breaking news
Tamil Nadu
-
కాంగ్రెస్ ఎంపీ చైన్ కొట్టేసిన దొంగ..
న్యూ ఢిల్లీ: రోజురోజుకీ చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు వేసుకొని బైక్పై వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళల బంగారాన్ని ఎత్తుకెళ్తున్నారు. తాజాగా ఈ అనుభవం ఓ మహిళా ఎంపీకి కూడా ఎదురైంది కాంగ్రెస్ మహిళా ఎంపీ సుధా రామకృష్ణన్ చైన్ దొంగతనానికి గురైంది. ఢిల్లీలో ఉదయం వాక్ చేస్తున్న సమయంలో తన మెడలోని గొలుసు దొంగలు కొట్టేశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఉదయం 6 గంటల సమయంలో ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలోని పోలాండ్ రాయబార కార్యాలయం సమీపంలో తోటి శాసనసభ్యడు, డీఎంకేకు చెందిన రాజాతితో కలిసి వాకింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపారు. దొంగ తనా మెడ నుంచి గొలుసును లాగడంతో, ఆమె మెడపై గాయాలయ్యాయని, తన చుడిదార్ కూడా చిరిగిపోయిందని ఫిర్యాదులో తెలిపారు.అదే విధంగా ఢిల్లీలో శాంతిభద్రతలను పర్యవేక్షించే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా ఆమె లేఖ రాశారు. స్కూటర్పై హెల్మెట్ ధరించిన వ్యక్తి తన గొలుసును లాక్కెళ్లాడని ఆమె పేర్కొన్నారు. కాగా సుధా రామకృష్ణన్ తమిళనాడులోని మైలదుత్తురై నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆమె ఢిల్లీలో ఉన్నారు. -
ధీరన్కు ఘన నివాళులు
●సీఎం పుష్పాంజలి సాక్షి, చైన్నె: స్వాతంత్య్ర సమరయోధుడు ధీరన్ చిన్నమలైకు ఆదివారం సీఎం స్టాలిన్ పుష్పాంజలి ఘటించారు. ధీరన్ చిన్నమలై 220వ వర్ధంతి సందర్భంగా చైన్నె, ఈరోడ్, నామక్కల్లలో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పలు పార్టీల నేతలు అంజలి ఘటించారు. స్వాతంత్య్ర సమరంలో ధీరన్ చిన్నమలై వీరోచిత పోరాటం అజరామరం. ఆయన్ను స్మరించే విధంగా చైన్నె గిండి తిరువీకా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గుర్రుంపై ధీరన్ స్వారీ చేస్తున్నట్టుగా విగ్రహాన్ని కొలువు దీర్చి ఉన్నారు. ఇక్కడ ఉదయం సీఎం స్టాలిన్, మంత్రులు శేఖర్బాబు, ఎం సుబ్రమణియన్, స్వామినాథన్, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, మేయర్ ప్రియ తదితరులు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన సేవలను నెమర వేసుకున్నారు. అనంతరం అన్నాడీఎంకే నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు తంబిదురై, జయకుమార్, పొన్నయ్యన్, గోకుల ఇందిరా తదితరులు పుష్పాంజలి ఘటించారు. అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరనన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, ప్రధాన కార్యదర్శి జీఆర్ వెంకటేష్తో పాటూ పలు పార్టీల నేతలు నివాళులర్పించారు. ఇక ఈరోడ్, నామక్కల్లలోని ధీరన్ చిన్నమలై స్మారక మందిర, మణి మండపంలలో పలు పార్టీల నాయకులు అంజలి ఘటించారు. బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షుడు అన్నామలై, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్, అన్నాడీఎంకే మాజీ మంత్రి తంగమణిలతో పాటూ పలు వురు నేతలు నివాళులర్పించారు. చైతన్య యాత్రలో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి తిరునల్వేలిలో ధీరన్ చిన్నమలై చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. -
ముక్తికి మార్గం..భక్తే
కొరుక్కుపేట: ముక్తికి మార్గం భక్తి ఒక్కటే అని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉపదేశించారు. భారతీయత వాహిని– చైన్నె ఆధ్వర్యంలో భక్తి –ముక్తి పేరిట ప్రవచన సార్వభౌమ ,బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు రెండు రోజుల ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ముందుగా బ్రహ్మశ్రీ చాగంటిని భారతీయతా వాహిని– చైన్నె నిర్వాహకులు పివి ఆర్ కష్ణారావు తదితరులు ఘనంగా సన్మానించారు.అనంతరం ఆయన కుటుంబం, ధర్మం, భక్తి, భగవంతుని సేవ అనే అంశాలతో సుదీర్ఘంగా భక్తి –ముక్తి పై ప్రవచనం చేశారు. భగవంతుని గురించి ఎంత చెప్పినా తక్కువే అని పేర్కొన్నారు. భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటే భక్తుడికి కూడా భగవంతుని శక్తి లభిస్తుందన్నారు.ఎన్నో కోట్ల జన్మల ఫలం మానవుడి జన్మ అని , ఆ జన్మను సార్థకం చేసుకోవాలన్నారు. ఏది జరిగిన మన మంచికే అనే నమ్మకంతో మానవాళి ముందుకు సాగాలని అన్నారు. ధర్మాన్ని కాపాడే శక్తి ఒక్క మానవుడికి మాత్రమే సాధ్యం అని అందుచేత ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేయాలని ఉపదేశించారు. ఏ వ్యక్తి అయినా నిర్మల, నిశ్చలమైన భక్తిమార్గంలో పయనిస్తే తద్వారా వారికి లభించే ఫలితాంశం అద్భుతం, అమతమయం అని వ్యాఖ్యానించారు. భగవంతుణ్ని ప్రేమించడంలో, పూజించడంలో, సేవించడంలో, కీర్తించడంలో కలిగే అనురాగమే భక్తి అని ఉపదేశించారుప్రతి జీవిపై ప్రేమ కలిగి ఉండటమే నిజమైన భక్తి అంటూ భక్తి గురించి వివరించారు. మనుషులు గర్వాన్ని విడనడాలి, ధర్మవైపు పయనించాలి అని ఉద్భోదించారు. భగవంతుడు వాక్కు ఇచ్చారని ఆ వాక్కు ఇతరులను నొచ్చుకోకుండా మంచి మాటలతో సంతోషపెట్టాలని అన్నారు. మంచి మనసుతో తపస్సు చేస్తే భగవంతుడు దయ, కరుణ లభిస్తుందన్నారు. కార్యక్రమంలో శ్రీసిటీ అధినేత రవి సన్నారెడ్డి, తెలుగు ప్రముఖులు ఊరా లక్ష్మీ నరసింహా రావు, అజంతా డాక్టర్ కె. శంకర రావు, అనిల్ కుమార్ రెడ్డి, నారాయణ గుప్తాతో పాటు నగర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. -
ఘనంగా హై–టెక్ హెల్త్కేర్ వార్షికోత్సవం
సాక్షి, చైన్నె: ప్రముఖ గుండె సంరక్షణ సంస్థ హైటెక్ హెల్త్ కేర్ 15వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక ‘వేవ్పూల్’ పేరిట నిర్వహించారు. చైన్నె, సేలంలో వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో ఆ సంస్థ సీఈఓ డాక్టర్ ఎస్ సెంథిల్ కందీపన్ మాట్లాడుతూ తాము పూర్తి స్థాయిలో పని చేసినప్పటికీ, గత పదిహేను సంవత్సరాలలో, పదిహేను నెలల కంటే ఎక్కువ సమయం అనుభూతి చెందలేదన్నారు. కాలం గడిచి పోతుందనేందుకు హృదయ స్పందన మీద ప్రత్యేక దృష్టి పెట్టడమేనని వ్యాఖ్యానించారు. ప్రతిరోజూ 25,000 మంది రోగులుకు తాము సేవలు అందిస్తూ వస్తున్నామని గుర్తు చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో హెల్త్వాచ్ పేరిట ఆకట్టుకునేలా లక్ష్యం, వృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. హెల్త్వాచ్ ప్రతిభతో పాటుగా అత్యుత్తమ సిబ్బంది సహకారానికి గుర్తింపుగా వివిధ విభాగాలలో అవార్డులను గుర్తింపును పొందామని వివరించారు. రాబోయే సంవత్సరానికి ఒక మార్గాన్ని నిర్దేశించుకున్నామని పేర్కొంటూ, దక్షిణ తమిళనాడులోని వృద్ధుల కోసం రోజువారీ సంరక్షణ , గృహాలకు ఉచిత క్యాంప్లపై దృష్టి పెట్టామన్నారు. ఆరోగ్య సంరక్షణ్ఙ సూత్రం ఆధారంగా రూపొందించబడినట్టుగా, బ్రాండెడ్ మందులు, రోజువారీ నిత్యావసరాలు, స్నేహపూర్వక సహకారం, కుటుంబ క్లినిక్, ఉచిత హోమ్ డెలివరీ , ఇంటి వద్దే రక్త నమూనా సేకరణ, ఫిజియోథెరపీ వంటి అంశాలను విస్తృతం చేయనున్నామని ప్రకటించారు. -
రోజుకు 20 నియోజకవర్గాలపై దృష్టి: ఉదయనిధి నిర్ణయం
సాక్షి, చైన్నె: మళ్లీ అధికారం నినాదంతో డీఎంకే యువజన ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ రోజుకు 20 అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టి, యువ నేతలతో ఉత్సాహాన్ని నింపేందుకు సిద్ధమయ్యారు. డీఎంకేను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సీఎం, ఆపార్టీ అధ్యక్షుడు స్టాలిన్ విస్తృతంగా ముందడుగు వేస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు సీఎంగా అధికారికి కార్యక్రమాలు, మరో వైపు పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పరంగా కార్యక్రమాలు, నియోజకవర్గ నేతలతోభేటీలతో ఉరకలు తీస్తున్నారు. ఆయనకు తోడుగా తాను సైతం అంటూ ఉదయ నిధి స్టాలిన్ రంగంలోకి దిగేందుకు నిర్ణయించారు. ఇక, రోజుకు 20 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సంప్రదింపులు జరపున్నారు. యువజన విభాగంతో పాటుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో నియోజకవర్గాల వారీగా సంప్రదింపు, అక్కడి పరిస్థితులు, బలపేతం, కార్యక్రమాలు విస్తృతానికి యువతను రంగంలోకి దించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇక రోజూ ఉదయం ఆయన నియోజకవర్గల నేతలతో క్యాంప్ కార్యాలయం లేదా, యువజన విభాగం కార్యాలయం అన్బగం నుంచి సమాచనలకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. -
సోషల్ మీడియాదే కీలక పాత్ర
తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియాదే కీలకమని, ఈమేరకు డీఎంకే విజయానికి యువజన విభాగం శ్రేణులు సోషల్ మీడియాను విరివిగా వినియోగించి ప్రచారం చేపట్టాలని మంత్రి నాజర్ అవగాహన కల్పించారు. తిరువళ్లూరు వెస్టు డీఎంకే యువజన విభాగం ఆధ్వర్యంలో తిరుత్తణి నియోజకవర్గం స్థాయిలోని 330 బూత్లకు సంబంధించిన యువజన విభాగం సోషియల్ మీడియా విభాగ శ్రేణులకు అవగాహన తరగతులు తిరుత్తణిలో ఆదివారం నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే చంద్రన్ అధ్యక్షత వహించారు. జిల్లా యువజన విభాగం తన్వీనర్ కిరణ్ స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి నాజర్ పాల్గొని యువజన విభాగం సోషల్ మీడియా విభాగం శ్రేణులకు అవగాహన కల్పించారు. గతంలో గ్రామ గ్రామానికి ప్రచారానికి వెళ్లడం, పత్రికలు, టీవీలు ద్వారా ప్రచారం చేసుకునే అవకాశం వుండేదని, అయితే మారిన క్రమంలో ప్రతి ఒక్కరి వద్ద అత్యాధునిక సెల్ఫోన్లు రావడంతో సామాజిక మాధ్యమాల పాత్ర చాలా వరకు పెరిగిందని, ఎప్పటికప్పుడు అన్ని ఘటనలూ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, విమర్శలు, ప్రతి విమర్శనలను తిప్పి కొట్టేందుకు, ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు చేర్చేందుకు సామాజిక మధ్యమాలు కీలకంగా మారయన్నారు. ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల పాత్ర విలువైనది కావడంతో యువత ఉత్సాహంగా సామాజిక మాధ్యమాలు వినియోగించుకోవాలని సూచించారు. -
తిరుత్తణి ఆలయంలో ఆడిపెరుక్కు సందడి
తిరుత్తణి: తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆడిపెరుక్కు సందర్భంగా ఆదివారం భక్తజన సందడి నెలకొంది. ఆడిపెరుక్కుతో పాటూ ఆదివారం సెలవు దినం కావడంతో కొండకు భక్తులు పోటెత్తారు. వేకువజామున మూలవీరాట్కు సుగంధద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించి బంగారు కవచం అలంకరణలో మహాదీపారధన నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు కొండ ఆలయంకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు కావళ్లతో కొండ ఆలయం చేరుకుని మురుగనుక్కు హారోహర నామస్మరణతో ఆలయ మాడ వీధుల్లో భక్తులు సందడి చేసారు. ఉచిత క్యూలైన్లో మూడు గంటలు, రూ. 100 ప్రత్యేక దర్శన మార్గంలో గంటపాటు వేచివుండి భక్తులు స్వామి దర్శనం చేసి కావళ్లు చెల్లించి దర్శనం చేసారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 40 వేలకు పైగా భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. -
చెట్టును ఢీకొన్న కారు
● మహిళ సహా ముగ్గురు మృతి ● బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఘటన ● ఆర్కేపేట వద్ద విషాద ఘటన పళ్లిపట్టు: చింతచెట్టును కారు ఢీకొన్న ఘటనలో మహిళ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆర్కేపేట ప్రాంతంలో విషాదాన్ని మిగిల్చింది. ఆర్కేపేట సమీపంలోని చిత్తూరు రాష్ట్ర రహదారిలో వేలన్కండ్రిగ వద్ద చింతచెట్టును వేగంగా కారు ఢీకొన్న ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో పయనించిన మహిళ సహా నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికుల సాయంతో ఆర్కేపేట పోలీసులు కారు నుంచి వెలికితీసి 108 ఆంబులెన్స్ సాయంతో తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మహిళ మృతి చెందింది. మరోవ్యక్తి తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసుల విచారణలో హోసూరుకు చెందిన రంగస్వామి భార్య కన్నగి(58), ఆమె కుమారుడు కార్తి(37), వారి బందువులు స్టాలిన్(46), సంపత్కుమార్(45) కారులో ప్రయాణించినట్లు తెలిసింది. ఐదుగురు కారులో హోసూరు నుంచి ఆదివారం ఉదయం బయల్దేరి తిర్తుతణి సమీపంలోని నల్లాటూరులో బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం తిరుగు పయనమయ్యారు. ఆర్కేపేట వద్ద చిత్తూరు రాష్ట్ర రహదారి వేలన్కండ్రిగ వద్ద చింతచెట్టును కారు ఢీకొన్న ఘటనలో స్టాలిన్, సంపత్కుమార్ సంఘటన ప్రాంతంలోనే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నగి ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్కేపేట సీఐ జ్ఞానశేఖర్ తెలిపారు. తీవ్ర గాయాలైన కార్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్కేపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తూత్తుకుడిలో కొత్త టెర్మినల్
– నేడు తూత్తుకుడికి సీఎం సాక్షి, చైన్నె: తూత్తుకుడి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ను ప్రయాణికుల సేవల నిమిత్తం ఆదివా రం తెరిచారు. చైన్నె నుంచి తొలి విమానం ఈ టెర్మినల్లో ల్యాండ్ అయింది. తూత్తుకుడి విమానాశ్రయాన్ని ఇటీవల అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఇది వరకు చైన్నె, బెంగళూరుకు మాత్రమే విమాన సర్వీసులు నడిచేవి. ప్రసిద్ధి చెందిన తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్య స్వామి దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తుల రాక పెరిగింది. అలాగే తూత్తుకుడి, తిరుచెందూరు, కులశేఖర పట్నం పరిసరాలు, తిరునల్వేలి పరిసరాలు పారి శ్రామికంగా ప్రగతి పథంలోకి పయనిస్తున్నాయి. దీంతో తూత్తుకుడి విమానాశ్రయాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకున్నారు. దక్షిణ తమిళనాడు లోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న విమానయాన అవసరాలను తీర్చడానికి సుమారు రూ.450 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన తూత్తుకుడి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి మోదీ గత నెల 26వ తేదీన ప్రారంభించారు. తూత్తుకుడి విమానాశ్రయంలోని కొత్త టెర్మినల్ భవనం లోపల తమిళ సంస్కృతి సంప్రదాయాలు, తూత్తుకుడి హార్బర్, మత్స్య సంపద, తిరుచెందూరు ఆలయ శోభను చాటే రీతిలో పెయింటింగులను తీర్చిదిద్దారు. ఈ విమానాశ్రయాన్ని 17,340 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించారు. కొత టెర్మినల్ రద్దీ సమయాల్లో 1,350 మంది ప్రయాణికులకు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ విమానాశ్రయ టెర్మినల్ను వారం రోజు ల తర్వాత ఉపయోగంలోకి తెచ్చారు. ఆదివారం ఉదయం చైన్నె నుంచి వచ్చిన విమానాన్ని ఈ టెర్మినల్లోకి అనుమతించారు. ఈ టెర్మినల్ నుంచి బయటకు వచ్చిన ప్రయత్ణికులకు విమానాశ్రయ వర్గాలు స్వీట్ బాక్సులు, పుష్పగుచ్ఛాలను అందజేసి ఆహ్వానం పలికాయి. ఇదే టెర్మినల్ నుంచి ప్రయాణికుల రాక పోకలకు శ్రీకారం చుట్టారు. నేడు తూత్తుకుడికి సీఎం తూత్తుకుడి విమానాశ్రయ కొత్త టెర్మినల్లోకి సీఎం స్టాలిన్ సోమవారం అడుగు పెట్టనున్నారు. తూత్తుకుడిలో రూ.16 వేల కోట్లతో తమిళనాడులో ప్రప్రథమగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమ రూపుదిద్దుకుంది. ఇక్కడ వియత్నాంకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ప్రారంభోత్సవంతోపాటుగా తొలి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించేందుకు తూత్తుకుడికి సీఎం వెళ్లనున్నారు. చైన్నె నుంచి విమానంలో ఆయన వెళ్తారు. తూత్తుకుడి–మదురై బైపాస్లో కొత్తగా నిర్మించిన పరిశ్రమను ప్రారంభించనున్నారు. -
కోలాహలంగా.. ఆడి పెరుక్కు
కావేరి నదీ తీర పరివాహక ప్రదేశాల్లో ఆడిపెరుక్కు ఆదివారం కోలాహలంగా జరిగింది. భక్తిశ్రద్ధలతో కావేరి తల్లికి ప్రజలు పూజలు చేశారు. రాష్ట్రంలోని భవానీ తదితర నదీ తీరాలలోనూ పూజలు భక్తిభావాన్ని చాటాయి. రాష్ట్రాన్ని, తమ జీవితాల్ని సుభిక్షం చేయాలని కాంక్షిస్తూ సర్వత్రా పూజలు చేశారు. ● కావేరి తీరంలో మిన్నంటిన భక్తిభావం ● ప్రత్యేక పూజలు చేసిన జనం సాక్షి, చైన్నె: తమిళనాట ఆడి మాసం(ఆషాడం)కు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మాసంలో భక్తిభావం మిన్నంటుంది. గ్రామ గ్రామన, వీధి వీధిన వెలిసిన అమ్మవారి ఆలయాల్లో ఉత్సవాలు, పూజలు మిన్నంటుతాయి. భక్తిభావంతో అమ్మవార్లను కొలుస్తుంటారు. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఇంటింటా పూజలు చేయడం జరుగుతూ వస్తున్నా యి. అలాగే ఆడి అమావాస్య రోజున పితృదేవుళ్లకు తర్పణాలు పెట్టడం జరిగింది. ఇక, ఈ మాసంలో ఆడి పెరుక్కు సంబరాలను నదీ తీరాల్లో జరుపు కోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆడి మాసంలో 18వ రోజును ఆడి పెరుక్కు పర్వదినంగా పరిగణించి కావేరితో పాటూ పలు నదుల తీరాలలో ఈ ఏడాది రెట్టింపు ఆనందంతో ఈ రోజున పూజలతో జన సందోహం నీరాజనాలు పలికారు. రైతాంగం కదిలి వచ్చి ప్రత్యేక పూజలతో తమ పంట పొలాల ను తడిపే నదీ జలాలలకు కర్పూర హారతులు సమర్పించారు. ఈ ఏడాది ఇప్పటికే కావేరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సేలం, ఈరోడ్డు, నామక్కల్, తిరుచ్చి, ధర్మపురి, కృష్ణగిరి, తిరువారూర్, తంజావూరు, పుదుకోట్టై, అరియలూరు, పెరంబలూరు తదితర ఆ నదీ తీరాలలో భక్తి భావం మిన్నంటింది. పూజలతో సందడి.. కర్ణాటక నుంచి కావేరిలో మేట్టూరు వైపుగా నీళ్లు పరవళ్లు తొక్కుతున్న విషయం తెలిసిందే. దీంతో ధర్మపురి జిల్లా పరిధిలో ఆడి పెరుక్కు మిన్నంటింది. కావేరి పరవళ్లు తొక్కుతుండటంతో పెద్దఎత్తున జనం తరలి వచ్చారు. హొగ్నెకల్ పరిసరాలు జనంతో కిక్కిరిశాయి. ఇక సేలం జిల్లా మేట్టూరు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ తీరంలోనూ జనం పెద్దఎత్తున తరలి వచ్చారు. ఈరోడ్, నామక్కల్, తిరుచ్చి – శ్రీరంగం, ముక్కొంబు, పనై కురిచ్చి, వేంగూరు, తిరువాలర్ సేలై, కంబరస పేట, పడితురైలలో ప్రజలు పెద్దఎత్తున పూజలు తరలి వచ్చారు. తంజావూరులోని తిరువయ్యారు. వద్ద కావేరి తీరంలో ఉత్సవ సందడి నెలకొంది. పూంబుహార్ వద్ద, రత్న పురేశ్వర ఆలయం వద్ద, భవానీ, కావేరి, అముదా నదుల సంగమ క్షేత్రం వద్ద ఆడి పెరుక్కు ఘనంగా జరిగింది. ఉదయాన్నే నవ దంపతులు, కుటుంబాలు, యువతీ, యువకులు, పిల్లలు, అన్నదాతలు పెద్దఎత్తున కావేరి తీరానికి తరలి వచ్చారు. కావేరి తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ పూజాధి కార్యక్రమాలు చేశారు. మహిళలు, నవదంపతులు గాజులు, బియ్యం, పసుపు కుంకుమలు, తమల పాకులను కళశాల మధ్య ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పలు రకాల ఫలాలను ఉంచి మొక్కులను తీర్చుకున్నారు. కర్పూర నీరాజనాలు సమర్పించారు. పవిత్ర స్నానం ఆచరించినానంతరం తమ మంగళ సూత్రాల్ని మార్చుకున్నారు. నవ దంపతులు తమ వివాహ సందర్భంగా ఉపయోగించిన పూల మాలల్ని తీసుకొచ్చి కావేరి నదిలో కలిపేశారు. అన్నదాతలు పెద్దఎత్తున తరలివచ్చి విత్తనాల్ని, గత ఏడాది తమ చేతికి అందిన పంటల్ని కావేరి నదీ తీరంలో ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆ పరిసరాల్లోని గ్రామ దేవతల ఆలయాల్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. పెళ్లి కాని కన్యలు, యువకులు, పిల్లల భాగ్యం లేని వాళ్లు పసుపు తాడును కావేరి తీరంలో కళశాల మధ్యలో ఉంచి పూజలు చేశారు. పవిత్ర స్నానం అనంతరం ఆ తాడును తమ చేతికి కట్టుకున్నారు. మరి కొందరు అక్కడి వేప, రావి చెట్లకు కట్టారు. ఇక తిరువారూర్, పుదుకోట్టై, నాగపట్నంలలో అక్కడక్కడ కావేరి నది తీరంలోనూ పూజలు కోలాహలంగా జరిగాయి. నవ వధువులు పవిత్ర స్నానం , పూజల అనంతరం తమ తాళి బొట్టును మార్చి కొత్తవి కట్టుకున్నారు. కావేరి తల్లికి నీరాజనాలు కావేరి తల్లికి సారే.. ఆడిపెడుక్కు సందర్భంగా తిరుచ్చి శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆ లయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయం నుంచి ఉదయం బంగారు పల్లకిలో ఊరేగింపుగా కావేరి తీరానికి స్వామి వారు వచ్చారు. అమ్మా మండపంలో స్వామికి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం వరకు స్వామి వారు భక్తులకు ఇక్కడే దర్శనం ఇచ్చారు. సాయంత్రం స్వామి వారి తరపున కావేరి తల్లికి పట్టు చీర, పసుపు కుంకమలు, చందనం, పూల మాలలు తదితర సారె సమర్పణ కార్యక్రమం కనుల పండువగా జరిగింది. ఇక మదురైలో వైగై నదీ, తిరునల్వేలి, కన్యాకుమారిలలో తామరభర్ణి నదీ, ఈరోడ్లో భవానీ నది, కోయంబత్తూరు నొయ్యల్ నది, తిరువణ్ణామలై, వేలూరులో పాలారు, తెన్పైన్నె తదితర నదీ తీరాల్లోనూ ఆడి పెరుక్కు సంబరాలు మిన్నంటాయి. కాగా, కావేరి, భవానీ నదులలో వరద ఉధృతి కారణంగా అనేక చోట్ల జనం నదిలోకి దిగేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కావేరి తీరంలోని అమ్మ పడుగై, పుష్ప మండపం, ఈరోడ్లోని మూడు నదుల సంగమ క్షేత్రం ఘాట్లో ఇసుకేస్తే రాలనంతగా జనం తరలి వచ్చి పూజలలో లీనమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ నేతృత్వంలో భవానీ సంగమ క్షేత్రంలో యాగాది పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. -
తిరుక్కురల్ను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి
– ప్రధాని మోదీకి కవి వైరముత్తు విజ్ఞప్తి తిరువొత్తియూరు: కవి వైరముత్తు తన ఎక్స్ పేజీలో ప్రధాని మోదీని ’ట్యాగ్’ చేసి పోస్ట్ చేశారు. అందులో ‘‘ ప్రధాని గారు, మీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి ప్రజల అభిప్రాయాలను ఆహ్వానించిన మీ గౌరవానికి నా ప్రజాస్వామ్య నమస్కారం. తమిళనాడు నుంచి ఒక భారతీయుడిగా రాస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ ప్రశంసించే తిరుక్కురల్ జాతి, భాష, మతం, దేశం దాటిన ప్రపంచానికి మార్గదర్శక సూత్రాల గ్రంథం. మానవత్వం అనే ఒకే లక్ష్యాన్ని అది చాటి చెబుతుంది. ఆ పవిత్ర గ్రంథాన్ని భారతదేశ జాతీయ గ్రంథంగా ప్రకటించాలి అనేది తమిళుల చిరకాల కల నెరవేరని కోరికగా వుంది. భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తిరుక్కురల్ను భారతదేశ జాతీయ గ్రంథంగా ప్రకటిస్తున్నట్లు మంచి ప్రకటన చేయాలని కోరుతున్నాం. మీరు కోరిన విధంగా నమో యాప్లో కూడా దీనిని పోస్ట్ చేయనున్నాం. ఇది ప్రపంచ సంస్కృతికి భారతదేశం ఇచ్చే బహుమతిగా భావించబడుతుంది. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఆగస్టు 15న టీవీ ముందు ఆతృతగా ఎదురుచూస్తాం’’ అని పేర్కొన్నారు. ఆర్ఎల్డీ అధ్యక్షుడిగా జి.రాజారామన్ సాక్షి, చైన్నె: రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ) తమిళనాడు కమిటీని ప్రకటించారు. జాతీయ రాజకీయాలలో ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాలలో రాణిస్తున్న ఆర్ఎల్డీ కార్యకలాపాలను తమిళనాడులో విస్తరింప చేయడానికి ఆ పార్టీ అధిస్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటుగా ఇతర కమిటీని ఐటీసీ వెల్కమ్ హోటల్ వేదికగా ప్రకటించారు. ఆర్ఎల్డీ తమిళనాడు అధ్యక్షుడిగా జి.రాజారామన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్. రవి పిళ్లై, కోశాధికారిగా తిరునావుకరసులను నియమించారు. మిగిలిన కొత్త ఆఫీస్ బేరర్లు, ఇతర కమిటీల నాయకులను రాష్ట్ర అధ్యక్షుడు త్వరలో ప్రకటిస్తారని జాతీయ ప్రధాన కార్యద ర్శి త్రిలోక్ త్యాగి వెల్లడించారు. ఆర్ఎల్డీ ప్రధా న కార్యాలయం(ఒడిశా)లో ఉన్నట్టు, ఇక్కడి నేతలు అక్కడి నుంచి వచ్చే సూచనలు, సలహాల మేరకు రాజకీయంగా సేవలు అందిస్తారని వివరించారు. తమిళనాడు–పుదుచ్చేరి నాయకుల ద్వారా కారక్రమాలు విస్తృతం చేయనున్నట్టు ప్రకటించారు. పేద ప్రజలు, రైతాంగానికి, ఇతర వర్గాలకు అన్ని రకాలుగా ఆర్ఎల్డీ ప్రోత్సాహం, సహకారం అందిస్తుందని వివరించారు. చైన్నెలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు సాక్షి, చైన్నె : చైన్నె నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు సేవలు అందించనున్నాయి. ఇందుకోసం 20 మార్గాలను ఎంపిక చేశారు. వివరాలు.. 1970లో చైన్నెలో తొలి సారిగా డబుల్ డెక్కర్ బస్సులను పరిచయం చేశారు. పది సంవత్సరాలు ఈ బస్సులు సేవలు అందించాయి. ఆతదుపరి సరికొత్త హంగులతో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు 1977లో రోడ్డెక్కాయి. 2008 వరకు పది సంవత్సరాలు ఈ బస్సులు సేవలు అందించాయి. ఆ తదుపరి నగరాభివృద్ధిలో భాగంగా వంతెనల నిర్మాణాల మీద దృష్టి పెట్టడంతో డబుల్ డెక్కర్ బస్సుల స్థానంలో త్రిబుల్ డోర్ బస్సులు రాగా, ఆతర్వాత డీలక్స్ అంటూ సేవలు అందించాయి. చివరకు ప్రస్తుతం ఎలక్ట్రిక్, గ్యాస్తో నడిచే బస్సులు రోడ్డు మీదకు వస్తున్నాయి. ఈ పరిస్థితులలో వంతెనలు లేని మార్గాలలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల సేవలను అందించే దిశగా ఎంటీసీ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. తొలి విడతగా 20 డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను కొనేందుకు ఆమోదం లభించడంతో ఆ దిశగా ప్రయత్నాలను అధికారులు మొదలెట్టి ఉన్నారు. పర్యాటకంగా సేవలను అందించే దిశగా ఈ బస్సులను ప్రైవేటు భాగస్వామ్యంతో నడిపేదిశగా చర్యలు చేపట్టి ఉన్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియను ముగించి ఈ ఏడాది చివరిలో డబుల్ డెక్కర్ బస్సులను రోడ్డెక్కించే విధంగా ఎంటీసీ వర్గాలు ఉరకలు తీస్తున్నాయి. -
తిరువళ్లూరులో మోస్తరు వర్షం
● వీరరాఘవుని ఆలయం వద్ద చేరిన మురుగునీరు తిరువళ్లూరు: గత రెండు వారాల నుంచి తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరైన జిల్లా ప్రజలు ఆదివారం కురిసిన మోస్తరు వర్షాలతో వాతావరణం చల్లడడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లావ్యాప్తంగా గత మార్చి నుంచి ఎండలు దంచి కొట్టాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత పెరిగి రికార్డు స్థాయిలో నమోదయ్యింది. దీంతో ప్రజలు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే జూన్ రెండవ వారంలో రెండు వారాల పాటూ సాయంత్రం సమయంలో వర్షాలు పడింది. దీంతో ఎండల ప్రభావం తగ్గి వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావించారు. అయితే జూలై చివరి రెండు వారాల్లో ఎండల తీవ్రత వేసవిని తలపించేలా పెరిగింది. ఎండల ప్రభావంతో పాటూ ఉక్కపోత కనిపించింది. ఈక్రమంలో ఆదివారం మధ్యాహ్నం హఠాత్తుగా మబ్బులు కముమకుని వర్షం పడడం ప్రారంభమైంది. దాదాపు రెండు గంటల పాటూ ఉరుములతో పాటూ మోస్తరు వర్షపాతం నమోదైంది. ఇదేవిధంగా ఊత్తుకోట, పేరంబాక్కం, తామరపాక్కం, పెద్దపాళ్యం, పూందమల్లి, ఆవడి, అంబత్తూరు, గుమ్మిడిపూండి, పొన్నేరి తదితర ప్రాంతాల్లోనూ మోస్తారు వర్షం పడింది. కాగా తిరువళ్లూరులో కురిసిన వర్షంతో వీరరాఘవుడి ఆలయం వద్ద మురుగునీటితో కలిసి వర్షపు నీరు ప్రవహించింది. బజారువీధిలోనూ వర్షపు నీరు నిలిచిపోవడంతో జనజీవనం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
దంతాలను అమర్చే విధానాల్లో విప్లవాత్మక మార్పులు
కొరుక్కుపేట: దంత వైద్యంలో ప్రస్తుతం కృత్రిమ దంతాలను అమర్చుకోవడంపై ప్రజలలో ఆసక్తి అధికమైందని, ఈ దంతాలను అమర్చే విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేస కుంటున్నాయని అంతర్జాతీయ సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. చైన్నె నందంబాక్కం ట్రేడ్ సెంటర్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఓరల్ ఇంప్లాంటోలజిస్ట్స్ (ఐఏఓఐ) అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును తమిళనాడు డాక్టర్ ఎంజీ వైద్యవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నారాయణస్వామి ప్రారంభించారు. శ్రీలంక ఆరోగ్యవిభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ చందన గజనాయికే. రాగాస్ డెంటల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ కనకరాజ్. డాక్టర్ శివశంకర్, డాక్టర్ జాన్సన్ రాజా జేమ్స్, డాక్టర్ జాన్ నేసన్, డాక్టర్ థ్యానేశ్వరన్ ప్రసంగించారు. సదస్సులో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ అసలైన దంతాలతో పోటీపడే రీతిలో కృత్రిమ దంతాలను అమర్చటం కూడా ఓ అందమైన కళేనని చెప్పారు. దేశవిదేశాల నుంచి 400 మంది కృత్రిమ దంతాలను అమర్చే చికిత్సకు సంబంధించిన వైద్యనిపుణులు హాజరయ్యారు. -
బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలకు డిమాండ్
కొరుక్కుపేట: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కొండపై బుద్ధుని శిలా విగ్రహాన్ని ధ్వంసం చేసిన శక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదివారం చైన్నె వీసీకే పార్టీ నాయకుడు డిమాండ్ చేశారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు డాక్టర్ తిరుమావలవన్ డిమాండ్ చేశారు. సుమారు 20 సంవత్సరాల నుంచి మదనపల్లిలో బుద్ధ పూర్ణిమ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ వీసీకే పార్టీ ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారని అతనిని రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది ఆ శిలా విగ్రహ తలను ధ్వంసం చేయడమే గాక ఈ చర్యను ప్రతిఘటిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన శివప్రసాద్ పై అనేక సెక్షన్లపై మదనపల్లి , రాయచోటి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తిరుమావలవన్ అన్నారు. ఆగస్టు 23వ తేదీ విజయవాడలో వీసీకే పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కార్యకర్తలతో చేపట్టనున్న ధర్నా కార్యక్రమంలో తాను కూడా పాల్గొనబోతున్నట్టు తిరుమావలవన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యాలయ కార్యదర్శి బాల సింగం, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వన్నియరసు, పీటీఎం శివప్రసాద్, యు. గణపతి పాల్గొన్నారు. -
గొప్ప పుస్తకం చదివినంత గర్వంతో..
తమిళసినిమా: 2023వ ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ చలనచిత్ర అవార్డుల్లో తమిళ చిత్ర పరిశ్రమకు ప్రకటించిన నాలుగు అవార్డులలో మూడు అవార్డులను పార్కింగ్ చిత్రం గెలుచుకోవడం విశేషం. రామ్ కుమార్ బాలకష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంస్థల అధినేతలు సుధన్ సుందరం, కేౠస్ సినీస్ కలిసి నిర్మించారు. హరీష్ కళ్యాణ్ నటి ఇందూజ జంటగా నటించిన ఇందులో ఎమ్మెస్ భాస్కర్ ముఖ్యపాత్ర పోషించారు. 2023లో విధమైన విచిత్రం మంచి విజయాన్ని సాధించింది తాజాగా ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ కథనం, ఉత్తమ సహాయ నటుడు మొదలగు 3 జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇందులో ఉత్తమ సహాయం అవార్డులు గెలుచుకున్నారు కాగా ఉత్తమ జాతీయ అవార్డులను గెలుచుకున్న కళాకారులకు నటుడు కమలహాసన్ సామాజిక మాధ్యమాల్లో ద్వారా శుభాకాంక్షలు అందించారు. దీంతో పార్కింగ్ చిత్ర యూనిట్ ఆయన్ని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారితో కొంతసేపు ముచ్చటించి, జాతీయ అవార్డులను గెలుచుకున్నందుకుగాను అభినందించారు. అనంతరం పార్కింగ్ చిత్ర కథానాయకుడు హరీష్ కళ్యాణ్ తన ఎక్స్ మీడియాలో నటుడు కమల్ హాసన్ గురించి కోరుకుంటూ ‘‘అవార్డే శుభాకాంక్షలు అందించిన తరుణం. ఒక మిత్రుడులా మాట్లాడారు. ఎంఎస్ భాస్కర్ గురించి మీ మిత్రుడిగా మాట్లాడారు. అవి మాటలా యూనివర్సిటీ పాఠమా. నేర్చుకున్నది ఎంతో.. మీ నుంచి నేర్చుకోవాల్సింది ఇంకెంతో. గొప్ప పుస్తకాన్ని చదివినంత గర్వం. అక్కడి నుంచి తిరిగి బయలుదేరినప్పుడు’’ అని నటుడు హరీష్ కళ్యాణ్ ఎంతో ఉద్వేగంతో పేర్కొన్నారు. -
రక్తదాన శిబిరానికి అనుహ్య స్పందన
కొరుక్కుపేట: ప్రముఖ టాలీవుడ్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో 50వ పుట్టినరోజు జరుపుకోనున్న సందర్భంగా చైన్నె మహేష్ బాబు అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. చైన్నె సెయింట్ థామస్ మౌంట్,నజరత్పురం, గాంధీ గ్రౌండ్ లో చేపట్టిన ఈ రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. నగరం నలుమూలల నుంచి అభిమానులతో పాటూ యువత తరలివచ్చి రక్తదానం చేశారు. ప్రత్యేకించి ఈ రక్తదాన శిబిరంలో సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఎక్కువమంది పాల్గొని రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. చైన్నె మహేష్ బాబు అభిమానులు, రాఘవ –జమునా చారిటబుల్ అండ్ ట్రస్ట్ ఓఅర్ జి బ్లడ్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సాగింది. ఈ శిబిరంలో పాల్గొన్న రక్త దాతలకు పండ్లు, బిస్కెట్లు, సర్టిఫికెట్ లను అందజేశారు. ఈ సందర్భంగా చైన్నె మహేష్ బాబు అభిమానులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహేష్ బాబు పుట్టినరోజు అంటే మాకు పండగతో సమానం అన్నారు. ఎంతోమంది పేదవారికి సహాయం చేయటమే కాకుండా ఉచిత గుండె ఆపరేషన్లు, ఎన్నో రకాలుగా తన దాతృత్వాన్ని చాటుకోవడం నిత్యం చేస్తూనే ఉంటారని అటువంటి హీరో మహేష్ బాబుకి అభిమానులుగా ఉండడం మాకు గర్వంగా ఉందన్నారు. ఇక పై సూపర్ స్టార్ మహేష్ బాబు పేరుతో చైన్నెలో పాటు తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. 4,500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడం నిజంగా అభినందనీయమన్నారు. రక్తదానం చేసి, ప్రాణాదాతలు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చైన్నె మహేష్ బాబు ఫ్యాన్స్ తిరుమలశెట్టి శివసాయి, ఉదయ్ కిరణ్, ఎం. వసంత్, ఎ.కిరణ్ కుమార్, టి.ధనహరి, చైతన్య, హర్ష, అనంత్, శ్రీను,సాకేత్ రామ్, వర్మ, శ్రీహర్ష, లింగబాబు, కేఎస్వీఎస్ రాఘవ పాల్గొన్నారు. -
పన్నీరు పునరాలోచించాలి
● దినకరన్ హితవు సాక్షి, చైన్నె: ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగే విషయంపై నిర్ణయాన్ని మాజీ సీఎం పన్నీరు సెల్వం పునస్సమీక్షించాలని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ సూచించారు. ఎన్డీఏ కూటమినుంచి పన్నీరు సెల్వం నేతృత్వంలోని కార్యకర్తల హక్కుల సాధన కమిటీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో అన్నాడీఎంకే నుంచి చీలికతో ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దారి ఎటో అన్న చర్చ జరుగుతోంది. అయితే అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఎన్డీఏతో పయనించేందుకే మొగ్గు చూపుతున్నట్టుంది. ఇందుకు అద్దం పట్టేవిధంగా ఆదివారం ఆ పార్టీ నేత దినకరన్ స్పందించారు. పన్నీరు సెల్వం నిర్ణయం తనకు షాక్కు గురి చేసిందన్నారు. పెద్దవారు ఆలోచించి అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏ కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారో అన్నది పక్కన పెడితే, ఆయన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకుంటే మంచిదని సూచించారు. ఆయన్ను బుజ్జగించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని పరోక్షంగా బీజేపీ వర్గాలకు సూచించారు. కూటమి నుంచి వైదొలగే విషయంపై నిర్ణయాన్ని పరిశీలించి, సమీక్షించి మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ ప్రధాని అనుమతి కోసం తనకు పన్నీరు సెల్వం ఎలాంటి ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు. ఆయన తనకు లేఖ రాసినట్టు పేర్కొంటున్నారని, ఆ లేఖ తనకు ఇంత వరకు అందలేదన్నారు. తనకు ఆ లేఖ అందినప్పుడు అనుమతి వ్యవహారంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అది అందని పక్షంలో అబద్దాలకోరు ఎవరో అన్నది స్పష్టమవుతుందని పరోక్షంగా పన్నీరుకు హితవు పలికారు. -
వంద కోట్లతో మాక్సివిజన్
●10 చోట్ల కంటి వైద్య ఆస్పత్రులు ●ప్రారంభించిన క్రికెటర్ ఎంఎస్ ధోని సాక్షి, చైన్నె: మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ చైన్నెలో రూ.100 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. చైన్నె అంతటా 10 సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్, విజన్ సెంటర్లను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలి ఆస్పత్రిని భారత మాజీ క్రికెటర్, చైన్నె సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్కే వేలు, మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ గ్రూప్ కో–చైర్మన్ డాక్టర్ కాసు ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. చైన్నెలోని మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ క్లినికల్–అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బి.గణేష్, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు ప్రాంతీయ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శిబు వర్కీ కూడా ఈ కార్యక్రమానికి హజరయ్యారు. డాక్టర్ జీఎస్కే వేలు మాట్లాడుతూ చాలా కాలంగా మాక్సివిజన్ కార్పొరేట్ ప్రధాన కార్యాలయం ఉన్న చైన్నెకి రావాలని ఎదురు చూశామని, ఇప్పుడు అది సాకారమైందన్నారు. మాక్సివిజన్ చైన్నె, తమిళనాడులో కంటి సంరక్షణ సేవలను విస్తృతం చేయనున్నట్టు వివరించారు. మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ క్లినికల్–అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి.గణేష్ మాట్లాడుతూ చైన్నె అంతటా 10 సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ ప్రారంభించామన్నారు. గ్రేటర్ చైన్నె ప్రాంతంలోని ప్రతి మూలకు ప్రపంచ స్థాయి కంటి సంరక్షణను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. చైన్నె సూపర్ కింగ్స్ కెప్టెన్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ చైన్నె అంతటా ఈ కేంద్రాలను ప్రారంభించడం ద్వారా చైన్నెలో కంటి వైద్య సేవల మాక్సివిజన్ ప్రయాణంలో తానూ భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. విజన్ అనేది మనం తరచుగా తేలికగా తీసుకునే విషయమని, మాక్సివిజన్లో అన్ని రకాల సేవలు సరసమైన ధరలకు అందుబాటులో ఉండడాన్ని అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. చైన్నె ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా, తనకు ఇష్టమైన చైన్నె నగరంలో పది కేంద్రాల ఏర్పాటు సంతోకరమని పేర్కొన్నారు. -
మనో వేదనలో అన్నాడీఎంకే కేడర్
●సీఎం స్టాలిన్ సానుభూతి సాక్షి, చైన్నె : అబద్దాల కోరు పళణి స్వామి కారణంగా నిజమైన అన్నాడీఎంకే కేడర్ తీవ్రమనో వేదనలో ఉన్నారని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. పార్టీ కేడర్కు ఆదివారం ఆయన లేఖ రాశారు. ఇందులో బీజేపీ, అన్నాడీఎంకేల తీరును దుయ్యబడుతూ, గవర్నర్ చర్యలను ఎండగట్టడమే కాకుండా అన్నాడీఎంకే కేడర్కు తన దైన శైలిలో సానుభూతిని వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లిన పళణి స్వామి అక్కడి బీజేపీ నేతల ముందు మొకరిల్లి పొత్తు పెట్టుకుని రావడం ఆపార్టీ కేడర్ను తీవ్రంగా కలచి వేసి ఉందని వ్యాఖ్యలు చేశారు. నిజమైన కేడర్ తీవ్ర మనో వేదనలో మునిగి ఉన్నారన పేర్కొంటూ, ఆ మేరకు కేడర్ను పళణి స్వామి తాకట్టుపెట్టే శారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఊరు..ఊరా తిరుగుతూ అబద్దాలను వళ్లిస్తూ వస్తున్నారని మండి పడ్డారు. ప్రాణానికి ప్రాణంగా, ఊపిరికి శ్వాసగా ఉన్న కేడర్ను చాలా రోజుల తర్వాత తాను లేఖ రూపంలో కలుసుకుంటున్నానని వివరిస్తూ, తాను ఆస్పత్రిలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆస్పత్రిలో ఉన్నప్పటికీ ప్రజాహితాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వ వ్యవహరాలను పర్యవేక్షిస్తూ వచ్చానని వివరించారు. దివంగత నేత కరుణానిధి అందర్నీ వీడి ఆగస్టు 7వ తేదీతో ఏడేళ్లుకానున్నదని గుర్తు చేస్తూ, ఆయన సేవలను, ఘనతనుచాటే కార్యక్రమాలు చేపడుదామన్నారు. నాలుగు సంవత్సరాల ద్రావిడ మోడల్ పాలనలో ఎన్నోపథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టామని వివరిస్తూ, ఇది మరింతగా కొనసాగుతాయని, విస్తృతం అవుతాయని, ప్రజలలోకి వీటిని చేర్చాల్సిన బాధ్యత కేడర్ మీద ఉందని సూచించారు. బీజేపీ కోసం అన్నాడీఎంకే పల్లకిని మోస్తుండటం ఆ పార్టీలోని నిజమైన కేడర్ను కలత చెందేలా చేసి ఉన్నాయని, సిద్ధాంతాలకు వ్యతిరేకంగాపళని స్వామి సాగిస్తున్న తీరును, వళ్లిస్తున్న అబద్దాలను తిప్పి కొడుదామన్నారు. ఇక, గవర్నర్ చర్యలను గుర్తు చేస్తూ, గవర్నర్ను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని పాతి పెట్టేందుకు జరుగుతున్న విశ్వ ప్రయత్నాలు అడ్డుకుందామన్నారు. -
రీఛార్జ్ అయిన మిల్కీబ్యూటీ
తమిళసినిమా: కుర్రకారు హార్ట్ బీట్ పెంచే అందం నటి తమన్నాది. అలా రెండు దశాబ్దాల పాటు వారిని తన అందచందాలతో ఉర్రూత లూగించిన ఈ మిల్కీ బ్యూటీ హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ నటులందరితోనూ నటించారనే చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రత్యేక పాటలతో కదం తొక్కిన తమన్నా అలాంటి పాటలకు తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం మూడున్నర దశాబ్దాల వయసులోకి అడుగుపెట్టిన తమన్నా ఆమధ్య లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కలిసి నటించిన రొమాంటిక్ సన్నివేశాలు చర్చనీయాంశంగా మారాయి. అయితే అదే సమయంలో నటి తమన్నాకు నటుడు విజయ్ వర్మకు మధ్య సాన్నిహిత్యం ప్రేమగా మారిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దాన్ని బలపరిచే విధంగానే తమన్న విజయవర్మలో సినీ వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు కలిసి వెళ్లిన దృశ్యాలు మీడియా దృష్టిని దాటి వెళ్లలేకపోయాయి. దీంతో తమన్నా నటుడు విజయవర్మతో పెళ్లికి సిద్ధమవుతున్నారనే ప్రచారం కూడా కూడా హోరెత్తింది. అలాంటిది ఏం జరిగిందో ఏమో కానీ తమన్నా , విజయ్ వర్మల మధ్య దూరం పెరిగింది. వీరి ప్రేమకు ముసలం పట్టిందని ప్రచారం జరిగింది. మరొక విషయం ఏమిటంటే పెళ్లికి సిద్ధమైన తమన్నా తన అందంపై శ్రద్ధ తగ్గించడంతో కాస్త బరువు పెరిగారు. అదే సమయంలో గట్టిగా అవకాశాలు తగ్గిపోయాయి. కాగా తాజాగా ప్రేమ పెళ్లి విషయాలను పక్కనపెట్టిన తమన్న మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారనిపిస్తోంది. కారణం ఆ మధ్య కాస్త బరువు పెరిగిన ఈ బ్యూటీ మళ్లీ డైటింగ్, కసరత్తు లాంటివి చేసి సన్నపడటమే. అలా మళ్లీ మెరుపుతీగలా మారిన తమన్నా ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకొని తీర్చుకున్న అందమైన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో మిల్కీ బ్యూటీ నటిగా మరో రౌండ్ కొడతారేమో చూడాలి. -
7వ తేదీ నుంచి లవ్ రిటర్న్స్
తమిళసినిమా: ఇటీవల సినిమాలతో పాటూ వెబ్ సిరీస్ల నిర్మాణం కూడా అవుతోందనే చెప్పాలి. కారణం వెబ్ సిరీస్కి ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుండటమే. దీంతో పలు నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్ పై చూపుతున్నాయి. అలా తాజాగా ఆడియో సంస్థ సరిగమ సంస్థ కూడా వెబ్ సిరీస్ పై దృష్టి సారించింది ఇప్పటివరకు టీవీ సీరియల్స్ను, లఘు చిత్రాలను నిర్మిస్తూ వచ్చిన ఈ సంస్థ తాజాగా యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి వెబ్ సిరీస్ను రూపొందిస్తుంది అందులో భాగంగా మొట్టమొదటిసారిగా లవ్ రిటర్న్్స్ అనే వెబ్ సిరీస్ రూపొందించింది. భార్య, మాజీ ప్రేయసి ఓకే కార్యాలయంలో పనిచేస్తే, ఆ మాజీ ప్రేయసి ఇంటికి వస్తే ఆ యువకుడి పరిస్థితి ఏమిటి..? జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి వంటి పలు ఆసక్తికరమైన అంచనాతో రూపొందిన వెబ్సిరీస్ లవ్ రిటర్న్స్్. 12 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ వినోదంతో కూడిన జనరంజకమైన వెబ్ సిరీస్ 7వ తేదీ నుంచి సరిగమ డైష్ టీవీ షోస్ తమిళ్ యూట్యూబ్లో స్ట్రీమింగ్ కానుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో మాజీ ప్రేయసిగా కయల్ వెబ్ సిరీస్ ఫేమ్ చైత్రారెడ్డి, భార్యగా కణాకానుం కాలంగళ్ ఫేమ్ ప్రవీణ, వీరిద్దరి మధ్య చిక్కి అవస్థలు పడే భర్తగా నటుడు గురు లక్ష్మణ్ నటించారు. సరిగమ సంస్థ ద్వారా ప్రిన్స్ ఇమానువేలు నిర్మించిన ఈ వెబ్సిరీస్కు సదాశివం సెంథిల్ రాజన్, అర్జున్ డీవీ కలిసి దర్శకత్వం వహించారు. -
సూర్యకు హీరోయిన్గా సంగీత దర్శకుడి సోదరి!
సూర్య.. కొన్నాళ్ల క్రితమే 'రెట్రో'తో ప్రేక్షకుల్ని పలకరించాడు. తమిళంలో పర్లేదు గానీ తెలుగులో ఘోరమైన డిజాస్టర్ అయింది. ప్రస్తుతం 'కరుప్పు' అనే మూవీ చేస్తున్నాడు. దీనికి ఆర్జే బాలాజీ దర్శకుడు. కొన్నిరోజుల క్రితం గ్లింప్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీనితో పాటు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితోనూ సూర్య ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులోనే ప్రముఖ సంగీత దర్శకుడి సోదరి లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సోదరి భవాని శ్రీ.. సూర్య-వెంకీ అట్లూరి మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. భవాని శ్రీ ఇంతకుముందు పావ కథైగల్, కాపే రణసింగం సినిమాల్లో హీరోయిన్గా చేసింది. సూరికి జంటగా 'విడుదలై' చిత్రంలోనూ కథానాయికిగా నటించింది. తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో ఈమె పాత్ర ఏమిటి అన్నది ఆసక్తిగా మారింది. ఈ సినిమాలో సూర్య సరసన మలయాళ బ్యూటీ మమిత బైజు చేస్తోంది. మరి భవాని శ్రీ కూడా సూర్యకు హీరోయిన్ లేదా మరేదైనా పాత్ర అనేది తెలియాల్సి ఉంది. రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన 'బిగ్బాస్' ఫేమ్ గౌతమ్) -
ఎన్నికల ఎఫెక్ట్.. ‘తమిళనాట 6.5 లక్షల కొత్త ఓటర్లు’
ఢిల్లీ: ఓటర్ లిస్టు విషయంలో ఎన్నికల సంఘంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మరో బాంబు పేల్చారు. తమిళనాడులో ఏకంగా 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారని చెప్పుకొచ్చారు. దీంతో ఓటర్ లిస్ట్పై కొత్త చర్చ మొదలైంది.బీహార్లో ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో కూడా ఓటర్ల సంఖ్య పెరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తెలిపారు. తాజాగా చిదంబరం ట్విట్టర్ వేదికగా.. ‘ఎస్ఐఆర్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారుతోంది. బీహార్లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉండగా.. తమిళనాడులో మాత్రం 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఇది ఆందోళనకరమైన చర్య. చట్టవిరుద్ధమైనది. పెరిగిన ఓటర్లను శాశ్వత వలస కార్మికులు అని పిలిస్తే అసలైన వలస కార్మికులను అవమానించినట్లు అవుతుంది. తమిళనాడు ఓటర్లు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం లేకుండా చేసేందుకు ఓట్ల పెంపుదల జరిగింది. ఎన్నికల సంఘం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాల ఎన్నికల విధానాలను మార్చేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది. ఈ అధికార దుర్వినియోగాన్ని రాజకీయంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాల్సిందే’ అని పిలుపునిచ్చారు.The SIR exercise is getting curiouser and curiouserWhile 65 lakh voters are in danger of being disenfranchised in Bihar, reports of "adding" 6.5 lakh persons as voters in Tamil Nadu is alarming and patently illegalCalling them "permanently migrated" is an insult to the…— P. Chidambaram (@PChidambaram_IN) August 3, 2025ప్రతి భారతీయుడికి శాశ్వత నివాసం ఉన్న ఏ రాష్ట్రంలోనైనా నివసించడానికి, పని చేయడానికి హక్కు ఉంది. అది స్పష్టంగా సరైనది. బీహార్ ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న లక్షల మంది వ్యక్తులు రాష్ట్రం నుండి శాశ్వతంగా వలస వెళ్లారు. కాబట్టి వారిని మినహాయించాలని ఎన్నికల సంఘం ఎలా నిర్ణయానికి వచ్చింది?. ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుండి శాశ్వతంగా వలస వెళ్లారు అని నిర్ధారణకు రాక ముందే, ప్రతి కేసుపై సమగ్ర విచారణ నిర్వహించకూడదా?. సామూహిక ఓటుహక్కుల తొలగింపు అనేది తీవ్రమైన సమస్య, అందుకే సుప్రీంకోర్టు పిటిషన్లను విచారిస్తోంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే చిదంబరం తన పోస్టుకు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. తమిళనాడు ఓటరు జాబితాలో వలస కార్మికులను చేర్చడంపై అధికార డీఎంకేతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. Every Indian has a right to live and work in any state where he has a permanent home. That is obvious and rightHow did the ECI come to the conclusion that several lakh persons, whose names are in the current electoral rolls of Bihar, must be excluded because they had…— P. Chidambaram (@PChidambaram_IN) August 3, 2025 -
ఘనంగా వల్విల్ ఓరి ఉత్సవం
సేలం: నామక్కల్ జిల్లాలోని కొల్లిమలైలోని సెమ్మెడులోన వల్విల్ ఓరి ఘనంగా ప్రారంభించారు. కొల్లిమలైలోని వాసలూర్పట్టి బొటానికల్ గార్డెన్లో శనివారం జరిగింది. నామక్కల్ రెవెన్యూ కమిషనర్ వి.శాంతి నేతృత్వంలో సెందమంగళం ఎమ్మెల్యే పొన్నుసామి కొల్లిమలైలో ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను, ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన మందిరాలను ఆయన ప్రారంభించి పరిశీలించారు. అనంతరం పడవ ప్రయాణాన్ని ప్రారంభించారు. పుష్ప ప్రదర్శనలో గుర్రం, జింక ఆకారం, వివిధ రంగుల పూలతో చేసిన ప్రేమ చిహ్నం, కూరగాయలతో ఎలుగుబంటి, పక్షి బొమ్మలు, ధాన్యాలతో చేసిన జంతువులు, పండ్లతో చేసిన ముఖ్యమంత్రి విగ్రహం పర్యాటకులను ఆకట్టుకున్నాయి. -
మోసం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు
తిరువళ్లూరు: జంతువులకు ఉపయోగించే మందులను ఇండియాలో విక్రయించడానికి ఏజెన్సీతో పాటూ మందులను సరఫరా చేస్తామని నమ్మించి సుమారు రూ.34.86 లక్షలు మోసం చేసిన నైజీరియాకు చెందిన వ్యక్తికి మూడేళ్ల జైలు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. టోక్యో, నైజీరియా తదితర రెండు దేశాల్లో వెటిస్ అనిమల్ హెల్త్ టోగో అనే సంస్థ జంతువులకు ఉపయోగించే మందులను తయారు చేస్తూ వేర్వేరు దేశాలల్లో విక్రయిస్తూవుంది. ఈ సంస్థల ప్రతినిధిగా ఇండియాలో నైజీరియాకు చెందిన జాన్ విల్సన్ పని చేస్తున్నాడు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా మందులను విక్రయించడానికి ఏజెన్సీలు కావాలని వాటాప్స్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహించాడు. ఈ ప్రచారాన్ని నమ్మి చోళవరం ప్రాంతానికి చెందిన జగదీషన్ ఫోన్లో జాన్ విల్సన్ను సంప్రదించి చైన్నె తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు ఇతర జిల్లాలకు ఏజెన్సీ కావాలని కోరినట్టు తెలుస్తుంది. ఏజెన్సీ, మందుల సరఫరా కోసం ముందుగా డబ్బులు చెల్లించాలని విల్సన్ కోరడంతో గత 2022లో విడతల వారిగా విల్సన్ బ్యాంకు ఖాతాలకు 34.86 లక్షల మేరకు చెల్లించాడు. అయితే మందులు సరఫరా చేయకపోవడంతో పాటూ ఏజెన్సీ ఇవ్వలేదు. మోసపోయామని ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బాధితుడు ఆవడి పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని ఆవడి పోలీసులు విచారణ చేపట్టి గతంలో అరెస్టు చేశారు. కేసు విచారణ పూందమల్లి కోర్టులో సాగింది. విచారణ ముగిసిన క్రమంలో న్యాయ మూర్తి తీర్పును వెలువరిస్తూ నైజీరియాకు చెందిన వ్యక్తికి మూడేళ్ల జైలు విక్షను విధించారు. అనంతరం నిందితుడ్ని పుళల్ జైలుకు తరలించారు. -
క్లుప్తంగా
కండక్టర్పై విద్యార్థి దాడి తిరుత్తణి: ప్రభుత్వ బస్సు కండక్టర్పై పాఠశాల విద్యార్థి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. తిరుత్తణిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసి పాఠశాలలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వ బస్సుల్లో విద్యార్థులు ఫుట్బోర్డు ప్రయాణంతో పాటు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తూ సమస్యలు సృష్టిస్తున్నారు. దీంతో బస్సు లు నడిపేందుకు డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం తిరుత్తణి బస్టాండ్ నుంచి వీరమంగళం పయనించిన రూట్ నంబర్ 65 ప్రభుత్వ టౌన్ బస్సులో పయనించిన పాఠశాల విద్యార్థులు కొందరు ఫుట్బోర్డులో నిలుచుకుని ప్రయాణం చేశారు. లోపలికి రావాలని కండక్టర్ అజిత్(27) విద్యార్థులను హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కండక్టర్తో గొడవకు దిగారు. దీంతో ఆగ్రహం చెందిన ఒక విద్యార్థి కండక్టర్పై దాడి చేసి పరారయ్యాడు. దీంతో మురుగూరు వద్ద బస్సు ఆపి దాడి చేసిన విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని బస్సు కండక్టర్తో పాటు డ్రైవర్ డిమాండ్ చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగడంతో తిరుత్తణి పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని విద్యార్థిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆందోళన విరమించారు. అర్ధగంట పాటు ఆలస్యంగా బస్సు బయలుదేరింది. నాణ్యమైన వైద్యమే లక్ష్యం తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా వున్న పేదలకు నాణ్యమైన వైద్యసేవలను అందించండమే లక్ష్యంగా సంక్షేమాన్ని కాపాడే స్టాలిన్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి నాజర్ తెలిపారు. సంక్షేమాన్ని కాపాడే స్టాలిన్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశిబిరాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆవడిలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని రాష్ట్ర మంత్రి నాజర్ ప్రారంబించారు. మంత్రి నాజర్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యసేవలను అందించాలన్న లక్ష్యంతోనే సంక్షేమాన్ని కాపాడే స్టాలిన్ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. వైద్యశిబిరంలో ఆర్థో, హార్ట్, బీపీ, షుగర్, గైనకాలజిస్టు వైద్యనిపుణులతో పాటు ఈసీజీ, ఎకో సేవలను అందిస్తున్నట్టు తెలిపారు. మొదట తిరువళ్లూరు జిల్లాలోని 14 యూనియన్లలో మూడు గ్రామాల చొప్పున 45 ప్రాంతాల్లో ప్రతివారం వైద్యశిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు. కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యేలు దురైచంద్రశేఖర్, కృష్ణస్వామి, మేయర్ సూర్యకమార్, కమిషనర్ శరణ్య, డిప్యూటీ డైరెక్టర్లు ప్రియారాజ్, ప్రభాకరన్ పాల్గొన్నారు. కారు దగ్ధం తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని జాతీయ రహదారిలో పయనిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమైంది. పాస్టర్లు సహా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. చైన్నెలోని సీఎస్ఐ చర్చి పాస్టర్లు జయశీలన్, ధనశేఖర్ శనివారం ఆంధ్రాలోని నగరి సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొనేందుకు కారులో బయలుదేరారు. కారును సూశై అనే వ్యక్తి నడిపాడు, తిరుత్తణి సమీపంలోని చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద కారు వెళుతుండగా కారు ఇంజిన్ నుంచి పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ పాస్టర్లను వెంటనే దింపి కారును రోడ్డుకు పక్కగా ఆపారు. కొంతసేపటికే కారు దగ్ధమైంది. సమాచారం మేరకు తిరుత్తణి అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన ప్రాంతం చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు దగ్ధమైంది. తలపై కొబ్బరికాయలు కొట్టడం నిషేధం తిరువొత్తియూరు: భక్తులు తలపై కొబ్బరికాయలు కొట్టే విధానాన్ని దేవదాయశాఖ నిషేధించింది. కరూరు జిల్లాలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆడి పెరుక్కు తర్వాత రోజున భక్తులు తలపై కొబ్బరికాయలు పగలగొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. వందలాది మంది భక్తులు ఈ విధంగా మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సంవత్సరం ఆడి పేరుక్కు ఉత్సవాలు నేడు ఆది పెరుక్కు పండుగను జరుపుకుంటారు. ఈక్రమంలో కృష్ణరాయపురం తాలూకా కార్యాలయంలో పెరుక్కు పండుగ సందర్భంగా అధికారులతో సమావేశం జరిగింది. ఇందులో మహాధనపురం మహాలత్ సుమి అమ్మ న్ ఆలయంలో జరిగే ఆడిపెరుక్కు సందర్భంగా, భక్తులు తలపై కొబ్బరికాయలు పగులగొట్టి మొక్కులు తీర్చుకునే విధానాన్ని దేవదాయశాఖ నిషేధం విధించింది. -
స్టూడెంట్ స్పెషల్ !
సాక్షి, చైన్నె: విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించేందుకు నగర రవాణా సంస్థ చర్యలు చేపట్టింది. 23 మార్గాలను ఎంపిక చేసిన ప్రత్యేక బస్సులను ఉదయం, సాయంత్రం వేళలో మాత్రం నడిపేందుకు నిర్ణయించారు. చైన్నె నగరంలో పలు మార్గాలలో విద్యా సంస్థలు ఉన్న విషయం తెలిసిందే. పూందమల్లి హైరోడ్డు, కామరాజర్ సాలై పరిసర మార్గాలలోని విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులు నిత్యం బస్సులలో రగడ సృష్టించడం సాధారణంగా మారింది. ఫుడ్ బోర్డులో వేలాడటం,బస్సులలో ఆట పాటలతో ఇతర ప్రయాణికులకు ఇబ్బందికలిగించడం లేదా, డ్రైవర్ను తీవ్ర ఆ గ్రహానికి గురి చేయడం వంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. దీంతో అనేక మార్గాలలో ఉదయం, సాయంత్రం వేళలో అకతాయి తనంతో వ్యవహరించే విద్యార్థుల భరతం పట్టే విధంగా పోలీసులు నిఘాతో వ్యహరిస్తుంటారు.అయినా, ఎక్కడో ఒక చోట విద్యార్థుల గ్రూప్ వార్ సైతం బస్సులలో వెలుగు చూస్తుంటుంది. ఈపరిణామాలను పరిగణించి, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా, విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను 23 మార్గాలలో ఉదయం, సాయంత్రం వేళలో నడిపేందుకు ఎంటీసీ వర్గాలు కసరత్తులు చేపట్టాయి. ఈ బస్సులలో విద్యార్థినులు, విద్యార్థులు, మహిళలు ప్రయాణించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మార్గాలలో ప్రత్యేక బస్సుల మీద పోలీసులు మరింత దృష్టి సారించనున్నారు. విద్యార్థులు తోక ఆడిస్తే చర్యలు తప్పదన్నట్టుగా ముందుకెళ్లబోతున్నారు. ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించిన నివేదికకు సీఎం స్టాలిన్ ఆమోద ముద్ర వేయగానే రోడ్డెక్కించేందుకు రవాణా సంస్థ వర్గాలు సన్నద్ధవుతున్నాయి. ● చైన్నెలో 23 మార్గాలలో రోడ్డుపైకి -
మురుగన్ సేవలో అన్బుమణి రామదాస్
తిరుత్తణి: పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ శనివారం మధ్యాహ్నం తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రం కోల్పోయిన హక్కుల కోసం పాదయాత్ర నిర్వహిస్తున్న పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ శనివారం మధ్యాహ్నం తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో స్వామి దర్శనానికి కొండ ఆలయం చేరుకున్నారు. అతనికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ ప్రసాదాలు పంపిణీ చేసారు. అన్బుమణి వెంట ఆ పార్టీ శ్రేణులు వందకు పైగా వారు వీఐపీ గేట్ ద్వారంలో స్వామి దర్శనానికి అనుమతి లేకుండా ప్రవేశించడం చర్చనీయాంశంగా మారింది. కాగా అన్బుమణి విలేకర్ల సమావేశం కోసం రెండు గంటల పాటు విలేకరులు వేచివుండగా చివరి నిమషంలో విలేకరుల సమావేశం లేదంటూ అన్బుమణి కారులో వెళ్లిపోవడం గమనార్హం. అంతకుముందు శుక్రవారం రాత్రి తిరుత్తణి పట్టణంలో అన్బుమణి పాదయాత్ర చేపట్టి చిత్తూరు రోడ్డు కూడలిలో బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి రావాలన్నది ముఖ్యం కాదని ఎవరు రాకూడదో ముఖ్యంగా పీఎంకే శ్రేణులు కష్టపడి పనిచేసి డీఎంకే ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కాగా పీఎంకేలో తండ్రీ కుమారుల మధ్య నెలకొన్న రాజకీయ పోరాటంతో ఆ పార్టీలో ఇక వర్గం అన్బుమణి సమావేశానికి హాజరుకాకపోవడంతో సమావేశానికి 500కు లోబడిన కార్యకర్తలు మాత్రమే హాజరుకావడం గమనార్హం. -
తంగ మగన్ జాయ్ ఆత్మకథ ఆవిష్కరణ
చైన్నె, సాక్షి : గ్లోబల్ బిజినెస్ ఐకాన్ , జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జాయ్ అలుక్కాస్ తన ఆత్మకథ తమిళ ఎడిషన్ను ‘తంగ మగన్ జాయ్‘ పేరుతో తీర్చిదిద్దారు. శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని సినీ నటీ నటులు, ప్రముఖులు చైన్నెలో ఆవిష్కరించారు. వివరాలు.. ’తంగ మగన్ జాయ్’ పుస్తకంలో డాక్టర్ జాయ్ అలుక్కాస్ కేరళలో తన నిరాడంబర జీవితం నుంచి ప్రపంచంలో అతిపెద్ద , అత్యంత విశ్వసనీయ ఆభరణాల రిటైల్ సామ్రాజ్యాలలో ఒకదానికి నాయకత్వం వహించే వరకు చేసిన అద్భుతమైన ప్రయాణాన్ని వివరించారు. ఇది దార్శనికత, స్థితిస్థాపకత అవిశ్రాంత కృషివలుడు కథ. జోయలుక్కాస్ విజయగాథలో కీలక పాత్ర పోషించిన తమిళనాడు ప్రజల కోసం దీనిని తమిళంలో విడుదల చేశారు. ఈ స్ఫూర్తిదాయకమైన కథనాన్ని తరతరాలుగా తమిళం పాఠకుల హృదయాలకు దగ్గరగా తీసుకురావడంలో ఈ ఆవిష్కరణ ఒక ముఖ్యమైనదిగా ప్రకటించారు. ఈ ఆవిష్కరణ సభలో డాక్టర్ జాయ్ అలుక్కాస్ మాట్లాడుతూ, తమ కలను నమ్మి, మాతో పాటు ఈ మార్గంలో నడిచిన ప్రతి శ్రేయోభిలాషికి, కస్టమర్లకు భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పుస్తకావిష్కరణ వేడుకకు వ్యాపార, సినిమా , సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు పాల్గొని డాక్టర్ జాయ్ అలుక్కాస్ సేవలను కొనియాడారు. తంగ మగన్ జాయ్ పుస్తకం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుస్తక దుకాణాలలో , ప్రధాన ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. కార్యక్రమంలో నటీనటులు నాజర్, పార్తీబన్, భాగ్యరాజ్ , ప్రశాంత్, మీనా, దేవయాని తదితరులు హాజరయ్యారు. -
ధర్మం ఉన్న చోటే ఈశ్వరుడు
కొరుక్కుపేట: ధర్మం ఎక్కడ ఉంటుందో ఈశ్వర భగవానుడు కూడా అక్కడే ఉంటారని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్బోధించారు. భారతీయతా వాహిని– చైన్నె ఆధ్వర్యంలో భక్తి –ముక్తి పేరిట బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు రెండు రోజుల ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు శనివారం సాయంత్రం చైన్నె, చేట్పేటలోని కుచలాంబాల్ కల్యాణ్ణ మహల్లో ప్రారంభమయ్యాయి. నిర్వాహకులు పీవీఆర్ కృష్ణారావుతోపాటు టీటీడీ చైన్నె మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీకృష్ణ సత్కరించారు. ప్రవచన కార్యక్రమంలో భక్తి–ముక్తిపై చాగంటి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. మహాభారతంలోని ఘట్టాలను వివరిస్తూ సుదీర్ఘంగా ప్రసంగించారు. విష్ణువు సర్వాంతర్యామి అని అన్నారు. భక్తి మార్గంలో, ధర్మ మార్గంలో ఎవరైతే నడుచుకుంటారో వారి వెంటే ఈశ్వర భగవానుడు ఉంటారని ఉపదేశించారు. ఈశ్వర ప్రీతి కలిగిన వారికి అంతా మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అజంతా డాక్టర్ కే. శంకరరావు, ఆనంద్ కుమార్రెడ్డి, రంగారెడ్డి, అశోక్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వరరావు -
నటుడు మదన్ బాబు కన్నుమూత
తమిళసినిమా: సీనియర్ నటుడు, సంగీత దర్శకుడు మదన్ బాబు (71) శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆరంభకాలంలో దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ నటించిన పలు నాటకాలకు సంగీతాన్ని అందించారు. అదేవిధంగా పలు టీవీ సీరియళ్లలో నటించారు. పలు టీవీ కార్యక్రమాల్లో జడ్జ్ గానూ వ్యవహరించారు.తమిళంలో పలు చిత్రాల్లో అనేక రకాల పాత్రలు పోషించి పాపులర్ అయ్యారు. తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించిన మదన్ బాబు కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా వైద్య చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మదన్బాబుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా ప్రస్తుతం మదన్బాబు భౌతిక కాయాన్ని స్థానిక అడయార్లోని స్వగృహంలో సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించండి –ఆలిండియా బార్ కౌన్సిల్ సూచన కొరుక్కుపేట: ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమంత్రో సేన్, అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్ల కార్యదర్శులకు ఒక లేఖ రాశారు. లేఖలో ప్రాథమికంగా, ఎన్నికల్లో న్యాయవాదులు రాజ్యాంగం, అఖిల భారత బార్ కౌన్సిల్ నియమాల ద్వారా నిర్వహించబడతారు. నిర్వహించని రాష్ట్ర బార్ కౌన్సిల్లకు ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించాలి. బార్ కౌన్సిల్లో నమోదు చేసు కున్న మొత్తం న్యాయవాదుల సంఖ్య, సర్టిఫికెట్ వెరిఫికేషన్లో ఎంత మంది న్యాయవాదులు ఉన్నారు. హాజరైన న్యాయవాదుల సంఖ్య, ధ్రువీకరణ పెండింగ్లో ఉన్న న్యాయవాదుల సంఖ్య, ఓటు వేయడానికి అర్హత ఉన్న న్యాయవాదుల సంఖ్యతో సహా వివరాలను వెంటనే ఆల్ ఇండియా బార్ కౌన్సిల్కు పంపాలి. ఓటరు జాబితా చట్టపరమైన చర్యలు సహా ప్రాథమిక చర్యలు వెంటనే తీసుకోవాలి. న్యాయవాదుల చట్టం ప్రకారం, రాష్ట్ర బార్ కౌన్సిల్ కార్యనిర్వాహకుల పదవీకాలం 5 ఏళ్లు. వారు ఆరు నెలల పొడిగింపు పొందవచ్చు. అందువల్ల, పదవీకాలం ముగిసిన రాష్ట్ర బార్ కౌన్సిల్లు, బార్ కౌన్సిల్ల క్షేత్ర పరిస్థితుల ఆధారంగా ఎన్నికల ప్రకటనను త్వరగా జారీ చేయాలి. దీనికి సంబంధించిన వివరణాత్మక నివేదికను ఆగస్టు 10వ తేదీలోపు అఖిల భారత బార్ కౌన్సిల్కు పంపాలి ఈ విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. నగల దుకాణంలో చోరీ –మహిళ అరెస్ట్ తిరుత్తణి: నగల దుకాణంలో వినూత్న రీతిలో నగలు చోరీ చేసిన మహిళలను తిరుత్తణి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. తిరుత్తణి మపోసీ రోడ్డులో ప్రకాష్ అనే వ్యక్తి నగల దుకాణం నడుపుతున్నాడు. శుక్రవారం సాయంత్రం రద్దీ సమయంలో ఓ మహిళ దుకాణానికి వెళ్లి నగలు కొనాలని గాజులు, రింగులు చూపాలని చెప్పడంతో దుకాణ సిబ్బంది చూపారు. నగలు చూసి నచ్చలేదని చెప్పి వెళ్లిపోయారు. అనుమానించిన దుకాణ యజమాని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించాడు. వినూత్న రీతిలో మూడు సవర్ల నగలు చోరీ చేసినట్టు గుర్తించారు. ఫిర్యాదు మేరకు తిరుత్తణి సీఐ మదియరసన్ కేసు నమోదు చేసి దుకాణంలోని ఫుటేజ్ సాయంతో చైన్నెకి చెందిన ప్రియాంక(36) అనే మహిళలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. మద్యం మత్తులో వీరంగం పళ్లిపట్టు: ఉపాధి పనులకు వెళుతున్న వృద్ధురాలిపై మద్యం మత్తులో దాడిచేసి లైంగికదాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నొచ్చిలి తోటి కాలనీకి చెందిన వృద్ధురాలు(60) శుక్రవారం ఉదయం టీసీ కండ్రిగలో ఉపాధి కూలీ పనులకు వెళ్లింది. మార్గమధ్యలో టీసీ కండ్రిగ గ్రామానికి చెందిన మూర్తి(45) మద్యం మత్తులో వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు విని గ్రామస్తులు వృద్ధురాలిని కాపాడి మందుబాబును చిదకబాది పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ వృద్ధురాలు తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
● 40 సవర్ల నగలు, రూ.2.39 లక్షల నగదు రికవరీ తిరువళ్లూరు: ఇంటి తాళాలు పగులగొట్టి 40 సవర్ల బంగారు నగలు, రూ.2.39 లక్షల నగదును చోరీ చేసిన కేసులో ఉత్తరాది వారు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వారి నుంచి నగదు, నగలను రికవరీ చేశారు. తిరువళ్లూరు జిల్లా ఉప్పరపాళ్యం ప్రాంతానికి చెందిన స్వామివేలు(49) ఇంట్లో గత 20న గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి ఇంట్లో వుంచిన నగలు, నగదు చోరీ చేశారు. ఫిర్యాదు మేరకు ఆవడి కమిషనరేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో స్థానికంగా భవన నిర్మాణరంగంలో వుంటున్న కార్మికులు చోరీ జరిగిన ఇంటికి సమీపంలో తరచూ సంచరించినట్టు నిర్ధారించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన అంగూర్షేక్(32), రాజూషేక్(34) ఇద్దరూ కలిసి తాళాలు పగులగొట్టి బీరువాలో వుంచిన 40 సవర్ల బంగారు నగలు, రూ.2.39 లక్షల నగదును చోరీ చేసినట్టు నేరం అంగీకరించారు. వీరి నుంచి నగలు, నగదును రికవరీ చేసిన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
@
గ్రాండ్ ఫాదర్గా భాస్కర్ కూలీ చిత్రంలోరజనీకాంత్ తమిళసినిమా: చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందంటే ఆ చిత్రాలను 12 ఏళ్ల లోపు పిల్లలు చూడడానికి థియేటర్లో అనుమతించరాదని అర్థం అనే విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలను ఇప్పుడు పెద్దగా ఏ సినిమా థియేటర్ నిర్వాహకులు పాటించడం లేదన్నది వేరే విషయం. సాధారణంగా క్రైమ్, థ్రిల్లర్, హర్రర్ కథా చిత్రాలకు, హింసాత్మక సంఘటనలు అధికంగా ఉన్న చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇస్తుంది. అదే సర్టిఫికెట్ను ఇప్పుడు రజనీకాంత్ తాజాగా కథానాయకుడు నటించిన కూలీ చిత్రానికి ఇవ్వడం గమనార్హం. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్తో పాటు బాలీవుడ్ సూపర్స్టార్ అమీర్ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్వుడ్ స్టార్ ఉపేంద్ర, ,క్రేజీ స్టార్ శ్రుతిహాసన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక అదనపు ఆకర్షణగా పూజాహెగ్డే ఐటమ్ సాంగ్ ఉండనే ఉంది. కాగా అనిరుద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూలీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ను ఇవ్వడం చర్చనీయంగా మారింది. కారణం ఈ చిత్రంలో భారీగా హింసాత్మక సన్నివేశాలు చోటు చేసుకోవడమే అని తెలిసింది. రజనీకాంత్ నటించిన అత్యధిక చిత్రాలు యూ /ఏ సర్టిఫికెట్ తోనే విడుదలయ్యాయి. అయితే 1982లో నటించిన పుదుకవితై, రంగా, 1985లో నటించిన ఊరుక్కావాలన్, 1989లో నటించిన శివ చిత్రాలు మాత్రం ఏ సర్టిఫికెట్తో విడుదలయ్యాయి. ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత మళ్లీ కూలీ చిత్రం ఏ సర్టిఫికెట్తో తెరపైకి రాబోతుందన్నది గమనార్హం. అయితే ఈ చిత్ర ట్రైలర్ ,ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని నెహ్రూ హిందూ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు. గ్రాండ్ ఫాదర్ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ తమిళసినిమా: ఎంఎస్ భాస్కర్, ఫ్రాంక్ స్టార్ రాహుల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రానికి గ్రాండ్ ఫాదర్ అనే టైటిల్ నిర్ణయించారు. కుట్టి స్టోరీస్ పిక్చర్స్ పతాకంపై భువనేష్ చిన్నస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెట్రో మురళి, మెట్రోగిరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఫ్రాంక్ స్టార్ రాహుల్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి స్మీక కథానాయకిగా నటిస్తున్న ఇందులో అరుణ్దాస్, మునీష్కాంత్, శ్రీనాథ్, శివ అరవింద్, ప్రియదర్శిని, అంజలిరావ్, అభినయ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీధర్ చాయాగ్రహణం, రంజిన్ రాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కామెడీ విత్ హర్రర్, ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా పార్కింగ్ చిత్రంలో నటనకుగాను నటుడు ఎంఎస్ భాస్కర్కు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ సహాయ నటుడు అవార్డును ప్రకటించిన నేపథ్యంలో గ్రాండ్ ఫాదర్ చిత్ర యూనిట్ ఆయన్ను అభినందించడంతో పాటు ఆయన గౌరవించే విధంగా ఈ చిత్ర టైటిల్ను, ఫస్ట్లుక్ పోస్టర్ను శనివారం విడుదల చేశారు. ఈ చిత్రంలో ఎమ్మెస్ భాస్కర్ గ్రాండ్ ఫాదర్గా టైటిల్ రోల్ను పోషిస్తున్నారు. ఫస్ట్లుక్ పోస్టర్లలో ఆయన గెటప్ కొత్తగా ఉండడంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. రాగా గ్రాండ్ ఫాదర్ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
అందరికీ ఉన్నత వైద్యమే లక్ష్యం
అందరికీ ఉన్నత వైద్యాన్ని దరిచేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం బృహత్తర పథకాలతో ఆరోగ్య సంరక్షణలో నెంబర్–1 దిశగా ముందు కెళ్తున్నట్టు సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈమేరకు నలం కాక్కుం స్టాలిన్ వైద్య శిబిరాల పథకానికి శనివారం ఆయన శ్రీకారం చుట్టారు. సాక్షి, చైన్నె : ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా వైద్య శిబిరాల నిర్వహణ లక్ష్యంగా నలం కాక్కుం స్టాలిన్ పేరిట పథకాన్ని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. వైద్య ప్రజారోగ్య శాఖ తరపున చైన్నె, శాంతోమ్, సెయింట్ పీట్స్ ఆంగ్లో ఇండియన్ మాధ్యమిక పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ హెల్త్ కేర్ ప్రత్యేక వైద్య శిబిరాల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, ఇటీవల తాను వాకింగ్కు వెళ్తున్న సమయంలో తల తిరిగినట్టు అనిపించి ఆస్పత్రికి వెళ్లినట్టు గుర్తు చేశారు. వైద్యులు కొన్ని పరీక్షలు చేయాలని సూచించడంతో ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చిందన్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా, ప్రభుత్వ అధికారులతో తాను సంప్రదింపులు కొనసాగిస్తూ, కొన్ని అత్యవసర ఫైళ్లను చూడడం జరిగిందన్నారు. అలాగే మీతో స్టాలిన్ విజ్ఞప్తుల స్వీకరణ గురించి ప్రత్యేక దృష్టి పెట్టానని పేర్కొన్నారు. అలాగే, తూత్తుకుడికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడు సమస్యలతో వినతిపత్రం కూడా అందించేందుకు చర్యలు తీసుకున్నట్టు వివరించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పటికీ, ప్రజలే తనకు ముఖ్యం అని పేర్కొంటూ, సచివాలయానికి వెళ్లగానే ఈ పథకం అమలు మరో వారం రోజులు వాయిదా వేయాలని అధికారులు సూచించారని, అయితే, తాను వెనక్కు తగ్గ లేదని, ముందడుగు వేయడంతో ఇప్పుడు, ఇక్కడ, ఈ రోజు వైద్య శిబిరాల పథకం అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. తాను ప్రజలను కలిసేందుకు ఉత్సాహాంగా ఉన్నట్టు అధికారులకు నచ్చ చెప్పినట్టు, ప్రజల వద్దకు వచ్చినప్పుడు తనకు మరింత ఉత్సాహం వస్తుందని వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం ప్రజల ప్రయోజనాలను కాపాడే కార్యక్రమం అని, గుర్తు చేస్తూ కరోనా కాలంలో తాను అధికార పగ్గాలు చేపట్టానని పేర్కొంటూ, అప్పటి పరిస్థిలు, నివారణకు యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలను వివరించారు. ప్రజా శ్రేయస్సే ముఖ్యం కరోనా పరిస్థితుల అనంతరం ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ అనేక వైద్య పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ వస్తున్నానని , ఆరోగ్య మంత్రిగా ఎం సుబ్రమణియన్ నిరంతరం శ్రమిస్తుఅందరి చేత పనులు చేయిస్తున్నారని కితాబు ఇచ్చారు. ఈ ఒక్క రోజు 1256 ప్రాంతాలలో వైద్య శిబిరాలు నిర్వహించామని, ప్రతి శిబిరంలో, వైద్యుల సహా 200 మంది సిబ్బంది 17 రకాల ప్రత్యేక వైద సేవలను అందించడం జరిగిందన్నారు. అన్ని పరీక్షలతో కూడిన నివేదికను వైద్య రికార్డులతో పొందు పరిచే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. తమిళనాడు విషయంలో వైద్య మౌలిక సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిందని, ఆసుపత్రికి రాలేని వారికి వైద్య సేవలు అందించేందుకు ఈ శిబిరాలు తోడ్పాటుగా మారినట్టు వివరించారు. ఈ శిబిరాలకు వచ్చే వారికి అన్ని రకాల వివరాలను, సేవలను పూర్తి స్థాయిలో అందించే విధంగా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యంపై వైద్యుల, సిబ్బంది దృష్టి పెట్టాలని, ఈ శిబిరాలలో మీ భాగస్వామ్యం కీలకం అని వ్యాఖ్యలు చేశారు. అన్నింటా తమిళనాడు నెంబర్ వన్గా ఉండాలని తాను ఆకాంక్షిస్తుంటానని పేర్కొంటూ, అందరికీ మెరుగైన, ఉన్నత వైద్యం దరిచేరే విధంగా వైద్యంలోనూ నెంబర్–1 కావడమే లక్ష్యంగా ముందుడుగు వేస్తున్నట్టు ధీమా వ్యక్తంచేశారు. కాగా, ఈ పథకం గురించి సమగ్ర వివరాలను, ప్రతి శనివారం జరిగే శిబిరాల గురించి ప్రభుత్వం తరపున మీడియా కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. రాధాకృష్ణన్, ఆరోగ్య కార్యదర్శి సెంథిల్కుమార్లు మీడియాకు వివరించారు. అంటువ్యాధి కాని వ్యాధులు అతిపెద్ద సవాళ్లుగా గుర్తించామని పేర్కొంటూ, అందరికీ ఉన్నత వైద్య దిశగా సీఎం ఆదేశాలతో పథకం అమలు విస్తృతం కానున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రి ఎం సుబ్రమణియన్, శే ఖర్బాంబు , సీఎస్ మురుగానందం, మేయర్ ప్రియ తదితరులు పాల్గొన్నారు. కాగా, అనంతరం సీఎంస్టాలిన్డీఎంకే కార్యాలయానికి చేరుకుని నియోజకవర్గాల నేతలతో సోదరా కదిలిరా నినాదం మేరకు చర్చల్లో మునిగారు. అలాగే, విల్లుపురం జిల్లా దిండివనంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కార్యకర్త కుటుంబానికి సీఎం స్టాలిన్ పది లక్షలు చెక్కును అందజేశారు. ఆరోగ్య సంరక్షణలో నెంబర్–1 సీఎం ఎంకే స్టాలిన్ నలం కాక్కుం స్టాలిన్ వైద్య శిబిరాలకు శ్రీకారం -
లాడ్జీలకు పార్కింగ్ వసతి తప్పనిసరి
వేలూరు: వేలూరు జిల్లాలోని హోటల్, లాడ్జి యజమానులు పార్కింగ్ వసతి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ మయిల్వాగనం అన్నారు. వేలూరు జిల్లాలోని హోటల్, లాడ్జి యజమానులతో సమీక్షా సమావేశం వేలూరులోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేలూరు పట్టణానికి పర్యాటకంతో పాటూ వైద్య చికిత్స కోసం పలు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చి వెళ్తుంటారన్నారు. వేలూరు పట్టణంలో మాత్రం సుమారు 200కు పైగా లాడ్జిలున్నాయన్నారు. ఈ లాడ్జిలకు వచ్చి వెళ్తున్న వారి వివరాలను తెలుసుకునేందుకు వారి ఆధార్ కార్డు, పూర్తి చిరునామాతో పాటూ ఏ కారణంతో వేలూరుకు వచ్చారు అనే పూర్తి వివరాలను సేకరించాలన్నారు. గతంతో నోటు పుస్తకాల్లో రాసుకునే వాటిని ఇకపై ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన ఆన్లైన్ వెబ్సైట్ను పోలీస్ స్టేషన్ల ద్వారా అందజేస్తామన్నారు. వీటి వల్ల లాడ్జికి వచ్చిన వారు ఎక్కడకు వెళ్తున్నారు. ఏ పనిమీద వెలుతున్నారు అనే పూర్తి విషయాలు పోలీసులకు తెలుస్తుందన్నారు. వీటి వల్ల నేరాలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. పోలీసులకు, లాడ్జి యజమానులకు ఈ ఈ విధానం వల్ల మంచి సంబంధాలు ఉంటుందన్నారు. లాడ్జిలకు బయట రోడ్డు పక్కన పబ్లిసిటీ బ్యానర్లు, బోర్డులు పెట్టరాదన్నారు. అదే విధంగా లాడ్జిలకు పార్కింగ్ వసతి ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎటువంటి ట్రాఫిక్ సమస్య రాదన్నారు. వాహనాలు ఎక్కడబడితే అక్కడ రోడ్డుపై వదిలి వెళ్లడం ద్వారా ట్రాఫిక్ సమస్యతో తరచూ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వేలూరు జిల్లాలోని లాడ్జి, హోటల్ యజమానుల సంఘం ప్రతినిధులు ఇందుకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ భాస్కరన్, డీఎస్పీ, పోలీస్ ఇన్స్పెక్టర్లు, హోటల్ యజమానుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రేమ కథా చిత్రంగా ఉసురే
తమిళసినిమా: ప్రేమ లేని సినిమానే ఉండదు. అయితే జీవం ఉన్న ప్రేమ కథా చిత్రాలు అరుదుగానే వస్తుంటాయి. అలాంటి యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన గ్రామీణ ప్రేమ కథ చిత్రం ఉసురే. డిజయ్ అరుణాచలం, జనని జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా నటి మంత్ర (రాశీ) ముఖ్యపాత్రలో రీఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా ఆదిత్య కదిర్, తంగదురై, క్రేన్ మనోహర్, సెంథిల్కుమారి, పావల్ నవనీతం, మెల్విన్, జయప్రకాష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ ప్రొడక్షన్న్స్ పతాకంపై మౌళి ఎం.రాధాకృష్ణ నిర్మించారు. నవీన్ డి గోపాల్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి కిరణ్ జోష్ సంగీతాన్ని, మార్గీసాయి చాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. సాధారణంగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండానే ప్రేమించాల్సి వస్తుంటుంది. అలా స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవలో మిత్రుడొకడు హీరోని ఎవరైనా ఒక అమ్మాయిని ప్రేమించి చూపించు అని సవాల్ చేస్తాడు. అతని సవాల్ స్వీకరించిన హీరో ఒక అందమైన యువతిని ప్రేమలో పడేసే ప్రయత్నాలు చేస్తాడు. అయితే అది చివరికి అతను ఆమెను నిజంగానే ప్రేమించే స్థితికి చేరుకుంటాడు. మరి వారి ప్రేమ సుఖాంతమా? కాదా అన్నదే ఉసురే కథ. సాధారణంగా ఒక జంట ప్రేమకు కులాలో, మతాలో, ఆస్తులో, అంతస్తులో అడ్డుగా నిలుస్తాయి. అయితే ఈ చిత్రంలో కథానాయకి తల్లినే ఆటంకంగా మారుతుంది. అది ఎందుకు? ఏమిటి అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో సాగే చిత్రం ఉసురే. ఇందులో నటి మంత్ర కథానాయకికి తల్లిగా నటించారు. ఇది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రమని దర్శక నిర్మాతలు తెలిపారు. -
సమస్యలను కేంద్రం పరిష్కరించాలి
వేలూరు: దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ సంస్థలోని సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని అఖిల భారత ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా అన్నారు. అఖిల భారత ఎల్ఐసీ ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘం 38వ మహానాడు వేలూరులోని ప్రయివేటు కల్యాణ మండపంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇన్సూరెన్స్ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్లైన్ వర్తకాన్ని రద్దు చేయాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతినే అమలు చేయాలని, ఎల్ఐసీ సంస్థలోని ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ మహానాడులో తీర్మానం చేశారు. మహానాడులో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను, క్రీడాకారులను అభినందించారు. సంఘం వేలూరు రీజినల్ అధ్యక్షుడు పీఎస్ బాలాజి, ప్రధాన కార్యదర్శి పయనిరాజ్, ఉపాధ్యక్షుడు ముత్తుకుమారస్వామి, సౌత్జోన్ కార్యదర్శి జేకేఎన్ పయణి, రీజినల్ కార్యదర్శి సెంథిల్వేలన్, శరవణన్, రమేష్, మాజీ ప్రధాన కార్యదర్శి రామన్, బాల కుమార్ పాల్గొన్నారు. -
ఇతర రాష్ట్ర ఓటర్లతో కొత్త సమస్యలు
వేలూరు: ఇతర రాష్ట్ర ఓటర్ల వల్ల తమిళనాడులో పలు సమస్యలు వచ్చే అవకాశం ఉందని సీనియర్ మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి నియోజక వర్గం పరిధిలోని వల్లిమలై గ్రామంలో ఆరోగ్యకరమైన స్టాలిన్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం బ్రహ్మపురం గ్రామంలో మీతో స్టాలిన్ పథకాన్ని పరిశీలించి ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వంలు సీఎం స్టాలన్ను కలిసి మాట్లాడటం వల్ల ఎటువంటి లాభం లేదు, నష్టం లేదన్నారు. సీఎం స్టాలిన్కు అనారోగ్యం క్షీణించడంతో వీరు వచ్చి పరామర్శించి వెళ్లారే తప్పా వీటిలో ఎటువంటి రాజకీయం లేదన్నారు. బిహార్కు చెందిన కార్మికులకు వారి రాష్ట్రంలోనే ఉపాధి కల్పించి ఉంటే మన రాష్ట్రానికి వచ్చే వారు కాదన్నారు. ప్రస్తుతం ఉపాధి కోసం మన రాష్ట్రానికి వచ్చారని ప్రస్తుతం ఏమి చేయాలో అర్థం కావడం లేదన్నారు. బిహార్లో ప్రాణాలతో ఉన్న వారందరినీ మృతి చెందినట్లు ఓటర్ల జాబితా నుంచి పేర్లు తీసి వేశారని అయితే మన రాష్ట్రంలో ఆ విధంగా చేసేందుకు కుదరదన్నారు. వీటిని మన రాష్ట్రంలోని రాజకీయ నాయకులకు పరిశీలించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు లక్షల సంఖ్యలో తమిళనాడులో ఓటర్లుగా మారే సమయంలో రానున్న రోజుల్లో పలు సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఎమ్మెల్యే నందకుమార్, డిప్యూటీ మేయర్ సునీల్కుమార్, యూనియన్ చైర్మన్ వేల్మురుగన్, సర్పంచ్ రాధాక్రిష్ణన్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
తిరుచ్చి రామజయం హత్య కేసులో కొత్త మలుపు
●పాలై జైలు ఖైదీని స్వయంగా విచారించిన డీఐజీ అన్నానగర్: తమిళనాడును కుదిపేసిన తిరుచ్చి వ్యాపారవేత్త రామజయం హత్య కేసులో చాలా సంవత్సరాలుగా పరిష్కారం దొరకలేదు, కానీ ఇప్పుడు కొత్త మలుపులో, తిరుచ్చి డిఐజి వరుణ్ కుమార్ పాలయన్కోట్టై సెంట్రల్ జైలులో ఓ దోషిని స్వయంగా విచారించారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. డీఎంకే ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కె.ఎన్. నెహ్రూ సోదరుడు రామజయం 2012 మార్చి 29న తిరుచ్చిలో వాకింగ్ వెళ్తుండగా కిడ్నాప్కు గురై హత్య చేయబడ్డారు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో సహా అనేక దర్యాప్తు సంస్థలు విచారణ చేసినప్పటికీ, నిందితులను ఇంకా గుర్తించలేదు.ఈ స్థితిలో, నైల్లె పాలై సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుడలైముత్తు అనే ఖైదీ ఈ హత్య కేసుతో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో తిరుచ్చి డీఐజీ వరుణ్కుమార్ నేతృత్వంలోని పోలీసు శనివారం పాలయంకోట్ సెంట్రల్ జైలును స్వయంగా సందర్శించింది. అక్కడ ఖైదీ సుడలైముత్తును 3 గంటలకు పైగా తీవ్రంగా విచారించారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. ప్రజా క్షేత్రంలోకి పన్నీరు! సాక్షి, చైన్నె : మాజీ సీఎం పన్నీరు సెల్వం ప్రజా క్షేత్రంలోకి వెళ్లనున్నారు. అక్టోబరు 3 నుంచి పర్యటనలకు సన్నద్దం కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల మీద మద్దతుదారులు దృష్టి పెట్టారు. ఎన్డీఏ కూటమి నుంచి మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని కార్యకర్తల హక్కుల సాధన కమిటీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తదుపరి రాజకీయ ప్రయాణానికి ముందుగా తన బలాన్ని చాటుకునేందుకు పన్నీరు సిద్ధమవుతున్నారు. దక్షిణ తమిళనాడులో తన సామాజిక వర్గం తన వెన్నంటే ఉందని చాటే విధంగా ప్రజాక్షేత్రంలో పర్యటనకు సన్నద్దం అవుతున్నారు. తన బలాన్ని చాటుకోవడం ద్వారానే రాజకీయంగా దూకుడు పెంచ వచ్చు అన్న నిర్ణయానికి రావడంతోనే యాత్రకు సన్నద్ధం అవుతున్నట్టు ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు అక్టోబరు 3వ తేదీ నుంచి ఈపర్యటన సాగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దక్షిణ తమిళనాడులోనే కాదు,కొంగు మండలంలో తన బలాన్ని చాటే ప్రదర్శనగా ఈ యాత్రను మలచుకునే వ్యూహంలో పన్నీరు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో పన్నీరును బుజ్జగించే దిశగా బీజేపీ వర్గాలు ప్రయత్నాలలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర బీజేపీకి చెందిన కొందరు ముఖ్యులు పన్నీరు మద్దతు దారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చర్చ ఊపందుకుంది. ఢిల్లీ పెద్దలు వచ్చినా తగ్గేది లేదన్నట్టుగా పన్నీరు శిబిరం ముందుకెళ్తున్నట్టు సమాచారం. లోయలో పడిన కారు ●డ్రైవర్ మృతి ●ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అన్నానగర్: కొల్లిమలై పర్వత రహదారిలో రెండో మలుపు సమీపంలో కారు 20 అడుగుల లోయలో పడిపోవడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఏడుగురు కళాశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. నామక్కల్ జిల్లాలోని కొల్లిమలై వలప్పూర్ నాడు సెల్లిపట్టికి చెందిన కులందయన్ కుమారుడు జయకుమార్ (23)కు సొంత కారు ఉంది. దానిని అద్దెకు నడుపుతున్నాడు. శనివారం అతను సెందమంగళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులైన దివాకర్, మణికంఠన్, ఇలంగేశ్వరన్, మురుగన్, విశ్వనాథన్, కదిర్, కవిన్తో కొల్లిమలైకి విహారయాత్రకు వెళ్లాడు. కారు కరావల్లి చెక్ పోస్టు నుంచి పర్వత రహదారిపైకి వెళ్లిది. ఆ సమయంలో, 2వ హెయిర్పిన్ బెండ్ వద్ద మలుపు తిరిగిన తర్వాత, కొద్దిసేపు డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన కారు, రిటైనింగ్ గోడను ఢీ కొట్టి 20 అడుగుల గుంటలో బోల్తా పడింది. ఇందులో కారు నుజ్జునుజ్జు అయింది. డ్రైవర్ జయకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వాళవంధినాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన విద్యార్థులను రక్షించి అంబులెనన్స్లో నామక్కల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జయకుమార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం సెందమంగళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. జ్యువెలరీ షో సేలంలో బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీషో ప్రారంభమైంది. జోయాలుక్కాస్ నేతృత్వంలో ఈ ఆభరణాల ప్రదర్శన హస్తకళా నైపుణ్యం, వివాహ కలెక్షన్లతో పాటు పలు రకాల డిజైన్లు కొలువుదీరాయి. ఆగస్టు 17వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. – సేలం -
ద్రోహి ఎవరో..?
● న్యాయం చెప్పండి ● మల్లై సత్య నిరసన దీక్షసాక్షి, చైన్నె : ద్రోహి ఎవరో తేల్చాలని, తనకు న్యాయం చెప్పాలంటూ ఎండీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మల్లై సత్య డిమాండ్ చేశారు. పార్టీ అధినేత వైగో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఒక రోజు చైన్నెలో మల్లై సత్య దీక్ష నిర్వహించారు. ఎండీఎంకేలో సాగుతూ వచ్చిన వార్ శనివారం రోడ్డెక్కింది. తొలుత పార్టీ అధినేత వైగో వారసుడు, ఎంపీ దురై వైగో మల్లై సత్య మధ్య మొదలైన వివాదం ప్రస్తుతం పార్టీలో అంతర్గత సమరానికి కారణమయ్యాయి. వైగోకు బై బై చెప్పి పార్టీ నుంచి బయటకు వెళ్లినవారందర్నీ మల్లై సత్య ఏకం చేస్తుండటం చర్చకు దారి తీసింది. ఈ పరిణామాలతో నేపథ్యంలో వైగో చేసిన వ్యాఖ్యలు మల్లై సత్యను తీవ్ర ఆవేదనలోకి నెట్టాయి. ఎవరో ద్రోహి అని వైగోను ప్రశ్నిస్తూ, తనకు న్యాయంచేకూర్చాలన్న నినాదాన్ని అందుకున్నారు. శనివారం తన మద్దతు దారులతో చైన్నె శివానంద రోడ్డులో ఏర్పాటు చేసిన వేదికపై నల్ల చొక్కా,నల్ల బ్యాడ్జీ ధరించి ఒక రోజు నిరసన దీక్షను నిర్వహించారు. దేశ ద్రోహి ఎవరో అని ప్రశ్నిస్తూ, న్యాయం చేయాలని నినాదిస్తూ ఒక రోజు నిరాహర దీక్షను సాయంత్రం వరకు కొనసాగించారు. ఎండీఎంకే జెండాలు అన్నది ఆ పరిసరాలలో కనిపించ లేదు. ఎండీఎంకే కండువా కూడా ఆయన కప్పుకోలేదు. ఈసందర్భంగా మల్లై సత్య మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావ సమయంలో తన కుటుంబం నుంచి ఎవ్వరూ రాజకీయాలోకి రారు అని వైగో ప్రకటించారని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు ఆయన వారసుడు పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నాడని మండి పడ్డారు. పార్టీ కోసం శ్రమించిన వారికి వైగో అన్యాయం చేశారని, ఇందులో తాను కూడా ఉన్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. మరణ శిక్ష పడ్డ ఖైదీకి సైతం చివరి కోరిక అన్నది ఉంటుందని, అయితే, వైగో కనీసం తన వద్ద వివరణ కూడా కోరకుండా వ్యాఖ్యలు చేయడం తీవ్ర మనో వేదనకు గురి చేసిందన్నారు. -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి
కొరుక్కుపేట: నైతిక విలువలను చిన్ననాటి నుంచే చిన్నారుల్లో పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్)–చైన్నె అధ్యక్షులు రవీంద్ర కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆధ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామి మంగళా శాసనాలతో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ –చైన్నె ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వార్షిక పోటీలు రెండు రోజులు పాటు ఏర్పాటు చేశారు. దీనికి చైన్నె అశోక్ నగర్ లోని జీఆర్టీ మహాలక్ష్మి విద్యాలయా వేదికై ంది. రెండు రోజుల పోటీల్లో భాగంగా మొదటి రోజు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నారులకు చిత్రలేఖన పోటీలు, యమునాచా ర్యాస్ ఆలవంద స్తోత్తరం, నాలాయిర దివ్య ప్రబంధాలు, రామానుజ నూట్రంధాది, అవధానం పోటీలను నిర్వహించారు. చిన్నారులు వివిధ పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షులు పి. రవీంద్ర కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా చిన్న జీయర్ స్వామికి ప్రత్యేక పూజలు చేసి పోటీలు ఆరంభించారు. అనంతరం జరిగిన పోటీలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమదైన ప్రతిభను చాటుకున్నారు .ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులలో నైతిక విలువలను పెంపొందించడంతోపాటు ఆధ్యాత్మిక చింతన, పెద్దల యందు గౌరవం, సమాజం పట్ల బాధ్యత, నిత్యజీవితంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాల్సిన నడవడికలు గురించి తెలియజేస్తున్నామన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, సమాజానికి ఉపయోగపడే పౌరులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని అభిప్రాయపడ్డారు ప్రతి ఏడాది విజయవంతంగా ఈ పోటీలో నిర్వహిస్తూ వస్తున్నామని దీనికి విద్యార్థుల నుంచే కాకుండా వారు తల్లిదండ్రుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా దాతలు సహకారం మరువలేనిదన్నారు. ఆదివారం కూడా పోటీలు జరుగుతున్నట్టు నిర్వాహకులు వెల్లడించగా కార్యక్రమ ఏర్పాట్లను జెట్ –చైన్నె కార్యవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. -
‘అన్భు’దూకుడు!
● 9న సర్వసభ్య సమావేశానికి నిర్ణయం ● వేదికగా మహాబలిపురం సాక్షి, చైన్నె: పీఎంకేలో అధికార సమరాన్ని కొలిక్కి తెచ్చే విధంగా అన్బుమణి దూకుడు పెంచారు. ఈనెల 9వ తేదీన పార్టీ సర్వసభ్య సమావేశానికి పిలుపు నిచ్చారు. మహాబలిపురం వేదికగా ఏర్పాట్ల మీద దృష్టి పెట్టారు. వివరాలు.. పీఎంకేలో నేనంటే..నేనే అధ్యక్షుడ్ని అని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న రాజకీయ సమరం ఆసక్తికర మలుపుతో సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. పార్టీలో అన్బుమణి వెన్నంటి ఉన్న వాళ్లను రాందాసు తొలగిస్తూ, కొత్తవారిని నియమిస్తున్నారు. అయితే, తానే అధ్యక్షుడ్ని అని తొలగించిన వారిని అన్బుమణి మళ్లీ నియమిస్తూ వస్తున్నారు. అదే సమయంలో తన బలాన్ని చాటే విధంగా అన్బుమని వంద రోజుల పాదయాత్రతో దూసుకెళ్తున్నారు. అన్బుమణి వెన్నంటి యువ సమూహం పీఎంకేలో కదులుతుండడంతో ఉత్సాహంగా ఆయన మద్దతుదారులు ఉన్నారు. ఈ పరిస్థితులలో తానేమిటో చాటుకునే విధంగా పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా తన తరపున పీఎంకే సర్వ సభ్య సమావేశానికి అన్బుమణి సిద్ధమయ్యారు. మహాబలిపురం వేదికగా ఈనెల9వ తేదీన పార్టీ సర్వ సభ్య సమావేశం జరుగుతుందని శనివారం అన్బుమణి ప్రకటించారు. మహాబలిపురంలో ఏర్పాట్ల మీద దృష్టి పెట్టే విధంగా నేతలకు సూచనలు చేశారు. అలాగే సర్వసభ్య సభ్యులతో పాటూ పార్టీలో ముఖ్యులు 3 వేల మందిని ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. ఈ సమావేశంలో పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకునే విధంగా అన్బుమని దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయి.అలాగే ఎన్నికలలో పొత్తు ఎవరితో అన్నది తేల్చే దిశగా పలు తీర్మానాలు చేయడానికి సన్నద్దం అవుతున్నట్టు మద్దతు దారులు పేర్కొంటున్నారు. -
సూర్య చిత్రంలో జీవీ సోదరి
తమిళసినిమా: సూర్య హీరోగా నటిస్తున్న చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్కుమార్ సోదరి భవానిశ్రీ నటించరున్నారా అనే ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. సూర్య కథానాయకుడిగా నటించిన రెట్రో చిత్రం ఆ మధ్య విడుదలై కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో నటిస్తున్న కరుప్పు చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో సూర్య రెండు విభిన్న కథా పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్రవర్గాలు రివీల్ చేయకపోయినా ఇటీవల విడుదల చేసిన చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్లు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కాగా ఇందులో త్రిష నాయకిగా నటిస్తున్నారు. సూర్య నటిస్తున్న 45వ చిత్రం కరుప్పు అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈయన తన 46వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి లక్కీ భాస్కర్ చిత్రం ఫేమ్ వెంకీ అట్లూరి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇందులో మలయాళ బ్యూటీ మమిత బైజు కథానాయకిగా నటిస్తున్నారు. రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఇందులో భవానిశ్రీ కూడా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోది. ఈమె సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ సోదరి. భవానిశ్రీ ఇంతకుముందు పావ కథైగల్, కాపే.రణసింగం చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించారు, సూరికి జంటగా విడుదలై చిత్రంలో కథానాయకి నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో ఈమె పాత్ర ఏమిటి అన్నది ఆసక్తిగా మారింది. -
ప్రభుత్వ విద్యను కాపాడుకుందాం
వేలూరు: ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం ప్రభుత్వ విద్య, రాజకీయ వ్యవస్థను కాపాడుకుందాం అనే నినాదంతో ఇండియన్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు వేలూరు టీచర్స్ భవనంలో జెండాను ఎగురవేశారు. ముందుగా ఆ సంఘం జిల్లా సమన్వయకర్త జోసెఫ్ అన్నయ్య అధ్యక్షతన జరిగిన ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు కోల్కతాలో జరిగే టీచర్స్ మహానాడు పోస్టర్ను అవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని అమలు చేయాలని, సెకండరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ హెచ్ఎంలకు జీతం వ్యత్యాసాలను తొలగించడం, అఖిల భారత సమావేశంలో మహిళలు, బాలికల హక్కలు, రక్షణపై సెమినార్ నిర్వహించాలని, ప్రభుత్వ విద్యను రక్షించాలనే తీర్మానాలు చేశారు. తమిళనాడు హయ్యర్ సెకండరీ స్కూల్ వృత్తి విద్యా టీచర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనార్దన్, తమిళనాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు జయకుమార్, జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ సెల్వకుమార్, జిల్లా కార్యదర్శి గుణశేఖరన్, మహిళా బృందం సమన్వయ కర్త సిలంబరసి, జాయింట్ కో–ఆర్డినేటర్ మంజుల, యశోద, జిల్లా ఉన్నత కమిటీ సభ్యులు జయప్రకాష్, ధనశేఖర్, భూపాలన్ పాల్గొన్నారు. -
● రీజెన్ –2025
చైన్నె వేదికగా ప్లేట్ లెట్ –రిచ్ ప్లాస్మా థెరఫీ కోసం మార్గాదర్శకాల ఆవిష్కరణ లక్ష్యంగా రీజెన్ – 2025 రీజనరేటివ్ మెడిసన్ సదస్సు శనివారం ప్రారంభమైంది. మూడు రోజుల ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 500 మందికి పైగా వైద్య ప్రతినిధులు హాజరయ్యారు. పునరుత్పత్తి వైద్యంలో అత్యాధునిక పురోగతిని చాటే విధంగా,, కొత్త పీఆర్పీ మార్గదర్శకాలు, ప్లేట్ లెట్ రిచ్ ప్లాస్మా థెరఫి సురక్షితం సిద్ధం చేసిన కర దీపికను రీజెన్ చైర్ పర్సన్ డాక్టర్ షర్మిలా తుల్పులే, ప్రభుత్వ మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అనస్థీషియా విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జికే కుమార్, ఆర్టో బయోలాజిక్స్ బయోటెక్ సహ వ్యవస్థాపకుడు నితీన్, అపోలో ఆస్పత్రి సీనియర్ కన్సలెంట్ డాక్టర్ నవలాడి శంకర్ విడుదల చేశారు. – సాక్షి, చైన్నె విచారణ ఖైదీ అనుమానాస్పద మృతి ●ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్ అన్నానగర్: తిరుప్పూర్ జిల్లాలోని ఉడుమలై ఫారెస్ట్ రిజర్వ్లోని కొండ తెగ నివాసి అయిన మారిముత్తును ఓ గోల్డ్ ఫిష్ కలిగి ఉన్నారనే ఆరోపణపై అటవీశాఖ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తిరుప్పూర్ జిల్లాలోని ఉడుమలై అటవీ శాఖ కార్యాలయంలో అతడిని విచారించారు. ఈ పరిస్థితిలో రెండు రోజుల క్రితం మారిముత్తు అనుమానాస్పదంగా మరణించాడు. దీంతో షాక్ అయిన అతని కుటుంబ సభ్యులు, కొండప్రాంత ప్రజలు సరైన దర్యాప్తు కోరుతూ నిరసన చేపట్టారు. ఈ పరిస్థితిలో మానుపట్టి అటవీ తిరుపూర్ జిల్లా అటవీ అధికారి రాజేష్ కుమార్ ఇద్దరు వ్యక్తులను, అంటే నిమల్ అనే ఫారెస్ట్ గార్డు సెంథిల్ కుమార్ను తొలగించాలని ఆదేశించారు. ఇంతలో మారిముత్తు మృతి నేపథ్యంలో ఉడుమలై, కుట్టైదిడల్ రోడులో సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. శుక్రవారం రాత్రి, తిరుప్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష పూర్తయింది. మారిముత్తు మృతదేహాన్ని అంబులెన్స్లో ఉడుమలైకి తీసుకువచ్చారు. కుట్టై దిడల్ వద్ద గుమిగూడిన కొండప్రాంత ప్రజలు మారిముత్తు అంత్యక్రియల్లో భారీగా పాల్గొన్నారు -
దేశ వ్యాప్త విస్తరణపై దృష్టి
సాక్షి, చైన్నె: దేశ వ్యాప్తంగా విస్తరణపై మాక్స్ఫ్రెష్ దృష్టి పెట్టినట్టు ఆ సంస్థ నిర్వాహకులు ప్రకటించారు.స్టెయిన్ లెస్–స్టీల్ వంట సామగ్రిలో ప్రీమియం బ్రాండ్లకు పేరుగడించిన మాక్స్ఫ్రెష్, వైబ్రాంట్ ఇండియా 2025 ఎక్స్పో చైన్నె ట్రేడ్ సెంటర్లో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 3వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో అన్ని రకాల కిచెన్ సొల్యూషన్స్ సామగ్రి శ్రేణిని కొలువుదీర్చారు. వంట సామగ్రి, గృహోపకరణలు, గిఫ్ట్ డెకర్ బ్రాండ్లతో గృహాలకు అవసరమైన అన్ని రకాల వస్తువులను ఒకే చోట ప్రదర్శనలో ఉంచారు. ఈసందర్భంగా ఎక్స్పోలో ట్రిపుల్ కుక్ వేర్, స్టీమర్లతో బహుముక లైనప్ను ప్రదర్శించారు. -
వెయ్యి ప్రసూతి కిట్ల పంపిణీ
కొరుక్కుపేట: ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా చైన్నె నగర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాస్పత్రులకు రూ.10 లక్షల విలువైన వెయ్యి ప్రసూతి కిట్లను రోటరీక్లబ్లు పంపిణీ చేశాయి. సమాజ సేవ, ప్రసూతి ఆరోగ్య సంరక్షణ మద్దతు తెలుపుతూ చైన్నె జిల్లా 3234కి చెందిన 40కి పైగా రోటరీ క్లబ్లు, క్లబ్ ఫస్ట్ లేడీస్ ఆర్ఏడబ్ల్యూ 2 (రోటరీ యాక్షన్ ఫర్ ఉమెన్ 2) కలసి ప్రసూతి కిట్ల పంపిణీ చొరవకు చేతులు కలిపాయి. ప్రథమ మహిళ రొటేరియన్ ఉషా సరోగి, డాక్టర్ సుసాన్ వర్గీస్, సీఎస్హెచ్ డైరెక్టర్ సూర్యనారాయణరావు నేతృత్వంలో ఈ నెల ఒకటి నుంచి 5వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వాస్పత్రుల్లో వెయ్యి ప్రసూతి కిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఈ ప్రసూతి కిట్లు ప్రసవానికి ముందు, ప్రసవానంతర తల్లులకు ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నారు. ఈ ఆస్పత్రులకు అవసరమైన పరికరాలను విరాళంగా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. స్థానిక షినాయ్ నగర్లో జరిగిన కార్యక్రమంలో ప్రసూతి కిట్లను శుక్రవారం పంపిణీ చేశారు. -
కంటి వెద్యశిబిరానికి విశేష స్పందన
తిరువొత్తియూర్: రాజన్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో ఎస్కేపీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కళాశాల కరస్పాండెంట్ వూటుకూరు శరత్కుమార్, ఇన్చార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ పీబీ వనిత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవీ నప్పిన్నై. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి.భరణికుమారి తదితరులు పాల్గొ ని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి, పరీక్షలు చేయించుకున్నారు. సాధారణ ప్రజలు, విద్యార్థులు, ఎస్కేపీసీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఎస్కేపీడీ బాలుర పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎస్కేపీడీ చారిటీస్ సభ్యులు సహా 350 మందికి పైగా ప్రయోజనం పొందారు. అవసరమైన వారికి కళ్ల అద్దాల పంపిణీ చేశారు. -
క్లుప్తంగా
జాలరి హత్య అన్నానగర్: ఓ జాలరి హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రామనాథపురం జిల్లాలోని మండపం సేతునగర్కు చెందిన ధనశేఖరన్ కుమారుడు కలంజియం(49) మత్స్యకారుడు. ఇతనికి భార్య, 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కుటుంబ వివాదం కారణంగా, కలంజియం కొన్నేళ్లుగా తన భార్య, కొడుకు నుంచి విడిపోయి ఒంటరిగా నివసిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మండపం రైల్వే రోడ్డు ప్రాంతంలోని సూపర్ మార్కెట్ ముందు పడుకుని నిద్రపోతున్నాడు. ఆ సమయంలో, ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి అతడిని కత్తిని మెడ కోసేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కార్మికురాలి దుర్మరణం తిరువొత్తియూరు: చైన్నె తాంబరం సమీపంలో కారు ఢీ కొని గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పారిశుద్ధ్య కార్మికురాలు శుక్రవారం ఉద యం మృతి చెందారు. తాంబరం సమీపం సిద్ధా లపాక్కం ప్రాంతానికి చెందిన ఏలుమలై. అతని భార్య రాణి( 30) తాంబరం మున్సిపల్ కార్పొరేషనన్లో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. గత ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో రాణి ఇతర పారిశుద్ధ్య కార్మికులు తూర్పు తాంబరం, వేళచ్చేరి రోడ్డులో చెత్తను తొలగిస్తున్నారు. ఆ సమయంలో రాణి రోడ్డు పక్కన నిలబడి ఉండగా మేడవాక్కం నుంచి తాంబరం వైపు వస్తున్న ఒక కారు అకస్మాత్తుగా రోడ్డు పక్కన ని లబడి ఉన్న రాణిని వేగంగా ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాల య్యాయి. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన తోటి కార్మికులు వెంటనే ఆమెను క్రోమ్పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం చైన్నె రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ రాణికి చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను పల్లికరనై ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. విద్యార్థులకు లైంగిక వేధింపులు – మతబోధకుడి అరెస్టు తిరువళ్లూరు: ట్యూషన్కు వచ్చిన బాలికలను లైంగిక వేధింపులకు గురి చేసిన మతబోధకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం సమీపంలోని బమ్మత్తుకుళం ప్రాంతానికి చెందిన కామరాజ్ అలియాస్ విక్టర్(54). ఇతను అదే ప్రాంతంలో క్రైస్తవ చర్చీని నిర్వహిస్తూ మతబోధనలు చేస్తున్నాడు. ఇతడి భార్య సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో పని చేస్తున్నారు. సాయంత్రం సమయంలో స్థానికంగా ఉన్న పిల్లలకు ట్యూషన్ చెబుతున్నాడు. ఈ క్రమంలో ట్యూషన్కు వచ్చే చిన్నపిల్లలు, బాలికలను లైంగిక వేధింపులకు గురి చేసినట్టు తెలు స్తుంది. దీంతో బాలికలు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పి వారి ద్వారా సెంగుడ్రం మ హిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విక్టర్ను అరెస్టు చేశారు. 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడి తిరువొత్తియూరు: బాలికపై లైంగిక దాడి చేసి గర్భిణి చేసిన కూలిని పోలీసులు పొక్సో చట్టం కింద అరెస్టు చేశారు. సేలం జిల్లా ఏర్కాడ్ కోవిలూర్ ప్రాంతానికి చెందిన వివేక్ (21) చెట్లు నరికే కూలీగా పనిచేస్తాడు. ఇతడు గత మార్చి నెలలో ధర్మపురి జిల్లా పాపిరెడ్డిపట్టి ప్రాంతంలోని బంధువుల ఇంట్లో జరిగిన విందుకు వచ్చాడు. ఆ సమ యంలో అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. దీంతో వివేక్ ఆ బాలికకు ఆశ మాటలు చెప్పి, లైంగిక దాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం దెబ్బతిన్న బాలికను ఆమె తల్లిదండ్రులు ధర్మపురి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి, ఆ బాలిక 5 నె లల గర్భిణి అని తెలిపారు. అది విని తల్లిదండ్రు లు దిగ్భ్రాంతి చెందారు. బాలిక గర్భానికి కారణం వివేక్ అని తెలిసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, వివేక్ను అరెస్టు చేశారు. ముగిసిన నాలుగు రోజుల కస్టడీతిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన పాఠశాల బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడిని నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీ విచారణ ముగిసిన క్రమంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ శుక్రవారం ఉదయం కోర్టులో హాజరు పరిచి, ఈనెల 8 వరకు రిమాండ్ విధించడంతో పుళల్ జైలుకు తరలించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని ఆరంబాక్కం ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలిక గత 12న పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 13 రోజుల తరువాత ఆంధ్రాలోని సూళూరుపేట రైల్వేస్టేషన్లో నిందితుడిని అరెస్టు చేశా రు. అనంతరం గత శనివారం పూందమల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్దకు తీసుకెళ్ళి హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన క్రమంలో పుళల్ జైలు కు తరలించారు. పోలీసుల విచారణలో నిందితు డు ఒడిశాకు చెందిన రాజూబిష్మవర్మ(35)గా గు ర్తించారు. నిందితుడుని ఆరంబాక్కం పోలీసులు ఏడు రోజులు కస్టడీకి అప్పగించాలని కోరుతూ గత సోమవారం పోక్సో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మంగళవారం న్యాయస్థా నం విచారణకు స్వీకరించింది. కేసును న్యాయ మూర్తి ఉమామహేశ్వరి విచారించి నాలుగు రో జులు కస్టడీకి ఇచ్చారు. పోలీసులు నిందితుడిని ఆరంబాక్కం, సూళూరుపేటకు తీసుకెళ్లి విచారణ చేశారు. కస్టడి ముగిసిన క్రమంలో శుక్రవారం భారీ బందోబస్తు నడుమ తిరువళ్లూరు కోర్టుకు తీసుకొచ్చారు. అనంతరం నిందితుడ్ని పుళల్ జైలుకు తరలించారు. -
రోజువారీ చెత్త పన్నులు వసూలు చేయాలి
తిరువళ్లూరు: ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువగా ఉన్న భవనాలు, వ్యాపార సముదాయాలు, కట్టడాల నుంచి చెత్తకుప్పల సేకరణకు దినసరి పన్నులు వసూలు చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే తిరువళ్లూరులో అమలు చేయాలని కౌన్సిలర్ థామస్ సూచించారు. తిరువళ్లూరు మున్సిపాలిటీ సాధారణ సమావేఽశఽం శుక్రవారం ఉదయం చైర్పర్సన్ ఉదయమలర్పాండ్యన్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి వైస్ చైర్మన్ రవిచంద్రన్, కమిషనర్ దామోదరన్ హాజరయ్యారు. సమావేశంలో కౌన్సిలర్ థామస్ మాట్లాడుతూ ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ ఉన్న హాటళ్లు, కల్యాణమండపాలు, షాపింగ్మాళ్లు, సూపర్మార్కెట్లు, ప్రైవేటు వైద్యశాలలు, వ్యాపార వాణిజ్య సముదాయాల నుంచి చెత్తసేకరణకు దినసరి పన్నులు వసూలు చేయాలన్న నిబంధనలు ఉన్నాయని, వాటిని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ కౌన్సిలర్ కౌన్సిల్ దృష్టికి తెచ్చిన విషయాన్ని అమలు చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని వాటిని అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. దీంతో పాటు మున్సిపాలిటీ పరిధిలో కొన్ని పార్క్లను కొందరు అక్రమించుకుని కట్టడాలు నిర్మిస్తున్నారని, అయితే సంబంధిత కట్టడాలకు మున్సిపల్ ప్లానర్ లంచం తీసుకుని అనుమతి కూడా ఇస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ భూమిని అక్రమించుకుని కడుతున్న నిర్మాణాలకు ప్రభుత్వ అధికారులు ఎలా అనుమతి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీంతో పాటు మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు శాంతి, సుమిత్ర, అరుణ, అయూబ్, సెల్వకుమార్, జాన్, ప్రభాకరన్ పాల్గొన్నారు. -
ఆడిపెరుక్కు సందడి
సాక్షి, చైన్నె : డాక్టర్ ఎంజీఆర్ జానకి మహిళా కళాశాలలో శుక్రవారం విద్యార్థినుల ఆడి పెరుక్కు సందడి కోలాహలంగా జరిగింది. నాలుగు వేల మంది విద్యార్థినులు తమిళ సంప్రదాయానికి అనుగుణంగా ఆడి పెరుక్కును జరుపుకున్నారు. తొమ్మిది రకాల ధాన్యాలు, చిక్కుళ్లు మొలకలతో నిండిన మట్టి కుండలను ఊరేగిస్తూ పూజలు చేశారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలో దీపాలను వెలిగించారు. నదీ తీరాల్లో చేసే సంప్రదాయ పద్దతిని అనుసరిస్తూ నిమ్మకాయ, చింతపండు, కొబ్బరితో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. ఈ ఉత్సవంలో భాగంగా విద్యార్థినుల దేవరాట్టం, కరగాట్టం, పులియాట్టం, ఒయిలాట్టం, సకై ్కయాట్టం, పోయ్ కాల్ కుదిరై యాట్టం, మైలాట్టం, వంటి నృత్య రూపకాలు సంప్రదాయబద్ధంగా ప్రదర్శించారు. కళాశాల చైర్ పర్సన్ డాక్టర్ కుమార్ రాజేంద్రన్ మాట్లాడుతూ మానవ జాతి పురోగతి సాధించడానికి, శాంతియుతంగా, సంప్రదాయాన్ని పరిరక్షించుకునేందుకు ,మన మూలాలను తెలుసుకోవాల్సిన అవశ్యం ఉందన్నారు. 5 వేల సంవత్సరాల పురాతన సంప్రదాయాన్ని తెలుసుకోవడానికి, దాని భవిష్యత్తు తరానికి అందించడానికి దోహద పడే విధంగా తాము విద్యార్థినులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ, తమిళ సంస్కృతి, సంప్రదాయ పద్ధతులు, సంగీత, నృత్య రూపకాల మేళవింపుతో ఆడిపెరుక్కును కోలాహలంగా విద్యార్థినులు జరుపుకున్నారని వివరించారు. -
అర్హులకు కలైంజ్ఞర్ ఆరోగ్యశ్రీ కార్డు
వేలూరు: కలైంజ్ఞర్ ఆరోగ్యశ్రీ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వెంటనే అర్హులైన వారికి అందజేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. వేలూరు యూనియన్ పరిధిలోని సెంబేడు గ్రామ పంచాయతీ, గంగనల్లూరు గ్రామ పంచాయతీలో మీతో స్టాలిన్ పథకం ఆయా గ్రామ సర్పంచ్ల అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో కలెక్టర్ ముఖ్యఅతిథిగా హజరై కలైంజ్ఞర్ ఆరోగ్య శ్రీకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అక్కడిక్కడే కార్డులను అందజేశారు. అలాగే అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఈ పథకంలో మొత్తం 15 శాఖలకు సంబంధించిన అధికారులను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు దరఖాస్తు చేసుకున్న వినతులపై వెంటనే విచారణ జరిపి, అర్హులైన వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వినతిని ఆన్లైన్లో నమోదు చేసి అర్జీదారులకు రశీదు అందజేయాలన్నారు. అఽధికారులు ఆలసత్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం ప్రజల రిజిష్టర్ నమోదు కేంద్రం, రశీదు అందజేసే కేంద్రం తదితర వాటిని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వేలూరు యూనియన్ చైర్మన్ అముద, బీడీఓ విన్సంట్ రమేష్బాబు, డీఎంకే యూనియన్ చైర్మన్ జ్ఞానశేఖరన్, సర్పంచ్ అన్బయగన్ పాల్గొన్నారు. -
ఇతర భాషల్లో చేయడం అంటే..
తమిళసినిమా: దీన, రమణ, గజనీ, తుపాకీ, సర్కార్ ఇలా వరుసగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి స్టార్ దర్శకుల లిస్ట్లో స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు ఏఆర్.మురుగదాస్. ఈయన గజనీ చిత్రాన్ని హిందీలో అమీర్ఖాన్ హీరోగా చేసి విజయాన్ని సాధించారు. అదేవిధంగా రమణ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి హీరోగా స్టాలిన్ పేరుతో చేశారు. అదేవిధంగా ఇటీవల సల్మాన్ఖాన్ హీరోగా సికిందర్ అనే చిత్రాన్ని చేశారు. ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. పలువురు దర్శకుడితోపాటు యూనిట్ సభ్యులపై విమర్శలు గుప్పించారు. కాగా మురుగదాస్ ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ హీరోగా మదరాసి చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం సెప్టంబర్ 5న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఇతర భాషల్లో చిత్రాలు చేసేటప్పుడు దివ్యాంగుల్లా భావన కలుగుతుందన్నారు. అదే మాతృభాషలో చిత్రం చేయడం చాలా బలం అని అన్నారు. తెలుగు కూడా ఓకే అని, ఎందుకంటే తెలుగు భాష కూడా ఇంచుమించు మన భాషలానే ఉండడంతో పట్టు దొరుకుతుందన్నారు. భాష తెలియని ప్రాంతంతో చిత్రం చేయడం దివ్యాంగుల మాదిరి భావన కలుగుతుందనే అభిప్రాయాన్న దర్శకుడు మురుగదాస్ వ్యక్తం చేశారు. కాగా హిందీలో రెండు చిత్రాలు చేసిన ఆయన ఇలా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. -
విశాల్ 35వ చిత్రం ప్రారంభం
తమిళసినిమా: ఎదగడానికై నా, ఎదిగిన తరువాత అయినా ప్రచారం ముఖ్యంగా మారిన రోజులివి. అలాంటి ప్రచారంలో ఉన్నారు నటి వరలక్ష్మీ శరత్కుమార్. ఈమె తెలియని సినీ ప్రేక్షకులు ఉండరనే చెప్పవచ్చు. ఎందుకంటే వరలక్ష్మీ నటించిన పాత్రలు అలాంటివి. 2012లో పోడాపోడీ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఈమె శరత్కుమార్ వారసురాలు అన్నది తెలిసిందే. అయితే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా, అలాంటి పాత్రలకే పరిమితం కాకుండా ప్రతినాయకిగానూ నటించడమే ఈమె ప్రత్యేకత. అలా ఎలాంటి పాత్రకై నా రెడీ అనే వరలక్ష్మీ బహుభాషా నటి కూడా. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ భామ ఇటీవల పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. కారణాలేమైన ఇప్పుడీమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో అవకాశాల వేటలో పడ్డారనే చెప్పవచ్చు. అందులో భాగంగా శ్రీలంకకు వెళ్లి ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. శ్రీలంకలో చిన్నమోన్ లైఫ్ సిటీ ఆఫ్ డ్రీమ్స్ ప్రాంతంలో ఈమె ఫొటో షూట్ నిర్వహించినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ ఫొటోల్లో తనకే సొంతమైన అందంతో పాటు ధైర్యాన్ని వ్యక్తం చేసేలా వరలక్ష్మీ కనిపించడం విశేషం. పలు చిత్రాల్లో తన కంటూ ప్రత్యేకతను చాటుకున్న వరలక్ష్మీ ఇటీవల నటించిన ది వెర్డిక్ట్ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలను అందుకున్నారు. డేరింగ్ అండ్ డైనమిక్ నటిగా ముద్ర వేసుకున్న ఈ భామ మరిన్ని వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా వరలక్ష్మీ ఫొటో సెషన్ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తమిళసినిమా: నటుడు విశాల్ ఇటీవల మార్క్ ఆంటోని, మదగజరాజా చిత్రాల విజయాలతో మంచి జోష్లో ఉన్న విషయం తెలిసిందే. అలాగే త్వరలో ఓ ఇంటివాడు కూడా కాబోతున్నారు. నటి ఽసాయి దన్సికను జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నారు. ఇలాంటి సంతోషకరమైన తరుణంలో విశాల్ తన 35వ చిత్రానికి రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సూపర్గుడ్ ఫిలింస్ అధినేత నిర్మించడం విశేషం. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 99వ చిత్రం కావడం మరో విశేషం. ఇంతకు ముందు ఎందరో నూతన నటీనటులకు, సాంకేతిక వర్గానికి అవకాశాలు కల్పించి, వారి సినీ జీవితాలకు మంచి బాట వేసిన నిర్మాత ఆర్బీ.చౌదరి తాజాగా నిర్మిస్తున్న చిత్రానికి రవిఅరసు కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గత నెలలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు అందించారు. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ను శుక్రవారం ప్రారంభించారు. చిత్రం షూటింగ్ను సింగిల్ షెడ్యూల్లో 45 రోజుల్లో చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేయనున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం, రిజర్డ్ ఎం.నాథన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా నటి దుషారా విజయన్ నాయకిగా నటిస్తున్న ఇందులో తంబిరామయ్య, ఆర్జై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. శ్రీలంకలో వరలక్ష్మి ఫొటో సెషన్ -
సిల్వర్ జూబ్లీ
పొటో: 34: చైన్నె అడయార్లోని పాట్రిషియన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలు శుక్రవారం జరిగాయి. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి కోవి చెలియన్, ఘనా డిప్యూటీ ప్రావిన్స్ లీడర్ బ్రదర్ డాక్టర్ ఎస్ అరోకియారా, తమిళనాడు సాంకేతిక విద్యా కమిషనర్ జే ఇన్నోసెంట్ దివ్య, ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి జె.రాధాకృష్ణన్, పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ మేజర్ మనోజ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్ చాంగన్యూన్ కిమ్, సినీ దర్శకుడు రాజ్కుమార్ పెరియస్వామి, ఎమ్మెల్యే హసన్ మౌలానా, మద్రాసు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రీటాజాన్ హాజరయ్యారు. సిల్వర్ జూబ్లీ జ్ఞాపిక, కాఫీ టేబుల్ బుక్, డాక్యుమెంటరీ చిత్రాలను ఈసందర్భంగా ఆవిష్కరించారు. – సాక్షి, చైన్నె : -
● సీఎం సమక్షంలో ఐఐటీతో ఒప్పందం ● తిరువణ్ణామలైలో టైడల్ పార్కు ● విదేశీ యాత్రకు తమిళ యువత
సాక్షి, చైన్నె : స్వచ్ఛ తమిళనాడు లక్ష్యంగా ఒక ప్రత్యేక ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రాసెసింగ్ రంగంలో సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణలో స్వచ్ఛ తమిళనాడు సంస్థ కోసం ఒక కార్యాచరణ రూపకల్పనకు ఐఐటీ మద్రాసుతో సీఎం స్టాలిన్ సమక్షంలో శుక్రవారం ఒప్పందాలు జరిగాయి. తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ కార్యక్రమాల్లో ప్రస్తుతం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోజూవారీ ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను నిర్వహించడంలో కీలకమైన అంశంగా మారింది. ఇందుకోసం పరిశుభ్రత ఉద్యమం అనే ఐక్య ఉద్యమంపై దృష్టి పెట్టారు. ఇందుకోసం స్వచ్ఛ తమిళనాడు ఉద్యమంపై దృష్టి పెట్టారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద స్థానిక సంస్థల ద్వారా రాష్ట్రానికి స్థిరమైన వ్యర్థ నిర్వహణ పరిష్కారాల కోసం ఈ కార్యకలాపాలను స్వచ్ఛ తమిళనాడు సంస్థ నిర్వహించే విధంగా దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా, స్వచ్ఛ తమిళనాడు సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను శాసీ్త్రయంగా, అధునాతన పద్ధతిలో శుద్ధి చేయడానికి టెక్నాలజీని ఉపయోగించేందుకు సన్నద్ధమైంది. రీసైకిల్ చేయడం, బలమైన ఇంటిగ్రేటెడ్ నిర్మాణాన్ని నిర్మించడం కోసం మద్రాసు ఐఐటీతో స్వచ్ఛతమిళనాడు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. నిబంధనలకు అనుగుణంగా పునర్వివినియోగం, రీసైక్లింగ్ కోసం ఈ అవగాహన ఒప్పందంలో అంశాలను వివరించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, అదనపు ముఖ్య కార్యదర్శి ప్రదీప్ యాదవ్, స్వచ్ఛ తమిళనాడు కార్పొరేషన్చ్ఛెండీ డాక్టర్ ఎస్.ఉమ, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ కామకోటి పాల్గొన్నారు. జర్నలిజం: చైన్నె ఇన్న్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం విద్యార్థుల దరఖాస్తుల తేదీని పొడిగిస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి విద్యార్థుల ప్రవేశం దరఖాస్తులకు ఈనెల 3వ తేదీ చివరి రోజు. అయితే, ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులకు ఈనెల పదో తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టెలివిజన్, రేడియో , ఆన్న్లైన్ మీడియాలో పనిచేయడానికి అధిక–నాణ్యత విద్య పాఠ్యాంశాలు రూపొందించామని ప్రకటించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చైన్నె మహానగర అభివృద్ధి సంస్థ తరఫున 4 ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. అలాగే 26 కొత్త ప్రాజెక్టులకు స్టాలిన్ శంకుస్థాపన చేశారు. మంత్రి శేఖర్బాబు పాల్గొన్నారు. తదుపరి జరిగిన కార్యక్రమంలో జాతీయ సహకార చక్కెర మిల్లుల సమాఖ్య ద్వారా మెరుగైన పనితీరు కోసం తమిళనాడులో 5 చక్కెర సహకార సంస్థలు, కర్మాగారాలకు లభించిన అవార్డులను సంబంధిత అధికారులు సీఎం స్టాలిన్కు అందజేశారు. మంత్రి రాజేంద్రన్ అన్ని అవార్డులను సీఎం స్టాలిన్కు సమర్పించారు. అలాగే, పర్యాటక రంగంలో 5 కొత్త ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. అలాగే, ఎగ్మూర్ మ్యూజియం కాంప్లెక్స్లో నిర్మించిన కొత్త పరిపాలనా భవనాన్ని సీఎం ప్రారంభించారు. మంత్రులు స్వామినాథన్, రాజేంద్రన్ పాల్గొన్నారు. కాగా, గత నెల సీఎం స్టాలిన్ అనారోగ్యసమస్యతో తిరుప్పూర్ పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. ఈ పర్యటన ఈనెల 11,12 తేదీ జరగనున్నట్టు అధికారులు ప్రకటించారు. తిరువణ్ణామలైలో మినీ టైడల్ పార్కు తిరువణ్ణామలైలో రూ.37 కోట్లతో కొత్త మినీ టైడల్ పార్క్ ఏర్పాటు పనులకు సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. 600 కొత్త ఉద్యోగాల కల్పన దిశగా ఈ మినీ టైడల్ పార్కు రూపుదిద్దుకోనుంది. మంత్రులు ఏవీ వేలు, డాక్టర్ టీఆర్బీ రాజా, పరిశ్రమ శాఖ కార్యదర్శి వి.అరుణ్రాయ్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో 14 దేశాల్లో ‘తమిళ మూలాల అన్వేషణలో’ ప్రాజెక్ట్లో భాగంగా ఎన్ఆర్ఐ తమిళ యువత కోసం తమిళనాడు సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రత్యేక పర్యటన నిమిత్తం ఎంపికై న 99 మంది తమిళ యువకులకు ప్రయాణం, నోట్స్, పుస్తకాలు, ఐడీ కార్డులు, వస్త్రాలు, ఇతర సామగ్రిని సీఎం స్టాలిన్ పంపిణీ చేశారు. ఇప్పటికే మూడు విడతల పయనం ముగియగా, తాజాగా మలి విడతగా నాలుగో విడతలో 14 దేశాల్లో 99 మంది తమిళుల యువత 16 రోజుల పాటు పర్యటించనున్నారు. మంత్రి నాజర్, అధికారులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో అన్నకూట మహోత్సవం
కొరుక్కుపేట: చైన్నెలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో నిర్వహించిన ఆడి శుక్రవార అన్నకూట మహోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలపైన శ్రీకన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల వద్ద వాసవాంబకి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 102 పాల బిందెలతో మహిళలు ఊరేగింపుగా శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయానికి మంగళ వాయిద్యాలు, జై వాసవీ...జైజై వాసవీ నినాదాల నడుమ చేరుకున్నారు. ఆలయంలో వాసవాంబకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి విశేషాలంకరణ చేసి, అన్నం రాశిగా పోసి అన్నకూట మహోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు భాస్కర్ పంతులు నేతృత్వంలో అన్నకూట మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి దీపారాధన చేసి, రాశిగా పోసిన అన్నాన్ని ప్రసాదంగా తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ వాసవి క్లబ్ షావుకారు పేట బృందం నిర్వహించిన భక్తి గీతాలాపన అందరినీ అలరించింది. -
సస్పెన్స్, థ్రిల్లర్గా సరెండర్
తమిళసినిమా: క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ కథ, కథనాలతో తెరకెక్కిన చిత్రం సరెండర్. బిగ్బాస్ ఫేమ్ దర్శన్ కథానాయకుడిగా నటించిన ఇందులో మలయాళ నటుడు లాల్, మన్సూర్అలీఖాన్, మునీష్కాంత్, సుజిత్, పడినే కుమార్, అరోళ్ డి.శంకర్, రమ్య రామకృష్ణన్, సుందరేశ్వరన్, కౌశిక్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా గౌతమ్ గణపతి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈయన దర్శకుడు అరివళగన్ శిష్యుడన్నది గమనార్హం. మెయ్యేంద్రన్ చాయాగ్రహణం, వికాశ్ బడీశా సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని ఆఫ్ బీట్ పిక్చర్స్ పతాకంపై వీఆర్వీ.కుమార్ నిర్మించారు. సరెండర్ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా పోలీసుశాఖ, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే కథ, కథనాలతో సాగే ఈ చిత్రం ఎన్నికలకు ఐదు రోజుల ముందు జరిగే సన్నివేశాలతో ప్రారంభం అవుతుంది. ఎన్నికలకు ముందు ఒక నటుడు తన పర్సనల్ గన్ను పోలీస్స్టేషన్లో సరెండర్ చేస్తాడు. అది మిస్ అవుతుంది. కాగా అదే సమయంలో ఒక రాజకీయ పార్టీకి చెందిన వారు ఓట్ల కోసం ప్రజలకు పంపిన నగదు మిస్ అవుతుంది. ఈ రెండు సంఘటనలతో జరిగే కథే సరెండర్. మిస్ అయిన గన్ కోసం పోలీసులు, ఓటర్లకు పంచాల్సిన డబ్బును కనుగొనడానికి రాజకీయ నాయకులు పడే పాట్లే ఈ చిత్రం. చిత్ర కథ బిగువైన స్క్రీన్ప్లేతో దర్శకుడు గౌతమ్ గణపతి తెరపై ఆవిష్కరించారు. నటుడు దర్శన్ ట్రైనీ ఎస్ఐగా పాత్రకు పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి. ఇక లాల్ పోషించిన పోలీస్ రైటర్ పాత్ర చిత్రానికి కీలకమనే చెప్పాలి. మొత్తం మీద సరెండర్ చిత్రం సినీ ప్రముఖుల నుంచి, విమర్శకుల నుంచి పాజిటివ్ రిపోర్ట్ తెచ్చుకుంటోంది. -
రిటైర్ పోలీస్ అధికారులకు సత్కారం
కొరుక్కుపేట: చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ శాఖలో 24 మంది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు గురువారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ మేరకు చైన్నె వేపేరిలోని చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనరేట్లో జరిగిన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో చైన్నె నగర పోలీస్ కమిషనర్ ఎ.అరుణ్ పాల్గొని చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ శాఖలో 25 సంవత్సరాలకు పైగా సేవలందించినందుకు 24 మందిని ఘనంగా సత్కరించారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ అదనపు కమిషనర్ విజయేంద్ర బిదారి,, డిప్యూటీ కమిషనర్లు డి.ఎన్.హరికిరణ్ ప్రసాద్, జి.సుబ్బులక్ష్మి, పోలీసు అధికారులు, ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
బాధ్యతల స్వీకరణ
తమిళసినిమా: ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం సినీ కళాకారుల ప్రతిభను గౌరవవించేలా జాతీయ అవార్డులను ప్రకటించి, వారిని జ్ఞాపికలతో సత్కరిస్తోంది. ఈ క్రమంలో 2023వ ఏడాదికిగాను 71వ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఆ పట్టికలో తమిళ చిత్రపరిశ్రమ ఐదు జాతీయ అవార్డులను గెలుచుకోవడం విశేషం. పార్కింగ్ చిత్రం ఏకంగా మూడు అవార్డులఽను గెలుచుకుంది. ప్రాంతీయ భాషలో పార్కింగ్ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును, ఉత్తమ సహాయ నటుడు అవార్డును గెలుచుకుంది. అలాగే నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన వాత్తీ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు లభించింది. హరీశ్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం పార్కింగ్. రామ్కుమార్ బాలకృష్ణన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఫ్యాషన్ స్టూడియోస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంస్థల నిర్వాహకులు సుధన్ సుందరమ్, కేఎస్ శినీష్ కలిసి నిర్మించారు. నటుడు ఎంఎస్ భాస్కర్ ముఖ్య పాత్రను పోషించిన ఈ చిత్రం 2023లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా ఇప్పుడు ఈ చిత్రానికి ఉత్తమ కథా చిత్రం అవార్డుతో పాటు ఉత్తమ స్క్రిన్ప్లే అవార్డును దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్కు, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటుడు ఎంఎస్ భాస్కర్కు అవార్డు వరించింది. అలాగే నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన వాత్తీ చిత్రానికి సంగీతం అందించిన జీవీ ప్రకాష్ కుమార్కు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వరించింది. అలాగే వీటిల్ వింగ్స్ అనే డాక్యుమెంటరీ చిత్రానికి జాతీయ అవార్డు వరించింది. ఈ సందర్భంగా తనకు జాతీయ అవార్డును ప్రకటించిన జాతీయ అవార్డుల కమిటీకి సంగీత దర్శకుడు ధన్యవాదాలు తెలిపారు. అలాగే వాత్తీ చిత్రానికి పని చేసే అవకాశం కల్పించినందుకు గాను నటుడు ధనుష్కు, ఆ చిత్ర దర్శక నిర్మాతలకు ఇతర యూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తాను అందుకోనున్న రెండో జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు అని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. భారత ఆర్మీ దక్షిణ భారత్ ఏరియా కొత్త జనరల్ ఆఫీసర్ కమాండింగ్గా లెఫ్టినెంట్ జనరల్ వి శ్రీహరి నియమితులయ్యారు. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా మెరీనా తీరంలోని వార్ మెమోరియల్వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఆర్మీ వర్గాలు గౌరవ వందనంతో ఆహ్వానం పలికాయి. – సాక్షి, చైన్నె: -
బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు!
సాక్షి, చైన్నె : బీజేపీతో పొత్తుప్రసక్తే లేదని ఎండీఎంకే నేత వైగో స్పష్టం చేశారు. మళ్లీ డీఎంకే అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఎండీఎంకే నేత వైగో రాజ్యసభ పదవీ కాలం గత నెల ముగిసిన విషయం తెలిసిందే. ఆయనకు మళ్లీ అవకాశం దక్కుతుందని ఎండీఎంకే వర్గాలు ఎదురుచూశాయి. అయితే డీఎంకే కరుణించ లేదు. అదేసమయంలో ఈ సారి ఎన్నికల్లో ఎండీఎంకే రూటు మార్చే అవకాశాలు ఉన్నాయని, డీఎంకేకు మోసం చేయడం ఖాయం అనే చర్చ ఊపందుకుంది. అదే సమయంలో ఆ పార్టీలో వైగో, ఆయన తనయుడు, ఎంపీ దురైవైగోలతో సీనియర్నేత మల్లై సత్య ఫైట్ వెలుగులోకి రావడం చర్చకు మరింత బలాన్ని చేకూర్చినట్లైంది. ఈ వివాదానికి డీఎంకే కారణం కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ఉదయం సీఎం స్టాలిన్ను క్యాంప్ కార్యాలయంలో ఎండీఎంకే నేత వైగో, ఎంపీ దురైవైగో భేటీ అయ్యారు. ఆస్పత్రి నుంచి వచ్చినానంతరం స్టాలిన్ను పరామర్శించే దిశగా ఈ భేటీ సాగినా, రాజకీయ అంశాల గురించి చర్చించుకున్నట్టు సమాచారం. అనంతరం మీడియాతో వైగో మాట్లాడుతూ, సీఎం స్టాలిన్ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేయడానికి, ఆయన సోదరుడు ముత్తు మరణానికి సంతాపంగా పరామర్శించేందుకు వచ్చినట్టు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 19న ఎండీఎంకే నేతృత్వంలో జరగనున్న అన్నా జయంతి వేడుకల మహానాడుకు హాజరు కావాలని సీఎంను ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం నేరాల మీద ఉక్కు పాదం మోపుతోందని, తప్పు చేసిన వాళ్లను వదలి పెట్టడం లేదని ఈసందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి మళ్లీ అధికార పగ్గాలు రాష్ట్రంలో చేజిక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన బీజేపీతో ఎలాంటి పరిస్థితుల్లోనూ, తాము పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మళ్లీ అధికారంలోకి డీఎంకే ఎండీఎంకే నేత వైగో -
కోలీవుడ్కు ఐదు జాతీయ అవార్డులు
ఆడి వెళ్లి కోలాహలం● – అమ్మన్ సన్నిధుల్లో పూజలు సేలం : ఆషాఢమాసం మూడో శుక్రవారం అమ్మవారి ఆలయాలు భక్తులతో కిట కిటలాడాయి. అమ్మవారి సన్నిధుల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. అనేక చోట్ల మహిళలు 1008 పాల బిందెలతో ఊరేగింపుగా ఆలయాలకు వెళ్లారు. ఆడి మాసం(ఆషాఢం) వస్తే చాలు తమిళనాడులో భక్తి భావం మిన్నంటుతుందన్న విషయం తెలిసిందే. ఈ మాసంలో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. భక్తి భావంతో మిన్నంటుతాయి. ఆడి అమావాస్య రోజున పితృదేవుళ్లకు తర్పణాలు వదిలి వారి ఆత్మల శాంతికి పూజలు చేస్తారు. ఈ నెలలో వచ్చే ప్రతి శుక్ర, ఆదివారాల్లో ఇంటింటింటా ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. ఈ మాసంలో మూడో శుక్రవారం కావడంతో ఉదయం నుంచి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా చేశారు. వేకువ జామున అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు జరిగాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయాలకు తరలి వెళ్లి, మొక్కుల్ని తీర్చుకున్నారు. గ్రామ దేవతల ఆలయాల్లో సైతం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇళ్లల్లోను ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అమ్మవారి ఆలయాల్లో ఉత్సవాలు, వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం చైన్నె, శివారుల్లోని ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు భక్తులతో నిండాయి. మైలాపూర్ ముండకన్ని అమ్మన్ ఆలయంలో ఉదయాన్నే అభిషేకం, పసుపు కుంకుమలతో అమ్మవారి అలంకరణ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. తిరువేర్కాడు కరిమారియమ్మన్ ఆలయం, మాంగాడు కామాక్షి అమ్మవారి ఆలయం, పురసై వాక్కం పాతాల పొన్నియమ్మన్ ఆలయం, కందన్ చావడి కన్నియమ్మన్ ఆలయాల్లోను ప్రత్యేక పూజలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీ నగర్లోని వేంబులి అమ్మవారి ఆలయానికి ఆ పరిసరాల్లోని మహిళా భక్తులు 1008 మంది తలపై పాల బందెల్ని ఉంచుకుని ఊరేగింపుగా తరలివచ్చారు. సేలం మారియమ్మన్ ఆలయంలో గాజుల పండుగ జరిగింది. ఆ పరిసరాలలోని అమ్మన్ ఆలయాల్లోని దేవతా మూర్తులను ఒక చోట చేర్చి గాజులతో అలంకరించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. -
క్లుప్తంగా
అడ్డంకులు వచ్చినా ఎదుర్కోవాలి వేలూరు: విద్యార్థులు జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తిగా మారాలని చైన్నె అన్నాయూనివర్సిటీ నానో టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ టి.దేవసేన అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని అగ్జిలియమ్ మహిళా డిగ్రీ కళాశాలలో 66వ స్నాతకోత్సవ కార్యక్రమం కళాశాల కార్యదర్శి డాక్టర్ ఆరోగ్యమేరి జోసిపిన్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై వివిధ కోర్సుల్లో డిగ్రీలు పూర్తి చేసిన 879 మందికి డిగ్రీ, 241 మందికి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాలను అందజేసి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేసేందుకే బ్రిటీష్ వారి కాలంలోనే అగ్జిలియమ్ కళాశాలను ప్రారంభించారన్నారు. క్రమశిక్షణతో ఉంటే మాత్రమే ఉన్నత శిఖరాలకు వెళ్లగలమన్నారు. డిగ్రీలు సాధించిన విద్యార్థులు పరిశోధనలు చేసేందుకు ఆశక్తి చూపాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టిర్ ఆరోగ్య జయశీలి, వైస్ ప్రిన్సిపల్ అమల వలర్మది, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ డీన్ విన్సీ, ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కలైసెల్వి, విద్యార్థినిలు, ఫ్రొఫెసర్లు పాల్గొన్నారు. పుట్టినరోజునే కానరాని లోకాలకు.. –ట్యాంకర్ ఢీకొని ఎస్ఐ దుర్మరణం అన్నానగర్: పుట్టినరోజే ఓ ఎస్ఐ తుదిశ్వాస విడిచాడు. ట్యాంకర్ ఢీకొని ఓ ఎస్ఐ దుర్మరణం చెందాడు. కీరనూరుకు చెందిన ముత్తుకుమార్ (52) పుదుక్కోట్టై జిల్లా కీరనూర్ పోలీస్స్టేషన్న్లో ఎస్ఐ. శనివారం తన పుట్టినరోజున స్వస్థలమైన వెల్లనూర్ సమీపంలోని వడచేరి పట్టిలో ఉన్న తల్లిని చూడడానికి పుదుక్కోట్టై నుంచి బైక్లో బయలుదేరాడు. నెడుంచేరి ప్రాంతంలో వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్యాంకర్ బైక్ను ఢీకొంది. ఈఘటన తీవ్రంగా గాయపడిన ముత్తుకుమార్ను స్థానికులు తిరుచ్చిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన నామక్కల్ జిల్లా మోహనూర్కు చెందిన ట్యాంకర్ డ్రైవర్ కృష్ణసామిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీ రోడ్డుకు నటుడు జయశంకర్ పేరు తమిళసినిమా: స్థానిక నుంగంబాక్కంలో పాపులర్ అయిన వీధి పేరు కాలేజీ రోడ్డు. కాగా అదే రోడ్డులో ప్రముఖ దివంగత నటుడు మక్కల్ కలైంజర్ జయశంకర్ ఇల్లు ఉంది. తమిళ చిత్ర పరిశ్రమలో చిరస్మరణీయమైన నటుడు జయశంకర్. తమిళ జేమ్స్బాండ్గా పేరు గాంచిన ఈయన తనదైన నటనతో తమిళ ప్రేక్షకుల మన్ననలను పొందారు. అలా తమిళ సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించినందుకు గానూ కాలేజీ రోడ్డుకు మక్కల్ కలైంజర్ జయశంకర్ రోడ్డుగా పేరు మార్చినట్లు చైన్నె మహానగరం శాఖ పేర్కొంది. దీని గురించి చైన్నె మహానగరం జాయింట్ డైరెక్టర్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో స్థానిక నుంగంబాక్కంలోని కాలేజ్ రోడ్డులో నటుడు జయశంకర్ ఇల్లు ఉండడంతో ఆ రోడ్డుకు ఇప్పుడు మక్కల్ కలైంజర్ జయశంకర్ రోడ్డుగా ప్రభుత్వం అనుమతితో పేరు మార్చినట్లు పేర్కొన్నారు. పథకాన్ని విజయవంతం చేయాలి వేలూరు: మీతో ముఖ్యమంత్రి పథకం విజయవంతం కావడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే నందకుమార్ అన్నారు. వేలూరు డీఎంకే పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈనెల 7న కరుణానిధి ఏడవ వర్ధంతి పురష్కరించుకుని ఆయన విగ్రహాలకు నివాళులర్పించాలన్నారు. అదేవిధంగా తమిళనాడులో డీఎంకే పార్టీలో రెండు కోట్ల మందికి సభ్యత్వం ఇప్పించి పార్టీ విజయం సాధించేందుకు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్లకు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేశారు. మీతో స్టాలిన్ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల వినతి పత్రాల కేంద్రం ఏర్పాటు చేసి పథకం విజయం సాధించేందుకు ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. అనంతరం వివిధ సమస్యలపై సమీక్షించించి తీర్మానం చేశారు. ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్కుమార్, మాజీ ఎంపీ మహ్మద్సఖీ, యూనియన్ కార్యదర్శలు జ్ఞానశేఖరన్, శరవణన్, గజేంద్రన్, కరుణాకరన్, తనికాచలం పాల్గొన్నారు. -
వ్యవసాయ భూములను సేకరిస్తే ఆందోళన
–అన్బుమణి రామదాస్ తిరువళ్లూరు: వ్యవసాయ భూములను ధ్వంసం చేసి శాటిలైట్ సిటీని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే రైతుల తరఫున ఆందోళన చేస్తామని పీఎంకే రాష్ట్ర అధ్యక్షుడు అన్బుమణిరామదాస్ అన్నారు. తమిళ ప్రజల హక్కుల పరిరక్షణ పేరుతో పీఎంకే రాష్ట్ర అధ్యక్షుడు అన్బుమణి వంద రోజుల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే పెద్దపాళ్యం, గుమ్మిడిపూండి, తిరువళ్లూరు ప్రాంతాల్లో గురు, శుక్రవారం పాదయాత్రను నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతోపాటు అండగా ఉంటామని హామీ సైతం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరణి నది పరివాహక ప్రాంతాల్లో మూడు పంటలు పండే 1,700 ఎకరాల విస్తీర్ణంతో శాటిలైట్ సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నాం. రైతులను వంచించి బెదిరింపులకు దిగి వ్యవసాయ భూముల్లో శాటిలైట్ సిటీని ఏర్పాటు చేసే తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు పోరాటం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయానికి ఉపయోగకరంగా లేని స్థలంలో శాటిలైట్ సిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పర్యావరణం కలుషితమైన ప్రాంతంగా గుమ్మిడిపూండి వుందని, అధికారులు చర్యలు తీసుకుని నష్ట నివారణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కార్యదర్శి ప్రకాష్, మాజీ కార్యదర్శి సెల్వరాజ్, రమేష్ పాల్గొన్నారు. -
పళనికి చుక్కెదురు!
● పిటిషన్ తిరస్కృతి సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి కె పళణి స్వామి ఎంపికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణకు సిటీ సివిల్ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ను తిరస్కరించాలన్న పళనిస్వామి వాదనను కోర్టు తోసి పుచ్చింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా 2022లో పళణి స్వామి ఎంపికై న విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ఈ కేసును దాఖలు చేసిన వ్యక్తికి అన్నాడీఎంకేతో సంబంధం లేదంటూ పళణి స్వామి తరఫున రిట్ పిటిషన్ దాఖలైంది. తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ను తిరస్కరించాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. వాదన అనంతరం పళణిస్వామి వాదనను కోర్టు తిరస్కరించింది. పళణి ఎంపికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణకు నిర్ణయించింది. సిటీ సీవిల్ కోర్టు నిర్ణయం కాస్త అన్నాడీఎంకేలో చర్చకు దారి తీసింది. పళణి స్వామి ప్రధాన కార్యదర్శి ఎంపిక విషయంగా విచారణను ఎదుర్కోవాల్సి ఉండడంతో ఇది ఎన్ని మలుపులకు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. ఇదిలా ఉండగా పళణిస్వామి చేపట్టిన ప్రజా చైతన్యయాత్ర శుక్రవారం తిరునల్వేలిలో బ్రహ్మరథం పట్టేలా జరిగింది. పళని రోడ్ షోకు విశేష స్పందన వచ్చింది. అదే సమయంలో పళణి మూడో విడత పర్యటన షెడ్యూల్ను సైతం అన్నాడీఎంకే వర్గాలు విడుదల చేశాయి. -
ఉద్యోగ విరమణ రోజే సస్పెన్షన్
సాక్షి, చైన్నె: అన్నావర్సిటీ మాజీ వీసీ వేల్రాజ్పై ఆ విద్యా సంస్థ సిండికేట్ కన్నెర్ర చేసింది. నాగర్కోయిల్కు చెందిన వేల్రాజ్ 1992 నుంచి గిండిలోని అన్నావర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. 20024 నుంచి 2010 వరకు డిప్యూటీ డైరెక్టర్గా వ్యవహరించారు. 2021లో అన్నావర్సిటీ వైస్ చాన్స్లర్గా నియమితులయ్యారు. ఈ పదవీ కాలం 2024లో ముగిసినప్పటికీ, ఉద్యోగ విరమణకు సంబంధించిన నిర్ణీత వయస్సు రాక పోవడంతో ప్రొఫెసర్గా పనిచేస్తూ వచ్చారు. అదే సమయంలో ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. కొన్నింటిపై విచారణ సాగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో జూలై 31న ఆయన ఉద్యోగ విరమణ రోజు. అయితే, అదే రోజున అన్నావర్సిటీ సిండికేట్ సమావేశం జరిగింది. ఇందులో ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగ విరమణ రోజే ఆయన్ను సస్పెండ్ చేయడం అన్నావర్సిటీలో చర్చకు దారి తీసింది. చిన్నారిపై లైంగిక దాడికి యత్నం ●ఒడిశా యువకుడిపై పోక్సో కేసు తిరుత్తణి: చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన ఒడిశాకు చెందిన యువకుడిని పోక్సో చట్టం కింద కనకమ్మసత్రం పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. తిరుపతి–చైన్నె జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. కనకమ్మసత్రం ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు చేస్తూ అదే ప్రాంతంతో 50కు పైగా కార్మికులు తాత్కాలిక షెడ్లు నిర్మించుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో కనకమ్మసత్రం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక గురువారం ఉదయం ఇంటికి సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. అక్కడ దాగి ఉన్న యువకుడు బాలికపై లైంగికదాడికి యత్పించడంతో బాలిక కేకలు పెట్టింది. ఇది విన్న స్థానికులు చుట్టిముట్టి యువకుడిని చితకబాది పోలీస్స్టేషన్లో అప్పగించారు. కనకమ్మసత్రం సీఐ నరేష్ కేసు నమోదు చేసి ఎరోమల్అలీ(27) అనే వ్యక్తిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. సబర్బన్ రైలు మార్గం విస్తరణకు ఆమోదం సాక్షి, చైన్నె : ఉత్తర చైన్నె పరిధిలో సబర్బన్ రైలు మార్గం విస్తరణకు దక్షిణ రైల్వే యంత్రాంగం ఆమోద ముద్ర వేసింది. రైల్వే బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్తిపట్టు– గుమ్మిండి పూండి మధ్య మూడు, నాలుగో రైల్వే మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మోర్ మార్కెట్ కాంప్లెక్స్ నుంచి గుమ్మిండి పూండి వైపుగా ఎలక్ట్రిక్ సబర్బన్ రైలు సేవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మార్గంలో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ రైళ్లు అన్నీ ఒకే మార్గంలో పయనిస్తున్నాయి. ఈ మార్గంలో ఎక్స్ప్రెస్ రైళ్ల అత్యధికంగా పయనిస్తుంటాయి. దీంతో సబర్బన్ రైలు సేవలలో జాప్యం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ రైళ్లు ఎక్కడికక్కడ స్టేషన్లలో ఆగిఆగి పయనించాల్సి ఉంది. ఈ సమస్యను అధిగమించేలా సబర్బన్ రైల్వే మార్గాన్ని విస్తరించాలన్న నినాదం ఆది నుంచి మిన్నంటుతూ వస్తుంది. ప్రస్తుతం దీనికి మోక్షం లభించింది. రైల్వే బోర్డు సమావేశంలో తీర్మానించడమే కాకుండా, ఈ పనులకు రూ.374 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. 20న పోషకాహార కార్మికుల సమ్మె కొరుక్కుపేట: పోషకాహార భోజన కార్మికులు ఈ నెల 20వ తేదీన నిరసన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఆ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖరన్ మాట్లాడుతూ పోషకాహార రంగంలో ఖాళీగా ఉన్న 60 వేల పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరంసహా వివిధ డిమాండ్లను నొక్కి చెబుతూ తాము కొన్ని సంవత్సరాలుగా అనేక దశల నిరసనలు నిర్వహిస్తున్నామన్నారు. అయితే, ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు. దీంతో తాము 7 దశల నిరసనలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. మొదటి దశలో ఈ నెల 20వ తేదీన జిల్లా రాజధానుల్లో ఒకరోజు సమ్మె జరుగుతుందన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 20న తిరుచ్చిలో సమ్మె సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత, అక్టోబర్ 8న యాదృచ్ఛిక సెలవు నిరసనను, నవంబర్ 7న చైన్నెలో ర్యాలీని నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 17న ఒకరోజు సమ్మె నిర్వహిస్తామని చెప్పారు. పోలీసులపై ఖైదీల దాడి కొరుక్కుపేట: చైన్నెలో పోలీసులపై ఖైదీలు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. చైన్నెలోని అ న్నానగర్ రౌడీ రాబర్ట్ హత్య కేసులో అరెస్టయి, జై లులో ఉన్న నిందితులను గురువారం పోలీసులు ఎగ్మోర్ క్రిమినల్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టు విచారణ పూర్తయిన తర్వాత, నిందితులను పోలీసు వాహనంలో తిరిగి పుళల్ జైలుకు తరలించారు. ఆ సమయంలో గార్డులు ఖైదీలను దుర్భాషలాడారు. దీంతో పోలీసులపై ఖైదీలు దాడి చేస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. వీడియో ఫుటేజ్ ప్రామాణికతను, హత్య కేసులో అరెస్టు చేసిన నిందితుడిని తీసుకువచ్చిన పోలీసు అధికారులను కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఎటువంటి ఫిర్యాదు నమోదు చేయకపోవడం గమనార్హం. -
అమ్మవారి ఊరేగింపు అడ్డగింత
– డీఎస్పీకి ఫిర్యాదు తిరుత్తణి: అమ్మవారి ఊరేగింపును అడ్డుకోవడంపై చర్యలు తీసుకోవాలని పదిమంది కుటుంబీకులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. తిరుత్తణి యూనియన్లోని సూర్యనగరం పంచాయతీలోని రామాపురం గ్రామంలో వందకు పైగా కుటుంబీకులు నివాశముంటున్నారు. ఆగ్రామంలో ప్రతి ఏటా ఆడి నెలలో పడవేట్టమ్మన్ ఆలయ జాతర నిర్వహించడం పరిపాటి. వచ్చే శుక్రవారం వేడుకలు సందర్భంగా బుధవారం రాత్రి గ్రామంలో సమావేశం నిర్వహించి గ్రామానికి హద్దు వరకు మాత్రమే అమ్మవారిని ఊరేగించాలని వెలుపల ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకెళ్లరాదని నిర్ణయించారు. దీంతో గ్రామానికి చెందిన పది కుటుంబీకులు ప్రభుత్వం అందజేసిన ఉచిత ఇంటి పట్టాల్లో ఇళ్లు నిర్మించుకుని నివాశముంటున్న ప్రాంతం కొండ జాతి ప్రజలు నివాశముంటున్న ప్రాంతం కావడంతో తమ ప్రాంతానికి అమ్మవారి ఊరేగింపును గ్రామంలో కొందరు వ్యతిరేకిస్తున్నట్లు ఆరోపిస్తూ డీఎస్పీ కందన్కు గురువారం ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కందన్ గ్రామానికి చెందిన ఆలయ పెద్దలను డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఏటా అమ్మవారిని గ్రామ హద్దు వరకు మాత్రమే ఊరేగించడం పరిపాటి. ఆ ప్రకారం మాత్రమే ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తున్నాం. కొత్తగా హద్దులు దాటి అమ్మవారిని ఊరేగించడం సాధ్యంకాదని తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య చర్చలు నిర్వహించి సమస్య పరిష్కరిస్తామని డీఎస్పీ తెలిపారు. -
ప్రభుత్వ పథకాలకు బతికున్న నేతల పేర్లు పెట్టొద్దు
చెన్నై: రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు జీవించి ఉన్న రాజకీయ నేతల పేర్లు పెట్టడం లేదా ప్రభుత్వ ప్రచార సామగ్రిలో మాజీ ముఖ్యమంత్రులు లేదా సైద్ధాంతిక నాయకుల ఫోటోలను ఉపయోగించవద్దని హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ సుందర్ మోహన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రకటనల కోసం సుప్రీంకోర్టు ఆదేశాలు, కంటెంట్ మార్గదర్శకాలను ఉదహరించింది. ఇటీవలే, తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి పేరును కలుపుకొని ‘ఉంగలుడన్ స్టాలిన్’, ‘స్టాలిన్ విత్ యు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం అదే పేరుతో ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీవీ షణ్ముగం పిటిషన్ దాఖలు చేశారు. సంక్షేమ పథకాల్లో రాజకీయ ప్రముఖులను పొందుపరచి రాష్ట్రం ప్రజా నిధులను దుర్వినియోగం చేస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పులను, ప్రభుత్వ ప్రకటన మార్గదర్శకాలు–2014ను ఉల్లంఘించిందని వాదించారు. ఇది ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ఆపడం లేదని, ఈ తీర్పు వాటిని ఎలా ప్రచారం చేస్తున్నారనే దానిపైనేనని హైకోర్టు స్పష్టత ఇచ్చింది. -
పోలీస్ శిక్షణ కేంద్రం ప్రారంభం
వేలూరు: పోలీస్ శిక్షణ కేంద్రం ఆరోగ్యకరమైన ప్రాంతంలో ఉండాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని సేవూరు గ్రామ కొండ ప్రాంతం వద్ద రూ.4.77 కోట్ల వ్యయంతో తమిళనాడు ప్రత్యేక 15వ బెటాలియన్ కార్యాలయ భవనాన్ని సీఎం స్టాలిన్ చైన్నె సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కలెక్టర్ సుబ్బలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం భవన నిర్మాణ పనులు, పోలీసుల విశ్రాంతి గది, శిక్షణ కేంద్రం, తరగతి గదులను పరిశీలించారు. ఎమ్మెల్యే కార్తికేయన్, కాట్పాడి యూనియన్ చైర్మన్ వేల్మురుగన్, వైస్ చైర్మన్ శరవణన్, వేలూరు కార్పొరేషన్ మొదటి జోన్ చైర్మన్ పుష్పలత, తమిళనాడు ప్రత్యేక 15వ బెటాలియన్ ప్రత్యేక అధికారి సెల్వమణి, అసిస్టెంట్ అధికారి ప్రకాష్, సర్పంచ్ రేవతి పాల్గొన్నారు. -
పురుగుల మందు తాగి సోదరుల ఆత్మహత్య
తిరువళ్లూరు: పురుగుల మందు తాగిన సోదరు లు చికిత్స ఫలించక మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా నుంగంబాక్కం కమ్మవారిపాళ్యం గ్రామానికి చెందిన డ్రైవర్ మోహన్ జయలక్ష్మి దంపతులు. వీరికి మొత్తం నలుగురు కొడుకులు వున్నారు. భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా మోహన్ విడిపోయి వేరే మహిహిళతో సహజీవనం సాగిస్తున్నాడు. పెద్దకొడుకు గణేష్ శ్రీపెరంబదూరులోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఇదే పరిశ్రమలో పని చేస్తున్న వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే గణేష్ వివాహానికి తల్లి జయలక్ష్మి అడ్డు చెప్పడంతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. కాగా మరో కొడుకు విఘ్నేష్ మద్యంకు బానిస కావడంతో తల్లి తీవ్ర మనోఽవేదనకు గురైన తల్లి జయలక్ష్మి గత 25న పురుగుల మందు తీసుకొచ్చి కొడుకుల ఎదుటే తాగడానికి యత్నించింది. అయితే తల్లిని అడ్డుకుని ఇద్దరు కొడుకులు ఆదే విషాన్ని లాక్కుని ఇద్దరు కొడుకులు సేవించగా స్థానికులు వైద్యశాలకు తరలించారు. తిరువళ్లూరులో ప్రథమ చికిత్స అందించిన తరువాత మెరుగైన చిక్సిత కోసం చైన్నెలోని ప్రవేటు వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత పొందుతూ ఇద్దరు గురువారం మృతి చెందారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మనవాలనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చైన్ స్నాచర్పై పోక్సో కేసు తిరువొత్తియూరు: పెరుంగుడి రైల్వేస్టేషన్న్లో టీచర్ వద్ద అసభ్యంగా ప్రవర్తించి చైన్ స్నాచింగ్కు పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. చైన్నె కోట్టూరు పురానికి చెందిన టీచర్ రోసీతో అసభ్యంగా ప్రవర్తించి పెరంగుడి ఫ్లయింగ్ రైల్వేస్టేషన్న్లో గుర్తు తెలియని యువకుడు చైన్ స్నాచింగ్కు పాల్పడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి విల్లుపురం సెంగిమేడుకు చెందిన సౌందర్ను 3 గంటల్లో అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. సర్వ దర్శనానికి 15 గంటలు తిరుమల : తిరుమలలో శ్రీవారి దర్వనానికి 15గంటల సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్స్లో 12 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 75,303 మంది స్వామి వారిని దర్శించుకోగా 27,166 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.99 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
మీతో స్టాలిన్ పథకానికి స్పందన
తిరుత్తణి: తిరుత్తణిలో గురువారం నిర్వహించిన మీతో స్టాలిన్ పథకానికి విశేష స్పందన లభించింది. ప్రభుత్వ పథకాలు ఒకే స్థలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మీతో స్టాలిన్ పథకం ద్వారా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుత్తణి మున్సిపాలిటీలోని 5, 14, 15వ వార్డులకు సంబంధిచి ప్రయివేటు కల్యాణ మంపడంలో శిబిరం నిర్వహించారు. శిబిరంలో 15 శాఖల నుంచి అధికారులు పాల్గొని ఆన్లైన్ సేవలు అందించారు. ఇందులో పట్టణంలోని మూడు వార్డులకు సంబందించిన ప్రజలు ఇంటి పట్టాలు, వృద్ధాప్య పింఛన్ల కోసం అధికారుల వద్ద వినతిపత్రాలు అందజేశారు. అధికారులు వినతిపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుని రసీదులు అందజేశారు. శిబిరాన్ని తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ ప్రారంభించారు. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ సరస్వతి, వైస్ చైర్మన్ సామిరాజ్ పాల్గొని శిబిరాన్ని పరిశీలించారు. అర్హులుగా ఎంపిక చేసిన వారికి ప్రభుత్వ సర్టిఫికెట్లు అందజేశారు. ఆర్డీఓ కణిమొళి, డీఎస్పీ కందన్, అధికారులు పాల్గొన్నారు. మీతో స్టాలిన్ పథకానికి బారులు వేలూరు: వేలూరు ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్న మీతో స్టాలిన్ పథకానికి అర్జీదారులు బారులు దీరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మీతో స్టాలిన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పథకంలో అన్ని శాఖల అధికారులు ఒకే ప్రాంతానికి చేరి ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని 20 రోజుల్లో పరిష్కరించాలనే ప్రభుత్వం నిబందన విధించింది. దీంతో ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న మీతో స్టాలిన్ పథకానికి గ్రామస్తులు వారి పనులను వదులుకొని అర్జీలు చేత బట్టి అధికారుల వద్ద అందజేస్తున్నారు. గురువారం ఉదయం కాట్పాడి యూనియన్ పరిధిలో సేవూరు గ్రామ పంచాయతీ, కన్నియంబాడి యూనియన్ పరిధిలోని తుత్తిపట్టు గ్రామ పంచాయతీలో ఈ పథకం జరిగింది. ఇందులో సర్పంచ్ రవిచంద్రన్ వద్ద వినతులు అందజేశారు. ఆయనతో పాటు యూనియన్ చైర్మన్ దివ్య, బ్లాక్ డెవలప్మెంట్ అధికారి సత్యమూర్తి, గ్రామ పరిపాలన అధికారి విజయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మతం కంటే మానవత్వం గొప్పది
కొరుక్కుపేట: మానవత్వం కంటే ఏ మతమూ గొప్పది కాదని సెంట్రల్ లా కాలేజీ చైర్మన్ డి.శరవణన్ అన్నారు. న్యాయ వ్యవస్థను సంస్కరించడం, మానవ హక్కులు, మానసిక ఆరోగ్యం, నేరాల్లో యువత ప్రమేయం, పునరావాసం్ఙ అనే అంశంపై అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం బుధవారం సేలంలోని సెంట్రల్ లా కాలేజీలో జరిగింది. ఇందులో దేశం, విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు పాల్గొన్నారు. అధ్యక్షుడు శరవణన్ మంచి సమాజానికి న్యాయమైన నిష్పాక్షికమైన న్యాయ వ్యవస్థ చాలా ముఖ్యమని చెప్పారు. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న నేరాలు మానవ హక్కుల ఉల్లంఘనల రేటుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎస్.మణికుమార్ మాట్లాడుతూ బలమైన చట్టాలు అవసరమని పేర్కొన్నారు. జస్టిస్ టి. మురుగేశన్, తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు విభాగం డైరెక్టర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్. మల్లిక, డాక్టర్ మణికందన్ సౌందరరాజన్, తూర్పు లండన్ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ రువాన్ ఉడువెరాజ్ పెరెరా, సచ్చితానంద వాలన్ మైఖేల్, హెన్రీ టిఫాగ్నే, డాక్టర్ గుర్మిందర్ కౌర్ పాల్గొన్నారు. -
విద్యతోపాటు క్రీడలూ అవసరం
వేలూరు: విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలూ ముఖ్య మని వేలూరు నరువి ఆస్పత్రి చైర్మన్ జీవీ సంపత్ అన్నారు. వేలూరు సత్వచ్చారిలోని ఎత్తిరాజ్ మెట్రిక్ పాఠశాలలో 32వ వార్షిక క్రీడా దినోత్సవం పాఠశాల ట్రస్ట్ సభ్యుడు ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. వివిధ క్రీడా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేసి ఆయన ప్రసంగించారు. పాఠశాల విద్యలోనే విద్యార్థులకు క్రమశిక్షణను అలవాటు చేయాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులకు ఉందన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదివేలా అలవాటు చేయాలన్నారు. పట్టుదల, క్రమశిక్షణ చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరికీ అవసరమని అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరన్నారు. పారిశ్రామిక వేత్త టీఎస్ ఉదయశంకర్, ప్రజాసభ్యుడు శరవణ ప్రసాద్, సభ్యులు ప్రకాష్, హెచ్ఎం షర్మిల, టీచర్లు పాల్గొన్నారు. -
3వ తరం ఎకో షో 5 స్మార్ట్ డిస్ ప్లే ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: అమెజాన్ అలెక్సాన్ ఇండియాతో కలిసి మూడవ తరం ఎకో షో 5 స్మార్ట్ డిస్ప్లేను ఆవిష్కరించింది. ఇది సులభంగా ఇంటి పర్యవేక్షణ, స్ట్రీమింగ్ అనుకూలమైన భద్రతా కెమెరా వీడియో ఫీడ్లు, ఆడియో–విజువల్ కంటెంట్ను చూడటం , మరిన్నింటి కోసం అంతర్నిర్మిత కెమెరాతో కూడిన కాంపాక్ట్ 5.5 స్మార్ట్ డిస్ప్లేను ఇది కలిగి ఉన్నట్టు గురువారం స్థానికంగా ప్రకటించారు. దీని గురించి అమెజాన్ డివైసెస్ ఇండియా డైరెక్టర్ ఆర్ఎస్ దిలీప్ వివరిస్తూ ఇది మునుపటి తరంతో పోలిస్తే 2 ఎక్స్ బేస్, స్పష్టమైన ధ్వనితో ఉత్తమంగా ధ్వనించే ఎకోషో 5 అని వివరించారు. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమాలతో పాటూ ఎంపిక చేసిన ఆఫ్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉందని వివరించారు. అలెక్సాతో రోజువారీ క్షణాలను మరింత ఉపయోగకరంగా మార్చడానికి రూపొందించబడినట్టు వివరించారు. -
గంజాయి మత్తులో యువకుల వీరంగం
– కనకవల్లిపురం వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత తిరువళ్లూరు: రాత్రి సమయంలో గంజాయి మత్తులో వచ్చే యువకులు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించడంతో పాటూ అడ్డొచ్చిన వారిపై దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తూ స్థానికులు తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై బుధవారం అర్థరాత్రి ఆందోళనకు దిగడం కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్ పరిధిలో కనగవల్లిపురం గ్రామం ుంది. ఇక్కడ సుమారు రెండువేల మంది ప్రజలు నివాసం వుంటున్నారు. తిరుపతి–చైన్నె జాతీయ రఽహదారికి ఆనుకుని వున్న గ్రామం కావడంతో రాత్రి సమయంలో గత రెండు వారాల నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గంజాయి మత్తులో వేగంగా వాహనాలను నడపడం, రోడ్డుపై ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోయారు. ఇదే విషయంపై స్థానికులు నిలదీస్తే వారిపై సైతం గంజాయి బ్యాచ్ దాడులకు దిగుతున్నారని వాపోయారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కొందరు యువకులు అలజడి సృష్టించగా.. స్థానికులు నిలదీశారు. దీంతో వారిపై దాడులకు దిగారు. ఆగ్రహించిన స్థానికులు తమపై దాడులకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై వాహనాలు బారులుదీరాయి. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు రాత్రి 11.30 గంటలకు ప్రజలను సముదాయించి భవిషత్తులో గంజాయి బ్యాచ్పై కఠిన చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చి ఆందోళననూ విరమింపజేశారు. -
కోలీవుడ్కు కోర్టు
తమిళసినిమా: తెలుగులో నటుడు నాని నిర్మించిన చిత్రం కోర్టు. నటుడు ప్రియదర్శిని, సాయికుమార్, హర్ష్ రోషన్, శ్రీదేవి, రోహిణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. గత మార్చిలో విడుదలైన కోర్టు మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్ర తమిళ్ రీమేక్ హక్కులను నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ పొందినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తారని తెలిసింది. ఇకపోతే ఇందులో ప్రియదర్శిని పాత్రను నటుడు ప్రశాంత్, సాయికుమార్ పాత్రను త్యాగరాజన్ పోషించనున్నారని, ఇంకా చిత్రంలో యువ హీరోహీరోయిన్లుగా నిర్మాత కదిరేశన్ వారసుడిని, నిర్మాత పీఎల్ తేనప్పన్ వారసురాలిని పరిచయం చేయనున్నట్లు తెలిసింది. అదే విధంగా ఈ చిత్రాన్ని త్యాగరాజన్, ఫైవ్స్టార్ కదిరేశన్ కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే చిత్రం సెట్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా అందగన్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ప్రశాంత్ నటించనున్న చిత్రం ఇది కావడం గమనార్హం. -
699 మంది విద్యార్థులకు 7.5 శాతం కోటా సీట్లు
సాక్షి, చైన్నె : రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని నీట్లో మంచి మార్కులు సాధించి 7.5 శాతం ప్రత్యేక కోటా కింద ఎంబీబీఎస్ కలను సాకారం చేసుకున్న 699మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉత్తర్వులను అందజేశారు. ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ఈ ఉత్తర్వులను అందజేశారు. 2025–26 సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు 7.5 శాతం రిజర్వుడ్ కోటా సీట్లను భర్తీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు సీట్లను కేటాయించారు. ఈ మేరకు 494 మందికి ఎంబీబీఎస్, 119 మందికి దంత వైద్య సీట్లు కేటాయించారు. మొత్తం 613 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాల కోటా ఆధారంగా మొత్తంగా 699 మంది విద్యార్థులను సీట్లు వరించాయి. విద్యార్థులకు మంత్రి ఎం. సుబ్రమణియన్ సీట్ల కేటాయింపు ఉత్తర్వులను అందజేశారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శి సెంథిల్కుమార్, వైద్య విద్య డైరెక్టర్ తెరని రాజన్, తదితరులు పాల్గొన్నారు. 8.23 శాతం పెరిగిన విమాన ప్రయాణికుల సంఖ్య కొరుక్కుపేట: చైన్నె విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో విమానాల సంఖ్య కూడా పెరుగుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో అంతర్జాతీయ టెర్మినల్ , దేశీయ టెర్మినల్లో ప్రయాణికుల సంఖ్య 8.23 శాతం పెరిగిందని అధికారులు తాజాగా వెల్లడించారు. ఇందులో చైన్నె అంతర్జాతీయ టెర్మినల్లో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు బయలుదేరే , వచ్చే ప్రయాణికుల సంఖ్య 30,49, 693 మందిగా ఉంది. గత సంవత్సరం మొదటి 6 నెలల్లో ఈ సంఖ్య 29 ,73,265గా ఉందని పేర్కొన్నారు. రౌడీకి రోజూ 50 మంది పోలీసులతో భద్రత తిరువొత్తియూరు: చైన్నెకి చెందిన 18 హత్యలు సహా 50కి పైగా కేసులలో నిందితుడైన ఓ రౌడీ ధర్మపురి కోర్టులో రోజూ బెయిల్పై సంతకం చేసి వెళ్తున్నాడు. అతని ప్రాణాలకు ముప్పు ఉన్నందున పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. వివరాలు.. చైన్నె ఎన్నూర్ ప్రాంతానికి చెందిన ధనశేఖరన్ (42) చైన్నె, మదురై సహా తమిళనాడులోని వివిధ జిల్లాలలో 18 హత్యలు, దోపిడీలు వంటి 50కి పైగా కేసులలో నిందితుడు. అజ్ఞాతంలో ఉన్న ఇతనిని పోలీసులు గాలిస్తున్న క్రమంలో ధనశేఖరన్ ముందస్తు బెయిల్ కోరుతూ కొన్ని రోజుల క్రితం ధర్మపురి క్రిమినల్ కోర్టులో లొంగిపోయాడు. న్యాయమూర్తి అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ధర్మపురి క్రిమినల్ కోర్టులో రోజూ హాజరై సంతకం చేయాలని ఆదేశించారు. దీని ప్రకారం గత 5 రోజులుగా, ప్రతి ఉదయం ధనశేఖరన్ తన స్నేహితులతో కలిసి ధర్మపురి కోర్టుకు వచ్చి సంతకం చేసి వెళ్తున్నారు. వివిధ కేసులలో నిందితుడైన ఇతనికి బాధితుల నుంచి ఎప్పుడైనా ప్రాణహాని ఉండవచ్చు అనే కారణంతో 50కి పైగా పోలీసులు అతను వచ్చినప్పుడు ధర్మపురి జాతీయ రహదారి నుంచి కోర్టు ప్రాంగణం వరకు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా ధనశేఖరన్కు బాధితుల నుంచి ప్రాణహాని ఉన్నందున అతను ఎక్కడికి వెళ్తున్నాడు అనే వివరాలు పోలీసులు వెల్లడించలేదు. కారుణ్య నియామకాలపై నిర్ధిష్ట విధానం ఎప్పుడు? – రవాణా శాఖకు హైకోర్టు ప్రశ్న కొరుక్కుపేట: తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్న రవాణా కార్మికుల కుటుంబాలకు కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగాలు ఎందుకివ్వడం లేదని.. మద్రాస్ హైకోర్టు తమిళనాడు రవాణా శాఖను ప్రశ్నించింది. ఈమేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. వివరాలు.. వైద్యపరంగా పని చేయడానికి అనర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు , వారి కుటుంబాలకు వివిధ అంశాల ప్రాతిపదికన కారుణ్య ఉపాధి కల్పిస్తున్నారు. అయితే దీనిపై ఓ నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించడం, అమలు చేయడంపై మార్గదర్శకాలను కోరుతూ తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థ అవినీతి నిరోధక ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తరపున రవాణా కార్మికులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను తమిళనాడు ప్రభుత్వ రవాణా శాఖ పరిపాలనా విభాగంలో ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎం. శ్రీవాస్తవ, జస్టిస్ సుందర్ మోహన్తో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రజా రవాణా సేవలను నేరుగా అందిస్తున్న కార్మికులకు కారుణ్య అవకాశాల కల్పనలో ఎందుకు లోపభూయిష్టంగా వ్యవహరిస్తున్నరని, ఈమేరకు ఉన్న సమస్యలను తెలియజేయాలని రవాణా శాఖ కార్యదర్శిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
మా కూటమిలోకి రండి!
సాక్షి, చైన్నె: విజయ్ తన తమ్ముడు లాంటి వారని, డీఎంకేను ఓడించాలన్న ఆశయంతో ఉన్న అతడు అన్నాడీఎంకే – బీజేపీ కూటమిలోకి రావాలని సినీ నటి కుష్భు పిలుపు నిచ్చారు. సినీ నటి కుష్భుకు బీజేపీలో ఎట్టకేలకు పదవి దక్కిన విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులలో ఆమె కూడా ఉన్నారు. తనకు పదవి దక్కడం ఆనందంతో గురువారం కుష్భు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీ,అన్నాడీఎంకేలో ఒక కూటమిగా ఏర్పాటు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమిళ వెట్రి కళగం నేత, నటుడు విజయ్ గురించి స్పందిస్తూ, విజయ్ తనకు తమ్ముడు లాంటివారని, అతను ఇప్పడు రాజకీయాలోకి వచ్చాడని గుర్తుచేశారు. రాజకీయాలోకి రాగానే విజయం సాఽధించ లేరన్న విషయం అతడికి బాగా తెలుసునని పేర్కొన్నారు. బయటి నుంచి చూస్తే, అతని ప్రస్తుత నిర్ణయం సరైనది కాదన్నారు. అతను రంగంలోకి దిగుతాడని, ఇది మంచిదే, ఆయన రాజకీయప్రవేశాన్ని ఒక సోదరిగా అభినందించాలనుకుంటున్నట్టు వ్యాఖ్యలు చేశారు. సినిమా నుంచి రాజకీయాలలోకి వచ్చిన వాళ్లు ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పలేమన్నారు. సినమా రంగంలో అగ్రస్థానం నంంచి రాజకీయాలలోకి వచ్చిన వారు ఆశించిన విజయాన్ని సాధించ లేదని, గతంలో ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేశారు. దివంగత నేతలు ఎంజీఆర్,కరుణానిధి, జయలలిత కాలం వేరు అని, ఇప్పుటి కాలం వేరు అని, అప్పటి ప్రజల మనస్తత్వం వేరు, ఇప్పటి ప్రజల మనస్తత్వం వేరు అని వివరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకేను ఓడించాలని విజయ్ కోరుకుంటున్నారని, ఇందు కోసం అందరం కలిసి ఒకే వేదిక మీదకు రావాల్సిన అవసరం ఉందన్నారు.● విజయ్కు కుష్భు ఆహ్వానం -
విజయ్సేతుపతి, పాండిరాజ్ కాంబో రిపీట్
తమిళసినిమా: రాజకీయాల్లోనూ, సినీ రంగంలోనూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. అంత పెద్ద మాటలు ఇక్కడ సరిపడవేమోగానీ అలాంటి చిన్న మనస్పర్థలు కారణంగా విజయ్సేతుపతి హీరోగా చిత్రమే చేయకూడదని అనుకున్న దర్శకుడు పాండిరాజ్ తాజాగా తెరకెక్కించిన చిత్రం తలైవన్ తలైవి. విజయ్సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి వసూళ్లను సాధిస్తోంది. ఏదేమైనా విజయ్ సేతుపతి, దర్శకుడు పాండిరాజ్లో కాంబో రీపీట్ కానుందన్న ప్రచారం జరుగుతోంది. హిట్ కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్న్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. లైకా సంస్థ ఇంతకుముందే విజయ్సేతుపతి హీరోగా చిత్రం చేయడానికి ఆయనకు అడ్వాన్న్స్ ఇచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇది కూడా గ్రామీణ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని తెలిపింది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా విజయ్సేతుపతి ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం చేస్తున్నారు. దీని తరువాత మహారాజు–2 చిత్రం చేయనున్నారు. ఆ తరువాత పాండిరాజ్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. విజయ్సేతుపతి, దర్శకుడు పాండిరాజ్ -
మరో కొత్త పథకానికి డీఎంకే ప్రభుత్వం శ్రీకారం
ప్రజా ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ రాష్ట్రంలో మరో కొత్త పథకం ఆగస్టు రెండున శనివారం అమల్లోకి రానుంది. నళం కాక్కుం స్టాలిన్( ఆరోగ్య సంరక్షణలో స్టాలిన్) పేరిట 38 జిల్లాలో విస్తృతంగా వైద్య శిబిరాలను వైద్యఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది. ● ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శిబిరాలు ● రేపటి నుంచి అమల్లోకి.. ● సచివాలయానికి సీఎం స్టాలిన్ ● ప్రారంభోత్సవాలతో బిజీబిజీట్రాన్స్ జెండర్ల కోసం పాలసీని విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి పోలీసు శాఖలో నిర్మించిన కొత్త భవనాలను ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: 2021లో అధికార పగ్గాలు చేపట్టినానంతరం అందరికీ అన్నీ నినాదంతో బృహత్తర పథకాలను సీఎం స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం విస్తృతంగా అమలు చేస్తూ వస్తోంది. అన్నిరంగాలలో ప్రగతి, జిల్లాల అభివృద్ధి, సమగ్ర సామాజిక సంక్షేమం, ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావడమే లక్ష్యంగా ప్రణాళికలు, పథకాలను అమలు చేస్తున్నారు. అలాగే, వైద్యపరంగా ఆస్పత్రులను బలోపేతం చేయడమేకాకుండా మనల్నిరక్షించే 48 నినాదంతో వైద్య సేవలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాలలో చేసిన ప్రకటన మేరకు మెరుగైన వైద్యాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్లే విధంగా ఆగస్టు 2న ఆరోగ్య సంరక్షణలో స్టాలిన్ నినాదంతో వైద్య శిబిరాలు ఏర్పాటు కానున్నాయి. ఈ పథకాన్ని చైన్నె సెయింట్ పీట్స్ ఆంగ్లో ఇండియన్ స్కూల్ వేదికగా సీఎం స్టాలిన్ ప్రారంభించనున్నారు. ఈ పథకం తమిళనాడులోని 38 జిల్లాల్లోనూ అమలు కానుంది. ప్రత్యేక వైద్య శిబిరాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం అయ్యే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిబిరాలు స్థానిక ప్రభుత్వ సంస్థలు, పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యా శాఖ, ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, మహిళా శాఖ, కార్మిక సంక్షేమం , నైపుణ్యాల అభివృద్ధి శాఖ, దివ్యాంగుల సంక్షేమం, రెవెన్యూ, విపత్తు నిర్వహణ, తదితర శాఖలు, వివిధ విభాగాలను మిళితం చేసే పాఠశాలు, కళాశాలల ఆవరణలో నిర్వహించనున్నారు. గ్రేటర్ చైన్నె విషయానికి వస్తే ప్రతి జోన్కు ఒక శిబిరం చొప్పున 15 మండలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పరిమిత ప్రత్యేక వైద్య సదుపాయాలు కలిగిన గ్రామీణ ప్రాంతాలు, మురికి వాడలు, గిరిజ ప్రాంతాలలో అధిక ప్రాధాన్యతను ఇచ్చే విధంగా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. 136 మంది విద్యార్థులకు సత్కారం ఆస్పత్రిలో చికిత్స పొందిన పది రోజుల అనంతరం సీఎం స్టాలిన్ సచివాలయానికి గురువారం వచ్చారు. ఆయనకు అధికారులు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ప్రారంభోత్సవాలు సీఎంచేశారు. ఆది ద్రావిడులు , గిరిజనులు సంక్షేమ పాఠశాలల్లో చదువుకుని 2025–26 విద్యా సంవత్సరంలో ప్రఖ్యాత ఉన్నత విద్యా సంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనియన్ యూనివర్సిటీలు, నేషనల్ వంటి సంస్థలు, ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ లా యూనివర్సిటీ, మిరాండా హౌస్, ఢిల్లీ విశ్వవిద్యాలయంలలో అడ్మిషన్ పొందిన 136 మంది విద్యార్థులకు సీఎం స్టాలిన్ ల్యాప్టాప్లు, ప్రశంసా పత్రాలలను అందజేశారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు, వసతి ఫీజులు వంటి విద్య కోసం అయ్యే ఖర్చులు, ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు రుసుముతో సహా అన్ని రుసుములు తమిళనాడు ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలోడిప్యూటీసీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రి మది వేందన్, సీఎస్మురుగానందం, ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కె లక్ష్మీ ప్రియ, ఆది ద్రావిడర్ సంక్షేమ కమిషనర్ టి. ఆనంద్, గిరిజన సంక్షేమం డైరెక్టర్ఎస్. అన్నాదురై తదితరులు పాల్గొన్నారు. మదురై జైలుకు కొత్త భవనం.. పోలీసులు, అగ్నిమాపక , జైళ్లు శాఖ తరపున రూ. 45.47 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు, అలాగే మధురై సెంట్రల్ జైలును రూ. 229.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్, రఘుపతి, ముత్తుస్వామి, హోం శాఖకార్యదర్శి ధీరజ్కుమార్, అగ్నిమాపక శాఖ డీజీపీ సీమా ఆగర్వాల్, పోలీసు హెడ్ క్వార్టర్స్ డైరెక్టర్ వినీత్ దేవ్ వాంఖడే, తమిళనాడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ కుమార్ యాదవ్, పోలీసు సర్వీసు డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మహేశ్వర్ దయాళ్, చైన్నె కమిషనర్ అరుణ్, తాంబరం కమిషనరన్ అబిన్ దినేష్ మోదక్, పోరెన్సీక్ సైనన్స్ డైరెక్టర్ డాక్టర్ శివప్రియ పాల్గొన్నారు. అనంతరం సాంఘిక సంక్షేమం, మహిళా హక్కుల శాఖ తరపున రూపొందించిన తమిళనాడు రాష్ట్ర ట్రానన్స్జెండర్లు పాలసీ –2025ను సీఎం విడుదల చేశారు. ట్రాన్స్ జెండర్ల సంక్షేమం, వివిధ సేవలు, స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం వరకు సహకారం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గీతా జీవన్ , సాంఘిక సంక్షేమం శాఖ కార్యదర్శి జయశ్రీ మురళీ ధరన్, అదనపు కార్యదర్శి ఎస్. వలర్మతి, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ సంగీత, ప్రణాళికా సంఘం సభ్యులు డా. నర్తకి నటరాజ్ పాల్గొన్నారు. అలాగే, తమిళనాడు రాష్ట్ర వాణిజ్య మండలికి టీఎన్పీఎస్సీ ద్వారా ఎంపికై న 40 మందికి ఉద్యోగ నియమాక ఉత్తర్వులను సీఎం అందజేశారు. చివరగా వాణిజ్య పన్ను శాఖకు 27 కోట్ల 4 లక్షల రూపాయలతో నిర్మించిన రెండు రాష్ట్ర పన్నుల కార్యాలయాల భవనాలు, 12 సబ్–రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలను ప్రారంభించారు. చెంగల్పట్టు రిజిస్ట్రేషన్ జిల్లాలోని తిరుపోరూర్ సబ్–రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి కొత్తగా నవలూర్, కేలంబాక్కం పేరిట రెండు కొత్త సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలను కూడా ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పి మూర్తి, వాణిజ్య పన్ను , రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శిల్పా ప్రభాకర్ సతీష్, కమిషనర్ శ్రీ ఎస్. నాగరాజన్, , రిజిస్ట్రేషన్ శాఖ అధ్యక్షుడు దినేష్ పొన్రాజ్ ఆలివర్ పాల్గొన్నారు. అనేక రకాల వైద్య సేవలు.. ఈ వైద్య శిబిరాలలో మధుమేహం, మానసిక, గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడే రోగులకు, గర్భిణి మహిళలు,పాలు ఇచ్చే తల్లులు, పిల్లలకు , దివ్యాంగులకు , వెనుకబడిన సామాజిక వర్గాలకు అధికప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎకోకార్డియోగ్రామ్, అల్ట్రాసౌండ్ స్కాన్, మహిళలకు గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించనున్నామన్నారు. ఇండియన్ మెడిసిన్ సంబంధించిన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, చర్మవ్యాధి, చెవి, ముక్కు , గొంతు వైద్యం, ప్రసూతి శాస్త్రం, సాంప్రదాయ వైద్యం, దంతవైద్యం, నేత్ర వైద్యం, మనోరోగ చికిత్స, పీడియాట్రిక్స్, పల్మనరీ మెడిసిన్,డయాబెటిస్ , రేడియాలజీ వైద్యులు సేవలు అందించనున్నారు. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద దివ్యాంగులకు రిజిష్ట్రేషన్లు, ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్లుకూడా ఈ శిబిరాలలోప్రధానం చేయనున్నారు. డేటా సేకరణ, తదుపరి పర్యవేక్షణ, తదుపరి చికిత్స గురించి ఆధునిక ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ(హెచ్ఎంఐఎస్ 3.ఓ) ద్వారా పరిర క్షించే విధంగా చర్యలు చేపట్టారు. -
పరామర్శ
తిరునల్వేలి పాళయం కోట్టైలో తూత్తుకుడికి చెందిన ఐటీ ఉద్యోగి కవిన్ పరువు హత్య చేయబడ్డ విషయం తెలిసిందే. ఈ కేసులో అతడి స్నేహితురాలు సోదరుడు, సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్న ఆమె తల్లిదండ్రులపై కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితులలో కవిన్ కుటుంబాన్ని డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, మంత్రులునెహ్రూ, అనిత రాధాకృష్ణన్ పరామర్శించారు. తమ సానుభూతిని తెలియజేశారు. కాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. కవిన్ స్నేహితురాలు ఓ వీడియో విడుదల చేస్తూ, తమ ఇద్దరి స్నేహం గురించి, పరిచయం గురించి పలు రకాలుగా పేర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ ఘటనలో తన తల్లిదండ్రుల ప్రమేయం లేదని, వారిని విడిచి పెట్టాలని విన్నవించడం గమనార్హం. – సాక్షి, చైన్నె -
బీజేపీకి పన్నీరు బై..బై.. !
● కూటమి నుంచి వైదొలగుతూ నిర్ణయం ● ప్రత్యామ్నాయంపై దృష్టి సాక్షి, చైనె: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మాజీ సీఎం పన్నీరు సెల్వం శిబిరం బయటకు వచ్చింది. ఆ కూటమితో ఇక తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయం మీద దృష్టి పెట్టే యోచనలో ఉన్న పన్నీరు సెల్వం సీఎం స్టాలిన్ను వాకింగ్ సమయంలో భేటీ కావడం చర్చకు దారి తీసింది. వివరాలు.. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణ తర్వాత, ఆ పార్టీని కై వసం చేసుకునేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కార్యకర్తల హక్కుల సాధన కమిటీని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక శిబిరంగా కొనసాగుతూ వచ్చాయి. లోక్సభ ఎన్నికల వరకు వరకు పన్నీరు సెల్వంకు బీజేపీ పెద్దల అండదండాలు పుష్కలంగానే ఉంటూ వచ్చాయి. దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత సాగిన పరిణామాలలో గానీయండి, డిప్యూటీ సీఎం పదవి ఆయనకు దక్కడంలో గానీయండి ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నది జగమెరిగిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే బీజేపీని పక్కన పెట్టిన సమయంలో ఆ పార్టీ కూటమికి పన్నీరు తన మద్దతు ప్రకటించారు. ఎన్డీఏ కూటమిలో కార్యకర్తల హక్కులు సాధన కమిటీ చేరినట్టు ప్రకటించారు. ఆ ఎన్నికలలో రామనాథపురం నుంచిపన్నీరు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తదుపరి పరిణామాలతో బీజేపీ పన్నీరును దూరం పెట్టగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి నేతృత్వానికి అండగా ఢిల్లీ పెద్దల ఆశీస్సులు క్రమంగా పెరిగాయి. ఇందుకు అనుగుణంగా ఇటీవల ఎన్డీఏ కూటమిలోకి అన్నాడీఎంకే వెళ్లింది. ఈ పరిణామాలతో ఎన్డీలో పన్నీరు సెల్వం భవిష్యత్తుపై నీలి నీడలు అలముకున్నాయి. సీఎం స్టాలిన్తో భేటీపై సర్వత్రా చర్చ పన్నీరు సెల్వం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగంతో జత కట్టబోతున్నట్టుగా ఓ చర్చ జరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే కార్యకర్తల హక్కుల సాధన కమిటీ సమావేశానికి ముందుగా ఉదయం సీఎం స్టాలిన్ను పన్నీరు సెల్వం కలవడం కొత్త చర్చకు దారి తీసింది. వాకింగ్ సమయంలో ఈ భేటీ జరిగినట్టు ఓ ఫొటో వెలుగు చూసింది. దీంతో డీఎంకే వైపుగా పన్నీరు చూడబోతున్నారా? అన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో డీఎంకేను గద్దె దించడమే తమరి లక్ష్యమా? అని మీడియా ప్రతినిధులు ఈ కమిటీ సీనియర్ నేత బన్రూటి రామచంద్రన్ను ప్రశ్నించగా, ఇతరులను ఓడించడం, గద్దె దించడం తమ ఆశయం కాదని, అభినందనలు ఆశీస్సులు అందించడమే తమ లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. సీఎంతో భేటీ గురించి పన్నీరుసెల్వం స్పందిస్తూ, తాను చైన్నెలో ఉన్నప్పుడు సాధారణంగా వాకింగ్కు వెళ్లే చోటకు వాకింగ్ వెళ్లినట్టు వివరించారు. ఈ ఉదయం వాకింగ్ సమయంలో సీఎం స్టాలిన్ ఎదురు పడగా మర్యాద పూర్వకంగా నమస్కరించినట్టు చెప్పారు. కాగా అన్నాడీఎంకేతో చీలికతో ఆవిర్భవించిన చిన్నమ్మ శశికళ ప్రతినిధి టీటీవీ దినకరన్ పన్నీరుతో సఖ్యత ఉంటున్నారు. దీంతో దినకరన్ సైతం బయటకు వచ్చేనా అన్న చర్చ ఊపందుకుంది. రాజకీయ చర్చల నేపథ్యంలో సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ను గురువారం సాయంత్రం మాజీ సీఎం పన్నీరు సెల్వం, ఆయన కుమారుడు, మాజీ ఎంపీ రవీంద్రనాథ్ భేటీ కావడం గమనార్హం.పీఎం అపాయింట్మెంట్ దక్కక పోవడంతో.. గత వారం తమిళనాడు పర్యటనకు వచ్చిన పీఎం మోదీని కలిసేందుకు పన్నీరు సెల్వం విశ్వ ప్రయత్నాలు చేశారు. ప్రధానికి వినయ పూర్వక లేఖను సైతం పంపించారు. అయితే, ఆయనకు అపాయింట్మెంట్ దక్కలేదు. దీంతో తీవ్ర మనో వేదనలో ఉంటూ వచ్చిన పన్నీరు సెల్వం ఎన్డీఏతో కటీఫ్ నిర్ణయానికి వచ్చారు. తమను తీవ్రంగా బీజేపీ అవమానిస్తూ వస్తున్నట్టు గత ఏడాది కాలంగా పన్నీరు శిబిరం వర్గాలుపేర్కొంటూ వచ్చాయి. ఈ పరిస్థితులో పీఎం సైతం అనుమతి ఇవ్వక పోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. గురువారం చైన్నెలో కార్యకర్తలు హక్కుల సాధన కమిటీ సమావేశం జరిగింది. ఆ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం,సీనియర్ నేత బన్రూటి రామచంద్రన్తో పాటూ మద్దతు నేతలందరూ తరలివచ్చాయి. ఇందులో బీజేపీ రూపంలో ఎదురవుతున్న పరిణామాల గురించి చర్చించి ఎన్డీఏకు గుడ్ బై చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏకు దూరంగా.. ఈ సమావేశానంతరం బన్రూటి రామచంద్రన్ మీడియాతో మాట్లాడుతూ 3తీర్మానాలు సమావేశంలో చర్చించి తీసుకున్నట్టు ప్రకటించారు. ఇన్నాళ్లూ ఎన్డీఏలో ఉన్నామని, ఇక ఈ కూటమిలో కొనసాగలేమన్న నిర్ణయానికి వచ్చి బయటకు వచ్చినట్టు ప్రకటించారు. అలాగే భవిష్యత్తులోనూ ఈ కూటమితో పొత్తు అవకాశం లేదని స్పష్టం చేశారు. తమిళనాడులో పన్నీరు సెల్వం జిల్లాల పర్యటన చేయబోతున్నట్టు వివరించారు. ఏ పార్టీతోనూ ప్రస్తుతం కూట మి అన్నది లేదని, ఇప్పట్లో ఆ విషయంగా ఎలాంటి నిర్ణయం అన్నది లేదని స్పష్టం చేస్తూ, భవిష్యత్తులో పరిస్థితులకు అనుగుణంగా కూటమి నిర్ణయం తీసుకోవాలని తీర్మానం చేశామన్నారు. -
క్లుప్తంగా
విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు అవసరం సాక్షి, చైన్నె: విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెరగాలని ఏవీఐటీ చాన్స్లర్ డాక్టర్ ఎఎస్ గణేషన్, వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ అనురాధా పిలుపు నిచ్చారు. ఆరుపడై వీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2025–26 సంవత్సరం తొలి బ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఇందులో గణేషన్, అనురాధా గణేషన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సమగ్రత, ఆవిష్కరణలు, సమ్మిళితత్వం, విలువల గురించి వివరించారు. సమాజ మార్పులో విద్యా పాత్రను గురించి తెలియజేశారు. నాస్కామ్ డైరెక్టర్ వి ఉదయ శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులలో ప్రతిధ్వనించే శక్తివంతమైన అంశాలను, వృత్తి పరమైన ప్రయాణం గురించి వివరించారు. పరిశ్రమ, ఏఐ, సైబర్ భద్రత, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ గురించి విశదీకరించారు. కార్యక్రమంలో ఏవీఐటీ నిర్వహణ బోర్డు సభ్యుడు సురేష్ శామ్యూల్, ప్రిన్సిపల్ డాక్టర్ జే జనత్, డైరెక్టర్ జీ సెల్వకుమార్, ఉపకులపతి డాక్టర్ పీకే సుదీర్, ప్రో ఉపకలపతి డాక్టర్ శబరి నాథన్, రిజిస్టార్ డాక్టర్ ఎ. నాగప్పన్, డిప్యూటీ రిజిస్టార్ పి. రాజశేఖరన్, పి. కార్తికేయన్, అడ్మిషన్స్ అధికారి నూర్జహాన్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ డాక్టర్ వాణి తదితరులు పాల్గొన్నారు. కారులో అకస్మాత్తుగా మంటలు – ప్రాణాలతో తప్పించుకున్న బాధితులు తిరువొత్తియూరు: పెరుంగళత్తూరు ప్రాంతంలో నడిరోడ్డుపై కారులో మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే అందులో నుంచి దిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు.. తూర్పు తంజావూ రు జిల్లా, పుదుక్కోట సమీపంలోని తిరుచ్చిట్రంబలం ప్రాంతానికి చెందిన అయ్యప్పన్ (34) తన కుటుంబంతో కలిసి కారులో చైన్నెకి బయలుదేరాడు. గురువారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో పెరుంగళత్తూరు సమీపంలోకి రాగానే, అతని కారు ముందు భాగం నుంచి పొగ వచ్చింది. దీంతో కారును రోడ్డు పక్కన ఆపి, అయ్యప్పన్, అతని కుటుంబానికి చెందిన నలుగురు కారులోంచి దిగిపోయారు. ఆ తర్వా త కొద్దిసేపటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై పీర్కన్ కరణై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్ బస్సు ఢీకొని టీచర్ మృతి అన్నానగర్: ఈరోడ్ సమీపంలోని చెట్టిపాళయం ప్రాంతానికి చెందిన శేఖర్. ఇతని కుమార్తె మిర్తియంక (21). మూలపాళయం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కిండర్ గార్టెన్లో టీచర్గా పనిచేస్తోంది. గురువారం ఉదయం, ఎప్పటిలాగే, మిర్థియంక తన ద్విచక్ర వాహనం పై ఇంటికి నుంచి మూలపాళయం పాఠశాలకు బయలుదేరింది. అన్నామార్ పెట్రోల్ పంప్ ప్రాంతం సమీపంలో ప్రైవేటు బస్సు మిర్తియంక స్కూటీని ఢీకొట్టింది. ఆమె అక్కడికక్కడే తల నుజ్జునుజ్జు అయి, రక్తస్రావంతో మరణించింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఉపాధ్యా యురాలి మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్మార్టం పరీక్ష కోసం ఈరోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసు కుని ప్రైవేట్ బస్సు డ్రైవర్ను విచారిస్తున్నారు. మారియమ్మన్ ఆలయ హుండీ ఆదాయం రూ.1.21 కోట్లు అన్నానగర్: సమయపురం మరియమ్మన్ ఆలయ హుండీ లెక్కింపు గురువారం చేపట్టారు. కోటి 27 లక్షల 31 వేల 398 రూపాయల నగదు, 1.535 గ్రాముల బంగారం, 4 కిలోల 405 గ్రాముల వెండి కానుకలు అందినట్లు ఆలయ నిర్వాహుకులు వెల్లడించారు. వివరాలు.. శక్తి ఆలయాలలో అగ్రగామిగా ఉన్న తిరుచ్చి సమయపురం మారియమ్మన్ ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. కాగా భక్తులు సమర్పించిన కానుకలను బ్యాంకులోని ఆలయ ఖాతాకు జమ చేసినట్లు ఆలయ జాయింట్ కమిషనర్ ప్రకాష్ తెలిపారు. చిన్నారిపై లైంగిక వేధింపులు – తల్లిదండ్రులు పాఠశాలను ముట్టడించడంతో కలకలం అన్నానగర్: తిరుప్పూర్లోని కెవిఆర్ నగర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ పాఠశాల నడుస్తోంది. ఈ పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్థితిలో ఇక్కడ 1వ తరగతి చదువుతున్న 6 ఏళ్ల బాలిక బుధవారం సాయంత్రం టాయిలెట్కు వెళ్లింది. ఆ సమయంలో టాయిలెట్ శుభ్రం చేస్తున్న అస్సాంకు చెందిన ఒక యువకుడు ఆ బాలికను లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తరగతి ఉపాధ్యాయురాలికి చెప్పింది. అయితే ఆమె సరైన చర్య తీసుకోలేదని తెలుస్తుంది. దీని తర్వాత, ఆ బాలిక సాయంత్రం తన తల్లికి పొత్తి కడుపులో నొప్పిగా ఉందని చెప్పి, పాఠశాలలో జరిగిన ఘటన గురించి కూడా చెప్పింది. దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు, సాధారణ ప్రజలు ప్రైవేట్ పాఠశాలను చుట్టుముట్టి, బాలికను లైంగికంగా వేధించిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసి నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న కేవీఆర్ నగర్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ జాన్ సహా పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టారు. ఆ తరువాత, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన అస్సాంవాసి జయ్ (27) పై సౌత్ ఆల్ ఉమెన్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
చైన్నె బడులలో స్మార్ట్ వాటర్ ఏటీఎం
– కార్పొరేషన్ నిర్ణయం సాక్షి, చైన్నె: స్మార్ట్ వాటర్ ఏటీఎంలను చైన్నె కార్పొరేషన్ బడులలో ఏర్పాటు చేయడానికి గ్రేటర్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను అధికారులు గురువారం జారీ చేశారు. వివరాలు.. చైన్నె వాటర్ బోర్డు ద్వారా ఉచితంగా నాణ్యమైన తాగునీటిని అందించడానికి స్మార్ట్ వాటర్ ఏటీఎంలకు ఇటీవల చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. తొలి ప్రయత్నంగా మనాలి, మాధవరం, తాండయార్పేట, రాయపురం, తిరు.వి.కె. నగర్, అంబత్తూర్, అన్నా నగర్, తేనాంపేట్, కోడంబాక్కం, వలసరవాక్కం, అడయార్ మండలాల్లో ఎంపిక చేసి బస్టాండ్లు, పార్కులు, ఆలయా లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, వాణిజ్య ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, పాఠశాలలు, కళాశాలలు, మెట్రో స్టేషన్, మెరీనా బీచ్ సహా 50 ప్రదేశాలలోవీటిని ఏర్పాటు చేశారు. ఇది విజయవంతంగా సాగుతుండడంతో కార్పొరేషన్ నేతృత్వంలోని పాఠశాలలో స్మార్ట్ ఏటీఎంల ఏర్పాటుకు కమిషనర్ కుమర గురుబరన్ ఆదేశాలు జారీ చేశారు. 2నెలల్లో ఈ ప్రక్రియను ముగించేందుకు సిద్ధమయ్యారు. -
మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆందోళన
తిరువళ్లూరు: మౌలిక సదుపాయాలు కల్పించని పక్షంలో పోరాటం చేస్తామని జేజే గార్డెన్కు చెందిన ప్రజలు ప్రకటించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా శిరువానూర్ కండ్రిగ పంచాయతీ పరిధిలో జేజే గార్డెన్ ప్రాంతం వుంది. ఇక్కడ సుమారు ఐదువందల మందికి పైగా నివాసం వుంటున్నారు. స్థానికంగా వున్న ప్రజలకు ఆధార్, ఓటరు కార్డు, రేషన్కార్డులను ప్రభుత్వం అందించింది. అయితే తమ ప్రాంతానికి మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ స్థానికులు పలు సార్లు ఆందోళన నిర్వహించారు. అయినా ఇంత వరకు సదుపాయాలు కల్పించలేదు. ఈ క్రమంలోనే తమ ప్రాంతానికి మౌలిక సదుపాయం కల్పించాలని స్థానికులు గత రెండు వారాల క్రితం కలెక్టర్ ప్రతాప్కు వినతి పత్రం సమర్పించారు. అయితే కలెక్టర్ జేజేగార్డెన్కు వెళ్లకుండా మరో ప్రాంతాన్ని తనిఖీ చేసి అక్కడ ప్రజలు నివాసమే లేరని అక్కడ ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ప్రశ్నించారు. ఈ విషయం స్థానికులకు చేరడంతో ఆగ్రహించిన ప్రజలు గురువారం దాదాపు మూడువందల మంది ఒకేచోట గుమికూడి నిరసన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో ప్రజలు వున్నా లేరని కలెక్టర్ సమాధానం చెప్పడం సరికాదన్నారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
వీఐటీ చైన్నెలో అంతర్జాతీయ సదస్సు
కొరుక్కుపేట: వీఐటీ చైన్నె క్రిస్టల్ జూబ్లీ వేడుకల్లో భాగంగా చైన్నెలోని వీఐటీలో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఫ్యాషన్ అండ్ దుస్తులలో వత్తాకార ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై అంతర్జాతీయ సదస్సు, ఈఎన్వీఐటీఓఎన్ –25 పేరుతో అంతర్ కళాశాల ఫ్యాషన్ పోటీని గురువారం నిర్వహించింది. ముఖ్య అతిథిగా తిరుప్పూర్లోని పాప్పయాస్ నైట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ ఎ. శక్తివేల్ , యునైటెడ్ కింగ్డమ్లోని న్యూకాజిల్లోని నార్తుంబ్రియా స్కూల్ ఆఫ్ డిజైన్, ఆర్ట్స్ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్ ప్రొఫెసర్ డాక్టర్ అన్నే పీర్సన్–స్మిత్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వీఐటీ వ్యవస్థాపక చాన్స్లర్ డాక్టర్ జి. విశ్వనాథన్ అధ్యక్షత వహించగా, వీఐటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ జీవీ సెల్వం ప్రత్యేక ప్రసంగం చేశారు. ముఖ్యఅతిథి డాక్టర్ ఎ. శక్తివేల్ మాట్లాడుతూ విద్యార్థులు, పరిశ్రమ నిపుణులను ఉద్దేశపూర్వక ఆవిష్కరణలను స్వీకరించాలని, సమగ్రతను నిలబెట్టుకోవాలని, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అపార అవకాశాలు.. భారతదేశం, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంతో ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు ప్రపంచ మార్కెట్లను అన్వేషించడానికి అపారమైన అవకాశాలను పొందుతారన్నారు. డాక్టర్ జి. విశ్వనాథన్ తన అధ్యక్ష ప్రసంగంలో కాలుష్యాన్ని తగ్గించడంలో, స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడంలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ కీలక పాత్రను నొక్కి చెప్పారు. ఇతర దేశాలకు ఎగుమతి చేసే విషయంలో భారతదేశం చైనాతో పోటీ పడగలగాలి, ఎందుకంటే చైనా ఎగుమతుల పరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందన్నారు. ఇదంతా యువత దీన్ని ఎలా చేయబోతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని, ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తుందని అన్నారు. డాక్టర్ జీవీ సెల్వం మాట్లాడుతూ భారతీయ వస్త్రధారణ , సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఇది దేశ వారసత్వం, వాతావరణం , సమాజ విలువలను ప్రతిబింబిస్తుందన్నారు. ఈ సమావేశంలో భాగంగా, వీఐటీ చైన్నె, యూకేలోని నార్తంబ్రియా స్కూల్ ఆఫ్ డిజైన్, ఆర్ట్స్ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్తో ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) పై సంతకం చేసింది. ఇది విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడికి, అలాగే స్థిరమైన ఫ్యాషన్ , డిజైన్లో సహకార పరిశోధనకు మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవంలో విఐటీ చైన్నె ప్రో–వైస్ చాన్స్లర్ డాక్టర్ టి. త్యాగరాజన్, చైన్నెలోని విఐటీ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ డీన్ డాక్టర్ టి. పళని రాజన్ కూడా పాల్గొన్నారు. -
అజిత్ కొత్త డీల్
తమిళసినిమా: నటుడు అజిత్ ఇటీవల నటించిన విడాముయర్చి చిత్రం మినహా అన్నీ విజయం సాధించాయి. తాజాగా అజిత్ కథానాయకుడిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది. కాగా ప్రస్తుతం కారు రేస్పై దృష్టి సారిస్తున్న అజిత్ త్వరలో కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకుముందు అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా తాజాగా ఈ హిట్ కాంబినేషన్ రూపొందనున్న ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ సంస్థ అధినేత రాహుల్ నిర్మించనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రానికి అజిత్ పారితోషికమే తీసుకోకుండా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అలాగని ఫ్రీగా నటించడం లేదని, అజిత్, నిర్మాత రాహుల్ ఒక డీల్ చేసుకున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ డీల్ ఏమిటంటే చిత్రం విడుదలైన తరువాత ఓటీటీ, డిజిటల్ హక్కులను అజిత్కు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అజిత్ ఇప్పటివరకు ఒక్కో చిత్రానికి రూ.150 నుంచి రూ.170 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. కాగా ఇంతకుముందు వరకు కొంత పారితోషికంతో పాటు ఒకటి రెండు ఏరియాల హక్కులను కోరే హీరోలు ఇకపై అజిత్లా ఓటీటీ, డిజిటల్ హక్కులు కోరతారేమో. అవకాశాల కోసం నిధి పోరాటం -
మార్నింగ్ వాక్.. మధ్యాహ్నానికి ఎన్టీయేతో కటీఫ్
తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ(జులై 31, 2025) కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం (OPS) ఎన్డీయే కూటమికి గుడ్బై చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్ను కలిసిన ఫొటో ఒకటి వైరల్ అయిన కాసేపటికే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. ఈ ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్తో మార్నింగ్ వాక్లో కనిపించిన ఓపీఎస్.. పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే కాసేపటికే ఆయన వర్గం నుంచి కీలక ప్రకటన వెలువడింది. తమ వర్గం ఎన్డీయే కూటమి నుంచి తెగదెంపులు చేసుకుందని, ఇక ఆ కూటమితో కలిసి నడిచేది లేదని మాజీ మంత్రి, ఓపీఎస్ నమ్మిన బంటు పానుర్తి రామచంద్రన్ గురువారం మధ్యాహ్నాం ప్రకటించారు. ఆ సమయంలో ఓపీఎస్ పక్కనే ఉండడం గమనార్హం. అయితే.. భవిష్యత్తులో ఏ పార్టీతో కలిసి నడుస్తారనేదానిపై ఆయన వర్గం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఏ పార్టీతోనూ పొత్తు అనుకోవడం లేదు.ఎన్నికలు సమీపించే సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అని ప్రకటించారాయన.అన్నాడీఎంకేలో కీలక నేతగా ఉన్న పన్నీర్ సెల్వం.. ఎడప్పాడి కె పళని స్వామితో పొరపచ్చాలతో సొంత వర్గం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత తమదే అసలైన అన్నాడీఎంకే వర్గంగా ప్రకటించుకున్న పళనిస్వామి.. ఓపీఎస్ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో బహిష్కృత నేతగానే ఓపీఎస్ రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయన వర్గాన్ని సైతం బీజేపీ దగ్గరకు తీసుకుంది. అయితే.. ఈ మధ్య జరిగిన పరిణామాలతో నొచ్చుకున్న ఆయన ఎన్టీయేకు కటీఫ్ చెప్పారు.కారణం అదే..గంగైకొండ చోళపురం పర్యటనలో ప్రధాని మోదీతో ప్రత్యేక భేటీకి ఓపీఎస్ ప్రయత్నించారు. అయితే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. తనకు ఆ మాత్రం ప్రాధాన్యం లేదా? రగిలిపోయారాయన. ఆ వెంటనే.. సర్వ శిక్షా అభియాన్ నిధుల జాప్యంపై ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు కూడా. ఇలా వరుస పరిణామాల తర్వాతే ఆయన ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు ఆయన మద్ధతు ఇస్తారంటూ గత రెండు రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈలోపే ఆయన డీఎంకే అధినేతతో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది ఇప్పుడు. విజయ్ పార్టీనా? స్టాలిన్ డీఎంకేనా? అనే ఛాయిస్ను బట్టి ఓపీఎస్ను అన్నాడీఎంకే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.బలం పెంచుకునే యోచనలో ఓపీఎస్ ఓపీఎస్ వర్గంలో దక్షిణ తమిళనాడు ప్రాంతానికి చెందిన బలమైన నేతలే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆ వర్గంలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. వీళ్లలో వీసీ ఆరుకుట్టి ఇప్పటికే పళనిస్వామి వర్గం వైపుళ్లిపోయారు. ఓపీఎస్ కొడుకు రవీంద్రనాథ్ కూడా విజయ్ టీవీకేతో టచ్లో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన మరికొందరిని ఆ పార్టీలోకి తీసుకెళ్తారని ఊహాగానాలు వినవస్తున్నాయి. అదే సమయంలో.. మాజీ సీఎం జయలలితకు సన్నిహితురాలైన శశికళతో పాటు టీటీవీ దినకరన్ను తన వర్గంలోకి చేర్చుకోవాలని ఓపీఎస్ ఉవ్విళ్లూరుతున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన మదురైలో మహానాడు నిర్వహించి తన బలం నిరూపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో.. సొంత పార్టీ ప్రకటన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
సస్పెన్స్ థ్రిల్లర్గా ‘హౌస్మేట్స్’
తమిళసినిమా: సినిమాలో కొత్తదనం ఉంటేనే అది పెద్దదైనా, చిన్నదైనా ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్లకు వెళ్లే పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ప్రేక్షకులు ఆదరించిన చిత్రమే పెద్దది అని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంటున్న పరిస్థితి. ఇకపోతే ఇటీవల మంచి కంటెంట్తో కూడిన చిన్న బడ్జెట్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తున్న పరిస్థితి .ప్రేక్షకులు వైవిద్యాన్ని కోరుకుంటున్నారన్నదానికి ఇదే ఉదాహరణ. కాగా తాజాగా అలాంటి ఇతి వృత్తంతో కూడిన చిత్రం హౌస్మేట్స్. ఇదేంటి క్లాస్మేట్స్ గురించి, రూమేట్స్ గురించి విన్నాం, హౌస్మేట్స్ ఏమిటీ అని అనుకుంటున్నారా? అదే ఈ చిత్ర కథ ప్రత్యేకత. రెండు కుటుంబాలు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే ఇంటిలో నివశిస్తుంటారు. అదేలా సాధ్యం అన్నదే ఆసక్తికరమైన విషయం. నటుడు దర్శన్, కాళీవెంకట్, అర్షా చాందిని బైజూ, వినోదిని, దీనా, అబ్దుల్లీ, మాస్టర్ హెండ్రిక్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రే స్మిత్ స్టూడియోస్, సౌత్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఎస్పీ శక్తివేల్ క్రియేటివ్ నిర్మాతగా వ్యవహిరించిన ఈ చిత్రానికి టీ.రాజవేల్ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. ఎంఎస్.సతీశ్ ఛాయాగ్రహణం, రాజేశ్ మురుగేశన్ సంగీతాన్ని అందించారు. కాగా చిన్న చిత్రాలను ప్రోత్సహించే నటుడు శివకార్తికేయన్ ఈ చిత్రాన్ని విడుదల చేయడం మరో విశేషం. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న హౌస్మేట్స్ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే సొంత ఇల్లు ఉండాలని కాబోయే మామ హీరోకు కండిషన్ పెట్టడంతో అతను సంపాందించినదంతా ఖర్చు పెట్టి ఓ ఆపార్ట్మెంట్ కొనుగోలు చేస్తాడు. అయినా మామ పెళ్లికి ఆటంకాలు పెట్టడంతో ప్రేమికులు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని కొత్తగా కొన్న ఇంటిలో కాపురం పెడతారు. అయితే అప్పటికే ఆ ఇంటిలో మరో కుటుంబం కాపురం ఉంటుంది. కానీ ఈ రెండు కుటుంబాలు ఒకరికి ఒకరు కనిపించరు. ఎందుకనీ, వారి కథ ఏమిటి అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం హౌస్మేట్స్ అని నిర్మాతలు వెల్లడించారు. -
ఆవిష్కరణలకు తొలి ప్రాధాన్యత
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఆవిష్కరణ, మేధో సంపత్తికి తొలి ప్రాధాన్యత అని డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ప్రకటించారు. టెక్నాలజీ ఎగ్జిబిషన్ హాల్ ప్రదర్శనలో పేటెంట్ పొందిన ట్రాన్స్ సెండెంటల్ టెక్నాలజీ ఆవిష్కరణలను బుధవారం ఆయన నపరిశీలించారు. తమిళనాడు ప్రభుత్వ సమాచార. సాంకేతిక పరిజ్ఞానం , డిజిటల్ మంత్రిత్వ శాఖ సేవల విభాగం పరిధిలోని తమిళనాడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేతృత్వంలో అన్నా శత జయంతి స్మారక గ్రంథాలయం వేదికగా మేథో శక్తి కేంద్రం– తమిళనాడు, భారత దేశం అన్న అంశంతో ఆవిష్కరణ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనిని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరిశీలించారు. ఇక్కడి ఆవిష్కరణలను, పేటెంట్లు పొందిన వివిధ పరిశోధనలను విష్కరించారు. తమిళనాడును ఆవిష్కరణలకు రాజధానిగా తీర్చిదిద్దుదామని ఈసందర్భంగా ప్రకటించారు. ఈ సదస్సులో తమిళనాడు నుంచి 16 మంది పరిశోధకుల పేటెంట్లు, ఆవిష్కరణలకు సత్కారం, నగదు ప్రోత్సాహం అందించారు. 5 స్వదేశీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికలు, టెక్నాలజీ ఇన్నోవేషన్ కంపెనీలకు ఐడీఎన్టీ సెంటర్ఫౌండేషన్ ద్వారా రూ. 53 లక్షలను చెక్కులను అందజేశారు. అలాగే ఫెసిలిటేషన్ సెంటర్ నేతృత్వంలో విద్యా పరిశోధకుల ఆవిష్కరణలకు, పేటెంట్ పొందిన కంపెనీలు, విద్యా పరిశోధకుల ఉపయోగం కోసం పారిశ్రామిక సంస్థల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఐడీటీఎన్ సెంటర్కు మద్దతు ఇచ్చే విధంగా డీప్ లెర్నింగ్ టెక్నాలజీ , అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ స్టార్టప్లకు మద్దతుగా అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ఇండియా, నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సెంట్రల్ హై–స్పీడ్ కంప్యూటింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మహీంద్రా – మహీంద్రా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి ఆరు సంస్థలో కూడిన కూడిన ఇంజినీరింగ్ సౌకర్యాల మ్యాప్( ఐ అండ్ఎస్టీఈఎం)ముందుకు వచ్చాయి. తమిళనాడు అంతటా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలు, వ్యాపార ఇంక్యుబేటర్లు, స్టార్టప్ కంపెనీలు, పారిశ్రామిక కంపెనీలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ రంగానికి సంబంధించిన సాంకేతిక పరిశోధకులు, పేటెంట్ హోల్డర్లు ఈ సమావేశానికి తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో సమాచార సాంకేతిక , డిజిటల్ శాఖ మంత్రి డాక్టర్ పళణి వేల్ త్యాగరాజన్, రాష్ట్ర ప్రణాళికా కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ జె. జయరంజన్, టెక్నాలజీ, డిజిటల్ సేవల విభాగం ప్రభుత్వ ప్రాథమిక కార్యదర్శి ప్రజేంద్ర నవ్నిత్, ఐడిఎన్టి సెంటర్ చైర్మన్ వనితా వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ, తమిళనాడు పరిశ్రమలకు రాజధానిగా మారుతున్నట్టు వివరించారు. పెట్టుబడులు విస్తృతంగా రానున్నాయని వివరించారు. ఉద్యోగ అవకాశాల కల్పన విస్తృతం చేశామన్నారు. ఆవిష్కరణలు, పరిశోధనలకు తమిళనాడులో తొలి ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు. డిప్యూటీ సీఎం ఉదయ నిధి వెల్లడి -
‘ఐరిస్ ఫేస్ ఆఫ్ చైన్నె’కు సన్నద్ధం
సాక్షి, చైన్నె: యువ మోడల్స్ను ఒకే వేదిక మీదకు తెచ్చే ఐరిస్ ఫేస్ ఆఫ్ చైన్నెకు నేచురల్స్ సన్నద్ధమైంది. ఈ ఏడాది 25వ సంవత్సరం(సిల్వర్ జూబ్లీ) వేడుకగా కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా లాంచ్ ఫ్యాడ్, విజేతకు బహూకరించే కిరిటాన్ని స్థానికంగా బుధవారం ప్రదర్శించారు. నేచురల్స్ సెలూన్ సహ వ్యవస్థాపకుడు సికే కుమర వేల్, వ్యవస్థాపకురాలు డాక్టర్ వీనా కుమర వేల్, జీఆర్టీ హోటల్స్ సీఈఓ విక్రమ్ కోటా, సుల్తాన్ జెమ్స్ అండ్ డైమండ్స్ ఎండీ సుల్తాన్ మొహిద్దీన్,డఫిల్ డిజిటల్ వ్యవస్థాపకుడు ఏఎస్ మురుగ వేలన్, ఐరిస్ సీఈఓ డాక్టర్ లత ఏ కృష్ణలు ఈ వేడుకల వివరాలను వెల్లడించారు. తమిళనాడు వ్యాప్తంగా ప్రత్యేకంగా మధురై, తిరుచ్చి, కోయంబత్తూరుతో పాటూ చైన్నె వంటి నగరాలలో ఆడిషన్లు నిర్వహించనున్నామని ప్రకటించారు. 18 నుంచి 29 సంవత్సరాల యువ మోడల్స్కు మిస్ అండ్ మిస్టర్ పోటీలు, 50 ఏళ్ల వయసున్న వివాహిత మహిళల కోసం ప్రత్యేక పోటీ నిర్వహించనున్నామని వివరించారు. సెప్టెంబరు నెలలో మెగా ఆడిషన్ జరుగుతుందన్నారు. ఆ తదుపరి అన్ని విభాగాలలో ఫైనలిస్టులను ఎంపిక ఉంటుందని, సెప్టెంబరు 27వ తేదీన మీనంబాక్కంలో ఫినాలే జీఆర్టీ రాడిషన్ బ్లూలో నిర్వహించనున్నామని ప్రకటించారు. గత సంవత్సరంలో చైన్నెలో జరిగిన ఆడిషన్కు 1000 మంది హాజరయ్యారని, మూడు విభాగాలలో 30 మంది ఫైనల్కు చేరుకున్నారని గుర్తు చేశారు. ఈ సంవత్సరం తమిళనాడు వ్యాప్తంగా ఆడిషన్లకు 3 వేల మందికి పైగా హాజరు అవుతారని భావిస్తున్నామన్నారు. వీరిలో ప్రతి విభాగం నుంచి 15 మందిని ఫైనల్కు షార్ట్ లిస్ట్ చేయనున్నామని వివరించారు. -
కీలడి నివేదికకు పట్టు!
సాక్షి, చైన్నె: తమిళ సంస్కృతికి దర్పణంగా మారిన కీలడి నివేదికను బట్ట బయలు చేయాలని కేంద్రాన్ని పట్టుబడుతామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి తెలిపారు. ఈ వ్యవహారంలో డీఎంకే ప్రభుత్వం చేపట్టేచర్యలకు తాము మద్దతు ఇస్తామన్నారు. తమిళనాడును, ప్రజలను రక్షిద్దామని పళణి స్వామి చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర బుధవారం శివగంగై జిల్లా తిరుబువనంకు చేరింది. ఇటీవల తిరుబువనంలో పోలీసుల లాకప్ డెత్లో మరణించిన అజిత్కుమార్ కుటుంబాని పళణి స్వామి పరామర్శించారు. అన్నాడీఎంకే తరపున రూ. 5 లక్షలు చెక్కును అందజేశారు. అనంతరం ఆయన కీలడిలో పురావస్తు పరిశోధనల ఎగ్జిభిషన్ను సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న పురావస్తు తవ్వకాలు, ఇప్పటి వరకు బయట పడ్డ అనేక ఆధారాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మట్లాడుతూ, డీఎంకే ప్రభుత్వ అసమర్థత కారణంగా అన్ని విభాగాలు అస్తవ్యస్థంగా మారి ఉన్నాయని ధ్వజమెత్తారు. కీలడిలో జరిగిన పురావస్తు పరిశోధనలకు సంబంధించిన నివేదిక విషయంగా ప్రస్తావిస్తూ, ఈ వ్యవహారంలో కేంద్రం వద్ద పట్టుబడుతామన్నారు. ఈ నివేదికను బయట పెట్టాలని కోరుతామన్నారు. ఈ వ్యవహారంలో మాత్రం డీఎంకే చేపట్టే చర్యలకు తాము మద్దతు ఇస్తామని వ్యాఖ్యలు చేశారు. కీలడి పురవాస్తు ఆధారాలన్నీ తమిళ సంస్కృతికి దర్పణాలు అని, తమ హయాంలో ఇక్కడి అంశాలతో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి ఉన్నామని వివరించారు. -
అరుదైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం
సాక్షి, చైన్నె : రక్త గ్రూపులు వేర్వేరుగా ఉన్న దాత, గ్రహీత మధ్య అరుదైన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను ఎస్ఆర్ఎం గ్లోబల్ వైద్యులు విజయవంతం చేశారు. అధునాతన ఇమ్యునో అడ్సార్ప్షన్ థెరపీని ఉపయోగించి ఈ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించామని బుధవారం వైద్యులు ప్రకటించారు. చైన్నెకి చెందిన జోసెఫ్ రాజ్ దీర్ఘకాలికంగా మూత్రపిండ వ్యాధితో బాధ పడుతూ వచ్చాడు. వ్యాధి చివరి దశలో మూత్రపిండ వైఫల్యానికి దారితీసింది. దీంతో గత మూడు సంవత్సరాలుగా తన ఉద్యోగాన్ని వదిలి వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవలసి వచ్చింది. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యమైంది. జోసెఫ్ తండ్రి తన కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చినా, ఇద్దరి రక్త గ్రూపులు వేర్వేరు కావడంతో అత్యాధునిక విధానం అనుసరించి శస్త్ర చికిత్సకు వైద్యులు సిద్ధమయ్యారు. కేసు సంక్లిష్టతను పరిగణనలోకి తీసుకుని, ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడికి 14 రోజుల ముందు ఒక ప్రత్యేకమైన డీసెన్సిటైజేషన్ ప్రొటోకాల్ను అనుసరించారు. ఇందులో ఇమ్యునో అడ్సార్ప్షన్ వాడకం కూడా ఉంది, శస్త్రచికిత్సకు దాదాపు 24 గంటల ముందు యాంటీబాడీ టైటర్ను సురక్షిత స్థాయికి విజయవంతంగా తగ్గించి. ఆ తర్వాత మార్పిడిని నిర్వహించారు, యాంటీబాడీ టైటర్లు మళ్లీ పెరిగినప్పుడు, రెండవ ఇమ్యునో అడ్సార్షన్ సెషన్ను వెంటనే నిర్వహించారు. రోగి ఎనిమిదవ రోజున స్థిరమైన స్థితిలో, సాధారణ క్రియేటినిన్ స్థాయితో డిశ్చార్జ్ చేశారు. ఈ అరుదైన మార్పిడి శస్త్ర చికిత్సకు సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మాథ్యూ గెర్రీ జార్జ్, యూరాలజిస్టు డాక్టర్ దీపక్ నాయకత్వం వహించారు. ఎస్ఆర్ఎం గ్లోబల్ ఆస్పత్రి అధ్యక్షుడు డాక్టర్ పి. సత్యనారాయణన్ ఈ సందర్భంగా మట్లాడుతూ, ఈ అసాధరణ కేసు తమ వైద్యుల బృందం, క్లినికల్ ఎక్సలెన్స్కు దర్పణంగా వ్యాఖ్యలు చేశారు. -
నేడు సచివాలయానికి సీఎం
●పది రోజుల తర్వాత రాక సాక్షి, చైన్నె: పది రోజుల తర్వాత సీఎం ఎంకే స్టాలిన్ గురువారం సచివాలయానికి రానున్నారు. పలు కార్యక్రమాలకు అధికారులు ఈ సందర్భంగా ఏర్పాట్లు చేశారు. సీఎం ఎంకే స్టాలిన్ గత సోమవారం 21వ తేదిన తల తిరగడంతో అపోలోఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు పలు రకాల వైద్య పరీక్షలు జరిగాయి. శనివారం సాయంత్రం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల సూచన మేరకు మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆస్పత్రిలో ఉన్నా, క్యాంప్ కార్యాలయంలో ఉన్నా, ప్రభుత్వ వ్యవహారాలు, పార్టీ వ్యవహారాలను సీఎంపర్యవేక్షిస్తూనే వచ్చారు. ప్రస్తుతం సీఎం పూర్తిగా కోలుకున్నారు. గురువారం నుంచి ఆయన తన రోజు వారి కార్యక్రమాల మీద దృష్టి పెట్టనున్నారు.సచివాలయానికి సీఎంరానున్నడంతో వీడియో కాన్పరెన్స్ ద్వారా పలు ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, ఈనెల 4వ తేదీన సీఎం స్టాలిన్ తూత్తుకుడి పర్యటనకు సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం. తూత్తుకుడిలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీనిని సీఎం స్టాలిన్ ప్రారంభించబోతున్నారు. అలాగే, పలు అభివృద్ధి కార్యక్రమాలకు చర్యలు తీసుకుంటారని అధికారులు వెల్లడించారు. 2న పోస్టాఫీసుల్లో సేవల నిలిపివేత ● సీనియర్ పోస్టల్ డివిజనల్ సూపరింటెండెంట్ వెల్లడి కొరుక్కుపేట: చైన్నె సెంట్రల్ డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసులలో పోస్టల్ శాఖ కొత్త అప్గ్రేడ్ టెక్నాలజీని 24.8.2025 నుంచి అమలు చేయాలని యోచిస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీ సాఫ్ట్వేర్ కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా విధానానికి అనుగుణంగా దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ మెరుగైన డిజిటల్ సేవ యొక్క సజావుగా, సురక్షితమైన ఆపరేషన్ను నిర్ధారించడానికి ఆగష్టు 2వ తేదీన లావాదేవీలు లేని రోజును ప్లాన్ చేశారు. ఈమేరకు 2వ తేదీన చైన్నె సెంట్రల్ పోస్టల్ డివిజన్ పరిధిలోని కింది పోస్టాఫీసులలో ఎటువంటి పోస్టల్ సేవలు అందించరు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు తమ పోస్టల్ సేవలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు. విద్యార్థినులకు లైంగిక వేధింపులు ●రెసిడెన్షియల్ స్కూల్ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్ తిరువొత్తియూరు: కల్లకురిచ్చి జిల్లా కల్వరాయన్మలై ప్రాంతంలోని మణియార్పాళయం గ్రామంలో ప్రభుత్వ గిరిజన రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాల నడుస్తోంది. ఈ పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థినులు అదే ప్రాంతంలోని హాస్టల్లో వుంటూ చదువుకుంటున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు ధనపాల్ పాఠశాల విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు అందింది. దీంతో కల్లకురిచ్చి జిల్లా బాలల సంరక్షణ అధికారి ఇళయరాజా పర్యవేక్షణలో బాలల సహాయ కేంద్రం సిబ్బంది సంబంధిత పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. అందులో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధనపాల్ పాఠశాల విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు తేలింది. దీనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కల్లకురిచ్చి జిల్లా ప్రాథమిక విద్యాశాఖ అధికారికి, గిరిజన సంక్షేమ పథకాల అధికారికి సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయుడు ధనపాల్ను సస్పెండ్ చేస్తూ గిరిజన సంక్షేమ అధికారి అణ్ణాదురై బుధవారం ఆదేశాలు జారీ చేశారు. చైన్నె పోలీస్ కమిషనరేట్లో గ్రీవెన్స్ డే కొరుక్కుపేట: చైన్నె పోలీస్ కమిషనరేట్లో జరిగిన ఫిర్యాదుల పరిష్కార శిబిరంలో పోలీస్ కమిషనర్ అరుణ్ ఫిర్యాదులు స్వీకరించారు. వివరాలు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రతి బుధవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరం నిర్వహిస్తున్నారు. వినతులు స్వీకరించిన కమిషనర్ అరుణ్ వాటిపై తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. రూ.505 కోట్లతో 100 వంతెనలు సాక్షి, చైన్నె: గ్రామాల్లో రూ.505 కోట్లతో వంద వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం టెండర్లను బుధవారం ఆహ్వానించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, ప్రజల, విద్యార్థులు రవాణా ఉపయోగం నిమిత్తం గ్రామీణ రోడ్లలో హైలెవల్ వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయిచింది. బడ్జెట్లో ప్రకటన మేరకు ఈ నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
రాష్ట్ర బీజేపీకి నైనార్ కొత్త జట్టు
సాక్షి, చైన్నె: రాష్ట్ర బీజేపీకి కొత్త జట్టును అధిష్టానం బుధవారం ప్రకటించింది. అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తనదైన శైలిలో ముద్ర వేస్తూ పదవులకు అర్హులైన వారికి ఎంపిక చేసుకున్నారు. ఉపాధ్యక్షురాలుగా సినీ నటి కుష్బూ సుందర్కు అవకాశం దక్కింది. అన్నామలైను తప్పించి నైనార్ నాగేంద్రన్ను అధ్యక్షుడిగా ఇటీవల బీజేపీ అధిష్టానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో పాత కార్యవర్గం స్థానంలో కొత్త నిర్వాహకుల ఎంపిక కసరత్తులపై నైనార్ నాగేంద్రన్ దృష్టి పెట్టారు. తొలుత డీఎంకే, ఆ తదుపరి కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి వచ్చిన కుష్బూ సుందర్కు న్యాయం చేకూర్చే విధంగా నైనార్ నిర్ణయం తీసుకున్నారు. ఆమె వాక్ చాతుర్యం, రాజకీయ ప్రతిభను గుర్తించి ఎట్టకేలకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులలో ఒకరిగా ఆమెకు పదవి కేటాయించారు. రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి 14 మందిని ఎంపిక చేశారు. ఇందులో ఎం. చక్రవర్తి, కరు నాగరాజన్, శశికళ పుష్ప, వీపీ దురైస్వామి, కేపీ రామలింగం, పాల్ కనకరాజ్, డాల్ఫిన్ శ్రీధర్, కనక సభాపతి, సంపత్, జయ ప్రకాష్, వెంకటేశన్, గోపాల్ స్వామి, సుందర్ ఉన్నారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేశవ వినాయగం, వి.బాల గణపతి, ఎం మురుగానందం, కాత్యాయిణిను ఎంపిక చేశారు. కార్యదర్శులుగా కరాటే త్యాగరాజన్, వెంకటేషన్, మలర్కొడి, సుమతి వెంకటేషన్, ఎస్ మీనాక్షి, సతీస్కుమార్, మీనాదేవ్, వినోజ్ సెల్వం, అశ్వర్థామ, డీఆర్ ఆనంద ప్రియ, ప్రమీలా సంపత్, నాగ తలి నరసింహ పెరుమాల్, ఉదంతకుమార్, రఘురామ్ మురళి, అనుష్ ప్రసాద్రెడ్డిలను నియమించారు. పార్టీ కోశాధికారిగా ఎఆర్. శేఖర్, సంయుక్త కోశాధికారి ఎం శివసుబ్రమణ్యంలతో పాటూ డివిజన్ ఆర్గనైజర్లు, సోషల్ మీడియా ఆర్గనైజర్లు, స్టేట్ ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ కో– ఆర్డినేటర్లను నియమించారు. రాష్ట్ర ముఖ్య వార్త సబంధిత అంశాలకు నారాయణ తిరుపతి, మీడియా ఆర్గనైజర్గా రంగనాయకులను నియమించారు. అనుబంధ విభాగాలు బీజేపీ అనుబంధ విభాగాలకు సైతం మార్పులు జరిగాయి. యువజన విభాగం రాష్ట్ర ఽ అధ్యక్షుడిగా డీజీ సూర్య,మహిళా విభాగం అధ్యక్షురాలుగా కవితా శ్రీకాంత్, క్యూ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా తిరునావుక్కరసు, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా సంభట్రాజ్, ఎస్టీ విభాగానికి అధ్యక్షుడిగా అసుమతి, వ్యవసాయ విభాగం అధ్యక్షుడిగా కె. నాగరాజ్, మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా జాన్సన్ జాకబ్ను నియమించారు. శరత్, విజయధరణికి దక్కని చోటు సినీ నటుడు శరత్కుమార్ లోక్సభ ఎన్నికల సమయంలో తన పార్టీ సమత్తువ మక్కల్ కట్చిని బీజేపీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఆయన సతీమణి, నటి రాధిక విరుదునగర్ లోక్ సభ స్థానాకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాగే లోక్సభ ఎన్నికలకు ముందుగా విలవన్ కోడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ ధరణి బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలలో సీటు దక్కతుందని ఆశించి భంగపడ్డారు. ఈ ఇద్దరు గత ఏడాది కాలంగా ఎలాంటి పదవులు లేకుండా బీజేపీలో నామమాత్రంగా ఉంటూ వస్తున్నారు. తమకు పదవులు దక్కుతాయన్న ఆశతో ఉన్న ఈ ఇద్దరికి తాజాగా నిరశ తప్పలేదు. శరత్, విజయ ధరణిలకు పార్టీ పదవులలోచోటు లభించ లేదు. అయితే ఏళ్ల తరబడి సాధారణ కార్యకర్తగా రాష్ట్రంలో కొనసాగుతూ వచ్చిన కుష్బూకు పదవి దక్కడం ఆమె అభిమానులకు ఆనందమే. ● ఉపాధ్యక్షురాలుగా కుష్భు -
రాష్ట్ర ప్రజలంతా.. మనతోనే!
ప్రజలు మనతోనే ఉన్నారని, 2026లో చరిత్ర సృష్టించే విజయాన్ని నమోదు చేయబోతున్నామని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ధీమా వ్యక్తం చేశారు. 1967, 1977 ఎన్నికలలో సాగిన ప్రజా ప్రభంజనం 2026లో పునరావృతం కావడం తథ్యమన్నారు. ఈ మేరకు బుధవారం చైన్నెలో జిల్లాల కార్యదర్శుల భేటీలో విజయ్ ప్రసంగించారు. సాక్షి, చైన్నె : తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టే పనిలో పడ్డారు. ఆగస్టులో జరిగే మధురై మహానాడు తదుపరి ఆయన ప్రజా క్షేత్రంలో దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయన జిల్లాల కార్యదర్శులతో బుధవారం చైన్నెలో భేటీ అయ్యారు. ఇది వరకు జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నిర్వాహకులతో తమిళగ వెట్రి కళగం(టీవీకే) ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ తరచూ సమావేశాలు నిర్వహిస్తుండే వారు. అయితే, ఈ సారి విజయ్ స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లాల కార్యదర్శులతో సుదీర్ఘంగా ఆయన సమావేశమయేయవారు. జిల్లాల కార్యదర్శులతో భేటీ.. చైన్నె పనయూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లాల కార్యదర్శుల సమావేశం జరిగింది. పార్టీ ముఖ్య నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున తదితరులతో కలిసి పార్టీ పరంగా ఉన్న 120 జిల్లాలకు చెందిన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో మధురై మహానాడు విజయవంతం దిశగా చర్చించారు. ఈ మహానాడు ద్వారా దక్షిణ తమిళనాడులో తమకు ఉన్న బలాన్ని చాటే విధంగా వ్యూహాలకు పదును పెట్టారు. అలాగే విజయ్ ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్లే రీతిలో రూట్ మ్యాప్ గురించి చర్చించారు. ప్రజా పయనం పేరిట విజయ్ యాత్ర సాగే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఎక్కడి నుంచి ఈ ప్రయాణం మొదలెట్టాలో అన్న విషయంగా చర్చించడమే కాకుండా, వినూత్న రీతిలో ప్రజలతో ఇంటింటా మమేకం అయ్యే విధంగా కార్యక్రమాల రూపకల్పనకు గురించి ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు అన్నది రాకుండా నిర్వాహకులు వ్యవహరించాలని, ప్రజల మన్ననలు పొందే విధంగా కార్యక్రమాలు ఉండాలే గానీ, అసహించుకునే రీతిలో ఉండ కూడదన్న హెచ్చరికలు విజయ్చేసినట్టు సమాచారం. అన్నా మార్గంలో.. విజయ్ ప్రసంగిస్తూ, నేతల నుంచి వచ్చిన ఐలవ్యూ అన్న పిలుపుకు ప్రతి స్పందనగా ఐలవ్ యూ టూ అని సమాధానం ఇస్తూ వ్యాఖ్యలను అందుకున్నారు. తమిళనాడు చరిత్రలో రెండు అతిపెద్ద ఎన్నికలు గతంలో జరిగాయని వివరించారు. ఆ ఎన్నికలు 1967, 1977లో జరిగినవిగా గుర్తు చేస్తూ, ఈ విజయోత్సవం 2026లో పునరావృతం కానున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. చరిత్ర సృష్టించే విధంగా జరిగిన ఆ ఎన్నికల విజయ పరంపర టీవీకే గెలుపుతో ప్రజా ప్రబంజనం సృష్టించనున్నదన్నారు. అధికారం, ధన బలానికి వ్యతిరేకంగా ఆ ఎన్నికలలో పోటీ చేసిన వాళ్లు విజయ ఢంకా మోగించారని వివరించారు. దీనిని సాధించేందుకుగతంలో వలే తాజాగా ఊరుకు...ఊరు, వీధికి...వీధి, ఇంటికి...వెవళ్లి అందర్నీ కలుద్దామని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా తనకు అన్నా చెప్పిన విషయం గుర్తుకు వస్తున్నట్టు వివరించారు. ప్రజల వద్దకు వెళ్లు... ప్రజల నుంచి నేర్చుకో... , ప్రజలతో జీవించు...., ప్రజలతో కలిసి వ్యూహత్మకంగా అడుగులు వెయ్ ..అన్న ఆ వ్యాఖ్యలను మదిలో పెట్టుకుని ముందుకు సాగితే...ఇక, విజయోత్సవ ర్యాలీ తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. అన్ని కుటుంబాలను ఒకే వేదిక మీదకు సభ్యులుగా తీసుకొచ్చేందుకే ఈ మై టీవీకే యాప్ అని ప్రకటించారు. ఈ కార్యమ్రం తదుపరి మధురై మహానాడులో కలుద్దాం అని వ్యాఖ్యలు చేశారు. తదుపరి ప్రజాక్షేత్రంలోకి పయనం.. ప్రజలతో ...ప్రజల్లో ఉంటా... అన్ని పనులూ చేపట్టండి అని నేతలకు సూచించారు. ప్రజలకు మనం ఉన్నాం.. ప్రజలంతా మన వెన్నంటే. ఇంత కన్నా ఏం కావాలని అంతా మంచే జరుగుతుంది..గెలుపు తథ్యం అంటూ ప్రసంగాన్ని విజయ్ ముగించారు. మై టీవీకే యాప్.. 2026 ఎన్నికల్లో గెలుపు తథ్యం అన్నాదురై మార్గంలో పయనిద్దాం టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ వ్యాఖ్య మై టీవీకే యాప్ ఆవిష్కరణ పార్టీ ఆవిర్భావంతో సభ్యత్వ నమోదు ప్రక్రియపై విజయ్ దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. గతంలో ఇందుకోసం ప్రకటించిన యాప్ ద్వారా ఉత్సాహంగా యువతీ, యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా సభ్యత్వ నమోదును పూర్తిస్థాయిలో నిబద్దతతో చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం మై టీవీకే పేరిట యాప్ను సిద్ధం చేశారు. ఈ యాప్ను జిల్లాల కార్యదర్శుల సమావేశంలో విజయ్ ఆవిష్కరించారు. అలాగే టీవీకే ఫ్యామిలీ వెబ్సైట్ను పరిచయం చేశారు. ఈయాప్ డౌన్లోడ్ చేసుకుని, తద్వారా పార్టీలో సభ్యులుగా చేరదలచని వారి వివరాలను నమోదు చేయించే రీతిలో ఇంటింటా కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ మాట్లాడుతూ టీవీకేలో 2 లక్షల 95 వేల 970 మందికి పార్టీ పరంగా వివిధ పదవులు అప్పగించామని వివరించారు. అట్టడుగు వర్గాల ప్రజలే పార్టీకి వెన్నుముక అని, పార్టీ సభ్యత్వ నమోదు కొత్త ప్రతిభ, శక్తి, ఆలోచనలకు ప్రతిరూపం కానున్నట్టు ప్రకటించారు. పార్టీ నేత ఆదవ్ అర్జున మాట్లాడుతూ ఇక, అధినేత విజయ్ నేరుగా కేడర్తో మాట్లాడుతారని ప్రకటించారు. రెండు కోట్ల మంది సభ్యులను చేర్చడమే లక్ష్యంగా ముందుకెళ్దామని పిలుపు నిచ్చారు. బూత్ కమిటీలే కాదు నిర్వాహకులు పనితీరును విజయ్ ప్రత్యక్షంగా పరిశీలించడమే కాదు, అవసరం అయితే, ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయన్నారు. -
రెండవ ఘాట్రోడ్డు పనుల తనిఖీ
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంకు రెండవ ఘాట్రోడ్డు ఏర్పాటుకు సంబంధించి హైవేశాఖ సూపరింటెండెంట్ బుధవారం తనిఖీ చేశారు. వివరాలు.. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వాహనాల్లో వచ్చి స్వామి దర్శనం చేస్తుంటారు. వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి అధికమిస్తున్న క్రమంలో ఘాట్రోడ్డులో వాహనాల రద్దీ నెలకొంటోంది. కొండకు ఒకే ఘాట్రోడ్డు వుండడంతో వాహనాలు ట్రాఫిక్ వలయంలో చోటుచేసుకుని భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల సౌకర్యార్థ్యం, వాహన సమస్యలు పరిష్కరించే విధంగా రెండవ ఘాట్రోడ్డు నిర్మించాలని భక్తులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రెండవ ఘాట్రోడ్డు నిర్మాణానికి తిరుత్తణి ఆలయ అధికారులు నిర్ణయం తీసుకుని 1200 మీటర్ల పొడవున రెండవ ఘాట్రోడ్డు నిర్మాణంకు సంబంధిం రూ. 32.50 కోట్లు ఆలయ నిధులు ద్వారా పనులకు చర్యలు తీసుకున్నారు. హైవేశాఖ ద్వారా ఘాట్రోడ్డు పనులు చేపట్టేందుకు వీలుగా రూపొందించిన మ్యాప్ సాయంతో కొండ ఆలయ ఘాట్రోడ్డులో హైవేశాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు శరవణ సెల్వన్ తనిఖీ చేశారు. హైవేశాఖ డివిజినల్ ఇంజినీరు చిట్రరసు, తిరుత్తణి డివిజన్ సహాయ ఇంజినీరు రఘురామన్ పాల్గొన్నారు. -
స్వదేశీ ఈవీ చార్జింగ్ ప్లాట్ఫాం అభివృద్ధి
కొరుక్కుపేట: ఐఐటీ మద్రాసు –ఇంక్యుబేట్ చేసిన స్మార్ట్ ఈవీ చార్జర్ కంపెనీ ఫ్లగ్స్మార్ట్ స్వదేశీ ఈవీ చార్జింగ్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసింది. ఇది బహుళ సీఎంఎస్ నెట్వర్క్లకు చార్జర్ లను కనెక్ట్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించడం విశేషం. ఇది ఒకే ఈవీ చార్జర్ బహుళ చార్జింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్లకు (సీఎంస్) ఏకకాలంలో కనెక్ట్ అవ్వడానికి అనుమతి ఇస్తుండడం గమనార్హం. ప్రస్తుతం, చాలా ఈవీ చార్జర్లు ఒక ఈవీకి లాక్ చేశారు, అంటే ఆ ఒక ఈవీబ్రాండ్ వినియోగదారులు మాత్రమే చార్జర్ను వినియోగించగలరు. ఈక్రమంలో ఫ్లగ్మార్ట్ సంస్థ దీనికి పరిష్కారంగా ఒకే చార్జర్ కోసం మిడిల్వేర్ను పరిచయం చేసి ఈ పరిమితిని బద్ధలు కొట్టిందని ప్లగ్స్ మార్ట్ సాఫ్ట్వేర్ బిజినెస్ యూనిట్ డైరెక్టర్ శ్రీ రాఘవేందర్ టీఎస్ తెలిపారు ప్రభుత్వ విధానాలు, స్థిరత్వ లక్ష్యాలు, సమర్థవంతమైన ఇంధన నిర్వహణ అవసరం కారణంగా భారతదేశంలో ఈవీ రంగం వేగంగా విస్తరిస్తోందని, చార్జింగ్ మౌలిక సదుపాయాల మార్కెట్ విపరీతంగా వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. -
శింబు 49వ చిత్రం అదే..!
తమిళసినిమా: వివాదాలకు కేరాఫ్ శింబు అంటారు. అయితే ఆయన వర్గం మాత్రం ఆయనంత మంచి వాడు లేడంటారు. ఏదేమైన శింబుకు మాత్రం సంచలన నటుడు అనే ముద్ర మాత్రం పడింది. కారణం ఈయన నటించే ప్రతి చిత్రం సంచలనంగా మారుతుండటమే. ఇకపోతే ఈయన మంచి హిట్ చూసి చాలా కాలమే అయ్యిందని చెప్పవచ్చు.ఇ టీవల మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్తో కలిసి నటించిన థగ్లైఫ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా , విడుదలయిన తరువాత ఆ చిత్రం రిజల్డ్ పూర్తిగా నిరాశ పరిచింది. అదే విధంగా ఇప్పుడు శింబు వరుసగా చిత్రాలను కమిట్ అయ్యారని, ఆయన చేతిలో మూడు నాలుగు చిత్రాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వాటిలో వెట్రిమారన్ దర్శకత్వంలో నటించే చిత్రం గురించి ఇప్పుడు రకరకాల ప్రచారం ట్రోలింగ్ అవుతోంది. వెట్రిమారన్ ఇంతకు ముందు ధనుష్ హీరోగా వడచైన్నె వంటి సక్సెస్పుల్ చిత్రాన్ని చేసిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్ను శింబుతో చేస్తున్న చిత్రం అనే ప్రచారం జరింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని, అదే నేపధ్యంలో జరిగే వేరే కథ ఇదని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. కాగా ఇది శింబు నటిస్తున్న 49వ చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయినట్లు సమాచారం. అయితే ఈ చిత్ర షూటింగ్ సాఫీగా సాగడం లేదని, అందుకు చిత్ర బడ్జెట్ పెరగడమేని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదే విధంగా శింబు పారితోషికాన్ని పెంచడం కూడా ఇందుకు ఓ కారణం అనే ప్రచారం వైరల్ అవుతోంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోను యూనిట్ సభ్యులు విడుదల చేయడంం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను ఆగస్ట్ 2న విడుదల చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. కాగా ఈ క్రేజీ చిత్రంలో శింబు ద్విపాత్రాభిన యనం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇందులో నటుడు, దర్శకుడు సముద్రఖని, కిశోర్, ఆండ్రియా, దర్శకుడు నెల్సన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన ఆగస్ట్ 2న వెలువడే అవకాశం ఉంది. -
కామరాజర్, రాధాకృష్ణన్ మార్గాల విస్తరణ
● గ్రేటర్ మీట్లో తీర్మానం ● 75 ప్రదేశాలలో పర్యావరణ పరిరక్షణ చర్యలు సాక్షి, చైన్నె: చైన్నె మెరీనా తీరం వైపుగా సాగే కామరాజర్ సాలై(రోడ్డు), రాధాకృష్ణన్ సాలైలోను విస్తరించేందుకు గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ సమావేశంలో బుధవారం తీర్మానించారు. 75 ప్రదేశాలలో పర్యావరణ పరిరక్షణ చర్యలు విస్తృతం చేయనున్నారు. అలాగే కార్పొరేటర్లకు హెల్త్ చెకప్ నిమిత్తం తలా రూ. 2 వేలు చొప్పున 200 మందికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చైన్నె కార్పొరేషన్ పాలక మండలి సమావేశంలో బుధవారం రిప్పన్ బిల్డింగ్లో జరిగింది. మేయర్ ప్రియ అధ్యక్షతన జరిగిన సమావేశానికి డిప్యూటీ మేయర్ మహేశ్కుమార్, కమిషనర్ కుమర గురుబరన్ పర్యవేక్షించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువరు కార్పొరేటర్లు తమ సమస్యలను సమావేశం ముందు ఉంచారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే అల్పాహర పథకం సిబ్బందికి రూ. 7 వేలు మాత్రమే జీతం ఇస్తున్నారని, దీనిని పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సభ్యుడు కృష్ణమూర్తి కోరారు. సభ్యుడు తనియరసు మాట్లాడుతూ, తిరువొత్తియూరు సమీపంలోని సాతంకాడు చెరువు ఆక్రమణలను తొలగించి, విస్తరించాలని, పక్షుల శరణాలయంగా తీర్చిదిద్దాలని కోరారు. చివరగా సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. 15 మండలాలలోని 75 ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణ నినాదంతో ప్రత్యేక సెన్సార్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. పర్యావరణానికి మెరుగు పరిచే విధంగా ప్రజలకు అవగాహన విస్తృతం చేయనున్నారు. చైన్నె మెరీనా తీరం వైపుగా ఉన్న రోడ్లలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని పరిగణించి కామరాజర్ సాలై, రాధాకృష్ణన్ సాలైను విస్తరించేందుకు తీర్మానించారు. ఈ రెండు రోడ్లను వెడల్పు చేసి సర్వీసు రోడ్డుతో ప్రత్యేక రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
కూలి కాంబో రిపీట్?
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ ఇటీవల తనకు నచ్చిన దర్శకులతో మళ్లీ చిత్రం చేయడానికి ఇష్టపడుతున్నారా? అంటే అవుననే సమాధానమే కోలీవుడ్ వార్గల నుంచి వస్తోంది. ఇంతకు ముందు వరుస ప్లాప్లలో ఉన్న రజనీకాంత్ను అందులోంచి బయట పడేసిన చిత్రం జైలర్. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకుడు. కాగా జైలర్ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు దానికి స్వీకెల్లో అదే దర్శకుడితో రజనీకాంత్ చిత్రం చేస్తున్నారు. ఇకపోతే రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన మరో చిత్రం కూలి. దీనికి లోకేశ్ కనకరాజ్ దర్శకుడు. వీరి కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇది. రజనీకాంత్తో పాటూ బాలీవుడ్ సూపర్స్టర్ అమీర్ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర, నటి శృతీహాసన్ వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో నటి పూజాహెగ్డే స్పెషల్ సాంగ్లో మెరవనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో, ట్రైలర్లను ఆగస్ట్ రెండవ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే చిత్రాన్ని ఆగస్ట్ 14న తెరపైకి తీసుకువస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. కాగా రజనీకాంత్ తరుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. అదే విధంగా దర్శకుడు లోకేశ్ కనకరాజ్ నెక్ట్స్ చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్, లోకేశ్ కనకరాజ్ కాంబో రిపీట్ కానుందనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన కథను కూడా లోకేశ్ కనకరాజ్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది ఏ బ్యానర్లో తెరకెక్కనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఏవరన్నది తెలియడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఎందుకంటే దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఇప్పుడు చాలా బిజీ. ఈయన ఒక పక్క దర్శకుడిగానూ, నిర్మాతగానూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో నటుడిగా పరిచయం అవ్వడానికి సిద్ధం అవతున్నారన్నది తాజా సమాచారం. ఈయన అరుణ్మాదేశ్వరన్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. అదేవిధంగా నటుడు అమీర్ఖాన్ హీరోగా ఒక హిందీ చిత్రం ,కార్తీ హీరోగా ఖైదీ– 2 చిత్రాలు చేయాల్సి ఉంది. ఇకపోతే నటుడు సూర్య హీరోగా, అజిత్ హీరోగా చిత్రాలు చేయలన్న కోరికను దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఇటీవల వ్యక్తం చేశారు. దీంతో రజనీకాంత్తో మళ్లీ ఎప్పుడు చిత్రం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే ఈ ప్రచారం మాత్రం రజనీకాంత్ అభిమానుల్లో మంచి జోష్ను నింపుతోందన్నది నిజం. -
వేలూరులో ట్రాఫిక్ సమస్యపై డీఐజీ సమీక్ష
వేలూరు: వేలూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంపై వేలూరు డీఐజీ ధర్మరాజ్ రోడ్డు భద్రతా సంఘం, ఇండియన్ రెడ్క్రాస్ సంఘం ప్రతినిధులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా డీఐజీ మాట్లాడుతూ వేలూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సభ్యులు సలహాలు, సూచలను ఇవ్వాలన్నారు. అదే విధంగా ట్రాఫిక్ రద్దీతో పాటూ ప్రమాదాల నివారణ మార్గాలు తెలపాలన్నారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలోని వేలూరు, కాట్పాడి వంటి ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో తరచూ ట్రాఫిక్ సమస్యతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడకుండా ఇండియన్ రెడ్క్రాస్ సభ్యులు, రోడ్డు భద్రతా దళం సభ్యులు ఎస్పీ మయిల్వాగనంకు తరచూ సలహాలు సూచలను అందజేస్తే వాటిని పాటించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఇకపై చేయాల్సిన పనులు తదితర వాటిని ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం సభ్యులు డీఐజీ ధర్మరాజ్కు రోడ్డు భద్రతా నియమావళి గురించి ఓ వినతిపత్రాన్ని సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మయిల్ వాగనం, అదనపు ఎస్పీ భాస్కరన్, రోడ్డు భద్రతా దళం కార్యదర్శి డాక్టర్ ఏఎం ఇక్రమ్, ఉపాధ్యక్షులు రమేష్కుమార్ జైన్, శ్రీనివాసన్, రామచంద్రన్, ఉపకార్యదర్శి శాంతి బాస్కరన్, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు జనార్దనన్, డాక్టర్ దీనబందు, ప్రిన్సిపల్ శివకుమార్ తదితరులున్నారు. -
స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలి
తిరువళ్లూరు: ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ రుణాలు పొంది వేధింపులు తాళలేక ఎస్టీ కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటున్న క్రమంలో ఎస్టీ గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి, వారికి రుణాలను ప్రభుత్వం మంజూరు చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. వివరాలు..తిరువళ్లూరు సమీపంలోని మప్పేడులో తమిళనాడు ఎస్టీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహానాడు కామ్రేడ్ మణిగండన్ మెమోరియల్ హాలులో జరిగింది. జిల్లా అధ్యక్షుడు చిన్నదురై అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర అద్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఢిల్లీబాబు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఢిల్లీబాబు మాట్లాడుతూ ఎస్టీ కాలనీలోని మహిళలు మైక్రో ఫైనాన్స్, కందు వడ్డీ తీసుకుని తిరిగి చెల్లించలేక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ముందుకు వచ్చి ఎస్టీ కాలనీల్లో మహిళలను స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి తక్కువ వడ్డీకి రుణాలను ఇవ్వాలని కోరారు. అర్హులైన వారికి ఇంటి పట్టాలు, గృహాలు నిర్మించాలన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా తమిళరసు, అధ్యక్షుడిగా చిన్నదురై, కోశాధికారిగా చెంచమ్మ తదితరులను ఎన్నుకున్నారు. అనంతరం మహానాడులో పలు తీర్మానాలు చేసి వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. -
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రారంభం
సాక్షి, చైన్నె: ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల ప్రవేశం నిమిత్తం కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమైంది. ఎంపికయ్యే వారికి ఆగస్టు 5వ తేదిన సీట్లను కేటాయించనున్నారు. వివరాలు.. రాష్ట్రంలోప్రభుత్వ వైద్య కళాశాలలో 6,600 ఎంబీబీఎస్, 1583 బీడీఎస్ సీట్లు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో 7.5 శాతం రిజర్వుడ్కోటా మేరకు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు 495 సీట్లు దక్కనున్నాయి. వీటితో పాటూ ప్రైవేటులో 1,736 ఎంబీబీఎస్, 530 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ నిమిత్తం 72,743 దరఖాస్తులు వచ్చాయి. నీట్ మార్కుల ఆధారంగా ర్యాంకుల జాబితాను ఈనెల 25వ తేదీన ప్రకటించారు. ప్రభుత్వ కోటా సీట్ల కోసం 39,853 మంది అర్హత సాధించారు. ఇందులో 7.5 శాతం రిజర్వుడ్ కోటా పరిధిలో 4,062 మంది ఉన్నారు. అలాగే, యాజమాన్య కోటా సీట్ల నిమిత్తం 28,279మంది అర్హత సాధించారు. వీరికి కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు ప్రక్రియ బుధవారం ఉదయం పది గటలకు ప్రారంభమైంది. ఆరోగ్యశాఖ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ వేదికగా సీట్ల భర్తీ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఆగస్టు 4వ తేది సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రక్రియ జరగనుంది. 5న ర్యాంకుల జాబితా ఆధారంగా ఎంపికై న వారికి సీట్లను కేటాయించనన్నారు. ఆగస్టు 6 నుంచి 11 వ తేదీ సాయంత్రం ఐదు గటలలోపు ఎంపిక చేసుకున్న కాలేజిల వివరాలను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా బుధవారం సీట్ల భర్తీలో తెన్ కాశి జిల్లా శివగిరి సమీపంలోని విశ్వనాథ పురానికి చెందిన తల్లి అముద వల్లి(49)తో పాటూ ఆమె కుమార్తె సంయుక్త ఎంబీబీఎస్కు అర్హత సాధించారు. తల్లి దివ్యాంగుల కోటాలో విరుదునగర్ ప్రభుత్వ కళాశాలను, కుమార్తె 7.5 శాతం రిజర్వేషన్ కోటా కింద ఎంపికయ్యారు. ఇక, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడా కోటతో పాటూ 7.5 శాతం రిజర్వేషన్ సీట్ల భర్తీ ప్రత్యక్షంగా అన్నాసాలైలోని ప్రభుత్వ మల్టీ స్పెసాలిటీ ఆస్పత్రి ఆవరణలో జరుగుతోంది. ఇక, ప్రభుత్వ కోటా సీట్ల భర్తీలో రాష్ట్రంలో తొలి సీటును కళ్లకురిచ్చి జిల్లా తిరుక్కోవిలూరుకు చెందిన తిరుమూర్తికి చైన్నె కళాశాలలో సీటు దక్కింది. -
ప్రారంభ దశలో గుర్తిస్తే విముక్తి
కొరుక్కుపేట: మహిళల్లో వచ్చే అండాశయ, గర్భాశయ క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా విముక్తి పొందవచ్చునని చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అపోలో వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈమేరకు బుధవారం చైన్నెలో ఏర్పాటైన కార్యక్రమంలో అపోలో క్యాన్సర్ సెంటర్స్ కొత్తగా ‘ఎండ్–ఓ చెక్’ను లాంచనంగా ప్రారంభించింది. అపోలో క్యాన్సర్ సెంటర్ –తేనాంపేట సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ వెంకట్ పి మాట్లాడుతూ ఆంకాలజీ పట్ల తమ నిబద్ధతను బలోపేతం చేస్తూ, అపోలో క్యాన్సర్ సెంటర్ (ఏసీసీ), అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ (ఏపీసీసీ), మహిళలను లక్ష్యంగా చేసుకుని సమగ్ర ముందస్తు గుర్తింపు కార్యక్రమమైన ఎండ్–ఓ చెక్ను ప్రారంభించామని తెలిపారు. అపోలో క్యాన్సర్ సెంటర్ , అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ ఒక ప్యానెల్ చర్చను నిర్వహించారు. ఇందులో వైద్యులు అజిత్పాయ్, డాక్టర్ వెంకట్ పి, డాక్టర్ ప్రియాకపూర్, డాక్టర్ కుమార్ గుబ్బల, డాక్టర్ మధుప్రియ చర్చలో పాల్గొన్నారు. -
ఆడికృత్తిక వేడుకల ఏర్పాట్ల పరిశీలన
తిరుత్తణి: ఆడికృత్తిక వేడుకల ఏర్పాట్లకు సంబంధించి కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం బుధవారం తనిఖీ చేశారు. వివరాలు.. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆగస్టు 16న ఆడికృత్తిక వేడుకలు నిర్వహించనున్నారు. వేడుకల్లో తమిళనాడుతో పాటు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల నుంచి మూడు లక్షలకు పైబడిన భక్తులు కావళ్లతో పాల్గొననున్నారు. భక్తుల సౌకర్యార్ధం ఏర్పాట్లకు సంబందించి జిల్లా కలెక్టర్ ప్రతాప్ ఆధ్వర్యంలో కొండ ఆలయం నుంచి ప్రత్యేక వాహనంలో పట్టణంలోని పలు ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేసారు. ముందుగా కొండ ఆలయంలో ని సీసీ కెమెరాలు, కావడి మండపంలో భక్తులకు సదుపాయాలు, కారు పార్కింగ్ వద్ద సదుపాయాలు, తలనీలాలు సంప్రదించే కేంద్రంలో తనిఖీ చేశారు. అనంతరం కొత్త బస్టాండు, శరవణ పుష్కరిణి, నల్లాన్ పుష్కరిణి, తాత్కాలిక బస్టాండు ఏర్పాటు చేయనున్న ప్రాంతాలతో పాటూ భక్తులకు తాగునీరు. తాత్కాలిక స్నానపు గదులు, మరుగుదొడ్లు, ఏర్పాటుకు సంబంధించి పరిశుభ్రత, వైద్య శిబిరాలు, విద్యుత్ సేవలు, సీసీటీవీ కెమెరాల నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. జాయింట్ కమిషనర్ రమణి, ఆర్డీఓ కణిమొళి, ఆలయ ట్రస్టీలు సురేష్బాబు, ఉష సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
తిరుపతి క్రైమ్: రాత్రి పూట తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పుత్తూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పుత్తూరు సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పుత్తూరు డీఎస్పీ రవికుమార్, పుత్తూరు సీఐ ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకున్నారు. రెండు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులున్న తమిళనాడుకు చెందిన మనీ అలియాస్ కోవిల్ మణి (38), సురేష్ అలియాస్ గుణ(35), తిరుపతి మంగళంకు చెందిన కుమార్(29), మణికంఠ(25), పట్టుబడ్డారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన ప్రభు(26), మణి గండన్(47) ఇద్దరు పరారీలో ఉన్నారని వివరించారు. వీరంతా పలుమార్లు జైలు కెళ్లి జైల్లో పరిచయాల వల్ల ముఠాగా ఏర్పడ్డాయని చెప్పారు. వీరి నుంచి 190 గ్రాముల బంగారు, 2.3 కిలోల వెండి ఆభరణాలను, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ రూ.20.4లక్షలు ఉంటుందన్నారు. -
ఆ పాత్రలో నటిస్తే.. విమర్శలు తప్పవా?
తమిళసినిమా: సినీ రంగంలో మహా సాధ్వి సీతాదేవి పాత్రను ఎవరు పోషించినా విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఆ మధ్య తెలుగు చిత్రం శ్రీరామరాజ్యం చిత్రంలో సీతగా నటి నయనతార నటించడాన్ని కొందరు తీవ్రంగా విమర్శించారు. సాంగీక చిత్రాల్లో అందాలను విచ్చల విడిగా ఆరబోసిన ఈమె ఏంటీ సీతాదేవిగా నటించడం ఏమిటీ అని విమర్శించారు. అయితే ఆ చిత్రం విడుదలయిన తరువాత సీతగా నయనతార ఒదిగిపోయారు అనే ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ చిత్రంలో సీతగా బాలీవుడ్ భామ కృతీసనన్ నటించినప్పుడూ ఆమె గురించి ట్రోలింగ్ చేశారు. ఆ చిత్రం ప్రేక్షకుల్లో పెద్దగా ప్రభావం చూపలేదు కాబట్టి ఆ విమర్శల్లో అర్థం ఉందనుకుందాం. కానీ ఇప్పుడు నటి సాయిపల్లవిపై కూడా విమర్శలు చేయడమే చర్చనీయాంశంగా మారింది. ఆది నుంచి సహజత్వానికి ప్రాముఖ్యత నిస్తున్న నటి సాయిపల్లవి. పదాలకు లిప్స్టిక్ వేసుకోవడానికి కూడా సందేహించే నటి ఈమె. ఇక నటిగా ఎలాంటి పాత్రనైనా ప్రాణం పెట్టి నటించే సాయిపల్లవి బాలీవుడ్లోకి అడుగు పెట్టిన తరువాత ట్రోలింగ్కు గురౌతున్నారనిపిస్తోంది. రామాయణం ఇతిహాసంతో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీత పాత్రలో నటి సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. సీతాదేవిగా ఆమె నటించడం రామాయణం కావ్యాన్నే అవమానపరిచినట్లు అని విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా ఆ చిత్రంలో శూర్పణక పాత్రలో నటిస్తున్న రకుల్ప్రీత్ సింగ్తో కలిసి నటి సాయిపల్లవిపైనా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా రామాయణ చిత్రంలో రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్, యష్ రావణాసురుడిగా నటించిన కొన్ని సన్నివేశాలు విడుదలయిన తరువాత ట్రోలింగ్స్ అధికం అవుతున్నాయి. అయితే ఎలాంటి విమర్శలను పట్టించుకోకుండా నటి సాయిపల్లవి తన నటనపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. కారణం చిత్రం విడుదలైన తరువాత తన నటనే అలాంటి వారికి సమాధానం చెబుతుందనే ఆమె ధైర్యం కావచ్చు. -
క్లుప్తంగా
ఘనంగా ఆడి మాస ఉత్సవాలు వేలూరు: రాణిపేట జిల్లాలోని రత్నగిరి సమీపంలోని కన్నికాపురం గ్రామంలో వెలసిన శ్రీపుత్తు మారియమ్మన్ ఆలయంలో ఆడి మాస ఉత్సవాలు అతి వైభవంగా జరిగాయి. ముందుగా గ్రామ పెద్ద నారాయణన్, ఆలయ ధర్మకర్త షణ్మగం అధ్యక్షతన మహిళా భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని 151 పాల బిందెలతో మేల తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మహిళా భక్తులు తీసుకొచ్చిన పాలను అమ్మవారికి మేల తాళాల నడుమ ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, పుష్పాలంకరణలు చేసి దీపారాధన పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. సినీ రచయిత రామమూర్తి కన్నుమూత తమిళసినిమా: సినీ రచయిత రామమూర్తి ( 75) వృద్ధాప్యం కారణంగా బుధవారం ఉదయం చైన్నెలో కన్నుమూశారు. ఈయన నటుడు మురళి, నటి మీనా, వడివేలు ప్రధాన పాత్రలు పోషించిన వట్టక్కుడి రాణియన్, వడివేలు, సంతానం కలిసి నటించిన తీకుచ్చి చిత్రాలకు రామమూర్తి కథ, మాటలను అందించారు. అదేవిధంగా పులి తోండ్రాలుమ్ మనిద కుల వరలారు అనే నవలను రాశారు. కాగా వృద్ధాప్యం కారణంగా ఇటీవల అనారోగ్యానికి గురైన రామమూర్తి స్థానికి క్రోంప్రేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు.అయితే వైద్యం ఫలించక బధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని సొంత ఊరు అయిన తిరువారూర్ జిల్లా, ముత్తుపేటకు తరలించినట్లు ఆయన కుటుంబ వర్గం తెలిపారు. రచయిత రామమూర్తి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చైన్నె ఔటర్ రింగ్ రోడ్డు పనులు తనిఖీ తిరువళ్లూరు: ఎన్నూరు పోర్టు నుంచి వేర్వేరు ప్రాంతాలకు ఎగుమతులు దిగుమతుల కోసం భారీ వాహనాలు చైన్నెకు వెళ్లకుండా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి చైన్నె ఔటర్ రింగ్ రోడ్డును ప్రభుత్వం నిర్మిస్తోంది. 132.87 కిలో మీటర్ల దూరానికి గానూ 16,221.40 కోట్లు వ్యయంతో సిక్స్వేగా నిర్మాణం చేస్తున్నారు. ఈ పనులను ఐదు దశలో నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో తిరువళ్లూరు జిల్లా ఈకాడు నుంచి 26.10 కిమీ దూరం మేరకు నిర్మిస్తున్న పనులను కలెక్టర్ ప్రతాప్ అధికారులతో కలిసి తనిఖీ చేపట్టారు. పనులను నాణ్యతతో చేపట్టడంతో పాటూ నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మీంజూరు రైల్వే బ్రిడ్జితో పాటూ పలు పనులను సైతం పరిశీలించారు. కలెక్టర్ వెంట జాతీయ రహదారిశాఖ చీఫ్ ఇంజినీర్ గణేష్, శంకర్, డిప్యూటీ ఇంజినీర్ మయిల్వాగనన్, రాజేష్కన్నా, తాహసీల్దార్(స్పెషల్) రమేష్ తదితరులు పాల్గొన్నారు. 500 ఎకరాల్లో పంటలు దగ్ధం అన్నానగర్: తిరుచెందూర్ కాయమొళి సమీపంలో కీళ్ తిరుచెందూర్ పంచాయతీ పరిధిలోని కాయమొళి, తలవాయిపురం, పుత్తూరు, నడునాలు మూలికినరు ప్రాంతంలో దాదాపు 500 ఎకరాల ఖరీఫ్ పంటలు అగ్నికి ఆహుతయ్యాయి. ఫలితంగా రూ. 50 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లాలోని తిరుచెందూర్ సమీపంలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో అరటి, కొబ్బరి మరియు మునగ సాగు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం మధ్యాహ్నం తలవాయిపురం–కాయమోళీ రోడ్డు వెంబడి కొబ్బరి చెట్లకు విద్యుత్ తీగలు తగలడం వల్ల మంటలు చెలరేగాయి. తిరుచెందూర్, ఐరల్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అయితే గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ఫలితంగా 20 తోటలలోని 30 వేల అరటి చెట్లు, 5 వేల కొబ్బరికాయలు, తాటి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. తిరుచెందూర్ తహశీల్దార్ బాలసుందరం ఘటనా స్థలాన్ని పరిశీలించి నష్టంపై నివేదిక రూపొందించారు. గంజాయి ధ్వంసం తిరువళ్లూరు: వేర్వేరు కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిని ఆవడి కమిషనరేట్ పరిధిలో అదనపు కమిషనర్ భవానీశ్వరి నేతృత్వంలోని పోలీసులు ధ్వంసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, గుట్కాలను నిషేధించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. గంజా యి అక్రమణ రవాణాను అడ్డుకోవడానికి పలు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి తనిఖీలను నిర్వహిస్తోంది. ఈ తనిఖీల్లో భాగంగానే 78 కేసులో 730 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
వివాహిత ఆత్మాహుతికి యత్నం
● అడ్డుకున్న పోలీసులుతిరువళ్లూరు: భర్తపై ఇచ్చిన ఫిర్యాదుపై మహిళా పోలీసులు తనకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ మహిళ ఆత్మాహుతికి యత్నించిన సంఘటన పోలీసుస్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ పట్టరై గ్రామానికి చెందిన జయంతి(45). ఈమె భర్త ఉలగనాథన్. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. పెద్ద కుమార్తె భారతికి వివాహమైంది. ఈ క్రమంలో కుటుంబసమస్యల కారణంగా ఉలగనాథన్ కాంచీపురం జిల్లా కిళాయ్ గ్రామంలోని తండ్రి వద్దకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఇటీవల మరో కుమార్తె సైతం ఉలగనాథన్ వద్దకు వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో భర్త తనను పట్టించుకోవడం లేదని, ఇటీవల మహిళా పోలీస్స్టేషన్లో జయంతి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరిని పిలిపించి విచారించి, కౌనెలింగ్ ఇవ్వాల్సి వుంది. అయితే పోలీసులు ఇవేమీ చేయకపోవడంతో మంగళవారం మహిళ పోలీసుస్టేషన్కు వచ్చి పోలీసులను వివరణ కోరింది. అయితే పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ తనతోపాటు తెచ్చుకున్న కిరోసిన్ను ఒంటిపై పోసుకుని ఆత్మాహుతికి యత్నించింది. దీంతో పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన మహిళా పోలీసులు మహిళను అడ్డుకుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
క్లుప్తంగా
అదనపు వసతులకు చర్యలు వేలూరు: వేలూరు కొత్త బస్టాండ్లో ప్రయాణికులకు అదనపు వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కొత్త బస్టాండ్లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన వసతులను తనిఖీ చేశా రు. ముందుగా ప్రయాణికులకు తాగునీరు, మరుగుదొడ్లు సిద్ధంగా ఉంచాలన్నారు. బస్టాండ్లో మెడికల్ దుకాణాలు ఏర్పాటుకు టెండర్లు పిలవాలన్నారు. బస్టాండ్కు వచ్చే బస్సులను ప్రతి ఏడాది రెన్యూవల్ చేసే సమయంలో వాటి కండిషన్ను అధికారులు తనిఖీ చేయాలన్నారు. ముఖ్యంగా బస్టాండ్లో ప్రయాణికుల విశ్రాంతి గది, బిడ్డ తల్లులకు పాలిచ్చే గది, ప్రయాణికుల సంరక్షణ గది ఏర్పాటు చేసి వాటికి అవసరమైన ఫ్యాన్ను ఏర్పాటు చేయాలన్నారు. బస్టాండ్లో ద్విచక్ర వాహనాలు నిలపకుండా చూడాలన్నారు. కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, ఎంవీఐ తంగరాజన్, తహసీల్దార్ వడివేల్ పాల్గొన్నారు. విద్యార్థిని ఆత్మహత్య అన్నానగర్: ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తూత్తుకుడి న్యూపోర్టు థర్మల్ నగర్ లేబర్ కాలనీకి చెందిన హరిచంద్రన్, మురుగేశ్వరి దంపతులు. వీరి కుమార్తె దర్శిని (18). తన అమ్మమ్మ సంరక్షణలో పెరిగుతున్న ఈమె ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. దర్శిని తూత్తుకుడిలోని ముదియపురంలోని రాజీవ్నగర్కు చెందిన ఒక విద్యార్థితో చనువుగా ఉన్నట్టు తెలిసింది. ఈ పరిస్థితిల్లో మంగళవారం, ఇంట్లో ఒంటరిగా ఉన్న దర్శిని, ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికొచ్చిన ఆమె చెల్లెలు ఇది చూసి వెంటనే థర్మల్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మెట్రో స్తంభాన్ని ఢీకొన్న బైక్ – యువకుడి దుర్మరణం తిరువొత్తియూరు: అలందూర్లోని అసర్ఖాన మలుపు వద్ద మెట్రో రైలు స్తంభాన్ని బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు దుర్మరణం చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. చైన్నె తాంబరం హస్తినాపురం జైన్ నగర్కు చెందిన కిషోర్ (18). అదే ప్రాంతం నేతాజీ వీధికి చెందిన యోనేష్. స్నేహితులైన వీరిద్దరూ మంగళవారం హస్తినాపురం నుంచి జీఎస్టీ రోడ్డు మీదుగా కత్తిపారకు బైక్లో వెళుతున్నారు. అలందూర్లోని అసర్ఖాన ప్రాంతంలోని మలుపు వద్ద వేగంగా వెళుతున్న బైక్ అదుపుతప్పి మెట్రో రైలు స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కిషోర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమచారం అందుకున్న పరంగిమలై పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాణాలతో పోరాడుతున్న యోనేష్ను రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు ఉద్యోగి దారుణ హత్య అన్నానగర్: ప్రేమ వివాదాన్ని పరిష్కరించిన కోర్టు ఉద్యోగిని తిరువారూర్ సమీపంలో దుండగులు దారుణంగా నరికి చంపారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువారూర్ జిల్లాలోని కూత్తానల్లూరు నివాసి మహ్మద్ఆడం (21) తెన్కాసిలో డ్రైవర్. ఇతను తిరువారూర్ సమీపంలోని పులివలంకు చెందిన మోహన్ కుమార్తె సౌమ్య (21)ను ప్రేమిస్తున్నాడు. కానీ ఇటీవల సౌమ్య, మహ్మద్ ఆడంతో మాట్లాడడం మానేసింది. దీంతో మహ్మద్ ఆడం బంధువులైన మహ్మద్ నస్రుద్దీన్ (23), హాజీమహ్మద్ (23)లను సోమవారం రాత్రి ఇంటికి పంపించాడు. అక్కడ సౌమ్య తమ్ముడు గోపీకృష్ణన్ (19)తో ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో తిరువూరు సమీపంలోని ధ్యానపురం నుంచి సంతోష్కుమార్ (28) సౌమ్య ఇంటి సమీపంలోని స్నేహితుడి ఇంటికి వచ్చాడు. ఇతను జిల్లా కోర్టులో ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. సౌమ్య ఇంట్లో జరుగుతున్న గొడవను చూసి అతను అక్కడికి వెళ్లి రాజీ చేసి వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహించిన మహ్మద్ ఆడమ్ వర్గీయులు కత్తితో సంతోష్ కుమార్పై దాడి చేశారు. సంతోష్కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై తిరువారూర్ తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి, హాజీ మహ్మద్, మహ్మద్ నస్రుద్దీన్లను అరెస్టు చేసి, పరారీలో ఉన్న మహ్మద్ ఆడం కోసం గాలిస్తున్నారు. మహిళకు లైంగిక వేధింపులు – నిందితుడి అరెస్టు తిరువొత్తియూరు: చైన్నె కొత్త చాకలిపేట ప్రాంతంలో నివసిస్తున్న 30 ఏళ్ల మహిళ 26వ తేదీ రాత్రి ఇంటిలో నిద్ర పోతున్నారు. ఆ సమయంలో తెల్లవారుజామున (27వ తేదీ) తెల్లవారుజామున, పక్క.ఇంటిలో నివసిస్తున్న పరిచయం లేని వ్యక్తి బాల్కనీ మార్గం ద్వారా ఇంటిలోకి చొరబడి ఆ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ మేల్కొని శబ్దం చేయడంతో అతను పారిపోయాడు. బాధిత మహిళ ఈ సంగతి గురించి కొత్త చాకలిపేట పోలీస్ స్టేషనన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి లైంగిక వేధింపులు కేసు చట్టం తమిళనాడు మహిళలపై అత్యాచారాల నిరోధక చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహించి, దీపక్ కుమార్ ( 37) ను మంగళవారం అరెస్టు చేసి జైలుకు పంపారు. దర్యాప్తులో, దీపక్ కుమార్ కొత్త చాకలిపేటలో ఒక బేకరీలో పనిచేస్తున్నట్టు తెలిసింది. -
మరమ్మతు పనులు ఆపండి
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని కోరంతాంగల్ గ్రామం వద్ద రైల్వే బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి కింద వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఇకపై ఈ రైలు మార్గంలో రైలు అతివేగంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు తనిఖీలు చేసి రైల్వే బ్రిడ్జి కింద పిల్లర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో మంగళవారం ఉదయం బ్రిడ్జి కింద పిల్లర్లు ఏర్పాటు చేసేందుకు కార్మికులు అక్కడికి వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికులు బ్రిడ్జి కింద ఎటువంటి పనులు చేపట్టకూడదని కార్మికులను అడ్డుకున్నారు. బ్రిడ్జి కింద వాహనాలు వచ్చి వెళ్లేలా ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే పనులు మొదలెట్టాలని తేల్చి చెప్పడంతో అఽధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరిపి ఆందోళన విరమింప జేశారు. అనంతరం అధికారులతో పోలీసులు చర్చించి వాహన రాక పోకలకు దారి ఏర్పాటు చేసి పనులను ప్రారంభించాలని తెలిపారు. -
కోలాహలం..అగ్నిగుండ ప్రవేశం
వేలూరు: తిరువణ్ణామలై అన్నామలైయార్ ఆలయంలో ఆడిపుర బ్రహ్మోత్సవాలు ఈనెల 19వ తేదీ నుంచి పది రోజుల పాటు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం సాయంత్రం స్వామివారికి తీర్థవారి నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయంలో పరాశక్తి అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి ఉన్నామలై అమ్మన్ను సన్నధి వద్ద ఏర్పాటు చేసిన అగ్నిగుండం వద్దకు మేళ తాళాల నడుమ తీసుకొచ్చారు. అనంతరం ఉపవాసంతో ఉన్న భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. భక్తులు హరోంహరా నామస్మరణలతో ఆలయ ప్రాంగనం మారుమోగింది. అనంతరం ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలను అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అగ్నిగుండ ప్రవేశ అనంతరం అమ్మవారికి గాజులు వేసే కార్యక్రమాన్ని మహిళా భక్తులచే నిర్వహించి ఆలయంలో ప్రత్యేక దీపాలు వెలిగించి పూజలు చేశారు. -
వైభవంగా గోదై నాచియార్ వైభవ పూజ
కొరుక్కుపేట: చైన్నెకు చెందినవాసవీ మహిళా విభాగ్ ఆధ్వర్యంలో గోదైనాచియార్ (గోదాదేవి) వైభవ పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. వివరాలు.. గోదాదేవి అమ్మవారి జన్మ నక్షత్రమైన ఆడిపూరం సందర్భంగా సోమవారం రాత్రి ప్రత్యేక పూజలను వాసవీ మహిళా విభాగ్ అధ్యక్షురాలు టి. లావణ్య అధ్యక్షతన నిర్వహించారు. చైన్నె జార్జిటౌన్ ప్రాంతంలోని ఆదియప్పనాయకన్ వీధిలో వెలసియున్న శ్రీకన్యకా పరమేశ్వరి దేవస్థానంలో చేపట్టిన ఈ ఆండాల్ పూజలో వివిధ రకాల పుష్పాలు, తులసీ దళాలు, వజ్రాభరణాలు, పట్టువస్త్రాలతో గోదాదేవిని విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు దిలీప్ కుమార్ పంతులు ఆండాల్ పూజను చేయించారు. మహిళలు దాదాపు 200మందికిపైగా మహిళలు పాల్గొని సామూహికంగాగోదాదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. గోదాదేవి విష్ణుమూర్తిని స్తుతిస్తూ 30 పాసురాళ్లను వాసవీ మహిళా విభాగ్ సభ్యులు పారాయణంచేసి ఆథ్యాత్మిక శోభను తెచ్చారు. కార్య క్రమంలో విభాగ్ అధ్యక్షురాలు టి.లావణ్య, కార్యదర్శి జి. సరళ, ట్రెజరర్ బి.సరళ, వైస్ ప్రెసిడెంట్ పి.కల్పన భక్తులందరికి పసుపు కుంకుమ, అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. -
డీప్–టెక్ స్టార్టప్లకు గేమ్ ఛేంజర్ ప్రోగ్రామ్
సాక్షి, చైన్నె: డీప్–టెక్ స్టార్టప్లను నిర్మించాలనుకునే స్టమ్ పరిశోధకుల కోసం ఐఐటీమద్రాసులో డీఎస్టీ అండ్ జీడీసీ, ఇంక్యుబేట్ కార్యక్రమం మంగళవారం జరిగింది. పరిశోధనను వాస్తవ ప్రపంచ ప్రభావంలోకి అనువదించడానికి అవసరమైన వ్యవస్థాపక నైపుణ్యాలు, వాణిజ్యీకరణ మార్గాలను అందించే విధంగా ముందుకెళ్లారు. ఈ సెమినార్లో ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు , పెట్టుబడి సంఘం ప్రతినిధులు ఒకే వేదిక మీదకు వచ్చి, భారతదేశం విద్యాసంస్థల నుంచి ఉత్పన్నమయ్యే డీప్–టెక్ స్టార్టప్ల అభివృద్ధిని ఎలా వేగవంతం చేయవచ్చో చర్చించారు. ఐఐటీ మద్రాస్లోని ఎక్సలెన్స్ సెంటర్గా ఉన్న గోపాలకృష్ణన్ –దేశ్పాండే సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ , 500 డీప్–టెక్ స్టార్టప్లపై పనిచేస్తున్న 1600 మందికి పైగా విద్యావేత్తలు , వ్యవస్థాపకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశోధన , వాణిజ్యీకరణను ప్రోత్సహించే విధంగా 100 కి పైగా విద్యా విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలలు, ఇంక్యుబేటర్లతో సహకరించినట్టు ప్రకటించారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి ఈ సదస్సులో మాట్లాడుతూ ఐఐటీ మద్రాస్లో తాము డీప్కోర్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామన్నారు. భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో దాని కీలక పాత్రను గుర్తించనున్నామన్నారు. సుమారు 12,000 మంది శక్తివంతమైన విద్యార్థి సమూహంతో కలిసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం తమ విద్యార్థులలో చాలా మందికి వ్యవస్థాపకతను కొనసాగించమని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ లక్ష్య విధానం తమ ప్రతిష్టాత్మకమైన రోజుకు ఒక పేటెంట్ పరిస్థితులు దారితీసిందన్నారు. ఈ సందర్భంగా తమ స్టార్టప్ల ఆవిష్కరణలను గుర్తు చేస్తూ, పలు అంశాలను వివరించారు. ఇంక్యుబేషన్ సెల్ నుంచి మాత్రమే 2032 నాటికి 1,000 స్టార్టప్లకు మద్దతు ఇవ్వాలని భావిస్తున్నామని ప్రకటించారు. ఐఐటీ బాంబేలోని దేశాయ్ సేథి స్కూల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో ప్రొఫెసర్ గా ఉన్న రమేష్ మంగళేశ్వరన్ మాట్లాడుతూ, భారతదేశంలో సైన్స్ ఆధారిత వ్యవస్థాపకతను పెంపొందించడంలో ముఖ్యంగా వెంచర్ సృష్టి ప్రారంభంలో కస్టమర్, మార్కెట్ ప్రయోజనాలు, వ్యవస్థాపకులలో వ్యవస్థాపక మనస్తత్వాన్ని నిర్మించడంలో ఇంక్యుబేట్ ప్రోగ్రామ్ కీలకమైనదిగా వివరించారు. -
రూ. 3 వేల కోట్లకు చేరిన జాన్సన్ టర్నోవర్
● సెంగాడులో రూ.250 కోట్లతో విస్తరణ పనులు సాక్షి,చైన్నె: ఇళ్లకు, కంపెనీలకు, ప్రభుత్వ రైల్వే ప్రాజెక్టులకు లిఫ్టులు, ఎస్కలేటర్లను తయారు చేయడంలో పేరుగాంచిన జాన్సన్ లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ సంస్థ టర్నోవర్ రూ.3వేల కోట్లకు చేరిందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి. జగన్నాథన్ తెలిపారు. దీంతో సెంగాడు వద్దనున్న కర్మాగారంలో రూ.250 కోట్లతో విస్తరణ కార్యకలాపాలను చేపడుతున్నట్టు ఆయన మంగళవారం చైన్నెలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలోప్రకటించారు. ఆయన మాట్లాడుతూ పూందమల్లి, ఒరగడం, సెంగాడులోను, నోయిడా వద్ద సంస్థ కర్మాగారాలున్నాయన్నారు. జాన్సన్ లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ సంస్థకు దేశవ్యాప్తంగా 80 బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించిన తూత్తుకుడి ఎయిర్ పోర్టులోనూ తమ సంస్థ లిఫ్ట్ల సదుపాయాన్ని కల్పించిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సంస్థ జనరల్ మేనేజర్ శివకుమార్, డైరెక్టర్ యోహాన్ కే జాన్ పాల్గొన్నారు. -
గోవాలో నైంటీస్ సినీ గార్జియస్
తమిళసినిమా: సినిమా అంటేనే బిగ్ ఎంటర్టైన్మెంట్. అలాంటి తరాల గురించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత అభిమానుల్లో ఉంటుంది. అదే విధంగా నటీనటులు తమ విషయాలను, అనుభూతులను అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. కాగా 1980 ప్రాంతంలో అగ్ర తారలుగా రాణించిన పలువురు ప్రతి ఏడాది ఒక్క రోజు ఏదో ఒక ప్రాంతంలో రీ యూనియన్ అయ్యి సరదాగా గడపడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అలా ఇప్పుడు 1990 ప్రాంతంలో దక్షిణాదిలో ప్రముఖ నాయకి నాయకులుగా, దర్శకులుగా వెలుగొందిన సినీ సెలబ్రిటీలు గోవాలో చిల్లైయ్యారు. అలా రీ యూనియన్ అయిన వారిలో దర్శకుడు శంకర్, కేఎస్ రవికుమార్, లింగసామి , మోహన్ రాజా, డాన్సింగ్ స్టార్ ప్రభుదేవాతో, నటుడు జగపతిబాబు, మెగా శ్రీకాంత్, 90స్ క్రేజీ హీరోయిన్లు సిమ్రాన్, మీనా, సంఘవి, మాళవిక, సంగీత, రీమాసేన్, మహేశ్వరి, శివరంజని మొదలగు వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాటి ప్రముఖ దర్శకులు నటీనటులు సముద్ర తీరంలో, సరదాగా గడిపారు. అదేవిధంగా ఒకరికొకరు తమ అనుభవాలను పంచుకుంటూ విందు వినోదాలతో చిల్లు అయ్యారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. -
ఆ పాత్ర కనెక్ట్ అయ్యింది
తమిళసినిమా: నటి బిందు మాధవి. ఈ పేరు పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇంతకు ముందు పలు భాషల్లో, చిత్రాల్లో కథానాయికిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పదహారు అణాల తెలుగు అమ్మాయి అయిన ఈమె తమిళంలో కళగు, కేడీ బిల్లా కిల్లాడి రంగా , తమిళుక్కు ఎన్ ఒండ్రు అళిక్కవుమ్ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. అలా 2019 వరకు వరుసగా చిత్రాలు చేసిన బిందు మాధవి ఆ తరువాత కారణాలు ఏమైనా వెండి తెరపై కనిపించలేదు. అలాంటిది మళ్లీ 2024లో మాయన్ చిత్రంతో ఒక రకంగా రీ ఎంట్రీ అయ్యారనే చెప్పవచ్చు. ప్రస్తుతం బ్లాక్ మెయిల్, యారుక్కుమ్ అంజాల్ పగైవనుక్కు అరుళ్వై మొదలగు మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. అందులో ఒకటి బ్లాక్ మెయిల్. జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఎం.మారన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు ఒకటవ తేదీన తెరపైకి రానుంది.ఈ సందర్భంగా బ్లాక్ మెయిల్ చిత్రంలో నటించిన అనుభవం గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ప్రతి కళాకారుడు కళాకారుని తమ జీవితాల్లో ఒక మార్పు తీసుకువచ్చే తరుణం కోసం ఎదురుచూస్తూనే ఉంటారన్నారు అదేవిధంగా మహిళలు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందడం కోసం సవాళతలను ఎదుర్కొంటారన్నారు. అలా దర్శకుడు ఎం మారన్ బ్లాక్మెయిల్ కథను చెప్పగానే అది తనకు బాగా కనెక్ట్ అయిన భావన కలిగిందన్నారు. అది తన కోసమే ఎదురుచూస్తున్న పాత్రగా భావించానన్నారు. దర్శకుడు రాసిన బలమైన , భావోద్వేగాలతో కూడిన ఆ పాత్ర తనలో బాధ్యతను పెంచిందన్నారు. ముఖ్యంగా పలు కథాపాత్రలతో కలిసి తన పాత్ర ఉంటుందన్నారు. జీవీ ప్రకాష్ లాంటి అద్భుతమైన నటనను ప్రదర్శించే నటుడుతో కలిసి పనిచేయటం మంచి అనుభవంగా పేర్కొన్నారు. నటి తేజు అశ్విని ,శ్రీకాంత్ తదితర నటీనటులందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారన్నారు భావోద్రేకాలతో కూడిన ఉత్సాహబహితమైన థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందని నటి బిందు మాధవి పేర్కొన్నారు. -
రజనీకాంత్ చిత్రాలను గుర్తు చేసే ‘కింగ్డమ్’
తమిళసినిమా: నటుడు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననేని కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు భారీ ఎత్తున నిర్మించాయి. శ్రీకర స్టూడియోస్ సంస్థ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని,, గిరీష్ గంగాధరన్ జోమోన్ ఛాయా గ్రహణం అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం ( ఈ నెల 31వ తేదీన) తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ మంగళవారం ఉదయం చైన్నెలో నిర్వహించిన ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కింగ్డమ్ చిత్రాన్ని చేయాలని అనుకున్నప్పుడే తెలుగు తమిళ భాషల్లో నిర్మించాలని భావించామన్నారు. ఇది హై ఆక్టెన్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా కథా చిత్రంగా ఉంటుందన్నారు. తానిందులో పోలీస్ కానిస్టేబుల్ పాత్ర నుంచి అండర్ గ్రౌండ్ స్పైగా మారే పాత్రలో నటించినట్లు చెప్పారు. చిత్ర కథా ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో మొదలై శ్రీలంకను టచ్ చేస్తుందని చెప్పారు. ఈ చిత్రంలో అనిరుధ్ శక్తివంతమైన సంగీతం, గిరీష్ గంగాధరన్, జోమోన్ ఛాయాగ్రహణం అదనపు ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఛాయాగ్రాహకుడు గిరీష్ గంగాధరన్ ఈ చిత్రానికి 40 శాతం పని చేసిన తర్వాత రజనీకాంత్ నటిస్తున్న కూలి చిత్రానికి వెళ్లడంతో మిగిలిన చిత్రాన్ని జోమోన్ పూర్తి చేశారని చెప్పారు. కింగ్డమ్ చిత్రం రజనీకాంత్ చిత్రాలను గుర్తు చేస్తుందని అన్నారు. కాగా ఈ చిత్ర టీజర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన నటుడు సూర్య అన్నయ్యకు ధన్యవాదాలు అన్నారు. ఈ చిత్రం కోసం ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న తాను ఆ తరువాత చైన్నెలో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇష్టపడతానని అన్నారు. ఈ చిత్రంలోని పాత్ర కోసం ఫుల్ ఎఫర్ట్ పెట్టానని, ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకాన్ని విజయ్ దేవరకొండ వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకులు, నటులతో 90స్ క్రేజీ కథానాయికలు -
విజేతలు
హిందూ స్థాన్ ఇంటర్నేషనల్ స్కూల్ నేతృత్వంలో ఇన్నోవిజ్ 2.5 పేరిట చైన్నెలోని 12 పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ఆలోచనలు, ఆవిష్కరణల కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ, వాక్ చాతుర్యం, లలిత కళలలు, క్రీడలతోపాటుగా 21 రకాల కార్యక్రమాలు జరిగాయి. ఈ ఫెస్ట్లో విజేతలుగా నిలిచిన వారికి చైన్నెలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ కమాండెంట్, ఏవీఎస్ఎం లెఫ్టినెంట్ జనరల్ మైఖెల్ ఏజే ఫెర్నాండెజ్, ఆయన సతీమణి ఫెర్నాండెజ్, హిందూ స్థాన్ గ్రూప్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీలు ట్రోపీలు, బహుమతులను ప్రదానం చేశారు. – సాక్షి, చైన్నె -
ఆరుప్పడై వీడులకు కావళ్ల యాత్ర
● బీజేపీ భక్తి ప్రయాణం సాక్షి, చైన్నె: తమిళ కడవుల్ మురుగన్ ఆశీస్సులతో ప్రజలకు చేరువయ్యేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆడిమాసంలో కావళ్లతో భక్తి పయనం ద్వారా ప్రజా మద్దతు కూడగట్టుకునేందుకు చర్యలు చేపట్టింది. వివరాలు.. 2026 ఎన్నికల ద్వారా తమిళనాట అన్నాడీఎంకేతో కలిసి పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో భక్తి ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఇప్పటికే మదురై వేదికగా జరిగిన తమిళ కడవుల్ మురుగన్ మహానాడుకు విశేష స్పందన రావడంతో హరోహర నినాదాన్ని జ్వళింప చేయడానికి కసరత్తు చేపట్టింది. ఈ మహానాడు రాజకీయాలకు అతీతం అని ప్రకటించినా, చివరకు రాజకీయ అంశాలకు వేదికగా మారింది. ఇది విమర్శలకు దారి తీసినా, జనం నుంచి వచ్చిన స్పందన ఆధారంగా ఇక, మురుగన్ వేల్ను తమ చేతిలోకి తీసుకుని యాత్రలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆడిమాసం కావడంతో ఆడికృత్రిక సందర్భంగా మురుగన్ ఆలయాలకు కావళ్ల యాత్రకు కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా తమిళ్ కడవుల్ మురుగన్కు ప్రసిద్ధి చెందిన ఆరుప్పడై వీడులుగా పిలవబడే ఆలయాలు రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇందులో తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులో జయంతి నాథర్ స్వామిగా, దిండుగల్ జిల్లా పళణిలోని దండాయుధపాణి, మదురై తిరుప్పరగుండ్రంలో సుబ్రమణ్యస్వామిగా, తంజావూరు జిల్లా స్వామిమలైలోని స్వామినాథన్గా, మదురై పళముదిర్ చోళైలో సోలై మలై మురుగన్, తిరుత్తణిలో మురుగన్ ఆలయాలకు కావళ్ల యాత్రకు సన్నద్ధం అవుతున్నారు. ప్రజల్ని ఏకం చేస్తూ, బీజేపీ వర్గాలు ఈ యాత్రకు సన్నద్ధం కానున్నాయి. ఇందుకు సంబంఽధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండురోజులలో వెలువడే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో ఇక, మురుగన్కు విశేష పర్వదినాలైన తైపూసం, స్కంధ సష్టి వంటి వేడుకలను తమకు అనుకూలంగా మలచుకుని భక్తి కార్యాక్రమాలకు కసరత్తు విస్తృతం చేసినట్టు చెబుతున్నారు. కాగా గతరెండు రోజులుగా తమిళనాట తూత్తుకుడి ప్రగతి ప్రాజెక్టులో, గంగై కొండ చోళపురంలో ఆధ్యాత్మిక, భక్తిభావం మిన్నంటే కార్యక్రమాలలో పీఎం మోదీ పాల్గొనడంతో కొత్త ఊపుతో ఉన్న బీజేపీ వర్గాలు, మరింత దూకుడుగా భక్తి మార్గంలో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. -
ఆధునిక సాంకేతికతతో ‘కెప్టెన్ ప్రభాకరన్’
తమిళసినిమా: గతంలో విజయవంతమైన చిత్రాలను మళ్లీ రిలీజ్ చేయడం ఇప్పుడు పరిపాటిగా మారింది. దీనికి కారణం ఆ చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల ఆదరణ పొందటం, కాసుల వర్షం కురిపించడమే. అలా 34 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయాన్ని సాధించిన కెప్టెన్ ప్రభాకరన్ చిత్రం ఆ చిత్రం మళ్లీ 4 కే, డిజిటల్ ఫార్మేట్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆగస్టు 22వ తేదీన రీ రిలీజ్ కానుంది. ఇది విజయ్ కాంత్ నటించిన 100వ చిత్రం అన్నది గమనార్హం. ఆర్కే సెల్వమణి కథా, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రంలో శరత్ కుమార్,నటి రూపిణీ, రమ్యకష్ణ ,మన్సూర్ అలీఖాన్, లివింగ్స్టన్, గాంధీమతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన విచిత్రం 1991 ఏప్రిల్ 14వ తేదీన విడుదలైంది కాగా కెప్టెన్ ప్రభాకర్ సంచలన విజయాన్ని సాధించడంతోపాటూ విజయ్కాంత్కు కెప్టెన్ అనే పేరు సార్ధకం చేసింది. కథ విచిత్రాన్ని ఇప్పుడు స్పారో సినిమాస్ పోతాకంపై కార్తీక్ వెంకటేశం రాష్ట్రవ్యాప్తంగా 500 థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల విజయకాంత్ జయంతి సందర్భంగా వెల్లడించారు. ఆయన నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు ఆర్కే సెల్వమణి,డిఎండికే పార్టీ అధ్యక్షురాలు ప్రేమలత విజయకాంత్, కోశాధికారి ఎల్కే సుదీష్, దర్శకుడు విక్రమనచ, ఆర్వీ ఉదయ్ కుమార్, అరవిందరాజ్, పేరరసు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. -
క్లుప్తంగా
తుపాకుల పనితీరు పరిశీలన సేలం : సేలం జిల్లా పోలీసు విభాగంలో ఉపయోగించే తుపాకీలలో మూడింట ఒక వంతు వార్షిక తనిఖీలు మంగళవారం చేపట్టారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్మాల్ ఆర్మ్స్ కరుపుసామి నేతృత్వంలోని అధికారులు రైఫిల్స్ను తనిఖీ చేసి, వాటికి సంబంధించిన రికార్డులను కూడా పరిశీలించారు. ఇందులో 303, ఎస్ఎల్ఎ, ఎకె 47, ఐఎన్ఎస్ఎఎస్, స్నిపర్ సహా 500 రైఫిళ్లను పరిశీలించినట్లు వెల్లడించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో.. – బ్రెయిన్ డెడ్ అయిన కార్మికుడి అవయవాల దానం అన్నానగర్: తిరువళ్లూరు జిల్లా సెవ్వపేటైకి చెందిన 49 ఏళ్ల దినసరి కూలీ 22వ తేదీన ఆరణి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అక్కడి నుంచి తదుపరి చికిత్స కోసం చైన్నెలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స ఫలించకపోవడంతో 24వ తేదీన ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీని తర్వాత, ఆయన కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. దీని తర్వాత, ఆయన రెండు మూత్రపిండాలు, ఎముకలు, చర్మం, కాలేయం, కళ్లను తొలగించి దానం చేశారు. ఓ మూత్రపిండాన్ని వడపళనిలోని ఓ రోగికి, మరో మూత్రపిండాన్ని అల్వార్పేటైలోని మరో రోగికి మార్పిడి చేశారు. కాలేయాన్ని కోవిలంబాక్కంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పంపారు. చైన్నెలోని ఎగుంపూర్ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు కళ్లను మార్పిడి చేశారు. ఎముకలను రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి, చర్మాన్ని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేశారు. ఈ అవయవ దానం ద్వారా ఏడుగురికి పునర్జన్మ కల్పించారు. అనంతరం రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అవయవ దానం చేసిన కార్మికుడి మృతదేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. నామక్కల్లో 7 చోట్ల సీబీసీఐడీ తనిఖీలు తిరువొత్తియూరు: నామక్కల్ తిరునగర్కు చెందిన పళనిస్వామి (77) ఫైనాన్స్ సంస్థ యజమాని. ఇతను తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నామక్కల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో 4 పేజీల లేఖ లభ్యమైంది. అందులో ఆయన మరణానికి నలుగురు కారణమని రాసి ఉంది. కాగా ఆత్మహత్య చేసుకున్న పళనిస్వామి భార్య వసంత, నామక్కల్ పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తదనంతరం, ఈ కేసును దర్యాప్తు చేయాలని కోర్టు సీబీసీఐడీ పోలీసులను ఆదేశించింది. దీని ప్రకారం, పళనిస్వామిని ఆత్మహత్యకు ప్రేరేపించబడినట్టు సీబీసీఐడీ పోలీసులు అభియోగం మోపారు. ఆర్థిక సంస్థ యజమానులు సెల్వరాజ్, శేఖరన్ ఇద్దరు న్యాయవాదులపై మొదటి చార్జీ సీటు దాఖలు చేశారు. పోలీసులు కొనసాగిస్తున్న దర్యాప్తులో ఓ న్యాయవాది రూ.85 లక్షల విలువైన భూమిని లిఖితపూర్వకంగా రాసి తీసుకున్నట్టు తెలిసింది. పళనిస్వామి మరణం తర్వాత ఆ భూమి పత్రాలను తన నుంచి స్వాధీనం చేసుకుని తన భార్యకు ఇవ్వాలని లేఖలో రాసినట్లు సీబీసీఐడీ పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సీబీసీఐడీ డీఎస్పీ వినోద్ నేతృత్వంలో పోలీసులు కలెక్టర్ కార్యాలయం సమీపంలో వున్న న్యాయవాది కార్యాలయం, న్యాయవాది ఇల్లు సహా ఏడు ప్రదేశాలలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఇందులో కీలక పాత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
విజేతలకు ఘన స్వాగతం
సేలం: స్పెషల్ ఒలింపిక్స్ ఇండియాలో భాగంగా ఛత్తీస్గఢ్లో మానసిక వికలాంగుల కోసం నిర్వహించిన బీఓసీసీఈ క్రీడా పోటీలో తమిళనాడు విద్యార్థులు పాల్గొని 8 పతకాలు సాధించారు. సేలం, చైన్నె, తిరుప్పూర్, మధురై, తిరునెల్వేలి జిల్లాల నుండి ఎనిమిది మంది ఈ పోటీలో పాల్గొన్నారు. ఇందులో విజయం సాధించి తిరిగి వచ్చిన తమిళనాడు జట్టుకు సేలం రైల్వే స్టేషన్లో స్పెషల్ ఒలింపిక్స్ ఇండియా తమిళనాడు, సేలం అధికారులు ఘన స్వాగతం పలికారు. అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి ఆనందన్ మరియు అనేక మంది నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గుమ్మిడిపూండిలో చిన్నారిపై లైంగిక వేధింపులు
● నిందితుడిపై దాడికి యత్నం ● కోర్టు ఆవరణలో ఉద్రిక్తత తిరువళ్లూరు: పాఠశాలకు వెళ్లి ఇంటికి వస్తున్న చిన్నారిపై లైగింక దాడికి పాల్పడిన వ్యవహారంలో అరెస్టుయిన నిందితుడ్ని నాలుగు రోజుల పాటూ పోలీసు కస్టడికి ఇస్తూ తిరువళ్లూరు పోక్సో కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం నిందితుడ్ని బయటకు తీసుకొచ్చే సమయంలో కొందరు మహిళలు, న్యాయవాదులు దాడికి యత్నించడం, పోలీసులు వారిని అడ్డుకుని తోసేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని ఆరంబాక్కం ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలిక ఈనెల 12న పాఠశాల ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసి లైగింక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. అయితే లైగింక దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించే విషయంలో పోలీసులకు సవాలుగా మారింది. దాదాపు 13 రోజుల పాటూ గాలించిన పోలీసులు నెల్లూరు జిల్లా సూళూరుపేట రైల్వేస్టేషన్లో నిందితుడ్ని అరెస్టు చేశారు. అరెస్టుయిన తరువాత దాదాపు 48 గంటల పాటూ రహాస్యంగా వుంచి విచారణ చేపట్టిన పోలీసులు నెల్లూరు, ఆరంబాక్కం తదితర ప్రాంతాలకు నిందితుడిని తీసుకెళ్లి విచారణ చేపట్టారు. గత శనివారం పూందమల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్దకు తీసుకెళ్లి హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన క్రమంలో పుళల్ జైలుకు తరలించారు. పోలీసుల విచారణలో బాలికపై లైగింక దాడికి పాల్పడిన యువకుడు ఒడిశాకు చెందిన రాజూబిష్మవర్మ(35)గా గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ సోమవారం పోక్సో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మంగళవారం న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. కేసు విచారణలో భాగంగా మంగళవారం భారీ పోలీసు బందోబస్తు నడుమ నిందితుడ్ని తిరువళ్లూరు న్యాయస్థానానికి తీసుకొచ్చారు. కేసును న్యాయమూర్తి ఉమామహేశ్వరి విచారణ చేపట్టారు. అనంతరం నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ తీర్పును వెలువరించారు. దాడికి యత్నం బుధవారం నుంచి నాలుగు రోజుల పాటూ పోలీసు కస్టడి విచారణకు కోర్టు అనుమతి ఇచ్చిన క్రమంలో నిందితుడ్ని భారీ పోలీసు బందోబస్తు నడుమ పుళల్ జైలుకు తరలించారు. ఈ సమయంలో కొందరు న్యాయవాదులు దాడికి యత్నించారు. పోలీసులు అసలైన నిందితుడ్ని అరెస్టు చేయలేదని నినాదాలు చేశారు. దీంతో పాటు అక్కడే వున్న మరికొందరు మహిళలు సైతం నిందితుడిపై దాడికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఉద్రిక్తతల మధ్య పోలీసులు నిందితుడ్ని పుళల్ జైలుకు తరలించారు. -
మీతో స్టాలిన్లో దరఖాస్తుల హోరు!
సాక్షి, చైన్నె: మీతో స్టాలిన్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 12.65 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 5.88 లక్షల మంది మహిళా హక్కు పథకం మేరకు నెలకు రూ. 1000 నగదు కోసం అర్జీలు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వివరాలు.. లక్షలాది మంది ప్రజలు రోజూ పొందే ప్రభుత్వ శాఖల సేవలను ప్రజల ఇళ్ల ముంగిటకే తీసుకొచ్చే విధంగా మీతో స్టాలిన్ కార్యక్రమానికి ఈనెల 15వ తేదిన శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జూలై 15 నుండి నవంబర్ 2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా 10,000 శిబిరాలు ఈ కార్యక్రమం ద్వారా నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందులో తొలి విడతగా ఆగస్టు 15వ తేదీ వరకు 3563 శిబిరాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో 1428 శిబిరాలు పట్టణ ప్రాంతాల్లో , గ్రామీణ ప్రాంతాల్లో 2135 శిబిరాలు జరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాలలోని ప్రజలు 13 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 43 సేవలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు 15 శాఖలకు చెందిన 46 సేవలను ఈ శిబిరాల ద్వారా పొందే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ శిబిరాలకు జనం నుంచి ప్రత్యేక స్పందన వస్తున్నది. దీంతో సీఎం స్టాలిన్ స్వయంగా ఈ శిబిరాలను పర్యవేక్షిస్తూ వస్తున్నారు. మంగళవారం నాటికి 15 రోజులలో ఈ శిబిరాల ద్వారా 12.65 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అనేకం స్థానికంగానే పరిష్కరించారు.మరికొన్ని ఆయా శాఖలకు సిఫారసులు చేసి ఉన్నారు. వీటన్నింటిని 45 రోజులలో పర్యటించే విధంగా చర్యలు చేపట్టారు. వచ్చిన దరఖాస్తులలో 5.88 లక్షల దరఖాస్తులు మహిళలు పెట్టుకున్నవే. కలైంజ్ఞర్ మహిళా హక్కు పథకం మేరకు నెలకు రూ. 1000 నగదును గృహిణులకు ప్రభుత్వం అందజేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు ఒక కోటి 15 లక్షల మందికి ఈ పథకం వర్తింప చేసి ఉన్నారు. తాజాగా శిబిరాల ద్వారా ఐదు లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకోవడం విశేషం. ఈ శిబిరాలలో దరఖాస్తులు చేసుకునే వారందరి సమస్యలు పరిష్కరించే విధంగా సీఎం స్టాలిన్ ఆదేశించి ఉండటం గమనార్హం. 12.65 లక్షల విజ్ఞప్తులు మహిళా హక్కు పథకం కోసం 5.88 లక్షల మంది -
అనుబంధ కౌన్సెలింగ్కు దరఖాస్తులు
సాక్షి, చైన్నె: ఇంజినీరింగ్ కోర్సులకు అనుబంధ కౌన్సెలింగ్ నిమిత్తం ఉన్నత విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈమేరకు ఆగస్టు 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వివరాలు.. రాష్ట్రంలో అన్నావర్సిటీ, సాంకేతిక విద్యా డైరెక్టరేట్ పరిఽధిలో ఉన్న 430 మేరకు ఇంజినీరింగ్ కళాశాలలో బీఈ, బీటెక్ కోర్సుల ప్రవేశ నిమిత్తం దరఖాస్తుల ప్రక్రియ ముగించి కౌన్సిలింగ్సాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ కోటాలోని సుమారు రెండు లక్షల సీట్లు ఉండగా 2 లక్షల 50 వేల 298 మంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. వీరిలో ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సెలింగ్కు 2 లక్షల 41 వేల 641 మంది అర్హత సాధించారు. తొలుత రిజర్వుడ్ కోటా క్రీడలు, దివ్యాంగులు, మాజీ సైనికులు తదితర సీట్ల భర్తీ జరిగింది. ఆ తదుపరి ఈనెల 14 నుంచి ఆగస్టు 19వ తేది వరకు జనరల్ కోటా సీట్ల భర్తీ జరుగుతూ వస్తున్నది. ఈ పరిస్థితలలో ఇప్పటి వరకు జరిగిన జనరల్ కోటా కౌన్సెలింగ్లో 98,565 మంది విద్యార్థులు తమకు కావాల్సిన కళాశాలలో కోర్సులను ఎంపిక చేసుకున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలో చదువుకున్న విద్యార్థులకు 7.5 శాతం రిజర్వుడ్ మేరకు 16259 మంది సీట్లను దక్కించుకున్నారు. ఈ పరిస్థితులలో అనుబంధ కౌన్సెలింగ్నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్లస్–2లో తప్పి, సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారు, ఇతర ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల కోసం ఎదురు చూసి సీట్లు దక్కక పోవడం, వంటి పరిణామాలతో ప్రత్యామ్నాయంగా ఇంజినీరింగ్ వైపుగా చూస్తున్న విద్యార్థులకు అనుబంధ కౌన్సిలింగ్లో అవకాశాలు కల్పించనున్నారు. ఈ అనుబంధ కౌన్సెలింగ్ ఆగస్టు 21 నుంచి 23 వరకు జరుగనుంది. -
స్వరం మార్చిన పన్నీరు!
● నేడు మద్దతుదారులతో భేటీ ● కీలక నిర్ణయానికి అవకాశంసాక్షి, చైన్నె: ప్రధాని నరేంద్ర మోదీ తనకు అపాయింట్మెంట్ ఇవ్వక పోవడంపై మాజీ సీఎం పన్నీరు సెల్వం గుర్రు మంటున్నారు. కేంద్రం తీరును ఎండగట్టే విధంగా రాష్ట్రానికి నిధుల కేటాయింపు వ్యవహారంపై స్వరంమార్చి గళాన్ని విప్పారు. బుధవారం మద్దతు దారులతో సమావేశానికి నిర్ణయించారు. వివరాలు.. తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు తనకు దక్కినట్టు దక్కి దూరం కావడాన్ని మాజీ సీఎం పన్నీరు సెల్వం జీర్ణించుకోలేకున్నారు. అన్నాడీఎంకేను కై వశం చేసుకునే ప్రయత్నాలు ఓ వైపు చేస్తూనే, మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో తాను ఉన్నట్టు ఇన్నాళ్లు చెప్పుకుంటూ వచ్చిన పన్నీరు సెల్వంకు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఒత్తిడితోనే తనకు అనుమతి ఇవ్వన్నట్టుగా పన్నీరు గుర్తించినట్టు ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాలతో ఇక బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఎన్నికల సమయంలో ఇమడటం కష్టం అన్నది పన్నీరు గుర్తించినట్టున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా పార్టీ ఏర్పాటు ద్వారా తమిళగ వెట్రి కళగం నేత విజయ్ నేతృత్వంలోని కూటమిలో చేరడానికి కసరత్తు మొదలెట్టినట్టుగా ఆయన మద్దతు దారులు పేర్కొంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇన్నాళ్లూ కేంద్రానికి వంత పాడుతూ వచ్చిన పన్నీరు సెల్వం మంగళవారం రూటు మార్చారు. తమిళనాడుకు విద్యా తదితర నిధుల కేటాయింపులో నిర్లక్ష్యాన్ని వహిస్తున్న కేంద్రం తీరును ఎండగట్టే విధంగా, ఈ వ్యవహారంలో ప్రధానినరేంద్ర మోదీ మెతక వైఖరిని అనుసరిస్తున్నారన్నట్టుగా విమర్శలు, వ్యాఖ్యల తూటాలతో ప్రకటనను పన్నీరు సెల్వం విడుదల చేయడం గమనార్హం. ఇక, బీజేపీతో కటీఫ్ అన్నట్టుగా ఈ ప్రకటనను రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితులలో బుధవారంచైన్నెలో తన మద్దతు దారుల సమావేశానికి పన్నీరు సెల్వం నిర్ణయించారు. ఈ సమావేశంలో రాజకీయ భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు మద్దతు వర్గం పేర్కొంటోంది. -
ఆరు నగరాల్లో..
కీలక ఒప్పందాలు.. రాష్ట్రంలో చైన్నెతో పాటూ ఆరు నగరాలలో పారా క్రీడా మైనదాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. చైన్నెలో ఏర్పాటు చేస్తున్న పారా బ్యాడ్మింటన్ కోర్టు పనులకు చర్యలు తీసుకున్నారు. ఈ పనులను మంగళవారం డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ పరిశీలించారు. అలాగే నాన్ మొదల్వన్ ప్రాజెక్టు కింద కంప్యూటర్, సైన్స్ స్ట్రీమ్లో చివరి సంవత్సరం చదువుతున్న ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల కోసం తమిళనాడు నైపుణ్యాభివృద్ధి సంస్థ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుంది. సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. జాతీ, అంతర్జాతీయ క్రీడలకు తమిళనాడు వేదిక కావాలనే లక్ష్యంతో క్రీడా పరంగా నిర్మాణాలు విస్తృతం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ పోటలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పాఠశాల,కళాశాల స్థాయిలో క్రీడాకారులను బలోపేతం చేసే విధంగా సీఎం టోర్నీ పోటీల నిర్వహణ ఏటా నిర్వహిస్తూ, అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో అనేక మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ పోటీలలో రాణిస్తూ పతకాలతో తమిళనాడుకు తిరిగి వస్తున్నారు. వీరిని మరింత ప్రోత్సహించే విధంగా నగదు బహుమతులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. నియోజకవర్గానికి ఒక మైదానం, నగరానికి ఒక క్రీడా అకాడమి అంటూ వివిధ నిర్మాణాలను వేగవంతం చేశారు. చైన్నె శివారులో క్రీడా నగరం రూపకల్పనకు సంబంధించిన కసరత్తులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పారా క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడల శాఖ, తమిళనాడు స్పోర్ట్స్ అథారిటీ సన్నద్ధమైంది. ఇందులో భాగంగా చైన్నె, తిరుచ్చి,మదురై, కడలూరు, తిరునల్వేలి, సేలం నగరాలలో పారా స్పోర్ట్స్ మైదానాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. నెహ్రూ పార్క్లో.. చైన్నెలోని నెహ్రూ పార్క్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పారా బ్యాడ్మింటన్ కోర్డు నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. తిరుచ్చి, మధురై, కడలూరు, తిరునెల్వేలి, సేలంలలో పారా స్పోర్ట్క్రీడా సముదాయాలు కొలువు దిర్చేందుకు స్ధిమయ్యారు. అర్ధవృత్తాకారంలో ఓపెన్ ఎయిర్ రూప్డ్ సీటింగ్తో పారా వాలీబాల్ కోర్ట్, పారా బాస్కెట్ బాల్ కోర్ట్, పారా బాల్ త్రోయింగ్ పిచ్ వంటి సదుపాయాలతో, పరిపాలన కార్యాలయం భవనం, క్రీడా సామాజిక నిల్వకు ప్రత్యేక గది, చక్రాల బండి, పురుషులు, మహిళలకు కుర్చీలతో కూడిన ర్యాంప్, తదితర సౌకార్యలను కల్పించేందుకు సిద్ధమయ్యారు. చైన్నె కిల్పాక్లోని నెహ్రూ పార్క్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రూ. 2.38 కోట్ల వ్యయంతో పారా బ్యాడ్మింటన్ మైదానం పనులను మంగళవారం డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ పరిశీలించారు. పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇతర నగరాలలో తలా రూ. కోటి విలువతో పారా మైదానాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. మొత్తం రూ.7.38 కోట్లు ఖర్చుతో పారా స్పోర్ట్ కాంప్లెక్స్ల నిర్మాణాలు వేగవంతం చేయనున్నారు. చైన్నెలోని నెహ్రూ పార్క్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అర్థ వృత్తాకారంలో ఓపెన్ ఎయిర్ పారా పెట్ , బ్యాడ్మింటన్ కోర్టు, సిట్టింగ్ పారా వాలీ బాల్ కోర్టు, పారా టేబుల్ టెన్నిస్ కోర్టు, పారా టైక్వాండో ఫీల్డ్, పారా జూడో ఫీల్డ్, పారా గోల్బాల్ పిచ్, పారా–వెయిట్ లిఫ్టింగ్తదితర క్రీడలకు అవసరమైన అన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్కు తమిళనాడు స్పోర్ట్స్అ థారిటీ సభ్య కార్యదర్శి జె. మేఘనాథరెడ్డి అన్ని వివరాలను తెలియజేశారు. త్వరితగతిన పనులు ముగించాలని, అన్ని రకాల వసతులు ఉండాలని ఈసందర్భంగా క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రాతో పాటుగా జే మేఘనాథరెడ్డిలను ఉదయ నిధి స్టాలిన్ ఆదేశించారు.ఉదయ నిధి స్టాలిన్ సమక్షంలో ఒప్పందాలు పారా బ్యాడ్మింటన్ కోర్టు పనులను పరిశీలిస్తున్న ఉదయనిధి, చిత్రంలో అతుల్య మిశ్ర, జె. మేఘనాథరెడ్డి న్యూస్రీల్ నెహ్రూ స్టేడియంలో పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నైపుణ్యాల పెంపునకు గూగుల్తో ఒప్పందాలు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో నాన్ మొదల్వన్ ప్రాజెక్టు కింద కంప్యూటర్, సైన్స్ స్ట్రీమ్లో చివరి సంవత్సరం చదువుతున్న ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల కోసం గేమ్ డెవలపర్, కలైంజ్ఞర్ ప్రోగ్రామర్ నైపుణ్యాల శిక్షణ నిమిత్తం గ్లోబల్ కంపెనీ గూగుల్, యూనిటీ కంపెనీతో తమిళనాడు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందాలు జరిగాయి. ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఇది ఒక గొప్ప ప్రయత్నంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం సంవత్సరానికి లక్ష మందికి పైగా ప్రయోజనం చేకూర్చనుంది. నైపుణ్య ఆధారిత శిక్షణ ద్వారా విద్యార్థులను పరిశ్రమలో ఉద్యోగ నిమిత్తం సన్నద్ధం చేయడం, మెరుగైన సమాజాన్ని సృష్టించే ఆదర్శవంతమైన లక్ష్యంతో కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. నాన్ మొదల్వన్ ప్రాజెక్టు ద్వారా ఈ సంవత్సరం 13 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించగా, ఇప్పటివరకు సుమారు 41 లక్షల మందికి నైపుణ్య ఆధారిత ధృవీకరణ పత్రాలను అందించినట్టు అధికారులు ప్రకటించారు. ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, పాలిటెక్నిక్, ఐటీఐలకు సంబంధించిన విద్యార్థులపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా విద్యా, సాంకేతికత, నిపుణులు, మార్గదర్శకులు, నిర్వాహకుల ద్వారా నైపుణ్యాలను అభివృద్ధిని విస్తృతం చేయనున్నాట్టు ప్రకటించారు. తాజాగా కొత్త యూనిటీ గేమ్ డెవలపర్ శిక్షణ కార్యక్రమం గూగుల్ ప్లే ప్రత్యేక సహకారంతో గేమ్ డిజైన్, అభివృద్ధి, ఆదాయ మార్గంతో పాటూ ఉచిత యూనిటీ లైసెన్స్, ఉచిత శిక్షణ, పరీక్షల తయారీ సెషన్లు, పరిశ్రమ నిపుణులతో సమావేశం , సంభాషణ స్టార్టప్లపై ఆసక్తి ఉన్నవారికి అవకాశం, ఇంక్యుబేటర్ , పెట్టుబడుల అవకాశాలను కల్పించనున్నట్టు వివరించారు. ఈ నైపుణ్య శిక్షణను ఎంపిక చేసిన 250 మంది విద్యార్థులకు అందించనున్నట్టు, ఒక్కో విద్యార్థికి రూ. 32,000, శిక్షణ ధ్రువీకరణకు విలువైన యూనిటీ లైసెన్స్ అందించనున్నామని ప్రకటించారు. దీని మొత్తం విలువ రూ. 80,32,500గా ప్రకటించారు. ప్రపంచ గేమింగ్ పరిశ్రమ ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా 2029 నాటికి మరింతగా పెరుగుతుందని వివరించారు. సచివాలంయలో జరిగిన ఈ ఒప్పందాల కార్యక్రమంలో గూగుల్ ప్లే పార్టనర్షిప్స్, ఏపీఏసీ పార్టనర్, డైరెక్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ – ఎకోసిస్టమ్ పార్టనర్షిప్స్, గూగుల్ ఇండియా ప్లాట్ ఫామం, ప్రభుత్వ వ్యవహారాల విభాగం అధికారులు అతిథి చతుర్వేది, ప్రదీప్ యాదవ్, క్రాంతి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవ్యవస్థను మోసం చేస్తోంది
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీపై ఉన్న ‘క్యాష్ ఫర్ జాబ్స్’ఆరోపణల కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యమయ్యేలా చేస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందుకే ఈ కేసులో నిందితులంటూ 2,300 మంది పేర్లను చేర్చిందని ఆరోపించింది. ఈ ప్రయత్నం న్యాయవ్యవస్థను మోసం చేయడమేనని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం అభివరి్ణంచింది. బాలాజీపై ఉన్న కేసుల పూర్తి వివరాలను తమ ఎదుట ఉంచాలని, బుధవారం విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ‘ఈ మొత్తం వ్యవహారంలో మంత్రితోపాటు మధ్యవర్తులుగా వ్యవహరించిందెవరు? మంత్రి సిఫారసులకు అనుకూలంగా పనులు చేసిన అధికారులెవరు? ఉద్యోగాల ఎంపిక కమిటీ సభ్యులెవరు? నియామక ఉత్తర్వులు వెలువరించిన అధికారులెవరు? వంటి వివరాలను తెలపాలని ధర్మాసనం కోరింది. బాలాజీ జీవిత కాలంలో కూడా విచారణ పూర్తి కాకుండా చేయడమే ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తోందని పేర్కొంది. మాజీ మంత్రి, ఆయన అనుచరులు ఉద్యోగాల కోసం డబ్బు చెల్లించమని బలవంతం చేసిన పేదలను లంచం ఇచ్చేవారిగా, ఈ కుంభకోణం కేసులో నిందితులుగా చేర్చారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘క్యాష్ ఫర్ జాబ్స్’కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టుకొట్టివేయడంతో వై.బాలాజీ అనే వ్యక్తి వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగట్టింది. ఏఐఏడీఎంకే హయాంలో 2011–2015 మధ్య కాలంలో మంత్రిగా పనిచేసిన సెంథిల్ బాలాజీ ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో తమిళనాడు పోలీసులు 2018లో మూడు కేసులు నమోదు చేశారు. దీనిపై 2021 ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసి, 2023 జూన్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసింది. 2024 ఫిబ్రవరిలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 15 నెలలపాటు జైలులో ఉన్న బాలాజీకి సుప్రీంకోర్టు 2024 సెపె్టంబర్లో బెయిలిచ్చింది. అదే నెలలో బాలాజీ మళ్లీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, బెయిల్ కావాలో పదవి కావాలో తేల్చుకోవాలని కొరడా ఝళిపించడంతో గతేడాది ఫిబ్రవరిలో పదవి నుంచి వైదొలిగారు. -
సమగ్ర శిక్ష నిధులను విడుదల చేయండి
చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.2,000 కోట్లకు పైగా విద్యా నిధులను వెంటనే విడుదల చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను అమలు చేయాలని కోరారు. ప్రధానమంత్రి రెండు రోజుల తమిళనాడు పర్యటన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ద్వారా స్టాలిన్ ఈ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను, రాజేంద్ర చోళన్ గౌరవార్థం ఒక స్మారక నాణెంను ప్రధాని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టాలిన్ మోదీకి లేఖ రాశారు. ‘2018 నుంచి తమిళనాడు ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది. దీని వల్ల విద్యా ఫలితాల్లో స్థిరమైన మెరుగుదలలు జరుగుతున్నాయి. తమిళనాడు పాఠశాల విద్యా వ్యవస్థ ప్రస్తుతం 43.90 లక్షల మంది విద్యార్థులు, 2.2 లక్షల మంది ఉపాధ్యాయులు మరియు 32,000 మందికి పైగా సహాయక సిబ్బందికి వసతి కల్పిస్తోంది. ఇంత కీలకమైన మరియు పెద్ద ఎత్తున పథకానికి నిధులను నిలిపివేయడం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కానీ నిధుల విడుదలకు కేంద్రం జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ఒక ముందస్తు షరతు పెట్టింది. ఇందులో కొన్ని నిబంధనలకు, ముఖ్యంగా త్రిభాషా విధానాన్ని విధించడం, పాఠశాల విద్యను 5+3+3+4 ఫార్మాట్కు పునరి్నరి్మంచడం గురించి రాష్ట్రానికి చట్టపరమైన, విధాన ఆధారిత అభ్యంతరాలు ఉన్నాయి. కాబట్టి.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.2,149 కోట్లను వెంటనే విడుదల చేయాలి. 2025–26 సంవత్సరానికి మొదటి విడత చెల్లింపును వేగవంతం చేయాలి’అని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. దశాబ్దం క్రితం మంజూరు చేసి, ఇంకా పెండింగ్లో ఉన్న బహుళ రైల్వే ప్రాజెక్టులను అమలు చేయాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. అనంతరం.. ‘‘తమిళనాడు విద్యార్థుల విద్యకు నిధులు, పేద, మధ్యతరగతి ప్రజల రవాణా కోసం రైల్వే ప్రాజెక్టులు, మత్స్యకారుల జీవనోపాధి, సేలం డిఫెన్స్ ఇండ్రస్టియల్ పార్క్ అభివృద్ధి గురించి గౌరవనీయ ప్రధాన మంత్రి మోదీకి మేం ఒక వినతిపత్రం సమరి్పంచాం. ప్రజల మనోభావాలకు, రాష్ట్ర అభివృద్ధికి విలువనిస్తూ ప్రధానమంత్రి తగిన పరిష్కారాలను అందిస్తారని విశ్వసిస్తున్నా’’అని స్టాలిన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. -
మాజీ సైనికుల కుటుంబాల నిరసన
● పట్టాలు ఇవ్వకుంటే ఆగస్టు 15న నల్లజెండాలు ఎగురవేస్తామని హెచ్చరిక తిరువళ్లూరు: రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన మాజీ సైనికులకు ప్రభుత్వం ఇచ్చిన భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధంలో 1939–45 వరకు జిల్లా నుంచి 60 మంది సైనికులు పాల్గొన్నారు. వీరికి విశ్రాంతి పొందిన తరువాత పింఛన్ లేకపోవడంతో జీవన ఆధారం కోసం ప్రతి సైనికుడికి ఆరు ఎకరాల భూమి, మూడు సెంట్లు ఇంటి స్థలాన్ని కేటాయించారు. ఇందుకు సంబంధించిన జీఓ 1980, 2004లో జారీ చేశారు. ప్రస్తుతం మాజీ సైనికులకు కేటాయించిన భూములు, ఇంటి స్థలం మాజీ సైనికుల ఆధీనంలో ఉన్నా ఇంత వరకు పట్టాలు ఇవ్వలేదు. ఈ క్రమంలో మాజీ సైనికులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం పట్టాలను ఆరు నెలల్లో మంజూరు చేయాలని ఆదేశించింది. అయితే ఇంత వరకు పట్టాలు మంజూరు కాకపోవడంతో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు, వారసులు కలిసి సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ ప్రతాప్కు వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆగస్టు 15న తమ ఇళ్లపై నల్లజెండాలను ఎగురవేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. -
ఘనంగా అన్నామలైయార్కు తీర్థవారి
వేలూరు: పంచ భూత స్థలాల్లో అగ్ని స్థలమైన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అన్నామలైయార్కు ఆలయ కోనేటిలో తీర్థవారి నిర్వహించారు. అన్నామలైయార్ ఆలయంలో ప్రతి నెలా పౌర్ణమి రోజున వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు 14 కిలో మీటరు దూరం ఉన్న గిరివలయం రోడ్డులో కాలి నడకన వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. ఇదిలా ఉండగా ఆలయంలో ఏటా ఆడి మాసంలో నిర్వహించే ఆడిపుర బ్రహ్మోత్సవాలు ఈనెల 19వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గత పది రోజులుగా స్వామివార్లు ఉదయం, సాయంత్రం వేలల్లో మాడ వీధుల్లో భక్తులకు వివిధ పుష్పాలంకరణల మధ్య దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాలు ముగియడంతో గత పది రోజులుగా అలసి పోయిన స్వామివార్లుకు ఆలయ వెనుక ఉన్న నాల్గవ ప్రాకారం చిన్న నంది సమీపంలో ఉన్న బ్రహ్మ తీర్థ కోనేటిలో శివాచార్యులు వేద మంత్రాల నడుమ స్వామి వారికి తీర్థవారి నిర్వహించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, దీపారధన పూజలు జరిపించారు. ఆలయానికి తీసుకొచ్చి పుష్పాలంకరణలు చేశారు. అనంతరం పరాశక్తి అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి భక్తుల దర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులతో గాజులు వేసే పూజలను నిర్వహించి, మాడ వీధుల్లో భక్తుల దర్శనార్థం మేళ తాళాల నడుమ ఊరేగించారు. -
తుపాకీ షూటింగ్లో పోలీసులకు పతకాలు
తిరువళ్లూరు: తమిళనాడు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేర్వేరు విభాగం షూటింగ్ పోటీల్లో ఆవడి పోలీసులకు పది బంగారు పతకాలు, రెండు కప్పులను గెలిచి సత్తా చాటారు. తమిళనాడు పోలీసుశాఖ ఆధ్వర్యంలో 2025 సంవత్సరంలో మహిళ, పురుష పోలీసులకు వేర్వేరు విభాగాల్లో షూటింగ్ పోటీలు నిర్వహించారు. జూలై 27నుంచి 26 వరకు చెంగల్పట్టు ఒత్తివాక్కంలో జరిగిన పోటీల్లో పిస్టల్, స్టెన్గన్ తదితర 13 విభాగాల్లో పోటీలను నిర్వహించారు. పోటీల్లో ఆవడి కమిషనరేట్ పరిధిలోని ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్ వెండి పతకం, తిరునిండ్రవూర్ ఎస్ఐ సుధ పిస్టల్ విభాగంలో బంగారు పతకం సాదించారు. మొత్తానికి ఆవడి పోలీసు కమిషరేట్ పరిధిలోని పోలీసులకు పది పతకాలు, రెండు కప్పులను సాధించి తమ సత్తాను చాటారు. పతకాలు సాధించిన వారిని ఆవడి కమిషనర్ శంకర్ అభినందించారు. -
ఇంటి పట్టాల కోసం హిజ్రాల వినూత్న నిరసన
● కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనతో ఉద్రిక్తత తిరువళ్లూరు: ఉచిత ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం జిల్లాలోని విఽవిధ ప్రాంతాలకు చెందిన హిజ్రాలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి వినూత్న నిరసన చేపట్టారు. తిరువళ్లూరు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో 450 మంది హిజ్రాలు ఉన్నారు. వీరు ఇంటి నుంచి బయటకు వచ్చి నివశిస్తున్నారు. ఈ క్రమంలో హిజ్రాలు గత 20 సంవత్సరాలు ఉచిత ఇంటి పట్టాలు, పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఇప్పటి వరకు సుమారు 10కి పైగా కలెక్టర్ల వద్ద వినతి పత్రం సమర్పించినా పలితం లేకపోవడంతో ఆగ్రహంతో కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన చేపట్టారు. తమకు ఇళ్లు కూడా అద్దెకు ఇవ్వడం లేదన్న హిజ్రాలు ఇంటి పట్టాల కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా ఫలితం దక్కడం లేదన్నారు. హిజ్రాలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మద్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొంది. అయినా పోలీసుల వలయాన్ని దాటి హిజ్రాలు ఆందోళన నిర్వహించారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వచ్చిన రెవెన్యూ అధికారులు హిజ్రాలతో చర్చలు జరిపారు. అర్హులైన వారికి ఇంటి పట్టాలు అందించే విషయాన్ని పరిశీలిస్తామన్న హామీతో హిజ్రాలు ఆందోళన విరమించారు. -
వైద్య రంగంలో నర్సుల సేవలు అజరామరం
● ఉత్తమ నర్సులకు జీవత సాఫల్య పురస్కారాలు ● ప్రదానం చేసిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సాక్షి, చైన్నె: వైద్య రంగంలో నర్సుల సేవలు అజరామరం అని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు నర్సింగ్, మిడ్ వైవ్స్ అసోసియేషన్ శతాబ్ది ఉత్సవాలలో సోమవారం 22 మంది నర్సులకు 2025 సంవత్సరానికి ఉత్తమ నర్సు, జీవిత సాఫల్య పురస్కారాలను ఉదయనిధి స్టాలిన్ అందజేశారు. వళ్లువర్ కోట్టంలో జరిగిన శతాబ్ది ఉత్సవాలకు ఉదయనిధి, ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రమణియన్ హాజరయ్యారు. శతాబ్ది వేడుకల ప్రారంభోత్సవ లోగో, క్యాలెండర్ను విడుదల చేశారు. 22 మంది ఉత్తమ నర్సులకు జీవిత సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ ప్రసంగింస్తూ, మిడ్వైవ్స్ కౌన్సిల్ శతాబ్ది ఉత్సవాలలో తాను భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ఇది తనకు దక్కిన గౌరవంగా వ్యాఖ్యానించారు. ఇక్కడికి వచ్చిన ప్రతి నర్సు ముఖం చూసినప్పుడు, తనకు ఎంతో ఆత్మవిశ్వాసం, భద్రత కలుగుతుందన్నారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి బిడ్డ తన సొంత తల్లి ముఖాన్ని చూసే ముందు, ఇక్కడికి వచ్చిన నర్సుల ముఖాన్ని చూస్తారని , వీరి సేవలు అజరామరం అని వ్యాఖ్యలు చేశారు. నర్సులను ఇక్కడ కలవడం తనకు ఎ ంతో గర్వంగా ఉందన్నారు. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి ఆసుపత్రిలో ఉన్నారని గుర్తు చేస్తూ, ఆయన ఇప్పుడు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారన్నారు. ఆయనకు వైద్య సేవలు, చికిత్సలు అందించిన వైద్యులకు, ముఖ్యంగా నర్సులకు ఈ సమయంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి టీకాలు వేయడం చాలా చాలా ముఖ్యం అని గుర్తు చేస్తూ, ఒకప్పుడు వైద్యులు, నర్సులు టీకాలు వేయడానికి వెళ్లినప్పుడు వారిని తరిమికొట్టేవారన్నారు. ఇప్పుడు నర్సింగ్ సమాజం అలాంటి వ్యక్తులకు అర్థమయ్యేలా చేసి టీకాలు వేయించడం, వ్యాధుల వ్యాప్తి నిరోధించడంలో ముందున్నారని కొనియాడారు. ప్రాణాలను సైతం అర్పించారు తమిళనాడులో అనేక వ్యాధులు వ్యాపించి, అతలాకుతలం చేసినప్పుడు, ముందు వరుసలో నిలిచి సేవలు అందించిన వాళ్లు నర్సింగ్ సమాజం అని వ్యాఖ్యలు చేశారు. కరోనా కాలంలో అనేక మందినర్సులు కుటుంబాలను, పిల్లలను వదలి పెట్టి సేవలు అందించారని, తమ ప్రాణాలను కూడా అర్పించారని వ్యాఖ్యలు చేశారు.‘శిక్షణ పొందిన నర్సులు ఆధునిక ప్రజారోగ్యానికి మూలస్తంభం, ‘శిక్షణ పొందిన నర్సులు ఆధునిక ప్రజారోగ్యానికి పునాది‘ అని ప్రశంసించారు. తమిళనాడులో నేడు గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాలు అద్భుతంగా సేవలు అందించడానికి కారణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారి సేవలేనని ఆయన పేర్కొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తే చర్యలు
● డీఐజీ ధర్మరాజన్ వేలూరు: ఇసుక అక్రమ రవాణాకు సహకరించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని వేలూరు డీఐజీ ధర్మరాజన్ తెలిపారు. వేలూరు నూతన డీఐజీగా ఆయన సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేలూరు ఎస్పీ మయిల్వానం పుష్పగుచ్ఛం అందజేసి, స్వాగతం పలికారు. రాణిపేట, తిరువణ్ణామలై, తిరుపత్తూరు తదితర జిల్లాలకు చెందిన ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, పోలీస్ ఇన్స్పెక్టర్లు పుష్ప గుచ్ఛాలు అందజేసి, ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తంజావూరు, కన్యాకుమారి, కోవై తదితర ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని తెలిపారు. ప్రస్తుతం వేలూరు రీజినల్లోని నాలుగు జిల్లాల్లో సమస్యలను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యంగా వేలూరు ఉమ్మడి జిల్లా పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో ఉండడంతో గుట్కా, మత్తు పదార్థాలు వేలూరు ఉమ్మడి జిల్లాకు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. వేలూరు పట్టణంలో ట్రాపిక్ సమస్య అధికంగా ఉందని తమ దృష్టికి వచ్చిందని, వేలూరు ఎస్పీతో చర్చించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై గూడా చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని ఇందుకు సాయం చేసే పోలీసులపై ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామన్నారు. తమ పరిధిలో ఉన్న వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాల్లో రౌడీలు లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
తమిళులు, మలయాళీల చరిత్రను తెలిపే వీర వణక్కం
తమిళసినిమా: నటుడు, దర్శకుడు సముద్రఖని, భరత్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం వీరవణక్కం. శారద్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకుడు అనిల్ వి.నాగేంద్రన్ కథ,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈయన దర్శకత్వం వహించిన తొలి తమిళ చిత్రం ఇది. ఇందులో నటుడు రితేశ్, జాతీయ అవార్డు గ్రహీత సురభిలక్ష్మి, విప్లవ గాయనీ, స్వాతంత్య్ర యోధురాలు పీకే.మేదిని, భరణి, ఐశ్విక, సిద్ధిక్, ఆకాశ్ దేవన్, చత్తాంగణ తదితరులతో పాటూ మొత్తం 2000 మందికి పైగా ప్రముఖ, నూతన నటీనటులు నటించినట్లు దర్శకుడు తెలిపారు. అణిచివేతకు గురైన, ఆకలి పస్తులతో బతికే కార్మికులకు, దోచుకునే సమాజానికి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథ అని చెప్పారు. అదే విధంగా తమిళులు, మలయాళీలు ఒక తల్లిబిడ్డలే అని చెప్పే మంచి సందేశంతో కూడిన చిత్రం అని చెప్పారు. కవియరసు ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా ఇందులోని మూడు పాటలను శారద్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో ఇటీవల విడుదల చేయగా విశేష ఆదరణను పొందాయని చెప్పారు. అదూ విధంగా చిత్ర పస్ట్లుక్ పోస్టర్ను సోమవారం విడుదల చేయగా సినీ ప్రముఖులు, విశ్లేషకుల నుంచి ప్రశంసలు లభించినట్లు చెప్పారు. కాగా చిత్ర టీజర్,ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. వీరవణక్కం చిత్రంలో సముద్రఖని -
విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలి
వేలూరు: విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఇతరులకు సాయం చేసేవారుగా ఉండాలని విశ్వకర్మ జగద్గురు సీనందల్ 65వ మఠాధిపతి శివరాజ స్వామీజీ తెలిపారు. వేలూరు జిల్లా గుడియాత్తం శ్రీకాళికాంబల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ రజతోత్సవ సంవత్సరం సందర్బంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, విద్యా స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శివరాజ స్వామీజీ మాట్లాడుతూ నేటికి విద్యార్థులు పాఠశాల ఫీజులు చెల్లించలేక అనేక మంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, అటువంటి వారిని గుర్తించి వారికి విద్యా సాయం చేపట్టాలన్నారు. విద్యార్థులు పాఠశాల విద్యా సమయంలోనే వారి జీవితాలను నిర్ణయం చేసుకోవాలన్నారు. పట్టుదలతో ప్రయత్నం చేస్తే తప్పక విజయం సాధించ వచ్చునన్నారు. ప్రస్తుతం కాళికాంబాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులను ఆదుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం ఆరు నుంచి ప్లస్టూ వరకు చదువుతున్న మొత్తం 750 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు విశ్వకర్మ స్నేహితుల సంక్షేమ సంఘం కార్యదర్శి, తమిళనాడు ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేనా జనార్దనన్, ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త అరుణాచలం, తాము మనవర్ వృద్ధాశ్రమం చైర్మన్ డాక్టర్ ఆనంది తంగవేల్, కాళికాంబల్ ట్రస్ట్ నిర్వాహకులు లోకనాథాచారి, రాజేంద్రన్, జగన్నాథన్, కోశాధికారి వెంకటేశన్ తదితరులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
జీఆర్టీలో ఆడి ప్రత్యేక ఆఫర్లు కొరుక్కుపేట: గత అరవై సంవత్సరాలుగా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించిన జీఆర్టీ జ్యువెలర్స్ ఆడి పండుగను పురస్కరించుకుని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జీఆర్ రాధాకృష్ణన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆ సంస్థ నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ కస్టమర్లను ఆనంద పరిచే రీతిలో జీఆర్టీ జ్యువెలర్స్కు చెందిన ఏ జీఆర్టీ షోరూంలో చేసిన ప్రతీ కొనుగోలుతోనైనా కస్టమర్లకు వివిధ రకాల ప్రత్యేక బహుమతులను అందిస్తోందని తెలిపారు. చిన్నదాని నుంచి అతిపెద్ద కొనుగోలు వరకు ప్రతీ లావాదేవీలో కచ్చితంగా ఆశ్చర్యకరమైన బహుమతి ఉంటుందని పేర్కొన్నారు. గత 60 సంవత్సరాలు తమను ఆదరిస్తున్న కస్టమర్లకు ప్రతీ ఆడి సీజన్కు బహుమతి ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఆడి ఆచారం క్యాంపెయిన్ అన్ని జీఆర్టీ జ్యువెలర్స్లో అందిస్తున్నట్టు మరో మేనేజింగ్ డైరెక్టర్ అనంత పద్మనాభన్ తెలియజేశారు. దంపతులను కట్టేసి నగలు, నగదు దోపిడీ తిరువొత్తియూరు: సేలం సమీపంలోని వీరాణం కొమాలి ప్రాంతానికి చెందిన పూమాలై (51) రైతు. ఇతను ఆ ప్రాంతంలో ఇటుక బట్టీని నడుపుతున్నాడు. అతని ఇల్లు వీరాణంలో అరూర్ మెయిన్ రోడ్డులో ఒంటరిగా ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఎప్పటిలాగే పూమాలై ఇంటి వరండాలో పడుకుని నిద్రపోయాడు. ఆ సమయంలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మంకీ క్యాప్ ధరించిన నలుగురు వ్యక్తుల ముఠా అతని ఇంటికి చొరబడ్డారు. వరండాలో నిద్రిస్తున్న పూమాలైని తాడుతో కట్టేశారు. ఇంట్లోకి చొరబడిన ఆ ముఠా పూమాలై భార్య చిన్నపాపాని కూడా కట్టేసి, అరువకుండా ఆమె నోట్లో గుడ్డను కుక్కారు. తరువాత ఆమె ధరించిన 3 సవర్ల బంగారు చైన్, చెవులకు ధరించిన అర సవర కమ్మలను లాక్కున్నారు. అంతేకాకుండా బీరువాను తెరిచి అందులో ఉన్న 5 సవర్ల నగలు, రూ.30 వేలు నగదును దోపిడీ చేసుకుని అక్కడి నుంచి పారిపోయారు. స్థానిక పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చెస్ పోటీలు తిరుత్తణి: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చెస్ పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ సరస్వతి సోమవారం ప్రారంభించారు. తిరుత్తణి జోనల్ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు చెస్ పోటీలు తిరుత్తణిలోని ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. తిరుత్తణి, తిరువలంగాడు మండలాల్లోని 20 ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన బాలికలు పాల్గొన్నారు. పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ సరస్వతి ప్రారంభించారు. ఇందులో వంద మందికి పైగా బాలికలు పాల్గొని, చెస్లో తమ ప్రతిభ కనభరిచారు. జోనల్ స్థాయి పోటీల్లో గెలుపొందిన బాలికలు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. పాఠశాల హెచ్ఎం కలామణి, పీటీఏ అధ్యక్షుడు కుమరవేలు తదితరులు పాల్గొన్నారు. సముద్ర గుర్రాల స్మగ్లర్ అరెస్ట్ అన్నానగర్: విల్లుపురం జిల్లాలోని మరక్కనం ప్రాంతంలో సముద్ర గుర్రాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు దిండివనం అటవీ శాఖకు సోమవారం రహస్య సమాచారం అందింది. దీంతో అటవీ అధికారి భువనేష్ నేతృత్వంలోని అటవీ అధికారులు మరక్కణంలో నిఘా పెట్టారు. ఆ సమయంలో వారు పుదుచ్చేరి రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన మోపెడ్ను నిలిపి, ఆ వ్యక్తి బ్యాగును తనిఖీ చేయగా, అందులో 14 చనిపోయిన సముద్ర గుర్రాలు ఉండడంతో అతడిని అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు మరక్కణం ప్రాంతానికి చెందిన తమీమ్ అన్సారీ (47)తేలింది. అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదాయ వృద్ధి లక్ష్యంగా కొత్త పథకం సాక్షి, చైన్నె: ఆదాయ వృద్ధిని పెంచుకోవడానికి యాక్టివ్ మొమెంటం ఫండ్ పథకాన్ని ప్రారంభించామని కోటక్ మహీంద్ర అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఎండీ నీలేషా తెలిపారు. కేఎంఏఎంసీ యాక్టివ్ మొమెంటం ఫంఢ్ పథకం గురించి సోమవారం స్థానికంగా ప్రకటించారు. దీని గురించి వివరించారు. ఇది ఓపెన్ ఎండ్ ఈక్విటీ పథకంగా పేర్కొన్నారు. ఇది ఇన్ హౌస్యాజమాన్య నమూనాపై నిర్మించబడిన ఆదాయ వృద్ది అవకాశాలను సంగ్రహించడం లక్ష్యంగా తీర్చిదిద్దామన్నారు.ఈ పథకం కోసం పబ్లిక్ సబ్ స్క్రిప్షన్ను మంగళవారం(29వ తేది) నుంచి ఆగస్టు 12 వరకు ఆహ్వానించనున్నామని వివరించారు. కోటక్ యాక్టివ్ మొమెంటం ఫండ్ మేనేజర్ రోహిత్ టాండన్ మాట్లాడుతూ, ఆదాయాల ద్వారా నడిచే నిధిని సృష్టించడానికి, పెట్టుబడి వ్యూహాన్ని డేటా సైన్స్తో అనుసంధానించామన్నారు. ఈ కొత్త పథకం ఒక సాధారణ నమ్మకంపై నిర్మించబడిందని, ఆదాయాలు పెరిగినప్పుడు, అప్ గ్రేడ్లు అనుసరించినప్పుడు, ధరలు చివరికి సమలేఖనం అవుతాయని వివరించారు. -
తిరుత్తణిలో ఆడి పూజల కోలాహలం
● కావళ్లతో మార్మోగిన కొండ ఆలయం ● ఉత్సవర్లకు 1008 బిందెలతో పాలాభిషేకం తిరుత్తణి: ఆడి మాసం సందర్భంగా తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామి కొండ ఆలయంలో సోమవారం కావళ్ల సవ్వళ్లు మార్మోగాయి. ఉత్సవర్లకు 1008 పాల బిందెలతో అభిషేకం నిర్వహించి, భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. ఆడిప్పూరం సందర్భంగా వేకువజామున స్వామికి అభిషేక పూజలు నిర్వహించి బంగారు కవచంతో అలంకరించి, మహాదీపారాధన పూజలు చేపట్టారు. చైన్నెలోని పలు ప్రాంతాల నుంచి ఆడిప్పూరం సందర్భంగా భక్తులు కొండ ఆలయానికి పోటెత్తారు. మెట్లు మార్గంలో కొండ ఆలయం చేరుకున్న భక్తులు నెమలి కావళ్లు, పన్నీరు కావళ్లు, పాల కావళ్లు, ఆలయ మాడ వీధులు హరోంహర నామస్మరణతో మార్మోగాయి. ఈ సందర్భంగా భక్తులు మురుగన్ ఆధ్యాత్మిక పాటలు పాడుతూ మేళతాళాలతో సందడి చేశారు. అదే విధంగా ఉదయం 10 గంటలకు కావడి మండపంలో 1008 పాల బిందెలతో ఉత్సవర్లకు పాలాభిషేకం నిర్వహించారు. భారీ సంఖ్యలో కావళ్లతో భక్తులు కొండకు చేరుకోవడంతో స్వామి దర్శనానికి భారీ క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. స్వామికి కావళ్లు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల్లో చాలామంది శరీరానికి ఇనుప చువ్వలు గుచ్చుకుని, దవడకు శూలం గుచ్చుకుని పాదాలకు ఇనుప కడ్డీల పాదరక్షలు ధరించి మాడ వీధుల్లో ఆలయానికి వెళ్లి, స్వామి దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. -
తీరంలో మాంగ్రూవ్ అడవుల పెంపకానికి శ్రీకారం
సాక్షి, చైన్నె: ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజినీరింగ్ విభాగం, ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా, నేషనల్ సెంటర్ ఫర్కోస్టల్ రీసెర్చ్, తమిళనాడు అటవీ శాఖ, మాంగ్రూవ్ ఫౌండేషన్, 4ఐ యాప్స్ సొల్యూషన్స్లు కలిసి కోవలం సముద్ర తీరంలో చెట్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. అటవీ దినోత్సవ 2025 కార్యక్రమాలలో భాగంగా కోవలం తీరంలో మాంగ్రూవ్ (మడ అడవులు) మొక్కలను పెద్దఎత్తున నాటారు. వీటిని సంరక్షించే విధంగా మాంగ్రూవ్ సప్లింగ్ ప్లాంటేషన్ డ్రైవ్కు చర్యలు తీసుకున్నారు.ఎన్సీసీఆర్ డైరెక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ఎస్ కంకర, ఫారెస్ట్ కోస్టల్ సెక్యూరిటీ అధికారి పొన్ సెంథిల్, ఓఎస్ఐ చైన్నె చాప్టర్ ప్రతినిధులు, శాస్త్ర వేత్తలు డాక్టర్ ట్యూన్ ఉష, జోసియా జోసెఫ్, తిరుమురుగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి వచ్చి మొక్కలను కోవలం సముద్ర తీరంలో నాటారు. వీటిని సంరక్షించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పట్రపెరంబదూరులో రాస్తారోకో – క్వారీ వద్ద లారీలను అడ్డుకుని ఆందోళన తిరువళ్లూరు:పట్రపెరంబదూరు చెరువులో ప్రభు త్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని ఆరోపిస్తూ లారీలను అడ్డుకుని సోమవారం ఉదయం నిరసన చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా పట్రపెరంబదూరు గ్రామంలో సుమారు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఈ చెరువు ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. చెరువులో మరమ్మతులు, పూడికతీత చేపట్టాలన్న ఉద్దేశంతోనే గత పది రోజుల క్రితం క్వారీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మూడు అడుగుల మేరకు మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. లారీలో అధికంగా మట్టిని లోడ్ చేయకూడదన్న నిబంధనలతో అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి మట్టిని తరలిస్తున్నట్టు ఆరోపిస్తూ గ్రామస్తులు సోమవారం లారీలను అడ్డుకుని క్వారీ వద్ద నిరసన చేపట్టారు. దీంతో క్వారీలో రెవెన్యూ అధికారులుతాత్కాలికంగా తవ్వకాలను నిలిపివేశారు. -
కుట్రం కడిదల్ సీక్వెల్కు శ్రీకారం
తమిళసినిమా: జేఎస్కే ప్రొడక్షన్స్ సంస్థ అధినేత జేఎస్కే సతీష్కుమార్ ఇంతకు ముందు తరమణి, కుట్రం కడిదల్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. పలువురు దర్శకులు, నటీనటులు, సాంకేతిక వర్గానికి అవకాశాలు కల్పించిన ఈయన తరమణి, పేరంబు,వంటి పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషించి గుర్తింపు పొందారు. ఇటీవల ఫైర్ అనే చిత్రంలో కథానాయకుడిగానూ నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించి విజయాన్ని సాధించారు. కాగా జేఎస్కే 2023లో నిర్మించిన కుట్రం కడిదల్ చిత్రం జాతీయ అవార్డును గెలుచుకుంది. ఆ చిత్రానికి తాజాగా సీక్వెల్ను చేస్తున్నారు. ఇందులో ఆయనే ప్రధాన పాత్రను పోషించడం విశేషం. పుదుమైపిత్తన్, వళ్లీ చిత్రాల దర్శకుడు, అనీతి, తలమై చెయల్ వెబ్ సిరీస్లకు మాటల రచయితగా పని చేసిన ఎస్కే.జీవా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కుట్రం కడిదల్ –2 చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, నటుడు జేఎస్కే వివరాలు తెలుపుతూ ఓ 60 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడి జీవిత వృత్తాంతమే ఈ చిత్ర కథ అని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును అందుకున్న ఆయనకు ఆ తరువాత జరిగిన ఒక సంఘటన కారణంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు, ఆ ఘటన ఏమిటీ తదితర పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం కుట్రం కడిదల్–2 అని చెప్పారు. చిత్ర షూటింగ్ను తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో జేఎస్కే.సతీశ్కుమార్తో పాటూ పాండియరాజన్, అప్పుకుట్టి, బాలాజీ మురుగదాస్, దీపక్, పద్మన్, పీఎల్.తేనప్పన్, చాందిని తమిళరసన్, కీర్తిచావ్లా, వీజీ చంద్రశేఖర్, లవ్విన్, జోవితా, లివింగ్స్టన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీనికి డీకే సంగీతాన్ని, సతీష్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
అటవీ ప్రాంత యువకులకు ప్రత్యేక శిక్షణ
వేలూరు: అటవీ ప్రాంత యువకులు పోలీసు ఉద్యోగాల్లో చేరేందుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్పీ మయిల్వానం అన్నారు. వేలూరు జిల్లా అనకట్టు నియోజక వర్గాల్లోని పలు అటవీ గ్రామాలను నేరుగా సందర్శించి, ప్రజలను కలిసి మాట్లాడారు. పోలీసులు ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటేనే నేరాలు లేకుండా ఉంటాయన్నారు. దీంతోనే తాను అటవీ ప్రాంత ప్రజలను నేరుగా చూసేందుకు వచ్చానని ఇక్కడి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. అనంతరం అటవీ గ్రామాల్లో పదో తరగతి, ప్లస్టూ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉన్న యువకులు ఎంత మంది ఉన్నారు, పోలీసు ఉద్యోగాల్లో చేరేందుకు ఎంత మందికి ఆసక్తి ఉందనే వాటిపై త్వరలో సర్వేలు నిర్వహిస్తామన్నారు. వారికి ఆయా ప్రాంతాల్లోనే ఉచితంగా పోలీస్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో పాల్గొని ప్రతి ఒక్కరూ పోలీస్ ఉద్యోగాల్లోకి రావాలన్నారు. అటవీ ప్రాంత ప్రజలు నాటు సారా కాచడానికి, విక్రయానికి వెళ్లకుండా ఉండాలన్నారు. అనంతరం అటవీ ప్రాంతాల్లోని ప్రజలను నేరుగా కలిసి వారి కుటుంబ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. -
తిరుత్తణి ఆలయ చైర్మన్గా శ్రీధరన్
తిరుత్తణి: తిరుత్తణి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్గా శ్రీధరన్ రెండో సారి పదవీ బాధ్యతలు సోమవారం స్వీకరించారు. తిరుత్తణి ఆలయ చైర్మన్ శ్రీధరన్ ఆధ్వర్యంలోని పాలక మండలి పదవీ కాలం మే 31తో ముగియడంతో ఇటీవల హిందూ దేవదాయ శాఖ పాలక మండలి సభ్యులుగా సురేష్బాబు, శ్రీధరన్, ఉషారవి, మోహనన్, నాగన్లకు రెండో సారి అవకాశం కల్పించి, రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఐదుగురు సభ్యుల్లో ఒకరు చైర్మన్గా ఎంపికకు సంబంధించి తిరుత్తణిలోని జాయింట్ కమిషనర్ ఆలయంలో సోమవారం రహస్య ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ట్రస్టు బోర్డు సభ్యులు ఐదురుగు పాల్గొని, తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రహస్య ఓటింగ్లో ఐదుగురు సభ్యులు చైర్మన్గా శ్రీధరన్ను ఎంపిక చేశారు. రెండవ సారిగా చైర్మన్గా ఎంపికై న శ్రీధరన్కు ఆలయ జాయింట్ కమిషనర్ రమణి, ట్రస్టుబోర్డు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం చైర్మన్తోపాటు ట్రస్టు బోర్డు సభ్యులు ఆలయానికి వెళ్లి శ్రీసుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారందరికీ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
విక్రమ్తో జత కుదిరింది !
తమిళసినిమా: ఇతర భాషల్లో హిట్స్ అందుకుంటే వారికి కచ్చితంగా తమిళంలో అవకాశాలు వరిస్తాయి. అలా కోలీవుడ్లో మంచి అవకాశాలు అందుకుంటున్న కన్నడ నటి రుక్మిణి వసంత్. ఈ బెంగళూర్ బ్యూటీ 2019లో బీర్బల్ త్రిలోగీ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేశారు. ఆ తరువాత అప్స్టార్ట్స్ అనే హిందీ చిత్రంలో నటించారు. 2023లో నటించిన సప్త సాగరదాచే ఇలో అనే చిత్రం రుక్మిణి వసంత్కు మంచి విజయాన్ని అందించింది. ఆ చిత్రం పలు అవార్డులను సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్లోనూ నటించిన రుక్మిణి వసంత్కు తరువాత కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్కు జంటగా భైరతి రణంగళ్ అనే భారీ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అలా అక్కడ స్టార్ హీరోయిన్ అంతస్తును తెచ్చుకున్న ఈ భామకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కాలింగ్ వచ్చింది. అలా అక్కడ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్కు జంటగా నటించారు. ఆ తరువాత కోలీవుడ్కు దిగుమతి అయ్యారు. ఇక్కడ శివకార్తికేయన్కు జంటగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న మదరాసి చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే విజయ్ సేతుపతి సరసన ఏస్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం ఆ మధ్య విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. దీంతో మదరాసి చిత్రం కోసం ఎదురు చూస్తున్న రుక్మిణి వసంత్కు తాజాగా ఒక తెలుగు, ఒక తమిళం చిత్రాల్లో నటించే అవకాశాలు కొట్టేశారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ 31వ చిత్రంలో ఈ అమ్మడు నటించనున్నారు. ఇకపోతే తమిళంలో విక్రమ్తో జత కట్టే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఇటీవల వీరధీరశూరన్ చిత్రంతో హిట్ను అందుకున్న విక్రమ్ తాజాగా తన 64వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి 96, మెయ్యళగన్ చిత్రాల ఫేమ్ ప్రేమ్కుమార్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయకిగా నటి రుక్మిణి వసంత్ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. నటి రుక్మిణి వసంత్ నటుడు విక్రమ్ నటుడు, నిర్మాత జేఎస్కే సతీష్కుమార్ -
రాజేంద్ర చోళుడే మోదీ రూపంలో వచ్చినట్లుంది
● గంగై కొండ చోళపురం శివాచార్యుల వ్యాఖ్యసాక్షి, చైన్నె: రాజేంద్ర చోళుడే స్వయంగా పీఎం మోదీ రూపంలో వచ్చినట్టుగా తనకు భావన కలిగిందని గంగై కొండ చోళపురం ఆలయ శివాచార్యులు రాజగురు వ్యాఖ్యానించారు. అరియలూరు జిల్లా గంగై కొండ చోళపురంలో జరిగిన ఆడి తిరువాధిరై ఉత్సవాల గురించి తెలిసిందే. ఆదివారం జరిగిన ముగింపు వేడకకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. గంగై కొండ చోళపురంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. కలసం చేత బట్టి ఆయన ఆలయంలోకి రావడం, స్వయంగా దీపారాధన చేయడం, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం వంటి అంశాలను గురించి అక్కడి శివాచార్యులు పలువురు మీడియా ముందుకు వచ్చి సోమవారం వివరించారు. రాజగురు మాట్లాడుతూ తాను 30 సంవత్సరాలుగా ఆలయంలో శివుడికి పూజలు చేస్తూ వస్తున్నానని తెలిపారు. ఏటా ఉత్సవాలు జరుగుతున్నా, ఈ సంవత్సరం ఆడి తిరువాధిరై వేడుకలకు ప్రధాని వస్తున్న సమాచారం మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు. కలలోకూడా తాను ఊహించ లేదని, ప్రధాని నరేంద్ర మోదీ తమతో మాట్లాడారని, ఆలయం వైభవం గురించి అడిగి తెలుసుకున్నారని, ఈ సమయంలో ఆయన ముఖంలో ఆనందం కనిపించిందన్నారు. ఈ సమయంలో ఆయన చిరునవ్వులు చూసి రాజేంద్ర చోళుడే ప్రధాని మోదీ రూపంలో వచ్చినట్టుగా తన్మయత్వం కలిగిందన్నారు. ఆయనకు తిలకం దిద్దే భాగ్యం తనకు దక్కడం జీవితంలో గొప్ప వరంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. -
గోవిందా.. గోపాల
● పులకించిన శ్రీవిళ్లిపుత్తూరు ●ఆండాల్ అమ్మవారి సన్నిధిలో రథోత్సవం సాక్షి, చైన్నె: శ్రీవిళ్లిపుత్తూరు ఆండాల్ అమ్మవారి సన్నిధిలో ఆడిపూరం బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టం అమ్మవారి రథోత్సవం సోమవారం వేడుకగా జరిగింది. గోవిందా..గోపాల అన్న నామస్మరణ మిన్నంటింది. ఆండాల్ అమ్మవారు, రంగ నాథ స్వామి వారు రథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. వివరాలు.. విరుదునగర్ జిల్లా రాజపాళయం సమీపంలోని శ్రీ విళ్లిపుత్తూరు ఆండాల్ అమ్మవారి ఆలయంలో ఆడి పూరం బ్రహ్మోత్సవాలు గత వారంరోజులకు పైగా అత్యంత వేడుకగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ కొలువు దీరిని అమ్మ వారి జీవిత ఇతి వృత్తాంతంకు పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. వైష్ణవ పురాణం మేరకు మహా విష్ణువు దశ అవతారాలలో రంగనాథ స్వామిగా కటాక్షించి ఉన్న విషయం తెలిసిందే. మహావిష్ణు భక్తురాలిగా జన్మించిన ఆండాల్ అమ్మ వారు రంగనాథ స్వామివారిని మనువాడేందుకు పూజలు చేసిన క్షేత్రంగా శ్రీ విళ్లిపుత్తూరు బాసిళ్లుతోంది. అందుకే శ్రీమన్నారాయణుడు వెలిసిన 108 దివ్య క్షేత్రాల్లో శ్రీవిళ్లి పుత్తూరు ప్రత్యేక స్థానం కల్పించి ఉన్నారు. అలాగే శ్రీకృష్ణుడి గురించి అనేక పాటలు రచించిన ఆళ్వార్లలో ముఖ్యుడిగా పేరు పొందిన పెరియాళ్వార్ అనే విష్ణు సిద్ధర్కు కుమార్తెగా అవతరించిన ఆండాల్ అమ్మవారి పుణ్యక్షేత్రమే ఇది. అందుకే ఇక్కడ ఉత్సవాల సమయంలో గోవిందా...గోపాల నామస్మరణ మారుమోగుతుంటుంది. కనుల పండువగా రథోత్సవం.. ఇక్కడ ఏటా అమ్మవారి జన్మ నక్షత్రం మేరకు ఆడి ఉత్సవం, ఆడిపూర రథోత్సవం కనుల పండువగా జరుగుతాయి. ఈ ఏడాది ఆడిపూరం బ్రహ్మోత్సవం ఈనెల 20వ తేదీ నుంచి కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రోజూ ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు, ఆండాల్ అమ్మవారు, రంగనాథ స్వామి వారు ఆలయ మాడ వీధుల్లో వివిధ వాహనాలలో ఊరేగితూ భక్తులకు దర్శనం ఇస్తూ వచ్చారు. ఈ ఉత్సవాలలో తొమ్మిదో వేడుకగా ఆడిపూరం రోజైన సోమవారం ఆడి పూర రథోత్సవం కోలాహలంగా జరిగింది. వేకువ జామును సుప్రభాత సేవ అనంతరం ఆలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు శాస్రోక్తంగా జరిగాయి. అనంతరం స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలతో అలకరించి, బంగారు ఆభరణాలతో అలకరించి ఆలయం నుంచి వెలుపలుకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మదురై కళ్లలగర్ ఆలయం నుంచి అమ్మవారి సారెను పంపించారు. సుందరంగా తీర్చిదిద్దబడ్డ రథం మీద స్వామి, అమ్మవార్లను అధిష్టంప చేశారు. మంత్రులు తంగం తెన్నరసు, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, విరుదునగర్ జిల్లా కలెక్టర్ సుహపుత్రా తాడు చేత బట్టి లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజలు, కర్పూర నీరాజనాల అనంతరం రథం ముందుకు కదిలింది. ఆలయ మాడ వీధుల్లో భక్తుల్ని స్వామి, అమ్మవార్లు రథంపై ఆశీనులై కటాక్షించారు. ఆండాల్ అమ్మవారు, రంగనాథ స్వామి వారిని చూసిన భక్తులు గోవిందా..గోపాల అన్న నామస్మరణను మార్మోగించారు. ఈ రథోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో శ్రీవిళ్లిపుత్తూరు పులకించింది. ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తునతరలి వచ్చిన భక్తుల కోసం తిరునల్వేలి, విరుదునగర్, మదురై, రామనాథపురంల నుంచి ప్రత్యేక బస్సులు శ్రీ విళ్లిపుత్తూరు వైపుగా నడిపారు. భక్తుల సేవలో పలు సంఘాలు తరలించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విరుదు నగర్జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. -
ఐటీ ఉద్యోగి పరువు హత్య
సాక్షి, చైన్నె: వేరే కులానికి చెందిన ఐటీ ఉద్యోగి తన అక్కను ప్రేమిస్తున్నాడన్న ఆగ్రహంతో తమ్ముడు ఉన్మాది అయ్యాడు. సబ్ ఇన్స్పెక్టర్లుగా ఉన్న తండ్రి, తల్లి అండను చూసుకుని పరువు హత్యకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. తిరునల్వేలి, తూత్తుకుడిలో ఈ ఘటన సోమవారం కలకలం రేపింది. తూత్తుకుడి జిల్లా ఏరల్ సమీపంలోని ఆర్ముగ మంగళంకు చెందిన చంద్రశేఖర్, తమిళ్ సెల్వి దంపతుల కుమారుడు కవిన్ సెల్వ గణేషన్ (26) చైన్నెలో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులు వేర్వేరుగా ఉన్నప్పటికీ తరచూ ఆర్ముగ మంగళంకు వచ్చి వెళ్లేవాడు. ఈ పరిస్థితులలో ఆదివారం రాత్రి పది గంటల సమయంలో కవిన్ హత్యకు గురయ్యాడు. ఈ సమాచారం ఆర్ముగ మంగళంలో ఉద్రిక్తతలకు దారితీసింది. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ కాశి పాండియన్ నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుని గ్రామస్తులను బుజ్జగించింది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరునల్వేలి పాళయం కోట్టైకు తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణను వేగవంతం చేశారు. పరువు హత్య విచారణలో ఇది పరువు హత్యగా తేలింది. పాళయం కోట్టై పోలీసు స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శరవణన్, మణిముత్తారు స్పెషల్ పోలీసు ఫోర్సు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కృష్ణకుమారి దంపతుల కుమారుడు సుర్జిత్(24) ఈ హత్యకు పాల్పడినట్టు విచారణలో వెలుగు చూసింది. దీంతో సుర్జిత్ను అరెస్టు చేశారు. అయితే ఈ హత్యకు ప్రధాన కారణం ప్రేమ వ్యవహారం అని తేలింది. కేటీసీ నగర్లో సిద్ధ క్లినిక్ కన్సల్టెంట్గా ఉన్న యువతి తన క్లాస్మేట్ కవిన్ ప్రేమలో పడింది. ఇదే క్లినిక్కు తరచూ తన బంధువును సైతం కవిన్ చికిత్స కోసం తీసుకొచ్చేవాడు. ఈ క్లినిక్లో కన్సల్టెంట్గా ఉన్న యువతి ఆ సబ్ ఇన్స్పెక్టర్ దంపతుల కుమార్తె కావడం గమనార్హం. చైన్నె నుంచి వచ్చినప్పుడల్లా కవిన్ క్లినిక్కు వచ్చి వెళ్తున్న వ్యవహారం సబ్ ఇన్స్పెక్టర్ దంపతుల దృష్టికి చేరింది. ఆదివారం క్లినిక్కు వచ్చిన కవిన్ను తన తల్లిదండ్రులు మాట్లాడాలని పిలిచినట్టుగా నమ్మబలికిన ఆ యువతి తమ్ముడు సుర్జీత్ వెంట బెట్టుకెళ్లాడు. మార్గ మధ్యలోని అష్ట లక్ష్మీ నగర్ వద్ద దాచి పెట్టిన కొడవలితో కవిన్ను సుర్జీత్ నరికి చంపేసినట్టు విచారణలో తేలింది. ఈ సమాచారంతో సోమవారం ఉదయం హతుడి బంధువులు రోడ్డెక్కారు. తూత్తుకుడి–తిరునల్వేలి మార్గాన్ని స్తంభింప చేస్తూ ఆందోళనకు దిగారు. ఎస్ఐ దంపతులను అరెస్టు చేయాలని నినదించారు. ఈ దంపతుల కుమార్తెను వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన కవిన్ ప్రేమించడమే ఈ హత్యకు కారణంగా బంధువులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెనుకబడిన సామాజిక వర్గం వాళ్లు ప్రేమిస్తే చంపేస్తారా అంటూ పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పోలీసులు కావడం, వారి అండను చూసుకునే సుర్జిత్ ఈ హత్యకుపాల్పడినట్టు వెలుగు చూసింది. దీంతో సబ్ ఇన్స్పెక్టర్ దంపతులపై కూడా కేసు నమోదైంది. వారిని అరెస్టు చేసే వరకు మృతదేహాన్ని తీసుకోబోమని హతుడి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పడంతో పోలీసులు బుజ్జగించే పనిలో పడ్డారు. పరువు హత్యకు పాల్పడిన వాళ్లందరినీ కఠినంగా శిక్షించే వరకు ఆందోళన కొనసాగుతుందని గ్రామస్తులు తేల్చి చెప్పారు. వారిని బుజ్జగించే పనిలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. ఎస్ఐ తనయుడి కిరాతకం అక్కను ప్రేమించాడని చంపేశాడు కుటుంబ సభ్యులపై కేసు -
14.5 శాతం పెరిగిన ఆస్తి పన్ను ఆదాయం
● రూ.43 వేల కోట్లకు చేరిన ఆదాయం కొరుక్కుపేట: 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తమిళనాడు ఆస్తి పన్ను ఆదాయం 14.5 శాతం పెరిగి రూ.43.3 వేల కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.37 వేల కోట్లుగా ఉందని భారత చీఫ్ ఆడిటర్ విడుదల చేసిన త్రైమాసిక గణాంకాలలో వెల్లడైంది. రాష్ట్ర మొత్తం ఆదాయ సేకరణలో ఈ ఆస్తి పన్ను ఆదాయం వాటా 75.3 శాతం. ఈ పన్ను ఆదాయం పెరుగుదలకు ప్రధాన కారకాలు రాష్ట్ర వస్తువులు, సేవల పన్ను, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ డ్యూటీ, ఆస్తిపన్ను ఆదాయంలో ప్రధాన అంశాలైన రాష్ట్ర వస్తువులు, సేవల పన్ను వసూలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 21 శాతం పెరిగి రూ. 15,761.04 కోట్లకు చేరుకున్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ. 13,019.26 కోట్లుగా ఉందని వెల్లడించారు. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు ద్వారా వచ్చే ఆదాయం 19.3 శాతం పెరిగి పెరిగిందని అధికారులు తెలిపారు. విమానం ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ ప్రయత్నం – అదుపులో ఐఐటీ విద్యార్థి సాక్షి, చైన్నె: టేకాఫ్కు సిద్ధంగా ఉన్న విమానంలో ఎమర్జన్సీ డోర్ను ఓపెన్చేయడానికి యత్నించిన ఐఐటీ విద్యార్ధి ఒకర్ని పోలీసులు చైన్నెలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం చైన్నె నుంచి దుర్గాపూర్కు 158 మందితో విమానం బయలుదేరడానికి సిద్ధమైంది. విమానం టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో ఫైలట్ క్యాబిన్లో అలారం మోగడంతో ఉత్కంఠ నెలకొంది. ఎమర్జన్సీ డోర్ వద్ద కూర్చున్న యువకుడ్ని ప్రశ్నించారు. డోర్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించడంతోనే అలారం మోగినట్టు గుర్తించారు. దీంతో కంట్రోల్ రూమ్కు సమాచారం అందించి టేకాఫ్ను రద్దు చేశారు. విమానంలో ఉన్న ఆ యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన సర్కార్(27)గా గుర్తించారు. ఇతడు ఐఐటీ మద్రాసులో చదవుతున్నట్టు తేలింది. అతడి వద్ద విచారణ జరుగుతోంది. సందర్శన చైన్నె వేదికగా భారతదేశంలోని వస్త్ర తయారీదారులను ఏకం చేస్తూ అడ్వైట్ 6.ఓ మెగా సౌత్ కాంక్లేవ్ జరిగింది. దీనిని 3 వేల మంది సందర్శించారు. 3 రోజుల వేడుకలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాలతోపాటుగా శ్రీలంక, మలేషియా, సింగపూర్, మారిషస్ నుంచి రిటైలర్లు తరలి వచ్చి బల్క్ ఆర్డర్లను బుక్ చేసుకున్నారు. అడ్వైట్ 6.ఓను పద్మభూషణ్ నల్లి కుప్పుస్వామి చెట్టి, అడ్వైట్ వ్యవస్థాపకుడు ధర్మేష్ నందు సందర్శించారు. – సాక్షి, చైన్నె తమిళనాడు వైపు ఆపిల్ చూపు ●30 వేల కోట్ల పెట్టుబడి ●మంత్రి రాజా సాక్షి, చైన్నె: తమిళనాడులో ఆపిల్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజ తెలిపారు. రూ.30 వేల కోట్ల పెట్టుబడితో 60 వేల మందికి ఉద్యోగ కల్పన దిశగా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ ప్రాజెక్టుకు కార్యాచరణ జరుగుతోందన్నారు. భారత దేశంలో పెట్టుబడుల దిశగా ఆపిల్, దాని అనుబంధ సంస్థలు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తమిళనాడు ఒక ప్రధాన కేంద్రంగా ఆపిల్ గుర్తించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమిళనాడు అన్ని వనరులకు నిలయంగా ఉండడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సహకాలను అందిస్తుండడంతో ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. దీనికి బలాన్ని చేకూర్చే విధంగా పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా వ్యాఖ్యలు చేశారు. 30 వేల కోట్ల పెట్టుబడి, 60 వేల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టామన్నారు. ఆపిల్ ఎలక్ట్రానిక్స్ సరఫరాదారులకు తమిళనాడు కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నట్టు వ్యాఖ్యానించారు.