breaking news
Tamil Nadu
-
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ (85) ఇక లేరు. వయో భారం.. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో చిత్రాలు నిర్మించారాయన. ఎంజీఆర్, శివాజీ, జెమిని గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్లతో వంటి లెజెండరీలు.. విక్రమ్, రానాలాంటి తారలు ఈ ప్రతిష్టాత్మక బ్యానర్లో నటించారు. ఏవీఎం అంటే అర్థం.. ఏవీ మేయప్పన్. ఆయన శరవణన్ తండ్రి. మద్రాస్(నేటి చెన్నై) కేంద్రంగా ఈ బ్యానర్ తొలినాళ్లలో సరస్వతి సౌండ్ ప్రొడక్షన్స్గా..ఆ తర్వాత ప్రగతి పిక్చర్స్ లిమిటెడ్, ప్రగతి స్టూడియోస్.. మేయప్పన్( ఏవీ మేయ్యప్ప చెట్టియార్) తన భాగస్వాములతో కలిసి నడిపించారు. 1945లో AVM Productionsగా మారింది. అప్పటి నుంచి ఈ బ్యానర్లో ఎన్నో గొప్ప చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తండ్రి ఏవీ మేయప్పన్ తర్వాత శరవణన్ ఆ ప్రొడక్షన్ హౌజ్ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. వివిధ భాషల్లో 176 సినిమాలతో పాటు తెలుగు, తమిళ్, మలయాళంలో సీరియల్స్ను ఏవీఎం బ్యానర్లో నిర్మించారు. భూకైలాస్(1940), శివాజీ ది బాస్, మెరుపుకలలు, జెమినీ, లీడర్, సంసారం ఒక చదరంగం.. ఇలా ఎన్నో మరుపురాని హిట్స్ అందించారు. ఏవీఎం బ్యానర్లో వచ్చిన చివరి చిత్రం ఇదువుమ్ కదాందు పొగుమ్(2014). 2022లో అరుణ్ విజయ్ లీడ్ రోల్లో తమిళ్రాకర్స్ అనే వెబ్సిరీస్ కూడా నిర్మించారు. ఈయన కుమారుడు ఎమ్ఎస్ గుహాన్ కూడా నిర్మాతగా రాణిస్తున్నారు. శరవణన్ మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి. -
న్యాయ వ్యవస్థలో మార్పులు అవసరం
వేలూరు: దేశ వ్యాప్తంగా ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయ వ్యవస్థలో మార్పులు అవసరమని వీఐటీ యూనివర్సిటీ చాన్స్లర్ విశ్వనాథన్ అన్నారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలో సీనియర్ న్యాయవాది వీసీ రాజగోపాలాచారి వర్ధంతి కార్యక్రమం వీఐటీ చాన్సలర్ విశ్వనాథన్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతినిధులు వీసీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంజయ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా చాలా కోర్టుల్లో మౌలిక వసతులు లేవని, చాంబర్లు లేవన్నారు. కోర్టుకు వచ్చే ప్రజలకు విశ్రాంతి గదులు లేవన్నారు. దేశ వ్యాప్తంగా ఈ పద్ధతి మారాలన్నారు. వీఐటీ చాన్స్లర్ విశ్వనాథన్ మాట్లాడుతూ వీసీఆర్ వద్దకే వచ్చే కేసులకు ఎటువంటి రుసుము తీసుకోకుండా కేసులను వాదించి విజయం సాధించే వారన్నారు. పేద ప్రజల కేసుల పరిష్కారం కోసం ప్రభుత్వం, న్యాయమూర్తులు, న్యాయవాదుల సంఘాలు సంయుక్తంగా కలిసి కొత్త పద్ధతిని తీసుకు రావాలన్నారు. దేశ వ్యాప్తంగా న్యాయ వ్యవస్థ ముఖ్యమైనదని అయితే కేసులను త్వరగా పరిష్కరించడంలేదన్నారు. వీఐటీ ఉపాధ్యక్షులు, శేఖర్ విశ్వనాథన్, కార్యనిర్వహణ డైరెక్టర్ సంధ్యా పెంటారెడ్డి, సీనియర్ న్యాయవాదులు విజయరాఘవులు, సీనియర్ న్యాయవాదులు, వీసీఆర్ కుటుంబసభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
వదలని వాన
● కొనసాగుతున్న అల్పపీడనం ● చైన్నెకు సమీపంలో బలహీనపడి కేంద్రీకృతం ● నేడు కూడా వర్షాలకు అవకాశం ● చైన్నె, శివారు ప్రాంతాల్లో సహాయక చర్యలు జీవ రైల్వే స్టేషన్ వంతెన వద్ద నీళ్లు దిత్వా బలహీన పడినప్పటికీ చైన్నె, శివారు జిల్లాలో వర్షం కురుస్తూనే ఉంది. వాయుగుండంగా మారిన దిత్వా రూపంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షాలు కొనసాగాయి. ఆ తదుపరి తెరపించి తెరపించి వర్షం పడుతోంది. పుదుచ్చేరి – మహాబలిపురం మధ్యలోని మర్కనం వద్ద తీరాన్ని సమీపించిన దిత్వా, మళ్లీ చైన్నెకు సమీపంలో అల్పపీడనంగా బలహీన పడి తిష్ట వేసింది. ఈ ప్రభావంతో గురువారం కూడా వర్షాలు కొనసాగనున్నాయి. ఇక, వర్షాల ధాటికి జలమయమైన చైన్నె శివారులలోని ప్రాంతాలలో సహాయక చర్యలు విస్తృతం చేశారు. సాక్షి, చైన్నె: చైన్నెకు సమీపంలో బలహీన పడ్డ దిత్వా రెండు రోజులు తిష్ట వేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో చైన్నె, శివారులోని తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలో సంవృద్దిగానే వర్షాలు పడ్డాయి. చైన్నెకు నీరు అందించే రిజర్వాయర్లు అన్ని నిండు కుండలుగా మారడంతో ఉబరి నీటిని విడుదల చేస్తూ వస్తున్నారు. మంగళవారం దిత్వా మరింత బలహీన పడి దిశను మార్చుకుంది. బుధవారం వేకు జామున ఇది మహాబలిపురం – పుదుచ్చేరికి మధ్యలోని మరక్కానం వద్ద తీరాన్ని సమీపించింది. ఈప్రభావంతో రాత్రంతా చైన్నె, శివారు జిల్లాలో ఎడ తెరపి లేకుండా ఉరుములు మెరుపులతో వర్షం పడింది. బుధవారం ఉదయం నుంచి తెరపించి తెరపించి వర్షం పడుతూ వస్తున్నది. తీరాన్ని తాకినట్టుగా కనిపించిన దిత్వా మరింత బలహీన పడి. మళ్లీ చైన్నె తీరానికి సమీపంలో సముద్రంలో అల్పపీడనంగా తిష్ట వేసింది. ఇది గురువారం మరింత బలహీన పడనుంది. ఈ దృష్ట్యా, చైన్నె, శివారు జిల్లాలోనే కాదు, విల్లుపురం, తిరువారూర్, నాగపట్నం, శివగంగై జిల్లాలో అనేక చోట్ల వర్షాలు పడుతున్నాయి. వేలూరు, తిరువణ్ణామలైలో అక్కడక్కడా వర్షం పడింది. చైన్నె, శివారు జిల్లాల్లో బుధవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ఇచ్చేశారు. వీడని వాన చైన్నె, శివారులలో వర్షం వీడటం లేదు. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలలో నీరు చేరడంతో తొలగింపు పనులు వేగవంతం చేశారు. రెడ్హిల్స్, తిరుముల్లై వాయిల్ పరిసరాలో అనేక చోట్ల పడవల ద్వారా ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జలదిగ్బంధంలో చిక్కుకుని ఉన్న గృహాల నుంచి 25 మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. 24 వేల మంది శిబిరాలలో ఉన్నారు. వీరికి కావాల్సిన ఆహారం తదితర అన్ని రకాల సౌకర్యాలను అందిస్తున్నారు. చైన్నె ఓట్టేరిలో వర్షం దాటికి పురాతన భవనం పాక్షికంగా కూలింది. ఈ భవనానికి పక్కనే దుకాణంలో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. భారీ వర్షం పడ్డప్పటికీ చైన్నెలోని 22 సబ్వేలలో నేరు చేరకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. మాధవరం, తిరువొత్తియూరు మనలి, ఎన్నూరు పరిసరాలలో 50 వేల మందికి మూడు పూట్ల ఆహారం అందజేశారు. వర్షం కారణంగా ఇళ్లు , పరిసరాలలోకి చేరిన 1,127 పాములను కూడా రక్షించారు. అగ్నిమాపక సిబంది, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు విరోచితంగా శ్రమించడంతో అనేక చోట్ల నీళ్లు తొలగింది. శివారులలో కొన్ని చోట్ల నీటి తొలగింపు శ్రమగా మారింది.అత్యదికంగా ఎన్నూరులో 13 సెం.మీ విమ్కో నగర్లో 12 , మనలి 11 సెం.మీ వర్షం పడింది. మేడవాక్కం, పళ్లికర ణైలలో 10 సెం.మీ వర్షం పడింది. -
క్లుప్తంగా
విద్యుత్షాక్కు గురై ఇద్దరి మృతి అన్నానగర్: విద్యుత్షాక్కు గురై ఇద్దరు మృతిచెందారు. ఈఘటన మదురై జిల్లాలోని వాడిపట్టి సమీపంలోని ఒక టీ దుకాణంలో బుధవారం చోటుచేసుకుంది. మదురై జిల్లాలోని వాడిపాటి సమీపంలో దిండిగల్–మదురై హైవేపై ఉన్న ఆండిపట్టి బంగళా వద్ద సోమసుందరం ఒక ఫుడ్స్టాల్, టీ స్టాల్ నడుపుతున్నాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బుధవారం ఉదయం దుకాణంలో అలంకరణ కోసం వేలాడదీసిన సీరియల్ లైట్ల నుంచి టీ షాప్లోకి విద్యుత్ ప్రసరించడంతో దుకాణంలో టీ మాస్టర్ బాలగురు (50) విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. ఇది చూసిన దుకాణ యజమాని కుమారుడు రంజిత్కుమార్ (35) బాలగురును కాపాడేందుకు ప్రయత్నించాడు. విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మృతదేహాలను పోలీసులు శవపరీక్ష కోసం వాడిపట్టి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైలు పట్టాలపై అదృశ్యమైన నర్సింగ్ విద్యార్థిని అన్నానగర్: తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలోని గణేష్ నగర్కు చెందిన శంకర్ కుమార్తె రమ్య (18). ఈమె మధురైలోని ఒక నర్సింగ్ కళాశాలలో చదువుతోంది. సెలవుల కోసం గ్రామానికి వచ్చిన రమ్య మంగళవారం ఉదయం జిరాక్స్ తీసుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. తర్వాత ఆమె తిరిగి రాకపోవడంతో, ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం పలు చోట్ల వెతికినా ఆమె జాడ తెలియలేదు. మంగళవారం సాయంత్రం ఇనామ్ మణి యాచ్చి కృష్ణనగర్ రైల్వే టన్నెల్ వంతెన సమీపంలోని పట్టాలపై ఒక మహిళ మృతదేహం పడి ఉందని రైల్వే పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేయగా మృతదేహం రమ్య అని తేలింది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం కోవిల్పట్టి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు బస్సులు ఢీ –10 మందికి గాయాలు పళ్లిపట్టు: ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేట డిపోకు చెందిన బస్సు బుధవారం ఉదయం పొదటూరుపేట బస్టాండులో ప్రయాణికులను దింపి డిపోకు వెళ్లింది. అదే సమయంలో తిరువణ్ణామలై దీపోత్సవానికి వెళ్లేందుకు పొదటూరుపేట బస్టాండులో వేచివున్న భక్తుల కోసం వెళుతున్న స్పెషల్ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. స్పెషల్ బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులతోపాటు పది మందికి గాయాలైయ్యాయి. గాయపడ్డ వారందరిని పొదటూరుపేట ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పొదటూరుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి హత్య అన్నానగర్: హొసూర్లో బుధవారం తెల్లవారుజామున బైక్లో వెళుతున్న యువకుడిని దుండగులు నరికి దారుణంగా చంపారు. కృష్ణగిరి జిల్లా హొసూరు మారుతినగర్లో గుర్తు తెలియని వ్యక్తి నరికిన స్థితిలో మృతిచెంది ఉన్నట్లుగా బుధవారం ఉదయం హొసూర్ హట్కో పోలీస్స్టేషన్కు సమాచారం అందింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో మృతుడు హొసూరులోని అవలపల్లి ప్రాంతం, మరసంద్రం గ్రామానికి చెందిన నారైయనప్ప కుమారుడు హరీష్ (32) అని తెలిసింది. ఇతను బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మారుతినగర్లో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, పాతకక్షల కారణంగా దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అమ్మవారి ఆలయంలో చోరీ తిరువళ్లూరు: అమ్మవారి ఆలయ తలుపులు పగులగొట్టి దుండగులు హుండీలోని రూ.లక్ష నగదు, అమ్మవారి ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన తిరువళ్లూరులో కలకలం రేపింది. తిరువళ్లూరులోని పెరియకుప్పంలో మూంగాత్తమ్మన్ ఆలయం వుంది. రాష్ట్ర దేవదాయశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయ హుండీని మూడు నెలలకు ఒకసారి తెరిచి కానుకలను లెక్కిస్తారు. ఆలయ పూజారి శివకుమార్ మంగళవారం రాత్రి 8 గంటలకు యథావిధిగా ఆలయాన్ని మూసివేసి ఇంటికి వెళ్లారు. బుధవారం ఉదయం 5 గంటలకు ఆలయం తెరిచేందుకు రాగా, అప్పటికే హుండీ తాళాలు పగులగొట్టి ఉండడం చూసి షాక్కు గురయ్యాడు. ఆలయం లోపలికి వెళ్లి చూడగా హుండీలోని నగదు, అమ్మవారి నగలు మాయమైనట్టు గుర్తించి టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విజయ్ పుదుచ్చేరి పర్యటన రద్దు
సాక్షి, చైన్నె : రోడ్ షోకు అనుమతి ఇవ్వక పోవడంతో పాటూ వర్షాల నేపథ్యంలో తన పుదుచ్చేరి పర్యటనను టీవీకే నేత విజయ్ రద్దు చేసుకున్నారు. అదే సమయంలో త్వరలో సరికొత్త రాజకీయ వ్యూహంతో పుదుచ్చేరిలో విజయ్ అడుగు పెట్టబోతున్నట్టు చర్చ ఊపందుకుంది. వివరాలు.. రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తొలి సారిగా పుదుచ్చేరిలో ఈనెల 5 వ తేదీన పర్యటించేందుకు విజయ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. భారీ ర్యాలీ, రోడ్ షో ద్వారా బహిరంగ సభకు నిర్ణయించారు. అయితే ర్యాలీ, రోడ్ షోకు అనుమతి అన్నది ఇవ్వలేదు. కేవలం బహిరంగ సభకు మాత్రమే అనుమతి ఇచ్చారు.అదే సమయంలో పుదుచ్చేరిలోను వర్షాలు పడుతుండటంతో తన పర్యటనను విజయ్ వాయిదా వేసుకున్నారు. అదే సమయంలో పుదుచ్చేరి సీఎం రంగ స్వామితో టీవీకే ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ బుధవారం భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. కొత్త చర్చ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్– బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. సీఎంగా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి ఉన్నారు. అధికారంలో బీజేపీకి వాటా సైతం ఇచ్చారు. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల రూపంలో రంగస్వామికి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు. అలాగే, అనేక పథకాలు అమలుకు నోచుకోక పోవడంతో తీవ్ర మనస్థాపంతో పదవిలో కొనసాగుతున్నట్టుగా గతంలో చర్చ సాగింది. తాజాగా విజయ్ రాజకీయ ప్రయాణం పుదుచ్చేరిలోనూ మొదలు కానున్నడంతో ఈ సారి ఎన్నికలలో బీజేపీని పక్కన పెట్టే వ్యూహంతో రంగస్వామి ఉన్నట్టు చర్చ ఊపందుకుంది. విజయ్తో తనకు ఉన్న సన్నిహిత సంబంధంతో టీవీకేతో కలిసి 2026 ఎన్నికలను ఎదుర్కొనేందుకు రంగన్న వ్యూహాలకు పదును పెట్టినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా భుస్సీ ఆనంద్ను తనను కలిసేందుకు రంగస్వామి అనుమతి ఇచ్చినట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ రూపంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న రంగస్వామి తాజాగా రూటు మార్చడం ఖాయం అని పేర్కొంటున్నారు. త్వరలో విజయ్తో ఆయన సంప్రదింపులు జరపవచ్చు అని, ఈసారి విజయ్ పర్యటన ఎవ్వరూ ఊహించిన రాజకీయ పరిణామాలతో పుదుచ్చేరిలో సాగవచ్చు అన్న చర్చ జోరందుకుంది. -
స్టార్టప్ హబ్గా ఐఐటీ మద్రాసు ఇంక్యుబేషన్ సెల్
– 500 స్టార్టప్ మైలురాయిని దాటి గుర్తింపు కొరుక్కుపేట: దేశంలో అతిపెద్ద డీప్ –టెక్ స్టార్టప్ హబ్గా అవతరిస్తున్న ఐఐటీమద్రాసు ఇంక్యుబేషన్ సెల్ 500 స్టార్టప్ మైలురాయిని దాటింది. ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మాట్లాడారు. స్టార్టప్ నిర్మాణం, స్థాయిని వేగవంతం చేయడానికి ఐఐటీ మద్రాసు నోడల్ ఏజెన్సీ ,ఐఐటి మద్రాసు ఇంక్యుబేషన్ సెల్ (ఐఐటీఎంఐసీ) 12 ఏళ్ల క్రితం ప్రారంభమైందన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 500కి పైగా డీప్ –టెక్ స్టార్టప్లను ఇంక్యుబేట్ చేయడం నిజంగా గొప్ప విషయం అన్నారు. ప్రధానమంత్రి ఊహించిన విధంగా వికసిత్ భారత్ 2047 నాటికి పరిణతి చెందిన స్టార్టప్గా దేశం నిలుస్తుందన్నారు. ఐఐటీ మద్రాసు ఇంక్యుబేషన్ సెల్ ఆ ధృఢమైన ప్రగతి శీల అడుగు వేసిందని గట్టి నమ్ముతున్నామని తెలిపారు. ఐఐటీఎం ఐసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న తమస్వతి ఘోష్ మాట్లాడుతూ ఐఐటీఎంఐసీ ప్రస్తుతం సంవత్సరానికి 100కి పైగా కొత్త స్టార్టప్లను ఇంక్యుబేట్ చేస్తుందని తెలిపారు. ఢిల్లీకి పన్నీరు – అమిత్ షాతో భేటీ? సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీరు సెల్వం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఎన్నికల కమిషన్ను సంప్రదించేందుకు వెళ్లినట్టుగా ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో భేటీ నిమిత్తం వెళ్లినట్టు చర్చ జరుగుతోంది. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించ బడ్డ పన్నీరు సెల్వం ఈనెల 15వ తేదీ వరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి గడువు ఇచ్చారు. అంతలోపు నిర్ణయం తీసుకోని పక్షంలో తదుపరి అడుగుల దిశగా ఆయన ముందుకెళ్తున్నారు. ఈ పరిస్థితులలో పన్నీరు సెల్వం ఢిల్లీ వెళ్లడం చర్చకు దారి తీసింది. ఆయన అన్నాడీఎంకే వ్యవహారాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసేందుకు వెళ్లినట్టుగా మద్దతు దారులు పేర్కొంటున్నారు. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి వచ్చిన పిలుపుతోనే ఆయన ఢిల్లీ వెళ్లినట్టు చర్చ జరుగుతోంది. అమిత్ షా ఇచ్చే అభయం మేరకు తదుపరి అడుగుల దిశగా పన్నీరు ముందుకు వెళ్లబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, తమిళనాట అన్నాడీఎంకే – బీజేపీ కూటమిని బలోపేతం చేసే విధంగా అనేక పార్టీలతో చర్చలు జరిపి, వ్యూహాలకు పదును పెట్టే దిశగా బీజేపీ అధిష్టానం ఉత్తరాదికి చెందిన నేత విజయంత్పాండాను రంగంలోకి దించేందుకు నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. వీఐటీ చైన్నెలో గుండె పనితీరును గుర్తించే ’చిప్’ రూపకల్పన – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంస కొరుక్కుపేట: వీఐటీ చైన్నె సెంటర్ ఫర్ నానోఎలక్ట్రానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ డిజైన్ బృందం మిశ్రమ –సిగ్నల్ రీడౌట్ ఇంటర్ఫేస్ (ఆర్ఓఐ) చిప్ను విజయవంతంగా రూపొందించి అభివద్ధి చేసింది. ఎంఈఎంఎస్ సెన్సార్ల ద్వారా వినియోగదారు హృదయ స్పందన రేటు, రక్తపోటు ఇతర కార్యకలాపాలను సమర్థంగా గుర్తించడానికి రూపొందించారు. చిప్ తయారు చేసిన తర్వాత, ఇటీవల మొ హాలిలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొని వీఐటీ–చైన్నె బృందానికి ప్రశంసలు తెలియజేశారు. దీనికి సంబంధించి, వీఐటీ ఉపాధ్య క్షుడు డాక్టర్ జి.వి. సెల్వం మాట్లాడుతూ, సామాజిక ప్రయోజనాల ఆధారంగా పరిశోధన లు జరుగుతున్నాయి. దాని ప్రధాన భాగంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఆ విష్కరణలను చేయడానికి కలిసి పనిచేస్తున్నారన్నారు. వైద్య రంగానికి అన్వయించగల పరిశోధ నలపై వీఐటీ చైన్నె దృష్టి పెరగడం వల్లే ప్రత్యేకమైన చిప్ విజయం సాధించిందని వీఐటీ చైన్నె ప్రో వైస్–చాన్స్లర్ త్యాగరాజ న్ అన్నారు. డీఎంకే పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయి కొరుక్కుపేట: డీఎంకే పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆరోపించారు. కళ్లకురిచ్చి కన్సర్ట్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి స్టాలిన్ వేదికపై చిరునవ్వుతో మాత్రమే మాట్లాడతారు. ఆయన తంజావూరులోని పొలాల్లో నడుస్తారు. కానీ రైతులకు చెరకు, పసుపు ధరలను ఆయన పెంచలేదు. అదేవిధంగా, వ్యవసాయం కోసం ఒక మండలిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఆ మండలిని ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రి స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్న్ను ముఖ్యమంత్రిగా చేయాలని పార్టీని బలోపేతం చేశారు. డీఎంకే పాలనలో గంజాయి అమ్మకాలు పెరిగాయి. శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నియంత్రణలో పోలీసు శాఖ లేదన్నారు. 20 సంవత్సరాలకు ఒకసారి ఓటర్ల జాబితాను సవరించడం ఆనవాయితీ అని అన్నారు. ఈ మేరకే ప్రస్తుతం ఎస్ఐఆర్ జరుగుతోందన్నారు. -
అంగమ్మాల్ అవార్డుల కోసం తీయలేదు!
తమిళసినిమా: యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రాల్లో వాస్తవికత ఉట్టిపడుతుంది. అదే విధంగా నటీనటుల నటనకు పదును పెడతాయి. అలాంటి యథార్థ సంఘటనలతో తెరకెక్కిన తాజా చిత్రం అంగమ్మాల్. తమిళనాడులోని ఒక గ్రామానికి చెందిన కుటుంబ నేపథ్యం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రంలో టైటిల్ పాత్రను గీత కై లాసం పోషించారు. ఇతర ముఖ్య పాత్రల్లో శరణ్ శక్తి, నాడోడిగళ్ భరణి, తెండ్రల్, యశ్విన్, ముల్లైయరసీ, సుధాకర్ ముఖ్యపాత్రలు పోషించారు. విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మూలకథను రచయిత పెరుమాళ్ మురుగన్ అందించారు. ఫ్రేమ్స్ రహీం, అంజాయ్ సామువేల్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఐంజాయ్ సామువేల్ చాయాగ్రహణం, ముహమ్మదు మక్బూల్ మన్సూర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంస్థ అధినేత కార్తికేయన్. ఎస్ మాట్లాడుతూ పలు భారీ చిత్రాలను నిర్మిస్తున్న తమ సంస్థ మంచి కంటెంట్తో కూడిన వైవిధ్య భరిత కథా చిత్రాలను, ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతికవర్గాన్ని ప్రోత్సహించే విధంగా ఈ అంగామ్మాళ్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కాగా ఇది అవార్డుల కోసం రూపొందించిన చిత్రమా అని అడుగుతున్నారని, నిజానికి అవార్డుల కోసం సినిమాలు తీయరని, మంచి, కథ, కథనాలతో కూడిన చిత్రాలకు అవార్డులు వరిస్తే సంతోషం అన్నారు. -
క్రీడలపై ఆసక్తి చూపాలి
తిరువళ్లూరు: విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి చూపాలని ఆవడి కమిషనర్ కె.శంకర్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి పోలీసు కమిషనరేట్లోని ట్యాంక్ ఫ్యాక్టరీ పోలీస్స్టేషన్ పరిధిలోని విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బాల, బాలికల ఫోరం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.హెచ్సీఎల్ టెక్నాలజీ అనుబంధ సంస్థ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ నిధుల సాయంతో గ్రౌండ్ఫ్లోర్లో గ్రంథాలయం, మొదటి అంతస్తులో క్రీడా పరికరాలతో కూడిన మినీజిమ్ను ఏర్పాటు చేశారు. వీటిని ప్రారంభించిన అనంతరం కమిషనర్ శంకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు సెల్ఫోన్, టీవీలకు బానిస కాకుండా క్రీడలపై ఆసక్తి చూపాలని కోరారు. క్రీడల వల్ల ఆరోగ్యం, ఏకాగ్రత పెరిగి చెడు అలవాట్లకు దూరంగా వుండొచ్చన్నారు. క్రీడల కోటాలో ప్రభుత్వం ఉద్యోగం కూడా సాధించవచ్చన్నారు. ఆవడి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లలో బాల, బాలికల ఫోరం తరఫున క్లబ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆవడి డిప్యూటీ కమిషనర్ ఫిరోజ్ఖాన్ అబ్దుల్లా, హెచ్సీఎల్ టెక్నాలజీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ జీకే కృష్ణ, జాతీయ హాకి క్రీడాకారిణి ఇస్సాబెల్లా, హోప్ ఫౌండేషన్ రీజినల్ డైరెక్టర్ మలర్విళి పాల్గొన్నారు. -
5న తెరపైకి అఖండ–2
తమిళసినిమా: బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం అఖండ తాండవం–2. ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది.ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను, వైజీ.మహేంద్ర, విజీ, సహ నిర్మాత కోటి పాల్గొన్నారు. ఇది సినిమా కాదు భారత దేశం ఆత్మ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ తాను పుట్టి పెరిగింది చైన్నెలోనేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వేర్వేరు కాదని మనది సహోదర బంధం అని తెలిపారు. మద్రాసు తన జన్మ భూమి అని, తెలంగాణ తన కర్మభూమి అని, ఆంధ్రా తన ఆత్మ భూమి అని తెలిపారు. ఎన్టీఆర్ గురువు, దైవం అన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పటి వరకు నటించిన మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయన్నారు. అఖండ–2 4వ చిత్రం అన్నారు. ఈ చిత్ర కథ గురించి ఒక్క రోజే చర్చించినట్లు చెప్పారు. ఇది హిందూ సనాతన ధర్మాన్ని భవిష్యత్ తరానికి తీసుకెళ్లే కథా చిత్రం అని పేర్కొన్నారు.ఈ చిత్రం షూటింగ్ను 130 రోజుల్లో పూర్తి చేసినట్లు బాలకృష్ణ చెప్పారు. -
తిరుప్పరకుండ్రంలో కార్తీకదీపం హైటెన్షన్
సాక్షి, చైన్నె : మదురై జిల్లా తిరుప్పర కుండ్రంలోని మురుగన్ సన్నిధిలో కార్తీక దీపం వెలిగించే వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. హిందూ సంఘాలు, బీజేపీ వర్గాల ఆందోళనతో హైటెన్షన్ నెలకొనడంతో పెద్ద ఎత్తున బలగాలను మొహరింపజేశారు. వివరాలు.. మురుగన్కు రాష్ట్రంలో ఉన్న ఆరుపడై వీడులలో ఒకటిగా తిరుప్పర కుండ్రం ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ పది రోజుల పాటూ కార్తీక బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. రాష్ట్రం నలమూలల నుంచే కాకుండా, పుదుచ్చేరి, కేరళ , కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఈ ఉత్సవాలలో భాగంగా తిరుప్పర కుండ్రం కొండపై ఉన్న స్తూపంపై కార్తీక దీపం వెలిగింపు వ్యవహారం అన్నది అనాదిగా వివాదాలతో వాయిదా పడుతూ వచ్చింది. సుమారు 30 సంవత్సరాలుగా ఈ వివాదం సాగుతోంది. స్తూపం వద్ద కాకుండా ఉచ్చి పిళ్లయార్ ఆలయం వద్ద దీపం వెలగించడం జరుగుతోంది. అయితే ఉచ్చి పిళ్లయార్ ఆలయం వద్ద వెలిగించే దీపం మోక్ష దీపం, అని ఇది కార్తీక దీపం కాదంటూ హిందూ సంఘాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రత్యేక కమిటీని సైతం రంగంలోకి దించారు. వ్యవహారం కోర్టులో సైతం విచారణలో ఉంది. మధురై ధర్మాసనం ఈ ఏడాది ప్రధాన స్తూపంలో దీపం వెలిగించేందుకు ఆదేశించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఆలయం తరపున అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. తీవ్ర ఉద్రిక్తత తాము కోర్టులో దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ విచారణకు వస్తుందని ఆలయ అధికారులు ఎదురు చూశారు. అయితే రాలేదు. అదే సమయంలో స్తూపం వద్ద దీపం వెలిగించాలంటూ బుధవారం సాయంత్రం వందలాదిగా హిందూ సంఘాలు, బీజేపీ వర్గాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కంద షష్టి పారాయణాలు చేశారు. అయితే దీపం ప్రధాన స్తూపం వద్ద వెలిగించక పోవడం వివాదానికి దారి తీసింది. దీంతో కొండపైకి వెళ్లి దీపం వెలిగించేందుకు హిందూ సంఘాలు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఓపోలీసు గాయ పడటంతో పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దిగాయి. కొండపైకి వెళ్లిన వారందర్నీ బలవంతంగా కిందకు తీసుకొచ్చారు. వ్యవహారం ముదరడంతో పోలీసు ఉన్నతాధికారులు అంతా తిరుప్పకుండ్రంలో తిష్ట వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదే సమయంలో తిరుప్పకుండ్రంలో 144 సెక్షన్ అమలు చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తిరుప్పర కుండ్ర నుంచి తమిళనాడుల మత కల్లోలం సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని డీఎంకే కూటమి పార్టీలు తీవ్రస్థాయిలో ఆరోపించాయి. -
మద్రాసు ఆర్ట్ ఉత్సవానికి శ్రీకారం
సాక్షి, చైన్నె: మద్రాసు ఆర్ట్ వీకెండ్ సాంస్కృతిక ఉత్సవాలు చైన్నెలో బుధవారం ప్రారంభమయ్యాయి. నుంగంబాక్కం తాజ్ కోరమండల్ వేదికగా ఐటీశాఖ మంత్రి పళణి వేల్ త్యాగరాజన్, సినీ దర్శకుడు మణిరత్నం ఈ ఉత్సవాలను ప్రారంభించారు. దక్షిణాది నుంచి సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించడం, కళలు, సంస్కృతిని చాటే విధంగా ఉత్సవం జరగనున్నది. ఈ ఏడాది మద్రాసు గతాన్ని గుర్తు చేస్తూ, అనే అంశంతో సాంస్కృతిక ఉత్సవాలు ఈ నెల 6వ తేదీ వరకు జరగనన్నాయి. వారసత్వ మైలురాళ్లను తిరిగి కళ్లకు కట్టే విధంగా కళాకారులు, వాస్తు శిల్పులు, డిజైన్లను కొలువు దీర్చారు. అలాగే, చరిత్రను రీమిక్స్ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని మద్రాసు ఆర్ట్ వీకెండ్ సంస్థ వ్యవస్థాపకురాలు ఉపాసన అస్రానీ తెలిపారు. చైన్నె గురించి అవగాహనను ప్రేరేపించే విధగా కథలు, సృజనాత్మక అంశాలు, ఆర్ట్, క్రాఫ్ట్, డిజైన్ ప్రదర్శనకు చర్యలు తీసుకున్నామని వివరించారు. దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ, సాంస్కృతిక సంభాషణనుమరింత విస్తరించడం, అసాధారణమైన సృజనాత్మక ప్రతిభను వెలుగులోకి తీసుకు రావడం స్ఫూర్తిదాయంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో చైన్నెలోని యూఎస్ కాన్సుల్ జనరల్ క్రిష్టోఫర్ హేడ్జెస్, సామాజిక వ్యవస్థాకుడు వైద్యనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
మహా దీపోత్సవం
కమనీయం..మహాకొండపై దేదీప్యమానంగా వెలుగుతున్న కార్తీక మహా దీపంపంచమూర్తుల దర్శనం ఆలయం ఎదుట వెలిగించిన దీపం తిరువణ్ణామలై అన్నామలైయార్ కొండపై బుధవారం సాయంత్రం మహాదీపం దేదీప్యమానంగా ప్రకాశించింది. అగ్ని రూపంలో ఉన్న ముక్కంటిగా భావించే ఈ దీపాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకుని తరించారు. హరోంహరా అంటూ తన్మయత్వం చెందారు. వేలూరు: తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం భరణి దీపం, సాయంత్రం కార్తీక మహా దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 40 లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చారు. దీంతో వేకువ జామున 2 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణ నిర్వహించారు. వజ్ర కిరీటం, బంగారు కవచంతో స్వామిని అలంకరించారు. 4 గంటలకు శివాచార్యులు మేళ తాళాలు వేద మంత్రాల నడుమ పంచ బూత స్థలాలలో ఆలయ ప్రధాన అర్చకులు భరణి దీపాన్ని వెలిగించారు. అనంతరం భక్తులను దర్శించుకోవడానికి అనుమతించారు. భక్తులకు స్వామి వారి అలంకరణ చూపించిన అనంతరం అమ్మన్ సన్నిధి, వినాయకర్ సన్నిధిలో దీపాలు వెలిగించారు. ఆపై భరణి దీపాన్ని కాల భైరవ స్వామి సన్నదిలో భక్తుల దర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా భక్తులు హరోంహరా.. అంటూ నామస్మరణ చేసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆలయం కింద ఆలయ అఽధికారులచే టపాకాయలు పేల్చిన సమయంలో ఆలయం వెనుక వైపునున్న 2,668 అడుగుల ఎత్తుగల కొండపై ఐదు అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు, మొత్తం 200 కిలోల బరువైన మహా దీప కొప్పరిలో 1,500 మీటర్ల గాడా గుడ్డ, 4500 కిలోల నెయ్యి, 20 కిలోల కర్పూరాన్ని ఉంచారు. సాయంత్రం 6 గంటలకు సంవత్సరానికి ఒక రోజు మాత్రమే భక్తులకు దర్శనం ఇచ్చే అర్థ నారేశ్వరుడు బయటకు వచ్చిన సమయంలో ఆలయం ముందు బాగం టపాకాయలు పేల్చి దీపాన్ని వెలిగించారు. వీటిని చూసిన వెంటనే మహా దీపం కొండపై శివాచార్యుల వేద మంత్రాలు, మేళ తాళాల నడుమ పారంపర్య వంశస్థులు కొండపై ఉన్న కొప్పరి వద్ద శంఖాన్ని ఊది అరుణాచలేశ్వరునికి హరోంహరా అంటూ నామస్మరణం చేసిన తర్వాత శివాచార్యులు మహాదీపాన్ని వెలిగించారు. ఈ దీపం కొండంత వెలుగు వెలగడంతో వీటిని భక్తులు చూసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ దీపం దర్శనార్థమై తమిళనాడు నుంచే కాకుండా ఆంధ్ర, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, మహారాష్ట్ర సహా దేశ విదేశాల నుంచి ఇటలీ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దీపోత్సవాన్ని తిలకించారు. భక్తులు ఉదయం నుంచే ఉపవాసం ఉండి సాయంత్రం 6గంటలకు దీపాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఇళ్లలో దీపాలను వెలిగించి స్వామి వారికి మొక్కులు తీర్చుకొని ఉపవాస దీక్షను విరమించారు. ఈ మహా దీపోత్సవం సందర్బంగా భక్తులకు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, ట్రస్ట్లు, ఆలయ నిర్వాహకులు, రాజకీయ నాయకులు గిరివలయం రోడ్డులోను, ఆలయ సమీపంలోను తాగునీరు అందజేశారు. బందోబస్తును పరిశీలించిన డీఐజీ ధర్మరాజన్ దీపోత్సవానికి సుమారు 45 లక్షల మంది భక్తులు పాల్గొననున్నారని 50 ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎక్కడా చోరీలు, ప్రమాదాలు జరగకుండా అదుపు చేసేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లను ఆలయం గది నుంచే పరిశీలించారు. అదే విధంగా కొండ చుట్టూ జరిగే ఘటనలను నిఘా ఉంచేందుకు రెండు మానవ రహిత మినీ విమానంలో కెమెరాలను ఉంచి ప్రత్యేక నిఘా ఉంచారు. దీపోత్సవానికి ఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో ఏడుగురు డీఐజీలు, 19 మంది ఎస్పీలు, కమోండో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు మొత్తం 15వేల మందితో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అదే విధంగా 64 ప్రాంతాల్లో తాత్కాలిక పోలీస్ కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచారు. భక్తులకు 5,484 ప్రత్యేక బస్సులు, 16 రైలు ఏర్పాటు దీపోత్సవానికి చైన్నె, విల్లుపురం, వేలూరు, గుడియాత్తం, బెంగుళూరు, సేలం, కోవై, మదురై, తిరిచ్చి, పుదుచ్చేరి, కాంచిపురం వంటి ప్రాంతాలను నుంచి ప్రత్యేక బస్సులను నడపారు. ప్రత్యేక బస్సులు నడిపినా భక్తులను అదుపు చేయలేక ట్రాన్స్పోర్టు అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. అదే విధంగా చైన్నె, విల్లుపురం, పుదుచ్చేరి నుంచి ప్రత్యేక రైలు ద్వారా భక్తులు అధిక సంఖ్యలో తిరువణ్ణామలైకి చేరుకున్నారు. కార్తీక దీపోత్సవ వేళ మాత్రమే దర్శనం ఇచ్చే అర్థ నారీశ్వరుడు పంచదీపాల్లో నెయ్యి వేస్తున్న ఏపీ మాజీ మంత్రి రోజా, తమిళనాడు మంత్రి శేఖర్బాబు గిరివలయం రోడ్డులో కిటకిట మహా దీపోత్సవానికి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో గిరివలయం రోడ్డులో చేరుకున్నారు. బుధవారం ఉదయం నుంచి భక్తులు గిరివలయంలోని 14 కిలోమీటర్ల దూరం కొండను చుట్టి వచ్చి దీపోత్సవాన్ని దర్శించుకున్నారు. దీంతో 14 కిలోమీటర్ల దూరం భక్తులతో కిటకిటలాడింది. గిరివలయం రోడ్డులో వివిధ రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిదులు భక్తులకు స్వామి వారి ప్రసాదాలను అందజేయడంతో పాటూ అన్నదానం చేశారు. తిరువణ్ణామలైలో ఎటు చూసినా భక్త జనమే, ఎక్కడా విన్నా హరోంహరా నామస్మరణే వినిపించింది. భక్తుల హరోంహార నామ స్మరణాలతో తిరువణ్ణామలై పట్టణం పులకింపజేసింది. ఇదిలా ఉండగా ఈనెల పౌర్ణమి 4న ఉదయం 7.58 గంటల నుంచి 5వ తేదీన ఉదయం 5.37 గంటలకు ముగియడంతో ఆ సమయంలో భక్తులు గిరివలయం వెల్లవచ్చునని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. భరణి దీపంలో ప్రముఖులు బుధవారం ఉదయం అరుణాచలేశ్వరాలయంలో జరిగిన భరణి దీపంలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, కలెక్టర్ తర్పగరాజ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి, ఐజీ అశ్రా కర్క్, డీఐజీ ధర్మరాజన్, ఎస్పీ సుధాకర్ , ఆలయ జేసీ భరణీధరన్, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీధరన్, ప్రజా ప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. -
విద్యుత్షాక్తో కార్మికుడి మృతి
తిరువళ్లూరు: వరిపొట్టును లోడింగ్ చేస్తున్న సమయంలో కన్వేయర్ బెల్టు వద్ద విద్యుత్షాక్కు గురై ఓ కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వెంగల్ చిత్తంబాక్కంలో గ్రామంలో గోవిందస్వామికి చెందిన శఽరవణ నూతన రైస్మిల్ ఉంది. ఈక్రమంలో తిరువళ్లూరు, సెంగుడ్రం, పాండియనల్లూరు తదితర రైస్మిల్ నుంచి వరి పొట్టును సేకరించి వాటిని పశుధాణాలకు ఉపయోగించే వ్యాపారాన్ని సురేంద్రరెడ్డి అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగానే పాడియనల్లూరు గ్రామానికి చెందిన సతీష్తో సహా సుమారు 10 మంది కార్మికులు వరి పొట్టును మిషన్ ద్వారా లోడింగ్ చేసే పనులను చేస్తున్న సమయంలో కన్వేయర్ బెల్టులో నుంచి విద్యుత్ సర్క్యూట్ కావడంతో షాక్కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకుని ఘటన స్థలానికి వచ్చిన వెంగల్ పోలీసులు, మృతదేహాన్ని కై వసం చేసుకుని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. -
మహాదీప దర్శనానికి పోటెత్తిన భక్తజనం
తిరుత్తణిలో.. తిరుత్తణి: తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా పచ్చిబియ్యం కొండపై 500 అడుగుల ఎత్తులో మహాదీపాన్ని హారంహర నామస్మరణతో భక్తులు దర్శించారు. తిరుత్తణి ఆలయంలో కార్తీకమాసం కృత్తిక సందర్భంగా బుధవారం ఉదయం మూలవర్లకు విశేష అభిషేక పూజలు నిర్వహించి బంగారు కవచంతో అలంకరించారు. కావడి మండపంలో శ్రీవళ్లి, దేవసేన సమేత ఉత్సవర్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు చేపట్టారు. కార్తీక దీపం సందర్భంగా తమిళనాడు, ఆంధ్రాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కొండ ఆలయంకు పోటెత్తారు. రూ. 100 క్యూలో 2 గంటలు, సర్వ దర్శనం మార్గంలో మూడు గంటల పాటు వేచివుండి స్వామి దర్శించుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో కొండ ఆలయ మాడ వీధులు కిటకిటలాడాయి. ముందుగా ఉత్సవర్లు వెండి నెమలి వాహనంలో మాడ వీధిలో కొలువుదీరగా, తాటిచెట్టుపై ఆలయ ప్రదాన అర్చకులు నెయ్యి దీపం వెలిగించగా ఆలయంకు పశ్చిమ దిశలోని పచ్చిబియ్యం కొండపై 500 అడుగుల ఎత్తులో 150 కేజీల నెయ్యితో మహాదీపం వెలిగించారు. ఈ సందర్భంగా మహాదీప దర్శనంను హారంహర నామస్మరణతో భక్తులు తిలకించి స్వామిని దర్శించి పరవశం చెందారు. కార్తీక దీపం వేడుకల ఏర్పాట్లను ఆలయ జాయింట్ కమిషనర్ రమణి, ఆలయ చైర్మన్ శ్రీధరన్ సహా పాలక మండలి సభ్యులు చేపట్టారు. రెండు గంటల పాటు ఆలయం మూసివేత కార్తీక దీపోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు క్యూలో వేచివున్న క్రమంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు గంటల పాటు స్వామికి అభిషేక పూజల కోసం భక్తులకు దర్శన భాగ్యం రద్దు చేశారు. ముందస్తు సమాచారం లేకుండా ఆలయం రెండు గంటల పాటు మూసివేయడంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెండి నెమలి వాహనంలో కనువిందుచేస్తున్న శ్రీవళ్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, కొండ ఆలయంలో తాటిచెట్టుపై నెయ్యి దీపం వెలిగిస్తున్న ఆలయ అర్చకులు -
కరుణ కాదు.. హక్కులే ముఖ్యం
సీఎం స్టాలిన్ సాక్షి,చైన్నె : దివ్యాంగులపై కరుణ చూపించడం కాదని, వారి హక్కులు సక్రమంగా కల్పించ బడుతున్నాయా..? అన్నదే ముఖ్యం అని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఉత్తమ సేవకులకు అవార్డు, సంక్షేమ పథకాలతో దివ్యాంగుల దినోత్సవ వేడుక బుధవారం వళ్లువర్ కోట్టం వేదికగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దివ్యాంగుల దినోత్సవ 2025 పోటో ఎగ్జిభిషన్ను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు, మోటారు సైకిళ్లతో పాటూ వివిధ సంక్షేమ పథకాలను అందజేశారు. అలాగే ఉత్తమ సేవలను అందిస్తున్న సంస్థలు, దివ్యాంగులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈసందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, దివ్యాంగులకు తాము ఎల్లప్పుడు మద్దతుగానే ఉంటామని వివరించారు. కలైంజ్ఞర్ మార్గంలోనే.. కలైంజ్ఞర్ కరుణానిధి చూపిన మార్గంలో ద్రావిడ మోడల్ ప్రభుత్వం వారి హక్కులు సాధన, వారికి కావాల్సిన అన్ని రకాల సంక్షేమ పథకాలను దరిచేర్చడంలో ముందున్నట్టు పేర్కొన్నారు. గత పది సంవత్సరాలుగా వళ్లువర్ కోట్టంను నిర్వీర్యం చేశారని గుర్తుచేస్తూ, తాజాగా తాము అభివృద్ధి చేశామని తెలిపారు. పనరుద్దరణ తదుపరి ఇక్కడ దివ్యాంగుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తొలిసారిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయనంతగా పథకాలను విస్తృతం చేశామని పేర్కొంటూ దివ్యాంగులకు స్థానిక సంస్థలలో నామినేటెడ్ కోటా సీట్లకు గాను రిజర్వేషన్ను కల్పించామన్నారు. ఇక స్థానిక సంస్థలో దివ్యాంగుల గొంతుక జ్వలించనున్నట్టు పేర్నొన్నారు. మెరీనా బీచ్, బెసెంట్ నగర్ బీచ్ తదితర ప్రాంతాలలో అలలను ఆస్వాధీంచేందుకు వీలుగా దివ్యాంగుల కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశామని, క్రీడా రంగంలోనూ వివిధ పోటీలను విస్తృతం చేశామని వివరిస్తూ, వివిధ జిల్లాల్లో పారా స్పోర్ట్స్ మైదానాలను విస్తృతంగా ఏర్పాటు చేయనున్నామని ఫ్రకటించారు. రాష్ట్ర ప్రజల గొంతుకగా ద్రావిడ మోడల్ ప్రభుత్వం ఉందని పేర్కొంటూ, దివ్యాంగులపై కరుణ చూపించడం కాదని, వారి హక్కులను సాధించి, వారి జీవితాలలో వెలుగు నింపే దిశగా ఈ ప్రభుత్వం ఉరకలు తీస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రులు గీతాజీవన్, టీఆర్పీ. రాజా, రాజకన్నప్పన్, ఎం. సుబ్రమణియన్, మేయర్ ప్రియ, ఎమ్మెల్యేలు ఎలిళన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం తదితరులు పాల్గొన్నారు. -
సీట్ల పందేరం?
