breaking news
Tamil Nadu
-
ఉదయం పెళ్లి.. సాయంత్రం ప్రియుడితో నవ వధువు జంప్
అన్నానగర్: పెళ్లి రోజున బ్యూటీ సెలూన్కు వెళుతున్నట్లు చెప్పి ప్రియుడితో నవ వధువు పరారైంది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పెళ్లింట ఇలా వధువు వెళ్లిపోయిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం..పెరంబూర్లోని అంబేడ్కర్ నగర్కు చెందిన అర్చనకు మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయకుమార్తో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ మేరకు బుధవారం ఉదయం బెసెంట్నగర్ ఆలయంలో వారి వివాహ వేడుక జరిగింది. తర్వాత వధూవరులు ఇంటికి వెళ్లారు. సాయంత్రం వివాహ విందుకు ఏర్పాట్లలో రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. అర్చన తన తల్లిదండ్రులకు రిసెప్షన్ కోసం బ్యూటీ సెలూన్కు వెళుతున్నానని చెప్పి, తన కొంతమంది స్నేహితులతో వెళ్లింది.అనంతరం, అర్చన ఇంటికి తిరిగి రాలేదు. రిసెప్షన్ సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు అర్చన సెల్ఫోన్కు ఫోన్ చేశారు. కానీ అది స్విచ్ ఆఫ్లో ఉంది. ఆమెతోపాటు వచ్చిన ఆమె స్నేహితులు కూడా అదృశ్యమయ్యారు. ఆమె తల్లిదండ్రులు విచారించగా, అర్చన ఇప్పటికే ఎరుకంజేరికి చెందిన ఒక యువకుడిని ప్రేమించిందని, పెళ్లి తర్వాత అతనిని వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసిందని వారికి తెలిసింది.ఈ క్రమంలో బ్యూటీ సెలూన్కు వెళ్లే నెపంతో ఆమె తన ప్రియుడితో పారిపోయిందని కూడా తేలింది. వధువు అదృశ్యం కావడంతో వరుడు, అతని బంధువులు ఒక్కసారిగా షాకై దిగ్భ్రాంతి చెందారు. దీంతో వివాహ రిసెప్షన్ రద్దు చేసుకున్నారు. ఈ విషయమై అర్చన తల్లి తిరు.వి.కె.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన నవ వధువు, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని నిర్ణయం
తిరువళ్లూరు: ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూలై 9వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో బీమా సంస్థలకు చెందిన ఏజెంట్లు పాల్గొని, విజయవంతం చేయాచాలని నిర్ణయించినట్టు ఆ సంఘం ప్రతినిధులు నిర్ణయించారు. బీమా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తిరువళ్లూరు, మీంజూరు, పొన్నేనొ, ఆవడి, పూందమల్లితో సహా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో సుమారు 10 ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో కార్మికులు పని చేస్తున్నారన్నారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించి, వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూలై 9వ తేదీన చేపట్టనున్న సమ్మెలో బీమా సంస్థల ఏజెంట్లు పాల్గొనాలని ఆ సంఘం నేతలు వాసు, నాగలింగం, సెల్వకుమార్, రామకృష్ణన్ పిలుపునిచ్చారు. -
ఈఓఎస్ రాయబారిగా రూబెన్ బిజీథామస్
సాక్షి,చైన్నె : వివాహ చిత్ర నిర్మాణంలో అత్యంత డిమాండ్ ఉన్న పేర్లలో ఒకరైన రూబెన్ బిజీ థామస్ను అధికారిక ఈఓఎస్ రాయబారిగా నియమించినట్టు కానన్ ఇండియా ఇమేజింగ్ కమ్యూనికేషన్ బిజినెస్సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ విశేష్ ప్రకటించారు. సినిమాటిక్ బ్రిలియోన్స్, లార్జర్ దాన్ లైఫ్ సెలబ్రిటీ వివాహాలకు , వివాహ కథలను చెప్పడంలో,మ్యూజిక్ మోస్ వీడియోలో రూబెన్ ప్రత్యేకత గురించి ఆయన స్థానికంగా గురువారం వివరించారు. ప్రతిష్టాత్మక డీడబ్ల్యు పీ కాంగ్రెస్ ద్వారా ఆయన టాప్ 50 గ్లోబల్ వెడ్డింగ్ పోటోగ్రాఫర్లలో ఒకరిగా గుర్తింపు పొంది ఉన్నారని వివరించారు.కానన్ ఈఓఎస్ అంబాసిడర్ ప్రోగ్రామ్ ,పోటో గ్రఫీ, వీడియో గ్రఫీ ల్యాండ్ స్కేప్లోని సృజనాత్మక నిపుణులను, పరిశ్రమ అనుభవజ్ఞులను ఒక చోట చేరుస్తున్నట్టు పేర్కొన్నారు. -
లాకప్ డెత్ను నిరసిస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా
తిరువళ్లూరు: శివగంగై జిల్లా తిరుపువనం యూనియన్ పరిధిలో అజిత్ లాకప్డెత్ను నిరసిస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం గుమ్మిడిపూండిలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి డీవైఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు మునిరత్నం అధ్యక్షత వహించగా సంఘం జిల్లా అధ్యక్షుడు కలైయరసన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలైయరసన్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తరచూ లాకప్డెత్లు జరుగుతున్నా ఇంతవరకు సరైన న్యాయం జరగలేదన్నారు. పోలీసు స్టేషన్లలో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఆధారంగా లాకప్డెత్పై పూర్థిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
వడ సాంబార్ క్రియేషన్స్తో రికార్డు
సాక్షి, చైన్నె : తమిళులు మెచ్చే వడ, సాంబార్తో రికార్డును సృష్టించారు. ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో వినూత్నంగా ఉద్దివడ, సాంబార్ క్రియేషన్స్పై గురువారం దృష్టి పెట్టారు. విద్యార్థులు, పాక శాస్త్రంలో శిక్షణ పొందుతున్న వారందరూ కలిసి ఆ విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ డి ఆంటోనీ అశోక్కుమార్ పర్యవేక్షణలో 1993 ఉద్దివడలను తయారు చేశారు. సాంబార్ వంటకాలను తయారు చేయడంతోపాటు వాటి ద్వారా ఎస్డీజీ 2, జీరో హంగర్ అనే చిహ్నాన్ని రూపొందించారు. తమ విద్యాసంస్థ 1993లో స్థాపించిన విషయాన్ని గుర్తు చేసేలా ఈ ప్రయోగం చేశారు. నో ఫుడ్ వేస్ట్ అనే ఎన్జీ ద్వారా ఈ ఆహారాన్ని అనాధ ఆశ్రమానికి అందజేశారు. వడ, సాంబర్తో చేసిన ఈ క్రియేషన్స్ కొత్త రికార్డును సృష్టించినట్టు ఆ విద్యా సంస్థ వీసీ ముత్తమిళ్ సెల్వన్ , రిజిస్టార్ పొన్నుస్వామి పేర్కొన్నారు. ట్రింప్ రికార్డుల జాబితాలోకి చేరిన ఈ క్రియేషన్కు గుర్తింపుగా సర్టిఫికెట్ను నిర్వాహకులు ప్రదానం చేశారు. -
బంగారు తిరుచ్చిపై సూర్య నారాయణుడు
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ అనుబంధ శ్రీసూర్యనారాయణ స్వామి గురువారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. తొలుత వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు, స్వామివారి జన్మనక్షత్రమైన హస్త సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని వజ్ర వైఢూర్యాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం బంగారు తిరుచ్చి వాహనంపై విహరించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్లు రమేష్, ప్రసాద్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. 03సీడీఆర్46–300073ః బంగారు తిరుచ్చిపై భక్తులను దర్శనమిస్తున్న సూర్య భగవానుడు -
క్లుప్తంగా
వీధి కుక్కదాడిలో చిన్నారికి గాయాలు తిరువళ్లూరు: తల్లితో వెళ్తున్న బాలికను వీధికుక్క లాక్కెళ్లిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. వివరాలు.. తిరువళ్లూరు మున్సిపాలిటీలోని 11వ వార్డులో పుల్లరంబాక్కం గ్రామానికి చెందిన వినోధ్ తల్లి నివాసం ఉంటున్నారు. ఈ మేరకు వినోద్ భార్య దేవయాని కుమార్తె తమిళ్ని(02) వెళ్లారు. కామరాజర్ విగ్రహం నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వీధికుక్కలు బాలికను లాక్కెళ్లి దాడి చేసింది. ఈ దాడిలో తమిళ్నిల తీవ్రంగా గాయపడింది. కుక్కల దాడిలో గాయపడ్డ బాలికను బంధువులు రక్షించి చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చిన్నారిపై వీధికుక్కల దాడి చేసి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నీట్పై అప్పీల్ కొట్టివేత కొరుక్కుపేట: నీట్ పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయంతో తాము ప్రభావితమయ్యామని, తిరిగి పరీక్ష నిర్వహించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీల్ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టడీస్ కోసం నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా గతనెల 4వ తేదీన నిర్వహించారు. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని కోరుతూ 16 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారని, తిరిగి పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తే అది నష్టదాయకమని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. ఈ ఉత్తర్వులపై నీట్ విద్యార్థులు అప్పీల్ చేశారు. ఈ అప్పీళ్లను న్యాయమూర్తులు జి నిషాబాను, ఎం.జ్యోతిరామన్లు విచారించారు. ప్రియుడితో నవ వధువు పరార్ అన్నానగర్: పెళ్లి రోజున బ్యూటీ సెలూన్కి వెళ్తున్నట్లు చెప్పి ప్రియుడితో నవ వధువు పరారైంది. పెరంబూర్లోని అంబేడ్కర్నగర్కు చెందిన అర్చనకు మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయకుమార్తో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ మేరకు బుధవారం ఉదయం బెసెంట్నగర్ ఆలయంలో వారి వివాహ వేడుక జరిగింది. తర్వాత వధూవరులు ఇంటికి వెళ్లారు. సాయంత్రం వివాహ విందుకు ఏర్పాట్లలో రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. అర్చన తన తల్లిదండ్రులకు రిసెప్షన్ కోసం బ్యూటీ సెలూన్కు వెళుతున్నానని చెప్పి, తన కొంతమంది స్నేహితులతో వెళ్లింది. అర్చన ఇంటికి తిరిగి రాలేదు. రిసెప్షన్ సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు అర్చన సెల్ఫోన్కు ఫోన్ చేశారు. కానీ అది స్విచ్ ఆఫ్లో ఉంది. ఆమెతోపాటు వచ్చిన ఆమె స్నేహితులు కూడా అదృశ్యమయ్యారు. ఆమె తల్లిదండ్రులు విచారించగా, అర్చన ఇప్పటికే ఎరుకంజేరికి చెందిన ఒక యువకుడిని ప్రేమించిందని, పెళ్లి తర్వాత అతనిని వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసిందని వారికి తెలిసింది. బ్యూటీ సెలూనన్కు వెళ్లే నెపంతో ఆమె తన ప్రియుడితో పారిపోయిందని కూడా తేలింది. వధువు అదృశ్యం కావడంతో వరుడు, అతని బంధువులు దిగ్భ్రాంతి చెందారు. దీంతో వివాహ రిసెప్షన్ రద్దు చేసుకున్నారు. ఈ విషయమై అర్చన తల్లి తిరు.వి.కె.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. మందుల దుకాణంలో చోరీ తిరువొత్తియూరు: మందుల దుకాణం తాళాలు పగులగొట్టి చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. చైన్నె నందనం సీఐటీ నగర్, మసీదువీధికి చెందిన రిల్వాన్ సీఐటీ నగర్ నాలుగో ప్రధాన రోడ్డులో మందుల దుకాణం నడుపుతున్నాడు. అతను బుధవారం రాత్రి దుకాణం మూసి వేసి, ఇంటికి వెళ్లాడు. గురువారం ఉదయం రిల్వాన్ దుకాణం వద్దకు వచ్చిన చూడగా దుకాణం తాళం పగులగొట్టి ఉంది. దుకాణంలో ఉంచిన రూ.40 వేల నగదును దుండగులు చోరీ చేసినట్టు గుర్తించాడు. ఈ విషయమై సైదాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడిపై దాడి ముగ్గురి అరెస్టు తిరుత్తణి: మద్యం మత్తులో యువకుడిని కత్తితో దాడి చేసిన కేసులో ముగ్గురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తిరుత్తణి సమీపంలోని మద్దూరు గ్రామానికి చెందిన వెంకటేశన్(27) బుధవారం రాత్రి గ్రామ శివారులో మద్యం సేవిస్తుండగా అటువైపు మద్యం మత్తులో బైకులో వెళ్లిన ముగ్గురు వ్యక్తులు వెంకటేశన్తో గొడవకు దిగారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఆగ్రహించిన బైకులో వెళ్లిన వ్యక్తి మద్యం మత్తులో పక్కనే ఉన్న ఇంటి వద్ద నుంచి కత్తి తీసుకొచ్చి వెంకటేశన్ తలపై నరికి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశన్ను కుటుంబసభ్యులు తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి మద్దూరుకు చెందిన విశ్వనాథన్(22), ఆర్వీఎన్ కండ్రిగకు చెందిన సారధి(23), మూలమద్దూరుకు చెందిన రఘు(28)ను అరెస్టు చేశారు. -
ఘనంగా పంచభూత మహాయాగం
నగరి : నగరి మున్సిపాలిటీ పరిధిలోని కేవీపీఆర్ పేట నందనార్ స్వామి ఆలయంలో గురువారం పంచభూత మహాయాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే ప్రజా సంక్షేమం కోసం దేశ వ్యాప్తంగా 31 పంచభూత మహాయాగాలను పూర్తి చేశామని నిర్వాహకులు తిరువియార్ రమేష్ స్వామి తెలిపారు. నగరి మున్సిపాలిటీ కేవీపీఆర్పేటలో 3 పంచభూత యాగాలు పూర్తి చేశామని తెలిపారు. నాలుగోది 48 రోజుల పాటు పూజలు నిర్వహించామని, గురువారం నిర్వహించిన మహాయాగంతో ముగింపునకు చేరుకుందన్నారు. ప్రజలకు 18 మంది సిద్ధుల ఆశీస్సులతో సంతాన బలం, ఆయురారోగ్యాలు అందాలన్న ఆకాంక్షతోనే ఈ యాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు మధ్యాహ్నం అన్నదానం చేశారు. -
డీఎంకే నూతన సభ్యత్వం ప్రారంభం
పళ్ళిపట్టు: పళ్లిపట్టు నార్త్ మండల కార్యదర్శి సీజే.శ్రీనివాసన్ ఆధ్వర్యంలో పుణ్యం గ్రామంలో గురువారం డీఎంకే నూతన సభ్వత్వ నమోదు శిబిరం ప్రారంభించారు. గడప గడపకు వెళ్లి ప్రజలను కలిసి, డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలుపై అవగాహన కల్పించి, కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒకే వర్గంలో ఉండాల్సిన అవసరంపై వివరించారు. అలాగే రాష్ట్రంతోపాటు తమిళులపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం చూపుతున్న సవతితల్లి ప్రేమ గురించి ప్రజలకు అవగాహన కల్పించి, డీఎంకే పార్టీలో సభ్యులుగా చేరాలని సూచించారు. దీంతో యువత, అధిక సంఖ్యలో పార్టీ సభ్యత్వం స్వీకరించేందుకు ముందుకు వచ్చారు. నూతన సభ్యత్వం నమోదు శిబిరాల్లో డీఎంకే క్యాడర్ ఉత్సాహంగా పాల్గొని, గ్రామాల్లో గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించి, పార్టీ సభ్యత్వం నమోదు చేశారు. -
వైభవంగా రథోత్సవం
కార్వేటినగరం: మహా భారత వార్షికోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. తొలుత అమ్మవారికి అర్చనలు అభిషేకాల అనంతరం ద్రౌపదీ, ధర్మరాజులకు ఉభయదారులు కరణీకులు సమర్పించిన పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పుష్పాలు, విశేష ఆభరణాలతో అలంకరించారు. అలాగే కరణీక కులస్తులు నూతనంగా నిర్మించిన రథంపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాలు, బాణసంచా మోత నడుమ గ్రామ వీధుల్లో ఊరేగించారు. భక్తులు ఉప్పు, మిరియాలు చల్లుతూ మొక్కులు చెల్లించారు. అలాగే ఇంటింటా కర్పూర నీరాజనాలు సమర్పించారు. భాగవతారిణి రెడ్డెమ్మ హరికథాగానం చేశారు. మధ్యాహ్నం వెంకటేశ్వర ఆటో యూనియన్ భక్తులకు అన్నదానం చేసింది. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు రవియాదవ్, ప్రధాన కార్యదర్శి గౌతంరాజు, అర్చకులు సుమన్యాదవ్, పలువురు భక్తులు పాల్గొన్నారు. నేడు అర్జున తపస్సు శుక్రవారం ఉదయం 8 గంటలకు నఽంది వాహనంపై స్వామివారి ఊరేగింపు, మధ్యాహ్నం 12 గంటలకు అర్జున తపస్సు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అర్జున తపస్సు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు. -
వైభవం..పార్వేట ఉత్సవం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవాన్ని శ్రీవారిమెట్టు సమీపంలో గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్టశిక్షణ కోసం స్వామివారు పంచాయుధాలను ధరించి మూడుసార్లు బళ్లెంను ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్ పాల్గొన్నారు. -
10న వినూత్న నిరసన
● ఆవులు, మేకలతో సీమాన్ భేటీ సాక్షి, చైన్నె : నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ వినూత్న రీతిలో ఆవులు, మేకలతో కలిసి ఓ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 10వ తేదీన మదురైలో ఈ సమావేశం జరగనుంది. సీమాన్ ఇటీవల కాలంగా సేంద్రీయ వ్యవసాయం, తాటి కల్లు అమ్మకాలకు అనుమతి, ఆవులు,మేకలుగురించి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తనకు అధికారం ఇస్తే,మేకలు,ఆవుల పెంపకంను ప్రభుత్వ ఉద్యోగంగా మార్చేస్తానని పేర్కొంటున్నారు. రైతులకు మద్దతుగా సీమాన్ చేస్తూ వస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా గురువారం ఓ వీడియో విడుదల చేశారు.ఇందులో అన్నదాతకు మద్దతుగా, పాలకులకు వ్యతిరేకంగా వినూత్న నిరసనకు సిద్దమయ్యారు. ఈనెల 10వ తేదిన మదురై విరగనూర్ వేదికగా ఆవులు, మేకలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నామని ప్రకటించారు.పార్టీ వర్గాలు తప్పని సరిగా, ఆవులు, మేకలతో ఈ సమావేశానికి తరలి రావాలని ఆయన పిలుపు నివ్వడం గమనార్హం. -
10 వేల గ్రామాల్లో సభలకు కార్యాచరణ
ఏర్పాట్లలో టీవీకే సాక్షి, చైన్నె : పది వేల గ్రామాల్లో సభల నిర్వహణకు తమిళ వెట్రి కళగం (టీవీకే) నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు విజయ్ ఆదేశాలతో ఏర్పాట్లపై దృష్టి సారించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని ప్రకటించి కార్యక్రమాలను విజయ్ విస్తృతం చేసిన విషయం తెలిసిందే. పార్టీకి సంబంధించిన సమగ్ర నిర్మాణాన్ని పూర్తి చేశారు. పదవులన్నీ భర్తీ అయ్యాయి. ఇక, ప్రజలతో మమేకం అయ్యేలా విజయ్ రాష్ట్ర పర్యటన కసరత్తులు జరుగుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పర్యవేక్షణలో రూట్ మ్యాప్ రూపకల్పన తుది దశలో ఉన్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెలాఖరులో లేదా ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో జనంలోనే విజయ్ ఉండబోతున్నారన్న సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. అదే సమయంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా పది వేల గ్రామాల్లో సభల నిర్వహణ లక్ష్యంగా పార్టీ వర్గాలకు విజయ్ ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఈ సభల నిర్వహణ, విజయ్ రూట్ మ్యాప్పై తుది కసరత్తులు ముగించి, ప్రజలలోకి చొచ్చుకెళ్లేలా శుక్రవారం టీవీకే వర్గాలు చైన్నెలో సమావేశం కానున్నాయి. పనయూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి వెయ్యి మంది ప్రతినిధులను ఆహ్వానించి ఉండడం గమనార్హం. ఈ సమావేశానంతరం విజయ్ రాష్ట్ర పర్యటన వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. వోక్స్ వ్యాగన్లో ఆటో ఫెస్ట్ సాక్షి, చైన్నె : వోక్స్ వ్యాగన్ ఇండియా ఆటో ఫెస్ట్ – వార్షిక నేషనల్ ఎకై ్స్చంజ్ కార్నివాల్కు సిద్ధమైందని ఆ సంస్థ బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లి తెలిపారు. గురువారం ఈ వివరాలను స్థానికంగా ఆయన ప్రకటించారు. వోక్స్ వ్యాగన్ కారుకు అప్ గ్రేడ్ చేసుకోవడానికి, పరిమిత కాల సేవా ప్రయోజనాలను పొందడానికి, పాత కార్లతో సహా అప్ గ్రేడ్ ఆఫర్లను పొందడానికి ఒక ప్రత్యేక అవకాశంగా ఆటో ఫెస్ట్కు చర్యలు తీసుకున్నామని వివరించారు. ఆకర్షణీయమైన మార్పిడి, లాయల్టీ రివార్డులు, ప్రత్యేక ఆర్థిక ఎంపికలు, ఉచిత వాహన మూల్యాంకనం, టెస్ట్ డ్రైవ్, ప్రత్యేక సేవ, నిర్వహణ ప్రయోజనాలు ఈ ఫెస్ట్లో ఉంటాయని పేర్కొన్నారు. బలమైన సర్వీస్ నెట్ వర్క్, జర్మన్ఇంజనీరింగ్ అందించడంలో నిరంతర దృష్టిని ఆటో ఫెస్ట్ ప్రతిబింబిస్తుందన్నారు. ప్రచార పర్యటన కోసం మిత్రులకు ఆహ్వానం ●ఒకే వేదికపైకి పళణి, నైనార్ సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్యటన ప్రారంభోత్సవానికి తరలి రావాలని బీజేపీ నేతలకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి పిలుపు నిస్తున్నారు. కోయంబత్తూరు వేదికగా పళణి స్వామితో పాటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కనిపించనున్నారు. అధికారం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టిన పళణి స్వామి ఈనెల 7వ తేదీ నుంచి ప్రచార పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. కోయబంత్తూరు జిల్లా మేట్టుపాళయం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పర్యటన మొదలు కానున్నది. తొలి విడత పర్యటన ఈనెల 23వ తేదీ వరకు జరగనుంది. ఈ ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమంలో బలాన్ని చాటే దిశగా పళణి వ్యూహర చన చేశారు.ఇందులో భాగంగా తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారికి ఆహ్వానాలు పలికే విధంగా పార్టీ వర్గాల ద్వారా పిలుపు నిచ్చే పనిలో పడ్డారు. అలాగే, తమప్రధాన మిత్ర పక్షం బీజేపీనే తలందర్నీ ఈ కార్యక్రమానికి పళణిస్వామి ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్తో పాటుగా ముఖ్య నేతలు పాల్గొనేందుకు సిద్ధమైనట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. కపాలీశ్వర ఆలయానికి బాంబు బెదిరింపు కొరుక్కుపేట: చైన్నెలోని మైలాపూర్ కపాలీశ్వర్ ఆలయంకు ఈమెయిల్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులు బాంబు బెదిరింపు పంపారు. దీంతో ఆలయ సిబ్బంది పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. బాంబు నిపుణులు ,స్నిఫర్ డాగ్ ్సతో కలసి ఘటనా స్థలానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. కానీ బాంబు కనిపించలేదు. చివరికి అది బెదిరింపు కాల్ అని తేలింది. దీని తర్వాత ఈ– మెయిల్ ద్వారా బెదిరింపు చేసిన యువకుడు ఎవరో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నాలలో నిమగ్నమై ఉన్నారు. -
● ఆళ్వార్పేటలో స్వయంగా సభ్యత్వం నమోదు ●రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం ●మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యదర్శుల ఉరకలు ●ఒకే జట్టు నినాదానికి మద్దతు హోరు
సాక్షి, చైన్నె: 2026 లో మళ్లీ అధికారం లక్ష్యంగా వ్యూహాలకు డీఎంకే పదును పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒకే జట్టుగా తమిళనాడు నినాదంతో ప్రజల్ని ఏకం చేసే విధంగా 45 రోజుల ప్రచార పర్యటన, సభ్యత్వ నమోదుకు ఈనెల ఒకటో తేదీన చైన్నెలో స్టాలిన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ 45రోజుల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్రంలోని 38 జిల్లాలలో ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాల కార్యదర్శులు బుధవారం మీడియా ముందుకు వచ్చి ఆయా ప్రాంతాలలో ప్రభుత్వ ప్రగతిని వివరించారు. ఇక, పార్టీ పరంగా ఉన్న 78 జిల్లాలలో ఇంటింటా ప్రచారం, సభ్యత్వ నమోదు ప్రక్రియను గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం చుట్టారు. కార్యదర్శుల నేతృత్వంలో ఒకే జట్టుగా తమిళనాడు నినాదంతో జిల్లాల వారీగా సభలు ఈ నెల ఏడో తేది నుంచి చేపట్టనున్నారు. 234 నియోజకవర్గాలకు శిక్షణ పొందిన ఐటీ విభాగం ఇన్చార్జ్లు, 68 వేల పోలింగ్ బూత్కమిటీలు, డిజిటల్ ఏజెంట్లు ప్రజల్ని కలిసే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డీఎంకే నాయకులు అందరూ ఉరకలు పరుగులతో తొలి రోజున ప్రచారం, సభ్యత్వ నమోదు మీద దృష్టి పెట్టారు. ఆళ్వార్ పేటలో.. చైన్నెలోని ఆల్వార్పేట ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతూ ఒకే జట్టుగా తమిళనాడు ఉద్యమానికి ప్రజా మద్దతును సేకరించే దిశగా గురువారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ శ్రీఓరనియిల్ తమిళనాడ్ఙు ఉద్యమంలోకి ప్రజలను ఆహ్వానిస్తూ ఇంటింటా పర్యటించారు. ఈ సమయంలో స్టాలిన్కు జనం బ్రహ్మారథ పడుతూ కరతాళ ధ్వనులను మార్మోగిస్తూ ఆహ్వానాలు పలికారు. ఈ జట్లలతో తామంతా మీ వెన్నంటే అంటూ జనం నినాదించారు. మహిళ, విద్య, పారిశ్రామిక ప్రగతి గురించి ప్రజలు సీఎంకు వివరిస్తూ అభినందించడం విశేషం. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రజలతో ముచ్చటించారు. ఓ ఫాంను అందజేసి, అందులోని ప్రశ్నలను సంధించి ప్రజలతో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. తమిళనాడులో పాలన కొనసాగాలని ఆశిస్తూ, ప్రజలు సంకల్పంతో సభ్యత్వ నమోదు చేసుకుంటుండడం చూస్తే, ఈ ఉద్యమం బ్రహ్మాండ విజయాన్ని చేజిక్కించుకోవడం ఖాయం అని ఈ సందర్భంగా స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. జూలై ఒకటో తేదీన ఒకే జట్టుగా తమిళనాడ ప్రచారాన్ని ప్రారంభించానని, ప్రజల నుంచి అఖండ మద్దతు లబిస్తుండటం ఆనందంగాఉందన్నారు. శ్రీతమిళ భూమి, భాష, హక్కు, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి కులం, మతం రాజకీయాలకు అతీతంగా తమిళనాడును మళ్లీ గెలిపించుకుందామని వ్యాఖ్యలు చేశారు. మత్స్యకారులు, నేత కార్మికులు మొదలైన వారి ప్రయోజనాలను పరిరక్షించే కార్యక్రమాలను అమలు చేస్తూనే ఉంటామన్నారు. పిల్లలను కనే విషయంగా ఓ ప్రశ్నను స్టాలిన్ సందించగా, అక్కడున్న వారు.. అవును... అవును.. అని నినదించారు. తన పర్యటనలో భాగంగా మరో వీఽధిలోకి వెళ్లగా అక్కడి ప్రజల ఆనందానికి అవదులు లేదన్నట్టుగా పరిస్థితి నెలకొంది. ట్వీట్తో ఆనందం తన ఇంటింటా ప్రచార పర్యటన గురించి స్టాలిన్ ట్వీట్ చేశారు. ప్రజలు ప్రశ్నలు అడగాన్నే చటుక్కున సమాధానాలు ఇవ్వడమే కాదు, మరింతగా విస్తృతం చేయాలని, పాలన కొనసాగాలని ఆకాంక్షించడం మరింత ఆనందాన్ని కలిగించిందని వివరించారు. యువతే దేశ భవిష్యత్తు సంపద అని, వారి భవిష్యత్తును కాపాడటం మన కర్తవ్యం అని వ్యాఖ్యలు చేశారు. చాలా అప్రమత్తంగా ఉండడం చూసి, ప్రజలే మార్గనిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను సందించిన పలు ప్రశ్నలకు ప్రజల నుంచి వచ్చిన సమాధానాలను గుర్తు చేస్తూ, తామున్నామని ప్రజలే మద్దతు ఇస్తున్నారని, ఎల్లప్పుడూ భారతదేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తమిళనాడు నిలవాలని ఆకాంక్షిస్తున్నారని, అందరం ఐక్యంగా ఉంటామని పేర్కొంటుండటం బట్టి చూస్తే ఈ ఉద్యమం రాబోయే విజయానికి (2026 ఎన్నికలకు) సంకేతంగా అభివర్ణించారు. సీఎంతో పాటూ ఇంటింటా ప్రచారానికి వెళ్లిన వారిలో పార్టీ నిర్వాహక కార్యదర్శి, మంత్రి ఎం సుబ్రమణియన్, పార్టీ స్థానిక నేతలు కలై, నందనం మది ఉన్నారు. రూ. 52 కోట్లతో ఆరోగ్య కేంద్రాలుతరమణిలో తమిళ నాలెడ్జ్ సెంటర్సాక్షి, చైన్నె: ప్రజా ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ కొత్త ఆరోగ్య కేంద్రాల ఏర్పాటును విస్తృతం చేశారు. ఇందులో భాగంగా రూ. 52 కోట్ల వ్యయంతో 208 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రూ. 60 కోట్లతో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను ఆరోగ్య శాఖ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. వీటిని సీఎం ఎంకే స్టాలిన్ గురువారం ప్రారంభించారు. వైద్య, ప్రజారోగ్య శాఖ తరపున చైన్నె అడయార్లోని శాస్త్రి నగర్లో జరిగిన కార్యక్రమంలో తమిళనాడులోని కార్పొరేషన్ , మునిసిపాలిటీ పరిధిలోని ప్రాంతాలలో రూ. 52 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 208 కొత్త పట్టణ కేంద్రాలను ప్రజల ఉపయోగానికి తీసుకొచ్చారు. వెల్నెస్ కేంద్రాలను సీఎం ప్రారంభించారు. అలాగే రూ. 60 కోట్లతో నిర్మించిన గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభించారు. తమిళనాడు ప్రజలకు ఉన్నత–నాణ్యత వైద్య సదుపాయాలను అందించడానికి, కొత్త ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, వైద్య సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం వేగం పెంచినట్టు ఈసందర్భంగా సీఎం ప్రకటించారు. గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ సహా 21 మున్సిపల్ కార్పొరేషన్లు , 63 మున్సిపల్ ప్రాంతాల్లో రూ. 177 కోట్ల అంచనా వ్యయంతో 708 కొత్త పట్టణ ఆరోగ్య కేంద్రాలు. ఏర్పాటు చేస్తామని ప్రకటించామని గుర్తు చేశారు. అలాగే చైన్నెలోని తారామణిలో తమిళ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణ పనులకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. చైన్నెలోని సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పనులను ప్రారంభించారు. తారామణిలోని రోజా ముత్తయ్య పరిశోధన గ్రంథాలయం తరపున తమిళ ప్రజల కోసం సాంస్కృతిక కేంద్రంగా పనిచేసే శ్ఙ్రీతమిళ జ్ఞాన సముదాయంశ్రీ (తమిళ్ నాలెడ్జ్ సెంటర్) క్యాంపస్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఈ నిర్మాణాలకు 30,000 చదరపు అడుగుల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రూ. 40 కోట్లతో పనులు చేపట్టారు. -
నిర్వాహకుల్ని తొలగించే అధికారం నాదే..!
సాక్షి, చైన్నె: పీఎంకేలో నిర్వాహకులను తొలగించడం, కొత్త వారికి పదవులు అప్పగించడం వంటి అధికారం తనకు మాత్రమే ఉందని పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు స్పష్టం చేశారు. గురువారం తైలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో క్షీణించిన శాంతి భద్రతల గురించి ప్రస్తావించారు. బాణసంచాల ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నా, కార్మికుల భద్రత విషయంలో పాలకులు నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారని మండి పడ్డారు. చైన్నెలో రోడ్లు మరీ అద్వన్నంగా మారి ఉన్నాయని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే లేదా డీఎంకే కూటమిలో పీఎంకే అంటూ వస్తున్న వార్తలన్నీ పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఎవరితో కూటమి అన్నది పార్టీ నిర్వాహక కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ నుంచి ఎవ్వర్నీ తొలగించే అధికారం అన్బుమణికి లేదని స్పష్టం చేశారు. ఎవరినైనా తొలగించాలన్నా, మరెవరికై నా పదవి అప్పగించాలన్నా.. అధికారం తనకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. పీఎంకే ఎమ్మెల్యే అరుల్ పార్టీ శాసన సభా విప్ కూడా అని గుర్తు చేస్తూ, ఆయన్ను తొలగించాలనుకుంటే తొలుత పార్టీ శాసన సభా పక్షనేత జీకేమణి ద్వారా స్పీకర్కు లేఖ ఇవ్వాల్సి ఉంటుందని, ఆ తర్వాత తొలగింపు నిర్ణయం అన్నది ఉంటుందన్నారు. అయితే, అవన్నీ చేయకుండా అరుల్ను తొలగించినట్టు అన్బుమణి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని, వాస్తవానికి పార్టీలో సర్వాధికారం తనకు మాత్రమే అన్నది అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. అన్బుమణికి సంబంధించిన ప్రశ్నలను ఇక తన వద్ద సందించ వద్దు అని మీడియాకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. -
సాగరంలో బ్రహ్మాండ వంతెన
● 92 కి.మీ నిర్మాణానికి పరిశీలన ● ఎన్నూర్ నుంచి పూంజేరి వరకు పనులుసాక్షి, చైన్నె: ^ðlO¯ðl² çÜÐ]l¬{§é-ి² ™éMýS$™èl* {ºàÃ…yýl Ð]l…™ðl¯]l Æý‡*ç³#-¨§ýl$ª-Mø-¯]l$…-¨. C…§ýl$MýS$ çÜ…º…-«¨…-_¯]l M>Æ>Å-^èl-Æý‡×æ íܧýl®… ^ólçÜ$¢-¯é²Æý‡$. 92 MìS.Ò$ §ýl*Æý‡… Ð]l…™ðl¯]l Ð]l*Æý‡Y…V> G¯]l*²ÆŠ‡ ¯]l$…_ ç³N…gôæÇ Ð]lÆý‡MýS$ 糯]l$-ÌSMýS$ MýSçÜ-Æý‡™èl$¢ fÆý‡$VýS$-™ø…-¨. C…§ýl$MýS$ A…^èl¯é Ð]lÅĶæ$…V> Æý‡*. 27,600 MørÏV> °Æý‡~-Ƈ$$…-^éÆý‡$. ÑÐ]lÆ>-Ë$.. ^ðlO¯ðl² ¯]lVýSÆý‡… ÑïÜ¢Æý‡~… ò³Ç-W…-¨. ÕÐéÆý‡$ hÌêÏË$ D ¯]lVýSÆý‡… ç³Ç-«¨-ÌZMìS ^ólÆ>aÆý‡$. ™èlÓÆý‡ÌZ Ð]lÊyø Ð]l*çÜtÆŠ‡ ´ëϯŒS AÐ]l$ÌZÏMìS Æ>»Z™èl$¯]l²-¨. ¯]lVýSÆý‡… ÑïÜ¢-Æ>~-°MìS A¯]l$-VýS$-׿…V> f¯]l¿ê MýS*yé AÐ]l*…-™èl…V> ò³Æý‡$-VýS$-™èl$¯]l²-¨. Æý‡Ðé-×ê Ð]lÅÐ]lçÜ¢ ÑçÜ–¢™èl… ^ólçÜ$¢-¯é²Æý‡$. Ðéçßæ-¯éÌS Æý‡©ª ò³Ç-W…-¨. ¯]lVýS-Æý‡…-ÌZMìS Ðéçßæ-¯éË$ Æ>MýS$…yé Ð]l…yýl-Ë*Æý‡$ ¯]l$…_ Ò$…þÆý‡$ Ð]lÆý‡MýS$ 62 MìS.Ò$ §ýl*Æý‡… LrÆŠ‡ Ç…VŠæ Æøyýl$z¯]l$ HÆ>µr$ ^ólÔ>Æý‡$. AÌêVóS ò³Æý‡…-VýSâýæ™èl*¢Æý‡$ ¯]l$…_ ç³#âýæÌŒæ Ð]lÆý‡MýS$ 32 MìS.Ò$ §ýl*Æý‡… O»ñæ´ë-‹ÜÌZ Ðéçßæ-¯éË$ §ýl*çÜ$-MðS-â¶æ$¢¯é²Æ‡$$. ÆøyýlÏ ÑçÜ¢Æý‡-׿MýS$ ™øyýl$V> Ð]l…™ðl¯]l Ð]l*Æ>YÌS °Æ>Ã-×êÌS ÐólVýS… ç³#…k-MýS$…¨. ^ðlO¯ðl² G¯]l*²ÆŠ‡ àÆý‡¾-ÆŠ‡-¯]l$…_ ¯ólÆý‡$V> ¯]lVýSÆý‡…ÌZ° ç³Ë$ {´ë…™éÌS VýS$…yé yýlº$ÌŒæ yðlMýSPÆŠ‡ Ð]l…™ðl-¯]l™ø ^ðlO¯ðl² ÕÐé-Æý‡$ÌZ° ç³N…§ýl-Ð]l$-ÍÏ çÜÒ$-ç³…ÌZ »ñæ…VýS-â¶æ*Æý‡$ gê¡Ä¶æ$ Æý‡çßæ-§é-ǰ ^ólÆó‡ Ñ«§ýl…V> K Ð]l*Æý‡Y…MýS$ Cç³µ-sìæMóS M>Æ>Å^èl-Æý‡×æ íܧýl®… ^ólÔ>Æý‡$. VýS™èl…ÌZ Mö…™èl §ýl*Æý‡… 糯]l$Ë$ fÇ-W¯é, {ç³çÜ$¢™èl… Ð]l¬…§ýl$MýS$ 糯]l$-ÌS¯]l$ ÌêW…^ól {ç³Ä¶æ$-™é²-ÌSOò³ gê¡Ä¶æ$,Æ>çÙ‰ Æý‡çßæ§é-Æý‡$ÌS Ô>Q Ð]lÆ>Y-Ë$-MýS$-ïÜ¢Ë$ ç³yýl$-™èl$-¯é²Æ‡$$. A§ól çÜÐ]l$-Ķæ$…ÌZ Ð]l$¯]lÍ ¯]l$…_ MøÄ¶æ$…-»ôæyýl$ Ò$§ýl$V> Ðólâýæ^ólaÇ Ð]lÆý‡MýS$ C¯]l²ÆŠ‡ Ç…VŠæ Æøyýl$zMýS$ Æ>çÙ‰ Æý‡çßæ-§é-Æý‡$ÌS Ô>Q ç³Ç-Ö-ÌS¯]l ç³NÇ¢ ^ólíÜ E…¨. ™égêV> ^ðlO¯ðl², †Æý‡$-Ð]l-â¶æ*ÏÆý‡$, M>…`-ç³#-Æý‡…, ^ðl…VýS-ÌSµr$t hÌêÏÌZ° {´ë…™éÌS¯]l$ MýSË$-ç³#™èl* G¯]l*²ÆŠ‡ ¯]l$…_ Ð]l$à-º-Í-ç³#Æý‡… çÜÒ$ç³…ÌZ° ç³N…gôæÇ Ð]lÆý‡MýS$ 133 MìS.Ò$ §ýl*Æý‡…-Æý‡çßæ§éÇ {´ëgñæ-MýS$tMýS$ M>Æ>Å-^èlÆý‡×æ íܧýl®… ^ólçÜ$¢-¯é²Æý‡$. ^ðlO¯ðl² ¯]lVýSÆý‡…ÌZ DïÜ-BÆŠæ, KG…-BÆŠ‡ Ð]l*Æ>YË$ {ç³çÜ$¢™èl… ¼i {´ë…™é-Ë$V> Ð]l*Ç E¯é²Æ‡$$. Cr$-OÐðl-ç³#V> Ððl${sZ OÆð‡Ë$ õÜÐ]lÌS 糯]l$Ë$ OòÜ™èl… ÔèæÆý‡-Ðól-VýS…V> fÆý‡$-VýS$-™èl$¯é²Æ‡$$. D ç³Ç-íܦ-™èl$-ÌSÌZ çÜÐ]l¬{§ýl…¯]l$ ™éMýS$™èl* Ð]l…™ðl-¯]l-Ð]l*-Æý‡Y…MýS$ MýSçÜ-Æý‡-™èl$¢Ë$ ^ólç³rtyýl… ÑÔóæçÙ… రూ. 27 వేల కోట్లతో పనులు ప్రాజెక్టును రూ. 27,600 కోట్లతో చేపట్టే దిశగా అంచనా వ్యయం నిర్ణయించి ఉన్నారు. సముద్రంలో అందమైన వంతెనగా 92. కీమీ దూరం నిర్మాణాలకు రాష్ట్ర రహదారుల శాఖ పరిశీలన చేస్తున్నది. ఈ ప్రాజెక్టు సాధ్యాఅసాధ్యాల పరిశీలన నివేదిక సమర్పణకు రూ. 3.80 కోట్లు కేటాయించి ఉన్నారు. చైన్నె ఈసీఆర్ మార్గాన్ని విస్తరించే ప్రణాళిక ఇది వరకే సిద్ధం చేసి పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో మహాబలిపురం నుంచి నాగపట్నం, కన్యాకుమారి వరకు ఈ విస్తరణను పొడిగించారు. కడలూరు, తూత్తుకుడి హార్బర్ను అనుసంధానించే రీతిలో ఎలివేటెడ్ వంతెన మార్గం నిర్మాణానికి ఐదు విధాలుగా ప్రాజెక్టును సిద్ధం చేయబోతున్నారు.కోస్టల్ రెగ్యులేటరీ అథారిటి నుంచి అనుమతి పొంది, మత్స్య కారుల సంక్షేమాన్ని కాంక్షించే విధంగా చైన్నె సముద్ర తీరం మరింత సుందరంగామారడమే కాదు, నగరంలో వాహన రద్దీని ఈసీఆర్ వైపుగా తగ్గించే విధంగా ఎన్నూర్ నుంచి తూత్తుకుడి వరకు హార్బర్లను అనుసంధానించడమే కాకుండా బ్రహ్మాండ వంతెన నిర్మాణానికి కార్యచరణ సిద్ధం చేసిఉన్నారు. తొలిదశగా రూ. 5400 కోట్లు, ఆతదుపరి రూ.9 వేల కోట్లు, చివరగా రూ. 13,200 కోట్ల కేటాయింపుతో సముద్ర మార్గంగా ఈ వంతెన ఉండబోతోందని రహదారుల శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ వంతెన మార్గానికి నగరంలోకి కొన్ని ప్రధాన మార్గాలే కాదు, పల్లావరం నుంచి తురై పాక్కం రేడియల్ రోడ్డును సైతం అనుసంధానించడం ద్వారా ఈ వంతెన మరింత రవాణా మార్గంగా మారబోతోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సముద్ర మధ్యలో పాంబన్ – రామేశ్వరంను అనుసంధానించే విధంగా వంతెన మార్గం ఉన్న విషయం తెలిసిందే. -
సీ్త్ర వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే గుడ్ వైఫ్
తమిళసినిమా: నటి రేవతి పేరు వినగానే గుర్తుకు వచ్చేది ఆమె సహజ నటన. తమిళం, తెలుగు, హిందీ ఇలా చాలా భాషల్లో కథానాయకిగా నటించి తన కంటే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రతిభావంతురాలు ఈమె. నటిగానే కాకుండా నిర్మాత, రచయిత, దర్శకురాలి ఇలా బహుముఖాలు కలిగిన రేవతి తాజాగా దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ గుడ్ వైఫ్. నటి ప్రియమణి, సంపత్, ఆరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్కు హలిత సమీమ్ కథనం ,మాటలను అందించారు. ఇది హిందీ మొదలగు ఆరు భాషల్లో రూపొందిన వెబ్ సిరీస్కు రీమేక్ అన్నది గమనార్హం. కె. సంగీతాన్ని అందించిన ఈ వెబ్ సిరీస్ నిర్మాణ కార ్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం చైన్నెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకురాలు రేవతి మాట్లాడుతూ తాను ఇంతకు ముందు నాలుగు చిత్రాలకు, షార్ట్స్ ఫిలింస్కు దర్శకత్వం వహించానని, ఒక మోగా సీరియల్ను కూడా నిర్మించినట్లు చెప్పారు. కాగా తమిళంలో తాను దర్శకత్వం వమించిన తొలి వెబ్ సిరీస్ గుడ్ వైఫ్ అని పేర్కొన్నారు. ఇది ఒక స్ట్రీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే సిరీస్గా ఉంటుందన్నారు. భార్యగా, తల్లిగా ,అదే సమయంలో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే మహిళగా ఎలా కర్తవ్యాన్ని నిర్వహించిందీ అన్న కథాంఽశంతో రూపొందించిన వెబ్ సిరీస్ ఇదని చెప్పారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక వర్గం వల్ల తానీ వెబ్ సిరీన్ను రూపొందించడానికి ఏమంత కష్టపడాల్సిన అవసరం రాలేదన్నారు. ముఖ్యంగా నటి ప్రియమణి చాలా అంకితభావంతో పని చేశారన్నారు. ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా హాట్స్టార్ సంస్థ ఎంతగానో సహకరించినట్లు చెప్పారు. నటి రేవతి దర్శకత్వంలో నటించడం సంతోషకరం అని నటి ప్రియమణి పేర్కొన్నారు. ఆమె దర్శకత్వం శైలి ప్రత్యేకం అనీ, చాలా కామ్గా పని చేసుకుపోతారన్నారు. -
వైద్యసేవల్లో తమిళనాడు ఆదర్శం
మంత్రి నాజర్ తిరువళ్లూరు: వైద్యసేవల్లో తమిళనాడు దేశానికే తలమానికంగా మారిందని రాష్ట్ర మంత్రి నాజర్ తెలిపారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో 208 నగర సంక్షేమ కేంద్రాలను రూ.5.20 కోట్లు వ్యయంతో నిర్మించారు. పనులు పూర్తయిన క్రమంలో అన్ని కేంద్రాలను ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ క్రమంలోనే తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలోని కోవిల్పదాగై ప్రాంతంలో నిర్మించిన కేంద్రాన్ని మంత్రి నాజర్ పరిశీలించి గర్భిణి సీ్త్రలకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి నాజర్ మాట్లాడుతూ దేశంలోనే తమిళనాడులోనే ప్రజలకు మెరుగైన చికిత్స అందుతుందని వ్యాఖ్యానించారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఆరోగ్యంతో పాటూ ప్రజాసంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతాప్, మేయర్ ఉధయకుమార్, ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్లు ప్రియారాజ్, డాక్టర్ ప్రభాకరన్తో పాటూ పలువురు పాల్గొన్నారు. -
కాట్పాడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి డివిజన్ పరిధిలోని కిల్తాన్పట్టరై ప్రాంతంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సీఎం స్టాలిన్ రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇందులో కలెక్టర్ సుబ్బలక్ష్మి, పార్లమెంట్ సభ్యులు కదీర్ ఆనంద్, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కాట్పాడిలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 208 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కార్పొరేషన్ పరిధిలో ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆ సమయంలో సమీపంలోని రేషన్ దుకాణంలో కొనుగోలు చేసేందుకు కార్డుదారులు బారులు తీరడంతో వారి వద్ద కలెక్టర్ విచారణ జరిపారు. ఇందుకు వారంలో మూడు రోజులు మాత్రమే రేషన్ దుకాణం తెరుస్తారని దీంతో తాము నిత్యవసర వస్తువులు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అనంతరం సమీపంలోని అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి తరగతి గదిలోని విద్యార్థుల సంఖ్య, వారికి అందజేస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. రోజూ ఎటువంటి ఆహారం ఇస్తున్నారు, ఆహారం నాణ్యతగా ఉందా అనే విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటూ కార్పొరేషన్ డివిజన్ చైర్మన్ పుష్పలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
మద్యం మత్తులో వృద్ధురాలిపై అత్యాచారం ● యువకుడి అరెస్ట్ తిరువొత్తియూరు: వృద్ధురాలిపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ధర్మపురి జిల్లా తోప్పూర్ సమీపంలోని మెల్పురికల్ ప్రాంతానికి చెందినవారు సురేష్ (26) పెయింటర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి అదే ప్రాంతంలోని ఒక ఇంటిలో ఒంటరిగా నివసిస్తున్న 75 ఏళ్ల మహిళ ఇంటిలోకి మద్యం మత్తులో చొరబడి ఆమైపె అత్యాచారం చేశాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని బంధువులు బుధవారం ఉదయం ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు ఆమెకు తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సురేష్ను అరెస్టు చేశారు. పెరుంగుడిలో సంచలనం ●వివాహేతర ప్రియుడిని కత్తితో పొడిచిన మహిళ తిరువొత్తియూరు: చైన్నెలోని పెరుంగుడి ప్రాంతానికి చెందిన శక్తివేల్ కారు డ్రైవర్. ఇతడు తన భార్యతో విడిపోయాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా గత వారం శక్తివేల్ తల్లిదండ్రులు దిండివనంకు పిల్లలను తీసుకెళ్లారు. ఈక్రమంలో శక్తివేల్కు పక్కఇంటిలో వుంటున్న వారు దిండివనంలో ఉన్న అతడి తండ్రికి ఫోన్ చేసి, మీ కుమారుడి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పారిపోయారని చెప్పారు. దీంతో వేలచేరిలోని బంధువులు అతనిని చూడటానికి వచ్చారు. తీవ్ర గాయాలతో అక్కడే పడి ఉన్న శక్తివేల్ను వారు రక్షించి, చికిత్స కోసం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. డ్రైవర్ శక్తివేల్ శరీరంపై మొత్తం 16 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటనపై దురైపాక్కం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహిత మహిళకు, డ్రైవర్ శక్తివేల్కు మధ్య వివాహేతర సంబంధం నడుస్తోందిని తెలిసింది. శక్తివేల్ ఆ మహిళను తరచూ వేధిస్తున్నాడని ఈ కారణంగానే బుధవారం రాత్రి వివాహేతర ప్రియుడి ఇంటికి వెళ్లిన సదరు మహిళ కత్తితో పదే పదే పొడిచి పారిపోయిందని తెలిసింది. దీని తరువాత, పోలీసులు ఆ మహిళను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఏటీఎం కార్డు సాయంతో వినూత్న చోరీ ●యువకుడి అరెస్టు పళ్లిపట్టు : ఏటీఎం కార్డు ఉపయోగించి వినూత్న రీతిలో డబ్బులు చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పళ్లిపట్టు సమీపంలోని కేశవరాజుకుప్పం గ్రామానికి చెందిన కృష్ణన్(55 )రైతు అతను నాలుగు రోజుల కిందట పొదటూరుపేటలోని ఇండియన్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో డబ్బులు డ్రా చేసేందుకు అక్కడున్న వ్యక్తి సాయం కోరాడు. తన అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని రైతు కోరగా సాయం చేసే విధంగా నమ్మించి ఏటీఎం కార్డు పనిచేయడం లేదని. కార్డు మార్చి ఇచ్చి అసలు కార్డు తీసుకెళ్లిన వ్యక్తి కొద్ది సేపటికి ఆ ఏటీఎం కార్డు ఉపయోగించి రూ. 42 వేలు డ్రా చేశాడు. ఈ మేరకు పొదటూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా నగరి సమీపం కేవీఆర్పీ పేటకు చెందిన అరుణ్కుమార్ (32)ను గురువారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. వైద్యులు సేవాభావం కలిగి ఉండాలి వేలూరు: వైద్యులు నిరుపేద రోగుల పట్ల సేవా భావాన్ని కలిగి ఉండాలని కాట్పాడి జూనియర్ రెడ్క్రాస్ కార్యదర్శి జనార్ధనన్ అన్నారు. జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం ఉదయం కాట్పాడి సమీపంలోని తిరువలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెడ్క్రాస్ సంఘం అద్వర్యంలో డాక్టర్ల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్బంగా డాక్టర్లచే కేక్ కట్ చేసి సన్మానించారు. అనంతరం డాక్టర్లు రాణి నిర్మల, దీనబందు తదితరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ గౌరవాధ్యక్షులు శివసుబ్రమణ్యం, ఉపాద్యక్షులు శ్రీనివాశన్, కోశాధికారి పయణి, రమేష్కుమార్ జైన్, డాక్టర్లు ప్రియ, నికిల్ ప్రశన్న, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గింజ గొంతులో ఇరుక్కుని బాలుడి మృతి అన్నానగర్: మేలపాలైయంలో రంబుటాన్ విత్తనం గొంతులో ఇరుక్కుపోయి 5 ఏళ్ల బాలుడు మరణించాడు. వివరాలు.. నైల్లెలోని మేలపాళయం వీధికి చెందిన నిజాం కుమారుడు రియాజ్ (5). ఇతను బుధవారం రాత్రి తన తాతా, అమ్మమ్మ కొనిచ్చిన రాంబుటాన్ పండ్లను తింటున్నాడు. పండు మింగిన కొన్ని నిమిషాల్లోనే, ఆ విత్తనం గొంతులో ఇరుక్కుపోవడంతో రియాజ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. బంధువులు వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే రియాజ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఈ ఘటనపై మేలపాళయం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అజిత్కుమార్ హత్యను నిరసిస్తూ విద్యార్థుల ధర్నా
