breaking news
Tamil Nadu
-
కుమారుడిని చంపి ఆత్మహత్య చేసుకున్న ఆడిటర్
సాక్షి, చెన్నై: ఆడిటర్గా పనిచేస్తున్న వ్యక్తి స్టాక్ మార్కెట్లో తీవ్ర నష్టాలు చవిచూడటంతో మనస్తాపం చెంది భార్య గొంతుకోసి, కుమారుని గొంతు నులిమి ఆ తర్వాత రైలు కిందపడి ఆత్మహత్మ చేసుకున్నాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన నవీనఖన్నా (42) అన్నానగర్ లోని ఓ ఫ్లాట్లో ఉంటున్నాడు. తేనాంపేటలోని సెంట్రల్ కంప్రోల్టర్, ఆడిటర్ జనరల్ కార్యాలయంలో ఆడిటర్గా పనిచేస్తున్నాడు. ఈయనకు తల్లి భువనేశ్వరి, భార్య నివేదిత (30), కుమారుడు లావిన్ కన్నన్ (7) ఉన్నారు.నివేదిత పెరంబూరులోని లోకో ఆఫీసులో సూపర్వైజర్ పనిచేస్తున్నారు. సోమవారం నవీన్ బయటకు వెళ్లిన అనంతరం తల్లి భువనేశ్వరికి ఫోన్ చేసి భార్య, కుమారుడు చాలాసేపు నిద్రపోతారని, రాత్రి 11 గంటల వరకు ఇబ్బంది పెట్టొద్దని చెప్పి, ఫోన్ కట్ చేశాడు. అనుమానం వచ్చిన తల్లి బెడ్రూమ్ తలుపు తట్టినా తెరవకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, లావిన్ కన్నన్ చనిపోయి ఉన్నాడు. మెడ తెగిపోయిన నివేదితకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో కీల్పాకం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈక్రమంలోనే నవీన్ చెన్నైలోని విల్లివాక్కం రైల్వేస్టేషన్ సమీపంలో ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అయితే తాను పనిచేసే కార్యాలయంలో మాజీ సైనికోద్యోగులకు ఇవ్వాల్సిన కోట్లాది రూపాయల సొమ్మును దుర్వినియోగం చేసి, ఆ డబ్బును షేర్ మార్కెట్లో పెట్టినట్టు విచారణలో వెల్లడైంది. నష్టాలు రావడంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొదట తన బిడ్డ గొంతు నులిమి చంపి, ఆపై కత్తితో భార్య గొంతు కోసినట్టు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి
చెన్నై: రామనాథపురంలోని ఓంశక్తి నగర్కు చెందిన సుబ్రమణియన్ కుమారుడు దీపన్ కుమార్ (30) ఖత్తార్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. తనతో పాటూ పనిచేసే ఫిలిప్పీన్స్ యువతి అర్ష (28) తో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ 5 సంవత్సరాలు కొనసాగింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని తరువాత, దీపన్ కుమార్ తన స్వస్థలంలో తమిళ సాంస్కృతిక ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలనే కోరికను అర్షకు వ్యక్తం చేశాడు. ఆమె దీనికి అంగీకరించింది. ఈ క్రమంలో సోమవారం వీరి వివాహం తమిళ సాంస్కృతి ఆచారాల ప్రకారం రామనాథపురంలో ఘనంగా జరిగింది. -
జిల్లాలో 554.6మిమీల వర్షపాతం
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా 554.60 మి.మీల వర్షపాతం నమోదు కాగా అఽత్యధికంగా పొన్నేరిలో 72మి.మీ, అత్యల్పంగా ఆర్కే పేటలో 4.6మిమీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 554.60 మి.మీల వర్షపాతం నమోదైంది. సరాసరిన 36.97 మి.మీల వర్షపాతం నమోదైంది. కాగా తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రెండు గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు పది పశువులు నీటిలో కొట్టుకపోయాయి. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా చెరువులకు భారీగా నీరు చేరుతోంది. -
నిండుకుండల్లా.. ఆనకట్టలు
తిరువళ్లూరు: కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని అన్ని ఆనకట్టలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఆనకట్టల నుంచి మిగులు జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి భారీ నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటూ ఆంధ్ర, వేలూరు తదితర ప్రాంతాల నుంచి భారీగా కూవం, కుశస్థలి, ఆరణియార్ ద్వారా భారీగా వరద నీరు వస్తుండడంతో జిల్లాలోని పూండి, పుళల్, చెమరంబాక్కం, చోళవరం, తేరువాయి కండ్రిగ–కన్నన్కోట రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయింది. దీంతో మిగులు జలాలను రిజర్వాయర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని సుమారు వందకు పైగా చెరువుల్లో 75 శాతం పైగా నీరు చేరింది. గ్రామాల్లోని బావులు, చెరువులు, కొలనులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈక్రమంలోనే జిల్లాలో రిజర్వాయర్లు, చెరువుల తరువాత స్తానంలో ప్రధాన నీటి వనరుగా వున్న ఆనకట్టలు పూర్తిగా నిండిపోయాయి. భారీగా నీటినిల్వ.. సురుటుపళ్లి చెక్డ్యామ్లో వంద మిలియన్ ఘనపరిమాణం, పనపాక్కం చెక్డ్యాడ్లో 10.97 మిలియన్ ఘణపరిమాణం, కల్పట్టులో 9.15 మిలియన్ ఘణపరిమాణం, చెంగాత్తుకుళం చెక్డ్యామ్లో 138 మిలియన్ ఘణపరిమాణం, పాళేశ్వరం చెక్డ్యామ్లో 98.84 మిలియన్ ఘనపరిమాణం, ఏఎన్కుప్పం చెక్డ్యామ్లో 98.55 మిలియన్ ఘనపరిమాణం, లక్ష్మీపురం చెక్డ్యామ్లో 300 మిలియన్ ఘణపరిమాణం, రెడ్డిపాళ్యం చెక్డ్యామ్లో 150 మిలియన్ ఘనపరిమాణం, ఆండార్మఠం డ్యామ్లో 22.60 మిలియన్ ఘనపరిమాణంతో పాటూ మొత్తం 927.31 మిలియన్ ఘనపరిమాణంలో నీటి నిల్వ ఉంది. దీంతో పాటూ తామరపాక్కం, పుట్లూరు, పుదుసత్రం, పింజివాక్కం, ఏకాటూరు చెక్డ్యామ్లు సైతం పూర్తిగా నిండి మిగులు జలాలు కిందికి వదిలి వెళ్ళుతున్నాయి. చెక్డ్యామ్లు పూర్తీ స్తాయి నీటి మట్టానికి చేరిన క్రమంలో సమీప ప్రాంతాల్లోని బావులు, బోర్లులలో నీరు పుష్కలంగా లబించే అవకాశం ఉంది. ఇదేవిధంగా భూగర్భ జలాలు సైతం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. అయితే కూవం, కుశస్థలి, ఆరణియార్ ద్వారా జిల్లాకు భారీగా వరద నీరు వస్తోంది. ఇదే సమయంలో అదనపు ఆనకట్టలు లేకపోవడంతో రోజులకు రెండు టీఎంసీల చొప్పున నీరు వృథాగా పోతోందని పలువురు రైతులు వాపోతున్నారు. అదనపు ఆనకట్టలను నిర్మించాలని కోరుతున్నా పాలకులు సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా గత కొద్ది రోజుల క్రితం వరకు నీరు లేక ముళ్ల పొదలతో నిర్మానుష్యంగా కనిపించిన ఆనకట్టలు ప్రస్తుతం జళకళతో కళకళాడుతుండడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ముంపు బాధితులకు కలెక్టర్ పరామర్శ
వేలూరు: వేలూరు జిల్లాలో వారం రోజులుగా తరచూ వర్షాలు కురుస్తుండటంతో వేలూరు కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇల్లలోకి చేరింది. దీంతో ఆ ప్రాంతంలో నివశిస్తున్న నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కనసాల్పేట, ఇందిరానగర్, అరియూరు, ముళ్ళిపాల్యం, గాంధీనగర్, జీవానగర్, వీజీరావ్ నగర్ వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు వారం రోజులుగా తగ్గడం లేదు. కార్పొరేషన్ సిబ్బందిచే మోటర్లు ద్వారా నీటిని తొలగిస్తున్నప్పటికీ ఉబరి నీరు అధికంగా రావడంతో నీటిమట్టం తగ్గడం లేదు. దీంతో ఆ ప్రాంతంలోని నివాసితులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలు, కల్యాణ మండపాల్లో ఉంచి వారికి అవసరమైన కనీస వసతులతో పాటూ భోజన వసతులను జిల్లా యంత్రాంగం చేస్తుంది. అదేవిధంగా నీరు అధికంగా చేరిన ప్రాంతాల్లో మంగళవారం ఉదయం కూడా మోటార్లు ద్వారా తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. నీరు చేరిన ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి అక్కడున్న ప్రజలకు వైద్య పరీక్షలు చేయడంతో పాటూ బ్లీచింగ్ చల్లడం, వీధులను శుభ్రం చేయడం వంటి పనిలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ముంపు బాధితులను కలెక్టర్ సుబ్బలక్ష్మి, మేయర్ సుజాత, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణన్ నేరుగా వెళ్లి పరామర్శించడంతో పాటు వారికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
క్లుప్తంగా
కారు దగ్ధం తిరువొత్తియూరు: అడయారులో కారుకు మంటలు అంటుకొని దగ్ధమైంది. ఈ ప్రమాదం నుంచి తండ్రీ, కూతురు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు.. తెలంగాణకు చెందిన వెంకటేశ్వర కుమార్తె పోరూరులో ఉంటూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ మెడిసిన్ చదువుతోంది. సోమవారం ఆమె చదువు పూర్తయిన సందర్భంగా ఆమెను తీసుకెళ్లడానికి తండ్రి వెంకటేశ్వర కారులో వచ్చారు. తండ్రీకూతుళ్లు సోమవారం రాత్రి బీసెంట్ నగర్ బీచ్ నుంచి మెరీనా బీచ్ వైపు కారులో బయలుదేరారు. అడయారు ఆవిన్ సెంటర్ దగ్గరకు రాగానే కారు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారును ఆపి దిగిపోయారు. కొద్దిసేపటికే కారు మొత్తం మంటల్లో కాలిపోయింది. తిరువాన్మియూర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. శాస్త్రి నగర్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. అప్పు చెల్లించలేదని కిడ్నాప్ తిరువొత్తియూరు: అప్పు చెల్లించలేదని ఓవ్యక్తిని దుండగలు కిడ్నాప్ చేశారు. విల్లుపురం జిల్లా, వనత్తి గ్రామానికి చెందిన శివ (40) వ్యవసాయం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం బంధువుల వద్ద కొంత నగలు అప్పుగా తీసుకున్నాడు. అప్పును తిరిగి చెల్లించకపోవడంతో అప్పుఇచ్చిన వారు మంగళవారం ఉదయం 8 గంటలకు అతని ఇంటి వద్దకు వెళ్లి మాట్లాడారు. ఆ సమయంలో చర్చలు సఫలం కాకపోవడంతో ఐదుగురు శివను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విల్లుపురం పోలీసులు కారును వెంబడించారు. పోలీసులు పట్టుకుంటారని భయపడి కారును రోడ్డుపై రాంగ్ రూట్లో నడిపారు. ఆ సమయంలో రోడ్డుపై వచ్చిన మూడు బైకులను ఢీకొట్టి చైన్నె– జాతీయ రహదారి వైపు వేగంగా వెళ్లారు. శివను, అతని కారును విల్లుపురం జాతీయ రహదారి జానకిపురం వద్ద వదిలిపెట్టి మరో కారులో పారిపోయారు. పోలీసులు శివను రక్షించి అతని వద్ద విచారణ జరుపుతున్నారు.. ఇంజినీర్ హత్య తిరువొత్తియూరు: శివగంగై జిల్లాలో ఇంజినీర్ను హత్య చేసిన సంఘటనపై చర్యలు తీసుకోవాలని బంధువులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. శివగంగై జిల్లా, కారైకుడి సమీపంలోని అరియకుడి ప్రాంతానికి చెందిన సుబ్రమణియన్ కుమారుడు పళనియప్పన్ (34) సివిల్ ఇంజినీర్. ఇతను బీజేపీ జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా పనిచేశాడు. ఇతనికి అరియకుడి, ఇలుప్పకుడి ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో వాణిజ్య సముదాయంలో అద్దెకు ఉన్న వ్యక్తికి, పళనియప్పన్న్కు మధ్య దుకాణాన్ని ఖాళీ చేయడంపై కక్షలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో సోమవారం పళనియప్పన్ పొన్ నగర్ ప్రాంతంలో తాను నిర్మిస్తున్న ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో ఆరుగురు ఇంట్లోకి వెళ్లి పళనియప్పన్న్పై కత్తులతో దాడి చేశారు. గాయపడ్డ అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పళనియప్పన్ మృతిచెందాడు. విషయం తెలిసి కారైకుడి కళనివాసల్లోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఎదుట బంధువులు రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేశారు. అన్నానగర్లో కొత్త పరిశోధన కేంద్రం సాక్షి, చైన్నె ఆర్తి స్కాన్ అండ్ ల్యాబ్ ఆధ్వర్యంలో చైన్నె అన్నానగర్లోని సెంటర్లో వైటల్ ఈన్సైట్స్ అనే భారతదేశపు మొట్టమొదటి దీర్ఘాయువు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆర్తి స్కాన్ వ్యవస్థాపక చైర్మన్ వి.గోవిందరాజన్ సమక్షంలో ప్రఖ్యాత స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, ఎ.టి.రాజామణి ప్రారంభించారు. గోవిందరాజన్ పనితీరును వివరించారు. నగలు దోపిడీ స్నేహితుడి సహా యువతి అరెస్ట్ తిరువొత్తియూరు: అరియలూర్ జిల్లా తురై సమీపంలో ప్రభుత్వానికి చెందిన రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇక్కడ ఈనెల 16వ తేదీన 60 ఏళ్ల మద్ధుడిపై ఓ మహిళ ఆమె స్నేహితుడు దాడి చేసి అతని వద్ద ఉన్న 6.5 సవర్ల నగలను దోచుకెళ్లారు. పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. వృద్ధుడి నుంచి నగలు దోచుకెళ్లిన అరియలూర్ జిల్లా ఆండిమటంకు చెందిన కలైయరసి (35), జయం గొండానికి చెందిన నవీనన్కుమార్ (30)ను సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 సవర్లు నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరినీ రిమాండ్కు తరలించారు. జంట హత్యల కేసులో ఐదుగురికి జీవిత ఖైదు అన్నానగర్: మాంసం దుకాణం వివాదంలో జరిగిన జంట హత్య కేసులో ఐదుగురికి డబుల్ జీవిత ఖైదు విధిస్తూ సోమవారం కోయంబత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోయంబత్తూరులో అక్టోబర్, 2015న జంట హత్యలు జరిగాయి. దీనికి సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు రెండేళ్ల క్రితం ఒక ప్రమాదంలో మృతిచెందాడు. కేసు విచారణ కోయంబత్తూరు 5వ సెషన్న్స్ కోర్టులో జరుగుతోంది. సోమవారం కేసు విచారించిన న్యాయమూర్తి శివకుమార్ నేరం రుజువు కావడంతో ఐదుగురికి జీవిత ఖైదు విధించారు. -
వైభవం.. సుబ్రహ్మణ్యస్వామి తిరుకల్యాణం
తిరువళ్లూరు: కందషష్టి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో వళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి తిరుకల్యాణ ఉత్సవం మంగళవారం ఉదయం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు సూరసంహారం, ఏడవ రోజు ఉదయం స్వామివారి తిరుకల్యాణ ఉత్సవం వైభవంగా జరిగింది. తిరుకల్యాణ ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆరుగంటలకు మంగళవాయిద్యం, ఏడు గంటలకు అభిషేకం, 8 గంటలకు ప్రత్యేక ఆరాధన, 9 గంటలకు తిరుమురై, తిరుపుగల్ ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం 10.30 గంటలకు తిరుకల్యాణ ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాగా ఉత్సవాల్లో పాల్గొన్న వారికి మంగళసూత్రాలతోపాటు ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు అందజేశారు. సేలంలో.. సేలం: ఈరోడ్లోని తిండల్ వేలాయుధస్వామి ఆలయంలో వేలాయుధస్వామికి, వళ్లి,దేవసేన సమేతంగా తిరుకల్యాణం జరిపించి ఉత్సవ రూపంలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. -
ప్రయాణికురాలిని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
సేలం: ఈరోడ్ రైల్వే స్టేషన్కు రోజూ వందకు సగటున పైగా రైళ్లు వస్తాయి. ఈ పరిస్థితిలో మంగళవారం తెల్లవారుజామున ఈరోడ్ నుంచి చైన్నె సెంట్రల్ వెళ్లే ఏర్కాడ్ ఎక్స్ప్రెస్ రైలు ఈరోడ్ రైల్వే స్టేషన్లోని మూడవ ప్లాట్ఫారం నుంచి బయలుదేరింది. ఆ సమయంలో దాదాపు 20 ఏళ్ల వయసున్న ఓ మహిళ పరిగెడుతూ కదులుతున్న రైలు ఎక్కడానికి యత్నించారు. ఈక్రమంలో అకస్మాత్తుగా అదుపు తప్పి, కిందపడి, రైలు, ప్లాట్ఫారమ్ మధ్య ఇరుక్కుపోయి వేలాడుతోంది. ఇది చూసి తోటి ప్రయాణికులు కేకలు వేశారు. ఆ సమయంలో, పెట్రోలింగ్లో ఉన్న జగతీసన్ అనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ సకాలంలో స్పందించి ఆ ప్రయాణికురాలిని లాగి, ఆమె ప్రాణాలను కాపాడాడు. దీంతో ప్రయాణీకురాలు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ దృశ్యాలన్నీ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. గంజాయితో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మహిళ అరెస్టు అన్నానగర్: మూలపుదూర్ ప్రాంతానికి చెందిన గణేషన్ భార్య ముత్తులక్ష్మి (51) సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం లో పిటిషన్ సమర్పించడానికి సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. ఆమె తీసుకెళ్తున్న బ్యాగును పోలీసులు తనిఖీ చేసినప్పుడు, అందులో 10 గ్రాముల గంజాయి ఉన్నట్లు గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు. నకు చర్మ వ్యాధి ఉన్నందున తనకు తెలిసిన వ్యక్తి ఈ (గంజాయి) స్థానిక మందుగా ఇచ్చాడని కూడా ఆమె పోలీసులకు చెప్పింది. అది గంజాయి అని నాకు తెలియదు? అని ఆమె చెప్పింది. అయినా పోలీసులు ముత్తులక్ష్మి అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
డీబీసీ కేంద్రంలో మొలకెత్తిన వరి
పళ్లిపట్టు: డీబీసీ కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి బస్తాలు గిడ్డంగికి తరలించక పోవడంతో వర్షానికి తడిచి మొలకెత్తి నిరుపయోగంగా మారుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పళ్లిపట్టు యూనియన్లోని రైతులు సాగు చేసిన వరి పంటను దిగుబడి చేసి బొమ్మరాజుపేట, నొచ్చిలి, వడకుప్పం ప్రభుత్వ డీబీసీ కేంద్రాల్లో విక్రయించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి బస్తాలను నిల్వ వుంచే కేంద్రాలు నిండిపోవడంతో ఆరు బయట వుంచారు. ఈక్రమంలో గత కొద్ది రోజులుగా వర్షం కురుస్తున్న క్రమంలో వరి బస్తాలకు అధికారులు కవర్లు కప్పి వుంచారు. అయితే భారీ వర్షంతో వర్షపు నీరు లోపలికి ప్రవేశించి వరి తడిచి ముద్దవుతోంది. వడకుప్పంలో డీబీసీ కేంద్రానికి బయట 500 బస్తాలు పది రోజుల నుంచి వుండడంతో వర్షానికి తడిచింది. బస్తాలు ముద్దగా మారి మొలకలు రావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డీబీసీ కేంద్రాల్లో బయట వున్న వరి బస్తాలను వెంటనే తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పాండ్రవేడు గ్రామానికి చెందిన రైతు నందకుమార్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి బస్తాలు తరలించడంలో ఆలస్యం చోటుచేసుకుంటుండడంతో వర్షానికి నిరుపయోగంగా మారుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
కుల గణన నిర్వహించాలి
వేలూరు: తమిళనాడులో కుల జనాభా గణన సర్వేలు చేపట్టి వన్నియర్లకు న్యాయం చేయాలని పీఎంకే పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్కుమార్ అన్నారు. వేలూరులో పీఎంకే పార్టీ యువజన విభాగం సమావేశం జిల్లా అధ్యక్షుడు బాలాజీ అధ్యక్షతన జరిగింది. ఆయన కార్యకర్తలకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ కుల ఆధారిత జనాభా గణన నిర్వహించి అన్ని వర్గాలకు రిజర్వేషన్లను అందజేయాలన్నారు. వేలూరు జిల్లాలోని అనకట్టు నియోజకవర్గంలో అటవీ ప్రాంతవాసులతోపాటు రైతులు అధికంగా వ్యవసాయ పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారని ఆ ప్రాంతంలో శీతల గిడ్డంగి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. పార్టీ మహిళా అధ్యక్షురాలు, వేలూరు కార్పొరేటర్ బాబీ కదిరవన్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి పార్టీలోని యువకులు సైనికుల్లా పని చేయాలన్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోను పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి అధికంగా పార్టీలో చేర్పించేందుకు కంకణం కట్టుకోవాలన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి వారికి సాయం చేసేందుకు కృషిచేయాలన్నారు. పార్టీలో వర్గ విభేదాలు వదిలి కలిసికట్టుగా పనిచేస్తే పీఎంకే విజయం తథ్యమన్నారు. అనంతరం సమావేశంలో సభ్యులు పది తీర్మానాలను ఆమోదించారు. సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి ఎన్టీ షణ్ముగం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశన్, జిల్లా కార్యదర్శి జగన్, రాజేష్కుమార్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
జ్వరంతో శిశువు మృతి
తిరువొత్తియూరు: చైన్నె ఆవడి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న రాజశేఖర్ ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. అతనికి అనన్య ఏడాది వయసున్న ఓ కుమార్తె ఉంది. గత కొన్ని రోజులుగా చిన్నారి జ్వరంతో బాధపడుతోంది. మంగళవారం ఉదయం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆవడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనే అనన్య మరణించింది. ఆవడి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. కొత్త కారు ఆవిష్కరణ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటారు ఇండియా ప్రెసిడెన్షియల్ ఎంజీ ఎం9ను సిద్ధం చేసింది. దీనిని మ్యూజిక్ మాస్ట్రో శంకర్ మహాదేవన్తో పాటూ ఎంజీ మోటారు ఇండియా వర్గాలు ఆవిష్కరించాయి. – సాక్షి, చైన్నె -
పగటి కలలు
బీజేపీవి.. తమిళ గడ్డపై డీఎంకే ఉన్నంత కాలం బీజేపీ కలలన్నీ.. పగటి కల్లలే అవుతాయని, వాటిలో ఏ ఒక్కటీ నెరవేర నివ్వబోమని డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. 2026 ఢిల్లీని ఢీకొట్టే డీఎంకే ప్రభుత్వమా? బానిస పాలనా? అన్నది తేల్చే రీతిలో తమిళనాడు రక్షణను ధ్రువీకరించే ఎన్నికలు కాబోతున్నాయని అభిప్రాయపడ్డారు. సమావేశం వేదికపై డీఎంకే నేతలు, ప్రసంగిస్తున్న స్టాలిన్ సాక్షి, చైన్నె: చైన్నె శివారులోని మహాబలిపురంలోని ఓ రిసార్ట్ వేదికగా మంగళవారం డీఎంకే నేతృత్వంలో ‘నా పోలింగ్ బూత్ ఓ విజయవంతమైన పోలింగ్ బూత్’ నినాదంతో శిక్షణ సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల పనులను పోలింగ్ బూత్స్థాయిలో నుంచి వేగవంతం చేసే దిశగా ఈ కొత్త కార్యక్రమాన్ని డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. తమిళనాడును అన్ని విధాలుగా అణగ దొక్కే ప్రయత్నంలో మోసపూరిత వ్యూహాలకు, కుట్రలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒడిగడుతోండడాన్ని తిప్పి కొట్టే రీతిలో ఈ శిక్షణలో నేతలు వ్యాఖ్యల తూటాలను పేల్చారు. పోలింగ్ బూత్లలో స్థానికంగా బలం, విజయాన్ని నిర్ధారించే విధంగా, ఆయా నియోజకవర్గాలలో స్థానికంగా పోలింగ్ బూత్ల వారీగా బలాన్ని చాటుకునే రీతిలో జరిగిన ఈ సమావేశానికి జిల్లాల కార్యదర్శులు, ఇన్చార్జ్లు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పరిశీలకులు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు యూనియన్, నగర, ప్రాంతీయ , పట్టణ సంఘాల కార్యదర్శులు హాజరయ్యారు. డీఎంకే ప్రదాన కార్యదర్శి దురై మురుగన్, కోశాధికారి కేఎన్నెహ్రూ, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కనిమొళి, కేఎన్ నెహ్రూ, తిరుచ్చి శివ, ఐ. పెరియస్వామి, యువజన ప్రధాన కార్యదర్శి ఉదయనిధి సీఎం స్టాలిన్తో పాటూ వేదికపై కూర్చుని పలు సూచనలు, సలహాలు తమ వ్యాఖ్యల ద్వారా తెలియజేశారు. పొరాడుదాం.. తమిళనాడు కోసం బీజేపీతో పోరాడుతూనే ఉంటామన్నారు. ‘మనం గెలుస్తాం‘ అన్న నినాదాన్ని తమిళనాడు అంతటా ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, దివంగత నేతలు పెరియార్, అన్నా, కరుణానిధిల బాటలో ఆత్మగౌరవం నినాదంతో ఫాసిజ బీజేపీకి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం కొనసాగుతుందన్నారు. ఎన్నో పోరాటాలలతో విజయం సాధించామని, హక్కులను సాధించుకున్నామని గుర్తు చేస్తూ, పాసిస్టులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వాటిని సమర్థంగా తిప్పి కొడుదామన్నారు. డీఎంకేలోని కేడర్, నాయకుడి ముఖాలలో తాను సూర్యోదయాన్ని చూస్తున్నానని పేర్కొంటూ, ఈ శిక్షణ తదుపరి వారివారి పోలింగ్ బూత్లలో గెలుపును నిర్ధారించే విధంగా ముందుకు సాగాలని ఆదేశించారు. రోజూ సాయంత్రం పోలింగ్ బూత్లలో సమావేశాలు నిర్వహించాలని, ప్రజలతో మాట్లాడాలని, ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుని జిల్లాల కార్యదర్శుల ద్వారా తనకు సమాచారం పంపించాలని సూచించారు. ప్రతి వారం పంపించే ఈ నివేదికను తాను స్వయంగా పరిశీలిస్తానని, తానే స్వయంగా స్థానికంగా ఉన్న వారితో మాట్లాడుతానని వివరిస్తూ, ఇందుకు సమాయత్తం అయ్యే విధంగా ప్రతి బూత్ కమిటీ సభ్యుడు ప్రతిజ్ఞతో ప్రజలలోకి దూసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో ఫీల్డ్ వర్క్ ముందంజలో ఉండాలని, ఏడోసారి అధికారం తథ్యం అన్నది నిర్ధాంచుకుందామన్నారు. తమిళనాడు ఆత్మగౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుదామని, తమిళనాడును, జాతి శత్రువులను, తమిళ ద్రోహులను తరిమి కొడుదామని, మన భూమిని, భాషను, గౌరవాన్ని మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. డీఎంకే కూటమి అన్ని స్థానాలలో విజయ ఢంకా మోగించే విధంగా ప్రతిఒక్కరి పని తీరు ఉండాలని సూచించారు. తమిళనాడు ఇప్పుడు సామాజిక, రాజకీయ, ఆర్థికంగా దండయాత్రను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, అన్ని విధాలుగా అన్యాయం తలబెట్టే ప్రయత్నాలు విస్తృతం అయ్యాయని వివరించారు. ఈ దాడిని తిప్పికొట్టే శక్తి మనకు ఉందని పేర్కొంటూ, ఈ భూమిపై డీఎంకే ఉన్నంత కాలం ఢీ కొడుతూనే ఉంటుందన్నారు. తాజాగా స్పెషల్ ఇంటెన్సివ్ ఓటరు జాబితా(ఎస్ఐఆర్) సవరణ పేరిట కొత్త ఎత్తుగడులు వేసి ఉన్నారని, దీనిపై అప్రమత్తత అవశ్యమని, బీహార్ పరిణామాలను గుర్తెరిగి ఓటరు జాబితా సవరణను నిశితంగా పరిశీలించాలని, ప్రజల ఓటుహక్కును పరిరక్షించాలని పిలుపునిచ్చారు. బీజీపీకి బానిసగా మారి, అమిత్ షాకు అన్నాడీఎంకేను తాకట్టు పేట్టేసిన పళణి స్వామి తాజా చర్యలు తమిళనాడు ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరని పేర్కొంటూ, తమిళనాడుకు వ్యతిరేకంగా ఆయన సాగిస్తున్న అవకాశవాదాన్ని ప్రజలలోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఏడోసారి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని, తమిళనాడును శాశ్వతంగా పరిపాలించడానికి డీఎంకేకు మాత్రమే అర్హత ఉందని నిరూపించుకునే విధంగా శ్రమించాలని పిలుపునిచ్చారు.పగటి కలలు నెరవేరనివ్వం.. ఈ భూమిపై డీఎంకే ఉన్నంత కాలం బీజేపీ పగటి కలలు నిజం కావు అని స్పష్టం చేస్తూ సమావేశంలో సీఎం స్టాలిన్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. 2026లో జరగబోయే ఎన్నికలు కీలక మలుపు కావాలని పేర్కొంటూ, ఇందులో డీఎంకే ప్రభుత్వమా.. లేదా ఢిల్లీకి తలవంచే బానిస ప్రభుత్వమా? అన్నది నిర్ణయించుకోవాలని ఓటర్లకు సూచించారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ లక్ష్యాలను సాధించేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉండాలని సూచించారు. ఇదే అసలైన ఉద్యమం అని ఇందులో రోజూ పనిచేస్తూనే ఉండాలని, నా పోలింగ్ బూత్ ఒక విజయపు పోలింగ్ బూత్ అన్న నినాదాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. అందరి సమష్టి కృషితో ఆరోసారి డీఎంకే పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని, ఏడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తంచేశారు. 2019లో సవాళ్లను అధిగమించి ప్రభుత్వాన్ని గొప్ప విజయవంతో ఏర్పాటు చేసుకున్నామని, 2026లో ద్రావిడ మోడల్ 2.ఓ అందరి కృషితో, తమిళనాడు ప్రజల మీద ఉన్న నమ్మకంతో కొనసాగుతుందని తాను స్పష్టం చేస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ద్రావిడ మోడల్ పాలనలో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేశామని, ప్రతి ఇంట్లోకి పథకాలతో ప్రవేశించామని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సాధించని స్థాయిలో విజయాలు సొంతం చేసుకున్నామని వివరించారు.ఈ విజయాలతోనే ధైర్యంగా ఉండగలుగుతున్నట్టుగా పేర్కొన్నారు. -
బోస్ వెంకట్ నూతన చిత్రం
ఒప్పంద పత్రాలతో బోస్ వెంకట్, వి.మదియళగన్, యువన్ శంకర్రాజా, కన్నన్రవి తమిళసినిమా: ఇంతకుముందు కన్నిమేడం, సార్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన నటుడు బోస్ వెంకట్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం మంగళవారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కేఆర్జీ మూవీస్ పతాకంపై కన్నన్రవి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎక్స్ట్రా ఎంటర్టెయిన్మెంట్ సంస్థ అధినేత వి.మదియళగన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత 35 ఏళ్లుగా దుబాయిలో ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తున్న కన్నన్ రవి తన కేఆర్జీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న 7వ చిత్రం ఇది కావడం గమనార్హం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి యువన్ శంకర్రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు బోస్ వెంకట్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథ ప్రేమ, కుటుంబ అనుబంధాలు, సమాజం వంటి పలు ముఖ్య అంశాల గురించి చర్చించే విధంగా ఉంటుందన్నారు. భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ చిత్రం సినీ పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచి పోతుందన్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. ఈ చిత్రంలో సంగీతదర్శకుడు యువన్ శంకర్రాజాతో కలిసి పనిచేయడం సంతోషకరమన్నారు. చిత్రాన్ని త్వరలోనే సెట్పైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు బోస్వెంకట్ పేర్కొన్నారు. -
కోవైకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
సాక్షి, చైన్నె: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మంగళవారం కోయంబత్తూరుకు వచ్చారు. ఆయనకు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ఇటీవల ఉ ప రాష్ట్రపతి పదవిని అధిరోహించిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించినానంతరం ఆయన ఇంత వరకు తమిళనాడుకు రాలేదు. గత నెలాఖరులోరావాల్సి ఉండగా, కరూర్ విషాద ఘటన నేపథ్యంలో వాయిదా పడింది. ఈ పరిస్థితులలో ఆయన మంగళవారం కోయంబత్తూరుకు వచ్చారు. ఉప రాష్ట్రపతిగా ప్రపథమంగా తమిళనాడుకు వచ్చిన సీపీ రాధాకృష్ణన్కు కోయంబత్తూరు విమానాశ్రయంలో బ్రహ్మరథం పట్టేవిధంగా ఆహ్వానం పలికారు. మంత్రులు ముత్తుస్వామి, స్వామి నాధన్ల నేతృత్వంలో అధికారిక ఆహ్వానం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్తో పాటూ బీజేపీ వర్గాలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొడీస్సీయా ఆడిటోరియంలో కోయంబత్తూరులో పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశానికి సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పదవీ అన్నది తన ఒక్కడికే దక్కిన గౌరవం కాదని, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత మిళులకు దక్కిన గౌరవంగా వ్యాఖ్యలు చేశారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూపిస్తానని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఎదగాలన్న కాంక్షతో ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నాలలో ఉన్నారని వివరించారు. గతంలో ఝార్కండ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టాలని ప్రదాని నరేంద్రమోదీ తనకు సూచించారని, దీనిని తాను ఊహించలేదని, ఇది దేవుడిచ్చిన వరంగా భావించినట్టు పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల నిరంతర ఆశీస్సులతో ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టానని గుర్తుచేశారు. అనంతరం కోయంబత్తూరులో జరిగిన పలు కార్యక్రమాలను ముగించుకుని తిరుప్పూర్కు వెళ్లారు. -
వరద బాధితులను ఆదుకోవాలి
వేలూరు: వేలూరు కార్పొరేషన్లోని వరద బాధిత ప్రాంతాలను గుర్తించి వారిని ఆదుకునేందుకు పారిశ్రామిక వేత్తలు, దాతలు ముందుకు రావాలని బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తియాయిని అన్నారు. వేలూరు కార్పొరేషన్లోని కన్సాల్పేట పూర్తిగా నీటితో నిండిపోవడంతో అక్కడి బాధితులను పాత బైపాస్ రోడ్డులోని సహాయ శిబిరంలో ఉంచారు. దీంతో బీజేపీ పార్టీ ఎస్సీ, ఎస్టీ విభాగం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏకే శరవణకుమార్ ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసర వస్తువులతోపాటు దుస్తులు, ఆహార పదార్థాలు, వంటి సంక్షేమ పథకాలు పంపిణీ చేశారు. ఇందులో హాజరైన ఆమె బాధితులను తమ వంతు ఆదుకుంటామన్నారు. ఇదే తరహాలోనే అన్ని ప్రాంతాల్లోని శిబిరాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం బాధితులను పరామర్శించడంతోపాటు వారికి పలు వస్తు సామగ్రిని అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దశరథన్, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు కలైమగల్ ఇళంగోవన్, రోటరీ క్లబ్ కార్యదర్శి ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షులు చక్రవర్తి, రమేష్ పాండియన్, ఐటీ విభాగం ఇన్చార్జ్ నందకుమార్, విఘ్నేష్ పాల్గొన్నారు. -
తప్పిన మోంథా ముప్పు
మోంథా గండం నుంచి చైన్నె మహానగరం దాని శివారు జిల్లాలు గట్టెక్కాయి. ఈ తుపాన్ ప్రభావంతో మంగళవారం కూడా చిరు జల్లులు కురిశాయి. ఆవడి, ఎన్నూరు పరిసరాలలో అయితే, భారీ వర్షం పడింది. అయితే భారీ వర్షాల ముప్పు తప్పడంతో ఎలాంటి గండం ఎదురు అవుతుందో..? అన్న ఉత్కంఠతో అధికార యంత్రాంగం క్షణ..క్షణం అప్రమత్తంగా వ్యవహరించింది. సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలలో ఇప్పటికే ఆశాజనకంగా వర్షాలు పడ్డ విషయం తెలిసిందే. చైన్నె, శివారులలోని రిజర్వాయర్లు ఇప్పటికే నిండు కుండలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో నెలకొన్న మోంథా రూపంలో చైన్నె, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం తదితర ఉత్తర తమిళనాడులోని జిల్లాలపై వర్షం ప్రభావం ఉంటుందని వాతావరణ పరిశోధకులు అంచనా వేశారు. ఇది చైన్నెకు సమీపంలో ప్రయాణించి ఆంధ్రా వైపుగా వెళ్తుందని తొలుత భావించారు. అయితే మోంథా తుపాన్ చైన్నెకు సమీపంలో కాకుండా, కాస్త దూరంగానే ప్రయాణించడంతో గండం తప్పినట్లయ్యింది. సోమవారం నుంచి చైన్నె, శివారు జిల్లాలో చిరు జల్లుల వర్షం పడుతూనే వచ్చింది. మంగళవారం కూడా ఇది కొనసాగింది. సుమారు 35 గంటల పాటూ చైన్నె, శివారులలో చిరు జల్లులతో వాన నిరంతరాయంగా కురిసింది. అప్పుడప్పుడూ అనేక చోట్ల ఈదురు గాలులు కాస్త వణికించాయి. అయితే ఉత్తర చైన్నె పరిధిలో కొన్నిచోట్ల, తిరువళ్లూరు జిల్లా పరిధిలో మరికొన్ని చోట్ల తెరపించి తెరపించి వర్షం పడింది. తిరునెండ్రవూరు, ఆవడి పరిసరాలు, ఎన్నూరు పరిసరాలలో భారీ వర్షం పడింది. ఎన్నూరులో 13 సెం.మీ వర్షం పడింది. ఆవడి పరిసరాలలోని కొన్ని చెరువులు నిండు కుండగా మారడంతో అక్కడి ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఎన్నూరు పరిసరాలలోనే ఇదే పరిస్థితి నెలకొనడంతో నీటి తొలగింపునకు అధికారులు ఉరకలు తీశారు. మంగళవారం రాత్రి సమయంలో చిరు జల్లుల వాన సైతం ఆగినట్టైంది. మోంథా రూపంలో ప్రభావం లేనప్పటికీ, మరో వారం పది రోజులు గాలిలో తేమ తగ్గే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నవంబర్ రెండో వారంలో మళ్లీ వర్షాలకు అవకాశం ఉన్నట్టు వాతావరణ పరిశోధకులు పేర్కొంటున్నారు. నవంబర్, డిసెంబర్ నెలలలో రెండు తుపాన్లకు అవకాశం ఉన్నట్టు, వీటి ప్రభావం తమిళనాడుపై అధికంగాఉండవచ్చని భావిస్తున్నారు. ఇక ఈశాన్య రుతు పవనాలతో పశ్చిమ కనుమలలో తేని, తెన్కాశి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాలలో వర్షాలు కొనసాగుతున్నాయి. అప్రమత్తంగా.. మోంథా రూపంలో భారీ వర్షం కురిసిన పక్షంలో ఎదుర్కొనే విధంగా మంగళవారం అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించారు. సబ్ వేలు, లోతట్ట ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి విపత్తు ఎదురు అవుతుందో అన్న ఉత్కంఠతో అప్రమత్తంగా ముందడుగు వేశారు. ఎమర్జెన్సీ కంట్రోల్ రూంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తిష్ట వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే పలుచోట్ల పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. సుమారు 54 వేల మందికి ఆహారం ప్యాకెట్లను అందజేశారు. ఎన్నూరు పరిసరాలలో సముద్రం కోతకు గురి కాకుండా ఇసుక బస్తాలను సిద్ధం చేసి ఆగమేఘాలపై కట్టడిచర్యలు అధికారులు తీసుకున్నారు. ఇక ఆంధ్రా వైపుగా వెళ్లే అనేకరైళ్ల సేవలలో మార్పులు చేశారు. చైన్నె సెంట్రల్ – హౌరా, విశాఖపట్నం, విల్లుపురం– ఖరగ్ పూర్, చైన్నె సెంట్రల్ – హౌరా సూర్ ఫాస్ట్ మెయిల్, తిరుచ్చి – హౌరా, తదితర రైళ్లుందులో ఉన్నాయి. అలాగే, పలు విమానాల సేవలు రద్దు చేశారు. ఆంధ్రా వైపుగా వెళ్లే ఆరు విమాన సేవలు రద్దు కాగా, మరో ఆరు విమానాల వేళలో మార్పులు చేశారు -
ముగ్గురు ప్రొఫెసర్లకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ – 2025
కొరుక్కుపేట: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ నుంచి ముగ్గురు ప్రొఫెసర్లు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025’ కు ఎంపికయ్యాయి. సైనన్స్, టెక్నాలజీ రంగాల్లో విశేష ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన వారికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్లను అందిస్తూ వస్తున్నారు. 2025 సంవత్సరానికి గాను రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025లను శాస్త్ర పరిశోధన విభాగాల్లో అద్భుత నైపుణ్యాలు ప్రదర్శించిన ముగ్గురు ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్లను వరించింది. ఇందులో ఐఐటీ మద్రాస్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ తలప్పిల్ ప్రదీప్తో పాటూ ప్రొఫెసర్ మోహనశంకర్ శివప్రకాశం, ప్రొఫెసర్ శ్వేత ప్రేమ్ అగర్వాల్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025కు ఎంపికై న ముగ్గురు ప్రొఫెసర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆగని బాంబు బెదిరింపుల పర్వం సాక్షి, చైన్నె : బాంబు బూచీలు పోలీసులను వెంటాడుతున్నాయి. మంగళవారం పలు చోట్ల వచ్చిన బెదిరింపు మెయిల్స్, కాల్స్తో పోలీసులు పరుగులు తీశారు. గత నెల రోజులుగా చైన్నెలో అక్కడ, ఇక్కడ బాంబులు ఉన్నాయంటూ వస్తున్న బెదిరింపు మెయిల్స్ పోలీసులకు సవాలుగామారిన విషయం తెలిసిందే. ఈ బెదిరింపు ఇస్తున్న వారిని పసిగట్టడం శ్రమగా మారింది. ఇది వరకు సీఎం, డిప్యూటీ సీఎంలతోపాటూ కీలక వ్యక్తులు, నాయకుల ఇళ్లు, కార్యాలయాలకు సైతం బెదిరింపు వచ్చింది. తాజాగా సినీ నటులు రజనీకాంత్, ధనూష్, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత సెల్వ పెరుంతొగై నివాసాలకు బెదిరింపు వచ్చాయి. ఇక బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామిని హతమారుస్తామంటూ డీజీపీ కార్యాలయానికి ఈ మెయిల్రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని చోట్లా సోదాలు జరపగా, ఎక్కడ ఎలాంటి బాంబు అన్నది లభించ లేదు. ఇక, సుబ్రహ్మణ్య స్వామికి భద్రత పెంచేందుకు చర్యలు చేపట్టారు. 8 నుంచి క్విజ్ పోటీలు సాక్షి, చైన్నె: బాటిల్ ఆఫ్ బ్రెయిన్స్ పేరిట ఇంటర్ స్కూల్ క్విజ్ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు కాసాగ్రాండ్ ఆహ్వానం పలికింది. నవంబర్ 8 నుంచి జరగనున్న ఈ క్విజ్ పోటీలు చైన్నెలోని పాఠశాలల విద్యార్థుల ప్రతిభను చాటే విధంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు 6 నుంచి 9 తరగతుల వారై ఉండాలని సూచించారు. విద్యార్థులను ఆరు జట్లుగా విభజించి పోటీలను నిర్వహించున్నామని, ఆశావహులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాసాగ్రాండ్కో.ఇన్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు అని సూచించారు. విజేతలకు ప్రతిష్టాత్మక ట్రోఫీతో పాటు రూ.1.50 లక్షల బహుమతి, రన్నర్ జట్టుకు రూ.80 వేలు అందజేయనున్నామని ప్రకటించారు. -
క్లుప్తంగా
13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి తిరువళ్లూరు: 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 13 ఏళ్లు జైలు శిక్షతో పాటూ రూ.16 వేలు జరిమానా విధిస్తూ తిరువళ్లూరు జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా ఒరగడం ప్రాంతానికి చెందిన ఆళగరసన్(37). ఇతను గత 2019వ సంవత్సరంలో తిరుములైవాయల్ ప్రాతంలో నివాసం ఉంటున్న తమ సమీప బంధువైన 13 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లి లైగింక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం బెయిల్పై వున్న నేపథ్యంలో కేసు విచారణ తిరువళ్లూరు పోక్సో న్యాయస్థానంలో సాగింది. విచారణ పూర్తి కావడంతో న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. 13 బాలికపై లైగింక దాడికి పాల్పడిన అళగరసన్కు 13 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. అనంతరం నిందితుడిని పుళల్ జైలుకు తరలించారు. అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి అన్నానగర్: రామనాథపురంలోని ఓంశక్తి నగర్కు చెందిన సుబ్రమణియన్ కుమారుడు దీపన్ కుమార్ (30) ఖత్తార్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. తనతో పాటూ పనిచేసే ఫిలిప్పీన్స్ యువతి అర్ష (28) తో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ 5 సంవత్సరాలు కొనసాగింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని తరువాత, దీపన్ కుమార్ తన స్వస్థలంలో తమిళ సాంస్కృతిక ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలనే కోరికను అర్షకు వ్యక్తం చేశాడు. ఆమె దీనికి అంగీకరించింది. ఈ క్రమంలో సోమవారం వీరి వివాహం తమిళ సాంస్కృతి ఆచారాల ప్రకారం రామనాథపురంలో ఘనంగా జరిగింది. 13 సవర్ల నగలు చోరీ అన్నానగర్: చైన్నె సమీపం అంబత్తూరులోని జ్ఞానమూర్తి నగర్ ప్రాంతంలో నివసించే బ్యూలా (46) ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. ఈమె తల్లి ప్రేమ, ఆమె సోదరితో నివసిస్తుంది. వీరి ఇంటి కింద రేవతి తన కుటుంబంతో నివసిస్తోంది. ఈనేపథ్యంలో రేవతి బ్యూలా తల్లి ప్రేమతో మాట్లాడుతున్నట్లు నటిస్తుండగా.. రేవతి కుమార్తె ప్రేమ ఇంటిలోనికి చొరబడి చాకచక్యంగా 13 సవర్ల నగలు దొంగిలించింది. దీంతో బ్యూలా 16వ తేదీన అంబత్తూరు క్రైమ్ బ్రాంచ్లో ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా, అంబత్తూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రేమ తనకు రేవతిపై అనుమానం ఉందని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో, దీపావళి సందర్భంగా రేవతి తన స్వస్థలం శ్రీవిల్లిపుత్తూర్కు వెళ్లింది. దీపావళి తర్వాత చైన్నెకి తిరిగి వచ్చిన తర్వాత, అంబత్తూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. దర్యాప్తులో భాగంగా నగలు దొంగిలించినట్లు తల్లి, కుమార్తె అంగీకరించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి, వారి నుండి 13 సవర్ల నగలను స్వాధీనం చేసుకున్నారు. రేవతిని పుళల్ జైలుకు, ఆమె 15 ఏళ్ల కుమార్తెను జువైనల్ హోంకు పంపించారు. బాలుడి దారుణ హత్య ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు అన్నానగర్: చోళవరం సమీపంలో 17 ఏళ్ల బాలుడిని అతని చేతులు, కాళ్లు కట్టి, గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లాలోని చోళవరం పక్కన ఉన్న ఆలమతిలోని దీరన్ చిన్నమలై వీధికి చెందిన బాబు (17) వెల్డింగ్ కార్మికుడు. బాబు కుటుంబం ఆరు నెలల క్రితం అద్దె ఇంటికి మారింది. బాబు తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లారు. బాబు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సోమవారం రాత్రి నుంచి బాబు సోదరుడు అతనికి ఫోన్ చేస్తున్నాడు, కానీ అతను ఫోన్ తీయకపోవడంతో, తన స్నేహితుడిని వచ్చి చూడమని అడిగాడు. అతడు లోపల తాళం వేసి ఉన్న ఇంటి తలుపు పగలగొట్టి చూడగా, బాబు చేతులు, కాళ్లు కట్టేసి, గొంతు కోసి మృతి చెందినట్లు గుర్తించి చోళవరం పోలీసులకు సమాచారం అందించారు. చోళవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం చైన్నెలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. -
ఆర్కే ఇంటర్నేషనల్ చిత్రం ప్రారంభం
నిర్మాత ఆర్కే రామకృష్ణ, దర్శకురాలు శాలిన్జోయాలతో చిత్ర యూనిట్ తమిళసినిమా: ఇంతకుముందు 17 జనరంజకమైన చిత్రాలను నిర్మించిన ఆర్కే ఇంటర్నేషనల్ సంస్థ అధినేత కేఎస్.రామకృష్ణ తాజాగా నిర్మిస్తున్న 18వ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల చైన్నెలో ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం ద్వారా మలయాళ నటి, దర్శకురాలు శాలిన్జోయాను కోలీవుడ్కు పరిచయం చేస్తున్నారు. ఈమె ఇంతకుముందు కన్నగి అనే చిత్రంలో నటించారు. అదేవిధంగా కుక్ విత్ కోమాలి కార్యక్రమంలో పాల్గొని పాపులర్ అయ్యారు. ఈ చిత్రంలో నక్సలైట్స్ చిత్రం ఫేమ్ అరుణ్, నటి బ్రిగిడా జంటగా నటిస్తున్నారు. ఎంఎస్.భాస్కర్, అరుళ్ దాస్, జావా సుందరేశన్, జాన్సన్ దివాకర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఇందులో నటి దేవదర్శిని వినూత్న పాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా అశ్విన్ కాక్కుమణు గౌరవ పాత్రలో నటిస్తున్నారు. చిత్ర వివరాలను నిర్మాత కేఎస్ రామకృష్ణ చెపుతూ తాజాగా శాలిన్జోయాను ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. శాలిన్ జోయా మాట్లాడుతూ ఒక గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఆ ప్రాంత ప్రజల జీవితాలను ఎలా మార్చేస్తుంది అనే విషయాన్ని వినోదాన్ని జోడించి ఫాంటసీ అంశాలతో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ప్రతిభావంతులైన కళాకారులు ,సాంకేతిక వర్గంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. మంచి కథా చిత్రాలను ఆదరించే తమిళ ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కె.రామ్చరణ్ చాయాగ్రహణం అందిస్తున్నారు. మొదట్లో చాలా భయపడ్డా! -
కమనీయం.. మురుగన్ కల్యాణోత్సవం
తిరుత్తణి: స్కంధషష్టి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం మురుగన్ కల్యాణోత్సవం కోలాహలంగా నిర్వహించారు. భారీ వర్షం సైతం లెక్క చేయకుండా భక్తులు కొండ ఆలయానికి చేరుకుని స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. వివరాలు.. తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో 22న స్కంధషష్టి వేడుకలు ప్రారంభమయ్యాయి. వారం పాటూ నిర్వహించిన వేడుకల సందర్భంగా రోజూ మూలవర్లకు విశేష అభిషేక ఆరాధన పూజలతో పాటూ ప్రత్యేక అలంకరణతో మహాదీపారాధన చేపట్టారు. కావడి మండపంలో శ్రీవళ్లి, దేవసేన సమేత షణ్ముఖర్కు సుగంధ పుష్పాలతో అలంకరించి లక్షార్చన పూజలు జరిగాయి. వేడుకల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం కల్యాణ మురుగన్ కల్యాణోత్సవం నిర్వహించారు. భారీ వర్షం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో భక్తులు కొండ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ నిర్వాహకులతో పాటూ భక్తులు కల్యాణోత్సవానికి సంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలు, పూజా సామాగ్రి, పుష్పాలు, పండ్లు వరుసగా తీసుకొచ్చి కావడి మండపం తీసుకొచ్చారు. ఆలయ ప్రదాన అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కావడి మండపంతో పాటు వెలుపల వేచివున్న భక్తులు హారంహర నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అధికారులు పసుపు,కుంకుమ. మాంగళ్యం. ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ చైర్మన్ శ్రీధరన్, జాయింట్ కమిషనర్ రమణి ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు సంయుక్తంగా స్కంధషష్టి వేడులకు ఏర్పాట్లు చేశారు.2026 ఆలయ క్యాలెండర్ విడుదల తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ 2026 సంవత్సరం క్యాలెండర్ను కొండ ఆలయంలో ట్రస్టు బోర్డు చైర్మన్ శ్రీధరన్ విడుదల చేశారు. మురుగన్ ఫొటోలతో పాటూ ఆధ్యాత్మిక వివరాలతో కూడిన మాసాంత క్యాలెండర్ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ. 100 చెల్లించి భక్తులు సుబ్రహ్మణ్యస్వామి ఆలయ క్యాలెండర్ను కొనుగోలు చేశారు. -
డీఎంకేను సాగనంపుదాం!