– డీఎంకేతో టీఎన్సీసీ టీం భేటీ సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకేతో సీట్ల పందేరం చర్చను కాంగ్రెస్ మొదలెట్టింది. బుధవారం ఏఐసీసీ నియమించిన టీఎన్సీసీ కమిటీ అన్నా అరివాలయంలో సీట్ల చర్చను ప్రారంభించింది. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్తో ఈ కమిటీ భేటీ అయింది. వివరాలు.. ఆది నుంచి డీఎంకే కాంగ్రెస్ల బంధం గురించి చెప్పనక్కర్లేదు. వీరి బంధం ప్రతి ఎన్నికలలోనూ కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 2026 ఎన్నికలలో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగే దిశగానే మొగ్గు చూపుతోంది. అనేక ప్రచారాలు, పుకార్లు బయలు దేరినా డీఎంకే కూటమిలోనే కాంగ్రెస్ కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తాజాగా డీఎంకేతో కూటమి బంధం పదిలం చేసుకోవడంతో పాటుగా ముందుగానే సీట్ల పందేరం ముగించే విధంగా ఏఐసీసీ పెద్దలు ఓ కమిటీని రంగంలోకి దించారు. ఈ కమిటీ ఇప్పటికే టీఎన్సీసీ నేతలతో పలుమార్లు సమావేశమైంది. డీఎంకేతో చర్చించాల్సిన అంశాల గురించి సమీక్షించారు. ఈ పరిస్థితుల్లో గత ఎన్నికలలో కాంగ్రెస్కు డీఎంకే 25 సీట్లు ఇవ్వగా ఇందులో 18 చోట్లే గెలిచారు. ఈ స్థానాలు డీఎంకే మళ్లీ ఇచ్చేనా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో తమకు ఈసారి రెట్టింపు సీట్లు ఇవ్వాలని, అధికారంలో వాటా ఇవ్వాలంటూ కొందరు కాంగ్రెస్ నేతలు నినదిస్తూ వస్తున్నారు. స్టాలిన్తో భేటీ తమిళనాడు, పుదుచ్చేరి పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ గిరిష్ చోదనక్కర్, ఏఐసీసీ ప్రతినిధులు సూరజ్ హెగ్డే, నివేదిత్ఆళ్వాలు, టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, శాసనసభా పక్ష నేత రాజేష్కుమార్ బుధవారం డీఎంకే కార్యాలయం తేనాంపేటలోని అన్నా అరివాలయంలో అడుగు పెట్టారు. డీఎంకే నేతల నెహ్రూ, ఆర్ఎస్ భారతీ, టీకేఎస్ ఇళంగోవన్లు ఈ కమిటీకి ఆహ్వానం పలికారు. అర్ధగంటకు పైగా వీరి భేటీ జరిగింది. అనంతరం మీడియాతో సెల్వ పెరుంతొగై మాట్లాడుతూ డీఎంకేతో సంతృప్తికరంగానే భేటీ జరిగిందన్నారు. తమ కమిటీలోని వారంతా సంతృప్తికరంగానే ఉన్నారని, త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. వదంతులు, ప్రచారాలు మాత్రం వద్దు అని అన్నీ సజావుగానే సాగుతాయని వ్యాఖ్యానించారు. -
రూ.2 వేల ప్రొజెక్టర్ : అమెజాన్కు రూ. 35వేల షాక్
చెన్నై,సాక్షి : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు ఎదురు దెబ్బ తగిలింది. ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా మరో తప్పుడు వస్తువు డెలివరీ చేసినందుకుగాను కోర్టు జరిమానా విధించింది. తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది.తమిళనాడులోకి తిరుచ్చకి చెందిన ఐజాక్ న్యూటన్ జులై 9న ఒక మినీ ప్రొజెక్టర్ ఆమెజాన్ ద్వారా ఆర్డర్ చేశారు. కానీ జూలై 14న వచ్చిన పార్సిల్ చూసి ఐజాక్ నివ్వెరపోయాడు. రూ.2,707 ధర గల మినీ ప్రొజెక్టర్కి బదులుగా టీ-షర్టులు కనిపించాయి. అయితే, న్యూటన్ ఉత్పత్తిని మార్చాడని ఆరోపిస్తూ అమెజాన్ డబ్బును తిరిగి చెల్లించడానికి నిరాకరించింది. అమెజాన్ చర్యతో నిరాశ చెందిన ఐజాక్ కంపెనీకి లీగల్ నోటీసు పంపాడు. అసలు మొత్తాన్ని తిరిగి ఇచ్చింది. అయినా చెప్పిన సమయానికిఈ-కామర్స్ సంస్థ డబ్బులు చెల్లించక పోవడంతో న్యాయపోరాటానికి దిగాడు. ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల కల సాకారం : నాన్నకోసం కన్నీళ్లతోతనకు జరిగిన మోసం, మానసిక వేదనకు పరిహారం చెల్లించాల్సిందిగా ఐజాక్ న్యూటన్ త్రిరుచ్చి జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. రూ. 5 లక్షల పరిహారం కోరుతూ కేసు దాఖలు చేశాడు. కేసును విచారించిన కోర్టు అమెజాన్ ,డెలివరీ ఏజెంట్ తప్పు చేసినట్లు గుర్తించింది. నవంబర్ 28న కోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసింది, అమెజాన్ ఐజాక్ న్యూటన్కు రూ.25,000 పరిహారంగా రూ.10 వేల కోర్టు ఖర్చులకు చెల్లించాలని ఆదేశించింది. ఐజాక్కు మొత్తంగా రూ.35,000 చెల్లించాలని తీర్పు చెప్పింది.చదవండి: మాస్క్తో పలాష్ : ప్రేమానంద్ మహారాజ్ని ఎందుకు కలిశాడు?TN NEWS : Tiruchi court fines Amazon ₹35,000 for delivering t-shirts instead of ordered projector.On July 9, he ordered a mini projector priced at ₹2,707. The product was delivered on July 14, but when Isaac opened the package and he found T-shirts instead of the projector. pic.twitter.com/izbiHzMqQh— News Arena India (@NewsArenaIndia) December 2, 2025 -
టీవీకే విజయ్కు బిగ్ షాక్
సాక్షి, చెన్నై: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తొలిసారిగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అడుగు పెట్టనున్నారు. అయితే ఆయనకు అక్కడి ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ పాలకులు అనేక ఆంక్షలు విధించారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైన విజయ్కు రోడ్ షో నిర్వహించేందుకు అనుమతిని నిరాకరించారు. కావాలంటే బహిరంగ సభ నిర్వహించుకోవచ్చు అని ఆ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మంగళవారం ప్రకటించింది. దీంతో, విజయ్కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.వివరాల ప్రకారం.. రాజకీయ పార్టీ ఆవిర్భావంతో పూర్తిగా తన దృష్టిని తమిళనాడుపైన విజయ్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడి ఓటర్లకు దగ్గరయ్యే విధంగా చేపట్టిన మీట్ ది పీపుల్ ప్రయాణానికి కరూర్ విషాద ఘటన రూపంలో బ్రేక్ పడింది. డిసెంబర్ 4 నుంచి సేలం వేదికగా మళ్లీ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైనా, కార్తీక దీపోత్సవాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తనను కలిసేందుకు సిద్ధంగా ఉన్న ప్రజల వద్దకే వెళ్లే విధంగా విజయ్ ముందుకు సాగుతున్నారు. గత వారం కాంచీపురం ప్రజల్ని కలిశారు. ఈ పరిస్థితులలో రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తన దృష్టిని తాజాగా పుదుచ్చేరిపై కూడాపెట్టే పనిలో పడ్డారు.కాగా, డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్ షో, ర్యాలీ, బహిరంగ సభకు సన్నద్దమయ్యారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పుదుచ్చేరి టీవీకే వర్గాలు వారం రోజుల క్రితం ఆ రాష్ట్ర డీజీపీ షాలిని సింగ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సమగ్ర వివరాలను అందులో తెలియజేశారు. పుదుచ్చేరి పర్యటన ముగించుకుని మరుసటి రోజన కడలూరు వెళ్లేందుకు విజయ్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టుగా టీవీకే వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పుదుచ్చేరి పాలకులు విజయ్కు అనేక ఆంక్షలతో అనుమతి ఇవ్వక తప్పలేదు.కరూర్ ఘటన దృష్టా ముందు జాగ్రత్తగా రోడ్ షోకు అనుమతి ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. మంగళవారం టీవీకే నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున తదితరులు అనుమతి కోసం ఓ వైపు డీజీపీ కార్యాలయం, మరోవైపు సీఎం రంగస్వామిని కలిసే ప్రయత్నం చేసి విఫలమయ్యాయి. చివరకు డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. రోడ్ షో, ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. అనేక ఆంక్షలతో బహిరంగ సభను నిర్వహించుకునేందుకు మాత్రం అవకాశం కల్పించారు. -
కార్తీక దీపోత్సవానికి సర్వం సిద్ధం
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ ఉత్సవాల్లో భాగంగా 10వ రోజైన బుధవారం ఉదయం 4 గంటలకు ఆలయం ఎదుటనున్న మూలవర్ సన్నధిలో భరణిదీపం వెలిగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు అర్ధనారేశ్వరుడు ఏడాదిలో ఒకసారి ప్రత్యేక వాహనంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇదే సమయంలో అరుణాచలేశ్వరాలయం వెనుకనున్న 2,668 అడుగుల కొండపై మహా దీపాన్ని వెలిగించనున్నారు. మహా దీపం వెలిగించే సమయంలో ఆలయం వద్దనున్న భక్తులు అరుణాచలేశ్వరునికి హరోం.. హరా.. అంటూ నామస్మరణాలు చేసుకుంటారు. మహా దీపోత్సవాన్ని తిలకించేందుకు 40 లక్షల మంది భక్తులు రానున్నారని ఆలయ అధికారుల అంచనా. కార్తీక దీపోత్సవం దృష్ట్యా అరుణా చలేశ్వరాలయాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. ఈ ఆలయంలో శివుడు అగ్నిరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కొండపైకి భక్తులకు అనుమతి నిరాకరణ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మహాదీపం కొండపైకి భక్తులు ఎక్కేందుకు 11 రోజులు అనుమతి నిరాకరించారు. మహా దీపం వెలిగించే ఆలయ అర్చకులు, పారంపర్య వంశస్తులు, ఆలయ సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. మహాదీపం 35 కిలోమీటర్ల నుంచి చూసినా దీప కాంతి సృష్టంగా కనిపించడం విశేషం. మహా దీపం పది రోజుల పాటు వెలుగుతూనే భక్తులకు దర్శనం ఇవ్వనుంది. పటిష్ట బందోబస్తు మహా దీపోత్సవానికి ఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ను నియంత్రించేందుకు ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. 39 ప్రాంతాల్లో తాత్కాలిక ఔట్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. మానవ రహిత విమానంతో కూడా ప్రత్యేక నిఘా ఉంచి చోరీలు జరగకుండా చూస్తామన్నారు. ఉదయం భరణి దీపం వెలిగించే సమయంలో అనుమతి ఇచ్చిన భక్తులు, మహా దీపం వెలిగించే సమయంలో 2,500 మందిని మాత్రమే ఆలయంలోనికి అనుమతిస్తామన్నారు. తిరువణ్ణామలైలో ట్రాఫిక్ను మూడు రోజులు మార్పు చేసినట్లు తెలిపారు. కై లాస వాహనంలో ఊరేగిన అరుణాచలేశ్వరుడు: ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి వారు కై లాస వాహనంలో మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 9 గంటలకు మూషిక వాహనంలో వినాయకుడు, హంస వాహనంలో వళ్లి, దేవసేన సమేత మురుగన్, కై లాస వాహనంలో ఉన్నామలై సమేత అన్నామలైయార్, కామధేను వాహనంలో పరాశక్తి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం మూషిక వాహనంలో వినాయకుడు, పురుష మునివాహనంలో చంద్రశేఖరుడు మాడ వీధుల్లో దర్శనమిచ్చారు. తిరువణ్ణామలై జిల్లాలో చినుకులతో కూడిన వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తులు వాటిని లెక్క చేయకుండా స్వామి వారి ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. మాడ వీధులతో పాటు తిరువణ్ణామలై పట్టణంలో ఎటు చూసినా భక్తుల మయంగా మారింది. ఇప్పటికే తిరువణ్ణామలై పట్టణంలో లాడ్జీలు, హోటల్స్, మాడ వీధుల్లోను భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రత్యేక బస్సులు: దీపోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 4,764 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు కలెక్టర్ తర్పగరాజ్ తెలిపారు. ముందుస్తుగా 24 తాత్కాలిక బస్టాండ్లు, 130 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఐదు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. -
ఆధునిక సాంకేతికతతో వినికిడి లోపానికి పరిష్కారం
సాక్షి, చైన్నె : అత్యాధునిక సాంకేతికతతో వినికిడి లోపానికి పరిష్కారంపై రేడియల్రోడ్డులోని కావేరి ఆస్పత్రి ఈఎన్టీ విభాగాధిపతి ఆనంద్ రాజు నేతృత్వంలో దృష్టి పెట్టారు. వినికిడి లోపంతో పోరాడుతున్న అన్ని వయస్సుల వారికి ఆశలు కల్పించే విధంగా అత్యాధునిక సాంకేతిక విధానాన్ని విజయవంతం చేశారు. మూడు సంక్లిష్టమైన కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలను విజయవంతం చేశారు. తీవ్రమైన వినికిడి లోపంతో బాధ పడుతున్న ఇద్దరు పిల్లలు, ఒక పెద్ద వయస్సు వారికి ఈ చికిత్స జరిగింది. ఇందులో ఒకటి డౌన్ సిండ్రోమ్, మరొకటి వై కల్యం గా పిలవబడే పుట్టుకతో వచ్చే పరిస్థితి కావడం గమనార్హం. డాక్టర్ ఆనంద్ రాజు నాయకత్వంలో అత్యంత సవాలుతో కూడిన కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స నిర్వహించి పుట్టుకతో చెవిటి వాడైన ఓ బాలుడికి వినికిడి ఆనందాన్ని కల్పించినట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అలాగే మరో ఇద్దరికి వినికిడి అవకాశం దక్కిందని, ఈ అధునికత విధానం ప్రయోజనకంగా ఉంటున్నదని డాక్టర్ ఆనంద్ రాజు పేర్కొన్నారు. -
రోడ్ షోకు అనుమతి నో
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తొలి సారిగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అడుగు పెట్టనున్నారు. అయితే ఆయనకు అక్కడి ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ పాలకులు అనేక ఆంక్షలు విధించారు. తన బలాన్ని సిద్ధమైన విజయ్కు రోడ్ షో నిర్వహించేందుకు అనుమతిని నిరాకరించారు. కావాలంటే బహిరంగ సభ నిర్వహించుకోవచ్చు అని ఆ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మంగళవారం ప్రకటించింది. వివరాలు.. రాజకీయ పార్టీ ఆవిర్భావంతో పూర్తిగా తన దృష్టిని తమిళనాడుపైన విజయ్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడి ఓటర్లకు దగ్గరయ్యే విధంగా చేపట్టిన మీట్ ది పీపుల్ ప్రయాణానికి కరూర్ విషాద ఘటన రూపంలో బ్రేక్ పడింది. డిసెంబర్ 4 నుంచి సేలం వేదికగా మళ్లీ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైనా, కార్తీక దీపోత్సవాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తనను కలిసేందుకు సిద్ధంగా ఉన్న ప్రజల వద్దకే వెళ్లే విధంగా విజయ్ ముందుకు సాగుతున్నారు. గత వారం కాంచీపురం ప్రజల్ని కలిశారు. ఈ పరిస్థితులలో రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తన దృష్టిని తాజాగా పుదుచ్చేరిపై కూడాపెట్టే పనిలో పడ్డారు. డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్ షో, ర్యాలీ , బహిరంగ సభకు సన్నద్దమయ్యారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పుదుచ్చేరి టీవీకే వర్గాలు వారం రోజుల క్రితం ఆ రాష్ట్ర డీజీపీ షాలిని సింగ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సమగ్ర వివరాలను అందులో తెలియజేశారు. పుదుచ్చేరి పర్యటన ముగించుకుని మరుసటి రోజన కడలూరు వెళ్లేందుకు విజయ్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టుగా టీవీకే వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పుదుచ్చేరి పాలకులు విజయ్కు అనేక ఆంక్షలతో అనుమతి ఇవ్వక తప్పలేదు. కరూర్ ఘటన దృష్టా ముందు జాగ్రత్తగా రోడ్ షోకు అనుమతి ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. మంగళవారం టీవీకే నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున తదితరులు అనుమతి కోసం ఓ వైపు డీజీపీ కార్యాలయం, మరో వైపు సీఎం రంగస్వామిని కలిసే ప్రయత్నం చేసి విఫలమయ్యాయి. చివరకు డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. రోడ్ షో, ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. అనేక ఆంక్షలతో బహిరంగ సభను నిర్వహించుకునేందుకు మాత్రం అవకాశం కల్పించారు. -
క్లుప్తంగా
ఐడీఎఫ్ చైర్పర్సన్గా ఆర్ఎం అంజనా సాక్షి, చైన్నె : ఐడీఎఫ్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ చైర్ పర్సన్, ఐడీఎఫ్ గ్లోబల్ యాక్టివ్ ఇనిషియేట్కు నాయకత్వం వహించే బాధ్యతలను చైన్నెకు చెందిన డాక్టర్ ఆర్ఎం అంజనా నియమితులయ్యారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ఎండీగా, మద్రాసు డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షులు ప్రస్తుతం ఆర్ఎం అంజనా వ్యవహరిస్తున్నారు. ఐడీ ఎఫ్ప్రాంతాలలో ఒక అంర్జాతీయ కన్సార్టియంను ఏర్పాటు చేసి మార్గ నిర్దేశం చేసే విధంగా ఆమె ప్రయానం సాగనుంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ పీటర్ స్క్వార్ట్ తాజాగా జరిగిన కార్యక్రమంలో అంజానకు ఐడీఎఫ్ వర్కింగ్ గ్రూపష్కు అధ్యక్షత వహించే విధంగా నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండీఆర్ఎఫ్ చైర్మన్ డాక్టర్ వి. మోహన్ తదితరులు పాల్గొన్నారు. లింగ నిర్ధారణ కేసులో ఇద్దరి అరెస్టు అన్నానగర్: కళ్లకురిచ్చి జిల్లా చిన్నసాలెంలోని కొడుకూర్ గ్రామానికి చెందిన వెంకటేశన్ (50). సేలం జిల్లా వళప్పాడి సమీపం బేలూర్లో శక్తివేల్ యాజమాన్యంలోని ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆ ఇంట్లో పుట్టబోయే బిడ్డ లింగాన్ని గుర్తించే ఆధునిక స్కేల్ యంత్రాన్ని అతను ఉపయోగిస్తున్నాడు. ఇంటి వెలుపల జననేంద్రియ వ్యాధుల కోసం దానిని పరీక్షిస్తున్నాడు. ఇతడి సహాయకురాలు సేలం, ధర్మపురి, కృష్ణగిరి, కళ్లకురిచ్చి, తిరుపత్తూరు జిల్లాల నుంచి చాలా మంది గర్భిణీ సీ్త్రలను, వారి కుటుంబాలను సంప్రదించడానికి వెంకటేశన్ 10 మందికి పైగా బ్రోకర్లతో సిండికేట్ కమిటీని ఏర్పాటు చేశాడు. వీరికి కమీషన్ ఇచ్చేవాడు. విషయం తెలుసుకున్న సేలం జిల్లా ఆరోగ్య అధికారులు ఒక బృందంగా పనిచేసి వెంకటేశన్ కదలికలను పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం, సేలంలోని కళ్లకురిచ్చి, ఓమలూర్ నుంచి నలుగురు గర్భిణులను అసిస్టెంట్ లత ద్వారా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ, వెంకటేశన్ ఆధునిక స్కానింగ్ పరికరంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా. వారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మహిళా సహాయకురాలు లతను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆధునిక స్కానింగ్ పరికరంతో సహా పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, 10వ తరగతి వరకు చదివిన వెంకటేశన్, గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షల కోసం రూ.30,000 చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. మోసం కేసులో వ్యక్తి అరెస్టు తిరువొత్తియూరు: పెళ్లి చేసుకుంటానంటూ మహిళా కానిస్టేబుల్ను మోసం చేసిన యువకుడి ని పోలీసులు అరెస్టు చేశారు. అన్నానగర్లో నివాసం ఉంటున్న వారు సుమతి (33) కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. భర్తకు దూరంగా ఒంటరిగా నివసిస్తున్నారు. ఈక్రమంలో 8 నెలల క్రితం ధర్మపురి జిల్లాకు చెందిన వసంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సెల్ఫోన్లో మాట్లాడుకునేవారు. తర్వాత ప్రేమ పేరుతో దగ్గరయ్యారు. తర్వాత ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఈక్రమంలో ఆమె వద్ద నుంచి 6 సవర్ల నగలు, రూ. 3 లక్షలు నగదు తీసుకుని సుమతీతో మాట్లాడడం మానేశాడు. తను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు అన్నానగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీని తర్వాత వసంత్ను మంగళవారం పోలీస్ స్టేషన్కు రప్పించి అతనితో పోలీసులు విచారణ జరిపినప్పుడు వసంత్ అసలు పేరు సింగారవేలు (35), సొంత ఊరు ధర్మపురి జిల్లా అని, పెళ్లయి భార్యతో నివసిస్తున్నాడని, మొదటి పెళ్లిని దాచి సుమతీతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లు తేలడంతో అరెస్టు చేశారు. నాటు తుపాకీ తయారీదారుడు అరెస్ట్ అన్నానగర్: శంకరపురం సమీపంలో ఇంట్లో దేశీయ గన్ తయారు చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేసి, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కల్లకురిచ్చి, జిల్లాలోని శంకరపురం సమీపం పలైయనూర్ గ్రామంలో కొంతమంది వ్యక్తులు దేశీయంగా తయారు చేసిన నాటు తుపాకులను కలిగి ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీని ఆధారంగా మంగళవారం శంకరపురం పలైయనూర్ గ్రామంలోని అరుళప్పన్ కుమారుడు జేమ్స్ పీటర్ (33) ఇంట్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో 3 ఎయిర్ గన్లు, కంట్రీ మేడ్ షాట్గన్, 5 కిలోల బ్లాక్ ఫాస్పరస్ పేలుడు పదార్థాలు, కంట్రీ మేడ్ షాట్ గన్లను తయారు చేయడానికి విడిభాగాలు అనుమతి లేకుండా దాచి ఉన్నట్లు వెల్లడించారు. ఇది చూసి పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. దేశంలోని అన్ని మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వారు జేమ్స్ పీటర్ను అరెస్టు చేసి విచారించడం కొనసాగిస్తున్నారు. -
కలైంజ్ఞర్ కలం అవార్డు ప్రదానం
సాక్షి, చైన్నె : 2024 సంవత్సరానికి గాను కలైంజ్ఞర్ కలం అవార్డును ప్రముఖ తమిళ పత్రిక దినతంది సంపాదకులు డిఈఆర్ సుకుమార్కు ప్రదానం చేశారు. జర్నలిజం రంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును మంగళవారం సచివాలయంలో సీఎం స్టాలిన్ అందజేశారు. 2021–22 నుంచి న్యూస్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ గ్రాంట్స్ స్కీమ్ ద్వారా సామాజిక సేవ, జర్నలిజం రంగంలో అణగారిన ప్రజల కృషికి దోహ పడిన అత్యుత్తమ జర్నలిస్టుకులకు కలైంజ్ఞర్ కలం అవార్డును ప్రదానం చేస్తూ వస్తున్నారు. తాజాగా 2024 సంవత్సరానికి గాను దినతంది పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ సుకుమార్కు అందజేశారు. అలాగే, రానున్న కాలంలో మహిళా జర్నలిస్టుకు సైతం ఈ అవార్డు అందజేయడానికి నిర్ణయించారు. అనంతరం కామరాజర్ నగర్లో రూ. 39.30 కోట్లతో తమిళనాడు స్టేషనరీ అండ్ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల తరహా గృహాలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. కార్యక్రమంలో సమాచార శాఖమంత్రి స్వామినాధన్, సీఎస్ మురుగానందం, సమాచార కార్యదర్శి కె. రాజారామన్, డైరెక్టర్ సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. వీరమణికి సత్కారం ద్రావిడ కళగం నేత కె వీరమణి సీనియర్ రాజకీయ నాయకులు అన్న విషయం తెలిసిందే. మంగళవారం 93వ వసంతంలోకి ఆయన అడుగు పెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రులు నెహ్రూ, ఎం. సుబ్రమణియన్, అన్బిల్ మహేశ్తో కలిసి స్వయంగా వీరమణి నివాసానికి సీఎం స్టాలిన్ వెళ్లారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు. ఆయన సేవలు, ప్రయాణాన్ని వివరిస్తూ ఎక్స్ పేజీలో సీఎం ట్వీట్ కూడా చేశారు. -
తిరువళ్లూరు జిల్లాలో భారీ వర్షం
తిరువళ్లూరు: ఆవడిలో జనజీవనానికి తీవ్ర ఇబ్బందికరంగా నిలిచిన వర్షపు నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నెహ్రూ అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో హౌసింగ్బోర్డు, కామరాజర్ నగర్తో పాటు పలు ప్రాంతాల్లోని నివాసాలు నీటిలో మునిగిపోయింది. వర్షపు నీరు భారీగా నిలిచిపోయిన క్రమంలో వాటిని భారీ యంత్రాల ద్వారా తొలగింపు ప్రక్రియను అధికారులు వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆవడిలో జరుగుతున్న వర్షపు నీరు తొలగింపు, సహాయక చర్యలను రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి నెహ్రు, మైనారిటి సంక్షేమశాఖ మంత్రి నాజర్ , కలెక్టర్ ప్రతాప్ , కమిషనర్ శరణ్యతో పాటూ పలువురు పర్యవేక్షించారు. వర్షపు నీటిని తొలగించడంతో పాటు వర్షపు నీరు సులభంగా చెరువులకు వెళ్లేవిధంగా కాలువల పూడికతీత పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం కల్పించిన శిబిరంలో వుంటున్న వరధ భాదితులను సైతం మంత్రులు కలిసి వారికి భరోసా ఇచ్చారు. పజలు ఆవడి, గుమ్మిడిపూండి, పొన్నేరి, రెడ్హిల్స్ తదితర ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్తితి ఏర్పడింది. నిండిన 88 చెరువులు దిత్వా తుపాను ఫలితంగా భారీ వర్షపాతం నమోదు కావడంతో జిల్లాలోని 88 చెరువులు పూర్తిస్థాయిలో నిండింది. జిల్లాలో పీడబ్ల్యూడీ అధీనంలో 250 చెరువులు వుండగా వీటిలో 88 చెరువులకు వందశాతం నీరు చేరింది. మరో 108 చెరువులకు 75 శాతం పైగా నీరు రాగ, 23 చెరువులకు 50 శాతం నీరు చేరినట్టు అధికారులు వెల్లడించారు. పూర్తిగా నిండిన ఆనకట్టలు జిల్లాలోని ప్రధాన ఆనకట్టలకు భారీగా వరధ నీరు రావడంతో నిండిపోయింది. పనపాక్కం, కల్పట్టు. చెంగాత్తుకుళం, పాళేశ్వరం, ఏఎన్కుప్పం, లక్ష్మాపురం, రెడ్డిపాళ్యం చెక్డ్యామ్లు పూర్తి స్థాయిలో నిండాయి. ఆవడిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి నాజర్ తదితరులు -
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి
కొరుక్కుపేట: చైన్నె నగరంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి చైన్నె ట్రిప్లికేన్ –చెప్పాక్కం నియోజకవర్గ సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ విభాగాల పుననిర్మాణ కోసం సభ్యుల అభిప్రాయ సేకరణ జరిగింది. రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీని తమిళనాడులో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ట్రిప్లికేన్లోని తెలుగు ప్రముఖులు పి.పాల్ కొండయ్య అధ్యక్షతన పి. చిన్నయ్య, పి.అరుణ్ కుమార్ , పల్లిపాటి సతీష్ కుమార్, మహిళా కాంగ్రెస్ కు చెందిన అమ్ములు రఘువీరా రెడ్డికి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు తంగబాలు , కౌన్సిలర్లు ఎస్. శివరాజ శేఖర్ పాల్గొన్నారు. -
సిట్ విచారణకే మొగ్గు
● సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ సాక్షి, చైన్నె: కరూర్ ఘటనపై సీట్ విచారణకే అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్పిటిషన్ను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం దాఖలు చేసింది. అలాగే జస్టిస్ అరుణా జగదీశన్ ఏక సభ్యకమిషన్ విచారణ కొనసాగేందుకు విజ్ఞప్తి చేశారు. తమిళ వెట్రి కళగం నేత విజయ్ ప్రచారం సందర్భంగా కరూర్లో చోటు చేసుకున్న విషాద ఘటన గురించి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈకేసును సీబీఐ విచారిస్తున్నది. సుప్రీం కోర్టు పర్యవేక్షణలోని ప్రత్యేక కమిటీ సైతం తాజాగా రంగంలోకి దిగింది. సిబీఐ వద్ద సోమవారం విచారణ జరిపిన ఈ కమిటీ మంగళవారం బాధితుల వద్ద సమాచారాలు రాబట్టింది. బాధితుల ఫిర్యాదులను స్వీకరించింది. ఈ పరిస్థితులలో కేసును తొలుత హైకోర్టు ఆదేశాలతో సిట్ విచారించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జస్టిస్ అరుణా జగదీశన్ కమిషన్ విచారణ చేపట్టడం గురించిన ప్రస్తావనను మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం తెర మీదకు తెచ్చింది. సుప్రీం కోర్టులో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సిబీఐ విచారణ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. సిట్ విచారణకే అవకాశం కల్పించాలని, అలాగే, అరుణా జగదీశన్ కమిషన్ విచారణ కొనసాగేందుకు వీలు కల్పించాలని కోరారు. ఈ పిటిషన్ ఒకటి రెండురోజులలో సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. చైన్నె నుంచి బయలుదేరే 7 విమానాలు రద్దు కొరుక్కుపేట: చైన్నె నుంచి అండమాన్, అహ్మదాబాద్, ముంబై, గౌహతి, కొచ్చి, భువనేశ్వర్కు వెళ్లే 6 దేశీయ విమానాలు, ఓ అంతర్జాతీయ విమానాన్ని అధికారులు మంగళవారం అకస్మాత్తుగా రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి ఎయిర్లైన్ ప్రతినిధులు మాట్లాడుతూ భారీ వర్షాలు, పరిపాలనా కారణాల వల్ల విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. తిరుప్పూర్ మేయర్కు జరిమానా సాక్షి, చైన్నె : విద్యుత్ చోరీకి పాల్పడినారంటూ తిరుప్పూర్ కార్పొరేషన్ డీఎంకే మేయర్ దినేష్కుమార్కు విద్యుత్ బోర్డు రూ. 42 వేలు జరిమానా విధించడం చర్చకు దారి తీసింది. తిరుప్పూర్ మేయర్గా ఉన్న దినేష్కుమార్ ఇటీవల తాను నిర్మించిన భవనానికి గాను అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఆయన విద్యుత్ చౌర్యానికి సైతం పాల్పడినట్టు గుర్తించిన విద్యుత్ బోర్డు వర్గాలకు ఆయనకు రూ. 42 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం నోటీసులు పంపించారు. ఇది కాస్త డీఎంకేలో చర్చకు దారి తీసింది. డీఎంకేకు చెందిన మేయర్ విద్యుత్ చౌర్యానికి పాల్పడటం, ఇందుకు విద్యుత్ బోర్డు కన్నెర్ర చేయడం గమనార్హం. వ్యక్తిగతంగానే సంప్రదింపులు సాక్షి, చైన్నె: తనను వ్యక్తిగతంగా మాత్రమే బీజేపీ నాయకులు సంప్రదిస్తున్నారే గానీ, అధికారికంగా ఏమాత్రం కాదని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. దినకరన్ నేతృత్వంలో అమ్మమక్కల్ మున్నేట్ర కళగంను మళ్లీ కూటమిలోకి రప్పించే దిశగా బీజేపీ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన్ను బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సంప్రదింపు జరిపినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితులలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా నుంచి దినకరన్కు పిలుపు అందినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం గురించి దినకరన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ,తనతో పార్టీ పరంగా,కూటమి గురించి బీజేపీ నుంచి ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఆపార్టీకి చెందిన వారు కొందరు తనతో ఉన్న వ్యక్తిగత పరిచయం మేరకు సంప్రదింపు జరుపుతున్నారే గానీ, అధికారికంగా తనతో ఎవ్వరూ మాట్లాడ లేదని స్పష్టం చేశారు. నేడు తిరుప్పరన్కుండ్రంలో కార్తీక దీపోత్సవం తిరువొత్తియూరు: తిరుప్పరన్కుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవంలో భాగంలో మంగళవారం సాయంత్రం మురుగపెరుమాన్కు పట్టాభిషేకం జరిగింది. బుధవారం మహదీపం వెలిగించే వేడుక నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుప్పరన్కుండ్రం కొండపై మూడు ముప్పావు అడుగుల ఎత్తు, 70 కిలోల బరువైన రాగి కొప్పరిలో 400 కిలోల నెయ్యి, 250 మీటర్ల పొడవైన గాడా గుడ్డ, 5 కిలోల కర్పూరం ఉపయోగించి మహదీపం వెలిగిస్తారు. దీని తర్వాత ఈ ప్రాంతంలోని చుట్టుపక్కల గ్రామాలలో, ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించనున్నారు. -
అన్నానగర్లో హైరిస్క్ ప్రెగ్నెన్సీ యూనిట్ ఏర్పాటు
సాక్షి, చైన్నె: చైన్నె అన్నానగర్లోని రెయిన్ బో చిల్డ్రన్స్ ఆస్పత్రిలో సుభిక్ష– సమగ్ర హై రిస్క్ ప్రెగ్నెన్సీ యూనిట్ను ఏర్పాటు చేశారు. దీనిని ఎమ్మెల్యే ఎంకే మోహన్ ప్రారంభించారు. ఇందులో పూర్తిగా లెవల్ 2 ఎన్ఐసీయూ, అధునాతన పిండ నిర్ధారణతో 24 గంటల ప్రసూతి, నియోనాటల్ సంరక్షణ సేవలను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆ ఆస్పత్రి గైనకాలిజిస్టు డాక్టర్ వి శాంత, నియోనాటలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్శోభన రాజేంద్రన్, టీఎన్, ఏపీ జోనల్ డైరెక్టర్ భాస్కర్రెడ్డిలు మాట్లాడుతూ నవ జాత శిశువు సేవలను విస్తరించడానికి నిబద్ధతతో ఈ యూనిట్ను ఏర్పాటు చేశామని వివరించారు. సమగ్ర సంరక్షణ సేవలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. -
దిశ మారిన దిత్వా
సాక్షి, చైన్నె: శ్రీలంకను అతలాకుతలం చేసి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించిన దిత్వా తుపాన్ తమిళనాడులోని డెల్టా జిల్లాలపై తొలుత ప్రభావాన్ని చూపించింది. పుదుచ్చేరి నుంచి చైన్నె వైపుగా కదిలిన సమయంలో ఇది బలహీన పడింది. సోమవారం అంతా చైన్నె తీరాన్ని సమీపంలో తీవ్ర వాయుగుండంగా దిత్వా కేంద్రీకృతం కావడంతో అనేక చోట్ల భారీ వర్షం పడింది. రాతంత్రా కూడా వర్షం పడింది. మంగళవారం ఉదయం నుంచి కాస్త తెరపించి తెరపించి వర్షం పడుతూ వచ్చింది. చైన్నె మీదుగా ఆంధ్రా వైపుగా దిత్వా వాయుగుండంగా బలహీనపడి ప్రయాణిస్తుందని తొలుత అంచనా వేశారు. అయితే, ఇది మంగళవారం దిశను మార్చుకుంది. మళ్లీ పుదుచ్చేరి వైపుగా కదలడంతో క్రమంగా వర్షాలు చిరుజల్లుల మయంగా మారాయి. అప్పుడప్పుడూ అక్కడక్కడ చిరు జల్లులతో , మరికొన్ని చోట్ల మోస్తరుగా మంగళవారం అంతా వర్షం పడింది. తాజాగా మహాబలిపురానికి సమీపంలో కేంద్రీకృతమైన దిత్వా కారణంగా చెంగల్పట్టు, కాంచీపురం, దక్షిణ చైన్నెలలో వర్షం కురుస్తోంది. బుధవారం ఈ వాయుగుండం మహాబలిపురం – కల్పాకం మధ్య తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. ఒకే చోట కేంద్రీకృతమైన పక్షంలో బుధవారం కూడా తెరపించి తెరపించి వర్షాలు కొనసాగనున్నాయి. తిరువణ్నామలై, వేలూరు, విల్లుపురం, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలకు సైతం వర్షాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే సేలం, ఈరోడ్, దిండుగల్ తదితర జిల్లాలోనూ వర్షాలు పడనున్నాయి. ముమ్మరంగా సహాయక చర్యలు.. చైన్నెలో వర్షం దాటికి 48 చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. పది చోట్ల నీళ్లలో పడ్డ వారిని పోలీసులు రక్షించారు. కార్పొరేషన్, రెవిన్యూ సిబ్బంది ఓ వైపు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు మరో వైపు తక్షణ సహాయక చర్యలలో మునిగాయి. దీంతో త్వరితగతిన ఆయా ప్రాంతాలలో నీటిని తొలగించారు. విరిగిన చెట్ల కొమ్మలను, నేలకొరిగిన చెట్లను తొలగించారు. చేట్ పట్లో ఓ పురాత గోడ కూలడంతో ఓ కారు ధ్వంసమైంది. డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ రిప్పన్ బిల్డింగ్లోని కంట్రోల్ రూమ్లో పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. ఉదయ నిధి, మంత్రులు కేఎన్ నెహ్రూ, శేఖర్బాబు తదితరులు ఆయా బాధిత ప్రాంతాలలో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరం చేయించారు. నీటి తొలగింపునకు పెద్ద ఎత్తున మోటారు పంపు సెట్లను ఉపయోగించారు. భారీ నుంచి అతి భారీ వర్షం అనేక చోట్ల పడ్డప్పటికీ, కొన్ని చోట్లమినహా తక్కిన చోట్లనీటిని త్వరితగతిన తొలగించారు. కాగా, ఎన్నూరులో వర్షం దాటికి నీట మునిగి రాజ్కుమార్ అనేయువకుడు మరణించారు. అలాగే రోడ్లపై ఉన్న గుంతల పుణ్యమా నీటిలో పడ్డ వాహనా దారులు అనేక మంది ఉన్నారు. ఇక, అంబత్తూరు పారిశ్రామక వాడలలో పరిశ్రమల యాజమాన్యాలు గత అనుభవాల దృష్ట్యాముందు జాగ్రత్తగా ఈ సారి ఇసుక బస్తాలను పెద్ద ఎత్తున తమ పరిశ్రమల ముందు రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.ఒకే చోట కేంద్రీ కృతంతో వర్షం దిత్వా ఒక రోజుకు పైగా ఒకే చోట్ల కేంద్రీ కృతం కావడంతో చైన్నె, శివారులలో అనేక చోట్ల భారీ వర్షం పడిందని రెవెన్యూ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ తెలిపారు. చైన్నె ఎళిలగంలోని స్టేట్ ఎమర్జన్సీ సెంటర్ నుంచి ఆయన పరిస్థితిని పరిశీలిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ వచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వాతావరణ కేంద్రం హెచ్చరికలు, సమాచారాలు ఉన్నప్పటికీ, సహజ మార్పుల కారణంగా దిత్వా త్రీవ వాయుగుండంగా, ఆతదుపరి వాయుగుండంగా బలహీన పడి ఉందన్నారు. ఇప్పటి వరకు దిత్వా రూపంలో వర్షాలకు నలుగురు మరణించారని పేర్కొన్నారు. 582 పశువులు మరణించాయని, 1,601 గుడిసెలు, ఇళ్లు దెబ్బ తిన్నాయని వివరించారు. 1,127 కుటుంబాలకు చెందిన 3,534 మంది శిబిరాలలో ఉన్నట్టు పేర్కొన్నారు. చైన్నెలో రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలకు చెందిన 330 మంది సహాయక పనులలో దూసుకెళ్తున్నారని తెలిపారు. అక్టోబరులో కురిసిన వర్షాలకు దెబ్బ తిన్న పంటకు గాను, హెక్టారుకు రూ. 20 వేలు అందించాలని సీఎం ఆదేశించినట్టు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తాజాగా జరిగిన సర్వే మేరకు వర్షాల రూపంలో 85,521 హెక్టార్ల పంట , పంట పొలాలు నీట మునిగినట్టు గుర్తించామని వివరించారు. శ్రీలంకలో చిక్కుకున్న తమిళులందర్నీ సురక్షితంగా చైన్నెకు తీసుకు వచ్చినట్టు మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బలహీన పడ్డ దిత్వా తన దిశను మార్చుకుంది. ఆంధ్రా వైపుగా కాకుండా మళ్లీ పుదుచ్చేరి వైపుగా కదిలింది. బుధవారం మహాబలిపురం – పుదుచ్చేరి మధ్య మరింత బలహీన పడి వాయుగుండంగా తీరాన్ని తాకనుంది. చైన్నె, శివారులలో 30 చోట్ల భారీగా , మరో ఐదు చోట్ల అతి భారీగా వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు, మార్గాలు జలమయం అయ్యాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. -
అనేక చోట్ల భారీ వర్షం
గడిచిన 24 గంటలలో చైన్నె, శివారు జిల్లాల పరిధిలో భారీ వర్షం పడింది. 30 చోట్ల భారీగా, ఐదు చోట్ల అతిభారీగా వర్షం పడింది. అత్యధికంగా ఎన్నూరులో 26 సెం.మీ, బ్రాడ్ వేలో 25 సెం.మీ, ఐస్ హౌస్లో 22 సెం.మీ, మనలి, పొన్నేరిలో 21 సెం.మీ, పెరంబూరులో 20 సెం.మీ వర్షం పడింది. రెడ్ హిల్స్, విమ్కో నగర్లో 19 సెం.మీ, వడపళణిలో 18 సెం.మీ వర్షం పడింది. అతిభారీ, భారీ వర్షాలు పడ్డ ప్రాంతాల పరిసరాలలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. ఉత్తర చైన్నెలోని వ్యాసార్పాడి సత్యమూర్తి నగర్, ముల్లై నగర్లో నీట మునిగాయి. ఇళ్లలోకి సైతం నీళ్లు చేరడంతో అక్కడి ప్రజలకు అవస్థలు తప్పలేదు. ఇక్కడ వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో కొడుంగయూరు కాలువలోకి నీళ్లు వెళ్ల లేని పరిస్థితులలో ఈ రెండు ప్రాంతాలను వరదలు ముంచెత్తినట్టు అధికారుల పరిశీలినలో తలింది. ఇక్కడ నీటి తొలగింపు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆవడి, అంబత్తూరు, కొండి తోపు, పటాలం, తిరువొత్తియూరు, ఎన్నూరు, బ్రాడ్ వే, పురసైవాక్కం, నుంగంబాక్కం, కోడంబాక్కం, శాంతోమ్, మైలాపూర్, వేళచ్చేరి పరిసరాలలో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో యుద్ధ ప్రతిపదికన తొలగించారు. వర్షాలు తెరపించి తెరపించి కొనసాగుతుండటంతో ముంపును ఎదుర్కొవాల్సి ఉంటుందన్న ఆందోళనతో వేళచ్చేరి పరిసరాలతో పాటూ పలు చోట్ల పరిసర వాసులు తమ వాహనాలను వంతెనకు పక్కగా పార్కింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. -
క్లుప్తంగా
విద్యుత్ తీగలు తగిలి నెమలి మృతి పళ్లిపట్టు: విద్యుత్ తీగలు రాజుకుని నెమలి ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. పళ్లిపట్టు ప్రాంతంలోని కాప్పు అటవీ ప్రాంతంలో జింకలు, నెమళ్లు సంచరిస్తుంటాయి. ఇటీవల ఆహారం కోసం జనసంచార ప్రాంతాలకు వచ్చి వివిధ ప్రమాదాలకు గురై మృత్యువాతపడుతున్నాయి. ఈక్రమంలో నొచ్చిలి సమీపంలోని ప్రధాడ్డు వద్ద ఆహారం కోసం ఎగురుతూ వెళ్లిన నెమలికి విద్యుత్ స్తంభంలోని తీగలు తగిలి మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. 8 ఏళ్ల మగ నెమలి మృతికి సంబంధించి అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఫారెస్టర్ గోపి తన సిబ్బందితో చేరుకుని మృతిచెందిన నెమలిని తీసుకెళ్లి పోస్టుమార్టం కోసం పశువైద్యులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ లాంచనాలతో నెమలికి పూడ్చిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. హైగ్రేడ్ గంజాయి, నక్షత్ర తాబేళ్లు సీజ్ అన్నానగర్: చైన్నె విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు థాయిలాండ్ నుంచి అక్రమంగా తీసుకువచ్చిన రూ. 1.5 కోట్ల విలువైన హై–గ్రేడ్ గంజాయిని, మలేషియా నుంచి అక్రమంగా తీసుకువచ్చిన నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చైన్నెలోని మీనంబాక్కం అన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి థాయిలాండ్ నుండి మలేషియా మీదుగా వచ్చిన విమానం మంగళవారం వేకువజామున చేరుకుంది. విమానంలో ఉన్న ప్రయాణీకులను విమానాశ్రయ కస్టమ్స్ ఇంటెలిజెన అధికారులు నిశితంగా పరిశీలించారు. ఆ సమయంలో, ఉత్తర రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి వద్ద 3.42 కిలోలహై–గ్రేడ్, ప్రాసెస్ చేసిన గంజాయిని గుర్తించారు. అదేవిధంగా థాయిలాండ్ నుంచి మరో విమానంలో ప్రయాణిస్తున్న ఉత్తర రాష్ట్రానికి చెందిన 28 ఏళ్ల వ్యక్తి వద్ద 693 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి అంతర్జాతీయ విలువ దాదాపు రూ.1 కోటి 45 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. అలాగే మలేషియా నుంచి ఒక విమానం సింగపూర్ మీదుగా చైన్నె మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకుంది. పర్యాటక వీసాపై వచ్చిన మలేషియా యువకుడిని వద్ద కస్టమ్స్ అధికారులు 2,805 ఎర్రచెవుల నక్షత్ర తాబేళ్లను గుర్తించి సీజ్ చేశారు. నిందితుడిని అరెస్టు చేశారు. పది నిమిషాలు ఆగిన మెట్రో సర్వీసు కొరుక్కుపేట: సాంకేతిక లోపం కారణంగా మెట్రో సర్వీస్ నిలిపివేయడంతో ప్రయాణికులు సొరంగం గుండా నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైన్నె విమానాశ్రయం నుంచి విమానాశ్రయం వరకు వర్షాల కారణంగా సెంట్రల్ –హైకోర్టు మధ్య సొరంగంలో రైలు వెళుతుండగా అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీని కారణంగా మెట్రో ఆగిపోయింది. ప్రయాణికులు మెట్రో రైలు లోపల పది నిమిషాలపాటు చిక్కుకుపోయారు. తరువాత, మెట్రో సిబ్బందికి సమాచారం అందించి, మెట్రో తలుపులు తెరిచి, హైకోర్టు రైల్వేస్టేషన్ సొరంగం ద్వారా 500 మీటర్ల దూరంలో ఉండడంతో ప్రయాణికులు పట్టాలపై నడిచి వెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె వేలూరు: లారీల ఎఫ్సీ రుసుమును పెంచడాన్ని ఖండిస్తూ దక్షణ భారత దేశంలో ఈనెల 9 నుంచి లారీలు సమ్మెలో పాల్గొననున్నట్లు దక్షణ భారత లారీ యజమానుల సంఘం తీర్మానం చేశారు. సంఘం సమావేశంలో వేలూరులోని ప్రయివేటు హోటల్లో జరిగింది. ఇందులో వివిద రాష్ట్రాలకు చెందిన లారీ యజమానుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగప్ప విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లారీలు ఎఫ్సీ చేసుకునే రుసుమును రూ.850 నుంచి ఒకేసారి రూ.33,034కి పెంచాయన్నారు. ఈ పెంపు లారీ యజమానులను ఎంతగానో ప్రభావితం చేస్తుందన్నారు. ఆంధ్ర, తమిళనాడుకే పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసం ఉంటున్నాయని వీటి గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రమం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో చర్చించి పరిష్కరించకుంటే ఈనెల 9 నుంచి సమ్మెలో పాల్గొంటామన్నారు. ఇందులో మొత్తం 12 లక్షల లారీలు సమ్మెలో పాల్గొంటాయన్నారు. ఆంధ్ర రాష్ట్ర లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వర్రావ్, రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్నాయుడు, సభ్యులు ఆర్వీ చినబాబు, ఆర్ శరత్, సంఘం సౌత్జోన్ అసోషియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు సెల్వకుమార్, లోకనాథన్,గోపాల్ , దొరైరాజ్, ధనరాజ్ పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్ దరఖాస్తుల స్వీకరణ
తిరువళ్లూరు: ఎస్ఐఆర్ దరఖాస్తులను సకాలంలో పంపిణీ చేసి గడువులోపు వందశాతం ఆన్లైన్లో అప్లోడ్ చేసిన బీఎల్ఓలను తన కార్యాలయానికి పిలిపించిన కలెక్టర్ వారికి సర్టిఫికెట్లను అందించి అభినందించారు. ఎన్నికల జాబితాలో సవరణలు, మార్పులు చేర్పులు, మృతిచెందిన వారి పేర్లు తొలగింపు సహా వేర్వేరు ప్రక్రియలో భాగంగా ఎస్ఐఆర్ దరఖాస్తులను ఎన్నికల సంఘం పంపిణీ చేసింది. నవంబర్ నాలుగున ప్రారంభమైన శిబిరం డిసెంబర్ నాలుగు వరకు జరుగుతుందని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎస్ఐఆర్ దరఖాస్తులను పంపిణీ చేసి సంబంధిత ధరఖాస్తులను ఓటర్లు పూర్తి చేసిన తరువాత వాటిని కలెక్ట్ చేసి ఆన్లైన్లో నమోదు చేయాల్సి వుంది. అయితే ఆన్లైన్లో నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగంగా జరగకపోవడంతో మరోవారం పొడిగించి ఎస్ఐఆర్ ప్రక్రియను ఈనెల 11 లోపు పూర్తిచేయాలని ఎన్నికల ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ దరఖాస్తుల పంపిణీ, ఆన్లైన్లో నమోదు ప్రక్రియను నిర్ణీత గడువులోపు 20 మంది బీఎల్ఓలు పూర్తి చేశారు. వారిని కలెక్టర్ ప్రతాప్ తన కార్యాలయానికి పిలిపించి అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విధులను నిష్పక్షపాతంగా నిర్వహించినట్టు ఆయన కలెక్టర్ అభినందించారు. -
తిరుత్తణి ఆలయానికి దిత్వా ప్రభావం
తిరుత్తణి: దిత్వా తుపాన్ ప్రభావంతో మూడు రోజుల నుంచి తిరుత్తణి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉండడంతో అర్ధగంటలో భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. దిత్వా తుపాన్ ప్రభావంతో తిరుత్తణి ఆలయంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు రోజుల పాటు భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. దీంతో తక్కువ సంఖ్యలో ఆలయంకు వచ్చిన భక్తులు అర్ధగంటలో నేరుగా ఆలయంకు వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. మురుగన్ను దర్శించుకునేందుకు మంగళవారం అనువైన రోజు కావడంతో స్థానికులు మంగళవారం ఉదయం స్వామి దర్శనం చేసారు. మధ్యాహ్నంకు తరువాత కాస్తా భక్తుల రద్దీ చోటుచేసుకుంది. కార్తీక దీపోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం కొండ ఆలయ మాడ వీధిలో అశేష భక్తజనం నడుమ ఉత్సవర్లు వెండి నెమలి వాహనంలో కొలువుదీరనున్న క్రమంలో కార్తీక దీపం వెలిగిస్తారు. అదే సమయంలో కొండకు ఉత్తర దశలోని పచ్చిబియ్యం కొండలో 500 అడుగుల ఎత్తులో 150 కేజీల నెయ్యితో మహాదీపం వెలిగించనున్నారు. మహాదీపం దర్శించుకునే తిరుత్తణి పరిసర ప్రాంతాల ప్రుజలు తమ ఇళ్లలో కార్తీక దీపం వెలిగించనున్నారు. -
కాశీ తమిళ సంగమం 4.0 కోసం..