వేలూరు: శివగంగై జిల్లాలోని భద్రకాళిఅమ్మన్ ఆలయ సెక్యూరిటీ అజిత్కుమార్ను హత్యను ఖండిస్తూ వేలూరు జిల్లా కాట్పాడిలోని న్యాయ కళాశాల విద్యార్థులు కళాశాల ఎదుట ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. ముందుగా అజిత్ కుమార్ చిత్ర పటాన్ని ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వంలో లాకప్డెత్లు తరచూ జరుగుతున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం అజిత్కుమార్ హత్యకు కారణమైన పోలీసులపై కఠిన శిక్ష విధించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు న్యాయస్థానం తగిన గుణపాఠం చెప్పాలని, నిరుపేదలపై పోలీసులు జులం చూపించడం మానుకోవాలని తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. న్యాయ కళాశాల విద్యార్థులు ఉన్న ఫలంగా కళాశాల ఎదుట ధర్నా నిర్వహించడంతో పోలీసులు అఽధిక సంఖ్యలో చేరుకున్నారు. అనంతరం విద్యార్థులు ధర్నాను విరమించారు. -
సూపర్మ్యాన్
11న తెరపైకి తమిళసినిమా: సూపర్మ్యాన్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఒక పెద్ద ఆశ్చర్యం. ఇంతకు ముందు వచ్చిన సూపర్మ్యాన్ చిత్రాలు, సీరియళ్లు ఎంతగా ఆదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కాగా తాజాగా మరో సూపర్మ్యాన్ ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. డీసీ.స్టూడియోస్,ట్రోల్ కోర్ట్ ఎంటర్టెయిన్మెంట్, ది సఫ్రాన్ కంపెనీ కలిసి నిర్మించిన తాజా హాలీవుడ్ చిత్రం ఇది. జేమ్స్గన్ కథ,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రంలో డేవిడ్ కోరెన్స్వెట్, రేచ్చల్ బ్రోస్నాహన్, నికోలస్ హౌల్ట్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రం గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు తెలుపుతూ తనకు సూపర్మ్యాన్, సూపర్గర్ల్ వంటి ఇతి వృత్తాలతో కూడిన కథలు అంటే చాలా ఇష్టం అన్నారు. తాను చిన్నప్పుడు సూపర్మ్యాన్ కామిక్స్ కథలను ఎక్కువగా చదివేవాడినని చెప్పారు. దీంతో ఈ సూపర్మ్యాన్ చిత్రాన్ని తనదైన స్టైల్లో తెరపై ఆవిష్కరించినట్లు చెప్పారు. దేశ విదేశాల్లో జరిగే అన్యాయాలపై తీవ్రంగా స్పంధిస్తూ వాటిని అరికట్టే ప్రయత్నం చేసే సూపర్మ్యాన్లో దయ కరుణ, మానవీయత వంటి గుణాలు ఉంటాయన్నారు. తన శక్తిని దేశ ప్రజల కోసం ఉపయోగించాలని భావించే గొప్ప వ్యక్తిత్వం కలిన మనిషి సూపర్మ్యాన్ అని పేర్కొన్నారు. ఇందులో సూపర్మ్యాన్ క్లార్క్,కెంట్గా ద్విపాత్రయంలో కనిపిస్తాడని చెప్పారు. అతన్ని అంతం చేయడానికి దుర్మార్గుడు, మోసగాడు ,అత్యంత ధనవంతుడు అయిన లెక్స్ తూథర్ యత్నిస్తాడన్నారు. అతనిని సూపర్మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు ? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో ఆధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన చిత్రం సూపర్మ్యాన్ అని దర్శకుడు తెలిపారు. కాగా ఈ చిత్రాన్ని భారతదేశంలో వార్నర్బ్రదర్స్ సంస్థ తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్లం భాషల్లో 3డీ, ఇమ్యాక్స్ 3డీ ఫార్మెట్లో ఈ నెల 11 తేదీన విడుదల చేయనుంది. -
ఈవీల ఆవిష్కరణే లక్ష్యంగా సీఈఎం
సాక్షి, చైన్నె: ఎలక్ట్రిక్ వాహన ఆవిష్కరణలకు వేదికగా సెంటర్ ఫర్ ఎలక్ట్రికల్ మొబిలిటీ(సీఈఎం)ను స్టెల్లాంటిస్ నేతృత్వంలో చైన్నె శివారులో ఏర్పాటు చేశారు. విద్యార్థులకు విద్యా నైపుణ్యం లక్ష్యంగా కాటాన్ కొళత్తూరులోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవరణలో ఎలక్ట్రిక్ వాహన పరిశోధనల ఆవిష్కరణ కోసం ఈ సెంటర్ను నెలకొల్పారు. ఈ సెంటర్ హెడ్ భారతీ రాజా చొక్కలింగం మాట్లాడుతూ, స్టెల్లాంటిస్ ఇండియా సహకారంతో రెండుసిట్రోయెన్ ఎలక్ట్రిక్ వాహనాలను ఈ కేంద్రానికి అందించారని వివరించారు. స్టెల్లాంటిస్ ఇండియా అధికారి అశ్విన్ కౌండిన్య ఈవీ సాంకేతికతల పురోగతిని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వాహన ఇంజనీర్లను తీర్చిదిద్దేదిశగా ఈసెంటర్కు సహకారం అందించారన్నారు. స్టెల్లాంటిస్ ఇండియా ప్రతినిధి శ్రీరామ్ వెంకటరమణన్ మాట్లాడుతూ, లోతైన పరిశోధన సామర్థ్యాలను వాస్తవ ప్రపంచంలో మిళితం చేసి విద్యా సంస్థల తోడ్పాటుతో బలమైన ఆవిష్కరణల మీద దృష్టి పెట్టామన్నారు. -
పొగ కమ్మి 8 మందికి అస్వస్థత
తిరువొత్తియూరు: గిండిలోని ఒక హాస్టళ్లలో జనరేటర్ నుంచి పొగలు వచ్చి, ఆ ప్రాంతంలో కమ్ముకోవడంతో ఎనిమిది మంది స్పృహ కోల్పోయారు. చైన్నె గిండి కత్తిపార జీఎస్టీ రోడ్ ఉన్న హాస్టల్లో రాత్రి 11 గంటల ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హాస్టల్కు జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా చేయడానికి ఆన్ చేశారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జనరేటర్ నడుస్తుండగా పొగలు వచ్చి హాస్టల్ అంతటా వ్యాపించాయి. దీంతో హాస్టల్లోని ఎనిమిది మంది ఊపిరాడక స్పృహ కోల్పోయారు. సమాచారం అందుకున్న సెయింట్ థామస్ మౌంట్ పోలీసులు గిండి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న వారిని రక్షించి, వెంటనే చికిత్స కోసం గిండిలోని కలైంజర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సెయింట్ థామస్ మౌంట్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వివాహ ముందస్తు భత్యం రూ. 5 లక్షలకు పెంపు అన్నానగర్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వివాహానికి ముందు ఇచ్చే భత్యాన్ని రూ.5 లక్షలకు పెంచారు. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి పిల్లల వివాహాలకు ప్రభుత్వం ముందస్తు చెల్లింపును అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వివాహానికి ముందు ఇచ్చే భత్యం రూ. 5 లక్షలకు పెంచుతామని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ శాసనసభ చివరి బడ్జెట్ సమావేశంలో ప్రకటించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఆర్థిక కార్యదర్శి ఉదయచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి 15 నెలల మూల వేతనం లేదా రూ. 5 లక్షలు, ఏది తక్కువైతే దానికి సమానంగా ఉంటుంది. ఉద్యోగ విరమణకు ఐదేళ్ల ముందు వరకు ఉన్న ఉద్యోగులు ముందస్తు చెల్లింపు పొందవచ్చు. భర్త, భార్య లేదా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ, ప్రతి కుటుంబానికి ఒకసారి మాత్రమే ముందస్తు చెల్లింపును పొందవచ్చని మార్గదర్శకాలు జారీ చేశారు. యువకుడికి దేహశుద్ధి అన్నానగర్: ఓ యువతి స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీసిన యువకుడికి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన కలకలం రేపింది. తిరుప్పూర్లోని అంగేరిపాళయం ప్రాంతంలో బుధవారం ఉదయం తన ఇంట్లోని బాత్రూంలో ఒక యువతి స్నానం చేస్తోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక యువకుడు దాక్కుని ఆ యువతి స్నానం చేస్తున్న దృశ్యాలను తన సెల్ఫోన్తో వీడియో తీశాడు. అకస్మాత్తుగా శబ్దం విన్న యువతి కేకలు వేయడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారి పోయాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న యువకులు, ప్రజలు ఆ యువకుడిని వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేశారు. విచారణలో అతను బీహార్కు చెందినవాడని తేలింది. అనంతరం అతన్ని అనుప్పర్ పాళయం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. వ్యభిచారం కేసులో మహిళ అరెస్టు అన్నానగర్: మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె వ్యభిచార నివారణ యూనిట్–2 ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని పోలీసులు సైదాపేటలోని మసుది పల్లం రెండో వీధిలో ఒక ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. పశ్చిమ సైదాపేట ప్రాంతానికి చెందిన భువనేశ్వరి(53) అనే సెక్స్ బ్రోకర్ ఇద్దరు యువతులతో సెక్స్వర్క్లో నిమగ్నమై ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు భువనేశ్వరిని అరెస్టు చేశారు. ఆమె సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచారం చేయిస్తున్న ఇద్దరు యువతులను రక్షించి, ప్రభుత్వ మహిళా ఆశ్రమానికి అప్పగించారు. దక్షిణరైల్వేకు కొత్త ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా వినయన్ కొరుక్కుపేట: దక్షిణ రైల్వే కొత్త ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా జే వినయన్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంతకుముందు దక్షిణ మద్య రైల్వే సీనియర్ డిఫ్యూటీ జనరల్ మేనేజర్గా సేవలందించారు. మే నెలలో ఉద్యోగ విరమణ చేసిన బె జీ జార్జ్ స్థానంలో జే వినయన్ నియమితులయ్యారు. -
పచ్చదనం వైపు అడుగులు వేద్దాం
కొరుక్కుపేట: పచ్చదనం వైపు అడుగులు వేద్దామని సదరన్ రైల్వే ఉమెన్స్ హెడ్క్వార్టర్స్ ఆర్గనైజేషన్ (ఎస్ఆర్డబ్ల్యూహెచ్మో) అధ్యక్షురాలు సోనియా సింగ్ పిలుపునిచ్చారు. సదరన్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లేడీస్ ఆర్గనైనజేషన్ (ఫిక్కీఫ్లో) సంయుక్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాయి. సోనియా సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రయ స్కూల్ ఫర్ స్పెషల్ చిల్డ్రెన్ ఆవరణలో మొక్కలు నాటారు. -
డీఎంకే బలోపేతానికి సమష్టిగా పనిచేయాలి
వేలూరు: డీఎంకే బలోపేతానికి కార్యకర్తలందరూ కలసికట్టుగా పనిచేయాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పలు కార్యక్రమాల్లో కలుసుకునేందుకు మంగళవారం సాయంత్రం వేలూరుకు వచ్చారు. ఆయనకు కలెక్టర్ సుబ్బలక్ష్మి పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా ఆయనకు డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి నందకుమార్ అధ్యక్షతన కార్యకర్తలు జిల్లా సరిహద్దు ప్రాంతమైన పిల్లయార్కుప్పం గ్రామం వద్ద ఘన స్వాగతం పలికారు. ఉదయం వేలూరు జిల్లా కాట్పాడిలోని తూర్పు డివిజన్ కార్యదర్శి వన్నియరాజ, కార్పొరేషన్ మొదటి జోన్ చైర్మన్ పుష్పలత దంపతుల కుమార్తె వివాహ వేడకల్లో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు మంత్రులు దురై మురుగన్, ఆర్ గాంధీ, పార్లమెంట్ సభ్యులు జగత్రక్షగన్, కదీర్ ఆనంద్, ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్, అములు, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్కుమార్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం వేలూరులోని ప్రైవేటు కల్యాణ మండపంలో ఉదయనిధి యువజన విభాగం కార్యకర్తలతో సమీక్షించి, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకోవాలని తెలిపారు. -
చైన్నెలో భారత్ బెంజ్ హెచ్ఎక్స్ శ్రేణి వాహనం ఆవిష్కరణ
సాక్షి,చైన్నె: చైన్నెలోని ఒరగడంలో డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ కొత్త భారత్ బెంజ్ హెచ్ఎక్స్ శ్రేణి వాహనాన్ని బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ హెవీ –డ్యూటీ ట్రక్ సిరీస్ను డైమల్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సత్యకమ్ ఆర్య, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ తిమ్మయాన్లు విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశపు నిర్మాణం, గనుల రంగం తమ శక్తివంతమైన వ్యాపార లావాదేవీల్లో ఒకటిగా కొనసాగుతుందని అన్నారు. మైనింగ్ ఆపరేషన్స్, నిర్మాణ స్థలాల కోసం ఈ ట్రక్కులు ప్రధానంగా నిలుస్తాయని వెల్లడించారు. -
వడకుప్పంలో వేడుకగా అర్జున తపస్సు
పళ్లిపట్టు: వడకుప్పంలో ద్రౌపదీ దేవి ఆలయ వేడుకల్లో భాగంగా బుధవారం అర్జున తపస్సుమాను నాటకం వేడుక నిర్వహించారు. వడకుప్పంలోని ద్రౌపదీదేవి ఆలయంలో వార్షిక అగ్నిగుండ వేడుకలు జూన్ 26న ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రోజూ అమ్మవారు గ్రామ వీధుల్లో ఊరేగుతున్నారు. ప్రతిరోజూ పగలు మహాభారత హరికథా గానం, రాత్రి వీధి నాటకం ప్రదర్శిస్తున్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన అర్జున తపస్సుమాను నాటకం ఆకట్టుకుంది. వడకుప్పం చుట్టు పక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్జునుడు వేషధారణ చేసి, కళాకారుడు తపస్సుమాను ఎక్కి పాటలు పాడుతూ పరమేశ్వరుడి వద్ద వరం కోరే ఘట్టం ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంతానం లేని మహిళలు సంతాన ప్రాప్తి కోసం తపస్సుమాను కింద పడుకుని వేడుకున్నారు. చివరగా అర్జున వేషదారి మహిళలపై నిమ్మపండ్లు సహా పూజా సామగ్రి విసరడంతో వాటిని తీసుకోవడానికి వాటిని స్వాకరించేందుకు పోటాపోటీ పడ్డారు. వేడుకల్లో ప్రధానమైన అగ్నిగుండ వేడుకలు ఆదివారం నిర్వహిస్తారు. -
4 జంటలకు ఉచిత వివాహాలు
తిరుత్తణి: సుబ్రమణ్యస్వామి ఆలయంలో బుధవారం నాలుగు జంటలకు ఉచిత వివాహాలు జరిపి, బంగారంతోపాటు వివాహ కానుకలు పంపిణీ చేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు చెందిన యువతీ, యువకులకు రాష్ట్ర ప్రభుత్వ హిందు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కొండ ఆలయంలోని ఆర్సీ మండపంలో నాలుగు జంటలకు ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో వివాహాలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ ప్రభుత్వం ద్వారా వధూవరులకు నాలుగు గ్రాముల బంగారంతోపాటు వివాహం పట్టు వస్త్రాలు, పువ్వుల మాలలు, బీరువా, మంచం, వెండి దీపం, సహా రూ.30 వేలు విలువైన ఇంటి సామగ్రిని పెండ్లి కానుకగా పంపిణీ చేసి, వధూవరులను ఆశీర్వదించారు. వివాహంలో పాల్గొన్న వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులకు ఆలయాధికారులకు భోజనాల ఏర్పాట్లు చేశారు. వివాహం చేసుకున్న కొత్త జంటలు నేరుగా స్వామివారి దర్శనానికి ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ డీఎంకే కన్వీనర్ వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా పొన్నియమ్మన్ ఆలయ కుంభాభిషేకం
వేలూరు: కాట్పాడి సమీపంలోని బ్రహ్మపురంలో నూతనంగా నిర్మించిన పొన్నియమ్మన్ ఆలయ మహా కుంభాభిషేకం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మంగళవారం సాయంత్రం గజపూజ, గణపతి హోమం, యాగశాల పూజ, గోపూజ, వాస్తు శాంతి పూజ నిర్వహించారు. బుధవారం ఉదయం ప్రత్యేక గణపతి హోమ పూజలు చేసి, వివిధ పుణ్యనదుల నుంచి తీసుకొచ్చిన పుణితజలాలను కలశంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ రాజ గోపురంపైకి తీసుకెళ్లి వేద మంత్రాల నడుమ మహా కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం కలశ జలాలను భక్తులపై చల్లి, దీపారాదన పూజలు చేశారు. తరువాత ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, దీపారాదన పూజలు చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. -
సర్వ దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో నాలుగు కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,126 మంది స్వామివారిని దర్శించుకోగా 24,720 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి భక్తులు హుండీలో రూ.3.97కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
కోమారి వ్యాధి నిరోధక వ్యాక్సిన్ శిబిరాలు ప్రారంభం
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా వున్న బర్రెలు, పశువులకు కోమారి వ్యాధి నిరోధక టీకాలు వేసే శిబిరాలను కలెక్టర్ ప్రతాప్ బుధవారం ఉదయం తన్నీర్కుళంలో ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వున్న పశువులు, మేకలు, బర్రెలకు కోమారి వ్యాధి నుంచి రక్షణ కల్పించడానికి టీకాలు వేసే శిబిరాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఏడవ దశ టీకాలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రతాప్ తన్నీర్కుళంలో ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 2లక్షల 79వేల 550 పశువులకు టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు వివరించారు. ఈ శిబిరాలను జూలై రెండు నుంచి 30 లోపు వందశాతం టీకాలు వేసే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
వేడుకగా ఆణి తిరుమంజన ఉత్సవాలు
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని శివాలయాల్లో ఆణి తిరుమంజన ఉత్సవాలు బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. తమిళ ఆణిమాస తిరుమంజన దినోత్సవాన్ని పురష్కరించుకొని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని శివగామి సుందరి సమేత నటరాజ పెరుమాల్కు ఉదయం 6 గంటలకు శివాచార్యులచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. అనంతరం స్వామి వారికి కర్పూర హారతులు పట్టి వేద మంత్రాలు చదివారు. ఈ విశేష పూజలను తిలకించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వార్లును వివిధ వాహనాల్లో ఆశీనులు చేసి మాడ వీధుల్లో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వార్లుకు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వేలూరు కోట మైదానంలోని శ్రీ జలకంఠేశ్వరాలయంలోని శ్రీ శివగామి సుందరి సమేత నటరాజ పెరుమాల్కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి కర్పూర హారతులు పట్టారు. అనంతరం స్వామివార్లును పట్టణంలో ఊరేగించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
వైభవంగా కుంభాభిషేకం
తిరువళ్లూరు: పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వేంబులీ అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన వేంబులీ అమ్మవారి ఆలయం వుంది. ఆలయంలో ఇటీవల జీర్ణోద్దరణ పనులను చేపట్టారు. పనులు పూర్తయిన క్రమంలో కుంబాబిషేకం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే గత 29న ఉదయం 9 గంటలకు మంగళపూజ, దీపపూజ, విఘ్నేశ్వరపూజ, ధనపూజ, గణపతిహామం, లక్ష్మీహోమం, నవగ్రహా పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకు వాస్తుశాంతి ప్రవేశబలి తదితర పూజల నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు సోమవారం ఉదయం 9 గంటలకు ధీపారాధన పూజ, ప్రసాదం పంపిణీ నిర్వహించారు. సాయంత్రం యాగశాల పూజలు నిర్వహించారు. మూడవ రోజు మంగళవారం ఉదయం పావనప్రవేశం, హామం, దీపారాధన, పూర్ణహుతి నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు పూర్ణహుతి తదితర పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ఆరు గంటల మహాపూర్ణహుతి, ఏడు గంటలకు ఆలయ గోపురంపై పుణ్యజలాలు వదిలి కుంభాభిషేకం నిర్వహించారు. పూజలకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. -
విష్ణుకార్స్కు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు
కొరుక్కుపేట: లక్షలాది కస్టమర్ల ఆదరణతో కార్ల వ్యాపారంలో నమ్మకానికి మారుపేరుగా నిలిచిన విష్ణు కార్స్ మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. చైన్నె జీఎస్టీ శాఖ ప్రకటించిన టాప్ ట్యాక్స్ పేయర్, అత్యుత్తమ పారిశ్రామిక వేత్తల విభాగాల్లో రెండు పురస్కారాలకు ఏక కాలంలో ఎంపికై న సంస్థగా నిలిచింది. రెండు విభాగాల్లో ఒకే సంస్థ నిలవడం ఇదే తొలిసారి. టాప్ ట్యాక్స్ పేయర్గా విష్ణుకార్స్ , ఉత్తమ మహిళా పారిశ్రామిక వేత్తగా విష్ణు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపావెంకట్ ఎంపికయ్యారు. 8వ సిజిఎస్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని జిఎస్టీ తమిళనాడు అండ్ పుదుచ్చేరి జోన్ చైన్నెలోని కలైవానర్ అరంగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలోదీపా వెంకట్ ఈ రెండు పురస్కారాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో సీయూఎంఐ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీథరన్ రంగరాజన్ , ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ డాక్టర్ రామ్ నివాస్ , ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ ఏఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపా వెంకట్ మాట్లాడుతూ 15 ఏళ్లుగా నమ్మకానికి మారుపేరుగా నిలిచిన విష్ణుకార్స్ ను రెండు విభాగాల్లో సిజిఎస్టీ వారు గుర్తించడం పై ఆనందం వ్యక్తం చేశారు .కస్టమర్ల ఆదరణ, సంస్థలో సేవలందిస్తున్న ఉద్యోగుల నిబద్దతతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. -
మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడే కుయిలి
తమిళసినిమా: వినోదాన్ని అందించే కథా చిత్రాల మధ్యలో మంచి సందేశంతో కూడిన ఆలోచింపజేసే ప్రయోజనాత్మక కథా చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలా ప్రజలకు ప్రాణాంతకమైన మద్యంపై అవిరామంగా పోరాడే కథా చిత్రాలు అప్పుడప్పుడే వస్తుంటాయి. అలాంటి కథతో తాజాగా రూపొందిన చిత్రం కుయిలి. స్వలాభం కోసం ప్రజలను మద్యానికి బానిసలను చేసే దుర్మార్గుడు వారి ప్రాణాలను బలి కొంటూ తన మద్యం సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతుంటారు. అలా ఒక గ్రామ ప్రజలు సహనం కోల్పోయి తిరగబడితే జరిగే పరిణామాలే కుయిలి చిత్ర కథ. సారాయి కారణంగా తండ్రిని కోల్పోయిన ఒక యువతి, ఎలాంటి వ్యసనాలు లేని యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే ఆర్ధిక సమస్యలు అతన్ని మద్యానికి బానిసను చేస్తాయి. ఈ తరువాత అతను ప్రాణాలను కోల్పోతాడు. అంతకు ముందు నుంచే కామ్రేడ్స్ కొందరు మద్యం సేవించడం వల్ల జరిగే నష్టాలను వివరించే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ప్రయోజనం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మద్యం కారణంగా బలైన తండ్రీ, భర్తలను కోల్పోయిన ఈ యువతి పోరాటానికి దిగుతుంది. ఎలాగైనా మద్యాన్ని ఆ ఊరులో లేకుండా చేయాలని కామ్రేడ్ మిత్రులతో కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పోరాడుతుంది. తన కొడుకును కష్ట పడి చదివించి కలెక్టర్ను చేసి మద్యానికి చరమగీతం పాడాటానికి శ్రమిస్తుంది. అయితే ఆమె పోరాటం ఫలించిందా? కలెక్టర్ అయిన కొడుకు తల్లి ఆశయానికి అండగా నిలిచాడా? వంటి పలు అంశాలతో రూపొందిన చిత్రం కుయిలి. ఒక యధార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని పీఎం.ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై వీ.అరుణ్కుమార్ నిర్మించారు. పీ.మునుసామి దర్శకత్వం వహించిన ఇందులో నటి లిజీ ఆంటోని టైటిల్ పాత్రను పోషించగా రవిషా, దష్మిక ,దీప్తీ, పుదుపేట్టై సరవణన్, రాక్షసన్ సరవణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జూ స్మిత్ సంగీతాన్ని, ప్రవీణ్రాజ్ ఛాయాగ్రహణంను అందించిన ఈ చిత్రం గురువారం శుక్రవారం తెరపైకి రానుంది. కుయిలి చిత్రంతో నటి లిజీ ఆంటోని -
క్లుప్తంగా
245 మంది విద్యార్థులకు రూ.1.31 కోట్ల స్కాలర్షిప్ ● వితరణ చేసిన జీఆర్టీ జ్యూవెల్లర్స్ కొరుక్కుపేట: సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా జిఆర్టి జ్యూవెల్లర్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 245 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ. 1.31 కోట్ల విలువైన స్కాలర్షిప్లు అందజేసింది. చైన్నెలోని జిఆర్టి మహాలక్ష్మీ విద్యాలయంలో ప్రత్యేకంగా స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా జీఆర్టీ జ్యువెల్లర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జిఆర్ ఆనంద్ అనంత పద్మనాభన్ మాట్లాడుతూ స్కాలర్షిప్లు ద్వారా లబ్ధిపొందించిన వారిలో అధిక భాగం ఆర్థికంగా వెనుకబడిన కుంటుంబాల నుంచి వచ్చిన వారు ఉన్నారని తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నతంగా చదవాలని భవిష్యత్లో వారు అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. వ్యక్తిగత అభివృద్దికై నా, సామాజిక మార్పునికై నా విద్యే పునాది అని విద్యను కొనసాగించాలనే సంకల్పంతో ముందుకెళ్లే విద్యార్థులకు జిఆర్టి జ్యువెల్లర్స్ మద్దతు ఇస్తున్నందుకు గర్విస్తున్నామని పేర్కొన్నారు. మరో మేనేజింగ్ డైరెక్టర్ జిఆర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ విద్యకు మద్దతుగా స్కాలర్షిప్లను అందించడం తమ సీఎస్ఆర్ కార్యక్రమాల్లో ప్రధాన భాగమని తెలిపారు. ఈ సంవత్సరం 245 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. వేధింపుల కేసులో యువకుడి అరెస్టు తిరుత్తణి: యువతికి లవ్ టార్చర్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. అరక్కోణం ప్రాంతంకు చెందిన 21 ఏళ్ల యువతిని తిరువలంగాడు సమీపంలోని హరిచంద్రాపురం గ్రామానికి చెందిన ముహ్మద్ అలీ(21) అనే యువకుడు రెండేళ్ల నుంచి ప్రేమిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంగా యువతి సరిగ్గా పలకరించడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం చిన్నమ్మపైట రైల్వే స్టేషన్ వద్ద వున్న యువతిని కలుసుకున్న ముహ్మద్ అలీ తనతో మాట్లాడాలని, ప్రేమించాలని టార్చర్ చేసినట్లు, యువతి తిరువలంగాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఆటో డ్రైవర్ల ఆందోళన తిరువళ్లూరు: అక్రమ కేసులు బనాయించి పోలీసులు సీజ్ చేసిన ఆటోలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మంగళవారం రాత్రి ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తిరువళ్లూరు పట్టణంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా ఆటోలను పార్కింగ్ చేశారన్న నెపంతో 11 ఆటోలను సీజ్ చేసి వాటిని స్థానిక ఆర్టీవో కార్యాలయంలో అప్పగించారు. అయితే ఆటోలను సీజ్ చేయడం వల్ల తమ జీవనోపాధి కోల్పోయే ప్రమాదం వుందని వాపోయిన డ్రైవర్లు బుధవారం రాత్రి 9 గంటలకు ఆర్టీవో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఆర్టీవో రామకృష్ణన్, స్థానిక పోలీసులు ఆందోళన చేస్తున్న ఆటో డ్రైవర్లతో చర్చలు జరిపారు. కొన్ని ఆటోలకు రూ. 500 నుంచి రూ. 3,500 రూపాయల వరకు జరిమానా విధించారు. మిగిలిన నాలుగు ఆటోలకు సరైన రికార్డులు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. కాగా ఆర్టీవో కార్యాలయంలో మంగళవారం రాత్రి జరిగిన ఆటో డ్రైవర్ల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లాలోని పశువులన్నింటికీ కోమారి టీకాలు తప్పనిసరి వేలూరు: జిల్లాలోని పశువులకు, మేకలకు తప్పనిసరిగా కోమారి వ్యాధి టీకాలను తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. వేలూరు జిల్లా కేవీ కుప్పం నియోజక వర్గంలోని పీకే పురం గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ది పథకాలను కలెక్టర్ తనఖీ చేశారు. అనంతరం పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశువులకు కోమారి వ్యాధులు రాకుండా టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో పశు సంవర్థశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తిరుకుమరన్, అసిస్టెంట్ అధికారి ఆందవన్, తహసీల్దార్ మురళీధరన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బానిస కావడం సమాజానికి హానికరం
● ఏఓఎఫ్ఎస్ నూతన ఉపాధ్యక్షులు డాక్టర్ కామరాజ్ కొరుక్కుపేట: ఇంటర్నెట్ అయినా, మాదకద్రవ్యాలైనా దేనికై నా బానిస కావటం సమాజానికి హానికరం అని,దీని నుంచి ప్రజలను రక్షించడానికి వైద్యులు కలసి పనిచేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆసియా–ఓషియానియా ఫెడరేషన్ ఆఫ్ సెక్సాలజిస్ట్ (ఏవోఎఫ్ఎస్)నూతన ఉపాధ్యక్షులు డాక్టర్ టి. కామరాజ్ అన్నారు. బుధవారం చైన్నెలో జరిగిన విలేకర్ల సామవేశంలో ఆయన మాట్లాడుతూ ఏవోఎఫ్ఎస్కు కొత్త ఉపాధ్యక్షులుగా ఎన్నిక కావటం తన చాలా ఆనందంగా ఉందని పేర్కొంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన లైంగిక విద్య పాఠ్యాంశాలను అమలు చేయాలని సెక్సాలజిస్టులు కోరుతున్నట్టు తెలిపారు.సాంప్రదాయకంగా ఆహారం, దుస్తులు, నివాసం మానవుల ప్రాథమిక అవసరాలు ఉంటాయి అని అలాగే లైంగిక ఆరోగ్యాన్ని కూడా ప్రాథమిక అవసరంగా చేర్చాలని అన్నారు. లైంగిక ఆరోగ్యం అందరికీ ముఖ్యం అని అదే సమయంలో లైంగిక హింస, దుర్వినియోగాన్ని నివారించడం కూడా అంతే ముఖ్యం అని తెలిపారు. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు ప్రతీ చోటా ఉపయోగించబడుతున్నాయని భారతదేశంలో 700 మిలియన్ల మంది ప్రజలు ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారని గణాంకాలు సూచిస్తున్నట్టు తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం పాఠశాలలు, కళాశాలల్లోనే కాకుండా చిత్ర పరిశ్రమలోనూ పాతుకుపోయిందన్నారు. ఇంటర్నెట్ అయినా, మాదక ద్రవ్యాలైనా బానిస కావటం సమాజానికి హానికరం అని పేర్కొన్నారు. ఏవోఎఫ్ఎస్ లైంగిక ఆరోగ్యం, లైంగిక న్యాయాన్ని మానవశ్రేయస్సు, ప్రాథమిక హక్కులలో భాగాలుగా గుర్తించడం ద్వారా ప్రజలకు సేవ చేయడానికి పనిచేస్తుందని తెలిపారు. డాక్టర్ కేఎస్ జయరాణికామరాజ్ కూడా పాల్గొని ప్రసంగించారు. -
పరందు పో ఎవరినీ నిరాశ పరచదు
తమిళసినిమా: దర్శకుడు రామ్ చిత్రాలు కచ్చితంగా ఇతర చిత్రాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఈయన చిత్రాల్లో మంచి సందేశం ఉంటుంది. ఇంతకు ముందు ఆయన తెరకెక్కించిన కట్రదు తమిళ్, తంగమీన్గళ్, తరమణి, పేరంబు వంటివన్నీ వైవిధ్యభరిత కథా చిత్రాలే. అంతే కాకుండా ప్రజాదరణతో పాటు పలు అవార్డులను తెచ్చిపెట్టాయి. కాగా రామ్ తాజాగా తెరకెక్కించిన చిత్రం పరందు పో. జియో హర్ట్స్టార్, జీకేఎస్ ప్రొడక్షన్, సెవన్ సీన్ అండ్సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో నటుడు శివ గ్రేస్ ఆంటోని జంటగా నటించారు. మాస్టర్ మిఽథున్ ర్యాన్, అంజలి, అజు వర్గీస్,విజయ్ యేసుదాస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్కే. ఏకాంబరం ఛాయాగ్రహణంను, సంతోష్ దయానిధి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్బంగా ఇందులో కథానాయకుడిగా నటించిన నటుడు శివ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ఈ చిత్రంలో నటించడానికి దర్శకుడు రామ్ తనను పిలిచినప్పుడు తనకు చాలా ఆశ్యర్యం కలిగిందన్నారు. నటీనటుల నుంచి తనకు కావాల్సిన నటనను రాబట్టుకునే వరకూ వదలని దర్శకుడాయన అని పేర్కొన్నారు. కాగా ఆయన స్టైల్లోనే ఈ పరందు పో చిత్రం ఉంటుందని చెప్పారు. చిత్రం చూసిన ప్రేక్షకులు కచ్చితంగా చిరునవ్వులు చిందిస్తూ సంతృప్తిగా బయటకు వస్తారని అన్నారు. ఈ చిత్రం ఎవరిని నిరాశ పరచదనే నమ్మకాన్ని నటుడు శివ వ్యక్తం చేశారు. -
ఎనిమిది మంది వైద్యులకు అవార్డుల ప్రదానం
కొరుక్కుపేట: వైద్య రంగంలో విశేష సేవలను అందిస్తున్న ఎనిమిదిమంది వైద్యులను పలు అవార్డులతో ఘనంగా సత్కరించుకున్నారు . జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3233లోని ఆరోగ్య విభాగం తరపున మంగళవారం నగరంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు.డిస్ట్రీక్ట్ గవర్నర్ డి దేవేంద్రన్ నేతృత్వంలో హీలర్స్ హార్మోని –రోటరీ ట్రైబ్యూట్ టు డాక్టర్స్ పేరిట ప్రముఖ వైద్యులను అవార్డులతో సత్కరించారు . అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులకు వైద్యశిబిరం , అన్నదానం తదితర కార్యక్రమాలు జరిగాయి . చైన్నె ఎగ్మోర్లో జరిగిన వైద్యుల సత్కార కార్యక్రమంలో తమిళనాడు నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి పాల్గొన్న వైద్యులను శాలువాలు , జ్ఞాపికలతో సత్కరించారు. విశిష్ట సేవలను అందించిన ఎనిమిది మంది ప్రముఖ వైద్యులకు అవార్డులను ముఖ్యఅతిథిగా ఆర్థోపెడిక్ సీనియర్ సర్జన్ డాక్టర్ మయిల్ వాహనన్ , గౌరవ అతిధిగా థౌజండ్లైట్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఎళిలన్ నాగనాథన్ చేతులమీదుగా ప్రదానం చేశారు . ఇందులో డాక్టర్ రేలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెంటర్ ఛైర్మెన్ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ రేలా ,అస్సాంకు చెందిన వైద్యులు డాక్టర్ రవికన్నన్ లకు ఫర్ ది షేక్ ఆఫ్ ఆనర్ అవార్డును అందుకున్నారు . అలాగే వైద్యులు డాక్టర్ ఆర్ శ్రీరామ్ , సీనియర్ కన్సల్టెంట్ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ మోహన్ రాజన్ , తమిళనాడు ప్రభుత్వ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ టిఎన్ సెల్వ వినాయగంకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకోగా , డాక్టర్ ఆర్ ప్రేమ్ శేఖర్, డాక్టర్ వసుమతి వేదాంతంలకువిశిష్ట సేవా అవార్డులు అందుకున్నారు . అలాగే డాక్టర్ కార్తీక్ బాలాజీ యంగ్ అచీవర్ అవార్డును అందుకున్నారు .ఈ సందర్భంగా డిస్ట్రీక్ కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ తమ సంఘం తరపున మంగళవారం ఒక్క రోజులోనే దాదాపు రూ. 15 లక్షల విలువైన సేవా కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. స్పాట్ ఆసుపత్రి నిర్వాహకురాలు సుజాత రమేష్ బాబుతోపాటూ పెద్దసంఖ్యలో వైద్యులు పాల్గొన్నారు. -
దర్శకుడు సెల్వరాఘవన్ హీరోగా నూతన చిత్రం
తమిళసినిమా: విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సెల్వరాఘవన్. ఈయన తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నటి ఖుషీ రవి నాయకిగా నటిస్తున్న ఇందులో సీనియర్ నటుడు వైజీ.మహేంద్రన్, మైమ్గోపి, కౌశల్య, సతీష్, దీపక్, హేమ, లిత్రిక, ఎన్.జ్యోతికన్నన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇంతకు ముందు ట్రిప్, తూక్కుదురై వంటి చిత్రాలను తెరకెక్కించిన డెన్నీస్ మంజునాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. దీన్ని విజయ సతీష్ సమర్పణలో వ్యోమ్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. దీనికి రవివర్మ.కే ఛాయాగ్రహణంను, ఏకే.ప్రియన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ను సేలంలో ప్రారంభించి దాని పరిసర ప్రాంతాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చక్కని ప్రకృతి కలిగిన సేలంలో తమ చిత్ర షూటింగ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని , ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల వంటి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు వారు తెలిపారు. -
● వర్క్ షాపు
2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా జాతీయ స్థాయి వర్క్షాపు ఎస్ఆర్ఎంఐఎస్టీలో జరిగింది. ఐసీఎస్ఎస్ఆర్ సహకారంతో ఇండియా 2030 ఇన్నోవేట్, ఇంటిగ్రేట్, ఇన్స్పైర్ – ది పాత్ టు అచీవింగ్ సస్టయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే అంశంపై రెండు రోజుల పాటూ జరిగిన ఈ సదస్సుకు ఎస్ఆర్ఎం ప్రో వీసీ వినయ్కుమార్, డీన్ దురై స్వామి, డిప్యూటీ డీన్ ఆల్బర్ట్ ఆంటోనీ రజ్, నిర్వాహక కార్యదర్శి సెల్వసుందరంలతోపాటుగా ముఖ్య అతిథిమద్రాసు స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చైర్మన్ డాక్టర్ సీ రంగరాజన్లతో పాటుగా నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు. – సాక్షి, చైన్నె -
● ఎబిలిటీ ఫెస్ట్
ఎబిలిటీ ఫెస్ట్ 2025 బుధవారం ఇండియా ఇంటర్నేషనల్ డిజేబిలిటీ ఫిల్మ్ ఫెస్టివల్గా చైన్నెలోని జాతీయ క్రాస్ డిజేబిలిటీ ఆర్గనైజేషన్ ఎబిలిటీ ఫౌండేషన్లో జరిగింది. ఇందులో సంగీత మాంత్రీకుడు ఏఆర్ రెహ్మాన్, నటి సిమ్రాన్, రచయిత మదన్ కార్కీ. స్విమ్మర్ మహ్మద్ సామ్స్ అలం షేక్, కోచ్ టి న్కేష్లు, అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ర్ కెప్టన్ వజియకుమార్, ఫెస్టివల్ డైరెక్టర్ జయశ్రీరవీంద్రన్, చైర్పర్సన్ రేవతి ఆశాలు పాల్గొన్నారు. 60 సెకండ్స్ టు ఫేమ్ – ఆల్ ఇండియా వన్ మినిట్ ఫిల్మ్ కాంపిటీషన్ ఆన్ డిసేబిలిటీ జ్యూరీ మీట్ తదుపరి షార్ట్ లిస్ట్ చేసిన చిత్రాలను ప్రదర్శించేందుకు నిర్ణయించారు. – సాక్షి, చైన్నె -
ఆమ్స్ట్రాంగ్ హత్యకు ఏడాది
● ప్రతీకార హత్యలను నివారించడానికి పోలీసుల హైఅలర్ట్ కొరుక్కుపేట: బహుజన సమాజ్వాద్ పార్టీ రాష్ట్ర ఽఅధ్యక్షులు ఆమ్స్ట్రాంగ్ ను గత ఏడాది జూలై 5న దుండగులు నరికిచంపారు. ఈ హత్యకు ఏడాది కావొస్తుంది. దీంతో ఆ హత్యకు ప్రతీకార హత్యలను నివారించడానికి చైన్నెలో పోలీసులు హై అలర్ట్ చేశారు. ఇప్పటికే ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న తిరువెంగడం అనే రౌడీని పోలీసులు కాల్చి చంపారు. హత్య కేసులో ప్రమేయం ఉన్న పులియాన్తోపు చెందిన దాదా నాగేంద్రన్తో సహా 30 మందిని అరెస్టు చేసి జైలులోపెట్టారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి దోషులను చట్టం ముందుకు తీసుకురావడానికి చర్యలు కూడా ముమ్మరం చేయబడ్డారు. ఆమ్స్ట్రాంగ్ హత్య ఘటన ప్రస్తుతం అతని మద్దతుదారులలో తీవ్ర కలకలం రేపుతోంది. ఫలితంగా ప్రతీకార చర్యలు జరగకుండా పోలీసులు తీవ్ర జాగ్రత్తలు తీసుకుంటున్నారు . ఈ విషయంలో పరారీలో ఉన్న కొంతమంది రౌడీలను పోలీసులు పట్టుకునేందుకు చురుగ్గా పర్యవేక్షిస్తున్నారు. పీఎంకే నుంచి అరుల్కు ఉద్వాసన ●అన్బుమణి ప్రకటన సాక్షి, చైన్నె : పీఎంకే నుంచి ఎమ్మెల్యే అరుల్కు ఉద్వాసన పలుకుతూ అన్బుమణి రాందాసు బుధవారం ప్రత్యేక ప్రకటన చేశారు. పీఎంకేలో రాందాసు, అన్బుమణి రాందాసు మధ్య జరుగుతున్న అధ్యక్ష వార్ గురించి తెలిసిందే. అన్బుమణి మద్దతు దారులను తొలగిస్తూ రాందాసు ముందుకెళ్తున్నారు. అదే సమయంలో రాందాసు తొలగించిన వారికి అన్బుమణి మళ్లీ పదవులు కల్పిస్తూ , తానే అధ్యక్షుడ్ని అంటూ ముందడుగు వేస్తున్నారు. తండ్రి, తనయుడి మధ్య జరుగుతున్న ఈ అధికార సమరంలో ముఖ్య నేతలు నలిగి పోతున్నారు. తాజాగా అన్బుమణి కి వ్యతిరేకంగా సేలంకు చెందిన జిల్లా నేత, ఎమ్మెల్యే అరుల్ తీవ్రంగా ఆరోపణల ప్రశ్నలను సందించారు. అన్బుమణి మద్దతు దారుల రూపంలో రాందాసుకు ప్రాణ హానీ ఉందని ఆరోపణలు చేశారు. దీనిని అన్బుమణి తీవ్రంగానే పరిగణించారు. ఇన్నాళ్లు పార్టీ నుంచి తనతో ఉన్న వారిని రాందాసు తొలగిస్తూ వస్తే, తాజాగా రాందాసుకు అనుకూలంగా, తనకు వ్యతిరేకంగా స్పందించిన ఎమ్మెల్యే అరుల్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం మొదలు అన్ని పదువుల నుంచి తొలగిస్తున్నట్టు అన్బుమణి ప్రకటించడం చర్చకు దారి తీసింది. రాందాసు, అన్బుమని మధ్య జరుగుతున్న సమరంలో తాజాగా ఎమ్మెల్యే అరుల్ బలి కావడంతో ఆయన మద్దతు దారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, అరుల్ను తొలగించే అధికారం అన్బుమణికి లేదంటూ రాందాసు స్పష్టం చేశారు. పీఎంకేలో అరుల్ కొనసాగుతారని తేల్చిచెప్పారు. నామినేటెడ్ పదువులకు దరఖాస్తుల ఆహ్వానం సాక్షి, చైన్నె: దివ్యాంగులకు స్థానిక సంస్థలో నామినేటెడ్ పదవులను కేటాయించడమే లక్ష్యంగా దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్రంలో పంచాయతీలు, పట్టణ పంచాయతీలు, తదితర స్థానిక సంస్థలలో ఒక స్థానం దివ్యాంగులకు కేటాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన విషయం తె లిసిందే. ఎన్నికలు లేకుండా వీరిని ఏక గ్రీవంగానామినేటెడ్ రూపంలో ఎంపిక చేయడానికి నిర్ణయించారు. ఇందుకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆయా స్థానిక సంస్థలలో ఈ నామినేటెడ్ పోస్టును భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఆశావహులు, అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ పిలుపు నిచ్చింది. ఈ దరఖాస్తులు చేసుకునే వారికి కొన్ని మార్గదర్శకాలను సైతం విడుదల చేశారు. ఆయా స్థానిక సంస్థల పరిధిలోని కార్యాలయాలు, జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు చేసుకునే దిశగా చర్యలు చేపట్టారు. ఏరోస్పేస్ సెజ్ సౌకర్యంతో బలోపేతం సాక్షి, చైన్నె : ఏరో స్పేస్ సెజ్ సౌకర్యం ఆవిష్కరణతో దేశ రక్షణ, విమానాయన పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి పునాది వేశామని బీఈఎంఎల్ చైర్మన్ శాంతను రాయ్ తెలిపారు. బెంగళూరులోని కేఐఏడీబీ , ఏరో స్పెస్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో కొత్తగా తాము నిర్మించిన అత్యాధునిక సౌకార్యం గురించి బుధవారం స్థానికంగా ఆయన వివరించారు. ఏరో స్పెస్ ఆశయాలను బలోపేతం చేయడానికి ఒక వ్యూహాత్మక చర్యలలో భాగంగా ఈ సెజ్లో 1.15 ఎకరాల స్థలంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి పునాది వేశామని వివరించారు. బీఈఎంఎల్ ప్రస్తుతం ఏరో స్పేస్ సెజ్లో మొత్తం 25 ఎకరాల స్థలాన్ని కలిగి ఉందని, దీనిని వేగంగా అభివృద్ధి చెందుతున్న రక్షణ, విమానయాన రంగాలకు అనుగుణంగా ఒక శక్తివంతంగా తీర్చిదిద్దాలన్నసంకల్పంతో ఉన్నామని తెలిపారు. ఏరో స్పేస్ సెజ్ను దేశ విమానయాన, రక్షణ రంగాలకు ప్రపంచ స్థాయి కేంద్రంగా మార్చేందుకు తమ మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామన్నారు. -
ఇంటి వద్దకే రేషన్..!