సాక్షి, చైన్నె: డీఎంకేను ఇంటికి పంపిద్దామని ప్రజలకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పిలుపు నిచ్చారు. కరూర్ ఘటన పరిణామాలతో నెల రోజులుగా విజయ్ ప్రజా సమస్యలపై ఎలాంటి స్పందన లేకుండా ఉంటూ వచ్చారు. రాజకీయ కార్యక్రమాలు కూడా ముందుకు సాగలేదు. ఈ పరిస్థితులలో సోమవారం కరూర్ బాధితులను చైన్నెకు పిలిపించి పరామర్శించారు. ఆయన తీవ్ర ఉద్వేగంతో తమను పరామర్శించినట్టుగా బాధితులు అనేక మంది పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో నెల రోజుల తర్వాత ప్రజా సమస్యపై స్పందిస్టూ విజయ్ ప్రకటన విడుదల చేశారు. వరి కొనుగోలలో నిర్లక్ష్యాన్ని వివరిస్తూ, పేదల కడుపు కొట్టడమే కాకుండా, రైతులను కన్నీటి మడుగులో ముంచుతున్న డీఎంకేను ఇంటికి పంపిద్దామని ప్రజలకు పిలుపు నిస్తూ ఈ ప్రకటన చేశారు. అదేవిధంగా వర్షాల నేపథ్యంలో ఎదురు అవుతున్న సమస్యలను వివరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. -
‘ఎస్ఐఆర్’పై కసరత్తు
సాక్షి, చైన్నె: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) కసరత్తు రాష్ట్రంలో మొదలయ్యాయి. ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ మంగళవారం సమావేశమయ్యారు. నవంబర్ 4వ తేదీ నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు నెల రోజుల పాటూ ఇంటింటా పరిశీనలు, జాబితాలో సవరణలపై దృష్టి పెట్టేందుకు చర్యలు చేపట్టారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలను తమిళనాడు ఎదుర్కోబోతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో రాష్ట్రంలోని ఓటరు జాబితాను సవరించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్చర్యలు తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 68,467 పోలింగ్ కేంద్రాలు న్నాయి. పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 10.21 లక్షల ఓటర్లు, 962 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలు వచ్చే ఏడాది ఎన్నికలను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఇక్కడ ఓటరు జాబితా సవరణపై ఎన్నికల యంత్రాంగం దృష్టి పెట్టింది. తమిళనాడులో చేపట్టాల్సిన పనులు, ఇతరాత్రా అంశాల గురించి ఎన్నికల అధికారులతో అర్చనా పట్నాయక్ సమావేశమయ్యారు. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులకు పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. నవంబర్3వ తేదీలోపు అన్ని కసరత్తులు ముగించి నవంబర్ 4 నుంచి నెల రోజుల పాటూ ఇంటింటా సమగ్ర పరిశీలనకు సిద్ధమయ్యే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా పోరాటానికి డీఎంకే నేతృత్వంలోని అఖిల పక్ష సమావేశానికి నిర్ణయించారు. తమిళనాడులో ప్రజల ఓటు హక్కును కాలరాసే విధంగా కుట్ర పన్ని ఉన్రాని, దీనికి వ్యతిరేకంగా రాజకీయ పక్షాలన్నీ ఏకమై, ప్రజల మద్దతుతో పోరాటానికి నిర్ణయించారు. నవంబర్ 2వ తేదీన డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఈ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా ఎస్ఐఆర్ను రూపంలో డీఎంకేలో గుబులు బయలుదేరిందని, వారి మోసాలు ఎక్కడ బయట పడుతాయో అన్న ఆందోళన పెరిగినట్టుందని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆరోపించారు. -
కర్నూలు ఘటన: ‘ఈ దుఖం నాతోనే ఉండిపోవాలి’
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురైన బస్సులో కరిగి ముద్దగా మారిన మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఏమని చెప్పాలి.. వారికి ఈ శరీరాన్ని ఎలా చూపాలి.. చూపితే వారు తట్టుకోగలరా.. ఇంతటి దుఃఖం మాతోనే ముగిసిపోనీ.. కర్నూలులోనే కుమారునికి అంత్యక్రియలు చేస్తాం’ అని ఆ తండ్రి బోరున విలపిస్తూ భావోద్వేగంతో చెప్పిన మాటలు కంటతడి పెట్టించాయి. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివారులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు.వీరిలో తమిళనాడులోని ధర్మపురం జిల్లా పాలక్కాడ్ తాలూకా మాదగేరి గ్రామానికి చెందిన రాజన్ మారప్పన్ కుమారుడు ప్రశాంత్ (29) కూడా ఉన్నాడు. ఇతను హైదరాబాద్లో చిప్స్ ఫ్యాక్టరీ నడుపుకుంటున్నాడు. అతడికి ఏడాదిన్నర క్రితమే వివాహం కాగా.. ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. స్వస్థలానికి వెళ్లి భార్యాపిల్లలను చూసేందుకు గురువారం రాత్రి హైదరాబాద్లో వి.కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. బస్సు కర్నూలు దాటగానే మంటల్లో కాలిపోయింది. ఇందులో ప్రశాంత్ సజీవదహనయ్యారు. సోమవారం తమిళనాడుకు చెందిన ప్రశాంత్ మృతదేహానికి కూడా కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు అధికారులను కోరారు. కర్నూలు నుంచి 800 కి.మీ. దూరంలో ఉన్న మాదగేరికి వెళ్లాలంటే రెండు రోజుల సమయం పడుతుందని.. మరణించి ఇప్పటికే మూడు రోజుల సమయం దాటిందని, ఇప్పుడు స్వగ్రామానికి వెళ్లేలోపు ఐదు రోజులు పూర్తవుతుందని తండ్రి రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కాలిపోయిన మాంసం ముద్దగా మారిన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు చూపించి వారిని మరింత క్షోభకు గురిచేయలేమని, కేవలం అస్థికలు మాత్రమే తీసుకెళ్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సద్గురుదత్త కృపాలయం గ్యాస్ క్రిమేషన్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించి అస్థికల్ని అందజేశారు. వాటిని ప్రశాంత్ తండ్రి రాజన్ మారప్పన్తో పాటు సోదరుడు మణి, స్నేహితులు తీసుకెళ్లారు. -
బైక్ను ఢీకొన్న బస్సు
యువకుడి మృతి తిరుత్తణి: బైకును బస్సు ఢీకొని యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన శోకాన్ని మిగిల్చింది. తిరువలంగాడు యూనియన్లోని నల్లాటూరు గ్రామానికి చెందిన సురేష్బాబు కుమారుడు కీర్తివాసన్(25) శ్రీపెరంబదూరులోని ప్రయివేటు కర్మాగారంలో విధులు నిర్వహించేవారు. యథాప్రకారం శనివారం బైకులో పనికి వెళ్లి రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి తిరుగు పయనమయ్యారు. చైన్నె తిరుపతి జాతీయ రహదారిలోని కనకమ్మసత్రం వద్ద ముందుగా వెళ్తున్న బైకును వెనుక వైపు వచ్చిన ప్రభుత్వ బస్సు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో కీర్తివాసన్కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న వారు కాపాడి తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంపై కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శిరువాపురిలో సూరసంహారం
తిరువళ్లూరు: స్కంధషష్టి ఉత్సవాల్లో భాగంగా శిరువాపురి మురుగన్ ఆలయంలో సోమవారం జరిగిన సూరసంహారం కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్లో చిన్నంబేడు శిరువాపురి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీబాలసుబ్రమణ్యం ఆలయం ఉంది. ఆలయంలో ప్రతి ఏటా స్కంధషష్టి ఉత్సవాలను ఏడు రోజులపాటు ఘనంగా నిర్వహించడం ఆవవాయితీ. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం పుష్పాలంకరణ నిర్వహించారు. అనంతరం 9వ కాలపూజలు, ప్రాకార ఊరేగింపు, కలఽశపూజలు, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం సాయంత్రం జోరువానలోనూ శూరసంహారం నిర్వహించారు. సూరసంహారం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. మంగళవారం ఉదయం అభిషేకం, చందనకాపు ఉత్సవం, సాయంత్రం స్వామివారికి తిరుకల్యాణం, రాత్రి ఎనిమది గంటలకు స్వామి వారి ఊరేగింపు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. -
బైక్ను ఢీకొన్న జేసీబీ
● భార్యాభర్తలు మృతి ● బంధువుల గృహ ప్రవేశానికి వెళ్తూ ఘటనఅన్నానగర్: ఓమలూరు సమీపంలో సోమవారం ఉదయం జేసీబీ వాహనం బైకును ఢీ కొట్టడంతో భార్యాభర్తలు మరణించారు. బంధువుల గృహప్రవేశానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని సిక్కం పట్టి గ్రామం పెరియకడం పట్టి ప్రాంతానికి చెందిన మురుగన్(40). ఇతని భార్య పార్వతి(32). ధర్మపురి జిల్లా పాలయంపుదూర్లో బంధువుల గృహ ప్రవేశం వేడుక కోసం సోమవారం ఉదయం ఓమలూరు నుండి బయల్దేరారు. ఓమలూరు దీవట్టి పట్టి పక్కన ఉన్న జోడుకులి దగ్గర జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, ఆ రోడ్డు వెంట ఒక జేసీబీ వాహనం వేగంగా ఆ బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ కిందపడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే దివట్టిపట్టి ఇన్స్పెక్టర్ సెంథిల్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం కోసం ఓమలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంధువుల గృహప్రవేశానికి వెళ్తుండగా భార్యాభర్తలు ప్రమాదంలో మరణించడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. -
పురాతన ఆలయంలో స్కంధషష్టి
కొరుక్కుపేట: చైన్నె జార్జిటౌన్లోని 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో స్కంధ షష్టి మహోత్సవం వైభవోపేతంగా సాగుతోంది. అందులో భాగంగా ఆరోరోజు సోమవారం సూరసంహార కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వర్షం కారణంగా ఆలయ మహామండపంలో ఈ సూరసంహార వేడుకలను చేపట్టారు. ఆలయ అర్చకులు భాస్కర పంతులు బృందం శ్రీసుబ్రమణ్యస్వామిని నెమిలి వాహనంపై వేంచేపు చేసి వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి పూజలు చేశారు. వందలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని శ్రీసుబ్రమణ్యస్వామి కృపకు పాత్రులయ్యారు. ఆలయ పాలకమండలి సభ్యులు భక్తులకు తగిన ఏర్పాటు చేసి ప్రసాద వినియోగం చేశారు. -
సర్దార్ జయంతికి యూనిటీ మార్చ్
తిరువళ్లూరు: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని తిరువళ్లూరు జిల్లాలోని ఆర్కేపేట, తిరువళ్లూరు తదితర రెండు ప్రాంతాల్లో యూనిటీ మార్చ్ పేరిట పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తిరువళ్లూరు జిల్లా యువ, మేరా భారత్ అధికారి నమ్మాల్ కృష్ణ వివరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ యువజన క్రీడా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐక్యత యాత్ర పేరిట యూనిటీ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లాలోని ఆర్కేపేట, తిరువళ్లూరు తదితర రెండు ప్రాంతాల్లో యూనిటీ మార్చ్ను నిర్వహించనున్నారు. జిల్లాలో జరిగే యూనిటీ యాత్రకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేసే కార్యక్రమం సోమవారం సాయంత్రం తిరువళ్లూరులోని క్రీడా మైదానంలో జరిగింది. కార్యక్రమానికి జిల్లా స్పోర్ట్స్ అధికారి సేతరామన్, కోఆర్డినేటర్ మీనాక్షిసుందరి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా యువజన, మేరా యువ భారత్ అధికారి నమ్మాల కృష్ణ హాజరై పోస్టర్ను విడుదల చేశారు. వివరాలను మీడియాకు వివరించారు. తిరువళ్లూరు జిల్లాలో ఆర్కేపేటలోని అన్నామలై ఆర్ట్స్ కళాశాల మైభారత్ తిరువళ్లూరు ఉమ్మడిగా స్థానికంగా ఉన్న పద్మావతి మహల్ నుంచి ఆర్కేపేట తాలూకా కార్యాలయం వరకు జరగనుంది. నవంబర్ ఐదున తిరుమురుగన్ ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాల, మైభారత్ ఉమ్మడిగా పూండి బైపాస్ నుంచి తిరువళ్లూరులోని స్పోర్ట్స్ మైదానం వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం యువతకు ఐక్యత, విలువలను తెలియజెప్పడమేనన్నారు. పాదయాత్రలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వారు మై భారత్ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోచ్చని తెలిపారు. జిల్లా స్థాయిలో యూనిటీ మార్చ్లు ముగిసిన తరువాత జాతీయ స్థాయిలో నవంబర్ 26 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు గుజరాత్ కరంసద్ నుంచి కేవడియాలోని యూనిటి ఆర్చ్ వరకు 152 కిమీ మేరకు పాదయాత్ర జరగనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి సేతురామన్, కోఆర్డినేటర్ మీనాక్షిసుందరి, ఎన్ఎస్ఎస్ డీఎల్ఓ కేశవులు, తిరుమురుగన్ కళాశాల ప్రిన్సిపల్ అముదాయి తదితరులు పాల్గొన్నారు. -
అందరూ సంయమనం పాటించాలి
కొరుక్కుపేట: అందరూ సంయమనం పాటించాలని తమిళనాడు లోకాయుక్త చైర్పర్సన్ జస్టిస్ పి.రాజమణిక్యం అన్నారు. సదరన్ రైల్వే ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ను పాటిస్తోంది. అందులో భాగంగా సోమవారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్ పి.రాజమాణిక్యం పాల్గొన్నారు. చైన్నెలోని సదరన్ రైల్వే ప్రధాన కార్యాలయంలో విజిలెన్స్ విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సదరన్ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్, ప్రధాన విభాగాల అధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అవేర్ నెస్ వీక్ను ప్రారంభించిన జస్టిస్ పి.రాజమాణిక్యం మాట్లాడుతూ ఈ సంవత్సరం విజిలెన్స్–మా భాగస్వామ్య బాధ్యత అనే థీమ్తో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అవినీతి, దుష్ప్రవర్తన, లంచం, నిధుల దుర్వినియోగాన్ని పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన వివిధ చట్టాల నిబంధనలను ఆయన వివరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో సదరన్ రైల్వే చురుకై న చర్యలను ప్రశంసించారు. రైల్వే కార్యకలాపాల సామర్థ్యాన్ని సమష్టిగా పెంచిన సాంకేతికత వినియోగం, నివారణ విజిలెన్స్ తనిఖీలు, వ్యవస్థాగత మెరుగుదలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్లో భాగంగా సదరన్ రైల్వే విజిలెన్స్ విభాగం ఇంటిగ్రిటీ బులెటిన్–2025ను విడుదల చేసింది. -
డీఎంకే, కాంగ్రెస్ బంధం దేశానికి రక్ష
సాక్షి, చైన్నె : డీఎంకే, కాంగ్రెస్ల బంధం దేశానికి రక్ష అని, దేశాన్ని కచ్చితంగా రక్షించి తీరుతామని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. చైన్నెలోని అన్నా అరివాలయంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ నేత ఇంటి శుభ కార్య వేడుకలో స్టాలిన్ ప్రసంగించారు. డీఎంకే, కాంగ్రెస్లు కాలక్రమేనా వేర్వేరు మార్గాలలో ప్రయాణించినప్పటికీ, ప్రస్తుతం దేశ శ్రేయస్సు, సంక్షేమం కోసం ఐక్యతతో సమష్టిగా ముందడుగు వేస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీని ఈ సందర్భంగా పొగడ్తలతో ముంచెత్తుతూ, తనను ఎల్లప్పుడూ అన్నయ్యఅని పిలవడం జరుగుతోందన్నారు. ఇది కేవలం రాజకీయ స్నేహం కాదని, ఇది ఒక విధాన పరమైన సంబంధం కూడా అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే, కాంగ్రెస్లు కలిసి కట్టుగా ఈదేశాన్ని రక్షించి తీరుతాయని ధీమా వ్యక్తం చేశారు.తమకు దేశ రక్షణే ముఖ్యం అని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకత తమిళనాడులో ఎస్ఐఆర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంతో డీఎంకే కూటమి తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది. చట్టపరంగా దీనిని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే కూటమి పార్టీలు సమావేశానికి నిర్ణయించాయి. ఇదిలా ఉండగా ఎస్ఐఆర్ను అన్నాడీఎంకే ఆహ్వానించింది. న్యాయబద్ధంగా జరగాలని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కోరారు. ఇక ఎస్ఐఆర్తో బిహార్లో తొలగించిన లక్షలాది ఓట్లను ఇక్కడ(తమిళనాడు)లో చేర్పించే కుట్ర జరుగుతోందని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ధ్వజమెత్తారు. -
రోడ్ షోలకు అనుమతి లేదు
సాక్షి, చైన్నె: మార్గదర్శకాల రూపకల్పన జరిగే వరకు రాష్ట్రంలో ఎలాంటి రోడ్ షోలకు అనుమతి లేదని కోర్టులో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కరూర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం భుస్సీ ఆనంద్, నిర్మల్కుమార్లు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ఈ ఇద్దర్నీ విచారించేందుకు సీబీఐ సమన్లు జారీ చేసినట్టు సమాచారాలు వెలువడ్డాయి. కరూర్ ఘటనతో రోడ్ షోలు, బహిరంగ సభల నిర్వహణకు మార్గదర్శకాల రూపకల్పన దిశగా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కసరత్తులలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ పరిస్థితులలో సోమవారం మద్రాసు హైకోర్టులో కేసు విచారణకు రాగా, మార్గదర్శకాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. కొన్ని పార్టీలకు సభలకు అనుమతి ఇవ్వడం లేదంటూ న్యాయవాదులు వాదించారు. మార్గదర్శకాలను రూపొందించే వరకు ఎలాంటి రోడ్ షోలకు పార్టీలకు అనుమతి ఇవ్వబోమని హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో త్వరితగతిన మార్గదర్శకాల రూపకల్పనకు కోర్టు ఆదేశించింది. అలాగే ముందస్తు బెయిల్ కోసం తమిళగ వెట్రికళగం ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, సంయుక్త కార్యదర్శి నిర్మల్కుమార్లు దాఖలు చేసుకున్న పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఆ పిటిషన్ల విచారణను న్యాయమూర్తులు తిరస్కరించారు. అదే సమయంలో కరూర్ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు భుస్సీ ఆనంద్, నిర్మల్కుమార్ను విచారించేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరికి సమన్లు జారీ చేసి ఉండడం గమనార్హం. -
పవిష్ హీరోగా నూతన చిత్రం ప్రారంభం
తమిళసినిమా: నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన నటుడు పవిష్. ఈయన దనుష్ సోదరి కొడుకు కావడం గమనార్హం. ఈయన గత ఆరు నెలలుగా పలు కథలు వింటూ వర్చారని, చివరికి మహేశ్ రాజేంద్రన్ చెప్పిన కథ నచ్చడంతో ఆయన దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు ఆయన వర్గం పేర్కొన్నారు. కాగా మహేశ్ రాజేంద్రన్ ఇంతకు ముందు దర్శకుడు లక్ష్మణన్ వద్ద బోగన్, బూమి చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. కాగా పవిష్ కథానాయకుడిగా నటిస్తున్న రెండవ చిత్రం సోమవారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. జీ సినిమా మీడియా అండ్ ఎంటర్టెయిన్మెంట్ అధినేత దినేశ్రాజ్, క్రియేటివ్ ఎంటర్టెయినర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత డి.ధనుంజయన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి నాగదుర్గ ఈ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అవుతున్నారు. ఈ తెలుగింటి ఆడపడుచు యూట్యూబ్లో పాపులర్ అయ్యారు. పీజీ.ముత్తయ్య ఛాయాగ్రణం అందిస్తున్న ఈ చిత్రం ద్వారా థింక్ మ్యూజిక్ సిఫార్సుతో నూతన సంగీత దర్శకుడు పరిచయం కానున్నారని, ఆయన గురించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నారు. కాగా రొమాంటిక్ లవ్ కథాంఽశంతో రూపొందుతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు నటుడు ధనుష్ తండి దర్శకుడు కస్తూరి రాజా ముఖ్య అతిథిగా పాల్గొని యూనిట్కు శుభాకాంక్షలు అందించారు. చిత్ర షూటింగ్ను 2026 ఆరంభంలో పూర్తి చేసి సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి ప్రణాళికను రచించినట్లు నిర్మాతలు పేర్కొన్నారు. చిత్రం ఈ తరం యువతతో పాటూ కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. -
క్లుప్తంగా
ఘనంగా మహా కుంభాభిషేకం వేలూరు: వేలూరు కొత్త బస్టాండ్లోని పాలారు నది ఒడ్డున వెలసిన శ్రీఅంకాళ పరమేశ్వరి అమ్మన్ ఆలయ మహా కుంభాభిషేక వైభవం సోమవారం అతి వైభవంగా జరిగింది. ముందగా ఆలయ ప్రాంగణంలో రెండవ కాల యాగ పూజలతో పాటూ గోపూజ, గజ పూజ, లక్ష్మి పూజ, నవగ్రహ పూజ, కలశ పూజలు నిర్వహించారు. యాగ గుండం వద్ద వివిధ పుణిద నదుల నుంచి తీసుకొచ్చిన నీటిని కళశాల్లో ఉంచి వేద పండితుల వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలశ నీటిని ఆలయ రాజ గోపురం వద్దకు తీసుకెల్లి గోపురంపై కలశ నీటిని పోసి కుంభాభిషేక వైభవం నిర్వహించారు. అనంతరం కలశ నీటిని భక్తులపై చల్లారు. అనంతరం ఆలయంలో ఉంచిన అమ్మవారి విగ్రహానికి కలశ నీటిని పోసి పుష్పాలంకరణలు, దీపారాధన పూజలు చేశారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మోహన్, ఆలయ నిర్వహకులు శశికుమార్, ఆనంద్, గణేశన్, సురేష్కుమార్, సెంథిల్కుమార్, బలరామ్, కార్తీక్ పాల్గొన్నారు. రైలు ఢీకొని తండ్రీకొడుకు మృతి వేలూరు: తంజావూరు జిల్లాకు చెందిన రాజేష్(41) ఇతను తిరువలంలోని సున్నపుకారర్ వీధిలో కుటుంబ సభ్యులతో ఉంటూ హోటల్ నడుపుతున్నాడు. ఇతని కుమారుడు కిషోర్ (18) ప్రైవేటు ఇంజినీరింగ్ కళావాలలో విద్యను అభ్యసిస్తున్నాడు. తండ్రి, కొడుకు ఇద్దరూ కాట్పాడి సమీపంలోని తిరువలం వద్ద రైలు రోడ్డు దాటేందుకు యత్నించారు. ఆ సమయంలో అతి వేగంగా వచ్చిన ఎక్స్ప్రెస్ రైలు ఇద్దరినీ ఢీకొనడంతో తండ్రి, కుమారులు ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి రైలు ఇంజిన్ డ్రైవర్ కాట్పాడి రైల్యే పోలీసులకు సమాచారం అందజేయడంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం రైల్యే పోలీసులు కేసు నమోదు చేసి తండ్రి, కుమారుడు ఇద్దరూ రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందా..? లేక ఆత్మహత్య చేసుకునేందుకు రైలు ముందుకు వెళ్లారా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఎలక్ట్రీషియన్ నిజాయితీ సేలం: సేలం రెడ్డిపట్టి ప్రాంతంలో నివసిస్తున్న భాషా (58) ఎలక్ట్రీషియన్. ఆదివారం రాత్రి తన భార్య పర్వీన్తో కలిసి లీ బజార్ ప్రాంతానికి నడుచుకుంటూ వెళుతుండగా వంతెన కింద పడి ఉన్న ఓ హ్యాండ్బ్యాగ్ను చూశాడు. అందులో బంగారు తాయెత్తు, బ్రాస్లెట్, పర్సు, ఏటీఎం కార్డు, పాన్ కార్డు ఉన్నాయి. దీని తరువాత, బ్యాగ్ను దాని నిజమైన యజమానికి అప్పగించాలనే ఉద్దేశంతో, సోమవారం ఉదయం, అతని కుమారుడు ఆటో డ్రైవర్ అబ్దుల్లా, బ్యాగ్ను సేలం నగర పోలీసు డిప్యూటీ కమిషనర్ సుబ్రమణ్య బాలచంద్రకు అప్పగించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆ ఆభరణాలను నిజమైన యజమానులైన సెహ్వాయిపేట్కు చెందిన పూంగోతైకి అప్పగించి, భాషా, అతని భార్య పర్వీన్, అబ్దుల్లాలను అభినందించారు. చెరువులకు జలకళ తిరుత్తణి: ఈశాన్య రుతుపవనాలతో చెరువులు వేగంగా నిండుతున్నాయి. తిరుత్తణి సబ్ డివిజన్లో నీరు పారుదల శాఖకు చెందిన 79 చెరువులున్నాయి. చెరువునీటిపై ఆధారపడి చాలా మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. అలాగే కుశస్థలి నది భూగర్భజలాలపై ఆధారపడి నది తీర ప్రాంతాల రైతులు పంట సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చెరువులు వేగంగా నిండుతున్నాయి. తిరుత్తణి డివిజన్లో నీటి పారుదల శాఖకు చెందిన 79 చెరువుల్లో 31 చెరువులు పూర్తి సామర్థ్యం నిండాయి. ఇందులో తిరుత్తణిలో 9 చెరువులు, ఆర్కేపేటలో 16, పళ్లిపట్టులో 6 చెరువులు నిండినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని చెరువులు ఒకటి రెండు రోజుల్లో నిండనున్నట్లు తెలిపారు. చెరువులు వేగంగా నిండుతున్న క్రమంలో సాగునీటి ఎద్దడి లేకుండా పంటలకు నీరందే అవకాశం ఏర్పడడంతో రైతులు హర్హం వ్యక్తం చేస్తున్నారు. -
వీజే సిద్దూ స్వీయ దర్శకత్వంలో..
తమిళసినిమా: వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కె.గణేశ్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం డయంకరం. డిజిటల్ స్టార్గా పేరు గాంచిన వీజే.సిద్ధూ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా, దర్శకుడిగా పరిచయం కావడం విశేషం. ఈయన ఇంతకు ముందు డ్రాగన్ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించి, మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కాగా డయంకరం చిత్రం ద్వారా హీరోగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నట్టి, కాళీ వెంకట్, ఇళవరసు, నితిన్సత్య, హర్షద్ కాంత్, ఆదిత్య కధీర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. పి.దినేశ్ కృష్ణన్ ఛాయాగ్రహణం, సిద్ధుకుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలను సోమవారం ఉదయం స్థానిక నుంగంభాక్కంలోని ఎల్ఏ స్టూడియోలో ప్రారంభించారు. చిత్ర వివరాలను యూనిట్ వర్గాలు తెలుపుతూ ఇది కామెడీ ఎంటర్టెయిన్గా ఉంటుందన్నారు. నేటి యువత మనోభావాలు, ఏమోషనల్తో కూడిన హ్యూమర్ కలగలిపి అన్ని వర్గాలను అలరించే విధంగా డయంకరం చిత్రం ఉంటుందని పేర్కొన్నారు. చిత్ర ఆడియోను వేల్స్ మ్యూజిక్ ఇంటన్నేషనల్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నట్లు చెప్పారు. అదే విధంగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ చిత్ర పూజా కార్యక్రమాల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. -
●ఆరోగ్య శిబిరాలు
ప్రముఖ ఎఫ్ఎంసీజీ గోల్డ్ విన్నర్ , కాశీశ్వరి రిఫైనరీ నేతృత్వంలో తమిళనాడు వ్యాప్తంగా ఆరోగ్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.9 కేంద్రాలలో 42 శిబిరాలను సోమవారం విజయవంతంగా నిర్వహించి, సమగ్ర ఆరోగ్య పరీక్షలను, చికిత్సను అందజేశారు. – సాక్షి, చైన్నె ●స్మార్ట్ స్టార్టప్ వెల్ టెక్ టీబీఐ స్టార్టప్, ఇన్వెస్టర్ సమ్మిట్ 2025ను స్మార్ట్ స్టార్టప్, పెట్టుబడులు – అభివృద్ధిలో ఏఐ ఉపయోగం గురించి చర్చించారు. వెల్టెక్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్, కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, ఆర్ అండ్ డీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మద్దతుతో జరిగిన ఈ సమ్మిట్కు ప్రతినిధులు గోపి కోటేశ్వరన్, గౌతమ్ సర్వేష్, గాయత్రి దేవి కల్యాణ రామన్, చేతన్ ప్రకాష్ సంచేటి, జిరామసుబ్రమణియన్, అతుల్శ్రీ,రాజేంద్రన్ హాజరయ్యారు. – సాక్షి, చైన్నె -
కాలువల ఆక్రమణలతోనే ఇళ్లలోకి నీరు
వేలూరు: కాలువలు ఆక్రమణలకు గురి కావడంతోనే వరద నీరు ఇళ్లలోకి చేరి విష పురుగుల బాధతో ఇబ్బందులు పడుతున్నట్లు కాట్పాడికి చెందిన కుటుంబ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి,వినతిపత్రం అందజేశారు. సోమవారం వేలూరు కలెక్టరేట్లో ప్రజా విన్నపాల దినోత్సవం కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. కాట్పా డి సమీపంలోని తారాపడవేడు, గోపాలపురం వంటి ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా తమ ప్రాంతంలో వర్షం వస్తే నీరు వెళ్లేందుకు కాలువ ఉండేదని ప్రస్తుతం ఈ కాలువలను పూర్తిగా ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకోవడంతో నీరు ఇళ్ల మధ్యే నిల్వ ఉంటోందన్నారు. గత రెండు రోజులుగా కార్పొరేషన్ సిబ్బంది సరి చేస్తున్నప్పటికీ నీటిమట్టం తగ్గలేదన్నారు. వీటిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. వినతులను స్వీకరించిన అధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా వినతిపత్రాలు స్వీకరించిన కలెక్టర్ అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ మాలతి, సబ్ కలెక్టర్ సెంథిల్కుమార్ పాల్గొన్నారు. -
హన్సిక ట్రిప్.. ఎవరితో తెలుసా?
తమిళసినిమా: ఒకప్పుడు క్రేజీ కథానాయకిగా వెలిగిన నటి హన్సిక. తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో 50 చిత్రాలకు పైగా నటించిన ఈ ముంబయి భామ ఆ మధ్య సోహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఇప్పటి వరకూ ఏ ఒక్క కొత్త చిత్రంలోనూ నటించలేదు. అయినప్పటికీ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల భర్తతో వివాదాలు అంటూ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దానికి బలం చేకూర్చే విధంగా నటి హన్సిక ఇటీవల దీపావళి పండగను ఒంటరిగానే జరుపుకోవడం, వివాహం అయిన రెండేళ్లలోనే భర్తను విడిచి తల్లితోనే ఉంటున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంపై హన్సిక ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. కాగా తాజాగా ఈ అమ్మడు రాజస్థాన్లోని రంతంబోర్ జాతీయ పార్క్ను తిలకించడానికి వెళ్లారు. అయితే ఆమె ఎవరితో కలిసి వెళ్లారో తెలుసా అమ్మ, సోదరుడితో కలిసి ఆ పార్క్కు వెళ్లారు. అక్కడ పులి, కుందేలు, ఎలుగుబంటులతో ఫొటోలు దిగారు. వాటిని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ విషయం అదికాదు. ఆ పార్క్కు హన్సిక తన తల్లి, సోదరుడితో కలిసి వెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారణం ఈసారి కూడా భర్త ఆమెతో లేకపోవడమే. దీంతో హన్సిక, సోహైల్ కతూరియా మధ్య వివేధాలు అనే ప్రచారం నిజమేనని అర్థమవుతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా హన్సిక తన సోదరుడి భార్యను గృహ హింసకు గురి చేసిందే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ టాప్ హీరోయిన్ ఇలాంటి వివాదాలకు తావు ఇవ్వడంతో హన్సిక పేరు వార్తల్లో నానుతోంది. అయితే ఇలాంటివన్నీ లెక్క చేయని ఈ అమ్మడు విహార యాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నటి హన్సిక -
5 టన్నుల పుష్పాలతో షణ్ముఖర్కు పుష్పాంజలి
తిరుత్తణి: స్కంధషష్టి వేడుకల్లో ప్రధానమైన పుష్పాంజలి సోమవారం సాయంత్రం కనులపండువగా సాగింది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో 22న స్కంధషష్టి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఆరవ రోజైన సోమవారం పుష్పాలతో షణ్ముఖర్కు పుష్పార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరు, హోసూరు సహా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పుష్పాలు తీసుకొచ్చారు. అలాగే తిరుత్తణి పట్టణ పుష్పాల వ్యాపారులు సైతం స్వామి సేవకు పుష్పాలు అందజేశారు. స్థానిక సుందర వినాయకుడి ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను భక్తులు కొండ ఆలయంకు తరలించారు. సాయంత్రం 5 గంటటల సమయంలో సర్వాంగసుందరంగా అలంకరించిన షణ్ముఖర్కు అశేష భక్తజనం నడుమ దాదాపు 5 టన్నుల పుష్పాలతో స్వామికి పుష్పార్చన నిర్వహించి మహాదీపారాధన చేశారు. ఈ సందర్భంగా భక్తులు హరోంహర నామస్మరణతో స్వామిని దర్శించుకున్నారు. స్వామికి అర్చన చేపట్టిన పుష్పాలను భక్తులు పోటాపోటీగా తీసుకెళ్లారు. -
మాధవన్
మరో బయోపిక్లో తమిళసినిమా: బయోపిక్లు తెరకెక్కడం కొత్తేమీ కాదు. అయితే అన్ని బయోపిక్లో ప్రేక్షకారణ పొందడం లేదు. ఇంతకు ముందు మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్.ధోని, తమిళంలో కామరాజ్, జయలలిత తదితరుల జీవిత చరిత్రలు సినిమాగా తెరకెక్కాయి. అయితే వాటిలో కొన్ని చిత్రాలు మాత్రమే విజయం సాధించాయి. కాగా ఇంతకు ముందు ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త అంబి నారాయణన్ బయోపిక్ను రాకెట్రీ ది అంబి ఎఫెక్ట్ పేరుతో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈచిత్రంలో నటుడు మాధవన్ అంబి నారాయణన్ పాత్రను పోషించి, స్వీయ దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రం కమర్షియల్గా సక్సెస్ కావడంతో పాటూ విమర్శకుల ప్రశంసలను అందుకుని, జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకుంది. కాగా తాజాగా నటుడు మాధవన్ మరో బయోపిక్లో నటిస్తున్నారు. ఇండియన్ ఎడిసన్గా పేరు గాంచిన జీడీ నాయుడు జీవిత చరిత్రను జీడీఎన్ పేరుతో సినిమాగా తెరకెక్కుతోంది. ఈయన కోయంబత్తూర్కు చెందిన ప్రముఖుడు అన్నది గమనార్హం. పలు విషయాలను కనుగొని ఇండియన్ ఎడిసన్గా పేరుగాంచారు. ఈ చిత్రంలో జీడీ నాయుడుగా నటుడు మాధవన్ నటిస్తున్నారు. నటుడు సత్యరాజ్, జయరామ్, తంబిరామయ్య, నటి ప్రియమణి, దుషారా విజయన్, వినయ్రాయ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్న వర్గీస్ మూలన్స్ పిక్చర్స్ సంస్థతో కలిసి నటుడు మాధవన్కు చెందిన త్రికలర్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. కథ, దర్శకత్వం బాధ్యతలను కృష్ణకుమార్ రామకుమార్ నిర్వహిస్తున్నారు. గోవింద వసంత్ సంగీతాన్ని, అరవింద్.కె ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జీడీ నాయుడు స్వగ్రామం అయిన కోయంబత్తూర్లో శరవేగంగా జరుపుకుంటోంది. కాగా జీడీ నాయుడు చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ఆదివారం నటుడు మాధవన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. కారణం అందులో నటుడు మాధవన్ గుర్తుపట్టలేనంతగా జీడీ. నాయుడి గెటప్లో ఉండడమే. చిత్రాన్ని 2026లో సమ్మర్ స్పెషల్గా విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు. -
ఆప్స్టేట్ మెడికల్ వర్సిటీతో వీఐటీ ఒప్పందం
వేలూరు: వేలూరు వీఐటీ యూనివర్సిటీ, అమెరికాలోని న్యూయార్క్ సిరిక్యూస్లోని ఒక ప్రభుత్వ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు వీఐటీ యూనివర్సిటీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకటనలో తెలిపిన విధంగా ఈ ఒప్పందం ఆరోగ్యశాస్త్రాలు, బయోమెడికల్ ఇంజినీరింగ్, మల్టీ డిసిప్లీనరి మెడికల్ కో–ఆపరేషన్ రంగాల్లో విద్య, పరిశోధనల్లో సహకారాన్ని సులభతరం చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకం చేసుకున్నారు. ఈ ఒప్పందంపై ఆప్స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ సి.అంబర్గ్, వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు శేఖర్ విశ్వనాథన్ సంతకం చేసుకున్నారు. ఈ ఒప్పందంతో కొత్త కొత్త పరిశోధనలు, అధ్యాపక విద్యార్థుల మార్పిడి ఉద్భవిస్తున్న బయోమెడికల్ రంగాలు, ట్రాన్స్లేషనల్ హెల్త్ కేర్ అని పిలువబడే బహుళ విభాగ వైద్య సహకారాలను సులభతరం చేస్తుంది. వీటితో పాటూ వీఐటీలోని వైద్య శాస్త్రాలు, ఇంజినీరింగ్ విభాగాన్ని వైద్య ఇంజినీరింగ్, వైద్య సాంకేతికలతో ప్రపంచ సహకారంలో కీలక పాత్ర వహిస్తుంది. అదేవిధంగా వీఐటీలోని విద్యార్థులు, ఫ్రొఫెసర్లు న్యూయార్క్లోని యూనివర్సిటీలో పలు పరిశోధనలు చేసేందుకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఇందులో వీఐటీ యూనివర్సిటీ వైద్య శాస్త్రాలు, ఇంజినీరింగ్ విభాగం డీన్ గీత ఉన్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. -
‘మోంథా’ జాగ్రత్తలు సిద్ధం
సాక్షి, చైన్నె: మోంథా తుపాన్తో రాష్ట్రంలోని అన్ని హార్బర్లలో ప్రమాద సూచికలను ఎగురవేశారు. అధికార యంత్రాంగం ముందు జాగ్రత్తలు సిద్ధం చేశారు. ఎంతపెద్ద వాన వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ధీమా వ్యక్తంచేశారు. ఈశాన్య రుతు పవనాలతో నేపథ్యంలో బంగాళాఖాతంలో మోంథా తుపాన్ ఉత్తర తమిళనాడులో పూర్తిగా వాతావరణాన్ని మార్చేసింది. విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, చైన్నె, రాణిపేట, వేలూరు, తిరువళ్లూరు జిల్లాలో సోమవారం ఉదయం నుంచి చిరు జల్లులతో వర్షం పడుతూ వచ్చింది. మోంథా ఆంధప్రదేశలోని కాకినాడలో తీరాన్ని మంగళవారం దాటుతున్నప్పటికీ, ఇది చైన్నెకు సమీపంలో ప్రయాణించే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేశారు. దీంతో చెంగల్పట్టు, కాంచీపురం, చైన్నె, తిరువళ్లూరు తదితర జిల్లాలలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అధిక ప్రభావం తిరువళ్లూరు జిల్లాపై ఉండేందుకు అవకాశాల నేపథ్యంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. సోమవారం రాత్రి సమయానికి చైన్నెకు 450 కి.మీ దూరంలో మోంథా కేంద్రీకృతమై, గంటకు సమారు 18 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్టు వాతావరణ అధికారులు ప్రకటించారు. ఈ ప్రభావంతోభారీ వర్షం పడ్డ పక్షంలో ముంపుప్రాంతాలలో బాధితులను ఆదుకునేందుకు ముందు జాగ్రత్తలు చైన్నె, శివారులలో సిద్ధం చేశారు. సిద్ధంగా ఉన్నాం.. ఉదయం నుంచి అధికారులు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రులు ఎం. సుబ్రమణియన్, కేఎన్ నెహ్రు, శేఖర్బాబు, మేయర్ ప్రియ తదితరులు వేర్వేరుగా చైన్నెలో ఉరకలు పరుగులతో ముందు జాగ్రత్తలను పరిశీలించారు. వ్యాసార్పాడి, తండయార్ పేట పరిసరాలలో డిప్యూటీ సీఎం పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ మోంథా తుపాన్ తమిళనాడుపై పెద్ద ప్రభావం ఉండదని భావించినా, ముందు జాగ్త్రతలు విస్తృతం చేసి ఉంచామన్నారు. ఉత్తర చైన్నె, తిరువళ్లూరులలో 8 సెం.మీ మేరకు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచనతో అందరం సమష్టిగా ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధమై ఉన్నామన్నారు. ఎంతపెద్ద వాన వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇదిలా ఉండగా వర్షాల సీజన్ నేపథ్యంలో రవాణా సంస్థ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. డ్రైవర్లు బస్సులను జాగ్రత్తగా నడపాలని, ప్రయాణీకుల భద్రతకు భరోసాకల్పించాలని సూచించారు. సురక్షిత ప్రయాణం దిశగా వర్షాల సమయంలో బస్సులను నడపాలని, ఎక్కడైనా రోడ్లపై అధిక నీరు ప్రవహిస్తున్నట్టు గుర్తిస్తే, తక్షణం సమాచారాలు ఇవ్వాలని, ప్రయాణికులకు పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు డ్రైవర్లు సిద్ధమై ముందడుగు వేయాలని సూచించారు. ఇక వర్షాల నేపథ్యంలో చైన్నెలో 405 శాశ్వత వైద్య శిబిరాలు, 166 మొబైల్ వైద్య శిబిరాల ద్వారా వైద్య సేవల విస్తృతానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆహారం, వైద్యం, తాగునీటి సౌకర్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కాగా, రెవెన్యూశాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, ఇతర అధికారులు ఎళిలగంలోనిస్టేట్ కంట్రోల్రూమ్కు పరిమితమయ్యారు. మోంథా కదలికను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వర్ష ప్రభావం ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటుందో ముందే గ్రహించి విస్తృత చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు.కూలిన చెట్టు తొలగింపు -
ఆదవ్కు.. ప్రమోషన్?
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగంలో ఆదవ్ అర్జునకు పదోన్నతి కల్పించేందుకు అధ్యక్షుడు విజయ్ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆయనకు ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న భుస్సీ ఆనంద్కు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పార్టీ పూర్తి బాధ్యతలు అప్పగించ బోతున్నట్టు సమాచారం. వివరాలు.. 2026 అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా సినీ నటుడు విజయ్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఆయన అభిమానులే పార్టీలో అధికంగా ఉన్నారు. జిల్లాలోని ముఖ్య అభిమాన నేతలకు పదవులను అప్పగించారు. పార్టీ పరంగా 120 జిల్లాలను ఏర్పాటు చేసి, కార్యదర్శులు,ఇతర నిర్వాహకులను నియమించారు. అలాగే, సుమారు 20కు పైగా అనుబంధ సంఘాలను సైతం ఏర్పాటు చేసి పార్టీ పరంగా కార్యక్రమాలు విస్తృతం చేశారు. తాను సైతం అంటూ ప్రజలలోకి చొచ్చుకెళ్తున్న సమయంలో కరూర్ లో చోటు చేసుకున్న పెను విషాదం ప్రచార పర్యటనకు కాస్త బ్రేక్ వేసింది. దీంతో పార్టీ పరంగా కొన్ని కీలక మార్పునకు విజయ్ నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ప్రధానంగా కొన్ని జిల్లాలో కార్యదర్శులను మార్చడమే కాకుండా, రాష్ట్ర స్థాయి కమిటీలోనూ కొన్ని కీలక మార్పునకు నిర్ణయించినట్టు చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆది నుంచి విజయ్ వెన్నంటి ఉంటూ వస్తున్న ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ను కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి రాజకీయాలకు పరిమితం చేయనున్నట్టు సమాచారం. ఆయన స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జునకు అప్పగించే అవకాశాలు ఉన్నట్ట్టు చర్చ ఊపందుకుంది. అలాగే, పార్టీ రాష్ట్ర స్థాయిలో కీలక పదవులలో ఉన్న వారిని సైతం మార్చి, రాజకీయంగా వ్యాఖ్యల తూటాలను పేల్చగలిగే వారిని నియమించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. -
శ్రమ, ప్రతిభకు గుర్తింపే.. డిగ్రీపట్టా
సాక్షి, చైన్నె: ‘డిగ్రీపట్టా అనేది కేవలం ఒక కాగిత ముక్క మాత్రం కాదు..మీ శ్రమకు ఫలితం. మీ జ్ఞానానికి మీ ప్రతిభకు గుర్తింపు. ఇది కుటుంబంలోని అనేక తరాల కల...దీనిని సాకారం చేసుకోవడం వెల కట్టలేని ఆనందకర క్షణం’ అని విద్యార్థులను ఉద్దేశించి సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. తిరుచ్చిలోని భారతీ దాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (బీఐఎం) 33వ గ్రాడ్యుయేషన్ సోమవారం చైన్నెలో జరిగింది. మ్యూజిక్ అకాడమి వేదికగా జరిగిన ఈ వేడుకకు సీఎం ఎంకే స్టాలిన్ హాజరయ్యారు. 197 మందికి డిగ్రీలు, పతకాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి శంకర్, భారతీ దాసన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ చైర్మన్ రవి అప్పాస్వామి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు బాల భాస్కర్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎస్. జయకృష్ణ, పోసు్ట్రగాడ్యుయేట్ విభాగాధిపతి రాఘవేంద్ర, భారతీదాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ నిర్వాహకులు తదితరులు హాజరయ్యారు. జీవితం ఉజ్వలమయం.. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఎం ఎంకేస్టాలిన్ మాట్లాడుతూ ఇక్కడ పట్టభద్రులైన విద్యార్థులకు ఈ రోజు చాలా ముఖ్యమైనదని పేర్కొంటూ, ఈ జీవిత ప్రయాణంలో చేతిలో ఉన్న ’డిగ్రీ’ కేవలం కాగితం ముక్క కాదని, శ్రమకు ఫలితం, జ్ఞానం, ప్రతిభకు గుర్తింపు అని వ్యాఖ్యలు చేశారు. విద్యారంగంలో జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థానాన్ని బీఐఎం కలిగి ఉన్నట్టు వివరించారు. ఇక్కడ చదువుకున్న వారెందరో విద్య, వ్యాపారం, సామాజిక రంగాలలో ఉన్నత స్థానాలలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ జాబితాలో ఇక్కడున్న విద్యార్థులు సైతం ఉండాలని ఆకాంక్షించారు. దేశంలోనే ఉన్నత విద్యకు ఉత్తమ రాష్ట్రంగా తమిళనాడు అవతరించి ఉందన్నారు. ఉన్నత విద్యా పరంగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో అత్యుత్తమ విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయని వివరించారు. ఉన్నత విద్య కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తున్నట్టు గుర్తు చేస్తూ, ట్యూషన్ ఫీజు రాయితీలు, కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటు, పేద, సామాన్య విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను దరి చేర్చడమే కాకుండా, ప్రభుత్వం అమలు చేస్తున్న అల్పాహార పథకం, పుదుమైపెన్, తమిళ్ పుదల్వన్,నాన్ మొదల్వన్ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మహాకవి తిరువళ్లువర్ రచించిన తిరుక్కురల్లోని అనేక సూక్తులను విశదీకరించారు. ఇందులోని జీవిత పాఠాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, మరిచి పోకూడదని, ఏ కష్ట సమయంలో నైనా, నిజాయితీ, నమ్మకం, బాధ్యత వంటి విలువలు అనుసరించాలనిపిలుపునిచ్చారు. -
హరో.. హర
రాష్ట్రంలోని తమిళ్ కడవుల్ ఆరుపడై వీడులన్నీ హరోం ..హర నామస్మరణతో సోమవారం మిన్నంటింది. భక్తుల జయ జయ ధ్వానాలు, హరోహర..., కందా.., వేలా.. నామస్మరణ మధ్య మురుగన్ సన్నిధుల్లో సూర సంహార ఘట్టం కనుల పండువగా సాగింది. ఇందులో తిరుచెందూరు సాగర తీరంలో అద్వితీయ ఘట్టం లక్షలాది మంది భక్తుల నడుమ జరిగింది. జయంతి నాథర్ సూరుడిని సంహరించిన ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించారు. సాక్షి, చైన్నె: తమిళ్ కడవుల్ మురుగన్కు ప్రసిద్ధి చెందిన ఆరుపడై వీడులు తమిళనాడులోనే ఉన్న విషయం తెలిసిందే. తిరుప్పర కుండ్రం ముత్తుకుమార స్వామిగా, పలముదిర్ చోళైలో మురుగన్గా, తిరుత్తణిలో బాలసుబ్రమణ్యన్గా, పళని దండయుధ పాణిగా, స్వామి మలైలో స్వామినాథన్, తిరుచెందూరులో జయంతి నాథర్గా కొలువై ఉన్న తమిళ్ కడవుల్కు స్కంధ షష్టి ఉత్సవాలు గత వారం రోజులుగా ఘనంగా జరుగుతూ వస్తున్నాయి. ఈ ఉత్సవాలలో ఆరవ రోజైన సోమవారం ఆలయాలలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు జరిగాయి. సూర సంహార ఘట్టాల అద్వితీయంగా జరిగాయి. అలాగే ఈరోడ్ గోబి చెట్టి పాళయం పచ్చమలై మురుగన్ ఆలయంలో , తేని కంబం సురులి వేలు అప్పన్ ఆలయం, మేల్ మలయనూరు మురుగన్ ఆలయం, కంచి వెల్లకోట్టై మురుగన్ ఆలయం, వడపళణి సుబ్రమణ్య స్వామి ఆలయాలలో సైతం స్కంధ షష్టి ఉత్సవాలలో భాగంగా సూరుడ్ని స్వామి వారు సంహరించే ఘట్టాలు జరిగాయి. ఈ సమయంలో హరోం..హర నామస్మరణ మిన్నటింది. తిరుచెందూరులో.. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ ఏటా స్కంధషష్టి అత్యంత వేడుకగా జరుగుతాయి. ఈ ఏడాది ఉత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. తొలి రోజున లక్షలాది మంది భక్తులు వత్రాన్ని ఆచరించి ఆలయ పరిసరాలలోని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఆరు రోజుల పాటూ ఆలయ పరిసరాల్లో భక్తిశ్రద్ధలతో పూజల్ని నిర్వహించిన భక్తులు సోమవారం తమ వ్రతాన్ని వీడారు. ఈ ఆరు రోజులు ఆలయంలో రోజూ విశిష్ట పూజలు, అభిషేకాలు జరిగాయి. సర్వాలంకరణలతో సెంథిల్ ఆండవర్, జయంతి నాథర్గా పిలవబడే మురుగన్ స్వామి వారు వళ్లి, దేవయాని సమేతంగా భక్తులకు దర్శనం ఇస్తూ వచ్చారు. స్కంధ షష్టి ఉత్సవాల్లో ఆరో రోజున అత్యంత ముఖ్య ఘట్టం సాగర తీరంలో అద్వితీయంగా జరిగింది. ఈ ఘటాన్ని తిలకించేందుకు ఆదివారం రాత్రి నుంచే నుంచే లక్షల్లో భక్తులు తిరుచెందూరుకు తరలి వచ్చారు. సముద్ర తీరం ఒడ్డున భక్తులు కూర్చుని ఈ ఘటాన్ని తిలకించే అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సముద్రంలోకి ఎవ్వరూ చొచ్చుకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తగా బారికెడ్లను ఏర్పాటు చేశారు. పడవలు, బోట్ల నుంచి భద్రతను పర్యవేక్షించారు. వేకువ జాము నుంచే.. వేకువ జామున ఒంటి గంటకు ఆలయంలో పూజాది కార్యక్రమాలు మొదలయ్యాయి. అభిషేయాలు, యాగాది పూజలతో స్వామివారి విశ్వరూప దర్శనాన్ని భక్తులకు దక్కింది. ఆలయ సంతోష మండపంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు సాగినానంతరం సూర సంహార ఘట్టానికి ఏర్పాట్లు చేశారు. భక్త జనం కందా...వేలా, హరోం..హర అన్న నామ స్మరణను మిన్నంటేలా నినదించడంతో పట్టు వస్త్రాలు ధరించి, వేలా యుధంను చేతబట్టి స్వామి వారు సాగర తీరం వైపుగా కదిలారు. ఈ సూరసంహార ఘట్టానికి పురాణాలలో ఉన్న ప్రత్యేక కథను చాటే విధంగా వేడుక కనుల పండువగా సాగింది.సూర సంహార ఘట్టం కనులపండువగా.. తారకాసురుడు అనే రాక్షసుడి ఆగడాలను అరికట్టేందుకే సుబ్రహ్మణ్య స్వామి భూమి మీద అవతరించినట్టు పురాణాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకు సుబ్రమణ్య స్వామిని తమిళ్ కడవుల్(తమిళ దేవుడు) అని భక్తులు పిలవడం జరుగుతోంది. పురాణ గాథను చాటే విధంగా జరిగిన అద్వితీయ ఘట్టాన్ని తిలకించేందుకు వచ్చిన భక్త జనంతో తిరుచెందూరు పులకించింది. ఆలయం, ఒడ్డు సముద్రంలోకి కలిసిందా..? అన్నట్టుగా పరిసరాలు మారాయి. ఇసుక వేస్తే రాలనంతంగా భక్తులు తరలి వచ్చి సూర సంహార ఘటాన్ని తిలకించారు. భక్త జన సమూహం మధ్యలోకి స్వామి వారు పచ్చ పట్టు, వజ్రాభరణాలను ధరించి రాగానే, శూరుడు(తారకాసురుడు) తన వీరంగాన్ని ప్రదర్శించే విధంగా క్షణాలలో వివిధ అవతరాలను మార్చుకుంటూ స్వామివారి సహనాన్ని పరీక్షించే రీతిలో ముందుకు సాగాడు. ఓపికగా సూరుడి వీరంగాలను వీక్షించిన స్వామివారు చివరకు తన వెండి వేలాయుధంతో సంహరించిన ఘట్టాన్ని చూసిన భక్తులు జయ జయ ధ్వానాలతో , హరో హర అంటూ, కందా...వేలా అన్న నినాదాల్ని మార్మోగించారు. సూర సంహార ఘట్టం అనంతరం భక్తులు సముద్ర స్నానం చేసిన ఆలయ సమీపంలోని నాలుగు బావి వద్దకు చేరుకుని ఆ నీటిని చల్లుకున్నారు. తదుపరి ఆలయంలో స్వామి వారి దర్శనానికి బారులుదీరారు. సముద్రం ఒడ్డున ఉన్న ఈ నాలుగు బావి నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. మిగిలిన చోట్ల నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ బావి నీటిని భక్తులు నెత్తిన చల్లుకుని ఆలయంలోకి వెళ్లడం ఆనవాయితీ. మలేషియా, సింగపూర్, శ్రీలంక వంటి దేశాలతో పాటూ తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు ఈ అద్వితీయ ఘటాన్ని ప్రత్యక్షంగా తిలకించినట్టు అంచనా. సూర సంహారం తదుపరి స్వామి వారికి అద్దాల భవనంలో విశేష అభిషేకాలు, పూజలు జరిగాయి. మంగళవారం అమ్మ వారి తపస్సు, స్వామి, అమ్మవార్ల వివాహ మహోత్సవం జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తూత్తుకుడి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. పోలీసులు నిఘాతో వ్యవహరించారు. రైల్వే, రవాణా సంస్థలు ప్రయాణీల కోసం ప్రత్యేక బస్సులు, రైళ్లను నడిపాయి. -
అలరించిన సురంజనా బోస్ సంగీత విభావరి
కొరుక్కుపేట:.శాసీ్త్రయ సంగీత కళలను పరిపోషిస్తున్న విశ్వకళా సంగమ ఆధ్వర్యంలో కలకత్తాకు చెందిన విధూషి సురంజనా బోస్ హిందుస్తానీ సంగీత విభావరితో అలరించింది. చైన్నె తిరువాన్మయూర్లోని కళా క్షేత్ర కళాశాల ప్రాంగణంలోని ఠాగూర్ హాల్ వేదికగా ఆదివారం రాత్రి హిందుస్తానీ సంగీత కచ్చేరి ఏర్పాటు చేశారు. విదూషి సురంజనా బోస్ దాదాపు 2 గంటల పాటూ హిందుస్తానీ కచేరితో సంగీత ప్రియులను మంత్రముగ్దులను చేశారు. ఆమె ఇంకా రాగశ్రీ రాగంలో సజ్ రంగ్ అనే పాట, పీలూతుమ్రీ, మాండ్ రాగంలో భజనల్లోని ప్రత్యేకమైన గీతాలు ఆలపించి శ్రోతలను పరవశింపజేశారు. ఆమెకు వాయిద్య సహకారాన్ని హార్మోనియంపై సందీప్ గుర్ములే, తబలాపై రామ్ ఖాద్సే అందించారు. ఈ సందర్భంగా కళాకారులను విశ్వకళా సంగమ వ్యవస్థాపకులు ఊరా లక్ష్మీ నరసింహారావు శాలువాలతో సత్కరించి అభినందించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వకళా సంగమ గత 25 సంవత్సరాలుగా హిందుస్తానీ సంగీతానికి పెద్దపీట వేస్తుందన్నారు. నార్త్ ఇండియా నుంచి గొప్పగొప్ప కళాకారులను తీసుకుని వచ్చి హిందుస్తానీ కచేరిలతో సంగీత ప్రియులను మైమరిపింప జేస్తున్నట్టు తెలిపారు. విశ్వకళా సంగమ 26 వ వార్షిక సంగీతోత్సవాలు రానున్న డిసెంబర్ 19 నుంచి 21వ తేది వరకు మూడు రోజులుపాటూ చైన్నె ఆళ్వార్ పేటలోని నారథగాన సభ వేదికగా నిర్వహిస్తామన్నారు. 250 రోజులు పూర్తి చేసుకున్న నిత్యాన్నదానం కొరుక్కుపేట: రాష్ట్ర ముఖ్య మంత్రి ఎం.కె. స్టాలిన్ 72వ పుట్టినరోజు సందర్భంగా 365 రోజలుపాటూ నిత్య అన్నదాన ప్రాజెక్టును దేవాదాయశాఖ మంత్రి పీకే శేఖర్ బాబు ప్రారంభించారు. ఫిబ్రవరి 19, 2026 వరకు, సంవత్సరంలో 365 రోజుల పాటూ వివిధ ప్రదేశాలలో రోజుకు సగటున 1000 మందికి అల్పాహారం అందించాలని ప్రణాళిక రచించారు. ఈ గొప్ప ప్రాజెక్టును మంత్రి పి.కె. శేఖర్బాబు నేతృత్వంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ చేతులమీదుగా కొళత్తూరులో ప్రారంభించారు. ఈ కార్యక్రమం సోమవారంతో 250వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. దీంతో కొలత్తూర్ వెస్ట్ ఏరియా, 64వ వార్డు కొలత్తూర్, ఎ.ఓ. కాలనీ 36వ కట్ రోడ్, లక్ష్మీ ఫార్మసీ దగ్గర , 64వ వార్డు, కొలత్తూర్ మెయిన్ రోడ్, టీచర్స్ గిల్డ్ రోడ్, మూకాంబిక అమ్మన్ ఆలయానికి సమీపంలోఏర్పాటు చేస్తున్నారు .ఈ కార్యక్రమానికి మంత్రి శివ మెయ్యనాథన్ ప్రత్యేక అతిథిగా హాజరై ప్రజలకు అల్పాహారం వడ్డించారు. ఈ అద్భుతమైన ప్రాజెక్టుకు ప్రజల నుండి మంచి ఆదరణ లభించింది. -
కరూర్ బాధిత కుటుంబాలకు విజయ్ ఓదార్పు
తమిళ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్ ఎట్టకేలకు కరూర్ బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. సోమవారం మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో వాళ్లను పరామర్శించి.. ఓదార్చి.. పరిహారం అందజేశారు. ఈ నేపథ్యంతో ఆ పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.కరూర్ తొక్కిసలాటకు నేటితో సరిగ్గా నెల రోజులు పూర్తైంది. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఈ ఘటన తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయ్.. బాధిత కుటుంబాలకు టీవీకే తరఫున పరిహారం కూడా ప్రకటించారు. అయితే అప్పటి నుంచి కరూర్ వెళ్లేందుకు ఆయనకు పోలీసుల నుంచి అనుమతి లభించడం లేదు. దీంతో.. దీంతో బాధిత కుటుంబాలనే మహాబలిపురంలోని ఓ రిసార్ట్కు రప్పించారు. బాధిత కుటుంబాల కోసం రిసార్ట్లో టీవీకే పార్టీ 50 గదులను బుక్ చేసింది. వాళ్లందరినీ విడివిడిగా కలిసి విజయ్ పరిహారం అందిస్తున్నారు. కరూర్లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది (Karur Stampede). ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందని ఆరోపిస్తూ.. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అటుపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణ కమిటీ ఆ దర్యాప్తును ఎప్పటికప్పుడు సమీక్షించనుంది. ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు (SOP) రూపొందించేవరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. -
బైసన్ మూవీ టీమ్పై సీఎం ప్రశంసలు
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్విక్రమ్ (Dhruv Vikram) కథానాయకుడిగా నటించిన చిత్రం బైసన్ (Bison Movie). అనుపమ పరమేశ్వరన్, రజీషా విజయన్, పశుపతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అప్లాస్ సంస్థతో కలిసి నీలం ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు పా.రంజిత్ నిర్మించారు. నివాస్ కే ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రం తమిళనాడులో అక్టోబర్ 17న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.బైసన్ టీమ్ను అభినందించిన సీఎంబైసన్ మూవీ చూసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.. ఆఫీసుకు పిలిచి మరీ మారిసెల్వరాజ్, ధ్రువ్విక్రమ్లను అభినందించారు. బైసన్ చిత్రం గురించి ఎక్స్లో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. మారిసెల్వరాజ్ సినీమకుటంలో ఇది మరో వజ్రం. ప్రతిభను మాత్రమే నమ్ముకున్న ఒక యువకుడు అటు కబడ్డీ కోర్టులో, ఇటు బయట ఎదురైన సమస్యలను ఎదుర్కొని విజయం సాధించిన కథను చాలా గొప్పగా తీర్చిదిద్దారు. చక్కగా చూపించారుక్రీడలు నేపథ్యంగా చేసుకుని ఒక యువకుడు చేరుకోవాల్సిన మార్గాన్ని దర్శకుడు మారిసెల్వరాజ్ చక్కగా చూపించారన్నారు. అద్భుతమైన నటనతో మారిసెల్వరాజ్ కథకి ప్రాణం పోసిన నటుడు ధ్రువ్విక్రమ్, పశుపతి, అనుపమ పరమేశ్వరన్, రెజీషా విజయన్.. ఇతర నటినటులు, తెర వెనుక శ్రమించిన సాంకేతిక వర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. సీఎం రివ్యూతో పొంగిపోయిన మారి సెల్వరాజ్ ఎక్స్ మీడియా ద్వారా స్టాలిన్కు కృతజ్ఞతలు తెలిపారు. #BisonKaalamaadan: மாரி செல்வராஜின் திரைமகுடத்தில் மற்றுமொரு வைரக்கல்!தன் திறமையை மட்டுமே நம்பி, கிராமத்தில் இருந்து சாதிக்கக் கிளம்பிய ஓர் இளைஞன், கபடிக் கோட்டுக்கு உள்ளேயும் வெளியேயும் சந்திக்கும் போராட்டங்களை எதிர்கொண்டு வெற்றி பெற்ற கதையை மிகச் சிறப்பான திரை அனுபவமாக… pic.twitter.com/q345pPYkxl— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) October 25, 2025 చదవండి: హిట్ మూవీలో వేశ్యగా నటించిన బ్యూటీ.. 'ప్రభాస్' ఫౌజీలో ఛాన్స్ -
తమిళ బంగారాలకు సత్కారం
సాక్షి, చైన్నె : ఆసియా యూత్ గేమ్స్లో తమిళనాడుకు చెందిన కబడ్డీ క్రీడాకారులు అభినేష్ మోహన్ దాస్, కార్తీక రమేష్లు బంగారు పతకాలను సాధించారు. చైన్నెకు చేరుకున్న వీరికి విమానాశ్రయంలో ఆదివారం బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానం లభించింది. వీరంతా నేరు గా సీఎం స్టాలిన్ను క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈసందర్భంగా క్రీడల మంత్రి, డిప్యూటీసీఎం ఉదయ నిధి స్టాలిన్ క్రీడల శాఖ కార్యదర్శిఅతుల్య మిశ్ర, స్పోర్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జే మేఘనాథరెడ్డిలు సీఎం స్టాలిన్ చేతుల మీదుగా ఈ బంగార పతకాల విజేతలకు రూ. 25 లక్షలు చొప్పున చెక్కును అందజేశారు. ఎన్ఐఏ అదుపులో ముగ్గురు నిందితులు – చైన్నెలో ముమ్మర విచారణ కొరుక్కుపేట: బీజేపీ నాయకుడి హత్యకేసులో అరెస్టు అయిన ముగ్గురిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు. వివరాలు.. పుదుచ్చేరిలోని వి. మంగళం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్చార్జ్గా ఉన్న సెంథిల్కుమారన్ను మార్చి 26, 2023న విల్లియనూర్ కనుపైట్టె ప్రాంతంలో కొందరు హత్య చేశారు. ఆయన విల్లియనూర్ నివాసి. తన ఇంటికి సమీపంలోని బేకరీ వద్ద నిలబడి ఉండగా, ఆరుగురు వ్యక్తుల ముఠా అకస్మాత్తుగా సెంథిల్కుమారన్పై బాంబు విసిరారు. ఆయన అపస్మారక స్థితిలో నేలపై పడిపోయిన తర్వాత కొడవలితో నరికి చంపారు. ఇది తీవ్ర కలకలం రేపింది. రాష్ట్ర పోలీసులు ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తరువాత కేసును ఎన్ఐఏకి బదిలీ చేశారు. ఈ కేసులో నిందితులు పుదుచ్చేరి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రధాన నిందితుడు శివమలైతో సహా అదుపులోకి తీసుకున్న ముగ్గురి నేపథ్యంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్ఐఏ అధికారులు ప్రణాళిక వేశారు. దీని తర్వాత, జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ముగ్గురిని వారం పాటూ కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా వారిని చైన్నెలోని పురసైవాక్కంలోని జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి తీసుకువచ్చి తీవ్రంగా విచారణ చేస్తున్నారు. కుటుంబ కలహాలతో.. – తండ్రిని హత్య చేసి శవాన్ని కావేరి నదిలో పడేసిన కుమారుడు తిరువొత్తియూరు: తమిళనాడులోని సేలం జిల్లా మేట్టూరు కావేరిపురం గ్రామం కోటయూర్ పడవ రేవులో ఓ వృద్ధుడి మృతదేహం కావేరి నదిలో తేలియాడుతూ కనిపించింది. రేవులో స్నానం చేస్తున్న స్థానికులు ఈ విషయాన్ని గురించి కొలత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కావేరి నది నుంచి వృద్ధుడి శవాన్ని వెలికితీసి విచారణ జరిపారు. విచారణలో మృతుడు కర్ణాటక రాష్ట్రం మాదేశ్వరన్ మలై పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగప్పాడి ప్రాంతానికి చెందిన వయ్యాపురి ( 60) అని తెలిసింది. వయ్యాపురికి, అతని కుమారుడు శంకరన్ (35)కి తరచుగా గొడవలు జరుగుతుండేవని, దీంతో శంకరన్ తన తండ్రి వయ్యాపురిని కొట్టి చంపి, ఎవరికీ తెలియకుండా శవాన్ని కావేరి నదిలో పడేసినట్లు తెలిసింది. దీంతో కొలత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న శంకరన్ను అరెస్టు చేశారు. అలాగే వయ్యాపురి శవాన్ని కర్ణాటక పోలీసులకు అప్పగించారు. వాకథాన్ సాక్షి, చైన్నె : వన్ వాక్ వన్ హోప్ నినాదంతో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన వాక్ థాన్ 2025 కార్యక్రమం ఆదివారం ఐలాండ్ గ్రౌండ్లో ఆదివారం జరిగింది. రోటరీ డిస్ట్రిక్ట్ సహకారంతో క్యాన్సర్ సపోర్ట్ థెరపీ టూ ఓవర్ కమ్ పెయిన్ నినాదాన్ని హోరెత్తించే విధంగా జరిగిన ఈవాక్ థాన్లో ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, సినీ నటి సంచిత శెట్టి, జిల్లా గవర్నర్ ఆర్జీఎన్ వినోద్ సరోగి, నిర్వాహకులు సురేష్ డి జైన్, ఎన్ఎస్ శరవణన్, జె. శ్రీధర్, విజయ భారతి రంగరాజన్ హాజరయ్యారు. ఈ వాక్థాన్కు తరలి వచ్చిన వారికి జెర్సీలను అందజేశారు. అవగాహన డ్రైవ్ సాక్షి, చైన్నె : ఎముకలలో సాంద్రత తగ్గడం, బలహీనత, ఊబకాయం వలన కలిగే వ్యాధులపై అవగాహన డ్రైవ్ ఆదివారం జరిగింది. దీనిని చైన్నెలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ జెండా ఊపి ప్రారంభించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోడంబాక్కం శాఖ అధ్యుడు ఎస్ఎస్కే సందీప్, కార్యదర్శిప్రియా కన్నన్, డాక్టర్మీనాక్షి సుందరం, ఇతర వైద్యుల బృందం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ఆరెంజ్ అలర్ట్!
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాల రాకతో రాష్ట్రంలో ఇప్పటికే ఆశాజనకంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్కాశి, తేని జిల్లాలలో గత పదిరోజులుగా వర్షాలు కొనసాగుతూ వస్తున్నాయి. డెల్టాలోని పలు జిల్లాలను వర్షం ఇప్పటికే ముంచెత్తింది. దక్షిణ తమిళనాడు, డెల్టా జిల్లాలోని రిజర్వాయర్లు, జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇక, ఉత్తర తమిళనాడులోని చైన్నె, శివారులతో పాటూ పలు జిల్లాలో వర్షం సాధారణం కంటే అధికంగా కురిసింది. ఈ సీజన్లో గత పది రోజులలో చైన్నెలో సాధారణం కంటే 57 శాతం అధికంగా వర్షం పడింది. ఈ పరిస్థితులలో బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇది తుపాన్గా మారింది. ఇప్పటికే ఈ తుపాన్కు మోంథా అని నామకరణం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లో తీరాన్ని దాటుతున్నప్పటికీ, దీని ప్రభావం చైన్నె, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, తిరువణ్ణామలై, వేలూరు, తిరువళ్లూరు జిల్లాలపై అధికంగా పడనుంది. దెబ్బతిన్న వరిధాన్యం పరిశీలన.. ఇక రెండవ రోజైన ఆదివారం కూడా కేంద్ర బృందం అధికారులు వరి కొనుగోలు కేంద్రాలలో పరిశీలన చేశారు. తడిసిన వరి పంటను పరిశీలించి, శాంపిల్స్ తీసుకెళ్లారు. తంజావూరు, తిరుచ్చి, తిరువారూర్లో పలు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను అధికారులకు తెలియజేశారు. తేమశాతాన్ని 22కు పెంచాలని విన్నవించారు. ఇదిలా ఉండగా వరి పంట రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వయంగా పొలంలోకి దిగిదెబ్బ తిన్న వరి పంటను చేతికి తీసుకుని పరిశీలించినట్టు వివరించారు. సీఎం స్టాలిన్ సైతం పొలాలలోకి వెళ్లి రైతులను పరామర్శించి, దెబ్బ తిన్న వరి పంటను పరిశీలించకుండా సినిమా వాళ్లకు షేక్ హ్యాండ్ , అభినందనలు అంటూ బిజీగా ఉన్నారని మండిపడ్డారు. కాగా సీఎం స్టాలిన్ స్పందిస్తూ సకాలంలో వరి కొనుగోళ్లు చేస్తున్నామని వివరిస్తూ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో ఇప్పటి వరకు తమిళనాడులో 42 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసి తమ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని వ్యాఖ్యలు చేశారు. పనుల్లో వేగం పెంచండి.. అడయార్ నది సముద్రంలో కలిసే ముఖ ద్వారం వద్ద పూడిక తీత పనుల వేగాన్ని పెంచాలని అధికారులను సీఎం స్టాలిన్ ఆదేశించారు. రెండురోజులలో ఈ పనులు ముగించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి, మంత్రి ఎం. సుబ్రమణియన్తో పాటూ అధికారులు రెండో రోజైన ఆదివారం ఉదయం ఇక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. నదిముఖ ద్వారంలో పూడిక తీత, విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల అవకాశాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుపాన్ ప్రభావంతో చైన్నె, దాని శివారు జిల్లాలలో కొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల మోస్తరుగా వర్షం పడే అవకాశాలు ఉన్నట్టు వాతా వరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో వర్షాలు ఉంటాయన్న ప్రకటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చైన్నెకు ఇతర జిల్లాల నుంచి అగ్నిమాపక సిబ్బందిని రప్పిస్తోంది. సర్వ సన్నద్ధం.. చైన్నెలో అతి భారీవర్షం కురిసిన పక్షంలో ఎదుర్కొనేందుకు కార్పొరేషన్ యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే విస్తృత చర్యలు చేపట్టారు. తిరునల్వేలి, తూత్తుకుడి, మదురై, తదితర జిల్లాల నుంచి చైన్నెకు సహాయక పనుల నిమిత్తం ముందస్తుగా అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించే పనిలో పడ్డారు. ఆదివారం 120 మందితో కూడిన బృందం చైన్నెకు చేరుకుంది. 17 రబ్బర్ పడవలను సైతం ఈ బృందం సిద్ధం చేసి పెట్టుకోవడం గమనార్హం. మొత్తం 900 మందిని రంగంలోకి దించేందుకు చర్యలు తీసుకున్నారు. శివారులలోని కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల అధికారులు సైతం అప్రమత్తంగా వ్యవహరించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఇక్కడి వాగులు వంకలు,నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అయితే సోమ, మంగళవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించేశారు. పాఠశాలలను శిబిరాలుగా మార్చేశారు. యానంలో మరింతగా ముందు జాగ్రత్తలు విస్తృతం చేశారు. ఇక, పశ్చిమ కనుమలలో వర్షాలతో వైగై నది నిర్ణీత 71 అడుగులకు చేరడంతో ఉబరి నీటిని విడుదల చేశారు. చిన్న, పెద్ద గేట్లను ఎత్తి వేయడంతో తేని, మదురై, దిండుగల్, రామనాథపురం, శివగంగై జిల్లాలలోని వైగై నదీ తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే మేట్టూరు జలాశయం నుంచి ఉబరినీటి విడుదల శాతం పెంపుతో కావేరీ తీర గ్రామాల ప్రజలను అలెర్ట్ చేశారు. కాగా, కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోయిల్ వద్ద ఉరుములతో కూడినవర్షం పడింది. ఈ సమయంలో పిడుగు పడడంతో ఆ గ్రామానికి చెందిన నటరాజన్ కుమారుడు సుబ్రమణ్యం(51) మరణించాడు. -
మేధాశక్తిని పెంచేందుకే పోటీలు
వేలూరు: విద్యార్థుల మేధాశక్తిని పెంచేందుకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఓం సాయిరామ్ భగవాన్ శ్రీసత్యసాయిబాబా ట్రస్ట్, బాల వికాస్ జిల్లా ఆర్గనైజర్ సత్యనారాయణన్ తెలిపారు. వేలూరులోని వెంకటేశ్వర ప్రభుత్వ పాఠశాలలో బాల వికాస్ ఆధ్వర్యంలో పుట్టపర్తి సత్యసాయిబాబా 100 జయంతిని పురష్కరించుకొని వివిధ పోటీలు నిర్వహించారు. అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలకు వంద మందికి పైగా తల్లిదండ్రులు, 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. వేలూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కే.విమల్నాథన్, బాలవికాస్ మాజీ ఇన్చార్జ్ నటరాజన్, సత్యసాయి బాబా భక్తులు పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి ఏటీఎం యంత్రంలో వినూత్న చోరీ – నిందితుల కోసం గాలింపు తిరువొత్తియూరు: పాత చాకలిపేట జి.ఎ.రోడ్డులో బ్యాంకు ఉంది. ఈ బ్యాంకు నియంత్రణలో ఆ ప్రాంతంలో సుమారు 12 ఏటీఎం యంత్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో రాయపురం సూర్యనారాయణన్ రోడ్డులోని యంత్రంలో గత సంవత్సరం ఏప్రిల్ నెల రూ.100, రూ.200 నోట్లకు బదులుగా రూ.500 వచ్చేలా సాంకేతికతను మార్చి పలు ఏటీఎం కార్డులను ఉపయోగించి రూ 4 లక్షల 12 వేలు నగదు వినూత్న పద్ధతిలో తీసుకున్నట్లు తెలిసింది. ఈ దృశ్యాలు అక్కడి నిఘా కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై బ్యాంకు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వినూత్న దోపిడీకి సంబంధించి బ్యాంకు యాజమాన్యం తరపున జార్జిటౌన్ 16వ క్రిమినల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో రాయపురం పోలీసులు కేసు నమోదు చేసి ఏటీఎం యంత్రంలో వినూత్న పద్ధతిలో డబ్బు దోచుకున్న నిందితుల కోసం గాలిస్తున్నారు. నీటి బకెట్లో పడి చిన్నారి మృతి తిరువొత్తియూరు: నీటి బకెట్లో పడి ఓ చిన్నారి మృతి చెందింది. వివరాలు.. చైన్నె తేనాంపేట జోగి తోటకు చెందిన దంపతులు శ్రీరామ్, సంతాన లక్ష్మి. వీరికి ఏడాదిన్నర వయసున్న ధనుష్ అనే బి డ్డ ఉన్నాడు. పక్క ఇంట్లో నివసిస్తున్న బంధువు అ లమేలుకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను చూడడానికి సంతాన లక్ష్మి బిడ్డతో కలిసి వెళ్లింది. అప్పుడు బిడ్డ ధనుష్ అలమేలు ఇంట్లో బాత్రూంలో ఉన్న నీటి బకెట్లో ప్రమాదవశాత్తూ పడి పోయాడు. దీంతో సంతాన లక్ష్మి తన బిడ్డను రక్షించి తేనాంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చింది. అయితే చికిత్స పొందుతూ బిడ్డ మృతి చెందడంతో తేనాంపేట పోలీసులు విచారణ చేస్తున్నారు. కొరుక్కుపేట: మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతిస్వామి ఉద్భోదించారు. కందషష్ఠి పర్వదినాన్ని పురష్కరించుకుని శ్రీకంచి కామకోటి పీఠం తరఫున భారతదేశంతోపాటు వివిధ దేశాల్లో విద్యార్థులకు సహస్ర కుమార భోజనం శనివారం జరిగింది. ఇందులోభాగంగా చైన్నెలోని చేట్పేటలోని శంకరాలయంలో జరిగిన కుమార భోజనాన్ని కంచి కామకోటి పీఠాతి పతి శంకరవిజయేంద్ర సరస్వతిస్వామి ప్రారంభించి విద్యార్థులను ఆశీర్వదించారు. అనంతరం స్వామివారు మాట్లాడుతూ మన అవసరాలు, కోరికలకు అనుగుణంగా కాలం మారుతోందని, కొన్ని అవసరాలు సహజంగానే వస్తాయన్నారు. అదేవిధంగా, మనం తప్పించుకోవాల్సిన అనేక అవసరాలను వెతుక్కుంటూ ఉంటామని తెలిపారు. తరం నుంచి తరానికి అనుసరిస్తున్న అనేక పద్ధతులు ప్రస్తుతం మారుతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించి కాపాడుకోవాలన్నారు. మానవత్వం స్వేచ్ఛగా ఆలోచించి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. సేవా స్ఫూర్తితో నిజాయితీపరులుగా మారాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా 68 ప్రదేశాల్లో జరిగిన ఈ సహస్ర కుమారభోజన్లో 1,600 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. -
బైసన్కు సీఎం ప్రశంసలు
తమిళసినిమా: మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటుడు ధ్రువ్విక్రమ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బైసన్. నటి అనుపమపరమేశ్వరన్, రజీషా విజయన్, పశుపతి, దర్శకుడు అమీర్, లాల్, మదన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అప్లాస్ సంస్థతో కలిసి నీలం ప్రొడక్షన్న్స్ పతాకంపై దర్శకుడు రంజిత్ నిర్మించారు. నివాస్ కే ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈనెల 17న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. బైసన్ చిత్రాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల తిలకించారు. అనంతరం మారిసెల్వరాజ్, ఽధ్రువ్విక్రమ్లను పిలిపించి అభినందించారు. బైసన్ చిత్రం గురించి ఎక్స్లో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ మారిసెల్వరాజ్ సినీమకుటంతో ఇది మరో వజ్రం. ఆయన తన ప్రతిభను మాత్రమే నమ్ముకుని సాధించడానికి వచ్చిన ఒక యువకుడు కబడ్డీ కోర్టులోనా బయట ఎదురైన పోరాటాలను ఎదుర్కొని విజయం సాధించిన కథను చాలా గొప్ప స్క్రీన్ అనుభవంగా మార్చారు. క్రీడలు నేపథ్యంగా చేసుకుని ఒక యువకుడు చేరుకోవాల్సిన మార్గాన్ని రాజకీయ పరిజ్ఞానంతో దర్శకుడు మారిసెల్వరాజ్ చూపించారు. ఆయన సినిమా భాషను, కళను మరింత మెరుగు పరిచేవిధంగా బైసన్ చిత్రం ప్రతిబింబిస్తోంది. ఈచిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి మారిసెల్వరాజ్ కథనానికి ప్రాణం పోసిన నటుడు ధ్రువ్విక్రమ్, పశుపతి, అనుపమపరమేశ్వరన్, రెజీషా విజయన్ నటినటులకు తెర వెనుక శ్రమించిన సాంకేతిక వర్గానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు . ముఖ్యమంత్రి స్టాలిన్కు దర్శకుడు మారిసెల్వరాజ్ తన ఎక్స్ మీడియా ద్వారా తన కృతజ్ఞతలు తెలిపారు. -
ఆరుపడై వీడులలో.. స్కంధ షష్టి మహోత్సవం
తమిళ్ కడవుల్ మురుగన్కు తమిళనాట ఉన్న ఆరు పడై వీడుల్లో స్కంధ షష్టి మహోత్సవం అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో ముఖ్య ఘట్టం సూర సంహారం సోమవారం జరగనున్నది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు తిరుచెందూరువైపుగా భక్తజనం పోటెత్తుతున్నారు. చైన్నె నుంచి తిరుచెందూరు, తిరునల్వేలికి ప్రత్యేక రైళ్లను సైతం పట్టాలెక్కించారు. సాక్షి, చైన్నె : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన తిరుచెందూరులో సెంథిల్ ఆండవర్, జయంతి నాథర్గా, తిరుప్పర కుండ్రంలో ముత్తుకుమార స్వామిగా, పలముదిర్ చోళైలో మురుగన్గా, తిరుత్తణిలో బాల సుబ్రమణ్యన్గా, పళనిలో దండయుధ పాణిగా, స్వామి మలైలో స్వామినాథగా ఆరుపడై వీడులలో తమిళ్ కడవుల్ మురుగన్ కొలువై భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ ఆలయాలలోనే కాదు సుబ్రమణ్య స్వామి కొలువుదీరిన ప్రాంతాలలో స్కంధ షష్టి ఉత్సవాలు గతం కొద్ది రోజులుగా జరుగుతూ వస్తున్నాయి. చైన్నెలోని వడపళణి , శిరువాపురి, కంద కోట్టం, కుండ్రత్తూరు, నంగనల్లూరు మురుగన్ ఆలయాలు, సేలం అమ్మపేట కుమర గురు సుబ్రమణ్య స్వామి తదితర ఆలయాలలో సైతం స్కంధ సష్టి భక్తి మిన్నంటోంది. పెద్దఎత్తున భక్తులు తరలి వస్తుండడంతో ఆలయ పరిసరాలలో హరోహర నామస్మరణ మిన్నంటుతోంది. అన్ని ఆలయాలలో సోమవారం సూర సంహార ఘట్టాలు కనుల పండవుగా జరగనున్నాయి. నేడు సూర సంహారం తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ స్కంధ సష్టి ఉత్సవం కనుల పండువగా సాగుతుంది. యాగశాల పూజతో ఉత్సవాలకు ఈనెల 22వ తేదీన శ్రీకారం చుట్టారు. ఈ ఆలయంలో జరిగే సూర సంహార ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలలో భక్తులు తరలి రావడం జరుగుతుంది. సముద్ర తీరం ఒడ్డున ఈ మహోత్సవ ఘట్టం జరుగుతుంది. దీనిని తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుచెందూరువైగా ఆదివారం కదిలారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఓవైపు ప్రత్యేక బస్సులు రోడ్డెక్కించారు. ప్రత్యేక రైళ్లు చైన్నె నుంచి కదిలాయి. సోమవారం వేకువజామున 1.30 గంటలకు విశ్వరూప దర్శనం, 2 గంటలకు ఉదయ మార్తాండ పూజ జరగనుంది. 6 గంటలకు స్వామి వారు యాగశాలకు చేరుకుంటారు. ఇక్కడ జరిగే పూజలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు జయంతి నాథర్ షణ్ముగ విలాస మండపం విచ్చేయనున్నారు. 2 గంటలకు తిరువాడుదురై షష్టి మండపంలో అభిషేకం, అలంకరతో నాలుగున్నర గంటలకు సముద్ర తీరం వైపుగా సూరుడ్ని సంహరించేందుకు బయలుదేరుతారు. అద్వితీయంగా జరిగే ఈ ఘట్టాన్ని ముగించుకుని సంతోష మండపంకు చేరుకునే స్వామి వారికి అభిషేకాది పూజలు నిర్వహిస్తారు.మరుసటి రోజు మంగళవారం అమ్మ వారి తపస్సు ఘట్టం, స్వామి అమ్మవారి కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగనుంది. లక్షల్లో తరలిరానున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సముద్ర తీరంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సముద్రంలోకి జనం చొచ్చుకెళ్లకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. ఆలయం పరిసరాలలో అనేక చోట్ల భద్రతా గోపురాలు ఏర్పాటు చేశారు. 250కు పైగా ప్రాంతాలలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు. డ్రోన్ కెమెరాలను రంగంలోకి దించారు. ఆలయం పరిసరాలలలో 3 వేల మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు. సూర సంహారం వేడుకనుమరింత సులభంగా భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్ఈడీ స్కీన్లను అక్కడక్కడ ఏర్పాటు చేశారు. భక్తులకు వైద్య సేవల నిమిత్తం 20 మంది డాక్టర్లు, 50 మంది నర్సులతో పాటుగా 15 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. తిరుచెండూరు బస్టాండ్ నుంచి ఆలయం వద్దకు ఉచితంగా బస్సులను నడిపేందుకు చర్యలుతీసుకున్నారు. సముద్రంలో పడవల ద్వారా సుమారు వంద మందికి పైగా గజ ఈత గాళ్ల సహకారంతో గస్తీకి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చేసిన ఏర్పాట్లను ఎంపీ కనిమొళి పరిశీలించారు. ఒట్ట పిడారం ఎమ్మెల్యే షణ్ముగయ్య, తూత్తుకుడి కలెక్టర్ ఇలం భగవత్, ఎస్పీ ఆల్బర్ట్ జాన్ , తిరుచెందూరు మున్సిపల్చైర్మన్ శివనాండి, ఆలయ ట్రస్తీ అరుల్ మురుగన్ ఏర్పాట్లను కనిమొళికి వివరించారు. -
యథార్థ ఘటన చిత్రంగా ఐయామ్
ఐయామ్లో బాలాజి, రైనాకరట్ తమిళసినిమా: యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించే కథా చిత్రాల్లో ఒక సోల్ ఉంటుంది. దాన్ని రక్తి కట్టించేలా తీస్తే ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాంటి కథాంశంతో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఐయామ్ అని ఆ చిత్ర దర్శకుడు ఎన్.వసంత్ పేర్కొన్నారు. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని సెంథిల్ ఆండవర్ మూవీస్ పతాకంపై ఈశ్వరన్ విజయన్ నిర్మిస్తున్నారు. నటుడు బోస్ వెంకట్, గానా ఉలగనాథన్ ఆడుగళం మురుగదాస్ ప్రధాన పాత్రలు పోషించారు. నటి దీపాశంకర్, కేపీవై.వినోద్, మిబ్బు రంజన్, విజయ్ గణేష్, క్రేన్ మనోహర్, యాజర్, సుబ్రమణి, డీఎన్ఏ.విజయలక్ష్మి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బాలాజీ, రైనా కరట్ హీరోయిన్లుగా నటించారు. చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొంటూ శ్రీలంక నుంచి జీవనాధారం కోసం మన దేశానికి వచ్చిన ఒక కుటుంబానికి ఎదురైన అవినీతి, అక్రమాలు, వాటిని వారు ఎదుర్కొన్నారు వంటి కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఐయామ్ అని చెప్పారు. చిత్ర షూటింగ్ను బెంగళూరు, హొసూరు, తూత్తుక్కుడి, రామేశ్వరం, చైన్నె ప్రాంతాల్లో 40 రోజుల్లో పూర్తిచేసినట్లు చెప్పారు. -
క్యూబిక్లో మరో రికార్డు నెలకొల్పిన చైన్నె బాలుడు
కొరుక్కుపేట: చైన్నెకు చెందిన ఓ 15 ఏళ్ల బాలుడు క్యూబిక్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు .కేవలం 15 ఏళ్ల వయస్సులోనే తన అసాధారణ ప్రతిభతో 15 జాతీయ ,అంతర్జాతీయ రికార్డులను సాధించిన అందరి మన్ననలు పొందుతున్నాడు. గవర్నర్ ఆర్ ఎన్ రవి,రాష్ట్ర పాఠశాల విద్యాశాఖామంత్రి అన్బిల్ మహేష్ల నుంచి ప్రసంశలు అందుకున్నాడు. చైన్నెలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పి.సిద్ధార్థ్ క్యూబిక్లో మరో రికార్డు సృష్టించాడు. తమిళనాడు క్యూబ్ అసోసియన్, ఆలిండియా స్పోర్ట్స్ అండ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ క్లబ్ (ఏఐఎస్ఆర్ఎసీ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధార్థ్ ఓ వైపు తిరుక్కురల్ ను పఠిస్తూ, ఎడమ చేతితో రూబిక్స్ క్యూబ్లను చేస్తూ, కుడి చేతితో ‘సీతాకోకచిలుకలా దువ్వెన తిప్పుతూ నిమిషం14 సెకన్లలో క్యూబ్లను సాల్వ్ చేసి అరుదైన రికార్డును సాధించారు. ఈ సాధన ఇంజీనియస్ చార్మ్ వరల్డ్ రికార్ుడ్స, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్తోపాటు ఇంటర్నేషనల్ అచీవర్స్ రికార్డ్స్ నమోదయ్యాయి . ఈ సందర్భంగా ఏఐఎస్ఆర్ఏసి ప్రెసిడెంట్ ఆనంద్ రాజేంద్రన్ చేతుల మీదుగా క్యూబ్ గ్రాండ్మాస్టర్ పి. సిద్ధార్థ్కు సర్టిఫికెట్ అందించి ఘనంగా సత్కరించారు. -
కనులపండువగా మహాకుంభాభిషేకం
వేలూరు: వేలూరు కార్పొరేషన్ పరిధిలోని కస్పా ప్రాంతంలో శ్రీ స్వర్ణపురేశ్వరాలయంలో మహాకుంభాభిషేకం ఆదివారం కనులపండువగా జరిగింది. వేద పండితుల మంత్రాల నడుమ రెండవ కాల యాగశాల పూజలు, వేద గీత సమర్పణం, మహాకుంభాభిషేకం అతి వైభవంగా జరిగింది. ముందుగా కలశాలను యాగ గుండంలో ఉంచి ప్రత్యేక పూజలు చేసి కలస నీటిని ఆలయ రాజగోపురంపైకి తీసుకెళ్లారు. వేద మంత్రాల నడుమ ఆలయ గోపురంపై చల్లారు. అనంతరం కలశ నీటిని భక్తులపై చల్లడంతో కుంభాభిషేకం పూర్తి చేశారు. అనంతరం ఆలయంలోని స్వామి వారికి దీపారాధన పూజలు చేసి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. అనంతరం భక్తులకు కలశాలను ప్రసాదంగా అందజేయడంతో పాటు మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. -
చైన్నెకు కరూర్ బాధితులు
సాక్షి, చైన్నె: కరూర్ బాధిత కుటుంబాలు ఐదు ప్రత్యేక లగ్జరీ బస్సులలో చైన్నెకు ఆదివారం సాయంత్రం బయలుదేరారు. వీరికి మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో బస ఏర్పాటు చేశారు. వీరందర్నీ విజయ్ సోమవారం పరామర్శించనున్నారు. వివరాలు.. కరూర్లో టీవీకే నేత విజయ్ గత నెల 27వ తేదిన నిర్వహించిన ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెను విషాదం గురించి తెలిసిందే. ఇందులో 41 మంది మరణించగా 160 మంది గాయపడ్డారు. ఈ కుటుంబాలకు విజయ్ పరామర్శించేందుకు నిర్ణయించారు. మరణించిన వారి కుటుంబాలకు పార్టీ తరపున రూ. 20 లక్షలు అందించేందుకు సిద్ధమయ్యారు. అయితే కరూర్లో విజయ్ పరామర్శ పర్యటనకు అనేక అడ్డంకులు తప్పలేదు. ఈ కుటుంబాలకు నష్ట పరిహారం అందించడమే కాదు, కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా విజయ్ ప్రయత్నాలు చేపట్టారు. కరూర్కు వెళ్ల లేని పరిస్థితి నెలకొనడంతో చివరకు చైన్నెకు బాధిత కుటుంబాలను రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. మహాబలిపురంలో.. ఇందు కోసం మహాబలిపురంలో భారీ వేదికగా రిసార్ట్లో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ బాధిత కుటుంబాలకు అన్ని రకాల బస ఏర్పాట్లు చేశారు. వీరందర్నీ విజయ్ పరామర్శించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆయా కుటుంబాలతో విజయ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వారి పరిస్థితులను తెలుసుకుని, ఆయా కుటుంబాలను దత్తత తీసుకోనున్నారు. బాధిత కుటుంబాలను కరూర్ నుంచి చైన్నెకు ప్రత్యేక లగ్జరీ బస్సులలో ఆదివారం సాయంత్రం తరలించారు. వీరంతా సోమవారం ఉదయాన్నే చైన్నెలో ఉంటారు. మహాబలిపురం రిసార్ట్లో విశ్రాంతి తదుపరి విజయ్ మధ్యాహ్నం లేదా సాయంత్రం పరామర్శించనున్నాని తెలిపారు మృతులు 41 మంది ఉండగా, వీరిలో 33 కుటుంబాలు మాత్రమే చైన్నెకు బయలుదేరాయి. మిగిలిన 8 కుటుంబాలు దూరంగా ఉన్నాయి. గాయపడ్డ వారిలో యాభై మంది చైన్నెకి వస్తుండగా మిగిలిన వారు దూరంగా ఉన్నారు. కాగా విజయ్ తమను కరూర్కు వచ్చి పరామర్శించాలని వీరంతా ఆశిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరందర్నీ పది బస్సులలో చైన్నెకి తీసుకొస్తున్నారు. ఈ బస్సులకు ప్రత్యేక భద్రతగా విజయ్ ప్రైవేటు సైన్యం వెన్నంటి కదలడం గమనార్హం. కాగా గత నెల 27వ తేదీన కరూర్లో ఘటన జరగగా, మూడు రోజుల అనంతరం వీడియో రూపంలో విజయ్ అందరి ముందుకు వచ్చారు. ఆ తర్వాత నాలుగు వారాల తర్వాత ఆయన బయటకు రానున్నారని సమాచారం. -
రూ. 27 కోట్ల వ్యయంతో..
తిరువళ్లూరు: పళవేర్కాడు ముఖద్వారం వద్ద సుమారు రూ. 27 కోట్లు వ్యయంతో చేస్తున్న పనులను రాష్ట్ర మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్, మానిటరింగ్ అధికారి కార్తికేయన్ తదితరులు బోటులో వెళ్లి పపనులను పరిశీలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులోని ముఖ ద్వారం వద్ద పేరుకపోయిన ఇసుక దిబ్బల కారణంగా నీరు సముద్రంలోకి ప్రవేశించడం కష్టంగా మారింది. దీంతో పళవేర్కాడు తదితర ప్రాంతాలకు ముంపు ఏర్పడుతోంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం శాశ్వ త నివారణ పనుల కోసం రూ.27 కోట్లు రూపాయల ను కేటాయించి గత ఆరు నెలల క్రితం పనులను ప్రారంబించారు. ముఖద్వారం వద్ద పేరుకపోయిన ఇసుక దిబ్బలను తొలగించడంతో పాటూ నీరు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవహించడానికి కొన్ని నిర్మాణాలను చేపట్టింది. ఈ పనులను రాష్ట్ర మైనారీటి సంక్షేమశాఖ మంత్రి నాజర్, తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్, సీనియర్ ఐఏఎస్ ఽఅధికారి జిల్లా మానిటరింగ్ ఽఅధి కారి కార్తికేయన్ సుమారు 10 కి.మీ బోటులో ప్రయాణించి శనివారం రాత్రి పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. -
గబ్బిలం ఓ అపూర్వ సృష్టి
కొరుక్కుపేట: నవయుగ కవి చక్రవర్తి జాషువా రచనల్లో శ్రీగబ్బిలంశ్రీ ఒక అపూర్వ సృష్టి అని నెల్లూరుకి చెందిన ఆధ్యాత్మిక సాహిత్య ఉపన్యాసకులు బొగ్గరపు రాధాకృష్ణమూర్తి కొనియాడారు. వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతీనెలా నిర్వహించేతరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక 166వ ప్రసంగంగా విశ్వనరుడు – గుర్రం జాషువా అనే అంశంపై జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి చైన్నె టి.నగర్లోని ఆస్కా ప్రాంగణంలోని కృష్ణా హాల్ వేదికై ంది. కార్యక్రమానికి వక్తగా ఆధ్యాత్మిక సాహిత్య ఉపన్యాసకులు బొగ్గరపు రాధాకష్ణమూర్తి పాల్గొని ప్రసంగించారు. వక్తను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. పెద్దసంఖ్యలో సాహితీప్రియులు పాల్గొన్నారు. -
భక్తులతో తిరుత్తణి కిటకిట
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో స్కంధషష్టి కారణంగా భక్తుల రద్దీ నెలకొంది. మూడు గంటల పాటు క్యూలో భక్తులు వేచివుండి స్వామి దర్శనం చేసుకున్నారు. స్కంధషష్టి వేడుకల్లో ఐదవ రోజైన ఆదివారం మూలవర్లకు వేకువజామున విశిష్ట అభిషేక పూజలు చేసి వెండి ఆభరణాలతో అలంకరించారు. ఉదయం 9 గంటలకు శ్రీవళ్లి, దేవసేన సమేత షణ్ముఖర్కు సుగంధ పుష్పాలతో అలంకరించి లక్షార్చన చేశారు. స్కంధషష్టి వేడుకలతో పాటు ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొండ ఆలయానికి పోటెత్తారు. ఘాట్రోడ్డులో వాహనలు క్యూకట్టడంతో వాహన రద్దీ నెలకొంది. సర్వదర్శనానికి మూడు గంటలు, రూ.100 ప్రత్యేక దర్శన మార్గంలో రెండు గంటల పాటు భక్తులు వేచివుండి స్వామిని దర్శించుకున్నారు. నేడు పుష్పాంజలి తిరుత్తణి ఆలయంలో స్కంధషష్టి వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం స్వామికి పుష్పాంజలి నిర్వహిస్తారు. వివిధ రకాల పుష్పాలు సుమారు ఐదు టన్నులు ఊరేగింపుగా కొండకు తీసుకొచ్చి షణ్ముఖర్కు పుష్పాభిషేకం నిర్వహిస్తారు. స్కంధషష్టిలో ప్రధానమైన సూరసంహారం నిర్వహించడం పరిపాటి, అయితే సుబ్రహ్మణ్యస్వామి యుద్ధం పూర్తిచేసుకుని కోపం చల్లారి, శాంతిమయంగా శ్రీవళ్లి, దేవసేనతో తిరుత్తణి కొండపై కొలువుదీరడంతో ఆలయంలో పుష్పాభిషేకం నిర్వహించడం పరిపాటి. తిరుత్తణి కొండ ఆలయంలో భక్తుల రద్దీ షణ్ముఖర్కు లక్షార్చన -
వైద్య చికిత్సకు ఆర్థికసాయం
తిరుత్తణి: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళకు వైద్య చికిత్స కోసం ఆర్థికసాయం అందజేశారు. ఆర్కే పేట యూనియన్ వెడియంగాడు గ్రామానికి చెందిన దీప అనారోగ్యంతో బాధపడుతోంది. పేద కుటుంబం కావడంతో వైద్య చికిత్స ఖర్చులకు ఆర్థికసాయం చేయాలని డీఎంకే యువజన విభాగ ట్రస్టుకు విన్నవించింది. స్పందించిన యువజన విభాగం కన్వీనర్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ రూ.25వేలు ట్రస్టు ద్వారా విడుదల చేశారు. ఈ మొత్తం చెక్కు రూ పంలో దీపకు జిల్లా మంత్రి నాజర్, తిరుత్తణి ఎమ్మె ల్యే చంద్రన్ పంపిణీ చేశారు. జిల్లా యువజన విభాగ కన్వీనర్ కిరణ్, ఉపకార్యదర్శి రాజా పాల్గొన్నారు. -
స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలి
వేలూరు: మహిళలు స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలని వేలూరు వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం అన్నారు. ఆయన జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని పేద మహిళలకు కుట్టు మిషన్లు, సంక్షేమ పథకాలు, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పేదలను ఆదుకోవడానికి పారిశ్రామిక వేత్తలు మందుకు రావాలన్నారు. వేలూరును ఆదర్శ జిల్లాగా చేసేందుకు ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. దీంతోనే తాను వేలూరు జిల్లాలోని అన్ని విభాగాలకు చెందిన కార్మికులు, నిరుపేద మహిళలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. జీవీఎస్ బృందం సభ్యులు గణేష్, వినోద్, పుణ్యకోటి, హేమావతి, న్యాయవాది పీడీకే మారన్, శ్రీనివాసన్, భూమినాదన్, సతీష్కుమార్, సుందర్ పాల్గొన్నారు. -
దొంగ ఓట్ల నిర్మూలనే లక్ష్యం
పళ్లిపట్టు: దొంగ ఓట్ల నిర్మూలనే లక్ష్యంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పొదటూరుపేటలో ఆదివారం సంతకాల ఉద్యమం నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సంతకాల ఉద్యమంలో ఆ పార్టీ నేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సుందరవేలు, న్యాయవాదుల విభాగం రాష్ట్ర కార్యదర్శి మురుగన్ పాల్గొని సంతకాల ఉద్యమం ప్రారంభించారు. కేంద్ర ఎన్నికల సంఘంను బీజేపీ తన కనుసన్నలో వుంచుకుని దొంగ ఓటర్లు చేర్పించి పాక్షికంగా విజయానికి కుట్రపన్ని ఎన్నికల కమిషన్ అండదండలతో విజయం సాధిస్తున్నట్లు, ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఓటు ద్వారా మాత్రమే గెలుపోటములు నిర్ణయించాలని, దొంగఓట్లు చేర్పించడం ఎదుర్కొనేందుకు ప్రతిఒక్కరూ ముందుకురావాలని కోరుతూ సంతకాల ఉద్యమం నిర్వహించారు. ఇందులో అనేక మంది పాల్గొని తమ మద్దతు తెలిపారు. -
డీబీసీ కేంద్రాల్లో కేంద్ర బృందం
తిరువళ్లూరు: వరి పంటలో తేమ శాతం 17 కంటే ఎక్కువగా వున్నా కొనుగోలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈక్రమంలో వరి కొనుగోలు, తేమ శాతాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తిరువళ్లూరులో ఆదివారం ఉదయం పర్య టించింది. తిరువళ్లూరు, ఊత్తుకోట, గుమ్మిడిపూండి, పొన్నేరి ప్రాంతాల్లో కమిటీ పర్యటించి వరి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ వుంచిన వరిని పరిశీలించి రైతుల నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈనేపథ్యంలో తేమ శాతాన్ని పెంచి రైతుల నుంచి వరిని కొనుగోలు చేయాలని పలు రైతు సంఘాల నేతలు ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇందులో భాగంగానే రైతుల విజ్ఞప్తి మేరకు 17 శాతం కంటే తేమ ఎక్కువగా వున్నా వరిని కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాల ని ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వరికొనుగోలు కేంద్రాల వద్ద వున్న పరిస్థితి, వరి ధాన్యాల నిల్వలు, తేమ శాతాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం మూడు ప్రత్యేక బృందాలను నియమించింది. ఈ బృందం కేంద్ర ప్రభుత్వ సివిల్ సప్లై డిప్యూటీ డైరెక్టర్ ప్రీతి ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులు అనుపమ, అరుణ్ప్రసాద్, ఉమామహేశ్వరి, కలెక్టర్ ప్రతాప్ తిరువళ్లూరు జిల్లాలో పర్యటించారు. రైతుల నుంచి వినతి పత్రాలను స్వీకరించడంతో పాటు డీబీసీ కేంద్రాల్లో వున్న వరి నిల్వను పరిశీలించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ వరిలో తేమ శాతం 17 కంటే ఎక్కువగా వున్నా రైతులకు నష్టం జరగకుండా వరిని కొనుగోలు చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి తమ కమిటీ నివేదికను ఇస్తుందన్నారు. -
కరూర్ ఘటన తర్వాత ప్రజల్లోకి విజయ్.. వేదిక ఫిక్స్
తమిళనాడులోని కరూర్ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నిర్ణయించారు. సుమారు 30 రోజుల తర్వాత విజయ్ బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ 27న చెన్నై కరూర్లో టీవీకే నేత విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెను విషాదం గురించి తెలిసిందే. మరణించిన 41 మంది బాధిత కుటుంబాలు, గాయపడ్డ 160 మందిని పరామర్శించేందుకు విజయ్ నిర్ణయించారు. బాధిత ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ. 20 లక్షలు విజయ్ ప్రకటించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి పరామర్శించడమే కాకుండా, నష్ట పరిహారంతో పాటు వారిని దత్తత తీసుకునే విధంగా విజయ్ కసరత్తులలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. కరూర్లో విజయ్ పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, భద్రత చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీవీకే వర్గాలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే, టీవీకే వర్గాలు ఎంపిక చేసిన వేదిక చిన్నదిగా ఉండడంతో ఏదేని కళాశాల మైదానాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచించారు. అలాగే ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర వివరాలను సమర్పించాలని సూచించారు. దీంతో పరామర్శలను వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరకు కరూర్లో అతి పెద్ద మైదానం, ఆడిటోరియంలేని దృష్ట్యా, బాధితులను చెన్నైకు తీసుకొచ్చి పరామర్శ ఏర్పాట్లు చేయడానికి టీవీకే వర్గాలు చర్యలు చేపట్టారు. ఇందుకోసం మహబలిపురం వద్ద అతి పెద్ద వేదికను ఎంపిక చేశారు. ఇక్కడకు బాధితులను తీసుకొచ్చి , వారికి అన్ని రకాల బస తదితర ఏర్పాట్లు చేయడానికి ఏర్పాట్లు చేపట్టారు. ఈమేరకు (27వ తేదీ)సోమవారం బాధితులను విజయ్ పరామర్శించి, నష్ట పరిహారం అందించనున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. -
క్లుప్తంగా
తమిళసినిమా: అందాల తార నటి రష్మిక మందన్నాకు ఏమైంది? అంటూ ఆమె అభిమానులును ఇప్పుడు కలవరపడుతున్నారు. అభిమానులు నేషనల్ క్రష్గా పిలుచుకుంటున్న పాన్ ఇండియా కథానాయకి ఈమె. మాతృభాష కన్నడంలో నటిగా కెరీర్ను ప్రారంభించి, ఆ తరువాత తెలుగు, తమిళం దాటి బాలీవుడ్లో దుమ్ము రేపుతున్నారు. ఈమె నటించిన తాజా హిందీ చిత్రం థామా చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మరిన్ని చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్నా ఇప్పుడు తరచూ ముఖానికి మాస్క్ వేసుకుని కనిపిస్తున్నారు. అలా శనివారం చైన్నె విమానాశ్రయంలో మాస్క్ ధరించి మెరిశారు. ముఖానికి మాస్క్ తొలగించమని ఫొటోగ్రాఫర్లు కోరగా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని, అందువల్ల కుదరదని ఆమె పేర్కొన్నారు. దీంతో రష్మిక మందన్నాకు ఏమైందని ఆరా తీయగా ఆమె తన అందాన్ని మరింత మెరుగు పరచుకునే విధంగా ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీంతో మరి కొద్ది రోజులు రష్మిక మందన్నా మాస్క్తోనే కనిపిస్తాయని ఆమె అనుచరులు తెలిపారు. కాగా రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం(తమిళం, తెలుగు) గర్ల్ ఫ్రెండ్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. తిరువొత్తియూరు: చైన్నె, అంబత్తూరులో వీధి కుక్కల దాడిలో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. వివరాలు.. ఓరగడం అంబత్తూరు గోవిందరాజ్ వీధికి చెందిన శరవణన్ కుమార్తె తణ్మతి, పక్క ఇంట్లో ఉండే భువనేశ్వరి కుమారుడు కవిష్ ఆడుకుంటుండగా.. వీధి కుక్క కరిచి గాయపరిచింది. కుక్క కరిచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. కాగా చిన్నారులకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. తప్పిన ప్రమాదం కొరుక్కుపేట: చైన్నె విమానాశ్రయం నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్కు వెళ్లే ఎయిర్ ఆసియా ప్యాసింజర్ విమానం అర్ధరాత్రి 11.50 గంటలకు చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఆ విమానంలో మొత్తం 190 మంది ఉన్నారు. వారిలో 182 మంది ప్రయాణికులు, 8 మంది విమాన సిబ్బంది ఉన్నారు. విమానం రన్వేపైకి టేకాఫ్ అయ్యింది. తర్వాత ఓ పక్షి విమానం ముందు భాగాన్ని ఢీకొట్టి ఇంజిన్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించింది. దీని తర్వాత పైలట్ వెంటనే చైన్నె విమానాశ్రయ నియంత్రణ గదికి సమాచారం అందించారు. విమానం ఎగరడానికి అనుమతించకుండా, చైన్నె విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో ఇంజినీర్లు విమానాన్ని పరిశీలించారు. పక్షి ఢీకొనడం వల్ల ఇంజిన్లు దెబ్బతిన్నట్లు గుర్తించి మరమ్మతు చేశారు. అయితే విమానం పనిచేయదని తేల్చడంతో ప్రయాణికులను లగ్జరీ బస్సుల్లో ఎక్కించి హోటళ్లకు తరలించారు. తిరువొత్తియూరు: పూందమల్లి ఉప్పు కొల్లై వీధిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న మురుగన్ (38) ఆటో డ్రైవర్. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను అదే ప్రాంతానికి చెందిన శశికళ అనే మహిళ వద్ద రూ.6.40 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా మురుగన్ వడ్డీ డబ్బులు చెల్లించడం లేదని తెలుస్తోంది. దీంతో శశికళ రుణం తిరిగి అడిగింది. మురుగన్ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో మురుగన్, అతని భార్య, తమ్ముడు కార్తీ (30) తనను అసభ్యంగా మాట్లాడారని శశికళ పూందమల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇద్దరినీ పూందమల్లి పోలీసులు శుక్రవారం విచారణకు పిలిచారు. దీంతో శుక్రవారం ఉదయం ఇద్దరూ పూందమల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఇద్దరినీ విచారించి, 10 రోజుల్లో తీసుకున్న డబ్బులో సగం తిరిగి చెల్లించాలని మురుగన్ వద్ద రాయించుకుని రాత్రి 8 గంటల సమయంలో ఇద్దరినీ పంపినట్లు సమాచారం. తరువాత మురుగన్ అకస్మాత్తుగా ఆటోలో సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే మురుగన్ను పూందమల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మురుగన్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయంపై పూందమల్లి పోలీసులకు సమాచారం అందించారు. మురుగన్ మృతి చెందినట్లు తెలుసుకున్న అతని బంధువులు పూందమల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన పోలీసులతో మురుగన్ మృతికి పోలీసులే కారణమని ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు స్వాధీనం చేసుకోవడానికి వెళ్లినప్పుడు, మృతదేహాన్ని ఇవ్వడానికి నిరాకరించడంతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. -
తిరుపతి–చైన్నె హైవే నిర్మాణంలో నాణ్యతా లోపం
తిరువళ్లూరు: తిరుపతి–చైన్నె జాతీయ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపం కారణంగా ప్రారంభానికి ముందే దాదాపు రెండు కిలోమీటర్ల దూరం పగుళ్లు ఏర్పడ్డాయి. వివరాలు.. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే చైన్నె పాడి నుంచి తిరుపతి వరకు జాతీయ రహదారి నిర్మాణం చేయాలని పదేళ్లకిందట నిర్ణయించారు. అయితే పాడి నుంచి తిరునిండ్రవూర్ వరకు భూసేకరణ కష్టంగా మారడంతో పాటూ రోడ్డు విస్తరణ కోసం ఇరువైపులా వున్న దుకాణాలను తొలగిస్తే సుమారు 40 లక్షల మందికి ఉపాధి కోల్పోయే ప్రమాదం వుందని బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు సైతం పూర్తిగా విచారణ చేసి పాడి నుంచి తిరునిండ్రవూర్ వరకు రోడ్డు నిర్మాణం, విస్తరణ కోసం దుకాణాలను తొలగించవద్దని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు తిరునిండ్రవూర్ నుంచి తిరుపతి వరకు జాతీయ రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పనులు పూర్తయింది. దీంతో పనులు పూర్తయిన ప్రాంతాల్లో అనధికారిక రాకపోకలు సాగుతున్నాయి. ఈక్రమంలో సెవ్వాపేట నుంచి శిరుకడల్ తన్నీర్కుళం వరకు రోడ్డుకు ఒకవైపు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు అంచులు సైతం కోతకు గరయ్యాయి. దీంతో రోడ్డు నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇప్పటికై నా స్పందించి కోత, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాల్లో నాణ్యతపై తనిఖీలు చేయాలని కోరుతున్నారు. -
తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలో సిద్ధ వైద్య కేంద్రానికి భూమిపూజ
తిరుత్తణి: తిరుత్తణి ప్రభుత్వాసుపత్రి భవనంలో సిద్ధ వైద్య కేంద్రానికి అదనపు భవన నిర్మాణానికి వీలుగా ఆయుష్ సంక్షేమ నిధి నుంచి రూ.37.50 లక్షల వ్యయంతో భవన నిర్మాణపు పనులకు శనివారం భూమిపూజ నిర్వహించారు. ఇందులో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని అదనపు భవనం నిర్మాణంకు వీలుగా భూమి పూజతో కట్టడం నిర్మాణపు పనులను ప్రారంభించారు. ఇందులో ప్రజా పనుల శాఖ సహాయ ఇంజినీరు మురళి, డీఎంకే పట్టణ కార్యదర్శి వినోత్కుమార్, పట్టణ నాయకులు గణేశన్, శ్యామ్సుందర్, అశోక్కుమార్ సహా ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
తిరువాభవరణం అలంకరణలో సుబ్రహ్మణ్యస్వామి
తిరుత్తణి: స్కంధషష్టి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన శనివారం మూలవిరాట్కు తిరువాభరణం అలంకరణలో దర్శనమిచ్చారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో స్కంధషష్టి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో నాల్గవ రోజైన శనివారం వేకువజామున మూలవర్లకు అభిషేక ఆరాధన పూజలు నిర్వహించి తిరువాభరణ అలంకరణలో దీపారాధన నిర్వహించారు. ఉదయం 9 గంటలకు కావడి మండపంలో శ్రీవళ్లిదేవసేన సమేత ఉత్సవర్లు షణ్ముఖర్కు సుగంధ పుషపాలతో సర్వాంగసుందరంగా అలంకరించి బిల్వాకులతో లక్షార్చన చేశారు. ఇందులో భక్తులు రూ.250 చెల్లించి లక్షార్చనలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. స్కంధషష్టి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో షష్టి దీక్ష చేసి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేశారు. షణ్ముఖర్కు లక్షార్చన, లక్షార్చనలో భక్తులు -
మెల్లిసై ఫస్ట్లుక్కు వెట్రిమారన్ ప్రశంసలు
తమిళసినిమా: ఇంతకుముందు వెప్పం కుళీర్ మలై వంటి మంచి విజయాన్ని అందుకున్న చిత్రాన్ని నిర్మించిన ఎష్టేక్ ఎఫ్డీఎఫ్ఎస్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం మెల్లిసై. తీరం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కిషోర్ కుమార్,సుభద్ర రాబర్ట్ జంటగా నటిస్తున్నారు. జార్జ్ మరియా, హరీష్ ఉత్తమన్, జస్వంత్ మణికంఠన్, తనన్య, ప్రోక్టీవ్ ప్రభాకర్, కన్నన్ భారతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్లు విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తోందని చిత్రవర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ దర్శకుడు వెట్టిమారన్ ఎంతగానో అభినందించారని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మంచి కథ కథనాలతో కూడిన చిత్రాలను అభినందించి, ఆదరించే దర్శకుడు వెట్రిమారన్ కవితాత్మకతతో కూడిన కుటుంబ కథా చిత్రం అయిన తమ మెల్లిసై చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ప్రశంసించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా అన్నాడు మట్టుమ్ అండమ్ తేడుం ( ప్రేమ మాత్రమే ప్రపంచాన్ని అన్వేషిస్తుంది) అనే టాగు చిత్ర కథను ప్రతిబింబిస్తోందని ప్రసంగించారన్నారు. తండ్రి కూతుర్ల మధ్య అందమైన అనుబంధాన్ని ఆవిష్కరించే కథాచిత్రంగా మెల్లిసై ఉంటుందన్నారు. ప్రేమ, లక్ష్యం, ఓటమి, గెలుపు వంటి ఘటనల సమహారమే ఈ చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపారు. -
ఘనంగా నాగులచవితి వేడుకలు
తిరుత్తణి: నాగుల చవితి సందర్భంగా నాగాలమ్మ ఆలయాల్లో శనివారం సందడి నెలకొంది. దీపావళి ఐదు రోజుల తరువాత నాగుల చవితి నిర్వహించడం పరిపాటి. ఈ సందర్భంగా తిరుత్తణిలో నాగాలమ్మ ఆలయాల్లో మహిళలు పూజలు చేపట్టి నాగ దేవతను వేడుకున్నారు. నాగ దోషం వున్నవారు. నాగల చవితి సందర్భంగా అమ్మవారికి పూజలు చేసి దర్శించుకుంటే దోషాలు తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుత్తణి గాంధీ రోడ్డులోని నాగలమ్మ ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు రావిచెట్టుకు పసుకు కుంకుమ దిద్ది, పుట్టకు పూజలు చేసి కోడిగుడ్డు, పాలు పోసి దర్శించుకున్నారు. పెట్టపై సజ్జలు వెదజెల్లారు. ఇదే విధంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో పుట్టకు మహిళలు పూజలు చేపట్టి దర్శించుకున్నారు. పళ్లిపట్టు, పొదటూరుపేట, తిరువలంగాడు, కనకమ్మసత్రం, ఆర్కేపేట, కేజీ.కండ్రిగ పరిసర ప్రాంతాల్లో మహిళలు నాగుల చవితి పూజలు నిర్వహించారు. తిరువళ్లూరులో.. తిరువళ్లూరు: నాగుల చవితిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ప్రజలు తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఏటా దీపావళీ ముగిసిన ఐదవ రోజు నాగుల చవితి వేడుకలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం నాగుల చవితి కావడంతో ఉదయం నుంచే అమ్మవారి ఆలయాల వద్ద భక్తుల రధ్దీ కనిపించింది. నాగదేవతకు ప్రత్యేక పూజలు చేయడంతో పుట్టలో పాలు పోసి గుడ్డు పెట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు. తిరువళ్లూరులోని శివుడి ఆలయం, అంకాళపరమేశ్వరి అమ్మవారి ఆలయం, మూంగత్తమ్మన్తో పాటు పలు ఆలయాల్లో వున్న పాము పుట్టలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నాగులచవితి వేడుకలు కొరుక్కుపేట: రాష్ట్రవ్యాప్తంగా నాగులచవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు ఆలయాలకు చేరుకొని నాగదేవతకు పూజలు చేసి పుట్టలో పాలుపోసి మొక్కులు తీర్చుకున్నారు. చైన్నె జార్జ్టౌన్లో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నాగుల చవితి వేడుకలు శనివారం కోలాహలంగా నిర్వహించారు. మహిళలు నాగదేవతకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. చైన్నె ట్రిప్లికేన్ రామనగర్లోని నాగదేవత ఆలయంలో నాగులచవితి ఘనంగా చేశారు. మాతమ్మ ఆలయం నుంచి మహిళలు 108 పాలబిందెలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని నాగదేవతకు అభిషేకం చేసి భక్తిభావాన్ని చాటుకున్నారు. నాగాలమ్మ ఆలయంలో పుట్టకు పూజలు చేస్తున్న మహిళలు నాగులచవితిని పురస్కరించుకుని ప్రత్యేక పూజల్లో భక్తులు -
బంగారుగుడిలో గురుస్థానం పూజ మండపం
–ప్రారంభించిన కేంద్రమంత్రి శివరాజ్సింగ్ సౌకాన్ వేలూరు: వేలూరు శ్రీపురంలోని బంగారుగుడి ఆవరణలో గురుస్థానం పూజ మండపాన్ని శ్రీనారాయణి పీఠాధిపతి శక్తిఅమ్మ ఆధ్వర్యంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ సౌకాన్ ప్రారంభించారు. అనంతరం ఆయన సతీమణి సాధనసింగ్తో కలిసి బంగారుగుడిని దర్శించుకొని నారాయణి ఆమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు పీఠం సంప్రదాయం ప్రకారం అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం పీఠంలోనే శక్తిఅమ్మ అధ్యక్షతన జరిగిన మహాచండీ యాగ పూజలతో పాటు పూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిపారు. అనంతరం పీఠంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.యాగ పూజల్లో వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు శంకర్ విశ్వనాథన్, నారాయణి పీఠం బంగారుగుడి డైరెక్టర్ సురేష్బాబు, నారాయణి ఆస్పత్రి డైరెక్టర్ బాలాజీ, మేనేజర్ సంపత్, ట్రస్టీ సౌందర్రాజన్, వివిధ దేశాల భక్తులు పాల్గొన్నారు. -
రొమ్ము క్యాన్సర్పై అవగాహన ర్యాలీ
తిరువళ్లూరు: రొమ్మ క్యాన్సర్పై అవగాహన అవసరమని తిరువళ్లూరు ప్రభుత్వ మెడికల్కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేవితి సూచించారు. ఏటా అక్టోబర్ 25న రొమ్ము క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం తిరువళ్లూరు మెడికల్ కళాశాల వద్ద అవగాహన ర్యాలీ జరిగింది. ర్యాలీని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేవతి అద్యక్షత వహించి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో ఆంకాలజీ సర్జరీ విభాగం ప్రొఫెసర్లు అఖిల, మధుసూధనన్తోపాటూ పలువురు పాల్గొన్నారు. ర్యాలీలో రొమ్ము క్యాన్సర్కు చిక్సిత, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటూ ఇతర అంశాలపై నినాదాలు చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ సురేష్బాబు, డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ విజయరాజ్, ఆర్ఎంవో డాక్టర్ రాజ్కుమార్, ఏఆర్ఎంవో ప్రభుశంకర్, డాక్టర్లు జగదీష్తో పాటూ పలువురు మెడికల్ విద్యార్థులు, ట్రైనీడాక్టర్లు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
అందులో తప్పేముంది
తమిళసినిమా: బహు భాషా కథానాయికల్లో ఒకరు నటి మడోనా సెబాస్టియన్. ఈ మాలీవుడ్ బ్యూటీ మాతృభాషతో పాటు కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ దక్షిణాది కథానాయకిగా గుర్తింపు పొందారు. తమిళంలో విజయ్ సేతుపతికి కాదలుమ్ కడందు పోగుమ్, కవన్, జూంగా చిత్రాల్లో నటించారు. అదేవిధంగా ఇటీవల ప్రభుదేవా సరసన జాలియో జింఖానా చిత్రంలో నటించారు. అయితే తన 13 ఏళ్ల కెరీర్లో చాలా తక్కువ చిత్రాల్లోనే నటించారు. ఏదేమైనా ఎందుకనో అనుకున్న స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేక పోయారు. ఇటీవల లియో చిత్రంలో విజయ్కు చెల్లెలిగా నటించారు. హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే ఇప్పుడు ఏకై క మార్గం గ్లామర్గా మారింది. ఇందుకు నటి మడోనా సెబాస్టియన్ అతీతం కాదనిపించారు. ఇటీవల గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తలో నానుతున్నారు. ఇదే క్రమంలో నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే విమర్శలు హీరోయిన్లకు కొత్తవి కాదు కాబట్టి ఈ అమ్మడు కూడా వాటిని తిప్పి కొడుతున్నారు. పైగా అందాలు ఆరబోత తప్పేమీ కాదు అంటూ సమర్ధించుకుంటున్నారు. గ్లామర్కు అసభ్యతకు మధ్య వ్యత్యాసం తెలిస్తే చాలు అని అన్నారు. గ్లామర్ను విమర్శించడానికి ఏమీ లేదన్నారు. మొత్తం మీద తను గ్లామర్కు గేట్లు తెలిసినట్లు ఈ అమ్మడు చెప్పకనే చెప్పారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నటి మడోనా సెబాస్టియన్ -
31న తెరపైకి ‘ఆన్బావం పొల్ల్దాదు’
తమిళసినిమా: మంచి కుటుంబ కథ చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న యువ కథానాయకులలో రియోరాజ్ ఒకరు. ఈయన ఇంతకుముందు నటించిన జ్యో చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అందులో నటి మాళవిక మనోజ్ నాయకిగా నటించారు. తాజాగా మరోసారి రియోరాజ్, మాళవిక మనోజ్ జంటగా నటించిన తాజా చిత్రం ఆన్బావం పొల్లదదు. ఈ చిత్రం ద్వారా కలైయరసన్ తంగవేల్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు నటి షీలా, ఆర్ జె.విఘ్నేష్ రాజ్ తతలు ముఖ్యపాత్రులు పోషించిన ఈ చిత్రాన్ని డ్రమస్టిక్ ప్రొడక్షన్ పతాకంపై. వెడిక్కరపట్టి ఎస్.శక్తివేల్ నిర్మించారు సిద్దు కుమార్ సంగీతాన్ని, మాదేశ్ మాణిక్యం ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని అక్టోబర్ 31 తేదీన తెరపైకి రానుంది. విచిత్రాన్ని తమిళనాడులో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇంతకుముందు మహిళల సమస్యలతో ఇతివృత్తంతో పలు చిత్రాలు వచ్చాయన్నారు. అయితే పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలతో కథతో ఎందుకు చిత్రాన్ని చేయరాదన్న ఆలోచనతో రూపొందించిన చిత్రం ఆన్బావం పొల్లదదు అని చెప్పారు. ఇది పెళ్లయిన భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న సమస్యల నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. అలాంటి కథతో సాగే ఈ చిత్రం కోర్టు వరకు దారితీస్తుందని ఆ తర్వాత ఏం జరిగిందన్నది చిత్ర ముఖ్యాంశమని దర్శకుడు చెప్పారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే ఇందులో ఓ ముఖ్యమైన విషయం గురించి చర్చించినట్లు చిత్ర కథానాయకుడు రియోరాజ్ తెలిపారు. -
కుశస్థలి పరవళ్లు
తిరుత్తణి: తిరువలంగాడు ప్రాంతంలో కుశస్థలి నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో నదికి మధ్యలోని రెండు కల్వర్టులను వరద ప్రవాహం ముంచెత్తడంతో గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఈశాన్య రుతుపవానాల ప్రభావంతో గత కొద్ది రోజులుగా తిరుత్తణి, తిరువలంగాడు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షంతో కుశస్థలి నదిలో వరద ప్రవాహం ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈక్రమంలో పాలారులో వరద ప్రవాహం చోటుచేసుకుని తిరువలంగాడు సమీపంలోని మనవూరు వద్ద కుశస్థలిలో వరద ప్రవాహం చోటుచేసుకుంటోంది. దీంతో కుప్పంకండ్రిగ, బాగసాలై వద్ద రెండు కల్వర్టులను వరద ప్రవాహం ముంచెత్తింది. దీంతో తిరువళ్లూరు పేరంబాక్కంకు ప్రాంతాలకు వెళ్లు రోడ్డుకు మధ్యలో వరద చోటుచేసుకుని గ్రామీణులకు రాకపోకలు తెగి పది గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో 10 కిలోమీటర్ల దూరం వెళ్లి తిరువళ్లూరు, పేరంపాక్కం వెళ్లాల్సి వుంది. 40 ఏళ్లుగా వర్షాకాలంలో వరద చోటుచేసుకున్న సమయాల్లో కల్వర్టులు వరద ముంచెత్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా బ్రిడ్జి నిర్మించాలని ఆ ప్రాంతం వాసులు కోరుతున్నారు. కనకమ్మసత్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాలువలు ఆక్రమణకు గురికావడంతోపాటు పూడికతీత చేపట్టక పోవడంతో వరద ప్రవాహం గ్రామంలో చోరబడి ఇళ్లలో వరదపోటు చోటుచేసుకుంది. ఇళ్ల ముందు వరద నీటితో మూడు రోజుల నుంచి గ్రామీణులు ఇబ్బందులు చెందుతున్నారు. -
ఘనంగా స్నాతకోత్సవం
కొరుక్కుపేట: చైన్నె కొట్టూరుపురంలోని అన్నా సెంటెనరీ ఆడిటోరియం వేదికగా టీమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ 21వ స్నాతకోత్సవవ శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, రాయపురం రిటైర్డ్ హెచ్ఎం అమలదాస్ విచ్చేశారు. వీరు పట్టభద్రులకు 570 మంది విద్యార్థులకు డిప్లొమా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. టీమ్ విద్యా సంస్థ సహ వ్యవస్థాపకులు ఫెలిక్స్ మైఖేల్ టీమ్ విద్యాసంస్థ అన్నా స్టెఫీ అధ్యక్షతన జరిగిన ఈ స్నాతకోత్సవంలో వారు గ్రాడ్యుయేట్లను అభినందించారు. -
హోంగార్డులు వైద్యపరీక్షలు చేసుకోవాలి
వేలూరు: పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డులు తరచూ విధి నిర్వహణలో ఉండడంతో వైద్య పరీక్షలు చేసుకోవాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం అన్నారు. వేలూరులోని తలమురైపేరవై, శ్రీనారాయణి ఆస్పత్రి ఆధ్వర్యంలో జీవీ సెల్వం జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని వేలూరు పోలీస్ కల్యాణ మండపంలో జిల్లాలోని హోంగార్డులకు ప్రత్యేక వైద్యశిబిరం, సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. శిబిరానికి వేలూరు డీఐజీ ధర్మరాజ్ అధ్యక్షత వహించగా జీవీ సెల్వం మాట్లాడుతూ తన జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే నేడు హోంగార్డులకు వైద్యశిబిరం నిర్వహించి అవసరమైన వైద్య సదుపాయాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వేలూరు డీఐజీ ధర్మరాజ్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో హోంగార్డుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. తక్కువ వేతనంతో పోలీసులతో సమానంగా ట్రాఫిక్లో నిలబడి క్రమబద్ధీకరిస్తారన్నారు. ట్రాఫిక్తో పాటు బందోబస్తులోనూ తరచూ పాల్గొంటున్న హోంగార్డులకు పని ఒత్తిడి తప్పకుండా ఉంటుందన్నారు. వాటి నుంచి బయట పడాలన్నారు. అనంతరం ప్రభుత్వ సిద్ధ వైద్యులు తిల్లైవాణన్ పాల్గొని తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన పద్ధతులపై సలహాలు, సూచనలు ఇచ్చారు. హోంగార్డుల అసిస్టెంట్ కమాండో జనరల్ సురేష్, ఏరియా కమాండో కుమరన్, అసిస్టెంట్ కమాండోలు అర్చన, గణేష్, వినోద్, తలమురై పేరవై నిర్వహకులు శ్రీనివాసన్, భూమినాథన్, మారన్ అసోషియేషన్ మేనేజింగ్ డైరెక్టర్, న్యాయవాది పీడీకే మారన్, సతీష్కుమార్, కేఎస్ సుందర్ పాల్గొన్నారు. -
భిక్షగత్తె అనుకుని!
చౌడేపల్లె: ఆమె ఎందుకొచ్చిందో.. ఎక్కడికొచ్చిందో తెలియదు. ఊరుగాని ఊరు వచ్చి బస్ షల్టర్లో చిక్కుకుపోయారు. మూడు రోజులుగా వర్షాల కారణంగా అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఎవరో భిక్షగత్తె అనుకుని స్థానికులు చేరదీసి ఆదరించారు. శనివారం ఉన్నట్టుండి అపస్మారక స్థితి చేరుకుని మృతిచెందారు. హెడ్ కానిస్టేబుళ్లు మస్తాన్, జయశంకర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మహిళ భుజానికి ఉన్న బ్యాగ్ను పరిశీలించారు. ఆమె పేరు రామలక్ష్మి(60)గా నిర్ధారించారు. ఆమెది ధనపాల్చెట్టి స్ట్రీట్, ముత్తుపాళెం, సిద్ధిపేట, చైన్నెగా బ్యాగులోని ఆధార్, బ్యాంకు పుస్తకాలను బట్టి గుర్తించారు. బ్యాగులో ఉన్న రూ. 1.08 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు చైన్నె కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు ఖాతా పుస్తకాలను పరిశీలించారు. బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.4 లక్షల మేర బ్యాలెన్స్ ఉన్నట్టు స్టేట్మెంట్ను బట్టి గుర్తించా రు. పర్సులో కొన్ని నగలు సైతం ఉండడంతో.. ఫోన్బుక్లో ఉన్న తన కుమార్తె పళణిఎమ్మాల్కు సమాచారమిచ్చారు. రామలక్ష్మి చౌడేపల్లెకు ఎందుకొచ్చారు.. ఎలా వచ్చారో తెలియడం లేదు. పలమనేరుకు వెళ్లాల్సింది పోయి.. గత మూడు రోజుల క్రితం ఆమె చౌడేపల్లెలో పలమనే రుకు వేళ్లేందుకు ఆటోలో ఎక్కాల్సి ఉండగా పొరపాటున తిరుపతి వైపు వెళ్లే ఆటో ఎక్కినట్టు స్థానికులు చె బుతున్నారు. చౌడేపల్లెకు 2కి.మీ దూరంలో ఆటో వెళ్తుండగా మహిళను డ్రైవర్ ప్రశ్నించాడు. పలమనేరుకు వెళ్లాలని సమాధానమివ్వగా ఆమినిగుంట బస్షెల్టర్ వద్ద ఆ మహిళను ఆటోలో నుంచి దింపేశా రు. ఆమెకు తెలుగు రాదు. మూడు రోజులుగా బస్షెల్టర్లోనే తలదాచుకున్నారు. చలికి వణుకుతూ అపస్మారస్థితికి చేరుకుని మృతిచెందినట్టు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహా న్ని పోస్టుమార్ట నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
ప్రపంచ దేశాలకు తమిళనాడు ఉత్పత్తులు
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఉత్పత్తి అయ్యే సంప్రదాయ, ప్రత్యేకమైన వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేసే దిశగా ప్రపంచ తమిళుల కోసం వాణిజ్య ఉత్సవం జరగనుంది. ఇందుకోసం చైన్నె నుంచి 55 మంది వ్యవస్థాపకులను మలేషియా పర్యటన నిమిత్తం తమిళనాడు నుంచి ఎంపిక చేశారు. ఈ వివరాలను చైన్నె ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో మిల్లెట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుందర్, తమిళర్ వర్తక సంఘం అధ్యక్షుడు బాలకృష్ణన్లు ప్రకటించారు. తమిళనాడు నుంచి 55 మంది వ్యవస్థాపకులను ఎంపిక చేశామని, ఇందులో చైన్నెకు చెందిన వారే అధికంగా ఉన్నట్టు వివరించారు. ఇంటర్నేషనల్ తమిళర్ బిజినెస్ కాన్ల్కేవ్ 2025 మలేషియా వేదికగా డిసెంబరు 22 నుంచి 25వ తేది వరకు జరగనున్నట్టు తెలిపారు. ఇందుకోసం 1000 మంది ప్రతినిధులను ఆహ్వానించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో తమిళనాడులో ప్రత్యేకమై, సాంపద్రాయక ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా సువర్ణావకాశాన్ని కల్పించేందుకు నిర్ణయించామని తెలిపారు. ఇక్కడి ఉత్పత్తులను, ఆహారం, తదితర వస్తువులను వివిధ దేశాల ముంగిటకు తీసుకెళ్లే విధంగా తమిళనాడు నుంచి 55 మందిని ఎంపిక చేశామని, ఇందులో చైన్నె నుంచి 22 మంది వ్యవస్థాపకులను ప్రతినిధులుగా ఉన్నట్టు వివరించారు. -
ఐడియాస్ టూ ఇంపాక్ట్
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాకింగ్లో మరోమారు నంబర్– 1 స్థానం దక్కించుకున్న ఐఐటీ మద్రాసు తాజాగా ఐడియాస్ టూ ఇంపాక్ట్ చాలెంజ్పై దృష్టి పెట్టింది. శనివారం క్యాంపస్లో యువ ఆవిష్కర్తలు అభివృద్ధి చేసిన 38 పర్వావరణ ఆవిష్కరణల ప్రదర్శన నిర్వహించారు. స్థిరత్వం, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, వాతావరణ స్థితిస్తాపకతను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వి.కామకోటి, తమిళనాడు ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అనురాగ్ మిశ్రా ప్రారంభించారు. అనంతరం ఇందులో విద్యార్థులు కొలువుదీర్చిన వివిధ ఆవిష్కరణలను వారు పరిశీలించారు. – సాక్షి, చైన్నె -
పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీగాంధీ
సేలం: తనయుడు అన్బుమణికి పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు పూర్తిగా చెక్ పేట్టేశారు. తన పెద్ద కుమార్తె శ్రీగాంధీకి పెద్ద పీట వేశారు. ఆమెకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్( కార్యనిర్వాహక అధ్యక్షురాలు) పదవిని అప్పగిస్తూ శనివారం రాందాసు నిర్ణయం తీసుకున్నారు. వివరాలు.. పీఎంకేలో తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య సాగుతున్న వార్ తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అన్బుమణి చర్యలతో విసిగి వేసారిన, పార్టీ అధినేత రాందాసు చివరకు ఆయన్ను తప్పించారు. ఆయన చేతిలో తొలుత ఉన్న అధ్యక్ష పదవిని లాగేసుకున్న ఆయన ఆ తదుపరి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి కూడా తప్పించారు. అదే సమయంలో అన్బుమణి స్థానంలో తన కుమార్తె శ్రీగాంధీని రాజకీయంగా రంగంలోకి దించేందుకు రాందాసు సిద్ధమైనట్టు పీఎంకే వర్గాలు పేర్కొంటు వచ్చాయి. పార్టీ సర్వసభ్య సమావేశంలో గానీయండి, ఇతర సమావేశాలలో గానీయండి ఆమెకు రాందాసు ప్రాధాన్యతను ఇస్తూ రావడం గమనార్హం. అన్బుమణికి పూర్తిగా చెక్ పెట్టడం లక్ష్యంగా శనివారం రాందాసు కీలక నిర్ణయం తీసుకున్నారు. కీలక బాధ్యతలు.. ధర్మపురిలో శనివారం పార్టీ జనరల్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ గౌరవ అధ్యక్షుడు జికేమణి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాందాసు కీలక ప్రకటన చేశారు. 46 సంవత్సరాల క్రితం పీఎంకే ఆవిర్భావం, పార్టీ బలోపేతానికి తాను పడ్డ శ్రమను వివరించారు. ధర్మపురి నేల నుంచి నాటిన విత్తనం నేడు వికసిస్తున్నట్టు పేర్కొంటూ, దీనిని సురక్షితం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అనేక త్యాగాలు పార్టీకోసం చేసిన వారెందరో ఉన్రానని వివరిస్తూ తాజాగా పార్టీకి , తనకు రక్షణగా కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆమేరకు తన పెద్దకుమార్తె శ్రీ గాంధిని పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తున్నట్టు తెలిపారు. అలాగే, పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా జీకేమణి కుమారుడు తమిళ్కుమరన్ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఈసందర్భంగా శ్రీగాంధీ మాట్లాడుతూ, పెద్దయన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని, పార్టీ బలోపేతం లక్ష్యంగాముందుకు సాగనున్నట్టు వివరించారు. తమిళ్ కుమరన్ మాట్లాడుతూ కష్ట సమయాలలో తాను యువజన నేత పదవి చేపడుతున్నానని పేర్కొంటూ, తన తండ్రి తరహాలో పార్టీకి విధేయతతో ఉంటానని స్పష్టం చేశారు. కాగా శ్రీగాంధీ నియామకం గురించి అన్బుమణిని ప్రశ్నించగా మౌనం వహించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి బహింగంగా మాట్లాడదలచుకోలేదని పేర్కొన్నారు. -
వీఐటీ బీటెక్ ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తులు
వేలూరు: వేలూరు వీఐటీ యూనివర్సిటీ పరిధిలోని వేలూరు, చైన్నె, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, మధ్య ప్రదేశ్లోని భోపాల్ బ్రాంచ్లలో 2026 సంవత్సరానికి గాను బీటెక్ ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చాన్స్లర్ విశ్వనాథన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో.. వీఐటీలోని బయో మెడికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ అండ్ ఆటోమోటివ్ ఇంజినీరింగ్, స్పెలేజేషన్ ఎనర్జీ ఇంజినీరింగ్, ప్రొడక్ష్న్ అండ్ ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో చేరేందుకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలు 2026 ఏప్రిల్ 28 నుంచి మే 3వ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో దేశంలోని 134 ముఖ్య పట్టాణాల్లోని కాకుండా దుబాయ్, కువైట్, మస్కట్ వంటి ఇతర దేశాల్లోని తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు వారి సొంత జిల్లా, చదివిన కళాశాల ప్రాంతాన్ని బట్టి పరీక్షా కేంద్రాన్ని నిర్ణయించుకునే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. కరూర్ బాధిత కుటుంబాలకు విజయ్ పరామర్శ.. రేపు సాక్షి, చైన్నె: కరూర్ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నిర్ణయించారు. వివరాలు.. చైన్నె కరూర్లో టీవీకే నేత విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెను విషాదం గురించి తెలిసిందే. మరణించిన 41 మంది బాధిత కుటుంబాలు, గాయపడ్డ 160 మందిని పరామర్శించేందుకు విజయ్ నిర్ణయించారు. ఈ కుటుంబాలకు ఇప్పటికే మరణించిన వారికి రూ. 20 లక్షలు విజయ్ ప్రకటించారు. వీరందర్నీ ఒకే వేదికపై తీసుకొచ్చి పరామర్శించడమే కాకుండా, నష్ట పరిహారం అందిస్తూ, మరణించిన వారి కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా విజయ్ కసరత్తులలో ఉన్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. శుక్రవారం కరూర్లో విజయ్ పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, భద్రత చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీవీకే వర్గాలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే, టీవీకే వర్గాలు ఎంపిక చేసిన వేదిక చిన్నదిగా ఉండడంతో ఏదేని కళాశాల మైదానాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచించారు. అలాగే ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర వివరాలను సమర్పించాలని సూచించారు. దీంతో పరామర్శలను వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరకు కరూర్లో అతి పెద్ద మైదానం, ఆడిటోరియం లేని దృష్ట్యా, బాధితులను చైన్నెకు తీసుకొచ్చి పరామర్శ ఏర్పాట్లు చేయడానికి టీవీకే వర్గాలు చర్యలు చేపట్టారు. ఇందుకోసం మహబలి పురం వద్ద అతి పెద్ద వేదికను ఎంపిక చేశారు. ఇక్కడకు బాధితులను తీసుకొచ్చి , వారికి అన్ని రకాల బస తదితర ఏర్పాట్లు చేయడానికి ఏర్పాట్లు చేపట్టారు. ఈమేరకు (27వ తేదీ)సోమవారం బాధితులను విజయ్ పరామర్శించి, నష్ట పరిహారం అందించనున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. డీఎంకే వ్యతిరేకులు ఏకం కావాలి! – టీఎంసీ భేటీలో పిలుపు సాక్షి, చైన్నె : డీఎంకేను గద్దె దించాలంటే, ఆ కూటమికి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ ఒకే వేదికపైకి రావాలని తమిళ మానిల కాంగ్రెస్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో పిలుపు నిచ్చారు. ఇందుకు సంబంధించి తీర్మానం చేశారు. తమిళ మానిల కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం శనివారం పల్లావరంలో జరిగింది. పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జీకే వాసన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సర్వసభ్య సభ్యులు, ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యవర్గం హాజరయ్యారు. ఇందులో జీకే వాసన్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతం దిశగా ముందడుగు వేయాలని నేతలకు సూచించారు. ఈసారి పార్టీ తరపున ప్రతినిధులు అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగా పనుల వేగం పెంచాలని సూచించారు. బలం ఉన్న నియోజకవర్గాలను గుర్తించి, ప్రజలతో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాలు విస్తృతం, ప్రజా సమస్యలపై పోరాటాలు చేపట్టాలని సూచించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి విజయానికి నేతలందరూ శ్రమించాలని సూచించారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞతో అడుగులు వేయాలన్నారు. ఈ ఎన్నికలలో డీఎంకే కూటమిని ఓడించాలన్నా, డీఎంకే అవినీతి పాలనకు చరమ గీతం పాడాలన్నా, వీరిని వ్యతిరేకించే పార్టీలు అన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి తీర్మానం కూడా చేశారు. -
75 వేల మందితో ఓటరు జాబితా పనులు
– అర్చనా పట్నాయక్ సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ పనులకు 75 వేల మంది సిబ్బందిని నియమించినట్టు రాష్ట్ర ఎన్ని కల ప్రధాన అధికారి అర్చ నా పట్నాయక్ తెలిపారు. 2026 ఎన్నికల దృష్ట్యా, రాష్ట్రంలో తుది ఓటరు జాబితా తయారీపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టారు. కొత్త ఓటర్ల జాబితా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఓటరు జాబితాలో మార్పు, చేర్పునకు సంబంధించిన పనులు, మరణించిన వారి పేర్ల తొలగింపు, కొత్త ఓటరు చేరిక, తదితర పనులకు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ వివరాలను శుక్రవా రం హైకోర్టుకు ఓ కేసు విచారణ సందర్బంగా సమర్పించారు. ఈ పరిస్థితులలో నవంబర్ 1వ తేదీ నుంచి ఈ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఓటరు జాబితా లో సమగ్ర పరిశీలన అన్నది జరగనన్నట్టు ఈ సందర్భంగా అర్చనా పట్నాయక్ పేర్కొన్నారు. ఇంటింటా వెళ్లి సిబ్బంది పరిశీలన జరుపుతారని పేర్కొన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో సమగ్ర పరిశీలన జరుగుతుందన్నారు. -
కమల్-రజనీ మూవీ.. శృతి హాసన్, సౌందర్య ఏమన్నారంటే?
స్టార్ హీరోలు కమల్ హాసన్ (Kamal Haasan), రజనీకాంత్ గతంలో పలు హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తరువాత ఇద్దరూ కావాలనే విడివిడిగా నటించడం మొదలెట్టారు. అలాంటిది దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుందన్న వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే! ఈ విషయాన్ని కమల్ హాసన్, రజనీకాంత్ కూడా నిజమేనని ధ్రువీకరించారు. రజనీ కూతురి రియాక్షన్అయితే ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? దర్శకుడు ఎవరు? అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అసలు ఈ చిత్రం తెరకెక్కుతుందా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య.. కమల్, రజనీల మల్టీస్టారర్ మూవీ కచ్చితంగా ఉంటుందని ఓ అవార్డుల ప్రదానోత్సవంలో పేర్కొన్నారు. తన తండ్రి రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించే చిత్రాన్ని కమల్హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తారని ఆమె స్పష్టం చేశారు. శ్రుతి హాసన్ ఏమందంటే?అదే వేడుకలో పాల్గొన్న హీరోయిన్ శ్రుతిహాసన్ (Shruti Haasan) కూడా కమల్, రజనీ మరోసారి కలిసి నటిస్తే చూడాలన్న ఆశ తనకూ ఉందన్నారు. దీంతో ఈ క్రేజీ కాంబోలో చిత్రం రావడం ఖాయం అనిపిస్తోంది. కాగా కెరీర్ తొలినాళ్ళలో ‘అపూర్వ రాగంగాళ్, మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ’... ఇలా దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్హాసన్. 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ తర్వాత వీరు కలిసి నటించింది లేదు.చదవండి: పూజా హెగ్డేకు రూ. 5 కోట్లా..? -
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సబేష్ (68) ఇక లేరు (MC Sabesh). కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం 12.15 గంటల ప్రాంతంలో చైన్నెలో కన్నుమూశారు. ఈయన ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవా సోదరుడు. మరో సోదరుడు మురళితో కలిసి పలు చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అదేవిధంగా పలు సంగీత కచేరీలను నిర్వహించారు. వీరు సంగీతాన్ని అందించిన చిత్రాలలో సముద్రం, మాయాండి కుటుంబత్తార్, పొక్కిషం, తవమాయ్ తవమిరుందు వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి.నివాళులు అర్పించిన కార్తీసబేష్.. సినీ సంగీత కళాకారుల సంఘానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. స్థానిక వలసరవాక్కంలోని చౌదరినగర్లో నివసిస్తున్న సబేష్కు గీత, అర్చన అనే ఇద్దరు కూతుర్లు, కార్తీక్ అనే కొడుకు ఉన్నారు. ఈయన భార్య తార ఇంతకుముందే కన్నుమూశారు. సబేష్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. దక్షిణ భారత సినీ నటినటుల సంఘం (నడిగర్) కోశాధికారి, హీరో కార్తీ, ఉపాధ్యక్షుడు కరుణాస్ తదితరులు నివాళులు అర్పించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక బృందావన్ నగరంలోని శ్మశానవాటికలో సబేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. చదవండి: తెలుసు కదా కొన్నేళ్లు మీతో ఉండి పోతుంది -
అపోలో హాస్పిటల్స్ మరో మైలురాయి
కొరుక్కుపేట: చైన్నెలోని గ్రీమ్స్ లేన్లోని అపోలో హాస్పిటల్స్, తమిళనాడులో మొట్టమొదటి లీడ్లెస్ డ్యూయల్ చాంబర్ ఏవీఈఐఆర్ ఫేస్మేకర్ను విజయవంతంగా అమర్చడంతో అధునాతన గుండె సంరక్షణలో మరో గొప్ప మైలురాయిని సాధించింది. ఈ సంక్లిష్టమైన ప్రక్రియను సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ కార్తికేసన్, అతని గుండె నిపుణుల బృందం నిర్వహించారు. ఈ చికిత్స పొందిన వ్యక్తి 80 ఏళ్ల పురుష రోగి, అతనికి అధిక రక్తపోటు, మధుమేహం, గతంలో యాంజియోప్లాస్టీ చేయించుకున్న వ్యక్తి. డయాలసిస్ పై దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి తోనూ బాధపడుతున్నారు. వయసు సంబంధిత పూర్తి హార్ట్ బ్లాక్ కారణంగా అతనికి నెమ్మదిగా హృదయ స్పందన రేటు, పదేపదే స్పృహ కోల్పోవడం వంటివి ఉన్నాయి. సాంప్రదాయ ఫేస్మేకర్లతో అతనికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున, అటువంటి రోగులకు సురక్షితమైన , మరింత అధునాతనమైన ప్రత్యామ్నాయంగా వినూత్నమైన లెడ్లెస్ పేస్మేకర్ వ్యవస్థను బృందం ఎంచుకుంది. ఏవీఈఐఆర్ డ్యూయల్ చాంబర్ పేస్మేకర్ తదుపరి తరం కార్డియాక్ పేసింగ్ టెక్నాలజీని ఉపయోగించి చేపట్టినట్టు వైద్యుల బృందం వెల్లడించింది. -
విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
తిరువళ్లూరు: రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె నందనం నిర్వాహకుల ఆధ్వర్యంలో వంద మంది ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా సైకిల్ను రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె నందనం నిర్వాహకులు అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె నందనం ఆధ్వర్యంలో విద్యార్థులే లక్ష్యంగా వేర్వేరు సహాయకాలను అందిస్తున్నారు. ఇందులోభాగంగానే తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్లోని ప్లేస్పాళ్యం, అల్లికుళీ రెండు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9, 10వ తరగతి చదువుతున్న వందమంది విద్యార్థులకు సైకిల్ను అందజేయాలని రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె నందనంతోపాటు రోటరీ జిల్లా 3234 క్లబ్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే ప్లేస్పాళ్యంలో సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. రోటరీ అధ్యక్షుడు నవీన్ప్రసాద్యాదవ్ అధ్యక్షత వహించగా కార్యదర్శి రొటేరియన్ ఢిల్లీబాబు హాజరయ్యారు. ఢిల్లీబాబు మాట్లాడుతూ తమ రోటరీ సంఘం విద్య, ఎంపవర్మెంట్, కమ్యూనిటీ డెవలప్మెటంట్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రస్తుతం వంద మంది విద్యార్థులకు ఉచితంగా సైకిల్ను అందజేశామని, త్వరలోనే తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తతంృ చేస్తామని హెచ్చరించారు. కోశాధికారి వాసు విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
మినీవ్యాన్ ఢీకొని రైతు మృతి తిరువళ్లూరు: మినీవ్యాన్ ఢీకొని ఓ రైతు మృతిచెందాడు. ఈఘటన తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్ మెయ్యూరు మేట్టు వీధికి చెందిన రాజ్కుమార్(45) రైతు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. ఇతను వేంబేడులో ఫార్మ్హౌస్ పేరిట వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ వేర్వేరు పంటలను సాగుచేస్తున్నాడు. ఈక్రమంలో బుధవారం సాయంత్రం వెంగల్కు ఎరువులు విత్తనాలు కొనుగోలు చేయడానికి ద్విచక్రవాహనంలో వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. సీతంజేరి సమీపంలో వెళుతుండగా ఎదురుగా వచ్చిన మినీవ్యాన్ రాజ్కుమార్ను ఢీకొంది. ఈప్రమాదంలో రాజ్కుమార్ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. విషయం తెలిసి సంఘటన స్థలానికి వెళ్లిన వెంగల్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని కై వసం చేసుకుని శవపరీక్షను పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాణసంచా పేలుడు కేసులో నలుగురి అరెస్ట్ తిరువళ్లూరు: అక్రమంగా టపాసులు నిల్వ వుంచడానికి ఇంటిని అద్దెకు ఇచ్చిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన ముగ్గురిని అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా పట్టాభిరామ్ తండురైలో గత నాలుగు రోజుల క్రితం ఇంట్లో అక్రమంగా నిల్వ వుంచిన టపాసులు పేలి నలుగురు మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ ఈప్రమాదంపై పట్టాభిరామ్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో టపాసులను అక్రమంగా నిల్వ వుంచడానికి ఇంటిని అద్దెకు ఇచ్చిన అదే ప్రాంతానికి చెందిన ఆర్ముగం(50)తోపాటు టపాసుల విక్రయానికి సహకరించిన సోదరుడి దామోదరన్(41), ఆర్ముగం కుమారుడు విజయన్(21) పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నటి మనోరమ కుమారుడు భూపతి కన్నుమూత తమిళసినిమా: దివంగత ప్రఖ్యాత నటిమణి మనోరమ కుమారుడు, నటుడు భూపతి (70) గురువారం ఉదయం చైన్నెలో కన్నుమూశారు. కుటుంబం ఒరు కదంబం చిత్రం ద్వారా నటుడుగా పరిచయమైన భూపతి ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించారు. కాగా భూపతి కుటుంబం స్థానిక టీ.నగర్ , నీలకంఠ మెహతా వీధిలో నివశిస్తున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన భూపతి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది గత వారమే డిశ్చార్జ్ అయ్యారు. అలాంటిది గురువారం ఉదయం 12.40 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. భూపతికి భార్య ధనలక్ష్మి, రాజరాజన్ అనే కొడుకు, అభిరామి, మీనాక్షి అనే కూతుర్లు ఉన్నారు. భూపతి మతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు దక్షిణ భారత నటినటుల సంఘం తరఫున ఉపాధ్యక్షుడు కరుణాస్ ఆయన భౌతికయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూపతి భౌతికకాయానికి శుక్రవారం స్థానిక టీనగర్ కన్నమ్మపేటలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. మహిళ గొంతు కోసి హత్య వివాహేతర ప్రియుడి కోసం గాలింపు అన్నానగర్: ధర్మపురి జిల్లాలోని పాలక్కోడు సమీపం కొమ్మ నాయకన అల్లి న్యూ నేషనల్ హైవే పై గురువారం 45 ఏళ్ల మహిళ రక్తపు మడుగులో మృతి చెందింది. పాలక్కోడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కత్తితో ఆ మహిళ గొంతు కోసి హత్య చేసినట్లు తేలింది. దీని తర్వాత మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. దర్యాప్తులో హత్యకు గురైన మహిళ ధర్మపురి జిల్లా కరిమంగళం సమీపం మందైవీది గ్రామానికి చెందిన గణేషన్ భార్య వల్లి (40) అని తేలింది. వివాహం అయిన 3 సంవత్సరాల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. దీని కారణంగా, ఒంటరిగా నివసించిన వల్లికి కొందరితో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులకు ముందు, తిరుప్పూర్లో తన కుమార్తెను చూడడానికి వెళ్లి తిరిగి వచ్చిన వల్లి గురువారం ఉదయం గొంతు కోసిన స్థితిలో మృతదేహంగా కనిపించింది. విచారణలో వల్లికి తిరుచ్చికి చెందిన పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్తో పరిచయం ఉందని వెల్లడైంది. దీంతో పుష్పరాజ్పై అనుమానం ఏర్పడింది. అతన్ని అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసులు తిరుచ్చికి చేరుకున్నారు. -
వర్షపు నీరు తొలగించాలని రాస్తారోకో
వేలూరు: వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం పరిధిలోని వూసూరు సమీపంలోని తెల్లూరులో వందకు పైగా కుటుంబాలు నివశిస్తున్నాయి. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వర్షపు నీరు పూర్తిగా ఆ ప్రాంతంలోని ఇండ్లు నీటితో నిండిపోయాయి. ఆ ప్రాంతం పల్లంగా ఉండడంతో నీరు పూర్తిగా ఇళ్లలోకి రావడంతో స్థానికులు కట్టుబట్టలతో బయట వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానికులు పలుమార్లు అధికారులకు తెలియజేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ స్థానికులు వూసూరు రోడ్డులో రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నందకుమార్ వెంటనే అక్కడకు చేరుకొని స్థానికులతో చర్చించి జేసీబీ సాయంతో వర్షపు నీటిని బయటకు తీసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు రాస్తారోకోను విరమించారు. -
మీతో స్టాలిన్కు పోటెత్తిన జనం
పళ్లిపట్టు: అత్తిమాంజేరిపేటలో గురువారం నిర్వహించిన మీతో స్టాలిన్ శిబిరానికి గ్రామీణులు పోటెత్తారు. పళ్లిపట్టు యూనియన్లోని అత్తిమాంజేరిపేట ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో గురువారం మీతో స్టాలిన్ శిబిరం నిర్వహించారు. కొడివలస, నొచ్చిలి, కృష్ణమరాజుకుప్పం, అత్తిమాంజేరి గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రజలు శిబిరంలో పాల్గొన్నారు. శిబిరాన్ని తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ ప్రారంభించారు. మహిళలకు ఆర్థికసాయం, ప్రత్యేక ప్రతిభావంతులకు గుర్తింపు కార్డులు, ఉచిత ఇంటి పట్టాలు సహా వివిధ సహాయకాలు కోసం మహిళలు సహా వృద్ధులు పోటెత్తి అధికారుల వద్ద వినతిపత్రాలు అందజేశారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన శిబిరంలో రెండు వేల మంది పాల్గొని వినతిపత్రాలు అందజేశారు. అధికారులు వినతిపత్రాలు స్వీకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేసి 30 రోజుల్లో సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ సహాయకాలు, సర్టిఫికెట్లు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే చంద్రన్ అధికారులకు సూచించారు. -
థియేటర్కు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది!
థడై అదై ఉడై చిత్ర ఆడియోను ఆవిష్కరించిన ఏజే బాలకృష్ణన్, అరుళ్దాస్తో యూనిట్ సభ్యులు తమిళసినిమా: గాంధీమతి పిక్చర్స్ పథకంపై అరివళగన్ మురుగేశన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం థడై అధై ఉడై. అంగాడి తెరు చిత్రం ఫేమ్ మహేష్, తిరుక్కురల్ చిత్రం ఫేమ్ గుణబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కేఎం పారివళ్లాల్, తిరువారూర్ గణేష్,మహాధీర్ ముహమ్మద్, తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సాయి సుందర్ సంగీతాన్ని, తంగపాండియన్, చోటా మణికంఠన్లో ద్వయం ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 31వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించారు. కార్యక్రమంలో తిరుక్కురళ్ చిత్రం ఫేమ్ ఏజే బాలకృష్ణన్, నటుడు అరుళ్ దాస్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. అనంతరం దర్శకుడు ఏజే బాలకృష్ణన్ మాట్లాడుతూ థడై అదై ఉడై (నిషేధాన్ని బద్ధలు కొట్టు). ఈ చిత్ర టైటిలే చాలా ముఖ్యమైందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో చూస్తే రచనలు నిషేధించబడ్డాయని, నాటకాలు నిషేధించబడ్డాయని, చిత్రాల కూడా నిషేధించబడ్డాయని అన్నారు. కాగా అలాంటి అంశాలతో రూపొందిన థడై అదై ఉడై చిత్రం మంచి విజయాన్ని సాధించాలని పేర్కొన్నారు. 1980 ప్రాంతంలో చిత్రాలను అందరూ చూసే వారిని అయితే ఇప్పుడు 30 శాతం మంది మాత్రమే చూస్తున్నారని అన్నారు. చిత్ర దర్శక నిర్మాత అరివళగన్ మురుగేశన్ మాట్లాడుతూ ఈ వేదికపై అందరం నవ్వుకుంటున్నామని అయితే అందరూ రక్తం చిందించి ఈ చిత్రం కోసం పనిచేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయం కంటే చిత్ర నిర్మాణం కష్టంగా ఉంది అంటూ తన తండ్రి పేర్కొన్నారు. అలా 36 గంటలు ఈ చిత్రం కోసం శ్రమించిన యూనిట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. తాను జపాన్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి సంపాదించిన డబ్బుతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటూ ఊర్లోని వారందరూ సంపాదించింది ఖర్చు చేసి ఎందుకు సినిమా నిర్మిస్తున్నానని తిట్టారన్నారు. అయినా తాను కచ్చితంగా విజయం సాధిస్తానని నమ్మకంతో ఈ చిత్రం చేసినట్లు చెప్పారు. -
పొంగల్ రేస్లో తమిళ్ పయ్యన్ హిందీ పొన్ను
తమిళసినిమా: సమీర్ అలీఖాన్ ఇంతకుముందు కాదల్ మట్టుమ్ వేణా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించి కథానాయకుడిగా నటించారు. తాజాగా ఆయన హీరోగా నటించి దర్శక, నిర్మాత బాధ్యతలను నిర్వహిస్తున్న చిత్రం తమిళ్ పయ్యన్ హిందీ పొన్ను. సూపర్ స్టార్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ఇందులో నటుడు ఆడుగళం నరేన్, బ్రహ్మాజీ, సోనియా బోస్, కుంకీ అశ్విన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాత కార్యక్రమాలు జరుపుకుంటోందని దర్శక నిర్మాత సమీర్ అలీ ఖాన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలు రూపొందుతున్న నేటి పరిస్థితుల్లో తాను తమిళం పై ఆసక్తితో ఈ చిత్రాన్ని తమిళ భాషలోనే నిర్మిస్తున్నట్లు చెప్పారు. వేరువేరు నేపథ్యానికి చెందిన యువతి యువకులు ప్రేమించుకుంటారన్నారు. దీంతో వారి ప్రేమకు ఎదురైన అనేక ఆటంకాలను ఎదుర్కొని ఎలా తమ ప్రేమను గెలిపించుకున్నారు అన్న ఇతివత్తంతో రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. చిత్రం ఆద్యంతం చాలా జాలీగా సాగుతుందన్నారు.. చిత్ర షూటింగ్ను చైన్నె, కోయంబత్తూర్, పుదుచ్చేరి ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని, తాజాగా రెండవ పోస్టర్ను విడుదల చేసినట్లు చెప్పారు. కాగా తమిళ్ పయ్యన్ హిందీ పొన్ను చిత్రాన్ని పొంగల్ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 9న విడుద చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమీర్ అలీ ఖాన్ వెల్లడించారు. -
న్యాయవాదులు విధుల బహిష్కరణ
తిరుత్తణి: న్యాయవాదిపై దాడిచేసిన ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి ఽగురువారం ధర్నా చేశారు. తిరుత్తణి కంబైన్డ్ కోర్టులోని మూడు న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో గురువారం కోర్టు ఆవరణలో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ తాగునీటి కోసం గ్రామీణులు రాస్తారోకో చేస్తే అందులో ఆ గ్రామానికి చెందిన న్యాయవాది అయ్యప్పన్ పాల్గొన్నారు. అతనిపై తిరుత్తణి ఇన్స్పెక్టర్ మదియరసన్, పోలీసులు దారుణంగా దాడిచేసినట్లు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేపట్టిన న్యాయవాదిపై దారుణంగా దాడి చేసిన ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాలని తమ డిమాండ్ల పరిష్కారం కోసం మూడు రోజల పాటు కోర్టు బహిష్కరించనున్నట్లు తెలిపారు. న్యాయవాదుల విధుల బహిష్కరణతో కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతున్నాయి. -
అజిత్ 64లో చాన్స్?
తమిళసినిమా: కోలీవుడ్లో అందరి దారి అజిత్ దారి వేరు అంటారు. ఇది అక్షరాల నిజం తనేంటో తన పని ఏంటో అంటూ చేసుకుంటూ పోయే నటుడు అజిత్. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ఓ భేటీలో మరోసారి స్పష్టం చేశారు. కాగా ఇటీవల కార్ రేస్ లపై ఆసక్తి చూపిస్తున్న ఈయన ప్రపంచ స్థాయి కార్యదర్శులు పాల్గొంటూ పథకాలను గెలుచుకుంటున్నారు. అలా దుబాయ్లో జరిగిన కార్ రేస్ పోటీల్లో మూడో స్థానంలో నిలిచి పథకాన్ని గెలుచుకున్నారు. అదేవిధంగా స్పెయిన్లో జరిగిన కార్ రేస్ పోటీల్లోనూ పాల్గొని మూడవ స్థానంలో నిలిచి పథకాలను తెలుసుకున్నారు. కాగా ఇంతకుముందు ఈయన నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. గత ఏప్రిల్ 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆరు నెలలకు కావస్తున్న అజిత్ నటించే తదుపరి చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఆయన నటించే కొత్త చిత్రం గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి మంచి కమర్షియల్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలోనే మళ్లీ నటించడానికి అజిత్ సిద్ధమవుతున్నారు. ఇది ఈయన నటించే 64 వ చిత్రం అవుతుంది. కాగా ఇందులో ఒక కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా ఈ క్రేజీ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత అన్నది పక్కన పెడితే ఈ బ్యూటీ ఇప్పటికే పరాశక్తి చిత్రంలో శివకార్తికేయన్కు జంటగా నటిస్తున్న విషయం తెలిసింది. ఇకపోతే అజిత్ తన 65వ చిత్రానికి కూడా సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. విజయానికి కేజీఎఫ్ చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. అజిత్ శ్రీలీల -
ఘనంగా పర్యాటక అవార్డుల ప్రదానం
కొరుక్కుపేట: పర్యాటక రంగంలో సమర్థంగా పనిచేస్తున్న 31 పరిశ్రమలు, ప్రభుత్వ విభాగాలు, పర్యాటక నిర్వాహకులకు తమిళనాడు పర్యాటక అవార్డులను రాష్ట్ర ఆరోగ్య ప్రజా సంక్షేమ శాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, హిందూ మత వ్యవహారాలు, ధార్మిక ధార్మిక శాఖ మంత్రి పి.కె. శేఖర్ బాబు ప్రదానం చేశారు. తమిళనాడు పర్యాటక అవార్డులు 2025 ప్రదానోత్సవం చైన్నెలోని ఓ హోటల్లో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో 31 పారిశ్రామిక సంస్థలు, హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు ప్రభుత్వ శాఖలతో సహా పర్యాటక నిర్వాహకులను గౌరవనీయ మంత్రి తమిళనాడు పర్యాటక అవార్డులతో సత్కరించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి అద్భుతమైన కృషి కారణంగా, తమిళనాడు ప్రస్తుతం పర్యాటక రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉందని. దేశ సామాజిక–ఆర్థిక అభివృద్ధిలో పర్యాటకం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. తమిళనాడును సందర్శించే విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచడానికి వివిధ కార్యకలాపాలు చేపడుతోందని దీనిని అనుసరించి ముఖ్యమంత్రి స్టాలిన్ మార్గదర్శకత్వం ప్రకారం, పర్యాటక అభివద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వివిధ పర్యాటక వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి తమిళనాడు పర్యాటక అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించి 2022 నుంచి ఈ అవార్డులను అందజేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈ సంవత్సరం పర్యాటక రంగం ద్వారా 13 రకాల అవార్డులు అందించినట్లు మంత్రులు పేర్కొన్నారు. -
భారీ వాహనాలు నిషేధం
సేలం: ఎడతెరపిలేని వర్షాల కారణంగా ముందు జాగ్రత్త, భద్రతా చర్యల్లో భాగంగా, సేలం నుంచి కుప్పనూర్ మీదుగా ఏర్కాడ్కు వెళ్లే రహదారిపై కార్లు, భారీ వాహనాల రాకపోకలను 24వ తేదీ నుంచి తాత్కాలికంగా నిషేధించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఈరా బృందాదేవి మాట్లాడుతూ ఏర్కాడ్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా, పర్వత మార్గాల ద్వారా కొన్ని చోట్ల నీరు ప్రవహిస్తోంది. అందువల్ల, రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ వాహనాలను నిషేధించామని తెలిపారు. -
పాలారు నదిలో నీటి ఉధృతి
వేలూరు: కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాలారు నదిలో నీటిమట్టం పెరిగింది. గత ఆదివారం నుంచి వర్షాలు కురవడంతో వేలూరు పట్టణంలోని ముళ్లిపాళ్యం, బెంగుళూరు రోడ్డు, ఇందిరానగర్ వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు నిద్రాహారాలు మాని మిద్దెలపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజూ రాత్రి వేళల్లో వర్షాలు కురుస్తుండడంతో వేలూరు, గుడియాత్తం, రాణిపేట వంటి ప్రాంతాల్లో సుమారు 100 ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు వేరే మార్గాలు లేకుండా కట్టుబట్టలతో మిద్దెలపైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాణిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రి కురిసిన వర్షాలకు పూర్తిగా వర్షపు నీరు చేరడంతో వైద్యులు, రోగులు ఆసుపత్రిలోకి వెళ్లలేక పోయారు. ఇదిలా ఉండగా రోగులకు ఇచ్చే మందులు కొంత వరకు తడిసి పోవడంతో వైద్య సిబ్బంది వాటిని అప్రమత్తం చేస్తున్నారు. పాలారులో పెరిగిన నీటిమట్టం వాణియంబాడి, ఆంబూరు వంటి ప్రాంతాల్లోనే కాకుండా ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో భారీ వర్షాలు కురవడంతో అక్కడున్న చెక్డ్యామ్లు, చెరువులు పూర్తిగా నిండి పోయి నీరు పాలారునదిలోకి చేరుతోంది. పాలారులో గత నాలుగు రోజులుగా నీరు వస్తున్నప్పటికీ రాత్రి కురిసిన వర్షాలకు నీటిమట్టం పెరగడంతో ఆంబూరు, వాణియంబాడి, వేలూరు కొత్త బస్టాండ్, ఆర్కాడు బ్రిడ్జి వంటి ప్రాంతాల్లో ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 540 చెరువులు పూర్తిగా నిండి పోయింది. పాలారులో నీటిమట్టం పెరగడంతో వేలూరు నార్త్ పోలీసులు పాలారు వద్ద అక్కడక్కడ హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి ఎవరూ పాలారునదిలోకి దిగకూడదని ఆంక్షలు విధించారు. చెక్డ్యామ్లు ఏర్పాటు చేస్తే.. ఆంధ్ర తరహాలో పాలారునదీ పరివాహక ప్రాంతాల్లో అక్కడక్కడా చెక్డ్యామ్లు నిర్మించి వర్షపు నీటిని సంరక్షించాలని పలువురు రైతులు కోరుతున్నారు. డ్యాం లేకపోవడంతో నీరు పూర్తిగా వేలూరు, కాంచీపురం, తిరువళ్లూరు, చైన్నె మీదుగా సముద్రానికి చేరి పోతుందని వీటి వల్ల ఈ జిల్లాలోని రైతులు, ప్రజలు రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని వాపోతున్నారు. 250 చెరువులకు జలకళ తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో దాదాపు 5 చెరువులు పూర్తిగా నిండగా, 124 చెరువుల్లో 50 శాతంపైగా నీరు చేరినట్టు పీడబ్ల్యూడీ అధికారులు తెలిపారు. ఇక జిల్లాలోని ఊత్తుకోట డివిజన్లో 67 చెరువులు, కవరపేటలో 66, ఆరణిలో 28, పొన్నేరిలో 53, మీంజూరులో 38తో సహా మొత్తం 250 చెరువులు వున్నాయి. వీటిలో 5 చెరువులకు వంద శాతం, 8 చెరువులకు 75 శాతం, 26 చెరువులకు 70 శాతం, 124 చెరువుల్లో 50 శాతం నీరు, 87 చెరువుల్లో 25 శాతం నీరు చేరినట్టు ఽఅధికారులు తెలిపారు. ఆనకట్ట నుంచి భారీగా నీరు విడుదల జిల్లాలోని వేర్వేరు అనకట్టలు పూర్తిస్థాయిలో నిండిన క్రమంలో మిగులు జలాలను అధికారులు విడుదల చేస్తున్నారు. సురుటుపల్లి అకనట్ట నుంచి 1,670 క్యూసెక్లు, చిత్రపాక్కం అనకట్ట నుంచి 2915 క్యూసెక్లు, పనపాక్కం అనకట్ట నుంచి 1975 క్యూసెక్లు, కల్పట్టు చెక్డ్యామ్ నుంచి 1,354 క్యూసెక్లు, చెంగాత్తుకుళం డ్యామ్ నుంచి 1,210 క్యూసెక్లు, పాళేశ్వరం చెక్డ్యామ్ నుంచి 787.99 క్యూసెక్లు, ఏఎన్కుప్పం అనకట్ట నుంచి 1500 క్యూసెక్లు, లక్ష్మీపురం అనకట్ట నుంచి 1,639 క్యూసెక్లు, రెడ్డిపళ్యం చెక్డ్యామ్ నుంచి 1,692 క్యూసెక్లు, ఆండార్మఠం డ్యామ్ నుంచి 1,802 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తున్నట్లు వివరించారు. కాగా జిల్లాలోని 10 ఆనకట్టల్లో 927.91 మిలియన్ ఘణపరిమాణంలో నీటినిల్వ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. -
దర్శనానికి 2గంటలు బ్రేక్
తిరుత్తణి: స్కందషష్టి సందర్భంగా స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహణకు వీలుగా నాలుగు రోజుల పాటు ఉదయం రెండు గంటల పాటు స్వామి దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో బుధవారం స్కంధషష్టి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏడు రోజుల పాటు నిర్వహించే వేడుకలు సందర్భంగా రోజూ మూలవర్లకు విశిష్ట అభిషేకం అలంకరణతోపాటు దీపారాధన నిర్వహిస్తారు. కావడి మండపంలో ఉత్సవర్లు షణ్ముఖర్కు రోజూ ప్రత్యేక అలంకరణలో లక్షార్చన నిర్వహిస్తారు. స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహణకు వీలుగా బుధవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు దర్శనభాగ్యం నిలిపి ఆలయ అర్చకులు స్వామికి అభిషేక పూజలు నిర్వహిస్తారు. 11 గంటలకు తరువాత భక్తులకు యథాప్రకారం స్వామి దర్శనం అనుమతిస్తారని ఆలయ జాయింట్ కమిషనర్ రమణి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా స్కందషష్టి వేడుకల్లో రెండవ రోజైన గురువారం స్వామికి ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు లక్షార్చన పూజలు నిర్వహించారు. -
వారిద్దరు ద్రావిడ ఉద్యమ రక్షకులు
వీఐటీలో వైగో వేలూరు: తందైపెరియార్, అన్నాదురైలో మన ద్రావిడ ఉద్యమ రక్షకులను వారి గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని డీఎండీకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైగో అన్నారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఆవరణలో నవలర్ చెజియన్ ఫౌండేషన్, భారతిదాసన్ తమిళ సాహిత్య వేదిక సంయుక్తంగా తందై పెరియార్, అన్నాదురై స్మారక ఉపన్యాస కార్యక్రమం వీఐటీ చాన్స్లర్ విశ్వనాథన్ అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ తమిళనాడులో ద్రావిడ భాష ఎందుకని ప్రతిఒక్కరూ అడుగుతున్నారని ద్రావిడ ఉద్యమం తమిళ భాష, సంస్కృతిని స్థానిక భాష లేకుండా కలిపిన తమిళ జాతీయవాదాన్ని సృష్టించిందన్నారు. ద్రావిడ ఉద్యమం వచ్చిన తరువాతనే పెరియార్, అన్నా వేసిన పునాది తమిళనాడు అభివృద్ధికి దారి తీసిందన్నారు. వైగో మాట్లాడుతూ 1949వ సంవత్సరంలో అన్నా నాయకత్వంలో డీఎంకే నుంచి ద్రావిడ కయగం రెండుగా విడి పోయిందన్నారు. వీటిపై అప్పట్లో పలు విమర్శలు వచ్చాయన్నారు. ద్రావిడ కయగం ఉన్నప్పుడు డీఎంకే ఎందుకని పలువురు నిలదీశారన్నారు. ఆర్యమాయ అనే పుస్తకాన్ని రాసిన తందై పెరియార్, పొన్మోలిగల్ అనే పుస్తకాన్ని రాయడంతో అన్నాదురై జైలుపాలు అయ్యారన్నారు. ద్రావిడర్ కయగం నేత కి.వీరమణి, వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు శంకర్, జీవీ సెల్వం పాల్గొన్నారు. -
తిరుత్తణిలో 8 సెం.మీ వర్షపాతం
తిరుత్తణి: తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మోస్తరుగా ప్రారంభమై భారీ వర్షం కుమ్మరింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా, ఇళ్లు, రోడ్లలో వర్షపు నీరు పేరుకుపోవడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షంతో కుశస్థలి, నంది నదిలో వరదపోటెత్తుతోంది. కాగా కనకమ్మసత్రం ప్రభుత్వ మహాన్నత పాఠశాల చుట్టూ వర్షపు నీరు గుంటను తలపించేలా పేరుకుపోయింది. రెండు తరగతి గదులకు సైతం వర్షపు నీరు చేరడంతో గురువారం బడికి వచ్చిన విద్యార్థులు ప్రత్మామ్నయంగా ఇతర తరగతి గదుల్లో కూర్చోబెట్టారు. పాఠశాల హెచ్ఎం మణిగండన్ పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇచ్చి నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. పాఠశాలలో నీరు పేరుకుపోవడం పట్ల హెచ్ఎం మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నందున వర్షపు నీరు ప్రవహించే కాలువలు తెగి నీరు పేరుకుపోతున్నట్లు, వెంటనే పంచాయతీ ద్వారా జేసీబీ సాయంతో పేరుకుపోయిన నీటిని తొలగించినట్లు తెలిపారు. -
అలర్ట్
● నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ● చైన్నెలో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధం ● పనుల పరిశీలనలో మంత్రులు ● నిండుకుండలుగా రిజర్వాయర్లు ఆరు జిల్లాలకుబంగాళాఖాతంలో మరో అల్పపీడనం శుక్రవారం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో కోయంబత్తూరు, నీలగిరి, ఈరోడ్ తదితర ఆరు జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు. ఈ ద్రోణి ప్రభావం అది ప్రయాణించే మార్గాన్ని బట్టి తెలుస్తుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక గురువారం వరుణుడు చైన్నె , శివారులలో కాస్త తెరపించినట్టు కనిపించినా, సాయంత్రం నుంచి వాతావరణం పూర్తిగా మారింది. చైన్నె శివారులలో గతుకుల మయంలో ఉన్న రోడ్డు మెరీనా బీచ్ మట్టి దిబ్బలలో చేరిన వర్షపు నీరు సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలో విస్తరించిన నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని ఎదురు చూశారు. అయితే, అది తీవ్ర అల్పపీడనంగా మారి చివరకు బలహీన పడింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడుతో పాటూ డెల్టాలో పలు జిల్లాలో భారీగానే వర్షం పడింది. ఈ వర్షం కారణంగా తంజావూరు, తిరువారూర్ జిల్లాలో పెద్ద ఎత్తున వరిపంట దెబ్బ తింది. ఈ పరిస్థితులలో శుక్రవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. వరుసగా వస్తున్న ద్రోణిల ప్రభావంతో అధికంగానే ఉంటుందని గ్రహించిన అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే మేట్టూరు జలాశయం పూర్తిగా నిండింది. హొగ్నెకల్ వద్ద కావేరిలో నీటిఉధృతి సెకనుకు 45 వేల క్యూసెక్కులుగా ఉంది. మేట్టూరులోకి వచ్చే ఈ నీటిని పూర్తిగా బయటకు విడుదల చేస్తున్నారు. దీంతో కావేరి తీరంలోనిడెల్టా జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు. కావేరిలో మరింతంగా నీటి ఉధృతి పెరిగే అవకాశాతో తీర గ్రామాల ప్రజలు నది వైపుగా వెళ్ల వద్దు అని హెచ్చరికలు చేయడమే కాకుండా, ఆ పరిసరాలలో కల్వర్టు మార్గాలను మూసివేశారు. కావేరి తీరంలోని కొల్లిడం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక మదురై వైపుగా వైగై నది పరవళ్లు తొక్కుతోంది. ఈరోడ్డు భవానీ సాగర్ నీటి మట్టం 102 అడుగులకు చేరింది. ఈ డ్యాం నీటి మట్టం 105 అడుగులకు చేరగానే ఉబరి నీటి విడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. ఈరోడ్లోని మణియారు, పాలారు నదులలలో నీటి ఉధృతి పెరిగింది. విల్లుపురంలోని 39 అడుగులతో కూడిన వీడురు రిజర్వాయర్ 31 అడుగులకు చేరింది. కొడి వేరి డ్యాం నిండడంతో ఉబరి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక్కడి సెంజి శంకరాభరణి నదిలో నీటి ఉధృతి పెరగడంతో ఆ పరిసర వాసులను అప్రమత్తం చేశారు. అల్పపీడన ద్రోణి.. ఈశాన్య రుతు పవనాల రాకతో బయలు దేరిన తొలి అల్పపీడనం బలహీన పడ్డప్పటికీ, శుక్రవారం మరొకటి ఏర్పడనుంది. బంగాళాఖాతంలో బయలుదేరనున్న ఈ ద్రోణి ప్రభావంతో కోయంబత్తూరు, నీలగిరి, ఈరోడ్, తిరుప్పూర్, తదితర ఆరు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలో శుక్రవారం నుంచి వర్షాలు ఉధృతి పెరగనున్నది. ఇప్పటికే ఈ జిల్లాలోని వర్షాలు పూర్తిగా స్థాయిలో నైరుతీ రుతు పవనాల రూపంలో కురిశాయి. నిండుకుండలుగా రిజర్వాయర్లు ఉన్నారు. దీంతో వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ద్రోణి తదుపరి వరసుగా మరికొన్ని బంగాళాఖాతంలో ఏర్పడే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీంతో 26వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని సముద్ర తీర , డెల్టా, ఉత్తర తమిళనాడులోని జిల్లాలో ఆశాజనకంగా వర్షాలు పడనున్నాయి. చైన్నె, శివారు జిల్లాలో వర్షాలు సంవృద్ధిగా పడే అవకాశాలతో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు విస్తృతం చేసింది. 1,436 మోటారు పంపులు లోతట్టు ప్రాంతాలలోనూ, 298 ట్రాక్టర్లతో కూడిన మోటారు పంపు సెట్లు ఇతర ప్రాంతాలలోను సిద్ధం చేసి ఉంచారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి ఓ వైపు, మంత్రులు శేఖర్బాబు, నెహ్రూ తదితరులు మరోవైపు చైన్నెలో ఎలాంటి వరద ముంపు అన్నది ఎదురు కాకుండా ముందస్తు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక నీలగిరులలో ఇప్పటికే వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో ఆ జిల్లా యంత్రాంగం మరింత అలర్ట్ అయింది. అలాగే కున్నూరు – ఊటీ రైల్వే మార్గంలో విరిపడ్డ కొండ, మట్టి చరియలను తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయి. -
సమష్టిగా విపత్తులను ఎదుర్కొంద్దాం..
చైన్నెలో ముందస్తు చర్యలన పరిశీలించిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ సమష్టిగా ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొంద్దామన్నారు. ఇక సీఎం స్టాలిన్ చైన్నె కార్పొరేషన్ అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. చైన్నె నగరంలో 22 సబ్ వేలలో చేరిన నీటిని తొలగించామన్నారు. 68 చోట్ల వంటలతయారీకి చర్యలు తీసుకున్నామని, 1,48,450 మందికి ఆహారం అందించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. 454 ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. చైన్నె కార్పొరేషన్కు సంబంధించి వర్షాల సమయాలలో ఫిర్యాదులు,సత్వర సేవలకు 1913 ,1916 టోల్ ఫ్రీం నెంబర్లను సంప్రదించాలని సూచించారు. -
డీఎంకే ఎమ్మెల్యే పొన్ను స్వామి హఠాన్మరణం
సాక్షి, చైన్నె: నామక్కల్జిల్లా సేంతమంగళం డీఎంకే ఎమ్మెల్యే కె. పొన్నుస్వామి(74) గురువారం గుండె పోటుతో హఠాన్మరణం పొందారు. ఈ సమాచారంతో డీఎంకే వర్గాలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ తన సంతాపం తెలియజేశారు. నామక్కల్ జిల్లాకు చెందిన పొన్ను స్వామి 2006 నుంచి సేంతమంగళం నియోజకవర్గం నుంచి వరుసగా పోటీ చేస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న ఆయన 2006లో ఓమారు, 2021లో మరో మారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ పరిస్థితుల్లో గురువారం ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు కొల్లిమలై ఆస్పత్రికి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం నామక్కల్కు తరలించారు. అయితే ఆయన మరణించినట్టు నామక్కల్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దీంతో తీవ్ర విషాదం డీఎంకేలో నెలకొంది. పులియంకాడులోని పొన్నుస్వామి స్వగ్రామంలో భౌతికకాయాన్ని ఉంచారు. ఈ సమాచారంతో మంత్రి మదవివేందన్, డీఎంకే ఎంపీలు వీఎస్ మాదేశ్వరన్, రాజేష్కుమార్తో పాటూ నామక్కల్ జిల్లాలోని డీఎంకే ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సేంతమంగళంకు చేరుకున్నారు. పొన్నుస్వామి భౌతిక కాయానికి అంజలి ఘటించారు. పొన్ముస్వామి మరణంతో డీఎంకే అధ్యక్షుడు,సీఎం స్టాలిన్ సంతాపం తెలియజేశారు. రెండుసార్లు ప్రజలు ఆయన్ని అసెంబ్లీకి పంపిచారని గుర్తుచేశారు. కలైంజ్ఞర్ కరుణానిధిపై అత్యంత అభిమానం కలిగిన పొన్ముస్వామి ఇక లేరన్న సమాచారం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన్ని కోల్పోయి తీవ్ర శోకంలో ఉన్నకుటుంబ సభ్యులకు, సేంతమంగళం నియోజకవర్గ ప్రజలకు తనసంతాపం, సానుభూతిని తెలియజేశారు. ఇక డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మంత్రులు ఏవీ వేలు, శివశంకర్, రాజేంద్రన్, అన్బిల్ మహేశ్, మాజీ మంత్రి సెంథల్ బాలాజీలు సేంతమంగళంకు చేరుకుని ఆయన భౌతిక కాయానికి అంజలి ఘటించారు. మరణించిన పొన్నుస్వామికి భార్య జయమణి,కుమారుడుమాదేష్, కుమార్తె పూమలర్ ఉన్నారు. -
పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం
సాక్షి, చైన్నె: పారిశుధ్య కార్మికుల కోసం కొత్త పథకం అమలులోకి రానుంది. తొలి విడతగా చైన్నెలో ఈ పథకం ప్రవేశ పెట్టనున్నారు. ఇక పారిశుద్ధ్య కార్మికులు ఉదయం వేళలో అల్పాహారం అందించనున్నారు. రాష్ట్రంలోని చైన్నె, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి, తిరునల్వేలి, తూత్తుకుడి తదితర కార్పొరేషన్లలో లక్షలాది మంది శుభ్రత పనులలో పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్న విషయం తెలిసిందే. గ్రేటర్ చైన్నెలోని పదిహేను మండలాలలో వేలాది మంది విధులలో ఉన్నారు. ఈ పరిస్థితులలో ఉదయాన్నే విధులకు వచ్చేకార్మికులు అల్పాహారం స్వీకరించడం లేదన్న సమాచారం సీఎం స్టాలిన్ దృష్టికి చేరింది. దీనిపై పరిశీలన జరుపుతున్న సమయంలో చైన్నెలో శుభ్రత పనులను ప్రైవేటుకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు పోరుబాట బట్టారు. దీంతో కార్మికులను బుజ్జగించేందుకు మంత్రులు, అధికారులు తీవ్రంగా యత్నించారు. చివరకు వీరి పోరాటాన్ని భగ్నం చేశారు. అయితే సీఎం స్టాలిన్ మాత్రం కార్మికుల సమస్యలు, విన్నపాలపై స్పందించారు. పారిశుద్ద్య కార్మికుల సంక్షేమార్థం ఆరు వరాలను ప్రకటించారు. దీంతో కార్మికులు ఆనందం, హర్షం వ్యక్తం చేశారు. ఇందులో తొలి వరంగా అల్పాహార పథకం అమలులోకి రానుంది. గ్రేటర్ చైన్నె కార్పొరేషన్లో తొలి విడతగా ఈ పథకం నవంబర్లో అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకం అమలు కోసం రూ. 186 కోట్లను మూడు సంవత్సరాలకు గాను కేటాయించారు. ఈ పథకం మేరకు గ్రేటర్ చైన్నెలో 29,455 మంది పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందించనున్నారు. తదుపరి క్రమంగా అన్ని కార్పొరేషన్లకు ఈ పథకం విస్తరించే విధంగా కార్యాచరణలో అధికారులు ఉన్నారు. -
కోర్టుకు సీబీఐ ప్రాథమిక నివేదిక
సాక్షి, చైన్నె: కరూర్ ఘటనకు సంబంధించిన ప్రాథమిక నివేదికను స్థానిక కోర్టులో గురువారం సీబీఐ దర్యాప్తు బృందం సమర్పించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీనిపై నవంబర్ 2న విచారణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. వివరాలు.. గత నెల 27వ తేదీన కరూర్లో టీవీకే నేత విజయ్ ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో 41 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. ఈ కేసును మద్రాసు హైకోర్టు ఆదేశాలతో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ బృందం తొలుత విచారించింది. ఆ తదుపరి కేసు సీబీఐకు చేరింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క మిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారని, ఇందులో ఇద్దరు తమిళనాడు కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారులుగా ప్రకటించారు. తాజాగా కేసును గుజరాత్కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్కుమార్ నేతృత్వంలో ఎడీఎస్పీ ముఖేష్కుమార్, డీఎస్పీరామకృష్ణన్తో సహా ఆరుగురితో కూడిన సీబీఐ బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తు పర్యవేక్షణ కమిటీలో తాజాగా ఇద్దరు అదనపు డీజీపీ స్థాయి అధికారులను నియమించారు. ఇందులో ఒకరుబీహార్లో పనిచేస్తున్న తమిళనాడు కేడర్కు చెందిన అదనపు డీజీపీ సుమీత్ శరణ్ కాగా, మరొకరు ఛత్తీస్గడ్లో పనిచేస్తున్న సోనాల్ వీ మిశ్రా ఉన్నారు. ఈ పరిస్థితులలో గత కొద్దిరోజులుగా కరూర్లో తిష్ట వేసిన సీబీఐ అధికారుల బృందం ప్రాథమికంగా ఓ నివేదికను తయారుచేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సామాజిక మాధ్యమాలలో వెలుగుచూసినఅంశాల ఆధారంగా కరూర్ ఘటనకు సంబంధించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి స్థానికకోర్టులో సమర్పించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీనిపై నవంబర్ 2న కోర్టు విచారణ ప్రారంభించనుంది. ఈ నివేదికలో సామాజిక మాధ్యమాలలో విజయ్ పర్యటనకు సంబంధించిన సమాచారాలు, ఇతర వివరాలు,సంఘటన తదుపరి సామాజిక మాధ్యమాలలో జరిగిన పలు అంశాలను పరిగణించి సమగ్రంగా వివరించినట్టు సమాచారం.ఇదిలా ఉండగా ఈ ఘటనతో వాయిదా పడ్డ విజయ్ మీట్ది పీపుల్ రోడ్ షో పర్యటనలు ఇక, బహిరంగ సభల రూపంలో నిర్వహించేందుకు కసరత్తులలో తమిళగ వెట్రి కళగం వర్గాలు నిమగ్నమయ్యారు. నవంబర్లో విజయ్ పర్యటన మళ్లీ మొదలు పెట్టే దిశగా రూట్మ్యాప్ సిద్ధంచేస్తున్నారు. -
28న కోవైకు ఉపరాష్ట్రపతి
●పలు కార్యక్రమాలకు ఏర్పాట్లు సాక్షి, చైన్నె: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈనెల 28వ తేదీన కోయంబత్తూరుకు రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ వర్గాలు కసరత్తులు చేపట్టాయి. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ఇటీవల ఉప రాష్ట్రపతి పదవిని అధిరోహించిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఇంత వరకు తమిళనాడుకు రాలేదు. గత నెలాఖరులోరావాల్సి ఉండగా, కరూర్ విషాద ఘటన నేపథ్యంలో వాయిదా పడింది. ఈ పరిస్థితులలో ఆయన ఈనెల 28వ తేదీన కోయంబత్తూరుకు రానున్నారు. ఉప రాష్ట్రపతిగా ప్రపథమంగా తమిళనాడుకు వస్తున్న సీపీ రాధాకృష్ణన్కు కోయంబత్తూరు విమానాశ్రయంలో బ్రహ్మరథం పట్టేవిధంగా ఆహ్వానం పలికేందుకు బీజేపీ వర్గాలు కసరత్తులు చేపట్టాయి. కోయంబత్తూరులో పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కోయంబత్తూరు కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించనున్నారు. కోయంబత్తూరులోఉదయం నుంచిసాయంత్రం వరకు జరిగే కార్యక్రమాల తర్వాత ఆయన తిరుప్పూర్కు బయలుదేరి వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. కోయంబత్తూరులో ఆయన పర్యటించే ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.వర్షం దెబ్బ..పెరిగిన కూరగాయల ధరలుకొరుక్కుపేట: తమిళనాడుతో పాటు వివిధ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చైన్నెలో కూడా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోయంబేడు మార్కెట్కు వచ్చే కూరగాయల లోడ్లు తక్కువగా రావటంతో కూరగాయలు ధరలు అమాంతంగా పెరిగి పోయాయి. ఇప్పటి వరకు కిలో రూ.20 ఉన్న టమాటా ప్రస్తుతం రూ.60కి పెరిగింది. బీనన్స్ రూ.80, శనగలు రూ.60, క్యారెట్లు–రూ.50 పలికినట్లు తెలిపారు. ఇక బయటి మార్కెట్లోని దుకాణాల్లో టమాటాలు కిలో రూ.70 వరకు, బీనన్స్, మునగకాయలు కిలో రూ.120 వరకు అమ్ముడవుతున్నాయని వెల్లడించారు.బడులకు బెదిరింపులుసాక్షి,చైన్నె : చైన్నె శివారులోని పలు పాఠశాలలకు గురువారం వచ్చిన బాంబు బెదిరింపుతో పోలీసులు ఉరకలు తీశారు. దీపావళి సెలవుల అనంతరం బుధవారం బడులు తెరచుకోవాల్సి ఉండగా, వర్షం కారణంగా వాయిదా పడింది. వర్షం తెరపించడంతో గురువారం యథాప్రకారం పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితులలో ఉదయాన్నే చైన్నె శివారులోని నొలంబూరు, తిరుమలిసై, పూందమల్లి, పరిసరాలో ఏడు పాఠశాలలకు ఒకటి తర్వాత మరొకటి అంటూవచ్చిన బెదిరింపు కాల్స్తో పోలీసులు, బాంబు, డాగ్స్క్వాడ్లు ఉరకలు తీశాయి. ఆ పరిసరాలలో తీవ్రంగా సోదాలు నిర్వహించినానంతరం ఇది బూచీ అని నిర్ధారించారు. ఇటీవల కాలంగా చైన్నె, శివారులలో బాంబు బెదిరింపు ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. -
దీపికా పదుకొణెతో డ్యుయెట్కు నేను రెడీ!
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం డ్యూడ్ (Dude Movie). శరత్ కుమార్, రోహిణి, సిద్ధూ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కీర్తీశ్వరన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ నిర్మించారు. సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించారు. అక్టోబర్ 17వ తేదీన తమిళం, తెలుగు భాషల్లో విడుదల అయిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. థాంక్స్ గివింగ్ మీట్ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చెన్నైలో థాంక్స్ గివింగ్ మీట్ నిర్వహించింది. చిత్ర నిర్మాతలు నవీన్ యేర్నేని, రవి శంకర్ మాట్లాడుతూ డ్యూడ్ చిత్రం తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటకలోనే కాకుండా, ఉత్తరాదిలో, అమెరికాలోనూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది అని పేర్కొన్నారు. ఇంత మంచి విజయాన్ని అందించిన దర్శకుడు కీర్తీ శ్వరన్, ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు, శరత్ కుమార్ యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.దీపికాతో డ్యుయెట్కు రెడీడ్యూడ్ చిత్ర షూటింగ్కు వెళుతున్నామనగానే మనసులో సంతోషం కలిగేదని, అంత జాలీగా షూటింగ్ సాగిందని మమిత బైజు అన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు, దర్శకుడు, హీరోకు కృతజ్ఞతలు తెలిపారు. చక్కని సందేశంతో కూడిన యూత్ ఫుల్ లవ్ స్టొరీ డ్యూడ్ అని నటుడు శరత్ కుమార్ పేర్కొన్నారు. తాను ఇప్పుడు హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)తో డ్యుయెట్ పాడటానికి కూడా రెడీ అన్నారు. చాలా సెన్సిబుల్ కథను నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాతలకు అభినందనలు తెలియజేశారు.చదవండి: బ్రేకప్.. గుండెలోతులో బాధ.. : రష్మిక మందన్నా -
తిరుత్తణిలో రోజంతా వర్షం
పళ్లిపట్టు: తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వీడని వర్షంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెరువుల్లోకి నీరు వేగంగా చేరుతోంది. ప్రజా పనుల శాఖకు చెందిన 26 చెరువులు పూర్తిగా నిండినట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా కృష్ణాపురం జలాశయం పూర్తి సామర్ధ్యం నిండడంతో డ్యాం నుంచి బుధవారం సాయంత్రం రెండు వేల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల చేశారు. దీంతో కుశస్థలి పొంగి ప్రవహిస్తోంది. సామంతవాడ వద్ద కల్వర్టు రెండుగా కూలింది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. అధికారులు ముందు జాగ్రత్తగా కల్వర్టుకు ఇరు వైపులా మట్టిని నింపి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అదే విదంగా తిరుత్తణి ప్రాంతంలోని నంది నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. -
ప్రాణం తీసిన అనుమానం
–భార్యను హతమార్చి పాతిపెట్టిన భర్త – రెండు నెలల తరువాత వెలికితీత తిరువళ్లూరు: భార్య ప్రవర్తనపై అనుమానంతో దారుణంగా హత్య చేసిన భర్త డ్రమ్లో మృతదేహాన్ని వుంచి పాతిపెట్టిన సంఘటన రెండు నెలల తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తురైపాళ్యం గ్రామానికి చెందిన శిలంబరసన్(39). పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ప్రియ అనే యువతిలో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈక్రమంలో ప్రియ ప్రవర్తనపై అనుమానంతో తరచూ శిలంబరసన్ గొడవ ఆమెతో పడేవాడు. భర్త వేధింపులు తాళలేక తరచూ పుట్టింటికి ప్రియ వెళ్లిపోయింది. దీంతో శిలంబరసన్ భార్యకు నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఈక్రమంలో పుట్టింటి నుంచి వచ్చిన తరువాత ప్రియ అదృశ్యమైంది. అయితే పొరుగింటి వారితో, తనతో గొడవ పడి మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయినట్టు శిలంబరసన్ నమ్మించాడు. దీపావళి పురస్కరించుకుని ప్రియ సోదరులు ఆమె ఇంటికొచ్చారు. ప్రియ ఇంట్లో లేకపోవడంతో శిలంబరసన్ను నిలదీశారు. ప్రియ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో 2నెలల క్రితమే ఆమెను హత్య చేసి డ్రమ్లో వుంచి పాతిపెట్టినట్టు చెప్పాడు. వారు ఆరంబాక్కం పోలీసులకు ిఫిర్యాదు చేశారు. పోలీసులు శిలంబరసన్ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ప్రియను హత్య చేసి ఎలాపూర్లోని బ్రిడ్జి సమీపంలో పాతిపెట్టినట్టు నేరం అంగీకరించాడు. మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
ఘనంగా పాఠశాల వజ్రోత్సవం
పళ్లిపట్టు: పొదటూరుపేట ప్రభుత్వ పాఠశాల వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో వజ్రోత్సవ వేడుకలను పూర్వవిద్యార్థుల సంయుక్త కృషితో చేపట్టి పాఠశాలకు రూ.15 లక్షలతో సదుపాయాలు కల్పించారు. పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేట ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించుకోవాలని ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు నిర్ణయించారు. ఇందుకుగాను ఆ పాఠశాలలో చదవి దేశ విదేశాల్లో వివిధ పదవులో ఉన్న వారితో కలిసి పాఠశాలకు తమ వంతు సాయం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం పూర్వవిద్యార్థుల ద్వారా స్వచ్ఛందంగా రూ.25లక్షలు ఇచ్చారు. ఆ మొత్తం డబ్బుతో పాఠశాలలో ఏసీ, స్మార్ట్ తరగతి గదులు, గదులకు ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు సహా పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరిచారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో శిలాఫలకం ఏర్పాటుతోపాటు ఆర్చి సైతం నిర్మించారు. మంగళవారం పాఠశాలలో వజ్రోత్సవాలు నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం మోదరన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథులుగా ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ కన్నప్పన్, తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రామన్, టౌన్ పంచాయతీ చైర్మన్ రవిచంద్రన్ పాల్గొని పూర్వవిద్యార్థుల సేవాభావాన్ని, మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం
వేలూరు: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వేలూరు జిల్లా అభివృద్ధి పనుల కమిటీ చైర్మన్, వేలూరు ఎంపీ కదిర్ ఆనంద్ అన్నారు. వేలూరు కలెక్టరేట్లో ఆ కమిటీ సభ్యులు జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులు నత్త నడకన సాగుతున్నాయని వీటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం వర్షాలు విరివిగా కురుస్తున్నందున వేలూరు కార్పొరేషన్లో వర్షపు నీరు చేరి ప్రజలు అంటు రోగాల బారిన పడకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలన్నారు. కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వీటిపై చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ నిర్మాణ కట్టడాలు, పాఠశాల భవనాలు వంటి అభివృద్ధి పనులను డిసెంబర్లోపు పూర్తి చేయాలన్నారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలో సంవత్సరాల తరబడి భూగర్భ డ్రైనేజీ పనులు జరుగుతున్నందున పట్టణంలోని రోడ్డులు బురదమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉన్నందున వెంటనే పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల పనితీరు, ప్రస్తుతం ఈ పనులు ఏస్థాయిలో ఉందనే వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు కార్తికేయన్, అములు, జగన్మూర్తి, విల్వనాథన్, మేయర్ సుజాత, అటవీశాఖ జిల్లా అధికారి అశోక్కుమార్, డీఆర్ఓ మాలతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బంగారుగుడిలో 10,008 దీపారాధన పూజలు
బంగారు గుడిలో నక్షత్ర ఆకారంలో వెలిగించిన 10,008 దీపాలు, దీపారాధన పూజలు చేస్తున్న పీఠాధిపతి శక్తిఅమ్మ వేలూరు: వేలూరు శ్రీపురం బంగారుగుడిలో ప్రపంచశాంతి కోసం 10,008 దీపాల పూజ మంగళవారం రాత్రి కనులపండువగా జరిగింది. దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దీపారాదన పూజలను శ్రీనారాయణి పీఠాధిపతి శక్తిఅమ్మ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులోభాగంగా బంగారుగుడిలో నక్షత్ర ఆకారంలో 10,008 నేతి దీపాలను వెలిగించారు. ముందుగా శ్రీనారాయణి అమ్మవారికి వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణ, గోపూజ, తులసి పూజ, యాగపూజలు అతి వైభవంగా జరిగాయి. అనంతరం నారాయణి అమ్మవారికి ఊంజల్ సేవను శక్తిఅమ్మ చేతుల మీదుగా నిర్వహించారు. పీఠాధిపతి శక్తిఅమ్మ నక్షత్ర ఆకారంలో వెలిగించిన దీపాల వద్ద ప్రత్యేక యాగం చేశారు. ప్రపంచంలో దీపావళి రోజున ఎటువంటి ప్రమాదాలు జరకుండా కాపాడాలని, ప్రజలను సుఖసంతోషాలతో వుంచాలని యాగ పూజలు నిర్వహించారు. నక్షత్ర ఆకారంలో వున్న దీపాలను తీసుకొచ్చి భక్తులకు హారతిగా ఇచ్చారు. నారాయణి ఆస్పత్రి డైరెక్టర్ బాలాజి, బంగారుగుడి డైరెక్టర్ సురేష్బాబు, మేనేజర్ సంపత్, బంగారుగుడి ఆంధ్ర రాష్ట్ర పీఆర్ఒ కల్యాణ్, శక్తి అమ్మ భక్తులు అఽధిక సంఖ్యలో పాల్గొని శక్తి అమ్మకు పుష్పాలు సమర్పించి స్వామివారి ఆశీర్వాదాలు అందుకున్నారు. -
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
– గరుడ వారధిపై నుంచి కిందికి దూకిన తమిళనాడు వాసి తిరుపతి క్రైమ్ : పెళ్లి కాలేదని మనస్తాపంతో తమిళనాడుకు చెందిన ఓ యువకుడు బుధవారం తిరుపతిలోని గరుడ వారధిపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మదురైకి చెందిన పాండ్యరాజన్(31) వివాహం కాలేదని కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం కుటుంబీకులతో కలిసి తిరుమలకు వచ్చాడు. శ్రీవారి దర్శనానంతరం కుటుంబసభ్యులను మధురై వెళ్లేందుకు రైలు ఎక్కించాడు. తాను బస్సులో వస్తానని వారికి చెప్పి బుధవారం ఉదయం మున్సిపల్ పార్క్ సమీపంలో గరుడ వారధి పైనుంచి కిందకు దూకేశాడు. తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి సెల్ఫోన్ ఆధారంగా కుటుంబీకులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కాలేజీకి తరలించినట్లు అలిపిరి ఎస్ఐ తెలిపారు. -
26.3 అడుగులు చేరుకున్న అరణియార్ నీటి మట్టం
నాగలాపురం: పిచ్చాటూరు మండల పరిదిలోని అరణియార్ రిజర్వాయర్లో నీట మట్టం 26.3 అడుగులకు చేరుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలాయంలో నీటి నిల్వ పెరిగింది. క్యాచ్మెంట్ ప్రాంతాల్లో కొనసాగుతున్నందున రాబోయే రోజుల్లో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అరణియార్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయానికి 301 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తోంది. ఫ్లడ్గేటు మూసి వేసి ఉండడంతో ఔట్ఫ్లో లేదని అధికారులు వెల్లడించారు. రేపు భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద గట్టి నిఘా ఉంచామని అన్నారు. ఏఈ స్థాయి అధికారులను 24 గంటల పాటు ప్రాజెక్టు గేటు వద్ద ఉండి పర్యవేక్షించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. గ్రామస్తులు, రైతులు రాబోయే సాగు సీజన్కు సరిపడేంత నీరు అరణియార్లో నిల ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
గరుడ వాహనంపై నృసింహుడి చిద్విలాసం
రాపూరు: మండలంలోని పెంచలకోనలో పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి బుధవారం రాత్రి బంగారు గరుడవాహనంపై చిద్విలాసం చిందించారు. శ్రీవారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం బుధవారం రావడంతో చందనంతో అలంకరించారు. నిత్య కై ంకర్యాలతోపాటు అభిషేకాలు, శాంతి హోమం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. రాత్రి శ్రీవారికి అత్యంత ప్రియమైన బంగారు గరుడ వాహనంపై శ్రీవారి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి వివిధరకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణ నడుమ పెంచలకోనలో దేవస్థాన కార్యాలయం వరకు క్షేత్రోత్సవం నిర్వహించారు. స్వామివారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. -
వేలూరు కొత్త బస్టాండ్లో రద్దీ
వేలూరు: దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల పాటూ సెలవు ప్రకటించింది. దీంతో చైన్నె, బెంగుళూరు, విల్లుపురం, కోవై, సేలం వంటి ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, గత శనివారం సొంత గ్రామాలకు చేరుకున్నారు. సెలవులు పూర్తి కావడంతో వేలూరు కొత్త బస్టాండ్కు చేరుకున్న ప్రయాణికులు బస్సుల్లో రద్దీని చూసి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులు మంగళవారం సాయంత్రంతో పాటూ బుధవారం ఉదయం ఒక్కసారిగా వేలూరు కొత్త బస్టాండ్ చేరుకొని చైన్నె, బెంగళూరు, సేలం వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు యత్నించడంతో బస్టాండ్ ప్రాంతం పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయింది. ఇదిలా ఉండగా రాజస్థాన్, కేరళ, ఆంధ్ర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు భారీగా చేరుకోవడంతో కాట్పాడి రైల్వే స్టేషన్లోనూ రద్దీ కనిపించింది. అదేవిధంగా మంగళవారం సెలవు రోజు కావడంతో వేలూరు కోట మైదానంలో అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతో చేరుకొని కాలక్షేపం చేశారు. దీంతో వేలూరు కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్, కోట మైదానం ఆవరణలో ప్రయాణికులతో కిటకిటలాడింది. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తూనే ఉండడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
వేలూరు, తిరువణ్ణామలైలో భారీ వర్షాలు
వేలూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారడంతో వేలూరు, తిరువణ్ణామలైలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురవడంతో 2 రోజుల పాటూ ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లలేక ఇంటికే పరిమితమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో రోడ్లు, వీధులన్నీజలమయం అయ్యాయి. అదేవిధంగా వర్షపు నీరు వేలూరు నేతాజీ మార్కెట్లోకి చేరుకోవడంతో వ్యాపారులు, కొనుగోలు దారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 రోజులుగా ఉదయం నుంచి వర్షాలు విడవకుండా కురుస్తుండడంతో విద్యుత్ శాఖ అధికారులు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. ఇదిలా ఉండగా కార్మికులు, ఉద్యోగస్తులు బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా వర్షం కారణంగా వేలూరు గ్రీన్ సర్కిల్, కొత్త బస్టాండ్, బజారు వీధి పూర్తిగా వర్షపు నీటితో నిండిపోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడి వాహనాన్ని నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేలూరు పట్టణంలోని కన్సాల్పేటలో సుమారు 40 ఇళ్లలోకి వర్షపు నీటితో పాటూ డ్రైనేజీ కాలువ నీరు చేరడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే కార్పొరేషన్ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి నీటిని విద్యుత్ మోటార్లు ద్వారా నీటిని తోడే పనిలో నిమగ్నమయ్యారు. రాణిపేట జిల్లాలో సంవత్సరాల తరబడి ఉన్న చింత చెట్టు నేల కొరగడంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. వెంటనే చెట్లను నరికి తీసే పనిలో కార్మికులు నిమగ్నమయ్యారు. కన్నమంగళం కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరువణ్ణామలై జిల్లాలోని సెయ్యారు, ఆరణి, తిరువణ్ణామలై, పోలూరు, తండ్రాంబట్టు వంటి ప్రాంతాల్లోను రెండు రోజుల నుంచి వర్షాలు కురవడంతో ఆ ప్రాంతాలన్ని జలమయమైంది. సందవాసల్, పడవేడు, పుష్పగిరి, కాట్పాడి వంటి ప్రాంతాల్లోని అరటి, వరి పంటలు పూర్తిగా నేలమట్టం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పూండి రిజర్వాయర్ నుంచి మిగులు జలాల విడుదల తిరువళ్లూరు: పూండి రిజర్వాయర్కు భారీగా మిగులు జలాలు వస్తున్న నేపథ్యంలో రిజర్వాయర్ నుంచి దిగువకు మరింత నీటిని విడుదల చేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పూండిలో సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్ వుంది. ఆంధ్ర కండలేరు నుంచి వచ్చే జలాలతో పాటూ వరద నీటిని నిల్వ వుంచి చైన్నె ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. రిజర్వాయర్ మొత్తం నీటిమట్టం 35 అడుగులు. ఇక్కడ మూడున్నర టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఇటీవల రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చిన క్రమంలో పూర్తిస్థాయికి చేరింది. దీంతో రిజర్వాయర్ బద్రతను దృష్టిలో ఉంచుకుని 700 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే రిజర్వాయర్కు ఇన్ఫ్లో మరింత పెరిగిన క్రమంలో సెకనుకు 4,500 క్యూసెక్ల నీటిని బుధవారం సాయంత్రం నుంచి విడుదల చేశారు. దీంతో షట్టర్లను దాటుకుని నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. పూండి రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేసిన క్రమంలో కరకట్ట ప్రాంతాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులను అధికారులు ముమ్మరం చేశారు. తిరువళ్లూరులో.. తిరువళ్లూరు: గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నివాస ప్రాంతాలకు నీరు చేరడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నివాసాల చుట్టూ నీరు చేరిన క్రమంలో అత్యవసర సేవలకూ వెళ్లలేకపోతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా నత్తంబేడు గ్రామంలో గణపతి నగర్, శబరి నగర్ ప్రాంతాలు వున్నాయి. ఇక్కడ సుమారు 500 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. గతంలో ఇక్కడ నిలిచే వర్షపు నీరు సమీపంలోని అప్పలగుంటకు చేరేది. అయితే అప్పల గుంటకు వెళ్లే కాలువను కొందరు ఆక్రమించుకోవడంతో నీరు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక రాత్రి సమయంలో విష సర్పాలు సైతం సంచరిస్తున్నట్టు స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించిన నివాసాలకు చేరిన నీటిని వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. -
కారు బోల్తా: ఇద్దరు దుర్మరణం
అన్నానగర్: కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన కరూర్లో చోటుచేసుకుంది. కరూర్ జిల్లా కరుపంపాలయంలోని అగ్రహార వీధికి చెందిన లోకనాథన్ కుమారుడు నితీష్ కన్నన్ (23). ఇతను ఒక ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. మంగళవారం తన ముగ్గురు స్నేహితులు తిరునెడుంగణనాథన్ (21), ధనుష్ (21), శివరాజన్ (24)లతో కలిసి సేలం–కరూర్ జాతీయ రహదారిపై కారులో వెళుతున్నారు. ఆ సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు సైడ్వాల్ను ఢీకొని రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తిరునెడుంగననాథన్, శివరాజన్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా మదురై సమీపంలోని తువారిమాన్ ప్రాంతానికి చెందిన విఘ్నేష్ (22) తన స్నేహితుడు కన్నన్ (27)తో కలిసి తిరుమంగళం–రాజపాళయం రహదారిపై బైక్లో వెళుతున్నాడు. బైక్ అదుపుతప్పడంతో వంతెనపై నుంచి పడిన విఘ్నేష్ వంతెన నిర్మాణం కోసం ఉపయోగించిన ఇనుప కడ్డీలలో చిక్కుకుని మృతిచెందాడు. కన్నన్ తీవ్ర గాయలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
డిసెంబర్లో ద్రౌపది–2
తమిళసినిమా: నటుడు రిచర్డ్రిషి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ద్రౌపది–2 . దీనికి మోహన్ జి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు రూపొందిన ద్రౌపది చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా దానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న చిత్రం ద్రౌపది–2. జీఎం ఫిలిం కార్పొరేషన్ తనతో కలిసి నేతాజీ ప్రొడక్షన్స్ అధినేత చోళచక్రవర్తి నిర్మిస్తున్న చిత్రం ఇది. చరిత్ర, వారసత్వం, శక్తి, నీతి వంటి ప్రధానాంశాలతో రూపొందుతున్న కథా చిత్రం ద్రౌపది–2 అని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. నటి రక్షణ ఇందూసూధన్ నాయికగా నటిస్తున్న ఇందులో నట్టి, వైజీ.మహేంద్రన్, శరవణ సుబ్బయ్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని, తాజాగా రెండవ ఫస్ట్లుక్ పోస్టర్ను రిచర్డ్రిషి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసినట్లు చెప్పారు. రిచర్డ్రిషికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఈ ఫస్ట్లుక్ పోస్టర్లో ఆయన గెటప్నకు మంచి రెస్పాన్స్ వస్తోందని చిత్ర వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచినట్లు, తమిళం, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న ద్రౌపది–2 చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నాయి. కాగా ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని, ఫిలిప్ ఆర్.సుందర్ చాయా గ్రహణం, మాటలను పద్మచంద్రశేఖర్, మోహన్.జీ అందించినట్లు చెప్పారు. ద్రౌపది చిత్ర సెకండ్ పోస్టర్ -
క్లుప్తంగా
పాము కాటుకు ప్రభుత్వ ఉద్యోగి మృతి పళ్లిపట్టు: పాము కాటుకి ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పొదటూరుపేట పోలీసుల కథనం మేరకు.. పొదటూరుపేటలోని నల్లతన్నీరు కులం వీధికి చెందిన గణేశన్(55) పొదటూరుపేట ప్రభుత్వ బాలికల మహాన్నత పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్గా విధులు నిర్వహించేవారు. అతను బుధవారం అతని ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేసింది. అక్కడే ఉన్న పామును చూసిన కుమారుడు మోహన్రాజ్ వెంటనే పామును కొట్టి గణేశన్కు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అతన్ని పరీక్షించిన వైద్యులు గణేశన్ అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం మేరకు పోలీసులు మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ నుంచి పడి బాలుడు.. అన్నానగర్: బైక్కు కుక్క అడ్డంగా రావడంతో ఓ బాలుడు మృతిచెందాడు. తిరువేర్కాడ్ సమీపం సుందరచోళపురంలోని చోళ గార్డెన్ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్. ఇతను ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్. ఇతని కుమా రుడు దర్శన్ (16) ప్లస్వన్ చదువుతున్నాడు. మంగళవారం అతను స్నేహితులతో కలిసి బైక్లో బయటకు వెళ్లాడు. తిరిగి లింగంనగర్లోని ఆయిల్సేరి మార్గంలో ఇంటికి వస్తుండగా హఠాత్తుగా కుక్క బైక్కు అడ్డంగా రావడంతో అదుపుతప్పి దర్శన్ కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసి సంఘటన స్థలానికి వెళ్లిన ఆవడి పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రూ.40 లక్షల మోసం –ముగ్గురిపై కేసు నమోదు కొరుక్కుపేట: ప్లాస్టిక్ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభం ఇస్తామని నమ్మించి వృద్ధుడి వద్ద రూ.40 లక్షలు మోసం చేసిన మహిళ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పద్మనాభన్ (66) చైన్నె కొండితోప్ కన్నయ్య నాయుడు వీధి నివాసి. ఇతను ఒక ప్లాస్టిక్ కంపెనీ నడుపుతున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో కంపెనీని మూసివేసి కొండిటాప్లో గణేశ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితిలో తరచూ ఆలయానికి వెళుతున్న గీత పద్మనాభన్తో పరిచయం ఏర్పడింది. ప్లాస్టిక్ కంపెనీలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించడంతో పద్మనాభన్ తన ఆస్తులను తనఖా పెట్టి 2016లో గీత, రమేష్, శ్రీనివాసులుకు రూ. 40 లక్షలు ఇచ్చాడు. తర్వాత, ముగ్గురూ వ్యాపారం గురించి పద్మనాభన్న్కు తెలియజేయలేదు. అనుమానం వచ్చిన పద్మనాభన్ తన డబ్బును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెట్టాడు. వారు తిరిగి డబ్బు ఇవ్వకపోవడంతో పద్మనాభన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ కోర్టులో కూడా పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశించండంతో గీత, రమేష్, శ్రీనివాసులుపై కేసు నమోదు చేశారు. పిడుగు పడి జల్లికట్టు ఎద్దులు మృతి అన్నానగర్: పిడుగు పడి రెండు జల్లికట్టు ఎద్దులు మృతిచెందాయి. తిరుచ్చి జిల్లాలోని సమయపురం సమీపం పురతక్కుడి ఓల్డ్ పోస్టాఫీస్ వీధికి చెందిన సెల్వం. సెల్వం తన ఇంట్లో రెండు జల్లికట్టు ఎద్దులు ఉన్నాయి. మంగళవారం సమయపురం, పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ స్థితిలో, సెల్వం జల్లికట్టు ఎద్దులను ఇంటి సమీపంలోని కొబ్బరి చెట్టుకు కట్టేశాడు. ఆ సమయంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. పిడుగుపాటుకు కట్టి ఉన్న రెండు జల్లికట్టు ఎద్దులు అక్కడికక్కడే మృతిచెందాయి. బుధవారం ఎద్దులను ఖననం చేశారు. యువకుడిపై పోక్సో కేసు తిరువొత్తియూరు: విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె కొడుంగయూర్ ప్రాంతానికి చెందిన మహిళ(35). ఈమె భర్త ఏడాది క్రితం మృతిచెందాడు. వీరి 18 ఏళ్ల కుమార్తె ప్రైవేట్ కళాశాలలో చదువుతోంది. బుధవారం ఆ విద్యార్థిని సమీపంలో ఉన్న స్నేహితురాలి ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, ఓ వ్యక్తి అడ్డుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థిని కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి రావడంతో యువకుడు పారిపోతుండగా స్థానికులు పట్టుకుని యువకుడిని కొడుంగయ్యూర్ పోలీస్స్టేషన్న్లో అప్పగించారు. విచారణలో అతను కొడుంగయ్యూర్ కణ్ణదాసన్నగర్కు చెందిన విక్రమ్ (22) అని, ప్రైవేట్ కొరియర్ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడని తెలిసింది. అతడిని ఎంకేబీ నగర్ మహిళా పోలీస్స్టేషన్న్లో అప్పగించారు. విక్రమ్ను పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
తిరుచెందూరులో స్కంధషష్టి ఉత్సవాలు
సాక్షి, చైన్నె: తిరుచెందూరులో స్కంధషష్టి ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఆరుపడైవీడులలో రెండోదిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో జయంతినాదర్గా కొలువైన స్వామి వారికి ప్రతిఏటా స్కంధషష్టి అత్యంత వేడుకగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు యాగశాల పూజలతో బుధవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మఖ్యమైన ఘట్టం ఆరో రోజు జరిగే సూరసంహారం తిలకించేందుకు దేశ విదేశాల నుంచి సైతం భక్తులు తరలి వస్తారు. సముద్ర తీరంలో జరిగే ఈవేడుక నిమ్తితం ఏర్పాట్లపై తూత్తుకుడి జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. ప్రభుత్వ బస్సు బోల్తా –21 మందికి గాయాలు అన్నానగర్: దిండివనం సమీపం జక్కంపేటలో బుధవారం తెల్లవారుజామున ప్రభుత్వ బస్సు బోల్తా పడి 21 మంది గాయపడ్డారు. అరందాంగి నుంచి మంగళవారం 53 మంది ప్రయాణికులతో ఒక ప్రభుత్వ బస్సు చైన్నెకి బయలుదేరింది. అరదాంగికి చెందిన రాజపాండి (53) డ్రైవర్గా, అదే ప్రాంతానికి చెందిన మణివన్నన్ (45) కండక్టర్గా విధుల్లో ఉన్నారు. ఈ స్థితిలో బస్సు బుధవారం తెల్లవారుజామున దిండివనం సమీపం జక్కంపేట వద్ద వెళుతుండగా బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు 21 మంది గాయపడ్డారు. గాయపడ్డ వీరిని దిండివనం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మయిలం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ట్రాఫిక్ను మళ్లించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైకులో మద్యం తరలింపు –ఒకరి అరెస్ట్ తిరుత్తణి: బైకులో మద్యం తరలించిన వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తిరుత్తణి సమీపం చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలో మురకంబట్టు వద్ద పోలీసులు బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆసమయంలో బైకులో వచ్చిన వ్యక్తి వద్ద తనిఖీ చేశారు. తనిఖీల్లో 38 మద్యం బాటిళ్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. మద్యం బాటిళ్లతోపాటు బైకును స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్లో అప్పగించారు. తిరుత్తణి పోలీసుల విచారణలో అతను మురకంబట్టుకు చెందిన మునికృష్ణన్(25) అని తెలిసింది. ఇతను మద్దూరులోని టాస్మాక్ దుకాణంలో మద్యం బాటిళ్లు తీసుకుని ఇంట్లో వుంచి అదనపు ధరలకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో మునికృష్ణన్ను పోలీసులు అరెస్టు చేశారు. -
శివారు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం
– సొంత ఊర్ల నుంచి తిరిగి వచ్చేవారికి అవస్థలు చైన్నె శివారు ప్రాంతాల్లో నిరంతర వర్షాల కారణంగా, సెలవులు ముగించుకుని తమ స్వస్థలాల నుంచి తిరిగి వస్తున్న ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివరాలు.. చైన్నె శివారు ప్రాంతాలైన తాంబరం, క్రోమ్పేట్, పల్లావరం, సైలెయూర్, వండలూర్, ఊరపాక్కం, పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కొనసాగింది. ఫలితంగా, బుధవారం తాంబరం–వేలచ్చేరి రోడ్డు, తాంబరం–ముడిచూర్ రోడ్డు, జీఎస్టీ రోడ్డులోని లోతట్టు ప్రాంతాలలో మోకాలి లోతు వరకు వర్షపు నీరు పేరుకుపోయింది. ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను నడపలేక, వాటిని నెట్టుకొని తీసుకు పోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా తూర్పు, పశ్చిమ తాంబరంలను కలిపే రైల్వే సొరంగం వంతెన ప్రాంతంలోవర్షపు నీరు నిలిచిపోయింది. తరువాత, కార్పొరేషన్ ఉద్యోగులు వర్షపు నీటిని వెంటనే తొలగించారు. తాంబరం , పరిసర ప్రాంతాలలోని ప్రధాన రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. తాంబరం, పల్లవరం సహా అనేక ప్రాంతాలలో రోడ్లపై వివిధ ప్రదేశాలలో వర్షపు నీరు నిలిచిపోయింది. టీటీకే నగర్, పెరుంగళత్తూర్ రోడ్, ముడిచూర్ రోడ్, సీడీవో కాలనీ, చిట్లపాక్కం, రాధా నగర్, క్రోంపేట్ నీరు ఏరులైపారింది. దీని కారణంగా ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను నడపలేక రోడ్డుపై ప్రయాణించాల్సి వచ్చింది. నిరంతర సెలవుల తర్వాత, జీఎస్టీ రోడ్డు ద్వారా తమ స్వస్థలాల నుంచి చైన్నెకి తిరిగి వస్తున్న ప్రజలు వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్లలో చిక్కుకుని చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. తిరువొత్తియూరులోని శ్రీనివాసనగర్ లోతట్టు ప్రాంతాల్లో..పురసైవాక్కంలో జలమయమైన రోడ్లు విల్లుపురం బస్టాండ్లో భారీగా చేరిన నీరు అల్పపీడనం కారణంగా పట్టినపాక్కం సముద్రంలో నురుగుగా వస్తున్న నీరు, కోడంబాక్కం ట్రస్టుపురంలోని కూలిన చెట్టు, చిదంబరం ఆలయం వద్ద నిండిన కోనేరు , ఈరోడ్ కలెక్టరేట్ను ముంచెత్తిన వరదనీరుసేలం: ఈరోడ్ సత్యమంగలం వళ్లియమ్మన్ ఆలయం వద్ద కూలిన కొండచరియలు, ఈరోడ్ సత్యమంగళం అటవీ మార్గంలో వరద నీరు హొగెనికల్ వద్ద నీటి ఉధృతి -
సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు ఇద్దరు ఏడీజీపీలు
సాక్షి, చైన్నె: కరూర్ ఘటన సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ఇద్దరు ఏడీజీపీలు నియమితులయ్యారు. ఈ ఇద్దరు ఉత్తరాదికి చెందిన అధికారులు కావడం గమనార్హం. గత నెల 27వ తేదీన కరూర్లో టీవీకే నేత విజయ్ ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో 41 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. ఈ కేసును మద్రాసు హైకోర్టు ఆదేశాలతో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ బృందం తొలుత విచారించింది. ఆ తదుపరి కేసు సీబీఐకు చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారని, ఇందులో ఇద్దరు తమిళనాడు కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారులుగా ప్రకటించారు. తాజాగా కేసును గుజరాత్కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్కుమార్ నేతృత్వంలో ఎడీఎస్పీ ముఖేష్కుమార్, డీఎస్పీరామకృష్ణన్తో సహా ఆరుగురితో కూడిన సీబీఐ బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తు పర్యవేక్షణ కమిటీలో తాజాగా ఇద్దరు అదనపు డీజీపీ స్థాయి అధికారులను నియమించారు. ఇందులో ఒకరు బిహార్లో పనిచేస్తున్న తమిళనాడు కేడర్కు చెందిన అదనపు డీజీపీ సుమీత్ శరణ్ కాగా, మరొకరు చత్తీస్గడ్లో పనిచేస్తున్న సోనాల్ మిశ్రా ఉన్నారు. సుమీత్శరణ్ ఇది వరకు కోయంబత్తూరు పనిచేసి, బీఎస్ఎఫ్లో విధులు నిర్వహిస్తున్నారు. సోనాల్ మిశ్రా 2000 సంవత్సరం ఐపీఎస్ కేడర్ అధికారి కావడం గమనార్హం. ఫెస్టివల్ సీజన్లో రికార్డుల బద్దలు ఎమ్మెల్యే అరుల్ను అడ్డగించిన అన్బుమణి అనుచరులు సాక్షి, చైన్నె: పీఎంకే ఎమ్మెల్యే అరుల్ను అన్బుమణి మద్దతుదారులు ముట్టడించడం వివాదానికి దారి తీసింది. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మద్య జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఎమ్మెల్యేలు జీకేమణి, అరుల్ రాందాసుకు మద్దతుగానూ, మరో ముగ్గురు అన్బుమణికి మద్దతుగానూ వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో ఎమ్మెల్యే అరుల్ను టార్గెట్ చేసి అన్బుమణి మద్దతు దారులు బుధవారం కయ్యానికి కాలు దువ్వారు. ఆయన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ధైర్యం ఉంటే గెలవాలంటూ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఇరు వర్గాల మధ్య వివాదం రేగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే అరుల్ ఆత్తూరు డీఎస్పీ సత్యరాజ్కు ఫిర్యాదు చేశారు. తిరుత్తణిలో స్కందషష్టి ఉత్సవాలు ప్రారంభం – మురుగన్కు లక్షార్చన తిరుత్తణి: తిరుత్తణి మురుగన్ ఆలయంలో స్కందషష్టి వేడుకలు బుధవారం షణ్ముఖర్కు లక్షార్చనతో ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో ప్రధానమైన పుష్పార్చన 27న నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేకువజామున మూలవర్లకు అభిషేక పూజలు నిర్వహించి బంగారు కవచంతో అలంకరించారు. అలాగే కావడి మండపంలో శ్రీవళ్లి, దేవసేన సమేత షణ్ముఖర్కు వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకచించారు. భక్తులు సమక్షంలో షణ్ముఖర్కు బిల్వ ఆకులతో లక్షార్చనతో అర్చకులు స్కందషష్టి వేడుకలకు శ్రీకారం చుట్టారు. పెద్ద సంఖ్యలో మురుగన్భక్తులు షష్టి మాలధారణ చేసి దీక్షలు చేపట్టి స్వామిని దర్శించుకున్నారు. ఏడు రోజుల పాటూ నిర్వహించనున్న వేడుకలు సందర్భంగా ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు షణ్ముఖర్కు లక్షార్చన నిర్వహిస్తారు. చివరి రోజైన 7 వ రోజు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. షట్టి ప్రారంభ వేడుకల్లో ఆలయ చైర్మన్ శ్రీధరన్, జాయింట్ కమిషనర్ రమణి, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
దెబ్బతిన్న పంటలు
లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరడంతో రెస్క్యూ విస్తృతం చేశారు. అనేక చోట్ల చెరువుల నుంచి ముందు జాగ్రత్తగా నీటి విడుదలు చర్యలు తీసుకున్నారు. తంజావూరు, తిరువారూర్లలో భారీ వర్షం దాటికి లక్ష ఎకరాలలో వరి పంట దెబ్బ తినే పరిస్థితి నెలకొంది. వరి చేలలోకి నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తంజావూరు, తిరువారూర్లో నీట మునిగిన పంట పొలాలను అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళణి స్వామి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వారి ఆవేదనను, ఆందోళనను విన్నారు. మీడియాతో ఆయనమాట్లాడుతూ ఈ దీపావళి రైతులకు కన్నీటి పండుగ అని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికి అంది వచ్చే సమయంలో నీళ్ల పాలు అయ్యాయని, కోత తదుపరి కొనుగోలు కేంద్రాలకు తరలించిన వరి వర్షార్పణం అయ్యాయని, ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని ధ్వజమెత్తారు. కడలూరులో వర్షందాటికి ఇళ్లు కూలడంతో ఇద్దరుమహిళలుమరణించారు. ఇక బుధవారం మధ్యాహ్నం తర్వాత చైన్నె, శివారులలో కాస్త వరుణుడు తెరపించినట్టుగా చిరు జల్లులు కురిసినా, ఆకాశం నల్లటి మేఘావృతంతో నిండింది. -
కంట్రోల్ రూంలో డిప్యూటీ సీఎం పర్యవేక్షణ
సాక్షి, చైన్నె: చైన్నెలో భారీ వర్షం పడుతుందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో రాత్రంతా డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ స్టేట్ కంట్రోల్ రూమ్ ఎళిలగంలో తిష్ట వేశారు. పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. చైన్నెలో 215 శిబిరాలను ఏర్పాటు చేసి, లక్షా 46 వేల మందికి సరిపడ్డ ఆహారం తదితర అన్ని రకాల వస్తువులను సిద్ధం చేయించారు. అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేయాలని, ఎలాంటి విపత్తు ఎదురైనా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిద్దామన్న పిలుపుతో ఉరకలు తీశారు. ఏదేని విపత్తు ఎదురైన పక్షంలో పోటీ పడి మరీ ప్రజలకు సేవలు అందించాలని అటు అధికారులు, సిబ్బందికి , ఇటు డీఎంకే కేడర్కు ఆయన పిలుపు నిచ్చారు. కాగా చైన్నె శివారులలో కురిసిన వర్షానికి తిరుముల్లై వాయిల్ రోడ్డులో వరదలు పోటెత్తడంతో వాహనదారులకు అవస్థలు తప్పలేదు. యుద్ధ ప్రాతిపదికన నీటిని తొలగించారు. చైన్నె నీరు అందించే చెంబరంబాక్కం, పూండి రిజర్వాయర్లలోకి నీటి రాక పెరగడంతో అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. చైన్నెలోని కోడంబాక్కం, మైలాపూర్లలో చెట్లు నేల కొరగగా ఆగమేఘాలపై తొలగించారు. చైన్నెలో అత్యధికంగా తిరుముల్లై వాయిల్, ఆవడి పరిసరాలలో 10 నుంచి 12 సెం.మీవర్షం పడింది. కాగా చైన్నెలో 107 ప్రాంతాలలో వర్షపు నీటి కాలువల పనులు ముగిసినా, ప్రధానకాలువలోకి అనుసంధానించని దృష్ట్యా, ఇక్కడ నీటిని తొలగించేందుకు ముందు జాగ్రత్తగా మోటారు పంపు సెట్లను సిద్ధం చేశారు. కాగా కూవం నదిలో ఓ వృద్ధుడు నీటిలో కొట్టుకెళ్లగా, అతడిని స్థానికులు రక్షించారు. చైన్నెకుతాజాగా అతి భారీ వర్షం గండం తాత్కాలికంగా తప్పినా, ఈ పవనాల రూపంలో మళ్లీ వర్షాలకు అధిక అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడులోని ధర్మపురి, కృష్ణగిరిలతో పాటూ పలు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. 11 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ను గురువారం ప్రకటించారు. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో జాలర్లు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి. -
వరుణాగ్రహం..!
ఈశాన్య రుతు పవనాలకు తోడు బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాలో వాన జోరు ఊపందుకుంది. 11 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. చైన్నెకు తాత్కాలికంగా పెను గండం తప్పినా, వానలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రిజర్వాయర్లలో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాల ప్రవేశంలో ఓ వైపు అరేబియా సముద్రంలో ఓ అల్పపీడనం, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. అరేబియాలోని ద్రోణి రూపంలో కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశి, తేని, నీలగిరి తదితర పశ్చిమ కనుమలలోని జిల్లాలో వర్షాలు విస్తారంగా వర్షాలు పడుతూ వస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతంలోని ద్రోణి రూపంలో అతి భారీ వర్షాలు చైన్నె, శివారులలో కురిసే అవకాశాలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. చైన్నె, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చి, నాగపట్నం, మైలాడుతురై, తిరుప్పూర్, ఈరోడ్, తిరుపత్తూరు, వేలూరు తదితర జిల్లాలతోపాటూ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బుధవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ జిల్లాలో రాత్రాంతా తేలక పాటిగా కొన్ని చోట్ల, మోస్తారుగా మరికొన్ని చోట్ల వర్షం పడింది. భారీ వర్షంతో విల్లుపురం కొత్త బస్టాండ్ జలదిగ్భందంలో చిక్కగా, కొన్ని గంటలలో అధికార యంత్రాంగం నీటిని తరలించి యథా స్థానానికి బస్టాండ్ను తీసుకొచ్చారు. చైన్నె శివారులలోని తిరుముల్లై వాయిల్, వానగరం, కాశిమేడు, గుడువాంజేరి, తదితర ప్రాంతాలలో భారీగా వర్షం పడింది. అయితే ఈశాన్య రుతు పవనాలు మరింతగా విస్తరించడంతో కోయంబత్తూరు, ఈరోడ్, నీలగిరిలలో అనేక చోట్ల వర్షాలు కొనసాగుతున్నాయి. ధర్మపురి, కృష్ణగిరి, సేలం జిల్లాలకు పవనాలు విస్తరించి కొన్ని చోట్ల భారీ వర్షాన్ని కురిపించడంతో వాగులు, వంకలలో నీటిక రాక పెరిగింది. చిదంబరం బస్టాండ్ జలమయం 11 జిల్లాల్లో భారీ వర్షాలు -
నటి గ్లామర్ పిక్స్ షేర్ చేసిన ఉదయనిధి స్టాలిన్.. ఎంత పనైపోయింది!
పొరపాట్లనేవి జరుగుతూ ఉంటాయి. కానీ, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అవి జరగకుండా జాగ్రత్తపడాలి. లేదంటే, ఇదిగో.. ఇలా ట్రోలింగ్ బారిన పడటం ఖాయం! బిగ్బాస్ కంటెస్టెంట్, నటి, మోడల్ నివాశియ్ని కృష్ణన్ (Nivaashiyni Krishnan) గ్లామర్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్ట్ను హీరో, తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రీపోస్ట్ చేశారు.చిన్న తప్పిదం!ఇది గమనించిన కొందరు నెటిజన్లు వెంటనే దాన్ని స్క్రీన్షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. జరిగిన తప్పును గ్రహించిన ఉదయనిధి.. వెంటనే సదరు పోస్ట్ను డిలీట్ చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అటు నివాశి గ్లామర్ పోస్ట్కు కామెంట్లను ఆఫ్ చేసింది. అప్పటికీ నెటిజన్లు ఆగడం లేదు.. వేరే పోస్టుల కిందకు వెళ్లి మరీ కామెంట్స్ చేస్తున్నారు. మా అన్న ఎలా ఉన్నారు? డీఎంకే పార్టీలోకి స్వాగతం అంటూ సెటైర్లు వేస్తున్నారు.ఎవరా బ్యూటీ?అటు ఉదయనిధి అభిమానులు మాత్రం ఆయన్ను వెనకేసుకొస్తున్నారు. పొరపాటను ఉదయనిధి చేయి టచ్ అయి అలా రీపోస్ట్ అయిందని సమర్థిస్తున్నారు. నివాశి విషయానికి వస్తే.. తమిళనాడు మూలాలున్న నివాశి సింగపూర్లో మోడల్గా రాణిస్తోంది. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గానూ పని చేసినట్లు తెలుస్తోంది. తమిళ బిగ్బాస్ ఆరో సీజన్లో కామనర్గా పాల్గొంది. ఓహో ఎంతన్ బేబీ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. Udhaya Anna 🤣❤️🔥 Sunday rowdy time Monday Ena time ??? 🤣 pic.twitter.com/tTjI2UkpNT— விழுப்புரம் கிருபா (@Admk_Kiruba) October 21, 2025 చదవండి: నేను, ఎన్టీఆర్.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీ -
టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు!
హీరో విశాల్ (Vishal) వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. అంతేకాదు అనూహ్యంగా మెగాఫోన్ పట్టడం విశేషం. ప్రస్తుతం మగుడం అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సూపర్గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదట రవి అరసును దర్శకుడిగా అనుకున్నారు. ఏమైందో ఏమో కానీ, ఇప్పుడు ఈ చిత్ర దర్శకత్వం బాధ్యతలను విశాల్ తన భుజాన వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన దీపావళి పండగ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో ఇది అనుకోకుండా జరిగిన విషయం కాదని, ముందుగా నిర్ణయించుకున్న విషయమేనని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ సహకారంతోనే మగుడం చిత్రానికి దర్శకత్వం బాధ్యతలను చేపట్టినట్లు చెప్పారు. దర్శకుడిగా..ఈయన మొదట తుప్పరివాలన్– 2 చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. దానికంటే ముందే మగుటం చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇకపోతే ఈ చిత్రం తరువాత సుందర్.సీ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు వీరి కాంబోలో 12 ఏళ్ల క్రితం మదగజరాజా తెరకెక్కింది. ఈ మూవీ ఎన్నో ఏళ్ల జాడ్యం తర్వాత ఈ ఏడాది విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా ఈ హిట్ కాంబో మరో చిత్రానికి సిద్ధం అవుతోంది. ఇద్దరు హీరోయిన్లుసుందర్.సీ చిత్రాల్లో కమర్షియల్ అంశాలు మెండుగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్ల అందాల ఆరబోత కచ్చితంగా ఉంటుంది. వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో విశాల్కు జంటగా మిల్కీబ్యూటీ తమన్నా, క్రేజీ బ్యూటీ కయాదు లోహర్ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
క్లుప్తంగా
అదుపుతప్పిన పోలీస్ వాహనం – డీఎస్పీ సహా ఇద్దరికి గాయాలు తిరువళ్లూరు: పూందమల్లి నుంచి తిరువళ్లూరు వెళుతున్న డీఎస్పీ వాహనం అదుపుతప్పిన సంఘటనలో డీఎస్పీ, కానిస్టేబుల్ గాయపడ్డారు. తిరువళ్లూరు జిల్లా ఎస్పి కార్యాలయంలో అమరవీరులకు నివాళులర్పించే అర్పించే కార్యక్రమం ఉదయం 6గంటలకు జరిగింది. కార్యక్రమానికి హాజరుకావడానికి పూందమల్లి నుంచి తిరువళ్లూరు డీఎస్పీ కుమరన్ ప్రభుత్వం వాహనంలో బయలుదేరారు. వాహనాన్ని రిజర్వ్ కానిస్టేబుల్ అరుల్రాజ్(25) నడిపారు. తిరువళ్లూరు సమీపంలోని మురుగంజేరి వద్ద కుక్క ను తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డీఎస్పీ కుమరన్(35), కానిస్టేబుల్ అరుల్రాజ్ ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న మనవాలనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ ఇద్దరిని చైన్నెలోని వైద్యశాలకు తరలించారు. 20 రోజుల్లో 9 కోట్ల మంది ప్రయాణం కొరుక్కుపేట: దీపావళి సీజన్లో ప్రయాణికుల ప్రయాణాలు సజావుగా ఉండేలా సదరన్ రైల్వే పటిష్ట చర్యలు తీసుకుందని సదరన్ రైల్వే చైన్నె డివిజినల్ రైల్వే మేనేజర్ శైలేంద్రసింగ్ తెలిపారు. గత 20 రోజుల్లో సదరన్ రైల్వేలో 9 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన సమావేశంలో మాట్లాడారు. దీపావళి పండుగ సీజన్లో పెరుగుతున్న డిమాండ్ను పరిష్కరించడానికి సదరన్ రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుందని అన్నారు. అదనపు రద్దీని తట్టుకునేందుకు సదరన్ రైల్వే ఇప్పటి వరకు 85 ప్రత్యేక రైలు సేవలను ప్రకటించిందని తెలిపారు . బైక్ను ఢీకొన్న కారు –తాత, మనవరాలు మృతి అన్నానగర్: బైక్ను కారు ఢీకొన్న ఘటనలో తాతమనవరాలు దుర్మరణం చెందారు. నైల్లె జిల్లాలోని పనగుడి సమీపంలోని వడకంకుళంకు చెందిన జోసఫ్ (65). ఇతను సెలూన్ దుకాణం నడుపుతున్నాడు. ఇతని కుమారుడు బాలసురేష్, కుమార్తె వర్ష (14). ఈమె ఆ ప్రాంతంలోని ఒక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ స్థితిలో సోమవారం మధ్యాహ్నం, జోసఫ్ మనవరాలిని బైక్లో ఎక్కంచుకుని వడక్కంకుళంలోని తన తోటకి వెళుతున్నాడు. నైల్లె–కుమరి నాలుగు లేన్ల రహదారిపై వెళుతుండగా కారు బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తాతమనవరాలు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పళవూరు సీఐ సురేష్కుమార్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఆసరిపల్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో కారు డ్రైవర్ పలయంకోట్టై ఎన్జీఓ కాలనీకి చెందిన 16 ఏళ్ల బాలుడని, అతను దీపావళికి ప్లస్వన్ చదువుతున్న తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో కన్యాకుమారికి వెళ్లాడని తెలిసింది. బాలుడి తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడి తండ్రి విదేశాల్లో ఉన్నందున పోలీసులు అతనిపై కేసు నమోదు చేయలేదు. అనాథాశ్రమంలో దీపావళి చాలా ఆనందం వేలూరు: దీపావళి పండుగను అనాథాశ్రమంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు ఇండియన్ రెడ్క్రాస్ ఆధ్వర్యంలో వేలూరు సమీపంలోని పొయిగై గ్రామంలో అనాథాశ్రమం ఉంది. కలెక్టర్ ఆశ్రమంలోని వారికి నూతన దుస్తులు అందజేసి స్వీట్లు పంచి దీపావళి పండుగను జరుపుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తన కుటుంబంతో కలిసి జిల్లా యంత్రాంగం పూర్తిగా ఆశ్రమంలో వేడుకలు జరుపుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇటువంటి అనాథాశ్రమంలో పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ అధికారులు కూడా జరుపుకోవాలన్నారు. ప్రస్తుతం రెడ్క్రాస్ సంఘం ఆధ్వర్యంలో ఆశ్రమంలోని వారికి అవసరమైన సౌకర్యాలను అందజేస్తున్నారని మరిన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్య క్రమంలో సబ్ కలెక్టర్ సెంథిల్కుమార్, రెడ్ క్రాస్ సంఘం చైర్మన్ ఉదయశంకర్, కార్యదర్శి పర్వద, కోశాధికారి పాండియన్, ఇంద్రకుమార్, అధికారులు పాల్గొన్నారు. -
వైభవంగా దీపావళి ఆస్థానం
గోవిందరాజప్వామి ఆలయంలో ఆస్థానంశ్రీకోదండరామస్వామి ఆలయంలో.. తిరుపతి కల్చరల్ : నగరంలోని పలు ఆలయాల్లో సోమవారం వైభవంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు. అందులో భాగంగా శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయం ప్రాంగణంలోని శ్రీపుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుంచి సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల మధ్య నూతన వస్త్రాలు, దీపాలు ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం దీపావళి ఆస్థానం జరిపించారు. పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ ఏఈఓ ఏబీఎన్ చౌదరి, సూపరింటెండెంట్ చిరంజీవి పాల్గొన్నారు. అలాగే శ్రీకోదండరామాలయంలో సోమవారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు దీపావళి ఆస్థానం ఘనంగా చేపట్టారు. ఈ సందర్బంగా శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలను కోదండరామునికి సమర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ , అధికారులు పాల్గొన్నారు. -
అమర వీరులకు ఘన నివాళి
వేలూరు: దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన అమర వీరులకు వేలూరు పోలీస్ గ్రౌండ్లో ఎస్పీ మయిల్వాగణన్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 653 మంది పోలీసులు వీరమరణం పొందారు. వీరికి శ్రద్ధాంజలి ఘటించేందుకు ప్రతి ఏడా ది అక్టోబర్ 21న పోలీసులు వీర వందనం చేయ డం ఆనవాయితీ. అందులో భాగంగా మంగళవా రం ఉదయం వేలూరులోని పోలీస్ గ్రౌండ్లో అమరవీరులకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ ప్రభు త్వ లాంచనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఎస్పీ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిఒక్కరూ దేశ రక్షణ కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. అనంతరం అడిషనల్ ఎస్పీ భాస్కరన్, డీఎస్పీ పయణి, అమరవీరులకు నివాళులర్పించారు. అదేవిధంగా తిరుపత్తూ రు, రాణిపేట జిల్లాల్లోను ఆయా ఎస్పీలు నివాళులర్పించారు. తిరువళ్లూరులో..తిరువళ్లూరు: భారత సరిఽహద్దులో విధులు నిర్వహిస్తూ అమరులైన జవాన్లకు తిరువళ్లూరు ఎస్పీ శ్రీనివాసపెరుమాల్, ఆవడి కమిషనర్ శంకర్ స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. ఆవడి కమిషనర్ కార్యాలయం, తిరువళ్లూరు ఎస్పీ కార్యాలయంలోనూ ప్రత్యేక స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. తిరువళ్లూరులో జరిగిన కార్యక్రమానికి ఎస్పీ వివేకానంద శుక్లా నేతృత్వంలో నివాళులర్పించారు. ఆవడిలో కమిషనర్ శంకర్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. -
ఇంటింటా మిన్నంటిన సంబరాలు
తిరుత్తణి: తిరుత్తణిలో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. సోమవారం దీపావళి సందర్భంగా తిరుత్తణిలో సందడి నెలకొంది. బంధువులు, స్నేహితులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు బాణసంచా కాల్చారు. మహిళలు తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించారు. తిరువళ్లూరులో.. తిరువళ్లూరు: దీపావళి పండుగను తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. సోమవారం ఉదయం నుంచే పట్టణంలో టపాసుల సందడి నెలకొంది. దయం ప్రారంభమైన టపాసుల మోత రాత్రి వరకు సాగింది. మార్కెట్, బజారు వీధిలో రద్దీ నెలకొంది. బాణసంచా దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. తిరుత్తణిలో టపాసులు కాలుస్తున్న దృశ్యం తిరువళ్లూరులో దీపావళి వేడుకలు -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 72,026 మంది స్వామివారిని దర్శించుకోగా 23,304 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.86 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంటనే ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు పరుగులు తీస్తూ చలువపందిళ్ల వద్దకు చేరుకుంటున్నారు. తిరుమల దుకాణాల్లో కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. -
తాగునీటి కోసం రాస్తారోకో
తిరుత్తణి: తాగునీటి కోసం గ్రామీణులు దీపావళి రోజు జాతీయ రహదారిలో రాస్తారోకో ఘటనకు సంబంధించి న్యాయవాదిపై సీఐ దాడి చేసిన ఘటన వివాదస్పదంగా మారింది. తిరుత్తణి యూనియన్లోని మురుక్కంపట్టు గ్రామ పంచాయతీలో ఎగువ మురుక్కంపట్టులో 200కు పైగా కుటుంబాలు నివాశముంటున్నాయి. పంచాయతీ ద్వారా గ్రామీణులకు పైప్లైన్లు ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈక్రమంలో వారం రోజుల నుంచి గ్రామంలో తాగునీటి సరఫరా ఆగడంతో గ్రామీణులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీపావళి సందర్భంగా మంగళవారం గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తడంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఖాళీ బిందెలతో మురుక్కంపట్టు వద్ద జాతీయ రహదారిలో రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో తిరుత్తణి సీఐ మదియరసన్ సిబ్బందితో వచ్చి రాస్తారోకో విరమించాలని కోరారు. ఈ సందర్భంగా ఆందోళనలో ఆ గ్రామానికి చెందిన అయ్యప్పన్ అనే న్యాయవాదిపై పోలీసులు చెయ్యి వేసుకోవడంతో గ్రామీణులు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. దీంతో న్యాయవాదిని పోలీసులు విడిచిపెట్టడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. బీడీఓ ఆదేశాల మేరకు గంట వ్యవధిలో తాగునీటిని గ్రామీణులకు సరఫరా చేశారు. -
తిరువళ్లూరులో భారీ వర్షం
– జనజీవనం అస్తవ్యస్తం తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షపాతం నమోదైంది. దీంతో పెద్దకుప్పం, వైష్ణవీనగర్, హంసానగర్, వేపంబట్టులోని కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వీరరాఘవుడి ఆలయం, మార్కెట్ వీధుల్లో మురుగునీటితో కలిసి వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండడంతో దుర్వాసన వెదజల్లింది. జిల్లాలో అత్యధికంగా గుమ్మిడిపూండిలో 6సెం.మీ వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా పళ్లిపట్టు ఆర్కేపేట ప్రాంతాల్లో 5 మి.మీ వర్షపాతం నమోదైంది. మొత్తానికి 263.80 మి.మీ వర్షపాతం సరాసరిన 17.59 శాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్ల నీటి మట్టం.. చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్ల నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. రెడ్హిల్స్ రిజర్వాయర్ మొత్తం నీటి సామర్ద్యం 21.20 అడుగులు కాగా ప్రస్తుతం 18.61 అడుగుల మేరకు నిల్వ వుంది. చోళవరం రిజర్వాయర్ మొత్తం నీటి సామర్ద్యం 18.86 అడుగులు కాగా ప్రస్తుతం 10.04 అడుగుల నీరు నిల్వ వుంది. చెమరంబాక్కంలో రిజర్వాయర్ నీటి మట్టం 24 అడుగులు కాగా ప్రస్తుతం 21.20 అడుగులకు నీరు చేరింది. చైన్నెకి తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్ సత్యమూర్తిసాగర్ పూండి మొత్తం నీటి సామర్ద్యం 35 అడుగులు కాగా ప్రస్తుతం 33 అడుగుల మేరకునీరు నిల్వ వుంది. కన్నన్కోట–తేరువాయి కండ్రిగ రిజర్వాయర్లో మొత్తం 36.61 అడుగుల నీటిని నిల్వ చేసుకునే అవకాశం వుండగా ప్రస్తుతం 34.37 అడుగుల నీరు నిల్వ వుంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రధాన రిజర్వాయర్ల నీటి మట్టం పూర్తి స్థాయికి చేరగా, చెరువులకు నీరు పెరిగింది. -
పరాశక్తికి నుంచి క్రేజీ అప్డేట్
తమిళసినిమా: ప్రస్తుతం రూపొందుతున్న క్రేజీ చిత్రాల్లో పరాశక్తి ఒకటి. నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో రవిమోహన్ ప్రతినాయకుడిగానూ, అధర్వ కీలక పాత్రలోనూ నటిస్తున్న ఇందులో క్రీజీ నటి శ్రీలీల నాయకిగా నటిస్తున్నారు. డాన్ ఫిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ పిరియాడికల్ కథా చిత్రానికి సుధాకొంగర కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈమె ఇంతకు ముందు ద్రోహి, ఇరుదు చుట్రు, సూరరై పోట్రు వంటి చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. కాగా ముగ్గురు స్టార్ హీరోలు నటిస్తుండడంతో పరాశక్తి చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడంలో సాధారణమే. ఇప్పటికే చిత్ర టైటిల్కు చాలా పెద్ద స్పందన రావడంతో పాటూ చిత్రంపై నానాటికీ ఆసక్తి పెరిగిపోతోంది. దాన్ని మరింత హైప్ చేసే విధంగా చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు దీపావళి సందర్భంగా ఓ క్రేజీ ఫొటోను విడుదల చేశారు. అందులో నటుడు అధర్వ, శివకార్తికేయన్, రవి మోహన్ కలిసి నడిసొస్తున్న దృశ్యం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిత్రాన్ని పొంగల్ సందర్భంగా 2026 జనవరి 14న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను రెడ్ జెయింట్ పిక్చర్స్ సంస్థ పొందడం మరో విశేషం. -
ఆనందోత్సాహాలతో.. దీపావళి
రాష్ట్ర ప్రజలు దీపావళి పండుగను సోమవారం ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పండుగ వేళ వర్షం కొన్ని చోట్ల పడ్డ, మరికొన్ని చోట్ల తెరపించడంతో బాణసంచా విక్రయాలు భారీగానే జరిగాయి. అలాగే వస్త్రాలు, స్వీట్లు, మాంసం అమ్మకాలు కూడా పెద్దఎత్తున సాగాయి. మొత్తం మీద రూ. 7 వేల కోట్ల వరకు టపాకాయల విక్రయం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నిబంధనలు ఉల్లంఘించి బాణసంచా అమ్మిన, కాల్చిన వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి. సాక్షి, చైన్నె: దీపావళి పర్వదినం రోజున రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు మిన్నంటాయి. ప్రజలు తలంటు స్నానాలు, కొత్తబట్టలు, పిండి వంటలు, స్వీట్ల పంపకాలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఇక చైన్నె శివారులోని మహాబలిపురంతో పాటూ పుదుచ్చేరి తదితర ప్రాంతాలలో విదేశీయులు దీపావళి సంబరాలలో భాగస్వాములయ్యారు. సినీ సెలబ్రటీలు తమ తమ కుటుంబాలతో పండుగను జరుపుకున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు బాణసంచా మోతను హోరెత్తించారు. కొన్నిచోట్ల వర్షం అంతరాయం కలిగించినా.. ఈ ఏడాది బాణసంచా విక్రయాలు జోరుగానే జరిగాయి. కొందరు అయితే, నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా బాణసంచా పేల్చడంతో పోలీసులు కన్నెర్ర చేశారు. కోయంబత్తూరు, తేని జిల్లాలోని అనేక గ్రామాల ప్రజలు పక్షులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా టపాకాయలు రహితంగా పండుగను జరుపుకున్నారు. ఇక బాణసంచా మోతతో చెత్తతో పాటూ వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. చైన్నెలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుంగుడి, ఆలందూరు పరిసరాలలో అమాంతంగా గాలిలో కాలుష్యం పెరిగింది. రోడ్లు కనిపించక పోవడంతో వానహదారులు అవస్థలు పడాల్సి వచ్చింది. చైన్నెలో 15 విమాన సేవలకు తీవ్ర ఆటంకం కలుగడంతో సేవలు ఆలస్యంగా జరిగాయి. బాణ సంచాతో పేరుకు పోయిన చెత్తను తొలగించేందుకు మంగళవారం ఉదయాన్నే చైన్నెలో 5 వేల మంది సిబ్బంది రంగంలోకి దిగారు. చైన్నెలోని 34 వేల వీధులలో సుమారు పెద్దఎత్తున చెత్త పేరుకు పోయింది. కేసులతో వాత.. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు బాణసంచా పేల్చేందుకు విధించిన సమయాన్ని అనేక చోట్ల ప్రజలు ఖాతరు చేయలేదు. రాత్రి 10 గంటల వరకు సైతం గాల్లో రంగు రంగుల బాణసంచా మారుమోగాయి. చైన్నె నగరంతో పాటూ ఆవడి, తాంబరంలలో గస్తీ పోలీసులు ఇష్టానుసారంగా నిబంధనలు ఉల్లంఘించి బాణసంచా పేల్చుతున్న వారిని పసిగట్టి కేసులతో వాతలు పెట్టారు. చైన్నెలో 319 మందిపై కేసులు పెట్టారు. అయితే రాష్ట్రంలో గతంలో కంటే ఈసారి అతిపెద్ద ప్రమాదాలు తక్కువే. అయితే చిన్నచిన్న ప్రమాదాలు ఎక్కువ. టపాకాయల కారణంగా గాయపడ్డ వారిని ఆస్పత్రులలో చేర్పించడంలో 108 సిబ్బంది విస్తృతంగా సేవలు అందించారు. చైన్నెలో 200 మంది వరకు గాయపడ్డారు. ఇక మంగళవారం సైతం పండగను అనేక మంది జరుపుకున్నారు. నోములు నోచి పూజలలో లీనమయ్యారు. ఇక పండుగ రోజైన సోమవారం మందుబాబులు పూటుగా మద్యాన్నితాగేశారు. రూ. 789 కోట్లకు మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. ప్రత్యేక బస్సులు.. దీపావళి సంబరాలు ముగియడంతో స్వస్థలాలకు వెళ్లిన జనం మంగళవారం సాయంత్రం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. వీరికోసం ఆయా మార్గాలు, వివిధ ప్రాంతాల నుంచి చైన్నె వైపుగా సాధారణ బస్సులతో పాటూ అదనంగా ప్రత్యేక బస్సులను రవాణా సంస్థ రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకుంది. చైన్నె వైపు 5,140 బస్సులను నడిపారు. టోల్ గేట్ల వద్ద కిలో మీటర్ల కొద్ది దూరం వాహనాలు బారులుదీరాయి. బుధవారం నగరంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు పకడ్భందీగా చర్యలు తీసుకున్నారు. కిలాంబాక్కం నుంచి ప్రయాణికులు నగరంలోకి వచ్చేందుకు వీలుగా దక్షిణ రైల్వే అదనపు ఎలక్ట్రిక్ రైలు సేవలకు నిర్ణయించింది. -
అమర వీరుల త్యాగాలకు వెలకట్టలేం!
సాక్షి, చైన్నె: పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం డీజీపీ కార్యాలయ ఆవరణలో పోలీసు స్మారక చిహ్నం వద్ద సీఎం స్టాలిన్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. పోలీసు కుటుంబ వారసులకు కారుణ్య ప్రాతిపదికన 175 మందికి ఉద్యోగ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 20 మందికి వారసులకు సీఎం స్టాలిన్ స్వయంగా ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. అలాగే విధి నిర్వహణలో మరణించిన పోలీసు అధికారుల కుటుంబాలకు బీమా మొత్తం, ఎక్స్గ్రేషియా మొత్తం రూ. 5.70 కోట్లు అందజేశారు. వివరాలు.. ప్రతి సంవత్సరం అక్టోబరు 21వ తేదీన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంగా అనుసరిస్తున్న విషయం తెలిసిందే. ఇందలో భాగంగా ఉదయాన్నే చైన్నె మెరీనా తీరంలోని పోలీసు డీజీపీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలోని పోలీసు స్మారక చిహ్నం వద్ద కు సీఎం స్టాలిన్ చేరుకున్నారు. ఆ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. ఈ సంస్మరణ దినోత్సవ వేడుకలో సీఎం పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కారుణ్య నియామకాలు.. అనంతరం తమిళనాడు పోలీసుశాఖలో పనిచేస్తున్నప్పుడు మరణించిన పోలీసు అధికారుల కుటుంబాలకు చెందిన 110 మందిని ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు, మరో 65 మందిని డేటా ఎంట్రీ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్ పోస్టులకు కారుణ్య నియామకం ప్రాతిపదికన ఉద్యోగాలను కేటాయించారు. విధి నిర్వహణలో మరణించిన తిరుప్పూర్ జిల్లా స్పెషల్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఎం. షణ్ముగవేల్, కృష్ణగిరి జిల్లా హెడ్ కానిస్టేబుల్ ఎస్. జాస్మిన్ మిల్టన్ రాజ్ కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వ జీతం ప్యాకేజీ పథకం కింద వ్యక్తిగత బీమా మొత్తంగా ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున చెక్కులను అందించారు. అలాగే విధి నిర్వహణలో మరణించిన విరుదునగర్ జిల్లా స్పెషల్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పి. విజయకుమార్, కృ ష్ణగిరి జిల్లా హెడ్ కానిస్టేబుల్ ఎస్. జాస్మిన్ మిల్టన్ రాజ్ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషియాగా రూ. 20 లక్షల చెక్కులను అందజేశారు. ప్రమాదాలలో మరణించిన వారికి తమిళనాడు ముఖ్యమంత్రి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా తమిళనాడు ప్రభుత్వ జీత ప్యాకేజీ పథకం కింద, వ్యక్తిగత ప్రమాద బీమా, తమిళనాడు ప్రభుత్వ ఎక్స్గ్రేషియా మొత్తాన్ని ముగ్గురు పోలీసుల సహా ఆరుగురి కుటుంబాలకు మొత్తం రూ. 5.70 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మురుగానందం, హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్ కుమార్, ఇన్చార్జ్ డీజీపీ జి. వెంకటరామన్, చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ ఎ. అరుణ్, ఐఏఎస్, సీనియర్ పోలీసు అధికారులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ వివేకానంద్ చౌబే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సత్యపాన్ బెహ్రా పాల్గొన్నారు. -
తొలి దీపావళి మూడ్లో కీర్తీసురేశ్
తమిళసినిమా: జీవితంలో ఎవరికై నా పెళ్లి ఒక పవిత్రమైన బంధం. అది మరువరాని మధురమైన అనుభూతి. ఇక సెలబ్రిటీస్ అయితే పెళ్లిని ఆడంబరంగా జరుపుకుంటారు. అలాంటిది నటి కీర్తీసురేశ్ మాత్రం తన పెళ్లిని అత్యంత సన్నిహితుల సమక్షంలో జరుపుకోవడం విశేషం. గత ఏడాది డిసెంబర్ నెలలో తన చిరకాల బాయ్ఫ్రెండ్ ఆంటోనీని పెళ్లాడారు. వీరి వివాహం గోవాలో జరిగింది. వివాహానంతరం నటించడానికి సిద్ధమైన కీర్తీసురేశ్కు ఇప్పుడు కొత్త అవకాశాలు వరిస్తున్నాయి. ఇకపోతే దీపావళి అంటేనే అందరిలోనూ వెలుగులు నింపే పండుగ. సినిమా వాళ్లు దీన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తుంటారు. అలా రజనీకాంత్ తన కుటుంబసభ్యులతో దీపావళి వేడుకను జరుపుకున్నారు. అదేవిధంగా త్రిష, హన్సిక పలువురు సినీ ప్రముఖులు దీపావళి వేడుకను జరుపుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా కీర్తీసురేశ్కు పెళ్లి అయిన తరువాత వచ్చిన తొలి దీపావళి ఇది. ఈ పండుగను ఈ అమ్మడు తన భర్తతో కలిసి ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఇద్దరూ టపాసులు కాల్సి ఆనందాన్ని పంచుకున్నారు. స్మిమ్మింగ్పూల్ పక్కన కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ముచ్చట్లు చెప్పుకున్నారు. కారులో షికారు చేశారు. అలా ఆహ్లాదకరమైన ప్రదేశంలో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ జంట అలా గడిపింది ఎక్కడ అన్నది మాత్రం తెలపలేదు. -
రెడ్ అలర్ట్
● బంగాళాఖాతంలో వాయుగండం ● ఉత్తర తమిళనాడు వైపుగా ప్రయాణం ● రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు ● చైన్నెలోనూ వాన జోరు ● 4 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 4 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ రాష్ట్రంలో ఈశాన్య రుతు పవనాలు తీవ్రరూపం దాల్చాయి. పలుజిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీనడం ఏర్పడడం, ఇది వాయుగుండంగా మారనుండడంతో వానలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో మొత్తం 19 జిల్లాలపై వరుణుడి ప్రభావం ఉండగా.. వాటిలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా, నాలుగు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ను వాతవరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. సాక్షి,చైన్నె: ఈశాన్య రుతు పవనాలు ఈనెల 16వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. పశ్చిమ కనుల వెంబడి జిల్లాలో వర్షాలు విస్తృతంగా కురుస్తూ వస్తున్నాయి. ఈ పరిస్థితులలో అరేబియా సముద్రంలో అల్పపీనడం రూపంలో పశ్చిమ కనులమల వెంబడి ఉన్న కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశి, తేని , నీలగిరి తదితర జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరుగా, మరికొన్ని చోట్ల అటవీ ప్రాంతాలలో భారీగా వర్షం పడుతూ వస్తోంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారనుండడంతో పశ్చిమ కనుమలలో వర్షం మరింత తీవ్రరూపం దాల్చనుంది. అదే సమయంలో మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారం సాయంత్రం వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర తమిళనాడు వైపుగా కదుతోంది. ఈ ప్రభావంతో రామనాథపురం, పుదుకోట్టై, మైలాడుతురై, నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, కడలూరు, విల్లుపురం జిల్లాలు, పుదుచ్చేరి, కారైకాల్లలో కొన్ని చోట్ల మోస్తరుగా, మరికొన్ని చోట్ల భారీగా వర్షాలు పడుతున్నాయి. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, విరుదునగర్, మదురై, తేని, దిండుగల్ జిల్లాలో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అధికారులతో సీఎం సమీక్ష ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత చైన్నె, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలు, మైలదుత్తురై, నాగపట్నం, తిరువారూర్ , తంజావూరు డెల్టా జిల్లాలలో భారీ వర్షాలకు ఇప్పటి వరకు కలిగిన నష్టాన్ని, వర్షం తీవ్ర తరం కానున్న సమయంలో చేపట్టిన ముందస్తు చర్యలను సీఎం ఎం.కె. స్టాలిన్ సచివాలయం నుంచి సమీక్షించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తోపాటూ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఆయా జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సముద్ర తీరం, లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి తీసుకున్న చర్యలు, సహాయక చర్యలను గురించి తెలుసుకున్నారు. ఈ జిల్లాల్లో సగటున 56.61 మి.మీ వర్షపాతం నమోదైనట్టు ఈ సమావేశంలో తేల్చారు. శిబిరాలలో ప్రజలకు ఆహారం, తాగునీరు , వైద్య తదితర అన్ని సౌకర్యాలను గురించి వివరాలు ఆరాతీశారు. తిరువళ్లూరు, చైన్నె, కాంచీపురం, చెంగల్పట్టు, మైలదుత్తురై, నాగపట్నం, తిరువారూర్ . తంజావూరు డెల్టా జిల్లాలలో వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. ఏదేని విపత్తులు ఎదురైన పక్షంలో తక్షణ విద్యుత్సహాయక చర్యల నిమిత్తం 51,639 విద్యుత్ స్తంభాలు, 1849 ట్రాన్స్ఫార్మర్లు , 1,187 విద్యుత్ కండక్టర్లు వంటి అవసరమైన అన్ని పరికరాలు సిద్ధంగా ఉన్నాయని ఈసందర్భంగా అధికారులు వివరించారు. వరి సేకరణ, నిల్వ, తరలింపు , మిల్లింగ్ను కూడా పరిశీలించారు. రైతులకు నష్టం, కష్టం అన్నది ఎదురు కాకుండా ముందస్తు చర్యలను విస్తృతం చ ఏయాలని సీఎం ఆదేశించారు. ఇక, చైన్నె మెట్రోపాలిటన్ నగరానికి సంబంధించి, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ ద్వారా మోటార్ పంపులు, యంత్రాలను ఉపయోగించి లోతట్టు ప్రాంతాల నుంచి వర్షపు నీటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలను మరమ్మతు చేయడానికి, సజావుగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ కంట్రోల్ రూమ్లో వర్షం గురించి వచ్చిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి, సీఎస్ మురుగానందం, రెవెన్యూ కార్యదర్శి సాయికుమార్, ప్రత్యేకపథకాలు అమలు విభాగం అదనపు కార్యదర్శి ప్రదీప్ యాదవ్, తమిళనాడు విద్యుత్ బోర్డు చైర్మన్ డాక్టర్ జె. రాధాకృష్ణన్, విపత్తు నిర్వహణ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి పి. అముద, కమిషనర్ సి. జి. థామస్ వైద్యన్, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ కమిషనర్ జె. కుమారగురుబరన్, జలవనరుల శాఖ కార్యదర్శి జె. జయకాంతన్, మైనర్ పోర్టుల శాఖ కార్యదర్శి డాక్టర్ ఆర్. సెల్వరాజ్, తమిళనాడు వినియోగదారులు పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎ. అన్నాదురై, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానంతరం 12 మంది ఐఎఎస్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని సీఎం స్టాలిన్ రంగంలోకి దించారు. వర్షాలు, వరదలు, విపత్తులు ఎదుర్కొనే దిశగా ఈబృందాలు జిల్లాలలోని అధికార యంత్రాంగాలను అలర్ట్ చేస్తూ ముందుకెళ్లనున్నాయి. మేట్టూరు జలాశయం నుంచి నీటి విడుదల చైన్నెలో వర్షంపాట్లుఉబరి నీటి విడుదల వర్షాల నేపథ్యంలో చైన్నె, శివారు జిల్లాలో నిండు కుండులుగా ఉన్న చెరువులు, రిజర్వాయర్లపై అధికారులు దృష్టి పెట్టారు. ముందు జాగ్రత్తగా నీటి విడుదలకు చర్యలు తీసుకున్నారు. చెంబరంబాక్కం రిజర్వాయర్ నుంచి సెకనుకు వంద క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయపురం చెరువు నుంచి సైతం నీటిని విడుదల చేస్తున్నారు. పళ్లికరణై, వేళచ్చేరి పరిసరాలలో ఉన్న చెరువులకు నీటి రాకను పరిశీలిస్తూ వస్తున్నారు. అడయార్ నది తీరం వెంబడి ఉన్న చెరువులపై దృష్టి కేంద్రీకరించడమే కాకుండా, ఆ తీరవాసులను అప్రమత్తం చేశారు. ఇక మేట్టూరు జలాశయం నుంచి ఉబరి నీటిని విడుదల చేస్తూ చర్యలు తీసుకున్నారు. వాగులు వంకలు అనేక జిల్లాలో పొంగిపొర్లుతుండడంతో రిజర్వాయర్లు, జలాశయాలలోకి వస్తున్న నీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవి నిండగానే ఉబరి నీటి విడుదలకు సిద్ధమయ్యారు. బుధ, గురువారాలలో విల్లుపురం, కడలూరు, మైలాడుతురై, రామనాథపురం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక చైన్నె, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే మరో 11 జిల్లాలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఇక, చైన్నె, శివారు జిల్లాలలో మంగళవారం ఉదయం నుంచి వాన కురుస్తోంది. ఈ వర్షాలు మూడురోజులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. వర్షం మరింత తీవ్రతరం కానుండడంతో చైన్నె కార్పొరేషన్ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. చైన్నెలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. శిబిరాలను సిద్ధం చేశారు. ఏదేని విపత్తు ఎదురైనపక్షంలో లోతట్టు ప్రాంత వాసులను శిబిరాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈశిబిరాలలో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇదిలా ఉండగా వాయుగుండం తుపాన్గా మారేనా లేదా? అన్నది బుధవారం తేలుతుందని వాతావరణ కేంద్రం అధికారి అముధ తెలిపారు. -
నవంబర్ 5 నుంచి ఐఐటీ మద్రాసులో గ్లోబల్ సదస్సు
కొరుక్కుపేట: ఐఐటీ మద్రాసు గ్లోబల్, గేట్స్ ఆధ్వర్యంలో గేట్స్ ఇండియా ఐసీటీ చానల్ సమిట్ 2025ను నవంబర్ 5 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐటీ మద్రాసు గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల మాదవ నారాయణ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సమ్మిట్కు 250 మందికి పైగా ఐసీటీ( ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ) ఛానల్ లీడర్లతో పాటూ టెక్నాలజీ ఇన్నోవేటర్లు, విధాన నిర్ణేతలు తదితరులు పాల్గొంటారని తెలిపారు. నవంబర్ 6వ తేదీన ఇండియా ఇంక్ ఎట్ ఫుల్ థ్రోటిల్ –ఫ్రమ్ ఇన్నోవేషన్ టూ గ్లోబల్ ఇంపాక్ట్ అనే అంశంపై ప్రత్యేక సెషన్ జరుగుతుందని వెల్లడించారు. హైదరాబాద్ వెళుతున్న విమానంలో సాంకేతిక సమస్య కొరుక్కుపేట: చైన్నె నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ ప్యాసింజర్ విమానంలో హటాత్తుగా సాంకేతిక సమస్య ఏర్పడటంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో 79 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు.. చైన్నెలోని మీనంబాక్కం విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు ఓ ప్రైవేట్ ప్యాసింజర్ విమానం మంగళవారం ఉదయం 6 గంటల కు చైన్నె దేశీయ విమానాశ్రయం నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. విమానంలో 74 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 79 మంది ఉన్నారు. విమానం రన్ వే పై ప్రారంభకాగానే ఫైలెట్ ఇంజిన్లో వైఫల్యాన్ని గుర్తించి వెంటనే విమానాశ్రయ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి రన్ వే పై ఆపారు. అనంతరం ఇంజినీర్లు మరమ్మతులు చేపట్టడం ఆలస్యం కావటంతో ప్రయాణికులను మరో విమానంలో హైదరాబాద్కు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. కాగా విమానంలో సాంకేతిక లోపాన్ని సకాలంలో గుర్తించటంతో పెనుప్రమాదం తప్పినట్లయ్యింది. విజయ్ పార్టీని దేవుడూ కాపాడలేడు! కొరుక్కుపేట: అన్నాడీఎంకే కూటమిలో చేరకపోతే విజయ్ పార్టీని దేవుడు కూడా కాపాడలేడని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయ్కుమార్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. మదురైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం స్టాలిన్ ప్రభుత్వం చెప్పడం ఒకటి , చేయటం మరొకటి అని ఎప్పటి నుంచో అన్నాడీఎంకే ప్రదాన కార్యదర్శి ఎడపాడి పళని స్వామి నిరంతరం చెబుతూనే ఉన్నాడన్నారు. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు సమయంలో రోడ్లన్నీ గుంతలతో నిండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అవి సరిచేయడంపై దృష్టిపెట్టాలని కోరారు. డీఎంకేను ఓడించే శక్తులన్నీ ఎడప్పాడి వెనుక నడవాలని, నటుడు విజయ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి లేకపోతే ఫలితం భిన్నంగా ఉంటుందన్నారు. విజయ్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి తమిళసినిమా: తన అభిప్రాయాలను నిర్భంగా వ్యక్తం చేసే నటి కస్తూరి. అలా ఆమె పలు వివాదాల్లో చిక్కుకున్నారు కూడా. తాజాగా నటుడు , తమిళగ వెట్రికళం పార్టీ అధ్యక్షుడు విజయ్కు ఓ సలహా ఇచ్చారు. తిరువణ్ణామలైలోని అన్నామలై స్వామిని దర్శించుకున్న నటి కస్తూరి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరూర్ ఘటన తరువాత విజయ్ తమిళగ వెట్రి కళగం నేతృత్వంలో కూటమి అన్నది కరెక్ట్ కాదన్నారు. ఆయన ఎన్డీఏ కూటమిలో చేరి కార్యక్రమాలను నిర్వహించడమే ఆయనకు మంచిదని పేర్కొన్నారు. ప్రస్తుతం తన పార్టీలో ఉన్న వారి నుంచి ఆయన బయటకు రావడమే శ్రేమస్కరం అన్నారు. ఈ పరిస్థితుల్లో విజయ్ సొంతంగా నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. ఇకపోతే ఎన్డీఏ కూటమి నుంచి టీటీవీ దినకరన్ బయటకు రావడానికి కారణం ఆయనకు అన్నాడీఎంకేతో ఏర్పడిన అభిప్రాయ భేదాలేనని, బీజేపీతో ఆయనకు ఎలాంటి సమస్య లేదని నటి కస్తూరి పేర్కొన్నారు. తంజావూరు ఆలయంలో పందకాల్ మహోత్సవం కొరుక్కుపేట: తంజావూరు ఆలయాన్ని నిర్మించిన రాజ రాజ చోళుని 1040వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక వేడుకలను ఈనెల 30, నవంబర్ 1 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈమేరకు మంగళవారం ఉదయం తంజావూరు ఆలయంలో పందకాల్ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాగంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలను చేపట్టారు. ట్రస్టీ బాబాజీ , ఇతర పాలకమండలి సభ్యులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఉదయ్నిధి దీపావళి శుభాకాంక్షలు.. భగ్గుమన్న బీజేపీ
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ్నిధి స్టాలిన్ దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పడం.. రాజకీయంగా దుమారాన్ని రేపింది. నమ్మకం ఉన్నవారికే.. అంటూ చేసిన కామెంట్పై బీజేపీ భగ్గుమంది. ఇది హిందువులపై వివక్షేనంటూ తీవ్రస్థాయిలో ఆ పార్టీ నేతలు విరుచుకుపడతున్నారు.తాజాగా ఉదయ్నిధి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘వేదికపైకి వచ్చినప్పుడు కొందరు నాకు పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు ఇచ్చారు. అయితే దీపావళి శుభాకాంక్షలు చెప్పడం కోసం కొందరు సంకోచించారు. ‘చెబితే వీడు ఎక్కడ కోపపడతాడేమో?’ అని అనుకుని ఉండొచ్చు. అందుకే నమ్మకం ఉన్నవారికి మాత్రమే శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని ఆయన అన్నారు.ఈ వ్యాఖ్యలపై(Udhayanidhi Stalin Diwali wish) బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ‘‘వాళ్లు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా హిందువులే. అందుకే మేం అందరికీ శుభాకాంక్షలు చెబుతాం" అంటూ ఉదయ్నిధి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఇతర మతాల విషయంలో ఇలా ఎందుకు చేయబోరని.. ఆయన వ్యాఖ్యలు హిందువులపై వివక్ష చూపుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన నమ్మకం ‘‘ఉన్నవారికి దీపావళి శుభాకాంక్షలు" అనే వ్యాఖ్యపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా తీవ్రంగా స్పందిస్తున్నారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ANS ప్రసాద్ స్పందిస్తూ.. హిందూ పండుగలపై డీఎంకే ప్రభుత్వం కనీస గౌరవం ప్రదర్శించబోదని మండిపడ్డారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడిని సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. అయినప్పటికీ ఎందుకనో డీఎంకే ప్రభుత్వం హిందూ మతంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తోంది. ఆ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది’’ అని ప్రసాద్ విమర్శించారు. ఇదిలా ఉంటే.. డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయ్నిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం అనేది సామాజిక అసమానతలకు మూలం అంటూనే.. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించకూడదు, నిర్మూలించాలి. ఇది డెంగీ, మలేరియా లాంటి వ్యాధిలా ఉంది అంటూ విమర్శించారు. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడగా.. దేశవ్యాప్తంగా కేసులు కూడా నమోదు కావడంతో కోర్టుల్లో విచారణ జరుగుతోంది.ఇదీ చదవండి: తమిళనాడు ఎలక్షన్స్.. వార్నీ.. అప్పుడే తొలి జాబితా రిలీజ్ -
తమిళనాడులో కుండపోత వర్షం.. చెన్నై పరిస్థితి దారుణం..
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై విమానాశ్రయంలో రన్వేపైకి నీళ్లు చేరడంతో ఎక్కడికక్కడే విమానాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఆదివారం రాత్రి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో, నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. తూర్పు తీర రోడ్డు (ECR) వెంబడి ఉన్న వేలచేరి, మేదవాక్కం, పల్లికరణై, నీలంకరై ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలోని అనేక ప్రాంతాల్లో ప్రయాణికులు మోకాలి లోతు నీటితో ఇబ్బంది పడ్డారు. వర్షాల నేపథ్యంలో జాగ్రత్త వహించాలని అధికారులు కోరారు.మరోవైపు.. భారీ వర్షం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారులతో సమావేశం అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీశారు. ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అందించాలని ఆదేశించారు. Heavy rain @aaichnairport. The runways are water-logged. @NewIndianXpress @ChennaiRains @praddy06 @IMDWeather #Chennaiairport #TamilNadu #ChennaiRains pic.twitter.com/lxlx6bdLYe— S V Krishna Chaitanya (@Krish_TNIE) October 20, 2025భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనా ప్రకారం.. చెన్నై, చెంగల్పట్టు, కడలూరు, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, పుదుచ్చేరి, కారైకల్, పరిసర జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 22 వరకు తమిళనాడు తీరప్రాంతంలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.@ChennaiRains @RainStorm_TN Heavy rains with gusty wind at Thoraipakkam #wetdiwali pic.twitter.com/rMl98JVZwV— Lakshmanan S (@Laxman190566) October 20, 2025కొండ ప్రాంతాలైన నీలగిరి, కల్లార్, కూనూర్ మధ్య కొండచరియలు విరిగిపడటంతో నీలగిరి మౌంటైన్ రైల్వే (NMR)లో రైలు సర్వీసులు రద్దు చేసింది. చెట్లు కూలిపోవడం వల్ల ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగిందని దక్షిణ రైల్వే తెలిపింది. అక్టోబర్ 19న మెట్టుపాళయం–ఉదగమండలం (రైలు నం. 56136 మరియు 06171), ఉదగమండలం–మెట్టుపాళయం (రైలు నం. 56137) సహా మూడు రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. Heavy rain on the bypass road in Chinnamanur, Theni districtand drizzling continues @ChennaiRains @MasRainman @RainStorm_TN @kalyanasundarsv @praddy06 pic.twitter.com/tudC0r5Gbn— Michael 🌿 (@michaelraj_GD) October 19, 2025 -
పట్టాభిరాంలో పేలుడు
సాక్షి, చైన్నె: చైన్నె శివారులోని పట్టాభిరాంలో ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఓ ఇంట్లో పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. పేలింది నాటు టపాసులా లేదా నాటు బాంబులా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. వివరాలు.. చైన్నె శివారులోని ఆవడి పరిధిలోని పట్టాభిరాంలో ఆదివారం రెండున్నర గంటల సమయంలో హఠాత్తుగా ఓ ఇంట్లో నుంచి భారీ శబ్దంతో పేలుడు చోటు చేసుకుంది. దీంతో పరిసరవాసులు ఉలిక్కి పడ్డారు. 20 నిమిషాలపాటూ పేలుళ్లతో ఆ ఇళ్లు 75 శాతం నేలమట్టం కావడంతో పరిసర వాసులు ఆందోళనతో పోలీసులకు సమాచారం అందించారు. ఆవడి పరిసరాల నుంచి అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. శిథిలాల కింద చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను గుర్తించారు. భారీ విస్పోటం జరిగే విధంగా పేలుడు జరగడంతో పేలింది నాటు టపాసులా లేదా నాటు బాంబులా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఛిద్రమైన మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుల వివరాలను సేకరించారు. మృతులలో తిరునెండ్రవూరుకు చెందిన యాసిన్(25), సునీల్(23) గుర్తించారు. మరో ఇద్దరు కూడా మరణించగా పేర్లు తెలియాల్సి ఉంది. అయితే, పేలుడు అనుమానాలకు దారి తీయడంతో ఆవడి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పేలింది నాటు బాంబులు అన్న అనమానాలు రావడంతో విచారణ వేగవంతం చేశారు. ఇటీవల కాలంగా వస్తున్న బాంబు బూచీల నేపథ్యంలో తాజాగా ఈ పేలుడు జరగడంతో మృతి చెందిన వారు ఏదేని కుట్రలకు వ్యూహ రచన చేస్తు్ండగా ఈ ఘటన చోటు చేసుకుందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆవడిలోని దండురై ప్రాంతం అదల్ పట్టాభిరామ్లోని వ్యవసాయ వీధికి చెందిన ఆర్ముగం(50) కుమారుడు విజయ్ శ్రీపెరంబదూరు పరిసరాల నుంచి నాటు టపాసులు కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముత్తున్నట్టుగా కూడా విచారణలో వెలుగు చూసింది. మరణించిన ఇద్దరు బాణసంచా కొనుగోలు చేయడానికి వచ్చినట్టుగా భావిస్తున్నారు. -
తిరుత్తణి ఆలయంలో రద్దీ సాధారణం
తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉండడంతో భక్తులు అతి తక్కువ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. పెరటాసి నెల ముగియడంతోపాటు దీపా వళి పండుగకు ముందు ఆదివారం తిరుత్తణి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొండ ఆలయంలో తక్కువ సంఖ్యలో భక్తులు చేరుకుని పది నిమిషాల వ్యవధిలో స్వామిని దర్శించుకున్నారు. నిత్యం రద్దీగా ఉంటూ గంట నుంచి రెండు గంటలపాటు వేచివుండి స్వామిని దర్శించకోవడం పరిపాటి. అయితే పెరటాసి నెల సందర్భంగా దీక్షలు చేపట్టి మాంసాహారం వీడిన భక్తులు వెంకటేశ్వర స్వామి మాలధారణ చేశారు. పెరటాసి ముగియడంతో దీక్ష విరమణ చేసిన జనం దీపావళికి ముందు రోజుతోపాటు ఆదివారం కావడంతో మాంసాహారం రుచి చూపేందుకు ఆసక్తి చూపారు. అలాగే దీపావళి పండుగ బిజీలో ఉన్న జనం కొండకు వెళ్లి స్వామి దర్శనానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో కొండ ఆలయంలో స్వామి దర్శనానికి తక్కువ సంఖ్యలో జనం వచ్చారు. అతి తక్కువ సమయంలో స్వామి ని దర్శించుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు. -
పూండి రిజర్వాయర్ సందర్శన
తిరువళ్లూరు: పూండి రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరిన క్రమంలో దిగువకు మిగులు జలాలను అధికారులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రతాప్ అధికారులతో కలిసి రిజర్వాయర్ను పరిశీలించారు. చైన్నెకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్ సత్యమూర్తిసాగర్ రిజర్వాయర్. రిజర్వాయర్ నీటి మట్టం 35 అడుగులు. గత కొద్ది రోజులుగా ఆంధ్రా, వేలూరు, రాణిపేట నుంచి వచ్చిన వరదలతో రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. దీంతో గత నాలుగు రోజుల క్రితం సెకనుకు 4వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్కు 2వేల క్యూసెకుల నీరు వస్తోంది. దీంతో అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రతాప్, ఆర్డీఓ రవిచంద్రన్, తహశీల్దార్ బాలాజీతోపాటు ఇతర ఉన్నతాధికారులు పూండి రిజర్వాయర్ను పరిశీలించారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, కరకట్ట బలోపేతం, ముంపు గ్రామాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపుతోపాటు ఇతర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. దీంతో పాటు షట్టర్ల పనితీరును అడిగి తెలుసుకున్న కలెక్టర్, అధికారులు అప్రమత్తంగా పని చేయాలని ఆదేశించారు. -
స్టాలిన్ వైద్య శిబిరంలో మంత్రి తనిఖీలు
తిరుత్తణి: ఆరోగ్యాన్ని రక్షించే స్టాలిన్ వైద్య శిబిరంలో మంత్రి సుబ్రహ్మణ్యన్ తనిఖీలు చేపట్టి, అర్హులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. తిరువలంగాడులో ఆరోగ్య శాఖ ద్వారా ఆరోగ్యం రక్షించే స్టాలిన్ వైద్య శిబిరం నిర్వహించారు. మెగా వైద్య శిబిరంలో వందకు పైగా వైద్యుల బృందం పాల్గొని, 43 రకాల వైద్య సేవలు అందించింది. ప్రధానంగా పెల్ డాడీ పరిశోధన ఉచితంగా నిర్వహించారు. చిన్నారులు, గర్భిణులు, మహిళలు, యువకులు సహా అందరికీ మెరుగైన వైద్య సేవలు చేశారు. శిబిరంలో ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ పాల్గొని, వైద్య సేవలకు సంబంధించి ఏర్పాటు చేసిన శిబిరాన్ని పరిశీలించారు. తిరువలంగాడు వ్యాప్తంగా నుంచి నాలుగు వేల మంది పాల్గొని వైద్య సేవలు పొందిన మెగా శిబిరం ద్వారా వైద్యులు అందుబాటులో ఉంచి పరికరాలను తనిఖీ చేశారు. ఇందులో తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్, తిరువళ్లూరు ఎమ్మెల్యే రాజేంద్రన్. జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ప్రియారాజ్, సహా వైద్యులు పాల్గొన్నారు. -
రేపు తుమ్మలగుంటలో నరకాసుర వధ
తిరుపతి రూరల్: దీపావళి వేడుకల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం సోమవారం తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద నరకాసుర వధ నిర్వహించనున్నారు. ఇందుకోసం రూ.2లక్షల వ్యయంతో 20 అడుగుల నరకాసుర ప్రతిమను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్రెడ్డి, హర్షిత్రెడ్డి మాట్లాడుతూ సోమ వారం సాయంత్రం 5.30 గంటలకు నరకాసుర వధ కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రతిమకు బాణసంచా అమర్చిన నేపథ్యంలో ఎవరికీ అపాయం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయా లని ఆలయ అధికారులు, సిబ్బందికి సూచించారు. -
కరూర్ బాధితులకు టీవీకే పరిహారం పంపిణీ
తమిళసినిమా: గత నెల 27న కరూర్ జిల్లా, వేలుసామి పురంలో తమిళగ వెట్రికళం పార్టీ తరుపున ఆ పార్టీ అద్యక్షుడు విజయ్ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు తీవ్ర ద్విగ్బ్రాంతికి గురి అయిన విజయ్ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో మృతి చెందిన ఒక్కొక్కరికి నష్టపరిహారంగా రూ.20 లక్షలు, గాయాల పాలైన వారికి తలా రూ.2 లక్షలు అందించినున్నట్లు ప్రకటించారు. ఈయన ఇచ్చిన మాట ప్రకారం శనివారం మృతుల కుటుంబాల బ్యాంకు ఖాతాలకు పరిహారం అందజేశారు. అదేవిధంగా గాయాల పాలయిన వారి బ్బాంకు వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు ఆ పార్టీ నిర్వాహకులు వెల్లడించారు. దీంతో నష్ట పరిహారం అందిన వారి కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న విజయ్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. కాగా గాయపడిన వారిని త్వరలో విజయ్ నేరుగా కలిసి ఓదార్చుతారని పార్టి నిర్వాహకులు పేర్కొన్నారు. విజయ్ ప్రజల ముందు నటించరు.. కాగా నటుడు, తమిళగ వెట్రి కళంగం పార్లీ అద్యక్షుడు విజయ్ ప్రజల ముందు నటించరు అని నటి నీలిమా పేర్కొన్నారు. ఈమె తిరుపాచ్చి చిత్రంలో నటుడు విజయ్కు చెల్లెలిగా నటించి గుర్తుంపు పొందారు. కాగా నటి నీలిమా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ప్రకటనలో పేర్కొంటూ విజయ్ షూటింగ్లో షాట్ పూర్తి కాగానే పక్కకు వచ్చి సైలెంట్గా కూర్చుంటారని, ఎవరితోనూ మాట్లాడరని ఎవరైనా పలకరిస్తేనే మాట్లాడతారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి రాజకీయ పార్టీని ప్రారంభిస్తే ఏమౌతుందో అని అందరూ భావించారన్నారు. అయితే ఆయన ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఆయనలో చాలా మార్పు వచ్చిందన్నారు. విజయ్ చాలా శక్తివంతమైన వ్యక్తిగా మారారని, ఆయన్ని ఇప్పుడు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. విజయ్ ప్రజల ముందు నటించరని, ఆయన రాజకీయాల్లోకి రావడం ప్రజల అదృష్టం అని నటి నీలిమ పేర్కొన్నారు. -
శివాజీ అభిమానుల ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
వేలూరు: వేలూరు కర్ణన్ శివాజీ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో వేలూరు వేలపాడిలోని అనాథాశ్రమంలో దీపావళి పండుగ వేడుకలను జరుపుకున్నారు. ముందుగా ఆణికులతమ్మన్ ఆలయ ధర్మకర్త సెల్శివ అధ్యక్షతన మాజీ కార్పొరేటర్ పీపీ చంద్రప్రకాష్, నిర్వహకులు ఆశ్రమంలోని వృద్ధులకు, చిన్ని పిల్లలకు అన్నదానం చేయడంతో పాటు వారికి నూతన దుస్తులు అందజేసి స్వీట్లు పంచి పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదం లడ్డులను అందజేశారు. అదే విధంగా వృద్ధుల వద్ద టపాకాయాలు పేల్చి దీపావళి పండుగ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ అభిమానుల సంఘం నిర్వాహకులు గంగాధరన్, భూపతి, సుందర్, మణి, రవీంద్రన్ పాల్గొన్నారు.