కొరుక్కుపేట: దక్షిణ రైల్వేలోని చైన్నె డివిజన్ మంగళవారం కాశీ తమిళ సంగమం 4.0 కోసం రెండవ బ్యాచ్ ప్రతినిధులు , కళాకారుల సజావుగా బయలుదేరడానికి వీలు కల్పించింది. ఇది ఈ సంవత్సరం విస్తరించిన సాంస్కృతిక చొరవలో ఓ ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ నుంచి 216 మంది ప్రతినిధులు, 48 మంది కళాకారులతో సహా మొత్తం 264 మంది పాల్గొన్నారు. ప్రత్యేక రైలు నంబర్ 06003 (చైన్నె సెంట్రల్–బనారస్) ద్వారా ఉదయం 04:15 గంటలకు డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరారు. ప్రయాణికులకు సమర్థంగా బోర్డింగ్ సజావుగా సహాయం అందించడానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్లను నియమించారు. ఈ సంవత్సరం సాంస్కృతిక, విద్యా కార్యక్రమాల ప్రారంభాన్ని అధికారికంగా సూచిస్తూ వారణాసిలోని నమో ఘాట్లో మంగళవారం జరుగుతున్న కాశీ తమిళ సంగమం 4.0 ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం లెట్ అజ్ లెర్న్ తమిళ్ –తమిళ కలచారం అనే థీమ్ తమిళ భాషా అభ్యాసాన్ని ఈ కార్యక్రమంలో కేంద్ర బిందువుగా ఉంచుతుంది. ఈ చొరవ తమిళనాడు, కాశీ మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింతగా పెంచడం, కాశీ ప్రాంతం నుంచి పాల్గొనేవారిని తమిళ అభ్యాస కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. తమిళనాడు నుంచి 1,400 మందికి పైగా పాల్గొనేవారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, రచయితలు, కళాకారులు, రైతులు, నిపుణులు, పరిశోధకులు కాశీలో సాంస్కృతిక, విద్యా, జ్ఞాన భాగస్వామ్య కార్యక్రమాలలో పాల్గొననున్నారు. 2022లో సంగమం ప్రారంభమైనప్పటి నుంచి ఇది అతిపెద్ద ప్రతినిధి బృందాలలో ఒకటి. పాల్గొనేవారు పెద్దఎత్తున ఉద్యమానికి మద్దతుగా, దక్షిణ రైల్వే, ఐఐటీ మద్రాస్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్యూ) సమన్వయంతో ఏడు ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోంది. కాగా మొదటి బ్యాచ్ ప్రతినిధులు 2025 నవంబర్ 29న కన్యాకుమారి నుంచి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. -
విస్తృతంగా వైద్య శిబిరాలు
సాక్షి, చైన్నె : ప్రస్తుత తరుణంలో నలం కాక్కుం స్టాలిన్ ( స్టాలిన్ హెల్త్ కేర్)శిబిరాలను విస్తృతం చేయడానికి అధికారులను సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఆరోగ్య శాఖనేతృత్వంలో అన్ని రకాల వైద్య సేవలను ప్రజలముంగిటకు తీసుకెళ్లే విధంగా స్టాలిన్ హెల్త్ కేర్ శిబిరాల ఏర్పాటుకు ఆగస్టులో ప్రభుత్వం శ్రీకారం చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇందు కోసం రూ. 13.58 కోట్లు నిధి కేటాయించారు. మొబైల్ సేవలతో కుగ్రామాలకు సైతం మెరుగైన వైద్యం తీసుకెళ్లే విధంగా లక్షలాది మందికి ఉపయోగకరంగా ఈ శిబిరాలు మారాయి. మధుమేహం, అధిక రక్తపోటు, మానసిక రోగులు, గుండె సంబంధిత రోగులు, గర్భిణీ , పాలిచ్చే తల్లులకు , పిల్లలు, దివ్యాంగులు, గిరిజనులు, వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన వారికి ఉపయోగకరంగా ఈ శిబిరాలను విస్తృతం చేశారు. 9,86,732 మంది ఈ శిబిరాల ద్వారా ప్రయోజనం పొందారు. ఈ హెల్త్ కేర్ పథకంపై సచివాలయంలో సీఎం స్టాలిన్ అధికారులు, ఆరోగ్యమంత్రి ఎం.సుబ్రమణియన్ తదితరులతో సమీక్షించారు. శిబిరాలు జరిగే ప్రదేశాలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు మెరుగు పరచాలని ఈసందర్భంగా సీఎం ఆదేశించారు.శిబిరాలను మరింత వేగవంతం చేయాలని, తగినంత మంది స్వచ్ఛంద సేవకుల సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. శిబిరాల నిర్వహణ గురించిన సమాచారాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేసే విధంగా ఆయా గ్రామాలలో చర్యలు విస్తృతం చేయాలని, వ్యాధులు నిర్ధారించ బడ్డ వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్మురుగానందం, ఆరోగ్య శాఖ కార్యదర్శి సెంథిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్షాక్తో తండ్రీ కుమారులు మృతి
వేలూరు: విద్యుత్ షాక్తో ఓ తండ్రి, ఇద్దరు కుమారులు దుర్మరణం చెందారు. ఈ విషాదక సంఘటన వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఒడుగత్తూరు సమీపంలోని రామనాయకన్పట్టి గ్రామానికి చెందిన జానికిరామన్(55) వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఇతని భార్య మల్లిక. వీరి కుమారులు వికాస్(25), లోకేష్(23), జీవ(22) ఉన్నారు. వికాస్కు వివాహం జరిగి ఒక కుమారుడున్నాడు. లోకేష్ బెంగుళూరులోని ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. జానకిరామన్, వికాస్, జీవ ముగ్గురూ కలిసి సొంత గ్రామంలో నర్సరీ పెట్టుకొని జీవిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ సెలవుపై సొంత గ్రామానికి వచ్చాడు. సోమవారం రాత్రి జానికిరామన్ ముగ్గురు కుమారులతో కలిసి నర్సరీ వద్దకు వెళ్లారు. నర్సరీ సమీపంలోని వ్యవసాయ పొలంలో వెళుతున్న జానికిరామన్ కేకలు వేశాడు. ఇది చూసిన ముగ్గురు కుమారులు అక్కడికి వెళ్లారు. అక్కడ విద్యుత్ తీగల్లో చిక్కుకున్న తండ్రిని కాపాడేందుకు ముగ్గురూ ప్రయత్నించారు. విద్యుత్షాక్కు గురై జానకిరామన్, వికాస్, జీవ అక్కడికక్కడే మృతిచెందారు. లోకేష్ తీవ్రగాయాలతో ప్రాణాలతో బయట పడ్డారు. విషయం తెలుసుకున్న వేపంకుప్పం పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వేలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణలో అదే గ్రామానికి చెందిన రైతు శంకర్ తన వ్యవసాయ భూమిలో అటవీ జంతువులు రాకుండా ఉండేందుకు విద్యుత్ తీగలతో కంచె వేసినట్లు అందులో చిక్కుకుని ముగ్గురు మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు శంకర్ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
జస్ట్ రూ. 200తో మొదలై రూ. 10 కోట్లదాకా ఇంట్రస్టింగ్ సక్సెస్ స్టోరీ
నూనూగు మీసాల విద్యార్థి దశలోనే ఉండగానే 18 ఏళ్ల వయసులో ఒక సంస్థకు సీఈఓ కాగలనని ఎవరైనా కలగంటారా? కానీ ఒకబ్బాయి కన్నాడు. పెద్ద సాహసమే చేశాడు. అభిరుచి, అభ్యాసం పట్టుదల ఉంటే ఏదైనా సాధించి తీరవచ్చని నిరూపించాడొక యువకుడు. కలలు కంటూ కూర్చోవడం కాదు, వాటిని సాకారం చేసుకోవడంలోనే ఉంటుంది కిక్కు. సూర్య వర్షన్ను చూస్తే అచ్చం ఇలాగే అనిపిస్తుంది. పదండి ఆయన సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.తమిళనాడులోని తూత్తుకుడిలో ఒక చిన్న వంటింటి నుంచి ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఆవిస్కృతమైన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. సూర్య వర్షన్ అద్భుతమైన నేకెడ్ నేచర్ (Naked Nature)ను స్థాపించాడు. కంపెనీ సీఈవోగా స్కిన్కేర్ అండ్ హెయిర్కేర్ బ్రాండ్ పరిశ్రమలో విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచాడు. View this post on Instagram A post shared by Surya Varshan (@zany_shan) ఉప్పు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన తూత్తుకుడి పట్టణంలో సూర్యకు చిన్నప్పటి నుంచి ఉప్పును ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాడు. మరీ ముఖ్యంగా గాయాలకు ఉప్పు కాపడం పెట్టడం చూసి ఆశ్చర్యపోయేవాడు. అసలు ఉప్పులో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకోవాలన్న కోరిక పుట్టింది. దానిగురించి స్టడీ చేశాడు. తద్వారా మెగ్నీషియం, కాల్షియం ఉప్పులో ఎక్కువగా ఉంటాయని, అవి కండరాల నొప్పులను తగ్గిస్తాయని లుసుకున్నాడు. అయితే ఉప్పుతో పాటు ఏదైనా పదార్థాన్నికలిపి మెడిసిన్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. రసాయనాలు కలపకుండా సహజ ఉత్పత్తులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో గతల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ రూ.200 తో,600 చదరపు అడుగుల ఇంటిలో మందారం పువ్వు, బార్లీ, వేపాకుతో కలిపి బాత్ సాల్ట్ ను తయారు చేశాడు. దానికి హైబిస్కస్ బాత్ సాల్ట్ అని పేరుపెట్టాడు. దీని ధర రూ. 320. 12వ తరగతిలో సూర్య వ్యవస్థాపక ప్రయాణం ప్రారంభమై 2019లో ఒక చిన్న ఫ్యాక్టరీ సెటప్కు మారింది. దాదాపు అన్ని పనులూ సింగిల్ హ్యాండ్తోనే నడిపించాడు. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ అవే ఈరోజు సూర్యను ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. చదవండి: సమంత-రాజ్ పెళ్లి వేడుక : అరటి ఆకులో విందు ఏం వడ్డించారో!సేంద్రీయ, చేతితో తయారు చేసిన ఉత్పత్తులు, పైగా దేశీ-ఆవు నెయ్యిని ఉపయోగించడంతో ముగ్ధుడైన ఆయుర్వేద వైద్యుడు బల్క్ ఆర్డర్ ఇవ్వడంతో సూర్య వ్యాపారం కీలక మలుపు మలుపు తిరిగింది. ఈ విజయంతో సూర్య తన చదువులను మధురైకి మార్చుకుని పూర్తిగా తన వ్యాపారంపై దృష్టి పెట్టాడు. యూట్యూబ్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు. వాటిని ఆన్లైన్లో బోధించి రూ. 2.2 లక్షలు సంపాదించాడు. దీన్ని తిరిగి నేకెడ్ నేచర్లో స్కేల్ ఆపరేషన్లకు పెట్టుబడి పెట్టాడు.ఇదీ చదవండి : పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?ప్రస్తుతం నేకెడ్ నేచర్ చర్మ ,జుట్టు సంరక్షణ, బాత్ బేబీ కేర్ వర్గాలలో, 70 ఉత్పత్తులనుపైగా సహజ ఉత్పత్తులను అందిస్తుంది. 2021-22 నాటికి రూ. 10 కోట్ల విలువను చేరుకుంది. కంపెనీ ఆఫీసు 4ఏవేల చదరపు అడుగులకు మారింది. ఈ బ్రాండ్ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, అంతర్జాతీయంగా కూడా ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. 2023లో గ్లోబల్ స్టూడెంట్ ఆంట్రపెన్యూర్ అవార్డు దక్కించుకున్నాడు. -
ఒంటరిగా ఉంటున్న వదినపై కన్నేసి..!
తమిళనాడు: కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని కట్టుకుడలూర్ ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణన్ భార్య తమిళరసి (35). వీరికి ఇద్దరు కుమారులు హరికృష్ణన్ (13), హరిశక్తి (10) ఉన్నారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా గత 10 సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నారు. గోపాలకృష్ణన్ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. తమిళరసి తన ఇద్దరు కుమారులతో కలిసి తన భర్త తమ్ముళ్లయిన బాలకృష్ణన్, మురుగనాథం ఇంట్లో నివసిస్తోంది. ఈ స్థితిలో కొన్ని రోజుల క్రితం, బాలకృష్ణన్, మురుగానందం తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ తమిళరసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళపై అత్యాచారాల నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు మురుగానందాన్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బాలకృష్ణన్కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బాలకృష్ణన్ తాగి ఇంటికి వచ్చాడు. తర్వాత తమిళరసితో గొడవ పడ్డాడు. తర్వాత తన వద్ద దాచిన కత్తితో తమిళరసి తలను నరికి హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడే ఉన్న బాలకృష్ణన్ను అరెస్టు చేశారు. -
టన్నెల్లో నిలిచిపోయిన మెట్రో రైలు.. ట్రాక్పై నడిచిన ప్రయాణికులు
చెన్నైలో మంగళవారం ఉదయం మెట్రో ప్రయాణికులు ఊహించని అనుభవాన్ని ఎదుర్కొన్నారు. విమ్కో నగర్ డిపో వైపు వెళ్తున్న బ్లూ లైన్ మెట్రో రైలు, సెంట్రల్ మెట్రో హైకోర్టు స్టేషన్ల మధ్య ఉన్న టన్నెల్లో అకాలంగా నిలిచిపోయింది. దీనితో ప్రయాణికులు రైల్వే ట్రాక్ మీదుగా నడుచుకుంటూ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ప్రారంభ సమయంలో బ్లూ లైన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. రైలులో విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు వెలుగు లేక చీకటిలోనే ఇరుక్కుపోయారు. అక్కడివారు రికార్డ్ చేసిన వీడియోల్లో ప్రయాణికులు హ్యాండ్రెయిల్ పట్టుకుని బయట పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది.అయితే పది నిమిషాల తర్వాత హైకోర్టు స్టేషన్ వరకు (దాదాపు 500 మీటర్లు) నడుచుకుంటూ వెళ్లాలని మెట్రో సిబ్బంది ప్రయాణికులకు తెలిపింది. అనంతరం వరుసగా క్యూలో నిలబడి టన్నెల్ ద్వారా జర్నీ కొనసాగించిన దృశ్యాలు కూడా సోషియల్ మీడియాలో వైరల్ అయ్యాయి.కాగా ఈ అంతరాయం విద్యుత్ లోపం లేదా సాంకేతిక సమస్య వల్ల జరిగి ఉండొచ్చని అంచనా. అయితే పరిస్థితిని త్వరగా సరిచేసిన అధికారులు మెట్రో సేవలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయని ప్రకటించారు.అనంతరం ఎక్స్లో చెన్నై మెట్రో అధికారులు స్పందిస్తూ ఎయిర్పోర్ట్ విమ్కో నగర్ డిపో బ్లూ లైన్ సేవలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి. గ్రీన్ లైన్లోని సెంట్రల్ మెట్రో–సెంట్ థామస్ మౌంట్ మార్గంలో కూడా రైళ్లు సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు.జరిగిన ఘటన వల్ల ఉదయం ప్రయాణికులు ఇబ్బంది పడ్డప్పటికీ అధికారులు సమస్యను తక్షణమే పరిష్కరించడంతో మెట్రో సేవలు మళ్లీ సవ్యంగా కొనసాగుతున్నాయి. -
డెల్టాలో దిత్వా నష్టంపై దృష్టి
సాక్షి, చైన్నె: దిత్వా తుపాన్ కారణంగా డెల్టాలో నష్టం తీవ్రతపై సీఎం స్టాలిన్ దృష్టి పెట్టారు. త్వరితగతిన నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే అక్టోబరులో కురిసిన వర్షానికి గాను బాధితులకు త్వరితగతిన నష్ట పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. వివరాలు.. శ్రీలంకలో ప్రళయాన్ని సృష్టించి దిత్వా తుపాన్ నాగపట్నంకు సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. శని, ఆదివారాలలో నాగపట్నం, మైలాడుతురై, తిరువారూర్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యలు, బాధితులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన పనులపై అధికారులతో సచివాలయంలో ఉదయం సీఎం స్టాలిన్ సమీక్షించారు. పంటనష్టం, పంట పొలాలలకు ఎదురైన వరద ప్రభావం గురించి ఆరా తీశారు. నాగపట్నం జిల్లా వ్యాప్తంగా 22 సెం.మీ , మైలాడుతురై జిల్లాలో 13 సెం.మీ , తిరువారూర్ జిల్లాలో 10 సెం.మీ, రామనాథపురం, తంజావూరు జిల్లాలో 9 సెం.మీ మేరకు వర్షం పడినట్టు అధికారులు వివరించారు. పంట నష్టం ,పంట పొలాల ఏ మేరకు నీరు పేరుకు పోయి ఉందో అన్న వివరాలను సేకరించే పనిలో ఉన్నట్టు అధికారులు వివరించారు. తక్షణం సమగ్ర వివరాలతో నష్టం తీవ్రత గురించి నివేదికను సమర్పించాలని అధికారులను ఈసంద్భంగా సీఎం ఆదేశించారు. అలాగే, అక్టోబరులో ఈశాన్యరుతు పవనాల సమయంలో కురిసిన వర్షానికి ఎదురైన నష్టం తీవ్రతను గురించి సైతం ఈసందర్భంగా సీఎంకు వివరించారు. అక్టోబరు 4,235 హెక్టార్లు 33 శాతం కంటే ఎక్కువ ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. దీంతో ఈ బాధిత రైతులకు త్వరితగతిన నష్ట పరిహారం చెల్లించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ మురుగానందం, రెవెన్యూ కార్యదర్శి ఎం సాయికుమార్, విపత్తు నిర్వహణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి పి. అముధ, ఐ కమిషనర్ సి.జి. థామస్ వైద్యన్, వ్యవసాయ కార్యిదర్శి వి. దక్షిణామూర్తి, డైరెక్టర్ పి. మురుగేష్, ఉద్యానవన శాఖ అధికారి కుమారవేల్ పాండియన్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా దిత్వా దెబ్బకు డెల్టాలో 2.10 లక్షల ఎకరాలలో పంట నష్ట జరిగినట్టుగా భావిస్తున్నారు. అలాగే నాగపట్నం జిల్లా శీర్గాలి సమీపంలోని వాగులో నీటి ఉధృతికి ఇద్దరు కొట్టుకెళ్లి సోమవారం మరణించారు. -
కరూర్ ఘటనపై సుప్రీంకోర్టు కమిటీ దృష్టి
సాక్షి, చైన్నె: కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కమిటీ దృష్టి పెట్టింది. సీబీఐ విచారణ తీరును సోమవారం ఆ కమిటీ పరిశీలించింది. సెప్టెంబరు 27వ తేదీన కరూర్లో టీవీకే నేత విజయ్ ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో 41 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. ఈ కేసును మద్రాసు హైకోర్టు ఆదేశాలతో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ బృందం తొలుత విచారించింది. ఆ తదుపరి సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ విచారిస్తోంది. గత నెల రోజులుగా సీబీఐఅ ధికారులు కరూర్లో తిష్ట వేసి పలు కోణాలలో విచారణ జరుపుతూ వస్తున్నారు. టీవీకే ముఖ్యనేతల వద్ద సైతం విచారణ పూర్తి చేశారు. ఈ దర్యాప్తు సరైన మార్గంలో సాగే దిశగా పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగీ నేతృత్వంలో కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. ఈ కమిటీలో ఇద్దర ఐపీఎస్ అధికారులతో పాటూ తమిళనాడు ప్రభుత్వం తరపున హోం శాఖ కార్యదర్శి ధీరజ్కుమార్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు. నెల రోజులుగా జరుగుతున్న విచారణ తీరు తెన్నులపై సుప్రీంకోర్టు కమిటీ దృష్టి పెట్టింది.కరూర్కు వచ్చిన ఈ కమిటీ ఇప్పటి వరకు జరిగిన సీబీఐ విచారణ, వెలుగులోకి వచ్చిన అంశాల గురించి సమాచారాన్ని రాబట్టింది. -
కనుల పండువగా గంధోత్సవం
ప్రసిద్ధి చెందిన నాగూర్ దర్గాలో గంధోత్సవాన్ని ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కనుల పండువగా నిర్వహించారు. నాగపట్నం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చిన గంధంను సోమవారం వేకువజామున సమాధి వద్ద ఉంచి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం, హిందూ అన్న భేదాలు లేకుండా భక్తజనం వేలాదిగా తరలి వచ్చారు. – సేలం నాగపట్నం జిల్లా నాగూర్లో ప్రసిద్ధి చెందిన హజ్రత్ సయ్యద్ షాహుల్ హమీద్(నాగూర్ ఆండవర్) దర్గా ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడకు నిత్యం ముస్లింలతో పాటుగా హిందువులు సైతం తరలి వస్తుంటారు. సముద్ర తీరంలో ఉన్న ఈ దర్గా వెలుపలి తలుపులు నిత్యం తెరిచి ఉంచడం, అంతర్గత తలుపులు నిర్ణీత సమయంలో మాత్రమే తెరుస్తారు. ఈ దర్గాకు ఐదు మినార్లు (గోపురాలు) ఉంటాయి. ఇందులో అతి పెద్ద మినార్ను మాత్రం మరాఠా పాలకులు నిర్మించినట్టు చరిత్ర చెబుతున్నది. హిందూ, ముస్లింల మధ్య శాంతియుత జీవనం, మార్గాన్ని సూచించే రీతిలో ప్రసిద్ది చెందిన ఈ దర్గాలో కందూరి ఉత్సవాలు అత్యంత వేడుకగా ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీ. పది రోజులకు పైగా ఈ ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. గత నెల 22వ తేదీ నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. నాగపట్నం నుంచి ఊరేగింపు 469వ కందూరి ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం సోమవారం వేకువజామున జరిగింది. నాగపట్నం నుంచి ఆదివారం గంధం ఊరేగింపు బయల్దేరింది. దారి పొడవునా మతాలకు అతీతంగా సర్వత్రా గంధోత్సవ రథాన్ని ఆహ్వానిస్తూ ముందుకు సాగారు. హిందూ, ముస్లిం మత సంప్రదాయాల మేరకు నైవేద్యాలు, నాదస్వరం, వాయిద్యాలతో అత్యంత భక్తిశ్రద్ధలతో ఊరేగింపు జరిగింది. నాగూర్కు సరిగ్గా సోమవారంవేకువ జామున మూడు గంటలకు ఈ గంధం చేరుకుంది. అక్కడి నుంచి సంప్రదాయ పద్ధతిలో దర్గాలోని నాగూర్ ఆండవర్ సమాధికి గంధం పూసే ఉత్సవం కనుల పండువగా న్విహించారు. ఆంధ్రప్రదేవ్, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచే కాకుండా గల్ఫ్ , మలేషియా, సింగపూర్ తదితర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ గంధోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. ఈ వేడుకలో సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఉత్సవం నేపథ్యంలో సోమవారం నాగపట్నం జిల్లాకు సెలవు ప్రకటించారు. -
క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ
కొరుక్కుపేట: శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మధురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని రవాణా శాఖ మంత్రి శివ శంకర్ సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండు బస్సుల డ్రైవర్లు కాంట్రాక్ట్ డ్రైవర్లు కాదు, ప్రభుత్వ డ్రైవర్లు. గత 3 సంవత్స రాలలో జరిగిన ప్రధాన ఘటన ఇది విచిత్రమై న ప్రమాదం. ఈ ప్రమాదంలో ఏలా జరిగిందో దర్యాప్తు చేస్తున్నాం. ప్రభుత్వ బస్సులకు అనుభవజ్ఞులైన, అర్హత కలిగిన డ్రైవర్లను మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రతిపక్ష పార్టీలు మాపై ఏదో ఆరోపిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి డ్రైవర్లు , ఆపరేటర్లకు నిరంతర శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణను తాము మరింత పెంచుతాం, ఈ బస్సులు చా లా సంవత్సరాలుగా నడుస్తున్నాయి. వాటిలో అనుభవజ్ఞులైన డ్రైవర్లను ఉపయోగిస్తున్నాం. కొంత నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్లు పనిభారంలో ఉన్నారా లేదా అనే దాని పై కూడా దర్యాప్తు చేస్తామని ఆయన అన్నారు. మంత్రి వెంట మధురై మేనేజింగ్ డైరెక్టర్ ధర్శరవనన్, కుంభకోణం మేనేజింగ్ డైరెక్టర్ దశరథన్, అరుల్ సుందరేష్ కుమార్ ఉన్నారు. గ్రూప్ –1 మెయిన్స్ పరీక్షల ప్రారంభం సాక్షి, చైన్నె: గ్రూప్ –1 మెయిన్స్ పరీక్ష నిఘా నీడలో సోమవారం చైన్నెలో ప్రారంభమైంది. రెండు విడతలుగా ఈనెల 10వ తేదీ వరకు పరీక్ష జరగనుంది. వివరాలు.. సబ్ కలెక్టర్, డీఎస్పీ, వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్కమిషనర్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ పోస్టుల భర్తీ నిమిత్తం ఏప్రిల్లో టీఎన్పీఎస్సీ నోటీఫికేషన్ జారీ చేసింది. వందలోపు పోస్టులకు గానూ సుమారు 2.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమినరీ పరీక్ష జూన్లోజరగ్గా 1.86 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో ఉత్తీర్ణులైన వారి వివరాలను ఆగస్టులో ప్రకటించారు. 1,843 మంది ఎంపిక మెయిన్స్కు అర్హత సాదించారు. వీరికి హాల్ టికెట్లను టీఎన్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా గత నెలాఖరులో విడుదల చేశా రు. వీరికి మెయిన్స్ పరీక్ష సోమవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. చైన్నెలో మాత్రమే 19 కేంద్రాలలో పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లను, నిఘా ను టీఎన్పీఎస్సీ చేసింది. గ్రూప్– 1 పోస్టులకు 1,2,3,4 పేపర్లకు సంబంధించిన పరీక్షలు నాలు గో తేదీ వరకు జరగనున్నాయి. ఆ తర్వాత గ్రూప్ –1ఏ పోస్టులకు గాను 8,9,10 తేదీలలలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆమ్నీ బస్సు బోల్తా– 8 మంది ప్రయాణికులకు గాయాలు తిరువొత్తియూరు: పుదుచ్చేరి నుంచి చైన్నెకి ఆదివారం రాత్రి ఆమ్నీ బస్సు వస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వా మామల్లపురం సమీపంలోని కడుంబడి తూర్పు తీర రహదారిపై బలమైన గాలులు, వర్షం కురుస్తున్న సమయంలో అదుపు తప్పి బస్సు హఠాత్తుగా రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి బోల్తా పడింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన ప్రయాణికులు కేకలు వేశారు. సమాచారం అందుకున్న మామల్లపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వారు బస్సు ముందు అద్దాలు పగలగొట్టి లోపల చిక్కుకుపోయిన వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారి ని మామల్లపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మిగతా ప్రయాణికులందరినీ మరో బస్సులో చైన్నెకి పంపించారు. ఈ ప్రమాదంతో ఆప్రాంతంలో కాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇప్పటి వరకు 8,022 ఎకరాల భూమి స్వాధీనం – మంత్రి శేఖర్ బాబు కొరుక్కుపేట: ద్రవిడ మోడల్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 3,896 దేవాలయాలలో కుంభాభిషేకం నిర్వహించారు. అలాగే అన్యాక్రాంతమైన రూ. 8,119 కోట్ల విలువైన 1,059 దేవాలయాలకు చెందిన 8,022.48 ఎకరాల భూమిని ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు తెలిపారు. వివరాలు.. తంజావూరు జిల్లాలో, బకోనంలో ప్రసిద్ధ మంగళాంబికై సమేత ఆదికుంబేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రతిష్ట జూన్ 5, 2009న జరిగింది. 16 సంవత్సరాల తర్వాత, ఈ ఆలయ కుంభాభిషేకం సోమవారం జరిగింది. హిందూ మత , దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు , ఉన్నత విద్యా శాఖ మంత్రి సర్ గోవి చెలియన్ జెండాను ఎగురవేసి కుంభాభిషేకం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనవరి నాటికి రాష్ట్రంలో దేవాలయాలలో కుంభాభిషేకాల సంఖ్య 4,000కు చేరుకుంటుందన్నారు. అలాగే 80 కొత్త రథాలు తయారు చేస్తున్నట్లు 600 దేవాలయాలలో రథాలకు రూ. 40 కోట్లతో మరమ్మతులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
గ్రీవెన్స్డేలో వినతుల స్వీకరణ
తిరువళ్లూరు: సోమవారం ఉదయం గ్రీవెన్స్డేను కలెక్టర్ ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించారు. పట్టాల కోసం 53, సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోకి 39, మౌలిక వసతుల కోసం 32 వినతులు సహా మొత్తం 195 వినతులు వచ్చాయి. అనంతరం ఆదిద్రావిడ సంక్షేమశాఖ తాడ్కో ద్వారా 9 మంది అర్హులకు ఐదు లక్షల చొప్పున 45 లక్షలు విలువ చేసే ఇంటి స్థలాలను కలెక్టర్ పంపిణీ చేశారు. దీంతో పాటూ డ్రాయింగ్ పోటీల్లో విజయం సాధించిన 25 మంది దివ్యాంగులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సురేష్, పీఏజీ వెంకట్రామన్, డిప్యూటి కలెక్టర్ బాలమురుగన్ పాల్గొన్నారు. -
కొంబు సీవి విడుదల తేదీ ఖరారు
తమిళసినిమా: ప్రముఖ దివంగత నటుడు, రాజకీయ నాయకుడు విజయ్కాంత్ వారసుడు షణ్ముగపాండియన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కొంబు సీవి. నటుడు శరత్కుమార్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో నటి తర్ణిక నాయకిగా నటించారు. నటుడు కాళీవెంకట్, కల్కి రాజా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి పొన్రామ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు వరుత్తపడాద వాలిబర్ సంఘం, రజనీమురుగన్, సీమరాజా, ఎంజీఆర్ మగన్, డీఎస్పీ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా కొంబు సీవి చిత్రానికి యువన్శంకర్రాజా సంగీతాన్ని, బాల సుబ్రమణియం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దీన్ని స్టార్ సినిమాస్ పతాకంపై ముఖేశ్ టి.చెల్లయ్య నిర్మిస్తున్నారు. కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టెయినర్ కథాంశంతో కూడిన ఈ చిత్ర టైటిల్ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. అదే విధంగా ఇటీవల చిత్ర గ్లింప్స్ను విడుదల చేయగా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్ వచ్చిందన్నారు. ఇది 1996లో ఉసిలంపట్టి, ఆండిపట్టి ప్రాంతాల్లో జరిగిన యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం అని చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండగ సందర్భంగా తెరపైకి తీసుకు వస్తున్నట్లు యూనిట్ వర్గాలు విడుదల చేసిన పోస్టర్లో పేర్కొన్నారు. -
క్లుప్తంగా
ప్రభుత్వ బస్సు–వ్యాన్ ఢీ ● ఇద్దరు మహిళలు మృతి ●10 మందికి తీవ్ర గాయాలు అన్నానగర్: కీల్పాక్కం సమీపం కూవత్తూరు కీలర్కొల్లై ప్రాంతానికి చెందిన మహిళలు కేళంబాక్కం పక్కనే ఉన్న పుదుప్పాక్కంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం, అదే ప్రాంతానికి చెందిన బాను (24), ఉమా (40) సహా 20 మంది మహిళలు ఒక వ్యాన్లో పనికి వెళ్లారు. ఆ వ్యాన్ ఉదయం 5.30 గంటలకు కీల్పాక్కం సమీపంలోని కున్నత్తూర్ ఈస్ట్ కోస్ట్ రోడ్డులో వచ్చింది. ఆ సమయంలో, ప్రభుత్వ బస్సు చైన్నె నుండి పాండిచ్చేరికి పోతోంది. అప్పుడు ప్రభుత్వ బస్సు, వ్యాన్ అకస్మాత్తుగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. వ్యాన్లో ఉన్న బాను, ఉమ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబాల రోదనలతో ఆ ప్రాంతం శోకసంద్రంగా మారింది.రూ. 3 లక్షల చొప్పున పరిహారం కొరుక్కుపేట: చెంగల్ పట్టు జిల్లా తిరుక్కజుకుంద్రం తాలూకా, సోమవారం ఉదయం, చైన్నె నుంచి కున్నత్తూర్ గ్రామం మీదుగా పుదుచ్చేరికి వెళ్తున్న ప్రభుత్వ బస్సు, కీజర్కొల్లై గ్రామం నుండి అలందూర్లోని ఓ ప్రైవేట్ కంపెనీకి ఉద్యోగులను తీసుకెళ్తున్న ప్రైవేట్ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు ఉమా, బాను అక్కడికక్కడే మరణించారు. ఈ వార్త విన్న సీఎం స్టాలిన్ మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల సహాయ సహాయం ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడివారిని చెంగల్పట్టు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, పుదుచ్చేరి ప్రభుత్వ వైద్య కళాశాల, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి సాధ్యమైనంత ఉత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష, స్వల్ప గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ. 50 వేలు చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆదేశించారు. సీనియర్ నటి దేవిక భర్త దేవదాస్ కన్నుమూత తమిళసినిమా: దివంగత సీనియర్ నటి దేవిక భర్త దేవదాస్ ఆదివారం ఉదయం చైన్నెలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈయన వయసు 88 ఏళ్లు. సినీ నిర్మాత ఎష్ఎంఎస్ సుందరరామన్ కొడుకులలో దేవదాస్ ఒకరు. దివంగత ప్రఖ్యాత దర్శకుడు భీంసింగ్ వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆ తరువాత వెగుళి పెన్ అనే చిత్రాన్ని తమిళం,తెలుగు భాషల్లో స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. కాగా సీనియర్ నటి దేవికను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తరువాత విడిపోయారు. వీరి కూతురే నటి కనక. కాగా దేవదాస్ కూతురు కనకకు కూడా దూరంగా జీవిస్తువచ్చారు. కాగా ఇటీవల వృద్ధాప్యం కారణంగా అనారోగ్యానికి గురైన దేవదాస్ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. వదినను హత్య చేసిన మరిది అరెస్టు అన్నానగర్: కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని కట్టుకుడలూర్ ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణన్ భార్య తమిళరసి (35). వీరికి ఇద్దరు కుమారులు హరికృష్ణన్ (13), హరిశక్తి (10) ఉన్నారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా గత 10 సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నారు. గోపాలకృష్ణన్ ప్రస్తుతం చైన్నెలో ఉంటున్నారు. తమిళరసి తన ఇద్దరు కుమారులతో కలిసి తన భర్త తమ్ముళ్లయిన బాలకృష్ణన్, మురుగనాథం ఇంట్లో నివసిస్తోంది. ఈ స్థితిలో కొన్ని రోజుల క్రితం, బాలకృష్ణన్, మురుగానందం తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ తమిళరసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళపై అత్యాచారాల నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు మురుగానందాన్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బాలకృష్ణనన్కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బాలకృష్ణన్ తాగి ఇంటికి వచ్చాడు. తర్వాత తమిళరసితో గొడవ పడ్డాడు. తర్వాత తన వద్ద దాచిన కత్తితో తమిళరసి తలను నరికి హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడే ఉన్న బాలకృష్ణన్ను అరెస్టు చేశారు. రూ.46 లక్షలు మోసం – మహిళా మేనేజర్ అరెస్టు అన్నానగర్: కన్యాకుమారి జిల్లా తేంగపట్టణంలోని ప్రైవేట్ ఆర్థిక సంస్థలో కాంజిరావిలైకి చెందిన బిందు (46) బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఈ స్థితిలో ప్రాంతీయ మేనేజర్ జగన్ డార్విన్ (35) తనిఖీ చేశారు. ఆ సమయంలో, బ్రాంచ్ మేనేజర్ బిందు నగలు తాకట్టు పెట్టిన కస్టమర్లకు నకిలీ రశీదులతో రూ. 46 లక్షలు దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. ఈ విషయంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా, పోలీసులు బిందు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గౌతమ్ రామ్ కార్తీక్ హీరోగా నూతన చిత్రం
తమిళసినిమా: నటుడు గౌతమ్ రామ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ఆదివారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు గణేశ్ కే.బాబు నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఈయన డాడా వంటి విజయవంతమైన చిత్రం ద్వారా దర్శకుడిగా పాపులర్ అయ్యారన్నది తెలిసిందే. ప్రస్తుతం ప్రస్తుతం కరాటే బాబు అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రాలను జరుపుకుంటోంది. కాగా తాజాగా నిర్మాతగా అవతారమెత్తిన గణేశ్ కే.బాబు డ్రాఫ్ బై జీకేబి అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి నటుడు గౌతమ్ రామ్ కార్తీక్ హీరోగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దినా రాఘవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు రాజుమురుగన్ శిష్యుడన్నది గమనార్హం. కాగా ఈ చిత్రానికి దర్శకుడు రాజు మురుగన్ మాటలను అందించారు. చిత్ర వివరాలను నిర్మాత గణేశ్ కే.బాబు తెలుపుతూ ఇది సమకాలీన రాజకీయాల ఇతి వృత్తంతో సాగే వినోదభరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తూ తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాధించికున్న నటుడు గౌతమ్ రామ్ కార్తీక్లో ఈ చిత్రంలో కథా పాత్రకు సరిపోయే ప్రతిభ, అర్హత ఉండటంతో ఆయన్ని హీరోగా ఎంపిక చేసినట్లు చెప్పారు.అదే విధంగా ఇందులో దర్శకుడు సెల్వరాఘవన్ వైవిధ్యభరిత కథా పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. వీరితో పాటు నటి అంజనా నేత్రన్, రాబీ, పీ.వాసు, ఏ.వెంకటేశ్, మారన్, ఇందుమతి, ఆదిత్య కదీర్, భాగ్యం శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ప్రదీప్ కలిరాజా ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు దర్శకుడు హెచ్,.వినోద్, రాజుమురుగన్, నిర్మాత ఫైవ్స్టార్ సెంథిల్కుమార్ తదితర సినీ ప్రముఖులు విశ్చేసి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు అందించారు. -
తీవ్ర వాయుగుండంగా దిత్వా
బలహీన పడ్డ దిత్వా తుపాన్ తీవ్ర వాయుగుండంగా మారింది. చైన్నె తీరానికి సమీపంలో గంటల తరబడి కేంద్రీ కృతమై ఉండడంతో అనేక చోట్ల ఎడ తెరపి లేని వర్షం మోస్తారుగా పడుతోంది. మరికొన్ని చోట్ల భారీగానే వర్షం పడింది. రోడ్లపై వరదలు కొంత మేరకు పోటెత్తడంతో కార్పొరేషన్ సిబ్బంది తొలగింపు పనులలో నిమగ్నమయ్యారు. చైన్నె, తిరువళ్లూరుకు మంగళవారం మధ్యాహ్నం వరకు రెడ్ అలర్ట్ ప్రకటించగా, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ఇచ్చారు. నేడు చైన్నె, శివారు జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు వర్షాల నేపథ్యంలో మంగళవారం చైన్నె, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సముద్రంలో అలల తాకిడి అధికంగా ఉండటంతో చైన్నెలోని కాశీమేడు, తిరువొత్తియూరు, పట్టినంబాక్కం, బీసెంట్ నగర్ , నీలాంకరై, కోవళం తదితర బీచ్లన్నీ మూసి వేశారు. బీచ్లకు ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు భద్రత కల్పించారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు తొమ్మిది గంటల పాటూ చైన్నె ఎన్నూరులో 19 సెం.మీ, మనలిలో 16 సెం.మీ, బ్రాడ్ వే 15 సెం.మీ, ఐస్ హౌస్ 14 సెం.మీ, వడపళని 13 సెం.మీవ, మేడవాక్కం, కత్తి వాక్కం 12 సెం.మీ, కాశిమేడులో 11 సెం.మీ వర్షం పడటం గమనార్హం. ఈ వర్షం మరింతగా రాత్రి వేళ పెరిగే అవకాశాలతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా చైన్నె, శివారులలో వ్యవహరిస్తున్నారు. ఎలాంటి విపత్తు ఎదురైనా సరే ఎదుర్కొనే విధంగా సన్నద్ధమయ్యారు. చైన్నె సముద్ర తీరంలో కెరటాల ఉధృతి సాక్షి, చైన్నె : కావేరి డెల్టా జిల్లాలోని నాగపట్నం, మైలాడుతురై, తిరువారూర్లో దిత్వా తుపాన్ శని, ఆదివారాలలో తీవ్ర ప్రభావాన్ని చూపిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి కారైక్కాల్, పుదుచ్చేరి వైపుగా కదిలిన దిత్వా క్రమంగా వేగం తగ్గడంతో బలహీన పడింది. ఫలితంగా ఆదివారం చైన్నె, శివారులలో వర్షం కురువలేదు. అయితే తర్వాత పుదుచ్చేరి నుంచి చైన్నె వైపుగా కదిలిన దిత్వా బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో సోమవారం ఉదయం ఆరు నుంచి వరుణుడు బీభత్సం సృష్టించాడు. చిరుజల్లులతో మొదలై... చెంగల్పట్టు, కాంచీపురం, చైన్నె, తిరువళ్లూరు జిల్లాలో చిరు జల్లులతో మొదలైన వర్షం మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి మరింతగా పెరిగింది. చైన్నె తీరానికి 50 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా సుమారు ఏడు గంటలకు పైగా ఒకే చోట కేంద్రీకృతం కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రభావంతో చైన్నె, శివారు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. శివారులలోని పూందమల్లి, ఆవడి, ఎన్నూరు. అంబత్తూరు ,మదుర వాయిల్బైపాస్. పోరూర్ మార్గం, పెరంబూరు, పటాలం పరిసరాలలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై వరద నీరు పోటెత్తడంతో వాహనల రాక పోకలకు తీవ్ర ఆటంకం తప్పలేదు. పూందమల్లి మార్గంలో వేలప్పన్ చావడి సర్వీసు రోడ్డులో వర్షపు నీటి గుంటలో ఓ కారు చిక్కుకుంది. హుటాహుటిన నీటి తొలగింపు పనులలో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. చైన్నెలోని కామరాజర్ సాలైం, నుంగంబాక్కం హైరోడ్డు, శాంతోమ్ రోడ్డు పరిసరాలలో రోడ్లపై నీరు చేరడంతో మోటారు పంపు సెట్ల ద్వారా తొలగింపు పనులు వేగవంతం చేశారు. టీనగర్ పరిసరాలలోని లోతట్టు ప్రాంతాలలోకి సైతం నేరు చేరడంతో అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. శివారులలోని తిరువళ్లూరు, చెంగల్పట్టు ,కాంచీపురం, రాణి పేట జిల్లాలలోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉదయం వర్షం తేలికగా పడటంతో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వలేదు. దీంతో సాయంత్రం విద్యార్థులు వర్షంలో తడుచుకుంటూ ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షానికి తోడుగా ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉండటంతో గ్రీన్ వేస్ రోడ్డు, అన్నా నగర్, నుంగంబాక్కంతో పాటూ అనేక చోట్ల చెట్లు, చెట్ల కొమ్మలు విరిగి పడటంతో హుటా హుటీన తొలగింపు పనిలో రెస్క్యూ బృందాలు నిమగ్నమయ్యాయి. గ్రీన్ వేస్ రోడ్డులో చెట్లు నేల కొరడంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఒకే చోట తీవ్ర వాయుగుండం కేంద్రీకృతం కావడంతో చైన్నె నుంచి అండమాన్ వైపుగా వెళ్లాల్సిన విమానాల సేవలు రద్దు చేశారు. మరింత అలర్ట్ చైన్నె తీరానికి సమీపంలో కేంద్రీ కృతమైన తీవ్ర వాయుగుండం సాయంత్రం తర్వాత గంటకు మూడు కి.మీ వేగంతో నెమ్మది కదలడంతో పాటూ మేఘాలు కమ్ముకోవడం, గాలి ప్రభావం పెరగడం వెరసి చైన్నె, తిరువళ్లురు జిల్లాలకు మంగళవారం సాయంత్రం వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. చెంగల్పట్టు, కాంచీపురం, రాణి పేట జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈదురు గాలుల ప్రభావంతో పాటూ అనేక చోట్ల మోస్తరుగా వర్షం పడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా మంగళవారం సాయంత్రం వరకు చైన్నె తీరంపై ప్రభావాన్ని చూపించవచ్చని అంచనా వేస్తున్నారు. తర్వాత చైన్నె తీరానికి మరింతగా సమీపించి ఆంధ్రా వైపుగా కదిలే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా, చైన్నె నగరంలో గత అనుభవాల దృష్ట్యా, ఎక్కడెక్కడ వర్షపు నీరు చేరేందుకు వీలున్నదో అక్కడంతా కార్పొరేషన్ సిబ్బంది రంగంలోకి దిగారు. నగరంలోని 22 సబ్వే మార్గాలపై దృష్టి పెట్టారు. విల్లుపురం, కడలూరు తదితర జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు హుటాహుటిన చైన్నె, శివారు జిల్లాలకు చేరుకున్నాయి. -
రేపే కార్తీక మహా దీపోత్సవం
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజైన బుధవారం సాయంత్రం 2,668 అడుగుల ఎత్తుగల మహా కొండపై మహా దీపాన్ని వెలిగించనున్నారు. దీని కోసం రాగి రాక్షస కొప్పరిని ఆలయ అధికారులు కొండపైకి తరలించేందుకు సిద్ధం చేశారు. ఇక బుధవారం ఉదయం 4గంటలకే ఆలయ రాజగోపురం ఎదుట భరణి దీపం వెలిగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు మహా దీపాన్ని కొండపైన వెలిగిస్తారు. ఇందుకోసం ఆరు అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు, కలిగిన రాగి రాక్షస కొప్పరిని ఆలయ గోపురం సమీపంలోని నంది విగ్రహం వద్ద ఉంచి వేద మంత్రాల నడుమ మహా దీప కొప్పరికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోపూజ చేసి కొప్పరిని ఆలయ ప్రాంగణంలో ఉంచారు. సోమవారం ఉదయం కొప్పరికి ప్రత్యేక పూజలు చేసి సావల్ పూండి గ్రామానికి చెందిన వంశ పార్యపర్య గ్రామస్తులు అన్నామలైయార్కు హరోం... హరా... అంటూ నామస్మరణ చేస్తూ 2,668 అడుగుల ఎత్తుగల కొండపైకి రాక్షస కొప్పరిని తీసుకెళ్లనున్నారు. మహా దీపానికి ఉపయోగించే వెయ్యి మీటర్లు గాడా వస్త్రం, 3,500 కిలోల నెయ్యిని ఆలయంలో సిద్ధంగా ఉంచారు. కొండపైకి అనుమతి నిరాకరించే అవకాశం వర్షాలకు కొండ చరియలు, బండరాళ్లు కొండ పై నుంచి కింద పడుతుండటంతో గతంలో మాదిరిగా ఈ సంవత్సరం మహా దీపం వెలిగించే కొండపైకి భక్తులను అనుమతించేందుకు వీలు కలగదని భావిస్తున్నారు. భక్తులు కొండ కింద నుంచే మహా దీపాన్ని దర్శించుకునే వీలు కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే మహా దీపం కొండపైకి వెళ్లేందుకు ముందస్తు అనుమతి పొందిన వారిని మాత్రమే అనుమతించనున్నారు. భక్తుల తొక్కిస లాట లేకుండా చర్యలు చేపడుతున్నారు. అంబులెన్స్, అగ్ని మాపక వాహనాల సిబ్బందిని అందుబాటులో ఉంచారు. భక్తులు ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించరాదు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు దీపోత్సవానికి రానున్న నేపథ్యంలో పట్టణంలో ప్లాస్టిక్ వస్తులు ఉపయోగించకుండా 75 మంది స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు గుర్తింపు కార్డులు అందజేసి నిఘా ఉంచినట్లు కలెక్టర్ తర్పగరాజ్ తెలిపారు. భక్తులకు అక్కడక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసామని అదే విధంగా తాగునీటి వసతి, గిరివలయం రోడ్డులో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. రెండు మానవ రహిత విమానాలతో నిఘా దీపోత్సవానికి సుమారు 40 లక్షల మంది భక్తులు పాల్గొననున్నారని ఇప్పటికే 50 ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా గిరివలయం రోడ్డులో 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 10 వేల మంది పోలీసులతో బందోబస్తులో పాల్గొంటారని, 17 యూనిట్ల మహిళా పోలీసులు బందోబస్తులో ఉంటారని ఎస్పీ సుధాకర్ తెలిపారు. ఆలయ రాజగోపురం పైనుంచి రెండు మానవ రహిత విమానాతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బందోబస్తుకు వేలూరు, విల్లుపురం, కాంచిపురం వంటి నాలుగు రీజిన్ల నుంచి డీఐజీలు, 14 మంది ఎస్పీలు, 22 మంది అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు బందోబస్తుకు హాజరుకానున్నారు.అశ్వ వాహనంపై చంద్రశేఖరుడి విహారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిద రోజైన సోమవారం ఉదయం వినాయకుడు, చంద్రశేఖరుడు అశ్వ వాహనంలో మాడ వీధుల్లో ఊరేగారు. ఉదయం స్వామి వార్లుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేసి అశ్వ వాహనంపై ఆశీనులు చేసి మాడ వీధుల్లో ఊరేగించారు. -