● ప్రయోగాత్మకంగా అమల్లోకి సాక్షి, చైన్నె: ఇంటి వద్దకే రేషన్ నినాదంతో నిత్యావసర వస్తువులను దరిచేర్చే బృహత్తర పథకానికి ప్రయోగాత్మకంగా బుధవారం శ్రీకారం చుట్టారు. చైన్నెలో వేళచ్చేరితో పాటూ పలు చోట్ల ఇంటి వద్దకే వెళ్లి రేషన్ వస్తువులను వృద్ధులు, దివ్యాంగులకు అందజేశారు. వివరాలు.. రాష్ట్రంలో 2.25 కోట్ల రేషన్కార్డులు ఉన్న విషయం తెలిసిందే. బియ్యం కార్డు దారులకు ఉచితంగా బియ్యం, చక్కెర , పామోలిన్, కంది పప్పు తదితర వాటిని చౌక ధరకే అందిస్తూ వస్తున్నారు. ఈకార్డు దారులను బయోమెట్రి క్ లేదా, ఐరీష్ ఆధారంగా గుర్తించి నిత్యవసర వస్తువుల పంపిణి సుమార 35 వేల మేరకు ఉన్న రేషన్ దుకాణాల ద్వారా జరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో గతంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ వస్తువుల పంపిణిని విజయవంతం చేయడానికి తమిళనాడు ప్రభుత్వం పరిగణించింది.దాపి ఆధారంగా తమిళనాడులోనూ ఈ విధానం అమలు చేయడానికి సీఎంస్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే, అమల్లోకి తీసుకు రావడంలో జాప్యం తప్పలేదు. తొలివిడతగా 10 జిల్లాల్లో.. ఎట్టకేలకూ ఇంటి వద్దకే రేషన్ వస్తువుల పంపిణీకి చర్యలు చేపట్టారు.అయితే, ప్రయెగాత్మకంగా అమలు చేయడానికి తొలుత వృద్ధలు, దివ్యాంగులైన కార్డుదారుల వివరాలను సేకరించారు. సమారు 15 లక్షలమంది కార్డుదారులుగా ఉన్నట్టు గుర్తించారు. వీరికి ఇళ్ల వద్దకే తీసుకెళ్లి రేషన్ వస్తువులనుఅందజేయడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. తొలి విడతగా పది జిల్లాలలో ఇంటి వద్దకే రేషన్ అమల్లో భాగంగా బుధవారం ప్రయోగాత్మకంగా చైన్నె వేళచ్చేరి పరిసరాలలో ఇంటి వద్దకే వాహనల ద్వారా రేషన్ వస్తువులను తీసుకెళ్లి లబ్దిదారులకు అందజేశారు. రేషన్ దుకాణాలలో క్యూలో నిలబడాల్సిన అవశ్యం లేకుండా తమ ఇళ్ల వద్దకే తీసుకొచ్చి నిత్యవసర వస్తువులను అందజేయడానికి వృద్ధులు, దివ్యాంగులు ఆహ్వానించారు. ఈ ప్రయోగాత్మకంగా పూర్తి స్థాయిలో విజయవంతం కాగానే, రాష్ట్రంలో పది జిల్లాలో అమలు చేయనున్నారు. ఆతదుపరి క్రమంగా అందరు రేషన్కార్డు దారులకు ఇళ్ల వద్దకే నిత్యవసర వస్తువులను పంపిణీ చేసే విధంగా మొబైల్వాహనాలను పూర్తి స్థాయిలో రంగంలోకి దించే విధంగా ప్రభుత్వ విస్తృత కార్యచరణ పై దృష్టి పె ట్టింది. -
● ఎన్ని విమర్శలైనా చేసుకోండి ● నిజమైన భక్తుల ప్రయోజనాలే ముఖ్యం ● సీఎం స్టాలిన్ స్పష్టీకరణ ● 32 జంటలకు వివాహాలు
సాక్షి, చైన్నె: రాజా అన్నామలైపురంలో హిందూ మతం, దేవాదాయ శాఖ నేతృత్వంలో 32 జంటలకు సామూహిక వివాహ వేడుక బుధవారం జరిగింది. ఏటా పేద జంటలకు ఈ వివాహలను జరిపిస్తున్నారు. 2022–2023లో 500, 2023–2024లో 600 , 2024–2025 లో 700 జంటలకు వివాహాలు జరిగాయి. 2025–2026లో 1000 జంటలకు వివాహాలు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ వివాహ నిమిత్తం 4 గ్రాముల బంగారు తాళి, రూ. 70 వేలు విలువైన అన్ని రకాల వస్తువులతో సారెను ఈ జంటలకు అందిస్తున్నారు. తాజాగా బుధవారం 32 జంటలకు వివాహం జరిగింది. జంటలకు తాళిబొట్టుతో సహా అన్ని రకాల సామాగ్రిని సీఎం చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రూ, ఎంసుబ్రమణియన్, పికే శేఖర్బాబు, మైలం బొమ్మపురం ఆధీనం శివజ్ఞానపాళయం స్వామిగల్, తిరువణ్ణామలై మఠం అథీనంు ఆది శివలింగాచార్య గురు స్వామిగల్, మెట్రోపాలిటన్ చైన్నె కార్పొరేషన్ మేయర్ శ్రీమతి ఆర్. ప్రియ, ఎమ్మెల్యేలు టి.వేలు, తాయకం కవి, జోసెఫ్ శామ్యూల్, జె. కరుణానిధి, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎం. మహేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఆనందంగా కలిగిస్తోంది.. హిందూ మతం దేవాదాయ శాఖ ధార్మిక సంస్థ విభాగం ఈ వివాహాలను ఏటా నిర్వహిస్తుండటం ఆనందంగా ఉందని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వధూవరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ శాఖ మంత్రి శేఖర్బాబు కార్మికుడిగానే కాదు సైనికుడిగా కూడా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. ప్రభుత్వ రంగాల పరంగా ఆయన ఏ రంగంలో రాణించ గలరో అని గుర్తించే ఈ శాఖను అప్పగించామన్నారు. శేఖర్బాబు భక్తితో ఈ నాలుగు సంవత్సరాలు ఈ శాఖను విజయవంతంగా నడిపించారని అభినందించారు. గత ఏడాది వరకు 1,800 వివాహాలు జరగ్గా ఈ ఏడాది ఇప్పటి వరకు 576 వివాహాలను విజయవంతంగా పూర్తి చేశారని వివరించారు. ఆధ్యాత్మిక ప్రియుల భాషలో చెప్పాలనుకుంటే, శేఖర్ బాబు ఓ భక్తుడిగా మారి సేవలు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3177 ఆలయాలను అభివృద్ధి చేశామని, ఇది ఒక రికార్డుగా అభివర్ణించారు. 997 దేవాలయాలకు చెందిన 7 వేల 701 కోట్లు విలువ చేసే 7 వేల 655 ఎకరాల స్థలాలను స్వాధీనం చేసుకున్నామని, అదనంగా, 2 లక్షల 3 వేల 444 ఎకరాల భూమి రక్షించబడిందన్నారు. 12,876 దేవాలయాలకు పునరుద్ధరణలు, వెయ్యి సంవత్సరాల పురాతన దేవాలయాల పురాతనత చెక్కు చెదరకుండా రూ. 425 కోట్లను కేటాయించి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆది ద్రావిడలు నివసించే ప్రాంతంలో 5 వేల దేవాలయాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5,000 దేవాలయాలు పునరుద్ధరణలకు తాజాగా ఆర్థిక సాయం అందజేసి ఉన్నామన్నారు. ఆడి నెలలో అమ్మన్ ఆలయాలు, పెరటాసి నెలలో వైష్ణవ ఆలయాలలో విశిష్ట పూజలు, రామేశ్వరం, కాశీ సందర్శనకు 60 నుంచి 70 ఏళ్లు పై బడ్డ వారికి ఆథ్యాత్మిక యాత్రకు సాయం అందిస్తున్నామని వివరించారు. ఆలయాల అభివృద్ధి కాదు, భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా విస్తృత ఏర్పాట్లు, నిర్మాణాలు జరుగుతూ వస్తున్నాయని వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా వివరించేందుకు అవకాశం ఉందని పేర్కొంటూ, అందరికీ సర్వస్వం లక్ష్యంగా ద్రావిడ మోడల్ పాలన రాష్ట్రంలో ఉందన్నారు. తనకు అందరూ సమానం, అని అందరికీ అన్ని దక్కాలన్నదే కాంక్షగా పేర్కొంటూ, అయితే, సమాజం, ద్వేషం అన్న విభజన కలిగి ఉన్న వాళ్లు చేస్తున్న చర్యలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు.భక్తి పేరుతో..కొందరు భక్తి పేరుతో వేస్తున్న పగటి వేషాలను చూస్తుంటే ఆందోళన తప్పడం లేదన్నారు. ఈ సందర్భంగా ఓ పత్రికలో వచ్చిన కార్టూన్ గురించి ప్రస్తావిస్తూ, దీన్ని బట్టి అర్థం చేసుకోండి, తాను కావడి తీసుకుంటున్నట్టు, మంత్రులతో కత్తితో నేల మీద దొర్లినట్టుగా ఉన్న ఆ కార్డూన్ను చూసి నవ్వు ఆపుకోలేక పోయినట్టు పేర్కొన్నారు. వారి లక్ష్యం భక్తి కంటే, ప్రభుత్వన్ని కించ పరచడమే థ్యేయం అన్నట్టుందన్నారు. వాస్తవానికి వారు ప్రభుత్వం అందించిన ఆథ్యాత్మిక ప్రయోజనాలను అభినందించి ఉంటే సంతోషించి ఉండే వాడ్ని అని, అయితే, కార్టూన్ రూపంలో సైతం వారిలో ఉన్న ద్వేషాన్ని వెల్లగక్కి ఉన్నారని విమర్శించారు. ఆధారం లేని ఆరోపణల గురించి తాను మాట్లాడ దలచుకోలేదన్నారు. నా పని నిత్యం ప్రజల సేవ మాత్రమే అని, ప్రజలకు ఏమి చేయాలి, మరింతగా ఎలాంటి పథకాలు అమలు చేయాలి, బృహత్తర ప్రాజెక్టులు ఎలా ఉండాలన్నదే కీలకంగా వివరించారు. ప్రజలే ముఖ్యం అని, తనను విమర్శించే వారి గురించి పట్టించుకోబోనని, విమర్శించే వాళ్లు విమర్శించుకోని అని హితవు పలికారు. నిజమైన భక్తుల ప్రయోజనం కోసం తాము శ్రమిస్తూనే ఉంటామని వివరిస్తూ, ఇక్కడ కొత్తగా వివాహలైన వధు వరులు పుట్టే బిడ్డలకు తమిళంలోనే పేర్లు పెట్టాలని , ఇంటికి ఒకరు స్వచ్ఛందంగా సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
ఈఎన్టీ నైపుణ్యాల అభివృద్ధే లక్ష్యం
సాక్షి, చైన్నె : ఈఎన్టీ నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా ఆర్హెచ్ఐఎంఈఎస్ 2025 కాడవెరిక్ ప్రదర్శన చైన్నె శివారులోని కాటాన్ కొళత్తూరులో జరిగింది. ఎస్ఆర్ఎం వైద్య కళాశాల ఆస్పత్రి, పరిశోధన కేంద్రం ఈఎన్టీ విభాగం, అనాటమీ విభాగం సహకారంతో రెండురోజుల పాటుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈఎన్టీ ప్రొఫెసర్ డాక్టర్ సీఆర్కే బాలాజీ , అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ సుందర పాండ్యన్ మార్గదర్శకంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యా పరమైన అంశాలు, క్లినికల్ నైపున్యాల గురించి చర్చించారు. ఈఎన్టీ నిపుణులతో విశిష్ట ప్యానెల్ ప్రతినిధులు పద్మశ్రీ డాక్టర్ మోహన్ కామేశ్వరన్, ఎంఈఆర్ఎఫ్ ఎండీ డాక్టర్ రెగి థామస్, సీఎంసీ వేలూరు ప్రొఫెసర్ డాక్టర్ రఘునందన్, డాక్టర్ వివేక్, డాక్టర్ నితిన్ ఎం నగర్కర్లు వివిధ సెషన్లలో రైనాలజీ రంగంలో తాజా ధోరణులు, శస్త్ర చికిత్సలు, ఆవిష్కరణల గురించి చర్చించారు. అధునాతన ప్రదర్శనలు అందించారు. ఆచరణాత్మక శిక్షణతో పాటుగా వర్క్షాపులో విద్యా అంశాలను విశదీకరించారు. -
● డీజీపీ ఆదేశాలతో జిల్లాలో చర్యలు ● అజిత్ కుటుంబానికి భరోసా..! ● సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం
ఏఎస్సీ, డీఎస్సీల పర్యవేక్షణలో రాష్ట్రంలో ఉండే ప్రత్యేక పోలీసు బృందాలను రద్దు చేస్తూ డీజీపీ ఆదేశించారు. దీంతో ఈ బృందాలను అనేక జిల్లాలో రద్దు చేస్తూ, ఇందులో పనిచేసే వారిని జిల్లా హెడ్ క్వార్టర్స్కు సరెండర్ చేశారు. కాగా, ప్రత్యేక బృందం పోలీసుల చేతిలో దెబ్బలు తిని మరణించిన అజిత్ కుటుంబానికి సీఎం స్టాలిన్ భరోసా ఇచ్చారు. అతడి సోదరుడికి ఆవిన్ సంస్థలో ప్రభుత్వ ఉద్యోగం అప్పగించారు. సాక్షి, చైన్నె : శివగంగై జిల్లా తిరుభువనంలో సెక్యూరిటీ గార్డు అజిత్కుమార్ లాకప్ డెత్ మరణం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ లాకప్ డెత్ కేసులో డీఎస్పీ పర్యవేక్షణలో ఉన్న ఓ ప్రత్యేక పోలీసు బృందం వ్యవహారం వ వెలుగులోకి వచ్చింది. వీరందర్నీ అరెస్టు చేశారు. ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. సీబీసీఐడీ విచారణ కొనసాగే విధంగా మధురై ధర్మాసనం ఆదేశించినా, ఈకేసులో పోలీసు అధికారుల ప్రమేయం గురించి వచ్చిన సమాచారంలో కేసును సీబీఐకు అప్పగిస్తూ చర్యలు తీసుకున్నారు. అలాగే, మధురై జిల్లా కోర్టున్యాయమూర్తి జాన్ తిరుభువనంలో ఈ ఘటనపై విచారణకు శ్రీకారం చుట్టారు. బుధవారం ఆయన ఏడీఎస్పీ సుకుమార్తోపాటూ పోలీసులను విచారించారు. అలాగే, తిరుభువనం ఆలయం సిబ్బందితో మాట్లాడి వివరాలను సేకరించారు. ఇక, పోలీసు చేతిలో మరణించి అజిత్కుమార్కుటుంబ సభ్యులను సీఎం స్టాలిన్ పోన్ ద్వారా పరామర్శించారు. వారికి భరోసా ఇచ్చారు. అతడి సోదరుడు నవీన్కుమార్కు కారైక్కుడి ఆవిన్ సంస్థలో ప్రభుత్వ ఉద్యోగానికి అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఉద్యోగనియామక ఉత్తర్వులను మంత్రి పెరియకరుప్పన్ అందజేశారు. అలాగే, కుటుంబ సభ్యులకు రూ. ఐదు లక్షలు చెక్కును అందజేశారు. పొటో: 14 : అజిత్ కుటుంబానికి చెక్కును అందజేస్తున్న మంత్రి పెరియకరుప్పన్ అపవాదుల కారణంగా.. దక్షిణ తమిళనాడుతో పాటూ రాష్ట్రంలో అనేక సమస్యాత్మక ప్రాంతాలలో ఏఎస్పీలు, డీఎస్పీల పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు విధులను నిర్వహిస్తుంటాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి దూసుకెళ్లడమే ఈ బృందాల పని. ఇలాంటి బృందాలలోని కొందరు సిబ్బంది కారణంగా పోలీసు యంత్రాంగాని అపవాదులు తప్పడం లేదు. ఇందుకు గతంలో చోటు చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. తాజా ఘటనల నేపథ్యంలో జిల్లాలలోని స్పెషల్ టీంలను రద్దుచేస్తూ డీజీపీ శంకర్ జివ్వాల్ ఆదేశించారు. దీంతో స్పెషల్ టీంలను రద్దు చేశారు. ఇందులోని సిబ్బందిని జిల్లా ఎస్పీ కార్యాలయాలకు సరండర్ చేశారు. తిరునల్వే జిల్లాలోని ఐదు ప్రత్యేక బృందాలను ఆయా ఉన్నతాధికారులు సరెండర్ చేశారు. -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఓ లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తెలంగాణకు చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించారు.ధర్మపురి సమీపంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందినవారిని తెలంగాణలో వనపర్తి జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. విహారయాత్రలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హనుమంతునిపై కల్యాణ వెంకన్న
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి విహరించి భక్తులను ఆశీర్వదించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ చేపట్టారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జోరుగా డీఎంకే సభ్యత్వ నమోదు
మంత్రి దురై మురుగన్ వేలూరు: ఒకే తాటిపై తమిళనాడు అనే పథకం కింద డీఎంకే సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేసి, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు సభ్యత్వ నమోదు చేపట్టాలని మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరులోని డీఎంకే పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎంకే పార్టీ రాజకీయ పార్టీ మాత్రమే కాదని, సిద్ధాంతాలతో కూడిన పార్టీగా ఉందని, ప్రజా పోరాటం కోసమే ఈ పార్టీని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ పథకాన్ని సీఎం స్టాలిన్ చైన్నెలోని సచివాలయంలో ప్రారంభించారన్నారు. దీంతోనే వేలూరు ఉమ్మడి జిల్లాలోనూ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. తమిళనాడులోని ప్రతి కుటుంబంలోని సభ్యులను కలిసి ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. గత నాలుగేళ్లలో ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు చెప్పారు. అయితే రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు కేటాయించక పోవడం సరికాదన్నారు. డీఎంకే ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. అంతకుముందు మంత్రి దురై మురుగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేసి, కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారులకు చిత్రహింస
తిరువళ్లూరు: చెప్పిన మాట వినడం లేదని ఇద్దరు చిన్నారులను చిత్రహింసలకు గురిచేసిన తల్లి, ఆమె రెండో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి వద్ద చేపట్టిన సబ్వే డ్రైనేజీ పనులు చేస్తున్న కూలీల కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల చేతికి గాయమై కనిపించారు. ఈ సంఘటననూ చూసి షాక్కు గురైన కొందరు పోలీసులకు రహస్య సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు, చిన్నపిల్లల సంరక్షణ అధికారులు గాయపడిన చిన్నారులను చూసి చలించిపోయారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైదశాలకు తరలించారు. అనంతరం పోలీసులు చేపట్టిన విచారణలో కల్లకురుచ్చి ప్రాంతానికి చెందిన సత్య(23)కు అదే ప్రాంతానికి చెందిన శివతో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. భర్తతో వివాదాల కారణంగా శివతో విడిపోయి, అన్బరసన్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. పిల్లలు చెప్పిన మాట వినడం లేదన్న అక్కసుతో వారిని చిత్ర హింసలకు గురి చేయంతో చిన్నారులు గాయపడినట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో సత్య, అన్బరసన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
వేలూరు కలెక్టరేట్కు బాంబు బెదిరింపు లేఖ
వేలూరు: జిల్లా కలెక్టరేట్కు బాంబు బెదిరింపు లేఖ తపాలా కార్యాలయం ద్వారా అందింది. వేలూరు సత్తువాచారిలో కలెక్టర్ కార్యాలయం నడుస్తోంది. ఇందులో ఏ, బి బ్లాక్లు మొత్తం ఐదు అంతస్తులున్నాయి. ఇందులో వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలు నడుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం తపాలా శాఖ నుంచి ఓ లేఖ వచ్చింది. వాటిని పరిశీలించగా కలెక్టర్ కార్యాలయంలో బాంబు పెట్టామని, అది సాయంత్రం లోపు పేలుతుందని అందులో పేర్కొన్నారు. దీంతో అధికారులు బాంబు స్క్వాడ్ నిపుణులకు సమాచారం అందజేయడంతో నిపుణులు డాగ్స్ స్క్వాడ్ నిపుణులు కలెక్టరేట్లోని ఏ, బి బ్లాక్లోని అన్ని అంతస్తులను తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ లేఖ తెన్ కాశీకి చెందిన ఒక వ్యక్తి పోస్టు చేసినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై సత్తువాచారి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ బాంబు బెదిరింపు లేఖను ఎవరు పంపించారు.. ఎందుకు పంపారనే కోణంలో విచారణ చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయానికి బాంబు బెదిరింపు లేక రావడంతో అధికారులు సంచలనం రేపింది. -
● కొత్త పథకానికి శ్రీకారం ● ఘనంగా నాన్ మొదల్వన్ 3వ విజయోత్సవం ● ఉద్యోగ నియామకాలు ● కొత్త ఆవిష్కరణలు. ఒప్పందాలు
సంపూర్ణ మద్దతు ఈ కార్యక్రమంలో తొలుత డిప్యూటీ సీఎం ఉదయ నిధి ప్రసంగిస్తూ విజయానికి హామీ ప్రణాళికగా ఈ పథకం రూపకల్పన చేసినట్టు తెలిపారు. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ తమిళనాడు యువత నైపుణ్య శిక్షణతో ఉన్నత విద్యను అభ్యసిస్తారని, ఇది 100 శాతం ఉపాధిని కల్పిస్తుందన్నారు. తమిళనాడు యువత కోసం అందిస్తున్న పథకాలను గుర్తుచేస్తూ, ఈ సమూహానికి సంపూర్ణ మద్దుతు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడు యువతకు అండగా ఉంటుందని, విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడును అన్నింటా అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పం అని వ్యాఖ్యానించారు. అద్భుత శిక్షణతో భవిష్యత్తుకు గెలుపుతో హామీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సంవత్సరం నుంచి కళాశాల విద్యార్థులకు ల్యాప్టాప్లను అందించబోతున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. కష్టపడి పనిచేస్తే విజయం ఖాయం, ప్రతిభ ఉంటే విజయం ఖాయం, దృఢ సంకల్పంతో ఉంటే, విజయం ఖాయం! విజయం ఖాయం! అని వ్యాఖ్యానించారు. సాక్షి, చైన్నె : నాన్ మొదల్వన్ పథకం మూడో సంవత్సర విజయోత్సవ వేడుకలో గెలుపు తథ్యం నినాదంతో బృహత్తర పథకానికి సీఎం స్టాలిన్ మంగళవారం శ్రీకారం చుట్టారు. చైన్నెలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మంగళవారం నాన్ మొదల్వన్ పథకం మూడు వసంతాల విజయోత్సవం నిర్వహించారు. విద్యార్థులకు శిక్షణలు, ఉద్యోగ నియామక ఉత్తర్వులు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. భారతదేశంలో తమిళనాడును అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడం లక్ష్యంగా పాఠశాల విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించాలన్న కాంక్షతో నాన్ మొదల్వన్ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అలాగే, పుదుమైపెన్, తమిళ్ పుదల్వన్ పథకాల ద్వారా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి నెలకు రూ. వెయ్యి నగదు ప్రోత్సహం అందిస్తున్నారు. 2022లో ఇంజినీరింగ్ కళాశాలలోని విద్యార్థులకు మాత్రమే ప్రారంభించిన నాన్ మొదల్వన్ పథకం, 2023–24లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలకు, ఆ తరువాత పాలిటెక్నిక్ కళాశాలకు విస్తరించారు. ఏటా లక్షలాది మందికి శిక్షణ అందిస్తూ ఉద్యోగాలను సైతం దరి చేరుస్తున్నారు. ఈ పథకం విస్తరణలో భాగంగా బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రీ 4.ఓ, రోబోటిక్స్, తదితర అంశాలను విద్యార్థులకు సులభంగా, ఉచితంగా తరగతుల రూపంలో అందుబాటులో ఉండేలా ఒక వెబ్సైట్ను ఆవిష్కరించారు. నాన్ మొదల్వన్ ద్వారా ఇప్పటి వరకు 3,28,393 మందికి ప్రయోజనం చేకూరుస్తూ ఉద్యోగాలను దరి చేర్చారు. దీనికి కొనసాగింపుగా గెలుపు తథ్యం పథకాన్ని మంగళవారం అమల్లోకి తీసుకొచ్చారు. ఈ పథకం విదేశాల్లో సైతం ఉద్యోగ నియామకాలను పొందడంలో కీలక పాత్రను పోషించనుంది. సక్సెస్ గ్యారెంటీడ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచ స్థాయి నాయకత్వంలో ఉన్న వివిధ శిక్షణ సంస్థలతో ఈ సందర్భంగా ఒప్పందాలు జరిగాయి. పరస్పర సహకారం, ఉచిత స్వల్ప కాలిక కోర్సులు, నైపుణ్య శిక్షణ అందించనున్నారు. 18–35 ఏళ్ల వారికి ప్రయోజనం కల్పించేలా గెలుపు తథ్యం అమలు చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఈ శిక్షణలో 38 పారిశ్రామిక రంగాల్లో 165 రకాల శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రులు రాజకన్నప్పన్, పి.కె. శేఖర్బాబు, మేయర్ ప్రియ తదితరులు పాల్గొన్నారు. గెలుపు తథ్యం -
యాగశాల పూజలకు శ్రీకారం
సాక్షి, చైన్నె : తిరుచెందూరులో కుంభాభిషేకానికి సంబంధించిన యాగశాల పూజలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పవిత్ర జలాలను ఏనుగుపై ఉంచి ఊరేగించారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఈనెల 7వ తేదీన మహాకుంభాభిషేక వేడుక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల కోసం యాగశాల పూజలకు శ్రీకారం చుట్టారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సముద్ర తీరంలో ఉన్న బావి నుంచి పవిత్ర జలాలను సేకరించారు. అక్కడి నుంచి ఏనుగుపై ఊరేగింపుగా యాగశాలకు తీసుకొచ్చి, యాగాది పూజలకు శ్రీకారం చుట్టారు. -
మహిళలకు రుణాల పంపిణీ
తిరువళ్లూరు: పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటై 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళలకు రూ.1.56 కోట్ల రుణాలను కలెక్టర్ ప్రతాప్ మంగళవారం ఉదయం అందజేశారు. స్వయం ఉపాధి మహిళ సంఘాలకు రుణాల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్బీఐ రీజినల్ మేనేజర్ ప్రభాకరన్, రామమూర్తి తదితరులు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ ప్రతాప్ హాజరై నాలుగు స్వయం ఉపాధి సంఘాలకు రూ.1.30 కోట్లు, విద్యార్థులకు విద్యారుణాల కింద రూ.26 లక్షలసహా మొత్తం రూ.1.56 కోట్ల రుణాలను అందజేశారు. అనంతరం ఎస్బీఐలో కేక్కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు దివ్య ప్రియదర్శిని, అరుణ్దేవ్, స్మిత్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీగోవిందుని పుష్పయాగానికి అంకురార్పణ
తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఈనెల 2న బుధవారం జరుగనున్న స్వామి వారి పుష్పయాగానికి మంగళవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల మధ్య సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. శ్రీవిష్వక్సేనులవారు ఆలయ మాడ వీధుల్లో విహరించిన తర్వాత అర్చక పండితులు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. కాగా బుధవారం ఉదయం 9.30 గంటలకు సతీసమేత శ్రీగోవిందరాజస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం,చేపట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలు రకాల పుష్పాలు, పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి వారికి అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో మునికృష్ణారెడ్డి, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
మతసామరస్యానికి ప్రతీక మొహర్రం
నాయుడుపేటటౌన్: మొహర్రం పండుగను పురస్కరించుకుని ముస్లింలు, హిందువులు పీర్ల పండుగ వేడుకల్లో పాల్గొని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. పట్టణంలోని గరిడివీధిలోని హజరత్ మౌలాలీ తాలీంఖానా వద్ద మంగళవారం రాత్రి పీర్ల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మౌలాలి తాలీంఖానా యువజన కమిటీ సభ్యులు, మత పెద్దలు గరిడీలో పీర్లు ప్రతిష్టించిన చోట ఫాతేహాలు జరిపారు.ముస్లింలు ఇళ్ల నుంచి జెండాలను ఊరేగింపుగా తీసుకొచ్చి తాలీంఖానా వద్ద ప్రతిష్టించి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి మౌలాలి పంజా(పీర్లు)ను గుర్రంపై ప్రతిష్టించి పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. పంజా ఊరేగింపులో పిల్లల పులివేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తీన్ మార్ బ్యాండు మేళాలు, డప్పు కళాకారులతో యువత కోలహాలం చేస్తు పీర్ల ఊరేగింపులో పాల్గొన్నారు. -
ఆడికృత్తికకు విస్తృత ఏర్పాట్లు
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆగస్టు 16న ఆడికృత్తిక వేడుకల ఏర్పాట్లకు సంబంధించి ఆర్డీఓ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివరాలు.. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆగస్టు 14 ఆడి అశ్వినితో ఆడికృత్తిక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 16న ఆడికృత్తికతో పాటు తొలిరోజు తెప్పోత్సవం నిర్వహిస్తారు. వేడుకల్లో లక్షలాది మంది భక్తులు కావళ్లతో తిరుత్తణి కొండకు పోటెత్తనున్న క్రమంలో సౌకర్యాలకు సంబంధించి అధికారుల స్థాయి సమీక్ష ఆలయ మండపంలో మంగళవారం నిర్వహించారు. ఆర్డీఓ కణిమొళి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆలయ జాయింట్ కమిషనర్ రమణి, డీఎస్పీ కందన్, తహసీల్దారు మలర్వియి సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శాఖల వారీగా ఆడికృత్తిక ఏర్పాట్లకు సంబందించి అధికారులు వివరించారు. వేడుకలకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధం చేసి హిందూ దేవదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని అధికారులకు ఆర్డీఓ పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, హైవే ఏఈ అరుల్రాజ్, సీఐ యదియరసన్ తదితరులు పాల్గొన్నారు. దుకాణాలు తొలగింపు తిరుత్తణి కొండ ఆలయంలో భక్తులకు వసతులు మెరుగుపరిచే విధంగా రూ. 85 కోట్లు వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కొండ ఆలయంలోని అన్నదాన భవనం విస్తరించేందుకు వీలుగా, మాడ వీధికి సమీపంలో పువ్వులు, పుష్పాలు, పూజా సామాగ్రి దుకాణాలు తొలగించారు. ఆ స్థానంలో అన్నదాన భవనం నిర్మించనున్నారు. పూజా సామాగ్రి, పండ్లు, పువ్వుల దుకాణాల కోసం పార్కింగ్ ప్రాంతంలో నూతనంగా దుకాణాలు నిర్మించనున్నారు. అలాగే కార్తికేయన్ ఆలయ వసతి గృహం పాత భవనాలు తొలగించి ఆ స్థానంలో నూతన భవనం నిర్మాణం కోసం దుకాణాలు తొలగించి పాత భవనం కూల్చివేయనున్నారు. -
టీవీకే తీర్థం పుచ్చుకున్న మహిళలు
పళ్లిపట్టు: పట్టణానికి సమీపంలోని నొచ్చిలిలో టీవీకే ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వంద మందికి పైగా మహిళలు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఢిల్లీబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నటుడు విజయ్ ఆధ్వర్యంలో తమిళన వెట్రి కళగం పార్టీలో చేరేందుకు యువత, మహిళలు ఉత్సాహం చూపుతున్నారు. ఇందులో భాగంగా మండలంలోని నొచ్చిలి టీవీకే ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా విభాగానికి చెందిన వెన్మది ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఢిల్లీబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు వంద మంది టీవీకేలో చేరారు. వారికి పార్టీ జిల్లా కార్యదర్శి ఢిల్లీబాబు గుర్తింపు కార్డులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యువత సత్తా చాటి తొలిసారిగా ద్రవిడ పార్టీలకు పోటీగా విజయ్ పార్టీ అధికారం చేపడుతుందన్నారు. -
తమిళనాడు ప్రజలందర్నీ ఒకే జట్టుగా, ఒకే వేదిక మీద తెచ్చే విధంగా ప్రచార కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం శ్రీకారం చుట్టారు. అన్నా అరివాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
● ఇంటింటా కార్యక్రమంతో ప్రజలలోకి.. ● 45 రోజుల ప్రచార పర్యటనకు స్టాలిన్ శ్రీకారంసాక్షి, చైన్నె: 2026లో మళ్లీ అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు డీఎంకే పదును పెట్టిన విషయంతెలిసిందే. పార్టీ పరంగా నేతలను అప్రమత్తం చేస్తూ, ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడంతా బలోపేతం దిశగా కార్యక్రమాలు విస్తృతం చేశారు. ఈ వ్యూహాల అమలులలో భాగంగా తమిళనాడు అంతా ఒకే జట్టు అన్న నినాదంతో ప్రజలను ఏకం చేసే కార్యక్రమానికి చర్యలు తీసుకున్నారు. చైన్నెలోని అన్నా అరివాలయం వేదికగా ఈ కార్యక్రమాని స్టాలిన్ ప్రారంభించారు. 45 రోజుల ప్రత్యేక కార్యక్రమం ఒకే జట్టుగా తమిళనాడు కార్యక్రమం గురించి డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ మీడియాకు వివరించారు. ఇది 45 రోజుల కార్యక్రమంగా పేర్కొన్నారు. ఇదిక మహోన్నత కార్యక్రమంగా అభివర్ణించారు. రాష్ట్రంలోని 38 జిల్లాలలో ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, జిల్లాల కార్యదర్శులు మీడియా ముందుకు వచ్చి ద్రావిడమోడల్ ప్రభుత్వం ఆయా ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తారన్నారు. అలాగే, 78 జిల్లా కార్యదర్శుల నేతృత్వంలో ఒకే జట్టుగా తమిళనాడు నినాదంతో జిల్లాల వారీగా సభలు జరుగుతున్నాయారు. జూలై 7 నుంచి ఇంటింటా ప్రజల్ని కలిసే కార్యక్రమాలు ఉంటాయన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి వారి నియోజకవర్గాలలో ప్రజలతో మమేకం అయ్యే విధంగా ఇంటింటా వెళ్తారని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తారన్నారు. ఈ కార్యక్రమం కోసం డీఎంకే ఐటీ విభాగం నేతృత్వంలో 234 నియోజకవర్గాలకు ఇన్చార్జ్లను నియమించి శిక్షణ ఇచ్చామన్నారు. వీరి ద్వారా 68 వేల పోలింగ్ బూత్కమిటీలు, డిజిటల్ ఏజెంట్లు ప్రజల్ని కలిసి తమిళనాడు, తమిళ భాష, భూమిని రక్షించుకునేందుకు ఏకం అవుద్దామన్న నినాదంతో అందర్నీ ఒకే తాటి పైకి తీసుకొస్తారని వివరించారు. తమ ప్రగతి, కేంద్రంలోని బీజేపీ పాలకుల మోసాలు, నిధుల కేటాయింపు విషయంలో తమిళనాడుకు తలబెట్టిన ద్రోహం వంటి అంశాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రజలలోకి వెళ్లడం జరుగుతుందన్నారు. ఈసందర్భంగా అనేక సంఘటనలను ఉదాహరణగా గుర్తు చేశారు.అందరి ఇళ్లకూ వెళ్తాం.. కేంద్రంలోని పాలకులను ధైర్యంగా ఎదిరించి నిలబడే పార్టీకి బ్రహ్మాండ ప్రజా వేదిక అవశ్యమన్నారు. అందుకే తాము ఒకే జట్టుగా తమిళనాడు నినాదాన్ని అందుకున్నామన్నారు. తాము ఏమి చేశామో అన్నది ప్రజలకు తెలుసునని, అయినా, వారికి ఓ మారు గుర్తు చేయడం లక్ష్యంగా ఈ 45 రోజుల ప్రచార కార్యక్రమాలు, కరపత్రాల పంపిణి విస్తృతంగా చేయనున్నామన్నారు.అదే సమయంలో సభ్యత్వ నమోదు సైతం జరుగుతుందన్నారు. ప్రతి పక్ష నేతల ఇళ్లకే కాదు, ఇష్ట పడే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పరిస్థితిని బట్టి స్థానికంగా ఉండే నేతలు ప్రతి పక్ష నేత పళణి స్వామి ఇంటికి సైతం వెళ్లేందుకు వెనక్కు తగ్గరన్నారు. ప్రజలలోకి పళణి స్వామి ఇప్పుడిప్పుడే వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, తాము నిత్యం ప్రజలలోనే ఉన్నామని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. డీఎంకే కూటమి పార్టీల సీట్ల పందేరం గురించి ప్రశ్నించగా, ఎన్నికలకు 10 నెలలు సమయం ఉందని, సందర్భానుగుణంగా అందరూ కూర్చుని చర్చించి మాట్లాడుకుంటామని, సర్దుబాటు చేసుకుంటామని వ్యాఖ్యలు చేశారు. -
తమిళం, తెలుగు భాషల్లో రాణిస్తున్న దక్షన్ విజయ్
తమిళసినిమా: సినిమా ఎల్లలు దాటి చాలా కాలం అయ్యింది. ప్రతిభ ఉంటే ఏ భాషలోనైనా రాణించవచ్చు. అలా మాతృభాషలోనే కాకుండా మలయాళంలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్న తమిళ నటుడు దక్షన్ విజయ్. తమిళంలో కబలిహరం అనే చిత్రంలో హీరోగా నటించి తన నటనకు ప్రశంసలు అందుకున్న ఈయనకు మలయాళంలోనూ అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటికే ఇత్తికర కొంబన్ అనే మలయాళ చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్న దక్షన్ విజయ్కు తాజాగా మరో అవకాశం వచ్చింది. ఈయన ముఖ్యపాత్ర పోషిస్తున్న సొప్నంగళ్ విరుక్కన్న చందిరనగర్ అనే చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అలాగే తమిళంలో ఈయన నటించిన అయామ్ వెయిటింగ్ అనే చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, త్వరలోనే తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇలా తమిళం, మలయాళం భాషల్లో నటిస్తూ తన కంటూ గుర్తింపును తెచ్చుకుంటన్న నటుడు దక్షన్ విజయ్ నటించే మరిన్ని కొత్త చిత్రాలు చర్చల్లో ఉన్నాయి. నటనకు అవకాశం ఉంటే ఎలాంటి కథా పాత్రలోనైనా నటించడానికి సిద్ధం అంటున్నారీయన. -
● కమనీయం.. రథోత్సవం
తిరుమంజన రథోత్సవం తిరువొత్తియూరు: ప్రసిద్ధ చిదంబరం నటరాజ స్వామి ఆలయంలో ఆణి తిరుమంజన ఉత్సవాలు గత నెల 23వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రోజూ ఉదయం, సాయంత్రం పంచమూర్తి ఊరేగింపు నిర్వహించారు. కాగా ఆణి తిరుమంజన ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని మంగళవారం ఉదయం జరిగింది. సోమవారం ఉదయం చిత్ సభ నుంచి బయలదేరిన శివకామ సుందరి సమేత నటరాజమూర్తి, వినాయగర్, మురుగర్ చండికేశ్వరులను కీల్ రథంవీధిలోని ప్రత్యేక రథాల్లో ఉరేగించారు. రథానికి ప్రత్యేక దీపారాధన తర్వాత, శివ భక్తులు డప్పు, మంగళ వాయిద్యలతో శివ కీర్తనలు వినిపించారు. తేవారం, తిరువాసం ఇతర భక్తి గీతాలను పాడుతూ వుండగా రథం ఊరేగింపు నిర్వహించారు. ముందుగా గణేశుడి రథం బయలుదేరింది. దాని తర్వాత చండికేశ్వరర్, మురుగన్, నటరాజ, అమ్మన్ రథాలు ఒకదాని తర్వాత ఒకటి బయలుదేరాయి. ముందుగా మహిళలు వీధులను ముగ్గులతో అలంకరించారు. భక్తులు శివుడు, పార్వతి వేషధారణలో నత్యం చేశారు. ఈ రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాగా జూలై 2వ తేదీ సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు శివకామసుందరి సమేత నటరాజానికి మహాభిషేకం, చీరాభిషేకం, పుష్పాంజలి నిర్వహించారు. -
బాలికపై అత్యాచారం
50 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు కొరుక్కుపేట: మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు ఓ తాతకు తంజావూరు పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలు.. తంజావూరు జిల్లాలోని వల్లం సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై 2022 మార్చి 29న 50 ఏళ్ల తనీష్ రాజ్ అత్యాచారం చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీని తరువాత తనీష్ రాజ్ను పోక్సో కేసులో అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ తంజావూరు పోక్సో కోర్టులో సాగింది. సోమవారం తుది తీర్పు వెలువడింది. నిందితుడు తనీష్ రాజ్కు న్యాయమూర్తి తమిళరసి జీవిత ఖైదు విధించారు. బాధిత బాలికకు ప్రభుత్వం రూ.6 లక్షల పరిహారం అందించాలని కూడా ఆమె ఆదేశించారు. స్థానిక సంస్థల్లో నియమిత సభ్యులుగా దివ్యాంగులు ఈనెల 17 వరకు దరఖాస్తులు కొరుక్కుపేట: స్థానిక సంస్థల్లో దివ్యాంగుల గొంతు వినిపించాలనే ఆలోచన ఆధారంగా తమిళనాడు శాసనసభ 1994 పంచాయితీ చట్టం, 1998 తమిళనాడు పట్టణ పంచాయతీ చట్టాన్ని సవరించి పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయితీలలో ఓ దివ్యాంగుడిని నామినేటెడ్ సభ్యుడిగా నియమించడానికి ఏకగ్రీవంగా బిల్లు ఆమోదించింది. దీని ప్రకారం పట్టణ స్థానిక సంస్థల విషయంలో కార్పొరేషన్ కౌన్సిల్కు, పట్టణ మండలికి, స్థానిక సంస్థల్లో ఒక్కో దివ్యాంగ సభ్యుడిని నియమించాలని చట్టం చేశారు. దీని ద్వారా 13,357 దివ్యాంగుల వ్యక్తులు స్థానిక సంస్థల్లో సభ్యులుగా సామర్థ్యం ఉన్న వ్యక్తులు నియమిస్తామని డీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం పట్టణ స్థానిక సంస్థల్లో 650 మంది దివ్యాంగులను వెంటనే నియమిస్తారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 2,984 మంది దివ్యాంగులను నియమిస్తారు. దీని ప్రకారం మంగళవారం నుంచి దివ్యాంగుల నియమిత సభ్యులుగా చేరడానికి దరఖాస్తు చేసుకోవచ్చునని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని సమర్పించగలరి కేరింది. మరిన్ని వివరాల కోసం tn.gov.in/dtp వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొంది. తిరుత్తణి మురుగన్ ఆలయం హుండీ కానుక రూ.2.20 కోట్లు తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో 38 రోజుల్లో భక్తులు రూ.2.20 కోట్లు కానుకగా చెల్లించినట్లు ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి రోజూ వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. భక్తులు తమ మొక్కులు చెల్లించే విధంగా హుండీల్లో నగదు, నగలు కానుకలుగా చెల్లిస్తుంటారు. భక్తులు చెల్లించిన కానుకలను ఆలయ అధికారుల సమక్షంలో హుండీలు తెరిచి కానుకలు లెక్కించడం పరిపాటి. చివరి 38 రోజుల్లో భక్తులు చెల్లించిన కానుకలు లెక్కింపు సోమవారం చేపట్టారు. ఆలయ జాయింట్ కమిషనర్ రమణి సమక్షంలో హుండీలు తెరిచి ఆలయంలోని వసంత మండపంలో లెక్కించారు. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన కానుకల లెక్కింపులో ఆలయ సిబ్బంది వందకు పైబడిన వారు పాల్గొన్నారు. ఇందులో నగదుగా రూ. రెండు కోట్ల 20 లక్షల 10 వేల 874 రూపాయలు, కేజీ 30 గ్రాముల బంగారం, 18 కేజీల 405 గ్రాముల వెండి భక్తులు కానుకగా చెల్లించినట్లు ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అమల్లోకి వచ్చిన రైలు చార్జీల పెంపు కొరుక్కుపేట: దేశవ్యాప్తంగా ఏసీ , స్లీపర్, సెకెండ్ క్లాస్ రైలు చార్జీల పెంపు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. 2013లో కిలోమీటరుకు రెండు పైసలు నుంచి 10 పైసలకు చార్జీలు పెంచారు. అదే విధంగా 2020లో మరోసారి చార్జీలను పెంచారు. తాజాగా 500 కిలోమీటర్లుకు పైగా ప్రయాణించే వారికి రైలు చార్జీలు పెంపు మంగళవార నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం రిజర్వేషన్ లేకుండా సాధారణ కోచ్లో 501 కిలోమీటర్లు నుంచి 1500 కిలోమీటర్లు వరకు ప్రయాణించే ప్రయాణికులకు రూ.5 పెరిగింది. అదే విధంగా 1,501 కిలో మీటర్లు నుంచి 2,500 కిలోమీటర్లు వరకు చార్జీలను రూ.10 పెంచారు. 2,501 కిలోమీటర్లు నుంచి 3,000 కిలోమీటర్లు వరకు ప్రయాణించే ప్రయాణికులకు రూ.15 పెరిగింది. ఇందులో సాధారణ బెడ్ సౌకర్యంతో చైన్నె నుంచి మదురైకి రూ.320, చైన్నె నుంచి తిరుచ్చికి రూ.249, చైన్నె నుంచి కోయంబత్తూరు రూ.330, చైన్నె నుంచి తూత్తుకుడికి రూ.402 , చైన్నె నుంచి నెల్లూరుకు రూ.402, చైన్నె నుంచి కన్యకుమారికి రూ.423, చైన్నె నుంచి నాగర్ కోయిల్కు రూ.433, చైన్నె నుంచి సేలంకు 259 , చైన్నె నుంచి బెంగుళూరుకు 269కు టికెట్ ధర చేరింది. ఏసీ కోచ్లలోనూ ఈమేరకు పెంచినట్టు అదికారులు వెల్లడించారు. -
నంది నదిలో ఇసుక ట్రాక్టర్ సీజ్
తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని నది నదిలో ఇసుక చోరీ చేసిన ట్రాక్టర్ను పోలీసులు సీజ్ చేశారు. తిరుత్తణి ప్రాంతంలో ఇసుకకు డిమాండ్ విపరీతంగా ఉంది. దీంతో కొంతమంది రాత్రి వేళల్లో వాగులు, వంకలు, నదుల నుంచి ఇసుక చోరీ చేసి లారీలు, ట్రాక్టర్లలో తరలించి అధిక ధరలకు విక్రయించి లబ్ధి పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తెక్కళూరు నంది నదిలో ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా గుర్తించిన పోలీసులు నిందతులను పట్టుకునే ప్రయత్నంలో ట్రాక్టర్ డ్రైవర్తో పాటు కూలీలు పరారయ్యారు. పోలీసులు ట్రాక్టర్ సీజ్ చేసి పరారైన వ్యక్తుల కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొట్టి చంపేశారు!
