతంగా సరఫరా చేసినట్లు విద్యుత్ బోర్డు అధికారులు సీఎంకు వివరించారు. కొత్త సబ్–స్టేషన్ల ఏర్పాటు, పాత విద్యుత్ లైన్ల ఆధునీకరణతో పాటు, దక్షిణ జిల్లాల్లో ఉత్పత్తి అయ్యే సౌర , పవన విద్యుత్ను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ’గ్రీన్ ఎనర్జీ కారిడార్’ పనులను వేగవంతం చేయడంపై చర్చించారు.ప్రస్తుత వేసవి కాలం , రాబోయే వర్షాకాలాన్ని దృషిలో ఉంచుకుని.. అవసరమైన విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లను తగినంత పరిమాణంలో ముందస్తుగానే స్టాక్ ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో విద్యుత్, న్యాయశాఖ మంత్రి ఆర్. నిర్మల్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం. సాయికుమార్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమ్మ క్యాంటీన్ల ఆధునీకరణకు ఆదేశం తమిళనాడులో పేద ప్రజల ఆకలి తీరుస్తున్న అమ్మ క్యాంటీన్ల పునరుద్ధరణ, ఆధునీకరణకు సీఎం విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ పరిధిలో 383, ఇతర మునిసిపల్ కార్పొరేషన్లు , మునిసిపాలిటీల పరిధిలో 237 అమ్మా క్యాంటీన్లు ప్రజలకు సేవలందిస్తున్నాయి. అయితే, ఇటీవల కాలంలో ఈ క్యాంటీన్లలో అందిస్తున్న ఆహార నాణ్యత, రుచి అంతగా బాగోలేదని ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి వచ్చింది. అమ్మ క్యాంటీన్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే ఆధునీకరించాలని సంబంధిత ప్రభుత్వ శాఖల కార్యదర్శులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దళితుడు సీఎం కావడం సులభం కాదు!సీఎంతో రెనాల్ట్ ఉన్నతాధికారుల భేటీ ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థ ’రెనాల్ట్ గ్రూప్’ ఉన్నతాధికారుల బృందం సచివాలయంలో సీఎం జోసెఫ్ విజయ్తో సమావేశమైంది. ఈ భేటీలో తమిళనాడులో ప్రస్తుతం రెనాల్ట్ సంస్థ నిర్వహిస్తున్న కార్ల ఉత్పత్తి , ఇంజనీరింగ్ కార్యకలాపాలతో పాటు భవిష్యత్తులో రాష్ట్రంలో చేపట్టబోయే సరికొత్త విస్తరణ ప్రాజెక్టులు, పెట్టుబడుల ప్రణాళికలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రెనాల్ట్ గ్రూప్ తరఫున మిస్టర్ స్టీఫెన్ డైబ్లెస్, హంసాదిర్ , నరసింహన్ పురుషోత్తమన్ ఉన్నారు. అలాగే, రామ్కో గ్రూప్ ఉన్నతాధికారులు సీఎంతో భేటీ అయ్యారు..ఈ భేటీలో రామ్కో గ్రూప్ తమిళనాడులో ప్రస్తుతం నిర్వహిస్తున్న వివిధ రకాల వ్యాపార రంగాలు (సిమెంట్, టెక్స్టైల్స్, సాఫ్ట్వేర్ తదితరాలు), వాటి పనితీరుతో పాటు భవిష్యత్తులో రాష్ట్రంలో చేపట్టబోయే విస్తరణ ప్రణాళికలు, సరికొత్త అభివద్ధి అవకాశాలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో రామ్కో గ్రూప్ చైర్మన్ ప.ఆర్. వెంకట్రామ రాజా, మేనేజింగ్ డైరెక్టర్ అభినవ్ రాజా ఉన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుపై సీఎం విజయ్ అధికారులతో సోమవారం సమీక్షించారు. విద్యుత్ కోతలు లేకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఇంధన వనరుల శాఖ పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమిళనాడు విద్యుత్ బోరు, దాని అనుబంధ సంస్థల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, డిమాండ్, పంపిణీ, ఆర్థిక పరిస్థితి , భవిష్యత్తు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. -
ఇళయరాజా సంగీతంలో.. కార్తీక్ సుబ్బరాజ్ చిత్రం
తమిళసినిమా: దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గురించి తెలియని వారు ఉండరు. ఇకపోతే సంగీతజ్ఞాని ఇళయరాజా గురించి చెప్పాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఇంతకు ముందు పిజా, జిగర్తండా, ఇరైవి, మెర్కూరి,పేట, జగమేతందిరం, జిగర్తండా డబుల్ ఎక్స్, మహాన్, రెట్రో మొదలగు 9 చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. తాజాగా తన 10వ చిత్రానికి రెడీ అవుతున్నారు. వీటిలో 8 చిత్రాలకు సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందించారు. కాగా ఇప్పటి వరకు 1,540 చిత్రాలకు సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు ఇళయరాజా. అయితే కార్తీక్ సుబ్బరాజ్ చిత్రానికి ఈ సంగీతజ్ఞాని ఇప్పటి వరకూ సంగీతాన్ని అందించలేదు. అయితే సందర్భం వచ్చినప్పుడల్లా కార్తీక్ సబ్బురాజ్ ఇళయరాజా సంగీతాన్ని తన చిత్రాల్లో వాడుతుంటారు. అలాంటిది ఇప్పుడు వీరి రేర్ కాంబినేషన్లో ఒక చిత్రం రూపొందనుందన్నది తాజా సమాచారం. దీని గురించి దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్ కల 10, ఆశీర్వాదం 1,540 అని తన ఎక్స్మీడియాలో పోస్ట్ చేశారు. అంటే కార్తీక్సుబ్బరాజ్ కలల చిత్రం అయిన తన 10వ చిత్రానికి 1,540 చిత్రాల సంగీతదర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని అందించనున్నారని చెప్పకనే చెప్పారన్నమాట. అంతే కాకుండా ఈ చిత్రానికి పాటల రికార్డింగ్ ప్రారంభం అయ్యింనట్లుంది. ఇళయరాజాతో దిగిన ఫొటోలను కార్తీక్సుబ్బరాజ్ తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
ఘనంగా శివ పార్వతుల కల్యాణ మహోత్సవం
తిరువొత్తియూరు: శీర్కాళి సమీపం తిరునంగూర్లో ఉన్న 12 శివాలయాల్లో స్వామి,అమ్మవార్లకు ఆదివారం రాత్రి దివ్యమైన తిరుకల్యాణ ఉత్సవం ఘనంగా జరిగింది. గ్రామం చుట్టూ 11 దివ్యదేశ పెరుమాళ్ కోవెలలు, ప్రసిద్ధి చెందిన 12 శివాలయాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం, పూర్వం మతంగ ముని ఇక్కడి మతంగ ఆశ్రమంలో తపస్సు చేయగా, పార్వతీ దేవి కన్యగా అవతరించి, అనంతరం శివుడిని వివాహం చేసుకుంది. ఆ సమయంలో మతంగ ముని కోరిక మేరకు పరమశివుడు నంది దేవుడితో కలిసి కల్యాణ కోలంలో దర్శనమిచ్చారని కథనం. ఈ ఘటనను పురస్కరించుకుని, ఏటా వైశాఖ మాసంలోని రోహిణి నక్షత్రం రోజున తిరునంగూర్లోని మతంగీశ్వరర్ ఆలయంతో సహా 12 శివాలయాల్లోని దేవతామూర్తులకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకలో మతంగీశ్వరర్, అయిరావతేశ్వరర్, కై లాసనాథర్, ఇతర 12 ఆలయాల్లోని చంద్రశేఖర్ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, కల్యాణ ఉత్సవాలు జరిగాయి. -
ఆ కథలో నా పాత్ర చాలా కీలకం!
నటి భాగ్యశ్రీ బోర్సే తమిళసినిమా: లక్కీ హీరోయిన్లలో నటి భాగ్యశ్రీ బోర్సే ఒకరనే చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో ఈమె తొలి నుంచి స్టార్ హీరోలతోనే జత కడుతున్నారు. తెలుగులో మొదటగా రవితేజతో మిస్టర్ బచ్చన్ చిత్రంలో జత కట్టారు. ఆ తరువాత విజయ్దేవరకొండ సరసన కింగ్డమ్ చిత్రంలో నటించారు. ఆ తరువాత తమిళంలో దుల్కర్సల్మాన్, రానాలతో కలిసి కాంతా చిత్రంలో నటించారు. తాజాగా తమిళంలో నటుడు కమలహాసన్ తన రాజ్కమల్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న సెయోన్ చిత్రంలో శివకార్తికేయన్కు జంటగా నటించే లక్కీఛాన్స్ను కొట్టేశారు. ఈ చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఇది ఇంతకు ముందు కమలహాసన్ నటించిన విరుమాండి చిత్రం తరహాలో కరుమాత్తూర్ దైవాల ఇతి వృత్తంతో సాగుతుందని సమాచారం. మదురై నేపధ్యంలో యాక్షన్, కామెడీ అంశాలతో గ్రామీణ కుటుంబ కథా చిత్రంగా సెయోన్ ఉంటుందని తెలిసింది. కాగా ఈ చిత్రంలో తన పాత్ర గురించి నటి భాగ్యశ్రీ బోర్సే ఇటీవల ఓ భేటీలో తెలుపుతూ కమలహహాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్కు జంటగా నటించే ఈ చిత్రం గురించి ఇప్పుడే ఎక్కువ చెప్పలేనన్నారు. అయితే ఈ చిత్రానికి తన పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుందని మాత్రం చెప్పగలనన్నారు. తనను ఉత్తమ నటిగా ప్రేక్షకులకు చూపుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రేక్షకులకు నిజాయితీగా ఉండాలంటే తాము నటించే చిత్రాల భాషను తెలుసుకోవాలన్నారు. అందుకే తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా కింగ్డమ్ చిత్రంలో నటించినప్పుడు ఆ చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పానని అన్నారు. అదే విధంగా ఇప్పుడు సెయోన్ చిత్రం కోసం తమిళ భాషను నేర్చుకుంటున్నట్లు భాగ్యశ్రీ బోర్సే చెప్పారు. -
క్రైమ్ థ్రిల్లర్గా మండవెట్టి
తమిళసినిమా: మండవెట్టి చిత్రంలో నటి కోమలి ప్రసాద్ విలక్షణ నటనను ప్రదర్శించారని ఆ చిత్ర దర్శకుడు చరణ్రాజ్ సెంథిల్కుమార్ అన్నారు. టస్కర్స్ డెన్ పిక్చర్స్ పతాకంపై ఈయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం మండవెట్టి. ఈ చిత్రం గురించి మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో దర్శకుడు తెలుపుతూ ఇది సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చెప్పారు. ఇందులో నటి కోమలి ప్రసాద్ ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. ఆమె పాత్ర ఆవేశం, ఆవేదనతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్తో సాగుతుందన్నారు. ఈ పాత్రకు చక్కని భావోద్రేకాలను వ్యక్తం చేయడంతో పాటు ధైర్యాన్ని ప్రదర్శించగల నటి అవసరం అవుతుందని భావించానని, అలాంటి పాత్రలో నటి కోమలి ప్రసాద్ అంకితభావంతో నటించి, జీవించారని ,శారీరకంగానూ చాలా కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ చిత్రం క్రైమ్ ధ్రిల్లర్ కథా చిత్రం అయినా కొన్ని ప్రాచీన కాల వాస్తవ ఘటనలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. పాత కాలానికి చెందిన తన గురించి తెలుసుకునే ఓ యువతి కథా చిత్రమే మండవెట్టి అని చెప్పారు. చెంజి అనే గ్రామీణ దేవత ఇతివృత్తంతో పలు రహస్యాలతో కూడిన పురాణ ఘటనలు ఈ చిత్రంలో చోటు చేసుకుంటాయని చెప్పారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కాగా ఈ చిత్రానికి ఈ చిత్రానికి దీపక్ వేణుగోపాల్ సంగీతాన్ని, ప్రకాశ్ మనిదన్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. -
పుదుచ్చేరి ప్రొటెం స్పీకర్గా.. అన్బళగన్ ప్రమాణ స్వీకారం