ఏఐ టెక్నాలజీతో పెద్ద టార్చర్
తమిళసినిమా: కథానాయకిగా దశాబ్దం కాలం పూర్తి చేసుకున్న యువ నటి కీర్తీసురేశ్. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ బ్యూటీ గత ఏడాది తన చిరకాల బాయ్ఫ్రెండ్తో మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు నడిచారు. అలా నటనకు చిన్న గ్యాప్ తీసుకున్న కీర్తీసురేశ్ ఇటీవల మళ్లీ నటించడం ప్రారంభించారు. కాగా ఈమె టైటిల్ పాత్రను పోషించిన రివాల్వర్ రీటా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా కీర్తీసురేశ్ ఓ భేటీలో పేర్కొంటూ చాలా కాలం తరువాత తాను నటించిన తమిళ చిత్రం విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. ఇది తాను నటించిన ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం అని పేర్కొన్నారు. అయితే సినిమా పరిశ్రమలో పురుషాధిక్యత కొనసాగుతోందని, హీరోలో నటించిన చిత్రాలకే అభిమానులు వస్తారనీ అన్నారు. హీరోయిన్ ఓరియన్టెడ్ కథా చిత్రాలు బాగుంటేనే ప్రేక్షకులు చూస్తున్నారని అన్నారు. కాగా ఇంతకు ముందు హిందీలో ఒక చిత్రం, ఒక వెబ్ సిరీస్ చేశానని చెప్పారు. ప్రస్తుతం తెలుగులో విజయ్దేవరకొండకు జంటగా ఒక చిత్రం చేస్తున్నానని, అదే విధంగా మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నట్లు చెప్పారు. ఇవి వచ్చే ఏడాది వరుసగా తెరపైకి వస్తాయని చెప్పారు. ఏఐ టెక్నాలజీ గురించి ప్రస్తావిస్తూ అది పెద్ద టార్చర్గా మారిందన్నారు. తనకు ఒక చెడ్డ అలవాటు ఒకటుందని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయ్యే రీల్స్ ఎక్కువగా చూస్తానని చెప్పారు. వాటిని తన భర్తకు షేర్ చేస్తానన్నారు. వాటిని చూసిన ఆయన ఇవి ఏఐ టెక్నాలజీతో రూపొందించినవి అని తెలియడం లేదా? అని తనను ఆట పట్టిస్తారన్నారు. ఇటీవల తాను తప్పుగా పోజ్ ఇచ్చినట్లు ఏఐ స్టిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యిందన్నారు. అది తనకే ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అలా మనుషులు కనిపెట్టిన టెక్నాలజీ మనుషులకే ముప్పుగా మారిందని కీర్తీసురేశ్ అన్నారు. తన భర్తకు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదని, అయినా ఆయన తనకుంటే ఎక్కువగా చిత్రాలు చూస్తారని చెప్పారు. తనను పెళ్లికి ముందు ఆ తరువాత వ్యత్యాసం గురించి అడుగుతున్నారని, అయితే తనకు అలాంటి వ్యత్యాసం ఏమీ తెలియడం లేదన్నారు. తాను 15 ఏళ్లుగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్లనో ఏమో పెద్దగా వ్యత్యాసం తెలియడం లేదని ఆమె పేర్కొన్నారు. రియోరాజ్ హీరోగా రామ్ ఇన్ లీలాతమిళసినిమా: యువ నటుడు రియోరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి రామ్ ఇన్ లీలా అనే టైటిల్ను ఖరారు చేశారు. 2019లో నెంజముండు నేర్మైయుండు ఓడు రాజా చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన నటుడు రియోరాజ్. ఆ తరువాత ప్లాన్ పన్ని పన్ననుమ్, జో, స్వీట్హార్ట్ చిత్రాల్లో నటించారు. ఇటీవల ఈయన హీరోగా నటించిన ఆన్పావం పొల్లాదదు చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా తన నూతన చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈవా ఎంటర్టెయిన్మెంట్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థల అధినేతలు ఆర్.రవీంద్రన్, సుందర్శన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రియోరాజ్కు జంటగా వర్తిక అనే నమ నటి నాయకిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ చిత్రం ద్వారా రామచంద్రన్ కన్నన్ దర్శకుడిగా పరిచచం అవుతున్నారు. అంకిత్ మీనన్ సంగీతాన్ని ,మల్లిఖార్జున్ ఛాయాగ్రహణంను అందిస్తున్న ఈ చిత్ర టైటిల్తో కూడిన పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ఇది సాధారణ లవ్ స్టోరీ కాదు తన రామ్ ఇన్ లీలా అర్థం చేసుకోండి అంటూ నటుడు రియోరాజ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ చిత్రం విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. -
తిరువళ్లూరు జిల్లాలో 747మి.మీ. వర్షపాతం
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఆవడి, గుమ్మిడిపూండి, పొన్నేరి, చోళవరం, రెడ్హిల్స్ ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి, జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోలోని రెడ్హిల్స్లో 16సెంమీ వర్షపాతం అత్యధికంగా నమోదు కాగా, పళ్లిపట్టు, ఆర్కేపేటలో వర్షపాతం నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. చోళవరంలో 117మిమీ, పొన్నేరిలో 125మిమీ, రెడ్హిల్స్లో 161మిమీ, జమీన్కొరట్టూరులో 27మిమీ, పూందమల్లిలో 44మిమీ, తిరువేళంగాడులో 9మిమీ, తిరుత్తణిలో 4మిమీ, పూండిలో 20మిమీ, తామరపాక్కంలో 30మిమీ, తిరువళ్లూరులో 29మిమీ, ఊత్తుకోటలో 16మిమీ, ఆవడిలో 71మిమీ వర్షపాతం నమోదైంది. మొత్తానికి 747 మిమీ వర్షపాతం నమోదు కాగా సరాసరిన 49.80 శాతం నమోదైనట్టు తెలిపారు. చాలా ప్రాంతాల్లో వర్షపు నీటితో కలిసి మురికి నీరు ప్రవహించింది. చోళవరం, రెడ్హిల్స్, పొన్నేరిలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. సోమవారం పాఠశాలలు యథావిదిగా పని చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షంలో తడుస్తూ రాకపోకలు సాగించారు. కూరగాయలు, పాలను పొన్నేరిలో ఎక్కువ ధరలకు విక్రయించారు. భారీ వర్షం కారణంగా జమీన్కొరట్టూరు, పొన్నేరి, రెడ్హిల్స్, కడంబత్తూరు, పేరంబాక్కం, పేరండూరు, ఊత్తుకోట, పెద్దపాళ్యం తదితర ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. -
డీఎంకే ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి ఇంట్లో చోరీ
– 300 సవర్ల నగల అపహరణ సాక్షి, చైన్నె: డీఎంకే ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి ఏకేఎస్ విజయ్ ఇంట్లో చోరీ జరిగింది. 300 సవర్ల బంగారు నగలు, నగదును గుర్తు తెలియని దుండగులు అపహరించుకెళ్లారు. ద్రావిడ మోడల్ ప్రభుత్వానికి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా కేఎస్ విజయ్ వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వ సంబంధిత అంశాలు, కేంద్ర పెద్దలతో అనుమతులు తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ఈయన మాజీ ఎంపీ కూడా. అలాగే డీఎంకే వ్యవసాయ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు. తంజావూరు కొత్త బస్టాండ్ ఆవరణలోని శేఖరన్ నగర్లో ఆయన నివాసం ఉంది. గత నెల 28వ తేదీన ఇంటికి తాళం వేసి నాగపట్నంకు కుటుంబంతోపాటుగా విజయన్ వెళ్లారు. సోమవారం తిరిగి వచ్చి చూడగా ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. లోనికి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. ఇందులో ఉన్న 300 సవర్ల బంగారాన్ని దుండగులు అపహరించుకెళ్లి ఉన్నారు. సీసీ కెమెరాలలోని దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సాధారణంగా ఏకేఎస్ విజయ్ ఇంటి పరిసరాలు సందడిగానే ఉంటాయి. అయితే తాజాగా పథకం ప్రకారం ఎవరో ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునన్న అనుమానంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
బాలాపురానికి జాతీయ గుర్తింపు
తిరుత్తణి: వర్షపు నీటి పొదుపులో జాతీయ స్థాయిలో బాలాపురం తృతీయ స్థానం సాధించడంతో ఆ పంచాయతీ మాజీ సర్పంచ్ తెన్నరసును డీఎండీకే ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తిరుత్తణిలో డీఎండీకే కార్యకర్తల సమావేశాన్ని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి అధ్యక్షతన ఆదివారం సాయంత్రం నిర్వహించారు. తిరుత్తణి నియోజకవర్గం వ్యాప్తంగా నుంచి పార్టీ శ్రేణులు పాల్గొన్న సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ పార్టీ జిల్లా ఎన్నికల ఉప కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే నల్లతంబి పాల్గొని జనవరిలో డీఎండీకే నిర్వహించనున్న మహానాడును విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో వర్షపు నీటిని ఆదా చేసి మొక్కలు పెంచి, భూగర్భ జలాలు స్థాయిని పెంచడంలో కృషికి ఫలితంగా జాతీయ స్థాయిలో తృతీయ ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ అవార్డు స్వీకరించారు. ఉత్తమ పంచాయతీగా అవార్డుకు కారకుడైన ఆ పంచాయతీ మాజీ సర్పంచ్, మండల డీఎండీకే కార్యదర్శి తెన్నరసును సభలో సన్మానించారు. -
ఘనంగా శక్తి గణపతి కుంభాభిషేకం
తిరుత్తణి: శక్తి గణపతి ఆలయ మహా కుంభాభిషేకం వేడుకలు సోమవారం కోలాహలంగా నిర్వహించారు. తిరుత్తణిలోని శేఖర్వర్మ నగర్లో శక్తి గణపతి ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టి, సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ నిర్మాణపు పనులు పూర్తి కావడంతో శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు మహాకుంభాభిషేకం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో యాగశాలలు ఏర్పాటు చేసి, నిత్య హోమగుండ పూజలు చేపట్టారు. సోమవారం ఉదయం మహాపూర్ణాహుతి హోమ పూజలు అనంతరం మేళతాళాలు నడుమ పవిత్ర పుణ్య తీర్థాల కలశాలు బయల్దేరి గోపుర కలశానికి వేదమంత్రోచ్ఛారణ నడుమ మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద గుమిగూడిన భక్తులపై పవిత్ర పుణ్యతీర్థాలు వెదజల్లారు. అనంతరం శక్తి గణపతికి అభిషేక పూజలు చేపట్టి, పుష్పాలంకరణలో దీపారాధన చేపట్టారు. భక్తులు స్వామిని దర్శించుకున్నారు. భక్తులందరికీ అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. మహాకుంభాభిషేకం వేడుకల్లో ఎమ్మెల్యే చంద్రన్, డీఎంకే మాజీ జిల్లా కార్యదర్శి భూపతి సహా అనేక మంది పాల్గొన్నారు. రోబోటిక్ పోటీల సందడి పాత్రల దుకాణం దగ్ధం అన్నానగర్: కోయంబత్తూరులోని గణపతికి చెందిన శివకుమార్ స్థానికంగా పాత్రల దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం, ఉద్యోగులు పని ముగించుకుని దుకాణానికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత, సోమవారం తెల్లవారుజామున, పాత్రల దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత, అకస్మాత్తుగా, దుకాణంలోని 5 సిలిండర్లు భయంకరమైన శబ్దంతో ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కాని ఇందులో, దుకాణంలోని రూ. లక్షల విలువైన పాత్రలు, వస్తువులు కాలిపోయి ధ్వంసమయ్యాయి. ఈవీ విభాగంలో 32 శాతం వృద్ధి సాక్షి, చైన్నె: ఎలక్ట్రిక్ వాహన విభాగంలో 3 శాతం వృద్ధిని నమోదు చేశామని జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటారు ఇండియా ప్రకటించింది. ఎంజీ సెలక్ట్ లగ్జరీ ఈవీ విభాగంలో రెండో స్థానాన్ని సాధించినట్లు స్థానికంగా సోమవారం ప్రకటించారు. సీవై–2024తో పోల్చితే జనవరి – నవంబర్ 2025లో 32 శాతం వార్షిక వృద్ధిని సాధించామని వివరించారు. 5754 యూనిట్ల అమ్మకాలు జరిగినట్టు పేర్కొన్నారు. ఎంజీ సెలక్ట్ ప్రారంభించినప్పటి నుంచి 1000 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు ప్రకటించారు. వరుడి మృతి తిరువొత్తియూరు: రాణిపేట జిల్లా ఆర్కాటు అరుంబాక్కం గ్రామానికి చెందిన పెరియసామి, ఆనంది దంపతుల కుమారుడు అజిత్కుమార్ (27). వీరు చైన్నెలో ఉంటూ బిల్డింగ్ పనులు చేస్తున్నారు. వీరు పనిచేసిన అదే స్థలంలో కళ్లకురిచ్చికి చెందిన వధువు సంధ్య(23) కుటుంబం కూడా బిల్డింగ్ పనులు చేస్తోంది. రెండు కుటుంబాలకు స్నేహం ఏర్పడి బంధువులుగా కలిసిపోయారు. అరుంబాక్కం పెరియసామి తన కుమారుడు అజిత్కుమార్కు, సంధ్యను పెళ్లి చేసుకున్నారు. రెండు కుటుంబాల సమ్మతితో ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7.30 గంటల మధ్య అజిత్కుమార్, సంధ్యలకు అరుంబాక్కంలోని కులక్కరై అమ్మన్ గుడిలో వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి అయిన సంతోషంలో వధూవరులు, బంధువులు ఉండగా, వరుడు అజిత్కుమార్, పెళ్లి దుస్తులతోనే గుడి పక్కన ఉన్న చెరువు దగ్గరికి మూత్ర విసర్జనకు వెళ్లారు. వెళ్లిన వ్యక్తి అరగంటకు పైగా తిరిగి రాకపోవడంతో, ఆందోళన చెందిన బంధువులు వెతకడం ప్రారంభించారు. అజిత్కుమార్ చెరువులో శవంగా తేలియాడుతూ కనిపించారు. ఇది చూసి వధువు కుటుంబం, వరుడి కుటుంబం తల్లడిల్లి ఏడ్చారు. అక్కడున్న ప్రజలందరి సహాయంతో శవాన్ని బయటకు తీశారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. హత్య కేసులో ముగ్గురి అరెస్టు అన్నానగర్: కృష్ణగిరి సమీపంలో మహిళను ఆస్తి వివాదం కారణంగా హత్య చేసిన బంధువుతో సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను కర్రలతో కొట్టి, గొంతు నులిమి చంపారని వెల్లడైంది. కృష్ణగిరి మావత్తలోని పరకూర్ సమీపంలోని మెల్సిని నివాసపురం నివాసి మురుగన్. ఇతని భార్య గోవిందమ్మాళ్(56). మురుగన్ గతంలోనే మరణించాడు. దీని కారణంగా గోవిందమ్మాళ్ 25వ తేదీన 100 రోజుల పని ప్రాజెక్టులో భాగంగా 3 అంతస్తుల ఇంటి నిర్మాణం కోసం పనికి వెళ్లింది. అక్కడి కొండ దిగువన అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో గోవిందమ్మాళ్ని కర్రతో కొట్టి, గొంతు నులిమి చంపారని శవపరీక్ష నివేదికలో తేలింది. దీని తరువాత నిందితులను అరెస్టు చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణ సందర్భంగా ప్రత్యేక బృందం దిగ్భ్రాంతికరమైన సమాచారాన్ని విడుదల చేసింది. గోవిందమ్మాళ్ చనిపోయే ముందు, ఆమె భర్త మురుగన్ సుబ్రమణి వద్ద ఒక స్థలాన్ని కొనుక్కునేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ భూమిని సుబ్రమణి నుండి, మురుగన్ అన్న పచ్చియప్పన్ కుమారుడు శక్తివేల్(44) కొన్నాడు. శక్తివేల్ తమ భూమిని కొనుగోలు చేయడంపై గోవిందమ్మాళ్ అతనితో తరచు వాగ్వాదం చేసేది. ఇంతలో శక్తివేల్ కొత్త ఇల్లు కట్టుకుని ఇంట్లోకి మారాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన గోవిందమ్మాళ్ శక్తివేల్ని అతనికి మద్దతుగా మాట్లాడిన వెంకటరామన్(65), గోవిందరాజ్(64)ను కూడా ఆమె అనుచిత పదాలతో దుర్భాషలాడింది. ఇది వారిని ఆవేశానికి గురిచేసింది. వారు గోవిందమ్మాళ్ని చంపాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం, శక్తివేల్, వెంకట్రామన్, గోవిందరాజ్ అనే ముగ్గురు వ్యక్తులు గోవిందమ్మాళ్ను కర్రలతో కొట్టి, గొంతు నులిమి చంపినట్లు తెలిసింది. దీని తర్వాత, శక్తివేల్, వెంకట్ రామన్, గోవిందరాజ్లను ఆదివారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. – ఉత్తమ ప్రాజెక్టులకు బహుమతుల ప్రదానం తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా ఆవడిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రోబోటిక్ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి మూడు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు. తమ ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. ఈ పోటీలు ఆవడిలోని ప్రైవేటు పాఠశాలలో నిర్వహించారు. ఈ ప్రదర్శనను దక్షిణ భారత వ్యాపార సంస్థ అధ్యక్షుడు థామస్ వర్గీస్ ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులు సైన్సుపై అవగాహన పెంచుకోవడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రాజెక్టులను రూపొందించడానికి ఆసక్తి ప్రదర్శించడం అభినందిచదగ్గ విషయమన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పెరుగుతున్న క్రమంలో వాటికి తగ్గట్టు పరిశోధనలు నిర్వహించి, పొరుగు దేశాలకు సవాలుగా మారాలన్నారు. రోటోటిక్, ఎస్టీఈఎం, ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్, ఐఐటీతోపాటు ఇతర రంగాలకు చెందిన సాఫ్ట్వేర్ ఉపయోగంపై సైతం ఆయన ప్రసగించారు. అనంతరం ఉత్తమ ప్రాజెక్టులను రూపొందించిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అతిథులుగా పాల్గొన్నారు. వాలీబాల్ విజేతలకు బహుమతి ప్రదానం పళ్లిపట్టు: వాలీబాల్ పోటీల్లో విజేతలను పళ్లిపట్టు సెంట్రల్ మండల డీఎంకే కార్యదర్శి బీడీ చంద్రన్ బహుమతులతో సత్కరించారు. డీఎంకే యువజన విభాగ కార్యదర్శి, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కర్లంబాక్కంలో రెండు రోజులపాటు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పది జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో షోళింగర్ వెంకటాపురం జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఆటలో షోళింగర్ జట్టు విజేతగా నిలిచింది. బహుమతులు పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఇందులో పళ్లిపట్టు సెంట్రల్ మండల డీఎంకే కార్యదర్శి బీడీ చంద్రన్ పాల్గొని, విజేత జట్టుకు రూ.ఐదు వేలు బహుమతితోపాటు ట్రోఫీ అందజేసి, సత్కరించారు. అలాగే ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన జట్లను కూడా సత్కరించారు. ఇందులో విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ మురళీసేన, యువజన విభాగం మండల సహాయ కన్వీనర్ దేవరాజు తదితరులు పాల్గొన్నారు. మృతి చెందిన కార్యకర్తకు రూ.10 లక్షల సాయం కొరుక్కుపేట: ‘ప్రజలను రక్షించండి, తమిళనాడును కాపాడండి’ అనే నినాదంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రతి జిల్లాలో తమిళనాడు అంతటా ప్రచార పర్యటన చేస్తున్నారు. దీని ప్రకారం, ఆదివారం రాత్రి ఈరోడ్ జిల్లాలోని గోపిచెట్టిపాళయం పక్కన ఉన్న నల్లకౌండన్ పాళయం ప్రాంతంలో పళనిస్వామి పాల్గొని ప్రసంగించారు. 50 వేలకు పైగా స్వచ్ఛంద సేవకు లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొండయ్యంపాలయంకు చెందిన అన్నాడీఎంకే కార్యకర్త అర్జునన్ (43) స్పృహ కోల్పోయి మరణించాడు. గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు కేసు నమో దు చేశారు. విషయం తెలుసుకున్న పళణిస్వామి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచిన అర్జునన్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా పార్టీ తరపున రూ.10 లక్షల చెక్కు అందజేశారు. -
ఆలూరి రామస్వామి పూర్ణావతి ట్రస్ట్ ఆవిర్భావం
–ప్రారంభించిన డాక్టర్ ప్రసాద్ తోటకూర సాక్షి, చైన్నె: సామాజిక సేవలలో రాణిస్తున్న తెలుగు ప్రముఖురాలు, విద్యావేత్త డాక్టర్ ఏవీ శివకుమారి తన తల్లిదండ్రులైన ఆలూరి రామస్వామి, పూర్ణావతి పేర్లతో ఆలూరి రామస్వామి పూర్ణావతి తెలుగు చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. సోమవారం ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్(ఆస్కా) ఆవరణలో జరిగిన వేడుకలో తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర హాజరై ఈ ట్రస్ట్ లోగో ను ఆవిష్కరించారు. మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలోడాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తల్లిదండ్రుల పేరుతో ట్రస్ట్ను ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. విశిష్ట అతిథిగా ఇన్ కంట్యాక్స్ మాజీ ప్రిన్సిపల్ కమిషనర్ బి.మురళి మాట్లాడుతూ సమాజ సేవలోనే ఆత్మసంతృప్తి ఉంటుందన్నారు. ఆస్కా కార్యదర్శి దిలీప్ కుమార్, తమిళనాడు ప్రభుత్వ మాజీ అదనపు ముఖ్య కార్యదర్శి టి.ప్రభాకర రావులు హాజరై ప్రసంగించారు. ట్రస్టు వ్యవస్థాపకురాలు డాక్టర్ శివకుమారి మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రులు కారణమని పేర్కొన్నారు. తండ్రి ఆశయాల కోసం ఈ ట్రస్ట్ ద్వారా సమాజనికి సేవ చేయనున్నట్టు, పేద విద్యార్థులకు చేయూత అందించనున్నట్టు వివరించారు. తెలుగు భాషను వ్యాప్తి చేయడం, ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడం, భక్తి కార్యక్రమాలను నిర్వహించడం, భావితరాలకు తెలుగు నేర్పడం, తెలుగు పండుగలు, సంస్క్కతిని, కూచిపూడి కార్యక్రమాలు విస్తృతం చేయనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో గాయని అరుణా శ్రీనాథ్, రాజేశ్వరి, తెలుగు ప్రముఖులు జేకే రెడ్డి, కందనూరు మధు, ఆదిశేషయ్య, గొల్లపల్లి ఇశ్రాయేలు తదితరులు పాల్గొన్నారు. -
రిటైర్డ్ ఉద్యోగులపై చిన్నచూపు తగదు
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరికాదని వేలూరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దీనదయాళన్ అన్నారు. ఆ సంఘం కార్యవర్గ సభ్యుల సమావేశం వేలూరులోని సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5వ తేదీన వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని పలు మార్లు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం సరికాదన్నారు. ఇప్పటికే పలు పోరాటాలు చేసినా, వినతిపత్రాలు సమర్పించినా స్పందించక పోవడం న్యాయం కాదన్నారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ధర్నాలో జిల్లాలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులంతా కలుసుకొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలను సభ్యులు నెరవేర్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం కార్యదర్శి మనోహరన్, కోశాధికారి తిరునావకరసు, సమాచార విభాగం అధికారి రాజ, రాధాక్రిష్ణన్, పారిరాజన్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో అత్త, అల్లుడు మృతి
వేలూరు: ఆంబూరు సమీపంలో సోమవారం వేకువజామున నిలిచి ఉన్న లారీని కారు అతి వేగంగా ఢీకొన్న ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్, అతని అత్త అక్కడికక్కడే మృతి చెందగా బార్యకు తీవ్ర గాయాలయ్యాయి. కోవై జిల్లా గౌండాంపాళ్యం ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దివ్య మోహన్(50) ఇతని భార్య లవ్లీ, అత్త రోస్లీ(72) ఉన్నారు. రోస్లీ అనారోగ్యం క్షీణించడంతో వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు ఆదివారం రాత్రి ముగ్గురూ కారులో బయల్దేరారు. కారును దివ్య మోహన్ నడుపుతున్నాడు. కారు తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని విన్నమంగళం గ్రామం వద్ద వేకుమ జామున 5.30 గంటల సమయంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని అతి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో దివ్య మోహన్, అతని అత్త రోస్లీ తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. లవ్లీ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన సహ వాహనదారులు వెంటనే ఆంబూరు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో బయటపడ్డ లవ్లీని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కారును క్రేన్ల సాయంతో పోలీసులు బయటకు తీశారు. ఈ మేరకు ఆంబూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
అంకాళమ్మకు ప్రత్యేక పూజలు
తిరువళ్లూరు: తిరుప్పాచ్చూర్లో ప్రసిద్ధి చెందిన శ్రీఅంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కుంభాభిషేకం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీఅంకాళపరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. ఆలయానికి ఇటివల జీర్ణోద్ధరణ పనులను చేపట్టారు. పనులు పూర్తయిన క్రమంలో కుంభాభిషేకం కార్యక్రమానికి గత మూడు రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. ఉత్సవాల్లో భాగంగా డున్నర గంటలకు గణపతి హోమం నిర్వహించి, ఆలయ గోపురంపై ఉన్న కలశంపై పుణ్యజలాలను వదిలి కుంభాభిషేకం నిర్వహించారు. ఉత్సవాలకు నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్నదానం చేశారు. -
విజయ్కు సలహాలివ్వను: కమల్ హాసన్
హీరో విజయ్కు తాను సలహాలిచ్చే స్థితిలో లేనంటున్నారు హీరో, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్. అనుభవమే అన్నీ నేర్పుతుందంటున్నారు. కేరళలో జరిగిన హార్టస్ ఆర్ట్ అండ్ లిటరేటర్ ఫెస్టివల్కు కమల్ హాసన్, మంజువారియర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమ్లకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అదే నా శత్రువుతమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన విజయ్.. అధికార డీఎమ్కే పార్టీయే తమ రాజకీయ ప్రత్యర్థి అన్నారు. మరి మీరు ఎవర్ని ప్రత్యర్థి/ శత్రువుగా భావిస్తున్నారు? అని అడిగారు. అందుకు కమల్.. నాకు పార్టీల కన్నా పెద్ద శత్రువు కులతత్వం. దాన్ని అంతమొందించడమే నా ప్రధాన లక్ష్యం. కులమే నాకు పెద్ద శత్రువు అని బదులిచ్చారు.అదే గొప్ప గురువు2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విజయ్ (Vijay)కు ఏమైనా సలహాలిస్తారా? అన్న ప్రశ్నకు నేను సలహాలిచ్చే స్థాయిలో లేను. నా సోదరుడు విజయ్కు సలహాలిచ్చేందుకు ఇది సరైన సమయం కూడా కాదు. అనుభవమే అన్నింటికంటే గొప్ప గురువు. మనుషులు పక్షపాతంగా ఉంటారేమో కానీ అనుభవానికి అటువంటి హద్దులు ఉండవు. సినిమాఅనుభవమే అన్ని పాఠాలు నేర్పిస్తుంది అన్నారు. మొత్తానికి విజయ్తో శత్రుత్వం లేదని తన మాటల ద్వారా చెప్పకనే చెప్పారు. కమల్ హాసన్ (Kamal Haasan) చివరగా మణిరత్నం థగ్ లైఫ్ సినిమాలో కనిపించారు. విజయ్ విషయానికి వస్తే ఆయన గతేడాది గోట్ మూవీతో పలకరించారు. తర్వాత అతడు ప్రధాన పాత్రలో నటించిన జన నాయగన్ 2026 సంక్రాంతికి విడుదలవుతోంది.చదవండి: నేడు సమంత పెళ్లి? బరి తెగించారంటూ ఆమె పోస్ట్ -
విశాల్కు జంటగా మిల్కీబ్యూటీ?
తమిళసినిమా: నటుడు విశాల్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న మకుడం చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. కాగా దీని తర్వాత మరో కొత్త చిత్రానికి కమిట్ అయినట్లు సమాచారం. ఈ చిత్రానికి సుందర్. సి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈయన రజనీకాంత్ కథానాయకుడిగా కమలహాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడిన తరుణంలో అనూహ్యంగా దర్శకుడు సుందర్.సి ఆ చిత్రం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విశాల్ హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కమర్షియల్ అంశాలతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఇందులో తమన్నా కథానాయకిగా నటించనున్నట్లు తెలిసింది. 6 ఏళ్ల తర్వాత మళ్లీ మరోసారి వీరిద్దరూ జత కట్టడానికి సిద్ధమవుతున్నారు, అదేవిధంగా సుందర్.సి దర్శకత్వంలో ఇంతకుముందు అరణ్మణై–4 చిత్రంలో తమన్నా నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే మదగజరాజా వంటి హిట్ చిత్రం తర్వాత విశాల్, సుందర్.సి కాంబోలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సుందర్.సి, నయనతార ప్రధాన పాత్రను పోషిస్తున్న మూక్కుత్తి అమ్మన్–2 చిత్తానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని పూర్తి చేసిన తర్వాత విశాల్ హీరోగా నటించే చిత్రానికి ఈయన దర్శకత్వం వహించే అవకాశం ఉంది. -
కనులపండువగా మహాకుంభాభిషేకం
పళ్లిపట్టు: యోగి వేమన ఆలయ మహాకుంభాభిషేకం ఆదివారం కనులపండువగా నిర్వహించారు. పళ్లిపట్టు సమీపంలోని అత్తిమాంజేరిపేటలో తెలుగు కవి వేమనకు రెండు వందల సంవత్సరాలుగా ఆలయం నిర్మించి పూజిస్తున్నారు. ఇటీవల ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామీణుల నిధుల సాయంతో ఆలయం నిర్మించారు. కొత్తగా వేమన 4 అడుగుల విగ్రహం ప్రతిష్టించి ఆలయ మహాకుంభాభిషేకం శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆదివారం ఉదయం మహాపూర్ణాహుతి హోమ పూజలు అనంతరం మేళతాళాల నడుమ పవిత్ర పుణ్యతీర్థాలు తరలించి యోగి వేమన విగ్రహానికి పవిత్ర జలాలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
సిరై సింగిల్ సాంగ్ విడుదల
తమిళసినిమా: విక్రమ్ ప్రభు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సిరై. సెవెన్ స్క్రీన్న్స్ స్టూడియో పతాకంపై ఎస్ఎస్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎల్కే అక్షయ్కుమార్ మరో ప్రధాన పాత్రను పోషించారు. ఆనంద నాయకిగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు, తమిళ్ కథను అందించారు. ఆయన నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథను రాసినట్లు చిత్రవర్గాలు తెలిపాయి. ఈ వైవిధ్య భరిత కథా చిత్రానికి సురేష్ రాజకుమారి దర్శకత్వం వహించారు. ఈమె దర్శకుడు వెట్రిమారన్ శిష్యురాలు అన్నది గమనార్హం. ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీనికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులోని మన్నిచ్చిడు అనే పల్లవితో సాగే పాటను ఆదివారం విడుదల చేశారు. ఈ పాటను వేలూరులో విక్రమ్ప్రభు, ఆనందలపై చిత్రీకరించినట్లు దర్శకుడు చెప్పారు. గాయనీగాయకులు సత్యప్రకాష్, ఆనంది జోషి పాడిన ఈ పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. చిత్ర కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని, చిత్ర శాటిలైట్, ఓటీటీ హక్కులను జీ సంస్థ పొందినట్లు నిర్మాతల వర్గం తెలిపింది. సిరై చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ -
క్లుప్తంగా
ఆలయ హుండీ చోరీ యత్నం – ముగ్గురు బాలురు అరెస్టు అన్నానగర్: తాంబరం సమీపంలోని ఇరుంపులియార్ తిరువల్లువర్ పురం ప్రధాన రహదారిపై శ్రీ గౌరీ అమ్మన్ ఆలయం ఉంది. శనివారం గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం గేటును పగలగొట్టి, భక్తులు హుండీలో కానుకలుగా ఇచ్చిన డబ్బు, వస్తువులను దొంగిలించడానికి యత్నించారు. దీనితో దిగ్భ్రాంతి చెందిన స్థానికులు వెంటనే తాంబరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తులో ఆ ముగ్గురు 15, 16, 17 సంవత్సరాల వయస్సున్న బాలురని తేలింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. బైక్ కొనివ్వలేదని.. – పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య అన్నానగర్: అడయార్లోని రామసామి గార్డెన్ ప్రాంతానికి చెందిన హరికరణ్ (18), పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి. ఈ స్థితిలో, ఇతను ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించా డు. దీనితో దిగ్భ్రాంతి చెందిన అతని తల్లిదండ్రులు శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు హరికరణ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కాగా ఇటీవల హరికరణ్ తన తల్లిదండ్రులను తనకు కొత్త బైక్ కొనాలని కోరాడు. అయితే కొన్ని నెలల తర్వాత అతనికి బైక్ కొంటామని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన హరికరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. పోలీసులు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సోమనాథస్వామి ఆలయ కుంభాభిషేకం కొరుక్కుపేట: చైన్నె కొలత్తూర్లోని 400 ఏళ్ల నాటి పురాతన ఆలయం సోమనాథస్వామి ఆలయం మహాకుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. కుంభాభిషేకం జరిగి 12 ఏళ్ల అయిన సందర్భంగా రూ.2.29 కోట్ల ఆలయ నిధులు, రూ.71 లక్షల విరాళాలు సహా రూ. 3 కోట్లతో13 రకాల పునరుద్ధరణ పనులు చేశారు. ఈక్రమంలో ఆదివారం సోమనాథస్వామి ఆలయం కుంభాభిషేకం వేదమంత్రోచ్ఛరణల నడుమ జరిగింది. రాష్ట్ర హిందూ మత ధార్మిక శాఖ మంత్రి పి.కె. శేఖర్బాబు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా, 300 ఏళ్ల పురాతనమైన వెంకటచలపతి పరిపాల సభ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది, దానిని తొలగించి, కమిషనర్ ప్రజా సంక్షేమ నిధి నుంచి రూ.72 లక్షలతో పునర్నిర్మించారు. భక్తుల పూజల కోసం దీనిని ప్రారంభించారు. హిందూ ధర్మాదాయ శాఖ జాయింట్ కమిషనర్ ఎస్.మోహనసుందరం, ముల్లై, కార్పొరేషన్ జోనల్ కమిటీ చైర్మన్ సరితా మహేశ్కుమార్, అసిస్టెంట్ కమిషనర్ కె. భారతీరాజా, కార్పొరేషన్ సభ్యులు నాగరాజా, ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్ మోహన్ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 14 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 79,791 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,911 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.73 కోట్లు సమర్పించారు. దర్శన టికెట్లు లేని వారికి దర్శతిరుమలలో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. శ్రీవారి ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ రవి తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ అధికా రులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
కోలాహలం.. రథోత్సవం
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. ఆదివారం పంచమూర్తుల పంచ రథోత్సవం కనులపండువగా సాగింది. కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన ఆదివారం ఉదయం 3 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నామలై సమేత ఉన్నామలై అమ్మవారికి పూజలు చేసి పుష్పాలంకరణలు చేశారు. అనంతరం పంచమూర్తులైన వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అన్నామలై సమేత ఉన్నామలై అమ్మ, పరాశక్తి అమ్మ, చండికేశ్వరుడులకు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం వినాయకుడిని ఉదయం 6.25 గంటలకు పుష్పాలంకరణలో రథంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథం అన్నామలైయార్ ఆలయ రాజగోపురం నుంచి బయలు దేరింది. ఆ సమయంలో చలి కూడా భక్తులు లెక్క చేయకుండా అరుణాచలేశ్వరునికి హరోంహరా అంటూ రథం దారాన్ని లాగారు. కలెక్టర్ తర్పగరాజ్, ఎస్పీసుధాకర్, ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ రథాన్ని లాగి పూజలు చేశారు. మాడ వీధుల్లో ఊరేగిన పంచ రథాలు మాడ వీధుల్లో బయలు దేరిన రథం ఉదయం 9.20 గంటలకు వచ్చి చేరింది. అనంతరం ఉదయం 9.35 గంటలకు సుబ్రహ్మణ్యస్వామిని ఊరేగించారు. మధ్యాహ్నం 12.20 గంటలకు మహారథాన్ని ఊరేగించారు. మహారథంలో అన్నామలైయార్ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రథాన్ని ఒక పక్క మహిళా భక్తులు, మరో పక్క పురుషులు లాగారు. సాయంత్రం 4 గంటలకు ఉన్నామలై అమ్మవారి రథోత్సవం జరిగింది. ఈ రథాన్ని మహిళా భక్తులు మాత్రమే లాగారు. స్వామి వారి మహారథం, చండికేశ్వరుడి రథం, పంచ రథాలు విడివిడిగా మాడ వీధుల్లో ఊరేగించారు. వేలాది మంది భక్తులు పాల్గొని పంచ మూర్తులను దర్శించుకున్నారు. కొంతమంది భక్తులు వరాలతో జన్మించిన సంతానాన్ని చెరకుతో ఉయ్యాల కట్టి అందులో సంతానాన్ని ఉంచి ఆలయ మాడ వీధుల్లో తిరిగి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవంలో 5లక్షల మంది భక్తులు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఐదు రథోత్సవాలకు 5లక్షల మందికి పైగా భక్తులు తిరువణ్ణామలై చేరుకుని రథాలపై బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆరువేల మందితో పోలీస్ బందోబస్తు నిర్వహించినట్లు ఎస్పీ సుధాకర్ తెలిపారు. పారంపర్య గుర్రపు సంత ప్రారంభం రథోత్సవం రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరిగే గుర్రపు సంత ఆదివారం ఉదయం ప్రారంభమైంది. దీపోత్సవాన్ని పురష్కరించుకొని వంద సంవత్సరాల క్రితం గుర్రపు సంతను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోడ్డు, పుదుక్కోటై, తిరుపత్తూరు, హొసూరు, కర్ణాటక రాష్ట్రాల నుంచి గుర్రాలను తీసుకొచ్చి సంతలో ఉంచారు. ఈ సంత ఈనెల 3న దీపోత్సవం రోజున ముగుస్తుంది. -
డిసెంబర్లో గగన్యాన్ జీ1 ప్రయోగం
– ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ తిరువళ్లూరు: డిసెంబర్ చివరి నాటికి మానవరహిత గగన్యాన్ జీ–1 రాకెట్ను అంతరిక్షంలోకి పంపి సురక్షితంగా తిరిగి తీసుకుని రావాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని వేల్టెక్ యూనివర్సిటీలో 15వ బ్యాచ్ విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వర్సిటీ అధ్యక్షురాలు రంగరాజన్ మహాలక్ష్మి కిషోర్ అధ్యక్షత వహించగా వర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఫ్రొఫెసర్ కల్నల్ రంగరాజన్ ప్రారంభోపన్యాసం చేశారు. విశిష్ట అతిథిలుగా రెనాల్ట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దేబషిష్ నెగోయి, అసెంజర్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కెంపన్నా తదితరులు హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న నారాయణన్ మాట్లాడుతూ నాసా సింథటిక్ అప్సర్ రాడార్ను గతంలో అంతరిక్షంలోకి ప్రయోగించినట్టు వివరించారు. ఈ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు ఒకసారి భూమి కక్ష్యలోకి వెళ్లి అధిక రిజల్యూషన్తో చాయాచిత్రాలను తీస్తుందన్నారు. ఇందులో ఎల్–బ్యాండ్, ఎస్–బ్యాండ్ సింథటిక్ రాడార్లు వున్నాయని, ఎస్–బ్యాండ్ను పూర్తిగా భారత్ సాంకేతిక పరిజ్ఞానంతోనే రూపొందించామన్నారు. వీటి ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, భూపంకాలను కచ్చితంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. భారత్ ద్వారా చంద్రుడిపైకి మానవులను పంపే ప్రణాళిక వుందని, ఇందుకోసం ప్రధానమంత్రి కూడా ఆమోదం తెలిపారని వివరించారు. ఇటీవల స్వీదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని రాకెట్లను ప్రయోగించి విజయం సాధించినా, విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగిస్తున్నట్టు వివరించారు. -
క్లుప్తంగా
తిరువొత్తియూరు: ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాంచీపురంలో వెలిసిన ఏకాంబరనాథర్ ఆలయంలో డిసెంబర్ 8వ తేదీన మహా కుంభాభిషేకం జరగనుంది. ప్రస్తుతం కుంభాభిషేకానికి సంబంధించిన చివరి దశ పనులైన యాగశాల మండపం ఏర్పాటు, ఆలయ ప్రాంగణ మరమ్మతులు, భక్తుల కోసం సౌకర్యాలు కల్పించడం వంటి పనులు పూర్తి వేగంతో జరుగుతున్నాయి. శివగంగై తీర్థకుళం పక్కన ఏర్పాటు చేస్తున్న నవకుండ యాగశాల మండపం, 70 హోమ గుండాలు ఏర్పాటు పనులపై తమిళనాడు ప్రధాన పర్యవేక్షణ, కార్యనిర్వాహక ఇంజినీర్ దామోదరన్ నేతృత్వంలోని అధికారులు, హిందూ మత ,ధర్మాదాయ శాఖ అధికారులు కలిసి తనిఖీ చేశారు. కుంభాభిషేకం సమయంలో దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు కల్పించాల్సిన ప్రాథమిక సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను చేపట్టుటకు అధికారులకు సూచించారు. ఆలయ గోడల మరమ్మతులు, నల్లరాళ్లు పరచడం, పురాతన విగ్రహాలకు పర్యావరణ అనుకూల రంగులు వేయడం, రాజగోపురం మూలవర్ సన్నిధి సహా వివిధ సన్నిధులలోని గోపురాలపై కలశాలు ఏర్పాటు చేయడం వంటి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. తిరువొత్తియూరు: చైన్నె మాధవరం ప్రాంతంలో అనుమానాస్పదంగా వస్తున్న కారును అడ్డుకోగా డ్రైవర్ పరారైన పరిస్థితిలో, ఆ కారు నుంచి సుమారు 265 కిలోల నిషేధిత గుట్కా వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వివరాలు.. చైన్నె మాధవరం పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు గత 20వ తేదీ సాయంత్రం మాధవరం సీఎండీఏ లారీ పార్కింగ్ వెనుక వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో దారి గుండా వచ్చిన ఒక కారును అనుమానంతో పోలీసులు అడ్డగించారు. పోలీసులను చూసిన డ్రైవర్, కారును రోడ్డు పక్కన ఆపి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు, ఆ కారును పూర్తిగా తనిఖీ చేశారు. కారు లోపల 265 కిలోల గుట్కా ప్యాకెట్లు దాచి ఉంచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రవీణ్ కుమార్ (18), హక్కం సింగ్ (30) అని తెలిసింది. వారిని శనివారం పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని క్రిష్టియన్పేటలోని ఫిట్జీ గ్లోబల్ పాఠశాలలో తొమ్మిది ప్రపంచ రికార్డులు, 16 వ్యక్తిగత ప్రపంచ రికార్డుల కోసం విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పాఠశాల ప్రిన్సిపల్ పొంగల్ పునిత గత నెల 15వ తేదీన ప్రారంభించారు. అప్పటి నుంచి వేలూరులో 25 ప్రపంచ రికార్డులను సృష్టించి జిల్లాలోనే మొదటి పాఠశాలగా ఫిట్జీ గ్లోబల్ పాఠశాలగా నిలిచింది. దీంతో బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం జరిగింది. ఇందులో 16 వ్యక్తిగత ప్రపంచ రికార్డులను విజయవంతంగా పూర్తి చేసి ఎలైట్ రికార్డ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను గుర్తించాయన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. ప్రిన్సిపల్ పొంగల్ పునిత, వైస్ ప్రిన్సిపల్ నిశాంత్ త్రిపాఠి, అంకుర్ కుమార్ జైన్, రాహుల్కుమార్ విలేకరులతో మాట్లాడుతూ వ్యక్తిగతంగా సాధించిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులకు క్రమశిక్షణ, కళ, సంస్కృతి, సంప్రదాయంపై దృష్టి సారిస్తుందన్నారు. విద్యార్థులను సమాజానికి మంచి పౌరులుగా అంకితం చేస్తామన్నారు. తిరువొత్తియూరు: నాగర్కోయిల్లో ఓ బ్యూటీషియన్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాగర్కోయిల్ వెట్టూర్ణిమడం పరమార్థ లింగపురం ప్రాంతానికి చెందిన మైఖేల్ జేవియర్. ఇతని భార్య శోభా. వీరి కుమార్తె లివినా (21) బీఎస్సీ కంప్యూటర్ సైన్న్స్ చదివింది. ప్రస్తుతం ఈమె పెరువిళైగంగానగర్ మొదటి వీధిలో ఉంటోంది. లివినా బ్యూటీషియన్గా పని చేస్తున్నారు. ఘటన జరిగిన రోజు మైఖేల్ జేవియర్, శోభా ఇద్దరూ బయటకు వెళ్లి ఉన్నారు. ఇంట్లో లివినా మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న ఆమె ఫ్యాన్న్కు ఉరి వేసుకుంది. ఇది చూసి ఆమె స్నేహితులు లివినాను ఆశారిపల్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. చనిపోయినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరి నాట్లలో రైతులు బిజీబిజీ
వరినాట్ల పనుల్లో రైతులు నారు నాటేందుకు సిద్ధంగా ఉన్న వరినారు తిరుత్తణి: కార్తీక సీజన్ ప్రారంభం కావడంతో రైతులు వరినాట్ల పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. కార్తీక మాసం ప్రారంభంతో రైతులు వరి, వేరుశనగ సాగుకు ఆసక్తి చూపుతారు. వర్షాలు కురిసి నీటి సమస్య తలెత్తకపోవడంతో ఈ సీజన్లో వరి, వేరుశనగ పంట సాగు చేస్తారు. తిరుత్తణి, పళ్లిపట్టు, ఆర్కేపేట, తిరువలంగాడు ప్రాంతాల్లోని రైతులు పొలాలను దున్ని చదును చేసి నీరుకట్టి వరినాట్లకు నారు సిద్ధం చేస్తున్నారు. తిరుత్తణి యూనియన్లో 1,500 ఎకరాల్లో రైతులు వరి వేరువనగ సాగుకు పొలం దుక్కి దున్ని సిద్ధం చేసి వరినాట్లు వేసే పనులకు సిద్ధమయ్యారు. రైతులకు వరి విత్తనాలు వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ ధరలకు అందజేస్తున్నట్లు, రైతులు ఆధార్ కార్డు, పాస్బుక్ తీసుకొస్తే హెక్టార్కు 50 కేజీల వరి విత్తనాలు అందజేస్తున్నట్లు, రైతులు ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించే అవకాశం కల్పించినట్లు వ్యవసాయ శాఖ సహాయ డైరెక్టర్ ప్రేమ్ తెలిపారు. -
60శాతం ఆ చిత్ర కథేనా?