సాక్షి, చైన్నె: తిరుభువనంలో లాకప్ డెత్ తీవ్ర వివాదానికి దారి తీసింది. సెక్యూరిటీ అజిత్కుమార్ శరీరంలో గాయాలు తీవ్రంగా ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. పోలీసులే అతడ్ని కొట్టి చంపేశారన్నది నిర్ధారణ కావడంతో హత్య కేసు నమోదు చేయాలని ప్రతి పక్షాలు పట్టుబడుతున్నాయి. వివరాలు.. శివగంగై జిల్లా తిరుభువనం సమీపంలోని మనప్పురం ఆలయంలో సెక్యూరిటీగా పనిచేస్తున్న అజిత్ కుమార్ను విచారణ పేరిట పోలీసు లాకప్ డెత్ చేసినట్టుగా వెలువడ్డ సమాచారం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగడంతో ఈకేసుతో సంబంధం ఉన్న తిరుభువనం పోలీసు స్టేషన్కు చెందిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. అదే సమయంలో విచారణ పేరిట మనప్పురం ఆలయం ఆవరణలోని గో శాల వద్ద అజిత్కుమార్ను విచక్షణా రహితంగా పోలీసులు చితక్కొట్టేస్తున్నట్టుగా వీడియో మంగళవారం వైరల్గా మారింది. అక్కడ పనిచేసే సిబ్బంది ఎవరో రహస్యంగా ఈ వీడియో చిత్రీకరించడంతో పోలీసు పైశాచికత్వం వెలుగులోకి వచ్చింది. తక్షణం ఆ ఐదుగురు పోలీసులను అరెస్టు చేస్తూ చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ఈ వ్యవహారంలో మానా మదురై డీఎస్పీ షణ్ముగ సుందరం హస్తం బయటపడింది. ప్రభుత్వం కన్నెర్ర వీడియో వైరల్ కావడంలో తక్షణం డీఎస్పీ షణ్ముగం సుందరంను సస్పెండ్ చేశారు. శివగంగై ఎస్పీ ఆశీష్ రావత్ను వీఆర్కు పంపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రామనాథపురం ఎస్పీ చాందీష్కు అదనంగా శివగంగై బాధ్యతలను అప్పగించారు. అదే సమయంలో విచక్షణ కోల్పోయి అజిత్పై పోలీసులు దాడి చేస్తున్న వీడియో మధురై ధర్మాసంనకు సైతం చేరింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మరీ అజిత్కుమార్ను విచారించాల్సిన అవశ్యం ఎందుకు వచ్చింది అని పోలీసు ఉన్నతాధికారులను న్యాయమూర్తులు ప్రశ్నించారు. అజిత్కుమార్ శరీరమంతా గాయాలు ఉన్నట్టు తేటతెల్లం కావడం బట్టి చూస్తే, ఈ కిరతకత్వానికి అనుమతి ఎవరు ఇచ్చారని మండిపడ్డారు. ఈ దాడి ఎవరు చేశారో, వారిపై తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, అజిత్కుమార్ పోస్టుమార్టం నివేదిక మేరకు 18 చోట్ల తీవ్ర గాయాలు ఉన్నట్టు, మెదడులో రక్తం గడ్డ కట్టడం, గుండెపోటు రావడంతో అతడు మరణించినట్టు వెలుగు చూసినట్టు విచారణ బృందం వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అన్నాడీఎంకే డిమాండ్ చేసింది. ఈ ఘటను సంబంధించి సమగ్ర వివరాలను బయట పెట్టాలని కోరుతూ ఈనెల 3వ తేదిన రాజరత్నం స్టేడియం వద్ద నిరసనకు తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్ పిలుపు నిచ్చారు. కాగా ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ స్పందిస్తూ, పోలీసుల తీరు వెలుగులోకి రావడంతో తక్షణం చర్యలకు ఆదేశించామన్నారు. సంబంధిత అధికారులను సైతం వదలి పెట్టేది లేదని, ఈ కేసు వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షిస్తామన్నారు. అజిత్ శరీరం అంతా గాయాలు ఐదుగురు పోలీసుల అరెస్టు డీఎస్పీ సస్పెన్షన్ వీఆర్కు ఎస్పీ -
మార్గన్ చాలా ప్రత్యేకం
తమిళసినిమా: విజయ్ఆంటోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యి, ఆ తరువాత కథానాయకుడు, ఎడిటర్, దర్శకుడు, నిర్మాత అంటూ పలు శాఖలలో సత్తా చాటుకుంటున్నారు. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించి తన విజయ్ ఆంటోని ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించి సంగీతాన్ని అందించిన చిత్రం మార్గన్. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ద్వారా ఎడిటర్ లియో జాన్పాల్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అజయ్ దిషాన్,ప్రధాన పాత్రను పోషించిన ఇందులో సముద్రఖని, మహానది శంకర్, ప్రితిక, బ్రిగిడ, బ్రిందా సాగా, వినోద్సాగర్, దీప్సీక తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రం గత నెల 27న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ మంగళవారం ఉదయం చైన్నెలో థ్యాంక్స్ మీట్ను నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న విజయ్ఆంటోని మాట్లాడుతూ తాను ఇంతకు ముందు చాలా సక్సెస్ఫుల్ చిత్రాలతో పాటు పలు ప్లాప్ చిత్రాలలోనూ నటించానని, అయితే మార్గన్ చిత్రం మాత్రం తనకు చాలా ప్రత్యేకం అని పేర్కొన్నారు. ఈ చిత్రం ద్వారా ఎడిటర్ లిమో జాన్ పాల్ను దర్శకుడిగానూ, తన చెల్లెలి కొడుకు అజయ్ దిషాన్ను యువ హీరోగానూ పరిచయం చేయడం సంతోషం అన్నారు. ఏ చిత్రం అయినా హీరో వల్లే ఆడదన్నారు. అది దేవుడు వచ్చి నటించినా ఆడదన్నారు. దర్శకత్వం, కథ సరిగా లేకపోతే ఏ చిత్రం సక్సెస్ కాదన్నారు. ఈ రెండు సరిగా ఉంటేనే విజయవంతం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.అందువల్ల ఏ చిత్రం సక్సెస్ అయినా,ఆ క్రెడిక్ట్ను దర్శకుడే చెందుతుందన్నారు. అలా ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడటానికి మొదటి కారణం దర్శకుడు లియో జాన్ పాల్నేనని పేర్కొన్నారు. ఆయన తన పనిని నిజాయితీగా చేశారన్నారు. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ ధన్యవాదాలు అన్నారు. ఇకపోతే ఇంతకు ముందు తాను ఎన్ని చిత్రాల్లో నటించినా, ఇకపై ఎన్ని చిత్రాల్లో నటించనున్నా, పిచ్చైక్కారన్ చిత్రానికి సమంగా ఏదీ ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.దర్శకుడు శశి ఆ చిత్ర కథ చెప్పగానే ఏడ్చేశానన్నారు.ఆ చిత్రాన్ని శశి దర్శకత్వంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తదుపరి తాను నటిస్తున్న శక్తి తిరుమగన్ విడుదల కానుందనీ, ప్రస్తుతం లాయర్ చిత్రంలో నటిస్తున్నట్లు విజయ్ ఆంటోని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసరి గణేశ్, ధనుంజయన్, శుశీంద్రన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. -
పదోన్నతులు కల్పించాలని ధర్నా
వేలూరు: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లకు సీనియారిటీ ప్రకారం ప్రభుత్వం పదోన్నతులు కల్పించాలని తమిళనాడు హయ్యర్ సెకండరీ పాఠశాల టీచర్ల సంఘం ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆ సంఘం జిల్లా కార్యదర్శి మంజుల అధ్యక్షత వహించారు. ఇండియన్ స్కూల్ టీచర్స్ ఫెడరేషణ్ అఖిల భారత కార్య నిర్వహక కమిటీ సభ్యులు జనార్ధనన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం సీనియారిటీ కలిగిన టీచర్లకు హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించాలని, పబ్లిక్ కౌన్సెలింగ్ ద్వారా ట్రాన్స్ఫర్లు కల్పించాలని కోరారు. అడ్మినిస్టేషన్ బదిలీ పేరుతో జరుగుతున్న అక్రమాలను నిలిపి వేయాలని, టీచర్లకు ఉద్యోగ భద్రత చట్టాన్ని అమలు చేయాలని, అరియలూరు జిల్లాలో పాఠశాల ఆవరణంలోనికి చొరబడి హెచ్ఎంకు హత్యా బెదిరింపులు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేయాలని తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ ధర్నాలో జిల్లా అధ్యక్షులు జయకుమార్, తమిళనాడు ప్రాథమిక పాఠశాల టీచర్స్ కూటమి జిల్లా కార్యదర్శి జోసెఫ్ అన్నయ్య, గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోషియేషన్ జిల్లా అద్యక్షులు సెల్వకుమార్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు జోషి, కార్యదర్శి దీన దయాళన్, ఇళంగో తదితరులు పాల్గొన్నారు. -
జోరువానలో డీఎంకే బహిరంగ సభ
యువతకు క్రీడా ఉపకరణాలు పంపిణీ తిరుత్తణి: జోరువానలో డీఎంకే బహిరంగ సభ నిర్వహించి, యువకులకు క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. డీఎంకే యువజన విభాగం తిరుత్తణి తూర్పు మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి డీఎంకే ప్రభుత్వం నాలుగేళ్ల పాలనపై అవగాహన కల్పించేందుకు బహిరంగ సభ నిర్వహించారు. ఆ పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కిరణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొన్నారు. గ్రామీణ మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సమావేశం మధ్యలో వర్షం వచ్చినా మహిళలు వేచివుండి ఆ పార్టీ ప్రచారకర్త సేలం సుజాత ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. పెద్ద వానలోనూ మహిళలు గొడుగుల సాయంతో డీఎంకే బహింరగ సభకు హాజరుకావడం ఆనందంగా ఉందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. బహిరంగ సభలో భాగంగా యువకులకు యువజన విభాగం ఆధ్వర్యంలో క్రీడా సామగ్రిని ఎమ్మెల్యే చంద్రన్ అందజేశారు. మండల కార్యదర్శి ఆర్తి రవి, యువజన విభాగం మండల కన్వీనర్ కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
టాస్మాక్ దుకాణంలో లంచం .. హెడ్కానిస్టేబుల్పై బదిలీ వేటు కొరుక్కుపేట: ప్రభుత్వ టాస్మాక్ దుకాణంలో వెయ్యి రూపాయలు లంచం తీసుకున్న ఓ హెడ్ కానిస్టేబుల్ను సాయుధ దళాలకు బదిలీ చేశారు . తిరువెన్న నల్లూరు పట్టణ పంచాయితీ ప్రాంతంలో ఒక ప్రభుత్వ టాస్మాక్ దుకాణం నడుస్తోంది. రాత్రి 9 గంటలకు తిరువెన్న నల్లూరు పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ పరంథామన్ దుకాణం నుంచి ఆమ్యామ్యా వసూలు చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో టాస్మాక్ దుకాణంలో పనిచేస్తున్న ఓ సేల్స్ మెన్ తలుపుతెరిచి బయటకు వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విల్లుపురం ఎస్పీ శరవణన్ హెడ్కానిస్టేబుల్ పరంథామన్ను విల్లుపురం సాయుధ పోలీసు దళానికి బదిలీ చేయాలని ఆదేశించారు. రిటైర్డ్ జడ్జి ఇంట్లో చోరీ చేసిన ముగ్గురి అరెస్టు తిరుత్తణి: రిటైర్డ్ జడ్డి ఫాంహౌస్లో చోరీ చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేసారు. వివరాలు.. కనకమ్మసత్రం సమీపం కావేరిరాజపురం వద్ద రిటైర్డ్ హైకోర్టు జడ్జి దినకరన్కు సొంతమైన 300 ఎకరాల పంటపొలం ఉంది. ఆ పొలంకు మధ్యలో ఫాంహౌస్ నిర్మించి తీరక సమయాల్లో వచ్చి వెళ్లేవారు. ఈక్రమంలో పాంహౌస్ మూసివుంచిన క్రమంలో జూన్ 15న ఫాంహౌస్ తాళం పగులగొట్టి దుండగులు ట్రాక్టర్ బ్యాటరీ, ఫ్యాన్లు చోరీ చేసుకెళ్లారు. ఎస్పీ శ్రీనివాస పెరుమాళ్ ఆదేశాలతో ప్రత్యేక బృందం ఎస్ఐ కుమార్ తన బృందంతో దర్యాప్తు చేపట్టింది. చేపట్లి తిరువలంగాడు సమీపం తోమూరు చెందిన ప్రభాకరన్(31), తిరుపతికి చెందిన సురేష్(29), రామజేరి గ్రామానికి చెందిన కమలకన్నన్(29) తదితరులను అదుపులోకి తీసుకుని వారి నుంచి కారు, బైకు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. వీఆర్కు తిరుత్తణి టీఎస్వో తిరుత్తణి: రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ముఠాతో సంబంధం కలిగివున్న తిరుత్తణి టీఎస్వోను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఆదేశించారు. వివరాలు.. రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రా సరిహద్దులోని తిరుత్తణి, పళ్లిపట్టు ప్రాంతాల్లో రేషన్కార్డుదారుల నుంచి బియ్యం అక్రమ రవాణా చేసే ఏజెంట్లు తక్కువ ధరలకు కొనుగోలు చేసి అధికారుల అండతో బస్సులు, కార్లు, రైళ్ల ద్వారా తరలిస్తున్నారు. ఈక్రమంలో తిరుత్తని టీఎస్వో వెంకటేశన్ రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే మహిళల వద్ద సెల్ఫోన్ ద్వారా మాట్లాడుతూ అసభ్య పదజాలం ఉపయోగించి తాను సూచిస్తున్న వ్యక్తులు మాత్రమే రేషన్ బియ్యం తరలించాలని, నెలకు సక్రమంగా డబ్బులు చెల్లిస్తున్న వారికి మాత్రమే అనుమతిస్తామని, తక్కిన వారిని అనుమతించనని, తనిఖీ చేసి వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆడియో కలకలం రేపింది. దీంతో టీఓస్వో వెంకటేశనన్ను విధుల నుంచి తొలగించి వెయిటింగ్ లిస్ట్లో వుంచి కలెక్టర్ ప్రతాప్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం తిరువళ్లూరు: ఒకే జట్టుగా తమిళనాడు పేరుతో గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై విసృతంగా ప్రచారం నిర్వహిస్తామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ స్పష్టం చేశారు. తిరువళ్లూరు జిల్లా కాకలూరులోని ఓ ప్రైవేటు మండపంలో విలేకరుల సమావేశాన్ని మంత్రి నాజర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాజర్ మాట్లాడుతూ ఒకే కూటమిలో తమిళనాడు పేరుతో రానున్న 45 రోజుల్లో ఇంటింటికీ వెళ్లి గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను వివరిస్తామన్నారు. తమ ప్రచారం ద్వారా ప్రభుత్వ పథకాలను, లబ్దిదారుల వివరాలను ప్రజలకు వివరించడంతో పాటూ 30 శాతం యువకులను పార్టీలోకి ఆకర్షిస్తామన్నారు. తమిళనాడు భాష, భూమి, ఆత్మభిమానం తదితర వాటిని పరిరక్షించడానికి తమ పోరాటం చేస్తామన్నారు. కులం, మతం పేరుతో రాజకీయం చేస్తున్న కొందరికి తమ ప్రచారం చెంపపెట్టులా మారుతుందన్నారు. ఈ సమావేశంలో తిరువళ్లూరు జిల్లా కన్వీనర్ తిరుత్తణి ఎమేమల్యే చంద్రన్, పొన్నేరి ఇన్చార్జ్ రమేష్రాజ్తో పాటూ పలువురు పాల్గొన్నారు. భర్త హత్య కేసులో భార్య, ప్రియుడి అరెస్టు అన్నానగర్: చైన్నె అశోక్ నగర్, హౌసింగ్ బోర్డు ఫ్లాట్ ఆన్లైన్ డెలివరీ ఉద్యోగి అయిన కలైయరసన్ (23)ను గత నెల 15వ తేదీన నరికి చంపారు. అతని భార్య వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలింది. కలైయరసన్ భార్య తమిళరసి, ఆమె తల్లి సంధ్య, సోదరులు శక్తివేల్, సంజయ్ సహా మరో ఐదుగురిని ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ స్థితిలో, అశోక్ నగర్ పోలీసులు తమిళరసి వివాహేతర ప్రియుడు అయిన పులియంతోప్కు చెందిన ప్రముఖ రౌడీ శరవణన్ను మంగళవారం అరెస్టు చేశారు. అతనిపై వివిధ క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయ మేనేజర్గా ఉన్న శంకరరామన్ హత్య కేసులో కూడా అతను ఉన్నాడు. కె.కె. నగర్కు చెందిన కదిరవన్ హత్య కేసులో కూడా అతను ప్రమేయం ఉందని దర్యాప్తులో తేలింది. -
తమిళనాడులో భారీ పేలుడు.. 8 మంది మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పటాకుల తయారీ ప్రముఖ కేంద్రం శివకాశిలోని ఓ గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సత్తూరులోని బాణసంచా యూనిట్పై దట్టమైన పొగ అములుకుంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని బాణాసంచా గోడౌన్ నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. తరచూ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.#JUSTIN சிவகாசி அருகே சின்ன காமன்பட்டி கோகுலேஸ் பட்டாசு ஆலையில் பயங்கர வெடி விபத்து #Sivakasi #FireAccident #News18Tamilnadu | https://t.co/3v5L32pLWJ pic.twitter.com/5g7GYG6V6d— News18 Tamil Nadu (@News18TamilNadu) July 1, 2025VIDEO Credits: News18 Tamil Nadu -
● రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు ●లో–ప్లోర్ బస్సులకు జెండా ఊపిన సీఎం ● పోలీసులకు పదోన్నతులు ● మెడికల్ ఆఫీసర్ల నియామకం ● శాంతి భద్రతలపై సమీక్ష
ఎలక్ట్రిక్ బస్సులకు జెండా ఊపుతున్న సీఎం స్టాలిన్ తమిళనాడులో ప్రభుత్వ రవాణా సంస్థలలో తొలిసారిగా మెట్రోపాలిటన్ ట్రానన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎలక్ట్రిక్ ప్రాజెక్టును రూ.47.50 కోట్లతో పూర్తి చేసింది. అప్గ్రేడ్ చేసిన వ్యాసర్పాడి ఎలక్ట్రిక్ బస్ వర్క్షాప్ సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం ప్రారంభించారు. రూ. 207.90 కోట్లతో సిద్ధంచేసిన 120 కొత్త ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులు సేవలకు సీఎం స్టాలిన్ శ్రీకారం చుట్టారు. సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించే విధంగా చైన్నె నగర భాగస్వామ్య ప్రాజెక్టు పరిధిలోని సీసీఐ అండ్ ఎస్యూఎస్పీ ఆధారంగా ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రాజెక్టుకు చర్యలు తీసుకున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో, మెట్రోపాలిటన్ ట్రాన్న్స్పోర్టేషన్ అథారిటీ కార్పొరేషన్ నేతృత్వంలో 625 కొత్త లో–ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులు నడిచేందుకు చర్యలు తీసుకున్నారు.ఇందులో భాగంగా వ్యాసర్పాడి, పెరుంబాక్కం, పూందమల్లి, తండయార్ పేట వర్క్ షాపులలో ఒప్పందం ఆధారంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు వీలుగా ప్రాజెక్టుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా రూ. 697 కోట్లు నిర్ణయించారు. ఎంపిక చేసిన ఐదు వర్క్షాప్లలో తగిన భవనాలు, మౌలిక సదుపాయాలు, ఛార్జర్లు , ఇతర నిర్మాణ పనులు, విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం అవసరమైన నిర్వహణ సౌకర్యం, కార్యాలయ పరిపాలన భవనం, సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు, కొత్త ట్రాన్న్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అలాగే అగ్ని ప్రమాదాల నివారణ లక్ష్యంగా మరిన్ని ఏర్పాటు చేశారు. ఒక్కసారి చార్జ్ చేసిన తర్వాత ఎయిర్ కండిషన్ రహితంగా 200 కి.మీ దూరం బస్సులు నడిపేందుకు తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం తొలిసారిగా మెట్రోపాలిటన్ ట్రానన్స్పోర్ట్ కార్పొరేషన్ నేతృత్వంలో వ్యాసర్పాడి ఎలక్ట్రిక్ బస్సు బస్ డిపోను రూ.47.50 కోట్లతో తీర్చిదిద్దారు. దీనిని ఉదయం జరిగిన కార్యక్రమంలో సీఎం స్టాలిన్ ప్రారంభించారు. అలాగే 120 కొత్త లో–ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రజలు ఉపయోగానికి తీసుకొస్తూ జెండా ఊపారు. కొత్త లో–ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. మెట్లు నేల ఎత్తు నుంచి 400 మి.మీ ఎత్తులో ఉంటాయి. సాంకేతిక సౌకార్యాల ఆధారంగా బస్సు నేల నుంచి మరో 250 మి.మీ ఎత్తును పెంచుకునే వీలుంది. దివ్యాంగులు సులభంగా కిందకు దిగేందుకు, సీ్త్రలు,పిల్లలు, వృద్దులు ఎలాంటి ఇబ్బంది అన్నది లేకుండా బస్సులలో ఎ క్కడం, దిగడానికి ఏర్పాట్లు చేశారు. అందరికీ సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించే విధంగా అన్ని ఏర్పాట్లతో ఎలక్ట్రిక్ బస్సులను సన్నద్దం చేశారు. ఈ బసుసలను నగరంలోని కన్నదాసన్ నగర్, ఆర్కే నగర్,సత్యమూర్తి నగర్, వల్లలార్ నగర్, యానైగౌని, సెంట్రల్, పల్వన్, వార్మెమోరియల్, అన్నా సమాధి, బ్రాడ్వే , నెహ్రూ స్టేడియం, పులియంతోపు, మూలక్కడై, వ్యాసర్పడి, పూందమల్లి, పెరంబూరు, పెరియ పాళయం, మనలి, తదితర మార్గాలు, ప్రాంతాలు, కలైంజ్ఞర్శత జయంతి స్మారక బస్టాండ్ కిలాంబాక్కం వైపుగా దూసుకెళ్లనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు శివ శంకర్, పికే శేఖర్బాబు, ఎంపీలు కళానిధి వీరాస్వామి, ఎమ్మెల్యేలు ఆర్డి శేఖర్, మూర్తి, ఎబినేజర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, అదనపు కార్యదర్శి కె. ఫణీంద్రరెడ్డి, ప్రభు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలు ప్రారంభం
●మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు కొరుక్కుపేట: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి . రెండు లక్షలకు పైగా కొత్త విద్యార్థులు కళాశాలల్లో చేరారు. గత మేలో ప్రారంభమైన అడ్మిషన్ల పక్రియ జూన్ నాటికి పూర్తి అయ్యింది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలల్లో సీట్లు నిండిపోయినప్పటికీ రిజర్వేషన్లు అధారంగా సీట్లు ఉన్నాయి. కళాశాల పరిపాలన తర్వలో ఆ సీట్లును భర్తీ చేయడానికి విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం ప్రతీ కళాశాలలో 100కి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి . వీటిని భర్తీ చేయనున్నారు . ఈ పరిస్థితిలో మొదటి సంవత్సరం విద్యార్థులు సోమవారం ఉత్సాహంగా కళాశాలలకు విచ్చేసి తమ తరగతి గదులకు వెళ్లారు. నగరంలోని రాజధాని కళాశాల, నందనం ప్రభుత్వ కళాశాల, వ్యాసార్పాడ , ఆర్కే నగర్ ప్రభుత్వ కళాశాలల సీనియర్ విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలికారు. అలాగే రాణిమేరీ కళాశాల , భారతీ కళాశాల, క్రిస్టియన్ ఉమెన్స్ కళాశాల, స్టెల్లా మేరీ కళాశాల, ఎథిరాజ్ కళాశాల, డిజి వైష్ణవ కళాశాల మొదలైన మహిళా కళాశాల విద్యార్థినులు కళాశాలల్లోకి ప్రవేశించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం కావడంతో బస్సులు , రైల్వే స్టేషన్లలో పోలీసులు అప్రమత్తంగా భద్రత విధుల్లో ఉన్నారు . కొన్ని ముఖ్యమైన ఆర్ట్స్ కళాశాలల ముందు కూడా పోలీసులను మోహరించారు. వేలం చీట్టిల పేరిట రూ.35 కోట్లు మోసం బాధితుల ఆందోళన తిరువళ్లూరు: వేలం చీట్టిలు, ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట వందలాది మంది నుంచి రూ.35 కోట్ల మేరకు వసూలు చేసి, ఉడాయించిన మహిళను అరెస్టు చేయడంతోపాటు తమ నగదును తిరిగి ఇప్పించాలని కోరుతూ బాధితులు మహిళ ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా పుట్లూరు ప్రాంతానికి చెందిన లూర్దుమేరీ తిరువళ్లూరు, పుట్లూరు, కాకలూరు, తిరునిండ్రవూర్, ఆవడి, పట్టాబిరామ్తోపాటు పలు ప్రాంతాల్లో వేలం చీట్టిలు, ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట సంస్థలను నిర్వహించి, వందలాది మంది నుంచి డిపాజిట్లు స్వీకరించారు. వేలం చీట్టిలు పూర్తిగా కట్టిన వారికి 2024 నుంచి డబ్బులు ఇవ్వలేదని తెలుస్తుంది. ఇదే విషయంపై పలుసార్లు లూర్దుమేరీ వద్ద కోరినా సరైన సమాధానం రాలేదు. ఈ క్రమంలో డిపాజిట్దారులు, వేలం చీట్టిలు వేసిన వారికి సోమవారం నగదు చెల్లిస్తామని లూర్దుమేరీ ప్రకటించారు. దీంతో బాధితులు సుమారు వంద మంది వరకు ఆమె ఇంటి వద్దకు రాగా ఇంటికి తాళం వేసి కనిపించింది. దీంతో మోసపోయామని భావించిన బాధితులు ఆమె ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. -
యాక్సెంచర్ లెర్న్ వాంటేజీతో ఐఐటీ మద్రాసు ఒప్పందం
కొరుక్కుపేట: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు (ఐఐటీ మద్రాసు)లోని యాక్సెంచర్ లెర్న్ వాంటేజ్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ అకాడమీ, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ అడ్వాన్సుడ్ ఆటోమోటివ్ రీసెర్చ్ సంయుక్తంగా ఆటోమోటివ్ ఓఈఎం, జీసీసీ కోసం ప్రత్యేక నైపుణ్య కార్యక్రమాలకు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. దీనిద్వారా ఆటోమోటివ్ను లక్ష్యంగా చేసుకుంది. ఈ మేరకు సోమవారం జరిగిన కార్యక్రమంలో యాక్సెంచర్ లెర్న్ వాంటేజ్ గ్లోబల్ లీడ్ కిషోర్ దుర్గ్, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి పాల్గొని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు , ఈ సందర్భంగా ఐఐటి మద్రాసులోని సెంటర్ ఫర్ అడ్వాన్సుడ్ ఆటోమోటివ్ రీసెర్చ్ (సీఏఏఆర్) ప్రొఫెసర్ ఇన్చార్జి కృష్ణన్ బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ సిఏఏఆర్ ద్వారా ప్రారంభించబడిన విద్యా –పరిశ్రమ భాగస్వామ్యం అన్ని పక్షాలకు విజయమంతం అయిన నమూనా అని , ఇది ఎస్డివి ల వంటి కొత్త రంగాలలో తదుపరి తరం శ్రామిక శక్తి నైపుణ్యాన్ని పెంచడానికి వీలు కల్పిస్తుంది అని యాక్సెంచర్ లెర్న్ వాంటేజ్తో భాగస్వామ్యం కావటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు (ఓఈఎంలు), గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు( జీసీసీలు) ఎస్డీవీ డొమైన్లో నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్ తీర్చడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అంతకు ముందు యాక్సెంచర్ లెర్న్ వాంటేజ్ గ్లోబల్ లీడ్ కిషోర్ దుర్గ్ మాట్లాడుతూ ఐఐటి మద్రాసులోని సీఏఏఆర్తో మా సహకారం గేమ్ –చేంజర్ గా నిలుస్తుందన్నారు. -
8న చైన్నెకి అమిత్ షా
● కోవైలో బల ప్రదర్శనకు పళని వ్యూహం సత్తా తెలియజేసేందుకు.. సాక్షి, చైన్నె: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 8న చైన్నెకు రానున్నారు. అదే సమయంలో కొంగు మండలంలో ప్రధాన కేంద్రంగా ఉన్న కోయంబత్తూరులో తన బలాన్ని చాటే ప్రదర్శనకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహ రచనకు సిద్ధమయ్యారు. వివరాలు.. బీజేపీ – అన్నాడీఎంకే పొత్తు మళ్లీ కుదిరినా, బల పడేందుకు సమయం పట్టేలా ఉంది. ఇందుకు కారణం బీజేపీ వర్గాలు ఓ వైపు అధికారంలోకి వస్తే సంకీర్ణ ప్రభుత్వం అన్న నినాదాన్ని అందుకోవడమే. దీనికి ప్రాంతీయ పార్టీలైన డీఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్లు ఇప్పటికే మద్దతు ఇచ్చాయి. అదే సమయంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా, సీఎం అభ్యర్థి ఎవరో అన్న విషయంలో గత వారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో కొత్తచర్చకు దారి తీశాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి సీఎం అభ్యర్థి అంటూ ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే, అమిత్ షా పళణిస్వామి పేరు ప్రస్తావించక పోవడం ఈ చర్చకు మరింత బలాన్ని చేకూర్చినట్లయ్యింది.తన పేరును సీఎం అభ్యర్థిగా అమిత్ షా ప్రస్తావించక పోవడాన్ని పళణి స్వామి తీవ్రంగా పరిగణించారు. ఈనెల 8వ తేదీన చైన్నెకు అమిత్ షా వస్తున్న సమయంలో తన బలాన్ని చాటే ప్రదర్శనకు కొంగు మండలంలోని ప్రధాన కేంద్రంగా ఉన్నకోయంబత్తూరును వేదికగా ఎంపిక చేసుకున్నారు. చైన్నెలో పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే అమిత్ షాకు అన్నాడీఎంకే బలం ఏమిటో, తన సత్తా ఏమిటో పరోక్షంగా నిరూపించే దిశగా కోయంబత్తూరులో భారీ ప్రదర్శనకు 7, 8 తేదీలలో పళణిస్వామి నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెల 7వ తేదీ నుంచి పళణిస్వామి రాష్ట్ర పర్యటనకు కోయంబత్తూరు నుంచి శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. ఇదే అదనపుగా ఈ పర్యటన తొలి రెండు రోజులు రాష్ట్రమే కోయంబత్తూరు వైపుగా దృష్టి పెట్టే విధంగా బల ప్రదర్శనకు వ్యూహరచన చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో పార్టీ వర్గాలు కొంగు మండలంలో భారీ జన సమీకరణకు సిద్ధమవుతున్నారు. చైన్నెకు వచ్చే అమిత్ షా నోటి నుంచి అన్నాడీఎంకే నేతృత్వంలో తమిళనాట అధికారం,సీఎం అభ్యర్థి పళని స్వామి అని పలికించే వ్యూహంతో ఈ బల ప్రదర్శన వేదిక కానున్నడం గమనార్హం. -
కానిస్టేబుళ్లకు హోదా
అనంతరం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో 21 మంది ఫస్ట్ గ్రేడ్ కానిస్టేబుళ్లకు చీఫ్ కానిస్టేబుల్ హోదా కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఈ హోదా దక్కించుకున్న వారికి సీఎం స్టాలిన్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అలాగే 2025–26 సంవత్సరానికి పోలీస్శాఖకు బడ్జెట్ నిధుల కేటాయింపునకు సంబంధించి వెలువడ్డ ప్రకటన మేరకు ఉద్యోగాలలో పదోన్నతుల దిశగా ఫస్ట్ క్లాస్ గార్డ్, చీఫ్ గార్డ్, స్పెషల్ అసిస్టెంట్లకు , ఇన్స్పెక్టర్ హోదాకు పదోన్నతికి కాలపరిమితి నిర్ణయించి అమలు చేయడానికి చర్యలు తీసుకున్నారు. జూలై ఒకటి నుంచి ఈ కాల పరిమితిమేరకు ప్రయోజనాలను కల్పించనున్నారు. 2026 పస్ట్ గ్రేడ్ పోలీసులను నియమించారు. ఈ సమయంలో 11,488 మంది పోలీసు తదుపరి ర్యాంకులు దక్కుతాయి. తాజాగా 21 మంది ఫస్ట్ గ్రేడ్ పోలీసులకు చీఫ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎన్. మురుగానందం, హోంశాఖ కార్యదర్శి ధీరజ్కుమార్, డీజీపీ శంకర్జివాల్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల కట్టడికి తీసుకున్న చర్యలను గురించి జిల్లాల వారీగా పోలీసు అధికారులతో సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. ఆయా జిల్లాల వారీగా పరిష్కరించిన కేసుల గురించి ఆరా తీశారు. నేరాల కట్టడికి మరింత విస్తృత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మెడికల్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు ద్వారా ఇండియన్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ హోమియోపతి విభాగానికి ఎంపిక చేసిన 115 మంది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు సీఎం స్టాలిన్ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలోమంత్రి ఎం సుబ్రమణియన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి సెంథిల్కుమార్, హోమియోపతి విభాగం కమిషనర్ ఎం విజయలక్ష్మి, మెడికల్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు చైర్పర్సన్ పి. ఉమా మహేశ్వరి తదితరులుపాల్గొన్నారు. -
విగ్రహాల తరలింపునకు తీర్మానం
కొరుక్కుపేట: చైన్నె రోడ్లకు అడ్డంగా ఉన్న ప్రముఖ నాయకుల విగ్రహాలను మరో చోటికి తరలించనున్నారు. సోమవారం జరిగిన కార్పొరేషన్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. చైన్నె కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి మేయర్ ప్రియా అధ్యక్షత వహించారు. డిఫ్యూటీ మేయర్ మహేష్ కుమార్, కమిషనర్ కుమార్ గురుభరన్ హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశానికి కేవలం 40 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. చైన్నె కార్పొరేషన్ బోర్డు విద్యార్థుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఇదిలా ఉండగా రోడ్లకు అడ్డంగా ఉన్న విగ్రహాలను మరోచోటికి తరలించేలా తీర్మానం చేశారు. ఇందులో జీఎన్ శెట్టి రోడ్డులో ఉన్న కలైవానర్ ఎన్ఎస్ కృష్ణన్ విగ్రహాన్ని కలైవానర్ అరంగం ప్రాంతానికి తరలించడానికి కౌన్సిల్ అనుమతి మంజూరు చేసింది. అలాగే ఎగ్మోర్ మ్యూజియం కాంప్లెక్స్లోని కన్నిమోరా పుస్తక దుకాణం ప్రవేశ ద్వారం వద్ద కార్లమార్క్స్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి లభించింది. తిరువాన్మాయూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని పార్కులో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి లభించింది. తమిళ అభివృద్ధి ఉద్యమ ప్రాంగణంలో దేవన్యా భావనార్ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి చైన్నె జిల్లా కలెక్టర్కు నిరభ్యంతర పత్రం ముంజూరు చేయడం, దిగంగత ఆర్చ్ బిషప్ నివసించిన వాడల్స్ రోడ్డు పేరును ఆర్చ్ బిషప్ ఎజ్రా సర్కునం రోడ్డుగా మార్చడం వంటి 110 తీర్మానాలు ఆమోదించారు. -
ఆధునిక సాంకేతికతతో మరింత అభివృద్ధి
సాక్షి, చైన్నె: ఆధునిక సాంకేతితను అందింపుచ్చుకుని ప్రతి రంగాన్నీ మరింత అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్లాల్సిన అవశ్యం ఉందని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. నేటి కాలంలో ప్రతి ఇంటి గణాంకాలు తప్పడం లేదని, బడ్జెట్ వేసుకుని మరీ జీవిత పయనాన్ని లాగే వారే ఎక్కువగా ఉన్నట్టు వివరించారు. చైన్నె మెట్రో రైల్ కార్పొరేషన్ ఆడిటోరియంలో సోమవారం 19వ జాతీయ గణాంక దినోత్సవ వేడుక జరిగింది. డేటా ఆధారంగా ప్రత్యేక అంశాలను సిద్ధం చేసే విధంగా రాష్ట్ర, జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీలలో విజేతలకు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా డిగ్రీ విద్యార్థుల కోసం నాన్ మొదల్వన్ పథకం ద్వారా అందిస్తున్న శిక్షణ, ఇందులో భౌతిక శాస్త్రం, గణిత విభాగంలో నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించి అవగాహన ఒప్పందాలు ఉదయ నిధి సమక్షంలో జరిగాయి. ఈ సందర్భంగా ఉదయనిధి ప్రసంగిస్తూ జాతీయ గణాంక దినోత్సవం గురించి గుర్తు చేస్తూ, అనేక మంది లెక్కలలో తడపడటం సహజమేని వివరించారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలు గణాంకాల వివరాలను వెల్లడించేవి అని పేర్కొంటూ, నేడు ప్రతి ఇంటికి గణాంకాలు తప్పనిసరి అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నెల వారీ బడ్జెట్, వార్షిక బడ్జెట్ అంటూ ప్రతి ఒక్కరూ గణాంకాలకు వేసుకుని ముందుకు సాగాల్సి ఉందన్నారు. తమిళనాడులో చాలా కుటుంబాలు లెక్కల ఆధారంగానే జీవనం సాగించడం అలవాటు చేసుకుని ఉన్నారన్నారు. గణంకాలు వివిధ కేటగిరిలుగా అభివృద్ది చెంది ఉన్నాయని గుర్తు చేస్తూ, అయితే, ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్ యుగంలో జీవిస్తున్నామన్నారు. దీనికి మరింత లోతైన డేటా అవసరం అని, కృత్రిమ మేధస్సుకే కాదు, మంచి కోసం కూడా ప్రభుత్వానికి ఖచ్చితమైన డేటా చాలా కీలకంగా పేర్కొన్నారు. ఇంటింటా గణాంకాలు తప్పనిసరి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రత్యేక విభాగం అందుకే నేడు గణాంకాల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఉన్నారని గుర్తు చేస్తూ, ఈ రంగంలో మరింత ఆధునిక సాంకేతికతను అందిం పుచ్చుకోవాలని సూచించారు. ద్రావిడ మోడల్ పాలనలలో ప్రభుత్వ పథకాలు మేరకు ప్రజలకు దరిచేరాయో, వారి జీవితాలలో ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నాయో అన్నది కూడా తెలుసుకునే విధంగా గణాంకాలు కీలకంగా ఉన్నాయని వివరించారు. ఈ విభాగం ఇచ్చే ఆధారాలతో ప్రతి అంశాన్ని ఆధారాలతో సహా గణాంకాల రూపంలో తెలియజేయడం జరుగుతున్నట్టు పేర్కొన్నారు. కొన్ని సార్లు కొన్ని గణాంకాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండదని గుర్తు చేస్తూ, వాస్తవ సామాజిక పరిస్థితి గురించి మరింత పరిశోధనల కోసం ఈ గణాంకాల ప్రాజెక్టు మరింత అభివృద్ధి చెందాలని సూచించారు. ప్రజలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలనుకుంటున్న, చేసే పాలకులకు ఈ విభాగం వెన్నెముకగా ఉండాలని పిలుపు నిచ్చారు. గణాంకాలు ఏం చెబుతున్నాయి? ఎలాంటి ట్రెండ్స్ ఉన్నాయి? అది ఏమి చూపిస్తున్నాయి? అన్నది సరిగ్గా అర్థం చేసుకుని, అవగాహన పెంచుకుని ఈ రంగం మరింత విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జె. జయరంజన్, ప్రణాళిక, అభివృద్ధి విభాగం అదనపు డైరెక్టర్, ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ మీనా, కమిషనర్ ఆర్. జయ, తమిళనాడు నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహణ డైరెక్టర్ క్రాంతి కుమార్ పాల్గొన్నారు. -
నెల్లయ్యప్పర్ సన్నిధిలో ఆణి బ్రహ్మోత్సవం
సాక్షి, చైన్నె : తిరునల్వేలిలో ప్రసిద్ధి చెందిన నెల్లయ్యప్పర్ ఆలయంలో ఆణి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం ఉదయం ఘనంగా ఉత్సవాలకు ధ్వజారోహణం వేడుక జరిగింది. పెద్దఎత్తున భక్త జనం తరలి రావడంతో ఆధ్యాత్మిక వాతావరణంలో నెల్లై పట్టణం మునిగింది. తిరునల్వేలి(నెల్లై) నగర నడి బొడ్డున నెల్లయ్యప్పర్, గాంధి మది అమ్మన్ పేరిట శివ, పార్వతిలు కొలువై ఉన్నారు. ఇక్కడ ఆణి ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ధ్వజారోహణం ఉదయం జరిగింది. స్వామి అమ్మవార్లకు ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. ధ్వజస్తంభం వద్ద శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. శివాచార్యులు ఉత్సవాలకు శ్రీకారం చుడుతు పతకాన్ని ఎగుర వేసి ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సవాలకు తరలి రానున్నారు. దీంతో ఇక్కడి ఉత్సవాల నిమ్తితం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలలో భద్రతను పెంచారు.ఈ ఉత్సవాలలో అత్యంత ముఖ్య ఘట్టం రథోత్సవం ఈనెల 8వ తేదీన జరగనుంది. ● ఘనంగా ధ్వజారోహణం -
విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం
వేలూరు: విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ ఎంతో అవసరమని భగవాన్ మహావీర్ దయానికేతన్ జైన్ పాఠశాల చైర్మన్ దిలీప్కుమార్జైన్ అన్నారు. కాట్పాడిలోనీ బీఎమ్డీ జైన్ పాఠశాల తొలిసారి పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు స్వాగతం పలికే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమంలు నిర్వహించి, విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేసి, ప్రసంగించారు. పాఠశాల విద్యలోనే విద్యార్థులకు క్రమశిక్షణను అలవాటు చేయాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంతోపాటు తల్లిదండ్రులపై ఆధారపడి ఉందన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదివేలా అలవాటు చేయాలే తప్ప, కఠినంగా శిక్షించి, ప్రతి నిమషం చదువుపైనే ధ్యాస పెట్టేలా చేయకూడదన్నారు. పాఠశాలతోపాటు ఇంటి వద్ద కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వారు ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రమశిక్షణ గల విద్యార్థులుగా ఎదుగుతారన్నారు. విద్యార్థులు వారి జీవితాలను ఆరోగ్యంగా ఉండేలా చూడాలన్నారు. ఇందుకు ప్రతిరోజూ యోగా చేయడం అవసరమన్నారు. పట్టుదల, క్రమశిక్షణ చిన్న వయస్సు నుంచే ప్రతి ఒక్కరికీ అవసరమని, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరన్నారు. ఇటీవల కాలంలో సెల్ఫోన్లకు చిన్నా పెద్దా తేడా లేకుండా బానిస అవుతున్నారని, ఆ వ్యసనం నుంచి బయటకు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ మాలతి, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వైభవంగా గ్రామోత్సవం
శ్రీకాళహస్తి: పట్టణంలోని ద్రౌపదీసమేత స్వామి ఆలయంలో జరుగుతున్న తిరుణాళలో భాగంగా సోమవారం అర్జున, ద్రౌపది, శ్రీకష్ణస్వాము గ్రామోత్సవం వైభవంగా సాగింది. ధర్మరాజుల గుడి వద్ద నుంచి ప్రారంభమైన గ్రామోత్సవంలో పోతురాజు కత్తి పట్టుకుని ముందు వెళుతుండగా అర్జున, ద్రౌపదీ, శ్రీకష్ణ ఉత్సవమూర్తులు అనుసరించారు. అర్జున మత్స్యయంత్ర ఛేదనం ద్రౌపదీ సమేత ధర్మరాజు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సొమవారం రాత్రి అర్జునుడు మత్స్యయంత్ర ఛేదనం ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విల్లంబులు ధరించిన అర్జునుడి ఉత్సవమూర్తికి సర్వంగ సుందరంగా అలంకరించి, వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. -
ఎంత హాయిలే చెల్లీ
తమిళసినిమా: తాము నటన ద్వారా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే తారలు మానసిక వినోదం కోసం అప్పుడప్పుడు జాలీగా విహారయాత్రలు చేస్తుంటారు. అది పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు. సుందరమైన ప్రదేశాల్లో విహరించడం మాత్రం కామన్. తాజాగా నటుడు సూర్య, జ్యోతిక దంపతులు సీషెల్స్లో వివరిస్తున్నారు. అలాగే నటి కాజల్ అగర్వాల్ భర్త, కొడుకు, చెల్లెలు నిషా అగర్వాల్ లోడుతో కలిసి ఇటీవల మాల్ దీవి మకి వెళ్లొచ్చారు. సందర్భం ఏమిటంటే కాజల్ అగర్వాల్ పుట్టినరోజు కావడమే. కాగా మాల్ దీవిలో కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్చులు, కొడుకు నెయిల్ కిచ్చులు, చెల్లెలు నిషా అగర్వాల్ కలిసి ఆనందంగా గడిపారు. భర్త బిడ్డతో మాల్ దీవిలోని సముద్ర తీరంలో జాలీగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా కాజల్ అగర్వాల్, చెల్లెలు నిషా అగర్వాల్ బికినీ దుస్తుల్లో స్మిమ్ చేశారు. అక్కడ ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలను నటి కాజల్ అగర్వాల్ తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలకు అభిమానుల నుంచి లైకుల వైరల్ కొనసాగుతోంది. కాగా నటి కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రను పోషించిన కన్నప్న చిత్రం ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఆ చిత్రంలో కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా నటించారన్నది గమనార్హం. అక్కాచెల్లెళ్ల జలకాలాటలు -
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటాలి
తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రతి డీఎండీకే కార్యకర్త అలుపెరుగని కృషి చేయాలని డీఎండీకే నూతన నియోజక్వర్గ ఇన్చార్జ్ల సమావేశంలో మండల సహాయ ఎన్నికల ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే నల్లతంబి పేర్కొన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగా డీఎండీకే తిరువళ్లూరు వెస్ట్ జిల్లాలోని నియోజకవర్గాలకు కొత్తగా ఇన్చార్జ్లు నియమించారు. వారి పరిచయ సమావేశం తిరుత్తణిలోని ప్రైవేటు కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ఇందులో మండల సహాయ ఎన్నికల ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే నల్లతంబి, జిల్లా ఎన్నికల ఇన్చార్జ్ ఏకాంబరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరువళ్లూరు, తిరుత్తణి, పూందమల్లి నియోజకవర్గాల ఇన్చార్జ్లు శరవణన్, కుమార్, శ్రీరామ్ తదితరులను పరిచయం చేసి మాట్లాడారు. ఎన్నికల్లో అధికారం కోసం డీఎండీకే సహాయం ప్రధాన పార్టీలకు అత్యంత అవసరమని, కూటమికి సంబందించి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, పార్టీ క్యాడర్ సమష్టిగా ఎన్నికలకు సిద్దం కావాలని, ఇందుకోసం బూత్ లెవల్ కమిటీ ఏర్పాటు చేసుకుని గ్రామీణ స్థాయిలో క్యాడర్ను ప్రోత్సహించి ముందుకు వెళ్లాలని సూచించారు. పట్టణ కార్యదర్శి శ్రీనివాసన్, మండల కార్యదర్శులు సురేష్, తెన్నరసు, సహా అనేక మంది పాల్గొన్నారు. -
అపూర్వ కలయిక
విద్యార్థులుగా తలోదారిలో వెళ్లి పోయి 45 ఏళ్లు తరువాత వృద్ధులుగా తాము చదువుకున్న తరగతి గదిలో కలుసుకున్న అపూర్వ ఘటనకు కనకమ్మసత్రం పాఠశాల వేదికగా మారింది. వివరాలు.. తిరుత్తణి సమీపంలోని కనకమ్మసత్రం ప్రభుత్వ మహాన్నత పాఠశాలలో 1980–81 విద్యా సంవత్సరంలో ప్లస్–2 చదువుకున్న 35 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. వారిలో చాలామంది ఉన్నత చదువులు పూర్తి చేసి ఆర్మీ, పోలీసులు, వైమానిక దళం, విదేశాల్లో వివిధ ఉద్యోగాల్లో స్థిరపడి ఇటీవల వారందరూ పదవీ విరమణ చేశారు. ఈక్రమంలో పాఠశాల మిత్రులను కలుసుకోవాలన్న వారిలో కొందరి తపనకు ఇతర మిత్రుల సహకారంతో అందరినీ ఏకం చేశారు. ఆదివారం పాఠశాల వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి కుటుంబీకులతో విచ్చేసిన పాఠశాల మిత్రులను చాలా కాలం తరువాత చూసి ఉద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా వారు సంతోషంతో ముచ్చటించుకుని వారి జీవితాల్లో విశేషాలు, ఘటనలను గుర్తు చేసుకున్నారు. దాదాపు 80 ఏళ్లు పైబడిన వారి పూర్వ విద్యార్థులను వేదికపై బహుమతులతో సత్కరించి వారి అశీస్సులు పొందారు. అందరూ ఉత్సాహంగా విద్యార్థులు మారి విద్యార్థులు, ఉపాధ్యాయుల అనుబంధాన్ని పంచుకుని సంతోషంగా గడిపి సాయంత్రం తిరుగు పయనమయ్యారు. –తిరుత్తణి -
పార్టీ వ్యవహారాలపై కనిమొళి దృష్టి
● విభాగాల వారీగా భేటీకి నిర్ణయంసాక్షి, చైన్నె: డీఎంకే ఉపప్రధాన కార్యదర్శి కనిమొళి కరుణానిధి పార్టీ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. పార్టీకి అనుబంధంగా ఉన్న విభాగాలతో సమావేశాలకు నిర్ణయించారు. సోమవారం పార్టీ సాహితీ విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు. డీఎంకేలో ఎంపీగా కనిమొళి తూత్తుకుడి రాజకీయ వ్యవహారాలు, ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. ఇది ఆమె నియోజకవర్గం కావడం ఇందుకు నిదర్శం. రాష్ట్ర పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా ఆమె ఉన్నప్పటికీ, ఢిల్లీ స్థాయి వ్యవహారాల మీద అధికంగా దృష్టి పెట్టే వారు. అలాగే, గతంలో తన చేతిలో ఉన్న మహిళా విభాగాన్ని బలోపేతం చేసే విధంగా నేటికి కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ పరిస్థితులలో కనిమొళికి డీఎంకేప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ప్రత్యేక ఛాంబర్ను ఏర్పాటు చేస్తూ అధ్యక్షుడు స్టాలిన్ చర్యలు తీసుకున్నారు. తనకు కేటాయించిన ఛాంబర్ నుంచి ఇక పార్టీ సంబంధిత వ్యవహారాలపై ఉపప్రధాన కార్యదర్శిగా ఆమె తీవ్ర వ్యూహాలకు పదును పెట్టనున్నారు. పార్టీలో పలు అనుబంధ విభాగాలు ఉన్న విషయం తెలిసిందే. వీటన్నింటిలోని నిర్వాహకులతో ఇక సమావేశాలనిర్వహణ, బలోపేతం దిశగా అడుగులతోపాటూ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయించే విధంగా కార్యాచరణలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా తొలిసారిగా సాహితీ విభాగం నేతలతో కనిమొళి సమావేశమయ్యారు. ప్రసంగించే క్రమంలో, సూచనలు ఇచ్చే క్రమంలో ఆమె లేచి నిలబడి మరీ నేతలకు మార్గదర్శనం చేయడం విశేషం. -
ప్రతిభా అవార్డుల ప్రదానం
వేలూరు: తిరువణ్ణామలై జిల్లాలోని జవ్వాది కొండపై ఏటా నిర్వహించే వేసవి ఉత్సవాలు ఆదివారం సాయంత్రంతో ముగిసింది. శని, ఆదివారాల్లో జరిగిన ఈ ఉత్సవాలకు అటవీ ప్రాంతం రైతులు వివిధ పంటలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. అదేవిధంగా అటవీ ప్రాంత యువకులకు, మహిలలకు, వేర్వేరుగా వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. బహుమతుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ తర్పగరాజ్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి ఏవా వేలు ముఖ్య అతిథిగా హాజరై వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జవ్వాది కొండపై అటవీ ప్రాంత ప్రజలను, విద్యార్థులను ఉత్సాహ పరిచేందుకు ఏటా వేసవి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు జవ్వాది కొండనుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధికంగా వచ్చార న్నారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా పుష్పాల ప్రదర్శన, పండ్లు ప్రదర్శన, ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలకు అవార్డుల సర్టిఫికెట్లను అందజేశారు. అదే విధంగా ప్రభుత్వ శాఖల ద్వారా లబ్దిదారులకు పథకాలను అందజేశారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు అటవీ ప్రాంత ప్రజల సంప్రదాయలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన శునకాలు వివిధ విన్యాసాలను చేసి పర్యాటకులను ఆకట్టుకుంది. అదే విధంగా అటవీ ప్రాంతంలోని మహిళలకు మారథాన్, దారం లాగుట, కబడీ వంటి వివిధ పోటీలు నిర్వహించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో జవ్యాది కొండపైకి రావడంతో కొండపై పర్యాటకులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గిరి, శరవణన్, డీఆర్ఒ రామ్ ప్రధీపన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అలరించిన సంగీత విభావరి
కొరుక్కుపేట: ప్రముఖ సంగీత గాయని నిత్యశ్రీ సంగీత కచ్చేరి ప్రేక్షకులను వీనుల విందు చేసింది. అలాగే రోబో శంకర్, స్టాండప్ కమెడియన్ విఘ్నేష్ విజయన్లు వినోద ప్రదర్శన అందరినీ ఆహ్లాదపరిచింది. శ్రీరంగంలో జీ– స్క్వాయర్ గ్రూప్ ఆధ్వర్యంలో జీస్క్వాయర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సినీ హాస్య ప్రముఖలతోపాటు సంగీత కళాకారులు పాల్గొని, తమదైన శైలిలో ప్రదర్శన ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 700 మందికి పైగా ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొని, ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా జీ స్క్వాయర్ నిర్వాహకులు మాట్లాడుతూ జీ స్క్వాయర్ జెన్ పేరుతో తిరుచ్చిలోని శ్రీరంగంలో ప్రిమియం రెసిడెన్షియల్ ప్లాట్, విల్లాలు ఏర్పాటు చేశామని, వీటికి విశేష స్పందన లభించి, 72 గంటల్లో రికార్డు స్థాయిలో ప్లాట్లను కస్టమర్లు బుక్ చేసుకున్నారని తెలిపారు. -
రైలులో 29 కిలోల గంజాయి సీజ్
వేలూరు: గంజాయి, హాన్స్ వంటి గుట్కా , మత్తు పదార్థాలు తరలించకుండా పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి తమిళనాడు మీదుగా వెల్లే రైలులో తరచూ తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా తిరుపత్తూరు జిల్లా జోలార్పేటకు వచ్చిన హాటియా ఎక్స్ప్రెస్ రైలును సోమవారం ఉదయం 3 గంటల సమయంలో తనిఖీ చేయగా రైలులోని ఫ్యాసెంజర్ పెట్టెలోని మరుగుదొడ్డిలో గంజాయి ప్యాకెట్లు మూడు ట్రావెల్ బ్యాగులో ఉన్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. వాటిలో మొత్తం 29 కిలోల గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ గంజాను ఎవరు, ఎక్కడ నుంచి తరలిస్తున్నారు అనే విషయాలు తెలియరాలేదు. వీటిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సీఈసీ వద్దకు పీఎంకే పంచాయితీ ● ఢిల్లీలో అన్బుమణి బిజీబిజీ సాక్షి, చైన్నె : పీఎంకేలో తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య అధికార వార్ తీవ్ర ఉత్కంఠగా అనేక మలుపులతో సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడ్ని తానే అని రాందాసు స్పష్టం చేస్తున్నారు.అ న్బుమణి వెన్నంటి ఉన్న వాళ్లను పార్టీ నుంచి తొలగించి, వారి స్థానంలో తన నమ్మిన బంటులను నియమిస్తూ వస్తున్నారు. అదే సమయంలో తానే పార్టీకి అధ్యక్షుడ్ని అంటూ తొలగించిన వాళ్లను అన్బుమణి మళ్లీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ పరిణామాలు పీఎంకేలో తీవ్ర గందరోళాన్ని సృష్టించి ఉన్నాయి. ఈ పరిస్థితులలో కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారా పార్టీని తన గుప్పెట్లో తెచ్చుకునేవ్యూహంలో అన్బమణి పడ్డట్టు సమాచారాలు వెలువడ్డాయి. తనకు కేంద్రంలోని బీజేపీ పెద్దల మద్దతు ఉన్న దృష్ట్యా, వారి ద్వారా పావులు కదిపి ఎ న్నికల కమిషన్ లో పంచాయతీ పెట్టి పార్టీని తన గుప్పెట్లో తె చ్చుకునే వ్యూహంలో అన్బుమణి ఉన్నట్టుగా ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు అన్బుమణి ఢిల్లీ వెళ్లినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. ఆయన మద్దతు దారులు పేర్కొంటున్న సంకేతాల మేరకు ఆయన ఢిల్లీ వెళ్లి కేంధ్ర ఎన్నికల కమిషన్ వర్గాలను కలిసినట్టు తెలుస్తోంది. పార్టీకి తానే అధ్యక్షుడ్ని అని,పార్టీ సర్వ సభ్య సమావేశం ద్వారా తనను ఎంపిక చేశారని, పార్టీకి ఉన్నఅధికారాలు, అధ్యక్షుడిగా ఎన్నికల కమిషన్ ద్వారా తనకు దక్కిన అధికారుల తదితర అంశాల గురించి ఎన్నికల వర్గాల దృష్టికి వివరాలు తీసుకెళ్లినట్టు సమాచారం. అంతే కాకుండా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాలతో పాటుగా పలువురు ముఖ్యులను కలిసేందుకు అను మతి కోరి ఉన్నట్టు పేర్కొనడం గమనార్హం. సదస్సు హిందూస్థాన్ వర్సిటీలో టెడెక్స్ పేరిట తొమ్మిది మంది నిపుణులను, వివిధ ఆవిష్కరణలను ఒకే వేదిక మీదకు తెస్తూ సోమవారం సదస్సు జరిగింది. యూఎస్కు చెందిన నాసా శాస్త్ర వేత్త డాక్టర్ రవి మార్క్ సహాయం, డాక్టర్ చొక్కలింగంలతో పాటుగా హిందూ స్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఛాన్సలర్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్, వైస్ చైర్మన్ డాక్టర్ అశోక్ జీ వర్గీస్లు పాల్గొని కొత్త ఆవిష్కరణలు, పరిణామం గురించి విశదీకరించారు. – సాక్షి, చైన్నె: ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ పనులను పరిశీలించిన మంత్రి కొరుక్కుపేట: చైన్నె వాల్ ట్యాక్స్ రోడ్డు, టానర్ తొట్టి వీదిలో ఉత్తర చైన్నె డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న కొత్త రక్త శుద్ది కేంద్రం, మింట్ ప్రాంతంలో నిర్మిస్తున్న 700 కొత్త ఇళ్లు, ఎలిఫెంట్ కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లు , కొత్త సాంఘిక సంక్షేమ కేంద్రం, క్రీడా సముదాయం అభివృద్ధి సహా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ పనులను మంత్రి పీకే శేఖర్ బాబు సోమవారం పరిశీలించారు. ఆ సమయంలో పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ తనిఖీలో గృహనిర్మాణం, పట్టణాభివృద్ది శాఖ సంయుక్త కార్యదర్శి కాకర్ల ఉషా తదితరులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య అన్నానగర్: విరుగంబాక్కం, సమీపం ఆళ్వార్ తిరునగర్, అంజుగం వీధికి చెందిన బాగేష్ కుమార్ (40) స్టేజ్ బిల్డర్గా పనిచేసేవాడు. గత కొన్ని నెలలుగా అతనికి సరైన ఉద్యోగం లేదు. ఈ కారణంగా, అతను తన పొరుగువారి నుంచి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో రుణదాతలు ఒత్తిడి చేసినట్లు తెలిసింది. తీవ్ర మనస్తాపానికి గురైన బాగేష్ కుమార్ ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి బాగేష్ కుమార్ మతదేహాం స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. తిరుత్తణి ఆడికృత్తిక ఏర్పాట్లపై సమీక్ష తిరుత్తణి: తిరుత్తణిలో ఆడికృత్తిక వేడుకల్లో పాల్గొనే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రత, తాత్కాలిక బస్టాండ్లకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టేందుకు వీలుగా మున్సిపల్ సమావేశంలో తీర్మానం ఆమోదించారు. వివరాలు.. తిరుత్తణి మున్సిపల్ చైర్పర్సన్ సరస్వతి భూపతి ఆధ్వర్యంలో సమావేశం సోమవారం నిర్వహించారు. కమిషనర్ బాలసుబ్రమణ్యం స్వాగతం పలికారు. ఇందులో 20 మంది సభ్యులు. మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆదాయ ఖర్చుల వివరాల నివేదిక సమర్పించారు. అనంతరం ఆగస్టు 16 ఆడికృత్తిక సందర్భంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంకు లక్షలాది మంది భక్తులు కావళ్లతో పాల్గొననున్న క్రమంలో మున్సిపల్ శాఖ ద్వారా పట్టణంలో పారిశుధ్య పనులతో పాటూ తాత్కాలిక బస్టాండ్లు, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, భక్తులకు కనీస సదుపాయాలు కల్పించాలని తీర్మానించారు. అలాగే కాలనీ పేరిట వున్న పేర్లను తొలగించి ప్రాంతం పేర్లు మార్చాలని తీర్మానించారు. అభివృద్ధి పనులకు వీలుగా నిధులు కేటాయించి తీర్మానం ఆమోదించారు.లాకప్ డెత్ రచ్చ సాక్షి, చైన్నె : శివగంగైలో జరిగిన లాకప్ డెత్ ఘటన రచ్చకెక్కింది. సెక్యూరిటీ అజిత్కుమార్ను పోలీసులు కొట్టిచంపేశారంటూ ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. శివగంగై జిల్లా తిరుబువనం సమీపంలోని మడప్పురం ఆలయంలో తాత్కాలిక సెక్యూరిటీగా పనిచేస్తున్న అజిత్ కుమార్(27)ను విచారణ పేరిట పోలీసులు వేధించి, చితక్కొట్టడంతో మరణించినట్టు ఆదివారం సమాచారం వెలుగు చూసింది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ కావడంతో ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. అయితే ఈ వ్యవహారం సోమవారం రచ్చకెక్కింది. కొందరు పోలీసులు వ్యవహరించే తీరుపై డీఎంకే కూటమిలోని పార్టీలు సైతం పెదవి విప్పడం గమనార్హం. సెక్యూరిటీని విచారణ పేరిట తీసుకెళ్లి కొట్టడం ఏమిటో అని వీసీకే నేత తిరుమావలవన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై డిమాండ్ చేశారు. ఇక, బీజేపీ, అన్నాడీఎంకే నేతలైతే ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేశారు. పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక, అన్నాడీఎంకే న్యాయ విభాగం తరఫున మద్రాసు హైకోర్టులో సుమోటో కేసు నమోదుకు విజ్ఞప్తి చేశారు. అలాగే మానవ హక్కుల కమిషన్ను సామాజిక కార్యకర్తలు ఆశ్రయించడంతో వ్యవహారం తీవ్ర రచ్చకెక్కినట్టైంది. శ్మశానంలో బ్రిడ్జి నిర్మాణ పనులపై ఫిర్యాదువేలూరు: శ్మశానంలో మృతదేహాలను తీసి వేసి బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు కలెక్టర్ సుబ్బలక్ష్మి వద్ద వినతిపత్రం అందజేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లో ప్రజా విన్నపాల దినోత్సవం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి వచ్చిన వినతీ పత్రాలను స్వీకరించారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఇందులో వేలూరు జిల్లాలోని కేవీ కుప్పం తాలుకా తుత్తితాంగల్ గ్రామానికి చెందిన ప్రజలు అందజేసిన వినతిలో పేర్కొన్న విధంగా తమ గ్రామంలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయని అయితే ఇందుకోసం తమ శ్మశానంలో ఉన్న మృతదేహాలను సైతం తవ్వేస్తున్నారని, ఫలితంగా తమకు రానున్న రోజుల్లో స్మశానం పూర్తిగా లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే లత ఇచ్చిన ఫిర్యాదులో సాగుబడి రైతులందరిని గుర్తించి వారికి వారికి తగిన గుర్తింపు కార్డులు మంజూరు చేసి కిసాన్ పథకం కింద రైతులకు రూ.12వేలు ఇప్పించాలని కోరారు. వినతులు స్వీకరించిన కలెక్టర్ అర్హులైన లబ్ధిదారులకు వివిధ శాఖల ద్వారా సంక్షేమ పథకాలను అక్కడిక్కడే అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ మాలతి, అధికారులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీలో చిన్నారుల భద్రతకు కమిటీలు
తిరువళ్లూరు: చిన్నపిల్లల భద్రత, బాల్య వివాహలను నిరోధించడానికి మున్సిపాలిటీలోని 27 వార్డులోనూ ప్రత్యేక కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఏర్పాటు చేయడానికి కౌన్సిలర్లు సహకరించాలని కోర్డినేటర్ మలర్విళి సూచించారు. తిరువళ్లూరు మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం సోమవారం చైర్పర్సన్ ఉదయమలర్పాండ్యన్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతోపాటు గత సమావేశంలో ప్రస్తావించిన అంశాలను చైర్పర్సన్ పరిష్కరించడంపై హర్షం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో పని చేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల సన్మానించడం శుభపరిణామని, ఇదే విధానాన్ని భవిషత్తులోనూ కొనసాగించాలని కౌన్సిలర్ జాన్ సూచించారు. అనంతరం చిన్నపిల్లల సంరక్షణ శాఖ అధికారి మలర్విళీ మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ కౌన్సిలర్లు సభ్యులుగా ఉండేలా చిన్నపిల్లల భద్రత, బాల్యవివాహాల నిషేధం, వెట్టిచాకిరిపై అధికారులకు సమాచారం ఇవ్వడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు అరుణజైకృష్ణ, జాన్,ఽథామస్, అయూబ్అలీ, సుమిత్రా వెంకటేషన్, శాంతిగోపి, వసంతి వేలాయుధం, ప్రభాకరన్, శానీటరి అధికారి మోహన్ పాల్గొన్నారు. -
డిసెంబర్ నాటికి కుత్తంబాక్కం బస్టాండ్
తిరువళ్లూరు: చైన్నెలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి సుమారు రూ.414 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కుత్తంబాక్కం బస్టాండ్ను డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామని మంత్రి శేఖర్బాబు స్పష్టం చేశారు. తిరువళ్లూరు జిల్లా కుత్తంబాక్కంలో సుమారు రూ.414 కోట్ల వ్యయంతో నూతన బస్టాండ్ పనులు చేపట్టారు. తిరుపతి, శ్రీకాళహస్తి, కడప, తిరుత్తణి, తిరుపత్తూరు, వేలూరు, బెంగళూరు, తిరువణ్ణామలై, హోసూరుతోపాటు సుమారు 20 ప్రాంతాలకు చెందిన బస్సులను ఇక్కడి నుంచే కొనసాగించనున్నారు. ఆ బస్టాండ్ పనులను మంత్రి శేఖర్బాబు పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు, తిరుపతి, హోసూరు, తిరుపత్తూరు తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచే రాకపోకలు సాగించడం ద్వారా చైన్నెకు ట్రాపిక్ ముప్పు తప్పుతుందన్నారు. ఇప్పటికే కిలాంబాక్కం నుంచి బస్సులు నడపడంతో సమస్యలు తగ్గుముఖం పట్టాయన్నారు. కిళాంబాక్కం నుంచి రైల్వే పనులు దాదాపు పూర్తయిన క్రమంలో మరో రెండు మూడు నెలల్లో రైల్వే సదుపాయం కిళాంబాక్కం నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతోపాటు మాధవరం బస్స్టాండు పనులు ఇంకా పూర్తి కాలేదన్న ఆయన, త్వరలోనే పూర్తి చేస్తామని, మెట్రో సదుపాయం కూడా వస్తుందన్నారు. కిళాంబాక్కం, మాధవరం, కుత్తంబాక్కం, చెంగల్పట్టు, మహాబలిపురం తదితర ప్రాంతాల్లోని బస్టాండ్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ట్రాపిక్ సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయన్నారు. కిళాంబాక్కం బస్టాండు నుంచి రాత్రి 11–12 గంటల మధ్యలో రవాణా సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్న మంత్రి, తక్కువ మంది ప్రయాణికులున్నా కిళాంబాక్కం నుంచి వేర్వేరు ప్రాంతాలకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి కాకర్ల ఉష, కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యే కృష్ణస్వామి పాల్గొన్నారు. -
అవినీతి కేసులో ముగ్గురి అరెస్టు
తిరువళ్లూరు: రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించడానికి రూ.75 వేలు లంచం తీసుకున్న స్పెషల్ తహసీల్దార్తో సహా ముగ్గురిని విజిలెన్స్ అధికారులు అరెస్టు చేసి, విచారణ చేపట్టారు. ఎన్నూరు నుంచి మహాబలిపురం వరకు రోడ్డు విస్తరణ, అవుటర్ రింగ్రోడ్డు నిర్మాణం కోసం తిరువళ్లూరు జిల్లా పోలీవాక్కం ప్రాంతానికి చెందిన వెల్వ్యూస్సేష్ సంస్థకు చెందిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.45 లక్షలు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. పరిహారం మొత్తాన్ని విడుదల చేయాలని పలుసార్లు ఆ సంస్థ మేనేజర్ అగస్టీన్ జోసెఫ్ కోరినా ఫలితం లేకుండా పోయింది. అయితే పరిహారం మంజూరు చేయడానికి రూ.లక్ష లంచం ఇవ్వాలని స్పెషల్ తహసీల్దార్ డిమాండ్ చేశారు. ఇందుకు సమ్మతించిన అగస్టీన్ జోసెఫ్ మొదట విడతగా రూ.75 వేలు ఇవ్వడానికి అంగీకరించి, విజిలెన్స్ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు లంచం మొత్తాన్ని ఎడ్వర్ట్ విల్సన్కు చెందిన బ్రోకర్లు కోమధినాయగం, వెల్లదురైకు ఇస్తుండగా విజిలెన్స్ డీఎస్పీ గణేషన్, ఇన్స్పెక్టర్ మాల నేతృత్వంలోని విజిలెన్స్ అధికారులు వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం వ్యవహరంలో స్పెషల్ తహసీల్దార్కు ప్రత్యక్ష ప్రమేయం ఉండడంతో ముగ్గురిని అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. -
డిఫెన్స్ ఔట్రీచ్
డిఫెన్స్ అకౌంట్స్ విభాగం నేతృత్వంలో 206వ ఔట్రీచ్ కార్యక్రమాన్ని చైన్నెలోని కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ తిరుచ్చి ఆర్మీ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించింది. కేంద్ర సహాయమంత్రి ఎల్ మురుగన్, కంట్రోలర్ డాక్టర్ మయాంక్ శర్మ, దక్షిణ భారత ఏరియా లెఫ్టినెంట్జనరల్ కరణ్ బీర్ సింగ్బ్రార్, అకౌంట్స్ కంట్రోలర ఐడీఎఎస్ టి జయ శీలన్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈసందర్భంగా 200 మంది అధికారులకు, ఫెన్షనర్లకు సంక్షేమా పంపిణీతో పాటూ వారి సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకున్నారు. 14 మంది పెన్షనర్లకుటుంబాలకు రూ. 1.50 కోట్లు విలువైన చెక్కును మంత్రి మురుగన్ అందజేశారు. అలాగే అంబులెన్స్ సేవలకు శ్రీకారం చుట్టారు. –సాక్షి, చైన్నె -
నాన్నా.. ఈ మెంటల్ టార్ఛర్ భరించలేకున్నా!
అన్నానగర్: తిరుప్పూర్ జిల్లా అవినాశిలోని కైకాట్టిపుదూర్ ప్రాంతానికి చెందిన అన్నాదురై బనియన్ కంపెనీ నడుపుతున్నాడు. ఇతని కూతురు రిదన్య ( 27). ఈమెకి కైకట్టిపుదూర్ లోని జయం గార్డె¯న్కు చెందిన కవింకుమార్కు మూడు నెలల క్రితం వివాహమైంది. శనివారం ఇంటి నుంచి కారు తీసుకెళ్లిన రిదన్య ఆ తర్వాత తిరిగి రాలేదు. ఇంతలో, మొండిపాళయం సమీపంలోని చెట్టిపుత్తూరులో కొబ్బరి చెట్లకు ఉపయోగించే పురుగుమందుల మాత్రలు మింగి రిదన్య తన కారులో మృతి చెంది కనిపించింది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న సేవూర్ పోలీసులు రిదన్య మతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం అవినాశి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. కుటుంబ వివాదం కారణంగా రిదన్య విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ముందు రిదన్య తన తండ్రికి వాట్సాప్ ద్వారా కొన్ని ఆడియోలను పంపింది. పోలీసులు వాటిని స్వా«దీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అందులో భర్త కవిన్కుమార్, మామగారు ఈశ్వరమూర్తి, అత్తగారు చిత్రాదేవి, ఆమెను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని పేర్కొంది. ఇకపై ఈ జీవితాన్ని గడపలేనని వెల్లడించింది. రిదన్యకు పెళ్లయి 3 నెలలే కావడంతో, ఆర్టీఓ దర్యాప్తు కూడా జరుగుతోంది. -
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
– గ్రామస్తుల రాస్తారోకో తిరువళ్లూరు: తిరుప్పాచ్చూర్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా స్పీడ్బ్రేకర్, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు ఆదివారం ఉదయం తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్ గ్రామంలో మూడు వేల కుటుంబాలు నివాసం వుంటున్నారు. ఈ గ్రామం మీదుగా వాహనాలు వేగంగా వెళుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమ ప్రాంతంలో స్పీడ్బ్రేకర్, హెచ్చరిక బోర్డు, రెఫ్లెక్ట్ బోర్డులను ఏర్పాటు చేయాలని పలుమార్లు గ్రామస్తులు అధికారులకు విన్నవించుకున్నారు. అయితే ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. ఈక్రమంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆదివారం ఉదయం రాస్తారోకోకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న తిరువళ్లూరు తాలుకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. వాహనాలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 40 నిమిషాల పాటు సాగిన ఆందోళనతో రెవెన్యూ అధికారులు వచ్చి గ్రామస్తుల సమస్యల ను పరిస్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
సంకీర్ణ ప్రభుత్వానికి ఆహ్వానం
– ప్రేమలత విజయకాంత్ సాక్షి, చైన్నె: రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ అన్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ మద్దతు ఇచ్చారు. తమిళనాడులో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని అమిత్ షా వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. ఇది అన్నాడీఎంకే వర్గాలకు షాక్లో పడేసినా, ఇతర పార్టీలకు మాత్రం ఆశాజనకంగానే మారాయి. తమిళనాడులో ఇంత వరకు సంకీర్ణప్రభుత్వం అన్నది అధికారంలోకి రాలేదు. ఈ దృష్ట్యా, అమిత్ చేసిన వ్యాఖ్యల నినాదానికి తమిళ మానిల కాంగ్రెస్ నేత, ఎంపీ జీకే వాసన్ మద్దతు ఇచ్చారు. ఇందులో తప్పే ముంది, అందరూ కలిసి కట్టుగా ప్రభుత్వం ఽఅధికారంలోకి రావడం కోసం శ్రమిస్తున్నామన్నారు. అధికారంలో సైతం అందరికి వాటా అన్నది అవశ్యమని వ్యాఖ్య లు చేశారు. ఆదివారం కోయంత్తూరులో ఇదే విషయంగా ప్రేమలత విజయకాంత్ మాట్లాడుతూ, తమిళనాడులో ప్రజలకు సుపరిపాలన అన్నది అందించాలంటే, ప్రజలకు మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవశ్యం ఉందన్నారు. అనేక రాష్ట్రాలలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయని, ఇక్కడ కూడా అధికారంలోకి సంకీర్ణ ప్రభుత్వం రావాల్సిన అవశ్యం ఉందన్నారు. దీనికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. కాగా డీఎండీకే నేత, ఎల్కే సుదీష్ కాంగ్రెస్ నేత నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం గురించి ఆమెను ప్రశ్నించగా, ఇది ఆయన వ్యక్తిగతం అని,పార్టీతో సంబంధం లేదని దాట వేశారు. -
నేరస్తులకు స్థావరంగా తమిళనాడు
– బీజేపీ మైనారీటీ విభాగం జాతీయ కార్యదర్శి వేలూరు ఇబ్రహీం తిరువళ్లూరు: డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత తమిళనాడు నేరస్తులు, దొంగలకు స్థావరంగా మారిపోయిందని బీజేపీ మైనారీటి విభాగం జాతీయ కార్యదర్శి వేలూరు ఇబ్రహీం ఆరోపించారు. తిరువళ్లూరు జిల్లా వెంగల్ రామరాజన్కండ్రిగ ప్రాంతానికి చెందిన హరిసతీష్(48). ఇతను బీజేపీ జిల్లా ట్రజరీగా విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలు అన్నానగర్లో చదువుతున్న క్రమంలో ప్రస్తుతం అక్కడే నివాసం వుంటున్నాడు. వారానికి ఒకసారి తన సొంత గ్రామానికి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం హరిసతీష్ ఇంట్లో చోరీ జరిగింది. దాదాపు 20 సవ ర్ల బంగారునగలు, 40 వేల నగదు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనపై బాధితుడు పిర్యాదు చేసిన క్రమంలో ఇంత వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాఫీని బాధితుడికి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే భాదితుడ్ని పరామర్శించిన వేలూరు ఇబ్రహీం వారికి అండగా వుంటామని హమీ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. -
పుష్ప సోయగం..భక్తజన పారవశ్యం
–బోయకొండ ఆలయంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణ చౌడేపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం సరికొత్త శోభతో భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. చూడగానే కట్టిపడేలా పుష్పాలంకరణతో సరికొత్త శోభ సంతరించుకుంది. ఆదివారం బెంగళూరుకు చెందిన కృష్ణప్ప కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రూ.3లక్షల విలువ చేసే పలు రకాల పుష్పాలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. దీంతో ఆలయం అంతా పుష్ప పరిమళ భరిత పుష్పాల కొత్తదనం..అందాలు భక్తులను కట్టిపడేశాయి. ఆషాఢ మాసంలో కర్ణాటక భక్తులు అమ్మవారి దర్శనం కోసం విరివిగా రావడం పరిపాటి. బెంగళూరు నుంచి పూలను తీసుకొచ్చి శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువ జామున వరకు ఆలయం లోపల, ఆలయం ముందు భాగం, చుట్టూ పరిసరాల్లో పూలతో అలంకరించారు. అనంతరం కుటుంబ సమేతంగా పూజలు చేయించారు. కోరిన కోర్కెలు ఫలించడంతో పుష్పాలంకరణ చేసి మొక్కుబడి చెల్లించినట్లు కృష్ణప్ప తెలిపారు. దాత కుటుంబ సభ్యులకు ఈఓ ఏకాంబరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు. -
ఆకట్టుకున్న తిమ్మన పారిజాతాపహరణం
కొరుక్కుపేట: తిమ్మన పారిజాతాపహరణం–మానసోల్లాస వ్యాఖ్యానం అనే అంశంపై ఆదివారం జరిగిన ఉపన్యాస కార్యక్రమం ఆధ్యంతం ఆకట్టుకుంది. వేదవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతినెలా నిర్వహిస్తున్న తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో 162వ ప్రసంగంగా తిమ్మన పారిజాతాపహరణం – మానసోల్లాస వ్యాఖ్యానంపై ఉపన్యసించేందుకు హైదరాబాద్కు చెందిన అన్నమాచార్య వాజ్మయ పరిశోధకులు గంధం బసవ శంకరరావు వక్తగా పాల్గొన్ని ప్రసంగించారు. చైన్నె టీ.నగర్లోని ఆంధ్రా క్లబ్ కృష్ణాహాలు వేదికగా సాగిన కార్యక్రమానికి తెలుగు సాహితీ ప్రియులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్యదర్శి కందనూరు మధు, అధ్యక్షుడు జేకే రెడ్డి, ఆస్కా మాజీ అధ్యక్షుడు ఎం.ఆదిశేషయ్య పాల్గొని బసవ శంకరరావును సత్కరించారు. -
కీలడి పరిశోధనలో మరో అడుగు
● సైన్స్ పరంగా నిరూపితం ● పుర్రెల ఆధారంగా ముఖ చిత్రం సాక్షి, చైన్నె: మదురై సమీపంలోని కీలడిలో ఏళ్ల తరబడి జరుగుతున్న పురావస్తు పరిశోధనలో తమిళులు మరో ముందడుగు వేశారు. సైన్స్ పరంగా తమిళ చరిత్రను నిరూపితం చేసే విధంగా బ్రిటన్ సహకారంతో విజయవంతం చేశారు. 2,500 సంవత్సరాల క్రితం తమిళులు ఎలా ఉండే వారో అన్నది పుర్రె ఆధారంగా బహిర్గతం చేశారు. మదురై సమీపంలోని కీలడిలో తమిళ సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణం పట్టే విధంగా పురాతన సంపదలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలుత 2013 నుంచి 2016 వరకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పరిశోధనలు చేసింది. పురావస్తు శాస్త్రవేత్త అమర్నాథ్ రామకృష్ణన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ పరిశోధన హఠాత్తుగా ఆగడం చర్చకు దారి తీసింది. దీంతో తమిళ సంస్కృతి, సంప్రదాయాలు, పురాతనలపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో 2016 నుంచి ఇక్కడ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక్కడ లభించిన వస్తువులను ఓపెన్ ఎగ్జిబిషన్లో ఉంచారు. అలాగే, ఇక్కడ బ్రహ్మాండ ఆడిటోరియం, ఎగ్జిబిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదే సమయంలో అమర్నాథ్ రామకృష్ణన్ బృందం పరిశోధన నివేదికను బహిర్గతం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఓ వైపు తమిళనాడు ప్రభుత్వం పట్టుబడుతూ వస్తోంది. అలాగే, ఈ వ్యవహారం మదురై ధర్మాసనంలో సైతం విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో కీలడి పరిశోదనలో మరో ముందుడుగు వేశారు. పుర్రెలతో ముఖ చిత్రం కీలడి పరిశోధనలో తమిళ చరిత్ర, సంస్కృతికి సంబంధించి ఎన్నో ఆధారాలు బయటపడ్డాయి. ఇందులో పుర్రెలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు మనుషులు ఎలా జీవించారో అన్న అంశానికి దర్పణం పట్టే విధంగా వారు ఉపయోగించిన ఎన్నో పరికరాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే, ఇక్కడ లభించిన పుర్రెల ఆధారంగా చేసుకుని 2,500 సంవత్సరాల క్రితం తమిళులు ఎలా ఉండే వారో అన్నది తాజాగా సైన్స్ పరిశోధనలో తేటతెల్లమైంది. మదురై కామరాజర్ వర్సిటీ, బ్రిటన్లోని జోన్ మోస్ వర్సిటీ ఈ పుర్రెల ఆధారంగా జరిపిన పరిశోధన విజయవంతమైంది. ఈ వివరాలను ఆదివారం వెలుగులోకి రావడంతో సీఎం స్టాలిన్ స్పందించారు. ప్రాచీన తమిళ సాహిత్యం గురించి వివరిస్తూ కీలడిలో జరిగిన పరిశోధనలు తాజాగా సైన్స్ ఆధారంగా సైతం నిరూపితమైందన్నారు. మన పూర్వీకులు ఎలా ఉండే వారో తాజాగా స్పష్టమైందని హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు మాట్లాడుతూ తమిళనాడు చరిత్ర, సంస్కృతి ఏమిటో అన్నది ఇకనైనా కేంద్రంలోని బీజేపీ పాలకులు గుర్తెరగాలని హితవు పలికారు. తమిళ చరిత్ర, సంస్కృతిని తుంగలో తొక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కేంద్రంలోని బీజేపీ పాలకులకు తాజాగా సైన్స్ సైతం ఇదే వాస్తవం అని నిరూపించిందన్నారు. తమిళనాడు చరిత్రకు ఆధారాలను సైన్స్ సైతం స్పష్టం చేసిందని, ఇకనైనా కేంద్రం అమర్నాథ్ నివేదికను తేటతెల్లం చేయాలని డిమాండ్ చేశారు. -
ముగిసిన ఏలగిరి ఉత్సవాలు
వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఏలగిరి వేసవి ఉత్సవాలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. ఏలగిరి వేసవి ఉత్సవాలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం నుంచి పడవ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళా సంఘాల నృత్య ప్రదర్శన, కబడ్డీ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ప్రదర్శనలో పర్యాటకులను ఆకర్షించే విధంగా వివధ పుష్పాలు, కాయగూరలతో ఏర్పాటు చేసిన వివిధ రకాల పక్షులు, చేపలు, డైనోసర్ పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా వివిధ పోటీల్లో గెలుపొందిన క్రీడా కారులకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లను మంత్రులు ఏవావేలు, పర్యాటక శాఖ మంత్రి రాజేంద్రన్, ఎంపీ అన్నాదురై, ఎమ్మెల్యేలు దేవరాజ్, నల్లతంబి, విల్వనాధన్, ఎస్పీ శ్రేయగుప్తా, జిల్లా అటవీశాఖ అధికారి మహేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి నారాయణన్ అందజేశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు: ఏలగిరి కొండపై అటవీ ప్రాంత ప్రజలచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. భరతనాట్యం, నయాండి మేలం, శునకాల విన్యాసాలు, కబడ్డీ పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాయగూరలతో ప్రదర్శన: కొండపై వివిద కాయగూరలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అటవీ ప్రాంత రైతులు వివిధ కాయగూరలను తీసుకొచ్చి నేచర్ పార్కు సమీపంలో పావురాలు, బాతులు, నెమలి వంటి ఆకారంలో తయారు చేసి ఉంచారు. -
హిర్దు హారూన్ హీరోగా టెక్సాస్ టైగర్
తమిళసినిమా: కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ప్రశంసలు అందుకున్న ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రం ఫేమ్ హిర్దు హారూన్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం టెక్సాస్ టైగర్. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడిన ఫ్యామిలీ చిత్రం ఫెమ్ సెల్వకుమార్ తిరుమారన్ కథ, దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. ఈ చిత్రాన్ని యూకే స్వార్డ్ పతాకంపై సుజిత్ బాలాజీకుమార్, భారతికుమార్ ,సెల్వకుమార్ తిరుమారన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలై చక్కని భావోద్వేగాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టెయినర్ కథాంశంతో కూడిన ఫ్యామిలీ చిత్రాన్ని వీరే నిర్మించడం గమనార్హం. ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందుతున్న టెక్సాస్ టైగర్ చిత్ర టీజర్ వీడియోను యూనిట్ వర్గాలు విడుదల చేశాయి. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అదేవిధంగా ఇప్పుడు ఈ టీజర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
25 నిమిషాలపాటు కర్రసాము
–యూనివర్సల్ అచీవర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం తిరువళ్లూరు: విరామం లేకుండా 25 నిమిషాలపాటు రెండువందల మంది విద్యార్దులు కర్రసాము విన్యాసాలను ప్రదర్శించి యూనివర్శల్ అచీవర్ బుక్ ఆఫ్ రికార్డులో స్తానం సంపాదించారు. తిరువళ్లూరు జిల్లా తిరువూర్ సూపర్ కింగ్స్, తిరునిండ్రవూర్ నటరాజన్ క్లబ్ విద్యార్ధిని విద్యార్దులు కర్రసాము విన్యాసాలను ప్రదర్శించి యూనివర్శల్ ఆచీవర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం కోసం ప్రయత్నం చేశారు. దాదాపు రెండు వంద మంది పాల్గోన్న కార్యక్రమంలో 25 నిమిషాల పాటు కర్రసాము స్టిక్కు రిబ్బన్ కట్టి విన్యాసాలను ప్రదర్శించారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన క్రమంలో వారికి రికార్డులో స్థానం దక్కింది. అనంతరం రికార్డులో స్థానం సంపాదించుకున్న సర్టిపికేట్ను కర్రసాము క్లబ్ నిర్వాహకులకు అందజేశారు. దీంతో పాలు కర్రసాము విన్యాసాలను ప్రదర్శించిన విద్యార్ధిని విద్యార్దులకు తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అరుణన్, పూండి పారెస్ట్ అధికారి మునస్వామి, క్లబ్ నిర్వాహకుడు సుందర్ తదితరులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కోచ్లు జయరామన్, రాజా, గుణ,విజయ్ఆనంద్, మేనేజర్ లోకేశ్వరి, తిరునిండ్రవూర్ క్లబ్ అద్యక్షుడు నటరాజన్, మాజీ యూనియన్ కౌన్సిలర్ దిలిప్రాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు. -
గృహాలకు విద్యుత్ చార్జీల వడ్డన లేదు
సాక్షి, చైన్నె: గృహ విద్యుత్ కనెక్షన్లకు ఎలాంటి చార్జీలను పెంచడం లేదని, రాయితీలు, ఉచిత పథకాలు కొనసాగుతాయని విద్యుత్, రవాణా మంత్రి ఎస్ఎస్ శివశంకర్ స్పష్టం చేశారు. ఏటా జూలై 1వ తేది నుంచి విద్యుత్ చార్జీలను పెంచే దిశగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2023లో గృహాలకు ఈ చార్జీలను పెంచ లేదు. 2024లో లోక్ సభ ఎన్నికల అనంతరం నామ మాత్రంగా చార్జీలను వడ్డించారు.తాజాగా జూలై 1వ తేది నుంచి వడ్డన కసరత్తులు మొదలైనట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా వడ్డన భారం ప్రజల నెత్తిన వేస్తే , సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోక తప్పదన్న విషయాన్నిగ్రహించిన పాలకులు వెనుకడుగు వేయడానికి సిద్దమయ్యారు. ఇందులో భాగంగా చార్జీల వడ్డనమీద వస్తున్న వార్తలు,సమాచారాలకు చెక్పెడుతూ ఆదివారంమంత్రి శివశంకర్ ప్రకటన చేశారు. విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి వస్తున్న సమాచారాలకు వివరణాత్మక వివరణ ఇది వరకే ఇచ్చామని గుర్తు చేశారు. మళ్లీ..మళ్లీ అదే ప్రచారం జరుగుతుండటంతో మరో మారు స్పష్టం చేయక తప్పడంలేదన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ మార్గదర్శకాల ప్రకారం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చార్జీలను నిర్ణయిస్తుంటుందన్నారు. అయితే, ఈ విషయంగా తాజాగా ఎలాంటి ఉత్తర్వులు అన్నది ఇవ్వలేదన్నారు. ఒక వేళ ఈ వ్యవహారంలో ఏదైనా ఉత్తర్వు జారీ చేసిన పక్షంలో, గృహల విద్యుత్ వినియోగ దారులకు ఎలాంటి సమస్య, ఇబ్బందులుఉండదని స్పష్టం చేశారు. గృహాలకు ఎలాంటి చార్జీల వడ్డన అన్నది ఉండదని స్పష్టం చేశారు. విద్యుత్ చార్జీ పెరుగుదల వల్ల ఎటువంటి ప్రభావం ఉండదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అందిస్తున్న 100 యూనిట్లు ఉచితంతో సహా అన్ని రాయితీలు, ప్రయోజనాలు కొనసాగుతాయని వివరించారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల గురించి అనవసరమైన పుకార్లను నమ్మ వద్ద అని కోరారు. ● మంత్రి శివశంకర్ స్పష్టం -
ఉల్లాసంగా ...ఉత్సాహంగా ..
