Tamil Nadu
-
ఎన్డీఏ గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు: స్టాలిన్
తిరుచ్చి: ఎన్డీఏ గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారంటూ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ ప్రదేశ్గా పేరు మారుస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. తిరుచ్చిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏపై స్టాలిన్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ డబ్బా ఇంజిన్ ముందు ద్రవిడ మోడల్ సూపర్ ఫాస్ట్ ఇంజిన్ తల వంచదంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో స్టాలిన్ విరుచుకుపడ్డారు.బీజేపీ ప్రభుత్వాన్ని ఒక పనికిరాని డబ్బా ఇంజిన్గా అభివర్ణించిన స్టాలిన్.. తమ ద్రవిడ మోడల్ పాలనను 'సూపర్ ఫాస్ట్ ఇంజిన్తో పోల్చారు. తమిళనాడు ఆత్మగౌరవాన్ని కాపాడటంలో, అభివృద్ధి పథంలో దూసుకుపోవడంలో తమ ప్రభుత్వం ఎవరికీ లొంగదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించి, ద్రవిడ సిద్ధాంతాన్ని మరోసారి గెలిపించాలంటూ ప్రజలకు స్టాలిన్ పిలుపునిచ్చారు.బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే, వారి వల్ల కలిగే నష్టాలు మన ఊహకు అందవు. తమిళనాడు పేరును కూడా మార్చేస్తారు. తమిళనాడు ఎప్పటికీ తమిళనాడుగానే ఉండాలి. ఉత్తరప్రదేశ్, మణిపూర్లాగా హింసాత్మక ప్రాంతంగా మారకూడదు. హోసూర్ విమానాశ్రయం, విద్యా ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు.. కానీ ప్రధాని మోదీ మాత్రం ఎన్నికల కోసం తరచుగా పర్యటనలు చేస్తారు’’ అంటూ స్టాలిన్ విమర్శలు గుప్పించారు. -
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్?
ముంబై: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగక ముందే తమిళనాడు ఎన్నికల్లో ఆయా పార్టీల గెలుపు–ఓటములపై,పొత్తులపై అంతర్గతంగా చర్చలు మొదలయ్యాయా? ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకోకపోతే హీరో,తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ను ఆహ్వానించే అవకాశముందా? ఒప్పందం ప్రకారం విజయ్ తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టనున్నారా? త్రిముఖ పోరులో విజయ్ ‘కింగ్ మేకర్’అవుతాడా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎన్డీయే మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే.కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమిలో విజయ్ చేరుతారు. ఎన్నికల ఫలితాల తర్వాత మద్దతు కోరుతాం. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే గట్టిపోటీ ఇస్తుంది. హంగ్ ఏర్పడితే టీవీకే ఎన్డీఏలో చేరుతుంది. విజయ్ మద్దతుతో ఎన్డీఏ సర్కార్ వచ్చే ఛాన్స్’ఉందని అని వ్యాఖ్యానించారు.మంగళవారం పుదుచ్చేరిలో ఇండియా రిపబ్లికన్ పార్టీ కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం.. అథవాలే మీడియాతో మాట్లాడారు. పుదుచ్చేరి, అస్సాంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాదు. తమిళనాడులో మెజారిటీ సాధించకపోతే ఎన్డీఏ కూటమి విజయ్తో మాట్లాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.ప్రస్తుతం కేరళంను అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు.అక్కడ కూడా బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.ఎన్నికల తర్వాత, ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నరేంద్ర మోదీ దేశానికి అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రిగా మూడోసారి అధికారంలో ఉన్నారు. దేశాభివృద్ధియే ఆయన లక్ష్యం’అని ఆయన అన్నారు.ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్తో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. పొత్తును ఖరారు చేసేలా చర్చలు ఎన్డీఏ పెద్దలు ఓ దూతను విజయ్ వద్దకు పంపించారు. ఎన్డీఏ కూటమి తరుఫున సదరు నేత విజయ్తో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో విజయ్ రెండున్నర సంవత్సరాలు, అన్నాడీఎంకే ఎడప్పాడి పళనిస్వామి మరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేలా మంతనాలు జరిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత ఇదే అంశాన్ని టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున ధృవీకరించారు.అయితే, పళనిస్వామి రెండున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి ఒప్పందాన్ని అంగీకరించలేదు.దీంతో, విజయ్తో పొత్తు కోసం బీజేపీ చేసిన ప్రయత్నం విఫలమైంది. విజయ్ ఒంటరిగా ఎన్నికల పోటీ చేస్తున్నారు. తాజా,పరిణామల నేపథ్యంలో తమిళనాడులో ఎన్డీఏ కూటమికి మెజారిటీ రాకపోతే విజయ్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రామ్దాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాగా, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయా పార్టీల పొత్తులు, గెలుపు–ఓటములు ఊహాగానాలు మాత్రమే. ఏ రాష్ట్రంలో ఎవరు గెలిచారు? కింగ్ మేకర్ ఎవరు అవుతారు? ఏ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి? అన్నది ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత మాత్రమే స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రచారంలో అగ్ర నేతలు
సాక్షి, చైన్నె: పార్టీల అగ్ర నేతలు ఎన్నికల ప్రచారబాట పట్టారు. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ తిరువారూర్లో తన ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రచారంలో అందరి కన్నా ముందున్నారు. తెన్కాశి జిల్లా కడయనల్లూరులో పర్యటించారు. తిరునల్వేలిలో దూసుకెళ్లారు. విరుదునగర్లో అనేక నియోజకవర్గాలలో మంగళవారం పర్యటించారు. బుధవారం తిరుచ్చి రామనాథపురం జిల్లాలో దూసుకెళ్లనున్నారు. ఇక, నామ్ తమిళర్ కట్చి నేత సైతం పరుగులు తీస్తున్నారు. సూలూరు, గౌండం పాళయంలో సాయంత్రం జరిగిన సభల్లో ప్రసంగించారు. ఇక, డీఎంకే యువజన నేత ఉదయనిధి స్టాలిన్ సోమవారం సాయంత్రం కాంచీపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం ధర్మపురి జిల్లాలో పలు నియోజకవర్గాలలో ఓపెన్ టాప్ వాహనంలో ఓటర్లను ఆకర్షించారు. బానిస పాలనను రానివ్వొద్దు ధర్మపురిజిల్లా అరూర్ నియోజకవర్గంలో ఎన్ని కల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ,‘తమిళనాడులో అన్నాడీఎంకే బానిస పా లనను రానివ్వద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. డీఎంకే మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ, గత ఐదేళ్ల ప్రగతి పాలనను గుర్తు చేశా రు. ‘ఈ ఎన్నికలు ఢిల్లీకి, తమిళనాడుకు మధ్య జరుగుతున్న పోరు అని, మోదీనా, తమిళనా డా అని తేల్చుకోవాల్సిన సమయం ఇదేనని పిలుపు నిచ్చారు. అన్నాడీఎంకేకు వేసే ప్రతిఓటూ బీజేపీకి వేసినట్లే అని హెచ్చరించారు. మన్సూర్ వినూత్నం లాల్గుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నటుడు మన్సూర్అలీఖాన్ వినూత్నంగా ప్ర చారంలో పరుగులు తీస్తున్నారు. కల్లకుడి రైల్వే పట్టాలపై పడుకుని వినూత్న ప్రచారం చేశా రు. దివంగత మాజీ సీఎం కరుణానిధి రాజకీయ జీవితంలో కల్లకుడి పోరాటం అత్యంత కీలకమైనదిగా చెపుతుంటారు. ఈ దృష్ట్యా, అదే నియోజకవర్గంలో పోటీచేస్తున్న మన్సూర్అలీఖాన్ ఆ పోరాట స్ఫూర్తిని చాటే విధంగా కాసేపు రైలు పట్టాలపై పడుకుని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ మార్గంలో మధ్యాహ్నం వరకు ఏ రైళ్లు రావు, ఈ దృష్ట్యా, ఆయన ధైర్యంగా పట్టాలపై కాసేపు పడుకున్నప్పటికీ, ఇది నిబంధనల ఉల్లంఘన అని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. స్టాలిన్ ప్రచార బాట తిరువారూర్ నుంచి డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తిరువారూర్ డీఎంకే అభ్యర్థి పూండి కలైవానన్, మన్నార్కుడి టీఆర్బీ రాజా, తిరుత్తురై పూండి సీపీఐ అభ్యర్థి మారిముత్తు, నన్నిలం ఎస్డీపీఐ అభ్యర్థి నెల్లై ముబారక్లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. స్థానికంగా వారి సేవలను గుర్తు చేశారు. తిరువారూర్ అంటే డీఎంకే ఊరు అని వ్యాఖ్యలు చేస్తూ, తమ ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమాలను వివరించారు. -
భారత్ ల్యాబ్ వజ్రాల మెరుపు
– ఐఐటీ ఆధ్వర్యంలో సదస్సు సాక్షి, చైన్నె: భారతదేశాన్ని ల్యాబ్–గ్రోన్ డైమండ్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో ఐఐటీ మద్రాస్కు చెందిన ‘ఇండియా సెంటర్ ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్’ పరిశోధనా బృందం కీలక అడుగులు వేసింది. క్వాంటం టెక్నాలజీస్, ఫోటోనిక్స్ , సెన్సింగ్ వంటి అత్యాధునిక రంగాలలో భారతీయ పరిశోధనలను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లేందుకు ఈ బృందం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇటీవల తొలి అంతర్జాతీయ సదస్సు ఐఐటీ మద్రాసులో నిర్వహించినట్టు వజ్రాల శాస్త్రం, ఎమర్జెంట్ మెటీరియల్స్పై చర్చించినట్టు మంగళవారం ప్రకటించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా, జీజేఈపీీసీ సహకారంతో ఈ కార్యక్రమం జరిగిందని వివరించారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మద్దతుతో స్థాపించిన ఈ కేంద్రం, స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశాన్ని ఆత్మనిర్భర్గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సాంకేతికత భారతీయ స్టార్టప్లకు, పరిశ్రమలకు అందుబాటులోకి రానుంది. ఈ విషయంగా ప్రొఫెసర్ ఎం.ఎస్. రామచంద్రరావు వివరిస్తూ ల్యాబ్–గ్రోన్ డైమండ్ పరిశ్రమకు అవసరమైన నిపుణులను తయారు చేయడానికి తాము త్వరలో ప్రత్యేక కోర్సులను కూడా ప్రారంభిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది ఐసీడీఈఎం– 2027 సదస్సును జనవరి 27 నుంచి 29 వరకు నిర్వహించనున్నామని ప్రకటించారు. ప్రొఫెసర్ సత్యన్ సుబ్బయ్య మాట్లాడుతూ భారతదేశంలోని నవతరం పారిశ్రామికవేత్తలు వజ్రాలను కేవలం ఆభరణాలకే కాకుండా ఇతర సాంకేతిక రంగాల్లో కూడా ఉపయోగిస్తున్నారన్నారు. వారితో కలసి పనిచేయడం ద్వారా భారత్ కొత్త ఎత్తులకు చేరుకుంటుందన్నారు. -
హిందూస్థాన్ స్కూల్కు గోల్డ్ రేటింగ్
సాక్షి, చైన్నె: విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ, విద్యార్థులకు అత్యుత్తమ అభ్యా స అనుభవాన్ని అందిస్తున్నందుకుగాను చైన్నె గిండిలోని హిందూస్థాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతిష్టాత్మకమైన క్యూఎస్ఐఅండ్ గైజ్ గోల్డ్ రేటింగ్ను దక్కించుకుంది. ఈగుర్తింపు 2026 నుంచి 2028 వరకు రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఈ గుర్తింపు అనేది విద్యాసంస్థల నాణ్యతను వివిధ అంశాల ఆధారంగా అంచనా వేసే స్వతంత్ర రేటింగ్ వ్యవస్థ కావడం గమనార్హం. హిందూస్థాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈ కింది విభాగాల్లో అద్భుతమైన రేటింగ్స్ను సాధించింది: టీచింగ్ అండ్ లెర్నింగ్, ఈ–లెర్నింగ్ సన్నద్ధత విభాగాల్లో అత్యున్నతమైన డైమండ్ రేటింగ్ను దక్కించుకుంది. ఈసందర్భంగా హిందుస్థాన్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్ మాట్లాడుతూ శ్రీఒక విద్యార్థి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో పాఠశాల కీలక పాత్ర పోషిస్తుందని మేము బలంగా నమ్ముతామన్నారు. ఈ గోల్డ్ రేటింగ్ రావడం గర్వకారణంగా పేర్కొంటూ, తమ సిబ్బంది, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల నమ్మకం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. -
సుపరిపాలన ఎలా?
ఐక్యత లేకుంటే – అన్నామలై వ్యాఖ్య సాక్షి, చైన్నె: కేవలం 30 అసెంబ్లీ స్థానాల మధ్యే సరైన సీట్ల సర్దుబాటు చేసుకోలేక, అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి పాలన ఎలా అందిస్తుందని బీజేపీ సీనియర్ నేత అన్నామలై ప్రశ్నించారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అన్నామలై మంగళవారం పుదుచ్చేరి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈసందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన, పుదుచ్చేరిలోని కాంగ్రెస్–డీఎంకే(ఇండియా) కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వింతైన కూటమి.. ప్రపంచంలో ఎక్కడా లేని వింతైన కూటమి పుదుచ్చేరిలో ఉందన్నారు. ఇక్కడ భాగస్వామ్య పక్షాల మధ్య కనీస గౌరవం లేదని ఎద్దేవా చేశారు. కూటమి ధర్మాన్ని పక్కన పెట్టి, మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లో కూడా కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టిందని, ఇది ఆ కూటమిలో ఉన్న అనైక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం 30 నియోజకవర్గాలను కూడా సమర్థవంతంగా పంచుకోలేక విఫలమైన ఈ పార్టీలు, రాష్ట్ర బాధ్యతలను ఎలా చేపడతాయని ఆయన ప్రశ్నించారు. సీట్ల సర్దుబాటు నుంచి నామినేషన్ల దాఖలు వరకు ప్రతి విషయంలోనూ ఇండియా కూటమి విఫలమైందని అన్నామలై విమర్శించారు. ఎన్నికల రోజున ఈ కూటమికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, భారీ ఓటమితో ఇండియా కూటమి తుడిచిపెట్టుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కూటమి మాత్రమే పుదుచ్చేరి అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన స్పష్టం చేశారు. -
ఘనంగా మహావీర్ జయంతి వేడుకలు
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని మహావీర్ జయంతి పురస్కరించుకొని వేలూరు బీఎస్ఎస్ ఆలయ వీధిలోని జైన్ సంఘానికి చెందిన భక్తులు అఽధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జైన్ మతస్తులు స్వామి వారిని వాహనంలో ఉంచి మేళ తాళాల నడుమ నృత్యం చేస్తూ ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆ సమయంలో జైన్ మతానికి చెందిన వ్యాపారులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామి వారికి పుష్పాభిషేకం చేసి ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా గాంధీ రోడ్డులోని నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు స్వీట్లు పంచి పెట్టారు. అదేవిధంగా వాలాజలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో పీఠంలోని భగవాన్ మహావీర్ సన్నధిలో ప్రత్యేక అభిషేకం, ఆరాధన నిర్వహించారు. -
ఫ్రెండ్స్ లేకుంటే చిత్రం లేదు!
కెన్ కరుణాస్తో యూత్ చిత్ర యూనిట్ తమిళ సినిమా: కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా పరిచయమైన చిత్రం యూత్. అనిష్మా అనిల్కుమార్, ప్రియాన్షీ యాదవ్, మీనాక్షి దినేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని పర్వతా ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై కరుప్పయ్య సి.రామ్, సులోచనాకుమార్ నిర్మించారు. సురాజ్ వెంజారముడు, దేవదర్శిని, నళిని ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ.ప్రకాష్కుమార్ సంగీతాన్ని విక్కీ చాయాగ్రహణం అందించారు. మార్చి 19న తెరపైకి వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపడుతున్న సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో థ్యాంక్స్ గివింగ్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో చిత్ర నిర్మాత కరుప్పయ్య సీ రామ్ మాట్లాడుతూ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తాను నిర్మించిన యూత్ చిత్రానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు అన్నారు.ఇక ముందు తాను నిర్మించే చిత్రాల లాభాల్లోనూ కొంత షేర్ అందిస్తానని చెప్పారు. కెన్ కరుణాస్ మాట్లాడుతూ ఫ్రెండ్స్ లేకపోతే ఈ చిత్రం లేదన్నారు. యూత్ చిత్రం హిట్ అవుతుందని భావించాం కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదన్నారు. తల్లిదండ్రులకు సంతోషం కలిగించాలనే కారణంతోనే ఈ చిత్రం చేశామని, అది పూర్తికావడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం ప్రదర్శన మరి కొద్ది రోజుల్లో ముగిసిపోతుందని, అయితే ఈ చిత్రం అనుభవాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ చిత్రం తనకు చాలా మంది స్నేహితులను ఇచ్చిందని కెన్ కరుణాస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
విజయ్ ప్రచారానికి భద్రత కరువు
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ప్రచారంలో చోటుచేసుకున్న పరిణామాలు వివాదానికి దారి తీశాయి. విజయ్ ప్రచారంలో భద్రతా లోపాలపై టీవీకే ఆగ్రహం వ్యక్తం చేసింది. టీవీకే అధినేత విజయ్ సోమవారం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. చైన్నెలోని పెరంబూర్, కొలత్తూరు నియోజకవర్గాల్లో విజయ్ నిర్వహించిన ప్రచారం భారీ జనసందోహం మధ్య సాగింది. అయితే, ఈ ప్రచారంలో భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని, ఇది డీఎంకే ప్రభుత్వ కుట్రని టీవీకే నాయకత్వం ఆరోపించింది. పెరంబూరు, కొళత్తూరు పర్యటన ముగించుకుని విల్లివాక్కంకు విజయ్ వెళ్లాల్సి ఉండగా పర్యటన రద్దు కావడం చర్చకు దారి తీసింది. అయితే, విజయ్ ప్రచారానికి ఊహించని రీతిలో జనం తరలి రావడమే ఇందుకు కారణంగా తేలింది. అధవ్ అర్జున ఆరోపణలు టీవీకే ఎన్నికల విభాగం ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున మాట్లాడుతూ విజయ్ ప్రచారానికి సరైన భద్రత కల్పించకుండా అణచివేయాలని డీఎంకే చూస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొలత్తూరులో ఒక్క పోలీసు కూడా భద్రత విధుల్లో లేరని ఆరోపించారు. మరో కరూర్ ఘటన జరగకుండా ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విజయ్ ప్రచార పర్యటనకు సరైన భద్రత కల్పించడం లేదని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్కు టీవీకే నేత నిర్మల్కుమార్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. డీజీపీకి ఎన్నికల సంఘం నోటీస్ విజయ్ ప్రచారంలో భద్రతా లోపాలు, జరిగిన తోపులాటపై తమిళనాడు ప్రధాన ఎన్నికల కమిషనర్ అర్చన పట్నాయక్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై వివరణ కోరుతూ రాష్ట్ర పోలీస్ డీజీపీకి, జిల్లా ఎన్నికల అధికారికి నోటీసులు జారీ చేశారు. అభ్యర్థులందరికీ సమానంగా భద్రతా నియమాలు అమలు చేస్తున్నారా, లేదా అనే దానిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. విజయ్పై కేసు నమోదు ఇంత కాలం ఎలాంటి కేసులు లేకుండా వచ్చిన విజయ్పై ప్రప్రథమంగా 5 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రచార సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై పెరంబూరు పోలీసులు విజయ్తో పాటు 5వేల మందిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేని సమయాల్లో రోడ్షో నిర్వహించడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం వంటి కారణాలతో పాటు నిబంధనలను ఉల్లంఘించి లౌడ్స్పీకర్లను వాడినట్టుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. -
ముమ్మరంగా తనిఖీలు
● అభ్యర్థుల వాహనాలపై ప్రత్యేక దృష్టి ● తొలి రోజున 573 నామినేషన్లు దాఖలుసాక్షి,చైన్నె: రాష్ట్రంలో రోడ్డు మార్గంలో కాకుండా, చైన్నె నుంచి కన్యాకుమారి వరకు సముద్రతీరంలోనూ నిఘాను కట్టుదిట్టం చేశారు. మైరెన్ పోలీసులు, నిఘా బృందాలు ప్రత్యేకబోట్ల ద్వారా నిఘా పర్యవేక్షణలో నిమగ్నమయ్యాయి. తమిళనాడు శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజున సీఎం స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ నామినేషన్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజున 573 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయగా, ఇందులో చైన్నె నుంచే 47 మంది ఉన్నారు. రెండో రోజు మంగళవారం సెలవు కావడంతో నామినేషన్లు స్వీరించలేదు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఆధవ్అర్జున ఆస్తి రూ.197 కోట్లుగా ప్రకటించగా, సీమాన్ ఆస్తి రూ.38 లక్షలుగా వెల్లడించారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే విధంగా ఆయనపై కేసు నమోదు చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థులు అందరూ ఈనెల 6న నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ మినహా తక్కిన పార్టీల అభ్యర్థుల జాబితా వెలువడింది. కూటమి పార్టీలంతా బుధవారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. రంగంలోకి ప్రత్యేక బృందాలు ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో నగదు, తాయిలాల తరలింపు కట్టడి దిశగా ఇప్పటికే రోడ్డు మార్గంలో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. రూ.300 కోట్ల నగదు , వస్తువులు సీజ్ చేశారు. 2వేలకు పైగా ఫ్లయింగ్ స్క్వాడ్లు, మరో రెండు వేలకు పైగా సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు ముమ్మరం చేశాయి. అదే సమయంలో చైన్నె నుంచి కన్యాకుమారి వరకు 15 సముద్ర తీర జిల్లాల ఉన్నాయి. సముద్ర గుండా నగదు, వస్తువులు ఒడ్డుకు చేరుతున్నాయన్న సమాచారంతో ఎన్నికల యంత్రాంగం అలర్ట్ అయింది. దీంతో చైన్నె నుంచి కన్యాకుమారి వరకు సముద్ర మార్గం, తీర గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి తనిఖీలు సముద్ర మార్గంలోనూ ముమ్మరం చేశారు. బదిలీలు ఎన్నికల వేళ పలువురు ఐపీఎస్లకు స్థానచలనం కల్పించారు. ఈమేరకు విరుదునగర్ ఎస్పీగా పనిచేసి వెయిటింగ్లిస్టులో ఉన్న డి.కణ్ణన్ను గ్రేటర్ చైన్నె పోలీస్ వెల్ఫేర్ ఎస్టేట్ డిప్యూటీ కమిషనర్గా, నాగపట్నం ఎప్పీగా పనిచేసి వెయిటింగ్ లిస్టులో ఉన్న కేఎస్ బాలకృష్ణన్ను గ్రేటర్ చైన్నె హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ కమిషనర్గా, కరూర్ ఎస్పీగా పనిచేసి వెయిటింగ్ లిస్టులో ఉన్న కే.జోష్ తంగయ్యను గ్రేటర్ చైన్నె సెక్యూరిటీ డిప్యూటీ కమిషనర్గా ఈరోడ్ ఎస్పీగా పనిచేసి వెయింటిగ్ లిస్టులో ఉన్న ఏ.సుజాతను తీవ్ర వాద నిరోధక విభాగం ఎస్పీగా స్థానచలనం కల్పిస్తూ హోంశాఖ కార్యదర్శి ధీరజ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, వెయిటింగ్ లిస్టులో ఉన్న ఐపీఎస్లు కె.షణ్ముగంను క్యూబ్రాంచ్ సీఐడీ, చైన్నెకు, ఆర్.రాజారాంను విలిజెన్స్ ఎస్పీగా, జీఎస్ మాధవన్ను క్రైంబ్రాంచ్ సీఐడీ, చైన్నె ఎస్పీగా, జీఎస్ అనితను పోలీసు మోడరనైజేషన్ ఎస్పీగా బదిలీ చేశారు. -
విరుదునగర్లో రసవత్తరం
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల్లో విరుదునగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అన్నాడీఎంకేలో గట్టి పోటీ నెలకొంది. అయితే, పార్టీలోని హేమాహేమీలను పక్కనపెట్టి అధిష్టానం శివకాశికి చెందిన పారిశ్రామికవేత్తను అభ్యర్థిగా ప్రకటించడం స్థానిక నేతల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. పోటాపోటీ విరుదునగర్ స్థానం కోసం మాజీ మంత్రి కె.టి.రాజేంద్ర బాలాజీ, మరో మాజీ మంత్రి మాఫా పాండియరాజన్ వర్గాల మధ్య గత కొంతకాలంగా ప్రచ్ఛన్నయుద్ధం నడిచింది. వీరిద్దరూ విడివిడి గ్రూపులుగా పనిచేస్తూ పట్టు కోసం ప్రయత్నించారు. గత ఏడాది విరుదునగర్లో జరిగిన ఒక బహిరంగ సభలో, పాండియరాజాకు శాలువా కప్పిన వ్యక్తిపై రాజేంద్రబాలాజీ దాడి చేయడం అప్పట్లో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది ఇద్దరు నేతల మధ్య దూరాన్ని మరింత పెంచింది. లోక్సభ ఎన్నికల్లో అవకాశం దక్కకపోవడంతో, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విరుదునగర్ నుంచి కచ్చితంగా పోటీ చేయాలని పాండియరాజన్ భావించారు. ఇందుకోసం ఆయన విరుదునగర్లో సొంత ఇల్లు కట్టుకుని మరీమకాం వేశారు. తనకు టికెట్ వస్తుందని ఆయన అనుచరులు గట్టి నమ్మకంతో ఉన్నారు. పాండియరాజాకు అడ్డుకట్ట వేసేందుకు రాజేంద్ర బాలాజీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు అడ్వకేట్ విజయకుమారన్ను తెరపైకి తెచ్చారు. విజయకుమారన్ కూడా తనకు టికెట్ వస్తుందని ఆశపడ్డారు. అనూహ్యంగా మారిన అభ్యర్థి అనూహ్య పరిణామాల మధ్య శివకాశికి చెందిన బాణసంచా వ్యాపారి, ప్రముఖ పారిశ్రామికవేత్త వి.జి. గణేషన్ను విరుదునగర్ అభ్యర్థిగా అన్నాడీఎంకే అధిష్టానం ప్రకటించింది. పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్న మాజీ మంత్రులు, జిల్లా స్థాయి నేతలను కాదని, ఒక పారిశ్రామికవేత్తకు టికెట్ ఇవ్వడంపై మాఫా పాండియరాజన్, విజయకుమారన్ వర్గీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమకు సీటు దక్కకపోవడానికి రాజేంద్రబాలాజీ కారణం అనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అదే సమయంలో ఈ విరుదునగర్ సీటు డీఎంకే కూటమిలో డీఎండీకేకు కేటాయించారు. తనకు రాజకీయంగా మార్గాన్ని చూపించడమే కాదు, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిన విజయకాంత్ వారసుడు విజయప్రభాకరన్ ఇక్కడ పోటీలో ఉండడంతో మాఫా పాండియరాజన్ డైలమాలో ఉన్నట్టు తెలిసింది. విజయకాంత్ వారసుడ్ని గెలిపించే దిశగా ఆయన మద్దతుదారులు నిర్ణయించినట్టుగా ప్రచారం ఊపందుకోవడంతో అన్నాడీఎంకే అభ్యర్థిలో టెన్షన్ తప్పలేదట. దీంతో పాండియరాజన్ను బుజ్జగించేందుకు పరుగులు తీసినట్టు విరుదునగర్లో చర్చ జోరందుకుంది. లోక్సభ ఎన్నికల సమయంలో విజయ ప్రభాకరన్కు విరుదునగర్లో మరీ ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. తాజాగా అన్నాడీఎంకేలో అసంతృప్తి తనకు కలిసి వస్తుందన్న ఆశాభావంలో వారసుడు ఉన్నారు. -
కార్తీక్మోహన్కు కనిమొళి ఆశీస్సులు
సాక్షి, చైన్నె: విల్లివాక్కం డీఎంకే అభ్యర్థి కార్తీక్మోహన్కు ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ నేత కనిమొళి కరుణానిధి తన ఆశీస్సులను అందజేశారు. అన్నానగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్ ఈసారి తనకు బదులుగా కుమారుడు కార్తీక్ మోహన్కు సీటు ఇప్పించుకున్నారు. అయితే, అన్నానగర్ నుంచి కాకుండా పక్కనే ఉన్న విల్లివాక్కం నియోజకవర్గం నుంచి కార్తీక్మోహన్ పోటీకి దిగారు. ఈ పరిస్థితులలో మంగళవారం కనిమొళిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా కార్తీక్కు తన ఆశీస్సులు, అభినందలను ఆమె అందజేశారు. నామినేషన్ దాఖలు తర్వాత ప్రచారంలో దూసుకెళ్లేందుకు కార్తీక్మోహన్ సిద్ధమయ్యారు. డీఎంకే మేనిఫెస్టో ఓ సూపర్స్టార్ సాక్షి, చైన్నె: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా దూసుకుపోయిందని, ఇది నిజమైన ‘సూపర్ స్టార్‘ అని మాజీ మంత్రి సెంథిల్బాలాజీ అభివర్ణించారు. కరూర్ నియోజకవర్గ డీఎంకే అభ్యర్థి త్యాగరాజాకు మద్దతుగా సెంథిల్ బాలాజీ మంగళవారం కోడంకిపట్టి ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయనకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి స్టాలిన్ కరూర్ జిల్లా అభిబృద్ధి కోసం రూ. 5వేల కోట్లు కేటాయించారని, కేవలం కరూర్ కార్పొరేషన్ పరిధిలోనే రూ.1,140 కోట్ల విలువైన పనులు జరిగాయని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షాల మేనిఫెస్టోతో పోలిస్తే డీఎంకే మేనిఫెస్టో ఒక సూపర్స్టార్ అని, ఇది సమాజంలోని అట్టడుగు వర్గాల వరకు చేరువైందన్నారు. ప్రజలందరూ ఉదయసూర్యుని గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు కరూర్ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో డీఎంకే క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అధిష్టానం ఆదేశంతో కోయంబత్తూరు నుంచి పోటీ చేయనున్నానని పేర్కొన్నారు. బుధవారం కరూర్ జిల్లా రాయనూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్గొని అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఏర్పాట్లను సెంథిల్ బాలాజీ పరిశీలించారు. -
హీరోగా అరుళ్దాస్
తమిళసినిమా: పెద్ద హీరో, చిన్న హీరో అన్న తారతమ్యం లేకుండా కథే హీరోగా చిత్రాలు రూపొందుతున్న కాలం ఇది. కంటెంట్ బాగుంటే ఎవరు హీరో అన్నది ప్రేక్షకులు చూడకుండా చిత్రాలు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నటుడు అరుళ్దాస్ హీరోగా అవతారమెత్తారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి రీ యూనియన్ అనే టైటిల్ను నిర్ణయించారు. హస్లర్స్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై కార్తీక్ జయాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాట్స్ రెక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. జయకుమార్, అనుపమకుమార్, అఖిల్సంతోష్, పర్విన్, సుబ్రమణియన్, జెమిని మణి, శివం, సేతుపతి జయచంద్రన్, కరాటే రాజా, సిలుమిషన్ శివ, కుట్టి గోపి, హరీష్, అరుణ్ ఉదయన్, శరత్, క్రిష్ అండ్ అయ్ షీ, పూవైయార్, కాక్కాముట్టైరమేష్ ముఖ్యపాత్రలు పోషించారు. విక్కీ మెక్ చాయాగ్రహణం, రాకీ డీజే సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ను విజయ్సేతుపతి తన ఎక్స్ మీడియా ద్వారా యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర పోస్టర్ను చూస్తుంటే ఇది యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. -
క్లుప్తంగా
నార్డ్ 6 ఆవిష్కరణ సాక్షి, చైన్నె: యువ నిపుణులు, టెక్ ప్రియుల కోసం వన్ప్లస్ తన ప్రతిష్టాత్మక ‘నార్డ్’ సిరీస్లో వన్ప్లస్ నార్డ్ 6ను పరిచయం చేసింది. శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, అధునాతన ఏఐ ఉత్పాదకత సాధనాలు, అత్యున్నతస్థాయి మన్నిక ఈ ఫోన్ ప్రత్యేకతలుగా మంగళవారం స్థానికంగా ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ విభాగంలోనే అతిపెద్దదైన 9వేల ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచామన్నారు. వన్ప్లస్ నార్డ్ 6 స్పెసిఫికేషన్లు, ధర, విక్రయాలకు సంబంధించిన ఇతర వివరాలు ఏప్రిల్ 7న అధికారికంగా ప్రకటిస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు ముమ్మరం వేలూరు: వేలూరు తొర్రపాడిలోని తందైపెరియార్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో వేలూరు జిల్లాలోని వేలూరు, కాట్పాడి, అనకట్టు, గుడియాత్తం, కేవీ కుప్పం నియోజక వర్గాలకు చెందిన ఈవీఎంలను భద్రపరిచి కౌంటింగ్ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన బందోబస్తును ఎస్పీ శివరామన్, పోలీస్ అధికారులు ఆకస్మికంగా తనఖీ చేశారు. ఎస్పీ శివరామన్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా లోని ప్రతి కౌంటింగ్ కేంద్రాల్లోనూ 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నామన్నారు. జిల్లాలోని వేలూరు, అనకట్టు, కాట్పాడి వంటి నియోజక వర్గాల్లోని కౌంటింగ్ కేంద్రాల్లోనూ 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈవీ ఎం మిషన్లు ఉంచే గదుల వద్ద నిఘా కెమె రాలు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. అదేవిధంగా ప్రజలు ఎటువంటి భయాందోళన చెందకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లు – ఏప్రిల్ 20 నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు సాక్షి, చైన్నె: విద్యా హక్కు చట్టం మేరకు ప్రైవేట్ పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు కేటాయించిన 25 శాతం రిజర్వేషన్ కోటా ప్రవేశాల కోసం ఏప్రిల్ 20 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది. ఏప్రి ల్ 2న పాఠశాలలు తమ వద్ద ఉన్న మొత్తం సీట్లు, 25వాతం కోటా కింద అందుబాటులో ఉన్న ఖాళీల వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 7న ప్రతి పాఠశాల తన నోటీసు బోర్డులో, విద్యాశాఖ వెబ్సైట్లో కేటాయించిన సీట్ల వివరాలను ప్రదర్శించాలని సూచించారు. ఏప్రిల్ 20 నుంచి మే 18 వరకు అర్హులైన విద్యార్థులు ఆన్న్లైన్ ద్వారా దరఖా స్తు చేసుకోవడానికి గడువు కేటాయించారు. మే 20న దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన, అనర్హులైన వారి జాబితాను (కారణాలు సహా) నోటీసు బోర్డులో ఉంచాలని ఆదేశించారు. మే 22న ఒకవేళ దరఖాస్తులు సీట్ల కంటే ఎక్కువగా ఉంటే, లాటరీ పద్ధతి ద్వారా విద్యా ర్థులను ఎంపిక చేయాలని, అదే రోజున ఎంపికై న వారి జాబితా, వెయిటింగ్ లిస్ట్ను విడుదల చేయాలని ఆదేశించారు. మే 25– 27వరకు ఎంపికై న విద్యార్థుల అడ్మిషన్లు నిర్వహించాలని సూచించారు. 30 మంది విద్యార్థినులకు అస్వస్థత తిరువొత్తియూరు: నామక్కల్, మోహనూర్ రోడ్డులో ఉన్న ఆదిద్రావిడర్ సంక్షేమ శాఖ ప్రభుత్వ మహిళా వసతి గృహంలో చదువుకుంటున్న 30 మంది విద్యార్థినులకు మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అకస్మాత్తుగా అనారోగ్యం కలిగింది. బాధితులైన విద్యార్థినులందరూ నామక్కల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వసతి గృహంలో నామక్కల్ ప్రభుత్వ మహిళా ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి ప్లస్టూ వరకు చదువుతున్న విద్యార్థినులు ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్నత తరగతులకు పరీక్షలు ముగియడంతో, 6 నుండి 9వ తరగతి వరకు చదువుతున్న 56 మంది విద్యార్థినులు మాత్రమే వసతి గృహంలో ఉన్నారు. వీరిలో ఎక్కువమంది కొల్లిమలై ప్రాంతానికి చెందినవారు. సోమవారం మధ్యాహ్నం విద్యార్థినులకు అన్నం, క్యాబేజీ కూర, గుమ్మడికాయ సాంబార్తో భోజనం ఇచ్చారు. ఇది తిన్న కొద్దిసేపటికే 30 మంది విద్యార్థినులకు వరుసగా వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వసతిగృహంలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీని గురించి సమాచారం మేరకు ఆహార భద్రత అధికారి తంగ విఘ్నేష్ నేతృత్వంలోని బృందం వసతిగృహానికి నేరుగా వెళ్లి తనిఖీ చేసింది. అక్కడ ఉన్న సాంబార్, అన్నం తదితర ఆహార నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షకు పంపారు. ఈ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే విద్యార్థినులు మూర్ఛపోవడానికి అసలు కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. -
సీపీఎం జాబితా విడుదల
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ఆపార్టీ అధిష్టానం మంగళవారం ప్రకటించింది. డీఎంకే కూటమిలో సీపీఎంకు ఐదు స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ స్థానాలలో కన్యాకుమారిలోని పద్మనాభపురంను మార్చుకునే దిశగా సాగిన ప్రయత్నాలు విఫలమైనట్టుంది. ఈ దృష్ట్యా, అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యం తప్పలేదు. ఎట్టకేలకు డీఎంకే కేటాయించిన ఐదు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంగా రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సీనియర్నేత బాలకృష్ణన్ సమక్షంలో జరిగిన సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. ఐదు స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఐదుగురు అభ్యర్థులు పళణి నియోజకవర్గం నుంచి గతంలో దిండిగల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఎన్ పాండి పోటీ చేస్తారని ప్రకటించారు. గంధర్వకోట్టై నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం. చిన్నదురైకు మళ్లీ అవకాశం కల్పించారు. పద్మనాభపురం నుంచి పార్టీ నేత ఆర్.చెల్లస్వామి, తిరువొత్తియూర్ నుంచి ఎల్.సుందరరాజన్, కీల్ వేలూరు నుంచి టి.లతకు కేటాయించారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగైమాలికి బదులుగా జిల్లా కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న లతకు అవకాశం కల్పించారు. రాందాసు తొలి జాబితా పీఎంకేలో చీలిక గురించి తెలిసిందే. అన్బుమణి పీఎంకే అన్నాడీఎంకే కూటమిలో ఉండగా, రాందాసు పీఎంకే శశికళ నేతృత్వంలోని పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగంతో కలసి ఈ ఎన్నికలను ఎదుర్కొంటోంది. ఈ కూటమి తరఫున పోటీ చేసే తన అభ్యర్థుల మొదటి విడత జాబితాను రామదాస్ విడుదల చేశారు. సేలం వెస్ట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అరుల్, వందవాసి నుంచి మురళీశంకర్, కుంభకోణం నుంచి రాష్ట్ర నిర్వాహక కమిటీ సభ్యుడు ఎం.కె. స్టాలిన్, విరుదాచలం నుంచి సురేష్, మైలాడుతురై నుంచి శక్తివేల్ పోటీచేస్తున్నారు. -
జననికి పైళ్లెంది!
తమిళసినిమా: దర్శకుడు బాలా దర్శకత్వంలో వహించిన అవన్ ఇవన్ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన నటి జనని. తొలి చిత్రంలోనే తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుని ప్రశంసలు అందుకున్నారీమె. ఆ తరువాత తెగిడి, బెలూన్, హార్ట్ స్పాట్ సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించిన జనని పలు మలయాళ చిత్రంలోనూ నటించారు. ఈ బ్యూటీ సోమవారం పెళ్లి పీటలు ఎక్కారు. తన చిరకాల బాయ్ఫ్రెండ్ సాయిరోషన్ శ్యామ్తో కలసి ఏడడుగులు నడిచారు. చైన్నెలో పుట్టి పెరిగిన సాయిరోషన్ శ్యామ్ దుబాయ్లో సెటిల్ అయ్యారు. విమానయానంలో పనిచేస్తున్న ఈయనకు, జననికి గత ఏడాదే వివాహ నిశ్చితార్థం జరిగింది. సోమవారం జరిగిన వీరి వివాహానికి చైన్నె, మహాబలిపురంలోని ఒక నక్షత్ర హోటల్ వేదికగా మారింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, బందువుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జనని, సాయి రోషన్ శ్యామ్కు వివాహం జరిగింది. వీరి వివాహ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సూరితో జత కడుతుందా? తమిళసినిమా: సినిమా ఎవరిని ఎప్పుడు, ఏ స్థాయిలో నిలబెడుతుందో తెలియదు. అప్పటివరకు ప్రయత్నం లోపం లేకుండా శ్రమిస్తూనే ఉండాలి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సహాయ నటుడి నుంచి హాస్యనటుడిగా ఎదిగి ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్న నటుడు సూరి. విడుదలై చిత్రంతో హీరోగా పయనం ప్రారంభించిన ఈయన ఇటీవల విడుదలైన మామన్ వరకు వరుసవిజయాలతో దూసుకుపోతున్నారు. కెరీర్ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్న సూరి ప్రస్తుతం మండాడి అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇది సముద్రతీరంలో జాలర్ల బోట్ల పోటీల నేపథ్యంలో రూపొందుతున్న కథా చిత్రం. ఈ చిత్రానికి మదిమారన్ పుహళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో రూపొందడం విశేషమే. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే సూరి కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండడం విశేషం. రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 2015లో చైన్నెలో బీభత్సం సృష్టించిన వరద నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉంటుందని సమాచారం. ఈ చిత్రం త్వరలో సెట్పైకి వెళ్లబోతోంది. ఇందులో సూరికి జంటగా నటించే కథానాయకి ఎవరన్న ప్రశ్నకు మమిత బైజు పేరు వినిపిస్తోంది. ఈ కేరళా కుట్టి డ్యూడ్ చిత్రంతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. విజయ్ హీరోగా నటించిన జననాయకన్లో ముఖ్య భూమికను పోషించారు. సూర్యకు జంటగా విశ్వనాత్ అండ్ సన్స్ చిత్రంలోనూ, ధనుష్తో కర చిత్రంలోనూ నటించారు. ఈ మూడు చిత్రాలు త్వరలో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సూరి సరసన మమిత బైజును నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి ఉండాల్సిందే. -
అన్నాడీఎంకేలో చేరిన డీఎంకే ప్రముఖులు
తిరువళ్లూరు: తిరువళ్లూరు నియోజకవర్గ డీఎంకే అభ్యర్థిగా వీజీ రాజేంద్రన్ను ప్రకటించడాన్ని నిరసిస్తూ అసంతృప్తి వ్యక్తం చేసిన పలువురు డీఎంకే నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి మాజీ మంత్రి అన్నాడీఎంకే తిరువళ్లూరు అభ్యర్థి బీవీ రమణ నేతృత్వంలో పార్టీలో చేరారు. తిరువళ్లూరు మున్సిపాలిటీకి చెందిన 14వ వార్డు కౌన్సిలర్ అరుణ, డీఎంకే ఎన్ఆర్ఐ విభాగం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జైకృష్ణ, నగర యువజన విభాగం ఆర్గనైజింగ్ ఉప కార్యదర్శి దిలీప్కుమార్, ఐటి వింగ్ జిల్లా ఉపకార్యదర్శి శరత్కుమార్, మనోజ్, సునిల్కుమార్ ఆపార్టీకి రాజీనామ చేసి అన్నాడీఎంకేలో చేరారు. పార్టీలో చేరిన డీఎంకే నేతలకు కండువా కప్పి మాజీ మంత్రి రమణ ఆహ్వానించారు. పార్టీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని, పార్టీలో సముచిత స్థానం దక్కేలా చర్యలు తీసుకుంటామని రమణ వారికి హామీ ఇచ్చారు. నగర కార్యదర్శి కందస్వామి, యూనియన్ కార్యదర్శి మాధవన్, అమ్మపేరవై జిల్లా కార్యదర్శి ఎయిలరసన్, విధ్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ బీవీ బాలాజీ, సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ పట్ర సత్యమూర్తి, పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
పోక్సో కేసులో 178 సంవత్సరాల జైలు – లైంగిక వేధింపుల కేసులో తీర్పు అన్నానగర్: శివగంగై సమీపంలోని చోళపురం గ్రామానికి చెందిన పెరియసామి (70) అక్కడి ఆలయంలో పూజారి. 2024లో, ఆలయానికి వచ్చిన ఇద్దరు బాలురను, ఒక బాలికను అతను బెదిరించి, దాడి చేసి, లైంగికంగా వేధించాడు. బాధితురాలైన బాలిక తనతోపాటు చదువుతున్న మరో అమ్మాయి ద్వారా ఈ విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయురాలికి తెలియజేసింది. ఆ ఉపాధ్యాయురాలు బాలల సంక్షేమ బృందానికి ఫిర్యాదు చేశారు. బాలల సంక్షేమ బృందం విచారణ జరిపింది. పెరియసామి, బాలురను, బాలికను లైంగికంగా వేధించారని అప్పుడు నిర్ధారణ అయింది. దీని తరువాత శివగంగై అఖిల మహిళా పోలీసులు కేసు నమోదు చేసి పెరియసామిని అరెస్టు చేశారు. శివగంగై లోని పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అతని పై ఒక కేసు దాఖలైంది. ఈ కేసును జడ్జి గోకుల మురుగన్ విచారించారు. ఈ కేసులో తీర్పు ఇవ్వబడింది. ముగ్గురు పిల్లలకు గాయా లు చేయడం, వారిని బెదిరించడం, లైంగికంగా వేధించడం, పూజారిగా ఉంటూ ఈ అనుచిత చర్యకు పాల్పడటంతో సహా ప్రతి నేరానికి వేర్వేరుగా శిక్ష, జరిమానా విధించబడ్డాయి. ప్రతి శిక్షను విడివిడిగా అనుభవించాలని కూడా న్యాయమూర్తి అన్నారు. దీని ప్రకారం, ఆలయ పూజారి పెరియస్వామికి న్యాయమూర్తి మొ త్తం 178 సంవత్సరాల జైలు శిక్ష, 8 వేల రూపాయల జరిమానా విధించారు. ముగ్గురు బాధితులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. రూ.2.69 లక్షల స్వాధీనం తిరువళ్లూరు: సరైన ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.2.60 లక్షల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకుని తిరువళ్లూరు రిటర్నింగ్ అధికారి రవిచంద్రన్కు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన క్రమంలో కోడ్ అమల్లోకి వచ్చింది. తిరువళ్లూరులోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30 ప్రత్యేక బృందాలు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం కడంబత్తూరు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.2.60 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకుని రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. డాక్యుమెంట్లు సమర్పించి నగదును తీసుకొవచ్చని బాధితులకు ఆర్వో సూచించారు. థర్మల్ పవర్స్టేషన్లో అగ్నిప్రమాదం తిరువొత్తియూరు: మీంజూరుకు సమీపం అత్తిపట్టు పుదునగర్లో ఉత్తర చైన్నె థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. ఇక్కడ మూడు దశల్లో 2,630 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ 3వ దశలో విద్యుత్ ఉత్పత్తి కోసం అక్కడి గోడౌన్లో బొగ్గు నిల్వ ఉంది. ఈ స్థితిలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గోడౌన్లో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి బొగ్గు కాలి దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంగళవారం ఉదయం 5వరకు శ్రమించి మంటలను ఆర్పారు. విద్యుత్ బోర్డు చైర్మన్ రాధాకృష్ణన్, విద్యుత్ ఉత్పత్తి డైరెక్టర్ రాజేశ్వరి నేరుగా వెళ్లి సందర్శించారు. రాధాకృష్ణన్ విలేకరులతో మాట్లాడుతూ మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఘనంగా అగ్నిగుండ మహోత్సవం సేలం: ఈరోడ్లోని అతిపెద్ద మరియమ్మన్ దేవాలయాలలో ఒకటైన కరైవైక్కల్ మరియమ్మన్ ఆలయంలో ఈరోజు జరిగిన కుండం ఉత్సవంలో వేలాది మంది భక్తులు అగ్నిపై అడుగుపెట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఈరోడ్ నగరంలోని మరియమ్మన్ దేవాలయాలలో పెరియ మరియమ్మన్ దేవాలయం మరియు దాని అనుబంధ దేవాలయాలైన చిన్నమరియమ్మన్, కరైవైక్కల్ మరియమ్మన్ అత్యంత ప్రసిద్ధి చెందినవి. ప్రతి సంవత్సరం ఈ దేవాలయాలలో అగ్నిగుండం, రథోత్సవం, స్తంభం లాగే పోటీలను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. దానికి అనుగుణంగా ఈ సంవత్సరం అగ్నిగుండం, రథోత్సవం 17వ తేదీ రాత్రి పుష్పాభిషేకంతో ప్రారంభమైంది. అదేవిధంగా అదే రోజున, పెరియమరియమ్మన్ అనుబంధ దేవాలయాలైన చిన్నమరియమ్మన్, నడుమరియమ్మన్ దేవాలయాలలో కూడా పుష్పాభిషేకాలు జరిగాయి. దీని తరువాత 21వ తేదీన రాత్రి 8.30 గంటలకు పట్టాలమ్మన్ అభిషేకం జరిగింది. రాత్రి 10 గంటలకు స్తంభ నాటే కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కరైవైక్కల్ మరియమ్మన్ ఆలయంలో 3 స్తంభాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పురోహితులు వాటిని తమ భుజాలపై ఊరేగింపుగా మోసుకుని వెళ్లి పెరియ మరియమ్మన్, చిన్న మరియమ్మన్ మరియు కరైవైక్కల్ మరియమ్మన్ ఆలయాలలో నాటారు. అప్పటి నుండి, మహిళలు ప్రతిరోజూ ఈ మూడు ఆలయాలలో నాటిన స్తంభాలపై పవిత్ర జలం పోస్తూ అమ్మవారిని పూజిస్తున్నారు. ఈ పరిస్థితిలో పండుగలోని ప్రధాన కార్యక్రమంలో భాగంగా ఉండే కరైవైక్కల్ మరియమ్మన్ ఆలయ అగ్నిగుండ ఉత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. -
బరిలో119 మంది కోటీశ్వరులు
సాక్షి, చైన్నె :కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధికంగా కోటీశ్వరులు ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం అభ్యర్థుల్లో 41 శాతం మంది కోటీశ్వరులు కాగా, అత్యధిక ఆస్తులు, అత్యధిక అప్పులు ఉన్న మొదటి ముగ్గురు అభ్యర్థులు ఎన్డీయే కూటమికి చెందిన వారే కావడం గమనార్హం. 30 అసెంబ్లీ స్థానాలతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలకు 8 రోజులే సమయం ఉంది. దీంతో ఇక్కడ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ 16 చోట్ల, ఈ కూటమిలోని బీజేపీ 10 చోట్ల, అన్నాడీఎంకే 2, లక్ష్య జననాయక కట్చి తరఫున రెండు స్థానాలలో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరంతా ఐక్యతతో ముందుకు సాగుతున్నారు. ఇక, ఇండియా కూటమిలో కాంగ్రెస్ తరఫున 16, డీఎంకే తరఫున 13, వీసీకే ఒకరు పోటీలో ఉన్నారు. అయితే, ఈకూటమిలో ఎవరికి వారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్కు చెందిన ముఖ్య నేతలైన రెబల్స్ అభ్యర్థులు ఆరుగురు డీఎంకే అభ్యర్థులను ఢీకొడుతున్నారు. ఇక, ఇదే కూటమిలోని వీసీకే తరఫున మరో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులపై పోటీ ఉన్నారు. సీపీఎం, సీపీఐలు తలా ఓ దారిలో తమకు బలం ఉన్న స్థానాలలో పోటీలో ఉన్నాయి. ఇక, టీవీకే విజయ్ పార్టీ ఓ వైపు, సీమాన్ నామ్ తమిళర్ కట్చి మరో వైపు పోటీలో ఉన్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. అభ్యర్థులు ఓట్ల వేటలో ఉన్నారు. మొత్తం 30 నియోజకవర్గాల్లో 294 మంది పోటీపడుతున్నారు. కోటీశ్వరుల వివరాలు.. ఇక్కడ పోటీలో ఉన్న వారిలో అత్యధికంగా కోటీశ్వరులే ఉన్నారు. పుదుచ్చేరి ఎన్నికల కో–ఆర్డినేటర్ జోసెఫ్ విక్టర్రాజ్ విడుదల చేసిన నివేదిక మేరకు ఆస్తులు, ఇతర వివరాలు. ఇక్కడ ఎన్డీఏ కూటమిలోని లక్ష్య జననాగయ కట్చి అధ్యక్షుడైన అభ్యర్థి జోస్ చార్లెస్ మార్టిన్ ఆస్తులు రూ.609 కోట్లు. కోటీశ్వరులలో మొదటి స్థానంలో ఆయనే ఉన్నారు. ఆయన వార్షిక ఆదాయం రూ. 59 కోట్లు. ఇక, బీజేపీ అధ్యక్షుడు, అభ్యర్థి రామలింగం రూ.115 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి, హోంమంత్రి నమశ్శివాయం రూ.85 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. అధికార ఎన్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న 16 మందితో పాటు బీజేపీ అభ్యర్థులందరీ వంద శాతం కోటీశ్వరులే, ఈ అభ్యర్థుల సగటు ఆస్తి విలువ రూ.7.21 కోట్లుగా ఉండడం గమనార్హం. అప్పులు...నేర చరిత్ర అత్యధిక అప్పులు ఉన్న వారిలో కూడా జోస్ చార్లెస్ రూ.210 కోట్లు, రామలింగం రూ.30 కోటు, నమ శ్శివాయం రూ.20 కోట్లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక, 291 మంది అభ్యర్థులలో 66 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇద్దరిపై హత్య కేసులు, ముగ్గురిపై లైంగిక దాడి కేసులు ఉండడం పుదుచ్చేరి వాసులలో ఆందోళన తప్పడం లేదు. విద్యార్హతలు: 134 మంది అభ్యర్థులు డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నారు. 125 మంది 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన వారు కాగా, నలుగురు నిరక్షరాస్యులు ఉన్నారు. అభ్యర్థుల్లో 41 నుంచి 60 ఏళ్లలోపు వారు 165 మంది ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో 40 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. -
క్రీడలతో చదువుకు నష్టం లేదు
తిరువళ్లూరు: క్రీడల్లో విద్యార్థులు పాల్గొనడం ద్వారా చదువుకు నష్టం ఏర్పడుతుందన్న భావన నుంచి తల్లిదండ్రులు బయటకు రావాలని ప్రముఖ వక్త, కవి రామలింగం సూచించారు. తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్ఎంకే కళాశాలలో 31వ క్రీడాదినోత్సవం, వార్షికోత్సవం ప్రిన్సిపల్ మహ్మద్జునైత్ అధ్యక్షతన నిర్వహించారు. కళాశాల వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎస్ మునిరత్నం మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం ద్వారా మొదడు చురుగ్గా పనిచేస్తుందన్నారు. కవి రామలింగం మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో సాంకేతిక మార్పులతో పోటీపడే విధంగా తీర్చిదిద్దడంతోపాటు వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం ఆర్ఎంకే కళాశాల సావనీర్ను విడుదల చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యాక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ జ్యోతినాయుడు, ఉపాధ్యక్షుడు కిషోర్, కార్యదర్శి యలమంచి ప్రదీప్, ఉపాధ్యక్షురాలు దుర్గాదేవి, ట్రస్టీలు సౌమ్య, మాజీ వీసీ డాక్టర్ పళనిస్వామి, రిటైర్డ్ ఐఏఎస్ అదికారి పిచ్చాండి, డీన్ డాక్టర్ మణివణ్ణన్ పాల్గొన్నారు. -
శ్రీహెర్లో థ్రైవ్ 2026 క్రీడా సంబరం
సాక్షి, చైన్నె: శ్రీ రామచంద్ర ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని శ్రీవిద్యా సుధశ్రీ కేంద్రం నేతృత్వంలో ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లల కోసం థ్రైవ్ 2026 క్రీడోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. దివ్యాంగులైన పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, వారి ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. తమిళనాడు ప్రభుత్వ దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. మధుమతి ఈ వేడుకలో మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు విద్యా సంస్థల్లో (పాఠశాలలు, కళాశాలలు) 5 శాతం రిజర్వేషన్ ఉందని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరికి 4 శాతం రిజర్వేషన్ కల్పించామని గుర్తుచేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లోని ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. సినీ నటుడు సంతానం మాట్లాడుతూ గత 22 ఏళ్లుగా ప్రత్యేక పిల్లలకు ఉచిత విద్య, చికిత్స , శిక్షణ అందిస్తున్న శ్రీహెర్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో శ్రీ రామచంద్ర ట్రస్ట్ చాన్స్లర్ వీఆర్.వెంకటాచలం సంయుక్త వెంకటాచలం, వైస్ చాన్స్లర్ డాక్టర్ ఉమ విద్యావేత్తలు, వైద్యనిపుణులు పాల్గొన్నారు. -
ఆండిపట్టిలో అన్నదమ్ముల సమరం
● మూడో సారిగా ప్రత్యర్థులుగా బరిలోకి ● ఒక్కచాన్స్ అంటున్న తమ్ముడు సాక్షి, చరైన్నె: తమిళనాడు రాజకీయాల్లో ఆండిపట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఎంజీఆర్, జయలలిత అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ దృష్ట్యా, ఎప్పడు ఆండిపట్టికి ప్రత్యేక గుర్తింపుతో పాటు ఇక్కడి రాజకీయం రసవత్తరంగా ఉంటుంది. ఇక్కడ ప్రధాన సమరం అన్నదమ్ముళ్ల మధ్య ఉంటున్నది. డీఎంకే తరఫున అన్న మహారాజన్, అన్నాడీఎంకే తరఫున తమ్ముడు లోగిరాజన్ ఇక్కడ ముచ్చటగా మూడోసారి తలబడేందుకు రెడీ అయ్యారు. 2019లో అన్నదమ్ములిద్దరూ అసెంబ్లీ ఉప ఎన్నికలలో ప్రత్యర్థులుగా తలబడ్డారు. ఇందులో అన్న మహారాజన్ విజయం సాధించారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో రెండోసారి కూడా వీరిద్దరి మధ్యే పోటీ జరిగింది. అదృష్టం అన్న మహారాజన్ వైపు నిలబడింది. తాజాగా మూడో సారిగా అన్నదమ్ముళ్లు ఢీకొడుతున్నారు. తమ్ముడిలో గెలుపు ధీమా తమ్ముడు లోగిరాజన్ 2021 ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేశారు. అన్న మహారాజన్కు ముచ్చెమటలు పట్టించే విధంగా ఓట్ల లెక్కింపులో దూసుకొచ్చారు. చివరకు 8,500 ఓట్ల స్వల్ప తేడాతో విజయావకాశాన్ని కోల్పోయారు. అయితే, గత ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి, తన ఓట్లకు గండి కొట్టిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఈసారి అన్నాడీఎంకే కూటమిలో ఉండడంతో తన విజయం ఖాయం అన్న ధీమా లోగిరాజన్లో నెలకొంది. హ్యాట్రిక్ వైపు అన్న దృష్టి గత రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని, ఈసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని మహారాజన్ నమ్మకంతో ఉన్నారు. సీఎం స్టాలిన్ బలం, కూటమి మద్దతు తన విజయం సునాయసమేనని పేర్కొంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సొంత అన్నదమ్ములే ఒకరిపై మరొకరు తాజా ఎన్నికలలో విమర్శలు చేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తుండడం ఆండి పట్టి వాసుల్ని ముక్కు మీద వేలు వేసుకునేలా చేసింది. ఇక, తమిళనాడు రాజకీయాల్లో ఆండిపట్టి నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. -
నైల్లెకు దూరంగా నైనార్
సాక్షి, చైన్నె : తిరునల్వేలి(నెల్లై) నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తప్పుకున్నారు. ఈ నియోజకవర్గాన్ని తాను ఎందుకు వదులు కోవాల్సి వచ్చిందో అనే వివరాలను ఆయన మంగళవారం ప్రకటించారు. నైనార్ నాగేంద్రన్ అంటే తిరునల్వేలి, తిరునల్వేలి అంటే నైనార్. ఇది అక్కడి రాజకీయం. అన్నాడీఎంకేలో ఆయన చక్రం తిప్పినానంతరం, బీజేపీలో చేరి రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడయ్యారు. అన్నాడీఎంకే తరఫున ఇక్కడ పోటీ చేస్తూ వచ్చిన నైనార్, చివరకు గత ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లారు. ఈ పరిస్థితులలో తిరునల్వేలికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన్ను మీడియా కదలించగా ఈసారి తిరునల్వేలిని వదులుకుని సాత్తూరు నుంచి పోటీ చేయడంపై స్పందించారు. స్థాన చలనం మిత్రపక్షం అన్నాడీఎంకే కోరిక మేరకు తాను నెల్లైకు బదులుగా సాత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థుల జాబితా అధికారికంగా వెలువడిన వెంటనే సాత్తూరులో నామినేషన్ వేస్తానని తెలిపారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ప్రజాసేవ కొనసాగుతుందన్నారు. నెల్లై ప్రజలకు తాను ఎప్పటికీ ముద్దుబిడ్డనే అని వ్యాఖ్యలు చేశారు. ఇక, డీఎంకేపై విమర్శలు గుప్పిస్తూ, డీఎంకే ప్రభుత్వంపై తాము ఈరోజు సాయంత్రం చార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. డీఎంకే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. గత ఎన్నికల్లో డీఎంకే మేనిఫెస్టో హీరోలా ఉంటే, ప్రస్తుత మేనిఫెస్టో జీరోలా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీకి డీఎంకే నేత ఒకరు ప్రాణహాని తలపెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సీఎం స్టాలిన్ దీపావళికి శుభాకాంక్షలు చెప్పరు అని పేర్కొంటూ, అయితే క్రిస్మస్ పండుగకు మాత్రం చెబుతారని విమర్శించారు. బీజేపీ అన్ని మతాల పండుగలకు (ముస్లిం, క్రిస్టియన్ పండుగలతో సహా) శుభాకాంక్షలు తెలుపుతుందన్నారు. డీఎంకే కేవలం ఓట్ల కోసమే లౌకికవాదం మాట్లాడుతోందన్నారు. బీజేపీ అభ్యర్థులందరూ ఏప్రిల్ 4న నామినేషన్లు దాఖలు చేస్తారని ఆయన అన్నారు. -
తాంబరం రాజాకు బుజ్జగింపు
సాక్షి, చైన్నె: ఎన్నికల వేళ సీట్ల కేటాయింపు వ్యవహారం కూటమి పార్టీల్లో చిచ్చుపెడుతోంది. తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహంతో ఎండీఎంకేకు చెందిన నేతలు కొందరు, డీఎంకే పార్టీకి చెందిన పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులలో డీఎంకే కూటమిలో ఎండీఎంకేకు 4 స్థానాలు కేటాయించి, అభ్యర్థులను కూడా ప్రకటించారు. అయితే, దక్షిణ చైన్నె తూర్పు జిల్లా కార్యదర్శి కళగ కుమార్కు ఈసారి కూడా పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 1994 నుంచి వైగో వెంటే నడుస్తున్నానని, పార్టీ కోసం ఎన్నో పోరాటాలు చేశానని కుమార్ పేర్కొన్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన కుమార్ తన జిల్లా కార్యదర్శి పదవికి, ఇతర జిల్లా స్థాయి నిర్వాహకులతో కలసి సామూహిక రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు నిమగ్నమయ్యారు. తాంబరం రాజాకు బుజ్జగింపు తాంబరం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్.ఆర్.రాజాకు కాదని, కొత్త ముఖమైన డాక్టర్ కృతికా దేవికి డీఎంకే టికెట్ కేటాయించడం కలకలం రేపింది. తమ నాయకుడికి టికెట్ దక్కలేదని ఎస్.ఆర్.రాజా మద్దతుదారులు ఆందోళనలు చేపట్టారు. దీంతో ఎంపీ ఏ.రాజా రంగంలోకి దిగి ఎస్.ఆర్.రాజాతో చర్చలు జరిపారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. అనంతరం కొత్త అభ్యర్థి కృతికాదేవి ఎస్.ఆర్. రాజాను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కాగా, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా ఎస్.ఆర్ రాజాతో ఫోన్న్లో మాట్లాడి, తాను నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించాలని కోరినట్లు సమాచారం. రాజా తగ్గినా, ఆయన మద్దతు దారులు తగ్గేలా లేదు. తాంబరం డీఎంకేలో అసమ్మతి సెగలు ఇంకా పూర్తిగా చల్లారలేదు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని అన్నాడీఎంకే ప్రయత్నాలు చేపట్టింది. -
హీరో విజయ్ ఏం చదివారో తెలుసా?
సాక్షి, చెన్నై: తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి–ఈస్ట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సోమవారం ఆయన నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తనకు సంబంధించిన ఆస్తులు, వాహనాలు, విద్యా వివరాలను పొందుపరిచారు. తనకు రూ.603.20 కోట్ల స్థిరచరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.విలాసవంతమైన కార్లు, బైకులుఅఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం విజయ్కు అత్యంత ఖరీదైన, విలాసవంత బీఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టొయోటా లెక్సస్ 350, టొయోటా వెల్ఫైర్ కార్లతోపాటు మరికొన్ని బైకులు ఉన్నాయి. మొత్తంలో ఆస్తుల్లో రూ.404.58 కోట్ల చరాస్తులు ఉన్నారు. కొడైకెనాల్లో వ్యవసాయ భూమి, చెన్నై పరిసరాల్లో రూ.198.62 కోట్ల విలువైన వాణిజ్య, నివాస స్థలాలు ఉన్నాయి. 2015–16 ఏడాదికి సంబంధించి రూ.1.5 కోట్ల విలువైన ఆస్తి వివాదాల్లో ఉంది. ఇప్పుడది కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ట్యాక్స్(అప్పీల్స్), హైకోర్టులో పెండింగ్లో ఉంది. 2022–23 ఏడాదికి సంబంధించి రూ.14.13 లక్షల విలువైన మరో ఆస్తి సైతం వివాదాల్లో ఉంది.భార్య పేరిట విడిగా ఆస్తులువిజయ్ భార్య సంగీత పేరిట విడిగా రూ.15.76 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిలో రూ.15.51 కోట్ల విలువైన చరాస్తులు, రూ.25 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. విజయ్ వద్ద రూ.2 లక్షల నగదు, వేర్వేరు బ్యాంకుల్లో రూ.213 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. విజయ్ వద్ద 883 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయి.అప్పులు లేవుతనకు ఎలాంటి అప్పులు లేవని విజయ్ అఫిడవిట్లో వెల్లడించారు. టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్కు రూ.3 కోట్లు, తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్కు రూ.3.02 కోట్లు, తల్లి శోభాశేఖర్కు విజయ్ రూ.8.71 లక్షలు ఇచ్చారు. ఏఎల్పీ ఆంటోనియస్ బ్రిటో, కోకిలాంబల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు చెరో రూ.20 కోట్లు, విద్యా చారిటబుల్ ట్రస్ట్కు రూ.5.84 కోట్లు ఇచ్చారు. భార్య సంగీతకు రూ.12.60 కోట్లు, కుమారుడు జేసన్ సంజయ్కు రూ.8.78 లక్షలు, కుమార్తె విద్యా సాశకు రూ.4.60 లక్షలు ఇచ్చారు. ఏటా స్వయంఉపాధి(నటన), వడ్డీలు, స్థిరాస్తుల నుంచి అద్దెల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోందని విజయ్ అఫిడవిట్లో పేర్కొన్నారు.చదవండి: ఎన్నికల వేళ.. విజయ్కు మరో షాక్డిగ్రీ డిస్కంటిన్యూవిజయ్ విద్యార్హతలను గమనిస్తే.. 1989లో పదోతరగతి పాసయ్యారు. ఆ తర్వాత ప్రైవేట్గా ఇంటర్మీడియట్ చదివారు. 1992లో చెన్నై లయోలా కాలేజీలో బీఎస్సీ డిగ్రీ మధ్యలోనే ఆపేశారు. -
హీరో విజయ్కి వేల కోట్ల ఆస్తులు.. అప్పులు ఎంతంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు రాజకీయాలలో ఫుల్ బిజీ అయిపోయాడు. సొంతంగా టీవీకే పార్టీని స్థాపించి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నాడు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే పోటీ చేస్తోంది. ఇందులో విజయ్ చెన్నైలోని పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నాడు. ఆదివారం అభ్యర్థులను ప్రకటించిన విజయ్.. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశాడు.రూ.600 కోట్లు..ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో పొందుపరిచిన విషయం తెలిసిందే . అయితే ఇక్కడ తన భార్య సంగీత ఆస్తులను కూడా ఆయన జమ చేయడం గమనార్హం. విజయ్ తన స్థిర, చరాస్తుల విలువలను దాదాపు రూ.600 కోట్లుగా అఫిడవిట్లో వెల్లడించాడు. అందులో నగదు రూపంలో తన వద్ద రూ.2 లక్షలు, తన భార్య సంగీత వద్ద లక్ష రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నాడు. విధ బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ.388 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఆయన పేరుమీద రూపాయి అప్పు కూడా లేదని అఫిడవిట్లో వెల్లడించాడు.లగ్జరీ కార్లు.. ఫ్యామిలీకి అప్పుఇక తన వాహనాల వివరాలను కూడా అఫిడవిట్లో పొందుపరిచాడు. తన వద్ద బిఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫేర్ వంటి ఖరీదైన కార్లతో పాటు మారుతి సుజుకి స్విఫ్ట్, టీవీఎస్ ఎక్సెల్ సూపర్ వంటి వాహనాలు కూడా ఉన్నట్లు తెలిపారు. ఇక వాహనాల మొత్తం విలువ రూ.14.35 కోట్లు అని వెల్లడించారు. అలాగే తన వద్ద 883 గ్రాముల బంగారం, 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులకు కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడట. తన సతీమణి సంగీతకు రూ. 12.60 కోట్లు, తండ్రి చంద్రశేఖర్కి రూ.3.02 కోట్లు, తల్లికి రూ. 87.12 లక్షలు, కొడుకుకి రూ. 8.78 లక్షలు, కూతురు దివ్యకి రూ. 4.6 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిపాడు.దీంతో పాటు తన టీవీకే పార్టీలో కీలక నేత అయిన ఎన్ ఆనంద్కి రూ. 3 కోట్లు ఇచ్చినట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నాడు. సంగీత పేరుపై కూడా భారీ ఆస్తులువిజయ్ అఫిడవిట్లో తన భార్య సంగీత ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాడు. తన భార్య వద్ద రూ. 4.07 కోట్ల విలువైన బంగారం, రెండు కేజీల వెండితో పాటు కోటి రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయి. సంగీత మొత్తం చరాస్తుల విలువ రూ.15.51 కోట్లు , స్థిరాస్తుల విలువ 25 లక్షలుగా వెల్లడించారు . తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. -
మరోసారి బరిలో ఎలక్షన్ కింగ్
సాక్షి, చెన్నై : ఎలక్షన్ కింగ్గా సుపరిచితులైన కె. పద్మరాజన్ (65) తన రికార్డును మరింత సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఆయన సోమవారం మెట్టూరు నియోజకవర్గంలో తన 253వ నామినేషన్ దాఖలు చేశారు. రికార్డుల రారాజు: సేలం జిల్లా మెట్టూరు సమీపంలోని కుంజండియూర్కు చెందిన పద్మరాజన్, గత 38 ఏళ్లుగా (1988 నుండి) దేశంలోని అన్ని ప్రధాన ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. అత్యధిక సార్లు ఓడిపోయిన అభ్యర్థిగా ఇప్పటికే ఆయన పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. దిగ్గజాలతో పోటీ: గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్ వంటి ప్రధానులతో పాటు కరుణానిధి, జయలలిత, స్టాలిన్, ఎడప్పాడి పళనిసామి వంటి హేమాహేమీలపై ఈయన పోటీ చేశారు. మెట్టూరులో నామినేషన్ వేసిన అనంతరం పద్మరాజన్ మాట్లాడుతూ.. తన 254వ నామినేషన్ను చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గంలో దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. అక్కడ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ను ఢీకొననున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఇప్పటివరకు ఎన్నికల డిపాజిట్ల కోసం దాదాపు రూ. కోటికి పైగా ఖర్చు చేసినట్లు పద్మరాజన్ వెల్లడించారు. 2011 జరిగిన మెట్టూరు అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన 6,700 ఓట్లే ఇప్పటి వరకు ఆయన సాధించిన అత్యధిక ఓట్ల రికార్డు కావడం గమనార్హం. గెలవడం తన ఉద్దేశం కాదని, ఒక సామాన్యుడు కూడా ఉన్నత స్థాయి వ్యక్తులతో పోటీ పడవచ్చని నిరూపించడమే తన లక్ష్యమని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడమే తన అంతిమ ధ్యేయమని పద్మరాజన్ పేర్కొన్నారు. -
ఒకే కుటుంబం.. మూడు పార్టీలు!
సాక్షి, చెన్నై : ఎన్నికలలో ఆసక్తికరంగా ఒకే కుటుంబానికి చెంది బిగ్ షాట్లు ముగ్గురు పోటీలో ఉన్నారు. అయితే, వీరంతా వేర్వేరు పార్టీల తరపున పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. వీరు తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకే రక్తసంబంధం ఉన్నప్పటికీ, సిద్ధాంతపరంగా భిన్నమైన బాటలు ఎంచుకుని తల్లి, కుమారుడు , అల్లుడు ఎన్నికల క్షేత్రంలో తలపడుతున్నారు. వీరంతా లాటరీ కింగ్ మార్టిన్ ఫ్యామిలీకి చెందిన వారు కావడం గమనార్హం. లాల్గుడి అన్నాడీఎంకే అభ్యర్థిగా లీమా రోజ్ పోటీలో ఉ న్నారు. ఆమె కుమారుడు జోష్ చార్లెస్ మార్టిన్ ఎన్డీఏ కూటమిలో లక్ష్య జననాయగ కట్చి తరపున పుదుచ్చేరిలోని కామరాజర్ నగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇక, లీమా రోజ్ మేనల్లుడు ఆధవ్ అర్జున టీవీకే తరపున విల్లివాక్కంలో పోటీ చేస్తుండటం గమనార్హం. లాటరీ మార్టిన్గా పేరుగడించిన వ్యాపార వేత్త కుటుంబానికి చెందిన వారు ఇలా తలా ఓ పార్టీ తరపున పోటీలో ఉండడం రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. వీరి నామినేషన్లలో ఆస్తులు కోట్లు కోట్లుగా ఉండడం గమనార్హం. -
ఎన్నికల రేసులో ఎన్కౌంటర్ స్పెషలిస్టు
– చిన్నమ్మ పార్టీ తరపున పోటీ సాక్షి, చైన్నె : దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి శశికళ నేతృత్వంలోని అఖిల భారత పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్రకళగం అభ్యర్థిగా ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరుగడించిన మాజీ పోలీసు అధికారి ఎస్. వెల్లదురై రంగంలోకి దిగారు. ఈ ఎన్నికలలో శశికళ పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుతో కలిసి కూటమిగా ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులలో సోమవారం శశికళ జాబితాను ప్రకటించారు. 21 మందితో తొలి జాబితాను ఆమె ప్రకటించారు. ఇందులో శంకరన్ కోయిల్ నుంచి అన్నాడీఎంకే మాజీ ఎంపీ వసంతి మురుగేషన్ పోటీ చేస్తున్నట్టు తెలిపారు. మదురైలో చక్రవర్తి, తిరుచ్చి తూర్పులో నందకుమార్, రాజ పాళయంలో డాక్టర్ హరీష్, ముదుకులత్తూరులో రిటైర్డ్ అదనపు ఎస్పీ డాక్టర్ రాంకుమార్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే,పొత్తుల మేకు సాత్తూరు, ఆలంకులం నియోజకవర్గాలను పసుంపొన్ మక్కల్ దేశం కట్చి, నన్నిలం నియోజకవర్గాన్ని వెల్లలార్ మున్నేట్ర కళగంకుకు కేటాయించినట్టు వివరించారు. అదే సమయంలో శశికళ పార్టీ తరపున నాంగునేరిలో పోటీ చేస్తున్న అభ్యర్థిపై అందరి దృష్టి పడింది. పోలీసు శాఖలో రిటైఱ్డ్ ఎస్పీగా ఉన్న వెల్ల దురై ఇక్కడ అభ్యర్థి కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. స్మగ్లర్ వీరప్పన్ వేటలో కీలక పాత్ర పోషించిన వెల్లదురై, తన సర్వీసులో ఎన్నో ఎన్కౌంటర్లలో పాల్గొని ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఎన్నో సస్పెన్షన్లు, ట్రాన్స్ఫర్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. తాజాగా ఎన్నికల రేసులో ఆయన దిగడంతో నాంగునేరి నియోజకవర్గంలో చర్చ మొదలైంది. -
శివాలయాల్లో ప్రదోష పూజలు
వేలూరు : వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని ఆలయాల్లో ప్రదోష దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం ప్రదోష పూజలను నిర్వహించారు. అంతకుముందు తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అధికార పెద్ద నంది భగవాన్కు శివాచార్యులు వేద మంత్రాలచే మేళ తాళాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టి కాయ కూరలు, పుష్పాలంకరణలు చేపట్టారు. అనంతరం భక్తుల అధిక సంఖ్యలో చేరుకొని హరోం హర నామస్మరణ మధ్య శివాచార్యులు వేద మంత్రాల నడుమ కర్పూర హారతులు పట్టారు. అనంతరం స్వామివార్లను అధికార నందీ వాహనంలో ఆశీనులు చేసి మాడ వీధుల్లో మేళ తాలాల నడుమ ఊరేగించారు. అదే విధంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో నంది భగవాన్కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి కాయకూరలతో అలంకరించారు. అనంతరం నంది భగవాన్కు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. అదేవిధంగా వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట వంటి జిల్లాలోని శివాలయాల్లోని నంది భగవాన్కూ విశేష పూజలు చేశారు. -
డీఎంకే విజయం ఖాయం
వేలూరు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పోటీ చేసినా డీఎంకే పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి నియోజక వర్గంలో డీఎంకే అభ్యర్థిగా దురై మురుగన్ను ప్రకటించారు. దీంతో మొదటిసారిగా ఆయన చైన్నె నుంచి రైలు మార్గంలో సోమవారం ఉదయం కాట్పాడికి చేరుకున్నారు. దీంతో కార్యకర్తలు అధిక సంఖ్యలో కాట్పాడి రైల్యే స్టేషన్కు చేరుకొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కాట్పాడి నుంచి తన మొదటి ప్రచారాన్ని ప్రారంభించారు. ర్యాలీగా వచ్చి అన్నాదురై, కామరాజర్, పెరియార్, అంబేద్కర్ విగ్రహాలకు పూల మాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు కాట్పాడి నియోజక వర్గంలో 11 సార్లు, మిగిలిన నియోజక వర్గంలో రెండు సార్లు మొత్తం 13వ సారి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. -
నామినేషన్లకు శ్రీకారం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. శుభ ముహూర్తం కావడంతో రాజకీయ దిగ్గజాలు తొలి రోజే తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చేశారు. ఇందులో సీఎం ఎంకే స్టాలిన్ కొళత్తూరులో, టీవీకే అధినేత విజయ్ పెరంబూరులో, కారైక్కుడిలో నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ నామినేషన్లు సమర్పించారు.సాక్షి, చైన్నె: రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నగారా ఈ నెల రెండో వారంలో మోగిన విషయం తెలిసిందే. రాజకీయ పక్షాలు సీట్ల సర్దుబాటు, నియోజకవర్గాల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక, ప్రకటనలలో బిజీ అయ్యాయి. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకేలు తమ అభ్యర్థులను ప్రకటించారు. ఈ కూటములలోని కొన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ పరిస్థితులలో ఎన్నికల నియమావళి అమల్లోకి తీసుకొస్తూ, నామినేషన్ల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణపై దృష్టి పెట్టారు. అభ్యర్థులకు కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో అభ్యర్థితో పాటు కేవలం ముగ్గురిని మాత్రమే లోపలికి అనుమతించారు. అలాగే ఈసారి ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫొటోలు పొందుపరచనుండడంతో నామినేషన్ పత్రంతోపాటు అభ్యర్థులు నెల రోజుల్లోపు తీయించుకున్న 3 కొత్త రంగుల ఛాయాచిత్రాలను అభ్యర్థుల నుంచి సేకరించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఈ నెల 6వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నప్పటికీ, మంగళవారంతోపాటుగా మరో మూడు సెలవు దినాలు రావడంతో నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులకు అతి తక్కువ సమయమే ఉండడం గమానార్హం. ఏప్రిల్ 6 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 9న ఉపసంహరణ ప్రక్రియలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వం మొదలు కావడంతో నియోజకవర్గాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికల కోడ్ అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలో దూసుకెళ్తున్నాయి. ముఖ్య నేతల నామినేషన్లు తొలి రోజున ముఖ్య నేతలు అనేక మంది నామినేషన్లు దాఖలు చేశారు. చైన్నె కొళత్తూరు నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ నామినేషన్ సమర్పించారు. అనంతరం ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 స్థానాలలో గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కొళత్తూరులో ఈసారి తనకు భారీ విజయం ఖాయమని వ్యాఖ్యలు చేశారు. పెరంబూర్ నుంచి పోటీ చేస్తున్న టీవీకే అధినేత విజయ్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్.గీతకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఆనంద్, నిర్మల్ కుమార్ ఉన్నారు. తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో విజయ్ ఏప్రిల్ 2న నామినేషన్ దాఖలుకు నిర్ణయించారు. విల్లివాక్కం నియోజకవర్గం టీవీకే ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున సిడ్కో నగర్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. టీవీకే వర్కింగ్ కమిటీ కన్వీనర్ సెంగోట్టయన్ గోబి చెట్టి పాళయంలో నామినేషన్ సమర్పించారు. ప్రప్రథమంగా ఎన్నికలలో పోటీ చేస్తున్న నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ కారైక్కుడిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉచితాలతో ప్రజల్ని మళ్లీ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డీఎంకే మేనిఫెస్టోలోని అంశాలను గుర్తు చేస్తూ వారికి కావాల్సిన సంస్థలకు అనుకూలంగా వ్యవహరించేందుకే కూపన్ల నాటకమనిఆరోపించారు. అలాగే మంత్రులు ఎం.సుబ్రమణియన్తో పాటుగా మరి కొందరు, డీఎంకే అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనేక మంది నామినేషన్లు సమర్పించారు. ఇక సోషలిస్టు పార్టీ నాయకుడు, గాంధేయ వాది రమేష్ నామక్కల్లో సైకిల్పై వచ్చి నామినేషన్ సమర్పించారు. ఇదే తరహాలో పలువురు వినూత్న రీతిలో వచ్చి నామినేషన్లు సమర్పించారు. తొలి రోజున నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.కొళత్తూరులో సీఎం స్టాలిన్ సిబ్బందికి శిక్షణ పూర్తి రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో అధికారులు, పోలింగ్ సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తయిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 3,32,231 మంది అధికారులకు ఎన్నికల విధులు, బాధ్యతలు, పారదర్శకతపై అవగాహన కల్పించామని వివరించారు. ఎన్నికల కమిషన్ విధుల్లో పాల్గొనే వివిధ కేటగిరీల అధికారులకు పారితోషికాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రిసైడింగ్ అధికారికి రూ.3 వేలు, పోలింగ్ అధికారికి రూ.2600, కౌంటింగ్ సూపర్వైజర్కు రూ.1500, అసిస్టెంట్కు రూ.1400, మైక్రో అబ్జర్వర్కు రూ.2 వేలు చొప్పున పారితోషికం నిర్ణయించారు. సోమవారం వరకు జరిగిన సోదాలలో రూ.296.40 కోట్ల విలువైన నగదు, వస్తువులు పట్టుబడ్డట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. -
మధుమేహ పరిశోధనలో.. సరికొత్త అధ్యాయం
సాక్షి, చైన్నె: మధుమేహం , ఇతర జీవక్రియ సంబంధిత వ్యాధులపై పరిశోధనల్లో ప్రపంచ గుర్తింపు పొందిన మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ( ఎండీఆర్ఎఫ్) జెనోమిక్స్ మల్టీ–ఓమిక్స్ రంగాలలో తన సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి ప్రేమాస్ లైఫ్ సైన్సెస్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. సోమవారం చైన్నెలో ఈ మేరకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. అధునాతన సాంకేతికత ఈ ఒప్పందం ద్వారా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘ఇల్యూమినా’ సీక్వెన్సింగ్ టెక్నాలజీని తన పరిశోధనల్లో ఎండీఆర్ఎఫ్ వినియోగించుకోనుంది.రోగి జన్యు క్రమాన్ని బట్టి సరైన చికిత్స అందించే ‘ప్రెసిషన్ మెడిసిన్’ విభాగంలో వినూత్న ఆవిష్కరణలు చేయడం ఈ సహకారం ముఖ్య ఉద్దేశంగా ప్రకటించారు. కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా, ఈ భాగస్వామ్యం ద్వారా వైద్యులు, పరిశోధకులు , విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఎండీఆర్ఎఫ్ చైర్మన్ డాక్టర్ వి మోహన్ మాట్లాడుతూ, మధుమేహం వంటి సంక్లిష్ట వ్యాధులను నివారించడానికి, మెరుగ్గా నిర్వ హించడానికి అత్యాధునిక సాంకేతికతలను క్లినికల్ పరిశోధనతో అనుసంధానించడం చాలా అవసరంగా పేర్కొన్నారు. భారతదేశంలో బలమైన శాసీ్త్రయ పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యం అని, అందుకే ఈ ఒప్పందం అని ఈసందర్భంగా ప్రేమాస్ లైఫ్ సైన్సెస్ ఎండీ ప్రవీణ్ గుప్తా ప్రకటించారు. కార్యక్రమంలో డాక్టర్ మహ్మద్ ఇమ్రాన్, డాక్టర్ రాధా వెంకటేశన్, డాక్టర్ ఆర్ఎం అంజన, డాక్టర్ దేబ్జానీ సాహా పాల్గొన్నారు. -
ఎస్ఆర్ఎంలో అంతర్జాతీయ సదస్సు
కొరుక్కుపేట: ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైనన్స్ అండ్ టెక్నాలజీ –వడపళని క్యాంపస్ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో అధునాతన పరిశోధనపై అంతర్జాతీయ సదస్సు (ఐసీఏఆర్ఈసీఎస్ –2026 )ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో అభివద్ధి చెందుతున్న పోకడలు, ఆవిష్కరణలపై చర్చించడానికి విద్యావేత్తలు, పరిశోధకులు పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (వీఎస్ఎస్సీ) శాస్త్రవేత్త ఇంజినీర్ – ఎస్జి (రిటైర్డ్) డాక్టర్ ఎల్. శ్రీనివాసన్ పాల్గొని సదస్సును ప్రారంభించారు. అనంతరం ప్రపంచ పరిశోధన సహకారాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ సదస్సు ప్రొసీడింగ్స్ను ప్రముఖులు విడుదల చేశారు. అంతేకాకుండా, డాక్టర్ రాజా రామ్మోహన్ రాయ్ ఏజెన్సీ ఫర్ ఐఎస్బిఎన్ పబ్లికేషన్ స్కీమ్ కింద ఈ ప్రొసీడింగ్స్ ఐఎస్బీఎస్తో ప్రచురించారు. ప్రారంభోత్సవం అనంతరం, మలేషియాలోని టేలర్స్ విశ్వవిద్యాలయం, ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అఫిజాన్ బిన్ అజ్మాన్ కీలకోపన్యాసాలు చేశారు. అనంతరం ఇసిఇ విభాగాధిపతి (హెచ్ఓడి) డా. ఎ. షిర్లీ ఎడ్వర్డ్ స్వాగతోపన్యాసం చేయగా, ఇసిఇ అసోసియేట్ ప్రొఫెసర్ డా. పి. నాగరాజన్ సదస్సుకు అద్భుతమైన స్పందన లభించిందని, దీనికి 450కి పైగా పరిశోధనా పత్రాలు అందాయని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. డీన్ డాక్టర్ సి వి జయకుమార్ , వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి గోమతి ,డాక్టర్ చెగ్గౌర్ సెలీనా, డాక్టర్ ఎస్ వెంకటేష్, డాక్టర్ పి నాగరాజన్, డాక్టర్ అంజు పాల్గొన్నారు. -
రేషన్ దుకాణాల్లో మద్యం విక్రయాలు!
తిరుత్తణి: రేషన్ దుకాణాల్లో మద్యం విక్రయం, బాలికలు, మహిళలపై చోటుచేసుకుంటున్న లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేలా కోర్టు అనుమతితో సెక్స్ వర్కర్ కేంద్రాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని స్వతంత్ర అభ్యర్థి ఇచ్చిన ఎన్నికల హామీ కలకలం రేపుతోంది. తిరుత్తణి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి వీరమంగళం గ్రామానికి చెందిన సేడ్డు అనే వ్యక్తి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇందుకోసం తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయానికి సైకిల్లో చేరుకున్నారు. నామినేషన్ దాఖలు చేసి అతను మాట్లాడుతూ.. 15 ఏళ్ల నుంచి ఎన్నికల్లో పోటీ కోసం ప్రతి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు వేసి, పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఉచిత పథకాలకు తాను వ్యతిరేకమని, ఉచితాలు వ్యతిరేకించేవారు మాత్రం తనకు ఓటు వేయాలన్నారు. తనను గెలిపిస్తే రేషన్ దుకాణాల ద్వారా మద్యం సరఫరా చేస్తామని, రైతులకు, నేత కార్మికులకు ఉచిత విద్యుత్ రద్దు చేస్తామన్నారు. సెక్స్ వర్కర్లను ప్రోత్సహిస్తామన్న హామీలు ప్రజల మధ్యలో కలకలం రేపుతున్నాయి. -
ధర్మపురి రేసులో సౌమ్య అన్బుమణి
సాక్షి, చైన్నె : పీఎంకే నేత అన్బుమణి సతీమణి సౌమ్య అన్బుమణి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్నారు. ఆమెను ధర్మపురి నియోజకర్గం అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈ మేరకు అన్బుమణి తన అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. పీఎంకే విషయంలో వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. పీఎంకే, చిహ్నం, మామిడి గుర్తు ను ఎన్నికల కమిషన్ నుంచి అన్బుమణి దక్కించుకున్నారు. దీంతో అన్నాడీఎంకే , బీజేపీ కూటమిలో అన్బుమణి పీఎంకే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కూటమిలో అన్బుమణి పీఎంకేకు 18 స్థానాలను కేటాయించారు. ఈ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో తన సతీమని సౌమ్యకు సైతం అన్బుమణి పోటీ చేసే అవకాశం కల్పించారు. ధర్మపురిలో సౌమ్య పోటీ తలో పీఎంకే అనుబంధ స్వచ్చంద సంస్థ ద్వారా ధర్మపురి, కృష్ణగిరి, సేలం, తదితర జిల్లాలలో సేవా కార్యక్రమాల ద్వారా సౌమ్య అన్బుమణి సుపరిచితురాలే. అంతే కాదు, ఆమె తండ్రి కృష్ణస్వామి కాంగ్రెస్ సీనియర్ లీడర్ కాగా, సోదరుడు విష్ణు ప్రసాద్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన సౌమ్య లోక్ సభ ఎన్నికలలో ధర్మపురి నుంచి పోటి చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా ఆమెను అసెంబ్లీ ఎన్నికల ద్వారా రాష్ట్ర రాజకీయాల్లోకి విస్తృతంగా తీసుకొచ్చేందుకు అన్బుమణి సిద్ధమయ్యారు. దీంతో ఆమెకు ధర్మపురి సీటు కేటాయించారు.అలాగే, టీవీకే అధ్యక్షుడు విజయ్ పోటీ చేస్తున్న పెరంబూరు నియోజకవర్గంలో పీఎంకే తరపున మహిళా నేత సత్యభామను పోటీలో పెట్టారు. డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ పోటీలో ఉన్న విరుదాచలంలో డాక్టర్ తమిళరసి ఆది మూలం, వీసీకే నేత తిరుమావళవన్ పోటీలో ఉన్న కాట్టుమన్నార్ కోవిల్లో డాక్టర్ అన్బు చోళన్ను నిలబెట్టారు. ఇక, సెంజిలో గణేష్కుమార్, అంబత్తూరులో కెఎన్ శేఖర్, కీల్ వేలూరులో వడి వేల్రావణన్, రిషివంధియంలో చెలియన్, ఉత్తర మేరూర్లో మహేశ్కుమార్, మైలాడుతురైలో ఏ పళణిస్వామి, షోళింగర్లో కె శరవణన్, విక్రవాండిలో సి శివకుమార్, సేలం ఉత్తరంలో ఎస్ సదాశివం, జయం కొండంలో కె వైది, తిరుప్పోరూర్లో న్యాయవాది కె బాలు, పోలూరులో సీఆర్ భాస్కరన్, పెన్నగరంలో పాడి వి సెల్వం,సేలం పశ్చిమంలో ఎం కార్తీలు పోటీ చేస్తారని జాబితాలో అన్బుమణి వివరించారు. -
10న తెరపైకి టీఎన్ 2026
తమిళసినిమా: రాష్ట్రంలో ఎన్నికల అడావుడి మొదలయ్యింది. ప్రచారానికి సిద్ధం అవుతూ విజయం కోసం వ్యూహరచనలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళంలో రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో టీఎన్ 2026 పేరుతో ఒక చిత్రం తెరపైకి రానుంది. ఏప్రిల్ 10న తెరపైకి రానున్న ఈ చిత్రంలో నట్టి కథానాయకుడిగా నటించారు. సిరుతారావ్, చాందిని తమిళరసన్, యాషిక ఆనంద్ మొదలగు ముగ్గురు హీరోయిన్లు నటించిన ఇందులో తంబిరామయ్య, ఎంఎస్.ఽబాస్కర్, ఇళవరసు, రెడిన్ కింగ్స్లీ, లొల్లుసభ మారన్, ముత్తుకుమార్, ఆదిత్యఖదీర్, చిత్రాలక్ష్మణన్, తలైవాసల్ విజయ్,వైయాపురి, వడివుక్కరసి, వీజీ చంద్రశేఖర్,శ్రీజరవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా డాన్స్మాస్టర్ శాండి క్యామియో పాత్రను పోషించిన ఈ చిత్రానికి తంబిరామయ్య కథను అందించగా ఆయన వారసుడు, నటుడు ఉమాపతి రామయ్య కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. కేఆర్జీ.రవి గ్రూప్ పతాకంపై కన్నన్ రవి, దీపక్ రవి నిర్మించిన ఈ చిత్రానికి దర్బక శివ సంగీతాన్ని, పీజీ.ముత్తయ్య ఛాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 10 వ తేదీన తెరపైకి రానుంది. ఇది సమకాలీన రాజకీయ నేపధ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్శంగా చిత్ర పోస్టర్ను విడుదల చేశారు. అందులో నటుడు నట్టి రాజకీయ వేదికపై ఆవేశంగా మాట్లాడుతూ పిడికిలి భిగించగా ఆయన చుట్టు ప్రచారంలో పాల్గొన కార్యకర్తలు, అభిమానుల దృశ్యం కనిపిస్తోంది. ఈ పోస్టర్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. శ్రీలంక యుద్ధానంతర పరిణామాలతో బొమ్మై -
పోలింగ్పై అవగాహనా ర్యాలీ
వేలూరు: వేలూరు జిల్లాలో వందశాతం ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి కరపత్రాలు పంపిణీ చేశారు. అందులో భాగంగా వేలూరు డీకేఎం మహిళా డిగ్రీ కళాశాలలో వందశాతం పోలింగ్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో అంగన్వాడీ కార్యకర్తలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వందశాతం పోలింగ్ అనే అక్షరాలపై నిలబడి విద్యార్థినులు ఆకట్టుకున్నారు. అదే విధంగా బుడబుడకల వారి ద్వారా జక్కమ్మ చెపుతుంది, జక్కమ్మ చెపుతుందని మంచి రోజులు వస్తున్నాయని ఏఫ్రిల్ 23వ తేదీన ప్రతి ఓటు హక్కును వినియోగించుకోవాలని మొదటి సారి ఓటు హక్కు కలిగిన వారు తప్పక ఓటు వేయాలని కోరారు. అదే విధంగా వేలూరు కోట మైదానంలోని గాందీ విగ్రహం నుంచి అంగన్వాడీలో ర్యాలీగా కోట మైదానంలోనికి వచ్చి వందశాతం పోలింగ్ అనే సంఖ్యపై నిలిచి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా సహకరిస్తామని అంగన్వాడీలు, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కలెక్టర్ సుబ్బలక్ష్మి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, అంగన్వాడీ వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటర్వ్యూలో పాల్గొన్న బస్ కండక్టర్ – విధుల నుంచి తొలగించిన అధికారులు అన్నానగర్: నీలగిరి జిల్లాలోని కూడలూరు రాష్ట్ర రవాణా సంస్థలో కండక్టర్ గా పనిచేస్తున్న నెడుంచెళియన్, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా ఎన్నికలలో పోటీ చేయకూడదనే నిబంధనను ఉల్లంఘించి డీఎంకే అభ్యర్థి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని తరువాత, రవాణా శాఖ అధికారులు నెడుంచెళియన్ను ఉద్యోగం నుండి తొలగించి చర్య తీసుకున్నారు. కాగా ఆయన కొన్ని రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండడం గమనార్హం. మహిళ అనుమానాస్పద మృతి అన్నానగర్: చైన్నెలోని వ్యాసర్పాడి మూర్తినగర్ ప్రాంతానికి చెందిన కార్తీక్ (34). ఇతని భార్య సుకన్య (31). ఆదివారం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో తన భార్య కత్తెరతో మెడలో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేసిందని తెలుస్తోంది. కార్తీక్ సుకన్యను ప్రాణాపాయ స్థితిలో స్టాన్లీ ఆసుపత్రిలో చేర్పించాడు. వైద్యుల పరీక్షలో సుకన్య అప్పటికే మరణించినట్లు తేలింది. ఈ విషయమై ఎం.కె.బి. నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, కుటుంబ కలహాల కారణంగా సుకన్య కత్తెరతో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుందా? లేక కార్తీక్ తన భార్యను కత్తెరతో పొడిచి చంపాడా? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా, వ్యాసర్పాడిలోని ముల్లై నగర్ శ్మశానవాటిక ప్రాంతంలోని ఒక ముళ్లపొదలో 50 ఏళ్ల పురుషుడి మృతదేహం లభ్యమైంది. అతను ఎవరు? ఏ గ్రామానికి చెందినవాడు? అతని శరీరం పై గాయాలు ఉండటంతో కొట్టి చంపారా? అనే విషయాలపై ఎం.కె.బి. నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల చిన్నారి మృతిపై కేసు నమోదు అన్నానగర్: చైన్నెలోని వేలచ్చేరి, రాజీవ్ నగర్కి చెందిన ప్రవీణ్ కుమార్. ఇతని భార్య సుబ్బులక్ష్మి. వీరి రెండేళ్ల కుమార్తె యుగ. ఈమెకి వాంతులు, జ్వరం రావడంతో ఆమె తల్లిదండ్రులు యుగను వేలచ్చేరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అక్కడ సరైన చికిత్స అందకపోవడంతో ఆ చిన్నారి సోమవారం మరణించింది. చిన్నారి మరణానికి గల కారణాల పై వేలచ్చేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చైన్నెలో జాతీయ స్థాయి కళా ప్రదర్శన సాక్షి, చైన్నె: శ్రీ దర్శిని కలైకూడం ఆధ్వర్యంలో 21వ వార్షిక జాతీయ స్థాయి కళా ప్రదర్శన చైన్నె థౌజండ్ లైట్స్ గ్రీమ్స్ రోడ్డులో ఉన్న లలిత కళా అకాడమీలో ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక కళా ప్రదర్శన లో ఆంధ్రప్రదేశ్తో పాటూ దేశ నలుమూలల నుండి 260 మంది కళాకారులు రూపొందించిన 350 అద్భుతమైన కళాఖండాలను కొలువుదీర్చారు. వీటి మొత్తం అంచనా విలువ రూ. 2.45 కోట్లు .ఈ ప్రదర్శన సాంప్రదాయ , వాస్తవిక శైలుల నుండి సమకాలీన ఆధునిక కళ వరకు గొప్ప వైవిధ్యాన్ని తలపిస్తోంది. తైలవర్ణ జలవర్ణ చిత్రాలు, మిశ్ర మ మాధ్యమ సృజనాలు, తంజావూరు , మై సూరు చిత్రకళ వంటి సాంప్రదాయక రూపాల తో పాటు ఉత్సాహభరితమైన గిరిజన కళతో సహా విసృత శ్రేణి కళాకృ తులు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. అలాగే ఈ ప్రదర్శనలో కాగితపు శిల్పాలు, మట్టి నమూనాలు, లోహం, చెక్క , రాతితో రూపొందించిన శిల్పాలు, అలా గే పలు డిజైన్లతో కూడిన సిరామిక్ బొమ్మలతో సహా శిల్పకృతులు కనువిందు చేస్తున్నాయి. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రఘుపతి , లలిత కళా అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి శోవన్ కుమార్, రాయపురంలోని సుధా ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ పాండియరాజ్, అంతర్జాతీయ వాలీబాల్ రిఫరీ నందగోపాల్, చిత్రకారులు రాఖీ తదితర ప్రముఖ అతిథులతో కలిసి జాతీయ స్థాయి కళా ప్రదర్శనను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఏప్రిల్ 4, కొనసాగుతుందని శ్రీ దర్శిని కలైకూడం వ్యవస్థాపకులు ధర్మలింగం తెలిపారు. శ్రీలంకకు అక్రమంగా తరలించే యత్నం – రూ.50 లక్షల విలువైన పసుపు, బొగ్గు, విదేశీ సిగరెట్లు స్వాధీనం అన్నానగర్: శ్రీలంకకి అక్రమంగా తరలించేందుకు యత్నిస్తున్న రూ.50 లక్షల విలువైన పసుపు, బొగ్గు, విదేశీ సిగరెట్లు వంటి వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రామనాథపురం జిల్లాలోని కీళకరై చెక్పోస్ట్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆదివారం రాత్రి వాహన తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో, అటుగా వెళ్తున్న ఒక సరుకు రవాణా వాహనాన్ని వారు ఆపి తనిఖీ చేశారు. అనుమానం రావడంతో ఆ వాహనాన్ని రహస్యంగా అనుసరించారు. మండపం ఉత్తర తీరానికి సమీపంలోని డి. నగర్ ప్రాంతంలోని ఓ గోడౌన్ వద్ద సరుకు రవాణా వాహనం వెళ్లడంతో దాడులు నిర్వహించారు. గోడౌన్లోని 2 టన్నుల పసుపు బస్తాలు, 10,000 విదేశీ సిగరెట్లు, 308 కేజీల బొగ్గు, 100 బీడీల కట్టలు, 56 లీటర్ల పురుగుమందు, 10 కేజీల యాలకులు, 60 కేజీల పసుపు పొడిని స్వాధీనం చేసుకున్నారు. సరుకుల అంతర్జాతీయ విలువ సుమారు రూ. 50 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. -
కామకోటికి ‘ఐకాన్ ఆఫ్ ది మంత్’ గౌరవం
సాక్షి, చైన్నె: సాంకేతిక రంగంలో అద్భుత ఆవిష్కరణలు, విద్యా నాయకత్వంలో పోషించిన కీలక పాత్రకు గుర్తింపుగా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని ‘సూపర్ చైన్నె’ సంస్థ మార్చి 2026 నెలకుగాను ‘ఐకాన్ ఆఫ్ ది మంత్’ పురస్కారంతో సత్కరించింది. స్వదేశీ ప్రాసెసర్ల అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీ , హై–పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ రంగాలలో భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడంలో ప్రొఫెసర్ కామకోటి కృషి అనన్యసామాన్యంగా ప్రకటించారు. ఆయన నాయకత్వంలో ఐఐటీ మద్రాస్ కేవలం విద్యా సంస్థగానే కాకుండా, డీప్–టెక్ స్టార్టప్లకు, పరిశోధనలకు ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదిగిందని ప్రకటించారు. చైన్నె నగరాన్ని ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెడుతున్న వ్యక్తులను సత్కరించే క్రమంలో, ఈ నెలకు ప్రొఫెసర్ కామకోటిని ఎంపిక చేసినట్లు ‘సూపర్ చైన్నె’ మేనేజింగ్ డైరెక్టర్ రంజీత్ రాథోడ్ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభమైన ‘సూపర్ చైన్నె’, నగరాన్ని సాంకేతిక, వైద్య, సాంస్కృతిక రంగాలలో గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ప్రకటించారు. క్రెడాయ్ చైన్నె ఆధ్వర్యంలో సాగుతున్న ఈ సామాజిక విప్లవం, నగర గర్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది. ప్రొఫెసర్ కామకోటిని వరించిన ఈ గౌరవం, చైన్నెలోని విద్యా పరిశోధనా రంగానికి దక్కిన గొప్ప గుర్తింపుగా భావిస్తున్నారు. -
ఏప్రిల్ 1 నుంచి 2 శాతం ధరల పెంపు
సాక్షి, చైన్నె: ఎంజీ మోడళ్ల ధరలు ఏప్రిల్ 1 నుంచి 2 శాతం పెరుగుతున్నట్లు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటారు ఇండియా ప్రకటించింది. ఎంజీ పోర్ట్ఫోలియో ధరల పెంపును సోమవారం స్థానికంగా ప్రకటించారు. నిరంతరం పెరుగుతున్న ముడిసరుకు ఖర్చుల ప్రభావాన్ని పాక్షికంగా భర్తీ చేయడమే ఈ ధరల సవరణ లక్ష్యంగా వివరించారు.మోడల్ వారీ ధరల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, వినియోగదారులు తమ సమీపంలోని డీలర్షిప్ను సంప్రదించాలని లేదా అధికారిక ఇండియా వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. తిరుత్తణి: పాండవుల జననం సందర్భంగా రెండు వేల బిస్కెట్ల ప్యాకెట్లతో అలంకరణ చేపట్టారు. పట్టణ వీధుల్లో ద్రౌపదీ దేవిని ఊరేగించారు. తిరుత్తణి గాంధీరోడ్డులోని ద్రౌపదీదేవి ఆలయంలో అగ్నిగుండ తిరునాళ్లు కోలాహలంగా నిర్వహిస్తున్నారు. 18 రోజుల ఉత్సవ వేడుకల్లో ప్రధానమైన అగ్నిగుండ వసంతోత్సవం 12వ తేదీన నిర్వహించనున్నారు. వేడుకలు సందర్భంగా ఆదివారం పొండవుల జననం ఘట్టం పురస్కరించుకుని పంచపాండవుల విగ్రహాలకు రెండు వేల బిస్కెట్లతో అలంకరించారు. మహా దీపారాధన చేపట్టి వాహనంపై కొలువుదీర్చి పట్టణ వీధుల్లో ఊరేగించారు. మహిళలు కర్పూర హారతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టి స్వామిని దర్శించుకున్నారు. తిరువొత్తియూరు: చైన్నె విమానాశ్రయం దేశీయ టెర్మినల్లో ఇండిగో ఎయిర్ ఎయిర్లైన్స్ ప్రయాణీకుల విమానం వచ్చి దిగింది. ఆ విమానంలో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ శాఖ ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రత్యేక బృందం రహస్య నిఘా పెట్టింది. అప్పుడు మదురైకు చెందిన 2 ప్రయాణికులు, కన్వేయర్ బెల్ట్పై వచ్చిన తమ సూట్కేస్, బ్యాగులను తీసుకుని బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ ఇద్దరి ప్రయాణికులను కస్టమ్స్ శాఖ ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానంతో ఆపి, వస్తువులను తెరిచి తనిఖీ చేశారు. వారి వద్ద కట్టలు కట్టలుగా రూ.1.50 లక్షలు భారత నగదు, రూ.33.5 లక్షల విలువైన అమెరికన్ డాలర్ కరెన్సీ నోట్లు మొత్తం రూ.35 లక్షల విలువైన నగదు తీసుకువచ్చినట్లు తెలిసింది. ఆ నగదుకు సరైన పత్రాలు చూపక పోవడంతో ఆ నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొరుక్కుపేట: చైన్నె పార్క్ టౌన్ మింట్ స్ట్రీట్ ఉన్న 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర ఆలయంలో పంగుణీ మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం ఆలయంలో పిచ్చాండవర్ తోటి ఉత్సవాన్ని ఎస్ఎల్ ఎంటర్ ప్రైజెస్ అధినేత ఇమ్మిడి కిషోర్ కుమార్ కుటుంబం వ్యవహరించింది. పిచ్చాండవర్కి అభిషేక పూజలను నేత్రపర్వంగా నిర్వహించారు. సాయంత్రం పిచ్చాండవర్ ను విశేషంగా అలంకరించి విశేషపూజలను శాస్త్రోక్తంగా చేపట్టారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ పిచ్చాండవర్ తొట్టి ఉత్సవం కంచి ఏకాంభరేశ్వర ఆలయంలో జరిగే మాదిరిగానే ఇక్కడ నిర్వహించడం విశేషం. పురవీధుల్లో పిచ్చాండవర్ స్వామిని ఊరేగింపు నిర్వహించగా, ఉత్సవంలో నాదస్వరం, బ్యాండ్ మేళం నడుమ వైభవంగా సాగి, ఆధ్యాత్మిక శోభన సంతరించుకుంది . వందలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. -
కామెడీ జోనర్లో ‘రావడి’
తమిళసినిమా: ఇటీవల సిరై చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ అధినేత ఎస్ఎస్.లలిత్కుమార్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం రావడి. కాగా దీనికి ఎల్కే విష్ణుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సిరై చిత్రంతో పరిచయం అయిన ఎల్కే అక్షయ్కుమార్, ఫాజిల్ జోసప్ ప్రధాన పాత్ర లు పోషిస్తున్న ఇందులో జాన్విజయ్, సత్యన్, జాఫర్ సాధిక్, నోబల్ కే.జేమ్స్, ఆరుణాచలేశ్వరన్. పీఏ, షారిక్ హాసన్,ఐశ్వర్య శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా విఘ్నేశ్ వడివేలు దర్శకుడిగా పరి చయం అవుతున్నారు. లియోన్ బ్రిట్టో ఛాయాగ్రహణంను, జన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా చిత్రం కామెడీ ఎంటర్టెయినర్గా ఉంటుందని యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నా రు. చిత్ర షూటింగ్ను చైన్నె, ఓగెనగల్ ప్రాంతాల్లోని అందమైన ప్రకృతిలో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందని, రావడి చిత్రం కచ్చితంగా పేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
చైన్నెలో మాహీ మల్టీ–స్పెషాలిటీ వైద్య సేవ
సాక్షి, చైన్నె: నగరంలోని కిల్పాక్కం ప్రాంతంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన మాహి హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయి వైద్య ప్రమా ణాలను, రోగులపై ప్రత్యేక శ్రద్ధ తో అందించాలనే లక్ష్యంతో ఈ మల్టీ–స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. జిటో చైర్మన్ రాజేష్ జీ చందన్, భారత మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్, పారిశ్రామిక వేత్త సుగల్ జీ సింఘ్వీ, ప్యారేలాల్ జీ పితాలియాలు ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. మాహి హాస్పిటల్స్ను ప్రఖ్యాత వైద్య దంపతులు డాక్టర్ దీపికా లునావ త్, డాక్టర్ విజయ్ సోహన్ లాల్ ఎస్ స్థా పించారు. డాక్టర్ విజయ్ సోహన్ లాల్ ఎస్ ప్రముఖ సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్థోపెడిక్ సర్జన్గా 18 ఏళ్లకు పైగా సేవలు అందిస్తున్నారు.డాక్టర్ దీపి కా లునావత్ ప్రముఖ డెర్మటాలజిస్ట్ ఈస్తటిక్ స్పెషలిస్ట్, చర్మ సంబంధిత చికిత్సలలో ప్రత్యేక గుర్తింపుపొంది ఉన్నా రు. చైన్నెలోని ప్రధాన ప్రాంతంలో ఉండటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో రోగుల కు సులభంగా అందుబాటులో తమ ఆస్పత్రి ఉంటుందని పేర్కొన్నారు. -
ఎవర్నీ కాపీ కొట్టలేదు..!
సాక్షి, చైన్నె: డీఎంకే ఎన్నికల ప్రణాళికపై వస్తున్న విమర్శలను ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి ఘాటుగా తిప్పికొట్టారు. చైన్నెలోని అన్నా అరివాలయంలో మీడియాతో సోమవారం మాట్లాడిన ఆమె, తమ మేనిఫెస్టోను అన్నాడీఎంకే లేదా ఇతర పార్టీల నుండి కాపీ చేయలేదని, ఇది క్షేత్రస్థాయిలో ప్రజల నుండి సేకరించిన అభిప్రాయాల ప్రతిరూపమని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిఎంకె ఇచ్చిన 503 హామీలలో ఇప్పటికే 404 హామీలను(80 శాతంకు పైగా )సీఎం స్టాలిన్ అమలు చేశారని వివరించారు. మిగిలిన 101 హామీలలలో 37 హామీలు కేంద్ర ప్రభుత్వ సహకారంపై ఆధారపడి ఉన్నాయని, మిగిలిన 64 హామీలు కొన్ని ఆచరణాత్మక ఇబ్బందులు, ప్రజల వ్యతిరేకత కారణంగా పెండింగ్లో ఉన్నాయని ఆమె వివరించారు. ఎన్నికల హామీల్లో లేకపోయినప్పటికీ మరెన్నో పథకాలు అమలు చేశామని వివరించారు. మేనిఫెస్టో తయారీలో ఏఐ సాంకేతికత ఈసారి ఎన్నికల ప్రణాళికను రూపొందించడానికి డీఎంకే కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడమే కాకుండా, ఆధునిక సాంకేతికతను వినియోగించుకుందన్నారు. ఈమెయిల్స్, వాట్సాప్ , ఏఐ ప్లాట్ఫారమ్ల ద్వారా అందిన సుమారు 80 వేల సూచనలను విశ్లేషించి ఈ నివేదికను సిద్ధం చేశామని వివరించారు. ప్రతి రంగంలోని నిపుణులతో సంప్రదింపులు జరిపి, ఆచరణ సాధ్యమయ్యే హామీలనే మేనిఫెస్టోలో చేర్చామని ఆమె తెలిపారు. మహిళా సాధికారతపై ప్రత్యేక దష్టి సారించిన డిఎంకె, ఈసారి శ్రీకూపన్ విధానాన్నిశ్రీ ప్రతిపాదించిందన్నారు. వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్ లేదా మైక్రోవేవ్ ఓవెన్ వంటివి కేవలం విలాస వస్తువులు కాదని, అవి మహిళల శ్రమను తగ్గించి, సమయాన్ని ఆదా చేసే ‘పెట్టుబడులు’ అని కనిమొళి అభిప్రాయపడ్డారు. ఒకరి ఇంట్లో ఇప్పటికే ఫ్రిజ్ ఉంటే, వారు తమకు నచ్చిన మరో వస్తువును కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఈ వోచర్ విధానం ద్వారా కలుగుతుందని ఆమె వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు సొంత వ్యాపారాలు ప్రారంభించడానికి రాయితీ రుణాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. ఇతరు మేనిఫెస్టోను చదవాల్సిన అవసరం గానీ, సమయం గానీ తమకు లేదని వివరించారు. ‘ద్రవిడ మోడల్’ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తమ లక్ష్యమని, ప్రతిపక్షాల విమర్శల్లో పసలేదని కనిమొళి కొట్టిపారేశారు. -
లైంగిక వేధింపులపై ఫిర్యాదు
తిరువళ్లూరు: టీవీకే పూందమల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాశం అలియాస్ కుట్టి తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా టీవీకే సౌత్ జిల్లా కార్యదర్శి కుట్టి అలియాస్ ప్రకాశం గత సంవత్సరం నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇతడ్ని తిరువళ్లూరు జిల్లా పూందమల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయానికి పూందమల్లి నియోజకవర్గం తిరువూర్ గ్రామానికి చెందిన సంగీత మణిగండన్ ఫిర్యాదు చేశారు. తనను కుట్టి లైంగికంగా వేధిస్తున్నారని, అతడిపై చర్యలు తీసుకోవడంతో పాటు అధిష్టానం అతడికి ఇచ్చిన సీటును వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన క్రమంలో అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశామని, అయినా అతడికి సీటు ఇవ్వడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. తనకు న్యాయం జరగకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తానని సైతం హెచ్చరించారు. కుట్టిపై రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన మద్దతుదారులు సైతం పోటాపోటీగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సంగీత మహిళ విభాగం కార్యదర్శిగా పదవిని ఆశించారని పదవి రాకపోవడంతో లైంగిక ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తప్పుడు ఫిర్యాదు చేసిన సంగీతపై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. -
తాజా అసెంబ్లీ ఎన్నికలతో స్టాలిన్ శకానికి ముగింపు పలికేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారని టీవీకే అధ్యక్షుడు విజయ్ వ్యాఖ్యానించారు. సోమవారం చైన్నెలోని పెరంబూరు నియోజకవర్గం నుంచి తన ఎన్నికల ప్రచారానికి విజయ్ శ్రీకారం చుట్టారు. ఒకే రోజు చైన్నెలో నాలుగు నియ
టీవీకే అధినేత విజయ్ వ్యాఖ్య నామినేషన్ దాఖలుకు వస్తున్న విజయ్ సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలలో టీవీకే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో టీవీకే అధినేత విజయ్ చైన్నెలోని పెరంబూరు నియోజవర్గంలో, తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. ఆదివారం అభ్యర్థులను ప్రకటించిన విజయ్ సోమవారం ఉదయం తాను పోటీ చేస్తున్న శ్రీపెరంబదూరు నియోజవర్గం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన విజయ్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. నిర్ణీత సమయం కంటే ముందుగా పెరంబూరులో ప్రచార వేదిక వద్దకు చేరుకుని విజయ్ అందరికి అభివాదం తెలుపుతూ పలకరించారు. విజయ్ భావోద్వేగ ప్రసంగం తనను ప్రేమించే వారు ఉన్న చోటు నుండి ప్రచారం మొదలుపెట్టాలనుకున్నానని, ఈ మేరకు తమిళనాడు అంతా తనకు ఇష్టమే అయినప్పటికీ, ఇందులో పెరంబూరు నుంచి ప్రయాణం మొదలెట్టడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడి నుంచి పోటీ చేయాలని, ఇక్కడి నుంచే ప్రచారం చేపట్టాలని తన మనస్సు చెప్పిందని, ఉత్తర చైన్నెకి ఐకానిక్ ప్రదేశాలో మాతా చర్చి, ప్రసిద్ధ ఆలయాలు, మసీదులు ఈ గడ్డలోనే ఉన్నాయంటూ భావోద్వేగంతో వ్యాఖ్యలు చేశారు. డీఎంకేపై నిప్పులు రాష్ట్రంలో మాదకద్రవ్యాల విచ్చలవిడితనం, మహిళలపై దాడులు పెరిగిపోయాయని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట మహిళలు బయటకు రావాలన్నా, టీ కొట్టుకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉందన్నారు. సామాన్యుడి ప్రాణాలకు రక్షణ ఇవ్వ లేని ఈ ప్రభుత్వం కేవలం తమ కుటుంబ ఆస్తులను పెంచుకోవడంపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. ఈ ఎన్నికలతో స్టాలిన్ పాలనకు చరమగీతం పాడటం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. యువతకు పిలుపు ఉద్యోగాల భర్తీలో జరిగిన అవినీతి, యువతకు జరుగుతున్న మోసాలు, చేస్తున్న అన్యాయాలపై కొత్త తరం జెన్–జీ ఓటర్లు దృష్టి పెట్టాలని పిలుపు నిచ్చారు. దోచుకున్న డబ్బుతో ఈ పాలకులు ఓటుకు నోటు ఇస్తే.. ఆ డబ్బు తీసుకోండని, అయితే, పోలింగ్ బూత్లో మాత్రం వారి చెవిలో ’విజిల్’ వేసినట్లుగా టీవీకే గుర్తుకే ఓటు వేసి బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.వారు ఇచ్చే డబ్బు తీసుకోండి – మార్పు కోసం ఓటు వేయండి అంటూ పిలుపు నిచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి తనను మీ ఇంటి బిడ్డగా, అన్నగా, తమ్ముడిగా భావించి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అభ్యర్థించారు. యువత అంతా ఉత్సాహంగా పాల్గొని ’విజిల్’ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. డీఎంకేది వైఫల్యాల పాలన అని పేర్కొంటూ, యువత ఓటింగ్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని కొత్త రాజకీయ మార్పుకు నాంది పలకాలని ఆయన కోరారు. ఈ ఎన్నికలతో స్టాలిన్ శకం ముగియనున్నదని పేర్కొంటూ, తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయని ధీమా వ్యక్తంచేశారు.భద్రతా కారణాలతో రద్దు విజయ్ సోమవారం నాలుగు చోట్ల ప్రచారానికి నిర్ణయించారు. తొలుత పెరంబూరులో విజయవంతంగా ప్రచార కార్యక్రమం జరిగింది. అనంతరం తిరువీకా నగర్లో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత విల్లివాక్కం, అన్నానగర్ నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అయితే, భద్రతా కారణాలను ఎత్తి చూపుతూ సాయంత్రం ఐదు గంటల సమయంలో విజయ్ ప్రచారం రద్దు చేసినట్టు టీవీకే వర్గాలు ప్రకటించాయి. దీంతో విజయ్ కోసం ఎదురు చూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు. -
క్లుప్తంగా
తిరువొత్తియూరు: భర్త నుండి విడిపోయి జీవిస్తున్న మహిళపై దాడి చేసిన భర్త, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె ఎం.జి.ఆర్. నగర్లో తన భర్త రాజేష్ నుండి విడిపోయిన మహిళ గత 3 సంవత్సరాలుగా ఈశ్వరి (32) కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తున్నారు. ఈమె గిండిలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, గత 28వ తేదీ రాత్రి ఈశ్వరి ఇంటికి వచ్చిన రాజేష్ విమల్రాజ్ ఈశ్వరికి హత్య బెదిరింపులు ఇచ్చారు. దీనిని అడ్డుకున్న ఆమె తండ్రి, సర్దిచెప్పడానికి వచ్చిన ఈశ్వరి పినతండ్రి, ఈశ్వరి పై దాడి చేసి పారిపోయారు. దీనిపై ఫిర్యాదు మేరకు ఎంజీఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మూలైపల్లంకు చెందిన రాజేష్ (38), అతని స్నేహితుడు విమల్రాజ్ (48)ను ఆదివారం అరెస్టు చేశారు. తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం సోమవారం ప్రారంభం కావడంతో నామినేషన్ల కేంద్రాల వద్ద సందడి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు 23న పోలింగ్ నిర్వహించనున్న క్రమంలో సోమవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు సందర్భంగా ఏఎస్పీ శుభమ్ దిమాన్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. కార్యాలయానికి వెళ్లేవారిని తనిఖీ చేపట్టిన తరువాతే అనుమతించారు. అభ్యర్ధితోపాటు నలుగురికి మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. తొలిరోజు నామ్ తమిళర్ పార్టీ అభ్యర్థి చంద్రన్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా మరో ముగ్గురు సహా మొత్తం నలుగురు నామినేషన్లు ఎన్నికల అధికారి కనిమొళి వద్ద దాఖలు చేశారు. తిరువొత్తియూరు: ఐపీఎల్ 20 ఓవర్ల క్రికెట్ పోటీలో చైన్నె చెపాక్ మైదానంలో 7 మ్యాచ్లు జరుగుతాయి. వచ్చే 3వ తేదీ (శుక్రవారం) జరిగే తొలి మ్యాచ్లో చైన్నె సూపర్ కింగ్స్–పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ పోటీకి సంబంధించిన టిక్కెట్ల విక్రయం సోమవారం ఆన్లైన్ ద్వారా ఉదయం 10.15 గంటలకు ప్రారంభమైంది. విక్రయం ప్రారంభం నుండే లక్షకు పైగా ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి వేచి ఉన్నారు. టిక్కెట్ల విక్రయం చాలా జోరుగా జరిగింది. రూ.2 వేలు, రూ.3,500, రూ.4 వేలు, రూ.4,700, రూ.8 వేలు ధరలలో టిక్కెట్ల ధరలు నిర్ణయించబడ్డాయి. విక్రయం ప్రారంభమైన సమయం నుండే రూ.2 వేలు, గంటలో రూ.3,500, రూ.4 వేలకు సంబంధించిన టిక్కెట్లు అమ్ముడైపోయాయి. అదేవిధంగా రూ.4,700, రూ.8 వేలకు సంబంధించిన టిక్కెట్లు కూడా త్వరలోనే అమ్ముడైపోతాయని తెలిపారు. సాక్షి, చైన్నె: అమ్మమక్కల్ మున్నేట్ర కళగం టీటీవీ దినకరన్కు కుక్కర్ చిహ్నం దక్కింది. ఆయన పార్టీ గతంలో కుక్కర్ చిహ్నంలోనే పోటీచేస్తూ వచ్చింది. అయితే ప్రతి ఎన్నికలలో ఈచిహ్నం కోసం పోరాటం తప్పడం లేదు. తాజాగా అన్నాడీఎంకే, బీజేపీ ఎన్డీఏ కూటమిలో 11 స్థానాలలో టీటీవీ దినకరన్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో వీరందరికి కామన్గా కుక్కర్ చిహ్నం దక్కింది. అదే సమయంలో ఈ పార్టీ అభ్యర్థులు పోటీలో లేని చోట్ల కుక్కర్ చిహ్నం స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించనున్నడంతో కూటమి పార్టీలకు కలవరం తప్పడం లేదు. ఇక డీఎంకే కూటమిలో 8చోట్ల వీసీకే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆపార్టీకి కుండ చిహ్నంను ఎన్నికల కమిషన్ కేటాయించింది. తిరువొత్తియూరు: చైన్నె మైలాపూర్ కపాలీశ్వర స్వామి ఆలయంలో పంగుణి ఉత్సవాలు గత 23వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో ముఖ్య ఘట్టమైన రథోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. 96 అడుగుల ఎత్తు, 300 టన్నుల బరువైన తేరులో కపాలీశ్వరర్, కర్పగాంబాల్ కొలువై విహరించారు. రథాన్ని శంభో మహాదేవా అంటూ పెద్దఎత్తున భక్తులు లాగారు. అలాగే ఈ ఉత్సవంలో మరో ముఖ్య ఘట్టమైన అరుబత్తు మూవర్ (63 మంది నాయనార్లు) ఉత్సవం సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది వెండి విమానంలో శివపెరుమాన్ స్వామి, 63 నాయన్మార్లతో కలిసి ప్రదక్షిణ, ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు కొనసాగింపుగా (బుధవారం) రాత్రి 8.30 గంటలకు తిరుకల్యాణ ఉత్సవం. 3వ తేదీన ఉత్సవ ముగింపు తిరుముళుకు (తీర్థవారి) జరగనుంది. 10వ తేదీన ఉత్సవాలు ముగుస్తాయని అధికారులు తెలిపారు. -
నిర్మాణాంతర కార్యక్రమాల్లో ‘కుదిరె కొంబు’
తమిళసినిమా: శ్రీలంకలో యుద్ధం, ఆ తరువాత పరిణామాలతో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. అదే కోవలో తెరకెక్కిన తాజా చిత్రం బొమ్మై. మహిళా దర్శకురాలు నవయుగ కుహరాజ తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఐబీసీ తమిళ్ పతాకంపై బాస్కరన్ కండియా నిర్మించారు. ఇందులో నవయుగ కుహరాజా ప్రధాన పాత్రను పొషించిన ఇందులో శ్రీలంకలోని ప్రతిభావంతులైన నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. యుద్దంలో పోరాడిన ఒక వీరవనిత అనంతరం ఎదుర్కొనే సమస్యల ఇతి వృత్తంగా రూపొందిన చిత్రం బొమ్మై. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం గురించి దర్శకురాలు పేర్కొంటూ తన చుట్టు పక్కలవారు, స్నేహితులు, బంధువుల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. కాగా ఈ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిందని యూనిట్ వర్గాలు తెలిపారు. ముఖ్యంగా స్వీడన్లో 2025లో జరిగిన లూలియా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో, బోడెన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ నూతన దర్శకురాలు అవార్డును గెలుచుకుంది. అదేవిధంగా ఈజిప్ట్ అమెరికన్ అంతర్జాతీయ చిత్రోత్సవాలు, యోరా అంతర్జాతీయ చిత్రోత్సవాల అవార్డులకు బొమ్మై చిత్రం అధికారికంగా ఎంపికై ంది. కాగా ఎం.రజనీకాంత్ సంగీతాన్ని అందించిగా, సీనియర్ ఎడిటర్ లెనిన్ పని చేసిన ఈ చిత్రం త్వరలో తమిళనాడులో విడుదలకు సిద్ధమవుతోంది. బొమ్మై చిత్రంలో నటి నవయుగ కుహరాజా తమిళసినిమా: కధలను మాత్రమే నమ్మి నిర్మించే చిత్రాల సంఖ్య ఇటీవల అధికమవుతోంది. అందులోనూ మంచి కంటెంట్తో రూపొందుతున్న చిన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ లభిస్తోంది. అలా మంచి సందేశంతో విభిన్న కథా, కథనాలతో రూపొందుతున్న తాజా చిత్రం కుదిరైకొంబు. యాపిల్ మూవీస్, యాస్ ఎంటర్టైన్మెంట్, రమేశ్ ప్రొడక్షన్స్ సంస్థల అధినేతలు గొమతి అయ్యనార్,యాస్, ఆర్. రమేష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయ్యనార్ కృష్ణ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించడంతో పాటూ ఒక కీలక పాత్రను పోషించడం విశేషం. ఇల్లియాస్, రామ్రాజ్,రమేశ్ ,ప్రవీణ్,చౌకత్అలీ, సానాశ్రీ,దుర్గ,లావణ్య, వేల్రాజ్, మమ్ముట్టి శింగారవేలన్, షణ్ముగం,రవి, శేఖర్,శరవణన్,గణేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. చౌకత్అలీ సంగీతాన్ని, ఏఎస్.రాజ్, జయకుమార్ల ద్వయం ఛాయాగ్రహణంను అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. చిత్ర వివరాలను తెలుపుతూ అందని దాని కోసం ఆశపడితే ఎదురైయ్యే పరిణామాలు, తెలియకుండా చేసే తప్పుల వల్ల ఎలాంటి సంఘటనలను ఎదుర్కోవలసి వస్తుందీ? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రం ఇదని పేర్కొన్నారు.చిత్ర షూటింగ్ను పేలం, ఏర్కాడు ,పాల్కాడు ప్రాంతాల్లో 55 రోజుల పాటు నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. చిత్రంలో మూడు పాటలు, మూడు పోరాట దృశ్యాలు చోటు చేసుకుంటాయన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయనీ,త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. -
ఐఐటీ మద్రాస్లో పీజీ కోర్సులు
సాక్షి, చైన్నె:దేశంలోనే అగ్రశ్రేణి విద్యాసంస్థగా వెలు గొందుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్, 2026–27 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దర ఖాస్తులను ఆహ్వానిస్తూ సోమవారం ప్రకటన చేసింది. ఇందులో ఎం.టెక్, ఎం.ఎస్సీ, ఎం.ఏ ప్రోగ్రాముల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఏప్రిల్ 27, 2026 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. కోర్సులు:డేటా సైన్స్–ఏఐ, ఎలక్ట్రిక్ వెహికల్స్, రోబోటిక్స్,సెమీకండక్టర్ టెక్నాలజీ వంటి అత్యాధునిక ఇంజనీరింగ్ విభాగాలతో పాటు ఇంగ్లీష్ స్టడీస్, ఎకనామిక్స్ వంటి హ్యుమానిటీస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఎం.టెక్ విభాగంలో 735 సీట్లు, ఎం.ఏ విభాగంలో 100 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఎంపిక విధానం గురించి వివరిస్తూ, గేట్ స్కోర్ ఆధారంగా ఎం.టెక్, ఎం.ఏ ప్రవేశాలు ఉంటాయన్నారు. ఎంఎస్సీ కోసం జామ్ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరిగా స్పష్టంచేశారు. తరగతుల జూలై 27వ తేదీ ప్రారంభం అవుతుందని, అర్హత కలిగిన భారతీయ విద్యార్థులకు నెలకు రూ. 12,400 టీచింగ్ అసిస్టెంట్షిప్ లభిస్తుందన్నారు. వీటితో పాటూ డీఏఈ వంటి ప్రతిష్టాత్మక ఫెలోషిప్ల ద్వారా ఎంపికై న వారికి నెలకు రూ.35,000 స్టైపెండ్తో పాటు అణుశక్తి విభాగంలో ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామన్నారు. ఉద్యోగ అవకాశాలు ఐఐటీ మద్రాస్లో పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు ఏటా టాప్ కంపెనీల్లో ప్లేస్మెంట్స్ లభిస్తాయని, పరిశ్రమలతో ఉన్న అనుసంధానం, అత్యాధునిక పరిశోధనా సౌకర్యాల వల్ల ఇక్కడి విద్యార్థులకు గ్లోబల్ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని అకడమిక్ కోర్సుల డీన్ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఈసందర్బంగా పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ను సంప్రదించవచ్చని సూచించారు. -
విజయపు కూటమి
●మిత్రులకు స్టాలిన్ విందు సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముందుగా మిత్ర పక్షాల నేతలతో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. వారికి తేనీటి విందు ఇచ్చారు. ఇది గెలుపు కూటమి అని, విజయంతో మళ్లీ కలుద్దామని వారికి సూచించారు. అన్నా అరివాలయంలో జరిగిన ఈ సమావేశానికి టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత షణ్ముగం, సీపీఐ నేత వీర పాండియన్, మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్తో పాటుగా ముఖ్యనేతలందరూ హాజరయ్యారు. మంగళవారం నుంచి స్టాలిన్ ప్రచారంలో బీజీ కానున్నారు. తిరువారూర్నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు. దీంతో కూటమి పార్టీలతో ఎన్నికల వ్యూహాల గురించి చర్చించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. కూటమిలోని కీలక నేతల ప్రచార అంశాల గురించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక, డిప్యూటీ సీఎం, యువజన నేత ఉదయ నిధి స్టాలిన్ సోమవారం కాంచీపురం వేదికగా తమ అభ్యర్థి నిత్య సుమార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంతో శ్రీకారం చుట్టారు. కాగా ముందుగా సీపీఎంకు కేటాయించిన పద్మనాభపురంను కాంగ్రెస్కు, కాంగ్రెస్కు కేటాయించిన విలవన్ కోడ్ స్థానాన్ని మార్చుకునే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే కాంగ్రెస్ జాబితా విడుదలలో జాప్యం గురించిన చర్చ సాగినట్టు సమాచారం. ఇక మిత్రపక్షాల అభ్యర్థులు, నేతలు స్టాలిన్ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఇదిలా ఉండగా తమిళనాడులో అధిక సీట్లు రాబట్టుకునే సత్తా ఇక్కడి కాంగ్రెస్ నేతలకు లేదంటూ ఏఐసీసీ నేత ప్రవీణ్ చక్రవర్తి తాజాగా వ్యాఖ్యానించడం హాట్టాపిక్గా మారింది. -
కాంగ్రెస్లో చేరిన జీకే మణి వారసుడు
రాందాసుకు షాక్ సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టాలి మక్కల్ కట్చి( పీఎంకే) రాందాసు శిబిరంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ , యువజన విభాగం నేత అన్బుమణి రామదాస్ మధ్య పెరుగుతున్న విభేదాలతో ఇప్పటికే పార్టీ ముక్కలైంది. పార్టీలోని ప్రధాన సామాజిక వర్గమైన వన్నియర్ సంఘం కార్యవర్గ సభ్యులలో మెజారిటీ నాయకులు రాందాస్ నిర్ణయాలపై సంతృప్తికరంగా ఉన్నారు. ఈ పరిస్థితులలో రాందాసుకు వెన్నదన్నగా ఉన్న పార్టీ గౌరవ అధ్యక్షులుగా ఉన్న జీకే మణి తాజాగా అసంతృప్తితో ఉన్నట్టు వెలుగు చూసింది. కాంగ్రెస్లోకి తమిళకుమారన్: జీకే మణి కుమారుడు , ప్రముఖ నిర్మాత తమిళకుమారన్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. కేవలం 5 నెలల క్రితమే ఈయనకు పీఎంకే యువజన విభాగం అధ్యక్ష పదవిని రాందాస్ కట్టబెట్టారు. తమిళకుమారన్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాందాస్, ఆయన్ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. యువజన విభాగం అధ్యక్ష పదవిని తన మనవడు ముకుంద్ కు అప్పగించాలని రాందాస్ భావిస్తున్నట్లు సమాచారం. -
ఎన్నికల రేసులో ఎన్కౌంటర్ స్పెషలిస్టు
సాక్షి, చెన్నై : దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి శశికళ నేతృత్వంలోని అఖిల భారత పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్రకళగం అభ్యర్థిగా ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరుగడించిన మాజీ పోలీసు అధికారి ఎస్. వెల్లదురై రంగంలోకి దిగారు. ఈ ఎన్నికలలో శశికళ పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుతో కలిసి కూటమిగా ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులలో సోమవారం శశికళ జాబితాను ప్రకటించారు. 21 మందితో తొలి జాబితాను ఆమె ప్రకటించారు. ఇందులో శంకరన్ కోయిల్ నుంచి అన్నాడీఎంకే మాజీ ఎంపీ వసంతి మురుగేషన్ పోటీ చేస్తున్నట్టు తెలిపారు. మదురైలో చక్రవర్తి, తిరుచ్చి తూర్పులో నందకుమార్, రాజ పాళయంలో డాక్టర్ హరీష్ ముదుకులత్తూరులో రిటైర్డ్ అదనపు ఎస్పీ డాక్టర్ రాంకుమార్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే,పొత్తుల మేకు సాత్తూరు, ఆలంకులం నియోజకవర్గాలను పసుంపొన్ మక్కల్ దేశం కట్చి, నన్నిలం నియోజకవర్గాన్ని వెల్లలార్ మున్నేట్ర కళగంకుకు కేటాయించినట్టు వివరించారు. అదే సమయంలో శశికళ పార్టీ తరపున నాంగునేరిలో పోటీ చేస్తున్న అభ్యర్థిపై అందరి దృష్టి పడింది. పోలీసు శాఖలో రిటైఱ్డ్ ఎస్పీగా ఉన్న వెల్ల దురై ఇక్కడ అభ్యర్థి కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. స్మగ్లర్ వీరప్పన్ వేటలో కీలక పాత్ర పోషించిన వెల్లదురై, తన సర్వీసులో ఎన్నో ఎన్కౌంటర్లలో పాల్గొని ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఎన్నో సస్పెన్షన్లు, ట్రాన్స్ఫర్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. తాజాగా ఎన్నికల రేసులో ఆయన దిగడంతో నాంగునేరి నియోజకవర్గంలో చర్చ మొదలైంది. -
అది నిజం కాదు, ఎవరూ నమ్మకండి: ఖుష్బూ
చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా అంటే తమను జనాలతో కలిపే వారధిగా భావిస్తారు. వ్యక్తిగత, వృత్తిపర విషయాలను పంచుకుంటూ ఉంటారు. మరికొందరు ఎప్పుడో ఒకసారి కానీ పోస్టులు పెట్టరు. అయితే సెలబ్రిటీల పేరుతో కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తుంటారు. ఇప్పుడదే జరిగింది. ఎక్స్ (ట్విటర్)లో ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సి పేరిట ఓ అకౌంట్ ఉంది. త్వరలోనే కొత్తది..దానికి సంబంధించిన స్క్రీన్షాట్ను ఖుష్బూ షేర్ చేస్తూ.. అది ఫేక్ అకౌంట్ అని స్పష్టం చేసింది. తన భర్త ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో లేడని వెల్లడించింది. కాబట్టి సుందర్.సి పేరుపై కనిపించే ఖాతాలను నమ్మవద్దని కోరింది. త్వరలోనే అతడికి ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేయనున్నట్లు తెలిపింది. ఇకపోతే ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన ఖుష్బూ.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంది. మొదట్లో డీఎంకేలో చేరింది. నాలుగేళ్లకే ఆ పార్టీని వదిలి కాంగ్రెస్లో అడుగుపెట్టింది. రాజకీయ ప్రవేశంఆరేళ్లకే కాంగ్రెస్ను సైతం వీడి బీజేపీలో చేరింది. 2025లో ఆమె తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితురాలైంది. ఇదిలా ఉంటే త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో ఖుష్బూ భర్త సుందర్. సి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. ఎన్డీయే కూటమి మిత్రపక్షమైన పుతియ నీది కట్చి (Puthiya Neethi Katchi (PNK) పార్టీ నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నాడు. మధురై నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నాడు. This is a fake account of Director #SundarC . He is not not any social media platform as on date. Pls do not follow this or interact on this or any other similar account on any social platform. . Shall be creating a new and verified account for him soon. 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/9P1VYV67U7— KhushbuSundar (@khushsundar) March 30, 2026 చదవండి: ప్రేమిస్తే ఛాన్స్ మిస్ అయ్యేది.. ముఖానికి గ్రీజు పూసుకోవడంతో..: హీరో -
పట్టుదలతో ఏ భాషైనా నేర్చుకోవచ్చు
–రచయిత్రి, వక్త బులుసు నవీన కొరుక్కుపేట: పట్టుదల అంటూ ఉంటే ఏ భాషైనా సొంతగా నేర్చుకోవచ్చునని ప్రముఖ రచయిత్రి, వక్త బులుసు నవీన అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు వేద విజ్ఞాన వేదిక తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధరావహికలో భాగంగా 171వ ప్రసంగంగా సంస్కతంలో చమత్కారం అనే అంశంపై ఉపన్యాస కార్యక్రమం ఆదివారం రాత్రి ఆంధ్రా క్లబ్ లో జరిగింది.వక్తగా అనువాదకురాలు, ప్రముఖ రచయిత్రి బులుసు నవీన విచ్చేసి ఉపన్యాసం అందించారు. ఆమె మాట్లాడుతూ... పట్టుదల అంటూ ఉంటే ఏ భాషైనా సొంతగా నేర్చుకోవచ్చు. అలాగే నేను తెలుగు నేర్చుకున్నా, సంస్కత సాహిత్యం సాగరం వంటిదన్నారు. వైమానిక, గణిత వంటి ఎన్నో శాస్త్రాలు, అనేక కావ్యాలు ఇందులో భాగం అని అన్నారు. విషయాన్ని అందంగా చెప్పడం కావ్యాలకే చెల్లింది. కొన్ని పొడుపు కథలను కూడా నవీన ప్రస్తావించి ఆకట్టుకున్నారు.. కవులు అత్యంత చమత్కారంగా పూరించిన కొన్ని సమస్యలను వివరించటం ప్రత్యేకంగా నిలిచింది. శివుడు గుణమనే చంద్రుడిని తలపై పెట్టుకొని విషాన్ని కంఠంలో దాచుకున్నట్టు కవులు గుణ దోషాలను స్వీకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా కార్యదర్శి కందనూరు మధు స్వాగతోపన్యాసం చేయగా, వక్త నవీనాను జేకే రెడ్డి సభకు పరిచయం చేసి ఘనంగా సత్కరించారు.తెలుగు సాహితీ ప్రియులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
మా గ్రామంలో సెల్ టవర్ వద్దు
తిరువళ్లూరు: నివాస ప్రాంతాల్లో సెల్ఫోన్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థాఽనికులు ఆందోళనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్ చెంబులివరం గ్రామంలో 5వేల మంది ప్రజలు నివాసం వుంటున్నారు. ఈ గ్రామంలో సెల్ టవర్ నిర్మాణానికి గత రెండు నెలల క్రితం పనులను చేపట్టారు. అయితే తమ ప్రాంతంలో సెల్ఫోన్ టవర్ నిర్మాణం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయని వాపోయిన స్థానికులు వెంటనే పనులను నిలిపివేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. విషయం తెలసి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పనులను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామన్న హామీతో ఆందోళనన విరమించారు. -
ఘనంగా ప్రవృత్తి 2కే26
తిరువళ్లూరు: ప్రవత్తి 2కే26 వేడుకలు పేరిట ప్రత్యూష కళాశాల నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకుంది. తిరువళ్లూరు జిల్లా అరణ్వాయల్కుప్పంలో ప్రత్యూష ఇంజనీరింగ్ కళాశాల వుంది. ఈ కళాశాలలో ఏటా సాంస్కతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రవత్తి 2కే26 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని శుక్ర శని తదితర రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. వేడుకలను కళాశాల ఛైర్మన్ రాజారావ్ అద్యక్షత వహించి ప్రారంభించారు. కళాశాల డైరెక్టర్ హైమావతి, ట్రస్టీ షఖీల తదితరులు ప్రారంభోపన్యాసం చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ అతిధిలను పరిచయం చేశారు. కాగా వేడుకలు ఏఐడీఎస్ విభాగం విద్యార్దులు చేసిన భరతనాట్యం పలువురిని ఆకట్టుకుంది. ముఖ్యఅతిధిలుగా సినీనటులు హర్షత్ఖాన్, అఽధిర్చి అరుణ్ సినీ నటి మిర్నాలినిరవి, విజయ్టివీ ప్రముఖులు మోసస్, రిక్కీ, చరణ్, సయ్య్ద్, అమర్ధీప్ చౌదరి, అక్రమ్ తదితరులు హాజరైృయ్యారు. వీరు ఆటలు పాటలతో విద్యార్దులను ఉత్సాహపరిచారు. సంగీతం, పాటలు, డాన్స్లతో కళాశాల ఆవరణం సందడిగా మారింది. వైస్ ఛైర్మన్ చరణ్తేజ, సీఈఓ ప్రత్యూష, కల్చరల్ కోర్డినేటర్లు ఉమ, శ్రీదేవి పాల్గొన్నారు. -
టీవీకే శ్రేణుల రాస్తారోకో
తిరువళ్లూరు: స్థానికులకే టికెట్ కేటాయించాలని కోరుతూ టివీకే శ్రేణులు రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. తిరువళ్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు టీవీకే అభ్యర్థులను ప్రకటించింది. తిరువళ్లూరు నియోజకవర్గానికి సేలం జిల్లాకు చెందిన అరుణ్కుమార్ను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన పార్టీ శ్రేణులు తిరువళ్లూరు టీవీకే అభ్యర్థిగా స్థానికులకే అవకాశం ఇవ్వాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. టీవీకే అధినేత విజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అభ్యర్థిని మార్చాలని లేని పక్షంలో నియోజకవర్గంలోని పార్టీ సభ్యులు మాకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని టీవీకే నేతలను చుట్టముట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో వున్న క్రమంలో రాస్తారోకో నిర్వహించడం సరికాదని, వెళ్లకుంటే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీంతో పార్టీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో తిరుమా పోటీ
సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ నిర్ణయించారు. ఆయన కాట్టుమన్నార్ కోవిల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ తమిళనాడులో దళిత సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా ఉన్న విషయం తెలిసిందే. 2009లో చిదరంబరం లోక్ సభ నుంచి ఆయన పార్లమెంట్కు వెళ్లారు. 2014లో ఓటమి పాలయ్యారు. 2019లో మళ్లీ అదే నియోజవర్గం నుంచి గెలిచారు. 2014లోనూ అదే నియోజకర్గం నుంచి ఎంపీ అయ్యారు. మూడు సార్లు ఎంపీగా పార్లమెంట్కు వెళ్లారు. ఈ పరిస్థితులలో ఆయన ప్రపథమంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి నిర్ణయించారు. డీఎంకే కూటమిలో వీసీకేకు 8 సీట్లు కేటాయించారు. ఇందులో కాట్టుమన్నార్ కోవిల్(రి) నుంచి తిరుమావళవన్ పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈమేరకు ఆయన ఆదివారం రాత్రి వీడియో ద్వారా వీసీకే తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఆ మేరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తిరుమావళవన్ కాట్టుమన్నార్ కోవిల్(రి) నియోజకవర్గంలో, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సిందనై సెల్వన్ చేయూర్(రి) నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. అలాగే, , తిరుప్పోరూర్: నియోజకవర్గంలో పార్టీ నిర్వాహక కార్యదర్శి పన్నీరు దాసు, అరక్కోణం(రి)లో న్యాయవాది ఎలిల్ కరోలి, దిండివనం(రి)లో పార్టీ సంయుక్త కార్యదర్శి వన్నియరసు, పెరియకుళం(రి)లో మరో సంయుక్త కార్యదర్శి శక్తి వేల్ అలియాస్ ఆర్టల్ అరసు,కళ్లకురిచ్చి(రి)లో న్యాయవాది మాలతి , బన్రూటి నియోజకవర్గంలో మైనారిటీ నేత అబ్దుల్ రహ్మాన్ పోటీ చేయనున్నారు. -
తిరువారూర్లో వేడుకగా రథోత్సవం
తిరువొత్తియూరు: తిరువారూర్లో వెలిసిన త్యాగ రాజ స్వామి ఆలయంలో రథోత్సవం (ఆళిత్తేరోట్టం) ఆదివారం కోలాహలంగా జరిగింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరువారూరు త్యాగరాజ స్వామి ఆలయం శైవ మతానికి ప్రధాన పీఠంగానూ, ఇచ్చట జన్మించిన వారికి ముక్తినిచ్చే స్థలంగానూ, నాయనార్లు తమ కీర్తనలు వినిపించిన స్థలంగా విలసిల్లుతోంది. ఆలయంలో మూల విరాట్ వన్మీకనాథుడు, ఉత్సవమూర్తిగా త్యాగరాజు ఉన్నారు. ఈ ఆలయంలో వున్న రథం ఆసియా ఖండంలోనే అతి పెద్ద తేరు (రథం) అని పిలువబడుతోంది. ఆళి అంటే సముద్రమంత పెద్దది అని అర్థం. ఈ సంవత్సరం పంగుణి ఉత్తర బ్రహ్మోత్సవాలు ఈనెల 6వ తేదీన ధ్వజరోహనంతో ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రతిరోజూ స్వామికి ప్రత్యేక అభిషేక, ఆరాధనలు, ఉత్సవ మూర్తి నాలుగు మాడ వీధి ఉత్సవాలు జరుగుతూ వచ్చాయి. ముఖ్యమైన ఉత్సవమైన ఆళిత్తేరోట్టం రథోత్సవం ఆదివారం (29వ తేదీ) ఘనంగా నిర్వహించారు. చైన్నె మైలాపూరులో రథోత్సవం చైన్నె మైలాపూరు కపాలీశ్వర స్వామి ఆలయంలో పంగుణి బ్రహ్మోత్సవాల ను పురస్కరించుకుని ఆదివారం ఘనంగా రథోత్సవం నిర్వహించారు. అ అలాగే కాంచీపురం ఏకాంబరం స్వామి ఆలయంలోనూ పంగుని ఉత్తరం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం రథోత్సవం చేపట్టారు. -
రెడ్ జెయింట్ మూవీస్ ఖాతాలో ధనుష్ చిత్రం
తమిళసినిమా: నటుడు ధనుష్ తాజాగా నటించిన చిత్రం కరా. నటి మమితాబైజు నాయకిగా నటించిన ఈ చిత్రంలో దర్శకుడు కేఎస్.రవికుమార్,సురాజ్ వెంజరముడు, జయరాం, పృధ్వీ పాండిరాజన్, శ్రీజారవి, కరుణాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని, తేనీ ఈశ్వర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 30వ తేధీన తెరపైకి రావడానికి సిధ్ధం అవుతోంది. తనన నమ్మిన వారిని హీరో ఎలా కాపాడారు అన్న పలు అసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్రంలోని పాత్రలను పరిచయం చేస్తూ ఒక వీడియోను యూనిట్ వర్గాలు ఇటీవల విడుదల చేశారు. అదే విధంగా చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్కు ధనుష్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్ టెయినర్గా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందిందన్నది గమనార్హం. -
నీళిరా వంటి పోరు కథా చిత్రాలకు..
తమిళసినిమా: స్టోన్బెంచ్ స్టూడియోస్ సంస్థ అధినేతలు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, కార్తీకేయన్ సంతానం, స్పిరిట్ మీడియా అధినేత దగ్గుబాటి రానా కలిసి నిర్మించిన చిత్రం నీళిరా. బాలుమహేంద్ర శిష్యుడు సోమినాదన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రంలో నటుడు నవీన్ చంద్ర, కపిలావేణు, విదూ, రూపా కొడువర్, కయల్ విన్సెంట్, సిద్దు కుమరేశన్ తదితరులు ప్రదాన పాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ సందర్బంగా చిత్ర ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలుమహేంద్ర సతీమణి అఖిల ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. కాగా ఈ సమావేశానికి దర్శకుడు వెట్రిమారన్, ఆర్కే.సెల్వమణి, లింగుసామి, రాజుమురుగన్, రామ్కుమార్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నిళీరా చిత్ర ప్రత్యేకత గురించి మాట్లాడుతూ యూనిట్ సభ్యులను ప్రశంసించారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన రానా దగ్గుబాటి మాట్లాడుతూ దర్శకుడు సోమినాదన్ సొంత జీవితమే ఈ చిత్రం అని పేర్కొన్నారు. ఈ వేదికపై పలువురు దర్శకులు మాట్లాడుతూ జర్మనీ, వియత్నాం వంటి దేశాల్లో జరిగిన పోరాటాల గురించి అనేక చిత్రాలు రూపొందాయని, అయితే మన దేశం గురించి, మన మన్ను గురించి చిత్రాలను ఎవరూ నిర్మించడం లేదని అన్నారన్నారు. అలాంటి చిత్రాలను నిర్మించడానికే గత ఐదేళ్ల క్రితం ప్రారంభించిన సంస్థ స్పిరిట్ మీడియా అని చెప్పారు. ఈ సంస్థపై మన సంస్కృతిని ప్రతిఫలించే విధంగా, మలయాళం, మరాఠి, ఇప్పుడు తమిళం, తెలుగు భాషల్లో చిత్రాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. స్టోన్ బెంచ్ స్టూయోస్ సంస్థతో కలిసి ఈ నీళిరా చిత్రంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ నీళిరా వంటి పోరు కథా చిత్రాలకు సరైన వేదిక సినిమా మాధ్యమం అని కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు. నీళిరా చిత్ర ఆడియోను ఆవిష్కరించిన అఖిలా బాలుమహేంద్ర, సినీ ప్రముఖులతో యూనిట్ సభ్యులు -
అన్నా అరివాలయంకు మిత్రుల క్యూ!
సాక్షి, చైన్నె: సీట్ల సర్దుబాటు, నియోజకవర్గ కేటాయింపు ప్రక్రియతో అభ్యర్థులు అన్నా అరివాల యం వైపుగా క్యూ కడుతున్నారు. డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్ను మిత్ర పక్షాల అభ్యర్థులు ప్రసన్నం చేసుకుని ఆశీస్సులు అందుకుంటున్నారు. వివరాలు.. అధికార డీఎంకే తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మిత్రులకు సీట్లు కేటాయించింది. వారు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించే పనిలో పడ్డారు. మైనారిటీలకు పెద్దపీట డీఎంకే కూటమి తరపున ఈసారి 10 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 8 మంది డీఎంకే గుర్తు ఉదయ సూర్యుడిచిహ్నంలో పోటీ చేస్తున్నారు. ఇందులో ఆవడి నుండి మంత్రి ఎస్.ఎం. నాజర్, సెంజి నుండి మాజీ మంత్రి కె.ఎస్. మస్తాన్, పాళయంకోట్టై నుండి అబ్దుల్ వహాబ్, రాయపురం నుండి సుబేర్ ఖాన్లు డీఎంకే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక, కూటమిలోని మనిద నేయమక్కల్ కట్చి తరపున జవాహిరుల్లా (నాగపట్నం, అబ్దుల్ సమద్ (మనప్పారై) పోటీలో ఉన్నారు. అలాగే ఎస్డిపిఐ తరపున నన్నిలం నుండి నెల్లై ముబారక్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక, ఐయూఎంఎల్ తరపున షాజహాన్ (పాపనాశం), సయ్యద్ ఫరూక్ (వాణియంబాడి) నిచ్చెన గుర్తుపై పోటీ చేస్తున్నారు. సిపిఐ, ఎండీఎంకే అభ్యర్థుల జాబితా విడుదల డీఎంకే కూటమిలో 5 స్థానాలు దక్కించుకున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తన అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో తిరుతురైపూండి: మరిముత్తు, తలి టి.రామచంద్రన్, తిరుప్పూర్, రవి, శ్రీవిల్లిపుత్తూరు: మహాలింగం, భవానీ సాగర్: సుందరం పోటీ చేస్తున్నారు. ఇక, ఎండీఎంకే సైతం అభ్యర్థులను ప్రకించింది. ఇందులో మోడకురిచ్చి– సెంథిల్ నాథన్, మదురై దక్షిణం– భూమినాథన్, కడయనల్లూరు – డీఎం రాజేంద్రన్లు డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేయనున్నారు. సిర్కాళి – సెంథిల్ సెల్వన్ మాత్రంప్రత్యేక చిహ్నంలో పోటీచేస్తారని ఎండీఎంకే నేత వైగో ప్రకటించారు. ఇప్పటికే డీఎండీకే తన అభ్యర్థులను ప్రకటించింది. డీఎండీకే, ఎండీఎంకే అభ్యర్థులతో పాటూ డీఎంకేకు చెందిన అభ్యర్థులు అనేక మంది అన్నా అరివాయలం వైపుగా క్యూ కట్టారు. స్టాలిన్ ఆశీస్సులు అందుకున్నారు. తాంబరం డీఎంకేలో అసమ్మతి సెగ అభ్యర్థుల ప్రకటన డీఎంకేలో కొన్ని చోట్ల అసమ్మతికి దారితీసింది. తాంబరం నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.ఆర్. రాజాకు ఈసారి టికెట్ నిరాకరించడం కలకలం రేపింది. ఆయన స్థానంలో డాక్టర్ కృతికా దేవిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఎంపీ టీఆర్ బాలు నివాసాన్ని ముట్టడించిన నిరసనకారులు తదుపరి చైన్నెలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. స్థానిక నేతను కాదని బయటి వ్యక్తికి సీటు ఇవ్వడం ఏంటి? అంటూ నినాదాలు చేశారు. కాగా, తనకు సీటు రాక పోవడంతో టీ నగర్ డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే కరుణానిధి తన పదవికి రాజీనామా చేశారు. స్టాలిన్ ఎన్నికల ప్రచారం ఖరారు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ నెల 31వ తేదీ నుండి తన సుడిగాలి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తిరువారూర్లో ఈ ప్రచారం మొదలు కానున్నది. ఏప్రిల్ 1– తిరుచ్చి, కరూర్ జిల్లాల్లో , 2న ఈరోడ్, కోయంబత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇక, డీఎంకే కూటమిలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కుస్తీ ఢిల్లీ వేదికగా జరుగుతోంది. ఇక, వీసీకే తన అభ్యర్థుల జాబితా తయారీలో నిమగ్నమైంది. -
క్లుప్తంగా
రూ. 1.22 కోట్లు స్వాధీనం తిరువొత్తియూరు: మొగప్పేర్ ప్రాంతంలో కొరట్టూరు పోలీసులు శనివారం అర్ధరాత్రి గస్తీ నిర్వహించారు. గోల్డెన్ కాలనీ ప్రాంతంలోని ఒక ఇంటి వాకిలి వద్ద నిలబడి ఉన్న ఉత్తర రాష్ట్రానికి చెందిన యువకుడు పోలీసులను చూడగానే తన చేతిలో ఉన్న సంచిని కింద పడేసి పారిపోయాడు. పోలీసులు ఆ సంచిని తనిఖీ చేయగా, అందులో కట్టల కట్టలుగా నగదు ఉంది. ఈ విషయంపై గస్తీలో ఉన్న ఇన్స్పెక్టర్ అశోక్ ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ దళానికి తెలియజేశారు. దీంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి అముద నేతృత్వంలో అధికారులు, పోలీసులు ఆ ప్రాంతంలోని మంజునాథన్ అనే వ్యక్తి ఇంటిలోకి వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇందులో అక్కడున్న 2 సంచులు మొత్తం కట్టల కట్టలుగా కరెన్సీ నోట్లు ఉంది.మొత్తం రూ. 1 కోటి 22 లక్షల 78 వేల నగదు ఉంది. ఈ డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో ఎన్నికల అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని అంబత్తూరులోని ప్రభుత్వ ఖజానాలో అప్పగించారు. దీనిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అంబత్తూరులో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులచే రూ. 1.22 కోట్లు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. తిరువళ్లూరు: పిల్లలపై తల్లిదండ్రులు తరచూ నిఘా వుంచాలని ఆర్ఎంకే విద్యాసంస్థల ఛైర్మన్ ఆర్ఎస్ మునిరత్నం సూచించారు. తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్ఎంకే పాఠశాలలో కేజీ విద్యార్దులకు పట్టాలు అందజేసే కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. కార్యక్రమానికి ప్రిన్సిపల్ చంద్రక ప్రసాధ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఛైర్మన్ ఆర్ఎస్ మునిరత్నం హాజరై ప్రసంగించారు. చిన్నపిల్లలకు సెల్ఫోన్ ఇచ్చి వారిని భానిసలుగా చేయవద్దని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తెరవెనుక ఏం చేస్తున్నారో పర్యవేక్షించాలని, సెల్ఫోన్ లాంటి పరికరాలను నూతన పరిశోధనలు, అభ్యసనం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ఛైర్మన్ ఆర్ఎం కిషోర్, సలహదారుడు పళనీస్వామి పాల్గొన్నారు. తిరువొత్తియూరు: చైన్నె పశ్చిమ మాంబళం, బరోడ వీధిలో 4 అంతస్తుల కొత్త భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ బెంగళూరుకు చెందిన శబరి ( 45) స్నేహితులతో కలిసి ఉంటూ కార్పెంటర్ పని చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పక్కనే ఉన్న భవనంలో శబరి అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించాడు. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన ఇంటి యజమాని అశోక్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శబరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో జరిగిన గొడవలో ఎవరైనా అతన్ని తోసి చంపారా? అనే కోణాలతో సహా పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ ప్రాంతంలోని నిఘా కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో శ్రీ పార్థసారథి స్వామి సభ ఆధ్వర్యంలో గత 60 రోజులుగా సాగిన భారత నృత్య ఉత్సవం ఘనంగా ముగిసింది. ఆళ్వార్ పేటలోని నారద గాన సభలో జరిగిన ముగింపు వేడుకల్లో ప్రముఖ భరతనాట్య విద్వాంసురాలు ప్రియదర్శిని గోవింద్కు ప్రతిష్టాత్మకమైన ‘నాట్య కళాసారథి’ బిరుదును ప్రదానం చేశారు.ఈ సభ 126వ వార్షికోత్సవంలో భాగంగా జనవరి 3న ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో సుమారు 144 నృత్య ప్రదర్శనలు జరిగాయి. భారతీయ శాసీ్త్రయ నృత్య సంప్రదా యాలకు ప్రతిబింబంగా నిలిచిన ఈ వేడుకల్లో 200 మందికి పైగా కళాకారులు, విద్యార్థులు, 77 మంది ప్రముఖ గురువులు పాల్గొన్నారు. గౌరవ సత్కారం: భారతీయ శాసీ్త్రయ నృత్య రంగానికి ప్రియదర్శిని గోవింద్ చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. వారితో పాటు మరికొందరు విద్వాంసులకు కూడా సర్టిఫికెట్లను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి నల్లి కుప్పుస్వామి శెట్టి అధ్యక్షత వహించగా, ప్రముఖ నృత్యకారిణులు సుధారాణి రఘుపతి, మీనాక్షి చిత్తరంజన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.సభ ముగింపు సందర్భంగా శ్రీదేవి నృత్యాలయ బృందం, షీలా ఉన్నికృష్ణన్ కొరియోగ్రఫీలో ‘ఏకాదశ విష్ణుం’ అనే అద్భుత నృత్య రూపకాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. -
కాణిపాకంలో భక్తుల రద్దీ
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రద్దీ కనిపించింది. ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. దర్శనం కోసం క్యూ లైన్లు పొడవుగా ఏర్పడగా, గంటల తరబడి భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, శానిటేషన్ వంటి సదుపాయాలు కల్పించారు. భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. మొత్తానికి భారీ రద్దీ ఉన్నప్పటికీ అధికారులు సమన్వయంతో వ్యవహరించడంతో భక్తులు సజావుగా దర్శనం చేసుకున్నారు. -
నేటి నుంచి నామినేషన్ల పర్వం
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులను అనుసరించాల్సిన నిబంధనలు, ఆంక్షల వివరాలను ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ ప్రకటించారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల కోసం సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరణకు నియోజకవర్గాలలో రిటర్నింగ్ అధికారులు సిద్ధమయ్యారు. షెడ్యూల్ ఇలా.. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఏప్రిల్ 6 నామినేషన్లకు చివరి రోజు. కాగా మహావీర్ జయంతి (మార్చి 31), బ్యాంకు సెలవు (ఏప్రిల్ 1), గుడ్ ఫ్రైడే (ఏప్రిల్ 3), ఆదివారం (ఏప్రిల్ 5) ఉన్నందున, అభ్యర్థులకు కేవలం 4 రోజులు మాత్రమే సమయం నామినేషన్ల దాఖలుకు అందుబాటులో ఉంటుంది. దీంతో తొలి రోజు నుంచి నామినేషన్లు దాఖలుపై అభ్యర్థులు దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే డీఎంకే తో పాటుగా కూటమిలోని పార్టీలు అనేకం అభ్యర్థులను ప్రకటించాయి. అన్నాడీఎంకే అభ్యర్థులను ప్రకటించగా కూటమిలోని బీజేపీతో పాటూ ఇతర మిత్రులు ప్రకటించాల్సి ఉంది. నామినేషన్ల దాఖలు నిమిత్తం 234 నియోజకవర్గాలలోని రిటర్నింగ్ అధికారుల కార్యాలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులకు ఆంక్షలు, నిబంధనలు విధిస్తూ అర్చనా పట్నాయక్ ప్రకటించారు. అభ్యర్థితో పాటూ ఐదు గురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతించనున్నారు. ఆన్లైన్లో సైతం నా మినేషన్ల దాఖలకు అవకాశం కల్పించినా, వాటి నకలును రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. రిటర్నింగ్ అధికారి కార్యాలయ పరిసరాలలో భద్రతా పరంగా చర్యలు చేపట్టారు. అలాగే 2,106 ఫ్లయింగ్ స్క్వాడ్లు నిఘాతో వ్యవహరించడమే కాకుండా, నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలతో నిఘా పెంచారు. -
ఊంజల్సేవలో పద్మావతి అమ్మవారు
నారాయణవనం: టీటీడీ అనుబంధ పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పంగుణోత్తర ఉత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం సాయంత్రం అమ్మవారు ఊంజల్సేవలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం సుప్రభాతసేవతో నిత్యపూజాధి కై ంకర్యాలతో అర్చకులు నైవేద్యం సమర్పించారు. పద్మావతీ అమ్మవారికి సర్కారు అభిషేకం పూర్తి చేసి, ధూప, దీప నైవేద్య నివేదన చేశారు. సాయంత్రం నిత్య పూజా కై ంకర్యాలు పూర్తయిన తర్వాత అమ్మవారిని పట్టుపీతాంబరాలు, స్వర్ణాభరణాలను, సుగంధపుష్ప మాలికలతో సుందరంగా అలంకరించి తిరుచ్చి వాహనంపై అధిష్టింప చేశారు. ఆలయ అంతర ప్రాకారంలో ఊరేగిన అమ్మవారు ఊంజల్ మండపంలో ఊయలపై కొలువుదీరారు. వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఉయ్యాల సేవ కనుల పండువగా కొనసాగింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీటీడీ స్థానిక ఆలయాల సూపరింటెండెంట్ ధర్మయ్య, ఆలయ అధికారి నాగరాజు, ఆర్జితం అధికారి భరత్, ప్రధాన అర్చకులు శ్రీధరభట్టాచార్య, శ్రీనివాస రాఘవ భట్టాచార్య, నరసింహరాఘవ భట్టాచార్యులు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కమనీయం..సీతారాముల కల్యాణం
కొరుక్కుపేట: చైన్నె పులియాంతోపు నరసింహనగర్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం వేదపండితులు వేంకటేశ్వరస్వామికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులను అలకంరించి వేదికపై ఆశీనులు చేశారు. అనంతరం సీతారాములకు కల్యాణాన్ని కమణీయంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి తరించారు. ఆలయ ప్రెసిడెంట్ పండిట్ జయరాములు, కార్యదర్శి కోటపాటి వెంకటేశ్వర్లు, కోశాధికారి మాధవమూర్తి, డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కొండయ్య పాల్గొన్నారు. -
మంగాత్తా కాంబో రిపీట్ ?
తమిళసినిమా: మంగాత్తా చిత్ర కాంబో రిపీట్ కానుందా? అంటే కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే బదులే వస్తోంది. నటుడు అజిత్, దర్శకుడు వెంకట్ ప్రభులది హిట్ కాంబినేషన్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో 2010లో తెరకెక్కిన మంగాత్తా చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఆ చిత్రంలో నటుడు అజిత్ను విలనిజంతో కూడిన స్టైలిష్ పాత్రలో చూపించి సక్సెస్ అయ్యారు దర్శకుడు. దీంతో వీరి కాంబినేషన్ మరో చిత్రం ఎప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఇప్పుడు రానుందన్నది తాజా సమాచారం. దర్శకుడు వెంకట్ ప్రభు నటుడు శివకార్తికేయన్ హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని నటుడు శివకార్తికేయన్ కూడా తెలిపారు. అయితే ఈ చిత్రం ప్రారంభంలో ఆలస్యం జరగనున్నట్లు తెలిసింది. దీంతో దర్శకుడు వెంకట్ ప్రభు ఇటీవల నటుడు అజిత్ను కలిసి కథ వినిపించినట్లు, అది ఆయనకు నచ్చడంలో అందులో నటించడానికి సమ్మతించినట్లు సమాచారం. కాగా అజిత్ 2027 జనవరి వరకు చిత్రాల్లో నటించనని ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆయన 64వ చిత్రాన్ని గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. దీంతో వెంకట్ ప్రభు దర్శకత్వంలో అజిత్ నటించే చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందీ? దానికి సంబంధించిన వివరాలు ఏమిటి? అన్నది తెలియాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే. ఇకపోతే ఇది మాంగాత్తాకు సీక్వెల్గా ఉంటుందా? లేక కొత్త కథా చిత్రంగా ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది. దర్శకుడు వెంకట్ప్రభు, అజిత్ -
కంటి వైద్యశిబిరానికి విశేష స్పందన
కొరుక్కుపేట: వెంకటేశ్వర భక్త సమాజం–పెరంబూర్, ఉదీ కంటి ఆస్పత్రి–ఆళ్వార్పేట సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. చైన్నె పెరంబూర్లోని వెంకటేశ్వర భక్త సమాజం ఆనంద నిలయంలో సమాజం అధ్యక్షుడు తమ్మినేనిబాబు అధ్యక్షతన వైద్యశిబిరాన్ని పారిశ్రామికవేత్త వి.జంబులింగం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇందులో ఉది కంటి ఆస్పత్రి వైద్య బృందం పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి అద్దాలు ఉచితంగా అందజేశారు. అలాగే క్యాటరాక్ట్ బాధితులకు ఉచితంగా శస్త్రచికిత్స చేయనున్నట్టు తమ్మినేని బాబు తెలిపారు. వెంకటేశ్వర భక్త సమాజం సెక్రటరీ ఎస్.వెంకట్రామన్, సహాయ కార్యదర్శి పి.రవికుమార్, కోశాధికారి వెంకట రమణుడు, ట్రస్టీ పి.రామచంద్రన్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ఓటర్లపై హామీల వర్షం
సాక్షి, చైన్నె : ద్రావిడ మోడల్ 2.ఓ ప్రభుత్వమే లక్ష్యంగా ప్రజలపై వరాల జల్లులను డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ కురిపించారు. రూ. 20 వేల కోట్లతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్యాకేజి పేరిట బృహత్తర కార్యక్రమాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. అన్ని వర్గాలను ఆకర్షించే రీతిలో పలు అంశాలను ఎన్నికల వాగ్దానంగా ప్రకటించారు. వివరాలు.. డీఎంకేకు ప్రతి ఎన్నికలలో మేనిఫెస్టో అన్నది కీలక అన్న విషయం తెలిసిందే. అందుకే ప్రతి సారీ డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ నేత కనిమొళి నేతృత్వంలోని కమిటీ ద్వారా మేనిఫెస్టోను స్టాలిన్ రూపొందించడం జరుగుతోంది. ఆదిశగా గత కొన్ని నెలలుగా ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించింది. అన్ని వర్గాల అభిప్రాయలను సేకరించింది. అందర్నీ ఆకర్షించడమే కాకుండా, ప్రధానంగా మహిళ, యువత ఓటు బ్యాంక్ను గురి చేస్తూ వాగ్దానాల వర్షం కురిపించే విధంగా మేనిఫెస్టోకు రూపకల్పన చేసింది. మేనిఫెస్టో విడుదల చైన్నెలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఆదివారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కనిమొళి కరుణానిధి, తిరుచ్చి శివ, కోశాధికారి టీఆర్బాలుతో పాటుగా మేనిఫెస్టో కమిటీలోని ప్రతినిధులు పాల్గొన్నారు. గత ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో సాధించిన విజయాలను గుర్తుచేస్తూనే, రాబోయే ఐదేళ్లలో ‘ద్రవిడ మోడల్ 2.0‘ ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. అలాగే కీలక వాగ్దానంగా గృహిణులకు కానుక పేరిట ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలలోని గృహిణులకు రూ. 8,000 విలువైన కూపన్లు అందజేస్తారు. వీటితో వాషింగ్ మెషీన్, టీవీ, ఫ్రిజ్, మిక్సీ, మైక్రోవేవ్ ఓవెన్ వంటి వస్తువులను వారే స్వయంగా కొనుగోలు చేయవచ్చు లేదా పాతవాటిని మార్చుకోవచ్చు అని ప్రకటించారు. కీలక వాగ్దానాలు ఇవే.. -
స్టాలిన్ ప్రత్యర్థిగా సంతాన కృష్ణన్
సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అన్నాడీఎంకే అభ్యర్థుల 3వ జాబితా ఆదివారం విడుదలైంది. ఇందులో చైన్నెలో 12 చోట్ల అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంపై అభ్యర్థులు పోటీ చేయనున్నారు. సీఎం స్టాలిన్కు కొళత్తూరులో ప్రత్యర్థిగా జయ పైరవై సంయుక్త కార్యదర్శి సంతాన కృష్ణన్ను రంగంలోకి దించారు. వివరాలు.. అధికారమే లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి వ్యూహాలకు పదును పెట్టి, ప్రజల్లోకి ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కూటమి పార్టీలకు సీట్ల సర్దుబాటు ముగించారు. తమ అభ్యర్థులు తొలి జాబితాను 23 మందితో విడుదల చేశారు. అనంతరం 127 మందితో రెండో జాబితా ప్రకటించారు. తాజాగా 17 మందితో మూడో, తుది జాబితాను విడుదల చేశారు. ఇందులో చైన్నెలోనే 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో రెండు నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులు కీలకంగా మారారు. వీరిలో ఒకరు బి సంతనా కృష్ణన్. ఈయన కొళత్తూరులో సీఎం స్టాలిన్ను అన్నాడీఎంకే అభ్యర్థిగా ఢీ కొడుతున్నారు. మరొకరు చేపాక్కం– ట్రిప్లికేన్లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ను ఢీ కొట్టేందుకు ఆది రాజా రాం సిద్ధమయ్యారు.మూడవ జాబితాలోని కీలక అభ్యర్థులుకొళత్తూర్: బి. సంతాన కృష్ణన్, థౌజండ్ లైట్స్ – మాజీ మంత్రి బి వలర్మతి, అన్నానగర్ – మాజీ మంత్రి గోకుల ఇందిర, చేపాక్కం, ట్రిప్లికేన్ – ఆది రాజా రాం, ఆర్.కె. నగర్ – ఆర్.ఎస్. రాజేష్, విల్లివాక్కం– ఎస్.ఆర్. విజయకుమార్, వేళచ్చేరి– అశోక్, షోళింగనల్లూరు – కందన్, విరుగంబాక్కం– విరుగై వి.ఎన్. రవి, టి. నగర్ – మాజీ ఎ మ్మెల్యే సత్యనారాయణన్ అలియాస్ సత్య, హార్బర్ – రాయపురం మనో, ఎగ్మూర్ (రి)– అభిషేక్ రంగసామి పోటీ చేస్తున్నారు.ఆర్మ్ స్ట్రాంగ్ సతీమణికి సీటుబీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ చైన్నెలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన మరణం తదుపరి పరిణామాలతో సతీమని పొర్కొడి ఆర్మ్స్ట్రాంగ్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తమిళనాడు బీఎస్పీ పేరిట పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆర్మ్ స్ట్రాంగ్ హత్యకు న్యాయం కోసం పోరాడుతూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాడు బీఎస్పీకి అన్నాడీఎంకే తరపున ఓ సీటును కేటాయించారు. అన్నాడీఎంకే రెండాకు చిహ్నంలో తిరువీకా నగర్ నియోజకవర్గం నుంచి ఆర్మ్ స్ట్రాంగ్ సతీమణి పొర్కుడిని అభ్యర్థిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రకటించారు.కృష్ణస్వామికి సీటు ఇచ్చే ప్రసక్తే లేదు: పళణిఅభ్యర్థులను ప్రకటించినానంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూత్తుకుడిలో పళని స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పుదియ తమిళగం అధ్యక్షుడు కృష్ణ స్వామి తనను సంప్రదించ లేదని స్పష్టం చేశారు. ఆయన మరొకరి ద్వారా తొలుత పది , ఆ తర్వాత 5 సీట్లకు పట్టుబట్టారని వివరించారు. గత ఎన్నికల్లో 31 నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం 33 వేల ఓట్లు మాత్రమే సాధించిన పార్టీకి అన్ని సీట్లు ఇవ్వడం అసాధ్యమని తేల్చి చెప్పినట్టు పేర్కొన్నారు. ఆయనకు గానీ, ఆ పార్టీకి గానీ సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో తూత్తుకుడి, నైల్లె జిల్లాల్లో వచ్చిన భారీ వరదల సమయంలో డీఎంకే ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. నటుడు విజయ్ తన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ఈ ఎన్నికలలో ద్విముఖ పోటీ మాత్రమే అని చెప్పడంపై స్పందిస్తూ.. ఆయన ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారని, ఎన్నికల ఫలితాల తర్వాతే ఆయనకు వాస్తవాలు అర్థమవుతాయి అని ఎద్దేవా చేశారు. -
అన్నాడీఎంకే మాజీల హవా
డీఎంకే జాబితాలో సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార డీఎంకే ప్రకటించిన అభ్యర్థుల జాబితా పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యంగా అన్నాడీఎంకే నుండి డీఎంకేలోకి వలస వచ్చిన నేతలకు పెద్దపీట వేయడం గమనార్హం. గతంలో అన్నాడీఎంకేలో కీలక బాధ్యతలు నిర్వర్తించి, రకరకాల కారణాలతో డీఎంకేలో చేరిన 19 మందికి ఈసారి పోటీ చేసే అవకాశం కల్పించారు. అత్యధికంగా అన్నాడీఎంకే నేపథ్యం ఉన్నవారికే ప్రాధాన్యత లభించింది. ఇటీవల పార్టీ మారిన ఓ. పన్నీర్ సెల్వంకు బోడి నాయకనూరు, వైద్యలింగంకు ఒరత్తనాడు, మనోజ్ పాండియన్కు ఆళంకులం సీట్లు ఇచ్చారు. అలాగే కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మాజీ మంత్రి సెంథిల్ బలాజీ, తిరువణ్ణామలైలో పోటీ చేస్తున్న మంత్రి ఏవీ వేలు, ఈరోడ్ వెస్ట్లో పోటీ చేస్తున్న ముత్తుస్వామి,చైన్నె హార్బర్ బరిలో ఉన్న మంత్రి శేఖర్ బాబు, తిరుచెందూర్ రేసులో ఉన్న మంత్రి అనితా రాధాకృష్ణన్, తిరుమయంలో పోటీ చేస్తున్న మంత్రి రఘుపతి, విల్లుపురంలో పోటీచేస్తున్న లక్ష్మణన్, హోసూరు అభ్యర్థి సత్యలు ఒకప్పుడు అన్నాడీఎంకే నుంచి డీఎంకేలోకి వచ్చిన వారే కావడం గమనార్హం. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న తమను పక్కన పెట్టి, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి మంత్రి పదవులతో పాటు తాజాగా మళ్లీ ఎన్నికల్లోనూ ప్రాధాన్యత ఇవ్వడంపై డీఎంకే సీనియర్లు పలువురు పెదవి విప్పుతున్నట్టు సమాచారం. ఈ ’వలస నేతల’ వ్యూహం డీఎంకేకు ఎంతవరకు కలిసి వస్తుందో వేచి చూడాలి. -
డీఎంకే మేనిఫెస్టో.. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్
చెన్నై: తమిళనాడులో గెలిస్తే 35 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తామని అధికార డీఎంకే ప్రకటించింది. ‘మహిళలకు రూ.8,000 విలువైన కూపన్లు ఇస్తాం. కూపన్లతో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటివి కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే పాతవాటితో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు’’ అని పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం ఆయన విడుదల చేశారు. ‘‘వ్యవసాయం, విద్య, పరిశ్రమల రంగాల్లో పలు రకాల సంక్షేమ పథకాలను అమలుచేస్తాం. రైతులు, గృహిణులు, విద్యార్థులు మొదలు అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి కోరుతూ పలు సంక్షేమ చర్యలను అమలుచేయబోతున్నాం. మామూలుగా డీఎంకే మేనిఫెస్టో హీరోలా ఉంటుంది. ఈసారి సూపర్స్టార్లా ఉండనుంది’’ అంటూ హామీల చిట్టాను ఓటర్ల ముందు ఆవిష్కరించారు.డీఎంకే మేనిఫెస్టో ముఖ్యాంశాలు...20 లక్షల మందికిపైగా రైతులకు ఉచితంగా మీటర్లేని పంపుసెట్లువార్షిక ఆదాయ పరిమితి పెంపుముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం రూ.10లక్షలకు పెంపువృద్ధులు, వితంతువులు, 50 ఏళ్లు దాటిన అవివాహితులకు నెలకు రూ.2,000 పెన్షన్కలైంగర్ మగలిర్ ఉరుమై థొగై పథకం కింద కుటుంబపెద్దగా ఉన్న మహిళలకు నెలవారీ ఆర్థికసాయం రూ.2వేలకు పెంపుపాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం ఎనిమిదవ తరగతి విద్యార్థుల దాకా వర్తింపుక్వింటాల్ వరి ధాన్యానికి రూ.3,500 మద్దతు ధరటన్ను చెరకుకు రూ.4,500 మద్దతు ధరవచ్చే నాలుగేళ్లలోపు పూరిగుడిసెల అవసరం లేకుండా గృహపథకంలో భాగంగా కొత్తగా 10 లక్షల గృహాల నిర్మాణంఉన్నత విద్య పూర్తిచేసిన వాళ్లకు నాన్ ముధల్వాన్ పథకం కింద ఆరు నెలలపాటు వృత్తి నైపుణ్య శిక్షణతోపాటు నెలకు రూ.1,500 అందజేతరాష్ట్రానికి రూ.18 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను రప్పించడంవచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలను సృష్టించడంపుధుమై పెన్, తమిళ్ పుధల్వాన్ పథకాల కింద నెలకు రూ.1,500 ఉన్నత విద్యా గ్రాంట్ అందజేతకోయంబత్తూర్, సేలం, మదురై, తిరుచిరాపల్లి సమీపంలో ఫ్యూచర్–రెడీ గ్లోబల్ సిటీల నిర్మాణం. -
పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో వెల్లడయ్యింది. 30 అసెంబ్లీ సీట్లు ఉన్న పుదుచ్చేరిలో ఎన్డీయే 14-17, ఎస్పీయే 9-11, సినీ నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2-4, ఇతరులు 1-2 సీట్లు గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. 9-11స్థానాలు కైవసం చేసుకుని ఎన్.ఆర్ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు ఈ సర్వేలో వెల్లడయింది. ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ బీజేపీ 5-7, ఎస్పీఏలో భాగస్వాములైన కాంగ్రెస్ 3-5, డీఎంకే 6-8 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఎన్డీయే 34-36 శాతం, ఎస్పీఏ 30-32 శాతం, టీవీకే 16-18 శాతం, ఎన్టీకే 4-6 శాతం, వీసీకే 1-3 శాతం, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు 2-5 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడయింది.పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ ఈ సర్వేను 16-23 మార్చి, 2026 మధ్య పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 పోలింగ్ స్టేషన్లను ఎంచుకుని, ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 20-25 శాంపిల్స్ ను సేకరించడం జరిగింది. ఈ సర్వేలో కులం, మతం, మహిళలు, పురుషులు, అన్ని వయసుల వారిని పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే నివేదికను నిఖిల్ కుమార్ రూపొందించారు. డేటా ఎనాలిసిస్ ను, ఇతర సాంకేతిక సహకారాన్ని అవెల్జెన్స్ సంస్థ అందించింది.ఎన్నికల షెడ్యూల్ ముందు ప్రతిపక్ష ఎస్పీయే కూటమి పట్ల ప్రజలు కొంత సానుకూలత చూపించినా... ఆ సానుకూలత ప్రస్తుతం కనిపించడం లేదు. టికెట్ల పంపకం తర్వాత ఆరుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే పార్టీకి కేటాయించిన సీట్లలో నామినేషన్లు దాఖలు చేసి ఉపసంహరించుకోకపోవడంతో ఎస్పీఏకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్... డీఎంకే పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించడంతో పుదుచ్చేరిలో ప్రస్తుత పరిస్థితులు ఎన్డీయేకు సానుకూలంగా మారాయి.ఎన్డీయే కూటమిలోని ప్రధాన పక్షమైన ఎన్.ఆర్ కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల పొత్తుల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ... దానిని అధిగమించి వారి మధ్య పొత్తు కుదిరింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం ఉండటం సానుకూలంగా మారింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, నగదు ఎస్పీఏలో కుమ్ములాటలు, సినీ నటుడు విజయ్ పార్టీ, ఓట్ల చీలిక తదితర అంశాల కారణంగా ఎన్డీయేకూ సానుకూలంగా మారుతున్నాయి. ఎన్నికల నాటికి ఎస్పీయేలో అంతర్గత విభేదాలకు తోడు ఎన్డీయే వ్యతిరేక పక్షాలు ఎక్కువ ఓట్లు చీలిస్తే అవి ఎన్డీయేకు అనుకూలంగా మారి 20 సీట్లకు పైగా గెలుపొందినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఎన్డీయే ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తారా? అని అడిగినప్పుడు, 55 శాతం మంది ఇస్తామని, 41 శాతం మంది ఇవ్వమని, 4 శాతం మంది చెప్పలేం అని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అభివృద్ధి చెందడం సాధ్యం కాదని నమ్ముతున్నట్లు దాదాపు 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని పరిశీలిస్తే కేంద్రంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నందున కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఎన్డీయే కూటమిని గెలిపించుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.ఎన్నికల్లో మీరు ఓటే వేసే ముందు ఏ అంశానికి ప్రాధాన్యత ఇస్తారు? అని ప్రశ్నించినప్పుడు 40 శాతం మంది అభ్యర్థి, 30 శాతం మంది పార్టీ, కులం, మతానికి 10 శాతం, డబ్బు 10 శాతం, మిగిలినవారు ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.ఈ ఎన్నికల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ప్రశ్నించినప్పుడు 62 శాతం మంది ఎన్. రంగస్వామికి మద్దతిచ్చారు. దీంతో ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల్లో ప్రధాన అంశం... ఏమిటని ప్రశ్నించినప్పుడు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధి లేకపోవడం, అధికార యంత్రాంగంలో అవినీతి, విచ్చలవిడి మద్యం అమ్మకాలు ప్రధాన సమస్యలు అని ఈ సర్వేలో ప్రజలు వెల్లడించారు.రాష్ట్ర హోదా డిమాండ్, లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం, యువతలో నిరుద్యోగం, వరదలు, రోడ్ల దుస్థితి, నీటి కొరత, స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం వంటి అంశాలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. కానీ, వీటికి కౌంటర్ గా ప్రచార వ్యూహాల్లో ఎన్డీయే సంక్షేమ పథకాలపై దృష్టి సారిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఉచిత బియ్యం, పాలు, విద్యుత్ సబ్సిడీలు, మహిళలకు నెలకు రూ. 2000 ఆర్థిక సహాయం వంటి పథకాలతో ప్రచారం చేస్తోంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆసరాగా తీసుకుని ఎస్పీయే కూటమి రాష్ట్ర హోదా, పాలనా లోపాలను ప్రధాన అంశాలుగా తీసుకుని ప్రచారం చేస్తోంది.మరోవైపు టీవీకే యువతను ఆకర్షించే ప్రచార వ్యూహాలతో ముందుకెళ్తోంది. అభ్యర్థుల ఎంపికలో మత, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఎన్డీయే ప్రధానంగా హిందూ ఓటర్లపై ఆధారపడి, వ్యూహాత్మకంగా మైనారిటీ అభ్యర్థులను కూడా నిలబెట్టింది. ఎస్పీయేకి క్రైస్తవులు, ముస్లింలలో బలమైన మద్దతు ఉంది. ఎన్టీకే 50 శాతం మహిళలకు టికెట్లు కేటాయించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో స్థానిక అంశాలు, అభ్యర్థుల బలం, ఓట్ల విభజన వంటి అంశాలే ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. అయినప్పటికీ, ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీయేకి స్వల్ప ఆధిక్యం తెచ్చిపెట్టే అవకాశం ఉంది.పీపుల్స్ పల్స్ రీసర్చ్ బృందం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అభ్యర్థులు ఉపసంహరణ చివరి తేది అయిన మార్చి 16 నుంచి 23వ తేది వరకు ఈ సర్వే నిర్వహించడం జరిగింది. రానున్న 10 రోజుల్లో సంభవించే రాజకీయ పరిణామాలు తుది ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఏప్రిల్ 9వ తేదిన పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలకు ముగిసిన తర్వాత పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ పోస్ట్ పోల్ సర్వే నిర్వహించి ఏప్రిల్ 29 నాడు తుది సర్వే ఫలితాలను వెల్లడిస్తుంది. -
తమిళనాడు: టీవీకే అభ్యరుల జాబితా విడుదల
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నిలక పోరు తారాస్థాయికి చేరింది. తమిళగ వెట్రి కళగం(టీవీకే) తమ అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. రెండు స్థానాల్లో టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేయనున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగనున్నారు. మొత్తం 234 స్థానాల్లో టీవీకే పోటీ చేయనుంది. విల్లివాక్కం నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అర్జున పోటీ చేయనున్నారు.డీఎంకే, టీవీకే మధ్య ఎన్నికల పోరు ఉంటుందని విజయ్ అన్నారు. తమిళనాడులో వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తామన్న విజయ్.. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో వచ్చానని తెలిపారు. స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుందని విజయ్ పేర్కొన్నారు.టీవీకే పార్టీని స్థాపించిన తర్వాత విజయ్ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికల సమరమిది. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని విజయ్ నిర్ణయించడంతో ఆ నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఏర్పడింది. తమిళగ వెట్రి కళగంతో తొలి సారిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు విజయ్ ఉరకలు తీస్తున్నారు. కేడర్ను బలోపేతం చేస్తూ, ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించడమే కాకుండా, వ్యూహాలకు పదును పెడుతూ వస్తున్నారు.అయితే, పెరంబూరు నుంచి ఎన్నికల ప్రచారానికి విజయ్ కార్యాచరణ సిద్ధం చేసుకోగా.. అనుమతి లభించలేదు. పెరంబూరులో తన ఎన్నికల ప్రచారానికి అధికారులు అనుమతి నిరాకరించడంపై విజయ్ అందులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ను స్వయంగా కలిసి ఫిర్యాదు పత్రం సమర్పించారు. తన ఫిర్యాదులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. బ్యూరోక్రట్లు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాడమే కాకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ.. తమ ఉద్యోగు బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్లో ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. -
ఎంపీ జ్యోతిమణి వ్యాఖ్యలపై చర్చ
సాక్షి, చైన్నె : తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి వ్యాఖ్యలు ఆపార్టీలో చర్చకు దారి తీశాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు వెలుగులోకి వస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత లేదంటూ కరూర్ ఎంపీ జ్యోతిమణి చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను సంచలనం సృష్టించాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ 28 సీట్లు కేటాయించారు. నియోజకవర్గాల ఎంపికలో సైతం జాప్యం తప్పలేదు. తాజాగా అభ్యర్థుల ఎంపిక ఢిల్లీకి చేరింది. ఈ పరిస్థితులలో కాంగ్రెస్లో బయలు దేరిన అసంతృప్తి అన్నది ఎక్కడ కూటమికి సంకటం అవుతోందో అన్న చర్చ ఊపందుకుంది. అగ్రనేతలతో చర్చించే సీట్లు, నియోజకవర్గాల ఎంపిక కాంగ్రెస్లో జరిగితే, పారదర్శకత లేదని, అభ్యర్థుల ఎంపికలోనూ అనేక లొసుగులు ఉన్నాయని ఆరోపించడం గమనార్హం. గతంలో ఎంపీలతో చర్చించి అసెంబ్లీకి అభ్యర్థులను ఎంపిక చేశారని, ఇప్పుడు ఆపాదర్శకత ఎక్కడ అని ప్రశ్నించడం గమనార్హం. రాష్ట్రకాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆమె వ్యాఖ్యలు ఉండటంతో పలువురు కాంగ్రెస్ నేతలు ఎదురు దాడికి దిగే పనిలో పడ్డారు. ఎన్నికల బరిలో నటుడు మన్సూర్అలీఖాన్ సాక్షి, చైన్నె: తిరుచ్చి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారుతోంది. ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ సభ్యుడైన ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఈసారి లాల్గుడి నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. తిరుచ్చిలోని తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మన్సూర్ అలీ ఖాన్ శనివారం ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తాను తిరుచ్చి గడ్డపై పోటీ చేయడం సంతోషంగా ఉంది. నా ప్రసంగ శైలి, సామాన్యులతో మమేకమయ్యే విధంగా ప్రజలను ఆకట్టుకుంటోందన్నారు.ఓట్ల కోసం ప్రతి ఇంటికీ వెళ్తామన్నారు. రాష్ట్రంలో మత్తు నియంత్రణ లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్లకు కూడా డ్రగ్స్ సులభంగా అందుబాటులో ఉంటున్నాయని, పోలీసు శాఖ దీనిని ఎందుకు అరికట్టలేకపోతోందని ప్రశ్నించారు.ఈ సందర్భంగా పొత్తుల గురించి స్పందిస్తూ, కూటమి నేతలను కలవడం కంటే, వైట్హౌస్లో ట్రంప్ను కలవడానికే ఇష్టపడతా అంటూ చమత్కరించారు. తాను లాల్గుడి నుంచి పోటీ చేయనున్నట్టు పేర్కొన్నారు. -
కోలాహలం..వఠారన్నేశ్వరర్ రథోత్సవం
పళ్లిపట్టు : వఠారన్నేశ్వరర్ ఆలయ కమల రథోత్సవం కోలాహలంగా సాగింది. వేలాదిగా భక్తులు పాల్గొని రథం లాగి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుత్తణి సమీపంలోని తిరువలంగాడు వఠారన్నేశ్వరర్ ఆలయంలో పంగుణి బ్రహ్మోత్సవాలు 22న ప్రారంభమై ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా ఉత్సవర్లు సోమాస్కందర్ వాహనాల్లో కొలువుదీరి భక్తులకు కటాక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన శనివారం కమల రథోత్సవం కోలాహలంగా సాగింది. వివిధ పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన రథంపై వండార్కుయళి సమేత ఉత్సవర్లు సోమస్కందర్ విశేష అలంకరణలో కొలువుదీరారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి రథం లాగారు. భక్తులు కర్పూర హారతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టి స్వామి దర్శనం చేసుఉకున్నారు. రథోత్సవంలో భక్తులు దేవతామూర్తుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ మాడ వీధుల్లో రథ ఊరేగింది. పలు చోట్ల భక్తులకు మజ్జిగ పంపిణీ చేసి అన్నదానం చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుత్తణి ఆలయ అధికారులు వేడుకల ఏర్పాట్లు చేశారు. పుష్పాలంకరణలో వఠారన్నేశ్వరర్ రథాన్ని లాగుతున్న భక్తులు -
బస్సు, కారు ఢీ
–దంపతులు మృతి తిరువళ్లూరు: తిరువళ్లూరు సమీపంలో కారు, ప్రభుత్వ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాధంలో భార్య దంపతులు మృతిచెందారు. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన రవిచంద్రన్ (63), ఇతని భార్య గీత (56). వీరిద్దరు తిరువళ్లూరులోని అమ్మవారి ఆలయానికి వెళ్లారు. దర్శనానంతరం కారులో తిరుగు పయనమయ్యారు. వేపంబట్టు, సెవ్వాపేట మధ్య వెళుతుండగా అదుపుతప్పి కారు, ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాధంలో గీత సంఘటన స్థలంలోనే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రవిచంద్రన్ను స్థానికులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. సెవ్వాపేట పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. మృతి చెందిన గీత, రవిచంద్రన్ -
వందశాతం పోలింగ్పై అవగాహన
వేలూరు: అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం పోలింగ్ జరగాలని కోరుతూ వేలూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎన్నికల అధికారి సుబ్బులక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వేలూరు జిల్లా వందశాతం పోలింగ్ జరగాలని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని తాలుకా కేంద్రాల్లోనూ అవగాహన కల్పించామన్నారు. ప్రస్తుతం వైద్య విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఆస్పత్రికి వచ్చే రోగులకు కరపత్రాలు అందజేసి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లాలో వందశాతం పోలింగ్కు ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. అనంతరం మహిళా సంఘాలకు వందశాతం పోలింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా వేలూరు ఏలగిరి ఆవరణలో మహిళా సంఘాలకు వందశాతం పోలింగ్పై ముగ్గుల పోటీలు నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఆస్పత్రి సిబ్బంది, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
రెబల్స్కు కాంగ్రెస్ అధిష్టానం హుకుం!
– మాజీ అధ్యక్షుడి రాజీనామా సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో డీఎంకేకు కేటాయించిన స్థానాలలో రెబల్స్గా పోటీచేస్తున్న నేతలకు కాంగ్రెస్ అధిష్టానం హుకుం జారీ చేసింది. అదే సమయంలో తన పదవికి రాజీనామా చేస్తున్న మాజీ అధ్యక్షుడు ఏవీ సుబ్రమణియన్ ప్రకటించారు. వివరాలు.. పుదుచ్చేరిలో కాంగ్రెస్ 16 చోట్ల పోటీ చేస్తున్నప్పటికీ డీఎంకే కేటాయించిన 14 స్థానాలలో ఆరు స్థానాలలో (ఒకటి వీసీకే స్థానం) కాంగ్రెస్ తరపున ముఖ్య నేతలు రెబల్స్గా పోటీలో ఉన్నారు. వీరు నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. దీంతో కాంగ్రెస్, డీఎంకే మధ్య ఆరు చోట్ల సమరం నెలకొంది. అదే సమయంలో కూటమి నుంచి సీపీఎం, సీపీఐ, వీసీకేలు బయటకువచ్చి ఒంటరిగా పోటీకి అభ్యర్థులను నిలబెట్టాయి. దీంతో కూటమి చిన్నాభిన్నమైంది. డీఎంకే, కాంగ్రెస్ మధ్య ఇండియా కూటమిలో బీటలు నెలకొన్నాయి.అ దేసమయంలో వివాదాన్ని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. 16 స్థానాలలోపోటీ చేస్తున్నవారే కాంగ్రెస్ అభ్యర్థులు అనిప్రకటించారు. మిగిలిన వారికిమద్దతు ఇవ్వ వద్దు అని పార్టీ వర్గాలకు ఆదేశించారు. అయినారెబల్స్ తగ్గలేదు. దీంతో పుదుచ్చేరి డీ ఎంకే ఎన్నికల ఇన్చార్జ్ జగత్ రక్షకన్ ఆగ్రహానికి లోనయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఆ పార్టీ జెండా, చిహ్నాలతో ప్రచారంలో దూసుకెళ్తుండటాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైద్యలింగ్ ప్రకటన చేశారు. రెబల్స్ తప్పుకోకుంటే చర్యలు తప్పదని హెచ్చరించారు. అదే సమయంలో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు రెబల్స్గా తానే కాకుండా, తనకుమారుడ్ని రంగంలోకి దించిన మాజీ అధ్యక్షుడు సుబ్రమణియన్ ప్రకటన చేయడం గమనార్హం. ఇక, పుదుచ్చేరిలో తనను పోటీ చేయకుండా అడ్డుకున్నారన్న ఆవేదనలో ఉన్న మాజీ సీఎం నారాయణ స్వామికి అధికారంలోకి రాగానే రాజ్యసభకు పంపించే విధంగా అధిష్టానం హామీ ఇచ్చినట్టు సమాచారం. కాగా పుదుచ్చేరిలో 9వ తేది ఎన్నికలు జరగనుండటంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఇక్కడి 321 పోలింగ్ కేంద్రాలలో భద్రతను పెంచి ఏర్పాట్లు విస్తృతం చేశారు. -
వైభవం..సోలీశ్వరుడి రథోత్సవం
తిరువళ్లూరు: సోలీశ్వరుడి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఉదయం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పేరంబాక్కంలో సోలీశ్వరుడు సమేత కామాక్షి అమ్మవారి ఆలయం వుంది. ఆలయంలో ప్రతి ఏటా పంగుణి మాసంలో ఉత్సవాలను పది రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఉత్సవాలు గత 22న ధ్వజారోహణంతో ప్రారంభించారు. ఏడవ రోజు శనివారం ఉదయం స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయం నుంచి బయలుదేరిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత రథానికి చేరుకుని భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. -
వృషభ వాహనంపై కరకంఠేశ్వరుడు
నగరి : పట్టణ పరిధిలోని కామాక్షీ సమేత కరకంఠేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న పంగుణోత్తర కల్య్యాణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం కరకంఠేశ్వర స్వామిని నంది వాహనంపై ఊరేగించారు. గతంలో మాజీ మంత్రి ఆర్కేరోజా రూ.1.80 లక్షలు వెచ్చించి సిద్దం చేసి ఆలయానికి అందించిన వృషభ (నంది) ఆ వాహనంపై స్వామిని ఊరేగించారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో అభిషేక అర్చనలు నిర్వహించారు. ప్రత్యేక అలంకారంలో ఊరేగింపుగా వచ్చిన స్వామికి భక్తులు కొబ్బరికాయలు కొట్టి, కర్పూర హారతులు ఇచ్చి దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త సుబ్రమణ్యం ఏర్పాట్లను పర్యవేక్షించారు. రెడ్డి సంక్షేమ సంఘం వారు ఉభయదారులుగా వ్యవహరించారు. -
సమస్యలు పరిష్కరించే వారికే మద్దతు
వేలూరు: విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వారికే రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇవ్వాలని తమిళనాడు విద్యుత్ మండలి ఇంజినీరింగ్ విభాగం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంథోని బడవరాజ్ అన్నారు. వేలూరు జిల్లాలోని ఆ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం వేలూరు జోనల్ కార్యదర్శి ఇంజినీర్ తనిగ సెల్వన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గత ఆర్థిక సంవత్సర ఖర్చులు వివరాలు, ప్రణాళికలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖలోని సమస్యలను పరిష్కరించడానికి తమ సంఘం ఆలస్యంగా పోరాటాలను ప్రారంభించడంతో వాటిలో విజయం సాధించలేకపోయామన్నారు. విద్యుత్ శాఖలోని ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ రీత్యా పలు సమస్యలు ఉన్నప్పటికీ సెలవు రోజుల్లో కూడా వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం వివిధ సమస్యలపై సమీక్షించారు. సంఘం సంక్షేమ నిధి కార్యదర్శి ఇంజనీర్ సంతోషకుమార్, పరిపాలన కార్యదర్శి రాకేష్తోపాటు శాఖా అధ్యక్షుడు ఇంజినీర్ శక్తివేల్, శాఖా కార్యదర్శి వినాయకం, కోశాధికారి మణికండన్, నిర్వాహకులు సుధాకర్, అరుణ్, శరవణన్, తమిళనాడు విద్యత్ మండలి ఇంజినీర్ల సంఘానికి చెందిన సభ్యులు కార్యవర్గ సభ్యులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఘనంగా మండల అభిషేక పూజలు
వేలూరు: వేలూరు జిల్లా పిల్లయార్కుప్పం గ్రామంలోని ఓలైకన్ను వినాయకుడి ఆలయ కుంబాభిషేకాన్ని పురస్కరించుకొని 48 రోజుల అనంతరం మండల అభిషేక పూజలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శివాచార్యుల వేద మంత్రాల నడుమ స్వామి వారికి ఆచార స్నానం, పుష్పాలంకరణలు, ఆరాధన పూజలు, దీపారాధన పూజలు చేశారు. అనంతరం ఆలయంలోని స్వామివారి ముందు యాగ గుండం ఏర్పాటు చేసి వాటి ముందు కలశ నీటిని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలస నీటిని స్వామివారితో పాటు భక్తులపై చల్లి పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ విజయన్, ఆలయ కమిటీ సభ్యులు అన్నాదురై, పురుషోత్తమన్, పరుశురామన్, శేఖర్ పాల్గొన్నారు. -
సందడిగా రీఛార్జ్ – 2026 వేడుక
ఏఆర్ రెహమాన్, ప్రభుదేవా సాక్షి, చైన్నె: చైన్నె సమీపంలోని తండలంలో ఉన్న రాజలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో 18 వేల మందితో విద్యార్థులతో రీఛార్జ్ 2026 వేడుక సందడి వాతావరణంలో జరిగింది. సరికొత్త చర్రితను సృష్టించే విధంగా కళలు, సంగీత సంబరాలు హోరెత్తాయి. సాంస్కృతిక ఉత్సవంగా భారతీయ కళాశాలల చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచే విధంగా రెండు రోజుల వేడుక జరిగింది. తొలిసారి కాలేజీ క్యాంపస్లో సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ లైవ్ షోను విజయవంతంగా నిర్వహించారు. అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చే రెహమాన్ తొలిసారిగా ఒక కాలేజీ క్యాంపస్లో నేరుగా లైవ్ కాన్సర్ట్ నిర్వహించడం విశేషం. ఆయనతో పాటు గాయనీ, గాయకులు శ్వేతా మోహన్, రక్షితా సురేష్, హరిచరణ్, ఏఆర్ అమీన్ వంటి వారు విద్యార్థులలలో ఉత్సాహాన్ని నింపే విధంగా పాటలను హోరెత్తించారు. రెండో రోజుగా నటుడు, దర్శకుడు, డ్యాన్స్మాస్టర్ ప్రభుదేవా తన బృందంతో డ్యాన్స్ షోతో సందడి చేశారు. సినీ తారలు శ్రియా శరణ్, సయేషా, నిక్కీ గల్రానీ వంటి వారి నృత్య ప్రదర్శనలు కనుల పండువగా జరిగాయి. ఈ చారిత్రాత్మక క్షణం గురించి రాజలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీ వైస్ చైర్మన్ అభయ్ మేఘనాథన్ మాట్లాడుతూ భారతదేశంలోని కాలేజీ కల్చరల్ ఈవెంట్స్లో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు. ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజాన్ని తమ క్యాంపస్కు ఆహ్వానించడం, తమ విద్యార్థులకు సాటిలేని అనుభవాన్ని అందించాలన్న నిబద్ధతకు నిదర్శనంగా పేర్కొన్నారు. రీఛార్జ్ –2026 నూతన ఆవిష్కరణలు, ప్రతిభను చాటి చెప్పినట్టు వివరించారు. -
10 మంది అధికారుల బదిలీకి డిమాండ్
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి, కమిషనర్, ఏడీజీపీ తదితర 10 మంది అధికారులను బదిలీ చేయాలని టీవీకే అధినేత విజయ్ పట్టుబడుతున్నారు. పది కారణాలను ఎత్తి చూపుతూ శనివారం ఆయన ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్కు ఫిర్యాదు చేశారు. ప్రపథమంగా ఆయన తాజాగా సచివాలయంలో అడుగు పెట్టారు. వివరాలు.. తమిళనాడులో అధికార డీఎంకే కూటమి, ప్రదాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కూటమి ఎన్నికల కార్యాచరణలో దూసుకెళ్తున్నాయి. అయితే టీవీకే అధినేత విజయ్కు అడుగడుగున అడ్డంకులు తప్పడం లేదు. ప్రచారాలకు సైతం అనుమతులు దక్కక పోవడంతో తీవ్ర అసహనానికి విజయ్ లోనయ్యారు. శనివారం జరగాల్సిన కార్యక్రమాన్ని ఆదివారం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుమతుల జారీ విషయంలో ఎన్నికల కమిషన్ వర్గాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని స్వయంగా విజయ్ ఆవేదనను సైతం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ అనుమతుల వివాదం నేపథ్యంలో తన అభ్యర్థులను ఆదివారం చైన్నె నుంగంబాక్కంలోని ఓ స్టార్ హోటల్ వేదికగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడుకు చెందిన 234 మంది, పుదుచ్చేరికి చెందిన 30 మంది అభ్యర్థులను విజయ్ పరిచయం చేయనున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. తొలిసారిగా ఎన్నికల రేసులో ఉన్న విజయ్ పార్టీ జాబితా, మేనిఫెస్టోపై ఎదురు చూపులు పెరిగాయి. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు.. పెరంబూరు నుంచి ఎన్నికల ప్రచారానికి విజయ్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అయితే అనుమతి అన్నది ఇంత వరకు దక్కలేదు. ఈ పరిస్థితులలో ఆయన శనివారం మధ్యాహ్నం తన కార్యాలయం నుంచి సచివాలయానికి వచ్చారు. ప్రపథమంగా ఆయన సచివాలయంలో అడుగు పెట్టి, ఇక్కడున్న ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ను స్వయంగా కలిసి ఫిర్యాదు పత్రం సమర్పించారు. పెరంబూరులో తన ఎన్నికల ప్రచారానికి అధికారులు అనుమతి నిరాకరించడంపై విజయ్ అందులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ఫిర్యాదులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. సచివాలయానికి వస్తున్న విజయ్ పక్షపాత ధోరణి తగదు ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ అయిన డీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విజయ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చైన్నె పోలీస్ కమిషనర్, ఏడీజీపీ, ఆర్థిక శాఖ కార్యదర్శి సహా మొత్తం 10 మంది కీలక ఉన్నతాధికారులను తక్షణమే ఎన్నికల విధుల నుండి మార్చాలని ఆయన కోరారు. తనకు ప్రచార అనుమతులు నిరాకరించడం వెనుక ఉన్న రాజకీయ కోణాలను వివరిస్తూ, తన ఫిర్యాదులో 10 కారణాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. ఎన్నికల సమయంలో తమ పార్టీకి సమాన అవకాశాలు కల్పించాలని, అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని విజయ్ ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ను కోరారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ విజయ్ నేరుగా రంగంలోకి దిగి అధికారులపైనే ఫిర్యాదు చేయడం తాజాగా హాట్ టాఫిక్గా మారింది. -
ఎన్నికల్లో విజయకాంత్ ఫ్యామిలీ
సాక్షి, చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికలలో డీఎండీకే దివంగత అధినేత, సినీ నటుడు, కరుప్పు ఎంజీఆర్ విజయకాంత్ కుటుంబానికి చెందిన ఇద్దరు పోటీ చేయనున్నారు. ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్, కుమారుడు విజయ ప్రభాకరన్ ఎన్నికలకు సిద్ధమయ్యారు. కరుప్పు ఎంజీఆర్గా తమిళుల హృదయాలలో సినీ నటుడు విజయకాంత్ ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత లోక్సభ ఎన్నికలను ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలో ఆ పార్టీ ఎదుర్కొని, తమ ఓటు బ్యాంక్ను చేజారకుండా జాగ్రత్త పడింది. దీంతో తాజాగా డీఎంకే కూటమిలో ఆపార్టీకి 10 స్థానాలు కేటాయించారు. ఈసారి విజయకాంత్ ప్రతినిధులు అసెంబ్లీలో అడుగు పెట్టడమే లక్ష్యంగా ఎన్నికలలో స్వయంగా పోటీకి ఆయన సతీమణి, కుమారుడు సిద్ధమయ్యారు. విజయకాంత్ను ప్రపథమంగా అసెంబ్లీకి పంపించిన విరుదాచలం నియోజకవర్గం నుంచి ప్రేమలత విజయకాంత్ పోటీ చేయనున్నారు. వారసుడు విజయప్రభాకరన్ విరుదునగర్ నుంచి పోటీ చేయనున్నారు. లోక్ సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో విజయ ప్రభాకరన్కు కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్యం ఠాకూర్ కన్నా అధిక ఓట్లు రావడం గమనార్హం. ఇక పల్లావరంలో డి. మురుగేశన్, తిరుత్తణి డి కృష్ణమూర్తి, ఓమలూరులో ఏఆర్ ఇలంగోవన్, మైలంలో మాజీ ఎమ్మెల్యే ఎల్ వెంకటేశన్, పోలూరులో టిపి శరవణన్, గుడియాత్తం(రి)లో కేబి ప్రతాప్, సేలం వెస్ట్లో మాజీ ఎమ్మెల్యే అలగాపురం ఆర్ మోహనరాజ్, ధర్మపురిలో డాక్టర్ వి ఇలంగోవన్లు పోటీ చేయనున్నారు. ఇక, డీఎంకే కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు కేటాయించిన పాపనాశంలో షాజాహాన్, వాణియం బాడిలో సయ్యద్ ఫరూక్ను అభ్యర్థులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖాదర్ మొహిద్దీన్ ప్రకటించారు. ఇక ఇదే కూటమిలోని మనిదనేయ జననాయక కట్చి అధ్యక్షుడు తమీమున్ అన్సారి చిదంబరం నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. -
యాక్షన్ సన్నివేశాలు రీషూట్
తమిళసినిమా: రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జైలర్ –2. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో నటుడు ఎస్జే సూర్య, సురాజ్ వెంజారముడు, రమ్య కృష్ణ, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి అయినట్లు, జూన్ నెలలో తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో జైలర్ –2 చిత్రంలోని ఫైట్ సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నట్లు సమాచారం. యూత్ను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నట్లు తెలిసింది. యాక్షన్ సన్నివేశాలు ఇంతకు ముందు రజనీకాంత్ చిత్రాల్లో చూడనటువంటివిగా జైలర్– 2 చిత్రంలో ఉంటాయట. ఇందులోని ఫైట్ సన్నివేశాల కోసం రజనీకాంత్ చాలా రిస్క్ తీసుకుని నటిస్తున్నట్లు, అందుకు చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం చిత్రంలో రజనీకాంత్, షారూఖ్ ఖాన్ మధ్య యాక్షన్ సన్నివేశాలు ఆసక్తిగా ఉంటాయని సమాచారం. మొత్తం మీద జైలర్ –2 చిత్ర సక్సెస్ కోసం యూనిట్ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
క్లుప్తంగా
అన్నానగర్: తంజావూరు సమీపంలోని కండియూర్ ప్రాంతానికి చెందిన రాజీవ్ గాంధీ కుమార్తె రషీదా (10). ఈమె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఆ ప్రాంతంలోని మారియమ్మన్ ఆలయంలో పుష్పగుచ్ఛం సమర్పించే కార్యక్రమం సందర్భంగా, శుక్రవారం ఓ సరుకు రవాణా వాహనంలో రోడ్డుపై ఊరేగింపు జరిగింది. రషీదా ఆ సరుకు రవాణా వాహనంలో కూర్చుని ఉంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ రక్షిత తల ఆ సరుకు రవాణా వాహనం యొక్క జనరేటర్ ఇంజనన్లో ఇరుక్కుపోయింది. ఆమె తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే విషాదకరంగా మరణించింది. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అన్నానగర్: పొల్లాచి సమీపంలోని కాట్టంపట్టిలో గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసి, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని పౌర సరఫరాల నేర పరిశోధన శాఖ పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో శనివారం అక్కడ జరిపిన సోదాల్లో సదాశివం అనే వ్యక్తి ఎలాంటి అనుమతి, భద్రతా సదుపాయాలు లేకుండా 83 గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచినట్లు రుజువైంది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి సదాశివంను అరెస్టు చేశారు. అదనంగా సిలిండర్ల స్మగ్లింగ్కు ఉపయోగించిన 2 కార్గో వాహనాలను కూడా సీజ్ చేశారు. సాక్షి, చైన్నె: భారతదేశంలోనే అతిపెద్ద ఈ స్పోర్ట్స్ ఈవెంట్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్(బీజీఐఎస్) 2026 గ్రాండ్ ఫైనల్స్ చైన్నె ట్రేడ్ సెంటర్ వేదికగా ప్రారంభమైంది. 16 అత్యుత్తమ జట్లు రూ. 4 కోట్ల భారీ బహుమతి కోసం పోటీపడుతున్నాయి. తొలి రోజు ఉత్కంఠ భరితంగా పోరు జరిగింది. ఎరాంగిల్ ,మిరామార్, మ్యాపులలో మొత్తం ఆరు మ్యాచ్లను తొలి రోజు నిర్వహించారు. స్టేడియం నిండా తరలివచ్చిన వేలాది మంది అభిమానుల కేకల మధ్య జట్లు తమ వ్యూహా లతో తలపడ్డాయి. తమిళనాడుకు చెందిన జట్లు సైతం చైన్నె గడ్డపై ఆడుతుండటం విశేషం.ఇండియా ఈ–స్పోర్ట్స్ అసోసియేట్ డైరెక్టర్ కరణ్ పాఠక్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, ఇది ఒక టోర్నమెంట్ మాత్రమే కాదని, ఇది భారతదేశం నిర్మించుకుంటున్న ఈ– స్పోర్ట్స్ సంస్కృతికి నిదర్శనంగా వ్యాఖ్యలు చేశారు. గేమర్స్ భాగస్వామ్యంతో ప్రైజ్ అదనంగా రూ.2 కోట్లు పెరగడం, తమ యూట్యూబ్ ఛానెల్కు 20 లక్షల సబ్స్క్రైబర్లు ఉండటం ఈ క్రీడపై ఉన్న క్రేజ్ను చాటుతోందన్నారు.కొరుక్కుపేట: ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి జెండా స్తంభాలు ఏర్పాటు చేసిన కేసులో నామ్ తమిళర్ కచ్చి జిల్లా అధ్యక్షుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. ప్రేమ్నాథ్ నామ్ తమిళర్ పార్టీ తరపున రామనాథపురం జిల్లాలోని తిరువదన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన పరిచయ సభ శుక్రవారం జరిగింది. కానీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి పట్టణమంతటా జెండా స్తంభాలు ఏర్పాటు చేశారు. ఈ విషయమై ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు నామ్ తమిళర్ కచ్చి జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్పై కేసు నమోదు చేశారు. తిరువొత్తియూరు: పెళ్లి చేసుకుంటానంటూ యువతిపై అత్యాచారం చేసిన యువకుడికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించి చెంగల్పట్టు మహిళా న్యాయస్థానం తీర్పునిచ్చింది. మధురాంతకం సమీపంలో ఉన్న అడయాలం గ్రామానికి చెందిన వీరరాఘవన్ కుమారుడు మోహన్. అతను ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఆశపెట్టి మోసం చేసి అత్యాచారం చేశాడని ఫిర్యాదు ర్యాదులు వచ్చాయి. ఈ కేసు తుది విచారణ చెంగల్పట్టు మహిళా న్యాయస్థానం న్యాయమూర్తి ఎళిల్ అరసి సమక్షంలో జరిగింది. మోహన్పై నేరం రుజువు కావడంతో నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 3,000 జరిమానా విధించి తీర్పునిచ్చారు. వృద్ధుడి ఆత్మహత్య తిరువొత్తియూరు: వంతెన పైనుంచి దూకి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోయంబత్తూర్కు చెందిన వేలుసామి(70) సిద్ధాపురంలో ట్రస్టు నడుపుతున్నారు. అలాగే సామాజిక కార్యకర్తగానూ పనిచేస్తున్నారు. ఇతను శనివారం ఉదయం ఇంటి నుంచి బైక్లో బయలుదేరి ఫ్లైఓవర్పై బైక్ ఆపాడు. వంతెన పైనుంచి కిందకు దూకాడు. ఈఘటనలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ అతన్ని పోలీసులు కోయంబత్తూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కట్టూర్ పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. -
ఎదురు చూపుల్లో..!
తమిళసినిమా: అవకాశాలను అందిపుచ్చుకుని నటిస్తున్నా.. నటి కృతిశెట్టిని విజయాలు మాత్రం వరించడం లేదు. అసలు ఈ మంగుళూరు భామ తెలుగులో నటించిన ఉప్పెన చిత్రం సంచలన విజయం సాధిస్తుందని, ఎవరు ఊహించలేదు. తొలి చిత్రమే మంచి పేరు తెచ్చిపెట్టడంతో తన నట కెరీర్ వెలిగిపోతుందని కృతిశెట్టి తెగ సంబర పడింది. అనుకున్నట్లు గానే వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. వాటిలో ఒకటి రెండు హిట్లు కూడా ఉన్నాయి. దీనికి తోడు మలయాళం, తమిళం భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఇంకేముంది దక్షిణాదిలో వేయవచ్చు అని కలలు కని ఉండవచ్చు ఈ అమ్మడు. తమిళంలోనూ కార్తీ, రవి మోహన్, ప్రదీప్ రంగనాథన్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వరించాయి. అయితే రవి మోహన్ సరసన నటించిన జీనీ చిత్రం ఏళ్ల తరబడి నిర్మాణంలోనే ఉంది. ఇక కార్తీతో జత కట్టిన వా వాథ్దియార్ చిత్రం ఈ మధ్యనే విడుదలై పూర్తిగా నిరాశ పరిచింది. ఇక మిగిలింది ప్రదీప్ రంగనాథన్కు జంటగా నటించిన ఎల్ ఐకే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) వరుసగా విజయాలను అందుకుంటున్న ప్రదీప్ రంగనాథన్ హిరోగా నటించిన చిత్రం కాబట్టి సక్సెస్ గ్యారెంటీ అని అందరూ అనుకుంటున్నారు. అయితే నటి నయనతార రౌడీ పిక్చర్స్ సంస్థ, సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది అక్టోబర్లోనే విడుదల కావలసింది. అదే సమయంలో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన డ్యూడ్ చిత్రం విడుదల కావడంతో ఎల్ఐకే చిత్రం విడుదలను వాయిదా వేయాల్సిన పరిస్థితి. ఆ తరువాత పలుమార్లు ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. ఎట్టకేలకు ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరో సారి వాయిదా పడుతున్నట్లు తాజా సమాచారం. ఎల్ఐకే చిత్రాన్ని ఏప్రిల్ 2వ వారంలో తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కృతిశెట్టి చేతిలో ఉన్న ఒకే ఒక్క చిత్రం వాయిదా మీద వాయిదా పాడటం ఆమెకు నిరాశ పరిచే విషయమేమీ అవుతుంది. ఇలా ఎదురు చూపులతో ఉన్న కతి శెట్టికి గుడ్డిలో మెల్ల అన్నట్లుగా త్వరలో తెలుగులో ఒక క్రేజీ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. -
11 స్థానాలల్లో టీటీవీ అభ్యర్థులు
సాక్షి, చైన్నె: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ శనివారం ప్రకటించారు. గతంలో అన్నాడీఎంకేలో మంత్రులుగా వ్యవహరించిన ఇద్దరు మాజీలకు తన పార్టీ తరపున అవకాశం కల్పించారు. వివరాలు.. అన్నాడీఎంకే – బీజేపీ ఎన్డీఏ కూటమిలో అమ్మమక్కల్ మున్నేట్ర కళగంకు 11 సీట్లను కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తన పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితా కసరత్తులను పూర్తి చేసిన టీటీవీ దినకరన్ శనివారం ఉదయం చైన్నెలో విడుదల చేశారు. ఈ జాబితాలో పార్టీ సీనియర్ నేతలు జి. సెంతమిళన్ , సి. షణ్ముగవేల్ గతంలో అన్నాడీఎంకే హయాంలో మంత్రులుగా వ్యవహరించారు. అన్నాడీఎంకే నుంచి దినకరన్ బయటకు వచ్చినానంతరం ఆయనకు వెన్నంటి ఉంటూ వచ్చారు. దీంతో ఈ ఇద్దరికి పోటీ చేసే అవశాన్ని టీటీవీ దినకరన్ కల్పించారు. 11 మంది అభ్యర్థులు తిరువయ్యారు– వి. వేలు కార్తికేయన్, కారైక్కుడి – వి. పాండియ, నాంగునేరి – ఆర్. ఇసక్కి ముత్తు, ఒట్ట పిడారం – ఆర్. సుందర్ రాజన్, సైదాపేట – జి. సెంతమిళన్, తిరుపత్తూరు – జ్ఞాన శేఖరన్, మన్నార్కుడి – ఎస్. కామరాజ్, పూందమల్లి – ఏలుమలై, పెరియకుళం –కె. కదిర్గామం, మడత్తుకుళం – సి. షణ్ముగ వేల్, తిరుచ్చి వెస్ట్ – ఎం. రాజశేఖరన్ పోటీ చేయనున్నారు. కుక్కర్ గుర్తుపై పోటీ టీటీవీ దినకరన్మాట్లాడుతూ ప్రజలు డీఎంకేకు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం సృష్టించనున్నారని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం రూపంలో రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని, వీటిని తొలగించి ఎన్డీయే కూటమి అధికారాన్ని చేపట్టబోతోందన్నారు. తాము ’కుక్కర్’ గుర్తుపైనే పోటీ చేస్తున్నామన్నారు. -
ఈవీఎంల అప్పగింత
సాక్షి, చైన్నె: శాసనసభ ఎన్నికల నిర్వహణలో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంలు చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో కంప్యూటర్ రాండమైజేషన్(లాటరీ)పద్ధతిలో ఎంపిక చేసి, కేటాయించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నియోజకవర్గాలకు చేర్చారు. పారదర్శక ప్రక్రియ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కంప్యూటర్ ద్వారా ఏ యంత్రం ఏ నియోజకవర్గానికి వెళ్లాలో నిర్ణయించారు. ఈ యంత్రాలను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లోని స్ట్రాంగ్ రూమ్లలో నిఘా నీడలో ఉంచారు. చైన్నెలో జిల్లా ఎన్నికల అధికారి జె. కుమరగురుబరన్ నేతృత్వంలో ఈ పంపిణీ ప్రక్రియ జరిగింది. ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్ల పర్యవేక్షణలో పనులు జరిగాయి. ఇక, ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ అధికారులందరికీ ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో శనివారం ప్రత్యేక శిక్షణ తరగతులు జరిగాయి. ఓటింగ్ యంత్రాల నిర్వహణ, పోలింగ్ రోజున పాటించాల్సిన నిబంధనలపై వీరికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అలాగే 100 శాతం ఓటింగ్ లక్ష్యంగా అవగాహణ కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి.కట్టుదిట్టమైన భద్రత మధ్య రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 75,032 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో 30,979 పట్టణ ప్రాంతాలలో, 44,065 రూరల్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక 265 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల నిమిత్తం మోడరన్గా తీర్చిదిద్దనున్నారు. మరో 258 స్టేషన్లను మహిళలే సారఽథులుగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన ఓటింగ్నిమిత్తం అన్ని నియోజకవర్గాలకు ఈవీఎం, వీవీ పాడ్, కంట్రోల్ పాన్ల్స్ను ఎన్నికల యంత్రాంగం సిద్ధం చేసింది. తనిఖీలు పూర్తి చేసుకున్న ఈవీఎంలు, వీవీప్యాట్, కంట్రోల్ పానల్స్ జిల్లా ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో నియోజక వర్గాలకు చేర్చారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలను ఏకం చేస్తూ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 90 వేల కంట్రోల్ యూనిట్లు, 90,000 ఈవీఎంలు, 97,500 వీవీప్యాట్ యంత్రాలను సిద్ధం చేశారు. సాంకేతిక లోపాలు తలెత్తితే తక్షణమే మార్చడానికి వీలుగా 20 శాతం యంత్రాలను అదనంగా ఉంచారు. -
మదురై సెంట్రల్ రేసులో సుందర్ సీ
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికలలో సినీ నటుడు, దర్శకుడు సుందర్ సీ పోటీ చేయనున్నారు. ఏసీ షణ్ముగం నేతృత్వంలోని పుదియ నీతి కట్చి తరపున ఆయన మదురై సెంట్రల్ నియోజకవర్గం రేసులో దిగనున్నారు. ఈ వివరాలను ఏసీ షణ్ముగం శనివారం ప్రకటించారు. సినీ నటి కుష్భు బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలి పదవిలో ఉన్నారు. 2021లో ఆమె చైన్నె థౌజండ్ లైట్స్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా ఆమె భర్త, ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు నిర్మాత సుందర్ సీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఆయన ఏ.సి. షణ్ముగం పుదియ నీతి (న్యూ జస్టిస్ పార్టీ) పార్టీ తరపున పోటీ చేయనున్నారు. ఈ పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలో ఉంది. ఈ పార్టీకి బీజేపీ ఒక సీటు, అన్నాడీఎంకే ఒక సీటు కేటాయించింది. అన్నాడీఎంకే తరపున కేటాయించిన సీటుకు సుందర్ సీని అభ్యర్థిగా ఏసీ షణ్ముగం ఎంపిక చేయడం విశేషం. రెండాకుల గుర్తుపై.. మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి సుందర్ సీ పోటీ చేస్తారని ఏసీ షణ్ముగం ప్రకటించడం గమనార్హం. అయితే, అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంపై సుందర్ సీ పోటీ చేయనున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో తమ పార్టీకి కేటాయించిన మదురై సెంట్రల్ స్థానం నుండి చిదంబరం పిళ్లై కుమారుడు, ప్రముఖ సినీ నటుడు సుందర్ సీని అభ్యర్థిగా నిలబెడుతున్నందుకు సంతోషిస్తున్నానని ఏషీ షణ్ముగం వ్యాఖ్యానించారు. మదురై సెంట్రల్ స్థానంతో పాటు పుదియ నీతి కట్చికి కేటాయించిన మరో నియోజకవర్గం అభ్యర్థిని అఽధికారికంగా సోమవారం అధికారికంగా ప్రకటిస్తామన్నారు. తాజాగా సుందర్ సీ రేసులోకి రావడంతో మదురై సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారనుంది. త్వరలోనే అభ్యర్థిని అధికారికంగా ప్రజలకు పరిచయం చేయనుండడానికి ఏసీ షణ్ముగం సన్నద్ధం అవుతున్నారు. కాగా ఇదే నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా ఉన్న మంత్రి పీటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్ను సుందర్ సీ ఢీకొట్టాల్సి ఉంది. -
తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు ఇలా..
చెన్నై: వచ్చే నెలలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికార డీఎంకే పార్టీ- కాంగ్రెస్ల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. ఈ మేరకు డీఎంకేతో జట్టు కట్టిన కాంగ్రెస్తో పాటు పలు ప్రాంతీయ పార్టీల సీట్ల సర్దుబాటును ఈరోజు(శనివారం, మార్చి 28వ తేదీ) ప్రకటించారు. తమిళనాడు మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గాను డీఎంకే 164, కాంగ్రెస్ 28, డీఎండీకే 10 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక వీసీకే 8 స్థానాల్లో, సీపీఐ 5, సీపీఎం 5, ఎండీఎంకే 4 స్థానాలను కేటాయించారు. ఇక డీఎంకే పోటీ చేసే పలు స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించింది. కొలతూర్ నుంచి సీఎం స్టాలిన్ బరిలోకి దిగుతుండగా, చెపాక్ నుంచి ఉదయనిధి పోటీ చేయనున్నారు. బోడినాయక్కనూర్ నుంచి పన్నీరు సెల్వం పోటీ దిగుతుండగా, కోయంబత్తూర్ సౌత్ నుంచి బరిలోకి సెంథిల్ బాలాజీ బరిలో ఉండనున్నట్లు డీఎంకే వెల్లడించింది. -
తమిళనాడు ఎన్నికల బరిలో సినీ దర్శకుడు
చెన్నై: తమిళ చలనచిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ప్రముఖ దర్శకుడు, నటుడు, సుందర్ సి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఆయన మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఐటీ శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ (PTR) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఈయననే డీఎంకే (DMK) మళ్ళీ బరిలోకి దించే అవకాశం ఉండటంతో, ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ నెలకొననుంది. సుందర్ సి భార్య, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.దర్శకుడి భార్య ఖుష్బూ స్పందిస్తూ.. ‘సినీ కెరీర్లో మూడు దశాబ్దాల పాటు నా భర్తకు ఈ రాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలిచారని.. అందుకే ఇప్పుడు వారికి సేవ చేయడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగారు. ఆయన భార్యగా నేను గర్వపడుతున్నా’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.సుందర్ సి (సుందర్వేల్ చిదంబరం) జనవరి 21, 1968న జన్మించారు. ఆయన 1990లో ‘వాళ్కై చక్కరం’తో నటుడిగా చిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. 1995లో ‘మురై మానమ్’తో దర్శకుడిగా మారారు. దాదాపు 37 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 10కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కళైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. తన భార్యతో కలిసి పలు టెలివిజన్ సిరీస్లను నిర్మించారు. -
క్లుప్తంగా
మల్టీప్లెక్స్లో హెచ్డీఆర్ స్క్రీన్లు సాక్షి, చైన్నె: సినీ ప్రియులకు సరికొత్త అనుభూతిని అందించడం లక్ష్యంగా మల్టీప్లెక్స్లో హెచ్డీఆర్ స్క్రీన్లతో అద్భుతాన్ని సృష్టించామని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఎండీ రమేష్ ప్రసాద్ తెలిపారు. ఈ విషయంగా స్థానికంగా తమ ఆవిష్కరణ గురించి ప్రకటించారు. భారత్లోనే అతిపెద్ద హెచ్డీఆర్ సినిమా ఆడిటోరియంను ప్రసాద్స్ యాజమాన్యం ప్రారంభించిందన్నారు. పీసీఎక్స్ హెచ్డీఆర్ బైబార్కో పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ థియేటర్, ప్రేక్షకులకు వెండితెరపై మునుపెన్నడూ లేని అనుభూతి, అద్భుతం చూస్తారన్నారు. ఈ ఆడిటోరియంలో బార్కో 4ఓ లేజర్ హెచ్డీఆర్ ప్రొజెక్టర్ను కలిగి, లైట్ స్టీరింగ్ టెక్నాలజీతో పనిచేస్తుందని వివరించారు. సాధారణ స్క్రీన్లకంటే భిన్నంగా, ఇది 300 నిట్స్ వరకు బ్రైట్నెస్ను అందిస్తుందన్నారు. కొత్త ఫ్లాట్ యాస్పెక్ట్ రేషియో స్క్రీన్, మెరుగైన సీటింగ్, అత్యాధునిక సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ తొలి ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగిందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కళాశాల విద్యార్థిని మృతి చెందిన క్రమంలో మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. తిరువళ్లూరు జిల్లా తిరువేర్కాడు ప్రాంతానికి చెందిన సురేష్కుమార్ కుమార్తె దివ్యప్రియ(19) చైన్నెలోని ప్రైవేటు కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో శుక్రవారం ఉదయం దివ్యప్రియతో పాటు మరో ఇద్దరు యువకులతో సహా విద్యార్థినులు కారులో తడలోని వాటర్ ఫాల్స్కు బయలుదేరారు. పొన్నేరి సమీపంలో కారు వెళ్తున్న క్రమంలో తచ్చూరు హైవే నుంచి కిందకు దిగుతున్న సమయంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దివ్యప్రియ తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. ఈ ప్రమాదంలో మూర్తి, హరీష్కుమార్, సాత్విక, హరిణి, శాలినీ సహా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వెళ్లిన కవరపేట పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పొన్నేరి వైద్యశాలకు తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవరపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోండి తిరువొత్తియూరు: చెంగల్పట్టు జిల్లా, తిరుప్పోరూర్ వద్ద కొట్టమేడు ప్రాంతంలో నివశిస్తున్న గిరిజన సామాజిక వర్గానికి చెందిన భాగ్యం (56) గత 5 రోజుల క్రితం అనారోగ్యంతో చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. గురువారం రాత్రి మృతిచెందారు. అత్యవసర చికిత్స విభాగం నుండి భాగ్యం మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. ఆ సమయంలో ఆమె మృతదేహాన్ని స్ట్రెచర్పై ఎక్కించాల్సిన ఉద్యోగి మృతురాలి బంధువులను రూ.1000 అడిగాడు. దానికి భాగ్యం బంధువులు, గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారమని, ఇప్పటికే పేదరికంతో బాధపడుతున్నామని తెలిపారు. తమ దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పి రూ.500 ఇచ్చారు. ఆ డబ్బును ఆస్పత్రి ఉద్యోగి తీసుకోవడానికి నిరాకరించి దురుసుగా ప్రవర్తించాడు. ఆ ఉద్యోగికి మద్దతుగా తోటి ఉద్యోగులు గుమిగూడి రూ.1000 ఇస్తేనే మృతదేహాన్ని పోస్టుమార్టానికి తీసుకువెళ్తామని చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రి యాజమాన్యం తక్షణమే సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కారు గుంతలో పడి బీజేపీ నాయకుడి మృతి అన్నానగర్: తంజావూరు జిల్లాలోని పెరుమగలూరు గ్రామానికి చెందిన రాజరత్నం(45) వంటగ్యాస్ పంపిణీదారుడు. ఇతను తంజావూరు జిల్లా బీజేపీ పారిశ్రామిక యూనిట్కు జిల్లా పరిశీలకుడిగా ఉన్నాడు. ఇతను శుక్రవారం పట్టుకోట్టై నుండి తన స్వగ్రామమైన పెరుమగలూరుకు కారులో వెళుతున్నాడు. అతను నైనంగుళం సమీపిస్తుండగా, కారు అనుకోకుండా అదుపుతప్పి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజరత్నం అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. డివైడర్ను ఢీకొట్టిన లారీ – తొలగింపు ఆలస్యం..స్తంభించిన ట్రాఫిక్ తిరువొత్తియూరు: చైన్నె, రెడ్హిల్స్ వద్ద పోర్టుకు వెళుతున్న లారీ రోడ్డు డివైడర్ను ఢీకొని రోడ్డుపై నిలిచి పోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆంధ్రా నుంచి చైన్నె పోర్టుకు శుక్రవారం తెల్లవారుజామున గ్రానైట్ లోడ్తో లారీ వస్తోంది. రెడ్ హిల్స్, వడకరై వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు మధ్యలో ఆగిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ గాయాల్లేకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. లారీ ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. నిద్రమత్తులో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లారీ వస్తుండగా, లారీని నడుపుతున్న వ్యక్తి కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తెల్లవారుజాము కావడంతో అటుగా ఇతర వాహనాలు రాలేదు. దీంతో ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఉదయం 10 గంటల వరకు ప్రమాదానికి గురైన లారీని తరలించకుండా అక్కడే నిలిపి ఉంచినట్లు చెబుతున్నారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహన రాకపోకలు స్తంభించాయి. రెడ్హిల్స్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ వద్ద ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. -
క్లుప్తంగా
అశోక్నగర్లో సీసీ కెమెరాల నిఘా సాక్షి, చైన్నె: ప్రజా రక్షణను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో చైన్నె అశోక్ నగర్ వ్యాప్తంగా 100 సీసీటీవీ కెమెరాల నెట్వర్క్ను ఐసీఎల్ ఫిన్కార్ప్ సంస్థ ఏర్పాటు చేసింది. లయన్స్ క్లబ్, తమిళనాడు పోలీసుల సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును శుక్రవారం ప్రారంభించారు. అశోక్ నగర్ ఆర్–3 పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఐసీఎల్ ఫిన్కార్ప్ సీఎండీ కె.జి.అనిల్ కుమార్ ఈ నిఘా వ్యవస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐసీఎల్ ఫిన్కార్ప్ హోల్–టైమ్ డైరెక్టర్, వైస్ చైర్మన్, సీఈఓ ఉమా అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా టీనగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.కుత లింగం, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.ఆల్డ్రిన్, ఇన్స్పెక్టర్ ఎస్.సతీష్ కుమార్ తదితర పోలీసు ఉన్నతాధికారులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొని సంస్థ చేస్తున్న సామాజిక సేవలను అభినందించా రు. ఆర్థిక సేవలకు మాత్రమే పరిమితం కాకుండా, సామాజిక భద్రతపై, ప్రజలు సురక్షితమైన వాతావరణంలో నివశించేలా చూడడమే లక్ష్యంగా ముందుకెళ్లడాన్ని ఆహ్వానించారు. నకిలీ నోట్ల కేసులో ఒకరి అరెస్ట్ అన్నానగర్: నకిలీ నోట్ల కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. నాగపట్టణం జిల్లాలోని తారగమరుదూరు ప్రాంతానికి చెందిన మురుగానందం (40). ఇతను టైలరింగ్ దుకాణం నడుపుతున్నాడు. శుక్రవారం, తానికోట్టగం కడైతేరు వద్ద పోలీసులు వాహన తనిఖీ నిర్వహించారు. బైక్లో వస్తున్న మురుగానందం వద్ద తనిఖీ చేయగా, అతని వద్ద నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో అతని వద్ద రూ.31,500 విలువైన నకిలీ నోట్లు ఉన్నాయని, వాటిని తన దుకాణంలో ముద్రించి చలామణికి తెచ్చాడని తెలిసింది. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ అలవరుచుకోవాలి వేలూరు: విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని అనకట్టు బ్లాక్ విద్యాశాఖాధికారి కుమరన్ అన్నారు. వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం పరిధిలోని మూలైకాట్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 49వ వార్షికోత్సవం, విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలను పాఠశాల హెచ్ఎం జోసెఫ్ అన్నయ్య అద్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అనేక వసతులున్నాయని, అయినప్పటికీ అనేక మంది కార్పొరేట్ పాఠశాలలకు ఆకర్షితులై ప్రభుత్వ పాఠశాలకు రావడం లేదన్నారు. ఇక్కడ విద్యను అభ్యసించిన అనేక మంది ఉన్నత స్థానాలకు చేరారన్నారు. అనంతరం తరగతులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేయడంతోపాటు పాఠశాలలో గ్లోబుల్ అకాడమీ ఆఫ్ ఎక్స్లెన్స్ నిర్వహించిన అబాకస్ పోటీల్లో 30 మందికి పైగా హాజరై చాంపియన్షిప్ సాధించారు. వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. అదేవిధంగా తిరువళ్లువర్ సాహిత్య వేదిక నిర్వహించిన తిరుక్కురల్ క్విజ్ పోటీల్లో ప్రశ్నలు సమాదానాలు చెప్పిన వారికి బహుమతుల అందజేయడంతోపాటు గ్రూప్ ఫొటో తీసుకున్నారు. సర్పంచ్ సైనలత, పాఠశాల కమిటీ చైర్మన్ సెల్వరాజ్, టీచర్లు పుణిద, మహేశ్వరి, గోవిందరాజ్, బ్లాక్ రిసోర్స్ పర్వవేక్షకురాలు శాంతి తదితరులు పాల్గొన్నారు. డివైడర్ను ఢీకొన్న కారు అన్నానగర్: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నివాసి అయిన బాలేంద్ర సింగ్ తన భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి కారులో తమిళనాడుకు వచ్చారు. కన్యాకుమారి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించిన తర్వాత, వారు గురువారం సాయంత్రం రామనాథపురం మీదుగా రామేశ్వరం ఆలయానికి తిరిగి వెళ్తున్నారు. రామనాథపురం జిల్లా మండపం పక్కన ఉన్న ఉచ్చిపులి సమీపంలో పెరుంగుళం పాత టోల్ గేట్ ప్రాంతానికి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సు అకస్మాత్తుగా రోడ్డుకు అడ్డంగా తిరిగింది. ఇది ఊహించని బాలేంద్ర సింగ్, బస్సును ఢీ కొనకుండా ఉండేందుకు వెంటనే కారును పక్కకు తిప్పారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి, రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలేంద్ర సింగ్తోపాటు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని రక్షించారు. రామనాథపురం ప్రభుత్వ అస్పత్రికి తరలించగా, అక్కడ బాలేంద్ర సింగ్ కుమార్తె ఆరాధ్య భద్రుల (10) చికిత్స అందక విషాదకరంగా మరణించింది. మిగిలిన నలుగురు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఉచ్చిపులి పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. -
క్యూఎస్ ర్యాంకింగ్లో వీఐటీకి ఆరవ స్థానం
వేలూరు: క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సబ్జెక్టు ర్యాంకింగ్స్లో ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగంలో వీఐటీ యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా 119వ స్థానానికి చేరుకొని ముందంజ వేసింది. ప్రపంచ ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ క్యూఎస్ క్యాక్యా రెల్లి సైమండ్స్ తన 2026 వరల్డ్ యూనివర్సిటీ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 100 విభిన్న ప్రాంతాల్లో ఉన్న 1,700కు పైగా విశ్వవిద్యాలయాల్లో అందిస్తున్న 18,300కు పైగా అకడమిక్ కార్యక్రమాల విశ్లేషించిన అనంతరం ఈ సంస్థ ఈ ఫలితాలను ప్రచురించింది. 2026 ఎడిషన్లో వేలూరు వీఐటీ యూనివర్సిటీ 17 విబిన్న సబ్జెక్టు విభాగాలలో ప్రపంచంలోని అగ్రగామి యూనివర్సిటీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ర్యాంకింగ్పై వీఐటీ యూనివర్సిటీ చాన్స్లర్ విశ్వనాథన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపిన విధంగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్లో వీఐటీ యూనివర్సిటీ గత సంవత్సరం పోలిస్తే 23 స్థానాలు ఎగబడి ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా 119వ స్థానానికి చేరుకుందని జాతీయ స్థాయిలో ఆరవ ర్యాంకును సాధించిందన్నారు. ముఖ్యంగా తమ యూనివర్సిటీ రెండు నిర్ధిష్ట విభాగాల్లో టాప్ 100 ర్యాంకింగ్స్లో విజయవంతంగా స్థానం సంపాదించిందన్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో 56వ ర్యాంకు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్లో 87వ ర్యాంకు సాధించిందన్నారు. అదేవిధంగా ఈ సంస్థ అనేక విభాగాలలో టాప్ 200 ర్యాంకింగ్స్లో స్థానం సంపాదించిందన్నారు. గణితంలో 104వ ర్యాంకు, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్లో 101–200, మెటిరియల్స్ సైన్స్లో 137వ ర్యాంకు, మెకానికల్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్లో 148వ స్థానం సాధించిందన్నారు. ప్రస్తుతం క్యూఎస్ ర్యాంకింగ్లో స్థానం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని ఆ ప్రకటనలో తెలిపారు. -
శ్రీరామనవమి కోలాహలం
పళ్లిపట్టు: శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి ఆలయాల్లో విశేష వేడుకలు నిర్వహించారు. శ్రీమహావిష్ణువు అవతారాల్లో ప్రసిద్ధి చెందిన రామావతారాన్ని స్మరించుకునే విధంగా రామనవమి వేడుకలు కోలాహలంగా నిర్వహించడం పరిపాటి. పళ్లిపట్టులోని ఆంజనేయనగర్లో ప్రసిద్ది చెందిన కల్యాణ రామ సమేత వీరమంగళ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం వేకువజామున స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఊంజల్ సేవ నిర్వహించి భక్తులు స్వామి దర్శనం చేశారు. మధ్యాహ్నం భక్తులందరికీ అన్నదానం పంపిణీ చేశారు. ఆర్కేపేట సమీపంలోని చెట్టివారిపల్లె గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో 109వ వార్షికోత్సవ రామనవమి వేడుకలు సందర్భంగా వేకువజామున సీతారాములకు సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించారు. స్వామికి పుష్పాలంకరణ చేపట్టి మహాదీపారాధన పూజలు నిర్వహించారు. గ్రామీణులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ సేవ సందర్భంగా విశేష అలంకరణలో స్వామివారు గ్రామ వీధుల్లో ఊరేగారు. ఇదే విధంగా పలు గ్రామాల్లో రాములవారి భజన మందిరాల్లో రామనవమి నిర్వహించి భజనలు చేపట్టారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 65,600 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,292 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.18 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
నాట్ హెల్త్ అధ్యక్షురాలిగా డాక్టర్ సంగీతారెడ్డి
సాక్షి, చైన్నె: భారతీయ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత సంస్థ నాట్హెల్త్(ఎన్ఏటీహెచ్ఈఏఎల్టీహెచ్)కు 2026–27 ఆర్థిక సంవత్సరానికి నూతన నాయక త్వ బృందాన్ని శుక్రవారం ప్రకటించా రు. చైన్నెలో జరిగిన నాట్హెల్త్ వార్షిక సర్వసభ్య సమావేశంలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న అమీరా షా (మెట్రోపోలిస్ హెల్త్కేర్) స్థానంలో నియమితులయ్యారు. కొత్త నాయకత్వ బృందం నాట్ హెల్త్కు అధ్యక్షురాలిగా డాక్టర్ సంగీతారెడ్డి (అపోలో హాస్పిటల్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా హిమాన్షు బైద్ (మేనేజింగ్ డైరెక్టర్, పాలీ మెడిక్యూర్ లిమిటెడ్), వైస్ ప్రెసిడెంట్గా వరుణ్ ఖన్నా(గ్రూప్ ఎం.డి, క్వాలిటీ కేర్ ఇండియా లిమిటె డ్) ఎంపికయ్యారు. బాధ్యతలు స్వీక రించిన అనంతరం డాక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ భారతదేశం వికసిత్ భారత్–2047 దిశగా అడుగులు వేస్తు న్న తరుణంలో వైద్యం కేవలం చికిత్సకు మాత్రమే పరిమితం కాకుండా నివారణ, రోగుల భద్రతకు పెద్దపీట వేసేలా మారాలని ఆకాంక్షించారు. ప్రాథమిక చికిత్సను బలోపేతం చేయడం, బీమా సౌకర్యాన్ని విస్తరించడం, డిజిటల్ హెల్త్ ప్లాట్ఫారంలను ఉపయోగించుకోవడం ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించవచ్చునని వివరించారు. తన తండ్రి డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, ప్రతి భారతీయుడికి అందుబాటు ధరలో, అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం, పరిశ్రమల మధ్య వారధిగా నాట్హెల్త్ పనిచేస్తుందని పేర్కొన్నారు. -
తెలుగు లోగిళ్లలో శ్రీరామనవమి
సాక్షి,చైన్నె: చైన్నె నగరంలో తెలుగు లోగిళ్లు రామనామ స్మరణ మార్మోగింది. శ్రీసీతారాముల కల్యాణ వైభోగం రమణీయంగా జరిగింది. అశేషంగా భక్తులు తరలివచ్చి సీతారాముల కల్యాణాన్ని కనులారా తిలకించి తరించారు . చైన్నెలోని శ్రీవారి ఆలయంలో.. శ్రీరామనవమి పురస్కరించుకుని చైన్నె టి.నగర్ , వెంకటనారాయణ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించారు. చైన్నె టీటీడీ స్థానిక సలహామండలి మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీకృష్ణ, ఆనందకుమార్ రెడ్డి, మాజీ సభ్యులు అనిల్కుమార్ రెడ్డి, మోహన్రావు, కార్తికేయన్, జయదేవ్, సత్యనారాయణ , రంగారెడ్డి, ఏఈఓ ధనుంజయ్ పాల్గొన్నారు. మద్రాసు మిర్చి వర్తక సంఘం ది మద్రాసు మిర్చి వర్తక సంఘం ఆధ్వర్యంలో 118 వ వార్షిక శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. చైన్నె అదియప్ప నాయకన్ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి కన్వెన్షన్ హాలు వేదికగా శ్రీ రామనవమి ఉత్సవ కమిటీ చైర్మన్ విజే సురేష్కుమార్ అధ్యక్షతన వేడుకలు, సీతారాముల కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. శ్రీఆంధ్ర కళాస్రవంతి ఆధ్వర్యంలో శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 37వ సంవత్సర శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా శుక్రవారం నిర్వహించారు. చైన్నె కొరట్టూర్ అగ్రహారంలోని రామాలయం వీధిలోని శ్రీ కోదండరామాలయం హాలు వేదికై ంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ ఆంధ్ర కళాస్రవంతి అధ్యక్షుడు జె ఎం నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలు జరిగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అన్నానగర్ ఎమ్మెల్యే మోహన్, స్రవంతి ప్రధాన సెక్రటరీ జె. శ్రీనివాస్ పాల్గొన్నారు. చైన్నె తెలుగు అసోసియేషన్: చైన్నె తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో చైన్నె మదురవాయిల్లోని శ్రీ సీతాలక్ష్మి కల్యాణ మండపం వేదికగా శ్రీ సీతారాముల కల్యాణాన్ని శుక్రవారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల కృష్ణా రెడ్డి, సెక్రటరీ వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. తెలుగు ప్రజా సంక్షేమ సంఘంలో: చైన్నె కొడుంగైయూర్ సీతారామనగర్లో ఉన్న సీతారామనగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమిని పురస్కరించుకు ని సీతారాముల వారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు . సంఘం అధ్యక్షుడు కె శ్రీనివాస కుమార్ , కార్యదర్శి పి. లక్ష్మణ రావు , ట్రెజరర్ డి. పిచ్చేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీ గీతా భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైన్నె గోపాలపురంలోని శ్రీ గీతా భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామనవి వేడుకలు అత్యంతవైభవంగా నిర్వహించారు. గీతా భవన్ ట్రస్ట్ చైర్మ న్ ఓంప్రకాష్ మోడీ, మేనేజింగ్ ట్రస్టీ మనుగోయల్ ,కోశాదికారి మురళీ లాల్ సాంతాలియా పాల్గొన్నారు. ఎస్కేపీడీలో శ్రీరామనవమి చైన్నెలోని శ్రీ కన్యపరమేశ్వరి ఆలయంలో ఉత్స వాలు శుక్రవారం వైభవంగా ఆరంభమయ్యా యి. హంస వాహనంపై శ్రీరామచంద్రమూర్తులను వేంచేపు చేసి పూజలను నిర్వహించారు. అదేవిధంగా చైన్నె పాతచాకలిపేటలో నూతనంగా నిర్మించి కుంభాభిషేకం జరుపుకున్న ఆలయంలో అంగరంగవైభవంగా రాములోరి పెళ్లి జరిపించారు. హిందూ కళాశాలలో.. కొరుక్కుపేట: ధర్మమూర్తిరావు బహదూర్ కలవల కన్నన్ చెట్టి హిందూ కళాశాల, తెలుగు శాఖ తెలుగు భాషా సమితి తరఫున ఉగాది వేడుక లు, ముగింపు సమావేశాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రధాన అధ్యాపకులు డా. కల్విక్కరసి మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు కొత్త విద్యార్థులను ఈ శాఖలో చేర్పించడానికి తమవంతు సహకా రన్ని అందించాలని ఆకాంక్షించారు. సహాయాచార్యులు డా. తుమ్మపూడి కల్పన ఉగాది ప్రా ముఖ్యతను, శ్రీరామనవమి వైశిష్ట్యాన్ని విద్యార్థులకు వివరించారు. మూడో సంవత్సరం విద్యార్థులు బాబు, సైమన్లకు శాఖ తరఫున బహుమతులను అందించారు.మద్రాసు మిర్చి వర్తక సంఘంలో సీతారాముల కల్యాణం ఆంధ్ర కళా స్రవంతిలో సీతారాముల కల్యాణం చైన్నె తెలుగు అసోసియేషన్లో శ్రీరామనవమి ఘనంగా శ్రీరామనవమి వేడుకలు వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో శ్రీరామనవమిని ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం ఉదయం రాములోరికి ప్రత్యేక పూ జలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేలూరు రంగాపురంలోని కోదండరాముడి ఆలయంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి పుష్పాలంరణలు చేశారు. అదేవిధంగా వాలాజలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని పీఠాధిపతి మురళీధరస్వామిజీ ఆధ్వర్యంలో పీఠంలో ప్రతిష్ఠించిన శ్రీ పట్టాభిషేకరాముడికి మహా అభిషేకం, పుష్పాలంకరణలు చేశా రు. ముందుగా ఉదయం 6 గంటలకు మహాగణ పతి పూజ, గోపూజ, 1008 కలశాలకు ప్రత్యేక పూజ లు, లక్ష్మీపూజ, సకల దేవతా హోమం, మహా సంకల్పం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ధన్వంతరి మూలమంత్ర జపం, పట్టాభిరాముడికి మహాఅభిషేకం, మహా పూర్ణాహుతి, చతుర్వేద పారాయణం, ప్రసాద వినియోగం నిర్వహించారు. అదేవిధంగా తిరువణ్ణామలై జిల్లాలోని శ్రీ రాముడి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేశారు. వేలూరు జిల్లా కేవీ కుప్పం సమీపంలోని అరుంబాక్కం పంచాయతీ పరిఽధి లోని చెన్నారెడ్డివూరు గ్రామంలోని ఆలయంలో స్వామివారికి తిరుకల్యాణోత్సవం నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. అలాగే చిన్నలత్తే రి గ్రామంలోని రాముడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కల్యాణోత్సవం నిర్వహించారు. -
అమ్మవారి ఆలయంలో చోరీ
తిరువళ్లూరు: టౌన్ పోలీసుస్టేషన్కు సమీపంలోని అమ్మవారి ఆలయంలో చోరీ జరిగిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరువళ్లూరు పట్టణంలోని దేవదాయశాఖకు చెందిన కాళికాంబ అమ్మవారి ఆలయం ఉంది. పురాతన ఆలయానికి చెందిన నిత్యం వందలాది మంది భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో అర్చకుడు నారాయణన్ గురువారం రాత్రి పూజలు అనంతరం ఆలయానికి తాళం వేసుకుని వెళ్లినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఆలయానికి యథావిధిగా రాగా అప్పటికే ఆలయంలోని హుండీతో పాటు గర్బగుడి తాళాలు పగలగొట్టబడి ఉన్నాయి. హుండలోని నగదు, అమ్మవారి నగలను ఎత్తుకెళ్లినట్టు గుర్తించి షాక్కు గురయ్యారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. టౌన్ పోలీసుస్టేషన్కు సమీపంలోని ఆలయంలో చోరీ జరిగిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మళ్లీ వార్తల్లోకి అన్నావర్సిటీ అన్నానగర్: 2024లో అన్నా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఒక విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపు ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన జ్ఞానశేఖరన్కు 30 ఏళ్ల జైలు శిక్ష ఇటీవల విధించారు. ఈ ఘటన మరువక ముందే అన్నా యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక వేదింపు ఘటన తాజాగా మరోసారి కలకలం రేపింది. ఈ విషయమై విద్యార్థిని దాఖలు చేసిన ఫిర్యాదులో ప్రొఫెసర్ లైంగిక దుష్ప్రవర్తన బయటపడింది. విద్యార్థిని దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు వివరాల మేరకు అన్నా వర్సిటీలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న గత మూడేళ్లుగా తనను ప్రొఫెసర్ నిత్యం వేధిస్తూ వస్తున్నట్టు ఆరోపించారు. ఆయన వేదింపు పెరగడంతో కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. తనతో పాటుగా ఆయన వేధింపులకు మరెందరో గురై ఉన్నారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో వ్యవహారం దుమారానికి దారి తీసింది. పీఎంకే, బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. నలుగురికి యావజ్జీవ శిక్ష తిరువొత్తియూరు: చైన్నె, మదురవాయిల్లో ఇంజినీర్ను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ పూందమల్లి కోర్టు తీర్పునిచ్చింది. చైన్నె మధురవాయల్ ప్రాంతానికి చెందిన ఢిల్లీబాబు అలియాస్ వెంకటేసన్ (29). ఇతను షిప్లో ఇంజినీర్గా పనిచేసేవారు. అదేప్రాంతానికి చెందిన గోకులకృష్ణన్ (38) ఢిల్లీబాబుతో నగదు విషయంగా శత్రుత్వం వుంది. దీంతో తన స్నేహితులైన కార్మేగం (38), భూపాలన్ (32), రాజ్కుమార్ ( 33), సుందరేసన్ (అలియాస్) సుందర్ (32), అందరూ కలిసి. గత 2012 ఫిబ్రవరి 6న ఢిల్లీబాబు (వెంకటేశ్)ను కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ కేసు విచారణ పూందమల్లి అదనపు కోర్టులో గురువారం విచారణకు వచ్చింది. నేరం రుజువుకావడంతో కార్మేగం, భూపాలన్, రాజ్కుమార్, కందరేషన్ అనే నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి విజయకుమార్ తీర్పు వెలువరించారు. గోకుల్కృష్ణన్పై నేరం రుజువు కాకపోవడంతో అతన్ని విడుదల చేశారు. ముగ్గురు విద్యార్థుల సస్పెన్షన్ అన్నానగర్: ఊటీ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో గంజాయి వాడకం పెరుగుతోంది. విద్యార్థులు కూడా గంజాయి వాడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు మరింత నిఘాపెట్టారు. ఈ స్థితిలో గురువారం కళాశాల విద్యార్థులు కొందరు గంజాయి తీసుకుంటున్నారని తెలిసింది. పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం కళాశాల యాజమాన్యం ఆ ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. -
శాంతిటాకీస్కు నివాస్ కె. ప్రసన్న
తమిళసినిమా: కోలీవుడ్లో దూసుకొస్తున్న యువ సంగీత దర్శకుల్లో నివాస్ కె.ప్రసన్న ఒకరు. ఈయన ఇటీవల బైసన్ వంటి విజయవంతమైన చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవల ఈయన సంగీతం అందించిన తాయ్ కిళవి చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ఈ చిత్రాలకు నివాస్ కె ప్రసన్న సంగీతం పక్కా బలంగా అమిరింది. కాగా తాజాగా మరో కొత్త చిత్రానికి ఈయనే కమిట్ అయ్యారు. ఇంతకు ముందు మావీరన్, 3 పీహెచ్కే వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శాంతి టాకీస్ సంస్థ అధినేత అరుణ్ విశ్వనిర్మిస్తున్న 4వ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమై శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో భారత్, కుటుంబస్తన్ చిత్రం ఫేమ్ శాన్వేమేఘ్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి హరిహర్సుదన్ అళగిరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి నివాస్ కె.ప్రసన్న సంగీతాన్ని అందిస్తున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మంచి కథా బలం ఉన్న చిత్రాలను నిర్మించే సంస్థగా పేరొందిన శాంతి టాకీస్ రూపొందిస్తున్న ఈ చిత్రం కూడా కథను మాత్రమే నమ్మి నిర్మిస్తున్నట్లు యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ను ఏకధాటిగా నిర్వహించి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. దీనికి తేనీఈశ్వర్ చాయాగ్రహణం అందిస్తున్నారు. -
కోలాహలం.. అమ్మవారి ఊరేగింపు
తిరుత్తణి: ద్రౌపదీదేవి ఆలయ అగ్నిగుండ వేడుకల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు కాశినాథపురంలో ఊరేగారు. ఈ సందర్భంగా భక్తులు తమ శరీరానికి ఇనుప చువ్వలు గుచ్చుకుని అమ్మవారి వాహనం లాగి మొక్కులు తీర్చుకున్నారు. తిరుత్తణి గాంధీ రోడ్డులోని ద్రౌపదీదేవి ఆలయంలో వార్షిక అగ్నిగుండ వేడుకలకు గురువారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 18 రోజులపాటు నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా రెండవ రోజు వేకువజామున ధర్మరాజుకు విశేష పూజలు నిర్వహించారు. ఉదయం ద్రౌపదీదేవికి విశిష్ట అలంకరణ చేసి ట్రాక్టర్లో కొలువుదీర్చారు. కాశినాథపురం గ్రామానికి చెందిన యువకులు తమ శరీరానికి ఇనుప చువ్వలు గుచ్చుకుని ట్రాక్టర్లో వేలాడుతూ, లాగుతూ గ్రామంలోకి అమ్మవారిని తరలించారు. గ్రామీణులు అమ్మవారికి హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి దర్శించుకున్నారు. -
నియోజకవర్గం సెగ
– డీఎంకే కూటమిలో విస్తృతంగా మంతనాలు సాక్షి, చైన్నె : సీట్ల సర్దుబాటు ప్రక్రియను కొలిక్కి తెచ్చినప్పటికీ, నియోజక వర్గాల ఎంపిక లో అసంతృప్తి సెగ అన్నది డీఎంకే కూటమిలో రాజుకున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. నో కాంప్రమైజ్ అంటూ డీఎంకే కఠినంగానే వ్యవహరిస్తుండటంతో కొన్ని పార్టీలు తమలోని ఆవేదనను బయటకు కక్కలేక, మింగలేక సతమతం అవుతోన్నట్టు చర్చ ఊపందుకుంది.కూటమిలో కాంగ్రెస్కు 28 సీట్లు, డీఎండీకేకు 10, వీసీకేకు 8, సీపీఎం 5, సీపీఐ 5, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ 2 సీట్లను దక్కించుకున్నాయి. ఈ పార్టీలన్నీ వారి వారి చిహ్నాలలో పోటీచేయనున్నాయి. అయితే, ఎండీఎంకేకు నాలుగు సీట్లు ఇచ్చినా, ఇందులోమూడు డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేసే విధంగా నిర్భంధం విదించడం గమనార్హం. మిగిలిన పార్టీలన్నీ డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేయాల్సిందే. 234 స్థానాలలో 59 స్థానాలు పైన పేర్కొన్న మిత్రులకు పోగా 175 స్థానాలలో డీఎంకే ఉదయ సూర్యుడు పోటీ చేసే విధంగా స్టాలిన్ నిర్ణయించారు. తమకు తక్కువ సీట్లు ఇవ్వడంతో సీపీఎం, సీపీఐలు లోలోపల అసంతృప్తితో ఉన్నప్పటికీ, నియోజకవర్గాల ఎంపిక విషయంలోనూ సమస్యను ఎదుర్కొంటున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. శుక్రవారం పలు దఫాలుగా నియోజకవర్గాల ఎంపిక విషయంగా డీఎంకే కమిటీతో చర్చలు జరిగాయి. అదే సమయంలో పాత మిత్రులకు తగ్గించి, కూటమిలోకి కొత్తగా వచ్చిన డీఎండీకేకు పది స్థానాలు ఇవ్వడంపై పెదవి విప్పే పనిలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంలో డీఎంకే పాత మిత్రులు లోలోపల కుమిలిపోతున్నారన్నది స్పష్టం అవుతోంది. ఇందుకు అనుగుణంగా నే ఎండీఎంకే ప్రతినిధి అర్జున రాజ్ స్పందించారు. తాము నవ్వుతూ ఏడుస్తున్నామంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. శుక్రవారం జరిగిన ఎండీంకే భేటీలో సైతం ఇదే విషయంగా నేతలు ప్రస్తావించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమ హక్కును హరించే విధంగా డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేసే విధంగా నిర్భందించడాన్ని మరికొన్ని చిన్న పార్టీలు సైతం మౌనంగా రోదిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. శుక్రవారం జరిగిన సుదీర్ఘ చర్చలు, మంతనాలతో కొన్ని పార్టీలకు నియోజకవర్గాలను కేటాయించారు. అలాగే,వీసీకేకు సైతం కేటాయింపు ముగించగా, మిగిలిన పార్టీలకు శనివారంలోపు పూర్తి చేయడానికి స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం తమ జట్టును స్టాలిన్ ప్రకటించే అవకాశాల ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, కాంగ్రెస్ రూపంలో నియోజకవర్గం ఎంపిక సెగ కొనసాగుతున్నట్టు అన్నా అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. -
నీ ఫరెవర్
వైవిధ్య కథనాలతో తమిళసినిమా: సినిమా కొత్త పుంతలు తొక్కుతోందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ తరం దర్శకులు కొంగొత్త ఆలోచనలతో కథలను తెరకెక్కిస్తున్నారు. భారీతనం కంటే మంచి కంటెంట్తో చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల అలాంటి చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అలా తాజాగా రూపొందిన చిత్రం నీ ఫరెవర్. అమ్మాయిలకు దూరంగా , ప్రేమించడం కూడా తెలియని ఒక యువకుడు ప్రేమ ఇతివత్తంతో ఒక ప్రాజెక్ట్ను చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ప్రేమ అనుభవం తెలుసుకోవడానికి యువతి కోసం పార్టీలో వెంట తిరుగుతుంటాడు. ఇంచుమించు అలాంటి ఒక లవ్ సబ్జెక్టుతో షార్ట్ ఫిలిం చేయాలని నిర్మాత కోరడంతో ప్రేమ అంటేనే గిట్టని ఒక యువతి ప్రేమ అనుభవాన్ని పొందడానికి ఒక అమాయక యువకుడి కోసం గాలిస్తుంది. అలా ఆ యువతి, యువకుడు తమ తమ అవసరాల కోసం ప్రేమించుకుటారు. అలా మొదలైన వారి ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? ఆ యువకుడు ప్రేమ గురించి ఆలోచించకపోవడానికి కారణం ఏమిటి ? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం నీ ఫరెవర్. జెన్ స్టూడియోస్ పతాకంపై పుగళ్, ఈడెన్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ద్వారా అశోక్కుమార్ కలైవాణి దర్శకుడిగా పరిచయం అయ్యారు. సుదర్శన్ గోవింద్, అర్చన రవి జంటగా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు వైజీ.మహేంద్రన్, నిళగళ్రవి, ఎంజే.శ్రీరామ్, రితిక శ్రీనివాస్ చెల్లా, బ్రిందా ముఖ్యపాత్రలు పోషించారు. అశ్విన్హేమంత్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. బ్లడీ పాలిటిక్స్ సెట్లో రాజుమురుగన్ తమిళసినిమా: నటుడు గౌతమ్రామ్ కార్తీక్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బ్లడీ పాలిటిక్స్. ఈ చిత్రం ద్వారా దినారాఘవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు రాజుమురుగన్ శిష్యుడు అన్నది గమనార్హం. అంజనానేత్రన్ నాయకిగా నటిస్తున్న ఇందులో దర్శకుడు సెల్వరాఘవన్, పి.వాసు, ఏ.వెంకటేశ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు గణేష్ కే.బాబు తన డ్రాఫ్ట్ బై జీకేబీ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ వి.ముత్తుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమై తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. తాజాగా రెండో షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సమకాలీన రాజకీయ నేపథ్యంలో సాగే ఈ ఈ చిత్ర టైటిల్తో కూడిన టీజర్ ఇటీవల విడుదల చేశారు. ఇది చిత్రంపై ఆసక్తిని పెంచేసిందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. దర్శకుడు రాజుమురుగన్ తన శిష్యుడు తెరకెక్కిస్తున్న బ్లడీ పాలిటిక్స్ చిత్ర షూటింగ్కు వెళ్లి పర్యవేక్షించి వారిని ప్రోత్సహించే విధంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన విజిటింగ్ ఈ చిత్ర యూనిట్కు ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందని దర్శకుడు దినారాఘవన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రదీప్ కాళీరాజా చాయాగ్రహణం, శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
బీజేపీకి ఝలక్.. ఎన్నికల వేళ ట్విస్ట్ ఇచ్చిన అన్నామలై!
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. అన్నాడీఎంకేతో సీట్లు సర్దుబాటు విషయమై రాష్ట్ర బీజేపీ మాజీ సారథి కె.అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందుకు నిరసనగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి.ఈ మేరకు కేంద్ర నాయకత్వానికి అన్నామలై ఇప్పటికే లేఖ కూడా రాశారు. బీజేపీ సులువుగా గెలవగలిగే కినతుకడవు వంటి స్థానాలను అన్నాడీఎంకే అట్టిపెట్టుకోవడంపై అందులో తీవ్రంగా ఆక్షేపించారు. కినతుకడవు నుంచి బీజేపీ పోటీ చేయకపోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలో పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు రెండు రోజులుగా ఆందోళనకు కూడా దిగుతున్నాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే 169, బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్డీయేలోని ఇతర భాగస్వాములు పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 స్థానాలు దక్కాయి. బీఎల్ సంతోష్కు ఝలక్..ఇదిలా ఉండగా.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ గురువారం చైన్నెలో నిర్వహించిన సమావేశానికి అన్నామలై గైర్హాజరు కావడం చర్చకు దారి తీసింది. గురువారం బీఎల్ సంతోష్ నేతృత్వంలో బీజేపీరాష్ట్ర కమిటీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో మాజీ అధ్యక్షుడు అన్నామలై పాల్గొన లేదు. తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదన్న లేఖను ఆయన పార్టీ అధిష్టానానికి పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన కోయంబత్తూరులోని సింగానల్లూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధమై, గత కొంత కాలంగా తన దృష్టిని కేంద్రీకరించారు. అయితే ఆ స్థానాన్ని అన్నాడీఎంకే నుంచి రాబట్టడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు. దీంతో తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదని అధిష్టానానికి అన్నామలై లేఖ పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన ఎన్నికలలో పోటీ చేయాలని మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ పిలుపు నిచ్చినా ఆయన స్పందించక పోవడం గమనార్హం.ఢిల్లీకి అభ్యర్థుల జాబితా27 మంది అభ్యర్థుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసి ఢిల్లీకి పంపించినట్టు సమాచారం. ఇందులో అవినాశి–కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, మైలాపూర్– మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కోయంబత్తూరు నార్త్– ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, నాగర్కోయిల్– మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, సాత్తూరు– బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, తళి – అమరప్రసాద్ రెడ్డి, తిరుప్పూర్ సౌత్ – ఎ.పి. మురుగానందం, విలవంకోడ్ – విజయధరణి, మదురై సౌత్–రామ శ్రీనివాసన్, తిరువణ్ణామలై– అశ్వత్థామన్, తంజావూరు– కరుప్పు మురుగానందం, మొడకురిచ్చి –కృతికా శివకుమార్, పుదుక్కోట్టై– రామచంద్రన్..రామనాథపురం– జి.పి.ఎస్. నాగేంద్రన్,రాశిపురం– డాక్టర్ ప్రేమ్ కుమార్,వాసుదేవనల్లూర్ – ఆనందన్ అయ్యాస్వామి, ఆవడి– అశ్విన్, ఊటి– భోజ రాజన్ లేదా ఉమాదేవి, గంధర్వకోట్టై – పురట్చి కవి దాసన్, తిరుపత్తూరు– చోళ పళనిస్వామి, అరంతంగి– కవిత శ్రీకాంత్, రాధాపురం– బాలకృష్ణన్, తిరువారూర్ – శివ, మనమదురై– పొన్పాల గణపతి, తిరుచెందూర్– ఆర్.ఎం. రాధాకృష్ణన్, పద్మనాభపురం– ఎడ్విన్ జోస్,కులచల్– శివకుమార్ పేర్లు ఉన్నాయి. సుమారు 20 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తూ సిద్ధం చేసిన జాబితాను ఢిల్లీ ఆమోదంతో రెండు రోజులలో ప్రకటించనున్నారు. -
అగ్నిగుండ వేడుకలు ప్రారంభం
తిరుత్తణి: తిరుత్తణి గాంధీనగర్లో ద్రౌపదీదేవి ఆలయ అగ్నిగుండ వేడుకలు గురువారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తిరుత్తణి, గాంధీనగర్లోని ద్రౌపదీదేవి ఆలయ అగ్నిగుండ వేడుకలను గురువారం ధ్వజారోహణం నిర్వహించి వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్రౌపదీదేవికి విశేష పుష్ఫాలంకరణ చేసి కొలువుదీర్చారు. వేకువజాము ఐదు గంటలకు ధ్వజస్తంభానికి విశేష పూజలు చేసి వేడుకలకు ధ్వజారోహణంతో శ్రీకారం చుట్టారు. 18 రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలను పురస్కరించుకుని ఆలయ పరిసర ప్రాంతాలు విద్యుద్దీపాలతో అలంకరించారు. రోజూ పగటి సమయాల్లో మహాభారత ఉపన్యాసాలు, రాత్రి వేళల్లో వీధి నాటకాలు ప్రదర్శిస్తారు. ఏప్రిల్ 12న అగ్నిగుండ వేడుకగా నిర్వహించనున్నారు. ఉత్సవ వేడుకలు ప్రారంభంతో భక్తులు కంకణాలు ధరించి దీక్షలు ప్రారంభించారు. ధ్వజారోహణం అలంకరణలో ద్రౌపదీదేవి -
అన్బుకే మామిడి పండు
– రాందాసుకు షాక్ సాక్షి, చైన్నె : మామిడి పండు చిహ్నం వ్యవహారంలో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుకు చుక్కెదురైంది. ఆయన విజ్ఞప్తిని కోర్టు పరిగణించలేదు. పిటిషన్ను చైన్నె సివిల్ కోర్టు గురువారం కొట్టి వేసింది. దీంతో మామిడి పండు అన్బుమణి వశం చేరినట్టుగా పరిస్థితి నెలకొంది. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్భుమణి మధ్య సమరం గురించి తెలిసిందే. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ అన్బుమణి పార్టీ అధ్యక్షుడిగా గుర్తించి, జెండా, చిహ్నం ఆయనకు అప్పగించింది. దీనిని వ్యతిరేకిస్తూ రాందాసు న్యాయపోరాటం చేస్తూ వస్తున్నారు. చివరకు సుప్రీం కోర్టు ఆదేశాలతో చైన్నె 12వ అదనపు సివిల్ కోర్టు తలుపు తట్టారు. బుధ, గురువారం ఈ విచారణ జరిగింది. న్యాయమూర్తి ధర్మప్రభు స్పందిస్తూ రాందాసు విన్నపాన్ని తిరస్కరించారు. కీలకంగా ఎన్నికల కమిషన్ వాదన విచారణకు హాజరైన ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాదులు కోర్టు ముందు బలమైన వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఈ దశలో చిహ్నాన్ని సీజ్ చేస్తే ఓటర్లలో గందరగోళం ఏర్పడుతుందని సూచించారు. పుదుచ్చేరిలో ఇప్పటికే ఈ చిహ్నాన్ని కేటాయించినట్లు తెలిపారు. ఈ వివాదం పూర్తిగా తండ్రి, కుమారుల మధ్య వ్యక్తిగత అంశం అని వివరించారు. అదే సమయంలో అన్బుమణి అధ్యక్షుడైన తర్వాతే పార్టీ గుర్తింపు రద్దయినట్లు రాందాసు తరపున వాదించారు. అలాగే, అన్బమణి తరపున సైతం వాడీవేడిగా వాదనలు జరిగాయి. రాందాస్ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని , పార్టీ చిహ్నం వేరే ఎవరికీ వెళ్లకుడదనే ఉద్దేశంతోనే తాను దానిని పొందినట్లు తెలిపారు. 2025లో రాందాస్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారని చెబుతున్న జనరల్ బాడీ సమావేశం చెల్లదని స్పష్టం చేశారు. చివరకు న్యాయమూర్తి స్పందిస్తూ, ఎన్నికల సంఘం నిర్ణయాల్లో కోర్టులు తలదూర్చలేవని, పైగా చిహ్నం వ్యక్తులకు కాకుండా పీఎంకే అనే పార్టీ పేరు మీద కేటాయించ బడి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని తిరస్కరించారు. దీంతో పార్టీ, చిహ్నం అన్భుమణి వశం అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. తాజా పరిణామంపై అప్పీలుకు వెళ్లాలా? లేదా ప్రత్యామ్నాయం మీద దృష్టి పెట్టాలా? అన్న డైలమాలో రాందాసు వర్గం నిమగ్నమైంది. -
చైన్నె వేదికగా ఫ్యాషన్ సందడి
సాక్షి, చైన్నె: ‘షఫ్లింగ్ సూట్కే సెస్’ నేతృత్వంలో చైన్నె వేదికగా మార్చి 28, 29 తేదీల్లో అమేథిస్ట్లో ప్రత్యేక ప్రదర్శన, ఫ్యాషన్ షో నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. స్వదేశీ బ్రాండ్లు, పర్యావరణహిత ఫ్యాషన్కు చిరునామాగా నిలిచే మల్టీ–డిజైనర్ ప్లాట్ఫారమ్ ‘ష ఫ్లింగ్ సూట్కేసెస్’ తన విలక్షణమైన పాప్–అప్ ప్రద ర్శనకు ఈ ఏడాది చైన్నెను వేదికగా ఎంపిక చేసింది. రాయపేటలోని ’అమేథిస్ట్’వేదికగా ఈ ఫ్యాషన్ వేడుక జరగనుంది. ఈ రెండ్రోజుల ప్రదర్శనలో భాగంగా ప్ర త్యేకంగా ఎంపిక చేసిన బ్రాండ్లు తమ ‘స్ప్రింగ్,సమ్మ ర్’ కలెక్షన్లను ప్రదర్శించనున్నారు. భారతీయ కళాత్మకతకు, ఆధునిక అభిరుచులకు అద్దం పట్టేలా ఈ ఎడిషన్ను రూపొందించారు. కొత్త డిజైనర్లను ప్రోత్సహిస్తూ నే, వినియోగదారులకు నాణ్యమైన, విభిన్నమైన ఫ్యా షన్ ఉత్పత్తులను ఒకే చోట అందించడం తమ ఉద్దేశంగా ప్రకటించారు. చైన్నె నగరానికి కళలు, హస్తకళల మక్కువను చాటే విధంగా సమకాలీన శైలిలో ఉండే లా ఈ ఎడిషన్ను ప్లాన్ చేశాం’ అని తెలిపారు. ఉద యం 11:00 గంటల నుండి రాత్రి 7.00 గంటల వర కు జరిగే ఈ ప్రదర్శనకు ప్రవేశం అందరికీ ఉచితం అని ప్రకటించారు. ఇది భారతదేశంలోని స్వదేశీ బ్రాండ్లను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసే ఒక వేదిక అని, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉనికిని చాటుకుంటూ, కళాకారుల నైపుణ్యాన్ని పర్యావరణహిత ఫ్యాషన్ను ఇది ప్రోత్సహిస్తోందని ప్రకటించారు. ఈ వేడుకకు ప్రఖ్యాత ఫ్యాషన్ మోడల్స్ తరలి రానున్నట్టు వివరించారు. -
క్లుప్తంగా
నైనార్పై మనీ లాండరింగ్ కేసుకు డిమాండ్ సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్పై మనీ లాండరింగ్ కేసు నమోదుకు ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో రైలులో పట్టుబడ్డ నగదు నైనార్ నాగేంద్రన్కు చెందినదిగా ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ విచారణ చేస్తోంది. ఈ పరిస్థితులలో నైనార్ నాగేంద్రన్, ఆ పార్టీ నేత కేశవ వినాయగంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి విచారించే విధంగా ఈడీని ఆదేశించాలని డీఎంకే ఎంపీ గిరిరాజన్ పిటిషన్ దాఖలు చేశారు. రూ.1.50 లక్షల స్వాధీనం తిరుత్తణి: తిరుత్తణిలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ గురువారం తనిఖీలు నిర్వహించి ఆధారాలు లేకుండా తీసుకెళ్లిన రూ. 1.50 లక్షలు స్వాధీ నం చేసుకున్నారు. తిరుత్తణి సమీపంలోని చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి వైపు వెళుతున్న కారును తనిఖీ చేశారు. తనిఖీల్లో ఆధారాలు లేని రూ.1.50 లక్ష స్వాధీనం చేసుకొని ఆర్డీఓ కార్యాలయంలో అప్పగించారు. విచారణలో తిరుపతికి చెందిన డాక్టర్ శోభన శ్రీపెరంబదూరులో బంధువుల ఇంటికి వెళుతుండగా స్వాధీనం చేసుకున్నట్లు విచారణలో తేలింది. కౌంటింగ్ కేంద్రాల పరిశీలన తిరువళ్లూరు: జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో ఈవీఎంలను రెండు ప్రాంతాల్లో భద్రపరిచి కౌంటింగ్ చేయాలని నిర్ణయించిన క్రమంలో ఏర్పాట్లను కలెక్టర్, ఆవడి పోలీస్కమిషనర్ గురువారం ఉదయం పరిశీలించారు. తిరువళ్లూరు, మాధవరం, తిరుత్తణి, పూందమల్లి, గుమ్మిడిపూండి, పొన్నేరి, మధురవాయల్, ఆవడి, అంబత్తూరు, తిరువొత్తియూరు పది అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అనంతరం గుమ్మిడిపూండి, పొన్నేరి, తిరుత్తణి, తిరువళ్లూరు ఈవీఎంలను సెవ్వాపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనూ, మాధవరం, మధురవాయల్, పూందమల్లి, ఆవడి, అంబత్తూరు, తిరువొత్తియూరు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను పెరుమాల్పట్టులోని శ్రీరామ్ విద్యాసంస్థల్లో భద్రపరచనున్నారు. గతంలో పది స్థానాలకు చెందిన ఈవీఎంలను పెరుమాల్పట్టులో భద్రపరిచి కౌంటింగ్ నిర్వహించేవారు. అయితే ఈ సారి రెండు ప్రాంతాల్లో కౌంటింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈక్రమంలో రెండు కౌంటింగ్ కేంద్రాలను తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్, కమిషనర్ ప్రేమానంద్సిన్హా పరిశీలించారు. ఏర్పాట్లను ముమ్మరంగా నిర్వహించి పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఈవీఎంలు భద్రపరిచే ప్రాంతాలు, కౌటింగ్ నిర్వహించే ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. టిప్పర్ ఢీకొని ఇద్దరు దుర్మరణం కొరుక్కుపేట: ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. చెంగల్పట్టు సమీపంలోని మామండూర్ ఫ్లైఓవర్పై ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి టిప్పర్ ఢీకొనడంతో ఈప్రమాదంలో బైక్లో వెళుతున్న అబిమాష్, జాన్ చార్లెస్ అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలిసి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో మృతులు ఇద్దరూ తిరువళ్లువర్ జిల్లా, ఆవడి, కామరాజర్ నగర్కు చెందినవారని, ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారని తెలిసింది. ఈ సంఘటన కారణంగా తిరుచి–చైన్నె జాతీయ రహదారిపై ఇరువైపులా రెండు గంటలకు పైగా భారీ ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నత పరిశోధనపై జాతీయ సదస్సు కొరుక్కుపేట: ఎస్ఆర్ఎం ఇన్స్ట్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ – వడపళని క్యాంపస్లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మెకానికల్ సైన్సెస్లో ఉన్నత పరిశోధనపై జాతీయ సదస్సును గురువారం నిర్వహించారు. సదస్సుకు దేశం నలుమూలల నుంచి ప్రముఖ విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు విద్యా ర్థులు పెద్ద ఎత్తున విచ్చేశారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఆర్. రాజారామన్ ఎస్ ఆర్ ఎం వడపళని క్యాంపస్ వైస్ ప్రిన్సిపల్, డాక్టర్ సి. గోమతి, డీన్ డాక్టర్ సి. వి. జయకుమార్ ప్రసంగించారు. సమకాలీన సవాళ్లను పరిష్కరించడంలో, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో మెకానికల్ ఇంజినీరింగ్ పరిశోధన ప్రాముఖ్యతను వారు వివరించారు. పొన్నేరిలోని నెల్కాస్ట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ కె.వరదరాజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కామాక్షి పాల్గొన్నారు. టీవీకేలోకి కాంగ్రెస్ నేతలు సాక్షి,చైన్నె : విజయ్ టీవీకేలో పలువురు కాంగ్రెస్ నేతలు గురువారం చేరారు.ఇందులో కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి సెల్వం కూడా ఉన్నారు. ఆయన తో పాటుగా మద్దతుదారులు చైన్నెలో విజయ్ సమక్షంలో టీవీకే తీర్థం పుచ్చుకున్నారు. అలాగే, సింగపూర్కు చెందిన వ్యాపార వేత్త ఒకరు టీవీకేలో చేరినట్టు సమాచారం. ఆయన తమిళనాడుకు చెందిన వారు కావడంతో మన్నార్కుడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అలాగే, విజయ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ సిద్ధం చేశారు. రోజుకు ఐదు నియోజకవర్గాలలో ఆయన పర్యటించనున్నారు. 28వ తేదిన చైన్నె పెరంబూరు నియోజకవర్గంలో ఈ ప్రచారం ప్రారంభం కానుంది. -
మహిళలకు నిరాశే..!
సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్న ,వారికి సీట్ల కేటాయింపులో గుర్తింపు దక్కలేదు. బీజేపీ, అన్నాడీఎంకే, కాంగ్రెస్, డీఎంకేలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇవ్వక పోవడంచర్చకు దారి తీసింది. 30 స్థానాలతో కూడిన పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనుంది. నామినేషన్ల పర్వం, ఉపసంహరణ గురువారంతో ముగిసింది. అయితే, పుదుచ్చేరి రాజకీయాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రధాన రాజకీయ పార్టీలు వెనుకబడి ఉన్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే, మహిళా సాధికారత కేవలం ప్రసంగాలకే పరిమితమైందని స్పష్టమవుతోంది. తగ్గుతూ వస్తున్న సంఖ్య పుదుచ్చేరి మొదటి అసెంబ్లీ (1963–64)లో సరస్వతి సుబ్బయ్య, సావిత్రి వంటి మహిళా నేతలు ఉండేవారు. కాలక్రమేణా ఈ సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2016లో నలుగురు మహిళా ఎమ్మెల్యేలు గెలవగా, 2021లో కేవలం చంద్ర ప్రియంక మాత్రమే ఎన్నికయ్యారు. ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. 2026 ఎన్నికల్లో పార్టీల వారీగా మహిళా అభ్యర్థులను పరిశీలిస్తే తక్కువే. నామ్ తమిళర్ కట్చి మాత్రం 50 శాతం సీట్లను ఏటాయించింది. 28 చోట్ల తాము పోటీ చేయా 14సీట్లు కేటాయించి వారిపై ఉన్న గౌరవాన్ని చాటుకుంది. ఇక, అధికార ఎన్.ఆర్. కాంగ్రెస్ 16 స్థానాల్లో పోటీ చేస్తున్నప్పటికి మాజీ మంత్రి చంద్ర ప్రియాంక, మాజీ ఎమ్మెల్యే గోపికకు అవకాశం కల్పించారు. ఇక విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం 28 స్థానాల్లో పోటీ చేస్తూ, ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించింది. ఇక 16 చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తున్నప్పటికీ మహిళా అభ్యర్థికి సీటు ఇవ్వక పోవడం గమనార్హం. అలాగే డీఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే సైతం పుదుచ్చేరిలో ఒక్క మహిళా అభ్యర్థిని కూడా తమ పార్టీల తరపున నిలబెట్టక పోవడం శోచనీయం. పార్లమెంటులో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిన బీజేపీ కానీ, సామాజిక న్యాయం గురించి మాట్లాడే డీఎంకే కానీ ఒక్క మహిళా అభ్యర్థికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు బయలుదేరాయి. -
‘అన్నామలై’లో ఆవేదన
సాక్షి, చైన్నె : బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తీవ్ర ఆవేదనతో ఉన్నట్టు సమాచారం. బీజేపీ ప్రధాన కార్యర్శి వీఎల్ సంతోష్ గురువారం చైన్నెలో నిర్వహించిన సమావేశానికి ఆయన గైర్హాజరు కావడం చర్చకు దారి తీసింది. వివరాలు.. బీజేపీకి అన్నాడీఎంకే 27 సీట్లను కేటాయించిన విషయం తెలిసిందే. నియోజకవర్గాలను కేటాయించడంతో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల కసరత్తు మొదలైంది. గురువారం వీఎల్ సంతోష్ నేతృత్వంలో బీజేపీరాష్ట్ర కమిటీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో మాజీ అధ్యక్షుడు అన్నామలై పాల్గొన లేదు. తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదన్న లేఖను ఆయన పార్టీ అధిష్టానానికి పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన కోయంబత్తూరులోని సింగానల్లూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధమై, గత కొంత కాలంగా తన దృష్టిని కేంద్రీకరించారు. అయితే ఆ స్థానాన్ని అన్నాడీఎంకే నుంచి రాబట్టడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు. దీంతో తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదని అధిష్టానానికి అన్నామలై లేఖ పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన ఎన్నికలలో పోటీ చేయాలని మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ పిలుపు నిచ్చినా ఆయన స్పందించక పోవడం గమనార్హం. ఢిల్లీకి అభ్యర్థుల జాబితా 27 మంది అభ్యర్థుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసి ఢిల్లీకి పంపించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఇందులో అవినాశి– కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, మైలాపూర్– మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కోయంబత్తూరు నార్త్– ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, నాగర్కోయిల్– మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, సాత్తూరు– బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, తళి – అమరప్రసాద్ రెడ్డి, తిరుప్పూర్ సౌత్ – ఎ.పి. మురుగానందం, విలవంకోడ్ – విజయధరణి, మదురై సౌత్– రామ శ్రీనివాసన్, తిరువణ్ణామలై– అశ్వత్థామన్, తంజావూరు– కరుప్పు మురుగానందం, మొడకురిచ్చి –కృతికా శివకుమార్, పుదుక్కోట్టై– రామచంద్రన్, రామనాథపురం– జి.పి.ఎస్. నాగేంద్రన్,రాశిపురం– డాక్టర్ ప్రేమ్ కుమార్,వాసుదేవనల్లూర్ – ఆనందన్ అయ్యాస్వామి, ఆవడి– అశ్విన్, ఊటి– భోజ రాజన్ లేదా ఉమాదేవి, గంధర్వకోట్టై – పురట్చి కవి దాసన్, తిరుపత్తూరు– చోళ పళనిస్వామి, అరంతంగి– కవిత శ్రీకాంత్, రాధాపురం– బాలకృష్ణన్, తిరువారూర్ – శివ, మనమదురై– పొన్పాల గణపతి, తిరుచెందూర్– ఆర్.ఎం. రాధాకృష్ణన్, పద్మనాభపురం– ఎడ్విన్ జోస్,కులచల్– శివకుమార్ పేర్లు ఉన్నాయి. సుమారు 20 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తూ సిద్ధం చేసిన జాబితాను ఢిల్లీ ఆమోదంతో రెండు రోజులలో ప్రకటించనున్నారు. -
ఓటు హక్కు వినియోగించుకోవాలి
తిరుత్తణి: యువత వందశాతం ఓటింగ్లో పాల్గొనాలనే మేరకు కళాశాల విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. తిరుత్తణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం ఓటింగ్ లక్ష్యంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఓటు విలువ, కొత్త ఓటర్లు కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రలోభాలకు గురికాకుండా ఓటును స్వేచ్ఛగా వేసే అవకాశం కల్పించాలని ప్రతిజ్ఞ చేశారు. అలాగే ప్రతి ఓటరకు తమ వంతు అవగాహన కల్పించాలని సూచించారు. బీడీఓ కుమార్, సెల్వి, కళాశాల ప్రిన్సిపల్ దేవసేన. ఆధ్యాపకులు, బీడీఓ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. ఓటు హక్కుపై అవగాహన వేలూరు: 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓ టు హక్కు కలిగి ఉండాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వందశాతం పోలింగ్కు ప్రతిఒక్కరూ సహకరించాలని జిల్లా యంత్రాంగం పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా గురువారం ఉదయం వేలూరు జిల్లా ఆనకట్టు నియోజకవర్గంలోని విద్యార్థులచే అవగాహన ర్యాలీ ప్రారంభించి విద్యార్థులతో కలసి కరపత్రాలు చేత పట్టి అవగాహన కల్పించారు. కలెక్టర్ మా ట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియో గం చేసుకోవాలన్నారు. మీకు నచ్చిన రాజకీయ నా యకులకు మీ ఓటు అనే ఆయుధాన్ని వినియోగించి దేశ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత యువత చే తిలోనే ఉందన్నారు. కాట్పాడిలోని జూనియర్ రెడ్క్రా స్ ఆధ్వర్యంలో వంద శాతం పోలింగ్కు ప్రతి ఒక్క రూ సహకరించాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సంఘం కార్యదర్శి జనార్దన్ ప్రా రంభించి కరపత్రాలు అందజేసి అవగాహన కల్పించారు. రెడ్క్రాస్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
స్ట్రాంగ్రూమ్లకు చేరిన ఈవీఎంలు
స్ట్రాంగ్రూమ్కు సీల్ వేస్తున్న అధికారులు ఈవీఎంలను స్ట్రాంగ్ రూముకు తరలిస్తున్న సిబ్బంది తిరువళ్లూరు: లాటరీ విధానంలో ఈవీఎంలను ఎంపిక చేసి వాటిని గోడౌన్ నుంచి తరలించిన క్రమంలో తిరువళ్లూరు నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను స్థానికంగా వున్న ప్రయివేటు పాఠశాలలో వుంచి అధికారులు సీల్ వేశారు. తిరువళ్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రల్ 23న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వాహణ కోసం లాటరీ విధానం ద్వారా ఈవీఎంలను ఎంపిక చేసి వాటిని పది నియోజకవర్గాలకు బుధవారం ఉదయం నుంచి తరలిస్తున్నారు. ఈక్రమంలోనే తిరువళ్లూరుకు చేరిన ఈవీఎంలను స్థానికంగా వున్న సెయింటానీస్ ప్రయివేటు పాఠశాల గదిలో వుంచిన అధికారులు, గురువారం ఉదయం రాజకీయ పార్టీలకు చెందిన నేతల సమక్షంలో సీల్ వేశారు. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. తిరుత్తణిలో..తిరుత్తణి: తిరుత్తణి నియోజకర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో వినియోగించనున్న ఈవీఎంలను తిరుత్తణిలోని స్ట్రాంగ్రూమ్కు గురువారం చేరాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతాప్ ఆధ్వర్యంలో అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓట్లు నమోదు శాతం పెంపొందించే విధంగా అవగాహన కార్యక్రమాలు, ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుత్తణి నియోజకవర్గంలోని 337 పోలింగ్ కేంద్రాల్లో వినియోగించనున్న ఈవీఎంలు, కంట్రోలర్, వీవీ ప్యాట్లు గురువారం తిరుత్తణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్ట్రాంగ్ రూముకు చేరాయి. నియోజకవర్గ ఎన్నికల నిర్వహణాధికారి కణిమొళి అధ్యక్షతన పటిష్ట పోలీసుల భద్రత నడుమ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్రూములో భద్రపరిచారు. -
అన్నామలైయార్ సేవలో సౌమ్య అన్బుమణి
వేలూరు: తిరువణ్ణామలై అన్నామలైయార్ ఆలయంలో సౌమ్య అన్బుమణి గురువారం తన కుమార్తెతో పాటు వచ్చి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఉంచి పూజలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీలకు చెందిన నియోజకవర్గాల పేర్లను అన్నాడీఎంకే పార్టీ రాష్ట్ర ఆర్గనైజర్ ఎడపాడి పళణిస్వామి బుధవారం ఉదయం ప్రకటించారు. ఇందులో పీఎంకే పార్టీకి 18 నియోజక వర్గాలు కేటాయించారు. దీంతో పీఎంకే పార్టీ అద్యక్షుడు అన్బుమణి సతీమణి సౌమ్య తన కుమార్తెతో వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. ముందుగా సంపద వినాయకుడి ఆలయంలో పీఎంకే పార్టీ ఆధ్వర్యంలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నామలైయార్ సన్నధి, ఉన్నామలై అమ్మన్ సన్నధికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. త్వరలోనే నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అన్బుమణి ప్రకటిస్తారని ఆమె తెలిపారు. ఏడుగురు జాలర్ల అరెస్ట్ కొరుక్కుపేట: రామేశ్వరానికి చెందిన ఏడుగురు జాలర్లు అరెస్టు అయ్యారు.రామనాథపురం జిల్లాలో సముద్రంలోకి వెళ్లిన జాలర్లు రాత్రిపూట సముద్రం మధ్యలో చేపలు పడుతుండగా పట్టుబడ్డారు, అయితే వారిని చేపలు పట్టనివ్వకుండా తరిమికొట్టారు. రామేశ్వరం మత్స్య రేవులో ఆరు పడవలు లంగరు వేసినప్పుడు, గస్తీ పడవలు వాటిని అడ్డుకోవడంతో, కొంతమంది మత్స్యకారులు మరో ప్రాంతానికి వెళ్లి చేపలు పట్టారు. ఈ పరిస్థితిలో, అక్కడికి చేరుకున్న శ్రీలంక నావికాదళం తిరిగి రామేశ్వరం మత్స్యకారుల పడవలను చుట్టుముట్టి ఏడుగురిని అరెస్టు చేసింది. ఈఘటన రామేశ్వరం మత్స్యకారులలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. -
పళనిలో పంగుణి ఉత్సవ శోభ
ఉత్సవాలకు ఘనంగా ధ్వజారోహణం సాక్షి, చైన్నె: పళని మురుగన్ ఆలయంలో పంగుణి ఉత్తరం ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యారు. ఉత్సవాలకు ఘనంగా ధ్వజారోహణం చేశారు. తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, అరుపడై వీడులలో మూడవదైన పళని దండాయుధపాణి స్వామి ఆలయంలో పంగుణి ఉత్తరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.ఇందులో భాగంగా గురువారం వేకువ జాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాదికార్యక్రమాలు జరిగాయి. ఉత్సవాలకు ధ్వజారోహణం గురువారం ఉదయం 10 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ధ్వజస్తంభంపై పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వామివారికి, వినాయకుడికి, ఇతర పరివార దేవతలకు ప్రత్యేక కాపు (రక్షాబంధనం) కట్టారు. ఉత్సవాల్లో భాగంగా ముత్తుకుమారస్వామి, వల్లి, దైవానై అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు నిర్వహించారు. స్వామి , అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు.ఈ10 రోజుల వేడుకల్లో స్వామివారు కామధేనువు, వెండి ఏనుగు, బంగారు గుర్రం వంటి వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఈనెల 31వ తేదీ రాత్రి 7 గంటలకు స్వామివారి తిరుకల్యాణం, అనంతరం రాత్రి 9 గంటలకు వెండి రథంపై ఊరేగింపు వేడుక జరగనుంది. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన మహా రథోత్సవం ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు గిరి వీధుల్లో జరుగుతుంది.భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఈ ఉత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు ఈరోడ్ జిల్లా కొడుముడి కావేరీ నది నుండి పవిత్ర తీర్థాన్ని కావడిలో తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు (3 రోజులు) ప్రత్యేక దర్శన టికెట్లను రద్దు చేశారు. వీఐపీలు, వీవీఐపీలు సైతం ఒకే వరసులో వెళ్లి స్వామి వారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. కావడి తీసుకువచ్చే భక్తుల కోసం రోజుకు 20,000 మందికి చొప్పున, మొత్తం 10 రోజులు 2 లక్షల మందికి అన్నదాన సౌకర్యం కల్పించారు. -
ప్రేమించిన అమ్మాయి కోసం..
తమిళసినిమా: యుక్త వయసు వచ్చిన తరువాత యువతీయువకులు తిరిగేది ప్రేమ గురించే. అలా ఒక యువకుడు ప్రేమ కోసం ఎన్నో పాట్లు పడుతుంటాడు. నచ్చిన ప్రతి యువతి వెంట పడుతూ ప్రేమ కోసం తపిస్తుంటారు. అయితే అతని ప్రేమను చాలా మంది తిరస్కరిస్తారు. అలాంటి తరుణంలో ఓ యువతి అతన్ని ప్రేమిస్తుంది.అంతే కాదు అతనిలో పలు మార్పులు తీసుకొస్తుంది. పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురైన ఆమె ప్రేమకు ఆయన సమ్మతిస్తాడు. అయితే ఈ ప్రేమికుల ప్రేమ సక్సెస్ అయ్యిందా? లేదా? అనే పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం హ్యాపీ రాజ్. ప్రేమకు ఆస్తి అంతస్తులు ముఖ్యం కాదు, మంచితనం, మానవత్వం ముఖ్యం అని చెప్పే మంచి సందేశంతో కూడిన కుటుంబ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ఇది. నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం హ్యాపీ రాజ్. నటి శ్రీ గౌరీ ప్రియ నాయకిగా ఇందులో నటుడు అబ్బాస్, జార్జ్ మరియన్, గీత కై లాసం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జయవర్ద నిర్మించిన ఈ చిత్రానికి జయకాంత్ సురేష్ సహ నిర్మాతగా వ్యవహరించారు. మరియ రాజా ఎలన్ చెళియన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు.జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. -
ఇండియా కూటమి.. చిన్నా భిన్నం
సాక్షి, చైన్నె: పుదుచ్చేరి ఇండియా కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. కూటమి చిన్నా భిన్నమైనట్టుగా పరిస్థితి నెలకొంది. కూటమిలోని పార్టీల తరపున ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేసుకుని, ఎన్నికలలో పోటీ దిశగా ప్రచారంలో ఉరకలు తీస్తుండటం చర్చకు దారి తీసింది. ఆది నుంచి కేంద్ర పాలిత పుదుచ్చేరిలోని డీఎంకే, కాంగ్రెస్, వీసీకే తదితర ఇండియా కూటమి వివాదాలు కొనసాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఎట్టేలకు కాంగ్రెస్ 16 చోట్ల, డీఎంకే 14 చోట్ల పోటీకి నిర్ణయించాయి. అయితే, సర్దుబాటు జాప్యంతో గడువు ముగియడంతో 30 స్థానాలలోనూ కూటమిలోని పార్టీలు నామినేషన్లు దాఖలు చేశాయి. తాజాగా కూటమి పార్టీలకు కేటాయించిన స్థానాలలో నామినేషన్లు వేసిన వాళ్లు ఉపసంహరించుకోకుండా మారం చేయడం వివాదానికి దారి తీసింది. డీఎంకేకు చిక్కులు.. డీఎంకేకు చెందిన ఐదు స్థానాలలో కాంగ్రెస్ వర్గాలు నామినేషన్లు వేశాయి. అలాగే వీసీకేకు డీఎంకే కేటాయించిన ఓ స్థానంలోనూ కాంగ్రెస్ తరపున నామినేషన్లు పడ్డాయి. కాంగ్రెస్ నాయకులు నామినేషన్లు ఉపసంహరించుకోక పోవడంతో రాజకీయ రసవత్తరంగా మారి, కూటమి చిన్నాభిన్నం అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాలలో డీఎంకే తరపున నామినేషన్లు వేసిన వారికి బీ ఫామ్లను డీఎంకే ఇవ్వక పోవడం గమనార్హం. అయితే, అస్సలు సమస్య అంతా కాంగ్రెస్ అభ్యర్థులు డీఎంకే స్థానాలలో నామినేషన్లు ఉపసంహరించుకోక పోవడమే ప్రధాన కారణంగా మారింది.ప్రస్తుతం డీఎంకేకు కేటాయించిన కాలాపట్టు, రాజ్భవన్, నెల్లితోపు, మంగళం, తిరిభువనై వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. అధిష్టానం ఆదేశించినా ఈ నేతలు తగ్గకుండా ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. అయితే, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి గురువారం నెల్లితోపు నియోజకవర్గ అభ్యర్థి ఆనందబాబు మాత్రమే నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఎవరికి వారే.. ఇప్పటికే కూటమి నుంచి వైదొలగిన సీపీఐ తట్టాన్ చావడి, ఉలవర్కర్నియోజకవర్గాలలో రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేసి పోటీలో నిమగ్నమైంది. అలాగే సీపీఎం నాలుగు స్థానాల్లో అభ్యర్థులను పోటీలో పె ట్టింది. ఇక, తాజాగా వీసీకే సైతం అదేబాటను అనుసరించింది. సర్దుబాటు గందరగోళం నేపథ్యంలో కూటమి ఒప్పంద ఉల్లంఘనకు సిద్ధమయ్యాయి. తమకు కేటాయించిన ఉలవర్కరైలో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేయడంతో వీసీకే నేత తిరుమావళవన్ కన్నెర్ర చేశారు. ఉళవర్కరై, ఊసుడు, నెట్టపాక్కం నియోజకవర్గాలలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని గురువారం ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన నేపథ్యంలో తిరుగుబాటు అభ్యర్థుల బెడద డీఎంకేకు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో వీసీకే నేత తిరుమావళవన్ తన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు వెనక్కు తీసుకోకుండా పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్పై ఆగ్రహంతో తిరుమావళవన్ ఈ ప్రకటన చేశారు. కూటమి ధర్మాన్ని కాంగ్రెస్ పాటించడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న నియోజకవర్గంలో తమ అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రకటించారు. ఈ మేరకు ఉళవర్కరై – సెల్వ పుష్పలత, ఊసుడు–అరిమా తమిళన్, నెట్టపాక్కంలో అముదన్ పోటీ చేస్తారని ప్రకటించారు. కాంగ్రెస్ మొండి వైఖరి వల్లే పుదుచ్చేరిలో కూటమి చిన్నాభిన్నంగా మారే పరిస్థితి నెలకొందన్న ఆగ్రహం నెలకొంది. అదే సమయంలో తిరుగుబాటు దారులను బుజ్జగించి ఫ్రెండ్లీ ఫైట్ దిశగా కాంగ్రెస్ కుస్తీలు పట్టే పనిలో నిమగ్నమైంది. ఇక, అధికార ఎన్ఆర్ కాంగ్రెస్ను తొమ్మిది చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఈ ఎన్నికలలో ప్రత్యక్షంగా ఢీ కొడుతుండటం గమనార్హం. -
నితీష్కు పట్టిన గతే పళణికి..!
సాక్షి, చైన్నె: బీహార్లో నితీష్ కుమార్కు పట్టిన గతే తమిళనాడులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి పడుతుందని రవాణా మంత్రి శివశంకర్ హెచ్చరించారు. గురువారం చైన్నెలో మంత్రి మీడియాతో మాట్లాడారు. డీఎంకే కూటమి బలం, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బలహీనతలను వివరిస్తూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బానిసగా.. ఒకప్పుడు ఉత్తర భారత పార్టీలు అన్నాడీఎంకే మద్దతు కోసం వేచి చూసేవని, అయితే ఇప్పుడు పళనిస్వామి ప్రతి చిన్న నిర్ణయం కోసం ఢిల్లీకి వెళ్లాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. అమిత్ షా ఇచ్చే స్క్రిప్ట్ను పళనిస్వామి మార్చకుండా చదువుతున్నారని విమర్శించారు. డీఎంకే కూటమిని బానిస కూటమి అని విమర్శించే అర్హత పళనిస్వామికి లేదన్నారు. ఆయన తన కూటమిలోని పార్టీలను ( పీఎంకే, ఏఎంఎంకే) కమలం గుర్తుపై పోటీ చేయించే స్థాయికి దిగజారినట్టు మండిపడ్డారు. తమిళనాడులో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చే బీజేపీకి పళనిస్వామి పెద్ద పీట వేశారని పేర్కొన్నారు. జయలలిత ఆశయాలకు విరుద్ధం మోదీయా – లేడియా? (మోదీనా లేక ఈ మహిళా?) అని బీజేపీకి సవాల్ విసిరిన దివంగత అమ్మ జయలలిత ఆశయాలను పళనిస్వామి సమాధి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మహారాష్ట్రలోని శివసేన, శరద్ పవార్ పార్టీల మాదిరిగానే అన్నాడీఎంకే కూడా చీలిపోయి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డీఎంకే మిత్రులను ఎంతో గౌరవంగా చూస్తుందని, మర్యాద పూర్వంగా మెలుగుతుందని, అందుకే తమకూటమి బలంగా కొనసాగుతోందన్నారు. -
విజయవంతంగా పేగు మార్పిడి చికిత్స
సాక్షి, చైన్నె : మూడు సంవత్సరాల వ్యవధిలో చైన్నెలోని ఎంజీఎం హెల్త్ కేర్ అతిపెద్ద ఇంటైస్టెనల్ రిహాబిలిటేషన్ – ట్రాన్స్ప్లాంట్ (పేగు పునరావాసం , మార్పిడి) ప్రోగ్రామ్ను విజయవంతం చేసింది. 40కి పైగా పేగు మార్పిడి చికిత్సలు జరగ్గా, ఒక్క 2025లోనే 21 చికిత్సలు పూర్తి చేసి అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక వార్షిక రికార్డును నెలకొల్పింది. ఈ వివరాలను గురువారం ఆస్పత్రి డాక్టర్ అనిల్ వైద్య బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా వారు వివరిస్తూ, అమెరికాలోని క్లీవ్ల్యాండ్ క్లినిక్ నుండి తిరిగి వచ్చిన ప్రముఖ వైద్యులు ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ వైద్య నేతృత్వంలో ఈ విభాగం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక్కడ చికిత్స పొందిన రోగులలో 98 శాతం మంది కృత్రిమ ఆహారం అవసరం లేకుండా, సహజంగా ఆహారాన్ని గ్రహించే స్థాయికి చేరుకున్నట్టు తెలిపారు. హోమ్ బేస్డ్, డోర్బిమెక్స్,బ్యాక్ టు బేస్విధానంతో దూసుకెళ్తూ ట్రాన్స్ప్లాంట్ ఆంకాలజీ విభాగాన్ని కూడా ప్రారంభించామన్నారు. ‘పేగు మార్పిడి అనేది వైద్య శాస్త్రంలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అని, చైన్నెని ఈ విభాగంలో గ్లోబల్ రిఫరెన్స్ పాయింట్గా మార్చడం గర్వంగా ఉందన్నారు. ఇది కేవలం శస్త్రచికిత్స గురించి మాత్రమే కాకుండా, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నుండి ఇంటి వద్ద సంరక్షణ వరకు ఒక పూర్తి వ్యవస్థను నిర్మించడం వలననే సాధ్యమైందన్నారు. అధునాతన వైద్య సేవలు కేవలం పాశ్చాత్య దేశాలకే పరిమితం కాదని, చైన్నెలోనూ ఇప్పుడు ఈ రంగంలో ప్రపంచానికే దిశానిర్దేశం చేస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. -
ఉచితాలు సరే.. మద్య నిషేధం మాటేంటో?
సాక్షి, చైన్నె : ప్రజలకు ఉచిత పథకాలను ఆశగా చూపే రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా అడ్డుకుంటామని ఎందుకు ప్రకటించడం లేదు? అని నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్ ప్రశ్నించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణగిరి జిల్లాలోని ఊత్తంగరై, కృష్ణగిరి, వేపనపల్లి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులకు మద్దతుగా ఆయన గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీమాన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకునే పార్టీలు కేవలం ఉచిత పథకాలకే పరిమితమవుతున్నాయని వివరించారు. మద్యపానం వలన నేరాలు పెరుగుతున్నాయని, ఆరేళ్ల చిన్నారి నుంచి అరవై ఏళ్ల వృద్ధురాలి వరకు మహిళలపై లైంగిక దాడులు పెరగడానికి మద్యం ప్రధాన కారణమవుతోందని ధ్వజమెత్తారు. ఉచితాల పేరుతో స్థానిక ప్రజలను సోమరులుగా తయారు చేసి, ఉత్తర భారతదేశం నుండి పనివారిని ఇక్కడికి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ద్వారా సుమారు ఒకటిన్నర కోట్ల మంది ఉత్తర భారతీయులకు ఓటు హక్కు కల్పించి ఉన్నారని ఆరోపించారు. ఈదృష్ట్యా, భవిష్యత్తులో ఇక్కడి రాజకీయ అధికారాన్ని వారే నిర్ణయించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే భాష, చరిత్ర, భూములను తమిళులు కోల్పోతున్నామని, మున్ముందు రాజకీయ అధికారాన్ని కూడా పరాయి వారికి అప్పగిస్తే, దేశాన్ని విడిచి వెళ్లడం తప్ప మరో మార్గం ఉండదని హెచ్చరించారు. రాష్ట్రంలోని కొండలను, ఖనిజ సంపదను యథేచ్ఛగా దోచుకుంటున్నారని , ప్రకృతిని సర్వనాశనం చేస్తున్న పార్టీలను ఈ ఎన్నికలలో బహిష్కరించాలని పిలుపు నిచ్చారు. ఒంటరి పోరాటం తమిళ నేలపై ప్రేమ ఉన్నవారే ఈ సమస్యలను పరిష్కరించగలరని, అందుకే ఎన్నిసార్లు ఓడిపోయినా, సిద్ధాంతాలకు విరుద్ధమైన పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా నామ్ తమిళర్ కట్చి ఒంటరిగానే పోటీ చేస్తోందన్నారు. తాను ఇప్పుడు చెప్పేటప్పుడు అర్థం కాకపోవచ్చు అని, అయితే, సమస్య అన్నది నెత్తి మీదకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది‘ అని సీమాన్ పేర్కొన్నారు. -
నియోజవర్గాల ఎంపికపై కుస్తీ
సాక్షి, చైన్నె : సీట్ల ఖరారు నేపథ్యంలో నియోజకవర్గాల ఎంపిక విషయంలో డీఎంకే కూటమి పార్టీలు కుస్తీలు పడుతున్నాయి. డీఎంకే కమిటీకి తాము ఆశిస్తున్న నియోజకవర్గాల జాబితాను గురువారం ఆయా పార్టీలు అందజేశాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్కు 28, డీఎండీకేకు 10, వీసీకేకు 8, ఎండీఎంకేకు 4, సీపీఎం 5, సీపీఐ 5, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ 2, మనిదనేయమక్కల్ కట్చి 2, కొంగు దేశీయ కట్చి 2 సీట్లు కేటాయించారు. చిన్న పార్టీలకు తలా ఓ సీటు ఇచ్చారు. మిత్రులకు కేటాయింపు పోగా డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో 175 నియోజకవర్గాలలో అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఈపరిస్థితులో వారి వారి సంఖ్యకు అనుగుణంగా తాము ఆశిస్తున్న నియోజకవర్గాల వివరాలను గురువారం అన్నా అరివాలయంలో మిత్ర పక్షాల నాయకులు,కమిటీల ప్రతినిధులు డీఎంకే కోశాధికారి టీఆర్బాలు నేతృత్వంలోని కమిటీకి అందజేశాయి. కాంగ్రెస్ అయితే, 35 నియోజకవర్గాలతో, డీఎండీకే 15, వీసీకే, సీపీఎం, సీపీఐలు పది నియోజకవర్గాలతో జాబితాలను అందజేశాయి. వీటిని సమగ్రంగా పరిశీలించి శుక్రవారం ఎవ్వరెవ్వరికి ఏఏ నియోజకవర్గం అన్న విషయాన్ని డీఎంకే ప్రకటించనుంది. ఇదిలా ఉండగా, డీఎంకే మేనిఫెస్టో రూపకల్పన సిద్ధం చేశారు. అభ్యర్థుల జాబితాను సైతం పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ సిద్ధం చేసినట్టు అన్నా అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన తిరువారూర్ నుంచి స్టాలిన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టే విధంగా షెడ్యూల్ రూపకల్పన చేసినట్టుగా చెబుతున్నారు. -
చారిత్రక విజయం తథ్యమా?
2011, 2016లో దివంగత జె. జయలలిత సృష్టించిన వరుస విజయాల ప్రభంజనాన్ని తాజాగా బద్దలు కొట్టే విధంగా చారిత్రక గెలుపు కోసం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పావులు కదుపుతున్నారు. సమీకరణలు శరవేగంగామారుతుండటంతో వ్యూహాలకు పదును పెట్టే దిశగా తమిళ పార్టీలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. స్టాలిన్ పాలను చెక్ పెట్టడమే లక్ష్యంగా అన్నాడీఎంకే, టీవీకేలు పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో పలు కూటములు ఉన్నా, సమరం అన్నది మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమి, టీవీకేల మధ్య మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి, చైన్నె : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈనెల 30 నుంచి నామినేషన్లు మొదలు కానున్నాయి. దీంతో అభ్యర్థుల కసరత్తులు వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 23న పోలింగ్, మే 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు తాజాగా ’త్రిముఖ పోరు’ వైపు సాగుతున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం హడావుడి, అన్నాడీఎంకే, బీజేపి ఎన్డీయే కూటమి ప్రయత్నాలు కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయి రాజకీయ పరిణామాలు మాత్రం ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమికే సానుకూలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం – సర్వేల అంచనా 2026 కేంద్ర బడ్జెట్లో తమిళనాడుకు పెద్దగా కేటాయింపులు జరగక పోవడాన్ని కొందరు విశ్లేషకులు రాజకీయ సంకేతంగా చూస్తున్నారు. అంటే రాష్ట్రంలో మళ్లీ డీఎంకే అధికారంలోకి వస్తుందని కేంద్రం ముందే ఊహించి ఉండవచ్చని భావిస్తున్నారు. అనేక స్వతంత్ర సర్వేలు డీఎంకే కూటమికి 41 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతుండటం గమనార్హం. ఇక, అన్నాడీఎంకే–బీజేపీ కూటమిలో సమస్యలు ఉన్నా, కేంద్రం పెద్దలతో కలిసి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు విజయ్ పార్టీ టీవీకే 13 నుంచి 15 శాతం ఓట్లు రావచ్చని, అయితే అవి సీట్లుగా మారడం కష్టమని అంచనా వేస్తున్నారు. ఈ చీలిక పరోక్షంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి డీఎంకేకు మేలు చేస్తుందని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద కూటమి బలం, కార్యకర్తల నెట్వర్క్, విద్యావంతులైన ఓటర్ల మద్దతు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మహిళా మద్దతుతో స్టాలిన్ను రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ఖాయం అన్ని సర్వేలతో పాటుగా అనుభవజ్ఞులైన విశ్లేషకుల వాదనగా ఉండటం గమనార్హం. ఇక రాష్ట్రంలో ఒంటరిగా పయనిస్తున్న నామ్ తమిళర్ కట్చి సీమాన్, దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళ, పీఎంకే వ్యవస్థాకుడు రాందాసు ఓ కూటమిగా ముందుకు సాగినా, ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఓ వైపు, అన్నాడీఎంకే ఖాతాలో పడాల్సిన ఓట్లను చీల్చే అవకాశాల కారణంగా డీఎంకేకు అనుకూలంగా పరిస్థితులను కల్పించడం ఖాయం అన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పెద్దల వ్యూహాలను తమిళనాట ఆచరణలో పెట్టే దిశగా ముందుకెళ్తున్న పళని స్వామి లో గెలుపు ఆత్మ విశ్వాసం ఎక్కువగానే ఉంది. డీఎంకే కుటుంబ పాలన, అవినీతి , అక్రమాలను అస్త్రంగా చేసుని ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఈ దృష్ట్యా, ఓటరు తీర్పు ఎలా ఉంటుందో, చరిత్ర సృష్టిస్తారా? రికార్డులు బద్దలు కొడతారా? అన్నది ఫలితాల వరకు ఎదురు చూడాల్సిందే. చారిత్రక అవకాశం – బలమైన కూటమి 1971 తర్వాత తమిళనాడులో ఏ ద్రావిడ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ రికార్డును దివంగత సీఎం జె. జయలలిత 2011, 2016లో తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా డీఎంకే గెలిస్తే ఇది ఓ చరిత్ర అవుతుంది. ప్రస్తుతం డీఎంకే 21 పార్టీలతో కూడిన అత్యంత బలమైన మెగా కూటమిని కలిగి ఉంది. ఇందులో కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, డీఎండీకేలతో పాటుగా మైనారిటీ పార్టీలన్నీ కీలకంగా ఉన్నాయి. ఈ కూటమిలోని ప్రతి చిన్న పార్టీకి ఒక ప్రత్యేక ఓటు బ్యాంక్ ఉండటం డీఎంకేకు అతిపెద్ద ప్లస్ పాయింట్గా మారిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.పారిశ్రామిక – కార్పొరేట్ వర్గాల మొగ్గు ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో (యుద్ధాలు, ఆర్థిక ఒడిదుడుకులు), పెద్ద పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు రాజకీయ స్థిరత్వాన్ని కోరుకుంటున్నాయి. డీఎంకే ప్రభుత్వ పాలనా అనుభవం, సెమీకండక్టర్, ఈవీ రంగాల్లో పెట్టుబడులు తీసుకురావడం వారికి నమ్మకాన్ని కల్పించినట్లయ్యింది. అనుభవం లేని కొత్త పార్టీలు అధికారంలోకి వస్తే పాలన కుంటుపడుతుందని వారు ఆందోళన చెందుతున్నట్టు మరి కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ద్రావిడ సిద్ధాంతం – మీడియా ఆధిపత్యం సామాజిక న్యాయం, సమాఖ్య స్ఫూర్తి, తమిళ ఆత్మగౌరవం వంటి ద్రావిడ సిద్ధాంతాలను డీఎంకే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ముఖ్యంగా టీవీ చర్చల్లో, సోషల్ మీడియాలో డీఎంకే ప్రతినిధులు ప్రత్యర్థుల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. విద్యావంతులైన ఓటర్లు కేవలం సెలబ్రిటీల ప్రభావానికి లోనుకాకుండా, ప్రభుత్వ పథకాలు, స్థిరత్వాన్ని చూసి ఓటు వేసే అవకాశం ఉందంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం డీఎంకే అసలు బలం అంతా గ్రామస్థాయి కార్యకర్తల వ్యవస్థలో ఉంది. ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలోని యువజన విభాగం, బూత్ లెవల్ ఏజెంట్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేయడంలో డీఎంకే మిగిలిన పార్టీల కంటే ముందుంది. ఇక, విజయ్ టీవీకేకకు అభిమాన గణం ఉన్నప్పటికీ, వారిని క్రమశిక్షణ కలిగిన ఎన్నికల సైనికులుగా మార్చడంలో తాజాగా విఫలమయ్యారన్న చర్చ జరుగుతోంది. -
మిషన్ శక్తి శాట్ మస్కట్ ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించే విధంగా 108 దేశాల బాలికల భాగస్వామ్యంతో ’మిషన్ శక్తిశాట్’ మస్కట్ను ఢిల్లీ వేదికగా ఆవిష్కరించడం జరిగిందని, చైన్నెలోని స్పేస్ కిడ్జి ఇండియా సీఈఓ డాక్టర్ శ్రీమతి కేసన్ ప్రకటించారు. ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో మహిళా శక్తిని చాటిచెప్పేలా ’స్పేస్ కిడ్జ్ ఇండియా’ ప్రతిష్టాత్మకంగా ’మిషన్ శక్తిశాట్’ను చేపట్టిందన్నారు. ఢిల్లీలో జరిగిన మహిళా సాధికారత సదస్సులో మాజీ కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి, బ్రిక్స్ ఛాపంబర్ ఆఫ కామర్స్ అధ్యక్షురాలు రూబీ సిన్నాహలు ఈ మస్కట్ను ఆవిష్కరించారని గురువారం చైన్నెలో ప్రకటించారు. మస్కట్ ప్రత్యేకత ’శక్తి’ అని పిలిచే ఈ మస్కట్ చొక్కాపై 108 దేశాల జాతీయ జెండాలు ఉన్నాయని వివరించారు.. ‘వసుధైవ కుటుంబకం‘ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే భారతీయ తత్వాన్ని చాటిచెప్పేలా ఈ మస్కట్ను చంద్రుడిపైకి పంపనున్నామన్నారు.. దీనిని తాను రూపొందించినట్టు పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి అంతర్జాతీయ బాలికల లూనార్ మిషన్ అని, దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలకు శాటిలైట్ ఇంజనీరింగ్, కోడింగ్, స్పేస్ టెక్నాలజీలో శిక్షణ ఇస్తున్నట్టు వివరించారు. భూ కక్ష్యలోకి ఒక ఉపగ్రహాన్ని పంపడంతో పాటు, చంద్రుడిపై ’హార్డ్ ల్యాండింగ్’ అయ్యేలా ఒక లూనార్ శాటిలైట్ను రూపొందించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఎంపికై న విదేశీ విద్యార్థినులు ఈ ఏడాది ఆగస్టులో భారత్కు చేరుకుని, శాటిలైట్ పేలోడ్ ఇంటిగ్రేషన్ పరీక్షల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారన్నారు. గతంలో 750 మంది గ్రామీణ భారతీయ బాలికలతో ’ఆజాదీశాట్’ ను విజయవంతంగా ప్రయోగించిన అనుభవంతో, తాజాగా ఈ నమూనాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నామన్నారు. ‘ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న బాలిక అయినా అంతరిక్ష శాస్త్రంలో రాణించగలదని నిరూపించడమే లక్ష్యం అని, ఈ మస్కట్ కేవలం ఒక బొమ్మ కాదని, అది ఒక ఉద్యమం. దేశాల మధ్య పోటీ కంటే సహకారం ముఖ్యం అని ఇది చాటి చెబుతుందన్నారు. -
కస్తూరి రాజా పాత్ర హబీబీ చిత్రానికి బలం
తమిళసినిమా: ఇంతకు ముందు పలు వైవిధ్య భరిత కథా చిత్రాలను రూపొందించిన దర్శకుడు మీరా కదిరవన్. తాజాగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం హబీబీ. ఈ చిత్రంలో సీనియర్ దర్శకుడు నటుడు ధనుష్ తండ్రి కస్తూరి రాజా చాలా కీలకపాత్రను పోషిస్తున్నారు. పాత్ర గురించి ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ఇందులో తన పాత్ర చిత్ర యూనిట్ను ఆదరించే విధంగా, వారికి మరింత బలం చేకూర్చేదిగా ఉంటుందన్నారు. మంచి కథ కచ్చితంగా ప్రేక్షకుల చెంతకు చేరుతుందని తాను నమ్ముతానన్నారు. ఈ చిత్రంలోనూ యదార్థత ఉందని అన్నారు. దర్శకుడు మీరా కదిరవన్ పేర్కొంటూ హబీబీ చిత్రంలో దర్శకుడు కస్తూరి రాజా నటించడం తమకు పక్క బలంగా అమిరిందన్నారు. ఆయన అనుభవం తమ పయనానికి అర్ధాన్ని, నమ్మకాన్ని కలిగించిందన్నారు. మత విభేదాలను మించి సమాజంలో పెద్దలకు మనం ఇచ్చే గౌరవాన్ని ఈ చిత్రంలో ఆయన పాత్ర ప్రతిబింబించే విధంగా ఉంటుందన్నారు. సమైక్యత, నిజాయితీ భావోద్రేకాలతో కూడిన పాత్రను కస్తూరి రాజా పోషిస్తున్నట్లు చెప్పారు. సీనియర్ నటుడైన ఆ భావాన్ని ఎక్కడ వ్యక్తం చేయకుండా సర్వ సాధారణంగా తమతో కలిసి మెలిగారని చెప్పారు. విచిత్రాన్ని రోమియో పిక్చర్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందని చెప్పారు. మంచి బలమైన కథ,కథనాలతో కూడిన సందేశాత్మక కథా చిత్రాలను ఆదరిస్తూ వస్తున్న ఈ సంస్థ చక్కని మార్కెటింగ్తో చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకెళుతుందని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, అనుభవజ్ఞుల మార్గదర్శకంలో, శక్తివంతమైన డిస్ట్రిబ్యూషన్ ఆదరణతో తెరపైకి రానున్న హబీబీ చిత్రం ప్రేక్షకుల గుండెల్లో పది కాలాలపాటు నిలిచిపోతుందని నమ్మకాన్ని దర్శకుడు మీరా కదిరవన్ వ్యక్తం చేశారు. -
ప్రస్తుతం ఆ ఆలోచన లేదు
తమిళసినిమా: ప్రయత్నం ఎన్నటికీ వృథా కాదు. వెంటనే కాకున్నా, కొద్ది కాలం తరువాత అయినా దాని ఫలితం ఉంటుంది. నటి సాయి పల్లవి విషయంలోనూ ఇదే జరిగింది. ఈ కోయంబత్తూరు భామకు సినిమాల్లో నటించాలన్నది చిన్నప్పటి నుంచి ఆశ. అయితే వెంటనే అలా తన ఆశను నెరవేర్చుకునే ప్రయత్నం చేయలేదు. ముందు చదువుపై దృష్టి సారించారు. అలా డాక్టర్ కూడా అయ్యారు. ఆ తరువాత కూడా నటనపై తన ఆసక్తి తగ్గాక పోవడంతో డాన్స్ లో శిక్షణ పొందారు. అలా తనలోని నటిని తృష్ణను తీర్చుకోవడానికి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు.అలా మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ దృష్టిలో పడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ప్రేమలులో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అంతేకాదు అందులో టీచర్ పాత్రకు పెద్ద పేరు వస్తుందని సాయి పల్లవి కూడా ఊహించి ఉండరు. ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగిన పోయారు. చాలా మంది గ్లామర్ క్రేజ్తోపాటు, అవకాశాలను తెచ్చి పెడుతుందని భావిస్తారు. అందులో నిజం లేకపోయినప్పటికీ, సాయి పల్లవి మొదటి నుంచి సహజత్వానికి ప్రాధాన్యత నటిస్తున్నారు. అదే ఆమెకు ప్లస్ అయ్యింది కూడా. సాయి పల్లవి నటిస్తే ఆ చిత్రం హిట్టే అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఈమె నటుడు శివకార్తికేయన్కు జంటగా నటించిన అమరన్ చిత్రం ఘనవిజయం సాధించింది, ఆ తరువాత తెలుగులో నాగచైతన్యతో జత కట్టిన తండేల్ చిత్రం విజయాన్ని సాధించింది. ఇటివల బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ సాయి పల్లవి, అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ కలిసి నటించిన ఏక్ దిన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అదేవిధంగా రామాయణం ఇతిహాసం ఇతివృత్తంతో రూపొందుతున్న రామాయణ 1,2 భాగాల్లో సీత గా నటిస్తున్నారు. అదేవిధంగా తమిళంలో ధనుష్కు జంటగా మరో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా చాలా బిజీగా ఉన్న సాయి పల్లవి ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు పెళ్లెప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని కచ్చితంగా చెప్పారు. ప్రస్తుతానికి తాను సింగిల్ అని కూడా చెప్పారు .కాగా ఈ 33 ఏళ్ల భామ చెల్లెలు పూజా కన్నన్ రెండేళ్ల ముందే పెళ్లి చేసుకున్నారు. మరి సాయి పల్లవికి పెళ్లి ఘడిన ఎప్పుడు వస్తుందో ఏమో! సాయి పల్లవి నటుడు విజయ్ సేతుపతితో ముత్తు ఎన్గిర కాట్టాన్ వెబ్ సిరీస్ యూనిట్ -
పిల్లల్లో సృజనాత్మకతకు ‘క్రేకిడ్’ బోర్డ్ గేమ్స్
సాక్షి, చైన్నె: పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, స్వతంత్ర ఆలోచనా ధోరణిని పెంపొందించే లక్ష్యంతో చైన్నెకి చెందిన ’క్రేకిడ్’ సంస్థ విజువల్ ఆర్ట్స్ ఆధారిత సరికొత్త బోర్డ్ గేమ్స్ , యాక్టివిటీ కిట్లను ఆవిష్కరించింది. ఇది కేవలం సూచనలను అనుసరించడమే కాకుండా, సొంతంగా కొత్త విషయాలను కనిపెట్టేలా రూపొందించారు. స్టికూ ప్రో – ప్రో మాక్స్ పేరిట 3 నుండి 7 ఏళ్ల పిల్లల కోసం రూపొందించిన ఈ కిట్స్ ద్వారా స్టిక్కర్లను ఉపయోగిస్తూ కథలను, దృశ్యాలను సృష్టించ వచ్చని, ఇది పిల్లల్లో ఊహాశక్తిని పెంచుతుందని ఆ సంస్థ డైరెక్టర్లు అమర్ నాథ్ అళగప్పన్, నరేంద్రనాథ్ వివరించారు. పెర్స్కెచ్ పేరిట 10 ఏళ్లు పైబడిన వారి కోసం ఉద్దేశించిన కిట్ ద్వారా భారతీయ వీధులు, ప్రదేశాలను పర్ఫెక్ట్గా డ్రాయింగ్ పద్ధతిలో గీయడం నేర్చుకోవచ్చు అని వివరంచారు. క్లేడోజ్ పేరిట మట్టితో బొమ్మలు చేస్తూ కథలు అల్లే కిట్ 6 ఏళ్ల పైబడిన పిల్లలకు ఎంతో ఉల్లాసాన్నిస్తుందన్నారు. పిల్లలు కేవలం సూచనలను పాటించడం దగ్గర ఆగిపోకూడదని, వారి సొంత ఆలోచనలకు రూపం ఇచ్చినప్పుడే అసలైన నేర్చుకోవడం మొదలవుతుందన్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే అనుభవాలను తాము రూపొందిస్తున్నామన్నారు. సృజనాత్మకతను ఒక ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం అని, రాబోయే తరానికి అవసరమైన వినూత్న ఉత్పత్తులను అందిస్తూ ఈ విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందాలనుకుంటున్నామన్నారు. -
గెలిచే తంబీ ఎవరో..?
కన్యాకుమారి.. భారతీయులకు సుపరిచిత ప్రాంతం..! తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా దక్షిణ భాగంలో ఉన్న విలవన్కోడ్ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారుతోంది. ఇందుక్కారణం.. ఆ ప్రాంతం రబ్బరు పరిశ్రమలకు నెలవు. యాలకులు, లవంగాలు సుగంధ ద్రవ్యాల పంటలకు కేరాఫ్ అడ్రస్..! అంతేకాదు.. చారిత్రక చిత్తరల్ కొండ ఆలయం, తిక్కురిచి మహాదేవ ఆలయం, నట్టాలం శంకరనారాయణ దేవస్థానం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికలు టఫ్గా సాగుతున్నాయి. అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకుపోతున్నా.. గెలుపోటములను ఏమాత్రం అంచనా వేయని పరిస్థితులున్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా?కన్యాకుమారి జిల్లాలో ప్రధాన వాణిజ్య పట్టణమైన మార్తాండంతోపాటు.. కుళితురై, కలియక్కవిలై, అరుమనై వంటి ప్రముఖ ప్రదేశాలు విలవన్కోడ్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. కొండప్రాంతమైన కొడియార్ కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతాల్లో రబ్బరు తోటలు సమృద్ధిగా ఉన్నాయి. రబ్బరు ప్రాసెసింగ్ పరిశ్రమలకు విలవన్కోడ్ అడ్డా అని చెప్పవచ్చు. జీడిమామిడి తోటలు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. కేరళ, తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో పండే జీడిమామిడి ప్రాసెసింగ్ మిల్లులు కూడా విలవన్కోడ్లో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో నాడర్ సామాజికవర్గం మెజారిటీగా ఉంది. వీరి తర్వాత నాయర్లు, ఈలవలు, వెల్లలార్లు, ఎస్సీలు, ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్తోపాటు.. సీపీఎం, బీజేపీలకు మంచి క్యాడర్ ఉందని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ 11 సార్లు, సీపీఎం ఐదు సార్లు విజయం సాధించగా.. బీజేపీ క్రమంగా తన ఓటుబ్యాంకును పెంచుకుంటూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువ. పురుష ఓటర్ల సంఖ్య ఒక లక్షా 11 వేల 990 కాగా.. మహిళా ఓటర్లు ఒక లక్షా 13 వేల 226 మంది ఉన్నారు. ముగ్గురు థర్డ్ జెండర్లు కూడా ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.ఈ నియోజకవర్గ ప్రజల చిరకాల డిమాండ్ అయిన.. రబ్బర్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు హామీపై అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతీ ఎన్నికల్లో ఈ హామీ పేరుతో ప్రధాన పార్టీలు తమను మోసగిస్తున్నాయనే భావన ఇక్కడి ఓటర్లలో ఉంది. దీంతోపాటు.. జీడిమామిడి మిల్లుల అప్గ్రేడేషన్, జీడిమామిడి కార్మికుల రోజుకూలీ పెంపు వంటి డిమాండ్లు పేద, మధ్యతరగతి వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇక్కడ అటవీ చట్టానికి సంబంధించిన సమస్యలతోపాటు.. నెయ్యర్ ఎడమగట్టు కాల్వలో నీటి విడుదల లేకపోవడం వంటి ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు అంటేనే.. అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లు రాజకీయాలు కొనసాగుతాయి. ఈ నియోజకవర్గంలో మాత్రం.. ఆ రెండు పార్టీల ప్రాబల్యం కనిపించదు. అయితే.. రబ్బర్ ప్రాసెసింగ్ పార్క్ హామీని నెరవేరుస్తామంటూ బీజేపీ.. కాంగ్రెస్ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. -
ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో మెట్టూరు కూడా ఒకటి. ఇక్కడి నుండి నామ్ తమిళర్ కట్చి తరపున అడవి బిడ్డ, స్మగ్లర్ వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యా రాణి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న వేళ, ఆమె తన ఎన్నికల ఖర్చుల కోసం ప్రజల సహాయాన్ని అర్థించారు. వీడియో ద్వారా విజ్ఞప్తి విద్యారాణి సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేస్తూ, అందులో తన భావాలను పంచుకున్నారు. ఎన్నికల ప్రచారానికి అవసరమైన వాహన డీజిల్, ఆహారం, ఇతర రోజువారీ ఖర్చుల కోసం తనకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన సోదర సోదరీమణులు, పెద్దలు, తమిళ బంధువులందరూ ఏకమై తోచిన సహాయం చేస్తే, అది తన విజయాన్ని సులభతరం చేస్తుందని ఆమె ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. విద్యా రాణి కేవలం విజ్ఞప్తి చేయడమే కాకుండా, తన వీడియోలో ఆర్థిక సహాయం పంపడానికి వీలుగా జీ పే, పోన్ పే నెంబర్లతో పాటుగా బ్యాంక్ ఖాతా వివరాలను జత చేశారు. సామాన్యుల పక్షాన నిలబడి పోరాడటానికి తనకు ఈ సహాయం ఎంతో అవసరమని ఆమె విజ్ఞప్తి చేశారు.విద్యారాణి రాజకీయ నేపథ్యం గతంలో బీజేపీ , పీఎంకే పారీ్టల్లో పనిచేసిన విద్యా రాణి, ఇటీవల సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చిలో చేరారు. ఆమె వృత్తిరీత్యా న్యాయవాది , సామాజిక కార్యకర్త. తన తండ్రి వీరప్పన్పై ఇప్పటికీ సానుభూతి ఉన్న ప్రాంతాల్లో ఆమెకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఓ వైపు ప్రధాన పారీ్టలు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తుంటే, విద్యా రాణి వీడియో సందేశంలో ఉద్వేగ పూరిత వ్యాఖ్యలతో ప్రజల నుండి చందాలు సేకరించే పనిలో పడ్డారు. చందనపు దుంగల, ఎనుగుల దంతాల స్మగ్లర్గా పశి్చమ పర్వత శ్రేణుల్లోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం కేంద్రంగా ఒకప్పుడు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ముచ్చెమటలు పట్టించిన వీరప్పన్ తనయ తాజాగా నిధుల కోసం ఎదురు చూడటం గమనార్హం. -
కనీస వసతులు లేవని నిరసన
వేలూరు: రాణిపేట జిల్లా వాలాజపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో వందకు పైగా కుటుంబాలు నివశిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో అవసరమైన కనీస వసతులు కల్పించలేదు. బుధవారం ఉదయం ఆ వార్డులోని వారందరూ ఇంటిపై నల్ల జెండాలు కట్టి నల్ల దుస్తులు ధరించి తమకు కనీస వసతులు కల్పించాలని నిరసన తెలిపారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వసతులు కల్పించాలని లేకుంటే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించి తమ ఓటరు కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులను జిల్లా ఎన్నికల అధికారికి అప్పగించడంతో పాటు పోలింగ్ బూత్ వద్ద తమ ప్రాంత వాసులతో నిరసన తెలియజేస్తామన్నారు. -
ఐఐటీ మద్రాసులో ఆధ్యాత్మిక పరిశోధనా కేంద్రం
కొరుక్కుపేట: ఐఐటీ– మద్రాసు పూర్వ విద్యార్థి అయిన సంత్ రాజిందర్ సింగ్ జీ మహారాజ్ మద్దతుతో మానవ శ్రేయస్సును మెరుగుపరచడానికి ఆధ్యాత్మికత, ధ్యానం, విజ్ఞానశాస్త్రం, సమాజం మధ్య ఉన్న సంబంధాన్ని అన్వేషించడానికి ఐఐటీ మద్రాస్ ఆధ్యాత్మికత, విజ్ఞానశాస్త్రం సమాజంపై ఉన్నత పరిశోధనా కేంద్రాన్ని స్థాపించింది. దీని ప్రారంభోత్సవం సందర్బంగా ఈ కేంద్రం మానవ శ్రేయస్సు, చైతన్యంపై జరిగే ప్రపంచ పరిశోధనకు దోహదపడుతుందని ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి తెలిపారు. విజ్ఞానశాస్త్రం, మానవీయ శాస్త్రాలు, వైద్యం, వాస్తుశాస్త్రాలను మిళితం చేసే అంతర్విభాగ పరిశోధనను ప్రోత్సహిస్తుందని అంతేకాకుండా, ఈ కేంద్రం ధ్యానం, ఆధ్యాత్మికత శాసీ్త్రయ, సామాజిక ప్రభావాలను అధ్యయనం చేస్తుందన్నారు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడైన, ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి సంత్ రాజిందర్సింగ్ జీ మహారాజ్, ఐఐటీ మద్రాస్ క్యాంపస్లో ఈ కీలక కేంద్రాన్ని ప్రారంభించడానికి రూ. 5 కోట్లు విరాళంగా అందించారు. ఆయన 50 దేశాలలో 3,400కు పైగా కేంద్రాలు కలిగిన ఒక ప్రపంచ ఆధ్యాత్మిక సంస్థ అయిన సైన్స్ ఆఫ్ స్పిరిచ్యువాలిటీకి ఆధ్యాత్మిక అధిపతిగా ఉండటం విశేషం . -
క్లుప్తంగా
కొరుక్కుపేట: మద్రాసు వర్సిటీ తెలుగుశాఖ, జనని సంయుక్త నిర్వహణలో డా. కాసల నాగభూషణం రచించిన ‘ఆధునికాంధ్ర కవిత్వం– తాత్త్వికతా వైవిధ్యం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. పుస్తకాన్ని గాడిపర్తి రాజా ఆవిష్కరించారు. పుస్తకం తొలిప్రతిని నూతలపాటి రాజా స్వీకరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మద్రాసు వర్సిటీ, తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ ఈ పుస్తకం తెలుగు సాహితీ విమర్శనా రంగంలో ఒక మణిహారం అని వ్యాఖ్యానించారు పుస్తకావిష్కరణలో పాండురంగం కాళియప్ప, కాకుటూరు అనిల్కుమార్రెడ్డి, డా.జొన్నలగడ్డ వెంకటరమణ, డా.నిర్మల, సరోజిని, గుడిమెట్ల చెన్నయ్య, డా. మాదా శంకరబాబు, డా. ప్రణవి, సురేష్, డా.ఆముక్తమాల్యద, శ్రీలక్ష్మీ, తమ్మినేని బాబు, డా.ఆంబ్రూణి, పి. జయశ్రీ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.కొరుక్కుపేట: లోక్సభలో ప్రవేశపెట్టిన ట్రాన్స్జెండర్ (హక్కుల పరిరక్షణ) సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడు ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు సభ్యులందరూ సంయుక్తంగా నిరసన తెలిపారు. చైన్నె కలెక్టరేట్ సమీపంలో బుధవారం జరిగిన నిరసనలో ట్రాన్స్జెండర్ హక్కుల సవరణ బిల్లు 2026ను తక్షణమే ఉపసంహరించుకోవాలి. రాజ్యాంగం ప్రకారం లింగ గుర్తింపు హక్కును పరిరక్షించాలి, ట్రానన్స్జెండర్ పరిరక్షణ చట్టం, 2019ని పూర్తిగా రద్దు చేయాలని నినదించారు. ఈ బిల్లు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా, ట్రాన్స్జెండర్ వర్గాల గుర్తింపులను తొలగిస్తుంది. దీనివల్ల ట్రాన్స్జెండర్ వర్గాలు చట్టపరమైన గుర్తింపు, రక్షణ పొందలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలి అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ట్రాన్స్జెండర్ సంక్షేమ సంఘం కోరింది. తిరుత్తణి: తిరుత్తణి కొండ ఆలయ ఘాట్రోడ్డులో ఆటో బోల్తాకొట్టి భక్తులు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుత్తణి పోలీసుల కథనం మేరకు వేలూరు జిల్లా తోటపాళ్యం గ్రామానికి చెందిన ముత్తువేల్(49) అతని భార్య శాంతి దంపతులు కలిసి వారి ఇద్దరు పిల్లలు మణిమేగళై, కిషోర్తో కలిసి ఆటోలో బుధవారం తిరుత్తణి కొండకు వచ్చి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఇంటికి తిరుగు ప్రయాణంలో కొండ ఘాట్రోడ్డులో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో దంపతులు వారి ఇద్దరి పిల్లలకు గాయాలయ్యాయి. వారిని పోలీసులు కాపాడి 108 అంబులెన్స్ ద్వారా తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స పొందుతున్నారు. పళ్లిపట్టు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర అసెంబ్లీకి ఏప్రిల్ 23వ తేదీ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 30న నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఏర్పాట్లు, భద్రతపై కలెక్టర్ ప్రతాప్ పరిశీలించారు. పళ్లిపట్టు సమీపంలోని కుమారాజుపేట పోలింగ్ కేంద్రంలో పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేసి ఏర్పాట్లను వివరించారు. అనంతరం కలెక్టర్ను ఆహ్వానించేందుకు వీలుగా పాఠశాలలో వేచివున్న విద్యార్థులను చూసి ఎన్నికల పట్ల విద్యార్థులకు తెలిసిన విషయాలను అడిగి తెలుసున్నారు. కలెక్టర్ వెంట తిరుత్తణి నియోజకవర్గ ఎన్నికల నిర్వహణాధికారి కణిమొళి పాల్గొన్నారు. అలాగే తిరుత్తణి మర్రిమాను వీధిలోని పోలింగ్ కేంద్రంలో పోలింగ్కు ఏర్పాట్లను తనిఖీ చేశారు. -
ఇండియా కూటమిలో రాజకీయ వార్
సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఇండియా కూటమిలో రాజకీయ వార్ తారా స్థాయికి చేరింది. ఆరు స్థానాలలో ఇరు పార్టీలు పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందు ఇరు పార్టీల తరపున అభ్యర్థులు ముందుకు రాక పోవడంతో కూటమి చిన్నా భిన్నమయ్యే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇండియా కూటమిలో వివాదం కొనసాగుతూనే ఉంది. సీట్ల సర్దుబాటుకు ముందుగా ఇక్కడి 30 స్థానాలలో డీఎంకే, కాంగ్రెస్ కూటమి తరపున నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరకు నామినేషన్ల ప్రక్రియ ముగిసినానంతరం సీట్ల సర్దుబాటు జరిగింది. ఇందులో 16 చోట్ల కాంగ్రెస్, 14 చోట్ల డీఎంకే పోటీ చేస్తున్నది. ఇందులో ఓ స్థానం వీసీకేకు డీఎంకే అప్పగించింది. సీట్ల పంపకాలు ముగిసినప్పటికీ, ఆరు స్థానాలు కూటమి చిన్నాభిన్నంకు పరిస్థితులను కల్పిస్తున్నాయి. ఈ ఆరు స్థానాలలో కాంగ్రెస్, డీఎంకే నామినేషను బుధవారం జరిగిన పరిశీలనలో ఆమోదించారు. గురువారం ఉపసంహరణ ప్రక్రియ జరగనున్నది.కుదరని ఏకాభిప్రాయంకూటమిలో ఏకాభిప్రయం కుదరక పోవడంతో సీపీఐ ఒంటరిగా పోటీ అని ప్రకటించి, తట్టాం చావడి, ఉలవర్కరై స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టేసింది. ఇక వీసీకే తరపున ఉలవర్కరై, ఉసుడు, తిరుభువనం నియోజకవర్గాలలో నామినేషన్లు దాఖలు చేసిన వాళ్లు ఉపసంహరణకు ముందుకు రాక పోవడం చర్చకు దారి తీసింది. ఇదే తరహా పోరు అన్నడి డీఎంకే, కాంగ్రెస్లోనూ నెలకొంది. డీఎంకేకు కేటాయించిన కాలపట్టు, రాజ్భవన్, నెల్లి తోపు, మంగళం, తిరుభువనం తో పాటుగా మరో నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కూడా నామినేషన్లు వేశారు. తాజాగా వీరు ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో డీఎంకే ఇరకాటంలో పడ్డట్లయ్యింది. గురువారం నామినేషన్లు ఉపసంహరించుకోని పక్షంలో రెండు పార్టీలు తలబడేందుకు సిద్ధమయ్యాయి. ఫ్రెండ్లీ సమరంగా ఈ ఆరు స్థానాలలో పోటీ ఉంటుందని కాంగ్రెస్ ప్రతినిధులు పేర్కొనడం గమనార్హం. అయితే దీనిని డీఎంకే అంగీకరించే పరిస్థితులలో లేదు. అదే సమయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు పోటీలో ఉన్న స్థానాలలో తమ తరపున నామినేషన్లు వేసిన వారి చేత ఉపసంహరింప చేయకుండా డీఎంకే ఎత్తుకు పై ఎత్తు వేస్తుండటంతో పుదుచ్చేరి ఇండియా కూటమిలో రాజకీయ సంక్షోభం అన్నది బయలు దేరి నట్టైంది. కూటమి చీలకుండా కాంగ్రెస్ ఎన్నికల ఇన్చార్జ్ గిరీశ్ చోదన్కర్ తదితరులు కాంగ్రెస్ నేతలతో సమాలోచనలో ఉన్నారు.నాకు వ్యతిరేకంగా కుట్రమాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామికి సీటు నిరాకరించడం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన విషయం తెలిసిందే. తనకు నెల్లి తోపు నియోజకవర్గం దక్కకుండా రాష్ట్ర అధ్యక్షుడు వైద్యలింగం కుట్ర పన్నారని నారాయణ స్వామి బహిరంగంగా విమర్శించారు. నారాయణస్వామి మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిరసన కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో నారాయణస్వామి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పార్టీని కాపాడటమే తన లక్ష్యం. ఒక నాయకుడు తనపై కుట్ర పన్నారని, కూటమి బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అని వ్యాఖ్యానించారు. -
మునీశ్వరర్, పెరియాండవర్ మహాకుంభాభిషేకం
పళ్ళిపట్టు: మునీశ్వరర్, పెరియాండవర్ ఆలయ మహాకుంభాభిషేకం బుధవారం కోలాహలంగా నిర్వహించారు. పళ్లిపట్టు సమీపంలోని సీఆర్.పట్టడ, కేశరాజుపురం గ్రామస్తులు సంయుక్తంగా గ్రామానికి శివారులోని కుశస్థలినది తీరంలో వినాయకుడి ఆలయంతో పాటు మునీశ్వరర్ ఆలయం, పెరియాండవర్ ఆలయాలు నూతనంగా నిర్మించారు. ఆలయ నిర్మాణపు పనులు పూర్తి కావడంతో సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు మహాకుంభాభిషేకం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో యాగశాలలు ఏర్పాటు చేసి నిత్యహామ పూజలు జరిగాయి. బుధవారం ఉదయం మహాపూర్ణాహుతి హామపూజలు అనంతరం అశేష భక్తజనం నడుమ మేళ తాళాలతో పవిత్ర పుణ్యతీర్ధాల కలశాలతో బయల్దేరి ముందుగా వినాయకుడి ఆలయ విమాన కలశానికి మహాకుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం మునీశ్వరర్, పెరియాండవర్ విగ్రహాలకు మహా కుంభాభిషేకం నిర్వహించారు. భక్తులందరికీ ఆలయ నిర్వాహకులు కుంకుమ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
అమలుకు సాధ్యం కాని మేనిఫెస్టో
వేలూరు: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి చెందడం ఖాయమని అందువల్లే ఎడపాడి పళణిస్వామి అమలు చేయలేని మేనిఫెస్టోలను ప్రకటించారని రాష్ట్ర మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలో కాట్పాడి, కేవీ కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను డీఎంకే పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాట్పాడిలో తనను పలువురు ఎమ్మెల్యే అభ్యర్థిగా చెపుతున్నప్పటికీ తాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ అధిష్టానం ఎవరిని ప్రకటిస్తుందో వారే అభ్యర్థి అన్నారు. తాను సీఎం స్టాలిన్తో తరచూ ఉంటూ పలు సమస్యలను నేరుగా చూసిన వ్యక్తి అయినప్పటికీ సీఎం స్టాలిన్తో పాటు అధిష్టానం ఎవరిని ప్రకటించినా అందుకు తాను సిద్ధపడి ఉండాలన్నారు. ప్రస్తుతం డీఎంకే పార్టీలో కూటమి పార్టీల సీట్లను ఒక రకంగా సర్దుబాటు చేశారన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎడపాడి పళనిస్వామి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో పసలేని మేనిఫెస్టోగా ఉందన్నారు. అధికారంలోకి రామని తెలిసి వారు ఇటువంటి హామీలను ఇచ్చారన్నారు. వీటిని ప్రజలు నమ్మరన్నారు. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో తాను లేనని త్వరలోనే మంచి మేనిఫెస్టోను ప్రజలకు ప్రకటిస్తామన్నారు. తాను ప్రస్తుతం రాజకీయాలు మాట్లాడబోమని తేల్చి చెప్పి వెళ్లిపోయారు. ఎంపీ కదిర్ఆనంద్, ఎమ్మెల్యే కార్తికేయన్, డిప్యూటీ మేయర్ సునీల్కుమార్, డివిజన్ కార్యదర్శి వన్నియరాజ, మాజీ ఎమ్మెల్యే లత, కోశాధికారి నరసింహన్, యూనియన్ చైర్మన్ వేల్మురుగన్, వైస్ చైర్మన్ శరవణన్, యూనియన్ కార్యదర్శి తనికాచలం పాల్గొన్నారు. -
క్లుప్తంగా
కారు ఢీకొనడంతో యూకేజీ విద్యార్థిని మృతి అన్నానగర్: తెన్కాశీ జిల్లాలోని పులియంగుడి సమీపంలో ఉన్న నెర్కట్టుం సేవల్ గ్రామానికి చెందిన మారిసామి. ఇతని భార్య పేరు వేల్ మయిల్. వీరి ఏకై క కుమార్తె శివయళిని (4). ఈమె పులియంగుడి ప్రాంతంలోని ఒక ఉన్నత మాధ్యమిక పాఠశాలలో యూకేజీ చదువుతోంది. మంగళవారం సాయంత్రం, శివయళిని పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళ్లడానికి పాఠశాల ఆవరణలో వేచి ఉంది. ఆ సమయంలో, ఒక కారు వేగంగా పాఠశాల ఆవరణలోకి వచ్చింది. ఈ క్రమంలో శివయళినిని ఢీ కొట్టింది. దీంతో ఆ విద్యార్థిని సంఘటన స్థలం లోనే మరణించింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ ఈవీఎంల తరలింపు తిరువళ్లూరు: జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఈవీఎంలను భారీ పోలీసు బందోబస్తు నడుమ బుధవారం తరలించారు.ఈ పనులను కలెక్టర్ ప్రతాప్ పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తిరువళ్లూరులోని గోదాములో 8,663 బ్యాలెట్ యూనిట్లు, 6,240 కంట్రోల్ యూనిట్, 5,968 వీవీప్యాట్లతో సహా 20,871 మిషన్లు వున్నాయన్నారు. వీటిలో లాటరీ విధానం ద్వారా 4,821 బ్యాలెట్ యూనిట్, 4,821 కంట్రోల్ యూనిట్, 5,223 వీవీప్యాట్లతో సహా 14,865 మిషన్లను ఎంపిక చేసి వాటిని ఆయా నియోజకవర్గాల్లో భారీ పోలీసు బందోబస్తు నడుమ భద్రపరిచినట్టు తెలిపారు. మిగిలిన 3,842 బ్యాలెట్ యూనిట్, 1,419 కంట్రోల్ యూనిట్, 745 వీవీప్యాట్లతో సహా 6,006 మిషన్లను గోడౌన్లో వుంచామన్నారు. పీఎంకే అభ్యుర్థుల జాబితా విడుదల సాక్షి, చైన్నె : పీఎంకే తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. అన్బుమణి నేతృత్వంలో పీఎంకే అన్నాడీఎంకే కూటమిలో ఉన్న విషయం తెలిసిందే. అన్బుమణికి అన్నాడీఎంకే 18 స్థానాలను కేటాయించింది. తొలి జాబితాను అన్బుమణి విడుదల చేశారు. ఇందులో పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎ. గణేష్ కుమార్ సెంజి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అంబత్తూరులో మాజీ మున్సిపల్ ఛైర్మన్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఎన్. శేఖర్ బరిలోకి దిగుతున్నారు.కీల్ వేలూరులో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్. వడివేల్ రావణన్ పోటీచేస్తున్నారు. పెళ్లి మండపంలో బాంబు బెదిరింపు అన్నానగర్: దిండుక్కల్–తిరుచ్చి బైపాస్ రోడ్డులో ఒక ప్రసిద్ధ వివాహ మండపం ఉంది. బుధవారం ఈ మండపంలో ఒక వివాహం జరగాల్సి ఉంది. బుధవారం ఉదయం, వరుడిని ఆహ్వానించడంతో పాటూ ఇతర కార్యక్రమాలు జరిగాయి, అనంతరం వధూవరులకు పూలమాలలు వేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో, పెళ్లి మండపంలో బాంబు పెట్టారనే వార్త అకస్మాత్తుగా వ్యాపించింది. దీంతో పెళ్లికి వచ్చిన అతిథులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం దాడికొంబు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు బాంబు నిపుణులతో సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులందరూ ప్రాణాలతో బయటపడాలనే ఆశతో హాలులోంచి బయటకు పరుగులు తీశారు. అంతేకాకుండా, వధూవరులను వారి బంధువులు తాళీ కట్టకుండానే బయటకు తీసుకువచ్చారు. అనంతరం తనిఖీలు చేశారు. బాంబు బూచీ ఒత్తిటే అని తేల్చారు. ఎంఎస్ఎంఈలకు తోడ్పాటుగా వేదిక సాక్షి, చైన్నె : ఎంఎస్ఎంఈలతో పాటుగా పెద్ద సంస్థలు తమ ఆర్థిక సంవత్సరం ముగింపు కొనుగోళ్లను సులభతరం చేస్తూ ఒక గొప్ప వేదికను ఏర్పాటు చేశామని అమెజాన్ బిజినెస్ ప్రకటించింది. ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ సేల్ 2026 ప్రారంభిస్తూ బుధవారం నిర్వాహకులు వివరాలను వెల్లడించారు. ఈ సేల్ ఒక గొప్ప వేదికగా నిలవనుందన్నారు. ఐటీ పరికరాలు, ఆఫీస్ ఫర్నిచర్ , ఇండస్ట్రియల్ టూల్స్ వంటి వివిధ విభాగాలలో ఈ సేల్ ప్రత్యేక ఆఫర్లను అందిస్తుందన్నారు. ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, ఇతర ఐటీ యాక్సెసరీలపై 50 శాతం వరకు డిస్కౌంట్, ఆఫీస్ ఫర్నిచర్, స్టేషనరీ రోజువారీ అవసరాలకు ఉపయోగపడే వస్తువులపై 70 శాతం వరకు తగ్గింపు ఈ వేదిక కల్పిస్తుందని వివరించారు. 2025 సంవత్సరంలో అమెజాన్ బిజినెస్ ద్వారా రూ. 2 వేల కోట్ల వరకు వర్తకం పరంగా ఆదా కల్పించామన్నారు. గుర్తింపు పొందిన సంస్థలు కూడా ఈ ప్లాట్ఫారమ్లో ఉచితంగా నమోదు చేసుకుని ఈ ప్రయోజనాలను పొందవచ్చని సూచించారు. -
దినేష్ కార్తీక్ జెర్సీ– 19తో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్
సాక్షి, చైన్నె: ప్రముఖ క్రికెటర్ దినేష్కార్తీక్ ఐకానిక్ జెర్సీ నెంబర్ 19 ఆకారంలో నిలుచోని చైన్నెస్ అమృత విద్యార్థులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాధించి చరిత్ర సృష్టించారు. బుధవారం ఉదయం చైన్నెలోని నెహ్రూ స్టేడియం వేదికగా తమిళనాడు డాక్టర్ ఎం.జి.ఆర్ మెడికల్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డాక్టర్ కె. నారాయణస్వామి, చైన్నెస్ అమృత గ్రూప్ ఛైర్మన్ ఆర్స్మినాథన్ సమక్షంలో ఈ సాథన జరిగింది. ఇందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలోని చైన్నెస్ అమృత విద్యా సంస్థల నుండి 3,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్రికెటర్ దినేష్ కార్తీక్పై అభిమానాన్ని చాటుకుంటూ, ఆయన ఐకానిక్ జెర్సీ నంబర్ 19కి ప్రతీకగా, వారంతా కలిసి సీఏ లవ్ డీకే 19 అనే భారీ ఆకారంలో నిలుచోని రికార్ుడ్సకు యత్నించారు. క్రీడాకారుడి జెర్సీకి మానవ ఆకారంలో గరిష్ట సంఖ్యలో పాల్గొన్నందుకు గాను దీనిని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్గా స్థానం సంపాదించారు. చారిత్రాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత క్రికెటర్ దినేష్ కార్తీక్, గౌరవ అతిథిగా చైన్నెలోని తమిళనాడు డాక్టర్ ఎం.జి.ఆర్ మెడికల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ కె. నారాయణస్వామి, ఎం.డి., డి.ఎం. (గ్యాస్ట్రో) హాజరయ్యారు. ఈ రికార్డు పట్టుదల, ధృఢ సంకల్పం, కఠోర శ్రమ వంటి విలువలను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు స్ఫూర్తినిచ్చింది. ఈ కార్యక్రమం చైన్నెస్ అమృత 7వ వార్షిక క్రీడా సమావేశానికి విద్యార్థులు క్రికెట్, వాలీబాల్, త్రోబాల్, ఫుట్బాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ వంటి అనేక క్రీడాంశాలలో పోటీపడ్డారు. పోటీలలో విజేతలకు పతకాలు, ట్రోఫీలతో సత్కరించారు. -
సృజనాత్మకతను చాటిన విద్యార్థినులు
కొరుక్కుపేట: కన్యకాపరమేశ్వరి మహిళా కళాశాల విద్యార్థినిలు సృజనాత్మకతను చాటుకున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు నమూనాలు, భాషా సంస్కృతులను తెలిపే నమూనాలు, ఏఐ ప్రాముఖ్యతను చాటే నమూనాలు, వినూత్న సాంకేతిక ఆవిష్కరణలు, విద్యాఅంశాలతో కూడిన నమూనాలను ప్రదర్శించారు. వివరాలు.. తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో 50వ వార్షిక పర్యాటన ప్రదర్శన చైన్నె ఐలాండ్ గ్రౌండ్స్ జరుగుతుంది. అందులో ఈనెల 24,25,26 తేదీల్లో నిర్వహిస్తున్న విద్యా ప్రదర్శనలో కన్యకాపరమేశ్వరి మహిళా కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే విధంగా రూపొందించిన మోడల్స్ అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక అభివృద్ధి, విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై విద్యార్థులు సృజనాత్మక నమూనాలను రూపొందించారు. కొంతమంది విద్యార్థులు పెన్సిల్ ఆర్ట్, క్రాఫ్ట్ ఐటమ్స్, ఇతర చేతి వృత్తులను తయారు చేసి ప్రదర్శించారు. ముఖ్యంగా తమిళనాడు సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే విధంగా తిరువళ్లువర్ విగ్రహం, వళ్లువర్ కోట్టం వంటి చారిత్రక నిర్మాణాల నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఆధునిక సాంకేతికత అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు సంబంధించిన నమూనాలు కూడా కొలువుదీర్చారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు కేవలం మోడల్స్ మాత్రమే కాకుండా, వివిధ గేమ్స్, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సందర్శకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ట్రేడ్ ఫేర్ ఇన్చార్జి కృష్ణమూర్తి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వనజా, అధ్యాపకులు డాక్టర్ పి.ఎస్.మైథిలి, విద్యార్థినులు పాల్గొన్నారు. -
టీఎన్సీసీలో ఆధవ్ చర్చ
● ప్రధాన కార్యదర్శి సస్పెన్షన్ సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్లో టీవీకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. అదే సమయంలో తమిళనాడు కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి డి సెల్వంను సస్పెండ్చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్కు తక్కువ సీట్లు కేటాయించినట్టుగా అనేక మంది నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడులో కాంగ్రెస్ను నమ్ముకుంటే రాజకీయం చేయలేమంటూ అనేక మంది నేతలు పార్టీ అధిష్టానం పెద్దల వద్ద ఆవేదనను వ్యక్తం చేసినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈపరిస్థితులలో టీవీకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున బుధవారం చైన్నెలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపాయి. క్యూలో వంద మంది నేతలు ఆధవ్ అర్జన మాట్లాడుతూ, కాంగ్రెస్ గుడారం ఖాళీ కానున్నట్టు వివరించారు. డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటుపై అనేక మంది నేతలు అసంతృప్తితో ఉన్నారని, సుమారు వంద మంది నేతలు టీవీకేలోచేరడానికి క్యూలో ఉన్నట్టు ప్రకటించారు. పార్టీఅధినేత విజయ్ను కలిసేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నారని, ఒకటి రెండు రోజులలో కాంగ్రెస్లోని ముఖ్య నాయకులు వంద మంది టీవీకేలో చేరబోతున్నారని చేసిన వ్యాఖ్యలో చర్చకు దారి తీశాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డి సెల్వంను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయడం గమనార్హం. ఆ వంద మంది నేతలు ఎవరో అన్న చర్చ ఊపందుకోవడంతో కాంగ్రెస్లో ప్రకంపన బయలు దేరినట్లయ్యింది. అదే సమయంలో ఆధవ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ఖండించారు. తమ అధినేతలు మల్లికార్జున కార్గే, రాహుల్ గాంధి మార్గదర్శకంలో ఇక్కడ నేతలు పార్టీ కోసం శ్రమిస్తారని వ్యాఖ్యలు చేశారు. తిరుత్తణి: కంచిలో పట్టు చీరలు కొనేందుకు వెళుతున్న వారి నుంచి రూ. 2.50 లక్షలను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు బుధవారం ఉదయం స్వాదీనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నియమావళి నిబంధనలు అమలు చేసే విధంగా అధికారులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుత్తణి సమీపం అరక్కోణం రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారును తనిఖీ చేశారు. సరైన ఆధారలు లేని రూ.2.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నగదును ఆర్డీఓ కార్యాలయంలో అప్పగించారు. విచారణలో పుత్తూరుకు చెందిన పూర్ణిమ కుటుంబ వివాహం కోసం కంచిలో పట్టు చీరలు కొనుగోలుకు వెళ్లుతున్నట్లు తెలిపారు. -
జీవిత విలువల గురించి చెప్పే కార్మేని సెల్వమ్
తమిళసినిమా: నార్వే ప్రొడక్షనన్స్ పతాకంపై అరుణ్ రంగరాజు నిర్మించిన చిత్రం కార్మేని సెల్వమ్. నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఇందులో దర్శకుడు గౌతమ్ మీనన్, లక్ష్మి ప్రియ,అభినయ, కార్తీక్ కుమార్,భడవా గోపి, మధుమిత, అర్జనన్, శంకరనారాయణ, వి.హరిత పరకోడ్ కోదండం, కిరణ్ చక్రవర్తి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రామ్ చక్రి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి మ్యూజిక్లౌడ్ స్టూడియో సంగీతాన్ని అందించింది. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 3వ వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సముద్రఖని మాట్లాడుతూ భగవంతుని కృప కారణంగా ఈ చిత్రంలో నటించే అవకాశం తనకు వచ్చిందన్నారు. దర్శకుడు రామ్ చక్రి కథ స్క్రిప్ట్ పంపాలన్నారు. కథను చదవగానే నచ్చిందని, ఎప్పుడు చేద్దాం చెప్పండి అని అన్నానన్నారు. తాను విషయం గురించి ఆలోచించ కుండా పనిలో దిగుతానని, దర్శకుడు అలా కాదని ప్రతి ఆ విషయం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.మనిషి సంతోషంగా జీవిస్తే చాలు, ధనవంతుడు కావలసిన అవసరం లేదు అని చక్కని సందేశంతో కూడిన కథా చిత్రం ఇదని చెప్పారు.మనం లేకపోయినా, పది కాలాల పాటూ గుర్తుండి పోయే చిత్రం కార్మేని సెల్వమ్ అని పేర్కొన్నారు. చిత్రంలో పని చేసిన నటీనటులు, సాంకేతిక వర్గం అంతా సమష్టిగా శ్రమించారని సముద్రఖని పేర్కొన్నారు. -
ఇంతకు ముందేప్పుడూ చూడని విధంగా..
తమిళసినిమా: వంద పరోటాలను ఆవురావురుమని తిని, లెక్క తప్పైతే మళ్లీ తింటా మొదటి నుంచి లెక్కపెట్టుకోండి అంటూ వెన్నెలా కబడ్డీ కుళు చిత్రంలో కమెడియన్గా నటించిన నటుడు సూరి. ఆ చిత్రం తర్వాత పరోటా సూరి ముద్ర వేసుకున్న ఈయన దాదాపు దశాబ్దన్నర కాలం పాటు చిన్న చిన్న పాత్రల్లో నటించి అలుపెరుగని పోరాటం చేసి ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగి, ఆ తరువాత కథానాయకుడి అవతారమెత్తి విజయాలను అందుకుంటున్నారు. అలా కొట్టు కాళీ, విడుదలై, గరుడన్, మారన్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన సూరి ఇప్పుడు ఒక ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలో హీరోగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. అవును ఈయన హిరోగా నటించనున్న చిత్రాన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. వీరు ఇంతకు ముందు తమిళంలో అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ, ప్రదీప్ రంగనాథన్ హీరోగా డ్యూడ్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. కాగా తాజాగా సూరి హీరోగా మూడో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఆర్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు ఇండ్రు ప్లేట్లు నాళై , అయలాన్ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా సూరి హీరోగా తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్న చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను మంగళవారం విడుదల చేశారు. ఆ పోస్టర్ ఇప్పుడు చిత్రంపై ఆసక్తిని పెంచేస్తోంది. వరద నీటి ప్రవాహంలో మూడొంతులు పైగా మునిగి నిలబడి కథానాయకుడి చేతిలో ఆయుధంతో వెనుక భాగాన్ని చూపుతూ, చుట్టూ చెల్లా చెదురైన వస్తువులు, గ్యాస్ సిలిండర్, ప్రమాదాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం వంటి ఆ దృశ్యాలతో మర్మంగా ఉన్న ఆ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఈ పోస్టర్ కింద బ్లడ్ ఫాలోవ్డ్ ది ఫ్లడ్ అనే ట్యాగ్ లైన్ పొందుపరిచారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
మిడ్డీగా రియోరాజ్
తమిళసినిమా: యువ నటుడు రియోరాజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారనే చెప్పాలి. ఈయన కథానాయకుడిగా నటించిన వైవిధ్య భరిత ప్రేమ కథాచిత్రం జో చిత్రం 2023లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.అఝదులో నటి మాళవిక మనోజ్ నాయకిగా నటించారు. హరిహరన్ రామ్ దర్శకత్వం వహించారు.ఆ తరువాత మరోసారి రియోరాజ్,మాళవిక మనోజ్ జంటగా నటించిన చిత్రం ఆన్ పావమ్.ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా తాజాగా రామ్ ఇన్ లీల అనే చిత్రంలో రియో రాజ్ హీరోగా నటిస్తున్నారు.ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో నూతన చిత్రానికి కమిట్ అయ్యారు. ఈ చిత్రానికి మడ్డీ టైటిల్ ను ఖరారు చేసారు. ఇందులో మలయాళ కుట్టి సానియా అయ్యప్పన్ హిరోయిన్ గా నటించనున్నారు. ఈమె ఇంతకు ముందు నటుడు విక్రమ్ ప్రభు హీరోగా నటించిన ఇరుగపట్రు అనే చిత్రం ద్వారా కోలీవుడ్లోకి అడుగు పెట్టారు.ఇక్కడ ఈ అమ్మడు నటిస్తున్న రెండవ చిత్రం మిడ్డీ. కాగా ఈ చిత్రం ద్వారా కార్తీకేయన్.బీకే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళైఅరసు నిర్మించిన ఈ చిత్రానికి దిబు నినన్ థామస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది రొమాంటిక్ కామెడీ కథా చిత్రంగా ఉంటుందని నటుడు రియో రాజ్ తన ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
చైన్నెలో ‘వ్యాగ్ ఎన్ డైన్’ ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: పెంపుడు జంతువుల పోషణలో సరికొత్త వేదికను చైన్నెలో ఏర్పాటు చేశారు. శునకాల కోసం తాజాగా వండిన, నాణ్యమైన ఆహారాన్ని అందించే వ్యాగ్ ఎన్ డైన్శ్రీ క్లౌడ్ కిచెన్ సేవలు చైన్నెలోని తాజ్ కన్నెమరా హోటల్లో ఘనంగా ప్రారంభించారు. సాధారణంగా పెంపుడు జంతువులకు ఇచ్చే ప్రాసెస్డ్ ఫుడ్ (డ్రై ఫుడ్) కాకుండా, మనుషులు తినేటటువంటి నాణ్యమైన చికెన్, శుద్ధి చేసిన నీరు, సహజమైన పదార్థాలతో ఈ ఆహారాన్ని తయారు చేస్తారు. దీనినే శ్రీహ్యూమన్ గ్రేడ్శ్రీ మీల్స్ అని పిలుస్తారు. ప్రతిరోజూ తాజాగా వండిన ఆహారాన్ని నేరుగా కస్టమర్ల ఇంటికే డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకన్నారు. ఇందులో ఎలాంటి నిల్వ ఉంచే రసాయనాలు వాడరని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ చెప్, , గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత పద్మశ్రీ దాము పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తినే ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో, పెంపుడు జంతువుల విషయంలో కూడా అంతే శ్రద్ధ వహించాలని సూచించారు. ఆ లోటును భర్తీ చేయడానికే వ్యాగ్ ఎన్ డైన్ ప్రారంభమైందన్నారు. వ్యాగ్ ఎన్ డైన్ వ్యవస్థాపకుడు మణివన్నన్ మాట్లాడుతూ.. పెంపుడు జంతువులకు కేవలం ఆహారం ఇవ్వడమే కాకుండా, వాటికి సరైన పోషణ అందించడం లక్ష్యంగా పేర్కొన్నారు. చైన్నె వంటి నగరాల్లో నాణ్యమైన పెట్ ఫుడ్ కోసం చూస్తున్న యజమానులకు మా క్లౌడ్ కిచెన్ ఒక మంచి ప్రత్యామ్నాయం అవుతుందన్నారు. -
చెరువులో మునిగి ముగ్గురి మృతి
వేలూరు: రాణిపేట సమీపంలో చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన పలువురిని కలచివేసింది. రాణిపేట జిల్లా సిప్కాట్ సమీపంలోని తిరువిగనగర్కు చెందిన సెల్వం కుమారుడు పార్థిబన్(13), శరవణన్ కుమారుడు నితీష్(14), కమల కన్నన్ కుమారుడు కే.నితీష్ (13) ముగ్గురూ స్నేహితులు. పార్థిబన్ సిప్కాట్లోని ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పది పరీక్షలు జరుగుతుండడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో పార్థిబన్తోపాటు ముగ్గురు స్నేహితులు కలిసి సమీపంలోని బనియంబట్టు చెరువులో స్నానానికి వెళ్లారు. చెరువులో దిగి స్నానం చేస్తుండగా ముగ్గురికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. మధ్యాహ్నం వరకు పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అన్ని చోట్ల వెతికారు. ఆ సమయంలో మనియంబట్టు చెరువు గట్టుపై విద్యార్థుల దుస్తులు ఉన్నట్లు గుర్తించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. దీంతో స్థానికులు సిప్కాట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, గ్రామస్తుల సాయంతో చెరువులోని నీటిలో గాలించారు. ముగ్గురు బాలురునీటిలో ఒకే చోట మునిగి ఉండడంతో వారిని బయటకు తీసి వెంటనే ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ముగ్గురు మృతిచెందినట్లు నిర్ధారించారు. రాణిపేట పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వాలాజ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ముగ్గురు విద్యార్థులు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. మృత దేహాలు ఉంచిన ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మృతుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు పెట్టడంతో పలువురిని కలచివేసింది. -
తల్లి, బిడ్డకు ప్రాణ రక్షణ
సాక్షి, చైన్నె: వైద్య చరిత్రలో అత్యంత అరుదుగా నిలిచే ఒక క్లిష్టమైన శస్త్రచికిత్సను చైన్నెలోని ఎస్ఆర్ఎం గ్లోబల్ హాస్పిటల్స్ వైద్య బృందం విజయ వంతం చేవారు.32 వారాల గర్భిణికి ఎదురైన వెన్నెముక సమస్యను, ప్రసవ సమస్యను ఏకకాలంలో పరిష్కరించారు. 32 ఏళ్ల గర్భిణి తీవ్రమైన వెన్నునొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఆమెకు శ్రీకౌడా ఈక్వినా సిండ్రోమ్శ్రీ అనే అరుదైన నరాల వ్యాధి సోకినట్టు గుర్తించారు. వెన్నెముకలోని ఎల్4–ఎల్5 ప్రాంతంలో డిస్క్ బయటకు రావడం వలన నరాలు తీవ్రంగా ప్రభావానికి గురైనట్టు తేల్చారు. దీంతో నడవ లేని పరిస్థితి, మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం జరిగింది. దీంతో కొన్ని గంటల్లోనే చికిత్స అందించకపోతే ఆమె శాశ్వతంగా పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉందని తేల్చారు. రోగి సుమారు 130 కిలోల బరువు ఉండటం, మధుమేహం, రక్త పోటు,థైరాయిడ్ సమస్యలుఉండటంతో చికిత్స సంక్లిష్టంగా మారింది. ఆమెకు యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ ) సిండ్రోమ్ కూడా ఉండటంతో ఒకేసారి రెండు సర్జరీలు నిర్వహించాల్సిన అవవ్యం ఏర్పడింది. సిజేరియన్తో బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లికి వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించే శ్రీడికంప్రెషన్శ్రీ సర్జరీని నిర్వహించారు. వెన్నెముక నిపుణులు డాక్టర్ యోగేష్ కుమర్, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్.కె. విద్యాలక్ష్మి, హెమటాలజిస్ట్ డాక్టర్ అభినయ, నియోనాటాలజిస్ట్ డాక్టర్ అశోక్, అనస్థీషియా నిపుణులు డాక్టర్ షణ్మిత ఈ శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. సిజేరియన్ సమయంలో తగిన జాగ్రత్తలు సవాలుగా మారయని, వెను వెంటనే మరో శస్త్ర చికిత్స మరింత సంక్లిష్టమైనా, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండటం ఆనందంగా ఉందని డాక్టర్ యోగేష్ పేర్కొన్నారు. -
వైభవంగా తిరుకాళీశ్వరుడి ఆలయ కుంభాభిషేకం
తిరువళ్లూరు: ప్రసిద్ధి చెందిన శ్రీ ఆనందవల్లి సమేత తిరుకాళీశ్వరర్ ఆలయంలో మహాకుంభాభిషేకం బుధవారం వైభవంగా నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్ కన్నిగపేర్ తిరుకండలం గ్రామంలో ప్రసిద్ది చెందిన శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ తిరుకాళీశ్వరర్ ఆలయం ఉంది. సుమారు రెండువేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం శిధిలావస్థకు చేరిన క్రమంలో ఆలయాన్ని ఇటీవల పునరుద్ధరించారు. పనులు పూర్తయిన క్రమంలో కుంభాభిషేకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గోపూజ, విఘ్నేశ్వర పూజ, నవగ్రహాహోమం, గణపతి హోమం, ఐశ్వర్య కుభేర హామంతో పాటు ఇతర పూజలు నిర్వహించారు. అనంతరం బుధవారం ఉదయం పది గంటలకు కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఉత్సవాల్లో వందలాది మంది భక్తులు పాల్గోనగా, భక్తులకు ప్రసాదంతో పాటూ అన్నదానం నిర్వహించారు. -
ఖాళీ సిలిండర్లతో నిరసన
అన్నానగర్: ఇరాన్పై అమెరికా–ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా వంటగ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అందువల్ల, ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న తర్వాత, కొన్ని రోజుల తర్వాతే సిలిండర్లను ఇళ్లకు పంపిణీ చేస్తున్నారు. వివరాలు.. విరుదునగర్ జిల్లాలోని కరియపట్టి ప్రాంతంలో, తిరుచుళి రోడ్డులోని సిలిండర్ గిడ్డంగి నుంచి కొన్ని రోజులుగా సిలిండర్ల పంపిణీ సరిగ్గా జరగడం లేదని ప్రజలు ఆరోపించారు. చాలా రోజుల క్రితమే రిజర్వేషన్లు చేసుకున్నప్పటికీ సిలిండర్ల కొరతతో బాధపడుతున్నామని పేర్కొంటూ, మంగళవారం సాయంత్రం పెద్ద సంఖ్యలో ప్రజలు గిడ్డంగిని ముట్టడించారు. అనంతరం వారు తిరుచుళి రోడ్డుపై కూర్చుని ధర్నా చేయడంతో కలకలం నెలకొంది. గంటకు పైగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులు వారితో చర్చించి నిరసన విరమింపజేశారు. -
కనుల పండువగా మహా కుంభాభిషేకం
వేలూరు: తిరువణ్ణామలై జిల్లా కీల్పెన్నాతూరు సమీపంలోని సోమాసిపట్టి గ్రామంలో వెలసిన శ్రీవళ్లిదేవసేన సమేత బాలసుబ్రమణియార్ ఆలయ మహాకుంబాభిషేకం బుధవారం కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాచార్యులతో ప్రత్యేక వేద మంత్రాలు, యాగ పూజలు గజపూజ, మహా గణపతి పూజ, గోపూజ, లక్ష్మీపూజ నిర్వహించారు. అనంతరం వివిధ పుణ్య నదుల నుంచి తీసుకొచ్చిన నీటిని కలశాల్లో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలశాల్లో ఉంచిన పుణ్య నీటిని శివాచార్యుల వేద మంత్రాల నడుమ ఆలయ రాజగోపురంపైకి తీసుకెళ్లి కలశాలపై పోసి కుంబాభిషేకం చేశారు. అనంతరం పుణ్యనీటిని భక్తులపై చల్లారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి, ఎంపీ అన్నాదురై, డీఆర్ఓ రామపార్థిబన్, తహసీల్దార్ రాజేంద్రన్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