తమిళసినిమా: విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్. ఇది ఆయన నటిస్తున్న 69వ చిత్రం కావడం గమనార్హం. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన హెచ్.వినోద్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. కాగా పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో మమితా బైజూ మరో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబిడియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి ముందు దర్శకుడు వినోద్ కమలహాసన్ కోసం ఒక కథను సిద్ధం చేశారు. అయితే ఆ కథలో కమలహాసన్ నటించ లేదు. దీంతో అదే కథను విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత బాలకృష్ణ తెలుగులో నటించిన నేలకొండ భగవత్కేసరి చిత్రానికి ఇది కాపీ అని జరిగింది. ఇలాంటి ప్రచారాన్ని దర్శకుడు ఖండించారు. ఇలాంటి పరిస్థితుల్లో జననాయకన్ చిత్రం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. 2026 జనవరి 9న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేమిటంటే నేలకొండ భగవత్ కేసరి చిత్రానికి చెందిన 60 శాతం జననాయకన్ చిత్రంలో ఉంటుందని, మిగతా భాగాన్ని దర్శకుడు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారట. విజయ్ రాజకీయ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం అన్న విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విజయ్ నటించిన చిత్రం ఇది. సమకాలీన రాజకీయ అంశాలు ఇందులో చోటు చేసుకుంటాయని తెలిసింది. దీంతో విజయ్ అభిమానులు ఖుషీ అవుతు న్నారు. -
మన జీవితం రాముని కథతో ముడిపడింది
కొరుక్కుపేట: మనిషి జీవితమంతా రాముని కథతో ముడిపడి ఉందని హైదరాబాద్కు చెందిన శతావధాని, ప్రవచనకర్త డాక్టర్ తాతా సందీప్ శర్మ అని అన్నారు. వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక 167వ ప్రసంగంగా రామాభ్యుదయ కావ్య సౌందర్యం అనే అంశంపై ఆదివారం రాత్రి జరిగింది. దీనికి చైన్నె టీనగర్లోని ఆంధ్రాక్లబ్ కృష్ణా హాలు వేదికై ంది. కార్యక్రమానికి వక్తగా హైదరాబాద్కు చెందిన శతావధాని, ప్రవచనకర్త, సైన్న్స్ పరిశోధకులు డాక్టర్ తాతా సందీప్ శర్మ పాల్గొన్నారు. ముందుగా వేదవిజ్ఞాన వేదిక కార్యదర్శి కందనూరు మధు సందీప్ శర్మను ఘనంగా సత్కరించారు. సందీప్ శర్మ మాట్లాడుతూ తెలుగులో చాలా రామాయణాలు వచ్చాయని అన్నారు. తెలుగు ప్రబంధాల్లో అయ్యలరాజు రామభద్రుడి రామాభ్యుదయం విరాజిల్లిందని అభిప్రాయపడ్డారు. ఆదినారాయణరెడ్డి, రమేష్, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. -
ఐఐటీ మద్రాసులో ఈడీసీ 360 డిగ్రీ కాన్కేలవ్
సాక్షి, చైన్నె: పీఏఎల్ఎస్ వ్యవస్థాపకతపై ఈడీసీ 360 కాన్క్లేవ్కు ఐఐటీ మద్రాసు చర్యలు చేపట్టిది. ఇందులో భాగంగా ఈ అభివృద్ధిని కాంక్షిస్తూ పరిశ్రమ, విద్యా వేత్తల మధ్య సత్సంబంధాలు, ఆవిష్కరణలు,స్టార్టప్ల పర్యావరణ వ్యవస్థపై దృష్టి పెట్టే విధంగా ఒప్పందాలు జరిగాయి. ఐఐటీ పూర్వ విద్యార్థుల నేతృత్వంలో స్వచ్ఛందం చొరవగా పీఎఎల్ఎస్, ఈడీసీ 360 డిగ్రీని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఐఐటీ మద్రాసు వ్యవస్థాపక అభివృద్ధిపై జరిగిన సమావేశంలో 40 దార్శనిక ఇంజినీరింగ్ సంస్థల నుంచి సీనియర్ ప్రతినిధులు ఈ సమావేశం నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఇంజినీరింగ్ కళాశాలలో బలమైన వ్యవస్థాపకత, ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలు, భవిష్యత్తు అంశాలపై ఇందులో దృష్టి పెట్టారు.ఇ ందులో భాగంగా జరిగిన ఒప్పందాలపై టెక్నాలజీ అండ్ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ల్యాబ్స్, ఐఐటీ మద్రాసు, ఏఐసీ అన్నా ఇంక్యుబేటర్ ప్రతినిధులు సంతకాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఐటీఈఎల్ చైర్మన్ ప్రొఫెసర్ అశోక్ , మహీంద్రా టెక్నాలజీ ఉపాధ్యక్షుడు శంకర్ వేణుగోపాల్తో పాటుగా ఐఐటీ పూర్వవిద్యార్థుల చారిటబుల్ ట్రస్ట్కు చెందిన తమిళనాడు, కేరళ, ఆంధ్రా,కర్ణాటక, తెలంగాణలకు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
గవర్నర్ కోసం ట్రాఫిక్ నిలిపివేత
తిరుత్తణి: గవర్నర్ కాన్వాయ్ కోసం చెరుకు ట్రాక్టర్లు రెండు గంటల పాటు నిలిపివేయడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్.రవి తిరుమలలో స్వామిని దర్శనం చేసుకుని ఆదివారం మధ్యాహ్నం రోడ్డు మార్గంలో చైన్నెకు బయలుదేరారు. దీంతో చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలో ఉదయం నుంచి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తిరుత్తణి నుంచి తిరువలంగాడులోని తిరుత్తణి సహకార చక్కెర ఫ్యాక్టరీకి చెరుకు తరలిస్తున్న ట్రాక్టర్లు, లారీలు, ఇతర భారీ వాహనాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తిరుత్తణి బైపాస్ వద్ద ఆపేశారు. రెండు గంటల పాటు రైతులు, వాహన డ్రైవర్లు పడిగాపులు కాచారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుత్తణి మార్గంలో గవర్నర్ వాహనం వెళ్లిన తరువాత వాహనాలు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. -
దిత్వా తుపాన్తో అప్రమత్తం
తిరుత్తణి: దిత్వా తుపాన్ కారణంగా వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా హైవేశాఖ అధికారులు ఉపకరణాలు సిద్ధం చేశారు. దిత్వా ప్రభావం తిరువళ్లూరు జిల్లాపై చూపే అవకాశాలు వుండడంతో వాతావారణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా శాఖల వారీగా అధికారుల బృందం సిద్ధంగా వుండాలని ప్రభు త్వం ఆదేశించింది. దీంతో తిరుత్తణి హైవేశాఖ సహాయ ఇంజినీర్ రఘురామన్ ఆధ్వర్యంలో హైవే సిబ్బంది జేసీబీ వాహనాలు, చెట్లు కూలితే కొమ్మలను కోసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉపకరణా లు, ఇసుక బస్తాలు సిద్ధం చేశారు. 24గంటలపాటు సమస్యలు అధికారుల దృష్టికి వస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా వున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ప్రాంతంలో చోటుచేసుకునే సమస్యలు పట్ల అధి కారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. -
రేర్ కాంబినేషన్ సెట్ అవుతుందా?
తమిళసినిమా: సినీ పరిశ్రమలో రేర్ కాంబినేషన్న్స్ అరుదుగా సెట్ అవుతుంటాయి. అలాంటి చిత్రాలకు వచ్చే క్రేజే వేరు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ అలా పలు రేర్ కాంబినేషన్న్స్తో కలిసి పని చేసి విజయాలను అందుకున్నారు. ఈయన మొదటి చిత్రాన్నే అజిత్, సురేష్ గోపి కాంబినేషన్లో చేసిన దీనా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత విజయ్ కాంత్ హీరోగా దర్శకత్వం వహించిన రమణ, సూర్య కథానాయకుడిగా చేసిన గజిని, అదే చిత్రాన్ని హిందీలో అమీర్ఖాన్తో చేసి ఘన విజయం సాధించారు. అదేవిధంగా విజయ్ హీరోగా కత్తి , సర్కార్ వంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. రజనీకాంత్తో చేసిన దర్బార్, తెలుగులో మహేష్ బాబు హీరోగా చేసిన స్పైడర్ చిత్రాలు మాత్రం నిరాశ పరిచాయి. కాగా ఇటీవల శివకార్తికేయన్తో చేసిన మదరాసీ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్నే అందుకుంది. దీంతో ఈయన తర్వాత చిత్రం ఏమిటన్న ఆసక్తి నెలకొంది. అందుకు సమాధానంగా ఒక ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదే తర్వాత శింబు హీరోగా మురుగదాస్ చిత్రం చేయబోతున్నది. ఈ రేర్ కాంబినేషన్లో చిత్రం నిజంగా తెరకెక్కితే ఆ క్రేజే వేరుగా ఉంటుంది కదూ. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న గ్యాంగ్స్టర్ కథా చిత్రం అరసన్లో శింబు హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత ఆయన మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్నారన్నది టాక్. శింబుదర్శకుడు మురుగదాస్, -
ఘనంగా ఓబుల్ రెడ్డి శత జయంతి
కొరుక్కుపేట: పారిశ్రామిక వేత్త పి.ఓబుల్రెడ్డి శాసీ్త్రయ కళలను పరిపోషించారని అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ పద్మవిభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి అన్నారు. ఈమేరకు పారిశ్రామిక వేత్త ఓబుల్ రెడ్డి శతజయంతి వేడుకలను చైన్నెలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఓబుల్ రెడ్డి శతజయంతిని పురష్కరించుకుని ఇండియా పోస్టు స్మారక మై స్టాంప్ను ఆవిష్కరించింది. డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి సమక్షంలో చైన్నెలోని పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్, ఐపీఓఎస్ మేజర్ మనోజ్ ఆవిష్కరించారు. ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి ఎందరికో ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. భారతీయ శాసీ్త్రయ కళల పోషణకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఓబుల్ రెడ్డి వారసత్వాన్ని గౌరవిస్తూ ఏడాది పొడవునా జరిగే శతాబ్ది ఉత్సవాల్లో మై స్టాంప్ విడదల కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అపోలో ఆస్పత్రి డాక్టర్ ప్రీతారెడ్డి, సునీతరెడ్డి, ఓబుల్రెడ్డి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
ఆవిష్కర్తలకు ప్రత్యేక గుర్తింపు
సాక్షి, చైన్నె: పరిశోధన, కొత్త ఆవిష్కరణ, మార్గదర్శకత్వం, ఇంక్యుబేషన్ మార్గాలకు మద్దతు ఇచ్చే విధంగా ఆవిష్కర్తలకు ప్రత్యేక గుర్తింపు, ప్రోత్సాహం అందించనున్నామని వీఎంఆర్ఎఫ్డీయూ చాన్స్లర్ ఏఎస్ గణేషన్ తెలిపారు. ఏవీఐటీ నేతృత్వంలో సిల్వర్ స్పార్క్ 2025 పేరిట ఆవిష్కరణ, వ్యవస్థాపక ఆలోచనలను పెంపొంచే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏవీఐటీ ప్రిన్సిపల్ డాక్టర్ జె జానెట్ తన ప్రసంగంలో విద్యార్థుల ఆవిష్కరణ, పర్యావరణ వ్యవస్థల బలోపేతం గురించి వివరించారు. వీఎంఆర్ఎఫ్ డీయూ చాన్స్లర్ ఎఎస్ గణేషన్, ఉపాధ్యక్షురాలు అనురాధాలు మాట్లాడుతూ, విద్యార్థులు వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ సాంకేతికత, స్థిరత్వం,డిజిటల్ వంటి విభిన్న ఇతి వృత్తాలలో పరిష్కారాలు,పరివర్తన, అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.ఉత్తమ ఆవిష్కర్తలకు ప్రోత్సాహం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈసందర్భంగా జరిగిన ది సిల్వర్ స్పార్క్ 2025 ఐడియాథాన్లో భాగంగా వినూత్న,సరికొత్త ఆవిష్కరణలకు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ విద్యాసంస్థ వీసీ డాక్టర్ పీకే సుధీర్, ఐఐఈ,ఐసీ డైరెక్టర్ డాక్టర్ పి.జ్ఞాన శేఖర్, వైస్ ప్రిన్సిపల్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
వైభవం..అయ్యప్ప పడి పూజలు
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కమ్మవారిపాళ్యంలో అయ్యప్పస్వామి పడి పూజలు వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా బీజేపీ జిల్లా కన్వీనర్ పన్నీర్సెల్వం ఆద్వర్యంలో అయ్యప్పస్వామి పడిపూజలు శనివారం రాత్రి జరిగాయి. ముందుగా అయ్యప్పస్వామి, గణపతి, శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. రెండు వేలకు పైగా అయ్యప్పస్వామి మాలధారణ చేసిన భక్తులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం, ప్రసాదాలను నిర్వాహకులు అందజేశారు. ఏర్పాట్లను బీజేపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ లయన్ పన్నీర్సెల్వం ఏర్పాటు చేయగా, అన్నాడీఎంకే మాజీ మంత్రి రమణ, పీఎంకే రాష్ట్ర ఉప కార్యదర్శి బాలయోగీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు లోకనాతన్, ఓబీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకరన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు తిరుత్తణి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆర్యశ్రీనివాసన్ పాల్గొన్నారు. వీరమణిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప భక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు
– రాకపోకలకు అంతరాయం తిరువళ్లూరు: దిత్వా తుపాన్ కారణంగా జిల్లాలో మోస్తరుగా వర్షం పడడంతో గుమ్మిడిపూండి జాతీయ రహదారిలో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా దిత్వా తుపాన్ ప్రభావంతో మోస్తరుగా వర్షం కురిసింది. అత్యధికంగా పొన్నేరిలో 53మిమీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా ఆర్కేపేటలో నాలుగు మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 289 మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో గుమ్మిడిపూండి జాతీయ రహదారిలో వర్షపు నీరునిలిచింది. వర్షపు నీటిలో గుమ్మిడిపూండి సిప్కాట్ నుంచి వెలువడే కలుషిత నీరు కలిసిపోవడంతో దుర్వాసన వెదజల్లింది. కాగా రోడ్డులో నిలిచిన వర్షపు నీటితో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
గోబిలో పళణి బల నిరూపణ..!
సాక్షి, చైన్నె: ఈరోడ్జిల్లా గోబి చెట్టి పాళయంలో అన్నాడీఎంకే బలాన్ని చాటే విధంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆదివారం బల ప్రదర్శనలో నిమగ్నమయ్యారు. పెద్దఎత్తున ర్యాలీగా తరలి వచ్చిన బహిరంగ సభలో ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సెంగొట్టయ్యన్ను టార్గెట్ చేశారు. గోబి చెట్టి పాళయం నియోజకవర్గం సీనియర్ నేత సెంగొట్టయ్యన్ సిట్టింగ్ స్థానం అన్న విషయం తెలిసిందే. తొమ్మిది సార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తాజాగా ఆయన విజయ్ నేతృత్వలోని టీవీకేలోచేరారు. టీవీకేలో చేరినానంతరం ఈరోడ్కు వచ్చిన సెంగొట్టయ్యన్కు బహ్మ్రరథం పట్టే ఆహ్వానం లభించింది. ఈ పరిస్థితులలో గోబి చెట్టి పాళ్యంలో సెంగొట్టయ్యన్ చూసి కాకుండా, అన్నాడీఎంకే రెండాకు చిహ్నం చూసే ఓట్లు ప్రజలు వేశారన్నది చాటే విధంగా, తన బలాన్ని చాటుకునే రీతిలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి ఆదివారం బల ప్రదర్శనలో నిమగ్నమయ్యారు. గోబి చెట్టి పాళయంలో బ్రహ్మాండ ర్యాలీ నిర్వహించారు. ప్రజా చైతన్య యాత్రను మళ్లీ మొదలెట్టే విధంగా ఆదివారం సాయంత్రం దూసుకెళ్లారు. ఆయనకు మేట్టుపాళయం ఎమ్మెల్యే సెల్వరాజ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున అభిమాన సందోహం బ్రహ్మరం రథం పట్టారు. అయితే, గోబి నుంచి కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి జన సమీకరణ ద్వారా పళణిస్వామి తన బలాన్ని చాటుకునే పనిలో పడ్డారంటూ సెంగొట్టయ్యన్ మద్దతుదారులు విమర్శలు ఎక్కుబెట్టే పనిలో పడ్డారు. అదేసమయంలో గోబి చెట్టి పాళయం వ్యాప్తంగా సెంగొట్టయ్యన్కు వ్యతిరేకంగా అన్నాడీఎంకే వర్గాలు పోస్టర్లు హోరెత్తించడం గమనార్హం. తన బలాన్ని చాటుకునే విధంగా బహిరంగ సభలో దూసుకెళ్లిన పళణిస్వామి సెంగొట్టయ్యన్ను టార్గెట్ చేసి విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెట్టారు. -
ఘనంగా సోపాన్ 2025 వేడుకలు
– విద్యార్థులకు బహుమతులు సాక్షి, చైన్నె: అన్నాదురై శత జయంతి స్మారక గ్రంథాలయం వేదికగా సోపాన్ 2025 విజేతలకు ఆదివారం బహుమతులను ప్రదానం చేశారు. అల్లెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ వార్షిక విజయోత్సవ వేడుకగా సోపాన్ 2025 వేడుకను నిర్వహించారు. ప్రముఖ జాతీయ సంస్థలలో ప్రవేశాలు పొందిన, ఒలింపియాడ్లలో విజేతలుగా నిలిచిన చైన్నెలోని అత్యుత్తమ విద్యార్థులను ఈ వేడుకలో సత్కరించారు. ఐఐటీలో 51 మంది, ఎన్ఐటీలో 33 మంది, ఐఐఐటీలో 18 మంది, ఐఐఎస్ఈఆర్లో ముగ్గురు అంటూ ఉత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ట్రోఫీలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అల్లెన్ తెలంగాణ హెడ్ సౌరవ్ తివారీ, మదురై అధ్యక్షుడు శ్రీనివాస పెరుమాల్, తమిళనాడు,పాండిచ్చేరిఅధ్యక్షుడు సంతోష్ సింగ్, ఏజీఎం కిషన్ వెంకట్ , ఉపాధ్యక్షుడు మహేశ్ యాదవ్, ఆవడి పోలీసు కమషనర్ కె శంకర్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ మితిలేష్ కుమార్ తదితరులు హాజరై విద్యార్థులను సత్కరించి, బహుమతులు అందజేశారు. -
డెల్టాకు మంత్రుల బృందం
సాక్షి, చైన్నె : మంత్రుల బృందం ఒకటి రెండు రోజులలో డెల్టా జిల్లాలో పర్యటించనున్నట్టు డిప్యూటీ సీఎం ఉదయ నిధిస్టాలిన్ తెలిపారు. పంట, ఇతర నష్టాలపై పరిశీలించనున్నట్టు వివరించారు. దిత్వా రూపంలో పెను విపత్తు తప్పదన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో రెవెన్యూ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్తో పాటుగా డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ఆదివారం ఉదయం నుంచి ఎళిలగంలోని స్టేట్ ఎమర్జన్సీ సెంటర్లో తిష్ట వేశారు. ఆయా జిల్లాలలో పరిస్థితులపై దృష్టి పెట్టారు. కంట్రోల్ రూమ్కు వచ్చే ఫిర్యాదులను తక్షనం పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు. అప్రమత్తంగా ఉన్నాం.. దిత్వా శ్రీలంక ను దాటి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించినప్పటి నుంచి రెండు రోజులలో అత్యధికంగా వర్షం నాగపట్నంలో కురిసిందన్నారు. మొత్తంగా ఇక్కడ 30 సెం.మీ వర్షం పడ్డట్టు ఈసందర్భంగా డిప్యూటీ సీఎం ఉదయ నిధిస్టాలిన్ వివరించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు, జలాశయాలలో 85 శాతం నీటి నిల్వ ఉందన్నారు. విపత్తును ఎదుర్కొనే విధంగా 16 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 ఆర్మీ బృందాలు నాగపట్నం, తిరువారూర్ తదితర జిల్లాలో తిష్ట వేసి, బాధితులకు సాయం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే పరిస్థితి ఉందన్న ప్రాంతాలలో 1,185 పడవలను సిద్ధం చేసి ఉంచినట్టు తెలిపారు. భారీ వర్షాల కారణంగా 20 వేల హెక్టార్ల పంట నీట మునిగినట్టు ప్రాథమిక సమాచారం వచ్చిందన్నారు. 26 జిల్లాలు తాము శిబిరాలను ఏర్పాటు చేశామని, వీటిలో సుమారు 2 వేల మంది మాత్రమే ప్రస్తుతం ఉన్నట్టు పేర్కొన్నారు. వీరికి కావాల్సిన అన్ని సౌకార్యాలు చేశామన్నారు. డెల్టాలోని నాగపట్నం, తిరువారూర్, తంజావూరులో వర్షం దాటికి పంట పొలాలు మునిగాయని, పంట వరద పాలైందని సమాచారాలు వచ్చాయని, వీటిని పరిశీలించేందుకు ఒకటి రెండు రోజులలో మంత్రులు బయలు దేరి వెళ్లనున్నారన్నారు. సమగ్ర పరిశీలనతో బాధితులకు న్యాయం చేస్తామన్నారు. మంత్రి కేకేఎస్ఎస్ఆర్ మాట్లాడుతూ, వర్షాలకు ముగ్గురు మరణించినట్టు పేర్కొన్నారు. ఇందులో తూత్తుకుడి, తంజావూరులో తలా ఒకరు గోడ కూలి, మైలాడుతురైలో విద్యుదాఘతానికి ఒకరు మరణించినట్టు అధికారిక సమాచారం వచ్చిందన్నారు. ఇతర జిల్లాల నుంచి సమాచారాలు సేకరిస్తున్నామన్నారు. 149 పశువులు మరణించాయని, 234 గుడిసెలు దెబ్బతిన్నట్టు వివరించారు. గాలి ప్రభావం అధికంగా ఉందని, ప్రజలు సహకరించాలని కోరారు. సముద్ర తీరం వైపుగా వెళ్ల వద్దని విన్నవించారు. అలల తాకిడి అధికంగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. అధికారులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం ఉదయనిధి, కంట్రోల్ రూం నుంచి ఫిర్యాదుల స్వీకరిస్తూ.. -
బలహీన పడ్డ దిత్వా
శ్రీలంకను అతలాకుతలం చేసిన దిత్వా తుపాన్ పుదుచ్చేరి నుంచి చైన్నె తీరానికి సమీపించే కొద్ది బలహీన పడింది. అయితే కొన్ని జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టించారు. మరికొన్ని చోట్ల వరుణ గండం తప్పినా ఈదురు గాలుల ప్రభావం కొనసాగింది. సముద్రంలో అలలు భారీగా ఎగసి పడ్డాయి. అయితే చైన్నె నగరం, శివారు జిల్లాలకు మాత్రం వర్షం ముప్పు తప్పినట్లయ్యింది. సాక్షి, చైన్నె: దిత్వా తుపాన్ పొరుగు దేశం శ్రీలంకను సర్వనాశనం చేసింది. ఆ దేశంలో ఎటు చూసినా వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీలంక నుంచి భారత్ వైపుగా విమాన , నౌక సేవలు సైతం రద్దు అయ్యాయి. ఇక్కడ దిత్వా రూపంలో వాటిల్లిన నష్టం అపారం. ఇక్కడి నుంచి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించిన ఈ తుపాన్ తొలుత తమిళనాడులోని నాగపట్నం, తిరువారూర్, మైలాడుతురై జిల్లాలపై తన ప్రభావాన్ని చూపించింది. ఈ జిల్లాలో శని వారం అంతాకుండ పోత వర్షం పడింది. ఆదివారం ఉదయం వరకు వర్షం పడింది. నాగపట్టణంలో 23 సెం.మీ, మైలాడుతురైలో అత్యధికంగా 20 సెం.మీ, సెమ్మనూర్ కోయిల్లో 19 సెం.మీ వాన కురిసింది. నాగపట్నం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. తిరువారూర్లో వేలాది ఎకరాల పంట పొలాలు చెరువులుగా మారాయి. ఈ మూడు జిల్లాలో 1.60 లక్షల ఎకరాల పంట పొలాలు నాశనమైనట్టు తేలింది. రామనాథపురం జిల్లా రామేశ్వరం, మండపం పరిసరాలను సైతం వర్షం ముంచెత్తింది. వర్షం దాటికి విద్యుదాఘాతానికి, గోడ కూలి, గుడిసెలు కూలి ఆరుగురు మరణించారు. అయితే అధికారిక లెక్కల మేరకు ముగ్గురే మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 91 గొర్రెలు మరణించాయి. ఈక్రమంగా దిత్వా తుపాన్ ఆదివారం ఉదయం ఉత్తర దిశలో పయనిస్తూ పుదుచ్చేరి వైపుగా దూసుకెళ్లింది. ఈ సమయంలో కడలూరు, విల్లుపురం, పుదుకోట్టై జిల్లాలలో భారీవర్షాలు పడుతాయని ఎదురు చూశారు. అయితే సముద్ర తీరంలోని గ్రామాలలో మాత్రమే ప్రభావం కనిపించింది. విల్లుపురం జిల్లా మరక్కానంలోని 3 వేల ఎకరాల ఉప్పు మడులు సముద్రంలో కలిసినట్టుగా పరిస్థితి నెలకొంది. ఇక, పుదుచ్చేరిని ముంచెత్తే ప్రమాదంతో ముందు జాగ్రత్తలను విస్తృతం చేశారు. సముద్ర తీరంలో హైఅలర్ట్ ప్రకటించారు. కారైక్కాల్ వరకు వర్షం ప్రభావం అధికంగా కనిపించినా క్రమంగా దిత్వా బలహీన పడే పరిస్థితి నెలకొంది. తొలుత 12 కి.మీ వేగంతో పుదుచ్చేరి వైపుగా దూసుకొచ్చినా, ఆ తదుపరి వేగం క్రమంగా తగ్గడంతో వర్షాలు సైతం తగ్గినట్టైంది. కారైక్కాల్లో అత్యధికంగా 19 సెం.మీ వర్షం పడింది. ఆక్రోశంగా సాగరం దిత్వా వేగం తగ్గడంతో పాటుగా మేఘాల కరువుతో వర్షాలు ఆశించిన మేరకు ఇతర జిల్లాలలో ప్రభావాన్ని చూపించ లేకుండా పోయింది. చెంగల్పట్టు, చైన్నె, కాంచీపురం, తిరువళ్లూరు, రాణి పేట, వేలూరు, తిరువణ్ణామలైలో అతి భారీ వర్షాలు పడే అవకాశాలతో ముందు జాగ్రత్తలు విస్తృతం చేసి ఉంచారు. అయితే ఉదయం 11 గంటల తర్వాతవర్షం కనుమురుగైంది. భానుడు ప్రత్యక్షమయ్యారు. వర్షం లేకున్నా, ఈదురు గాలులు హోరెత్తాయి. సముద్రంలో అలలు ఆక్రోశంతో ఎగసి పడ్డాయి. బీచ్ల వైపుగా జనం వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నా ఫలితం శూన్యం. ఆది వారం సెలవు దినం కావడంతో జనం ఉత్సాహంగా తీరం వైపుగా వచ్చి అలలను చూసే పనిలో పడడంతో ఉత్కంఠ నెలకొంది. వీరిని కట్టడి చేయడానికి పోలీసులు శ్రమించాల్సిన పరిస్థితి. మహాబలిపురం నుంచి చైన్నె కాశి మేడు వరకు అలల తాకిడి మరీ ఎక్కువగా క నిపించాయి. మహాబలిపురం వద్ద 10 నుంచి 12 అడుగుల మేరకు అలలు ఎగసి పడ్డాయి. జాలర్లు పడవలను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చిభద్ర పరిచారు. రామేశ్వరంలో అయితే, అలల తాకిడికి అనేక పడవలు ధ్వంసమయ్యాయి. దిత్వా బలహీన పడ్డప్పటికీ క్రమంగా తీరాన్ని సమీపించే కొద్ది తొలుత వాయుగుండం, తదుపరి తీవ్ర అల్పపీడనంగా మారనుది. సోమవారం దిత్వా చైన్నెకు సమీపంలో లేదా, ఆంధ్రప్రదేశ్ సూలూరు పేట సమీపంలో తీరాన్ని సమీపించి మళ్లీ సముద్రంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అంచనావేసి ఉండటం గమనార్హం. ఈదురు గాలుల ప్రభావం కొన్ని చోట్ల 60 నుంచి 70 కి.మీ వేగంతో వీయడం గమనార్హం. -
చైన్నెకు తప్పిన గండం
చైనె, శివారు జిల్లాలను వర్షం ముంచెత్త వచ్చన్న వాతావరణ కేంద్రం సమాచారంతో శనివారం రాత్రంతా అధికారులు కంటిమీద కునుకు లేకుండా వ్యవహరించారు. చైన్నెకు నీరు అందించే రిజర్వాయర్ల నుంచి అధిక శాతం నీటిని బయటకు విడుదల చేశారు. అయితే, ఆశించిన స్థాయిలో వర్షం పడలేదు. అదే సమయంలో దిత్వా బలహీనం పడడంతో చైన్నె, శివారు జిల్లాలకు పెనుగండం తప్పినట్లయ్యింది. శనివారం రాత్రంతా వర్షం పడ్డప్పటికీ, క్రమంగా వాతావరణం మారింది. ఉదయం భానుడు ప్రత్యక్షం కావడంతో పాటుగా ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరించింది. సాయంత్రం తర్వాత అప్పుడప్పుడు చిరు జల్లులు, గాలి తీవ్రత కొంత ఎక్కువగా ఉండటంతో అర్ధరాత్రి తర్వాత వర్షం పడేనా? అన్న ఎదురు చూపులు ఉన్నాయి. అదే సమయంలో దిత్వా సోమవారం వేకు జామున చైన్నెకు సమీపంలో ప్రయాణించనున్నడంతో పొరుగున ఉన్న తిరువళ్లూరు, రాణి పేటలకు వర్షం అలర్ట్ ఇవ్వడం గమనార్హం. కాగా, ఏటా ఏదో ఒక తుపాన్ రూపంలో చైన్నె నీట మునగడం జరుగుతూ వచ్చింది. అయితే, ఈ ఏడాది దిత్వా తాండవం చేస్తుందని ఎదురు చూస్తే, అది బలహీన పడి తీరం వైపుగా కదలడంతో ఆశించిన మేరకు వర్షాలు చైన్నె, శివారులలో ఈ సారి పడ లేదన్నది అధికారుల వాదనగా ఉంది. ఇక చైన్నె నుంచి రాష్ట్రంలోని వివిధ నగరాలకు రద్దు చేసిన విమాన సేవలు మళ్లీ పునరుద్ధరించారు. శ్రీలంకలో దిత్వా ప్రళయంలో చిక్కుకున్న వారిలో 177 మంది తమిళులను చైన్నెకు సురక్షితంగా తీసుకువచ్చారు. -
వంకాయ కిలో ధర రూ.120
కొరుక్కుపేట: వర్షాల నేపథ్యంలో దిగుబడి తగ్గడం, మార్కెట్లకు సరుకు రాకపోవడంతో కూరగాయలకు రెక్కలు వచ్చాయి ఇప్పటికే మునగకాయల ధరల ఆకాశానికి అంటగా, దాని తర్వాత వంకాయల ధరలు కిలో రూ.120 వరకు విక్రయిస్తున్నారు. గత కొంతకాలంగా ముఖ్యంగా టమాటాలు, ఉల్లిపాయలు, మునగకాయల ధరలు పెరిగాయి. ఈ పరిస్థితిలో వంకాయల ధరలు కూడా పెరిగాయి. తూత్తుకుడి జిల్లాలోని తిరుచెందూర్, ఉదుకుడి , సాతంకులం, తిరునల్వేల్లి జిల్లాలోని ఉల్లతిశయన్విలై చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారు 2,000 ఎకరాల విస్తీర్ణంలో మునగకాయల సాగు చేస్తారు. సాతంకులం ప్రాంతంలో మునగకాయలకు ప్రత్యేక మార్కెట్ ఉంది.ఇక్కడ స్థానికంగా మునగకాయల సాగు ఎక్కువగా ఉంది. ఇది మంచి దిగుబడిని ఇస్తుంది. నిరంతర భారీ వర్షాల కారణంగా చెట్ల నుండి రసం కారుతోంది. పువ్వులు , మొగ్గలు గాలికి రాలిపోతున్నాయి, ఫలితంగా దిగుబడి భారీగా తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో వంకాయ ఉత్పత్తి కూడా పెరిగింది. ఆ విషయంలో వంకాయ ధర రూ.120కి పెరిగింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో కూరగాయల సరఫరా కనీసం మూడో వంతు తగ్గింది. ఆ కారణాల వల్ల, చైన్నెలోని కోయంబేడు మార్కెట్తో సహా వివిధ మార్కెట్లలో కూరగాయల ధరలు బాగా పెరిగాయి. ఈ ధరల పెరుగుదల మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు పెర్కొంటున్నారు. మాంగాడు పోలీసు ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ – ఆవడి నగర పోలీస్ కమిషనర్ ఆదేశం అన్నానగర్: సైబర్ నేరానికి సహాయం చేశాడనే ఫిర్యాదు మేరకు ఆవడి మెట్రోపాలిటన్ పోలీసులు మాంగాడు పోలీస్ ఇనన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తూ ఆవగి నగర కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. మాంగాడు పోలీస్ స్టేషన్లో క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా నాలుగురోజుల క్రితం సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇతడు చైన్నెలో సైబర్ క్రైమ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పని చేశాడు. ఈనేపథ్యంలో ఆవడి నగర పోలీసు కమిషనర్ శంకర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. గతంలో ఒక సైబర్ క్రైమ్ నేరస్తుడికి సహకరించిట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఎస్ఐఆర్ దరఖాస్తు గడువు పెంపు – డిసెంబరు 11 వరకు స్వీకరణ సాక్షి, చైన్నె: ఎస్ఐఆర్ దరఖాస్తులను స్వీకరణ గడువును పొడిగించారు. డిసెంబరు 11వ తేదీ వరకు ఓటర్లు దరఖాస్తును పూర్తి చేసి సమర్పించే విధంగాఎన్నికల కమిషన్ వెసులు బాటు కల్పించింది. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ నవంబర్ 4వ తేదీన నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే. డీఎంకే కూటమితో పాటుగా టీవీకే ఈ ప్రక్రియను ఆది నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. పోరాటాలు సైతం జరిగాయి. బీఎల్ఓలు అనేక చోట్ల ఈ ప్రక్రియను వ్యతిరేకించే విధంగా విధుల బహిష్కరణ, నిరసనలు కొనసాగిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం అందజేస్తున్న దరఖాస్తులను పూరించడం కష్టతరంగా ఉందన్న ఆవేదనను ఓటర్లు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గతంలో ఉన్న సమాచారాలు, తల్లిదండ్రుల సమాచారాలు, వారి ఓటరు ఐడీ వివరాలను కోరుతుండడం ఇందుకు సమస్యగా మారింది. దరఖాస్తులను ఇంటింటా బీఎల్ఓలు అందజేసినా, తిరిగి సమర్పించడంలో ఓటర్లు ఆసక్తి చూపించడం లేదు. దీంతో దరఖాస్తులు స్వీకరణ సమస్యగా మారింది. ఈ దృష్ట్యా, ఎస్ఐఆర్ దరఖాస్తులు ఓటర్లకు డిసెంబరు నాలుగో తేది వరకు మాత్రమే బీఎల్ఓలు అందజేయనున్నారు. పూర్తి చేసిన దరఖాస్తులకు చివరి రోజు నాలుగో తేదీ అని ముందుగా నిర్ణయించినా, తాజాగా సమయాన్ని పొడిగించారు. డిసెంబరు 11 వతేదీ వరకు పూర్తిచేసిన దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇందుకు గాను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేకఅవకాశం కల్పించింది. నమూనా ఓటరు జాబితాను డిసెంబరు 16 తేదీన ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. -
వాట్సాప్ స్టేటస్గా ‘మధ్యాహ్నం హత్య’!
సాక్షి, క్రైమ్: ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. భార్యను కొడవలితో నరికి భర్త హత్య చేసిన దారుణ ఘటన ఆదివారం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. నెల్లై జిల్లా మేలపాళయం సమీపంలోని తరువాయికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ(32) దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా శ్రీప్రియ తన భర్త, పిల్లలను వదిలి కోయంబత్తూరుకు వచ్చి రేస్కోర్సు సమీపంలోని 5వ వీధిలో ఉన్న మహిళల హాస్టల్లో ఉంటూ టౌన్ హాల్ ప్రాంతంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. ఆదివారం శ్రీప్రియను కలవడానికి ఆమె భర్త బాలమురుగన్ వచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫొటోను తన వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేశాడు. అందులో ‘ద్రోహానికి ఫలితం.. మరణం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. శ్రీప్రియ తన నుంచి విడిపోయాక ఓ యువకుడితో కలిసి దిగిన ఫొటోను ఇటీవల చూశానని, అందుకే కోపంతో హత్య చేశాడని బాలమురుగన్ పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ హత్య ఆదివారం తమిళనాట పెను సంచలనం సృష్టించింది. -
తమిళనాడులో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి
శివగంగ జిల్లా: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. శివగంగ జిల్లా తిరుపత్తూర్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఓ బస్సు తిరుప్పూర్ నుంచి కారైకుడికి వెళ్తుండగా.. మరో బస్సు కారైకుడి నుంచి దిండిగల్కు వస్తుండగా ప్రమాదం జరిగింది.గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫైర్ సిబ్బంది, అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
స్టార్టప్ల కోసం యంగ్ ఇండియన్స్ ఏకం
సాక్షి, చైన్నె: యువ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్, బీబీఐసీ 2.ఓ నేషనల్ ఫినాలేలో భాగంగా అతి పెద్ద స్టూడెంట్ స్టార్టప్ షోకేష్ కోసం యువత ఏకం అయ్యారు. ఒకే వేదికగా 900 మందికి పైగా యువత ప్రేరణ, అభ్యాసం, జాతీయ స్థాయి స్టార్టప్ పిచింగ్ కోసం ఒకే వేదిక మీదకు వచ్చారు. సీఐఐలో భాగంగా ఉన్న యంగ్ ఇండియన్ (వై) చైన్నె నేతృత్వంలో అత్యంత ప్రభావవంతమైన వ్యవస్థాపకత, శక్తి వంతం, యువత భాగస్వామ్యం గురించి స్టార్టప్ జట్లు భారత్ బిలియన్ ఇంఫాక్ట్ ఛాలెంజ్ 2.ఓకు చర్యలు తీసుకున్నారు. ఈ ఫినాలేలో యువ సమూహంతో కూడిన టాప్ 3 స్థానాలలో కోయంబత్తూరు హెల్పింగ్ హ్యాండ్స్, మదురై ఫుడ్ షీల్డ్, ఈరోడ్ బన్రావ్లు నిలిచాయి. విజేత జట్టుకు తాజాగా ఐఐటీ మద్రాసులో ఇంక్యుబేషన్ లభించనుంది. విద్యార్థుల ఆవిష్కరణలు, స్టార్టప్ అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా యంగ్ ఇండియన్స్, ఐఐటీ మద్రాసు ముందుకుసాగనున్నాయి. ఈ కార్యక్రమానికి నేచురల్స్ సహ వ్యవస్థాపకుడు సికే కుమర వేల్, స్టార్టప్ సింగం సీఈఓ అరుణ్నాయర్, కేఆర్ఈఏ చైర్మన్ ప్రవీణ్ శేఖర్, వర్క్ ఫాస్ట్ ఏఐ వ్యవస్థాపకుడు సురేష్ హాజరై యువత కలలు, స్థితి స్థాపకత, వ్యవస్థాపకత, మార్కెటింగ్, భవిష్యత్తు టెక్ స్టార్టప్లను గురించి విశదీకరించారు. -
మేధాశక్తితోనే ఉన్నత శిఖరాలకు
వేలూరు: మేధాశక్తితోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరకోగలరని సినీ హాస్య నటుడు మదురై ముత్తు అన్నారు. వేలూరు శ్రీపురంలోని బంగారుగుడి, శ్రీ నారాయణి పీఠం పీఠాధిపతి శక్తిఅమ్మ 50వ జయంతి దినోత్సవాన్ని పురష్కరించుకొని నారాయణి పాఠశాలలోని విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు బంగారుగుడి డైరెక్టర్ సురేష్బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే విద్యార్థులు క్రమ శిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. పీఠాధిపతి శక్తిఅమ్మ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వీటిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రిన్సిపల్ రమేష్, సుబ్రమణి, లక్ష్మి, ఊరీస్ కళాశాల ప్రొఫెసర్ జాన్బాబు, నారాయణి పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్
కొరుక్కుపేట: విద్యతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని లైఫ్లైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ జాయింట్ డైరెక్టర్ ,వైద్యులు డాక్టర్ అనిరుధ్ తెలిపారు. ఈ మేరకు ఎస్కేపీడీ అండ్ ఛారిటీస్ నిర్వహణలో కొనసాగుతున్న మహర్షి విద్యా మందిర్ (ఎంవీఎం)సీనియర్ సెకండరీ స్కూల్ –చూలై 11వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. దీనికి చైన్నె తేనాంపేటలోని కామరాజ అరంగం వేదికై ంది. పాఠశాల కరస్పాండెంట్ టీవీ రామకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ అనిరుధ్ రాజ్కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ఆరంభించారు. అనంతరం వివిధ పోటీలతోపాటూ విద్యలో ప్రతిభను కనపరుస్తున్న విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందించిన ఆయన మాట్లాడుతూ జీవితంలో పాఠశాల విద్యను మరవలేమని అన్నారు . పాఠశాల ప్రదానోపాధ్యాయులు పి. సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రతా చట్టాన్ని అమలు చేయాలి
తిరువళ్లూరు: రాష్ట్రంలోని టీచర్లు, ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులను నివారించడానికి ఉద్యోగ భద్రతా చట్టాన్ని వెంటనే అమలు చేయాలని తమిళళనాడు పట్టభద్రుల టీచర్ల సంఘం సమావేశంలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. తమిళనాడు పట్టబద్రుల టీచర్ల రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం తిరువళ్లూరులోని ఓ ప్రైవేటు పంక్షన్ హాలులో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కోశాధికారి చౌదరి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఇళంగోవన్, విశిష్ట అతిధిగా రాష్ట్ర జనరల్ సెక్రెటారీ సోమసుందరం హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమసుందరం మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలులోకి తేవాలన్నారు. సర్వీసు పొడిగింపు కాలంలో 25 శాతం విధిస్తున్న కోతలను నిలిపి వేసి పూర్తి స్థాయి వేతనాన్ని మంజూరు చేయాలని తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, పన్నీర్సెల్వం, మలర్కన్నన్, కుమరేషన్, ఆరుముగస్వామితో పాటూ రాష్ట్రం నలుమూలల నుంచి సంఘం నేతలు హాజరయ్యారు. -
ఉన్నత విద్యతోనే దేశాభివృద్ధి
వేలూరు: ఉన్నత విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ విశ్వనాథన్ తెలిపారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలోని అందరికీ ఉన్నత విద్యా పథకం కింద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. ఈసందర్భంగా విద్యార్థులకు విద్యా స్కాలర్షిప్ చెక్కులను అందజేశారు. చాన్సలర్ మాట్లాడుతూ ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా మొట్ట మొదటి సారిగా వేలూరులో అందరికీ ఉన్నత విద్యా పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. విద్యలో తమిళనాడు మొదటి రాష్ట్రంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు శేఖర్ విశ్వనాథన్, కార్యనిర్వాహక డైరెక్టర్ డాక్టర్ సంధ్య, ప్రొ చాన్స్లర్ పార్ధసారథిమల్లిక్, ట్రస్ట్ సభ్యులు లక్ష్మణన్, జౌరీలాల్ జైన్, రచయిత పదుమనార్, కేఎంజీ రాజేంద్రన్, వ్యాపారుల సంఘం జిల్లా అద్యక్షుడు జ్ఞానవేల్, తమిళనాడు హోటల్ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటసుబ్బు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
అందాలారబోత వారి ఇష్టం
తమిళసినిమా: ఒకప్పటి కథానాయికలకు ఇప్పటి వారికి చాలా తేడా ఉందని చెప్పక తప్పదు. పాతతరం కథానాయికలు పుష్టికరమైన అవయవ సౌష్టవంతో ఉండేవారు. ఈ తరం కథానాయికలు జీరో సైజుపై మక్కువ చూపుతారు. ఒకవేళ శరీర కొలతలు పెరిగితే దాన్ని తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడి తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. డైటింగ్ పేరుతో నోళ్లు కుట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయంలో ఉత్తరాది హీరోయిన్లు ముందు ఉంటున్నారని చెప్పక తప్పదు. అలా వివాహనంతం కూడా నాజూకు తనాన్ని మెయింటైన్ చేస్తున్న హీరోయిన్లలో రకుల్ ఒకరు. ఈమె ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొందరు నటీమణులు వివాహనంతరం స్లిమ్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కారణం వారు మళ్లీ నటించడానికి రెడీ అవడమే. అలాంటి హిరోయిన్లలో రకుల్ ఒకరు. వివాహానంతరం నటించడానికి సిద్ధమైన ఈమె కోలీవుడ్లో చివరిగా నటించిన చిత్రం ఇండియన్–2. ఆ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఆ తర్వాత రకుల్కు దక్షిణాదిలో మరో అవకాశం రాలేదు. అయినా ఆమె అవకాశాల వేటను మానుకోలేదు. ఇప్పటికీ అందాలారబోతతో తీయించుకున్న వివిధ రకాల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అందాలతార గురించి అడిగితే సాధారణంగా పెళ్లి అయితే హీరోయిన్ల పని అంతే అనే భావన ఉందన్నారు. అయితే అది తప్పు అని, తన విషయంలో అలా జరుగుతోందా అని ప్రశ్నించారు. తనకు సంబంధించినంత వరకూ అందాలారబోత అనేది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది అన్నారు. అందం హద్దులను పెళ్లి నిరోధించడంలో, తగ్గించడంలో జరగదన్నారు. అది ప్రోత్సహించే ఒక నిచ్చెన లాంటిదని రకుల్ పేర్కొన్నారు. రకుల్ప్రీత్సింగ్ -
అణాలి ఫస్ట్లుక్ విడుదల
తమిళసినిమా: సింథియా ప్రొడక్షన్ హౌస్ పతాకంపై రూపొందుతున్న అణాలి. సింథియా లూర్దే కథానాయకిగా నటించిన ఈ చిత్రానికి దినేష్ దినొ కథ, కథనం, మాటలు దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. శక్తి వాసుదేవన్ హీరోగా నటించిన ఇందులో కుమారవేల్, ఇనియ, కబీర్దుహాన్సింగ్, అభిషేక్ వినోద్, జాన్సన్ దివాకర్, శివ, మేథ్యూవర్గీస్, వినోద్సాగర్, బేబీశిమాలి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రామలింగం డీసీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంత కార్యక్రమాలు జరుపుకుంటోంది. విచిత్ర వివరాలను దర్శకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ఇది ఒక రాత్రిలో జరిగే విభిన్న కథ చిత్రంగా ఉంటుందన్నారు. కిడ్నాపర్లు లాల్ చేట్టా, ఖాన్బాయ్, రంగారావ్ రెడ్డిలకు చిక్కిన జాన్సీ అనే యువతి, ఆమె 10 ఏళ్ల కూతురి ఇతివృత్తంతో సాగే కథా చిత్రం అని చెప్పారు. మృగాల కంటే ఘోరమైన ఆ ముగ్గురి నుంచి జాన్సీ తెలివిగా ఎలా బయటపడ్డారు, పలు ఆసక్తికరమైన సంఘటన సమహారమే అణాలి చిత్రం అని చెప్పారు. ఈ చిత్రం దర్శకుడు వెంకట్ప్రభు, గణేష్ కే బాబు సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారని చెప్పారు. చిత్ర ట్రైలర్ను, ఆడియోను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.కాగా విచిత్ర షూటింగ్ను సినిమా చరిత్రలోనే తొలిసారిగా 10 వేల కంటైనర్లు కలిగిన యార్డులో భారీ సెట్టును వేసి చిత్రీకరించడానికి పూర్తిగా సహకారం అందించిన నిర్మాత సింథియా లూర్దేకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.అణలిలో సింథియా లూర్దే -
నేడు వేమన ఆలయ మహాకుంభాభిషేకం
పళ్లిపట్టు: భాషాభిమానం నిండిన తమిళనాట తెలుగుకవి యోగి వేమనకు ఆలయం నర్మించి పూజిస్తున్న ఘటన అత్తిమాంజేరిపేటలో గుర్తింపు పొందుతోంది. 17వ శతాబ్దానికి చెందిన యోగివేమన పద్యాలు సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండేవి. అత్తిమాంజేరిపేటలో వేమన పద్యాలు నేర్చుకున్న ఎందరో పూర్వీకులు వేమనకు ఆలయం నిర్మించి పూజలు మొదలుపెట్టారు. వేమనకు కొత్త ఆలయం రెండు వందల సంవత్సరాల వేమన ఆలయం దుస్థితికి చేరుకోవడంతో గ్రామీణులు కలిసికట్టుగా నిధులు సమకూర్చి వేమనకు కొత్త ఆలయం నిర్మించారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మహాకుంభాభిషేకం వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాగశాలలు ఏర్పాటు చేసి హోమగుండం పూజలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఆలయ మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. -
థియేటర్లలో సందడి చేస్తున్న తేరే ఇష్క్ మే
తేరే ఇష్క్ మే చిత్రంలో క్రితీ సనన్, ధనుష్ తమిళసినిమా: నటుడు ధనుష్ స్థాయి దక్షిణాదిని దాటి చాలా కాలమే అయ్యింది. అంతేకాదు అది హాలీవుడ్ వరకు వెళ్లింది. తమిళంతో పాటూ తెలుగు, హిందీ, ఆంగ్లం చిత్రాల్లో నటిస్తూ పాన్ వరల్డ్ హీరోగా పేరు తెచ్చుకున్న ధనుష్ 2013లో కథానాయకుడిగా నటించిన హిందీ చిత్రం రాంజాన మంచి విజయాన్ని అందుకుంది. అంతకుముందే ఈయన నటుడు అమితాబ్ బచ్చన్తో కలిసి షమితాబ్ చిత్రంలో నటించారు. కాగా రాంజాన చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తాజాగా ధనుష్ కథానాయకుడిగా నటించిన చిత్రం తేరే ఇష్క్ మే. నటి క్రితీ సనన్ నాయికగా నటించిన ఇందులో ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. భూషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ప్రేమ, దేశం కోసం త్యాగం వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం ఇది. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. నటుడు ధనుష్ పాత్ర కళాశాల విద్యార్థి, ప్రేమికుడు,యుద్ద విమాన పైలెట్ అంటూ 3 కోణాల్లో సాగే ఇందులో ఆయన నటన మరోసారి ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది. అదేవిధంగా నటి క్రితీ సనన్ ఆయనకు దీటుగా నటించారనే చెప్పాలి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం పక్క బలంగా అదిరింది. కీబేర, ఇడ్లీకడై వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ధనుష్ నటించిన చిత్రం కావడంతో తేరే ఇష్క్ మే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటిని ఈ చిత్రం రీచ్ అవుతుందో చూడాలి. -
మహాదీపోత్సవానికి సర్వం సిద్ధం
వేలూరు: తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 3న జరగనున్న మహాదీపోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ తెలిపారు. స్థానిక అన్నామలైయార్ శివాలయంలో కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ 3న ఉదయం 4 గంటలకు ఆలయంలో భరణి దీపం వెలిగిస్తారు. సాయంత్రం 6 గంటలకు మహా కొండపై కార్తీక మహాదీపం వెలిగించనున్నారు. అర్ధనారీశ్వరుడి ఆలయం నుంచి ప్రదర్శన ప్రారంభమై బలి పీఠం వద్ద ముగిస్తుంది. ఇక్కడ అఖండ జ్యోతిని వెలిగిస్తారు. అదే సమయంలో కొండపై మహాదీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగించేందుకు ప్రభుత్వ ఆవిన్ పాల పరిశ్రమ నుంచి ఇప్పటికే 3,500 కిలోల నెయ్యిని సిద్ధంగా వుంచారు. ఈదీపాన్ని 20 కిలోమీటర్ల దూరం నుంచి భక్తులు దర్శించుకోవచ్చు. దీపాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఇప్పటికే తిరువణ్ణామలైకి చేరుకున్నారు. 12 వేల మందితో పోలీస్ బందోబస్తు.. దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు 40 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారని. దీపోత్సవానికి 12 వేల మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సుధాకర్ తెలిపారు. అక్కడక్కడ సిసి కెమరాలు, డూమ్ కెమరాలు వుంచి నిఘా వుంచనున్నట్లు తెలిపారు. కొండపైన దీపోత్సవాన్ని చూసేందుకు ముందుస్తు గుర్తింపు కార్డు పొందిన వారికి మాత్రమే కొండపైకి అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. గజ వాహనంపై చంద్రశేఖరుడి చిద్విలాసం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శనివారం ఉదయం వెండి గజవాహనంలో చంద్రశేఖరుడు భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం రాత్రి పంచ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణలు చేసి మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాలను పురష్కరించుకొని 63 నాయన్మార్లు ప్రత్యేక అలంకరణల మధ్య కావిళ్లలో ఉంచి భక్తులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కర్పూర హారతులు పట్టి స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు కార్తీక మహా దీపం దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రం నుంచి రెండు వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తర్పగరాజ్ తెలిపారు. తిరువణ్ణామలైకి వచ్చే తొమ్మిది రహదారులను మూసివేసి తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేశామన్నారు. నేడు మహారథోత్సవం కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఆదివారం ఉదయం పంచ రథోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఒక్కో రథాన్ని ఒక్కోసారి ప్రారంభించాలని తెలిపారు. -
రామన్నకు షాక్
సాక్షి, చైన్నె: పీఎంకే ఎవరిది అన్న చర్చ కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం ముగింపు పలికింది. అన్బుమణి గుప్పెట్లోకి పీఎంకే వెళ్లే విధంగా సీఈసీ చేసిన ప్రకటనతో ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు శిబిరం షాక్కు గురైంది. అన్బుమణిపై రాందాసు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. వివరాలు.. పీఎంకేలో రాందాసు, అన్బుమణి రాందాసు మధ్యసాగుతున్న వివాదం గురించి తెలిసిందే. అన్బుమణిని పార్టీ నుంచి రాందాసు తొలగించారు. తానే అధ్యక్షుడ్ని అంటూ ఓ వైపు అన్బుమణి నేతృత్వంలో సర్వసభ్య సమావేశం నిర్వహించి కేంద్ర ఎన్నికల కమిషన్కు తీర్మానాలు పంపించారు. పార్టీకి తానే వ్యవస్థాపక అధ్యక్షుడ్ని అంటూ రాందాసు నేతృత్వంలో ప్రత్యేక సర్వ సభ్య సమావేశం నిర్వహించి తీర్మానాలను ఎన్నికల కమిషన్కు పంపించారు. అలాగే అన్బుమణి స్థానంలో తన కుమార్తె శ్రీగాంధీని వర్కింగ్ ప్రెసిడెంట్గా రాందాసు నియమించారు. ఈ పరిస్థితులలో అన్బుమణిని పార్టీ అధ్యక్షుడిగా అంగీకరిస్తూ గత నెల కేంద్ర ఎన్నికల కమిషన్ పంపిన ఓ లేఖ చర్చకు దారి తీసింది. ఇక పీఎంకే అన్బుమణి గుప్పెట్లో అన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, అన్బుమణికి పంపిన లేఖకు వ్యతిరేకంగా రాందాసు తరపున కేంద్ర ఎన్నికల కమిషన్ను న్యాయవాదులు కలిసి వివరణ ఇవడంతో పార్టీ ఎవరిది? అన్న చర్చ సాగుతూ వచ్చింది. తన పదవీ కాలం ముగిసిన విషయాన్ని దాచి పెట్టి, సర్వ సభ్యసమావేశం తీర్మానాలతో ఎన్నికల కమిషన్ను అన్బుమణి తప్పుదోవ పట్టించినట్టుగా రాందాసు తరపున ఫిర్యాదు చేశారు. అదే సమయంలో తన పదవీకాలాన్ని 2026 ఆగస్టు వరకు పొడిగించినట్టు కేంద్ర ఎన్నికల కమిషన్కు అన్బుమణి తరపున వివరణ ఇచ్చారు. దీంతో పార్టీని ఎవరికి అప్పగించాలో అని తర్జన భర్జన పడుతూ వచ్చిన ఎన్నికల కమిషన్ చివరకు అన్బుమణి గుప్పెట్లోకి అప్పగించడం రాందాసుకు షాక్గా మారింది. అన్బుమణికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అండగా ఉండటంతోనే ఎన్నికల కమిషన్ పార్టీని ఆయనకు అప్పగించినట్టు ప్రచారం ఊపందుకుంది. రామన్న ఆగ్రహం ఎన్నికల కమిషన్ తీరుపై రాందాసు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన తరపున అప్పీలు పిటిషన్కు న్యాయవాది, ఎమ్మెల్యే బాలు నేతృత్వంలోని బృందం కసరత్తు చేపట్టింది. తమకు షాక్ ఇచ్చే విధంగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై రాందాసు నిశితంగా పరిశీలించే పనిలో పడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, అన్బుమణి తన వద్ద నుంచి అన్ని లాగేసుకున్నాడని, ఒక్క ప్రాణం తప్పా? అని ఆవేదనతో వ్యాఖ్యలు చేశారు. అన్బుమణి రాజకీయ జీవితం త్వరలో సమాప్తం కానున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సామాజిక వర్గం ప్రజలు తన వెన్నంటే ఉన్నారని , హక్కులను ఎన్నటికీ వదులుకోనని స్పష్టం చేశారు. కాగా, అప్పీలు పిటిషన్లో ఏదేని తిరకాసు తలెత్తిన పక్షంలో తక్షణం కొత్త పార్టీ దిశగా సైతం రాందాసు కసరత్తులలో ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. -
జిల్లా అధ్యక్షుడి నియామకంపై కసరత్తు
తిరుత్తణి: కాంగ్రెస్ నూతన జిల్లా అధ్యక్షుల ఎంపికకు సంబంధించి కార్యకర్తల నుంచి అభిప్రాయం సేకరించి కొత్త అధ్యక్షులను నియమించనున్నట్లు పరిశీలకులు తెలిపారు. తమిళనాట త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ బలోపేతం చేసి విజయం సాధించడం లక్ష్యంగా జిల్లాలకు కొత్త సారథులు నియమించేందుకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించి కొత్త సారతులు నియమిస్తున్నారు. ఇందుకోసం పరిశీలకులను నియమించి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరువళ్లూరు నార్త్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి కేజీ కండ్రిగలో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దురైచంద్రశేఖర్, మాజీ అధ్యక్షుడు ఏజీ.చిదంబరం పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు సందీప్ కార్యకర్తలు వద్ద విడివిడిగా వారి అభిప్రాయాలు సేకరించి రికార్డు చేశారు. కార్యకర్తల అభిప్రాయాలు సేకరించిన తర్వాత కొత్త సారిథి నియామకంకు సంబంధించి ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇందులో పార్టీ రాష్ట్ర నేత వెంకటరాజు, రాష్ట్ర కార్యదర్శి గోవిందరాజ్, మండల కార్యదర్శి ఏలుమలై, నగర కార్యదర్శి రామకృష్ణన్ పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొన్న కారు
–ఇద్దరు దుర్మరణం అన్నానగర్: డివైడర్ను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన ధువరంకురిచ్చి సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. మదురై జిల్లాలోని నాగమలై పుదుక్కోట్టైకు చెందిన పాట్రిక్ (55) మదురైలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ప్రొఫెసర్. ఇతని భార్య చైన్నె కొలత్తూర్ పోలీస్స్టేషన్న్లో సీఐ. వీరి కుమారుడు మెల్విన్ (32) చైన్నెలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. కోడలు ఆరోగ్య ప్రిస్సిల్లా (26). పాట్రిక్ తన కుమారుడు, కోడలితో కలిసి చైన్నె వెళ్లి శుక్రవారం రాత్రి కారులో మధురైకి తిరిగి వెళుతున్నాడు. కారును మెల్విన్ నడుపుతున్నాడు. శనివారం ఉదయం 9 గంటలకు భారీ వర్షం కురుస్తుండడంతో కారు అదుపుతప్పి తిరుచ్చి జిల్లాలోని ధువరంకురిచ్చిలోని మదురై జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొంది. ఈప్రమాదంలో పాట్రిక్ అక్కడికక్కడే మృడిచెందాడు. తీవ్రంగా గాయపడిన ఆరోగ్య ప్రిస్కిల్లా, మెల్విన్లను మదురైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యప్రిస్కిల్లా మృతిచెందింది. సమాచారం అందుకున్న కురిచి పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాట్రిక్ మృతదేహాన్ని శిథిలాల నుంచి వెలికితీసి పోస్ట్మార్టం కోసం మనప్పారై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణ పనుల పరిశీలన కొరుక్కుపేట: చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ తరపున ఉత్తర చైన్నె డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద రూ. 46.50 కోట్ల ఆర్థిక సహకారంతో నిర్మిస్తున్న తిరువొత్తియూర్ ప్రభుత్వ సాంకేతిక కళాశాల, ప్రభుత్వ వత్తి శిక్షణ సంస్థ పనులను మంత్రి, చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పి.కె. శేఖర్బాబు పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనల మేరకు, ఉత్తర చైన్నె అభివద్ధి ప్రాజెక్టు కింద, ఒక పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ,సాంకేతిక కళాశాల నిర్మాణం కూడా వేగంగా జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే కె.పి. శంకర్, చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ గోప్రకాష్ పాల్గొన్నారు. -
రోబోటిక్ విధానంతో మెరుగైన శస్త్ర చికిత్సలు
సాక్షి, చైన్నె: ఆంకాలజీ, జీర్ణ సంబంధిత సమస్లయు, యూరాలజీ ,థొరాసిక్, గైనకాలజీ, కాంప్లెక్స్ జనరల్ సర్జరీలో రోబోటిక్ విధానం మరింత మెరుగైనదిగా బిల్ రోత్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ రాజేష్ జగన్నాథన్ తెలిపారు.మెరుగైన శస్త్ర చికిత్స, ఖచ్చితత్వం కోసం మాడ్యులర్ రోబోటిక్ , హై డెఫెనిషన్ 3డీ ఇమేజింగ్ను కలిగిన అధునాతన ఎస్ఎస్ఐ మంత్ర వ్యవస్థను బిల్ రోత్లో ఏర్పాటు చేశారు. శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ విధానం, ఎస్ఎస్ ఇన్నోవేషన్ రూపకల్పన చేసిన ఎస్ఎస్ఐ మంత్ర, రోబోటిక్ సర్జరీల గురించి డాక్టర్ రాజేష్ జగన్నాథన్ వివరిస్తూ, రోబోట్సహాయక శస్త్ర చికిత్స కోసం ఒక ఎ క్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. రోగులకు ఇది ఎల్ల వేళల్లో అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఉపాధ్యక్షులు డాక్టర్ దీపా, గైనకాలజిస్టు డాక్టర్జయలక్ష్మి, శివరాజ్, పద్మకుమార్, డాక్టర్ దివ్య, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్కుమర గురుబరన్, డాక్టర్ శంకర్ నారాయణన్, యూరాలజిస్టు డాక్టర్ఏసీ మణి, థొరాసిక్ నిపుణుడు డాక్టర్ భరత్గురు, తదితరులు పాల్గొన్నారు. -
ఆయనే నాకు స్ఫూర్తి
తమిళసినిమా: దర్శకుడు విజయ్ ఇంతకుముందు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డి స్టూడియోస్ పోస్ట్ అని సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్టూడియోలో రికార్డింగ్, రీ రికార్డింగ్, డబ్బింగ్, ఎడిటింగ్, సౌండింగ్, స్పెషల్ ఎఫెక్ట్ పంటి చిత్రాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ స్టూడియో నిర్వహణలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వేల్స్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ భాగస్వామ్యమైంది. ఇప్పటికే ఎన్నో భారీ చిత్రాలను నిర్మించిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరి గణేష్, దర్శకుడు విజయ్ కలిసి ఈ సంస్థ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ ఇండియన్ సినిమా గుండె చైన్నెనేనని పేర్కొన్నారు. చైన్నెలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డి స్టూడియో పేరుతో ఏర్పాటు చేయాలనే ఆలోచనకు ఊతం ఇచ్చిందన్నారు. నిర్మాత ఐసీ గణేష్ తనకు ఈ రంగంలో స్ఫూర్తిగా పేర్కొన్నారు. అలాంటి ఆయనతో కలిసి భవిష్యత్తులో వేల్స్ ది స్టూడియో సంయుక్తంగా తమిళ సినిమాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
క్లుప్తంగా
తిరువొత్తియూరు: చైన్నె, కోయంబేడు ప్రాంతలో మెథబెటమైన్ విక్రయం చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కోయంబేడు ప్రాంతంలో హైగ్రేడ్ డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని ప్రత్యేక పోలీసు బృందానికి రహస్య సమాచారం అందింది. పోలీసులు కోయంబేడు మార్కెట్ సమీపంలోని కుమరన్ నగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా బుల్లెట్ బండిలో తిరుగుతున్న ఇద్దరు యువకులను చుట్టుముట్టి విచారించారు. వారు అయ్యప్పంతంగల్కు చెందిన చంద్రప్రకాష్ (22), సాలిగ్రామానికి చెందిన భూపాలన్ (21) అని, మెథాబెటమైన్ డ్రగ్స్ విక్రయిస్తున్నారని తెలిసింది. దీంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3.28 గ్రాముల మెథాబెటమిన్, బుల్లెట్ బండి, ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తిరువొత్తియూరు: తూత్తుకుడి జిల్లా కలుగుమలై సి.ఆర్. కాలనీ మారియప్పన్ కోవిల్ వీధికి చెందిన సుతంత్ర కుమార్ (43) ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు. ఇతను తిరుప్పూర్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పని చేసి గత 6 నెలలుగా ఉద్యోగానికి వెళ్లకుండా స్వగ్రామమైన కలుగుమలైలో ఉంటున్నాడు. ఇతనికి పెళ్లయి భార్య 2 రోజుల్లోనే విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో శుక్రవారం రాత్రి ఇతను తెన్కాసి జిల్లా శంకరన్ కోవిల్ సమీపంలోని గురువికుళం దగ్గర ఉన్న కామాక్షిపురం చెరువు ప్రాంతంలో గాయాలతో హత్యకు గురయ్యాడు. గురువికుళం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నైల్లె ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరుత్తణి: పాఠశాల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన విద్యార్థిని పోలీసులు పోక్సో చట్టం కింద శనివారం అరెస్టు చేశారు. వివరాలు.. తిరుత్తణిలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఎప్పటిలైగే బుధవారం పాఠశాలకు నడిచి వెళ్లింది. ఆ బాలికను బైకులో వెంబడించి గుర్తు తెలియని యువకుడు లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆ బాలిక తిరుత్తణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో తిరుత్తణి యూనియన్లోని వీరగనళ్లూరు గ్రామానికి చెందిన మోహన్(21)ను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హజరుపరిచి జైలుకు తరలించారు. కాగా నిందితుడు చైన్నెలోని ఓ ప్రయివేటు కళాశాలలో బీఎస్సీ చదువుతున్నట్లు తెలిసింది. అన్నానగర్: చైన్నె పెరంబూరులోని బందర్ గార్డెన్లోని అరుముగ ముదలి వీధికి చెందిన దుక్క రాములు. ఇతని కుమార్తె దీపిక (22). ఈమె థౌజండ్ లైట్స్ ప్రాంతంలోని ఓ ప్రసిద్ధ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈమె శనివారం ఉదయం 6 గంటలకు ఓట్టేర దారిన మోపెడ్పై ఇంటి నుంచి బయలుదేరింది. అక్కడి దిడిర్ నగర్ శ్మశానవాటిక వద్దకు చేరుకుంటుండగా, ఆమె పనిచేస్తున్న ఆసుపత్రి వాహనం ఆమె మోపెడ్ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. దీపిక కిందపడి వ్యాన్ చక్రం ఆమె తలపై నుంచి ఎక్కి దిగడంతో అక్కడికక్కడే మరణించింది. దీని గురించిన సమాచారం అందుకున్న కిల్పాక్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు దీపిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం కిల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి వ్యాన్ డ్రైవర్ శ్రీనివాసన్ (29)ను అరెస్టు చేశారు. దీపిక పనిచేసే ఆసుపత్రిలోనే శ్రీనివాసన్ కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేశాడు. ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ మహిళ మరణానికి మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కొరుక్కుపేట: సామాజిక సేవల్లో రాణిస్తున్న తెలుగు ప్రముఖురాలు, విద్యావేత్త డాక్టర్ ఏవీ శివకుమారి తన తల్లిదండ్రులైన ఆలూరి రామస్వామి, పూర్ణావతి పేరుతో చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. మరింతగా సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఆలూరి రామస్వామి పూర్ణావతి తెలుగు చారిటబుల్ ట్రస్ట్ ను డిసెంబరు 1వ తేదీ ప్రారంభించనున్నారు. చైన్నె టి.నగర్ విజయరాఘవరోడ్డులో వున్న ఆంధ్రాక్లబ్లో 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు ట్రస్టు ప్రారంభో త్సవం జరుగనుంది. ఈ కార్యక్రమానికి తానా పూర్వాధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర ముఖ్యఅతిథిగా హాజరై ట్రస్ట్ను ఆవిష్కరించనున్నారు. మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు అధ్యక్షత వహించనున్న కార్యక్రమంలో గౌరవ అతిథిగా తమిళనాడు ప్రభుత్వ మాజీ అదనపు ముఖ్య కార్యదర్శి టి.ప్రభాకర రావు ,విశిష్ట అతిథిగా ఇన్ కంట్యాక్స్ మాజీ ప్రిన్సిపల్ కమిషనర్ బి. మురళి, ప్రత్యేక అతిథిగా ఆస్కా కార్యదర్శి దిలీప్ కుమార్ హాజరుకానున్నారు. ఈ కార్యమానికి అందరూ ఆహ్వానితులే అని ఆ ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ శివకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. -
ప్రేమను నిరాకరించిన బాలికపై దాడి
– విద్యార్థి అరెస్ట్ తిరువొత్తియూరు: చైన్నె కేకేనగర్లో ప్రేమించ లేదని బాలికపై దాడి చేసిన కళాశాల విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె ఎం.జి.ఆర్ నగర్ సమీపంలోని జాఫర్ఖాన్పేట ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక కే.కే.నగర్లోని ఓ కాఫీ షాపులో పనిచేస్తోంది. ఆమె ఇంటికి దగ్గరలో నివసిస్తున్న ఓ కళాశాల విద్యార్థిని ప్రేమించింది. అయితే అభిప్రాయభేదాల కారణంగా ఐదు నెలల క్రితం ఇద్దరూ విడిపోయారు. కానీ, ఆ బాలికను మర్చిపోలేక ఆ కళాశాల విద్యార్థి కొన్ని రోజులుగా పనికి వెళ్లే దారిలో బాలికను అడ్డగించి వేధించాడు. అయితే, ఆ బాలిక అతనితో మాట్లాడడానికి నిరాకరించి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన ఆ కళాశాల విద్యార్థి బాలిక పనిచేస్తున్న కాఫీ షాపునకు వెళ్లి గొడవ చేశాడు. దీన్ని ఖండించిన బాలికపై దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి, తన కూతురిపై దాడి చేసిన కళాశాల విద్యార్థిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వడపళని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి కళాశాల విద్యార్థిని అరెస్ట్ చేశారు. 3,500 క్యూసెక్కుల నీరు విడుదల తిరువళ్లూరు: జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షం మొదలైన క్రమంలో పూండి రిజర్వాయర్ నుంచి సెకనుకు 3,500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా శనివా రం నుంచి మోస్తరు వర్షం పడుతోంది. దీంతో రిజర్వాయర్కు భారీగా ఇన్ప్లో పెరగడంతో సెకనుకు 3,500 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ నుంచి భారీగా నీరు విడుదలైన క్రమంలో దాదాపు 30కి పైగా గ్రామాలకు ముంపు హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సైతం హెచ్చరిక జారీ చేశారు. -
అందాల ఆరబోత.. నేను చేయట్లేదా?: రకుల్
ఒకప్పటి హీరోయిన్లను ఇప్పటి తరానికి చాలా తేడా ఉందని చెప్పక తప్పదు. పాతతరం కథానాయికలు బొద్దుగా ఉండేవారు. ఈ తరం కథానాయికలు సైజ్ జీరోపై మక్కువ చూపుతారు. ఒకవేళ శరీర కొలతలు పెరిగితే దాన్ని తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడుతుంటారు. డైటింగ్ పేరుతో నోళ్లు కట్టేసుకుంటారు. ఈ విషయంలో ఉత్తరాది హీరోయిన్లు ముందుంటారని చెప్పక తప్పదు. పెళ్లి తర్వాతఅలా వివాహం తర్వాత కూడా నాజూకుతనాన్ని మెయింటైన్ చేస్తున్న హీరోయిన్లలో రకుల్ ఒకరు. గతేడాది బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. కొందరు హీరోయిన్లు పెళ్లి తర్వాత స్లిమ్గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కారణం.. మళ్లీ నటించడానికి రెడీ అవడమే. హీరోయిన్ రకుల్ కూడా ఆ కోవలోకే వస్తుంది. ఈమె కోలీవుడ్లో చివరగా నటించిన ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపర్చింది. అది తప్పుఆ తర్వాత దక్షిణాదిలో తనకు అవకాశాలు రాలేదు. అయినప్పటికీ అందాలారబోతతో పలు ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. దీని గురించి రకుల్ మాట్లాడుతూ.. సాధారణంగా పెళ్లయితే హీరోయిన్ల పని అయిపోయినట్లే అనే భావన ఉందని తెలిపింది. అయితే అది తప్పని, తన విషయంలో అలా జరగడం లేదని పేర్కొంది. తనకు సంబంధించినంతవరకు అందాల ఆరబోత అనేది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుందని తెలిపింది. అందం హద్దులను పెళ్లి చెరిపేయదని.. పైగా ప్రోత్సహించే నిచ్చెనలా పని చేస్తుందని చెప్పుకొచ్చింది. -
గళం జ్వలించాలి!
తీర్మానాలు ఇవే.. సాక్షి, చైన్నె :లోక్సభలో తమిళ గళం మరింతగా జ్వలింప చేయాలని, వివిధ పథకాలు, ప్రాజెక్టులకు అనుమతి కోసం కేంద్రాన్ని నిలదీయాలని, పట్టుబట్టాలని ఎంపీలకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ఉపదేశించారు. లోక్సభ వేదికగా అధికార బీజేపీ కూటమిని ఢీ కొట్టి, తమిళనాడుకు వారు చేస్తున్న ద్రోహాలను బట్టబయలు చేయాలని పిలుపు నిచ్చారు. వివరాలు.. డిసెంబరులో పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అధికార బీజేపీ ఢిల్లీ వేదికగా లోక్ సభ, రాజ్య సభలలో ఢీ కొట్టేందుకు ఎంపీలను డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ రంగంలోకి దించారు. ఇందుకోసం చైన్నె తేనాంపేటలోని అన్నా అరివాలయం మురసోలి మారన్ కాన్ఫరెన్స్ హాల్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులతో స్టాలిన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల కాలంగా తమిళనాడుపై కేంద్రం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, ఇక్కడికి రావాల్సిన ప్రాజెక్టులు, పథకాలను మరో రాష్ట్రాలకు బదిలీ చేయించడం, కోయంబత్తూరు, మధురై మెట్రో ప్రాజెక్టులకు అనుమతుల నిరాకరణ, వరిలో తేమ శాతం పెంపునకు అనుమతించక పోవడం, తమిళనాడులో రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వక పోవడం తదితర అంశాల గురించి చర్చించారు. కేంద్రం వైఖరిని ఉభయ సభల వేదికగా ఎండగట్టే విధంగా సమరానికి సిద్ధమయ్యారు. ప్రతి ఎంపీ తన గళాన్ని వినిపించాలని, కేంద్రం తీరును ఎండగట్టడమే కాకుండా, వారు అనుసరిస్తున్న వైఖరి ప్రజలోకి తీసుకెళ్లే విధంగా ఢిల్లీ వేదికగా నిరసన గళం జ్వలింప చేయాలన్న ఆదేశాలను ఎంపీలకు స్టాలిన్ చేశారు. అనంతరం ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు.ఎంపీలతో స్టాలిన్ సమావేశం రాష్ట్ర హక్కులను కాల రాసే విధంగా బీజేపీ పాలకులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేశారు. కేంద్రం అడ్డంకులు సృష్టించినా, తమిళనాడులో పెట్టుబడులు పెట్టేందుకు గత వారం 17 సంస్థలు ముందుకు రావడాన్ని ఆహ్వానించారు. గత కొన్నేళ్లలో 1,016 అవగాహన ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా రూ. 1,140,731 కోట్ల పెట్టుబడులను తీసుకు రావడంలో , 34 లక్షల మందికి ఉపాధి కల్పించడం టీఎన్ రైజింగ్ పనితీరును అభినందించారు. పారిశ్రామిక అభివృద్ధి, శాంతిభద్రతల నిర్వహణ,ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో అందరికీ అన్నీ నినాదంతో ఆర్థిక ప్రగతి కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్దిని చూసి ఓర్వ లేక ఈర్షతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నా, అనేక వివక్షలు చూపుతున్నా, గవర్నర్ ద్వారా అడ్డంకుల సృష్టిస్తున్నా, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో సుపరిపాలనను నిర్ధారించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్న ద్రావిడ మోడల్ సీఎం స్టాలిన్ను ప్రశంసించారు. బీజెపికి మద్దతు ఇచ్చే సంకీర్ణ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే నిధులు, పథకాలు అంటూ సాగుతున్న కేంద్రం తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా, అనేక పథకాలను విస్మరిస్తున్న కేంద్రం తీరును ఖండిస్తూ మరో తీర్మానం చేశారు. కొత్త రైలు ప్రణాళికలు లేవు. పదేళ్ల క్రితం ప్రకటించిన వాటికి నిధులు లేవు అంటూ అసహనం వ్యక్తం చేశారు. 2024–25లో కొత్త రైల్వే లైన్లకు 31,450 కోట్లు అని ప్రకటించి కేవలం రూ. 310 కోట్లు మాత్రమే విడుదల చేయడాన్ని ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ఈ వ్యవహారం గురించి ఇది వరకే లోక్ సభలో గళం వినిపించామని గుర్తు చేస్తూ, బీజేపీ ప్రభుత్వం తమిళనాడు అన్న రాష్ట్రం పేరునే మరిచినట్టు వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. కోయంబత్తూరు, మధురై మెట్రో రైలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపేందుకు ప్రధానమంత్రి స్వయంగా జోక్యం చేసుకోవాలని పట్టుబడుతూ నినదించనున్నామని ప్రకటించారు. బీజేపీ మోసాలకు, కుట్రలకు మద్దతు ఇస్తూ తమిళనాడు ప్రజలకు వ్యతిరేకంగా ప్రతి పక్ష నేత పళణిస్వామి వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ, ఆయన వ్యవహార తీరును ఖండిస్తూ తీర్మానం చేశారు. కోయంబత్తూర్, మధురై విమానాశ్రయ విస్తరణ, మధురై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలైంజ్ఞర్ వర్సిటీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం, గవర్నర్కు గడువు నిర్ణయం విషయంగా ఉభయ సభలలో కేంద్రంపై ఒత్తిడికి నిర్ణయించారు. ఈ వ్యవహారంలో విశ్రమించబోమని స్పష్టం చేశారు. అన్ని పార్టీల ఎంపీలను మద్దతుతో ఈ బిల్లుకు ఆమోదం దిశగా ముందుకెళ్లేందుకు తీర్మానించారు. వరిలో తేమ శాతం పెంపునకు, రైతులను ఆదుకునేందుకు, వరి కొనుగోలును మరింత విస్తృతం చేసే దిశగా, రైతులకు మద్దతు ధర, ప్రజా పంపిణీ పథకంతో సహా ఇతర సంక్షేమ పథకాలను వెంటనే ఆమోదించే విధంగా డిమాండ్ల నినాదాన్ని ఉభయ సభలలో మార్మోగించేందుకు నిర్ణయించారు. విద్యలో కాషాయం రంగును పులిమేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. తమిళనాడుకు రూ. 3,548.22 కోట్ల రుణాలను విడుదల చేయాలని పట్టుబట్టారు. కొత్త చట్టాలు కార్మిక హక్కులను హరించే విధంగా, వారి పై ప్రభావం చూపించకుండా ఉండాలని డిమాండ్ చేశారు. కార్మిక జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు. సాంప్రదాయ చేపల వేట హక్కులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, శ్రీలంక చెరలో ఉన్న జాలర్లను విడుదలచేయించాలని, పడవలన్నీ స్వాధీనం చేసుకోవాలని నినదించారు. ఉపాధ్యాయులుగా నియమితులైన , ప్రస్తుతం పనిచేస్తున్న వారు రెండేళ్లలోపు బోధనా అర్హత కలిగి ఉండే విధంగా టెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాల్సిందే, లేని పక్షంలో వారు బోధనా విధుల నుంచి తొలగించబడతారనే విషయంగా సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్టు ప్రస్తావిస్తూ, ఉపాధ్యాయులలో నెలకొన్న ఆందోళనలను తొలగించడం, వారికి రక్షణగా నిలిచేందుకు ఎంపీలు తీర్మానించారు. మహాత్మా గాంధీ గ్రామీణాభివృద్ధి కార్యక్రమం గ్రామీణ పేదలకు ఒక ముఖ్యమైన పథకం అని పేర్కొంటూ, తమిళనాడుకు ఉపాధి పథకం నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఒకే రోజు ఈరోడ్లో ముగ్గురు నేతల ప్రచారం
సాక్షి, చైన్నె : ఈరోడ్లో ఆదివారం ఒకే రోజు మూడు పార్టీల నేతల ప్రచారం జరగనుంది. సెంగొట్టయ్యన్ బయటకు వెళ్లిన నేపథ్యంలో తమ పార్టీ బలాన్ని గోబి చెట్టి పాళయంలో చాటే విధంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి సభకు నిర్ణయించారు. ఈరోడ్జిల్లా గోబిచెట్టి పాళయంలో ఈ సభ ఆదివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. అదే సయంలో డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ పర్యటన కూడా ఈరోడ్ ఉత్తరం పరిధిలో సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఈ ఉత్తరం ప్రాంతం సైతం గోబి చెట్టి పాళయంకు సమీపంలోని నంబియూరు కొత్త బస్టాండ్ ఆవరణలో ఉండడం గమనార్హం. అదేవిధంగా ఈరోడ్ ఎలుమత్తూరులో డీఎంకే యువజన ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ కార్యక్రమం కూడా జరగనుంది. ద్రవిడ కళగం నేతృత్వంలో 6వ రాష్ట్రస్థాయి సామాజిక న్యాయ సదస్సు ఇక్కడ జరగనుండడం గమనార్హం. ముగ్గురు నేతల పర్యటనలు పక్క పక్క గ్రామాల పరిధిలోని ప్రాంతాలలో జరుగుతుండడంతో భద్రతా ఏర్పాట్లలో ఈరోడ్ జిల్లా పోలీసుల యంత్రాంగం నిమగ్నమైంది. పెట్టుబడిదారుల రక్షణలో ఎస్ఈబీఐ సాక్షి, చైన్నె : పెట్టుబడి దారుల రక్షణలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(ఎస్ఈబీఐ), నేషనల్ స్టాక్ ఎక్సే ్చంజ్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్ఈ)లు ఉన్నాయని వక్తలు వ్యాఖ్యానించారు. పుదుచ్చేరిలో హై ఇంపాక్ట్ రీజినల్ ఇన్వెస్టర్ సెమినార్ ఆన్ అవేర్ నెస్పేరిట కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్థిక అక్షరాస్యత, పెట్టుబడి దారులకు అవగాహన , పెట్టుబడి దారులకు రక్షణ గురించిన అంశాలను విశదీకరించారు. ఎస్ఈబీఐ చైర్మన్ తుహిన్ కాంత పాండే, ఎన్ఎస్ఈ ఎండీ ఆశీష్కుమార్ చౌహాన్లు మాట్లాడుతూ, పెట్టుబడిదారుల విద్య, రక్షణ, అవగాహన, ఎన్ఎస్ఈ, ఎస్ఈబీఐ లక్ష్యాలను, భద్రతా పరమైన అంశాలను గురించి విశదీకరించారు. దేశంలో 12.2 కోట్ల మంది ప్రత్యేక రిజిస్టర్డ్ పెట్టుబడి దారులు ఉన్నారని పేర్కొంటూ, ఆర్థికంగా మోసాలను అడ్డుకోవడం, మోసాలకు వ్యతిరేకంగా బలమైన కవచంగా ఆర్థిక శ్రేయస్సుకు తోడ్పాటు అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి సైబర్ క్రైమ్ ఐపీఎస్ అధికారి శృతి ఎస్. యరగట్టి, సెబీ ఎస్ఆర్ఓ ప్రాంతీయ డైరెక్టర్ సూరజ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. తెన్ కాశీనుంచి ప్రత్యేక బస్సులు కొరుక్కుపేట: ప్రసిద్ధ శబరిమల ఆలయంలో మండల, మకరవిళక్కు క్రతువులు ప్రారంభం కావడంతో, తమిళనాడు నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం వివిధ మార్గాల్లో ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించారు. ఇందులో భాగంగా, శనివారం (నవంబర్ 29) నుంచి బొంబాయి– తెన్ కాశీ మధ్య ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభించనున్నట్లు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. శబరిమల సీజన్లో తమిళనాడు , కర్ణాటక నుంచి వచ్చే భక్తుల రవాణా అవసరాలను తీర్చడానికి, మొత్తం 67 మార్గాల్లో బస్సు సర్వీసులను నడపడానికి రాష్ట్ర రవాణా సంస్థకు అనుమతి మంజూరు చేయబడింది. దీనివల్ల రెండు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. మొదటి దశలో, శుక్రవారం నుండి కోయంబత్తూర్ – పంబా మధ్య ప్రత్యేక బస్సు సర్వీసు ప్రారంభించారు. కేవలం తెన్కాసికే కాకుండా, భక్తుల ప్రయోజనం కోసం తమిళనాడులోని పళని, తిరునల్వేలి, కుంబం, చైన్నె వంటి ఇతర ప్రధాన నగరాలకు త్వరలో ప్రత్యేక బస్సులు నడపబడతాయి. అదనంగా, కర్ణాటక నుండి వచ్చే భక్తుల డిమాండ్లకు అనుగుణంగా అదనపు బస్సులను నడపాలని యోచిస్తున్నట్లు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. 3న టాస్మాక్ ఉద్యోగుల సమ్మె కొరుక్కుపేట : డిసెంబర్ 3న టాస్మాక్ ఉద్యోగులు సమ్మె చేపడుతున్నట్టు తమిళనాడు టాస్మాక్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ తిరుచ్చిలో ప్రకటించింది. తమిళనాడు రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సభ్యులు శనివారం తిరుచ్చి సెంట్రల్ బస్టాండ్ సమీపంలోని తిరుచ్చి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. మద్యం ఖాళీ సీసాలను సేకరించడానికి ఓ ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కోరారు.ఉద్యోగులు ఖాళీ సీసాలను సేకరిస్తే, రాబోయే కొన్ని సంవత్సరాలలో, ఉద్యోగులు వివిధ వ్యాధులు, మానసిక ఒత్తిడితో చనిపోయే పరిస్థితి ఉందన్నారు. ఈమేరకు సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించారు. -
కోవైలో ఉత్తరాది ముఠా వీరంగం
● ఒకే రోజు 13 ఇళ్లలోచోరీ ● తుపాకీతో వెంటాడి పట్టుకున్న పోలీసులు సాక్షి, చైన్నె: కోయంబత్తూరులో ఉత్తరాది దొంగల ముఠా వీరంగం సృష్టించింది. ఒకే రోజు 13ఇళ్లలో చోరికి పాల్పడింది. ఈ సమాచారంతో కోయంబత్తూరు పోలీసులు జల్లెడ పట్టారు. తుపాకీతో వెంటాడి వేటాడి మరి ముఠాలో కొందర్ని పట్టుకున్నారు. ఇందులో ముగ్గురి కాళ్లకు తూటాలు దిగడంతో పోలీసులు ఆస్పత్రిలోచేర్పించి చికిత్స అందిస్తున్నారు. కోయంబత్తూరు శివారులోని గౌండం పాళయంలో తమిళనాడు హౌసింగ్ బోర్డుకు చెందిన 14 అంతస్తుల భవనంలో వెయ్యికిపైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇందులోకి ఉత్తరాదికి చెందిన దొంగలముఠా శుక్రవారం రాత్రి ప్రవేశించి. తాళం వేసిన 13 ఇళ్లలో ఒకే రోజు రాత్రి ఈ ముఠా చోరికి పాల్పడింది. చోరీ సమాచారంతో గౌండం పాళయం పోలీసులు అలర్ట్ అయ్యారు. 13ఇళ్ల నుంచి 56 సవర్ల బంగారం, రూ. 3 లక్షలకు పైగా నగదు, ఇతర వస్తువులు చోరికి గురైనట్టు తేలింది. ఈ ముఠాను పట్టుకునేందుకు రాత్రంతా జల్లెడ పట్టాయి.ఈ ముఠా చోరీ అనంతరం యముత్తూరు వైపుగా వెళ్లినట్టు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. ఇక్కడి కులనత్తుం పాళయంలో ఓ ఇంట్లోకి శనివారం వేకువ జామున ముగ్గురు వెళ్తుండటంతో వారిని చుట్టుముట్టారు. వీరిలో ముగ్గురు పోలీసులపై ఎదురు దాడికి దిగారు. దీంతో ఆత్మరక్షన కోసం తుపాకీకి పని పెట్టారు. ముగ్గురి కాళ్లకు తుపాకీ తూటాలు దిగడంతో వారిని చికిత్స నిమిత్తం కోయంబత్తూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ముఠాలో మరి కొందరు సభ్యులు ఉండవచ్చు అన్న అనుమానంతో దర్యాప్తు ముమ్మరంగా చేస్తూ వస్తున్నారు. గాయపడి ఆస్పత్రిలో ఉన్న ముగ్గుర్ని ఉత్తరప్రదేశ్కు చెందిన ఇర్భాన్(45), ఆసీఫ్(48), ఖలీల్(60)గా గుర్తించారు. -
అది సరికాదు.. కేంద్రంపై మరోసారి సీఎం స్టాలిన్ ఫైర్
చెన్నై: కేంద్రంపై మరోసారి తమిళనాడు సీఎం స్టాలిన్ విరుచుకుపడ్డారు. తమిళనాడును కేంద్రం మోసం చేస్తోందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళనాడు నుంచి కేంద్రానికి ఎక్కువ రెవెన్యూ వెళ్తోందని.. కేంద్రం నుంచి మాత్రం తమిళనాడుకు తక్కువ నిధులొస్తున్నాయంటూ కేంద్రాన్ని స్టాలిన్ నిలదీశారు. రాష్ట్రానికి సంబంధించిన న్యాయమైన డిమాండ్లను కేంద్రం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుందని దుయ్యబట్టారు.అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వంగా చెప్పుకుంటూ, తమిళనాడు ప్రజల గొంతును బీజేపీ ప్రభుత్వం విస్మరించడం సరైనదేనా? అంటూ స్టాలిన్ ట్వీట్ చేశారు. తమిళనాడు డిమాండ్లు, అవసరాలను లేఖలు, వ్యక్తిగత పిటిషన్లు, శాసనసభ తీర్మానాల ద్వారా తీసుకొని వాటిని వినకపోవడం న్యాయం కాదు. అత్యధిక పన్ను ఆదాయాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రమైన తమిళనాడును మోసం చేయడాన్ని మనస్సాక్షి ఉన్న ఎవరూ అంగీకరించరు. మేము తలవంచం. నిటారుగా నడుస్తాం. రాబోయే పార్లమెంటరీ సమావేశంలో బీజేపీ ప్రభుత్వం.. తమిళనాడు ప్రజా ప్రతినిధులకు సమాధానం చెప్పాలి’’ అంటూ స్టాలిన్ డిమాండ్ చేశారు. மிகப்பெரிய ஜனநாயக நாடு என்று பெருமையாகச் சொல்லிக்கொண்டே, தமிழ்நாட்டு மக்களின் குரலை ஒன்றிய பா.ஜ.க. அரசு புறக்கணிப்பது சரியா?தமிழ்நாட்டின் கோரிக்கைகளை - தேவைகளைக் கடிதங்களாக, நேரில் மனுக்களாக, சட்டமன்றத் தீர்மானங்களாக எடுத்துச் சொல்லியும் காதில் வாங்காமல் இருப்பது நியாயமல்ல!… pic.twitter.com/xCC8BcOZNB— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) November 29, 2025 -
దూసుకొస్తున్న ‘దిత్వా’.. తమిళనాట కుండపోత వానలు
విశాఖ: దిత్వా తుపాన్ దూసుకొస్తుంది. దిత్వా తుపాను కారణంగా తమిళనాడులో కుండపోత వానలు కురుస్తున్నారు. నాగపట్టిణం, కరైకల్, రామనాధపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరొకవైపు ఏపీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధిక కుండపోత వానలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు సహా కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉందని హెచ్చరికలు పంపింది. గాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. VIDEO | Tamil Nadu: With Cyclone Ditwah approaching he coastal areas, Nagapattinam has receiving continuous rainfall leading to waterlogging in several low lying areas. #CycloneDitwah (Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/I0rXDVXA3A— Press Trust of India (@PTI_News) November 29, 2025 VIDEO | Strong winds lashed several parts of Tamil Nadu on Friday, as Cyclone Ditwah which is likely to bring heavy rainfall in the state, intensified over the southwest Bay of Bengal and the Sri Lankan coast. With the storm moving towards Puducherry, north Tamil Nadu and south… pic.twitter.com/80dhP4BV4I— Press Trust of India (@PTI_News) November 28, 2025దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అతలాకుతలం అవుతుంది. శ్రీలంక అంతటా తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వరదలు సంభవించగా, మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తులో అధికారిక నివేదికల ప్రకారం 123 మంది మృతి చెందారు. రెండు లక్షల మందికి పైగా ప్రజలు ప్రకృతి విపత్తులకు ప్రభావితమయ్యారు. తుఫాను కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి.In Sri Lanka, flooding has wreaked havoc. So far, 47 people have been reported dead from the #floods and landslides and 21 are missing. Relief and rescue operations are underway...#SriLanka #SriLankafloods #SriLankarains #SrilankaWeather #srilankanews #FloodSL #floodrelief pic.twitter.com/PIlM4GOwO2— Galgotias Times (@galgotiastimes) November 28, 2025 శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్లో నదుల నీటి మట్టాలు ఆందోళనకర స్థాయికి పెరగడంతో సహాయక చర్యలు కష్టతరమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరిట తక్షణమే సాయం అందించింది.దీనిలో భాగంగా వరద-నిర్వాసితులకు అత్యవసర సహాయ సామగ్రిని తీసుకువెళుతున్న భారత వైమానిక దళానికి చెందిన సీ130 విమానం శనివారం తెల్లవారుజామున కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానంలో అవసరమైన ఆహారం, శానిటరీ సామాగ్రిని తరలించారు. సముద్ర మార్గం ద్వారా కూడా ‘ఆపరేషన్ సాగర్ బంధు’ ప్రారంభమైంది. తొలి విడత సహాయ సామగ్రిని భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి ద్వారా ఇప్పటికే తరలించారు. -
తీరానికి సమీపంలో..
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్ ప్రస్తుతం శ్రీలంక మీదుగా ఉత్తర–వాయువ్య దిశలో పయనిస్తోంది. ఇది శనివారం తమిళనాడు తీరం వెంబడి ఉత్తర దిశగా కదులుతుందని అంచనా వేశారు. దీంతో రాష్ట్ర విపత్తు నిర్వహణకు చెందిన 16 బృందాలను చైన్నె, చెంగల్పట్లు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో రంగంలోకి దించారు. అలాగే, మరో 12 జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు సైతం రంగంలోకి దిగాయి. రాష్ట్ర, జాతీయ, అగ్నిమాపక, ప్రత్యేక రెస్క్యూ బృందాలను వేలూరు, తిరువణ్ణామలై, రాణిపేట, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్, పుదుక్కోట్టై, మైలడుతురై, కడలూరు, విల్లుపురం, తిరునెల్వేలి , తూత్తుకుడి జిల్లాలకు శుక్రవారమే పంపిచేశారు. అవసరం అయితే, సేవలకు సిద్ధంగా ఉండాలని ఆర్మీ, నౌక, వైమానిక దళం, ఇండియన్ కోస్టుగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేర వేసే విధంగా చైన్నె ఎలిళగంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్తగా నిండు కుండలుగా ఉన్న రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేస్తూ చర్యలు తీసుకున్నారు. కూవం, అడయార్, కుశస్థలి నదీ తీరాల ప్రజలను అప్రమత్తం చేశారు. అరక్కోణం నుంచి ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 240 మందితో కూడిన 8 బృందాలు డెల్టా జిల్లాలకు వెళ్లాయి. గ్రామీణ ప్రాంతాల వైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు -
మాతోనే జయలలిత వర్సిటీ ప్రగతి
సాక్షి, చైన్నె: జయలలిత పేరిట ఉన్న వర్సిటీపై తాము ఎలాంటి వివక్ష చూపించలేదని, మరింతగా అభివృద్ధి చేశామని సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. జే జయలలిత మ్యూజిక్ అండ్ ఫైనార్ట్స్ వర్సిటీ స్నాతకోత్సవంలో శుక్రవారం నటుడు శివకుమార్కు గౌరవ డాక్టరేట్ను సీఎం ప్రదానం చేశారు. చైన్నెలోని కలైవానర్ అరంగంలో జె జయలలిత మ్యూజిక్ అండ్ ఫైనార్ట్స్ వర్సిటీ 3వ స్నాతకోత్సవం జరిగింది. ఇందులో ఆ వర్సిటీ చాన్స్లర్ హోదాలో సీఎం స్టాలిన్తో పాటు మంత్రులు స్వామినాథన్, సుబ్రమణియన్, శేఖర్బాబు, ఎంపీలు కళానిధి వీరాస్వామి, మణివాసన్, వర్సిటీ వీసీ డాక్టర్ సౌమ్య, రిజిస్ట్రార్ మాలిని, నటుడు శివకుమార్, చిత్రకారుడు చంద్రు, వర్సిటీ బోర్డు సభ్యుడు పూచ్చిమురుగన్ హాజరయ్యారు. విద్యార్థులకు పతకాలను, డిగ్రీలను సీఎం స్టాలిన్ అందజేశారు. శివకుమార్, చిత్రకారుడు చంద్రులకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ శివకుమార్, చంద్రులకు గౌరవ డాక్టరేట్ అందజేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనా కాలంలో శివకుమార్, ఆయన కుమారులు సూర్య, కార్తీ ఇచ్చిన విరాళం గురించి గుర్తు చేశారు. వివక్ష చూపించ లేదు.. అమ్మయార్ జయలలిత పేరిట ఉన్న ఈ వర్సిటీపై తాము ఎలాంటి వివక్ష చూపించ లేదని, మరింత అభివృద్ధి చేశామని అన్నారు. 2021 తర్వాతే ఈ వర్సిటీకి గొప్ప వైభవం తీసుకొచ్చామని వివరించారు. ఈ వర్సిటీ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈరోజు పట్టభద్రులైన వారందరూ రానన్న కాలంలో గొప్పకళాకారులుగా ఎదగాలని పేర్కొంటూ, సంగీత విద్యాంసుడు ఇళయరాజకు ఇటీవల జరిగిన సన్మానం గుర్తుచేశారు. ఈవర్సిటీలో సంగీతం, కళలు, కవిత్వం గురించి విద్యార్థులు అధ్యయనం చేస్తుండడం ఆహ్వానించదగ్గ విషయంగా పేర్కొన్నారు. ఈ దిశగా 2026–27లో కవితలు, కళల పరిరక్షణలో కొత్త మాస్టర్ డిగ్రీ కోర్సు ప్రవేశ పెట్టనున్నామని ప్రకటించారు. వర్సిటీ నిర్వహణ మెరుగుపరచడానికి రూ.3కోట్ల నుంచి రూ.5కోట్లకు పెంచుతున్నామని ప్రకటించారు. తమిళానికి, తమిళ జాతికి గర్వకారణంగా నిలిచే విధంగా రచనలు అందించాలని విద్యార్థులకు పిలుపునిస్తూ, ఉత్తమ కళలకు, సేవకులకు కలైమామణి వంటి అవార్డులు ఎదురు చూస్తున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. -
టీఎంసీలో కొత్త ఉత్సాహం
సాక్షి, చైన్నె: తమిళ మానిల కాంగ్రెస్లో 2026 అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఉత్సాహాన్ని నింపబోతున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జీకే వాసన్ తెలిపారు. ఆళ్వార్పేటలో శుక్రవారం తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) ఆవిర్భావ దినోత్సవం జరిగింది. పార్టీ జెండాను జీకే వాసన్ ఎగురవేశారు. కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టారు. అందరికీ సీట్లు, సహాయకాలను అందజేశారు. బాణసంచా కాల్చుతూ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకున్నారు. ఈసందర్భంగా వాసన్ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జీఆర్ వెంకటేశ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. అనంతరం వాసన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, శాంతి భద్రతలు క్షీణించాయని, డీఎంకేపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆరోపించారు. 2026 ఎన్నికలు టీఎంసీకి కొత్త ఉత్సాహం ఇవ్వబోతోందన్నారు.ఈ సారి తమ ప్రతినిధులు సభలో అడుగు పెట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. -
పులికి తోకగా ఉండడమే గౌరవం
● అన్నాడీఎంకే సీనియర్ నేతజయకుమార్ సాక్షి, చైన్నె: ఎలుకకు తలగా ఉండడం కన్నా, పులికి తోకగా ఉండడమే గౌరవం అని అన్నాడీఎంకే సీనియర్ నేత డి.జయకుమార్ అన్నారు. పార్టీ సీనియర్ నేతగా ఉన్న సెంగొట్టయ్యన్ టీవీకేలో చేరడం గురించి ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తన అభిప్రాయాన్ని, తన నిర్ణయాన్ని సెంగొట్టయ్యన్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఎక్కడున్నా బాగుండాలన్నదే తన అభిప్రాయం అని చెప్పారు. తన వరకు అయితే, ఎలుకకు తలగా ఉండడం కన్నా, పులికి తోకగా ఉండడమే గౌరవంగా భావిస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పులి అన్నాడీఎంకే అని, ఎలుక అనేది ఎవరో మీరే అర్థం చేసుకోండి అంటూ పరోక్షంగా టీవీకేను ఉద్దేశించి చమత్కరించారు. ఎలుకకు తలగా ఉంటే ప్రయోజనం శూన్యం అని ఎద్దేవా చేశారు. మరో సీనియర్ నేత ఆర్బీ ఉదయకుమార్ స్పందిస్తూ అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడం ఎవరితరం కాదన్నారు. 2026లో ఎవరెన్ని జిమ్మికులు, మాయలు చేసినా గెలుపు అన్నాడీఎంకే వైపే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలలో చైతన్యం వచ్చేసిందని, ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని, గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. శిరోభారంగా పదవుల భర్తీ సాక్షి, చైన్నె : రాష్ట్ర కాంగ్రెస్లో జల్లా అధ్యక్షులు, ఇతర కార్యనిర్వాహకుల పదవుల భర్తీ అధిష్టానం పెద్దలకు శిరోభారంగా మారింది. అనేక చోట్ల అధ్యక్ష పదవి కోసం గ్రూపుల మధ్య సమరం నెలకొనడంతో ప్రత్యేక కమిటీ వర్గాలు సందిగ్ధంలో పడ్డట్టు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్లోని అన్ని జిల్లాల్లో అధ్యక్షులు, ఇతర నిర్వాహకుల పదవుల భర్తీ నిమిత్తం ఏఐసీసీ 33 మంది ప్రతినిధులతో కమిటీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. బృందాలుగా ఏర్పడిన ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అయితే, అనేక చోట్ల అధ్యక్ష పదవులకు సంబంధించి కాంగ్రెస్లోని గ్రూపుల మధ్య సమరం నెలకొనడంతో ప్రతినిధులకు శిరోభారంగా మారినట్టు తెలిసింది. డిసెంబర్ మొదటి వారంలోపు పర్యటనను ముగించి జాబితా సిద్ధం చేయడానికి ఈ కమిటీ పరుగులు తీస్తోంది. అదే సమయంలో శుక్రవారం అంబత్తూరులో జరిగిన సమావేశంలోనూ ఉత్తర చైన్నె, కాంచీపురం జిల్లాల అధ్యక్ష పదవుల ఎంపిక కసరత్తులు రచ్చకు దారి తీయడంతో కమిటీ ప్రతినిధులు నివ్వెర పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీఎంకే పతనమే లక్ష్యం సాక్షి, చైన్నె: డీఎంకే పతనమే లక్ష్యంగా ముందుకు సాగే కూటమిలో పీఎంకే ఉంటుందని ఆపార్టీ నేత అన్బుమణి వ్యాఖ్యానించారు. శుక్రవారం స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎంకేపై ప్రజల్లో ఆక్రోశం రగులుతోందన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ డీఎంకే పాలనలో మహిళలు, యువకులు, కార్మికులు, రైతులు, పారిశ్రామిక వేత్తలు సైతం అష్టకష్టాలు పడుతున్నారని, ఎప్పుడెప్పుడు డీఎంకేను గద్దె దించేద్దామా అనే ఎదురుచూపుల్లో అన్ని వర్గాలు ఉన్నాయన్నారు. ప్రజలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని, డీఎంకేను గద్దెదించే సమయం ఆసన్నమైందన్నారు. ఈ ప్రయాణంలో ముందుండే కూటమిలో పీఎంకే ఉంటుందని, డీఎంకే పతనమే లక్ష్యంగా పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాడుతుందా అనేది ఎన్నికల ఫలితాల ఆధారంగానే ఉంటాయని, అంతవరకు వేచి ఉండాల్సిందేనని అన్నారు. త్వరలో టెర్మినల్ పనులు సాక్షి, చైన్నె: త్వరలో పరందూరులో విమానాశ్రయ టెర్మినల్ పనులు మొదలు అవుతాయని సలహా కమిటీ చైర్మన్, ఎంపీ టీఆర్ బాలు తెలిపారు. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయ సలహా కమిటీ సమావేశం శుక్రవారం ఆ విమానాశ్రయ డైరెక్టర్ రాజాకిషోర్ అధ్యక్షతన జరిగింది. ఇందులో సలహా కమిటీ చైర్మన్ టీఆర్ బాలు, పల్వారం ఎమ్మెల్యే కరుణానిధి, తాంబరం ఎమ్మెల్యే ఎస్ఆర్ రాజా, అధికారులు పాల్గొన్నారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించి పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలను మీడియాకు టీఆర్ బాలు వివరించారు. అలాగే, మీనంబాక్కం విమానాశ్రయ విస్తరణ పనులకు ఆ పరిసరాలలోని కౌల్బజార్, పొలిచ్చలూరు, అనకాపుత్తూరు పరిసరాలలో ఎలాంటి స్థల సేకరణ జరగదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న స్థలంలోనే టెర్మినల్స్ విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కొత్త విమానాశ్రయం పరందూరులో చేపట్టనున్నామని, త్వరలో ఈ పనులకు శ్రీకారం చుట్టనున్నట్టు వివరించారు. విమానాశ్రయం కోసం 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమి, 3,700 ఎకరాల ప్రైవేటు భూములను ఎంపిక చేసినట్టు తెలిపారు. -
దిత్వా రెడ్ అలర్ట్
మెట్రో రగడ సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో దిత్వా తుపాన్ రూపంలో తమిళనాడులోని డెల్టా జిల్లాల్లో శనివారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. డెల్టాలోని జిల్లాల సముద్ర తీరానికి సమీపంలో దిత్వా కదులుతుండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక, చైన్నెలోనూ శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం వరకు అనేక చోట్ల భారీ నుంచి మోస్తరుగా వర్షం పడే అవకాశాలు ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, ఇతర జిల్లాల నుంచి సహాయక బృందాలను రంగంలోకి దించింది. ఇప్పటికే దక్షిణ తమిళనాడు వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. డెల్టాలోని అనేక జిల్లాల్లో డెబ్బ తిన్న పంటలను చూసిన రైతులు కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో దిత్వా తుపాన్ ప్రభావం తమిళనాడుపై అధికంగా పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ ప్రభావం దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి, తిరునెల్వేలి, డెల్టా జిల్లాల్లోని పుదుక్కోట్టై, మైలాడుదురై, నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, కడలూరు జిల్లాలపై శనివారం అధికంగా పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే, చైన్నె, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లోనూ అధిక వర్ష పాతం నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎగసి పడుతున్న కెరటాలు దిత్వా ప్రభావంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంది. శుక్రవారం దిత్వా తన వేగాన్ని తగ్గించుకున్నప్పటికీ, శనివారం డెల్టాకు సమీపంలోకి రాగానే, వేగాన్ని పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో శుక్రవారం చైన్నె నుంచి తూత్తుకుడి , రామనాధపురం జిల్లాల వరకు సముద్రంలో అలల తాకిడి కనిపించింది. రామేశ్వరానికి వెళ్లాల్సిన అన్ని రైళ్లను మండపం వరకే పరిమితం చేశారు. కెరటాల జడి నేపథ్యంలో సముద్ర తీరంలోకి వెళ్ల వద్దంటూ ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. ముందు జాగ్రత్తగా జాలర్లు పడవలను ఒడ్డున భద్ర పరిచే పనిలో నిమగ్నమయ్యారు. చైన్నెలో లోతట్టు ప్రాంతాలలో ట్రాక్టర్లతో కూడిన మోటారు పంపు సెట్లను సిద్ధంగా ఉంచారు. రిప్పన్ బిల్డింగ్లోని ప్రత్యేక కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు చైన్నెలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు సన్నద్ధమయ్యారు.సన్నద్ధంగా ఉన్నాం: సీఎం స్టాలిన్ దిత్వా తుపాన్ నేపథ్యంలో చైన్నెలోని ఎలిళగంలోని రాష్ట్ర అత్యవసర కంట్రోల్ విభాగం నుంచి 14 జిల్లాల కలెక్టర్లతో సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఆయా జిల్లాలో చేపట్టిన ముందు జాగ్రత్తలను సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీఎస్ మురుగానందం, రెవెన్యూ అదనపుముఖ్య కార్యదర్శి సాయికుమార్, విద్యుత్శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి, మంగత్రామ్శర్మ, విపత్తు నిర్వహణ అదనపు ముఖ్యకార్యదర్శి పి. అముద పాల్గొన్నారు. మీడియాతో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, శని, ఆదివారాలలో డెల్టాతోపాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాల అలర్ట్తో అన్ని ముందు జాగ్రత్తలు విస్తృతం చేసి ఉంచామన్నారు. అన్ని జిల్లాలలో ప్రత్యేక అధికారులు రంగంలోకి దిగారని వివరించారు. ఎక్కడెక్కడ నష్టం తీవ్రత ఉంటుందో గ్రహించి అక్కడి ప్రజలను శిబిరాలకు తరలిస్తున్నామని, ప్రమాదాలను నివారించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే ఆయా ఇన్చార్జ్ మంత్రులు జిల్లాలకు చేరుకున్నారని, అఽధికారులతో కలిసి ముందుజాగ్రత్త పనుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. ప్రతి పక్ష నేతే రైతులకు తీవ్ర మోసం తలపెట్టారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దిత్వాను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. -
అఽథ్లెటిక్స్ విజేతలకు బహుమతులు
తిరువళ్లూరు: జిల్లా స్థాయిలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను అథ్లెటిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు శివకుమార్ శుక్రవారం ఉదయం అందజేశారు. స్పోర్ట్స్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆప్ ఇండియా సహకారంతో అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశంలోని ప్రతి జిల్లాలో ప్రతిభావంతులైన మహిళ అథ్లెట్లను కేంధ్ర ప్రభుత్వం సహకారంతో గుర్తించి వారిని అంతర్జాతీయ, ఒలింపిక్ స్థాయిలో పాల్గోనేలా చేయడడానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 14 నుంచి 16 లోపు వున్న విద్యార్థులకు తిరువళ్లూరు జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు స్థానికంగా ఉన్న క్రీడామైదానంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించారు. ఈ అథ్లెటిక్ పోటీలకు జిల్లాలోని వేర్వేరు పాఠశాలలకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. 200 మీటర్లు, 600 మీటర్లు, జావెలిన్త్రో, షాట్పుట్, లాంగ్జంప్, స్టాండింగ్ లాంగ్ జంప్ తదితర ఏడు రకాల పోటీలను నిర్వహించారు. పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులను అథ్లెటిక్ సంఘం జిల్లా అద్యక్షుడు గుమ్మిడిపూండి మాజీ యూనియన్ చైర్మన్ శివకుమార్, కార్యదర్శి మోహన్బాబు తదతరులు పాల్గొని, బహుమతులను అందజేశారు. -
హీరోయిన్ ఎలా అయ్యానంటే..
నటి కృతిశెట్టి తమిళసినిమా: ఒక్కోసారి అనుకోకుండా, ఎలాంటి ప్రయత్నం లేకుండానే అదృష్టం అవకాశాలు వరించేలా చేస్తుంది. అలా లక్తో నాయకిగా కిక్ అయిన నటి కృతిశెట్టి. ఈ బెంగళూరు బ్యూటీ పుట్టింది మాత్రం ముంబయిలో. తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఫ్యాషన్ డిజైనర్. ఇవి చాలు కృతిశెట్టి నటి కావడానికి అర్హతలు. ఈ బ్యూటీకి నటనపై ఆసక్తి ఉండడంతో తొలి ప్రయత్నంగా వాణిజ్య ప్రకటనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అదే ఈమెను సినిమా హీరోయిన్ను చేసింది. అలా 17 ఏళ్ల వయసులోనే కథానాయకి అయిన నటి కృతిశెట్టి. మొదటి సారిగా ఉప్పెన అనే తెలుగు చిత్రంలో నాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచెర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీ ఇలా పలు చిత్రాల్లో నటించారు. అయితే వీటిలో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు మినహా ఏవీ సక్సెస్ కాలేదు. అంతే అమ్మడి క్రేజ్ తగ్గిపోయింది. అయితే తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లోనూ నటిస్తుండడంతో సౌత్ ఇండియన్ కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఈ అమ్మడు తమిళ ప్రేక్షకులకు ది వారియర్, కస్టడి చిత్రాలతో పరిచయం అయ్యారు. తాజాగా తమిళంలో జీనీ, వా వాద్దియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో నటిస్తున్నారు. నిజానికి వీటి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యి చాలా కాలమే అయ్యింది. ఈ మూడు చిత్రాలే కృతిశెట్టి కెరీర్ను డిసైడ్ చేస్తాయని చెప్పవచ్చు. వా వాద్దియార్ చిత్రంలో కార్తీతో జత కట్టారు. జీనీలో రవిమోహన్ సరసన నటిస్తున్నారు. ఇకపోతే లవ్ ఇన్సూరెన్స్ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్తో జత కట్టారు. ఈ మూడు చిత్రాల్లో కార్తీకు జంటగా నటించినా వా వాద్దియార్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కృతిశెట్టి ఇటీవల ఒక భేటీలో తాను హీరోయిన్ను ఎలా అయ్యాను అన్నది తెలుపుతూ తాను ఒక వాణిస్య ప్రకటనలో నటించడానికి ఆడిషన్స్కు వెళ్లానన్నారు. అది ముగిసిన తరువాత తనను తీసుకెళ్లడానికి తండ్రి రావడం ఆలస్యం అయ్యిందని చెప్పారు. దీంతో ఆ సమీపంలో ఒక స్టూడియో కనిపిస్తే అందులోనికి వెళ్లానని చెప్పారు. అక్కడ ఒక చిత్రం కోసం ఆడిషన్స్ జరుగుతోందనీ, వారు తనను చూసి సినిమాలో నటించడానికి ఆసక్తి ఉందా అని అడిగారన్నారు. దీంతో తాను వారికి తన తల్లి ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చేశానన్నారు. ఆ తరువాత దర్శకుడు చిట్టిబాబు ఫోన్ చేసి మాట్లాడారని, అలా తెలుగులో ఉప్పెన చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశం వచ్చిందని నటి కృతిశెట్టి చెప్పారు. తమిళంలో నటుడు కార్తీ సరసన వా వాద్దియార్, ప్రదీప్ రంగనాథన్కు జంటగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో నటించడం సంతోషంగా ఉందని ఈమె పేర్కొన్నారు. -
అజిత్–64
సెట్స్పైకి తమిళసినిమా: నటుడు అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం గత ఏడాది విడుదలై కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈయన తదుపరి చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందన్న ఆసక్తి నెలకొంది. కారణం అజిత్ ప్రస్తుతం కారు రేసులపై ఎక్కువగా ఆసక్తి చూపడమే. అయితే ఆయన 64వ చిత్రానికి దర్శకుడు ఖరారు అయ్యారు. గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి హిట్ చిత్రానికి పని చేసిన ఆధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీంతో ఈ చిత్రంపై మరింత అంచనాలు నెలకొంటున్నాయి. అయితే ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవతుఉందన్నదే ఆసక్తిగా మారింది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ అజిత్ 64వ చిత్రంపై చిన్న హింట్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపు పూర్తి అయ్యాయని, చిత్ర షూటింగ్ను వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే ఇందులో అజిత్ పాత్రపై ఇప్పుడే చెప్పలేననీ అన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కోసం లొకేషన్స్ ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం తరువాత మళ్లీ అవకాశం ఇచ్చిన అజిత్కు ధన్యవాదాలు తెలుపుతున్నాననీ అన్నారు. ఈ చిత్రం తనకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు. కారు రేసుల ద్వారా ఇండియాకు ఘనతను చేకూర్చిన అజిత్తో కలిసి రెండో చిత్రం చేయడం సంతోషంగా ఉందని దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ పేర్కొన్నారు. అయితే ఈ చిత్రాన్ని ఏ నిర్మాణ సంస్థ నిర్మించనుంది, కథానాయకి ఎవరు అన్న ఆసక్తి అజిత్ అభిమానుల్లో నెలకొంది. -
వృషభ వాహనంపై అరుణాచలేశ్వరుడు
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం ఉదయం చంద్రశేఖరుడు అద్దాల పెద్ద వెండి వృషభ వాహనంలో మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కార్తీక దీపోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 5 గంటలకు ఆలయంలోని ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రశేఖర స్వామిని విశేషంగా అలంకరించి వృషభ వాహనంలో కొలువుదీర్చారు. అనంతరం స్వామిని మాడ వీధుల్లో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. అనంతరం 32 అడుగుల పెద్ద రథానికి కలసం చల్లిన గొడుగును ధరింపజేశారు. సాయంత్రం 6 గంటలకు పెద్ద వృషభ వాహనంలో శివుని చిహ్నంగా దుస్తులతో గొడుగు కప్పి మాడ వీధుల్లో ఊరేగించారు. ఉదయం వెండి వృషభ వాహనంలో అన్నామలైయార్ సమేత ఉన్నామలై అమ్మవారు ప్రత్యేక అలంకరణల మధ్య మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. దీపానికి నెయ్యి కానుకలు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్ డిసెంబర్ 3న ఆలయం మహాకొండపై సాయంత్రం 6 గంటలకు మహాదీపాన్ని వెలిగించనున్నారు. ఇందుకోసం గాడ గుడ్డతోపాటు నెయ్యి వినియోగించి దీపాన్ని వెలిగించనున్నారు. ఇప్పటికే అవసరమైన నెయ్యిని కొనుగోలు చేశారు. అయినప్పటికీ భక్తుల నుంచి నెయ్యిని స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు భక్తులతో కిటకిటలాడుతున్న మాడవీధులు -
18 రోజుల తర్వాత రోడ్డెక్కిన ఆమ్నీ బస్సులు
సాక్షి, చైన్నె: ఇతర రాష్ట్రాలకు తమిళనాడు నుంచి ఆమ్నీ ప్రైవేటు బస్సులు 18 రోజుల తర్వాత శుక్రవారం రోడ్డెక్కాయి. రవాణా మంత్రి శివశంకర్ హామీతో బస్సులను నడిపేందుకు నిర్ణయించామని ఆమ్నీ ప్రైవేటు బస్సుల యాజమాన్య సంఘం నేత అన్బళగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో విధిస్తున్న ప్రత్యేక పన్ను, జరిమానకు వ్యతిరేకంగా ఆమ్నీ ప్రైవేటు యాజమాన్యాలు బస్సుల సేవలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాలలోని ప్రధాన నగరాలకు ప్రైవేటు బస్సులు నిలుపుదల చేశారు. ఎట్టకేలకు యాజమాన్య సంఘాలతో మంత్రి శివశంకర్ శుక్రవారం చర్చించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో బస్సులను రోడ్డెక్కించేందుకు ఆమ్నీ యాజమాన్యాలు నిర్ణయించాయి. -
బాల్య వివాహాలు లేని జిల్లాగా సేలం
కొరుక్కుపేట: ఏడాదిలో సేలంలో బాల్య వివాహాలు లేని జిల్లాగా మారుతుందని ఐసీడబ్ల్యూఓ ప్రతిజ్ఞ చేసింది. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలను నిర్మూలించే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్న్తో ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్(ఐసీడబ్ల్యూఓ) సేలంను ఏడాదిలోపు బాల్య వివాహాలు లేని జిల్లాగా ప్రకటించడానికి అన్ని ఏజెన్సీలతో చేయి చేయి కలిపి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసింది. బాల్ వివాహ్ ముక్త్ భారత్ ఏడాది అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ‘100 రోజుల ఇంటెన్సివ్ అవేర్నెస్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఐసీడబ్ల్యూఓ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (జేఆర్సీ)లో భాగస్వామితో పనిచేస్తుంది. గత ఏడాదిలోనే ఈ నెట్వర్క్ దేశవ్యాప్తంగా లక్షకు పైగా బాల్య వివాహాలను నిరోధించింది. బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచారానికి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పాఠశాలలు, సంస్థలు, గ్రామ సంఘాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. జిల్లా అంతటా ప్రతిజ్ఞ వేడుకలను నిర్వహించింది. గత ఏడాదిలోనే 1,019 బాల్య వివాహాలు ఆగిపోయాయని ఎన్జీఓ డైరెక్టర్ ఎ.జె.హరిహరన్ తెలిపారు. -
భారతీయ రైల్వేలో బెడ్రోల్ సౌకర్యం
కొరుక్కుపేట: దక్షిణ రైల్వే చైన్నె డివిజన్ స్లీపర్ క్లాస్ ప్రయాణికుల కోసం పరిశుభ్రమైన బెడ్రోల్ సౌకర్యాన్ని అందించనుంది. స్లీపర్ ప్రయాణికుల సౌకర్యం పరిశుభ్రతను మెరుగుపరిచే లక్ష్యంతో, దక్షిణ రైల్వేలోని చైన్నె డివిజన్ ఒక మార్గదర్శక సేవను ప్రవేశపెట్టనుంది. జనవరి 01, 2026 నుంచి నాన్–ఏసీ స్లీపర్ క్లాస్ ప్రయాణికులు చెల్లింపుపై పరిశుభ్రమైన బెడ్రోల్లను పొందవచ్చు. ఇప్పటివరకు స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు బెడ్రోల్లను అందించే సౌకర్యం అధికారికంగా రూపొందించలేదు. ప్రయాణికుల నుంచి వచ్చిన స్పందన తర్వాత ప్రారంభ దశలో చైన్నె డివిజన్ నిర్వహించే 10 రైళ్లలో మూడేల్లపాటు ఈ సేవ అమలు చేస్తారని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. -
ఎక్స్ఆర్ విప్లవానికి ఐఐటీ నాయకత్వం
సాక్షి, చైన్నె: ఎక్స్టీఐసీ గ్లోబల్ సౌత్నేషన్స్ కోసం భారత దేశ ఎక్స్ఆర్ విప్లవానికి ఐఐటీ మద్రాసు నాయకత్వం వహించనుంది. ఇది భవిష్యత్ సాంకేతిక స్వదేశీ ఆవిష్కరణలను వేగవంతం చేయనుంది. ఐఐటీ మద్రాసులోని ఎక్స్పీరియన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్(ఎక్స్టీఐసీ)లో గ్లోబల్ సౌత్ కోసం తొలి అంతర్జాతీయ సింపోజియం శుక్రవారం జరిగింది. ఇది భారత దేశాన్ని విస్తరించిన వాస్తవికత(ఎక్స్ఆర్) సాంకేతిక పరిజ్ఞానాలలో ముందంజలో ఉంచే విధంగా నిర్వహించారు. భారత దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ తరంగంలో ప్రయాణిస్తుండగా తర్వాత సాంకేతిక పెరుగుదల ఎక్స్ఆర్ ద్వారా నడిపించే లక్ష్యంగా సింపోజియంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. యూనెస్సో మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఒబిజియో ఫోర్ అగినామ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పరిశోధనలు, అంతర్జాతీయ సహకారం, పైలట్ ఇన్నోవేషన్ కార్యక్రమాలను వివరించారు. ఐఐటీ మద్రాసులోని ఎక్స్టీఐసీ ప్రిన్సిపల్ ఎం.మణివణ్ణన్ మాట్లాడుతూ ఇండియా ఎక్స్ఆర్ కారిడార్, విద్యారంగం, పరిశ్రమ, ప్రభుత్వాన్ని ఏకం చేసే దిశగా స్వదేశి ఐపీ సృష్టి, నైపుణ్య అభివృద్ధి, విస్తరణ గురించి వివరించారు. ఎక్స్ఆర్ సాంకేతికతలు, ప్రభావం గురించి ఫిన్లాండ్కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ స్టీవెస్ లావాల్లే తెలియజేశారు. -
●అవార్డు
రాష్ట్ర క్రీడలు, స్పోర్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలోని తమిళనాడు చాంపియన్స్ ట్రస్ట్ క్రీడాభ్యున్నతికి ఇండియా స్పోర్ట్స్ అవార్డు 2025 వరించింది. ఈ అవార్డులను శుక్రవారం డిప్యూటీ సీఎం, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్, కార్యదర్శి అతుల్య మిశ్రా, సభ్య కార్యదర్శి జె.మేఘనాథరెడ్డిలు సీఎం స్టాలిన్కు అందజేశారు. – సాక్షి, చైన్నె మహిళకు లైంగిక వేధింపులు తిరువొత్తియూరు: పుళల్ సమీపంలో ఒక మహిళను లైంగికంగా వేధించిన కేసులో ఫిజియోథెరపీ డాక్టర్ను అరెస్టు చేశారు. పుళల్కు సమీపంలోని పుత్తగరం, కదిర్వేడు, శ్రీనివాసన్ నగర్ 3వ క్రాస్ స్ట్రీట్కు చెందిన శక్తివేల్(46) గత మూడు సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇతను వినాయకపురం ప్రాంతంలో ఫిజియోథెరపీ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. అతను నివశిస్తున్న ప్రాంతంలో 22 ఏళ్ల మహిళ కూడా అద్దెకు ఉంటోంది. ఆ ఇంటి ముందు తన ద్విచక్ర వాహనాన్ని నిలపడంతో, ఆ మహిళ ద్విచక్ర వాహనాన్ని ఇక్కడ నిలపవద్దని, కొంచెం దూరంగా నిలపాలని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఫిజియోథెరపీ డాక్టర్ శక్తివేల్ తన ద్విచక్ర వాహనాన్ని తీస్తున్నట్లుగా తీసి, ఆ మహిళ కాలుపైకి ఎక్కించి గాయపరిచాడు. అంతేకాకుండా ఆ మహిళను నడివీధిలోకి ఈడ్చుకెళ్లి, ఆమె పైవస్త్రాన్ని చించి లైంగికంగా వేధించాడు. దీంతో బాధితురాలైన ఆ మహిళ వెంటనే పుళల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు శక్తివేల్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ చేపట్టారు. అనంతరం పుళల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శరవణన్ ఫిజియోథెరపీ డాక్టర్ను అరెస్టు చేసి, అతన్ని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. సురక్షిత డిజటల్ లావాదేవీలు లక్ష్యం సాక్షి, చైన్నె: బీహెచ్ఐఎం చెల్లింపు యాప్ సమాజంలోని ప్రతి విభాగానికి డిజిటల్ లావాదేవిలను సరళంగా, సురక్షితంగా అందించడం లక్ష్యంగా చర్యలు తీసుకున్నామని ఎన్బీఎస్ఎల్ సీఈఓ లలితా నటరాజ్ తెలిపారు. యూపీఐ సర్కిల్ పూర్తి ప్రతినిధి బృందంతో బీహెచ్ఐఎం ప్రత్యేక ప్రసారం గురించి, నిర్ణీత పరిమితులలో అధీకృత చెల్లింపు గురించి స్థానికంగా లలిత నటరాజ్ వివరించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థగా ఎన్పీసీఐ బీహెచ్ ఎం సర్వీసు ఉన్నట్టు పేర్కొన్నారు. తాజాగా బీహెచ్ఐఎం పేమెంట్స్ యాప్లో యూపీఐ సర్కిల్ పుల్ డెలిగేషన్ను ప్రవేశ పెట్టామనితెలిపారు. అప్ గ్రేడ్లో భాగంగా కొత్త బీహెచ్ఐఎం చెల్లింపు యాప్లో 4.0.10 తాజా వెర్షన్లో అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. -
తిరువళ్లూరు జిల్లాకు తుపాను ముప్పు
తిరువళ్లూరు: జిల్లాకు తుపాను ముంపుతో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లలో రెండు అడుగుల మేరకు నీటి మట్టాన్ని తగ్గించాలని నిర్ణయించినట్టు తిరువళ్లూరు జిల్లా మానిటరింగ్ అధికారి కార్తికేయన్ వివరించారు. తిరువళ్లూరు జిల్లాపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన క్రమంలో జిల్లాకు మానిటరింగ్ అధికారిగా కార్తికేయన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో మానిటరింగ్ అధికారి కార్తికేయన్ శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ప్రతాప్తో కలిసి వేర్వేరు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పూండి రిజర్వాయర్కు చేరుకుని అక్కడ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను అధికారులను నుంచి సేకరించారు. భారీ వర్షపాతం నమోదయితే ఆంధ్ర, వేలూరు, రాణిపేట జిల్లాల నుంచి ఎంత మొత్తంలో వరద ప్రవాహం ఉంటుందన్న అంచనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రెండు షట్టర్ల నుంచి సెకనుకు 1300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్బంగా జిల్లా మానిటరింగ్ అధికారి మీడియాతో మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చైన్నెకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్లైన పూండి సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్, రెడ్హిల్స్, కన్నన్కోట–తేరువాయి కండ్రిగ రిజర్వాయర్, చోళవరం, చెమంబాక్కం రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరినట్టు వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రధాన రిజర్వాయర్లు, లోతట్టు ప్రాంతాలను నేరుగా వెళ్లి పరిశీలిస్తూ, అక్కడి అధికారులకు తగు సూచనలు ఇస్తున్నట్టు తెలిపారు. పూండి రిజర్వాయర్ నీటి మట్టం 35 అడుగులు కాగా ప్రస్తుతం 34 అడుగులకు చేరింది. ఈ క్రమంలోనే తిరువళ్లూరుకు తుపాను హెచ్చరిక జారీ చేయడంతో పాటు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇదే విధంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర, పొరుగు జిల్లాలైన వేలూరు, రాణిపేట నుంచి భారీగా వరద నీరు వచ్చే అవకాశఽం భుండడంతో రిజర్వాయర్లను భద్రతను దృష్టిలో ఉంచుకుని నీటిని దిగువకు విడుదల చేసినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాణిపేట తదితర జిల్లాల నుంచి వరద నీటిని నిత్యం పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా ఉంచామని, ప్రజలను అప్రమత్తం చేయడానికి కంట్రోల్ రూమ్ను సైతం ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇదే విధంగా తుపాను బాధితులను ఆదుకోవడానికి ఆవడిలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో రెండు బృందాలు, 9 అగ్నిమాపక సిబ్బంది బృందాలతోపాటు పళవేర్కాడులోనే బృందాలు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. భారీగా ఈదురు గాలులు వీస్తే పళవేర్కాడులో విద్యుత్స్తంభాలు కూలిపోయే ప్రఽమాదం ఉందని వెల్లడించారు. అక్కడ స్తంభాలను సిద్ధంగా ఉంచినట్టు వివరించారు. పూండి రిజర్వాయర్ నుంచి నీటిని పెంచి విడుదల చేస్తే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చినట్టు వివరించారు. ఇదే విధంగా మరో 15 రోజుల్లో ప్రసవానికి సిద్ధంగా ఉన్న 323 మంది గర్భిణులను గుర్తించి, వారిని సమీపంలోని వైద్యశాలలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లా మానిటరింగ్ అధికారి వెంట కలెక్టర్ ప్రతాప్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్, ఆర్డీఓ రవిచంద్రన్, తహశీల్దార్ బాలాజీ తదితర అధికారులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
ఆవడిలో మహిళపై దాడి అన్నానగర్: ఆవడి కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళనాడు తరఫున మావీరార్ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ జరిగింది. వేదికపై లిబరేషన్ టైగర్స్ నాయకుడు ప్రభాకరన్ ఫొటోగ్రాఫ్ ఉంచి పూల మాల వేసి నివాళులర్పించారు. అప్పుడు ముగప్పేర్కి చెందిన ఒక మహిళ అకస్మాత్తుగా వేదిక పైకి వచ్చి ‘ప్రభాకరన్ బతికి ఉన్నప్పుడు మీరు అతనికి దండ ఎందుకు వేశారు’ అని అడిగి అతనితో వాదించారు. దీని తరువాత వారు ఆమెను వేదికపై నుండి బలవంతంగా దింపి, ఆమెను తొలగించడానికి ప్రయత్నించారు. అప్పుడు కొంతమంది మహిళపై దాడి చేయడంతో కలకలం నెలకొంది. కాపలాగా ఉన్న పోలీసులు వెంటనే ఆ మహిళను రక్షించి అక్కడి నుండి తీసుకెళ్లారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ హత్య అన్నానగర్: ఆవడిలోని కామరాజ్ నగర్ నివాసి ముత్తు(53) ఆటో డ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన కార్మికుడు శ్రీనివాసన్(48)తో 23వ తేదీన మద్యం తాగి గొడవ పడ్డాడు. ఆ తర్వాత ముత్తు కోపంతో శ్రీనివాసన్పై దాడి చేశాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీని తర్వాత శ్రీనివాసన్ కుమారులు జెబరాజ్, అరుళ్రాజ్ రాత్రి అదే ప్రాంతంలో రోడ్డు పక్కన తాగి నిద్రపోతున్న ముత్తుతో వాగ్వాదానికి దిగారు. వారు ఇటుకలతో కూడా దాడి చేశారు. ముత్తు తలకు తీవ్ర గాయం కావడంతో రక్తపు మడుగులో స్పృహ తప్పి పడిపోయాడు. జెబరాజ్, అరుళ్రాజ్ వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ముత్తును పొరుగువారు రక్షించి కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై ఆవడి నగర పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి జెబరాజ్, అరుళ్రాజ్ ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇంతలో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముత్తు శుక్రవారం ఉదయం విషాదకరంగా మరణించాడు. దీని తరువాత ఆవడి పోలీసులు ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 12 కిలోల గంజాయి స్వాధీనం తిరువళ్లూరు: నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న త్రిపుర రాష్ట్రానికి చెందిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు రైల్వేస్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా గంజాయి విక్రయం జోరుగా సాగుతున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని పోలీసులు అక్కడ ప్రత్యేక నిఘా ఉంచగా, అనుమానాస్పద రీతిలో బ్యాగుతో సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో పట్టుబడిన యువకుడు త్రిపుర రాష్ట్రానికి చెందిన ఇక్బాల్ హుస్సేన్(25)గా గుర్తించారు. ఇతను ఒడిశా నుంచి రైలులో గంజాయి తీసుకొచ్చి అంబత్తూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. అతడ్ని అరెస్టు చేసి 12 కిలోల గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పూందమల్లి కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు తరలించారు. ఉపాధి పనులకు వెళ్లిన మహిళ మృతి తిరువళ్లూరు: ఉపాధి హామీ పనులకు వ్యాన్లో వెళ్లిన మహిళ వ్యాన్ నుంచి జారి కిందపడి తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మార్గం మధ్యలోనే మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా వెంగల్కుప్పం గ్రామానికి చెందిన మునియమ్మాల్(66) ఉపాధీ హమీ పనులకు ఇంటి నుంచి పని జరిగే ప్రాంతానికి సహచర మహిళలతో కలిసి సరుకులు తీసుకెళ్లే మినీవ్యాన్లో బయలుదేరింది. వ్యాన్ డోర్పై కూర్చుని వెళ్తున్న సమయంలో కన్నిగైపేర్ వద్ద స్పీడ్బ్రేక్ను దాటే క్రమంలో వ్యాన్లో ఉన్న మహిళ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడింది. రక్తపు గాయాలతో కిందపడ్డ మహిళను స్థానికులు 108 ద్వారా తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మహిళను పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించారు. ఈ సంఘటన స్తానికంగా విషాదాన్ని నింపిన క్రమంలో మృతురాలి బంధువులు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. ఎల్ఐసీ ఏజెంట్ మృతి తిరువొత్తియూరు: తిరువారూర్లో లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఊహించని విధంగా కిందపడడంతో, లారీ టైరు కింద తల చిక్కుకుని వృద్ధుడు మృతి చెందాడు. నాగపట్నం జిల్లా కొళప్పాడు ప్రాంతానికి చెందిన షణ్ముగనాథన్(73) ఎల్ఐసీ ఏజెంట్. అతని కుమారుడు తిరువారూర్ విళమల్ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా ఉంటున్నాడు. కొడుకు వద్దకు వెళ్లిన షణ్ముఖనాథన్ గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా తిరువారూర్ రైల్వే వంతెన మీదుగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఊహించని బైక్ అదుపు తప్పి కిందపడి అతని తలపై లారీ టైరు ఎక్కింది. దీంతో షణ్ముగనాథన్ తల నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నగర పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను అరెస్టు చేసి ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా తిరువారూర్–నాగపట్నం రోడ్డులో భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. -
వాస్తవ సంఘటనల వెళ్లకుదిర
తమిళసినిమా: కమర్షియల్ అంశాలతో కూడిన చిత్రాల మధ్య వాస్తవ సంఘటనలతో కూడిన కథా చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. సినిమాలపై ప్రేమ, ఫ్యాషన్ ఉంటేనే ఇలాంటి కథా చిత్రాలు రూపొందుతాయి. అలాంటి చిత్రం వెళ్లకుదిర. ఇలాంటి సహజత్వంతో కూడిన చిత్రాలకు అంతర్జాతీయ అవార్డు మరింత బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. అలా తెరకెక్కిన వెళ్లకుదిరై చిత్రం ఏకంగా 62 అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి, 54 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకోవడం విశేషం. ఈ చిత్రంలో చెప్పుకోవాల్సినన విషయాలు చాలానే ఉన్నాయి. దురాశ దుఃఖానికి చేటు అంటారు. అదే విధంగా నిజాయితీ, సేవాభావం ఉంటే ఎక్కడైనా గౌరవంగానే జీవించవచ్చునన్న విషయాలను ఈ చిత్రం చెబుతుంది. ఒక గ్రామంలో తప్పుడు బాటలో పయనించిన ఒక చిన్న కుటుంబ పెద్ద ప్రాణభయంతో ఉన్న గ్రామాన్ని వదిలి తన పూర్వీకులు నివశించిన కొండ ప్రాంతానికి భార్య, కొడుకును తీసుకుని వెళ్తాడు. అక్కడ నిశ్చల మనస్కులైన ప్రజలు వారికి ఆశ్రయం ఇస్తారు. అలా సాఫీగా సాగుతున్న పరిస్థితుల్లో ఆ వ్యక్తి మళ్లీ దురాశ, అక్రమ సంపాదనకు అలవాటు పడతారు. భార్య ఆ ప్రాంత ప్రజలకు తనకు చేతనైన సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది. ఆ కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చూసే ఒక పెద్ద మనిషి భాగోతం బయట పెట్టి మరింత గౌరవాన్ని తెచ్చుకుంటుంది. అదే సమయంలో ఆమె భర్త పయనించే తప్పుడు మార్గం ఆ ప్రాంత ప్రజలకు తెలుస్తుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న పెద్దమనిషిగా చెలామణి అవుతున్న వ్యక్తి ఆ కుటుంబాన్ని అవమాన పరిచి నడిరోడ్డుకు ఈడుస్తాడు. ఆ తరువాత ఆ కుటుంబం పరిస్థితి ఏమిటీ ఎలాంటి కనీస వసతులు లేని కొండ పైనుంచి కిందికి రావడానికి అక్కడి ప్రజలు పడే అవస్థలు, ఆ ప్రాంతాన్ని ప్రజలు వదిలి వెళ్లిపోవడానికి కారణాలు, కొండ పైనుంచి కిందికి రావడానికి రోడ్డు కోసం వారు చేసే పోరాటం నెరవేరిందా తదితర పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం వెళ్లకుదిర. నిజం సినిమా పతాకంపై హరీష్ ఓరి నిర్మించి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో నటి అబిరామి బోస్, విజయకుమార్, రెజిన్, మెలోడి టార్గస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వీరిలో పలువురు రంగస్థల నటులు కావడం విశేషం. చరణ్రాజ్ సెంధిల్కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భరత్ ఆశీర్వాగన్ సంగీతాన్ని అందించారు.కాగా ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. -
క్లుప్తంగా
ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పుట్టినరోజు కొరుక్కుపేట: ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు సంక్షేమ సహాయకాలు అందించారు. తిరువొత్తియూరు సెంట్రల్ ఏరియా కార్యాలయం ప్రారంభోత్సవం మనలి కామరాజర్ సాలైలో జరిగింది. చైన్నె నార్త్ ఈస్ట్ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే మాధవరం ఎస్.సుదర్శనం నేతృత్వంలో ఏరియా కార్యదర్శి 2వ జోన్ కమిటీ అధ్యక్షుడు ఎ.వి.అరుముగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చైన్నె జోన్ ఇన్చార్జ్ ఎంపీ.రాజా తిరువొత్తియూరు సెంట్రల్ ఏరియా డీఎంకే కార్యాలయాన్ని ప్రారంభించి, ఉదయనిధి స్టాలిన్ పుట్టిన రోజు కేక్ను కట్ చేశారు. 1000 మందికి బిర్యానీ అందించారు. స్వీట్లు పంపిణీ చేశారు. ఎంపీ డాక్టర్ కళానిధి వీరసామి, నియోజకవర్గ ఇన్చార్జ్ మోహన్, జిల్లా నిర్వాహకులు పాల్గొన్నారు. చోళుల వెండి నాణెం లభ్యం అన్నానగర్: కడలూరు జిల్లాలోని పన్రుట్టి సమీపం ఉలుదంపట్టి తెన్పైన్నె నదిలో గురువారం కళాశాల విద్యార్థులు క్షేత్ర పరిశోధన చేస్తుండగా ఒక నాణెం దొరికింది. అది రాజరాజ చోళుల కాలంలో ఉపయోగించిన నాణెం అని తేలింది. పురావస్తు శాస్త్రవేత్త ఇమ్మాన్యుయేల్ ఇలా అన్నాడు. తెన్పైన్నె నదిలో దొరికిన నాణెం రాజరాజ చోళ కాలం నాటి వెండి నాణెం అని గుర్తించారు. ఈ నాణెం బరువు దాదాపు 4.35 గ్రాములు. నాణెం ఒక వైపు దేవనాగరి లిపిలో ‘శ్రీరాజ రాజ’ అనే పేరు ఉందని ఆయన చెప్పారు. తమిళ సమాఖ్య ప్రారంభం కొరుక్కుపేట: తమిళ సమాజ రక్షణ ఉద్యమం తరఫున తమిళనాడులోని 18 గిరిజన కుల సంస్థల సంప్రదింపుల సమావేశం చైన్నెలో జరిగింది. ఇందులో తమిళనాడు సత్రియా నాడార్ ఉద్యమ పోషకుడు టి.పద్మనాభన్ కూడా పాల్గొన్నారు. తమిళ కమ్యూనిటీ ప్రొటెక్షన్ మూవ్మెంట్ కోఆర్డినేటర్ ఆర్.చంద్రన్ జయపాల్, ఎన్.ఆర్.థానపాలన్ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులోని తమిళుల హక్కులను కాపాడేందుకు, 18 స్థానిక తమిళ కులాలను, వాటి శాఖలను, అనుబంధ కులాలను ఏకం చేయడానికి తమిళ సమాఖ్య అనే కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తమిళ కులస్తులు నివశించే ఇతర రాష్ట్రాలన్నింటిలోనూ తమిళులకు రిజర్వేషన్లు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలనేది సహా వివిధ తీర్మానాలను ఆమోదించారు. రూ.13లక్షల చోరీ అన్నానగర్: అచ్చరపాక్కంలో కారు అద్దాలు పగులగొట్టి దుండగులు రూ.13లక్షల 38 వేలు చోరీ చేశారు. చెంగల్పట్టు జిల్లాలోని తిరుక్కల్ కుండ్రం సమీపం నెమ్మేలి ప్రాంతానికి చెందిన షేక్ దౌత్(45). ఇతను గురువారం అచ్చరప్పాక్కం సమీపంలోని అత్తివాక్కం గ్రామంలోని తన ఇంటిని మరొకరికి అమ్మగా వచ్చిన నగదు రూ.13 లక్షల 38వేలను కారులో పెట్టాడు. కొంతసేపటి తర్వాత అతను తిరిగి వచ్చి చూడగా కారు అద్దాలు పగిలి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే కారులో చూడగా కారులో ఉంచిన నగదు రూ.13 లక్షల 38వేలు చోరీకి గురైనట్టు గుర్తించాడు. ఫిర్యాదు మేరకు సంఘటన జరిగిన ప్రాంత సమీపంలోని కిరాణా దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా అచ్చపాక్కం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 93 సవర్ల నగల దోపిడీ ముగ్గురి అరెస్ట్ అన్నానగర్: వ్యాపారిపై దాడి చేసి 93 సవర్ల బంగారు నగలను దుండగులు దోపీడీ చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. చైన్నెలోని ఎగ్కినారు ప్రాంతానికి చెందిన జగదీష్ (34) రాజస్థాన్న్కు చెందిన వ్యాపారి. ఇతను యానైకౌనిలోని వెంకట్రాయన్ వీధిలో నగల దుకాణం నడుపుతున్నాడు. ఇందులో ఐదుగురికి పైగా పనిచేస్తున్నారు. గత 24వ తేదీన జగదీష్ ఒంటరిగా దుకాణంలో ఉన్నాడు. ఆ సమయంలో బంగారు నాణేలు కొనేందుకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు జగదీష్పై దాడి చేసి మత్తుమందు స్ప్రే చేశారు. అతను స్పృహ కోల్పోయాడు. దుకాణంలోని 93 సవర్ల బంగారం, వెండి నాణేలు, రాగి పలకలను దోచుకుని వెళ్లిపోయారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో దుండగులు రాజస్థాన్కు చెందిన వారని తెలిసింది. రాజస్థాన్న్కు వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం, ఆరాష్ట్ర పోలీసుల సహాయంతో పాలి జిల్లాలో ఉన్న దుండగులు వినోద్ (33), సర్వన్ గుర్జార్ (19), ఓంప్రకాష్ (23)లను అరెస్టు చేశారు. వారిలో వినోద్ అక్కడ నగల దుకాణం నడుపుతున్నాడు. వారి నుంచి 414.8 గ్రాముల బంగారు నాణేలు, 36 గ్రాముల వెండి నాణేలు, 295 గ్రాముల రాగి పలకలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ముగ్గురిని శుక్రవారం రైలులో చైన్నెకి తీసుకొస్తున్నారు. శతాధిక వృద్ధురాలి మృతి వేలూరు: వేలూరు జిల్లా ఒడుగత్తూరు సమీపంలోని తెరుంగుమలై గ్రామానికి చెందిన చిన్నపయ్యన్ బార్య కుప్పమ్మాల్(110). వీరికి ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులున్నారు. వీరందరికీ వివాహం కావడంతో వేర్వేరుగా జీవిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల క్రితం చిన్నపయ్యన్ మృతి చెందాడు. దీంతో కుప్పమ్మాల్ మాత్రం ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు వస్తున్న వృద్ధాప్య పెన్షన్తో జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో నెల రోజులుగా ఈమె అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. గురువారం సాయంత్రం ఇంటిలోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుమార్తెలు, కుమారులు, బంధువులు ఆమెకు దహనక్రియలు చేశారు. -
హీరోయిన్ ఎలా అయ్యానంటే..: కృతీ శెట్టి
ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. అలా లక్తో హీరోయిన్ అయిన బ్యూటీ కృతీ శెట్టి. ఈ బెంగళూరు బ్యూటీ పుట్టింది మాత్రం ముంబైలో! తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఫ్యాషన్ డిజైనర్. కృతీకి నటనపై ఆసక్తి ఉండటంతో తొలి ప్రయత్నంగా వాణిజ్య ప్రకటనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అదే ఈమెను హీరోయిన్ను చేసింది.ఉప్పెనతో హీరోయిన్గా17 ఏళ్ల వయసులో ఉప్పెన మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీ వంటి పలు చిత్రాల్లో నటించింది. వీటిలో ఒకటీరెండు సినిమాలు మాత్రమే హిట్టవడంతో అమ్మడి క్రేజ్ అమాంతం తగ్గిపోయింది.తమిళ సినిమాలుదీంతో కేవలం టాలీవుడ్నే నమ్ముకోకుండా తమిళ, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా తమిళంలో జీనీ, వా వాద్దియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో నటిస్తోంది. కృతీ కెరీర్కు ఈ మూడు సినిమాల ఫలితాలు చాలా కీలకంగా మారనున్నాయి. వా వాద్దియార్లో కార్తీతో జత కట్టగా జీనీలో రవిమోహన్ సరసన నటిస్తోంది. లవ్ ఇన్సూరెన్స్లో ప్రదీప్ రంగనాథన్తో కలిసి నటించింది.హీరోయిన్ ఎలా అయ్యానంటే?వా వాద్దియార్ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఓ భేటీలో పాల్గొన్న కృతీ శెట్టి.. తాను హీరోయిన్ ఎలా అయ్యానన్నది వెల్లడించింది. ఒక వాణిజ్య ప్రకటనలో నటించేందుకు ఆడిషన్స్కు వెళ్లానని, అది ముగిసిన తర్వాత తనను తీసుకెళ్లడానికి తండ్రి రావడం ఆలస్యమైందని పేర్కొంది. దీంతో సమీపంలో ఒక స్టూడియో కనిపిస్తే అక్కడికి వెళ్లగా, అక్కడ ఒక చిత్రం కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయంది. దర్శకుడు ఫోన్ చేసి..వాళ్లు తనను చూసి సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉందా? అని అడిగారని గుర్తు చేసుకుంది. దీంతో తన తల్లి ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చేశానంది. ఆ తర్వాత దర్శకుడు చిట్టిబాబు ఫోన్ చేసి మాట్లాడారని, అలా తెలుగులో ఉప్పెన మూవీలో హీరోయిన్గా నటించానంది. తమిళంలో కార్తీ సరసన, ప్రదీప్ సరసన నటించడం సంతోషంగా ఉందని కృతీ శెట్టి పేర్కొంది. -
డిప్యూటీ సీఎం బర్త్డే వేడుకల్లో అశ్లీల నృత్యాలు
తమిళనాడు మంత్రి పెరియా కరుప్పన్ చిక్కుల్లో పడ్డారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో(డిసెంబర్ 27న ఆయన బర్త్డే) అశ్లీల నృత్యాల్ని ప్రొత్సహించారాయన. పొట్టి దుస్తుల్లో అమ్మాయిలు డ్యాన్స్ చేస్తుంటే సంతోషంగా చప్పట్లు చరుస్తూ ఆయన జాలీగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో దుమారం రేగుతోంది. వీడియోలో మంత్రి పెరియా కరుప్పన్.. ముందువరుసలో జిల్లా స్థాయి పార్టీ నాయకులతో కలిసి కూర్చుని ప్రదర్శనను చూస్తున్నట్లు కనిపించారు. ఆ డ్యాన్సర్లను చూస్తూ మీసాలను మెలేశారాయన. ఆ తర్వాత ఆయన వేదికపై ఉన్న కళాకారులను దిగమని సంకేతాలు చేస్తూ.. తన దగ్గరగా నృత్యం చేయమని సూచిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో వాళ్లు ఆయన దగ్గరకు వచ్చి స్టెప్పులు వేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో మంత్రి తీరును పలువురు తప్పుబడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి.. డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకల్లో ఇలాంటి నృత్యాలను ప్రొత్సహించడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై అన్నాడీఎంకే, బీజేపీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మహిళలకు గౌరవం ఇచ్చే తీరు ఇదేనా? అని బీజేపీ నిలదీస్తోంది. అర్థనగ్నంగా ఉన్న మహిళలను తమ వద్దకు పిలిపించుకుని ఇలా మురిసిపోయే నేతలకు.. తమ భద్రత గురించి మహిళలు ఎలా చెప్పుకోగలరు? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరుప్పున్ చరిత్ర గురించి పాపం వాళ్లకు తెలియదేమో. ఇది పగటిపూట జరిగిందని అదృష్టం, లేకపోతే ఏమి జరిగేదో ఊహించలేం అంటూ అన్నాడీఎంకే ఘాటు చురకలు అంటించింది. పలువురు నెటిజన్లు సైతం ఈ వీడియోపై మండిపడుతున్నారు. గతంలో ఓ మహిళతో ఆయన్న సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజా ఘటన నేపథ్యంలో ఆ వీడియోను పలువురు తెరపైకి తెచ్చారు. ఈ ఘటనపై డీఎంకే పార్టీ, ఉదయ్నిధి ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదు. மீசையை முறுக்கிக்கொண்டே ஆட்டத்தை ரசிக்கும் அமைச்சர் பெரிய கருப்பன்... வைரல் வீடியோவ முழுசா பாருங்க.... pic.twitter.com/D1sHnbpmd8— Kathir News (@KathirNews) November 26, 2025 -
ఉదయనిధికి బ్రహ్మరథం
సాక్షి, చైన్నె: డీఎంకే వారసుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గురువారం 49వ వసంతంలోకి అడుగు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే, యువజన విభాగాల నేతృత్వంలో వాడ వాడలలో మనిద నేయ ఉదయ నాల్ పేరిట జన్మదిన వేడుకలను నిర్వహించారు. పేదలకు సంక్షేమ,సహాయకాలను పంపిణీ చేశారు. వివరాలు.. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్కు గత బర్త్డే కు ముందుగా డిప్యూటీ సీఎం పదవి దక్కిన విషయం తెలిసిందే. క్రీడలశాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఈ ఏడాది కాలంలో రాజకీయంగా ఆయన దూసుకెళ్తున్నారు. ప్రజలతో మమేకమయ్యే విధంగా విస్తృత పర్యటనలు చేస్తూ వస్తున్నారు. అధికారిక, ప్రభుత్వ కార్యాక్రమాలతో బిజీబిజీగా ఉంటున్నారు. ఈ పరిస్థితులలో గురువారం ఆయన 49వ వసంతంలోకి అడుగు పెట్టడంతో వేడుకలను మనిద నేయ ఉదయనాల్ పేరిట కోలాహలంగా డీఎంకే వర్గాలు జరుపుకున్నాయి. ఆయన బర్త్డేను డీఎంకే యువజన విభాగం వాడ వాడలలో సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించాయి. ఉదయాన్నే తండ్రి, సీఎం స్టాలిన్, తల్లి దుర్గా ఆశీస్సులను ఉదయనిధి అందుకున్నారు. కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మెరీనా తీరంలోని దివంగత సీఎం అన్నాదురై, దివంగత నేత, తాతయ్య కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. మంత్రి శేఖర్బాబుతో కలిసి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఇంటికి కావాల్సిన వస్తువులు, ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం మంత్రులు అన్బిల్ మహేశ్ పొయ్యామొళి, టీఆర్బీ రాజ, సీవీ గణేషన్, శేఖర్బాబులతో కలిసి వేప్పేరిలోని పెరియార్ తిడల్లో ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ స్మారకం వద్ద అంజలి ఘటించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పేదలకు సంక్షేమ పథకాలను అందజేశారు. ఈసందర్భంగా ఉదయ నిధి ప్రసంగిస్తూ అధ్యక్షుడు స్టాలిన్ పిలుపు మేరకు రానున్న ఎన్నికలలో 200 స్థానాల కై వశంతో చరిత్ర సృష్టిద్దామని పిలుపు నిచ్చారు. అనంతరం గోపాలపురం, సీఐటీ నగర్లలోని ఇంటికి వెళ్లారు. తన మేనత్త, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపి కనిమొళిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు.సంబరాలు.. డీఎంకే యూత్ నేతృత్వంలో ఓవైపు, డీఎంకే పార్టీ నేతృత్వంలో మరో వైపు వాడవాడలా సేవా కార్యక్రమాలు హోరెత్తించారు. అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సభల రూపంలో వేడుకలు నిర్వహించారు. ఉదయ నిధికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆయన నివాసం వద్దకు ఓ వైపు, డీఎంకే ప్రధాన కార్యాలయంకు మరో వైపు అభిమానులు, యువజనులు పోటెత్తారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కేడర్ కానుకలను అందజేశారు. ఇక డీఎంకే కూటమి పార్టీల నేతలు ఉదయ నిధికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, యువజన నేతగా, మంత్రి, డిప్యూటీ సీఎం ఉదయ నిధి పనితీరును అందరూ అభినందిస్తుంటే, ఓతండ్రిగానే కాకుండా, పార్టీ అధ్యక్షుడిగా తనకు ఎంతో ఆనందంగా ఉందని సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. -
సేవా అవార్డుల ప్రదానం
సాక్షి, చైన్నె : సాంఘిక సంక్షేమం, మహిళా హక్కుల శాఖ నేతృత్వంలో 2025 సంవత్సరానికి గాను శిశు సంక్షేమం– సేవా అవార్డులను సీఎం స్టాలిన్ గురువారం ప్రదానం చేశారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో తంజావూరు– మదర్ సత్య అమ్మయార్ మెమోరియల్ హాల్, తూత్తుకుడి – హోలీ మరియన్ మెర్సీ హోమ్, చైన్నె – ప్రభుత్వ దూర దృష్టి గృహం, రామనాధపురం –బాలల రక్షణ యూనిట్కు ఈ అవార్డులను అందజేశారు. ఒకొక్కరికి రూ. లక్ష చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గీతా జీవన్, సీఎస్ మురుగానందం, మహిళా హక్కుల శాఖ కార్యదర్శి జయశ్రీ మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో హిందూ దేవాదాయ శాఖ నేతృత్వంలో రూ. 79.94 కోట్లతో పూర్తి చేసిన 20 ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే, 25 కొత్త ప్రాజెక్టులకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. 18 ఆలయాలలో కొత్తగా పనులు చేపట్టే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ఒక కకళాశాలలో ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంకు శంకు స్థాపన చేశారు. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయం గిరివలం మార్గంలో భక్తులకు కోట్లాది రూపాయల విలువైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించే విధంగా ఆరోగ్య కేంద్రాలు, విశ్రాంతి మందిరాలపై దృష్టి పెట్టారు. తిరుచ్చి శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయానికి చెందిన రామానుజ జియ్యర్ మఠంల పునరుద్ధరణ తదితర పనులు ఇందులోఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి పీకే శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే రూ. 10.79 కోట్లతో మైనారిటీ సంక్షేమ శాఖ నేతృత్వంలో నిర్మించిన భవనాలను సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే,రూ. 38.85 కోట్లతో తొమ్మిది పురాతన మసీదులు, దర్గాల మరమ్మతు పనులకు శంకు స్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు నాజర్, శివ వి. మెయ్యనాథన్, తదితరులు పాల్గొన్నారు. చివరగా కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోవిల్ డివిజన్, తిరుముట్టం డివిజన్లలోని 38 రెవెన్యూ గ్రామాలలోని వ్యవసాయ భూముల పరిరక్షణ దిశగా ప్రత్యేక ఉత్తర్వులను సీఎం జారీ చేశారు. -
ఆధునిక పద్ధతుల్లో కుటుంబం నియంత్రణ
తిరువళ్లూరు: పురుషులకు ఆధునిక పద్ధతుల్లో శాశ్వత కుటుంబ నియంత్రణ కల్పించే అంఽశంపై మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పురుషులకు ఆధునిక పద్ధతుల్లో కుటుంబ నియంత్రణ చేసే అంశంపై రెండు వారాలపాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే గ్రామాలకు వెళ్లి ప్రచారం చేయడానికి ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రచార రథాన్ని కలెక్టర్ ప్రతాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులకు ఆధునిక పద్ధతుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే అంశంపై నవంబర్ 21 నుంచి డిసెంబర్ నాలుగు వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్పై ఆసక్తి ఉన్నవారు సమీప ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించవచ్చని కూడా ఆయన వివరించారు. ఆపరేషన్ చేసుకునే వారికి ప్రభుత్వం ఐదువేల రూపాయల మేరకు ప్రోత్సాహకం అందజేస్తుందని కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆసియా బుక్లోకి ఈవీ
సాక్షి, చైన్నె: ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ వాహనం కొత్త రికార్డులను నమోదు చేసింది. లేహ్ నుంచి కన్యాకుమారి వరకు 83 గంటలలో 3,757 కి.మీ దూరం ప్రయాణించిన ఎలక్ట్రిక్ వాహనంగా ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. అత్యంత వేగవంతమైన, సురక్షిత ప్రయాణాన్ని ధ్రువీకరించే విధంగా సాగిన ఈ ప్రయాణంపై జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటారు ఇండియా ప్రధాన అధికారి వినయ్ రైనా స్థానికంగా గురువారం వివరిస్తూ లేహ్ నుంచి కన్యాకుమారి వరకు ఒక వైవిధ్యమైన సాహస యాత్రను ఎలక్ట్రిక్ వాహనం ఉపయోగించి రికార్డు సృష్టించామన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, దానికి శక్తినిచ్చే మౌలిక సదుపాయాలకు పెరుగుతున్న విశ్వాసానికి ఈ ధైర్యం నిదర్శనమని వ్యాఖ్యానించారు. -
వైభవంగా పంచమీ తీర్థం
కొరుక్కుపేట: చైన్నె పెరంబూర్లోని శ్రీవేంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో పంచమి తీర్థం కనుల పండువగా సాగింది. శ్రీవారి పట్టపురాణి శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీవేంకటేశ్వర భక్త సమాజం ఆనంద నిలయంలో పంచమీతీర్థ వైభవాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు. సమాజం అధ్యక్షుడు తమ్మినేని బాబు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముందుగా పెరుమాళ్, శ్రీ దేవి, భూదేవి అమ్మవార్లను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు పైగా పెరంబూరులోని పెరుమాళ్ రామచంద్రన్రోడ్డులో ఉన్న శ్రీ గురువాయూరప్ప దేవాలయం నుంచి మహిళలు, భక్తులు పసుపు, పండ్లు, లడ్డూ, మైసూర్ పాక్, అతిరసం, యాపిల్, దానిమ్మ, అరటిపండు, వివిధ రకాల పుష్పాలు, ప్రత్యేక వస్త్రాలు, శ్రీవేంకటేశ్వర స్వామి, అమ్మవారికి అలంకారాలు, పూలమాలలతో కూడిన సారెను ఊరేగింపుగా ఆనంద నిలయానికి తీసుకునివచ్చారు. అనంతరం శ్రీపద్మావతి అమ్మవారికి అర్చన, ఆరాధన, నామ సంకీర్తనలు నిర్వహించి పంచమీతీర్థ వైభవంను విజయవంతంగా చేపట్టారు. వేడుకలో పాల్గొన్న భక్తులకు హారతి, ప్రత్యేక అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సమాజం సెక్రటరీ ఎస్.వెంకట రామన్, జాయింట్ సెక్రటరీ పి.రవికుమార్, కోశాధికారి కోదండరామయ్య, జాయింట్ ట్రెజరర్ హెచ్డీ వెంకటరమణుడు, ట్రస్టీ రామచంద్రన్, సభ్యులు ఎస్.శరవణన్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
హైస్పీడ్ రైలు ట్రయల్రన్
సాక్షి, చైన్నె: జోలార్ పేట–కోయంబత్తూరు మధ్య హై స్పీడ్ రైలు ట్రయల్ రన్ను దక్షిణ రైల్వే నిర్వహించింది. దక్షిణ రైల్వే పరిధిలోని జోలార్పేట్–కోయంబత్తూరు మధ్య 286 కి.మీ దూరాన్ని హైస్పీడ్ ట్రయల్ రన్ ద్వారా విజయవంతం చేశారు. ప్రస్తుతం గంటకు 110 కి.మీ వేగంతో రైలు నడుపుతున్నారు. దీనిని 130 కి.మీకి పెంచే ప్రయత్నంలో భాగంగా జోలార్ పేట–కోయంబత్తూరు సెక్షన్లోని రెండు దిశలలో తప్పనిసరి ట్రయల్ రన్ అవసరమైంది. ఈ మేరకు గురువారం ఉదయం డాక్టర్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ నుంచి ప్రత్యేక రైలు ట్రయల్ రన్ జరిగింది. మధ్యాహ్నం కోయంబత్తూరుకు రైలు చేరుకుంది. గరిష్టంగా గంటకు 145 కి.మీ వేగంతో రైలు దూసుకెళ్లింది. ఇది వరకు చైన్నె సెంట్రల్–గూడురు మధ్య 134 కి.మీ, సెంట్రల్–అరక్కోణం–రేణిగుంట మధ్య 134.78 కి.మీ, అరక్కోణం–జోలార్పేట మధ్య 144.54 కి.మీ వేగంతో రైళ్లు దూసుకెళ్లి ఉండడం గమనార్హం. రానున్న 2026–27 సంవత్సరంలో చైన్నె ఎగ్మూర్–విల్లుపురం, విల్లుపురం–విరుదాచలం, విరుదాచాలం–తిరుచ్చి, కొల్లం–తిరువనంతపురం, తదితర ప్రధాన సెక్షన్లలో 110 నుంచి 130 కి.మీ వేగంతో రైలు నడిపేందుకు చర్యలు చేపట్టనున్నట్టు దక్షిణ రైల్వే ప్రకటించింది. -
క్లుప్తంగా
నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా కొరుక్కుపేట: చైన్నెలోని కోయంబేడులోని జే పార్క్ సమీపంలో పార్క్ చేసిన ప్రైవేట్ వాహనాల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి సామాన్యులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో రోడ్డుపై ఆక్రమించి పార్క్ చేసిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. కోయంబేడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్.పి. సుందరం ఆధ్వర్యంలో నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించారు. గంజాయి తరలింపు కేసులో మహిళ అరెస్ట్ తిరువొత్తియూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చైన్నెకి గంజాయి తరలిచిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్నె వెస్ట్ జాయింట్ కమిషనర్ దిశా మిట్టల్ ఆదేశాల మేరకు, అన్నానగర్ ఎక్స్ఛేంజ్ అసిస్టెంట్ కమిషనర్ బాలసుబ్రమణియన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం కోయంబేడు మార్కెట్, బస్ స్టేషన్ ప్రాంతాలలో తీవ్రంగా నిఘా పెట్టారు. ఆ సమయంలో కోయంబేడు మార్కెట్ సమీపంలోని రోడ్డులో ఆంధ్ర రాష్ట్ర బస్సు నుంచి ఓ మహిళ పెద్ద పార్సిల్తో దిగి, ఆటో డ్రైవర్ను కోయంబేడు బస్ స్టేషన్కు వెళ్లాలని పిలిచింది. తరువాత ఆ పార్శిల్ను ఆటోలో ఎక్కిస్తున్నప్పుడు, పోలీసులు వెళ్లి ఆ మహిళను పట్టుకుని పార్సిల్ను తనిఖీ చేయగా, అందులో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ మహిళను అరెస్టు చేసి విచారించగా, ఆమె తంజావూరు జిల్లాకు చెందిన ప్రముఖ గంజాయి వ్యాపారి ధనలక్ష్మి (55) అని, ఆమైపె ఇప్పటికే 5 గంజాయి కేసులు ఉన్నాయని తెలిసింది. 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆమెను ఎగ్మూర్ కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. కామాంధుడికి జైలుశిక్ష తిరువళ్లూరు: కన్నకూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రికి 17 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు ఫోక్సో కోర్టు తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా కొత్త చాకలిపేట జీవానగర్కు చెందిన సురేష్కుమార్ చైన్నె పెరంబూరులోని ఐసీఎఫ్లో టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య సంధ్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్కుమార్కు పలువురు మహిళలతో అక్రమ సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై భార్యభర్త మధ్య తరచూ ఘర్షణ జరిగేది. ఈ క్రమంలో భార్య సంధ్య నుంచి విడాకులు కోరాడు. అయితే భార్య విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన సురేష్కుమార్ తన 13 ఏళ్ల కుమార్తేపై లైంగిక దాడికి దిగినట్టు తెలుస్తుంది. ఈ సంఘటనపై సంధ్య ఇచ్చిన పిర్యాదు మేరకు తిరువొత్తియూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ తిరువళ్లూరు ఫోక్సో కోర్టులో సాగింది. విచారణ ముగిసిన క్రమంలో నిందితుడు సురేష్కుమార్కు 17 ఏళ్ల జైలు శిక్షతోపాటు 25 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. దీంతోపాటు బాలికకూ మూడు లక్షల రూపాయల పరిహారాన్ని సైతం అందజేయడానికి సిఫారసు చేశారు. జైలు శిక్ష అనంతరం నిందితుడ్ని పుళల్ జైలుకు తరలించారు. ఎలుకల మందు తిని ఆత్మహత్య అన్నానగర్: కూడలూరు సమీపంలో ఎలుకల మందు తిని ప్లస్–1 విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషాదాన్ని నింపింది. తేని జిల్లా కూడలూర్ సమీపంలోని ధమ్మనాంపట్టికి చెందిన కారు డ్రైవర్ మురుగన్ భార్య సంగీత. వీరి కుమార్తె యువిక(17). ఈమె కూడలూరులోని ఒక పాఠశాలలో ప్లస్–1 చదువుతోంది. ఇంతలో యువిక పుట్టినరోజు 21న వచ్చింది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు కొత్త దుస్తులు కొనలేదని, కేక్ కట్ చేసి జరుపుకోలేదని తెలుస్తోంది. దీంతో యువిక తన తల్లిదండ్రులతో వాగ్వాదం చేసింది. మరుసటి రోజు ఉదయం యువిక అకస్మాత్తుగా వాంతులు చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించగా, ఆమె పుట్టినరోజుకు మీరు ఏమీ చేయనందున కోపంతో ఎలుకల మందు తిన్నానని చెప్పింది. ఇది విన్న ఆమె తల్లిదండ్రులు దిగ్భ్రాంతితో వెంటనే ఆమెను కంబం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. తరువాత, ఆమెను తదుపరి చికిత్స కోసం తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స ఫలించక యువిక గురువారం మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బంధువుల వద్ద సీబీఐ విచారణ సాక్షి, చైన్నె: కరూర్ ఘటనలో మరణించిన వారి బంధువుల వద్ద సీబీఐ అధికారులు గురువారం విచారణ నిర్వహించారు. టీవీకే నేత విజయ్ ప్రచారం సందర్భంగా కరూర్లో జరిగిన విషాదంలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసును పలు కోణాలలో సీబీఐ విచారిస్తున్నది. గత రెండు రోజులుగా టీవీకే అగ్ర నేతల వద్ద విచారణ జరిగింది. తాజాగా మృతుల బంధువులను విచారించేందుకు సీబీఐ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగారోజుకు 10 మంది మృతుల కుటుంబాలకు విచారణకు పిలిపించే పనిలోపడ్డారు. గురువారం పది కుటుంబాలు హాజరై తమ వద్ద ఉన్న సమాచారాలను సీబీఐకు తెలియజేశారు. -
ఘనంగా ఉదయనిధి పుట్టినరోజు వేడుకలు
పళ్లిపట్టు: ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ జన్మదినం సందర్భంగా గురువారం డీఎంకే శ్రేణులు కోలాహలంగా పేదలకు సహాయకాలు పంపిణీ చేశారు. పళ్లిపట్టు సెంట్రల్ మండల డీఎంకే కన్వీనర్ బీడీ చంద్రన్ ఆధ్వర్యంలో అత్తిమాంజేరిపేటలో ఉదయనిధి స్టాలిన్ జన్మదిన వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 500 మందికి మండల కన్వీనర్ బీడీ చంద్రన్, మాజీ కన్వీనర్ పి.రవీంద్రనాథ్రెడ్డి బిరియానీతోపాటు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్ మురళీసేన, మండల యువజన ఉప కార్యదదర్శి దేవరాజ్ సహా అనేక మంది పాల్గొన్నారు. తిరుత్తణి, పళ్లిపట్టు, తిరువలంగాడు, ఆర్కేపేట సహా పలు ప్రాంతాల్లో డీఎంకే శ్రేణులు, యువజన విభాగం కార్యకర్తలు ఉదయనిధి స్టాలిన్ జన్మదిన వేడునలను కోలాహలంగా కొనియాడారు. -
మరో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, చైన్నె : తనను ప్రేమించి మరొకరితో నిశ్చితార్థానికి సిద్ధ పడ్డ ప్రియురాలిపై ప్రేమోన్మాది ఆక్రోశాన్ని ప్రదర్శించాడు. నడి రోడ్డులో అందరు చూస్తుండగానే టీచర్గా ఉన్న ప్రియురాలిపై కత్తితో పొడిచి హతమార్చాడు. వివరాలు.. తంజావూరు సమీపంలోని మారియమ్మన్ ఆలయం మేల కలక్కుడికి చెందిన పుణ్యమూర్తి కుమార్తె కావ్య(26) ఆలంకుడిలోని ప్రాథమిక పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన పెయింటర్ అజిత్ కుమార్ (26)తో కొన్ని సంత్సరాల క్రితం కావ్యకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ పరిస్థితులలో కావ్య తన బంధువు ఒకరిని తల్లిదండ్రుల ఒత్తిడితో వివాహం చేసుకోవాల్సిన అవశ్యం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వివాహ నిశ్చయతార్తం కూడా జరిగింది. తనకు జరిగిన నిశ్చయతార్థంకు సంబంధించిన ఫొటోలను అజిత్కుమార్కు ఆమె పంపించింది. దీంతో కోపోద్రిక్తుడైన అజిత్కుమార్ ప్రేమోన్మాదిగా మారాడు. తనను ప్రేమించి, మరొకరితో పెళ్లికి సిద్ధ పడుతావా..? అన్న ఆగ్రహంతో ఊగి పోయాడు. ఉన్మాదిగా మారిన అజిత్కుమార్ గురువారం ఉదయం కావ్య పాఠశాలకు వెళ్తుండగా వెళ్లి కలిశారు. తననే ప్రేమించాలి, తననే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించి, పాఠశాలకు వెళ్తుండగా కోపోద్రిక్తుడైన అతడు తన వద్ద ఉన్న కత్తితో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే అతి కిరాతంగా పొడిచి చంపేశారు. అతడ్ని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. అప్పటికే అతడు విచక్షణా రహితంగా పొడవడంతో తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పాపనాశం పోలీసులు రంగంలోకి దిగారు. కావ్య మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అజిత్కుమార్ను అరెస్టు చేశారు. కాగా గత వారం రామేశ్వరంలో ప్రేమోన్మాది ఘాతుకానికి షాలిని బలైన ఘటన మరువక ముందే మరో ఘటన తాజాగా జరగడం గమనార్హం. -
కమల్, రజనీ కాంబోలో సాయిపల్లవి?
సాయి పల్లవి రజనీకాంత్, కమలహాసన్ తమిళసినిమా: తమిళం సినిమా మూలస్తంభాలైన కమలహాసన్, రజనీకాంత్ల కాంబినేషన్లో ఇంతకుముందు దాదాపు 11 సూపర్ హిట్ చిత్రాలు రూపొందాయి. ఆ తరువాత సూపర్ స్టార్ ఇమేజ్ కారణంగా ఇద్దరూ వేర్వేరుగా నటిస్తూ వచ్చారు. అలాంటిది సుదీర్ఘ కాలం తర్వాత ఈ లెజెండ్స్ ఇద్దరు కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారు. కాగా అంతకు ముందు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో నటుడు రజనీకాంత్ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సుందర్.సి దర్శకత్వం వహించనున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాంటిది అనూహ్యంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు సుందర్.సి వైదొలగుతున్నట్లు మీడియా ద్వారా ఒక లేఖను విడుదల చేసి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఒక ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి పార్కింగ్ చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డును పొందిన రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించబోతున్నారన్నదే ఆ ప్రచారం. కాగా ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటి సాయి పల్లవి నటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు కమలహాసన్ నిర్మించిన అమరన్ చిత్రంలో కథానాయకిగా సాయి పల్లవి నటించారన్నది గమనార్హం. అదేవిధంగా రజనీకాంత్ నటించనున్న ఈ చిత్రంలో మరో కీలక పాత్రను నటుడు ఖదీర్ పోషించనున్నారని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. నటి తాన్యా రవిచంద్రన్ -
డేనియల్ బాలాజీ అలా కనిపించారు
బీపీ 180 చిత్రంలో నటుడు డేనియల్ బాలాజీ తమిళసినిమా: దివంగత నటుడు డేనియల్ బాలాజీ గురించి ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో తెలియని వారు ఉండరని చెప్పవచ్చు. తమిళం, తెలుగు తదితరులు దక్షిణాది భాషల్లో పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషించి విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్నారు. దైవభక్తుడు, అవివాహితుడు అయిన డేనియల్ బాలాజీ ఈ మధ్యనే కన్నుమూశారు. కాగా ఈయన ప్రధాన పాత్రను పోషించిన చివరి చిత్రం బీపీ 180. రేడియంట్ ఇంటర్నేషనల్ ఫిలింస్, అతుల్ ఇండియా మూవీస్ సంస్థల అధినేతలు ప్రతీక్ డి.చాట్బార్, అతుల్ ఎం.బోసమియా కలిసి నిర్మించిన చిత్రం ద్వారా జేపీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈయన దర్శకుడు మిష్కిన్ శిష్యుడు కావడం గమనార్హం. కాగా నటి తాన్యా రవిచంద్రన్, డేనియల్ బాలాజీ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో దర్శకుడు కె.భాగ్యరాజ్ అరుళ్ దాస్, తమిళ్,నయన సాయి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రామలింగం ఛాయాగ్రహణం, జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు జేపీ మాట్లాడుతూ సినీపరిశ్రమలో తన 19 ఏళ్ల శ్రమ ఈ చిత్రం అన్నారు. మూస కథా చిత్రాలు చేయడం తనకు ఇష్టం ఉండదన్నారు. అలా ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించిన చిత్రం బీపీ 180 అని చెప్పారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం చాలా మందిని సంప్రదించారని, ఎవ్వరూ సెట్ కాని పరిస్థితుల్లో నటుడు డేనియల్ బాలాజీ చేతితో కత్తి పట్టుకుని తన కలలో కనిపించారన్నారు. ఆయన నటిస్తారో లేదో అన్న సందేహంతో ఫోన్ చేసి మాట్లాడానని, కథ వినగానే ఇందులోని ఆర్నాల్డ్ పాత్రను తాను చేస్తున్నానని చెప్పారన్నారు. రాజకీయ నాయకులను, అధికారులను వణికించే రౌడీ పాత్రలో ఆయన జీవించారన్నారు. పొలిటికల్, క్రైమ్ డ్రామాగా రూపొందిన ఇందులో నటి తాన్యా రవిచంద్రన్ ధైర్యవంతురాలైన వైద్యురాలిగా నటించారు. -
అంజాన్ రీ రిలీజ్
తమిళసినిమా: ఇటీవల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోందనే చెప్పవచ్చు. గతంలో కమల హాసన్ కథానాయకుడిగా నటించిన నాయకన్, విజయ్, సూర్య కలిసి నటించిన ఫ్రెండ్స్ వంటి చిత్రాలు రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా అంజాన్ చిత్రం శుక్రవారం రీ రిలీజ్ కానుంది. నటుడు సూర్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రాన్ని లింగుస్వామి దర్శకత్వంలో తిరుపతి బ్రదర్స్ సంస్థ నిర్మించింది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రంలో నటుడు విద్యుత్ జమ్వాల్ , సూరి, మనోజ్, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా రూపొందిన అంజాన్ 2014లో విడుదల అయ్యింది. అయితే చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అలాంటి చిత్రాన్ని కథలో ఆర్డర్ మార్చి, పలు కట్స్ తో డిజిటల్ ఫార్మేట్ కు మార్చి రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ అంజాన్ మొదటి రిలీజ్ సమయంలో హైటెక్స్ పెక్టేషన్ ను క్రియేట్ చేశారన్నారు. అదే సమయంలో తిరుపతి బ్రదర్స్ సంస్థ నిర్మించిన పయ్యా ,వేట్టై, వళక్కు ఎన్ 18/9, కుండీ వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇవి కూడా అంజాన్ చిత్రం విజయంపై ప్రభావం చూపిందన్నారు. అదే విధంగా ఆ సమయంలో తాను బిజీగా ఉండటంతో అంజాన్ చిత్రం తొలి భాగాన్ని, రెండవ భాగాన్ని కలిపి చూడలేదన్నారు వీటితో పాటు తనపై అధికంగా ట్రోలింగ్ జరిగిందని చెప్పారు. ఇప్పుడు చిత్రాన్ని సరికొత్త ఆర్డర్ తో అనవసర సన్నివేశాలను తొలగించి డిజిటల్ ఫార్మేట్లో విడుదల చేస్తున్నట్లు లింగుస్వామి పేర్కొన్నారు. -
గ్యాంగ్ స్టర్స్ ఇతివృత్తంతో ‘ఫ్రైడే’
తమిళసినిమా: పదవీ దాహం, ధన వ్యామోహం, అందుకోసం చేసే దుర్మార్గాలు, తద్వారా జరిగే పరిణామాలు ఇతివృత్తంతో రూపొందిన చిత్రం ఫ్రైడే. కథ విషయానికొస్తే.. ఒక రాజకీయ పార్టీ నేత అధికారం చెలాయిస్తుంటారు. ఆ పార్టీలో ఎంఎల్ఏ టిక్కెట్ కోసం ఇద్దరు రౌడీలు ప్రయత్నిస్తుంటారు. వారిద్దరూ గంజాయి, హార్బర్లో దందాలు అంటూ అరాచకం సృష్టిస్తారు. అందుకు అనుచరులను పెంచి పోషిస్తుంటారు. అలాంటి వారిలో జీవా అనే యువకుడు ఒక రౌడీకి ప్రధాన అనుచరుడిగా పని చేస్తుంటాడు. అతనికి భార్య సోదరుడు, అతనికి భార్య అంటూ కుటుంబం ఉంటుంది. అయితే అతను తన తమ్ముడిని తనలా కాకుండా చదివించి విదేశాలకు పంపించాలని ఆశ పడతాడు. ఆ తరువాత తను కూడా మంచిగా మారి సాధారణంగా జీవించాలని భావిస్తాడు. అయితే అది జరగడానికి ముందే తమ్ముడు హత్యకు గురౌతారు. ఆ తరువాత జరిగే విపరీత ఘటనలే ఫ్రైడే చిత్రం. ఒక మనిషి రౌడీగా మారడానికి కారణం ఏమిటి? కత్తి చేత పట్టిన వాళ్లు ఆ కత్తులకే బలి అవుతారు అనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రం ఇది. డక్డమ్ మోషన్ పిక్చర్స్ పతాకంపై అనీష్ మాసిలామణి నిర్మించిన ఈ చిత్రానికి హరి వెంకటేష్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఇందులో అనీష్ మాసిలామణి, మైమ్ గోపి, దీనా, కలైయరసన్ ,రామచంద్ర దురైరాజ్,చిత్ర సేనన్, సిద్ధూ కుమరేశన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జానినాష్ ఛాయాగ్రహణం, డుమె సంగీతాన్ని అందించిన ఒక్క రాత్రిలో జరిగే క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. -
సీనియర్ సిటిజెన్ల కోసం ‘పెవిలియన్’
సాక్షి, చైన్నె: లాంకర్ హర్మోనియా పెవిలియన్ పేరుతో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక గృహాలను విస్తృతంగా నిర్మించనున్నామని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సీఈఓ జేఎం చంద్రశేఖర్ తెలిపారు. గురువారం స్థానికంగా ఈ ప్రాజెక్టు గురించి వివరించారు. శ్రీపెరుంబుదూరులో నిర్మించిన లాంకర్ హార్మోనియా పెవిలియన్లో వృద్ధుల కోసం 110 గృహాలను తీర్చిదిద్దామన్నారు. ఆరోగ్యకర వాతావరణంలో, అన్ని రకాల సౌకర్యాలతో లాంకర్ పెవిలియన్లను మరిన్ని చోట్ల నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. ఈ సమావేశంలో సంస్థ చైర్మన్ ఆర్వీ శేఖర్, స్పెషల్ ప్రాజెక్టు డైరెకర్ వీకే అశోక్, సంస్థ బ్రాండ్ అంబాసిడర్ సీనియర్ సినీ నటి రేవతి శంకరన్ తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతులు కల్పించాలని ఆందోళన
తిరువళ్లూరు: వదట్టూరు గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రోడ్డులోని బురదలో నారు నాటి తమ నిరసన వ్యక్తం చేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వదట్టూరు పంచాయతీలో కండ్రిగ గ్రామం ఉంది. ఇక్కడ సుమారు రెండు వందల కుటుంబాలు నివాసం వుంటున్నారు. ఈ క్రమంలో గ్రామానికి రోడ్లు, తాగునీరు, వీధిధీపాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ పలుసార్లు కలెక్టర్తో సహా ఉన్నత అధికారులకు వినతి పత్రం అందించారు. అయితే ఇంత వరకు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించలేదు. దీంతో గురువారం ఉదయం బురదలో నారునాటి ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. దీంతో పాటు జాతీయ ఉపాధీ హమీ పనులు సక్రమంగా కేటాయించాలి. అర్హులైన వారికి ఇంటి పట్టాలను మంజూరు చేయాలని కోరారు. -
నాగ వాహనంలో.. చంద్రశేఖరుడి చిద్విలాసం
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన గురువారం ఉదయం వినాయకుడు, చంద్రశేఖరుడు సింహ, బంగారు నాగ వాహనంలో మాడ వీధుల్లో ఊరేగారు. అంతకుముందు ఆలయంలోని అన్నామలైయార్ సమేద ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పంచమూర్తులకు ప్రత్యేక పుష్పలంకరణ చేసి మాడ వీధుల్లో ఊరేగించారు. అదేవిధంగా బుధవారం రాత్రి పంచ మూర్తులకు ప్రత్యేక పుష్పాలంకరణలు చేసి మూసిక వాహనం, హంస వాహనాలకు ప్రత్యేక పూజలు చేసి వివిధ వాహణాల్లో ఆశీనులు చేయడంతో పాటూ వాటికి ప్రత్యేక విద్యుత్ దీపాలను అలంకరించి అరుణాచలేశ్వరునికి హరోం హరా... అంటూ భక్తులు నామస్మరణాలు చేసుకొని మాడ వీధుల్లో ఊరేగించారు. ప్రత్యేక రైలు, బస్సుల ఏర్పాటు కార్తీక బ్రహ్మోత్సవాలను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ రైలు, బస్సులను వేలూరు, చైన్నె, పుదుచ్చేరి వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక రైలు నడపనున్నారు. అదేవిధంగా ఇప్పటికే 25 చోట్ల తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేసి బస్సులను బస్టాండ్లోనికి రాకుండా తాత్కాలిక బస్టాండ్లకే పరిమితం చేయనున్నారు. ఆలయం వద్దకు ఆటోలు, వాహనాలు రాకుండా కట్టుదిట్టం చేశారు. ఆక్రమణల తొలగింపు రథోత్సవంతో పాటూ దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరువణ్ణామలై రానున్న నేపథ్యంలో తిరువణ్ణామలైలోని మాడ వీధులు, సన్నిధి వీది, ఆలయానికి వచ్చే ప్రధాన వీధుల్లో ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఈ పనులను కలెక్టర్ తర్పగరాజ్ పర్యవేక్షిస్తున్నారు. -
విస్తృతంగా బ్యాంకింగ్ సేవలు
సాక్షి, చైన్నె : తమ ఉనికిని బలోపేతం చేయడం లక్ష్యంగా బ్యాంకింగ్ సేవలను విస్తృతం చేశామని కరూర్ వైశ్య బ్యాంక్ ఎండీ రమేష్బాబు తెలిపారు. తిరునల్వేలి జిల్లా మేలపాళయంలో ఏర్పాటు చేసిన కొత్త శాఖను గురువారం మునిసిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ డి చంద్ర మోహన్, ప్రసూతి వైద్యులు గాయత్రి శివరామకృష్ణన్లతో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ, అఖిల భారత స్థాయిలో తమ శాఖల నెట్ వర్క్ 898కి చేరినట్టు వివరించారు. కొత్త శాఖలు, కొత్త ఖాతాలు, డిపాజిట్లు, రుణాలు,పొదుపు, కరెంట్ ఖాతాలు , సమగ్ర బ్యాంకింగ్ సేవలు విస్తృతం చేశామన్నారు. కేవీబీ బలమైన డిజిటల్ పరిష్కారాలను కూడా అందిస్తున్నట్టు, కేవీబీ డిలైట్ మొబైల్ బ్యాకింగ్యాప్ 150కు పైగా ఫీచర్లతో ఆర్థిక , ఆర్థికేతర సేవలను అందిస్తున్నట్టు వివరించారు. -
వేలూరు నుంచి అన్నామలైయార్లకు గొడుగుల ఊరేగింపు
వేలూరు: వేలూరు కోట మైదానంలో వెలసిన శ్రీ జలకంఠేశ్వరాలయం నుంచి వేలూరు జిల్లా హిందూ ఆలయ రక్షణ సమితి ఆధ్వర్యంలో అన్నామలైయార్కు గొడుగులను ఊరేగింపుగా తీసుకెళ్లారు. వివరాలు.. తిరువణ్ణామలైలో కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపద్యంలో హిందూ ఆలయ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఏటా గొడుగులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఆరో వార్షిక సంవత్సరంగా సమితి ప్రధాన కార్యదర్శి ఎల్ బాలాజీ, రాష్ట్ర మహిళా బృందం అధ్యక్షరాలు కలైవాణి ఆధ్వర్యంలో వేలూరు కోటలోని ఆలయం నుంచి శివాచార్యుల వేద మంత్రాల నడుమ అశ్వ వాహనంలో గొడుగులను పట్టణంలో మేళ తాళాల నడుమ ఊరేగించారు. అనంతరం ఈ గొడుగులను తిరువణ్ణామలైలోని అన్నామలైయార్కు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేక అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఉత్సవ కమిటీ రాష్ట్ర కార్య నిర్వహణ అధ్యక్షులు ఎస్ఆర్ జయకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్రన్, హిందూ ఆలయ సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. -
తుపాకీతో కాల్చుకుని పోలీసు ఆత్మహత్య
సాక్షి, చైన్నె : విధుల్లో ఉన్న స్పెషల్ ఫోర్సు పోలీసు తుపాకీతో కాల్చుకుని గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధురై ధర్మాసనం ఆవరణలో కలకలం రేపింది. వివరాలు.. మధురై కొట్టాయి పట్టి గ్రామానికి చెందిన మాణిక్యం, పొట్టు అమ్మల్ దంపతుల కుమారుడు మహాలింగం(29) తమిళనాడు పోలీసు విభాగంలోని ప్రత్యేక ఫోర్సులో 2023లో చేరాడు. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో భద్రతా విధులలో నిమగ్నమై ఉన్నాడు. గత కొన్ని రోజులుగా సెలవు అన్నది లేకుండా విధులకు వచ్చి వెళ్తున్నట్టు సమాచారం. గురువారం వేకువ జామున మూడు గంటల సమయంలో విధులలో ఉండగా హఠాత్తుగ తుపాకీ కాల్పు శబ్ధం రావడంతో అక్కడ విధులలో ఉన్న ఇతర సిబ్బంది పరుగులు తీశారు. తనను తాను కాల్చుకున్న స్థితిలో మహాలింగం రక్తపు మడుగులో పడి ఉండటంతో అతడ్ని ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. మధురై ఆస్పత్రి వైద్యులు పరీక్షించగా, మహాలింగం మరణించినట్టు తేలింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అతడి బ్యాగ్లో లభించిన లేఖతో ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. ఆ లేఖలో తన మరణానికి ఎవ్వరూ కారకులు కాదు అని పేర్కొని ఉన్నప్పటికీ ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అని విచారణ చేస్తున్నారు. -
వర్షాలపై అప్రమత్తం
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతుపవనాలు ఓ వైపు, అల్పపీడన ద్రోణి రూపంలో మరో వైపు కురుస్తున్న వర్షాలపై సీఎం స్టాలిన్ దృష్టి పెట్టారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీతో గురువారం సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో వర్షాలను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలపై చర్చించారు. నైరుతీ బంగాళాఖాతంలో శ్రీలంకకు దక్షిణ తీర ప్రాంతంలో నెలకొన్న అల్పపీడనం రూపంలో రానున్న రోజులలో చైన్నె, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, తిరువణ్ణామలై, నాగపట్నం, మైలాడుతురై, రామనాథపురం, రాణిపేట, తిరువారూర్, తంజావూరు, పుదుక్కోట్టై జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేసింది. ఇప్పటికే దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశి, విరుదునగర్, రామనాథపురం, తూత్తుకుడి జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా 29వ తేదీ నుంచి భారీ వర్ష హెచ్చరికలతో జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. ఇప్పటి వరకు కురిసిన వర్షాల గురించి తొలుత సమీక్షించి, అక్కడ చేపట్టిన సహాయక పనులను ఆరా తీశారు. తాజాగా కురిసే వర్షాలను ఎదుర్కొనేందుకు విధ విభాగాల సీనియర్ అధికారులు, జిల్లా యంత్రాంగాలు అవసరమైన సన్నాహక చర్యలను మరింత ముమ్మరం చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు. తమిళనాడులోని కొత్త సాంకేతికత ఆధారంగా ఎప్పటికప్పుడు సమాచారాలు జిల్లాలకు చేరవేయడం, ప్రజలను అప్రమత్తం చేసే విధంగా చర్యలు విస్తృతం చేయాలని సూచించారు. ఈ నెల 29, 30 తేదీలలో రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలో మరింత అప్రమత్తత అవశ్యమని హెచ్చరించారు. రెవెన్యూ శాఖ, స్థానిక ప్రభుత్వ శాఖ, పోలీసు శాఖ, అగ్నిమాపక, రెస్క్యూ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఆరోగ్య శాఖతో సహా అన్ని విభాగాలు కలిసి పనిచేసే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని వివరించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. మంత్రి కె.కె.ఎస్.ఎస్.ఆర్.రామచంద్రన్, ప్రధాన కార్యదర్శి మురుగానందం, రెవెన్యూ కార్యదర్శి డాక్టర్ ఎం.సాయి కుమార్, ఇంధన శాఖ అదనపు కార్యదర్శి మంగత్ రా మ్ శర్మ, పంచాయతీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గగన్ దీప్ సింగ్ బేడీ, హోం వ్యవహారాల అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్ కుమార్ పాల్గొన్నారు. -
రజనీకాంత్ సినిమాలో సాయిపల్లవి?
తమిళ సినిమా మూలస్తంభాలైన కమల్ హాసన్, రజనీకాంత్ల కాంబినేషన్లో ఇంతకుముందు దాదాపు 11 సూపర్ హిట్ చిత్రాలు రూపొందాయి. ఆ తర్వాత సూపర్స్టార్ ఇమేజ్ కారణంగా ఇద్దరూ వేర్వేరుగా నటిస్తూ వచ్చారు. అలాంటిది సుదీర్ఘకాలం తర్వాత ఈ లెజెండ్స్ ఇద్దరూ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. రజనీ హీరోగా, కమల్ నిర్మాతగాఅయితే దీనికంటే ముందు కమల్హాసన్(Kamal Haasan) తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో రజనీకాంత్ హీరోగా (#Thalaivar 173) నటించనున్నారు. దీనికి సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. కానీ, తర్వాత అనూహ్యంగా సుందర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి వైదొలగుతున్నట్లు మీడియా ద్వారా ఒక లేఖను విడుదల చేసి షాకిచ్చారు. దీంతో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే ఆసక్తి నెలకొంది.సాయిపల్లవి?పార్కింగ్ చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందిన రామ్కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించబోతున్నారనేది లేటెస్ట్ టాక్. ఈ భారీ బడ్జెట్ మూవీలో సాయిపల్లవి నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే మరో నటుడు ఖదీర్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
టీవీకేలో చేరిన సెంగొట్టయన్
చెన్నై: ఏఐఏడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయన్.. సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళిగ వెట్రి కజగం(టీవీకే) పార్టీలో చేశారు. బుధవారం శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన, గురువారం టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ఆ పార్టీలో చేరారు. ఆయనతో ఓ మాజీ ఎంపీతోపాటు, అతని మద్దతు దారులు కూడా చేరారు. పసుపు–ఎరుపు మిశ్రమంతో రంగులతో ఉన్న టీవీకే శాలువాను విజయ్ ఆయనకు కప్పారు. సెంగొట్టయన్కు పార్టీ ఆర్గనైజింగ్ చీఫ్ బాధ్యతలు అప్పగించారు. తరువాత విలేకరులతో మాట్లాడిన సెంగొట్టయన్ తాను రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలనను తీసుకురావడానికే టీవీకేలో చేరానని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య ఎలాంటి తేడా లేదని, ప్రజలు పారదర్శకమైన పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. మంచి పాలన అందించే నాయకుడిని కోరుకుంటున్నారని, అందుకు విజయ్ సరైన వ్యక్తని సెంగొట్టయన్ అన్నారు. ఆ సమయంలోనూ ఆయన జేబులో ఏఐఏడీఎంకే వ్యవస్థాపకురాలు జయలలిత ఫొటో ఉంది. ఫొటోపై మీడియా ప్రశ్నించగా.. ‘నేను అన్నా డీఎంకేకు విధేయుడిగా ఉన్నాను. 50 ఏళ్లపాటు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశాను. చివరకు నాకు లభించిన బహుమతి పార్టీ నుంచి తొలగించటం. పార్టీని బలోపేతం చేద్దామన్న నా ఆలోచననను సమరి్థంచిన నా మద్దతుదారులు కూడా బహిష్కరణకు గురయ్యారు’అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అత్యంత సీనియరైన ఆయన చేరికతో టీవీకే పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన స్వస్థలం ఈరోడ్ జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అవుతుందని టీవీకే వర్గాలు భావిస్తున్నాయి.