● జైహింద్ పేరిట డచెస్ ఆల్ ఉమెన్ కార్ ర్యాలీ 2025 ● జెండా ఊపి ప్రారంభించిన నటి సుహాసినీ మణిరత్నం కొరుక్కుపేట: డ్రైవింగ్ నిబంధనలు , దేశభక్తి, సైనికులు, యోథులను గౌరవించడం, హ్యాపీనెస్, చైన్నె నగరం గొప్ప చరిత్రను తెలియజేసే లక్ష్యంతో ఆదివారం ఉదయం నిర్వహించిన ఇండియన్ ఆయిల్ –డచెస్ ఆల్ ఉమెన్ కార్ ర్యాలీ 2025కు విశేష స్పందన లభించింది. జైహింద్ పేరిట నిర్వహించిన ఈ కారు ర్యాలీని ప్రముఖ సినీనటి సుహాసినీ మణిరత్నం జెండా ఊపి ప్రారంభించారు . ఈ ర్యాలీలో 100కి పైగా కార్లు పాల్గొన్నాయి . జైహింద్ .. జైహింద్ అంటూ ముందుకు సాగిన ఈ కారు ర్యాలీ ఎంతో త్రిల్లింగ్తో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. చైన్నె ఆళ్వార్పేటలోని సవేరా ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈర్యాలీ తిరిగి అదేప్రాంతానికి సాయంత్రం 4 గంటలకు చేరుకుంది. ఈ సందర్భంగా డెచెస్ క్లబ్ నిర్వాహకురాలు నీనా రెడ్డి మాట్లాడుతూ డచెస్ క్లబ్ తరపున 24వ వార్షిక ఉమెన్ కార్ ర్యాలీని అనూహ్యమైన స్పందన లభించిందని అన్నారు. చైన్నె నగరవ్యాప్తంగా 50 నుంచి 65 కిలోమీటర్లు మేర ఈ కార్ ర్యాలీ సాగిందన్నారు. దేశభక్తి, సైనికులు, యోధులను గౌరవించడం ఇంకా డ్రైవింగ్ నిబంధనలు పాటించడం, మహిళలు సంతోషంగా గడపడం, నగర చరిత్రను తెలిపేలా ఏర్పాటైన ఈ కార్ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ దన్యవాదాలు తెలిపారు. అతిథులుగా ఐపీఎస్ అర్చణ మిశ్రా రామచంద్రన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉన్నినాయర్ , ఐఆర్పీఎఫ్ఎస్ విను సచిన్ , ఇంకా డచెస్ క్లబ్కు చెందిన సుజాత, అను అగర్వాల్, రథి,అను సచ్దేవ్ ఇండియన్ ఆయిల్ కు చెందిన రాజశేఖర్, ఏఏ మోటర్ స్పోర్ట్ అమిత్ అరోరా ఇంకా అఖిల, రోహిణీలు పాల్గొన్నారు . -
థాయ్ ఎయిర్లైన్స్ విమానం రద్దు
కొరుక్కుపేట: బ్యాంకాక్కు వెళ్తున్న థాయ్ ఎయిర్ లైనన్స్ విమానం ఆదివారం ఉదయం చైన్నె విమానాశ్రయంలో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా ఆదివారం విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని కారణంగా, బ్యాంకాక్ కు వెళ్లాల్సిన 164 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన థాయ్ ఎయిర్లైన్స్ విమానం శనివారం అర్ధరాత్రి 12 గంటలకు చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్కు చేరుకుంది. తరువాత చైన్నె నుంచి విమానం సాధారణంగా అర్ధరాత్రి 1.10 గంటలకు ప్రయాణికులతో బ్యాంకాక్కు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో విమానాన్ని నడిపే పైలట్ విమానంలో సాంకేతిక సమస్య ఉందని, దానిని మరమ్మతు చేసిన తర్వాతే వెళ్తుందని ప్రకటించారు. వారికి చైన్నె విమానాశ్రయ లాంజ్లలో వసతి కల్పించారు. తరువాత, ఇంజినీర్లు థాయ్ ఎయిర్లైన్స్ విమా నం ఎక్కి యాంత్రిక సమస్యలను సరిచేయడానికి ప్రయత్నించారు. అయితే ఉదయం 5 గంటల వరకు విమానంలో సంభవించిన యాంత్రిక సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాలేదు. ఫలితంగా, బ్యాంకాక్కు వెళ్లే థాయ్ ఎయిర్లైనన్స్ విమానం రద్దు చేశారని ప్రకటించారు. విమానాశ్రయంలోని ప్రయాణికులలో కలకలం రేపింది. అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే జగన్ మూర్తి ●పొరుగు రాష్ట్రాలకు నాలుగు బృందాలు సాక్షి, చైన్నె : తిరువేలంగాడులో బాలుడి కిడ్నాప్ కేసు సీబీసీఐడీకి దర్యాప్తును వేగవంతం చేసింది. ముందుస్తు బెయిల్ను కోర్టు నిరాకరించడంతో ఈ కేసులో కీలకంగా ఉన్న ఎమ్మెల్యే జగన్ మూర్తి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయనకోసం నాలుగు బృందాలను సీబీసీడీ ఉన్నతాధికారులు రంగంలోకి దించారు. తిరువేలంగాడులో బాలుడ్ని కిడ్నాప్ కేసు వ్యవహారంలో ఏడీజీపీ జయరాం, పురట్చి భారతం నేత, ఎమ్మెల్యే జగన్ మూర్తి ప్రమేయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం జగన్ మూర్తి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. పోలీసు విచారణకు ఆయన సహరించడం లేదని ఇప్పటికే కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాదులు వివరించారు. ప్రస్తుతం ముందస్తు బెయిల్ దక్కక పోవడంతో ఆయన్ని అరెస్టు చేయడం ఖాయం అన్నది స్పష్టమైంది. ఇదే అదనుగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటకలలో ఆయన తలదాచుకుని ఉండ వచ్చు అన్న సమాచారాలు వెలువడ్డాయి. అలాగే ఢిల్లీలో ఆయనకు కావాల్సిన బీజేపీ పెద్దలు సన్నిహితులుగా ఉన్న సమాచారంతో అటు వైపుగా సైతం సీబీసీఐడీ దృష్టి పెట్టింది. నాలుగు ప్రత్యేక బృందాలురంగంలోకి దిగి జగన్ మూర్తి కోసం వేట ముమ్మరం చేశాయి. ఆయన్ని సోమవారం అరెస్టు చేయవచ్చు అన్న సంకేతాల నేపథ్యంలో ఆయన నివాసం పరిసరాలు, ఆయన ప్రాతినిత్యం వహించే నియోజకవర్గం పరిధిలో ముందు జాగ్రత్తలను పోలీసులు విస్తృతం చేశారు. పోక్సో కేసులో ముగ్గురి అరెస్టు అన్నానగర్: నైల్లె సమీపంలో గతవారం 9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసినందుకు పోక్సో చట్టం కింద ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నైల్లె జిల్లాలోని మనూర్ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థినిని చంపేస్తామని బెదిరించిన అదే ప్రాంతానికి చెందిన కౌసర్ (20), అజార్ మైదీన్ (20), సదాం (20) ఆ పాఠశాల విద్యార్థిని పై సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పాలై పురనగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయం పై దర్యాప్తు చేసి కౌసర్, అజార్ మైదీన్, సదామ్ అనే ముగ్గురు వ్యక్తులను పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి పాలయంకోట్టై సెంట్రల్ జైలుకు తరలించారు. సముద్రంలో ఈదుతూ రీల్స్ విద్యార్థి మృతి తిరువొత్తియూరు: సోషల్ మీడియా లైకుల కోసం రీల్స్ వేటలో ఓ విద్యార్థి సముద్రంలో మునిగి న సమయంలో బండ రాయిఢీకొని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వివరాలు.. చైన్నె, ఎన్నూర్ అన్నై శివగామి నగర్కు చెందిన ప్రదీప్ (18)అతను ప్లస్ 2 పూర్తి చేసి కళాశాలలో ఉన్నత చదువులు చదవడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉండగా, శనివారం సాయంత్రం ప్రదీప్ ఎన్నూర్లోని పెరియకుప్పం బీచ్లో నలుగురు స్నేహితులతో కలిసి సముద్రంలో స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో, ప్రదీప్ సముద్రంలో స్నానం చేస్తూ, ఈత కొడుతున్న వీడియోను రికార్డ్ చేసి సోషల్ నెట్వర్కింగ్ సైట్లో రీల్స్ పోస్ట్ చేయాలని ప్లాన్ చేశాడు. ఆ ప్రకారంగా, ప్రదీప్ సముద్రంలోకి దూకి అలలలో ఈదుకుంటూ, ఒడ్డున ఉన్న తన స్నేహితులను ఈత కొడుతున్న వీడియో తీయమని అడిగాడు. ఆ సమయంలో, ఎదురు చూడని విధంగా పెద్ద అలలో చిక్కుకున్న ప్రదీప్ నీటిలో మునిగిపోయాడు. అదే సమయంలో ఒడ్డున ఉంచిన బండ రాయి ఢీ కొని తల గాయపడటం చూసి అతని స్నేహితులు దిగ్భ్రాంతి చెందారు. అతన్ని రక్షించి చికిత్స కోసం చైన్నెలోని స్టాన్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతన్ని పరీక్షించిన వైద్యులు ప్రదీప్ మార్గంమధ్యలోనే చనిపోయాడని గుర్తించారు. ఎన్నూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త చిత్రానికి గౌతమ్ కార్తీక్ రెడీ
తమిళసినిమా: పేరు మార్చుకుంటున్న నటుల్లో గౌతమ్ కార్తీక్ కూడా చేరారు. ఈయన ఇప్పుడు తన పేరును గౌతమ్ రామ్ కార్తీక్ అని మార్చుకున్నారు. ఈయన కొత్త చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి రెడీ అవుతున్నారు. వెరూస్ ప్రొడక్షన్న్స్ పతాకంపై తనిస్తాన్ ఫెర్నాడ్, రాజరాజెన్ గణనసంబంధం, సంజయ్శంకర్ సైక్ ముజీబ్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సూర్యప్రతాప్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన నాళైయ ఇయక్కనార్ సీజన్ 1 శిక్షణ పొందడంతో పాటు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన కోచ్చడైయాన్ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పని చేశారన్నది గమనార్హం. సైన్స్, ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో గౌతమ్ రామ్ కార్తీక్ పోలీస్ అధికారిగా నటించనున్నట్లు నిర్మాతలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దర్శకుడు సూర్యప్రతాప్ కథ చెప్పినప్పుడే ఆయన తన భావాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లగల ప్రతిభను గుర్తించామని తెలిపారు. లేకపోతే హాస్యంతో పాటు బలమైన పాత్రలోనూ తనను తాను నిరూపించుకున్న నటుడు గౌతమ్ రామ్ కార్తీక్ ఈ చిత్రం పోలీస్ అధికారిగా నటించనున్నారని ఇది ఆయన కెరియర్లోనే ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. ఈ చిత్రానికి అర్జున్ రాజా చాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, ఆ సమయంలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. -
క్లుప్తంగా
మినీ బజార్కు విశేష స్పందన కొరుక్కుపేట: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) గ్రేటర్ చైన్నె విభాగం, తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చైన్నె సంయుక్త ఆధ్వర్యంలో చైన్నె చూలైమేడు, గిల్ నగర్ ఎక్స్టెన్షన్లోని శ్రీహరి నిలయంలో ఆదివారం నిర్వహించిన మినీ బజార్కు విశేష స్పందన లభించింది. వామ్ గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలను పోత్సహిచడమే కాకుండా మధ్యతరగతి కుటుంబాలకు అవకాశం కల్పించడమే ఈ మినీ బజార్ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. మినీబజార్లో వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్, ఆభరణాలను ప్రదర్శనలో కొలువుదీర్చారు. మినీ బజార్కు వచ్చే సందర్శకులకు సిల్వర్ నుంచి డైమండ్ ఐటమ్స్ వరకు ప్రతి అరగంటకు ఒక లక్కీ డిప్ అందజేసినట్టు తెలిపారు. వామ్కు చెందిన సాయిచందన్, శ్రీహరి, బి.సాంబశివరావు, త్రినాథ్కుమార్, రాజశేఖర్, సుజాత పాల్గొన్నారు. మహిళ హత్య అన్నానగర్: సేలం జిల్లా సంగగిరికి చెందిన మణిమేగలై. మునిసిపాలిటీలో క్లీనర్గా పనిచేస్తున్న ఈమె కుటుంబ వివాదం కారణంగా భర్త నుంచి విడిపోయిన తర్వాత ఒంటరిగా నివసిస్తు వచ్చింది. ఈ స్థితిలో శనివారం సంగగిరి–తిరుచెంగోడు జంక్షన్ బ్రిడ్జ్ కింద మణిమేగలై రాయి దాడిలో హత్యకు గురైంది. సంగగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో సంగగిరి అక్కంపేటకి చెందిన అరుంధతియార్ వీధికి చెందిన కార్తీక్ (29)ను పోలీసులు అనుమానించారు. అతన్ని అరెస్టు చేసి విచారించినప్పుడు, అతను మణిమేగలైని హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. బైకు – లారీ ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతి అన్నానగర్: కృష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి సమీపం మాథుర్ పోలీస్ స్టేషన్, స్పెషల్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మహాలింగం, హెడ్ కానిస్టేబుల్ జాస్మిన్ మిల్టన్ రాజ్ అలియాస్ మిల్టన్, 7వ స్క్వాడ్ శిక్షణ, పోచంపల్లి పే బెటాలియన్, శనివారం రాత్రి పెట్రోలింగ్ విధుల్లో ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో, కోట్టూరు మారియమ్మన్ ఆలయంలో ఆడిట్ నిర్వహించి, పత్రాల పై సంతకం చేసిన తర్వాత, హెడ్ కానిస్టేబుల్ మిల్టన్, ట్రైనీ కానిస్టేబుల్ సుకుమార్ మాథుర్ ప్రాంతంలో ఆడిట్ నిర్వహించడానికి బైకుపై వెళ్లారు. వెనుక నుంచి వస్తున్న లారీ బైకు ను ఢీకొట్టింది. ఇందులో తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ మిల్టన్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక ఉన్న ట్రైనీ కానిస్టేబుల్ సుకుమార్ కిందపడి గుంతలో పడి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఇద్దరి లారీ డ్రైవర్లను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారికి కత్తి చూపించి బెదిరింపు – నగలు నగదు, అపహరణ ఇద్దరు అరెస్టు తిరువొత్తియూరు: దుకాణం యజమానికి కత్తిని చూపించి బెదిరింపులు ఇచ్చి నగదు నగలు అపహరించిన ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కాంచీపురం జిల్లా మనిమంగళం సమీపము వరదరాజపురం ప్రాంతానికి చెందిన మనివన్నన్ ఇతను తాంబరం ముడిచూర్ లో టీ దుకాణం నడుపుతూ ఉన్నాడు. ఇతని దుకాణంలో గుడియాత్తంకు చెందిన ధనుష్ అనే అతను పనిచేస్తున్నాడు. టీ దుకాణంలో నష్టం రావడంతో మనివన్నన్ గత 3 నెలలకు క్రితం దుకాణమును మూసివేశారు. ఈ క్రమంలో మణివన్నన్ వరదరాజపురంలో ఉన్న అతని ఇంటిలో వున్న సమయంలో అక్కడికి వచ్చిన దుకాణంలో పని చేసిన ధనుష్, అతని స్నేహితుడు విగ్నేష్ మనివన్నన్ కు కత్తిని చూపించి బెదిరింపులు ఇచ్చి గూగుల్ పే మూలంగా రూ. లక్ష బీరువాలో ఉన్న 6 సవర్ల బంగారు నగలు తదితర వస్తువులను చోరీ చేసుకుని ఇద్దరు పారిపోయారు. దీని గురించి మనిమంగళం పోలీస్ స్టేషన్లో మనివన్నన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్రోమ్ పేటలో ఉన్న స్నేహితుని ఇంటిలో దాగి ఉన్న ధనుష్ ,విగ్నేష్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి కత్తి, 6 సవర్ల నగలు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసులో అత్త అరెస్టు తిరువొత్తియూరు: ఆన్లైన్లో డెలివరీ ఉద్యోగి హత్య కేసులో అత్తను పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె అశోక్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న కలయరసన్ (23) ఆన్లైన్ డెలివరీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతని భార్య తమిళరసి కుటుంబ ఘర్షణతో భర్త నుంచి విడిపోయి తల్లితో ఉంటోంది. ఈక్రమంలో గత 15వ తేదీ హత్యకు గురయ్యాడు. పోలీసుల విచారణలో తమిళరసికి పులియందు తోపు ప్రాంతానికి చెందిన శరవనన్ వివాహతర సంబంధం ఉందని దీన్ని కలయరసన్ ఖండించడంతో అతను హత్య చేయబడినట్లు తెలియ వచ్చింది. ఈ కేసులో తమిళరసి సహోదరుడు రౌడీ శక్తి వేల్, మరో తమ్ముడు సంజయ్, స్నేహితుడు సునీల్ కుమార్, సంజయ్ సహా ఐదుగురిని పోలీస్ అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఈ కేసులో సంబంధం వున్న తమిళ అరసి తల్లి సంధ్యను పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న శరవనన్ కోసం పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. -
డీఎంకేతోనే ప్రయాణం
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే కూటమిలోనే తమ పయనం కొనసాగుతుందని ఎండీఎంకే కార్యనిర్వాహక సమావేశంలో తీర్మానించారు. సెప్టెంబర్ 15న తిరుచ్చి వేదికగా బ్రహ్మాండ పార్టీ బహిరంగ సభకు నిర్ణయించారు. ఎండీఎంకే కార్యనిర్వహక కమిటీ సమావేశం ఆదివారం చైన్నె ఎగ్మూర్లోని పార్టీ కార్యాలయం తాయగంలో జరిగింది. పార్టీ నేత అర్జున రాజ్ సమక్షంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ దురై వైగో, పార్టీ నేతలు , నిర్వాహకులు హాజరయ్యారు. జూన్ 22వ తేదీన మదురైలో జరిగిన మురుగన్ మహానాడులో అన్నా, పెరియార్లను కించ పరిచే విధంగా వ్యవహరించిన నిర్వాహకులను తీవ్రంగా ఖండిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. తమిళనాడు ప్రజల మత విశ్వాసాలను రాజకీయాలకు వాడుకుంటున్న శక్తులను తరిమి కొటేట దిశగా, బీజేపీ కుట్రలను భగ్నం చేయడానికి కార్యక్రమాలు విస్తృతంగానిర్వహించేందుకు మరో తీర్మానం చేశారు. 2026 ఎన్నికలలోనూ డీఎంకే కూటమిలోనే ఎండీఎంకే పయనం కొనసాగుతుందని స్పష్టం చేశారు.సెప్టెంబర్ 15న తిరుచ్చి వేదికగా అన్నా 117వ జయంతిని పురస్కరించుకుని బ్రహ్మాండ సభకు తీర్మానించారు. జూలై 1 నుంచి 17వతేదీ వరకు డివిజన్ల వారీగా పార్టీ నేతలతో సమావేశాలకు నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసి, ప్రజలలోకి చొచ్చుకెళ్లే కార్యక్రమాలు చేపట్టే విధంగా ఈ సమావేశంలో తీర్మానాలు చేశారు. పాఠశాలలలో వృత్తి విద్యా కోర్సులకు మంగళం పాడే విధంగా జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని ప్రత్యేకంగా తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించారు. ఎండీఎంకే భేటీలో నిర్ణయం సెప్టెంబర్ 15న తిరుచ్చిలో కాన్ఫరెన్స్ -
నిండు కుండగా మేట్టూరు
కావేరి ఉగ్ర రూపంతో మేట్టూరు జలాశయంలో నీటి మట్టం అమాంతం పెరిగి అన్నదాతల్లో ఆనందాన్ని నింపింది. ఆదివారం జలాశయం నీటి మట్టం 120 అడుగులను సమీపించడంతో ఉబరి నీటిని విడుదల చేస్తూ గేట్లు ఎత్తి వేశారు. ముందు జాగ్రత్తగా డెల్టాలోని ఎనిమిది జిల్లాలోని కావేరి తీర వాసులను అలర్ట్ చేశారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశాలతో తీరం వెంబడి దండోరా వేయించారు. ● ఉబరి నీటి విడుదల ● ‘డెల్టా’ వైపుగా కావేరి పరవళ్లు ● తెరచుకున్న మేట్టూరు గేట్లు ● తొమ్మిది జిల్లాలకు అలర్ట్ సేలం: కర్ణాటక నుంచి తమిళనాడు వైపుగా కావేరి నది పరవళ్లు తొక్కడంతో 120 అడుగులతో కూడిన డెల్టా అన్నదాతల వరప్రదాయిని మేట్టూరు జలాశయంలోకి నీటి రాక క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. నిర్ణీత జూన్ 12వ తేదీన జలాశయం నుంచి సాగు నిమిత్తం నీటిని విడుదల చేశారు. అదే సమయంలో గత రెండు మూడు రోజులుగా నదీ పరివాహక ప్రదేశాలు , కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కావేరి ఉగ్రరూపం దాల్చింది. కావేరి నదిలో హొగ్నెకల్ వద్ద సెకనుకు సుమారు 85 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. ఇది జలాశయంలోకి సుమారు 75 వేల క్యూ సెక్కులతో ప్రవేశిస్తున్నది. దీంతో శర వేగంగా జలాశయం నీటి మట్టం పెరిగింది. శనివారం రాత్రి సమయంలో 119 అడుగులను నీటిమట్టం దాటడంతో 16 స్లూయిస్ గేట్ల ఎత్తి వేసి నీటిని విడుదల చేశారు. నీటి ఉధృతి మరింతగా పెరగవచ్చు అన్న సంకేతాలతో ఆదివారం తిరుచ్చి రీజియన్ నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజనీర్ల బృందం జలాశయం,పరిసరాలలో పరిశీలన చేశారు. కావేరిలో నీటి ఉధృతి, మేట్టూరు జలాశయం నిండు కుండగాదర్శనం ఇవ్వడంతో ముందు జాగ్రత్తలపై ప్రభుత్వం ఆదివారం ఉదయాన్నే దృష్టి పెట్టింది. మేట్టూరు జలాశయం మీద ఆధార పడ్డ 13 జిల్లాలోని కావేరి ఉమ్మడి తాగు నీటి పథకాలకు నీటి పంపింగ్ విస్తృతం చేయడం, మరో 11 జిల్లాలోని 925 చెరువులకు నీటి మళ్లింపునకు సంబంఽధించిన పరిశీలన విస్తృతం చేశారు. తీరంలో అలర్ట్ ఆదివారం సాయత్రం నిర్ణీత 120 అడుగులకు నీటి మట్టం చేరడంతో ఉబరి నీటిని విడుదల చేస్తూ, ప్రధాన గేట్లను ఎత్తి వేశారు. ప్రస్తుతం 60 క్యూసెక్కుల వరదనీరు కిందికి ప్రవహిస్తోంది. ఈ నీటిని చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున డ్యాం వద్దకు చేరుకున్నారు. ఉబరి( మిగులు) జలాల ఉధృతి అధికంగా ఉండే అవకాశాలతో డెల్టా వైపుగా కావేరి తీరంలో ఉన్న జిల్లాల ప్రజలను అప్రమత్తం చేస్తూ చర్యలు చేపట్టారు. సేలం, ఈరోడ్, నామక్కల్, కరూర్, పెరంబలూరు, అరియలూరు, తిరుచ్చి, పుదుకోట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, కడలూరు జిల్లాల్లోని తీర గ్రామాల ప్రజలకు ముందు జాగ్రత్తలతో హెచ్చరికలు చేయిస్తూ దండోరా వేయించారు. అలాగే మేట్టూరు జల విద్యుత్ కేంద్రం వైపుగా వరద చొచ్చుకు రాకుండా, మేట్టూరు – ఎడపాడి మార్గంలోకి వరద నీరు చొరబడటంతో ఆ మార్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధానంగా రాత్రి సమయంలో నీటి ఉధృతి పెరిగిన పక్షంలో వచ్చే నీటిని పూర్తిగా బయటకు పంపించక తప్పదు. ఈ దృషౠ్ట్య, సేలం, ఈరోడ్ జిల్లాలోని లోతట్టు గ్రామాలలోకి వరద నీరు చొచ్చుకు వెళ్లే అవకాశాలు ఎక్కవ కావడంతో అక్కడి ప్రజలను మరింత అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్తలను విస్తృతం చేశారు. నివాసాలలోకి నీరు చొచ్చుకు వచ్చిన పక్షంలో అక్కడి ప్రజల కోసం శిబిరాలకు చర్యలు చేపట్టారు. భవానీ, కందన్ నగర్, అందియూరు కూడలి, పాలక్కరై , నేతాజీ నగర్, కొడుముడిలో పరిసర లలోకి వరదలు చొచ్చుకు రాకుండా చర్యలు విస్తృతం చేశారు. కావేరి నదీ తీరం వైపుగా వెళ్ల వద్దని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. కల్వర్టు మార్గాలను, వంతెనలు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని గ్రామాలలో దండోరా వేశారు. ఏ క్షణానైనా నీటి విడుదల శాతం మరింతగా పెరగవచ్చునని, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత ముందు జాగ్రత్తలతో ఉండాలని హెచ్చరించే పనిలో పడ్డారు. ఐదేళ్లుగా నిండు కుండగా.. 2021, 2022, 2023, 2024లలో నైరుతీరుతు పవనాలు కర్ణాకటలో కరుణించడంతో కావేరి పరవళ్లు తొక్కాయి. దీంతో మేట్టూరు జలాశయం నిండు కుండగా మారింది. కావేరి తీరం వైపుగా ఉబరి నీటిని బయటకు విడుదల చేశారు. గత రెండేళ్లుగా అయితే ఈ జలాశయం పలు మార్లు పూర్తిగా నిండింది. ప్రస్తుతం కూడా నిండు కుండగా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టాన్ని రాత్రి సమయంలో చేరడంతో ఉబరి నీటిని విడుదల చేశారు. ఈ దృష్ట్యా, కావేరి తీరప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఉబరి నీటిని సమీపంలోని చెరువులు, చిన్న చిన్నా ఆనకట్టులకు మళ్లీంచే విధంగా విస్తృత చర్యలకు ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. -
వైభవంగా గోమాతకు సీమంతం
కొరుక్కుపేట: ఆవును పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని నమ్ముతారు. గోమాతకు సీమంతం చేసి భక్తిని చాటుకున్న ఘటన చైన్నె నగరంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయ గోశాలలో ఆదివారం జరిగింది. చైన్నెకు చెందిన గోమాత సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ కన్యకాపరమేశ్వరి గోశాలలోని రెండు గోవులకు సీమంతం చేశారు.గోవులకు పసుపు కుంకుమ రాసి,గాజులు తొడిగి ,జడపట్టి కట్టి , కొత్త వస్త్రాలు సమర్పించి గోప్రదక్షిణలు చే శారు.ఈ గోమాత సీమంతం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు, పెద్దలు, చిన్నారులు పాల్గొని గోమాత సేవలో తరించారు. గోమాత సేవ సంస్థ వ్యవస్థాపక సలహాదారులు అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర రావు ,వ్యవస్థాపకులు దయాళం పుష్పాంబ నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది. -
అందరికీ రూ. 1000
● నిబంధనలు మరింత సడలింపు సాక్షి, చైన్నె: కలైంజ్ఞర్ మగళిర్ ఉరిమై తిట్టం( మహిళా హక్కు పథకం) అందరు మహిళలకూ వర్తింప చేసే అవకాశాలుఉన్నాయి. ఈ పథకం ఇది వరకు విధించిన నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అర్హులైన వారందరూ దరఖాస్తులు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఆదివారం ప్రకటన వెలువడింది.ఎన్నికల వాగ్దానంగా ఏడాదిన్నర్న క్రితం కలైంజ్ఞర్ మహిళ హక్కు పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలి విడతగా ఒక కోటి 6 లక్షల మందికి ఈ పథకం వర్తింపజేశారు. ఆ మేరకు అర్హులైన గృహిణులకు నెలకు రూ. వెయ్యి నగదు పంపిణీ జరుగుతోంది. అదే సమయంలో తమ కంటే తమకు లబ్ధి చేకూర లేదని పేర్కొంటూ 11 లక్షలమందికి పైగా మహిళా అప్పీలు దరఖాస్తులు దాఖలు చేసుకున్నారు. వీటిని సమగ్రంగా పరిశీలించి సుమారు 7. 35 లక్షల లక్షల మందికి వర్తింప చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. అయినా, తమ కంటే తమకు రావడం లేదని అప్పీలు చేసుకునే వారి సంఖ్య పెరిగింది. అదే సమయంలో కొన్ని నిబంధనల కారణంగా అర్హులైన మహిళలు ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. తక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులకూ.. మహిళా ఉద్యోగిణిలు, పెన్షనర్లు, పదవీ విరమణ పొందిన వారందర్నీ ఈ పథకంకు అనర్హులుగా గతంలో ప్రకటించారు. అలాగే కార్లు కలిగిన వారు, ఆదాయ పన్ను చెల్లించే వారి కుటుంబాలకు కూడా అవకాశం కల్పించ లేదు. ఈ పరిస్థితులలో ఈ పథకం విస్తరణ దిశగా జూలై 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్టాలిన్ మీతో కార్యక్రమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తమకంటే తమకు పథకం వర్తింప చేయాలన్న విజ్ఞప్తులు పెరగడంతో తాజాగా మూడు నిబంధనలను సడలించారు. ఈ మేరకు తక్కవ జీతాలు పొందుతున్న మహిళలు, పెన్షన్లు పొందతున్న మహిళలు, నాలుగు చక్రాల వాహనాలను కలిగిన కుటుంబాలకు చెందిన మహిళలు, వితంతు పెన్షన్లు పొందతున్నమహిళలు సైతం ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు అని ప్రకటించారు. ఈ పథకంలో నిజమైన అర్హులకు న్యాయం జరిగే విధంగా ఈ చర్యలు తీసుకుని నిబంధనలు సడలించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. -
పుదుచ్చేరి బీజేపీ అధ్యక్షుడిగా వీపీ రామలింగం
● జాన్కుమార్కు మంత్రి పదవి ● మరో ముగ్గురికి నామినేటెడ్ పదవులు సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి బీజేపీ అధ్యక్షుడిగా వీపీ రామలింగం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అలాగే పార్టీలో అసంతృప్తి ఎమ్మెల్యేగా ఉన్న జాన్కుమార్కు మంత్రి పదవి దక్కింది. మరో ముగ్గురికి నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులను కట్టబెట్టే దిశగా సిఫారసులు ఢిల్లీకి చేరాయి. 2021లో ఎన్ఆర్కాంగ్రెస్తో కలిసి ఎన్నికలలోకి వెళ్లిన బీజేపీ బ్రహ్మాండ విజయాన్ని దక్కించుకుంది. బీజేపీ – ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. ఎన్ఆర్కాంగ్రెస్ నేత రంగస్వామి సీఎంగా ఉన్నారు. అధికారంలో బీజేపీ భాగస్వామ్యంగా ఉంది. అయితే, గత వారం రోజులుగా పుదుచ్చేరి బీజేపీలో అనూహ్యమార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీలోని పార్టీ అధినేతల నుంచి వచ్చిన సమాచారంతో తొలుత ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. క్షణాలలో వీరి రాజీనామాను స్పీకర్ ఎన్బలం సెల్వం ఆమోదించారు. మరుసటి రోజే శనివారం మంత్రి పదవికి బీజేపీ ఎమ్మెల్యే సాయి శరవణ కుమార్ రాజీనామా చేశారు. అదే సమయంలో ఆదివారం బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికకు ఎన్నికల నిర్వహించారు. ఇందులో పార్టీలో 2021లో చేరిన వీపీ రామలింగం అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్దాఖలు చేశారు. ఇతరులు ఎవ్వరు నామినేషన్ దాఖలు చేయనిదృష్ట్యా,ఆ యన ఎంపిక ఏక్రగీవమైంది. కొత్త అధ్యక్షుడిగా ఆయన జూలై 2వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. జాన్కుమార్కు జాక్పాట్ బీజేపీలో ఆది నుంచి అసంతృప్తి ఎమ్మెల్యేగా జాన్కుమార్ వ్యవహరిస్తూ వచ్చారు. సాయి శరవణ కుమార్ రాజీనామాతో ఆయనకు తాజాగా అవకాశం కల్పించారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో పదినెలలు సమయం ఉన్న నేపథ్యంలో జాన్కుమార్కు మంత్రి పదవి కట్టబెట్టారు. అదే సమయంలో పార్టీకి చెందిన ముగ్గురు నేతలైన దీపయన్, సెల్వం, రాజశేఖర్లకు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులు కట్ట బట్టే దిశగా అధిష్టానానికి సిఫారసులు వెళ్లాయి. కేంద్ర హోం శాఖ ఆమోదంతో వీరిని నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా నియమించనున్నారు. ఇదిలా ఉండగా, బీజేపీలో సాగుతున్న పరిణామాల నేపథ్యంలో సీఎం రంగస్వామి వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. పూర్తిగా మంత్రి వర్గ పునర్ వ్యవస్తీకరణ దిశగా కసరత్తులలో ఉన్నట్టు సమాచారాాలు వెలువడ్డాయి. తమ పార్టీకి చెందిన పలువురు మంత్రులపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారిని తప్పించి అసంతృప్తితో ఉన్న వారికి పదవులు ఇచ్చే దిశగా వ్యూహాలకు పదును పెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా లెఫ్టినెంట్గవర్నర్ కై లాష్ నాథన్ను సీఎం రంగస్వామి కలవడం ప్రాధాన్యతకు దారి తీసింది. ఆయన సమయం ఇవ్వగానే మంత్రి వర్గ పునర్ వ్యవస్తీకరణ ప్రకటన, కొత్త వారి ప్రమాణ స్వీకారం ఒకే సమయంలో జరిగే దిశగా కసరత్తులు జరుగుతున్నాయి. -
నటిస్తే హీరోగానే..