సాక్షి, చైన్నె : కేంద్రపాలిత ప్రాంత పుదుచ్చేరి శాసనసభ తాత్కాలిక సభాపతి (ప్రొటెం స్పీకర్) గా ఎమ్మెల్యే అన్బళగన్ నియమితులయ్యారు. కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం ఈనెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశం కానున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. వివరాలు.. రాజ్ నివాసంలోని దర్బార్ హాల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ కై లాష్నాథన్.. అన్బళగన్ చేత ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, మంత్రి నమశ్శివాయం, మల్లాడి కృష్ణ్ణారావు, ఎంపీ సెల్వగణపతి పాటు ఎన్.ఆర్.కాంగ్రెస్, బీజేపీ, డీఎంకే, టీవీకే, ఎల్జెపి, నేయన్ మక్కల్ కజగం పార్టీల ఎమ్మెల్యేలు స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ప్రమాణ స్వీకారం అనంతరం అన్బళగన్ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్కు చేరుకుని, సీఎం రంగస్వామి ఆశీస్సులు తీసుకుని తన సీట్లో ఆశీనులయ్యారు. 20న అసెంబ్లీ ప్రమాణ స్వీకారం అనంతరం ప్రొటెం స్పీకర్ అన్బళగన్ విలేకరులతో మాట్లాడారు. పుదుచ్చేరి 16వ శాసనసభకు కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవం ఈనెల 20వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభ మవుతుందన్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇంటర్నెట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంచేస్తామన్నారు. ప్రజలు చూసేందుకు వీలుగా ముఖ్య కూడళ్లలో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.సీఎం రంగస్వామి రాజీనామా ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసి గెలిచిన ముఖ్యమంత్రి రంగస్వామి.. నిబంధనల ప్రకారం తన తట్టాంచావడి నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ లేఖ అందించారు. దీనిపై చట్టపరంగా పరిశీలించి తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించచారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత, ముఖ్యమంత్రి సలహా మేరకు శాశ్వత స్పీకర్ ఎన్నిక తేదీని ప్రకటించనున్నారు. కాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఫోన్ ద్వారా అన్భలగన్కు శుభాకాంక్షలు తెలిపారు. -
మట్టి తవ్వకాలపై నిరసన
– జేసీబీలను అడ్డుకున్న జనం తిరువళ్లూరు: రోడ్డు విస్తరణ పనుల పేరిట మట్టి తవ్వకాలకు యత్నించిన క్వారీ నిర్వాహకుల జేసీబీలను అడ్డుకుని స్థానికులు రాస్తారోకో నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. తిరువళ్లూరు జిల్లా మీదుగా తిరుపతి–చైన్నె, చైన్నె పోర్టు–మహాబలిపురం తదితర రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయి. వీటితోపాటు తచ్చూరు నుంచి చిత్తూరు వరకు నిర్వహిస్తున్న రెండవ దశ పనులు సైతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు పనులకు కోసం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో క్వారీకి అనుమతి ఇచ్చి మట్టి తవ్వకాలను చేస్తున్నారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లా పున్నపాక్కం గ్రామంలోని చెరువులో మట్టి తవ్వకాల కోసం అనుమతి ఇచ్చిన క్రమంలో సోమవారం ఉదయం ఆరు జేసీబీ వాహనాలు, ప్రోక్లెయిన్లు చెరువు వద్దకు చేరుకున్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు లారీలు, ప్రోక్లెయిన్, జేసీబీ యంత్రాలను అడ్డుకుని స్థానికులు ఆందోళన నిర్వహించారు. పున్నపాక్కం చెరువుపై ఆధారపడి సుమారు రెండువేల ఎకరాల భూములు సాగులో ఉంది. ఇప్పటికే రెండు సార్లు చెరువులో మట్టి తవ్వకాలకు అనుమతి ఇవ్వగా, నిబంధనలను విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేయడంతో సాగుకు నీరు అందకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. మళ్లీ అనుమతి ఇస్తే ఎక్కువగా మట్టి తవ్వకాలు చేయడంతో భూగర్భ జలాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని స్థానికులు వాపోయారు. స్థానికుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు రెవెన్యూ అధికారులు స్థానికులతో చర్చలు జరిపారు. మట్టి తవ్వకాలను తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో స్థానికులు ఆందోళన విరమించారు. -
పీఎం శ్రీ పథకంపై త్వరలో నిర్ణయం
సమీక్షా సమావేశంలో ముఖ్యాంశాలు సాక్షి, చైన్నె: పీఎం శ్రీ పథకం అమలుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించి త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్ స్పష్టం చేశారు.సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో విలేకరులు తమిళనాడులో పీఎం శ్రీ పథకాన్ని అమలు చేస్తారా? అని ప్రశ్నించగా మంత్రి సమాధానమిస్తూ.. ‘ద్విభాషా విధానమే మా ప్రాథమిక సిద్ధాంతం. బంధుమిత్రులతో మాట్లాడటానికి తమిళం, ప్రపంచంతో మాట్లాడటానికి ఇంగ్లీష్.. ఇదే మా విధానం. పీఎం శ్రీ పథకంపై అధికారులతో సంప్రదింపులు జరిపి తదుపరి నిర్ణయం ప్రకటిస్తాం‘ అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ పీఎం శ్రీ స్కూల్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తారు. అయితే ఈ పథకంలో త్రిభాషా విధానం ఉండటంతో తమిళనాడు దీనిని వ్యతిరేకించింది. దీని కారణంగా సమగ్ర శిక్షా అభియాన్ కింద తమిళనాడుకు కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ. 3,500 కోట్ల విద్యా నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారం పెద్ద వివాదంగా మారింది. తాజాగా, తమిళనాడులో తమిళగ వెట్రి కళగంనేతృత్వంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరుణంలో.. కేంద్ర విద్యాశాఖ తమిళనాడు ప్రభుత్వానికి మరో లేఖ రాసింది. పీఎం శ్రీ పథకం కింద పాఠశాలలను ఆధునీకరించేందుకు తక్షణమే ఒప్పందంపై సంతకం చేయాలని అందులో కోరింది.దీనిపై కొత్త టీవీకే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? గత డీఎంకే ప్రభుత్వం తరహాలోనే వ్యతిరేకిస్తుందా లేక నిలిపివేసిన నిధులను రాబట్టేందుకు ఒప్పందం చేసుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే మంత్రి రాజ్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాఠశాల విద్యాశాఖ, తమిళ అభివృద్ధి, సమాచార , ప్రచార శాఖల మంత్రి రాజ్మోహన్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలను మంత్రి ప్రకటించారు. ఈ మేరకు 1, 2, 3 తరగతుల విద్యార్థుల కోసం సరికొత్త సిలబస్తో రూపొందించిన 9 పాఠ్యపుస్తకాలను మంత్రి విడుదల చేశారు. పిల్లల శారీరక, మానసిక, సామాజిక నైపుణ్యాలను పెంపొందించేలా, రంగురంగుల చిత్రాలు, కథలు, పాటలతో ఈ పుస్తకాలను రూపొందించారు. తమిళనాడులో వేసవి సెలవుల అనంతరం జూన్ 1, 2026 నుండి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. బడి తెరిచిన మొదటి రోజే 1 నుండి 12వ తరగతి విద్యార్థులందరికీ ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్త పాఠ్యపుస్తకాల నేపథ్యంలో 1 నుండి 3 తరగతుల బోధించే ఉపాధ్యాయులకు జూన్ 1 నుండి జూన్ 3 వరకు ప్రత్యేక బోధనా నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నారు. -
గ్రీవెన్స్డేకు పోటెత్తిన జనం
తిరువళ్లూరు: సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్డేకు జనం పోటెత్తడంతో రద్దీగా మారింది. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు గ్రీవెన్స్డేను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గ్రీవెన్స్డేకు అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరువుతుండగా, జిల్లా నలుమూలల నుంచే వచ్చే ప్రజలు తమ సమస్యల కోసం కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో గ్రీవెన్స్డే ఎన్నికల కోడ్తో దాదాపు రెండు నెలలు వాయిదా పడింది. కోడ్ నిబందనలను సడలించిన క్రమంలో గత వారం నుంచి యథావిధిగా గ్రీవెన్స్డే ప్రారంభించారు. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం గ్రీవెన్స్డేను నిర్వహించారు. -
క్లుప్తంగా
షావుకారుపేటలో నిధి జ్యూవెల్స్ ప్రారంభం సాక్షి,చైన్నె: సినీ, పారిశ్రామిక రంగాలలో రాణిస్తున్న తెలుగు ప్రముఖులు తంగుటూరి రామకృష్ణ, ఆయన కుమారుడు సాయిచందన్, హైదరాబాదుకు చెందిన వూర బాబురావు, ఆయన కుమారుడు వూర కృష్ణ భాగస్వాములుగా స్థానిక షావుకారుపేట ఎన్ఎస్సీ బోస్ రోడ్డులోని గిరి కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆధునిక హంగులతో నిధి జ్యూవెల్స్ను ఏర్పాటు చేశారు. సోమవారం తంగుటూరి రామకృష్ణ కుటుంబ సభ్యులు తశ్య, తన్విక్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు . ప్రారంభోత్సవంలో చందన్, డాక్టర్ ఎంవీ నారాయణగుప్తా. అర్నెల్లి బద్రినాధ్, కేకే త్రినాద్ కుమార్ సహా నగరంలోని పలు జ్యూవెరీ షాపుల యజమానులు, వామ్ సభ్యులు, పురప్రముఖులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియురాలిపై హత్యాయత్నం తిరువొత్తియూరు: తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని ఒక కళాశాల విద్యార్థినిని దారుణంగా కొట్టి, గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిన సంఘటన సంచలనం కలిగించింది. నవీన్ శివగంగ జిల్లాకు చెందిన నవీన్ (22)తిల్లానగర్లోని ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఇతనికి రామనాథపురం జిల్లాకు చెందిన కళాశాల విద్యార్థినితో పరిచయం ఏర్పడి వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు అయితే నవీన్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, తన తల్లిదండ్రులు అంగీకరించడం లేదని ఆ యువతి నిరాకరించింది. ఆదివారం సాయంత్రం తిరుచ్చిలోని అన్న స్టేడియం సమీపంలో వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా వీరి మధ్య గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన నవీన్, తన వద్ద ఉన్న శాలువాతో ఆమె గొంతు నులిమి, సమీపంలోని రాయిని తీసుకుని ఆమె తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి పడిపోయిన ఆ యువతిని పోలీసులు రక్షించి, చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేకేనగర్ పోలీసులు నవీనన్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోడ్డు విస్తరణ పనులు కొరుక్కుపేట: చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణికులు, బస్సుల రద్దీని తగ్గించేందుకు, సబర్బన్ ఎలక్ట్రిక్ రైల్వేస్టేషన్ ముందున్న రోడ్లను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఆటోడ్రైవర్లు పూర్తిస్థాయిలో సహకరిస్తేనే ఈ రద్దీ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. చైన్నెకి ప్రధాన ప్రవేశ ద్వారమైన సెంట్రల్ రైల్వే స్టేషన్, మోర్ మార్కెట్ సబర్బన్ రైల్వే స్టేషన్, చైన్నె కార్పొరేషన్ కార్యాలయం, పార్క్ రైల్వే స్టేషన్, రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అన్నీ సమీపంలోనే ఉన్నాయి, అందువల్ల ఈ జంక్షన్ ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. ప్రతిరోజూ 150కి పైగా ఎక్స్ప్రెస్ రైళ్లు, 119 సబర్బన్ రైళ్లు నడుస్తాయి. ప్రతిరోజూ 2 లక్షలకు పైగా ప్రయాణికులు ఈ కాంప్లెక్స్ నుంచి రాకపోకలు సాగిస్తారు. ముఖ్యంగా కోయంబత్తూరు, ఈరోడ్, అరక్కోణం తదితర ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్లే చాలా మంది ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులు, సబర్బన్ ప్రయాణికులు 6వ గేటును ఉపయోగిస్తారు. పెరియార్ రోడ్డు నుంచి వస్తున్న వందలాది వాహనాలు, ప్రయాణికులను ఎక్కించుకునే, దించే ఆటోలు సబర్బన్ రైల్వే స్టేషన్ ముందు చాలా సేపటి వరకు నిలిచిపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీని కారణంగా చాలా మంది ప్రయాణికులు నిరంతరం రైళ్లను కోల్పోతూ ఉండేవారు. దీనిని నివారించడానికి, 2025లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ మధుసూదన్రెడ్డి వాహనాలు విడివిడిగా వెళ్లేందుకు వీలుగా తాత్కాలిక ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల రద్దీ కొంతమేర తగ్గినప్పటికీ, రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఇది పూర్తిస్థాయి పరిష్కారాన్ని అందించలేకపోయింది. దీని తరువాత చైన్నె భద్రతా దళాలు, రైల్వే డివిజనల్ అధికారులు చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ రోడ్డును విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. సాంస్కృతిక నందవన పార్క్ ఏర్పాటు సాక్షి, చైన్నె : తమిళనాడులో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చారిత్రాత్మక పర్యాటక ప్రాంతమైన మామల్లపురం(మహాబలిపురం) సమీపంలోని ఈస్ట్కోస్ట్ రోడ్డులో ఉన్న ‘తిరువిడంతై’ వద్ద భారీ కల్చరల్ పార్క్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఉన్న ప్రసిద్ధ నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయానికి చెందిన 218 ఎకరాల దేవదాయ శాఖ భూమిని పర్యాటక అభివృద్ధి కోసం ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో మొత్తం రూ.99.67 కోట్ల అంచనా వ్యయంతో తమిళనాడు పర్యాటక అభివృద్ధి సంస్థ 4 విడతలలో ఈ సాంస్కృతిక నందవన పార్క్ను నిర్మించనుంది. రూ.22.53 కోట్ల విలువైన మొదటి విడత పనులకు మార్చి 5న శంకుస్థాపన జరిగింది. ఈ పార్కులో తమిళ సంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే అందమైన శిల్పాలు, కలువ పూల కొలనులు, పచ్చని పచ్చిక బయళ్లు, వాకింగ్ ట్రాక్స్, ఆటోమేటిక్ లైటింగ్ సిస్టమ్ ఆధునిక మరుగుదొడ్ల వసతిని కల్పిస్తున్నారు. ప్రస్తుతం సదరు నిర్మాణ ప్రాంతంలో ఒక తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, స్థలాన్ని శుభ్రపరచడం, మ్యాప్ ప్రకారం కొలతలు తీసుకోవడం, భూసార(ఇసుక) పరీక్షలు తదితర ప్రాథమిక పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. -
కేసులు కొట్టివేత
● అహ్మద్ బుహారీ కేసులపై కోర్టు నిర్ణయం సాక్షి, చైన్నె: కోస్టల్ ఎనర్జీ ప్రమోటర్ అహ్మద్ బుహారి, అతని సహచరులపై ఉన్న కేసులన్నీ కోర్టు కొట్టివేసింది. ఆయన కడిగిన ముత్యంలా బయటపడ్డారు. కోస్టల్ ఎనర్జీ ప్రమోటర్ అయిన అహ్మద్ బుహారీకి సంబంధించిన చివరి పెండింగ్ కేసును సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు(స్పెషల్ సీసీ నెం.1/2022), ఈ ఏడాది ఏప్రిల్ 28న కొట్టివేసింది. ఈ ఉత్తర్వులతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అతను, అతని సహచరులపై దాఖలు చేసిన పలు కేసులను, వరుసగా ముంబయిలోని సీఈఎస్టీఏటీ, ఢిల్లీ హైకోర్టు, మద్రాస్ హైకోర్టులతో సహా వివిధ న్యాయ వేదికలు ఇప్పుడు కొట్టివేశాయి. తూత్తుకుడి కేంద్రంగా పనిచేస్తున్న 1,200 మెగావాట్ల స్వతంత్ర విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఐపీపీ) అయిన కోస్టల్ ఎనర్జ , కోస్టల్ ఎనర్జెన్ ప్రమోటర్ అహ్మద్ బుహారీ, ప్రభుత్వ రంగ సంస్థలకు(పీయూఎస్) నాసిరకం బొగ్గు సరఫరా చేశారనే ఆరోపణలకు సంబంధించిన ఒక హై–ప్రొఫైల్ కేసులో 2022 మార్చి 3న అరెస్టు అయ్యారు. ఈ ప్రధాన నేరంలో సీబీఐ ఎటువంటి ఛార్జిషీట్ దాఖలు చేయనప్పటికీ, అతని తరఫున దాఖలు చేసిన పలు బెయిల్ దరఖాస్తులను వివిధ కోర్టులు తిరస్కరించాయి. 31 నెలలకు పైగా జైలులో గడిపిన తర్వాత, అతనిపై ఎలాంటి అభియోగాలు నమోదు కానప్పటికీ, చివరకు 2024 అక్టోబర్ 24న అతనికి బెయిల్ మంజూరైంది. తదనంతరం మద్రాస్ హైకోర్టు 2025 అక్టోబర్ 7న ఈ కేసును కొట్టివేసింది. ఆ తర్వాత సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి, 2026 ఏప్రిల్ 28న అతనికి అతని సహచరులకు వ్యతిరేకంగా ఉన్న అన్ని అభియోగాలను మూసివేసింది. అభియోగాల నుండి నిర్దోషులుగా విడుదలైన వ్యక్తుల కేసులలో పరిహారంపై సుప్రీంకోర్టు ఇటీవల చర్చిస్తోంది. -
రాజకీయాలకు తాత్కాలిక విరామం
త్యాగరాజన్ ప్రకటన కొరుక్కుపేట: డీఎంకే మాజీ మంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించిన తరువాత ఆర్థిక మంత్రిగా, సమాచార సాంకేతికత, డిజిటల్ సేవల మంత్రిగా పనిచేశారు. ఇటీవల ముగిసిన 2026 అసెంబ్లీ ఎన్నికలలో మదురై సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన పి.టి.ఆర్.పళనివేల్పై పోటీ చేసిన టీవీకేకు చెందిన ముస్తఫా చేతిలో 19 వేల 128 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ పరిస్థితిలో తాను పలు కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయమై ఆయన జారీ చేసిన ఒక ప్రకటనలో ఇలా అన్నారు. గత 10 సంవత్సరాలుగా శాసనసభ సభ్యుడిగా ఉండడం తాను, తన బృందం పగలు రాత్రి తేడా లేకుండా నిరంతర బాధ్యతగా పనిచేశామన్నారు. ఇప్పుడు తాను ఆ బాధ్యతల నుండి కొన్ని వారాలపాటు విరామం తీసుకుని, ఒక సాధారణ పౌరుడిగా ఉండాలని అనునకుంటున్నట్టు తెలిపారు. నటుడు ముత్తుకాళికి సతీ వియోగం తమిళసినిమా: తమిళ సినిమాలో హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందిన నటుడు ముత్తుకాళి. ఈయన భార్య పేరు మాలతి (47). వీరికి ఒక కొడుకు ఉన్నాడు. కాగా మాలతికి ఇటీవల తలలో గడ్డ కట్టటంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు.ఈమె గత 19 రోజల క్రితం స్థానిక కీల్పాక్కమ్ ఆస్పతిలో చేర్చారు. వైద్యులు మాలతికి శస్త్ర శికిత్స చేశారు. అయినప్పటికీ ఆమె శ్వాసకోస సమస్యతో బాధపడ్డారు. కాగా చికిత్స పొందుతూ మాలతి సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆమె భౌతికకాయాన్ని ముత్తుకాళి సొంతమూరు అయిన విరుదునగర్ జిల్లా, రాజపాళయం తాలుకా, సంగంపట్టి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ సోమవారం సాయంత్రం మాలతి పార్దీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ముత్తుకాళి భార్య మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఊటీ కనువిందు
తిరువొత్తియూరు: ఊటీ ప్రభుత్వ వృక్షశాస్త్ర ఉద్యానవనంలో 128వ పుష్ప ప్రదర్శన సోమవారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. నీలగిరి జిల్లా ఊటీకి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. వారిని అలరించడానికి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కోతగిరిలో కూరగాయల ప్రదర్శన, ఊటీలో రోజా, పుష్ప ప్రదర్శనలు, కూనూరులో పండ్ల ప్రదర్శన, గూడలూరులో సుగంధ ద్రవ్యాల ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. వీటిలో పుష్ప ప్రదర్శన అతి ముఖ్యమైన వేడుకగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది సోమవారం(మే 18వ తేదీ) పుష్ప ప్రదర్శనను నీలగిరి జిల్లా కలెక్టర్ లక్ష్మి భవ్య తన్నీరు ప్రారంభించి పరిశీలించారు. ఈ ప్రదర్శన ఈ నెల 28వ తేదీ వరకు మొత్తం 10 రోజులపాటు జరగనుంది. ఈ ప్రదర్శనలో మేరీగోల్డ్, సైక్లమెన్, బాల్సమ్, పెటునియా, పాన్సీ, డెల్ఫీనియంతో సహా 275 రకాలకు చెందిన 7 లక్షల రంగురంగుల పుష్ప మొక్కలు కొలువుదీరాయి. ఆయా ప్రాంతాల్లోని నడక దారుల్లోనూ మొక్కలు నాటగా, అందులో పూలు పూసి కనువిందు చేస్తున్నాయి ఇది కాకుండా అలంకార మండపాలు, పార్కులోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పచ్చిక బయళ్లను అలంకరించడం కోసం 35 వేల కుండీలలో నాటిన పూల మొక్కలను అలంకరించారు. ఈసారి పుష్ప ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా 1.5 లక్షల కార్నేషన్ పూలతో భారీ చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్, ఒక లక్ష పూలతో మామళ్లపురం దేవాలయాలు, గోపురాలు నిర్మించబడ్డాయి. ఇది కాకుండా 4.5 లక్షల పూలతో వివిధ రకాల పుష్ప అలంకరణలు చేశారు. తిరువళ్లువర్ విగ్రహం, నర్తకిల ప్రతిమలు, పుష్ప గోపురాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ పుష్ప అలంకరణల కోసం కోత పూలను స్థానిక వ్యాపారుల నుండి, అదనపు పూలను ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి ఉపయోగించారు. కమనీయం.. పుష్పప్రదర్శన పుష్ప ప్రదర్శనను పురస్కరించుకుని రంగురంగుల విద్యుత్ దీపాలతో పార్కును అలంకరించారు. వివిధ కళా ప్రదర్శనల కోసం భారీ వేదికను ఏర్పాటు చేశారు. ఇది కాకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా పువ్వులు, కూరగాయలతో రకరకాల అలంకరణలు కూడా చేశారు. ఫొటోలు తీసుకోవడానికి అక్కడక్కడ సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. సోమవారం ప్రారంభమైన ఈ పుష్ప ప్రదర్శనను భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చి తిలకిస్తున్నారు. పుష్ప ప్రదర్శన నేపథ్యంలో ఊటీలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భద్రతా పనుల్లో 500 మందికి పైగా పోలీసులు నిమగ్నమై ఉన్నారు. పుష్ప ప్రదర్శన చూడడానికి వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం ప్రభుత్వ రవాణా సంస్థ తరఫున ఊటీ–కోయంబత్తూర్ మధ్య 50 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అదేవిధంగా అన్ని పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా 30కి పైగా సర్క్యూట్ బస్సులు కూడా నడుపుతున్నారు. -
‘అమ్మ క్యాంటీన్ల’పై సీఎం విజయ్ ఫోకస్
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ ‘అమ్మ క్యాంటీన్లు’పై తన దృష్టి సారించారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను(ఉనవగామ్లు) ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఎం విజయ్ అమ్మ క్యాంటీన్లను పునరుద్దరించడంతో పాటు ఆధునీకరించాలని అధికారులకు ఆదేశించారు. అమ్మ క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించి, మెరుగుపరచాలని, ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని విజయ్ అధికారులకు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అమ్మ క్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యత, రుచి సంతృప్తికరంగా లేవన్న అభిప్రాయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన తర్వాత, ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.2011-16 ఏఐఏడీఎంకే ప్రభుత్వ హయాంలో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలచే ఆప్యాయంగా "అమ్మ" అని పిలుచుకునే అప్పటి ముఖ్యమంత్రి జె. జయలలిత పుట్టినరోజున, 2013 ఫిబ్రవరి 24న ఈ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. మొదట ఇవి చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత, వీటిని వివిధ పట్టణాలు, నగరాలకు విస్తరించారు. రాష్ట్రంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో 383 అమ్మ క్యాంటీన్లు, ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణలో 237 అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. -
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
‘‘నేనేం రాజకీయాల్లో లేను. నాకంటే వయసులో చిన్నోడు సీఎం అయ్యాడని నేనెందుకు కుళ్లుకుంటా?’’ అంటూ సూపర్స్టార్ రజనీకాంత్ స్పందించడం ఇప్పుడు తమిళనాట మాత్రమే కాదు దక్షిణాదిలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఓడిపోయిన మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి పరామర్శించడం.. గొప్ప విజయంతో సీఎం అయిన విజయ్ను, అదీ పెద్ద స్టార్గా ఉండి కూడా మర్యాదకైనా పలకరించకపోవడంపై రజనీ అభిమానుల నుంచే పెదవి విరుపులు కనిపించాయి. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ప్రెస్మీట్ పెట్టాల్సి వచ్చిందనేది భోగట్టా. అయితే.. రజనీకాంత్ మాట్లాడిన కొన్నిగంటల తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. అందులో విజయ్ ఫ్యాన్ అయిన తన కొడుక్కి రజనీ ఫ్యాన్ అయిన ఓ తండ్రి హితబోధ చేస్తాడట. అది ‘బాషా’ రేంజ్ ఎలివేషన్ కావడంతో ఆ కొడుకు కన్నీరు పెట్టాడంట. విజయ్ అభిమాని చేసిన పోస్ట్ అంటూ అది హల్ చల్కావడంతో.. ‘‘రజనీ ది గ్రేట్’’ అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే అదంతా అభిమానులను శాంతింపజేయడం.. తన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం రజనీ తరఫున జరిగిన పీఆర్ స్టంట్ అంటూ ఓ బాంబ్ పేలడం ఈ ఎపిసోడ్ను మరో మలుపు తిప్పింది. సినీ ప్రపంచంలో అభిమానుల మధ్య పోటీలు ఎప్పుడూ ఉంటాయి. కానీ, రజనీ–విజయ్ విషయంలో “ఫ్యాన్ వార్ చరిత్ర” కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. తొలినాళ్లలో ఇద్దరూ వ్యక్తిగతంగా స్నేహపూర్వకంగా కనిపించినా.. అభిమానుల మధ్యే విభేదాలో లేదంటో స్టార్ డమ్ విషయంలో ఇగో అనేదో ఏమో తెలియదుగానీ పోను పోను ఆ ఇద్దరి ఆటిట్యూడ్ను అవి పూర్తిగా మార్చేశాయి. సినిమాలపరంగానే కాదు.. రాజకీయాలతోనూ ఆ గ్యాప్ మరింతగా ముదిరింది. 1990ల చివరలో రజనీ అప్పటికే “సూపర్స్టార్” స్థాయిలో ఉన్నాడు. ఆ టైంలోనే విజయ్ యువ హీరోగా ఎదుగుతున్నాడు. ఆరోజుల్లో రజనీ సినిమా విడుదలైతే తమిళనాట పండుగ వాతావరణం నెలకొనేది. అయితే దానికి పోటీగా విజయ్ అభిమానులు ‘మాస్ వాతావరణాన్ని సృష్టిస్తూ’ సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఇది రజనీ అభిమానులకు ఏమాత్రం సహించేది కాదు. అలా ఈ పోటీ నెమ్మదిగా బాక్సాఫీస్ కలెక్షన్ల దాకా వెళ్లింది. ఇద్దరి సినిమాలు ఒకేసారి, కాస్త గ్యాప్లో లేదంటే ఒకే ఏడాదిలో విడుదలైనా సరే.. హిట్లు-ఫట్లు, కలెక్షన్ల లెక్కలు చూపిస్తూ కొట్టుకోసాగారు. ఈ క్రమంలో ఫేక్ కలెక్షన్ల ఆరోపణలతో పరస్పరం తిట్టిపోసుకోవడం.. ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేసుకోవడం.. క్రమంగా సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ వార్స్ దాకా చేరుకుందది. ఆ సమయంలో ఇద్దరూ వాళ్ల వాళ్ల ఫ్యాన్స్ను వారించడం.. మళ్లీ రిపీట్ కావడం అవుతూ ఉండేది. ఈలోపు.. విజయ్ సినీ కెరీర్ ఎవరూ అందుకోలేనంత పీక్స్కు చేరుకుంది.కొంతకాలం సైలెంట్గా ఉన్న ఇద్దరి ఫ్యాన్స్.. జైలర్ సినిమా టైంలో రజనీ వ్యాఖ్యలతో మళ్లీ మొదలుపెట్టారు. ‘‘కాకి ఎప్పుడూ గద్దను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగని గద్ద తన స్థాయిని తగ్గించుకోలేదు. అంతకంతకు పైకి ఎగిరిపోతుంది. మన స్థాయిని తగ్గించకుండా.. మన దారిలో ముందుకు పోవాలి’’ అంటూ రజనీకాంత్ చెప్పిన కుట్టీ స్టోరీ విజయ్ అభిమానులకు మంట తెప్పించింది. విజయ్ను కాకితో పోల్చాడంటూ అవమానంగా ఫీలై తలైవా మీద సోషల్ మీడియాలో దండయాత్ర చేశారు. ఇది ఎంతదాకా చేరిందంటే.. తన వ్యాఖ్యలను విజయ్ అభిమానులు పొరపాటుగా అర్థం చేసుకున్నారని స్వయంగా రజనీనే వివరణ ఇచ్చుకునేదాకా. దీనికి కౌంటర్గానే విజయ్ ‘లియో’ క్లైమాక్స్లో గద్ద రిఫరెన్స్ చూపించారనే ప్రచారం ఒకటి ఉంది. పొలిటికల్ టర్న్..!90వ దశకంలో భయంకరమైన ఫ్యాన్డమ్ను చవిచూసిన రజనీ.. ఆ టైంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. అయితే ఆధ్యాత్మిక ధోరణి, ఆరోగ్య సమస్యలు, మరేయితర కారణాలతో తెలియదుగానీ ఆయన ఆ పని చేయలేదు. బదులుగా జయలలితను ఢీ కొడుతూ డీఎంకే పార్టీ(కరుణానిధి.. ఎంకే స్టాలిన్) కుటుంబానికి మద్దతు ఇస్తూ వచ్చారు. అదలా కొన్నేళ్లపాటు సాగింది. చివరకు సొంతంగా రాజకీయ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిన ఆయన.. ఉన్నట్లుండి వెనక్కి తగ్గడం ఆయన అభిమానుల్ని సైతం బాధించింది. అదే సమయంలో.. విజయ్ టీవీకే పార్టీ ప్రకటన, రాజకీయ దూకుడు.. తాజా తమిళనాడు విక్టరీ.. రజనీ ఫ్యాన్స్ను మరింత కుంగదీసింది. అది తారాస్థాయికి చేరుకుని రజనీనే తిట్టిపోసేదాకా చేరుకుంది. నిజానికి రజనీకాంత్ స్టైల్, మేనరిజంను అనుకరిస్తూనే విజయ్ సినిమాలపరంగా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగాడని కోలీవుడ్లో ఒక టాక్. అంతెందుకు విజయ్ అభిమానులు కూడా ఆ విషయాన్ని నిర్మోహమాటంగానే ఒప్పుకుంటారు. కానీ, రజనీ అభిమానుల్లో ఇలాంటి మెచ్యూరిటీ ఏమాత్రం కనిపించదు. విజయ్ను ఎంతసేపు తిట్టడం, వీలైనప్పుడల్లా ట్రోలింగ్ చేయడంతోనే గడిపేస్తుంటారు. ఇంత జరుగుతున్నా రజనీ ఏనాడూ తన అభిమానుల్ని వద్దని వారించిన పని చేయలేదు. ఇటు విజయ్ కూడా ఏనాడూ రజనీ ఫ్యాన్స్ చేస్తున్న దాడిపై నేరుగా స్పందించలేదు. బదులుగా తన అభిమానులకు “పాజిటివ్గా ఉండండి, కష్టపడి పనిచేయండి”.. ‘‘ నీ విజయంతో ఎదుటివారిని ఓడించు.. నీ నవ్వుతో వారిని మట్టికరిపించు’’ ఇలాంటి మోటివేషన్ స్పీచ్లతో సందేశాలిస్తూ వచ్చాడు. విజయ్ రాజకీయ పార్టీ పెట్టాక కూడా ఆ హుందాతనం అలాగే కొనసాగడం అది అటు తన అభిమానులనే కాదు.. రజనీ, అజిత్.. ఇలా ఇతర హీరోల ఫ్యాన్స్ను కూడా ఆకట్టుకోగలిగింది. ఒకరకంగా ఇదే ఆయనపై గౌరవం మరింత పెంచి.. ఆయన నాయకత్వానికి బలం చేకూరింది. అయితే ‘‘ఆ స్టార్డమ్ నుంచి బయటకు వచ్చి సీఎంగా నిర్ణయాలు తీసుకోవాలి’’ అంటూ విజయ్కు రజనీ ఇచ్చిన సలహా.. అక్కసు వెల్లగక్కడంకాక మరేంటనే? కోణంలో ఇప్పుడు చర్చ నడుస్తోంది. తన సమకాలీకుడు(కమల్ హాసన్) స్వయంగా వెళ్లి విజయ్ను అభినందించడం.. విజయ్ విజయంపై మొక్కుబడిగా ఎక్స్లో ఓ మెసేజ్ పెట్టడం.. ఆపై తాజా ప్రెస్మీట్ వ్యాఖ్యల ఆంతర్యం.. విజయ్ విషయంలో రజనీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని కొందరు అంటున్నారు. -
పళనిస్వామికి భారీ షాక్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహణకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం బృందం సిద్ధమైంది. ఇందు కోసం 1000 మంది సభ్యుల చేత సంతకాలు చేయించి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే సర్వసభ్య సమావేశం విషయంగా ఎవ్వరూ సంతకాలు చేయవద్దని సభ్యులకు పళనిస్వామి సూచించారు.వివరాల మేరకు.. అన్నాడీఎంకేలో పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం శిబిరాల మధ్య వివాదం ముదిరింది. పళనిస్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గద్దె దించడం లక్ష్యంగా ఎస్పీ వేలుమణి వ్యూహాలకు పదును పెట్టారు. ఇందుకు పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని అస్త్రంగా చేసుకున్నారు. అన్నాడీఎంకేలో 1,800 మంది మేరకు సర్వ సభ్య సభ్యులు ఉన్నారు. వీరిలో 1000 మందిని తమ వైపునకు ఎస్పీ వేలుమణి శిబిరం తిప్పుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరితో సంతకాలు చేయించి, సర్వ సభ్య సమావేశం లక్ష్యంగా పట్టుబట్టే పనిలో పడ్డారు. పార్టీపరంగా తమతో ఉన్న 28 జిల్లాల కార్యదర్శుల ద్వారా మిగిలిన జిల్లాల కార్యదర్శులకు గాలం వేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.సంతకాలు చేయవద్దు పార్టీ సర్వ సభ్య సభ్యులకు పళనిస్వామి సూచనలు చేస్తూ ఆదివారం ప్రకటన చేశారు. సర్వ సభ్య సమావేశం పేరిట సంతకాలు చేయవద్దని, పార్టీని సర్వనాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల చర్యలకు చెక్ పెట్టేవిధంగా చట్ట పరమైన పోరాటానికి సైతం పళనిస్వామి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకునేందుకు సీఎం విజయ్ కుట్రలు చేస్తున్నారని అమ్మమక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన పక్షంలో సీబీఐ విచారణ కోరుతామని హెచ్చరించారు. -
సీఎం విజయ్, రజనీ వ్యాఖ్యలపై కమల్ స్పందన ఇదే..
సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ పనితీరుపై ఇప్పుడే విమర్శలు చేయడం లేదా అంచనా వేయడం సరి కాదని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. మదురై విమానాశ్రయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని ఆయన కోరారు.రెండు రోజుల్లో చెబితే అది జోస్యం అవుతుంది..సీఎం విజయ్ పాలన ఎలా ఉందనే ప్రశ్నపై కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు. ‘విజయ్ ముఖ్యమంత్రి అయి రెండు రోజులే అవుతోంది. అప్పుడే ఆయన పాలన ఎలా ఉందో చెప్పమంటే అది జోస్యం చెప్పినట్లే అవుతుందని చమత్కరించారు. ఆరు రోజుల్లోనో, పదిహేను రోజుల్లోనో ప్రభుత్వ పనితీరుపై సమీక్షలు చేయడం కూడా అంతే అని వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం స్థిరపడటానికి, వారి విధానాలు అమలు కావడానికి కనీసం 6 నెలల సమయం ఇవ్వాలని కమల్ పేర్కొన్నారు.ప్రజలు నమ్మి ఓటేశారు.. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావడంపై స్పందిస్తూ... కొత్తవాళ్లు చాలా మంది అధికారంలోకి వచ్చారని, అయితే రాజకీయాలకు ఇది కొత్తేమీ కాదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు బాధ్యతలు స్వీకరించిన వారంతా కొత్తవారేనని పేర్కొన్నారు. ప్రజలు నమ్మి ఓటేశారు కాబట్టి, ఆ పాలన సజావుగా సాగుతుందా లేదా అనేది గమనించాలన్నారు. తాము కూడా దాన్నే గమనిస్తున్నాం అని చెప్పారు.తమిళనాట పుడితే అది ద్రావిడ పార్టీనే తమిళనాడు రాజకీయ సిద్ధాంతాలపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తన ఉద్దేశం ప్రకారం.. తమిళనాడులో తమిళం మాట్లాడే వ్యక్తి ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీని ప్రారంభిస్తే, అది కచ్చితంగా ద్రావిడ పార్టీనే అవుతుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ.. నూతన విద్యా విధానాన్ని తమిళనాడులో అమలు చేయాలని ఎవరూ బలవంత పెట్టలేరని స్పష్టం చేశారు.మా ఇద్దరి మధ్య కేవలం పోటీ మాత్రమే సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యల (ఒకవేళ కమల్ సీఎం అయినా తనకు అసూయ ఉండదన్న వ్యాఖ్యల) ప్రస్తావన రాగా, కమల్ హాసన్ వారి స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. తాను, రజనీకాంత్ ఎప్పుడూ ఒకరిని చూసి ఒకరం అసూయ పడలేదన్నారు. అయితే, తమ మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేదన్నారు. తాము సినిమా రంగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పోటీ పడ్డాం.. ఒకవేళ మేం క్రికెట్ ఆడి ఉన్నా సరే, ఇలాగే పోటీ పడేవాళ్లం తప్ప అసూయ పడేవాళ్లం కాదన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం విజయ్ ప్రభుత్వానికి ఇప్పుడే మార్కులు వేయకుండా, కొంతకాలం వేచి చూడాలనే రజినీకాంత్ అభిప్రాయాన్ని కమల్ హాసన్ కూడా సమర్థించడం తమిళ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. -
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్న్యూస్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరాజయం నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ అన్నామలై బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ జాతీ నేత పీఎల్ సంతోష్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మెజారిటీ శాతం మంది అన్నామలైకే మళ్లీ బాధ్యతలు అప్పగించాలని పట్టుబట్టినట్టు సమాచారాలు వెలువడ్డాయి.అసెంబ్లీకి ఎన్నికల ముందుగా అన్నాడీఎంకే ఒత్తిడి మేరకు అన్నామలైను అధ్యక్ష పదవి నుంచి బీజేపీ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్ నియమితులయ్యారు. ఈ ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓటమి చవి చూసింది. నైనార్ నాగేంద్రన్ సైతం ఓటమి పాలు కావడంతో ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న నినాదం బీజేపీలో బయలు దేరింది. దీంతో అధ్యక్ష మార్పు విషయంగా పీఎల్ సంతోష్ ద్వారా అభిప్రాయాల సేకరణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నిర్ణయించినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి.ఈ మేరకు పీఎల్ సంతోష్ అభిప్రాయాల సేకరణలో నిమగ్నమయ్యారు. మెజారిటీ శాతం మంది అన్నామలై ద్వారానే బీజేపీ బలోపేతం సాధ్యమన్నది స్పష్టం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆయన్ని మళ్లీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఆయనకు ఈసారి రాజ్యసభ పదవి కూడా ఇవ్వబోతున్నట్టుగా మద్దతుదారులు పేర్కొంటుండటం గమనార్హం. -
ఇసుక క్వారీల అక్రమాలకు బ్రేక్
– ఆదాయ వనరుపై ప్రభుత్వం దృష్టి సాక్షి, చైన్నె : తమిళనాడులో అధికార మార్పిడి అనంతరం ఇసుక క్వారీల నిర్వహణలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గత కొంతకాలంగా సాగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడటంతో, ఖనిజ వనరుల శాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెంచేందుకు సీఎం విజయ్ సిద్ధమయ్యారు. రాజకీయ జోక్యం.. ప్రభుత్వానికి నష్టం తమిళనాడు వ్యాప్తంగా నిర్మాణ రంగానికి ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా గ్రావెల్ మట్టికి ఎప్పుడూ కొరత ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని గతంలో మెజారిటీ క్వారీలను రాజకీయ నాయకులే నడిపించేవారు. ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీ చేయడం, డ్రోన్ల ద్వారా తవ్వకాలను పర్యవేక్షించడం వంటి చర్యలు ప్రభుత్వం చేపట్టినప్పటికీ.. నాటి అధికార పార్టీ నేతల జోక్యంతో అక్రమాలు యథేచ్ఛగా సాగాయి. అనుమతి పొందిన పరిమితి కంటే ఎక్కువ తవ్వకాలు జరపడం, ఒక చోట అనుమతి తీసుకుని మరోచోట మట్టిని తరలించడం వంటి చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. మామూళ్ల దందాకు ముగింపు గతంలో 6 యూనిట్ల (30 టన్నులు) మట్టిని తరలించడానికి ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా రూ. 2,500 చెల్లించాల్సి ఉండేది. అయితే దీనితో పాటు కంపెనీ పేరుతో పైస్థాయి నేతలకు రూ. 2,400, స్థానిక నాయకులకు రూ. 1,200 చొప్పున మొత్తం రూ. 3,600 వరకు అక్రమ వసూళ్లకు పాల్పడేవారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అదనపు భారాన్ని తట్టుకోవడానికి, వ్యాపారులు ఆన్లైన్లో ఒకే ఒక్క ఒరిజినల్ పర్మిట్ తీసుకుని, దాని ఆధారంగా నకిలీ రశీదులను సృష్టించి పదే పదే మట్టిని తరలించేవారనిఇ సమాచారం. ఫలితంగా ప్రభుత్వానికి రావలసిన లక్షలాది రూపాయల ఆదాయంకు గండి కొట్టినట్లయ్యింది. డ్రోన్ల నిఘా.. కఠిన చర్యలు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ప్రకటన సమయం నుంచే అధికారుల నిఘా పెరగడంతో అక్రమ క్వారీలు మూతపడ్డాయి. అదే సమయంలో ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం అధికారంలోకి రావడంతో, రాజకీయ నాయకులు అక్రమ క్వారీల జోలికి వెళ్లడం మానేశారు. ప్రస్తుతం పర్మిట్ల అవినీతికి పూర్తిగా ముగింపు పడే రీతిలో అధికారులు కొరడా ఝుళిపించి ఉన్నారు. దీంతో నిర్వాహకులు నిబంధనల ప్రకారం ఆన్లైన్ పర్మిట్లు తీసుకునే పనిలో ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం పుంజుకునే అవకాశాలు అధికమయ్యాయి. అలాగే ఖనిజ వనరుల శాఖ అధికారులు డ్రోన్ల సహాయంతో తవ్వకాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ మట్టిని తీస్తే భారీ జరిమానాలు విధిస్తున్నారు. లీజు పొందిన స్థలాన్ని కాకుండా వేరే చోట తవ్వకాలు జరిపితే సదరు క్వారీలను తక్షణమే సీజ్ చేసే విధంగా ఉరకలు తీస్తుండటంతో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం క్రమంగా పెరిగనున్నది. ఈ విషయంగా శివగంగై జిల్లా ఖనిజ వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ పన్నీర్సెల్వం మాట్లాడుతూ.. ప్రస్తుతం శివగంగై జిల్లాలో అనుమతి పొందిన 16 క్వారీలు మాత్రమే నడుస్తున్నాయి. జిల్లాలో ఎలాంటి అక్రమ క్వారీలు లేవని. రవాణా చేసే వాహనాలు సక్రమంగా పర్మిట్లు కలిగి ఉన్నాయా లేదా అనే అంశంపై క్షేత్రస్థాయిలో నిరంతర నిఘా ఉంచాం అని తెలిపారు. -
పురుషుల రక్షణ కోసం హెల్ప్లైన్ కావాలి
తమిళసినిమా: ఇటీవల నటుడు రవిమోహన్ తన భార్య కుటుంబం వేధిపుల గురించి మీడియా ముందు వెల్లడిస్తూ కంటతడి పెట్టిన విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత నాలుగేళ్లుగా తన భార్య, ఆమె కుటంబం తనను తీవ్ర మనస్థాపానికి గురి చేస్తోందని, తన పిల్లలను కూడా చూడనీయకుండా చేస్తున్నారని, తాను పలుమార్లు చేతి నరాలు కట్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డానని ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో పురుష రక్షణ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది అరుల్ తుమిళన్ ముఖ్యమంత్రి విజయ్కు ఒక విజ్ఞాపన లేఖను రాశారు. అందులో తమిళనాడులో భార్యా బాధితుల మరణాలు అధికం అవుతున్నాయని, వారిని రక్షించడానికి పురుష రక్షణ కోసం ఒక హెల్ప్లైన్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన దేశాలైన బ్రిటన్, ఆస్ట్రేలియాలో పురుష రక్షణ కోసం హెల్ప్లైన్ను ఏర్పాటు చేశారని,అదే విధంగా తమిళనాడులోనూ ఆ దిశగా చర్యలు చేపట్టాలాని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 162 మంది టెక్నికల్ ఎస్ఐల బదిలీ కొరుక్కుపేట: పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 162 మంది టెక్నికల్ ఎస్ఐలను డీఐజీ (టెక్నికల్ డివిజన్) జయలక్ష్మి బదిలీ చేశారు. తమిళనాడు పోలీసులోని వివిధ సాంకేతిక విభాగాలలో ఎస్ఐలు పనిచేస్తున్నారు. వారు 3 సంవత్సరాలకు పైగా ఒకే చోట పనిచేస్తున్నందున, పరిపాలనా సౌలభ్యం కోసం, ఇతర విభాగాలకు బదిలీ కావాలని ఎస్ఐలు చేసిన అభ్యర్థనల మేరకు, 162 మంది ఎస్ఐలను పోలీసులోని వివిధ విభాగాలకు బదిలీ చేయాలని ఉత్తర్వులిచ్చారు. ఇందులో సి.బి.సి.ఐ.డి సాంకేతిక విభాగంలో పనిచేసిన ఎస్ఐ బాల ఆత్మనేసర్ను చైన్నెలోని ఉగ్రవాద నిరోధక దళానికి బదిలీ చేశారు. తమిళనాడు ఆన్లైన్ గేమింగ్ కమిషన్లో పనిచేసిన ఇర్ఫాన్ అయాజ్ను చైన్నెలోని ఉగ్రవాద నిరోధక దళానికి, ఆర్థిక నేరాల విభాగంలో పనిచేసిన రాబర్ట్ బ్రూస్ను చైన్నెలోని ఉగ్రవాద నిరోధక దళానికి బదిలీ చేశారు. వీరపురంలోని తమిళనాడు 3వ బెటాలియన్లో పనిచేసిన కలైసెల్విని ఉగ్రవాద నిరోధక దళానికి, ఆవడి మెట్రోపాలిటన్ పోలీస్ను చైన్నెలోని ఉత్తర మెట్రోపాలిటన్ పోలీస్ జోన్, పోలీస్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. బైకు – బస్సు ఢీ అన్నానగర్: విల్లుపురం జిల్లా, మరకానం మండవాయి,పుదుక్కుప్పం సమీపంలోని ఆలపాక్కంకి చెందిన శేషాద్రి కుమారుడు సిలంబరసన్ (29). ఇతనికి పెళ్లి కాలేదు. ఆదివారం తెల్లవారుజామున సిలంబరసన్ను అతని బావ స్టాలిన్ (37), కలపట్టులోని కనకశెట్టి కుళం ప్రాంతంలో హోటల్ నడుపుతున్న మరో బావ కార్తికేయన్ (33) ఒకే బైకుపై పుదుచ్చేరిలోని అభిషేకప్పక్కం ప్రాంతానికి వెళ్లారు. స్టాలిన్ బైక్ నడుపుతున్నాడు. పుదుచ్చేరిలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో కొట్టకుప్పం సమీపంలో ఉన్న పెరియముదలియార్ చావడి ఎకై ్సజ్ చెక్ పోస్ట్ వద్దకు వారు సమీపిస్తుండగా, అతివేగంగా వస్తున్న తమిళనాడు ప్రభుత్వ బస్సు, చైన్నె నుండి పుదుచ్చేరి వైపు వస్తున్న కారును ఢీకొట్టింది. ఇదే క్రమంలో ఆ బస్సు స్టాలిన్ ప్రయాణిస్తున్న బైకును కూడా ఢీకొట్టింది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న స్టాలిన్తో సహా ముగ్గురు బస్సు ముందు చక్రలో చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. దిండుక్కల్ వెస్ట్ గక్కన్ రోడ్కు చెందిన బస్సు డ్రైవర్ మురుగేశ్వరన్ (30), అక్కడ బస్సును ఆపి పారిపోయాడు. అనంతరం, బస్సు డ్రైవర్ మురుగేశ్వరన్ పుదుచ్చేరిలోని ఉరులయన్పేట పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పంపారు. బస్సు ఢీకొన్న కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్కు చెందిన ఐటీ ఉద్యోగులు శివాసిస్ పట్టి నాయక్ (35), నరేంద్ర (25), యశ్వంత్ భూపతి (30), తరుణ్ (25)కు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా పుదుచ్చేరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోటకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరువళ్లూరు: పిచ్చికుక్క దాడిలో ఒకే రోజు ముగ్గురు మహిళలు సహా 18 మంది తీవ్రంగా గాయపడిన ఘటన తిరువళ్లూరులో కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా కాకలూరు లోని నివాస ప్రాంతాల్లో పిచ్చికుక్క సంచరిస్తూ కనిపించింది. అదేసమయంలో అటువైపు వెళు తున్న ముగ్గురు మహిళలు సహా 18 మందిపై దాడి చేసి గాయపరిచింది. కుక్క దాడిలో కాకలూరుకు చెందిన గజేంద్రన్ (65), సురేష్ (42), రవికుమార్ (26), భాస్కర్ (29), గోకనాథన్ (60), మాల (22) సహా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని తిరువ ళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. -
విజయ్ నాకు సమకాలికులు కారు!
సాక్షి, చైన్నె : ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో తన భేటీ చర్చకు దారితీయడంతో రజినీకాంత్ వివరణ ఇచ్చారు. ‘‘స్టాలిన్కు, నాకు మధ్య ఉన్న బంధం రాజకీయాలకు అతీతమైంది. ఆయన నాకు సుదీర్ఘకాలంగా మంచి మిత్రుడు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. అయితే కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ ఓడిపోవడం నన్ను ఎంతగానో బాధించింది. ఒక మంచి స్నేహితుడిగా, ఆయనకు ధైర్యం చెప్పడానికే నేను వెళ్లాను‘ అని వివరించారు. విజయ్ సీఎం కాకూడదని, ఆయనను అడ్డుకోవడానికే రెండు పెద్ద పార్టీలు కలవాలంటూ తాను అక్కడ మాట్లాడినట్లు వస్తున్న వార్తలను రజినీ తీవ్రంగా ఖండించారు. అటువంటి దిగజారుడు రాజకీయాలు మాట్లాడే వ్యక్తిని తాను కాదన్నారు. విజయ్కు రజినీకాంత్ శుభాకాంక్షలు చెప్పలేదని, ఆయనపై రజనీకి అసూయ ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సూపర్ స్టార్ ఘాటుగా స్పందించారు. ‘విజయ్ గెలవగానే నా ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా అభినందనలు తెలిపానని గుర్తు చేశారు. ఇటీవల ఎయిర్పోర్టులో ఒకరు ఫోన్ చూపిస్తూ విజయ్ సీఎం అయ్యారు అని చెబితే, నవ్వుతూ వెళ్లిపోయానని, దాన్ని పట్టుకుని శుభాకాంక్షలు చెప్పలేదనడం సరికాదన్నారు. సినిమా రంగం నుంచి వచ్చి ఒంటరి పోరాటంతో విజయ్ సాధించిన విజయాన్ని రజినీకాంత్ ఆకాశానికెత్తారు. చాలా చిన్న వయసులోనే విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి మహానుభావులు సాధించిన రికార్డుల కంటే విజయ్ సాధించిన ఘనత చాలా పెద్దది. ఇది తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఒక ఒంటరి వ్యక్తిగా, పెద్ద పెద్ద పార్టీలను ఎదిరించి ఆయన విజయం సాధించారు. ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఓటేశారని, కచ్చితంగా ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటారనే నమ్మకం తనకు ఉందన్నారు. అభిమానులకు, కార్యకర్తలకు రజినీ పలు సూచనలు చేశారు. తాను ఎందుకు రాజకీయాల్లోకి రాలేదో గతంలోనే సుదీర్ఘమైన ప్రకటన ద్వారా స్పష్టం చేశానని గుర్తుచేశారు. ‘సినిమాలో నష్టం వస్తే కేవలం నిర్మాత మాత్రమే నష్టపోతాడని పేర్కొన్నారు. అయితే, రాజకీయం అలా కాదు.. దాని బాధ్యత చాలా పెద్దది. కమల్ హాసన్తో సహా సినిమా ప్రముఖులు చాలా మంది విజయ్ను కలిశారు. నేను కేవలం ఫార్మాలిటీ కోసం వెళ్లి కలిసే వ్యక్తిని కాను అని పేర్కొన్నారు. విజయ్ పాలనను నిరూపించుకోవడానికి ప్రజలు కనీసం రెండేళ్ల సమయం ఇవ్వాలని కోరారు. విజయ్ పార్టీ కార్యకర్తలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, వారు చేసే చిన్న తప్పు కూడా విజయ్ ప్రతిష్టను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. తమిళనాడులో 60 ఏళ్ల తర్వాత సినిమా గ్లామర్, యువత, మహిళల మద్దతుతో ఒక పెను మార్పు వచ్చిందని రజినీకాంత్ ముగించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తనపై వస్తున్న విమర్శలకు, రాజకీయ ఊహాగానాలకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఆదివారం గట్టి కౌంటర్ ఇచ్చారు. పోయేస్ గార్డెనన్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ను తాను కలవడం వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూనే, కొత్తగా సీఎం పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్పై తనకు ఎలాంటి అసూయ లేదని రజినీకాంత్ స్పష్టం చేశారు. నాకు, విజయ్కు జనరేషన్ గ్యాప్ ‘నేను రాజకీయాల్లోనే లేను.. అలాంటప్పుడు విజయ్పై నాకు ఎందుకు అసూయ ఉంటుంది? ఒకవేళ కమల్ హాసన్ సీఎం అయినా నాకు ఆ భావన రాదు. నాకూ, విజయ్కు మధ్య ఒక తరం వ్యత్యాసం ఉంది. చిన్నప్పటి నుంచి అతడిని చూస్తున్నాను. అతను సీఎం అవ్వడం నాకెందుకు అసూయ?‘ అని ప్రశ్నించారు. అభిమానులకు సూచన ఎంజీఆర్, ఎన్టీఆర్ రికార్డులను మించిన ఘనత రెండేళ్లు సమయం ఇవ్వాలి విజయ్ విజయం అద్భుతం.. -
పువ్వుల్లో దాగున్న అందం
తమిళసినిమా: పువ్వులు వికసించగానే పరిమళిస్తాయి. అలాంటి పువ్వుల చూడగానే మగువుల తలపులు వికసిస్తాయి. వాటిని తమ సిగలో దాల్చుకోవాలని తహతహలాడుతుంటారు.. పువ్వులకు, మగువులకు అంతగా అనుబంధం ఉంటుంది. మగువులకు చీరలెంత అందమో, పువ్వులు అంత అందాన్నిస్తాయి. ఇకపోతే మగువులను పువ్వులతో పోల్చుతారు. వారి మనసులు అంత సుకుమారమనే అలా పోలుస్తారు. పువ్వులను ఇష్టపడని సీ్త్ర ఉండదని చెప్పొచ్చు. నయనతారకు పువ్వులంటే చాలా ఇష్టం అనుకుంటా. దాన్ని ఇప్పుడు చేతల్లో చూపించారు. దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈ భామ, జవాన్ చిత్రంతో బాలీవుడ్లోనూ పాగా వేసి మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా మరోసారి సల్మాన్ఖాన్కు జంటగా హిందీలో నటిస్తున్నారు. తమిళంలోనూ పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలా ఈమె నటించిన మూక్కుత్తి అమ్మన్–2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇకపోతే ఈ బ్యూటీ ఏంచేసినా వార్తే అవుతుంది. ప్రచారంలో ఈమె స్టయిలే వేరుగా ఉంటుంది. ఎలాంటి అకేషన్ వచ్చినా ఫొటోలు తీసుకుని వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు. అలా ఇటీవల అందమైన పువ్వులు ఈమె కంటపడ్డాయి. అంటే వెంటనే ఆ పువ్వులను సృశించి, పరిమళాలను ఆస్వాదించడంతో సరిపెట్టుకోకుండా వాటితో రకరకాల భంగిమల్లో ఫొటోలను తీయించుకున్నారు. పువ్వుల మధ్యలో దాగి వాటి అందాల్లో అందంగా మారిపోయారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజాక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
త్వరలో మంత్రివర్గ విస్తరణ
సాక్షి, చైన్నె: తమిళనాడులో కొత్తగా బాధ్యతలు చేపట్టి న ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనుందని ఆర్థిక మంత్రి సెంగోట్టయ్యన్ వెల్లడించారు. కోయంబత్తూ రు విమానాశ్రయంలో ఆదివారం ఆయన మీడియా తో మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం కోసం, మిగిలిన మంత్రి పదవుల భర్తీని ముఖ్యమంత్రి విజయ్ క్ర మంగా చేపడతారని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇంకా 15 మందిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు త్వరలోనే మరో 13 మందిని క్యాబినెట్లోకి తీసుకుని మంత్రిత్వ శాఖల పరిధిని విస్తరించనున్నట్లు సెంగోట్టయ్యన్ తెలిపారు. గతంలో జయలలిత మొదట చిన్న క్యాబినెట్తో ప్రారంభించి ఆ తర్వాత క్రమంగా విస్తరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విజయ్ సంచలన నిర్ణయాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 717 మద్యం దుకాణాల మూసివేత వంటి కార్యక్రమాలతో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ కాలంలోనే విజయ్ చారిత్రాత్మక విజయాలు సాధించారని మంత్రి కొనియాడారు. భారతదేశంలో మరెవరూ ఇంత వేగవంతమైన నిర్ణయాలు తీసుకోలేదన్నారు. మహిళల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్ స్టాండ్ల సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం ఒక మైలురాయి అని సెంగోట్టయ్యన్ ప్రశంసించారు. వారికి ఎవరు పదవులు ఇస్తామన్నారు మంత్రివర్గంలోఅన్నాడీఎంకే ఎమ్మెల్యేల చేరికపై మీడి యా ప్రశ్నించగా.. ‘సీఎం విజయ్ ఏది ఆలోచించినా దాన్ని అమలు చేయడమే తమ బాధ్యతగా పేర్కొన్నా రు. మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి స్వయంగా తన హోదా నుంచే తుది నిర్ణయం తీసుకుంటారని సెంగోట్టయ్యన్ స్పష్టం చేశారు. అయితే, వారికి మంత్రి పదవులు ఇస్తామని ఎవరు చెప్పారని, ఇంత వరకు అలాంటి ప్రస్తావనే లేదన్నారు. ఏనిర్ణయమైనా తమ నాయకుడు, సీఎం విజయ్ తీసుకుంటారని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా మంత్రి వర్గంలో చేరడం గురించి ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం, ఎంఆర్ విజయ భాస్కర్, విజయ భాస్కర్ తదితర అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆదివారం చైన్నెలో సమావేశం కావడం ప్రాధాన్యకు దారి తీసింది. -
కథానాయకిగా నటుడు కొట్టాచ్చి కుమార్తె
తమిళసినిమా: ఇంతకు ముందు బాలతారలుగా రాణించిన పలువురు ఆ తరువాత కథానాయికలుగా పరిచయం అయ్యి ఉన్నత స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొట్టాచ్చి కూతురు మానసీ పలు విజయవంతమైన చిత్రాల్లో బాలతారగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా తాజాగా బాలతార మానసి హీరోయిన్గా పూ కాయ్ కని అనే చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం ద్వారా కేసీపీ. మిథున్ చక్రవర్తి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు అడియే వెళ్లళగి, ఏన్ ఎన్నై కాదలిచ్చా వంటి ఇండిపెండెంట్ ఆల్బమ్లలో నటించి గుర్తింపు పొందారన్నది గమనార్హం. అదే విధంగా టూలెట్ చిత్రం కథానాయకుడు సంతోష్ నంబిరాజన్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. దీనికి వెట్రివీరన్ మహాలింగం దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు అరుంబు మీసై కురుంబు పార్వై, వెన్నెలా వీడు, విసిరి వంటి చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. అదేవిధంగా ఈయన ఇటీవల దర్శకత్వం వహించిన సూట్కేస్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. తాజాగా పూర్తి నేటివిటితో రూపొందిస్తున్న చిత్రం పూ కాయ్ కని. ఇది 1986 ప్రాంతంలో జరిగే మూడు పరిమాణాల్లో సాగే విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దీన్ని ఇంతకు ముందు సూట్కేస్ చిత్రానికి నిర్మాణ నిర్వహణ భాద్యతలను నిర్వహించిన రాజేశ్వరి వెట్రివీరన్ ఈ చిత్రాన్ని పళయనూర్ సందనం పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా డబ్బింగ్ కళాకారుడిగా పలువురు నటులకు డబ్బింగ్ చెప్పిన దర్శకుడు వెట్రివీరన్ కొడుకు రాజు మహాలింగంతో పాటు కూత్తుపట్టరైలో శిక్షణ పొందిన పలువురు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కవితాత్మకంగా ఉన్న చిత్ర టైటిల్ మాదిరిగానే చిత్రం జనరంజకంగా ఉంటుంద ని దర్శకుడు తెలిపారు. కాగా ఈ చిత్రానికి పీజీ.ముత్తయ్య ఛాయాగ్రహణంను, ధన్రాజ్ మాణిక్యం సంగీతాన్ని అందిస్తున్నారు. -
సీనియర్ నిర్మాత, నటుడు కె.రాజన్ ఆత్మహత్య
తమిళసినిమా: సీనియర్ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు కె.రాజన్ (80) ఆదివారం సాయంత్రం స్థానిక ఆడయార్ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కె.రాజన్ 1983లో బ్రహ్మచారిగళ్ అనే చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తరువాత పలు చిత్రాలు నిర్మించిన ఈయన నటుడు నిళల్గళ్ రవి, శరత్కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన నమ్మ ఊరు మారియమ్మ అనే చిత్రానికి దర్శత్వం వహించారు. దర్శకుడు సెంథిల్నాథన్ కోసం ఆయన దర్శకత్వం వహించిన తంగమాన తంగచ్చి చిత్రానికి కథను అందించారు. అదే విధంగా పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన కె.రాజన్ పలు సినీ సంఘాల్లో కీలక పాత్రను నిర్వహించారు. ప్రస్తుతం సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతను నిర్వహిస్తూ వచ్చారు. కాగా సినీ వేదికపలై ఏ విషయాన్నైనా నిర్భయంగా మాట్లాడే ఈయన ముఖ్యంగా చిన్న చిత్రాల రక్షణ కోసం గళమెత్తేవారు. అంతే కాకుండా నిర్మాతలను కాపాడే విధంగా స్టార్ హీరోల పారితోషికాలను తగ్గించుకోవాలని గొంతేత్తడంలో ఎప్పుడూ ముందుండేవారు. అంతే కాకుండా కె.రాజన్ విద్యాదాత కూడా. చిన్న పిల్లల కోసం పాఠశాలను నిర్విస్తూ వచ్చారు. ఎందరికో ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. అలాంటి కె.రాజన్ ఇలా నదిలో పడి ఆత్యహత్య చేసుకోవడం చిత్ర పరిశ్రమను ధిగ్బ్రాంతికి గురి చేసింది. ఈయన భౌతిక కాయాన్ని అగ్నిమాపక దళం అడయారు నదిలో నుంచి పైకి తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా కె.రాజన్ ఆత్మహత్య హత్యకు కారణాలు గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈయన స్థానికి ఓల్డ్ వాషర్పేటలోని కప్పల్ పొలు వీధిలో నివశిస్తూ వచ్చారు. -
చైన్నెలో సరికొత్త హెల్త్ రెవల్యూషన్ ప్రోగ్రామ్
సాక్షి, చైన్నె: ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజల ఆరోగ్య శైలిని మార్చేందుకు చైన్నెలో ఓ వినూత్నమైన భాగస్వామ్యం కుదిరింది. ప్రముఖ హెల్త్కేర్ అండ్ వెల్నెస్ క్లినిక్ లివ్యా హబ్, ప్రముఖ ఫిట్నెస్ సెంటర్ బ్రాండ్ టీమ్ హై పెర్ఫార్మెనన్స్తో చేతులు కలిపింది. ఈ ఇరు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన లివ్యా అడ్వానన్స్డ్ మెటబాలిక్ రీసెట్ ప్రోగ్రామ్ చైన్నెలో అధికారికంగా ప్రారంభించారు. చైన్నెలోని ఆల్వార్పేటలో ఉన్న ‘లివ్యా క్యూర్ హబ్’ ప్రాంగణంలో జరిగిన ఈ ప్రోగ్రామ్ పరిచయ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు, టాప్ ఫిట్నెస్ కన్సల్టెంట్లు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సహా 200 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ వి. శ్రవంతి, డాక్టర్ ఆశాలత శ్రీనివాసన్; లివ్యా క్యూర్ హబ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.కె.టి. రాజు, టీమ్ హై పెర్ఫార్మెనన్స్ వ్యవస్థాపకులు శ్రీ హరి ప్రసాద్ తదితరులు పాల్గొని ఈ సరికొత్త హెల్త్ ఇనిషియేటివ్ను ఆవిష్కరించారు. చైన్నె నగర చరిత్రలో ఒక వెల్నెస్ క్లినిక్, ఒక ఫిట్నెస్ బ్రాండ్తో కలిసి ఇలాంటి ప్రోగ్రామ్ను తీసుకురావడం ఇదే తొలిసారి కావడం విశేషం. వివిధ రంగాలకు చెందిన వైద్య నిపుణులు, ఫిట్ నెస్ బ్రాండ్స్ సంయుక్తంగా ఈ ట్రానన్స్ఫార్మేషన్ ప్రోగ్రామ్ను క్లినికల్గా డిజైన్ చేశారు. శరీరంలోని జీవక్రియలను పునరుద్ధరించడం, శక్తి సామర్థ్యాలను పెంచడం, స్థిరమైన పద్ధతిలో శరీర బరువును నియంత్రించడం ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. 90 రోజుల సమగ్ర ప్యాకేజీలో అత్యాధునిక కతమైన రోగనిర్ధారణ పరీక్షలు,నిపుణుల పర్యవేక్షణలో రూపొందించిన ప్రత్యేక ప్రణాళికలు, నిరంతర వైద్య పర్యవేక్షణ ఇందులో ఉంటాయి. -
విజయ్కి 6 నెలల సమయం ఇవ్వాలి !
సాక్షి, చైన్నె: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ పనితీరుపై ఇప్పుడే విమర్శలు చేయడం లేదా అంచనా వేయడం సరి కాదని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. మదురై విమానాశ్రయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని ఆయన కోరారు. రెండు రోజుల్లో చెబితే అది జోస్యం అవుతుంది: సీఎం విజయ్ పాలన ఎలా ఉందనే ప్రశ్నపై కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు. ‘విజయ్ ముఖ్యమంత్రి అయి రెండు రోజులే అవుతోంది. అప్పుడే ఆయన పాలన ఎలా ఉందో చెప్పమంటే అది జోస్యం చెప్పినట్లే అవుతుందని చమత్కరించారు. ఆరు రోజుల్లోనో, పదిహేను రోజుల్లోనో ప్రభుత్వ పనితీరుపై సమీక్షలు చేయడం కూడా అంతే అని వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం స్థిరపడటానికి, వారి విధానాలు అమలు కావడానికి కనీసం 6 నెలల సమయం ఇవ్వాలని కమల్ పేర్కొన్నారు. ప్రజలు నమ్మి ఓటేశారు.. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావడంపై స్పందిస్తూ... కొత్తవాళ్లు చాలా మంది అధికారంలోకి వచ్చారని, అయితే రాజకీయాలకు ఇది కొత్తేమీ కాదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు బాధ్యతలు స్వీకరించిన వారంతా కొత్తవారేనని పేర్కొన్నారు. ప్రజలు నమ్మి ఓటేశారు కాబట్టి, ఆ పాలన సజావుగా సాగుతుందా లేదా అనేది గమనించాలన్నారు. తాము కూడా దాన్నే గమనిస్తున్నాం అని చెప్పారు. తమిళనాట పుడితే అది ద్రావిడ పార్టీనే తమిళనాడు రాజకీయ సిద్ధాంతాలపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ తన ఉద్దేశం ప్రకారం... తమిళనాడులో తమిళం మాట్లాడే వ్యక్తి ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీని ప్రారంభిస్తే, అది కచ్చితంగా ద్రావిడ పార్టీనే అవుతుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ.. నూతన విద్యా విధానాన్ని తమిళనాడులో అమలు చేయాలని ఎవరూ బలవంత పెట్టలేరని స్పష్టం చేశారు. మా ఇద్దరి మధ్య కేవలం పోటీ మాత్రమే సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యల (ఒకవేళ కమల్ సీఎం అయినా తనకు అసూయ ఉండదన్న వ్యాఖ్యల) ప్రస్తావన రాగా, కమల్ హాసన్ వారి స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. తాను, రజనీకాంత్ ఎప్పుడూ ఒకరిని చూసి ఒకరం అసూయ పడలేదన్నారు. అయితే, తమ మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేదన్నారు. తాము సినిమా రంగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పోటీ పడ్డాం.. ఒకవేళ మేం క్రికెట్ ఆడి ఉన్నా సరే, ఇలాగే పోటీ పడేవాళ్లం తప్ప అసూయ పడేవాళ్లం కాదన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం విజయ్ ప్రభుత్వానికి ఇప్పుడే మార్కులు వేయకుండా, కొంతకాలం వేచి చూడాలనే రజినీకాంత్ అభిప్రాయాన్ని కమల్ హాసన్ కూడా సమర్థించడం తమిళ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. -
క్లుప్తంగా
బైక్పై తీసుకెళ్లి దాడి దోపిడీ అన్నానగర్: రాజస్థాన్కు చెందిన లీలా రామ్ (27) అంబత్తూరు సమీపంలోని కల్లి కుప్పం ప్రాంతంలో నివసిస్తూ, పని చేస్తు వచ్చాడు. ఇతను ఆదివారం తన స్వగ్రామానికి వెళ్లి రైలులో చైన్నెకి వచ్చాడు. ఇతను రైల్వే స్టేషన్ నుండి అంబత్తూరు వెళ్లడానికి ఒక యాప్ ద్వారా బైక్ టాక్సీ బుక్ చేసుకున్నాడు. కొద్దిసేపటికే, మోటార్ సైకిల్ మీద అక్కడికి వచ్చిన ఓ యువకుడితో లీలారామ్ ప్రయాణిస్తున్నాడు. అయితే, ఆ యువకుడు అంబత్తూరు వైపు వెళ్లకుండా, మాధవరం రౌంటనా సమీపంలో ఉన్న తట్టన్కుళం రోడ్డు వైపు వాహనాన్ని అకస్మాత్తుగా మలుపు తిప్పాడు. ఆ సమయంలో, అప్పటికే అక్కడ వేచి ఉన్న మరో యువకుడు, బైక్ టాక్సీ నడుపుతున్న ఇంకో యువకుడితో కలిసి లీలరామ్ పై దాడి చేసి బెదిరించారు. ఆ తర్వాత వారు అతని వద్ద నుండి డబ్బు, సెల్ఫోన్ తీసుకుని, ’జిపే’ ద్వారా మరింత డబ్బు పంపించామని బెదిరించి, అక్కడి నుండి పారి పోయారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన లీలా రామ్, మాధవరం పోలీసులకు ఫిర్యాదు చేశా డు. పోలీసులు కేసు నమోదు చేసి, నిఘా కెమెరా, బైక్ ట్యాక్సీ బుకింగ్ వివరాల ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని, ఈ దోపిడీలో పాల్గొన్న వ్యాసర్పాడి కాక్కన్ వీధికి చెందిన సంతోష్ (24)ను అరెస్టు చేశారు. ఇతని నుంచి మోటార్బైక్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఇద్దరు జనపద గాయకుల హత్య తిరువొత్తియూరు: తాంబరం సమీపంలోని వరదరాజపురం ప్రాంతానికి చెందిన భరత్ (22), శీను (23) అనే ఇద్దరు (గానాపాట) జనపద గాయకులు. శనివారం రాత్రి స్నేహితులిద్దరూ ఒక చోట గానా పాటల కచేరీ నిర్వహించారు. అనంతరం పడప్పై సమీపంలోని అమ్మణంపాక్కం గ్రామానికి చెందిన తమ స్నేహితుడు లోకేష్ ఇంట్లో బస చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 6 మందికి చెందిన ముఠా మోటార్ సైకిళ్లపై అక్కడికి చేరుకున్నారు. కత్తు లు, కొడవళ్లతో లోకేష్ ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న భరత్, శీనులను ఆ ముఠా తీవ్రంగా దాడి చేశారు. తరువాత ఆ ముఠా అక్కడి నుండి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన భరత్, శీను అదే చోట మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మణిమంగళం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హంతకులందరూ హెల్మెట్లు ధరించి వచ్చారు. దీనివల్ల వారిని గుర్తించడంలో చిక్కులు ఏర్పడ్డా యి. హంతకులు ఎవరు? హత్యకు గల కార ణం ఏమిటో తెలియరాలేదు. శనివారం రాత్రి ’గానా’ పాటల కార్యక్రమం జరుగుతున్న సమ యంలో ఏవైనా ఘర్షణలు జరిగాయా? లేదా చనిపోయిన వారి స్నేహితుడి కోసం వెతుకుతూ వచ్చిన అజ్ఞాత ముఠా ఈ జంట హత్యలకు పాల్పడిందా? అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. చోళుల కాలం నాటి రాగి ఫలకాలను శాశ్వతంగా ప్రదర్శించాలి – జవహిరుల్లా డిమాండ్ కొరుక్కుపేట: నాగపట్టణంలో చోళుల కాలం నాటి రాగి ఫలకాలను శాశ్వతంగా ప్రదర్శించాలని హ్యుమానిటీ పీపుల్స్ పార్టీ నాయకు డు, ఎమ్మెల్యే జవహిరుల్లా అన్నారు. ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ 300 సంవత్సరాల తర్వాత నెదర్లాండ్స్ ప్రధానమంత్రి చోళుల అనైమంగళం రాగి ఫలకాలను ప్రధానమంత్రి మోదీకి అందజేయబోతున్నారని తెలిసి నేను చాలా సంతోషించాను. ఈ రాగి ఫలకాలు సాధారణమైనవి కావు, ఇవి రాజరాజ చోళ, రాజేంద్ర చోళుల కాలపు వైభవానికి, సముద్రాలు దాటి విస్తరించిన రాజకీయ స్నేహానికి, తమిళుల సంస్కృతికి సాక్ష్యాలు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో, ఈ రాగి ఫలకాలను తమిళనాడుకు తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామని మాజీ మంత్రి తంగం తెన్నరసు శాసనసభలో ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పదేపదే నొక్కి చెప్పింది.అందరి నిరంతర కృషి నేటి ఇటువంటి ఫలితాలను ఇవ్వడం సంతోషకరమైన విషయం అన్నారు అదే సమయంలో ఈ అనమంగళం రాగి ఫలకాల అసలు స్థానం నాగపట్టణం. ఈ విషయాన్ని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం, ఈ రాగి ఫలకాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలి. తమిళనాడు ప్రభుత్వం కూడా ఆలస్యం చేయకుండా ఇందుకు తగిన ప్రయత్నాలు చేసి, ఈ విలువైన చారిత్రక పత్రాలు తమ మాతృభూమి అయిన నాగపట్టణానికి తిరిగి వచ్చేలా చూడాలి అని కోరారు. ఈ శిల్పాలను ప్రజలు చూసేందుకు వీలుగా నాగపట్టణంలో శాశ్వతంగా ప్రదర్శించాలని, దీనిపై తమిళనాడు ప్రభు త్వం గట్టిగా పట్టుబట్టాలని తాను అభ్యర్థిస్తున్నాను అని ఆయన అన్నారు. తిరువళ్లూరు: మూర్చ రావడంతో మిద్దైపె నుంచి కిందపడి పెయింటర్ మృతిచెందాడు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ వెంగత్తూరు గ్రామానికి చెందిన మణిగండన్(35) అవివాహితుడు. ఇతను పెయింటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం గణేషపురంలో పెయింటింగ్ పనులు చేస్తుండగా హఠాత్తుగా ఫిట్స్ రావడంతో మిద్దైపె నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సహచర కార్మికులు అతడ్ని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మనవాలనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