తమిళసినిమా: నటుడు శింబు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన ఏ చిత్రంలో నటించినా సంచలనమే అవుతుంది. అదేవిధంగా కోలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన దర్శకుడు వెట్రిమారన్. ఈయన చిత్రాలు ఇతర చిత్రాలకు కంటే కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎండగట్టే కథాంశాలే ఈయన చిత్రాలకు కంటెంట్ అవుతాయి. ఈయన ఇటీవల తెరకెక్కించిన విడుదలై, విడుదలై 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తదుపరి చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. అలాంటి వారికి సంచలన న్యూస్ ఏమిటంటే నటుడు శింబు హీరోగా చిత్రం చేయబోతున్నారన్నదే. వీరి కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. కాగా ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇది ఇంతకు ముందు వడచైన్నె చిత్రంలో దర్శకుడు అమీర్ పోషించిన రాజన్ వాగైయరో పాత్రతో కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని సమాచారం. దీంతో ఈ చిత్రానికి రాజన్ వాగైయారో అనే టైటిల్ నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో దర్శకుడు నెల్సన్, నటుడు కవిన్ ప్రత్యేక పాత్రల్లో నటించనున్నట్లు, ఆండ్రియా ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం. చిత్ర షూటింగును వచ్చే వారంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే సోషల్ పొలిటికల్ కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. కేజీ చిత్రాన్ని కలైపులి ఎస్ ధాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని వెట్రిమారన్ చాలా టైట్ షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడే అవకాశం ఉందని సమాచారం. తమిళసినిమా: నటుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడుగా అశ్వద్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన డ్రాగన్ చిత్రం ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నటి ఖయాడు లోహర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఇందులో దర్శకుడు మిష్కిన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం దిగ్విజయంగా వంద రోజులు ప్రదర్శింపబడిన సందర్భంగా శనివారం సాయంత్రం చైన్నెలో శత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు, చిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక వర్గానికి జ్ఞాపికలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత అర్చన కల్పాతి మాట్లాడుతూ ఈ రోజుల్లో చిత్రం థియేటర్లలో వంద రోజులు ప్రదర్శింపబడటం సాధారణ విషయం కాదన్నారు. దాన్ని డ్రాగన్ చిత్రం సుసాధ్యం చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నటుడు ప్రదీప్ రంగానాథన్, దర్శకుడు అశ్వద్ మారిముత్తుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. మీరు చిత్ర పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి స్ఫూర్తిదాయకం అని ప్రశంసించారు.. చిత్ర విజయానికి కథే కింగ్ అని, ఈ విషయాన్ని వారు గుర్తించుకోవాలని అర్చన కల్పాతి పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ తాను దర్శకుడు అశ్వద్ మారిముత్తు మంచి మిత్రులు అన్నది తెలిసిందేన్నారు. అశ్వద్ మారిమాత్తు ఓ మై కడవులే చిత్రం చేస్తున్నప్పుడు అందులో తనను ఒక పాత్రలో నటించడానికి పిలిచారన్నారు. అయితే తాను నటిస్తే హీరో గానే నటిస్తానని ఆయనతో చెప్పాను అన్నారు. ఆ తర్వాత తాను కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన లవ్ టుడే చిత్రాన్ని విడుదలకు ముందు అశ్వద్ మారిముత్తుకు చూపించానన్నారు. అప్పుడు తనను కథానాయకుడిగా చిత్రాన్ని చేస్తావా ఆయన్ని అడిగానన్నారు. అలా లవ్ టుడే చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించిన తర్వాత చేసిన చిత్రం డ్రాగన్ అని చెప్పారు. నువ్వు దర్శకత్వ వహించి కథానాయకుడిగా నటించి విజయం సాధించావు ఇతరుల దర్శకత్వంలో నటించి సక్సెస్ కాగలవా అని మాట్లాడిన వారికి ఈ చిత్ర విజయం సమాధానమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు రుణపడ్డానని ప్రదీప్ రంగనాథన్ పేర్కొన్నారు. శింబు, వెట్రిమారన్ కాంబో షురూ -
రాందాసు ప్రాణాలకు ముప్పు
సేలం: అన్బుమణి మద్దతుదారుల నుంచి రాందాసు ప్రాణాలకు ముప్పు ఉందని సేలం పశ్చిమ నియోజకవర్గం పీఎంకే ఎమ్మెల్యే అరుల్ ఆరోపించారు. రాందాసును కించపరచడం మానుకోవాలని అన్బుమణిని హెచ్చరించారు. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న అధికార సమరం గురించి తెలిసిందే. పార్టీ వర్గాలు, ముఖ్యులు, ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారు. రాందాసు వెన్నంటే సీనియర్లు, ముఖ్యులైన ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే సమయంలో రాందాసును టార్గెట్ చేస్తూ అన్బుమణి విమర్శలు గుప్పిస్తుండడంతో మీడియా ముందుకు ఆదివారం ఎమ్మెల్యే అరుల్ వచ్చారు. అన్బుమణిని హెచ్చరించే విధంగా వ్యాఖ్యల తూటాలను పేల్చారు. రాందాసువి పిల్ల చేష్టలుగా అన్బుమణి పేర్కొనడాన్ని ఖండించారు. అన్బుమణి రామదాస్ కారణంగా గత 15 సంవత్సరాలుగా వరసుగా పార్టీ పతనం వైపు వెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్ప నాయకుడైన రాందాసును అన్బుమణి అవమానకరంగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పార్టీకి పూర్వవైభవం మళ్లీ రావాలంటే 2026 ఎన్నికల్లో రాందాసు నేతృత్వంలో పార్టీ ముందుకు సాగాల్సిన అవశ్యం ఉందన్నారు. కాగా ఇతరులు అవమానించినా, కించ పరిచినా, మనం మాత్రం ఎవర్ని బాధ కలిగించకుండా వ్యవహరించాలని ఆదివారం తైలాపురంలో జరిగిన సోషల్ మీడియా పార్టీ ప్రతినిధుల సమావేశంలో రాందాసు సూచించడం గమనార్హం. ఎమ్మెల్యే అరుల్ ఆరోపణ అన్బుమణికి హెచ్చరికలు -
భగవద్గీతతో అద్భుతమైన పరివర్తన
కొరుక్కుపేట: భగవద్గీతలోని అంతరార్థాన్ని అర్థం చేసుకున్న వారి జీవితంలో అద్భుతమై పరివర్తన వచ్చి తీరుతుందని ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు, ఆథ్యాత్మిక ప్రబోధకులు, గురువు శ్రీ వివేకానంద ఉపదేశించారు. ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్, ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటీఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు ఏర్పాటు చేసిన ఆత్మజ్ఞానం సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఆథ్యాత్మిక సదస్సుకు గురువు శ్రీవివేకానంద విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆత్మచైతన్యంపై సమగ్ర అవగాహననే జ్ఞానం అని పేర్కొన్నారు. అలాగే సత్యం, జ్ఞానం అనేది తెలుసుకుంటే జీవితం ఎంతో బాగుంటుందన్నారు. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనది లేనే లేదన్నారు. రెండు దశాబ్దాలుగా భగవద్గీత, గరుడపురాణం తదితర గ్రంథాల్లోని సారాంశాన్ని అందరికీ ఉపదేశిస్తున్నట్టు తెలిపారు. ప్రతి మానవడు భగవద్గీత అర్థం చేసుకోవాలన్నారు. దాన్ని అర్థం చేసుకుంటే వారి జీవితంలో అద్భుత పరివర్తన వచ్చి తీరుతుందని తెలిపారు. అనంతరం గురువు వివేకానందను డబ్ల్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీమోహనరావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సంధ్య, సాంబశివరావు, ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ప్రతినిధి సుభాషిణి పాల్గొన్నారు. -
శేష వాహనంపై పరాశరేశ్వరస్వామి
నారాయణవనం: టీటీడీ అనుబంధంగా ఉన్న చంపకవళ్లీ సమేత పరాశరేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం రాత్రి స్వామివారి ఉత్సవర్లు శేషవాహనంపై అధిష్టించి పురవీధుల్లో విహరించారు. ఉదయం ఆలయాన్ని తెరచిన అర్చకులు పరివార దేవతలకు, మూలవర్లకు అభిషేకాలు, నిత్య కై ంకర్యాలు చేపట్టారు. 10 గంటలకు చంపకవళ్లీ, పరాశరేశ్వర్లుకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూప, దీప నైవేద్యాలను సమర్పించి, భక్తులకు ప్రసాదాలను వితరణ చేశారు. సాయంత్రం కై ంకర్యాలను అందుకున్న ఉత్సవర్లు శేష వాహనాన్ని అధిరోహించారు. సర్కారు హారతి అందుకున్న దేవేరులు గ్రామోత్సవంలో విహరిస్తూ భక్తుల నుంచి హారతులు అందుకున్నారు. కార్యక్రమాలను స్థానిక ఆలయాల ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ ధర్మయ్య, ఆలయ అధికారి నాగరాజు, ఆర్జితం అధికారి భరత్ తదితరులు పర్యవేక్షించారు. ఉత్సవాల్లో అయిదో రోజు ఆదివారం రాత్రి స్వామివారు నంది వాహనం అధిష్టించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. -
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,229 మంది స్వామి వారిని దర్శించుకోగా 30,559 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.02 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
శ్రీసిటీలో అన్నమాచార్య సంకీర్తనలు
శ్రీసిటీ (సత్యవేడు) : శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో శ్రీఅన్నమయ్య పదామత వర్షణిశ్రీ కార్యక్రమం శనివారం సంగీత ప్రియులను అలరించింది. హైదరాబాదుకు చెందిన ప్రఖ్యాత అన్నమాచార్య పండితుడు గంధం బసవ శంకరరావు వ్యాఖ్యాతగా అన్నమయ్య కీర్తనలు, రచనల గొప్పతనాన్ని వివరించారు. ఆయనకు తోడుగా నెల్లూరుకు చెందిన కుమారి మల్లాది అనూష కొన్ని అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. స్ఫూర్తిదాయక కార్యక్రమానికి శ్రీసిటీ –శ్రీవాణి వేదిక కావడం తమకు గర్వకారణమని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. కళాకారులను ఇతర బృంద సభ్యులను ఆయన అభినందించారు. నిర్వాహకుల తరపున తిరుపతి శ్వేతా మాజీ డైరెక్టర్ భూమన్, ఎస్కే యూనివర్సిటీ మాజీ ఉప కులపతి కుసుమకుమారి కళాకారులను సత్కరించారు. కార్యక్రమానికి పళ్లేటి బాలాజీ సమన్వయ కర్తగా వ్యవహరించారు. -
తమిళ భాషకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
మద్యం తాగితే స్తంభానికి కట్టేయాలి వేలూరు: విద్యార్థులు తమిళభాషకు అధిక ప్రాదాన్యత ఇవ్వాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్సలర్ విశ్వనాథన్ అన్నారు. వేలూరు కంభన్ కయగం ఆధ్వర్యంలో కవి కన్నదాసన్ జయంతి కార్యక్రమం వేలూరులోని ఊరీస్ కళాశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలూరు కంభన్ కయగం చైర్మన్, వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం అధ్యక్షత వహించారు. చాన్సలర్ మాట్లాడుతూ తమిళ భాషకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కవులు, రచయితలను గుర్తించి ప్రతి సంవత్సరం సమావేశం ఏర్పాటు చేసి అభినందిస్తున్నామన్నారు. చైర్మన్ జీవీ సెల్వం మాట్లాడుతూ తమిళ భాషను పది కోట్ల మంది ప్రజలు మాట్లాడుతున్నప్పటికీ నేటి యుగంలో తమిళం మాట్లాడే వారి సంఖ్య తగ్గుతూనే ఉందన్నారు. ఇందుకు కారణం నేటి విద్యార్థులు పత్రికలు, తమిళ భాష పుస్తకాలు చదవక పోవడమే కారణమన్నారు. తమిళ భాష మాట్లాడటం అనేది అవమానం కాదని, మన గుర్తింపుగా భావించాలన్నారు. నేడు మనం ఆంగ్లభాషకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, తమిళభాషను మరిచి పోతున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో తమిళ భాషను మన తరాలు మరిచి పోయే పరిస్థితి ఉందన్నారు. మాతృభాషా దినోత్సవం జరుపుకునే సంప్రదాయం తమిళులకు లేదన్నారు. ప్రతి ఒక్కరూ తమిళ భాషను చదవాలన్నారు. తమిళ భాషకు అధిక ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కంభన్ కయగం ఆధ్వర్యంలో కన్నదాసన్ జయంతి ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు. అనంతరం తమిళ కవులు, రచయితలను అభినందించారు. ఈ కార్యక్రమంలో రచయితలు జ్యోతి బాలు, వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జ్ఞానవేల్, కంభన్ కయగం కార్యదర్శి చోళనాథన్, కోశాధికారి తిరునావకరసు, తమిళ సంఘం రచయితలు, కవులు, తమిళ పండిట్లు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. వృద్ధురాలి చైన్, నగదు చోరీ తిరువొత్తియూరు: ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో వృద్ధురాలి చైన్, నగదు చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. చైన్నె, కొట్టివాక్కం ప్రాంతానికి చెందిన రాజేశ్వరి (62) వేపేరిలో వెటర్నరీ ఆస్పత్రిలో అకౌంట్టెంట్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఈమె శుక్రవారం తిరువాన్మియూర్ నుంచి షేర్ ఆటోలో కొట్టివాక్కమ్కు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో ఆటోలో పక్కన కూర్చుని ఉన్న మహిళ, రాజేశ్వరితో మీ మెడలో ఉన్న చైన్ తెగిపోయేలా ఉందని, దాన్ని మీ బ్యాగులో భద్రంగా ఉంచుకోండని చెప్పింది. తరువాత ఆ మహిళ రాజేశ్వరి చైన్ తీసి బ్యాగులో పెట్టడానికి సహాయం చేసింది. రాజేశ్వరి ఇంటికి వచ్చి బ్యాగు తెరిచి చూడగా బంగారు చైన్, రూ.4 వేల నగదు కనిపించలేదు. దీంతో రాజేశ్వరి దిగ్భ్రాంతి చెందింది. ఆటోలో మహిళ తన దృష్టి మరల్చి, చైన్, డబ్బు చోరీ చేసినట్లు రాజేశ్వరి నిర్ధారించుకుంది. దీనిపై నీలంకరై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాలలో ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. టీచర్పై ప్లస్ టూ విద్యార్థుల దాడి తిరువొత్తియూరు: పాఠశాలకు ఆలస్యంగా రావడాన్ని ప్రశ్నించిన ఉపాధ్యాయుడిపై ప్లటూ విద్యార్థులు దాడి చేశారు. చైన్నె కొత్త చాకలిపేట దేశీయనగర్ నాలుగో వీధికి చెందిన వినోద్ (39) చైన్నె కొడంగయూర్ పొన్నుస్వామినగర్లోని పద్మప్రకాష్ మెట్రిక్యులేషన్ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పాఠశాలలో చదువుతున్న మాధవరం ప్రాంతానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా పాఠశాలకు వచ్చారు. ఆ సమయంలో ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులను పిలిచాడు. కానీ విద్యార్థులు నిర్లక్ష్యం చేసి అక్కడికి వెళ్లలేదు. సమాచారం అందుకున్న పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వినోద్ అక్కడికి వెళ్లి వారిని ఆలస్యం విషయమై ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ముగ్గురు విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. దీంతో వినోద్ కుమార్ ఎడమ కంటి వద్ద గాయమైంది. అతన్ని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను విచారిస్తున్నారు. రౌడీల అరెస్టు తిరువొత్తియూరు: చైన్నె, ఎంకేబీ నగర్, పులియాంతోపు ప్రాంతాల్లో వేర్వేరు సంఘటనలకు సంబంధించి పోలీసులు పలువురు రౌడీలను అరెస్టు చేశారు. చైన్నె, ఎంకేబీ నగర్ నార్త్ అవెన్యూ రోడ్డులో ప్రజలకు భీతిని కలిగిస్తున్న వ్యాసర్పాడి దామోదరన్ నగర్కు చెందిన సంతోష్ (36), దినేష్ (29)ను అరెస్టు చేశారు. అలాగే పులియాంతోపు మేకలతొట్టి వద్ద మాంసం కొనడానికి వచ్చే వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసి, డబ్బు వసూలు చేస్తున్న పులియాంతోపు, కన్నికాపురం, కస్తూరిబాయి కాలనీకి చెందిన కార్తీక్ (32) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పులియాంతోపు కెనాల్ స్ట్రీట్ ప్రాంతంలో గుట్కా అమ్ముతున్న పులియాంతోపు నరసింహనగర్ ఒకటో వీధికి చెందిన సూర్య(19), బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసులో అతని తండ్రి తిరుమలను అరెస్టు చేశారు. 6 చోట్ల కొత్త ట్రాన్స్ఫార్మర్లు తిరువొత్తియూరు: ఎన్నూర్, తిరువొత్తియూర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం నివారించడానికి ఆరు చోట్ల కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుకు భూమిపూజ చేశారు. తిరువొత్తియూర్ ఎమ్మెల్యే కేపీ శంకర్, జోనల్ కమిటీ చైర్మన్ టీఎం తనియరసు, కౌన్సిలర్ ఎంఎస్ తిరవియం ట్రాన్స్ఫార్మర్ల స్థాపనకు భూమి పూజ చేశారు. అన్నానగర్: మద్యం తాగితే ఓ రోజంతా అమ్మవారి ఆలయం వద్ద స్తంభానికి కట్టి వేయాలని పంచాయతీలో గ్రామపెద్దలు తీర్మానం చేశారు. వివరాల్లోకి వెళితే.. నాగై జిల్లా, వేదారణ్యంలోని పంజనదికులం నడుచ్చేతి పంచాయతీలోని సిరుదలైకాడు మత్స్యకార గ్రామం. ఈ గ్రామంలో 2 వేల మందికి పైగా నివసిస్తున్నారు. చేపల వేట వీరి ప్రధాన వృత్తి. ఈ గ్రామంలో మద్యానికి బానిసైన యువకులతో ఆ అలవాటును మాన్పించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. దీంతో శుక్రవారం సిరుదలైకాడులో గ్రామాధికారి నామకోటి నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. సిరుదలైకాడులో నిత్యం మద్యం సేవించే వ్యక్తులను పట్టుకుని మారియమ్మన్ ఆలయం వద్ద స్తంభానికి ఒక రోజు పాటు కట్టి వేయాలని తీర్మానించారు. అలాగే మద్యం సేవించి, వాహనం నడిపితే ఆ బైకును జప్తు చేయాలని తీర్మానించారు. మహిళలను ఆటపట్టించకూడదని, వెంబడించకూడదని, వారిని ఒత్తిడి చేయకూడదని, ఎవరైనా అలాంటి పని చేస్తూ దొరికితే, అపరాధి గుడి ముందు గుండు చేయించుకోవాలని నిర్ణయించారు. ప్రజలు పంచాయతీ సమావేశంలో ఈ తీర్మానాలను ఆమోదించి, వాటిని ముద్రించి పట్టణంలోని రెండు ప్రదేశాల్లో ఉంచారు. గ్రామంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు, మహిళలు హృదయపూర్వకంగా స్వాగతించారు. ఈ విషయం గురించి గ్రామాధికారి నామకోడి మాట్లాడుతూ యువత నిరంతరం మద్యం సేవించి ప్రమాదాలకు గురవుతున్నారని, మద్యపానంతో కుటుంబాలు నాశనమవుతున్నాయని గమనించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 8 నెలల గర్భిణి హత్య అన్నానగర్: ఎనిమిది నెలల గర్భిణి హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణగిరి జిల్లా వేప్పనపల్లి సమీపం అటవీ ప్రాంతంలో శుక్రవారం కుళ్లిపోయిన స్థితిలో చెట్టుకు వేలాడుతు ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న వెప్పనపల్లె పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం కృష్ణగిరి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో మృతురాలు పల్లెరి గ్రామానికి చెందిన మూర్తి కుమార్తె షాలిని (25)గా గుర్తించారు. 8 నెలల గర్భిణి అయిన ఈమెను సుత్తితో కొట్టి, దుపట్టాతో గొంతు నులిమి హత్య చేశారని పోస్టుమార్టమ్ రిపోర్టులో నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు షాలిని కుటుంబ సభ్యులను విచారించారు. ఆమె 19వ తేదీ నుంచి కనిపించలేదని, ఆమె కోసం వెతుకుతున్నామని వారు తెలిపారు. దీంతో షాలిని మృతదేహం దొరికిన ప్రదేశంలో బాధితురాలి సెల్ఫోన్ సిగ్నల్లో ఎవరి నంబర్లు రికార్డు ఆధారంగా దర్యాప్తు చేశారు. ఆ సెల్ఫోన్ నంబర్లు పందికురి గ్రామానికి చెందిన మేఘనాథన్ (21), కృష్ణగిరి సమీపంలోని పెరియా అగ్రహారానికి చెందిన పుగళేంది (19)కి చెందినవని తేలింది. పోలీసులు వారిని అరెస్టు చేసి విచాచించారు. మేఘనాథన్కు షాలినితో వివాహేతర సంబంధం ఉందని, ఈ క్రమంలో వారిద్దరి మధ్య విబేధాలు రావడంతో మేఘనాథన్ తన స్నేహితుడు పుగళేంది సహాయంతో షాలినిని హత్య చేశాడు. దీంతో పోలీసులు శనివారం మేఘనాథన్, పుగళేందిని అరెస్టు చేశారు. కార్మికుడి హత్య తిరువొత్తియూరు: జీతం, నగదు ఇవ్వలేదని కార్మికుడిని హత్య చేసిన మరో కార్మికుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..తిరువేర్కాడు సెల్వగణపతి నగర్, ఫస్ట్ స్ట్రీట్లో దండపాణి(45) బంధువుల ఇంట్లో ఉంటూ దినసరి కూలీగా పనికి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో ఇతడు రెండు రోజుల కిందట బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలో చైన్నె తిరువేర్కాడు గ్రీన్పార్క్ ప్రాంతంలోని ముళ్ల పొదలో గాయాలతో ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్టు పోలీసులకు శుక్రవారం సాయంత్రం సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో అదే ప్రాంతానికి చెందిన సుడలై (40)ని అనుమానించి, అరెస్టు చేసి విచారించారు. దండపాణి, సుడలై కలిసి పెయింటర్లుగా పని చేయడానికి వెళ్లారు. సుడలై జీతం డబ్బు తీసుకుని దండపాణికి ఇవ్వకుండా మోసం చేశాడు. ఆగ్రహం చెందిన సుడలై సంఘటన జరిగిన రోజు, మద్యం మత్తులో దండపాణిని కత్తితో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయినట్లు అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన తిరువెర్కౌడ్ పోలీసులు సుడలైని అరెస్టు చేశారు. -
క్లుప్తంగా
కారులో గుట్కా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు తిరుత్తణి: ఆంధ్రప్రదేశ్ నుంచి కారులో చైన్నెకు నిషేధిత గుట్కా తరలిస్తున్న యువకుడిని పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. తిరుత్తణి సమీపంలోని కనకమ్మసత్రం పోలీసులు శుక్రవారం రాత్రి చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలోని ఆర్కాడుకుప్పం వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చైన్నె వైపు వెళుతున్న కారును ఆపి తనిఖీ చేశారు. కారులో నిషేధిత గుట్కా, పొగాకు ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి కారుతోసహ వాటిని స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించి విచారించారు. విచారణలో కనకమ్మసత్రం సమీపంలోని నెడుంబరం అరుంధతీ కాలనీకి చెందిన ముత్తుసెల్వన్(29) అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని నగరి నుంచి కారులో చైన్నెకు 50 కిలోల గుట్కా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అతడిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బైకును ఢీకొన్న కంటైనర్ ● దంపతుల మృతి వేలూరు: బైక్ను కంటైన్ ఢీకొన్న ఘటనలో దంపతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. వేలూరు జిల్లా పొయిగై సమీపంలోని పిల్లయార్ ఆలయ వీధికి చెందిన రమేష్(43), అతని భార్య గోమది(36) శనివారం ఉదయం వేలూరుకు బైకులో బయలు దేరారు. ఆ సమయంలో బెంగళూరు నుంచి చైన్నెకి వస్తున్న కంటైనర్ అతి వేగంగా వచ్చి వారి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి తెలుసుకున్న విరింజిపురం పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం వేలూరు ఆస్పత్రికి తరలించారు. కంటైనర్ డ్రైవర్ ఆకాష్ యాదవ్ను అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన కంటైనర్ నుంచి ఉన్న ఫళంగా మంటలు చెలరేగడంతో జాతీయ రహదారిలో సంచలనం రేగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్లాస్టిక్ రహిత సమాజంలో భాగస్వాములు కావాలి తిరువళ్లూరు: ప్లాస్టిక్ రహిత సమాజానికి యువత, విద్యార్థులు భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతాప్ పిలుపునిచ్చారు. తిరువళ్లూరు జిల్లా పెద్దపాళెంలోని భవానీ అమ్మవారి ఆలయంలో మెగా మాస్ క్లీనింగ్, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ, పసుపు బ్యాగుల పంపిణీతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ప్రతాప్ హాజరయ్యారు. మొదట దేవదాయశాఖ ఆధ్వర్యంలో మెగా మాస్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఆషాఢమాసంలో పెద్దపాళెం భవానీ అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం ప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్ చేసే యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. తరువాత ఆలయానికి వచ్చిన భక్తులకు ప్లాస్టిక్ వస్తువులతో కలిగే అనర్థాలను వివరించి, పసుపు బ్యాగులను అందజేశారు. కన్నకూతురిని కడతేర్చాడు! అన్నానగర్: కన్న కూతురిని ఓ తండ్రి కొట్టి చంపిన ఘటన చిదంబరం సమీపంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లాలోని చిదంబరం కాట్టుమన్నర్ కోయిల్ సమీపంలోని టి.మడప్పురం గ్రామానికి చెందిన అర్జునన్ (57) కూలీగా జీవిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, అబిత (27) అనే కుమార్తె ఉన్నారు. ఈమె ఎంఎస్సీ, ఎంఈడీ పూర్తి చేసింది. అబిత కాట్టుమన్నర్ కోయిల్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు వివాహం చేయడానికి అర్జునన్ వరుడి కోసం వెతకడం ప్రారంభించాడు. అర్జునన్ అభితకు కొంతమంది యువకుల ఫొటోలను కూడా చూపించాడు. కానీ ఆమె ఏదో కారణం చెప్పి పెళ్లిని వాయిదా వేయండంటూ వచ్చింది. కుమార్తె ప్రవర్తనపై అర్జునన్కి అనుమానం కలిగించింది. దీంతో అతను ఆమె పర్యవేక్షించి, విచారణ చేపట్టారు. అప్పుడు తన కూతురు ఒకరిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఇది అర్జునన్కి బాధ కలిగించింది. ఈ స్థితిలో శుక్రవారం అబిత విధులకు వెళ్లలేదు, ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అర్జునన్ తన కుమార్తెను తాను చూసే వరుడిని వద్దంటున్నావెందుకని అడిగాడు. ఆ సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. కోపంగా ఉన్న అర్జునన్, తన కుమార్తెను అక్కడ ఉన్న కత్తితో గొంతు కోసి, కట్టితో కొట్టాడు. దీంతో అభిత సంఘటన స్థలంలోనే మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి అభిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసి అర్జునన్ని అరెస్టు చేశారు. -
ఆగిన బస్సు షెల్టర్ నిర్మాణం
తిరుత్తణి: పట్టణంలోని అక్కయ్య రోడ్డులో బస్సు షెల్టర్ నిర్మాణానికి మద్రాసు హైకోర్టు స్టే ఇవ్వడంతో పనులు ఆర్ధాంతరంగా ఆగాయి. తిరుత్తణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రైళ్లు, బస్సుల ద్వారా వస్తుంటారు. సుబ్రమణ్యస్వామి ఆలయానికి వచ్చే భక్తులు రైల్వేస్టేషన్, కమల థియేటర్ సమీపంలోని అక్కయ్య రోడ్డులో బస్స్టాప్ వద్ద వేచి ఉండి వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. చాలా కాలంగా బస్ షెల్టర్ లేక పోవడంతో ప్రయాణికులు, ఎండ, వానలకు రోడ్డుపై వేచివుండి ప్రయాణించాల్సి వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నిధుల రూ.23 లక్షల మంజూరయ్యాయి. దీంతో బస్షెల్టర్ నిర్మాణ పనులు నెల కిందట ప్రారంభమయ్యాయి. వేగంగా పనులు జరుగుతుండగా అక్కయ్య రోడ్డులో దుకాణ యజమానులు బస్ షెల్టర్ నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన హైకోర్టు బస్షెల్టర్ నిర్మాణానికి తాత్కాలికంగా స్టే విధించింది. దీంతో బస్షెల్టర్ పనులు ఆగాయి. చాలా కాలం తరువాత ప్రయాణికుల కోసం నిర్మిస్తున్న బస్షెల్టర్ పనులు అర్ధాంతరంగా ఆగడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తిరుచ్చిపై వెంకన్న విహారం
చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారు శనివారం బంగారు తిరుచ్చి వాహనంపై విహరించారు. వారపు ఉత్సవాల్లో భాగంగా వేకువనే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు సమర్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు కనులపండువగా కల్యాణోత్సవం జరిపించారు. సాయంత్రం వేడుకగా ఊంజల్ సేవ చేపట్టారు. ఈ క్రమంలోనే సర్వాలంకారభూషితులైన దేవదేవేరులను బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చి ఊరేగించారు. వైభవంగా ప్రసన్నుడి గ్రామోత్సవం వడమాలపేట (విజయపురం): వడమాలపేట మండలం అప్పలాయిగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం శ్రీవారి గ్రామోత్సవం, ఊంజల సేవను వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొల్పి నిత్య కై ంకర్యాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఉభయనాంచారుల సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామిని సర్వాభరణాలు, పూలమాలలతో అలంకరించారు. వేదమంత్రాలు భక్తుల గోవింద నామస్మరణ నడుమ స్వామి వారి ఊంజల సేవ కొనసాగింది. అనంతరం పద్మావతి అండాల్ సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామిని మేళాతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని, మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ అధికారి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే జట్టుగా తమిళనాడు!
తమిళనాడు అంతా ఒకే జట్టు అన్నట్టుగా ఏకం అవుదాం అని కేడర్, ప్రజలకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ పిలుపు నిచ్చారు. జూలై ఒకటి నుంచి సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుడుదాం అని ఆదేశించారు. 68 వేల మంది సోషల్మీడియా సైన్యంతో మరింతగా ప్రజలలోకి చొచ్చుకెళ్దామని వ్యాఖ్యానించారు. సాక్షి, చైన్నె: మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ద్రావిడ మోడల్ వ్యూహాలకు సీఎం ఎంకే స్టాలిన్ పదును పెట్టిన విషయం తెలిసిందే. డీఎంకే యువజన విభాగం ఓ వైపు, పార్టీ అనుబంధ విభాగాలు మరోవైపు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాయి. జిల్లాలు, యూనియన్లు, పట్టణాలు, నగరాలు, గ్రామాల వారీగా ఎన్నికల పనులు మరింత వేగవంతం చేయించడమే కాకుండా, ప్రజలలోకి చొచ్చుకేళ్లే కార్యక్రమాల నిర్వహణ, ప్రభుత్వ పథకాలన్నీ ఇంటింటా దరి చేరాయా? అని పరిశీలించి అర్హులైన వారికి మరిన్ని పథకాలను దరి చేర్చే దిశగా కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా నేతలతో ఉడన్పెరుప్పే వా...( సోదరా ..కదిలిరా) నినాదంతో సీఎం స్టాలిన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రాన్ని ఏడు డివిజన్లుగా పార్టీ పరంగా విభజించారు. ఆయా డివిజన్లకు ఇన్చార్జ్లనురంగంలోకి దించారు. జిల్లాల కార్యదర్శులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేసి పనుల వేగాన్ని పెంచారు. ఈ వ్యూహాలలో భాగంగా శనివారం అందియూరు, మొడకురిచ్చి, మేట్టుపాళయం జిల్లాల నేతలతో ఒన్ టూ ఒన్గా స్టాలిన్ సమావేశమయ్యారు. ఆ నియోజకవర్గాలలో పరిస్థితులను అధ్యయనంచేశారు. ఈ సమావేశాలలో భాగంగా జూలై 1 నుంచి చేపట్టనున్న సభ్యత్వ నమోదు గురించి కేడర్కు సందేశాన్ని స్టాలిన్ పంపించారు. న్యూస్రీల్ ఏకం అవుదాం జూలై 1 నుంచి సభ్యత్వానికి శ్రీకారం చుడుదాం 68 వేల మందితో డీఎంకే డిజిటల్ సైన్యం ద్రోహులకు చోటు లేదు.. సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టే విధంగా తమిళనాడు అంతా ఒకే జట్టు అని చాటే దిశగా ఏకం అవుదామన్న పిలుపుతో కేడర్, ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. 75 సంవత్సరాల డీఎంకే ప్రయాణాన్ని గుర్తు చేస్తూ, ఏడవ సారిగా సైతం అధికారం లక్ష్యంగా శ్రమిద్దామని పిలుపు నిచ్చారు. కలైంజ్ఞర్ నిర్దేశించిన మార్గంలో సమగ్ర ప్రణాళికతో 2026లోనూ అధికారం కొనసాగే విధంగా ప్రతి ఒక్కరూ మరింతగా దూసుకెళ్లాల్సిన తరుణం మొదలైందన్నారు. ఇందుకోసం జూలై 1 నుంచి ఓరనియిల్ తమిళనాడు( ఒకే జట్టుగా తమిళనాడు)నినాదంతో గొప్ప సభ్యత్వ నమోదుతో పాటూ ప్రచార భేరి మోగిద్దామని పిలుపు నిచ్చారు. ఓరనియిల్ తమిళనాడు పేరిట ప్రత్యేక యాప్ను సిద్ధం చేసి, డిజిటల్ సైన్యాన్ని సైతం రంగంలోకి దించామని వివరించారు. 234 నియోజకవర్గాలలోని 68 వేల పోలింగ్ బూత్లలో ఈ సైన్యానికి శిక్షణ ఇచ్చామని, వీరితో కలిసి నాయకులు ఇంటింటా వెళ్లాలని, ప్రజలకు ప్రభుత్వ పథకాలను వివరించాలని,ద్రావిడ మోడల్ ప్రభుత్వం పనితీరును విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల మద్దతును కూడగట్టుకునే విధంగా ఒక్కో పోలింగ్ బూత్కు కనీసం 30 శాతం సభ్యులను చేర్చే దిశగా ముందుకెళ్లాలని పిలుపు నిచ్చారు. ద్రోహులకు తమిళనాడులో చోటు లేదని, మతం, కులం ముసుగులో ప్రజల్ని విడగొట్టే ప్రయత్నం చేసే శక్తులను తరిమి కొట్టేందుకు ప్రజా మద్దతును విస్తృతంగా సేకరించాలని ఆదేశించారు. -
విద్యార్థుల కోసం వాటర్ బెల్
● జూలై 1 నుంచి బడుల్లో అమలుసాక్షి, చైన్నె : విద్యార్థుల శరీరంలో నీటి శాతం పెంపు లక్ష్యంగా వాటర్ బెల్పథకం అమలుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. జూలై 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉదయం వేళలో పిల్లల ఆకలి తీర్చేలా అల్పాహార పథకం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. విద్యార్థుల కోసం మరిన్ని పథకాలు అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు బడి వేళలో సరిగ్గా నీరు సేవించడం లేదని అధ్యయనంలో తేలింది. పిల్లలు వాటర్ బాటిళ్లు బడులకు తీసుకెళుతున్నా నీరు తాగడం లేదని వెలుగు చూసింది. దీంతో పిల్లల శరీరంలో నీటి శాతం పెంపు లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకు వాటర్ బెల్ పేరిట పథకం అమలుకు సిద్ధం అయ్యింది. ఇందుకు సంబంఽధించిన ఉత్తర్వులను శనివారం విద్యాశాఖ డైరెక్టర్ కన్నప్పన్ జారీ చేశారు. తమిళనాడులోని అన్ని జిల్లాల కార్యదర్శులు ఈ పథకాన్ని జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సిందేనని ఆదేశించారు. విద్యార్థులు పాఠశాలల్లో సరిగ్గా నీళ్లు తాగేందుకు వీలుగా మూడు నుంచి ఐదు నిమిషాల వరకు సమయం కేటాయించనున్నారు. ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 3 గంటలకు మూడు సార్లు ప్రత్యేకంగా పాఠశాలలో బెల్ మోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ బెల్ మోగినప్పుడల్లా విద్యార్థులు తాము తెచ్చుకున్న బాటిళ్లలో నుంచి నీరు తాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను డీ హైడ్రేషన్ నుంచి రక్షించడంలో భాగంగా ఈ ప్రయత్నం చేపట్టినట్టు ప్రభుత్వం వివరించింది. -
ఉగ్ర కావేరి!
సేలం: తమిళనాడులోనే డెల్టా జిల్లాలకు సాగుకు, ఇతర జిల్లాలకు ఉమ్మడి తాగు నీటి పథకానికి ప్రధాన వనరుగా మేట్టూరు జలాశయం నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కురువై సాగుబడికి ఈ జలాశయం చేయూతను ఇచ్చింది. నిర్ణీత జూన్ 12వ తేదీన సాగునిమిత్తం గేట్లు తెరచుకున్నాయి. డెల్టా జిల్లాల వైపుగా కావేరి పరవళ్లుతొక్కుతున్నాయి. నిర్ణీత 120 అడుగులతో కూడిన ఈ జలాశయంలోకి శుక్రవారం నుంచి నీటి రాక మరింతగా పెరిగింది. సెకనుకు 75 వేలకు పైగా క్యూ సెక్కుల నీరు వస్తోంది. కర్ణాటకలో కురస్తున్న వర్షాలతో మళ్లీ కావేరిలోకి వరద ఉధృతి క్రమంగా పెరుగతున్నది. తమిళనాడు సరిహద్దులలోని పిలి గుండుల వద్ద సెకనుకు 90 వేల మేరకు క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. ఇది తమిళనాడు – కర్ణాటక సరిహద్దులలోని హొగ్నెకల్ వద్ద ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తున్నది. హొగ్నెకల్ జలపాతం అన్నది ఇక్కడ ఒకటి ఉందా..? అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. ఈ నీటి ప్రవాహం మరింతగా పెరగవచ్చు అని భావిస్తున్నారు. ఇక్కడ సెకనుకు 85 వేల క్యూసెక్కులమేరకు నీరు ప్రవహిస్తున్నది. ఇక్కడ మరింతగా నీరు ఉప్పొంగిన పక్షంలో హొగ్నెకల్, ఆలంపాడి, ఉట్టమలై, నాడర్ కోట్టం గ్రామాలలోని లోతట్టు ప్రాంతాల వైపుగా నీరు దూసుకెళ్లడం ఖాయం. దీంతో ముందు జాగ్రత్తగా హొగ్నెకల్ తీరంలోని గృహాలలోకి నీరు చేరడంతో ఇక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. నీటి ఉధృతి మరింతగా పెరిగే అవకాశాలతో కావేరి తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, గ్రామాలకు కావేరి నదీ మీదుగా ఉన్న చిన్న చిన్న వంతెనలు, రోడ్డు మార్గాలను మూసి వేశారు. మేట్టూరు జలాశయం నీటిమట్టం 116 అడుగులకు దాటింది. ఒకటి రెండు రోజులలో నిండుకుండగా మారనన్నది. దీంతో ఉబరి నీటిని పూర్తిగా బయటకు విడుదల చేయల్సి వస్తుంది. ఈ దృష్ట్యా, ముందు జాగ్రత్తగా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కావేరి తీరం వెంబడి ఉన్న సేలం, ఈరోడ్, నామక్కల్, కరూర్, పెరంబలూరు, అరియలూరు, తిరుచ్చి, పుదుకోట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, కడలూరు జిల్లాల్లోని గ్రామాల ప్రజల్ని అప్రమత్తంచేశారు. కావేరి నదీ తీరంకు కూత వేటు దూరంలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా , అవసరం అయితే, సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ముందు జాగ్రత్తలుచేపట్టారు. చిన్న చిన్న మార్గాలన్నీ మూసి వేసి , పోలీసు భద్రతను కల్పించారు. మేట్టూరు– ఎడపాడి ప్రధాన మార్గాన్ని సైతం మూసి వేశారు.22 శాతం అధికంగా వర్షం కర్ణాటక నుంచి భారీగా వరద నీరు మహోగ్రంగా హొగ్నెకల్ జలపాతం ఉప్పొంగిన నీటితో తీర ప్రాంతాలు జలమయం నిండు కుండగా మేట్టూరు తీరంలో అలర్ట్ కర్ణాటక నుంచి కావేరి నదిలో భారీగా వరద పోటెత్తుతోన్నది. ఉగ్రరూపం దాల్చి కావేరి నది ప్రవహిస్తుండటంతో తీర గ్రామాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేశారు. భారత నయాగారా హొగ్నెకల్ జలపాతం కనుమరుగైనట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది నైరుతీ రుతు పవనాలు కోయంబత్తూరు, నీలగిరులతోపాటూ పశ్చిమ కనుమల వెంబడి ఉన్న జిల్లాల మీద అధిక ప్రభావాన్ని చూపించాయి. మరోరెండు మూడు రోజులు కోయంబత్తూరు, నీలగిరులలో భారీవర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.జూన్ 1 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడులో నైరుతీ రూపంలో 22 శాతం అధికంగా వాతావరణ శాఖ ప్రకటించింది. కోయంబత్తూరులో 33 సె.మీ నీలగిరులలో 26 సెం.మీ , కన్యాకుమారిలో 18 సెం.మీ వర్షం పడిందని ప్రకటలించారు. -
తిరుచెందూరులో పనులు వేగవంతం
● పరిశీలించిన మంత్రులు, ఎంపీ సాక్షి, చైన్నె: తిరుచెందూరులో కుంభాభిషేకం పనులు ముగింపుదశకు చేరాయి. ఈ పనులను శనివారం మంత్రులు శేఖర్బాబు, అనిత రాధాకృష్ణన్, ఎంపీ కనిమొళి పరిశీలించారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడకు నిత్యంభక్తులు పోటెత్తుతుంటారు. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాలను తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలిరావడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ ఆలయ కుంభాభిషేక పనులకు అధికార వర్గాలు చర్యలు తీసుకున్నాయి. పదిహేను సంవత్సరాల తర్వాత ఈ మహోత్సవం జూలై ఏడున ఇక్కడ జరగనున్నది. దేశ విదేశాల నుంచి సుమారు పది లక్షల మందికి పైగా భక్తులు ఈ వేడుకకు తరలి వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే స్పష్టమైన సమాచారాలు వచ్చాయి. ఒకటి నుంచి పూజలు కుంభాభిషేకం మహోత్సవం నిమ్తితం జూలై 1 నుంచి పూజలుమొదలు కానున్నాయి. తొలి రోజున యాగశాల పూజలతో ఉత్సవాలు మొదలు కాన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మైదానంలో యాగశాలను ఏర్పాటు చేసి పూజలకు చర్యలు తీసుకున్నారు.ఈ ఉత్సవం ధృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలను తూత్తుకుడి జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. పరిశీలన.. శనివారం మంత్రులు శేఖర్బాబు, అనిత రాధాకృష్ణన్, తూత్తుకుడి ఎంపీ కనిమొళి కరుణానిధిలు ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. యాగశాల, ఆలయ పరిసరాలు, సముద్ర తీరంలో చేసిన ఏర్పాట్లను వీక్షించారు. భక్తుల కోసం మరింత మెరుగైన సేవలు అందించే విధంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వీటన్నింటి గురించి జిల్లా కలెక్టర్ ఇలం భగవత్ మంత్రులు, ఎంపీకి వివరించారు.తాము చేపట్టనున్న భద్రతా ఏర్పాట్ల గురించి ఎస్పీ ఆల్బర్ట్ జాన్ వివరించారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ, భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లన్నీ ముగింపు దశకు చేరాయని వివరించారు. భక్తులు ముడుపులు సమర్పించే సమయంలో ఎలాంటి తొక్కిసలాటలకు చోటు కల్పించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు బస చేయడానికి వీలుగా ఏర్పాట్లు, సముద్ర తీరంలోకి చొచ్చుకు వెళ్లకుండా మరింత భద్రతపరంగా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. -
అనల్ అరసు దర్శకత్వంలో పరిచయం ఓ భాగ్యం
తమిళసినిమా: ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన తొలి చిత్రం ఫీనిక్స్. ఈ చిత్రం ద్వారా స్టార్ హీరో విజయ్ సేతుపతి వారసుడు సూర్య విజయ్ సేతుపతి కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు. ఏకే.బ్రేవ్మెన్ పిక్చర్స్ పతాకంపై రాజ్యలక్ష్మి అనల్ అరసు నిర్మించిన ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని మే 4వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్రం ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక వడపళనిలోని పలోజో థియేటర్లో ఘనంగా నిర్వహించారు. ఇందులో నిర్మాత కలైపులి ఎస్.ధాను, టీ.శివ, దర్శకుడు హెచ్ వినోద్, పాండిరాజ్, ఫెఫ్సీ విజయన్, శక్తి ఫిలింస్ శక్తివేలన్, నటుడు విజయ్ సేతుపతి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఫైట్ మాస్టర్ ఆనల్ అరసు ఈ చిత్రం కథను తనకు 2018లోనే చెప్పారన్నారు. అయితే అప్పట్లో తాను నటించలేని పరిస్థితి అని పేర్కొన్నారు. ఆ తర్వాత మీ అబ్బాయి సూర్య ఈ కథలో నటిస్తే ఎలా ఉంటుంది అని అడిగారన్నారు. దీంతో తనకు ఒకపక్క సంతోషం మరో పక్క భయం కలిగిందన్నారు. అయితే తన కొడుకు సూర్యకు సంబంధించిన నిర్ణయాలు తనే తీసుకోవాలని భావిస్తానన్నారు. అతనికి కథ వినమని చెప్పానన్నారు. ఆ తర్వాత ఆ విషయం గురించి తానేమి చెప్పలేదన్నారు. అయితే తన సినిమా అనుభవాలను తన కుటుంబ సభ్యులతో పంచుకుంటానని చెప్పారు. అందుకే సూర్యకు సంబంధించిన విషయాల్లో తనే నిర్ణయం తీసుకోవాలని భావించానని చెప్పారు. అందువల్లే తాను ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలతోపాటు ఏ విషయాల్లోనూ పాల్గొనలేదని చెప్పారు. అయితే నటించడం మొదలు పెట్టిన తర్వాత సంతోషంగా ఉందా? అని తన కొడుకు సూర్యను అడగ్గా.. ఉందని చెప్పారన్నారు. అతనికి ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన వారందరికీ ధన్యవాదాలన్నారు. స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ద్వారా సూర్య హీరోగా పరిచయం కావడం అతని భాగ్యంగా పేర్కొన్నారు. దర్శకుడిగా పరిచయం అయిన అనల్ అరసు మాట్లాడుతూ తాను ఈ స్థాయికి ఎదగడానికి కారణం తన తండ్రిని పేర్కొన్నారు. తన సతీమణి రాజ్యలక్ష్మి లేకపోతే ఈ చిత్రమే లేదని ఆయన అన్నారు. -
చిన్నారుల సంరక్షణ కమిటీ సమావేశం
పళ్లిపట్టు: పళ్లిపట్టు టౌన్ పంచాయతీలో చిన్నారుల సంరక్షణ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పళ్లిపట్టు టౌన్ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన చిన్నా రుల సంరక్షణ కమిటీ సమావేశానికి పట్టణ పంచా యతీ కార్యనిర్వహణాధికారి రాజకుమార్ అధ్యక్షత వహించారు. పట్టణ పంచాయతీ కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది. విద్యావేత్తలు, పోలీసులు, తదితరుల బృందం పాల్గొన్నారు. ముఖ్య అతిఽథిగా పట్టణ పంచాయతీ చైర్పర్సన్ మణిమేగళై పాల్గొని చిన్నారుల సంరక్షణ, బాలల హక్కులను వివరించారు. ప్రధానంగా చిన్నారులు ప్రతి ఒక్కరూ పదో తరగతి వరకు నిర్భంద ఉచిత విద్య అందడంతో పాటు బాలికలపై వేధింపులు అరికట్టడం, బాల కార్మికుల నిర్మూలన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. టౌన్ పంచాయతీ మేనేజర్ కుప్పారెడ్డి, విద్యావేత్త గురుమూర్తి, ఎస్ఐ రమేష్కుమార్ సహా సభ్యులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
చైన్నెకి రెండో సబర్బన్ ఏసీ ఎలక్ట్రిక్ రైలు ● అక్టోబర్ నుంచి అందుబాటులోకి కొరుక్కుపేట: చైన్నెకి రెండో సబర్బన్ ఏసీ ఎలక్ట్రిక్ రైలు వచ్చేసింది. లోపాలన్నింటినీ పరిష్కరించిన తర్వాత చైన్నెలో రెండో సబ్బరన్ ఏసీ ఎలక్ట్రిక్ రైలును ప్రారంభించారు. అయితే అక్టోబర్ నెలలో ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని రైల్వే అధికారులు తెలిపారు. చైన్నెలో ప్రస్తుతం చైన్నెబీచ్–తాంబరం –చెంగల్పట్టు మార్గాల్లో సెంట్రల్ –అరక్కోణం, సెంట్రల్ –గుమ్మిడిపూండి మార్గాల్లో సబ్బరన్ ఎలక్ట్రిక్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఇటీవల బీచ్ నుంచి చెంగల్పట్టు వరకు ఎయిర్ కండీషన్డ్ సబర్బన్ ఎలక్ట్రిక్ రైలును నడిపారు. ప్రారంభమైన రెండు రోజుల్లోనే ఏసీ ఎలక్ట్రిక్ రైలు బోగీ లు చెడిపోవడంతో రైలు ప్రయాణికుల్లో భ యాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిస్థితిలో రైలు ఆపివేశారు. ప్రస్తుతం బోగీల్లో సమస్యలు పరిష్కరించి, ట్రయల్ రన్ నిర్వహించారు. మరో రెండు నెలల్లో ప్రయాణికులకు అందుబాటులో తేనున్నట్లు అధికారులు తెలిపారు. ఇరాన్ నుంచి చైన్నె చేరిన తమిళులు తిరువొత్తియూరు: ఇరాన్లో చిక్కుకున్న 12 మంది తమిళులు సురక్షితంగా చైన్నెకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్లో వారికి మంత్రి అవడి ఎస్ఎం నాసర్ స్వాగతం పలికారు. ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలకు వెళ్లిన తమిళనాడుకు చెందిన పలువురు ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా ఇబ్బందులకు గురయ్యారు. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తదితరుల వారిని స్వదేశానికి రప్పించడానికి చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ దేశాల్లో చిక్కుకున్న 12 మంది తమిళులను యుద్ధ ప్రాతిపదికన చైన్నె కు రప్పించడానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ తమిళుల ఆధ్వర్యంలో తమిళనాడుకు తిరిగి రావడానికి చర్యలు తీసుకున్నారు. సంక్షేమశాఖ మంత్రి అవడి ఎస్ఎం నాసర్ చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశాల నుంచి 12 మంది చైన్నెకు చేరుకున్నారు. ఆ సమయంలో మంత్రి అవడి ఎస్.ఎం. నాసర్ వారిని స్వాగతించారు. తరువాత చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి వారిని రైళ్లలో వారి స్వస్థలాలకు పంపించారు. విజయమే లక్ష్యంగా పనిచేయాలి తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సభ్యులందరూ కలిసికట్టుగా కృషి చేయా లని ఎమ్మెల్యే చంద్రన్ పిలుపునిచ్చారు. తిరుత్తణిలోని కదిర్వేల్ మండపంలో డీఎంకే బూత్ లెవల్ సభ్యుల సమావేశం నిర్వహించారు. పట్టణంలో డీఎంకే బూత్ కమిటీ సభ్యులకు నూతన సభ్యత్వ నమోదు దరఖాస్తులను ఎమ్మెల్యే చంద్రన్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, పధకాలు ద్వారా లబ్ధి పొందిన వివరాలు తెలుసుకుని, వారి సమస్యలు అడిగి పరిష్కరించాలని, పార్టీలో సభ్యులుగా చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలకు పార్టీ సభ్యత్వ నమోదు దరఖాస్తులు అందజేశారు. జూలై నుంచి నూతన సభ్యత్వ నమోదు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదులో బీఎల్వోలు, ఐటీ విభాగం ఇన్చార్జ్లు చురుగ్గా పాల్గొనాలని కోరారు. పార్టీ పట్టణ కార్యదర్శి వినోద్కుమార్, మండల కార్యదర్శులు హారతి రవి, కృష్ణన్, రాజేంద్రన్, విజయకుమార్, పట్టణ నాయకులు శ్యామ్సుందర్, అశోక్కుమార్, గణేశన్ తదితరులు పాల్గొన్నారు. రూ.60 లక్షల విలువైన బీడీ ఆకులు స్వాధీనం కొరుక్కుపేట: తూత్తుకుడి ఓడరేవు సమీపంలోని థ్రెస్పురం బీచ్ మీదుగా అనుమానాస్పద వ్యక్తులు పడవ ద్వారా బీడీ ఆకు సంచులను ఆక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో కోస్ట్గార్డు గ్రూప్ ఇన్ స్పెక్టర్ పచ్చిముత్తు పర్యవేక్షణలో కోస్ట్గార్డు గ్రూప్ పోలీసులు బీచ్కు చేరుకున్నారు. పోలీసులు రావటంతో వారిని చూసిన ప్రజలు బీడి ఆకు సంచులను సుముద్రంలోని ఒక కంట్రీ బోట్లో వదిలి అక్కడి నుంచి పారిపోయారు. తరువాత పోలీసులు పడవను స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.60 లక్షల విలువైన 43 సంచులలోని 1,800 కిలోల బీడి ఆకులను సీజ్ చేసి కస్టమ్స్ విబాగానికి అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు. మెట్రో రైలు పనుల్లో అపశ్రుతి ● ఇనుప రాడ్డు పడి కార్మికుడికి తీవ్ర గాయాలు తిరువొత్తియూరు: కోయంబేడులో మెట్రో రైలు పనులు జరుగుతుండగా ఇనుప రాడ్ పడి ఓ కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు.. కోయంబేడు మార్కెట్ సమీపంలోని ఈ– రోడ్డులో మెట్రో రైలు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ, శుక్రవారం రాత్రి, మంజంబాక్కంకు చెందిన కార్మికుడు రబు కై వర్క్ ( 34) తన సహోద్యోగులతో కలిసి పనిచేస్తున్నాడు. ఆ సమయంలో ఇనుప కడ్డీలతో కూడిన ఒక పెద్ద కాంక్రీట్ స్లాబ్ ఊహించని విధంగా పై నుంచి పడింది. దీంతో రబు కై వర్క్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కొలత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కోయంబేడు బస్టాండ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ కథా చిత్రాలను ఆదరిస్తారు!
తమిళసినిమా: కథానాయకుడిగా, నిర్మాతగా మంచి చిత్రాలను చేస్తూ రాణిస్తున్న నటుడు విష్ణు విశాల్. కాగా ఈయన తాజాగా తన విష్ణు ప్రసాద్ స్టూడియోస్ పతాకంపై రోమియో పిక్చర్స్ రాహుల్తో కలిసి నిర్మించిన చిత్రం ఓహో ఎందన్ బేబీ. ఈ చిత్రం ద్వారా తన తమ్ముడు (పెదనాన్న కొడుకు) రుద్రను కథానాయకుడిగా పరిచయం చేశారు. నటి మిధుల పాల్కర్ నాయకిగా నటించిన ఇందులో అంజుకురియన్, దర్శకుడు మిష్కిన్, బాలాజీ శక్తివేల్,కరుణాకరన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ వాణిజ్య ప్రకటనలు దర్శకుడు, నటుడు కష్ణ కుమార్ రామ్ కుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. జెన్ మార్టిన్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని జూలై 11వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం చిత్రం ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక రాయపేటలోని పీవీ ఆర్ సత్యం థియేటర్లో నిర్వహించారు. కార్యక్రమంలో నటుడు కార్తీ, దర్శకుడు వెట్రిమారన్, రామ్ కుమార్, అశ్వద్ మారిముత్తు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు విష్ణు విశాల్ రుద్ర తన పెదనాన్న కొడుకు అని చెప్పారు. తాను నటుడు కావడానికి తన పెదనాన్న ప్రోత్సాహమేనని పేర్కొన్నారు. ఇప్పుడు తన తమ్ముడు రుద్రను తాను కథానాయకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మాట్లాడుతూ కుటుంబం గురించి తెలియగానే తనకు వానత్తుపోల్ చిత్రం గుర్తుకు వచ్చిందన్నారు. తాను హీరోగా పరిచయమైనప్పుడు కుటుంబ సభ్యులంతా ఎంతగానో అండగా నిలిచారన్నారు. కాగా ఓహో ఎందన్ బేబీ చిత్ర ట్రైలర్ పాటలను చూస్తే ఇది మంచి ప్రేమ కథ చిత్రం గా ఉంటుందని తెలుస్తోందన్నారు. ఇలాంటి ప్రేమ కథా చిత్రాలనే ఇప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు నటుడు కార్తీ పేర్కొన్నారు. -
స్ఫూర్తి ప్రదాత హెలెన్ కెల్లర్
కొరుక్కుపేట: మహిళల ఓటుహక్కు, కార్మికుల హక్కులు, ప్రపంచశాంతి కోసం విస్తృత ప్రచారం చేయడంతోపాటు తన జీవితాంతం దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన హెలన్ కెల్లర్ ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత అని ఎంఎన్ కంటి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శృతి పేర్కొన్నారు. దృష్టి లోపం ఉన్న వ్యక్తుల కోసం 64 ఏళ్లుగా సేవలందిస్తున్న నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ తమిళనాడు రాష్ట్రశాఖ (ఎన్ఏబీ– టీఎన్ఎస్బీ) ఆధ్వర్యంలో హెలెన్ కెల్లర్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఆ శాఖకు చెందిన నీనారెడ్డి నేతృత్వంలో సవేరా వేదికగా జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ శృతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెలెన్ కెల్లర్ ఒక అమెరికన్ రచయిత్రి, రాజకీయ కార్యకర్త, లెక్చరర్ అయిన ఆమె అనారోగ్యం కారణంగా చిన్న వయస్సులోనే చెవిటి, అంథురాలయ్యారని, అయినా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని సంపాదించిన మొదటి చెవిటి– అంథురాలిగా నిలిచారని గుర్తు చేశారు. వైకల్యం ఉన్నా ప్రతీ బిడ్డా నాణ్యమైన విద్యను పొందే హక్కును కల్పించాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా స్పెషల్ ఎడ్యుకేటర్స్ను ఘనంగా సత్కరించగా, స్పెషల్ స్కూల్స్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినంది, సత్కరించారు. -
రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
తిరువళ్లూరు: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలతో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన క్రమంలో శనివారం ఉదయం తిరువళ్లూరులోని వేర్వేరు ప్రాంతాల్లో పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ మోహన్, కలెక్టర్ ప్రతాప్ అకస్మిక తనిఖీలు చేశారు. రేషన్ సరుకు పంపిణీలో బయో మెట్రిక్ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. అయితే ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనతో ఒక కార్డుదారుడికి సరుకులను ఇవ్వడానికి 45 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని, తద్వారా కాలయాపన జరగడంతో పాటు సాంకేతిక సమస్యలు ఏర్పడితే సమస్యలు మరింత జఠిలం అవుతాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణ సిబ్బంది శుక్రవారం ఉదయం ఆందోళన బాట పట్టారు. దీంతో ప్రభుత్వాధికారుల్లో చలనం మొదలైంది. పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ మోహన్, తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్ తదితరులు పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేశారు. కొత్త విధానం అమలు, సరుకుల నాణ్యతతో పాటు ఇతర వాటిని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. -
ముగ్గురు విద్యార్థుల అదృశ్యం
వేలూరు: పాఠశాలలకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. తిరువళ్లూరు నగర్కు చెందిన గోకుల్ ప్రసాద్, తొర్రపాడి సమీపంలోని భవానీనగర్కు చెందిన క్రిష్ణన్, కేకే నగర్కు చెందిన జీవ సూర్యన్. వీరు ముగ్గురూ తొర్రపాడిలోని రామ్సెట్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. ఒకే తరగతి గదిలో ఉంటున్న ముగ్గురూ తరచూ కలిసి తిరిగే వారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ముగ్గురు విద్యార్థులు సాయంత్రం పాఠశాల నుంచి బయటకు వెళ్లారు. ఇందులో ఒక విద్యార్థి మాత్రం రోజూ ఆటోలో వచ్చి వెళ్లేవాడు. దీంతో శుక్రవారం సాయంత్రం ఆటో డ్రైవర్ పాఠశాలకు వెళ్లినప్పటికీ ఆ విద్యార్థి ఆటోలో వెళ్లకుండా తాను తన స్నేహితులతో కలిసి వస్తానని చెప్పి, ఆటో డ్రైవర్ణు పంపి వేశాడు. అనంతరం రాత్రి 10 గంటల వరకు ముగ్గురు విద్యార్థులు ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో గాలించినప్పటికీ ఎటువంటి ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు బాగాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు విద్యార్థుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు కూడా విద్యార్థుల ఆచూకీ కనిపించక పోవడంతో తల్లిదండ్రలు ఆందోళన చెందుతున్నారు. -
వినియోగదారుల అభిరుచులే ముఖ్యం
సాక్షి, చైన్నె: వినియోగ దారుల అభిరుచులే లక్ష్యంగా గ్రాండ్ కాంటినెంట్ సేవలు ఉంటాయని ఆ సంస్థ వ్యవస్థాపకుడు రమేష్ శివ తెలిపారు. చైన్నె టీనగర్లో గ్రాండ్ కాంటినెంట్ ప్రీమియర్ కొత్త హోటల్ను ప్రారంభించినానంతరం రమేష్ శివ మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ఇదే హోటల్లో పనిచేసిన తాను, ప్రస్తుతం గ్రాండ్కాంటినెంట్ పేరిట దేశ వ్యాప్తంగా హాస్పిటాలిటీరంగంలో విస్తృత సేవలను అందిస్తున్నట్టు వివరించారు. చైన్నెలోని మిడ్ మార్కెట్ హాస్పిటాలిటీరంగంలో ఉన్నత స్థాయి సౌకర్యాలతో కొత్త బెంచ్ మార్క్గా ఈ హోటల్ నిలుస్తుందన్నారు. ఇది తమ 22వ హోటల్ అని , రానున్న రోజులలో ద్వారకా, జైపూర్, అయోద్య, గుర్గాంలలో హోటళ్లను ప్రారంభించనున్నామని వివరించారు. ప్రస్తుతం అత్యాధునిక సౌకర్యాలతో , వినియోగ దారుల అభిరుచులకు అనుగుణంగా సేవలను అందించడం లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. 2028 నాటికి తమ సేవలను ఐదు ఇంతలు పెంచడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. 2011 నుంచి తన పయనం మొదలైనా, కరోనా కాలంలో తీవ్ర సమస్యలు ఎదురయ్యాయని, అనంతరం క్రమంగా కోలుకుని, అందరి సహకారంతో హాస్పిటాలిటీరంగంలో ఉరకలు తీస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆ సంస్థ డైరెక్టర్ విద్య రమేష్, సీఓఓ సునీల్మాథూర్ పాల్గొన్నారు. -
శరవేగంగా రోడ్డు విస్తరణ పనులు
తిరుత్తణి: తిరుత్తణి– చిత్తూరు రోడ్డు విస్తరణ తొలిదశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమిళనాడులోని తిరుత్తణి నుంచి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు పట్టణానికి ప్రస్తుతం రెండు లేన్ల రహదారి ఉంది. వాహనాల రద్దీతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకోవడంతో రోడ్డు విస్తరణకు హైవే శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతో సీఎం రహదారుల విస్తరణ పథకంలో భాగంగా తొలి దశలో తిరుత్తణి హైవేశాఖ ఆధ్వర్యంలోని తలయారితాంగల్ నుంచి బీరకుప్పం వరకు నాలుగు కిలోమీటర్ల దూరం నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ. 26 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం రోడ్డుకు ఇరువైపుల చెట్లు నరికి రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఇరువైపులా రోడ్డు విస్తరించి మధ్యలో సెంటర్ మీడియన్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. అలాగే పళ్లిపట్టు హైవేశాఖ ఆధ్వర్యంలోని ఎరుంబి నుంచి గోపాలపురం వరకు ఐదు కిలో మీటర్లల దూరం తొలివిడతలో రూ.35 కోట్లు వ్యయంతో రోడ్డు విస్తరణ పనులు జగుతున్నాయి. హైవేశాఖ అధికారులు సమక్షంలో పనులు వేగంగా నిర్వహిస్తున్నట్లు, మరో నెల రోజుల్లో నాలుగు లేన్ల రహదారి పనులు పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. -
మళ్లీ మెగా ఫోన్ పట్టిన ఎస్జే సూర్య
తమిళసినిమా: విలక్షణ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎస్ జే. సూర్య. ఈయన అజిత్ కథానాయకుడిగా దర్శకత్వం వహించిన తొలి చిత్రం వాలి. ఆ చిత్రం సంచల విజయాన్ని నమోదు చేసుకుంది. అలాగే విజయ్ హీరోగా ఖుషి చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత తమిళం, తెలుగు తదితర భాషల్లో తొలి చిత్రం వహించారు. అలాగే న్యూ అనే చిత్రం ద్వారా కథానాయకుడిగానూ పరిచయం అయ్యారు. ఎస్జే సూర్య చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం ఇసై. ఆ తర్వాత పూర్తిగా నటనపైనే దృష్టి సారిస్తున్న ఈయన ప్రతి నాయకుడిగా తనదైన ముద్ర వేసుకుని నటిస్తున్నారు. కాగా 10 ఏళ్ల తర్వాత తాజాగా మరోసారి మెగాఫోన్ పెట్టారు. ఈయన శ్రీజగత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి కిల్లర్ అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో ప్రీతి అస్రాణి నాయకిగా నటిస్తున్నారు. శ్రీ గోకులం ఫిలిమ్స్ గోకులం గోపాలన్తో కలిసి ఏంజెల్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం చైన్నెలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్రం వివరాలను దర్శకుడు, కథానాయకుడు ఎస్జే సూర్య తెలిపారు. ఇది తన డ్రీమ్ చిత్రం అని చెప్పారు. ఎంజీఆర్ (స్థానాన్ని చిత్ర పరిశ్రమలో)పొందడానికి మొదటి చిత్రం దర్శకుడిలా, తొలి చిత్ర నటుడిలా మంచి కథా చిత్రంగా అందరి ఆదరణతో రూపొందించడానికి సిద్ధమయ్యానన్నారు. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు చెప్పారు. చిత్రం షూటింగ్ను భారతదేశంలోని పలు ప్రాంతాలతోపాటు మెక్సికోలో కూడా చిత్రీకరించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఎస్ జే.సూర్య పేర్కొన్నారు. -
234 నియోజకవర్గాల్లోనూ రోడ్ షోలు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలలో రోడ్ షోలకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నిర్ణయించారు. 2026లో అధికారం లక్ష్యంగా తీవ్ర వ్యూహాలకు పదును పెట్టిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి జూలై 7 నుంచి రాష్ట్ర పర్యటనకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ పర్యటనల వివరాలు శుక్రవారం వెలువడ్డాయి. ఇందులో భాగంగా జరిగే కార్యక్రమాల గురించి అన్నాడీఎంకే కార్యాలయం తాజాగా ప్రకటించింది. జూలై 7వ తేదీన కోయంబత్తూరు జిల్లా మేట్టు పాళయం నియోజకవర్గం నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నారు. అక్కడి వన భద్ర కాళి అమ్మన్ ఆలయంలో ఉదయం 9.30 గంటలకు జరిగే పూజలతో తొలుత రైతు సంఽఘాలతో సమావేశం అవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రచారం మొదలు అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో రెండు చోట్ల కొన్నికి.మీ దూరం రోడ్ షో నిర్వహించే దిశగా కార్యాచరణ సిద్ధంచేశారు. జన సమూహాన్ని ఏకం చేసి ఒక చోట్ల ప్రసంగించే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రతి రోజూ పర్యటనలో రైతు సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలతో సమావేశాలు తప్పని సరి కార్యాచరణగా రూపకల్పన చేశారు. పళణి పర్యటనను విజయవంతం చేయడానికి ప్రత్యేక వాలంటీర్ల బృందాన్ని ఆయా నియోజకవర్గాలలో రంగంలోకి దించారు. ఈ ప్రచార పర్యటనకు ముందుగా జూలై 3వ తేదిన తిరుచ్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మెగా నిరసనలో పళణి స్వామి పాల్గొననున్నారు. -
రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
వేలూరు: రెండు కార్లలో తరలిస్తున్న రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆంబూరు రేంజర్ సెంథిల్ అధ్యక్షతన సిబ్బంది అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నాయకనేరి గ్రామం సమీపంలోని నడువూరు గ్రామంలో అనుమానా స్పదంగా కొందరు తిరుగుతున్నట్లు గుర్తించారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రిజిష్టేషన్ గల రెండు కార్లు ఉన్నట్లు గుర్తించారు. అటవీశాఖ సిబ్బందిని చూసిన వెంటనే రెండు కార్లతో నిందితులు పరారయ్యారు. దీంతో సినీపక్కీ లో అటవీశాఖాధికారులు వాటిని వెంబడించారు. దీంతో నిందితులు అటవీ ప్రాంతంలోని పుదూరు గ్రామం వద్ద రెండు కార్లను వదిలి పెట్టి, పరారయ్యారు. అటవీశాఖ సిబ్బంది రెండు కార్లును తనిఖీ చేయగా అందులో సుమారు రూ. 20 లక్షలు విలువ చేసే 575 కిలోల ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ సిబ్బంది రెడ్డితోపు ప్రాంతంలోని అటవీ కార్యాలయంలో అప్పగించారు. అనంతరం ఎర్రచందనం ఎవరు కార్లులో తరలిస్తున్నారు అనే కోణంలో విచారణ జరపగా నాయకనేరి పంచాయతీలోని నడువూరు గ్రామానికి చెందిన ముత్తు కుమారులు రామక్రిష్ణన్, మురుగేషన్గా తెలిసింది. వీరిద్దరూ పరారీ కావడంతో వీరి కోసం గాలిస్తున్నారు. ఈ కార్లు ఆంధ్రప్రదేశ్ రిజిష్టర్ ఉండటంతో ఈ కార్లు ఎవరివి, ఎర్రచందనాన్ని ఎక్కడ నుంచి ఎక్కడకు తరలిస్తున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
‘మేం కూడా స్నేహితులమే.. మరి మీరు తమిళం నేర్చుకోండి’
చెన్నై: హిందీ భాష అనేది ఎవరికీ శత్రువు కాదని, ఆ భాషను స్నేహపూర్వకంగా దక్షిణాది రాష్ట్రాలు చూడాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు డీఎంకే ఎంపీ కనిమొళి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. తాము హిందీ నేర్చుకోవడం సంగతిని కాసేపు పక్కన పెట్టి, ఉత్తరాది వారు తమిళం నేర్చుకుంటే బాగుంటుందని కనిమొళి స్పష్టం చేశారు. అలాగైనా తమిళ భాష జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చినట్లు అవుతుందని ఆమె పేర్కొన్నారు. ‘మేం(తమిళులం) కూడా ఎవరికీ శత్రువులం కాదు.. మేం కూడా స్నేహితులమే. మా భాష కూడా అంతా నేర్చుకోవచ్చు. ప్రత్యేకంగా నార్త్ ఇండియన్స్ తమిళం నేర్చుకంటే బాగుంటుంది’ అని అమిత్ షా పేరును ప్రస్తావించకుండానే తనదైన శైలిలో పేర్కొన్నారు.అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. హిందీ భాషను దేశంలోని ప్రతీ ఒక్కరు నేర్చుకోవాలన్నారు. హిందీని ఎవరూ శత్రువుగా భావించొద్దని, అది ఏ భాషకు శత్రువు కూడా కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న ‘త్రిభాషా పాలసీ’లో హిందీని తప్పనిసరి చేయడానికి చూడటాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలు హిందీ భాషను తమ రాష్ట్రాల్లో రుద్దడాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు తమిళం ఉండగా హిందీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రాజకీయ దురుద్దేశాలతోనే హిందీని తమిళనాడులో పాతాలని చూస్తున్నారని ఇప్పటికే ఎన్నోసార్లు ధ్వజమెత్తారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ కనిమొళి సైతం హిందీ భాషను తమ రాష్ట్రంలోకి తీసుకు రావడాన్ని ఖండించారు. -
వివాహేతర సంబంధం వద్దన్నా వినలేదు!
అన్నానగర్: వివాహేతర సంబంధం నడుపుతుందన్న కోపంతో భార్యను భర్త కొట్టి, గొంతునులిమి చంపేశాడు. చెన్నై సమీపంలోని పెరుంబాక్కంలో ఉన్న హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అపార్ట్మెంట్లో నివసిస్తున్న జాహీర్ హుస్సేన్ (39)కు సుప్రియ భేగం(26) భార్య ఉంది. వీరు ఉత్తర రాష్ట్రానికి చెందినవారు. వీరిద్దరూ వేర్వేరు ప్రైవేట్ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య తగాదా జరిగింది. దీంతో ఆగ్రహించిన జాహీర్ హుస్సేన్, సుప్రియా బేగంపై దాడి చేసి, గొంతు నులిమాడు. అప్పుడు ఆమె స్పృహ తప్పింది. దీంతో వెంటనే ఆమెను రాయపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు, సుప్రియభేగం అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషయమై ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరుంబాక్కం పోలీసులు జాహీర్ హూస్సెన్ను అరెస్టు చేసి, విచారించారు. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, మందలించిన వివాహేతర సంబంధాన్ని వదులకపోవడంతో ఆమెను కొట్టి, గొంతు నులిమి చంపినట్లు అంగీకరించాడు. -
రామన్నతో సెల్వం భేటీ!
● తైలాపురానికి టీఎన్సీసీ నేతలు ● రాజకీయాలు లేవని స్పష్టం సాక్షి, చైన్నె: పీఎంకే అధ్యక్షుడు రాందాసుతో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై నేతృత్వంలోని బృందం భేటీ అయింది. ముఖ్యనేతలతో కలిసి తైలాపురానికి సెల్వ పెరుంతొగై వెళ్లడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్యసాగుతున్న అధికార సమరం గురించి తెలిసిందే. తమ మధ్య వివాదాలు, విభేదాలకు డీఎంకే కారణం అంటూ అన్బుమణి ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే కూటమిలో కీలకపార్టీగా ఉన్న తమిళనాడు కాంగ్రెస్ ప్రతినిధులు శుక్రవారం ఉదయాన్నే తైలాపురం గెస్ట్హౌస్కు వెళ్లి రాందాసును కలవడం రాజకీయ ఆంతర్యానికి పరిస్థితులు కల్పించినట్లైంది. రామన్నతో భేటీ గత కొద్దిరోజులుగా రాందాసు డీఎంకే కూటమికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు రూబి మనోహర్, విజయన్లతో కలిసి టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై తైలాపురానికి వెళ్లారు. రాందాసుతో కాసేపు మాట్లాడారు. అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకం మాత్రమే అని స్పష్టం చేశారు. ఇందులో రాజకీయాలు లేవు, కూటమి ప్రయత్నాలు లేవని తేల్చి చెప్పారు. పీఎంకే వివాదంలో సామరస్యం కుదర్చాల్సిన అవసరం తమకు ఎందుకు అని, అది వారికి సంబంధించినది వారే పరిష్కరించుకుంటారని సమాధానం ఇచ్చారు. వారి వివాదంలోకి అన్బుమణి డీఎంకే లాగే విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. బీజేపీ నిర్బంధానికి గురై ఆయన ఆ వ్యాఖ్యలు చేస్తున్నారేమో అంటూనే, ఆయన మనస్సు అంతా డీఎంకేతోనే ఉంటుందని చమత్కరించారు. డీఎంకేలోకి పీఎంకే వస్తుందా అని ప్రశ్నించగా, డీఎంకే కూటమి బలంగా ఉందని, పీఎంకేను చేర్చుకోవాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత సీఎం స్టాలిన్పై ఉందన్నారు. తమిళనాడు అన్ని రంగాల్లో బలంగా ఉందని, దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా దూసుకెళ్తోందని, తమ కూటమి ఈ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము మాత్రం ఇక్కడ రాజకీయంగా రాలేదని, పుదుచ్చేరికి వెళ్లి వస్తూ మార్గ మధ్యలో దిండివనం తైలాపురానికి వచ్చి రాందాసును మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసినట్టు అన్నారు. -
పళణి పర్యటన షెడ్యూల్ విడుదల
● 7 నుంచి రాష్ట్ర పర్యటనసాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె పళనిస్వామి రాష్ట్ర పర్యటన రూట్ మ్యాప్ వెలువడింది. జూలై 7వ తేదీ నుంచి విస్తృతంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆయన పర్యటించనున్నారు. 2026లో అధికారం లక్ష్యంగా వ్యూహాలకు పళణిస్వామి పదును పెట్టిన విషయం తెలిసిందే. ప్రజల్లో మమేకం అయ్యే విధంగా రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నారు. జూలై 7న కోయంబత్తూరులోని మేట్టుపాళయం సమీపంలోని గౌండంపాళయం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన పర్యటనకు శ్రీకారంచుట్టనున్నారు. ముందుగా కోయంబత్తూరు, ఆ తర్వాత విల్లుపురం, కళ్లకురిచ్చి, తంజావూరు, నాగపట్నం, తిరువారూర్ జిల్లాల మీదుగా సాగే విధంగా రూట్ మ్యాప్ను రూపకల్పన చేసుకుని ఉండడం శుక్రవారం అన్నాడీఎంకే కార్యాలయం ప్రకటించింది. తొలి విడత పర్యటన జూలై 20వ తేదీ వరకు జరగనుంది. కాగా, అన్నాడీఎంకే చిహ్నం ఇతర వ్యవహారాలపై ఎన్నికల కమిషన్ కోర్టులో ఉన్న బంతి విషయంగా ఎలాంటి నిర్ణయం ఇంతవరకు వెలువడలేదు. దీంతో పళణిస్వామి హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్ విచారణ సమయంలో అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలపై తుది ఉత్తర్వులు ఎప్పుడు వెలువడతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. -
బహుముఖ ప్రజ్ఞాశాలి కలైంజ్ఞర్
● ఉత్తమ రచనలకు గుర్తింపు ● సాహితీ అవార్డు గ్రహీలకు ప్రభుత్వ గృహాలు ● సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: బహుముఖ ప్రజ్ఞాశాలి, దివంగత నేత కలైంజ్ఞర్ అని సీఎం ఎంకే స్టాలిన్ కొనియాడారు. ఉత్తమ రచనలు, రచయితలకు ద్రావిడ మోడల్ ప్రభుత్వం అండగా ఉండటమే కాకుండా, వారికి సరైన గుర్తింపు ఇస్తున్నట్టు వ్యాఖ్యానించారు. సాహితీ అవార్డు గ్రహీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గృహాలను కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు.కాంచీపురం ఏకాంబరనాథర్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, చూలైమేడులోని అంజుగం ప్రాథమిక పాఠశాలలో రూ. 13.94 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు పాఠశాల భవనాలను సీఎం స్టాలిన్ శుక్రవారం ప్రారంభించారు. ఆ పాఠశాలల విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యాసామగ్రి, సైకిళ్లను అందజేశారు. కీల్పాకంలో జరిగిన ఈ కార్యక్రమంలో హిందూ మత దేవాదాయ శాఖ పరిధిలోని విద్యా సంస్థల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. అలాగే, విద్యార్థుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సీఎం స్టాలిన్ తిలకించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో హిందూ మత, దేవాదాయ శాఖ మంత్రి పి.కే. శేఖర్బాబు, ధర్మపుర ఆధీనం మాసిలామణి దేశిక జ్ఞానసంపద పరమాచార్యస్వామి, కుండ్రకుడి ఆధీనం పొన్నంబల దేశిక ఆడిగలార్, మయిలం బొమ్మపుర ఆధీనం శివజ్ఞానపాలయ స్వామిగల్, శ్రీపెరంబుదూర్ మఠం అప్పన్ ఉలగరియ రామానుజ ఎంబార్ జీయర్ స్వామిగల్, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మేయర్ ఆర్. ప్రియ, డిప్యూటీ మేయర్ ఎం. మహేష్కుమార్, ఎమ్మెల్యేలు ఎంకే. మోహన్ తదితరులు పాల్గొన్నారు. కలైవానర్ అరంగంలో శతాబ్ది ఉత్సవ సదస్సు సాహితి అకాడమీ, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, తమిళ శాఖ సంయుక్తంగా కలైంజ్ఞర్ శతాబ్ది ఉత్సవం జరిగింది. ముత్తమిళరిగ్నర్ కలైంజ్ఞర్ శతాబ్ది ఉత్సవం పేరిట జరిగిన సదస్సుకు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. సదస్సును ప్రారంభించడంతో పాటు ఒక ప్రత్యేక సంచికను విడుదల చేశారు. అలాగే సాహితీ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వ గృహాలను కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ వివిధ అంశాల ఆధారంగా జరిగిన ఈ సదస్సుకు పెట్టిన పేరులో కలైంజ్ఞర్కు సాటి మరొకరు లేరని వ్యాఖ్యానించారు నాయకుడిగా, కళాకారుడిగా, అపార ప్రతిభావంతుడి బహుముఖ ప్రజ్ఞాశాలి కలైంజ్ఞర్ కరుణానిఽధి అని కొనియాడారు. రంగ స్థల ప్రసంగాలు, సాహిత్యానికి మరో ముఖంగా కలైంజ్ఞర్ ఉన్నారని, శాసన సభలో ఆయన ప్రసంగం సభా గౌరవానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. తన జీవితంలో 80 సంవత్సరాలు ప్రజాసేవకే అంకితం చేసిన గొప్ప నాయకుడని, ఆయన చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు భారతీయ సమాజాన్ని ప్రేరేపించాయని చెప్పారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆదర్శంగా సాహిత్య అకాడమీ గొప్పగా పనిచేస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రంలో ఈ వేదిక ఆధారంగా రచయితలు, అనువాదకులను ప్రోత్సహించడమే లక్ష్యంగా సాహిత్య అకాడమీ లక్ష్యంగా పయనం సాగుతున్నట్టు తెలిపారు. తమిళ సాహిత్యం ప్రత్యేక రంగంగా తీర్చిదిద్దేలా రూ. 5.30 కోట్లు కేటాయించామని గుర్తు చేస్తూ, ఈ సమయంలో తాను ఒక సందేశాన్ని ప్రస్తావించాలనుకుంటున్నానన్నారు. సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న ముగ్గురు తమిళ పండితులకు కలైంజ్ఞర్ కలల ప్రాజెక్టు గా హోమ్ అనే పథకం అమల్లోకి తీసుకొచ్చామన్నారు. ఈ ప్రాజెక్టులో తమిళనాడు ప్రభుత్వం ఇప్పటివరకు 15 మంది పండితులకు స్కాలర్షిప్లను అందించిందని, ఇక, డ్రీమ్ హోమ్ ప్రాజెక్ట్ ఖర్చులు తమిళనాడు ప్రభుత్వం భరిస్తుందన్నారు. సాహిత్య అకాడమీ అనువాద అవార్డు గ్రహీతలకు సైతం ఇక గృహాలను అందజేయనున్నామని ప్రకటించారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం అమల్లో లేదని, ఇదికొనసాగుతుందని స్పష్టం చేశారు. -
ఎన్డీఏ కూటమిదే అధికారం!
● అధికారంలో బీజేపీకి వాటానా? ● సీఎం ఎవరో తేల్చని అమిత్ షా ● అన్నాడీఎంకేలో గందరగోళం ● పళణి నేతృత్వంలోనే అధికారం అన్న రెండాకుల సేనలు సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలో కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఓ తమిళ మీడియాకు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళనాట ఎన్డీఏ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని, కూటమి పాలన తథ్యమని అమిత్షా సంకేతాన్ని ఇచ్చారు. అయితే, సీఎం ఎవరో అన్న ప్రశ్నకు ట్విస్టు పెట్టే రీతిలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి పేరును ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇటీవల చైన్నెకి వచ్చిన అమిత్షా సమక్షంలో జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమిలోకి అన్నాడీఎంకే మళ్లీ చేరిన విషయం తెలిసిందే. అదేసమయంలో తమిళనాట మాత్రం అన్నాడీఎంకే నేతృత్వంలోనే కూటమి అని ప్రకటించారు. అన్నాడీఎంకే నీడలోనే ఎన్నికలు అని స్పష్టం చేశారు. అయితే, ఇటీవల కాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, బీజేపీ నేతల వ్యాఖ్యలు అన్నాడీఎంకే వర్గాలను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. పళణిస్వామి నేతృత్వంలోనే తమిళనాట కూటమి అన్న పరిణామాలు సాగుతున్న సమయంలో అధికారంలో వాటా అనే నినాదాన్ని అందుకునే విధంగా బీజేపీ నేతలు ముందడుగు వేయడం చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితుల్లో తాజా తమిళనాట ఎన్డీఏ కూటమిదే అధికారం అని స్పష్టం చేసిన అమిత్షా సీఎం అభ్యర్థి విషయంలో ట్విస్టు పెట్టడం అన్నాడీఎంకేలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించినట్లైంది. అమిత్షా వ్యాఖ్యలపై చర్చ ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు అమిత్షా స్పందించారు. తమిళనాడులో కూటమి పాలనే అని ఓ ప్రశ్నకు స్పష్టం చేస్తూ, ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలో వివాదాల గురించి స్పందిస్తూ, విడిపోయిన వారిని ఒక చోట చేర్చడం తమ పని కాదని, ఎవరి పని వాళ్లు చేసుకోవాల్సిందేనని, అది వారి పార్టీకి సంబంధించిన వ్యవహారం అంటూ, ఇందులో తలదూర్చమన్నారు. తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకేలతో కూడిన ఎన్డీఏ కూటమి బలంగా ఉందని, అధికారంలో బీజేపీ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కూటమిలో సీఎం అభ్యర్థి ఎవరో అన్న ప్రశ్నకు ట్విస్ట్ ఇచ్చారు. తమిళనాట ఎన్డీఏ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చినా, సీఎం అభ్యర్థి అన్నాడీఎంకేకు చెందిన ఒకరు ఉంటారన్న వ్యాఖ్యతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి మద్దతు దారుల గుండెల్లో బాంబును పేల్చారు. పళణిస్వామి పేరును సీఎం అభ్యర్థిగా అమిత్షా పరిగణించనట్టుగానే ఈ ట్విస్టును భావించాలన్న కొత్త చర్చ ఊపందుకుంది. అదే సమయంలో ఇటీవల కాలంగా బీజేపీ పెద్దలతో అన్నాడీఎంకేకు చెందిన ఎస్పీ వేలుమణి, సెంగోట్టయన్ సన్నిహితంగా ఉంటూ రావడంతో ఆ ఇద్దర్ని అమిత్షా దృష్టిలో పెట్టుకున్నారా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇక, విజయ్ ఎన్డీఏలోకి వస్తారా అనే ప్రశ్నకు ఎన్నికలకు ఇంకా సమయం ఉందని వేచి చూడండి అని సమాధానం ఇచ్చారు. న్యూస్రీల్పళణిస్వామి సీఎం అభ్యర్థి అమిత్షా వ్యాఖ్యలపై పలువురు అన్నాడీఎంకే నేతలు స్పందిస్తూ పరోక్షంగా ఖండించారు. మాజీ మంత్రి రాజేంద్రబాలాజీ స్పందిస్తూ తమిళనాడులో అన్నాడీఎంకే నేతృత్వంలోనే కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. సీఎం అభ్యర్థి పళణిస్వామి మాత్రమే అని స్పష్టం చేశారు. మరో మాజీ మంత్రి వైగై సెల్వన్ స్పందిస్తూ తమిళనాట కూటమి పాలనకు ఆస్కారం లేదన్నారు. ఇందుకు తమిళనాడు ప్రజలు అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. కూటమి పాలన అన్నది చరిత్రలో ఇక్కడ జరగలేదని, ఇక మీదట కూడా జరగబోదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే కూటమి లక్ష్యం డీఎంకేను గద్దె దించడమే అని పేర్కొంటూ, కూటమి పాలనను అంగీకరించం అని తేల్చి చెప్పారు. ఇక, బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ను ప్రశ్నించగా, కూటమి, అధికారం అన్న విషయాల గురించి తమ నేత అమిత్షా, పళణిస్వామి చర్చించి నిర్ణయం తీసుకుంటారని దాట వేశారు. -
మొహర్రం సమ్మేళనానికి శ్రీకారం
సాక్షి, చైన్నె : మొహర్రం నెల ప్రారంభంతో మొహర్రం ఆథ్యాత్మిక సమ్మేళనానికి చైన్నె వేదికగా శుక్రవారం శ్రీకారం చుట్టారు. దావూదీ బోహ్రా ముస్లిం సమాజానికి 53వ నాయకుడైన సయ్యద్నా ముఫద్దాల్ సైపుద్దీన్ ప్రత్యేక ప్రసంగం చేశారు. ఆషారా ముబారకా పేరిట జూలై 5వ తేదీ వరకు జరిగే ఈ సమ్మేళనానికి ఆయన నాయకత్వం వహించనున్నారు. సయ్యద్నా సైఫుద్దీన్ వార్షిక మొహర్రం సమ్మేళనంలో ప్రవక్త మహ్మద్ మనవుడైన ఇమామ్ హుస్సేన్ త్యాగాలను, కర్బలాలో ఆయన బలిదానం వంటి అంశాల గురించి ప్రసంగిస్తున్నారు. చైన్నెలోని ఎస్ఎంబీ వీధిలోని సైఫీ మసీదు, వింగ్స్ కన్వెన్షన్ సెంటర్, వైఎంసీఏ, బిన్నీ గ్రౌండ్తో సహా నగరంలో తొమ్మిదిచోట్ల ఆయన ప్రసంగాలను ప్రత్యేకప్రసారం ద్వారా తొలి రోజున దావూదీ బోహ్రా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన సుమారు 43 వేల మంది వీక్షించినట్టు నిర్వాహకులు ప్రకటించారు. చైన్నెలో జరిగే ప్రసంగాలను కోయబత్తూరు, ఈరోడ్, సేలంలతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్లోని ఆ సామాజిక వర్గం వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చైన్నెలోని ఆ కమ్యూనిటీ ఔట్రీచ్ కో ఆర్డినేటర్ అలియాస్తర్ షకీర్ తెలిపారు. దక్షిణ భారత దేశ సాంస్కృతిక రాజధానిగా పిలవబడే చైన్నెలో సమ్మిళితత్వం, వైవిధ్యం, సామరస్యాన్ని ప్రోత్సహించడానికి సైఫుద్దీన్ పర్యటన మరింత దోహదకరంగా మారినట్టు వ్యాఖ్యానించారు. -
7నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
● ర్యాంకుల జాబితా విడుదల ● జనరల్ కౌన్సెలింగ్ 14 నుంచి సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే ఇంజినీరింగ్ కళాశాలలో ప్రభుత్వ కోటా సీట్ల భర్తీ నిమిత్తం కౌన్సెలింగ్ తేదీ ఖరారు చేశారు. జూలై 7 నుంచి రిజర్వుడ్, 14 నుంచి జనరల్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కటాఫ్ మార్కులు 200లకుగాను 200 సాధించిన టాపర్లు, కౌన్సెలింగ్కు అర్హత సాధించిన ఇతర ర్యాంకర్ల జాబితాను ఉన్నత విద్యా మంత్రి కోవిచెలియన్ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రంలో అన్నావర్సిటీ, సాంకేతిక విద్యా డైరెక్టరేట్ పరిఽధిలో ఉన్న 430 మేరకు ఇంజినీరింగ్ కళాశాలలో కౌన్సెలింగ్ నిమిత్తం దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగిసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుల ఆధారంగా ర్యాండం నంబర్లను ప్రకటించారు. ప్లస్టూ మార్కుల ఆధారంగా కటాఫ్ నిర్ణయించి ర్యాంకుల జాబితాను సిద్ధం చేశారు. ఉదయం అన్నావర్సిటీ ఆవరణలోని సాంకేతిక విద్యా డైరెక్టరేట్లో ఉన్నత విద్యాశాఖా మంత్రి కోవిచెలియన్ జాబితాను విడుదల చేశారు. సీట్ల కోసం 3 లక్షల 2374 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వీరిలో 2 లక్షల 50 వేల 298 మంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్టు మంత్రి ప్రకటించారు. గత ఏడాది కంటే ఈ సారి 40,645 మంది అదనంగా నమోదు చేసుకున్నారని తెలిపారు. జూలై 7 నుంచి కౌన్సిలింగ్.. 200లకుగాను 200 కటాఫ్ మార్కులను స్టేట్ బోర్డు సిలబస్లో చదువుకున్న 144 మంది, ఇతర బోర్డుల ద్వారా చదువుకున్న ఐదుగురు ఉన్నారని ప్రకటించారు. వెబ్సైట్లో ర్యాంకుల జాబితా ఉన్నట్టు, ఏదేని లోపాలు ఉన్నా, ఎవరి పేర్లు అయినా లేకున్నా వెంటనే సమీపంలోని అడ్మిషన్ సెంటర్లను సంప్రదించి జూలై 2లోపు ఫిర్యాదులను నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు అర్హత సాధించిన వారిలో 2 లక్షల 41 వేల 641 మంది ఉన్నారని, వీరిలో రిజర్వుడ్ కోటా సీట్లకు (క్రీడ, దివ్యాంగులు, మాజీ సైనికులు) జూలై 7 నుంచి 11వ తేదీ వరకు కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. జనరల్ కోటా జూలై 14 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు నిర్వహించనున్నామన్నారు. అనుబంధ కౌన్సెలింగ్ ఆగస్టు 21 నుంచి 23 వరకు జరుగుతుందన్నారు. టాపర్లు.. స్టేట్ బోర్డు సిలబస్ ఆధారంగా మంత్రి ప్రకటించిన జనరల్ కేటగిరి ర్యాంకుల జాబితాలో తొలి స్థానాన్ని కాంచీపురానికి చెందిన సహస్త్ర అనే విద్యార్థిని దక్కించుకుంది. రెండవ స్థానంలో నామ్కల్కు చెందిన కార్తిక, మూడో స్థానం అరియలూరుకు చెందిన అమలన్ ఆంటో దక్కించుకున్నారు. ఇక 7.5 శాతం ప్రభుత్వ ప్రత్యేక కోటా మేరకు తొలి స్థానాన్ని కడలూరుకు చెందిన ధరణి, రెండో స్థానాన్ని చైన్నెకు చెందిన మైథిలి, మూడో స్థానాన్ని కడలూరుకు చెందిన మురళిధరన్ ఉన్నారు. జనరల్ కేటగిరి ర్యాంకుల జాబితాలో టాప్ 10లో ఏడుగురు విద్యార్థినులు, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది కౌన్సెలింగ్కు ప్రభుత్వ పాఠశాలల నుంచి 47,372 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా, విద్యార్థులు ఏదేని సందేహాలను నివృతి చేసుకోదలచిన పక్షంలో 18004250110 టోల్ఫ్రీ నంబరును సంప్రదించవచ్చని మంత్రి సూచించారు.70 వేలు దాటిన వైద్య దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వ వైద్యకళాశాలలు, ప్రైవేటు కళాశాలలోని ప్రభుత్వ కోటా పరిధిలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల సీట్ల భర్తీకి నీట్ మార్కుల ఆధారంగా దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పదివేల లోపు సీట్లు ఉండగా, ఇప్పటి వరకు 70 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆదివారంతో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాత నీట్ మార్కుల ఆధారంగా ర్యాంకుల జాబితాను ప్రకటించే విధంగా వైద్య విద్యా డైరెక్టరేట్ అడ్మిషన్స్ విభాగం కార్యదర్శి థేరనిరాజన్ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. కొన్ని కోర్సులు మిగిలి ఉండడంతో వాటిని భర్తీ చేయడానికి రెండో విడత కౌన్సెలింగ్కు చర్యలు చేపట్టారు. -
14 నుంచి నిరవధిక సమ్మె
తిరువళ్లూరు: రేషన్ దుకాణ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చని పక్షంలో జూలై 14వ తేదీ నుంచి నిరవదిక సమ్మెకు దిగుతామని ఉద్యోగులు ప్రకటించారు. తమిళనాడు రాష్ట్ర ప్రాథమిక సహాకార సంఘం ఆధ్వర్యంలో రేషన్ దుకాణాలు నడుస్తున్నాయి. ఈ దుకాణాల ద్వారా నిరుపేదలకు బియ్యం, పప్పులు, నూనె తదితర వస్తువులు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల నిత్యావసర వస్తువులను అందించే సమయంలో కొత్త నిబంధనలను పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త ఉత్తర్వులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆరోపిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తొలిదశ ఆందోళనలో భాగంగా తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షుడు మురుగేషన్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి త్యాగరాజన్ హాజరై, ప్రసంగించారు. మాట్లాడుతూ నిత్యావసర వస్తువులను అందించే సమయంలో బ్లూటూత్ను త్రాసుకు అనుసంధానం చేయాలన్న విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. గోడౌన్ నుంచి సరుకులు బయటకు వచ్చే సమయంలో తూకం సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెలవు దినాల్లో ఉద్యోగులకు ఇస్తున్న వేర్వేరు పనులను రద్దు చేయాలని కోరారు. సేల్స్మెన్ విద్యార్హత ఆధారంగా ఉద్యోగోన్నతి కల్పించాలని కోరారు. సేల్స్మెన్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయవద్దని కోరారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో జూలై 14వ తేదీ నుంచి విధులను బహిష్కరించి సామూహిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నేతలు మారీ, నూర్మహ్మాద్, జయచంద్రన్, మేగనాథన్, పొన్నన్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట కుటుంబ సభ్యులతో ఆత్మహత్యాయత్నం
వేలూరు: స్థానిక కలెక్టరేట్ ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా కల్లూరు ఎంజీఆర్ నగర్కు చెందిన సత్యకుమార్ తన తల్లి చంద్ర, భార్య సంగీత, చెల్లెలు, ఆమె కుమార్తెతోపాటు శుక్రవారం ఉదయం వేలూరు కలెక్టరేట్కు వచ్చారు. ఆ సమయంలో వారు తీసుకొచ్చిన పెట్రోల్ను శరీరంపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వారిపై నీటిని పోశారు. ఆ సమయంలో సత్యకుమార్ తల్లి చంద్ర ఉన్నఫళవగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో పోలీసులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు సత్యకుమార్ను విచారించగా తమ గ్రామానికి చెందిన చంద్రు అనే వ్యక్తి గత వారం తాను నిలిచి ఉన్న ప్రాంతానికి బైకులో వచ్చి తనపై దాడి చేసి గాయ పరిచాడని, ఈ విషయమై తాను గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. అయితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేశారన్నారు. దీంతో తాను వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా గుడియాత్తం పోలీసులు తమను కాదని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తావా? అని వేధింపులకు గురి చేస్తున్నారని, దీంతోనే తాము కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్లోని అధికారులకు వినతి పత్రం అందజేశారు. -
ఎలక్ట్రిఫైయింగ్ తమిళనాడు ప్రచారానికి శ్రీకారం
కొరుక్కుపేట: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ–డాడీ సంస్థ ఆధ్వర్యంలో ఎలక్ట్రిఫైయింగ్ తమిళనాడు(విద్యుదీకరణ తమిళనాడు) ప్రచారాన్ని ప్రారంభించినట్టు ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలు యాస్మీన్ జవహర్ అలీ తెలిపారు. చైన్నెలోని ట్రేడ్ సెంటర్లో శుక్రవారం నుంచి ఈవీ ఇండియా ఎక్స్పో 2025 ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో ఎలక్ట్రిక్ మెబిలిటీలో పేరుగాంచిన ఈ–డాడీ సంస్థ భారతదేశంలో మొట్టమొదటి ఐఆర్ఏఐ ఆమోదించిన మల్టీ వెహికల్ ఈవీ రెట్రోఫిట్ కిట్ను ఆవిష్కరించింది. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం విద్యుదీకరణ తమిళనాడు పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీనిని స్టార్టప్ టీఎన్ సీఈఓ, మిషన్ డైరెక్టర్ శివరాజారామయ్య, ఇప్పో పే వ్యవస్థాపకులు మోహన్ కె ప్రారంభించారు. ఈ సందర్భంగా యాస్మీన్ జవహర్ అలీ మట్లాడుతూ ఇంధన వాహనాలతో కాలుష్యం పెరిగిపోవడంతోపాటు ఖర్చులు ఎక్కువైపోతున్నాయన్నారు. ఇంధనంతో నడిపే వాహనాలను ఈవీ వెహికల్గా మార్చడమే లక్ష్యంపై తాము దృష్టి పెట్టామని చెప్పారు. 2026 నాటికి తమిళనాడులోని టైర్ 2, టైర్ 3, గ్రామీణ ప్రాంతాల్లో 4 వేల వాహనాలను రెట్రోఫిట్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ–డాడీ ప్రారంభించిన రెట్రోఫిట్ కిట్ ఇప్పటికే ఉన్న ఇంధనంతో నడిచే ఆటో రిక్షాలను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి అనుమతి ఇచ్చిందని, ఈ కిట్ అమర్చడంతో సాధారణంగా ఇంధన ఖర్చుల కంటే దాదాపు 75 శాతం తక్కువ అవుతుందని ఆమె వెల్లడించారు. ఈ ప్రదర్శనలో ఈ–డాడీ ఇంజినీరింగ్ చేసిన 2026లో ఉత్పత్తిని విడుదల చేయడానికి షెడ్యుల్ చేసిన పూర్తి ఎలక్ట్రిక్ త్రీ –వీలర్ అయిన ఎక్స్3 ఆటోను ప్రదర్శనలో ఉంచిందన్నారు. తేలికై న డిజైన్, ఎర్గోనామిక్ సౌకర్యం, స్మార్ట్ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు.