breaking news
Tamil Nadu
-
మూడు దశాబ్దాల తర్వాత ఉగ్రమూకల అరెస్టుపై బీజేపీ హర్షం
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి మూడు దశాబ్దాలుగా చిక్కకుండా తిరుగుతున్న ముగ్గురు టెర్రరిస్టులను ఏటీఎస్( యాంటీ టెర్రరిజం స్వ్కాడ్) అదుపులోకి తీసుకోవడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై హర్షం వ్యక్తం చేశారు. సదీఖ్ అలీ అలియాస్ టైలర్ రాజా, మహ్మద్ అలీ మన్సూర్, అబుబాకర్ సిద్ధిఖిలను ఏటీస్ బృందం అదుపులోకి తీసుకోవడాన్ని ప్రత్యేకంగా అభినందించారాయన. ఇది తమిళనాడు ఏటీఎస్ పోలీసుల ఘనత అంటూ ఆయన కొనియాడారు. రాష్ట్రంలో జరిగిన ఉగ్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ముగ్గుర్ని మూడు దశాబ్దాల తర్వాత పట్టుకోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ మేరకు అన్నామలై ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. After three decades, the Tamil Nadu Anti-Terrorism Squad has successfully arrested three long-absconding terrorists, Sadiq Ali (also known as Tailor Raja), Mohammed Ali Mansoor, and Abubacker Siddique, linked to a series of targeted terror attacks across Tamil Nadu.These… pic.twitter.com/ODNkJ5HqwW— K.Annamalai (@annamalai_k) July 14, 20251998లో కోయాంబత్తూర్లో జరిగిన ఉగ్రదాడిలో 59 మంది ప్రాణాలు కోల్పోగా, మరొకవైపు 1993లో చెన్నై ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో జరిగిన బాంబు దాడి జరిగింది. ఇక 1995లో నాగూర్లో హిందూ మున్నాని నాయకుడు ముతుకృష్ణన్ భార్యను పొట్టనపెట్టుకున్నారు ఈ ఉగ్రవాదులు. రామాయణం పుస్తకంలో బాంబు దాచి ముతుకృష్ణన్ భార్యను హత్య చేశారు. ఇలా పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ వీరిపై ఏటీఎస్ నిఘా వేసి ఉంచింది. తప్పుడు ఐడెంటీ కార్డులతో ఖాళీగా ఉండే ప్రదేశాలను ఎన్నుకుని తప్పించుకుని తిరుగుతూ ఉన్న వీరిని ఎట్టకేలకు ఏటీఎస్ బృందం పట్టుకుంది. -
షూటింగ్లో ఆర్టిస్ట్ మృతి.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రముఖ స్టంట్ మాస్టర్
ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వెట్టువన్. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ తమిళనాడులోని కిళైయూర్ కావల్ సరగమ్ సమీపంలో విళుందమావడి గ్రామంలో గత మూడు రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. కాగా ఆదివారం ఉదయం షూటింగ్లో పాల్గొన్న మోహన్ రాజు అనే స్టంట్ కళాకారుడు కారులో నుంచి బయటకు దూకుతుండగా గుండెపోటుకు గురయ్యాడు.స్టంట్ కళాకారుడు మృతివెంటనే అతన్ని నాగపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. రాజు మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాంచీపురం నెహ్రూ పూంగండం ప్రాంతానికి చెందిన స్టంట్ కళాకారుడు మోహన్ రాజు వయసు 52 ఏళ్లు. ఈయన మృతి వెట్టువన్ చిత్ర యూనిట్నే కాకుండా సినీపరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. స్టంట్ కళాకారుడు మోహన్ రాజు మృతి పట్ల హీరో విశాల్ (Vishal) సంతాపం ప్రకటించారు.ప్రమాదకర స్టంట్లుసినిమా షూటింగ్లో కారులో నుంచి దూకుతూ స్టంట్ కళాకారుడు రాజు చనిపోయాడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. రాజు నాకు చాలా ఏళ్లుగా తెలుసు. తను ఎంతో ధైర్యశాలి. నా సినిమాల్లో ఎన్నో ప్రమాదకర స్టంట్లు చేశాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కేవలం ఒక్క ట్వీట్ చేసి నా పని నేను చేసుకోలేను. అతడి కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటాను. వారికి తోడుగా ఉండటం నా బాధ్యత అని ఎక్స్ (ట్విటర్)లో పేర్కొన్నారు.ఫైట్ మాస్టర్ ట్వీట్ఫైట్ మాస్టర్ సిల్వ స్టంట్.. రాజు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఒక గ్రేట్ స్టంట్ ఆర్టిస్ట్ను కోల్పోయాం. స్టంట్ యూనియన్, చలనచిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటు. అతడిని మిస్ అవుతున్నాం అంటూ ఏడుస్తున్న ఎమోజీలతో ట్వీట్ చేశాడు.So difficult to digest the fact that stunt artist Raju passed away while doin a car toppling sequence for jammy @arya_offl and @beemji Ranjith’s film this morning. Hav known Raju for so many years and he has performed so many risky stunts in my films time and time again as he is…— Vishal (@VishalKOfficial) July 13, 2025 One of our great car jumping stunt Artist S M Raju Died today while doing car stunts 😭😭RIPOur stunt union and Indian film industry ll be missing Him😭😭 pic.twitter.com/9Qr7Zg8Dbb— silva stunt (@silvastunt) July 13, 2025చదవండి: సకల సినీ పాత్రలకు పెట్టని కోట -
తిరుపతి – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: ఆగస్టులో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ప్రతి సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి (07018), ప్రతి శుక్ర, శని వారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి (07017) రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు మల్కాజిగిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్న గర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడి పత్రి, ఎరగ్రుంట, కడప, ఒంటిమిట్ట, రాజంపే ట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.ప్రతి బుధవారం చర్లపల్లి నుంచి తిరుపతికి రైలు (07251), ప్రతి గురువారం తిరుపతి నుంచి చర్లపల్లికి రైలు (07252) రైళ్లు నడువను న్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. -
ఘనంగా వాసవీ క్లబ్ సేవలు
కొరుక్కుపేట: చైన్నె ఎగ్మూర్లో వాసవీ క్లబ్ చెన్నపట్న, వనిత చెన్నపట్న సంయుక్త ఆధ్వర్యంలో 15వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. క్లబ్ల అధ్యక్షులు హెచ్.బాలాజి, పూర్ణిమల నేతత్వంలో జరిగిన వేడుకలకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సౌభాగ్య ఆదికేశవన్ వేడుకలను ప్రారంభించారు. వేడుకల్లో క్లబ్లకు 15 సంవత్సరాలుగా అధ్యక్షులుగా సేవలందించిన వారిని ఘనంగా సత్కరించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మింట్లోని టైటివి స్కూల్ వేదికగా ఉచిత మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు. వేడుకల్లో క్లబ్ సెక్రటరీలు సతీష్, ఉష, కోశాధికారులు అశోక్, జనని, జోన్ చైర్మన్ బాలాజి, ఇమ్మిడి కిషోర్ పాల్గొన్నారు. -
3,500 ఆలయాల్లో కుంభాభిషేకం నిర్వహిస్తాం
–మంత్రి శేఖర్బాబు సేలం: ఈ ఏడాది చివరి నాటికి 3,500 దేవాలయాల్లో కుంభాభిషేకం నిర్వహిస్తామని హిందూదేవదాయ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు తెలిపారు. ఈరోడ్ కొండపై తిండల్ వేలాయుధస్వామి ఆలయం ఉంది. హిందూధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయంలో ప్రస్తుతం రాజగోపురం నిర్మించే పనులు జరుగుతున్నాయి. దీని తర్వాత ఆలయం ముందు 186 అడుగుల ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించి, దానికోసం పనులు ప్రారంభించారు. ఆదివారం మంత్రులు శేఖర్బాబు, ముత్తుసామి పనులను పరిశీలించారు. మంత్రి శేఖర్బాబు మాట్లాడుతూ ద్రవిడ మోడల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ పునరుద్ధరణలు ప్రారంభమయ్యాయని తెలిపారు. హిందూ మతపరమైన ఎండోమెంట్స్ అండ్ చారిటీస్ చట్టం అమల్లోకి వచ్చిన రోజు నుంచి చేపట్టని పునరుద్ధరణల పనులకు ఆటంకం ఏర్పడింది. ఈ సంవత్సరం చివరి నాటికి 3,500 ఆలయాల్లో పునరుద్ధరణలు పూర్తవుతాయని అన్నారు. 186 అడుగుల ఎత్తులో ఆసియాలోనే ఎత్తైన విగ్రహాన్ని ఈరోడ్ తిండాల్ వేలాయుధ స్వామి ఆలయంలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. -
రైలు ప్రయాణికుల పడిగాపులు
తిరుత్తణి: తిరువళ్లూరు వద్ద ఆదివారం వేకువజామున డీజిల్ ట్యాంకర్ల గూడ్సు రైల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంతో చైన్నె అరక్కోణం మార్గంలో రైళ్ల సేవలు ఆదివారం పూర్తిగా రద్దయ్యాయి. దీంతో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుత్తణి నుంచి చైన్నెకి వెళ్లే విద్యుత్ రైళ్ల సేవలను నిలిపివేయడంతో పాటు తిరుపతి నుంచి చైన్నె వెళ్లే సప్తగిరి, గరుడాద్రి ఎక్స్ప్రస్ రైళ్ల సేవలతో పాటు అన్నీ రైళ్ల సేవలు ఆగిపోయాయి. దీంతో తిరుత్తణి ఆలయానికి వచ్చిన భక్తులు పనుల నిమిత్తం ప్రయాణం చేసేవారు, తిరుత్తణి రైల్వే స్టేషన్లో ఉదయం నుంచి పడిగాపులుకాచారు. రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే స్టేషన్లో ప్రకటించడంతో బస్సుల ద్వారా ప్రయాణం చేయాల్సి రావడంతో బస్సుల్లో రద్దీ నెలకొంది. -
వీరవణక్కం విప్లవ పాట ఆవిష్కరణ
ఎస్జే సూర్య, ఏఆర్ రెహ్మాన్ తమిళసినిమా: విశారద్ క్రియేషన్న్స్ సంస్థ నిర్మించిన చిత్రం వీరవణక్కం. అనిల్ వి.నాగేంద్రన్ దర్శకత్వం వహించిన ఇందులో రితేష్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని నుగత్తడియై తోళిల్ సుమంత్ వుళైప్పాళిగలే అంటూ సాగే చెప్పవా గీతాన్ని యాసిన్ నిజార్ పాడారు. నవీన్ భారతి రాసిన ఈ పాటకు జేమ్స్ వసంతన్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ, డాక్టర్ తోల్ తిరుమావలవన్ విడుదల చేశారు. చైన్నెలో ఈ పాట ఆవిష్కరణ జరిగింది. ఇందులో పాల్గొన్న తోల్తిరుమావలవన్ మాట్లాడుతూ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రంలోని తెండ్రలే మలై తెండ్రలే అనే పల్లవితో సాగే మరో పాటను ఇటీవల విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చినట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలోని పాటలను నిర్మాతకు చెందిన విశారద్ క్రియేషన్స్ యూట్యూబ్ చానల్లో పొందుపరిచినట్లు చెప్పారు. చిత్ర దర్శకుడు అనిల్ వి నాగేంద్రన్, సహదర్శకుడు కేజీ.రామకుమార్, రితేష్, వీసీకే పార్టీ సహాయ కార్యదర్శి వన్ని అరసు పాల్గొన్నారు. -
వైభవం..మునీశ్వర్ మహాకుంభాభిషేకం
తిరుత్తణి: మునీశ్వరర్ ఆలయ మహాకుంభాభిషేకం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుత్తణి సమీపంలోని ఎస్.అగ్రహారం గ్రామంలో ఎల్లయమ్మన్ గుంట వద్ద 11 అడుగుల ఎత్తులో మునీశ్వర్ విగ్రహం ప్రతిష్టించారు. విగ్రహం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. దీంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు మహాకుంభాభిషేకం వేడుకలు సందర్భంగా యాగశాలలు ఏర్పాటు చేసి నిత్యహోమగుండ పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం మహాపూర్ణాహుతి హోమ పూజలు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర పుణ్యతీర్థాల కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి మునీశ్వరర్ విగ్రహానికి పుణ్యతీర్ధాలతో మహాకుంభాభిషేకం నిర్వహించి భక్తులపై పుణ్యతీర్థాలు చల్లారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. -
క్లుప్తంగా
గొంతుకు ఊయల బిగించుకుని విద్యార్థి మృతి పళ్లిపట్టు: ఊయల గొంతు బిగించుకుని 9వ తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన శోకాన్ని మిగిల్చింది. వివరాలు.. పొదటూరుపేట పోలీసుల కధనం మేరకు.. దిగువ నెడిగళ్లు గ్రామానికి చెందిన నాగరాజ్ అతని భార్య జ్యోతి దంపతులకు ప్రేమలక్ష్మి(16), కిరణ్(14) అనే ఇద్దరు పిల్లలున్నారు. వారిలో కిరణ్(14) తిరుత్తణిలోని ప్రయివేటు పాఠశాలలో 9వ తరగతి చదువుకునేవారు. ఈ క్రమంలో నాగరాజ్ అతని భార్యతో కలిసి ఆదివారం బందువుల ఇంటికి వెళ్లగా ఇంట్లో కిరణ్ వుంటుండగా, చీరతో ఊయల కట్టి ఆడుకుంటుండగా, గొంతుకు ఊయల చిక్కుకుని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా చుట్టుపక్కల వారు కాపాడి పొదటూరుపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చిన్నారి మృతి పట్ల పొదటూరుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి దారుణ హత్య అన్నానగర్: అంబత్తూరులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అంబత్తూరు పోలీస్స్టేషన్ సమీపంలోని మారాజ్పురం ప్రాంతానికి చెందిన అరుణాచలం (30). ఇతని భార్య రాణి. వీరికి ముగ్గురు పిల్లలు. శనివారం రాత్రి 11 గంటలకు అరుణాచలం భార్య రాణి, పిల్లలతో ఇంటి ముందు ఉన్నాడు. ఆ సమయంలో కత్తులు, కొడవళ్లతో ఒక రహస్య ముఠా అక్కడికి వచ్చి అరుణాచలంతో వాగ్వాదానికి దిగి అరుణాచలాన్ని దారుణంగా నరికి చంపారు. భార్య, పిల్లలు భయంతో కేకలు వేశారు. రాణి భర్తను కాపాడేందుకు ప్రయత్నించింది. సమాచారం అందుకున్న అంబత్తూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. వారు అరుణచలం మృతదేహాన్ని శవపరీక్ష కోసం కిల్పాకం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గంజాయి విక్రయం విషయంలో జరిగిన వివాదంలో ఈ హత్య జరిగిందని తెలిసింది. హత్యకు సంబంధించి వినోద్, శ్రీనివాసన్లను పోలీసులు అరెస్టు చేశారు. యువకుడి హత్య – ముగ్గురు నిందితుల అరెస్ట్ అన్నానగర్: దిండుక్కల్ జిల్లా వత్తలకుండు సమీపంలోని అయ్యంగొట్టై గ్రామానికి చెందిన కోడి అలియాస్ కృష్ణన్ (25) మహిళలను ఎగతాళి చేశాడనే ఆరోపణలతో అయ్యంగొట్టైపుత్తూరు నివాసి దవపాండితో వివాదం ఏర్పడింది. దీని తరువాత, కోడి అలియాస్ కృష్ణన్ అయ్యంగొట్టైపుత్తూరులోని దవపాండి ఇంటికి వెళ్లి ఈ విషయంపై తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో ఉన్న దవపాండి తన బంధువులతో కలిసి శనివవారం రాత్రి అయ్యంకోటలోని ఇంట్లో నిద్రిస్తున్న కృష్ణను ఊఫు మందై గ్రామంలోని కాళియమ్మన్ ఆలయ ప్రాంతానికి పిలిపించారు. రాత్రి యువకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ పరిస్థితిలో, దవపాండి (25), అతని సోదరుడు నాగపాండి (23), స్నేహితుడు సంజయ్ (25) లు తాము దాచిపెట్టిన కత్తితో కోడి అలియాస్ కృష్ణన్ను నరికారు. తీవ్రంగా గాయపడిన కోడి అలియాస్ కృష్ణన్ సంఘటనా స్థలంలోనే మరణించాడు. తిలకోట్టై డీఎస్పీ సెంథిల్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీని తర్వాత, కోడి అలియాస్ కృష్ణన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం దిండుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య కళాశాలకు పంపారు. ఇన్స్పెక్టర్ రాజశేఖర్ నేతృత్వంలోని పోలీసులు, హత్యలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులు దవపాండి, నాగపాండి మరియు సంజయ్ను రాత్రిపూట అదే ప్రాంతంలో దాక్కున్న వారిని అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏడుగురు మత్స్యకారుల అరెస్టు కొరుక్కుపేట: సరిహద్దు దాటి చేపలు పడుతున్నారని రామేశ్వరానికి చెందిన ఏడుగురు మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసింది. వివరాలు.. రామేశ్వరం ఫిషింగ్ పోర్టు నుండి 456 ఫిషింగ్ బోట్లు మత్స్య శాఖ కార్యాలయం నుంచి అనుమతులు పొంది బయలుదేరాయి. వాటిలో ఎక్కువ భాగం హిందూ మహాసముద్రంలో పడవలలో చేపల వేటకు వెళ్లారు. శ్రీలంక సరిహద్దులో ఉన్న నెడుంతీవు సమీపంలో చేపలు పడుతున్నారు. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో శ్రీలంక నేవీకి చెందిన గస్తీ పడవ కొద్ది దూరం నుంచి మెరుపు వేగంతో మత్స్యకారుల పడవలను చుట్టుముట్టారు. తర్వాత శ్రీలంక నావికాదళం సిబ్బంది మత్స్యకారులైన షణ్ముగం (30), దుతార్ (40), ఎడిసన్ (51), శక్తివేల్ (47), జేసుదీష్ (48), దల్విన్రాజ్ (46), అన్బళగనన్ను అరెస్టు చేసి ఫిషింగ్ బోట్లో తీసుకెళ్లారు. దీంతో వారిని విడిపించాలని కేంద్ర ప్రభుత్వానికి రామేశ్వరం జాలర్లు విజ్ఞప్తి చేశారు ఇంటిపై పెట్రో బాంబులు అన్నానగర్: రిటైర్డ్ ఎల్ఐసీ ఉద్యోగి ఇంటిపై పెట్రో బాంబులు విసిరారు. నైల్లె జిల్లాలోని అంబై ముడప్పాలం నార్త్ స్ట్రీట్కు చెందిన రవిచంద్రన్ (65) రిటైర్డ్ ఎల్ఐసీ ఉద్యోగి. శనివారం రాత్రి కొంతమంది యువకులు అతను నివసించే వీధిలో స్నేహితుడి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆ సమయంలో వారు వీధిలో కేక్ కట్ చేస్తూ వీరంగం సృష్టించారు. దీంతో రవిచంద్రన్ వారిని మందలించాడు. దీంతో యువకులు అర్ధరాత్రి రవిచంద్రన్ ఇంటిపై నాలుగు పెట్రో బాంబులు వేసి పారిపోయారు. వాటిలో 2 పేలాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పేలని రెండు బాంబులను నిర్వీర్యం చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
మతతత్వ శక్తుల వ్యూహాల్ని ఛేదిద్దాం!
● మరింతగా శ్రమిద్దాం ● ప్రజల్లో మద్దతు పెరిగింది ● సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: మతతత్వ శక్తుల వ్యూహాల్ని తమిళనాడులో భగ్నం చేద్దామని, వారికి ఇక్కడ చోటు లేదని నిరూపిద్దామని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. మరింతగా శ్రమిద్దామని, మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంద్దామని కేడర్కు పిలుపునిచ్చారు. ప్రజలలో మద్దతు అన్నది పెరుగుతున్నదని, బాధ్యతతో మరింతగా ముందుకెళ్దామన్నారు. వివరాలు.. సోదరా కదిలిరా నినాదంతో నియోజకవర్గాల వారీగా నేతలతో డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ వన్ టూ వన్గా నేతలతో సమావేశాలను విస్తృతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేడర్ను అప్రమత్తం చేస్తూ ఆదివారం లేఖ రాశారు. 10 సంవత్సరాలు అధికారం అన్నది దూరంగా ఉన్నప్పుడు, ద్రవిడ మోడల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కేడర్ పడ్డ శ్రమ, సేవలను ఈసందర్భంగా గుర్తు చేశారు. తనను సీఎంగా కూర్చోబెట్టిన క్షణాలలో కేడర్ ఆనందాన్ని పేర్కొంటూ, అఽధికారంలోకి వచ్చినానంతరం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాగ్దానాలన్నీ విజయవంతంగా అమలు చేస్తూ వస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో జూన్ 1న మధురైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోదరా కదలిరా నినాదంతో నియోజకవర్గ నేతలను స్వయంగా తానే కలిసి పార్టీ పరంగా పరిస్థితులను ఆరా తీస్తూ వస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్దాం.. తమిళనాడు ప్రజలు ద్రావిడ మోడల్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఒకే జట్టుగా తమిళనాడు నినాదంతో ఇంటింటా జరుగుతున్న సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన వస్తున్నదన్నారు. జూలై 1న చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 77 లక్షలమందికి పైగా కొత్త సభ్యులు పార్టీలో చేరి ఉన్నారని వివరించారు. తమిళనాడు, తమిళ సంస్కృతి అంటూ ప్రగల్బాలు పలుకుతూ ఓ వైపు, మరోవైపు తమిళనాడుకు నిధులు ఇవ్వకుండా అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న వాళ్లు ప్రజల్ని మోసం చేయడానికి వ్యూహాలను రచిస్తున్నారని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలను మత పరంగా విభజించి, ఇక్కడ పాగా వేయాలన్న కుట్రలతో ఉన్న మతతత్వ శక్తులను పాదం మోపనీయకుండా అడ్డుకుంద్దామని కేడర్కు పిలుపు నిచ్చారు. ఇందు కోసం ప్రజలందర్నీ ఒకే జట్టుగా ఒకే వేదికగా నిలబెడుదామని, సభ్యత్వ నమోదును మరింత విస్తృతం చేద్దామని సూచించారు. అన్ని వర్గాల ప్రజల నుంచి ద్రావిడ మోడల్ ప్రభుత్వానికి మద్దతు పెరుగుతోందని, అదే సమయంలో బాధ్యతతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల మద్దతు పెరిగేకొద్దీ, బాధ్యత కూడా పెరుగుతుందని, వారి అంచనాలను తీర్చదానికి మరింతంగా అందరం కష్టపడి పనిచేద్దామని పిలుపు నిచ్చారు. విజయమే లక్ష్యంగా మరింతగా శ్రమించేందుకు ప్రతి ద్రావిడ సైనికుడు సిద్ధం కావాలని కోరారు. -
సారీ కాదు.. న్యాయం కావాలి!
● లాకప్ డెత్లపై విజయ్ ● చైన్నెలో తొలిసారిగా నిరసన ● డీఎంకేపై వ్యాఖ్యల తూటాలు సాక్షి, చైన్నె : సారీ కాదు...న్యాయం కావాలంటూ లాకప్ డెత్ మరణాలపై తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పబ్లి సిటీ ద్రావిడ మోడల్ ప్రభుత్వం...నేడు సారీమా..! ప్రభుత్వంగా మారినట్టుందని విమర్శించారు. వివరాలు.. శివగంగై జిల్లా తిరుభువనంలో జరిగిన సెక్యూరిటీ గార్డు అజిత్కుమార్ లాకప్ డెత్తో పాటూ డీఎంకే హయాంలో వివిధ ప్రాంతాలలో చోటు చేసుకున్న 24 మరణాలకు న్యాయం కోరుతూ తమిళగ వెట్రి కళగం నేతృత్వంలో చైన్నెలో ఆదివారం నిరసన కార్యక్రమం జరిగింది. ఆపార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ప్రపథమంగా చైన్నెలో నిరసనకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. లాలప్ డెత్ మరణాలకు సంబంధించిన బాధిత కుటుంబాలతో కలిసి వేదిక మీద నుంచి తన నిరసన తెలియజేశారు. సారీ వద్దు..న్యాయం కావాలని అన్న నినాదంతో కూడిన ప్లకార్డును ప్రదర్శించారు. విజయ్ కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు, కేడర్ నిరసనకు తరలి రావడంతో ఆ సరిసరాలు కిట కిటలాడాయి. తోపులాట సైతం జరగడంతో స్వల్పంగా పలువురు గాయపడ్డారు. నిరసనలో ఆ పార్టీ నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున తదితర ముఖ్యులు ప్రసంగిస్తూ డీఎంకే, బీజేపీలపై శివాలెత్తారు. సారీ మా సర్కారు.. విజయ్ మాట్లాడుతూ అజిత్ కుమార్లాకప్ డెత్ కేసును గుర్తు చేస్తూ, ఆ కుటుంబానికి ఒక్క సారీ చెబితే సరి పోతుందా..? అని ప్రశ్నించారు. ఆ కుటుంబానికి నష్ట పరిహారం ఇచ్చారు...సారీచెప్పారు..అయితే, గత నాలుగేళ్లలో జరిగిన 24 లాకప్ డెత్ ఘటనలలో బాధిత కుటుంబాలకు సారీ చెప్పారా...? చెప్పకుండా ఉంటే చెప్పేయండి..! అని డిమాండ్ చేశారు. అలాగే నష్ట పరిహారంకూడా ఇచ్చేయండి సీఎం సార్ అంటూ వ్యాఖ్యలు చేశారు. పబ్లిసిటీ ద్రావిడ మోడల్ ప్రభుత్వం ప్రస్తుతం సారీ మా సర్కారుగా మారిందని విమర్శించారు. ఏదైనా ఘటన జరిగితే సారీ చెప్పడం అదే పనిగా పెట్టుకుని ఉన్నారని ధ్వజమెత్తారు. తెలియకుండా జరిగిందీ.., జరగకూడదని జరిగిందీ...సారీ అంటూ ఒక్కమాటతో ఈపాలకులు ముగించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ పాలనకు చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. మీరు చేసిందేమిటో.. గతంలో సాత్తాన్కులంలో తండ్రికుమారుడు జుడిషియల్ కస్టడీలో మరణిస్తే, కేసును సీబీఐకు అప్పగించడం తమిళనాడు పోలీసులకు అవమానం అని వ్యాఖ్యలు చేసిన వాళ్లు, ఇప్పుడు అజిత్కుమార్ విషయంలో చేసిందేమిటో? అని ప్రశ్నించారు. తమిళగ వెట్రి కళగం నేతృత్వంలో న్యాయ పోరాటం ద్వారా ప్రత్యేక సిట్కు పట్టుబడుతున్న సమయంలో విచారణకు భయపడి ముందస్తుగానే సీబీఐ విచారణకు అప్పగించారని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల కనుసన్నల్లో ఉన్న సీబీఐకు అప్పగించి కేంద్ర ప్రభుత్వం వెనుక దాక్కోవడం ఎందుకో.? అని సీఎంస్టాలిన్ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఇంకా ఎన్ని ఘోరాలు, నేరాలు చూడాలంటూ, అన్నావర్సిటీ మొదలు అజిత్కుమార్ కేసు వరకు కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక తమరెందుకు సార్...తమరి ప్రభుత్వం ఎందుకు సార్. తమరికి సీఎం కుర్చీ ఎందుకు సార్..! అంటూ చమత్కారాలతో ప్రశ్నలను సీఎంను ఉద్దేశించి చేశారు. తాను ఎలా ప్రశ్నించినా తమరి వద్ద సమాధానం అన్నది ఉండదను సార్ అంటూ తమరికి తెలిసిందంతా సారీ మాత్రమే అంటూ ఎద్దేవా చేశారు. ఈ నాలుగేళ్ల కాలంలో చేసిన తప్పులకు ప్రాయచ్చిత్తంగా శాంతి భద్రతలను పునరుద్ధరించండి, బాధితులకు న్యాయం చేయండి అని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలతో కలిసి తాము సరి చేయాల్సి ఉంటుందని, ఎలాంటి పోరాటాలకై నా వెనుకాడే పరిస్థితి లేదనిహెచ్చరించారు. -
వీరాణం చెరువుకు జలకళ
తిరువొత్తియూరు: చైన్నెకి తాగునీటిని సరఫరా చేసే వీరాణం సరస్సు మళ్లీ పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. చైన్నె నగరం తన తాగునీటి అవసరాల కోసం పూండి, చోళవరం, పుళల్, కన్నన్ కోట్టై తేర్వాయి కండ్రిగై, సెంబరం పాక్కం, వీరాణం సరస్సుల నుంచి నీటిని వినియోగిస్తారు. వీరాణం సరస్సు కడలూరు జిల్లాలోని కాట్టుమన్నార్ కోవిల్ సమీపంలో ఉంది. జిల్లాలో ఇది అతిపెద్ద నీటి వనరు. దీని పూర్తి సామర్థ్యం 47.50 అడుగులు. పూర్తి సామర్థ్యం 1,465 మిలియన్ క్యూబిక్ అడుగులు. ఈ సరస్సు మూలంగా కడలూరు జిల్లాలోని కావేరి డెల్టా ప్రాంతాలైన చిదంబరం, కట్టుమన్నార్ కోవిల్, భువనగిరి, తిరుముద్దంలోని 44,856 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తోంది. ఈ చెరువు నుంచి ముఖ్యంగా చైన్నెకి రోజూ నీటిని పంపుతున్నారు. ఈ ఏడాది జనవరి 27న వీరానం సరస్సు పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగా, జూన్ 4న రెండోసారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంది. వీరాణం సరస్సు నుంచి సేథియాతోప్పు వీఎన్ఎస్ ఆనకట్ట ద్వారా మిగులు నీటిని విడుదల చేయడం, చైన్నెకి సెకనుకు 74 క్యూబిక్ అడుగుల నీటిని సరఫరా చేయడం వల్ల ఇది జరిగింది. దీని వలన సరస్సు నీటి మట్టం దాని మొత్తం నీటి మట్టం నుంచి 45.25 అడుగులకు తగ్గింది. ఈ క్రమంలో, ప్రజా పాలన శాఖ అధికారులు కొన్ని రోజుల క్రితం దిగువ ఆనకట్ట నుంచి వడవారు ద్వారా సెకనుకు 1,800 క్యూబిక్ అడుగుల నీటిని విడుదల చేశారు. దీని కారణంగా, వీరనం సరస్సు నీటి మట్టం మళ్లీ క్రమంగా పెరగడం ప్రారంభమైంది. ఈ పరిస్థితిలో వీరాణం సరస్సు శనివారం సాయంత్రానికి పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంది. ఈ సంవత్సరం మూడోసారి వీరాణం సరస్సు పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే శనివారం నాటికి దిగువ జలాశయం నుంచి వీరాణం సరస్సుకు సెకనుకు 1000 క్యూబిక్ అడుగుల నీరు ప్రవహిస్తోంది. ఎప్పటిలాగే చైన్నె ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి సెకనుకు 74 క్యూబిక్ అడుగుల నీటిని పంపుతున్నారు. -
గూడ్స్ రైలులో.. మంటలు
చైన్నె తండయార్పేట నుంచి ఆదివారం ఉదయం మైసూరు వైపు క్రూడ్ ఆయిల్తో బయలుదేరిన గూడ్స్ ట్యాంకర్లో భారీ అగ్నిప్రమాదానికి గురైంది. తిరువళ్లూరు సమీపంలో ఈ ఘటన కలకలం సృష్టించింది. ఐదు జిల్లాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది సుమారు పది గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా రైలు సేవలు ఆగాయి. ఇక ఆ పరిసరాలన్నీ దట్టమైన కారు మబ్బులు కమ్ముకున్నట్టుగా పొగ నిండిపోయింది.తిరువళ్లూరు: సాధారణంగా ఉదయం వేళలలో చైన్నె వైపుగా కోయంబత్తూరు, బెంగళూరు నుంచి పదుల సంఖ్యలో రైళ్ల రాక పోకలు సాగిస్తుంటాయి. అలాగే ఎలక్ట్రిక్ రైళ్ల సేవలు మరింత వేగంగా పరుగులు తీస్తుంటాయి. నిత్యం బిజీగా ఉండే రైల్వేమార్గంలో హఠాత్తుగా జరిగిన ఘటన ప్రయాణికుల్నేకాదు, అధికారులు ఉలిక్కిపడేలా చేసింది. వివరాలు.. చైన్నె తండయార్ పేటలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి 52 ట్యాంకర్లతో క్రూడ్ ఆయిల్తో గూడ్స్ రైలు మైసూరు వైపు ఆదివారం ఉదయం బయలుదేరింది. ఒక్కో ట్యాంకర్లో సుమారు 70 వేల లీటర్లు ఆయిల్ సామర్థ్యం వుంది. ఈ క్రమంలో ట్యాంకర్ గూడ్స్ రైలు తిరువళ్లూరు రైల్వే స్టేషన్ దాటి వెళ్తుతున్న క్రమంలో ఉదయం 5 గంటలకు భారీ శబ్దంతో ప్రమాదానికి గురైంది. రైలు నుంచి ఏర్పడిన శబ్దంతో రైల్వేట్రాక్ సమీపంలో నివాసం వుంటున్న సంచార కులాలకు చెందిన కుటుంబాలు, ఎస్టీ సామాజికవర్గ ప్రజలు, వరధరాజర్ నగర్ ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. స్వల్పంగా ట్యాంకర్ నుంచి మంటలు రావడం ప్రారంభమై క్షణాల్లో ఇతర ట్యాంకర్ల వైపుగా వ్యాపించింది. ఇంజిన్ నుంచి మూడవ ట్యాంకర్తో మొదలైన మంటలు క్షణాల్లో 12 ట్యాంకర్లకు వ్యాపించింది. ఉరకులు పరుగులు.. భారీగా మంటలు ఎగిసిపడి పొగలు కమ్ముకోవడంతో రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వచ్చిన రైల్వే అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రమాధం తీవ్రతను గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన తిరువళ్లూరు, తిరువూర్, పేరంబాక్కం తదితర అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా పలితం దక్కకపోగా మరింతగా మంటలు ఎగిసిపడింది. దీంతో ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల దూరం మేరకు పొగలు కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సంఘటన స్థలాన్ని కలెక్టర్ ప్రతాప్, ఎస్పీ శ్రీనివాసపెరుమాల్, మంత్రి నాజర్, జీఎం ఆర్ఎన్ సింగ్, డీఆర్ఎం విశ్వనాథన్, రైల్వే ఎస్పి ఈశ్వరన్తో పాటు పలువురు ఉన్నత అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్తితిని సమీక్షించారు. ప్రమాదం తీవ్రతను గుర్తించి కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట, చైన్నె, తిరువళ్లూరు తదితర జిల్లాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది, వాహనాలను రప్పించారు. దీంతో పాటు గుమ్మిడిపూండి, తిరుమళిసై, అంబత్తూరు, శ్రీపెరంబదూరు సిప్కాట్లలోని ప్రవేటు పరిశ్రమలకు చెందిన వాహనాలను సైతం పిలిపించి నీటిలో ఫోమ్ను కలిపి మంటలను అదుపు చేశారు. దీంతో పాటూ అరక్కోణం జాతీయ విపత్తు నిర్వాహణ బృందాలకు చెందిన సిబ్బందిని సైతం రంగంలోకి దించారు. దాదాపు పది గంటల పాటు శ్రమించిన సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే 12 ట్యాంకర్లు, 8.40 లక్షల లీటర్లు క్రూడ్ ఆయిల్ అగ్నికి ఆహుతి అయ్యింది. దట్టమైన పొగ.. ప్రమాదం క్షణాల్లో వ్యాపించిన క్రమంలో మంటలు ఎగిసిపడింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో సమీప ప్రాంతాల్లోని ప్రజల్లో భయాందోళన నెలకొంది. గుండె శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఎస్టీ సామాజిక వర్గాల గృహాలు, సంచార కులాలకు చెందిన ప్రజలు, వరధరాజనగర్ ప్రాంతాలకు చెందిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. గర్భిణులు, చిన్నపిల్లలను సైతం అంబులెన్స్లో తరలించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఆశ్రయం కల్పించారు. కిలో మీటర్లకొద్ది దట్టమైన కారు మబ్బులుకమ్ముకున్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా పలు గ్రామాల్లో చీకట్లు అలముకున్నాయి. ఎక్కడికక్కడ ఆగిన రైళ్లు తిరువళ్లూరు సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. అరక్కోణం నుంచి చైన్నె వైపు వస్తున్న చైన్నె మెయిల్ను ఏకాటూరు వద్ద నిలిపి వేయడంతో ప్రయాణికులు దాదాపు మూడు కిలోమీటర్ దూరం మేరకు నడక సాగించి తిరువళ్లూరు, మనవాలనగర్కు చేరుకుని బస్సు, లోకల్ రైళ్ల ద్వారా చైన్నెకు బయలుదేరారు. కాగా సేలం, తిరుపత్తూరు, మైసూరు, బెంగళూరు, తిరుపతి, తిరుత్తణి, కాట్పాడి, జోలార్పేట తదితర ప్రాంతాల నుంచి చైన్నె వైపు వచ్చిన రైళ్ళును అక్కడిక్కడే నిలిపి వేశారు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి రైలులోనే వుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాగునీరు, ఆహారం అందక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తిరువేళాంగాడు, కడంబత్తూరు తదితర ప్రాంతాల నుంచి ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా ప్రయాణికులను చైన్నెకు తరలించారు. చైన్నె నుంచి తిరువళ్లూరు మీదుగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన పదికి పైగా ఎక్స్ప్రెస్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరో పది ఎక్స్ప్రెస్ రైళ్లను ఎక్కడిక్కడే నిలిపివేవారు. ఐదు ఎక్స్ప్రెస్ రైళ్లనుదారి మళ్లించారు. కాగా తిరుత్తణి, తిరువళ్లూరు, తిరుపతి, అరక్కోణం, తిరువణ్ణామలై, కాట్పాడి తదితర ప్రాంతాల నుంచి చైన్నె వైపు వెూటఛీుఽ వందకు పైగా లోకల్ రైలు రాకపోకలను సైతం నిలిపివేశారు. తండయార్పేట నుంచి మైసూరుకు వెళ్తున్న సమయంలో ఘోరం క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు దగ్ధం 70 వేల లీటర్లు సామర్థ్యం వున్న 12 ట్యాంకర్లు అగ్నికి ఆహుతి రూ.13 కోట విలువైన 8.40 లక్షల లీటర్ల ఆయిల్ నష్టం రెళ్ల రాకపోకలు నిలిపివేత ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు దెబ్బతిన్న నాలుగు రైల్వే లైన్లు,సిగ్నల్ బోర్డు, విద్యుత్ లైన్లు ధ్వంసమైన రైల్వేట్రాక్ ప్రమాదం తీవ్రత ఎక్కువ కావడంతో ఎక్స్ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగించే ట్రాక్లు కూడా చిద్రమయ్యాయి. పట్టాలు సైతం మంటల తీవ్రతకు ముక్కలయ్యా. నాలుగు ప్రధాన లైన్లులోని విద్యుత్ లైన్లు, ట్రాక్, సిగ్నల్ బోర్డులు ద్వంసం అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అదే విధంగా ప్రమాదం జరిగిన ప్రాంతాలకు సమీపంలో వున్న నివాసాలకు సైతం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వీటి పునరుద్ధరణకు అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం: ఉదయం ఐదు గంటలకు ప్రమాదం జరగ్గా, దాదాపు పది గంటల పాటు శ్రమించిన అధికారులు సాయంత్రం మూడుగంటలకు మంటలు అదుపులోకి తెచ్చారు. మంటలు కాస్త అదుపులోకి రాగానే రైల్వే సిబ్బంది సుమారు మూడువందల మందితో సహాయక చర్యలను ప్రారంభించారు. మొదట నష్టం తక్కువగా వున్న లోకల్ రైల్వే ట్రాక్లకు విద్యుత్ పునరుద్ధరణ, పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో సరిచేయడం, సిగ్నల్ బోర్డు మరమ్మతులను ప్రారంభించారు. ఇప్పటికే రైల్వేకు చెందిన భారీ వాహనాలు, 10 ప్రోక్లెయిన్స్, జేసీబీలతో పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో వున్న మరో రెండు ట్యాంకర్లలోని క్రూడ్ ఆలయిల్ను లారీలోకి నింపే ప్రక్రియను సైతం ప్రారంభించారు. కాగా రైల్వే ఉన్నత అధికారులుసైతం అక్కడే వుంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం నాటికి రెండు లైన్లును సరి చేసి రాకపోకలను పునరుద్ధరించే అవకాశం వుంద అధికారులు వెల్లడించారు. -
మహా కుంభాభిషేకం
తిరుప్పరకుండ్రంలో నేడు తిరుప్పరకుండ్రంలో ఏర్పాటు.. (ఇన్సెట్) మీనాక్షి, సుందరేశ్వరులు ● తరలి వస్తున్న భక్తులు సాక్షి,చైన్నె: తిరుప్పరకుండ్రంలో మహాకుంభాభిషేక వేడుకకు సర్వం సిద్ధం చేశారు. ఇక్కడి వేడుక కోసం మదురై నుంచి మీనాక్షి అమ్మన్ మరియు సుందరేశ్వరర్ స్వామి వారు తిరుప్పరకుండ్రంకు బయలు దేరి వెళ్లారు. భక్తులు సైతం పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో నిఘా కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో మురుగన్కు ఉన్న ఆరుపడై వీడులలో మొదటిదిగా తిరుప్పరకుండ్రంప్రసిద్ది చెందిన విషయం తెలిసిందే. మదురై జిల్లా తిరుప్పరకుండ్రం కొండపై సుబ్రమణ్య స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో గత కొన్నేళ్ల అనంతరం మహాకుంభాభిషేకానికి హిందూ, దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. రాజగోపురంను పంచవర్ణాలతో తీర్చిదిద్దారు.జీర్ణోద్దారణ పనులు ముగియడంతో ఈనెల పదో తేది నుంచి ఇక్కడ కుంభాభిషేకానికి సంబంధించినయాగ శాల పూజలు జరుగుతూ వచ్చాయి. ఆలయం ఆవరణలో వళ్లి దేవానై మండపం ఆవరణలో యాగ శాల పూజలు భక్తి శ్రద్దలతో జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక యాగాలు, పూజలు జరిగాయి. సోమవారం వేకువ జామున మూడున్నర గంటల నుంచి ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 4.30 గంటలకు యాగశాల నుండి పవిత్ర జలాలను కలశాలలోఉంచి రాజగోపురం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. ఉదయం 5.25 గంటలకు రాజగోపురంలోని 7 కలసాలకు పవిత్ర అభిషేకాలు జరగనున్నాయి. అలాగే, ఆలయ ప్రాంగణంలోని గోవర్ధన ఆలయంలో, విమాన ప్రకారంలకు అభిషేకాలు నిర్వహించనున్నారు.సరిగ్గా 6.10 గంటలకు మురుగన్ సన్నిధిలో మహాకుంభాభిషేకం జరగనున్నది. ఈ వేడుక నిమ్తితం తమిళనాడులోని మురుగన్ భక్తులు ఆదివార ం మధ్యాహ్నం నుంచే తిరుప్పర కుండ్రం వైపుగా పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ పాలకమండలి చర్యలు తీసుకుంది. మీనాక్షి, సుందరేశ్వరుల పయనం మదురైలోని తిరుప్పరంకుండ్రంలో జరగనున్న కుంభాభిషేకాన్ని దృష్టిలో ఉంచుకుని మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర్ స్వామి ఆదివారం తమ ఆలయం నుంచి తిరుప్పరకుండ్రంకు బయలు దేరి వెళ్లారు. మదురై ఆలయంలో సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి పది గంటలకు స్వామి, అమ్మవారులు తిరుప్పరకుండ్రంకు బయలు దేరగా దారి పొడవున భక్తులు కర్పూర నీరజనాలు పలికారు. తిరుపరంకుండ్రంకు అర్ధరాత్రి చేరుకుని కుంభాభిషేకం అనంతరం మదురై ఆలయానికి స్వామి,అమ్మవార్లు తిరిగి వచ్చేందుకు సమయం పట్టనున్న దృష్ట్యా, సోమవారం మీనాక్షి అమ్మన్ ఆలయంలో భక్తులకు దర్శనంరద్దు చేశారు. తిరుప్పర కుండ్రంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ పరిసరాలు విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. -
24 నుంచి పళణి మలి విడత పర్యటన
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి మలి విడత పర్యటన రూట్ మ్యాప్, షెడ్యూల్ను ఆదివారం ప్రకటించారు. ప్రజలను, తమిళనాడును రక్షిద్దామన్న నినాదంతో ప్రజా చైతన్య యాత్రకు ఈనెల 7వ తేదీన పళణిస్వామి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రకు అనూహ్య స్పందన అన్నాడీఎంకే వర్గాల నుంచి వస్తోంది. తొలి విడత పర్యటన 23వ తేదీ వరకు అని ముందుగా ప్రకటించారు. తాజాగా మలి విడత పర్యటన షెడ్యూల్ను ప్రకటించారు. ఈ మేరకు 24వ తేదిన పుదుకోట్టై జిల్లా గందర్వ కోట్టై నుంచి మలి విడత పర్యటన ప్రారంభం కానుంది. తొలి రెండు రోజులు పుదుకోట్టై జిల్లాలోని అసెంబ్లీ నియోజక వర్గాలలో పర్యటించనున్నారు. 26వ తేదీన శివంగంగై జిల్లా, ఆతదుపరి మూడు రోజుల అనంతరం 30, 31తేదీలలో రామనాథపురం జిల్లా ఆగస్టు 1,2 తేదిలలో తూత్తుకుడి జిల్లా, 4,5,6 తేదిలలో తిరునల్వేలి, తెన్కాశి జిల్లాలో, 7,8 తేదీలలో విరుదునగర్ జిల్లాలో పర్యటన జరగనుంది. కాగా, ఆదివారం కడలూరుజిల్లాలో పళణి పర్యటన విస్తృతంగా సాగింది. -
సర్వ దర్శనానికి 24 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు ఆక్టోపస్ సర్కిల్ వరకు బారులు తీరారు. శనివారం అర్ధరాత్రి వరకు 92,221 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 42,280 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.51 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాయం కంటే ముందు వస్తే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. -
శక్తి తిరుమగన్ విడుదలకు తేదీ ఖరారు
తమిళసినిమా: విజయ్ ఆంటోనీదో సెపరేట్ రూట్ అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ నది ఒంటరి పోరు అని పేర్కొనవచ్చు చిన్న పరిశ్రమంలో ఎంతో పోరాడి సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ శాఖలో విజయం సాధించి ఆ తర్వాత కథానాయకుడుగా అవతారం ఎత్తారు అక్కడ సక్సెస్ అయ్యి ఆ తర్వాత నిర్మాతగా ఎడిటర్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఆయన కథానాయకుడు దర్శకుడు నిర్మాత ఎడిటర్ సంకేత దర్శకుడు అంటూ బహుముఖ ప్రతిభావంతుడుగా తనను తాను నిరూపించుకున్నారు. ఇటీవల విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించి, సంగీతాన్ని అందించి, నిర్మించిన చిత్రం మార్గన్. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మార్గం చిత్రాన్ని విజయవంతం చేసినందుకు గాను విజయ్ ఆంటోని కతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. ఇకపోతే ఈయన కథానాయకుడిగా నటించిన మరో చిత్రం శక్తి తిరుమగళ్. దీనికి ముందుగా పరాశక్తి అనే టైటిల్ నిర్ణయించారు అయితే ఆ టైటిల్ వేరే వారు రిజిస్టర్ చేయడంతో ఆ తర్వాత శక్తి తిరుమగన్ అనే టైటిల్ ఖరారు చేశారు. అదేవిధంగా తెలుగులోనూ రూపొందుతున్న ఈ చిత్రానికి భద్రకాళి అనే టైటిల్ నిర్ణయించారు. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై విజయ్ ఆంటోని నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే అందిస్తున్నారు. తృప్తి రవి నాయకిగా నటిస్తున్న ఇందులో వాగై చంద్రశేఖర్ సునీల్ గిరి పలని సెల్మురుగన్ కిరణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అరుణ్ ప్రభు దర్శకత్వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా ఇది విజయ్ ఆంటోని కథానాయకుడు నటిస్తున్న 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని తమిళం ,తెలుగు భాషల్లో సెప్టెంబర్ 5వ తేదీన విడుదల చేయనట్లు అధికారికంగా ప్రకటించారు. -
పెరుగుతున్న చాక్లెట్ అమ్మకాలు
షేడ్ హౌస్ నిర్మాణానికి భూమి పూజకొరుక్కుపేట: పూందమల్లి బైపాస్ బస్టాండ్ వద్ద రూ.35 కోట్లతో పెద్ద షేడ్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా పూందమల్లి నగర్లోని 20వ వార్డులోని శక్తినగర్లో రూ.16 లక్షలతో కొత్త దుకాణ భవనాన్ని నిర్మించడానికి భూమి పూజను ఎమ్మెల్యే కృష్ణసామి చేశా రు. డీఎంకే నగర కార్యదర్శి జీ.ఆర్. తిరుమల ము న్సిపాలిటీ చైర్మన్ కాంచన, వైస్ చైర్మన్ కే.శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ ఎం.శరవణ కుమార్, పారిశుధ్య అధికారి గోవిందరాజ్, డీఎంకే కార్యనిర్వా హకులు ఏ.విమల్ ఆనంద్, మాజీ పబ్లిక్ ప్రాసి క్యూటర్ రాజేంద్రన్, పి.అన్బళగన్ పాల్గొన్నారు.నీలగిరిలో పెరుగుతున్న చాక్లెట్ అమ్మకాలుకొరుక్కుపేట: నీలగిరిలోని ఒక చాక్లెట్ దుకాణం పర్యాటకులను ఆకర్షిస్తోంది. కిలోల చొప్పున అమ్ముతున్నారు. కేజీ రు.800లకే విక్రయంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. భారతదేశానికి వచ్చిన అంకోరియన్లు తమ సొంత అవసరాల కోసం తమ ఇళ్లలోనే కేక్లు, చాక్లెట్లు తయారు చేసుకోవడం ప్రారంభించారు. నేడు దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన వంటకాలు అమితంగా ఇష్టపడుతున్నారు. భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో ఇంట్లో తయారు చేసిన మాచా చాక్లెట్లు ఉదయపూర్, కొడైకెనాల్ వంటి కొన్ని కొండ ప్రాంతాల్లో మాత్రమే తయారవుతాయి. మంచి నాణ్యత గల, స్వచ్ఛమైన కోకో ఆధారిత, ఇంట్లో తయారుచేసిన చాక్లెట్లు కూడా కిలోకు రూ.800కు లభిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. -
తమిళనాడు: రైలు నుంచి ఎగిసిపడుతున్న మంటలు.. ట్రైన్స్ నిలిపివేత
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తిరువళ్లూరులో డీజిల్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అన్ని వ్యాగన్లకు మంటలు వ్యాపించాయి. దీంతో, వ్యాగన్లు నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా అప్రమత్తమైన అధికారులు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అలాగే, ట్రాక్ సమీపంలోని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు.వివరాల ప్రకారం.. అరక్కోణం నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్ రైలులో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. పెరియకుప్పం సమీపంలో గూడ్స్ రైలులో మంటలు వ్యాపించాయి. ఓడరేవు నుండి చమురుతో వెళ్తున్న గూడ్స్ రైలు కావడంలో మంటలు చెలరేగుతున్నాయి. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. రైలులో ఇంధనం ఉండటంతో మంటలు మరింత వ్యాపిస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తిరువళ్ళూరు ఎస్టీ కాలనీ, వరదరాజ నగర్కు చెందిన 300 కుటుంబాలను జిల్లా అధికారులు ఖాళీ చేయించారు. ఘటనా స్థలానికి తిరువళ్ళూరు కలెక్టర్ ప్రతాప్, ఎస్పీ శ్రీనివాస్ పెరుమాళ్, రైల్వే డీఆర్ఎం విశ్వనాథన్ చేరుకున్నారు.🚨 #Breaking: Massive fire engulfs a diesel freight train near Tiruvallur, Tamil Nadu. Several major trains from MGR Chennai Central have been canceled for today, July 13, as a safety precaution. Passengers are advised to check with @GMSRailway for updates.#TrainFire #TamilNadu… pic.twitter.com/1ipJg4q94M— Shubham Rai (@shubhamrai80) July 13, 2025ఇక, గూడ్స్ రైలుకు మొత్తం 52 ట్యాంకర్లు ఉండగా.. ఇంజన్ వైపున రెండో ట్యాంకర్ నుండి తొమ్మిదో ట్యాంకర్ వరకు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎనిమిది ట్యాంకర్లు అగ్నికి ఆహుతి కాగా.. మిగిలిన ట్యాంకర్లను అధికారులు రైలు నుంచి సురక్షితంగా తప్పించినట్టు సమాచారం. 40 ట్యాంకర్లు సురక్షితంగా ఉన్నాయి. ఒక్కో ట్యాంకర్లో 70వేల లీటర్లు క్రూడ్ ఆయిల్ ఉంది.Major fire broke out very near tiruvallur railway station! Oil trail got collapsed n breakup a major fire.. #tiruvallur #tiruvallurrailwaystation #railway #SouthernRailway @RailMinIndia @IRCTCofficial @GMSRailway @UpdatesChennai @THChennai @polimernews pic.twitter.com/YJ8G534hpc— arsath ajmal (@ajmalji) July 13, 2025 A fuel-laden railway tanker caught fire near Tiruvallur.Thick black smoke and intense flames engulfed the area, disrupting train services.Firefighters are on the scene, & officials are investigating the cause.#TrainFire #BreakingNews #ChennaiUpdates @NewIndianXpress@xpresstn pic.twitter.com/Pc3jwtJJDd— Ashwin Prasath (@ashwinacharya05) July 13, 2025 అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు పదికి పైగా అగ్నిమాపక యంత్రాలు ప్రయత్నిస్తున్నాయి. మంటల కారణంగా, అరక్కోణం మీదుగా సెంట్రల్కు వచ్చే ఎక్స్ప్రెస్ రైళ్లను వివిధ ప్రదేశాలలో నిలిపివేశారు. అదనంగా ఉదయం 5.50 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ వందే భారత్ రైలును చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ శతాబ్ది రైలును కూడా నిలిపివేశారు. తిరుపతి, వేలూరు, మైసూరు, సేలం నుంచి చెన్నైకు వెళ్ళే రైళ్లు రాకపోకలకు అంతరాయం కలిగింది. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 🚨 BREAKING: Goods train derails and catches fire near Tiruvallur railway station in Tamil Nadu. Rescue operations currently underway. 🚂🔥#TiruvallurTrainAccident #TamilNadu #TrainDerailment #RescueOperations #Breaking #IndianRailways #Emergency #SafetyFirst pic.twitter.com/NShYM4uw8K— Benefit News 24 (@BenefitNews24) July 13, 2025Southern Railway tweets, "Due to a fire incident near Tiruvallur, overhead power has been switched off as a safety measure. This has led to changes in train operations. Passengers are advised to check the latest updates before travel." pic.twitter.com/LTvTAFYNqu— ANI (@ANI) July 13, 2025 -
అనుభవజ్ఞులు లేని పార్టీ విజయం సాధించలేదు
తమిళసినిమా : అనుభవజ్ఞులు లేని ఏ సంఘం, ఏ పార్టీ అయినా విజయం సాధించలేదని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఎంపీ వెంకటేష్ రాసిన వేల్ పారి పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం స్థానిక కలైవానర్ అరంగం ఆవరణలో ఏవీ వేలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో తాను పాల్గొనానన్నారు. అదే వేడుకలు ప్రభుత్వ అధికారులు, మంత్రులు పాల్గొన్నారని.. వారంతా తను మిత్రులు లేరని పేర్కొన్నారు. ఆ వేదికపై ఓల్డ్ స్టూడెంట్స్ ను కంట్రోల్ చేయడం చాలా కష్టమని వారు తరగతల గది నుంచి బయటకు వెళ్లరని చెప్పానన్నారు. అయితే వారంతా మూల స్తంభాలు, వ్యవస్థాపకులు, అనుభవజ్ఞులు కాలేరని, వారు నిర్వహించే సంఘాలు గాని పార్టీలు కానీ విజయం సాధించలేవని అన్నానన్నారు. అయితే తాను చెప్పదలచుకున్నది వేరని , అనుభవజ్ఞులు కాకపోతే విజయం సాధించలేరు అని చెప్పలేక పోయానని అన్నారు. అయితే ఇప్పుడు అలాంటి మిస్టేక్ చేయకూడదు అని, సరిగా మాట్లాడాలని భావించానన్నారు. 1996 ప్రాంతంలో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన్ని రెండు మూడు సార్లు కలిసే అవకాశం కలిగిందన్నారు. అప్పుడు ఆయన మహారాష్ట్రలో మూడు ఎకరాల పొలం కొనుగోలు చేశానని 10 పశువులు ఉన్నాయని చాలా పుస్తకాలు కొనుగోలు చేశానని ఆ పుస్తకాలు చదువుతూ అక్కడే శేష జీవితాన్ని గడపాలన్న ఆశను వ్యక్తం చేశారన్నారు. అప్పుడు తనకు రాజకీయాల కంటే ఆయన చెప్పిన ఆ విషయం బురల్రోకి ఎక్కిందన్నారు. అప్పటినుంచి మంచి పుస్తకం లభిస్తే విశ్రాంతి సమయంలో అలాంటి ఒక ప్రాంతంలో ఆ పుస్తకాలు చదువుతూ గడపాలన్నది తన కోరిక అని చెప్పారు. దీంతో పలు పుస్తకాలను సేకరిస్తున్నట్లు చెప్పారు కలలు ఏ రూపంలో ఉన్న వాటిని ఆస్వాదించడానికి తమిళ ప్రజలు జాతి, మతం, భాషా భేదాలను చూడరన్నారు. హ్యాట్సాఫ్ నీ కాళ్లకు నమస్కరిస్తున్నాను అని నటుడు రజినీకాంత్ పేర్కొన్నారు. -
ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమి పూజ
పళ్లిపట్టు: పళ్లిపట్టులోని ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వసతులు కల్పించే విధంగా రూ.1.75 కోట్లతో అదనపు భవన నిర్మాణ పనులను భూమిపూజతో ఎమ్మెల్యే చంద్రన్ శనివారం ప్రారంభించారు. పళ్లిపట్టు శివారులోని కోనేటంపేటలో పళ్లిపట్టు ప్రభుత్వాస్పత్రి వుంది. ఆస్పత్రిలో వసతులు మెరుగుపరిచే విధంగా ఆరోగ్యశాఖ నిధుల నుంచి రూ.1.75 కోట్లతో ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆస్పత్రి అదనపు భవనం నిర్మాణ పనులకు తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ భూమి పూజ చేశారు. ఇందులో ప్రజాపనుల శాఖ ఈఈ దేవన్, ఎస్టీఓ మురళి, మండల డీఎంకే కార్యదర్శి శ్రీనివాసన్, పట్టణ కార్యదర్శి సెంథిల్కుమార్, పట్టణ చైర్పర్సన్ మణిమేగళై, ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నిర్మాణ పనులు ప్రారంభించిన సమయంలో చికిత్స పొందేందుకు ఆస్పత్రికి వచ్చిన మహిళలు ఆస్పత్రిలో అదనపు వైద్యులు నియమించి 24 గంటల పాటు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే చంద్రన్ ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి వైద్యులు, వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
బూత్ ఏజెంట్లే విజయంలో కీలకం
పళ్లిపట్టు: అన్నాడీఎంకే విజయంలో బూత్ ఏజెంట్లే కీలకమని ఎన్నికల వేళ అప్రమత్తంగా వ్యవహరించి ఓటరు జాబితాలో అవకతవకలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి బీవీ రమణ అన్నారు. పళ్లిపట్టు, ఆర్కేపేట, తిరుత్తణి మండలాల్లో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో బూత్ ఏజెంట్ల సమావేశం శనివారం నిర్వహించారు. పళ్లిపట్టు మండల అన్నాడీఎంకే ఆధ్వర్యంలో నిర్వహిహించిన బీఎల్ఓల సమావేశానికి మండల కార్యదర్శి టీడీ శ్రీనివాసన్ అధ్యక్షత వహించారు. ఇందులో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, మాజీ మంత్రి బీవీ రమణ, మాజీ ఎంపీ, ఆ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి తిరుత్తణి హరి, జిల్లా ఎన్నికల పరిశీలకులు విజయకుమార్ పాల్గొని బీఎల్ఓలకు ఓటరు జాబితాతో పాటు నూతన ఫారాలు, ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్లు చేర్పునకు సంబంధించి అవగాహన కల్పించారు. ఆవిన్ మాజీ చైర్పర్సన్ వేలంజేరి కవిచంద్రన్, పొదటూరుపేట టౌన్ చైర్మన్ రవిచంద్రన్, పళ్లిపట్టు పట్టణ కార్యదర్శి జయవేలు, నేతలు శాంతిప్రియ, కృష్ణమ నాయుడు, చంద్రబాబు పాల్గొన్నారు. -
రుణాల పంపిణీలో అవకతవకలు
తిరుత్తణి: బ్యాంకు రుణాల పంపిణీలో అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్లో రైతు సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కణిమొళి ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ స్థాయి అగ్రీ గ్రీవెన్స్ నిర్వహించారు. డివిజన్ వ్యాప్తంగా నుంచి రైతులు పాల్గొన్నారు. రైతులు సమస్యల పరిష్కారం కోసం వినతులు అందజేశారు. సమావేశంలో రైతు సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్రాజు మాట్లాడుతూ నొచ్చిలిలోని ఇండియన్ బ్యాంకులో అర్హులైన రైతులకు, వ్యాపారులకు బ్యాంకు రుణాలు పంపిణీ చేయకుండా కమీషన్ల కోసం బ్యాంకు అధికారులు కుమ్మకై ఇతర ప్రాంతాలకు చెందిన వారికి రూ.7కోట్ల రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. దీంతో బ్యాంకు నష్టాల్లో కూరుకుపోయిందని, రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు నష్టాల్లో వున్నట్లు తెలిపారు. అవకతవకలకు పాల్పడిన బ్యాంకు అధికారులు, ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
సీఎస్బీఎస్ ఒప్పందం కీలకం
తిరువళ్లూరు: టీసీఎస్తో ప్రత్యూష కళాశాల కుదుర్చుకున్న కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఒప్పందం ద్వారా భవిషత్తులో నైపుణ్యవంతమైన ఇంజినీర్లను తయారు చేయడానికి ఉపయోగపడుతుందని టీసీఎస్ అకడమిక్ హెడ్ సుశీంద్రన్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా అరణ్వాయల్కుప్పంలోని ప్రత్యూష్ కళాశాల సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్తో కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్పై కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సంబంధిత ఒప్పందంపై టీసీఎస్ అకడమిక్ హెడ్ సుశీంద్రన్, ప్రత్యూష్ కళాశాల చైర్మన్ రాజారావ్ పరస్పర అంగీకారంతో సంతకం చేశారు. చైర్మన్ రాజారావ్ మాట్లాడుతూ పరస్పర సహకారంతో విద్యారంగం, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడానికి సీఎస్బీఎస్ విధానం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ప్రిన్సిపల్ కుమార్ మాట్లాడుతూ పరిశ్రమల నిఫుణుల నుంచి మార్గదర్శకత్వం, ఆచరణాత్మక శిక్షణ, ప్రముఖ సంస్థలో ఉద్యోగ అవకాశాలు పొందడానికి సీఎస్బీస్ విధానం ఉపయోగపడుతుందన్నారు. ప్లేస్మెంట్ డైరెక్టర్ హైమావతి పాల్గొన్నారు. -
క్లుప్తంగా
చైన్నె వైద్యుడి నుంచి రూ.2.90 కోట్లు దోచుకున్న ముఠా – సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు కొరుక్కుపేట: ముంబై సైబర్ క్రైమ్పోలీసు అధికారులుగా నటిస్తూ చైన్నెలో ఓ వైద్యుడినుంచి రూ.2.9 కోట్లు దోపిడీ చేసిన ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు సోదిస్తున్నారు. వివరాలు.. ముంబాయ్ సైబర్ క్రైమ్ పోలీసు డివిజన్ నుంచి వచ్చినట్టు చెప్పుకుని ఓ రహస్య ముఠా చైన్నె కు చెందిన ఒక వైద్యుడిని సంప్రదించారు. కేసు పెడతామని బెదిరించి వారి నుంచి రూ.2.90 కోట్లు లాగేసుకున్నారు. అంతలోనే మోస పోయానని గ్రహించిన వైద్యుడు జరిగిన దాని ని అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తోంది. విద్యార్థినులకు లైంగిక వేధింపులు – ప్రభుత్వ టీచర్ అరెస్ట్ తిరువొత్తియూరు: ఓమలూరు సమీపంలో ఐదుగురు విద్యార్థినుల వద్ద అసభ్యంగా ప్రవర్తించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సేలం జిల్లాలోని ఓమలూరు సమీపంలోని కడైయంపట్టి గ్రామంలోని పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్లో 4 ,5 తరగతులు చదువుతున్న ఐదుగురు విద్యార్థినులపై తరగతి ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు అందింది. విద్యార్థుల ఫిర్యాదుపై ప్రధానోపాధ్యాయుడు దర్యాప్తు నిర్వహించారు. ఆ ఉపాధ్యాయుడు 9, 10 సంవత్సరాల బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడని తెలిసింది. దీని తరువాత, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఓమలూరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ శశికళ నేతృత్వంలోని పోలీసులు దర్యాప్తు నిర్వహించి, విద్యార్థులను వేధించిన తిరునెల్వేలిలోని వడక్కన్ పట్టికి చెందిన పాఠశాల ఉపాధ్యాయుడు తంగవేల్ (43)పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం ఆ టీచర్ తంగవేలు అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. వృద్ధురాలిని గొంతు కోసి చంపి.. – 5 సవర్ల నగలు చోరీ అన్నానగర్: తిరుచ్చి జిల్లా, మనప్పారై, వైయంపట్టి యూనియన్, పెరియకులంపట్టి గ్రామానికి చెందిన, కులందై థెరెసు (65). ఈమె కుమారుడు సౌరిముత్తు తిరుచ్చిలో, కుమార్తె జెబామాలైమెరి సమీపంలోని ముగవనూర్ లో నివసిస్తున్నారు. దీని కారణంగా, కులందై థెరసు ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈమె 100 రోజుల పనికి, కూలీ పనికి వెళ్లేది. ఈమె సాధారణంగా రాత్రిపూట ప్రాంగణంలో, తలుపు వద్ద తాడు మంచం మీద పడుకుంటుంది. శుక్రవారం రాత్రి ఆమె ప్రాంగణంలో ఓ మంచం మీద పడుకుంది. శనివారం ఉదయం ఈమె శరీరం నుంచి రక్తం కారుతున్నట్లు చూసిన స్థానికులు సమీపంలోకి వెళ్లి చూడగా గొంతు కోసి పడి ఉన్న కులందై థెరసును చూశారు. ఆమె ధరించిన 5 సవర్ల నగలు కనిపించలేదు. దీంతో దిగ్భ్రాంతి చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కులందై థెరసు మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. విచారణ లో వద్దురాలిని గొంతు కోసీ హత్య చేసి 5 సవర్ల నగలు చోరీ చేసుకుని పరారైనట్లు తెలిసింది. అనంతరం కేసు నమోదు చేసిన పోలిసులు, హంతకుడిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. హత్య కేసులో నలుగురి అరెస్ట్ తిరువొత్తియూరు: మద్యం మత్తులో ఏర్పడిన గొడవలో స్నేహితుడి తలపై బండరాయి వేసి హత్య చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దిండిగల్ జిల్లా వత్తులగుండు మదురై వెళ్లే మెయిన్ రోడ్లో ఆర్టీఓ కార్యాలయం వద్ద శనివారం ఉదయం ఐదుగురు మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో ఐదుగురిలో నలుగురు కలిసి ఒకరి గొంతు నులిమి తలపై రాయి వేసి హత్య చేసి పారిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణలో హత్యకు గురైన వ్యక్తి మదురై జైహింద్పురానికి చెందిన రౌడీ శివమణి తెలిసింది. హత్య చేసిన ఇతని స్నేహితులు మణికంఠన్, అరుల్మణి, సూర్య మునస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ పేరుతో మోసం –యువకుడి అరెస్ట్ తిరుత్తణి: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్న యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. తిరుత్తణికి చెందిన యువతి డిగ్రీ చదివి ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. యువతి, తెక్కళూరు దళితవాడకు చెందిన ఇన్బరాజ్(27) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతి సంపాదించిన డబ్బును ఇన్బరాజ్ తీసుకున్నాడు. ఈక్రమంలో వారం రోజుల క్రితం మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రేమ పేరుతో మోసం చేసిన ఇన్బరాజ్పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు తిరుత్తణి మహిళా పోలీస్స్టేషన్ సీఐ మలర్ ఇన్బరాజ్ను అరెస్టు చేశారు. -
ఉమ్మడి విన్యాసాలు
జపాన్ కోస్టుగార్డు నౌక ఇట్సుకుషిమ చైన్నెకు వచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ కోస్టుగార్డు, జపాన్ కోస్టుగార్డు సంయుక్తంగా ఇండో – పసిఫిక్ ప్రాంతంలో బలాన్ని మరింత చాటే విధంగా విన్యాసాలను ఆదివారం ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉమ్మడి ఆపరేషన్ వంటి అంశాలను ప్రదర్శించారు. జపాన్ నౌకలోని కెప్టన్నవోకి మిజోగుచి నేతృత్వంలోని 50 మంది బృందం, భారత కోస్టుగార్డు తూర్పు రీజియన్ ఇన్స్పెక్టర్ జనరల్ దత్వీందర్ సింగ్ సైని నేతృత్వంలో భారత బృందం ఈ విన్యాసాలను సాగరంలో అదరగొట్టారు. పరస్పర సహకారం ఒప్పందాలు ఈ సందర్భంగా జరిగాయి. – సాక్షి, చైన్నె -
● 42 కుటుంబాల దత్తత
వినాయక మిషన్ లా స్కూల్లో శనివారం లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలకు శ్రీకారం చుట్టారు. న్యాయ విద్యార్థులు, సాధారణ ప్రజలతో ఈసందర్భంగా ఓపెన్ డే కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 42 ఇరుళర్ తెగ కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా విధాన కమిటీ చైర్మన్ డి మురుగేషన్, వీఎంఎల్ఎస్ ఉపాధ్యక్షులు డాక్టర్ అనురాధా గణేశన్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సురేష్ శామ్యూల్, జిందాల్ గ్లోబల్ లా స్కూల్కు చెందిన ఏ ప్రాన్సీస్ జూలియాన్, వీఎంఆర్ఎఫ్ ఛాన్స లర్ డాక్టర్ ఏ ఎస్ గణేశన్, డీన్ అనంత్ పద్మనాభవన్, న్యాయ నిపుణులు అంబిలిమీనన్, ఇన్బ విజ యన్ వీరరాఘవన్, డాక్టర్ అనంత్ పద్మనాభన్, ఆంటోనీ జూలియన్లు హాజరయ్యారు. – సాక్షి, చైన్నె -
సూర్య విజయ్సేతుపతికి మంచి భవిష్యత్తు
తమిళసినిమా: ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకుడుగా అవతారం ఎత్తి తెరకెక్కించిన చిత్రం ఫినిక్స్. ఆయన భార్య రాజ్యలక్ష్మి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ద్వారా విజయ్సేతుపతి వారసుడు సూర్య విజయ్సేతుపతి కథానాయకుడిగా పరిచయమయ్యారు. శ్యామ్ సి ఎస్ సంగీతాన్ని వేల్రాజ్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఈనెల 4వ తేదీన విడుదలై ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ శుక్రవారం థ్యాంక్స్ గివింగ్ సమావేశాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. సూర్య విజయ్సేతుపతి మాట్లాడుతూ ఫినిక్స్ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అన్నారు. చిత్రం చూసిన తర్వాత చాలామంది అభినందించారని, మాస్టర్ అనల్అరసు తనను హీరోగా ఎంపిక చేసి ఉండకపోతే తాను ఈ వేదికపై ఉండేవాడిని కాదని అన్నారు. నిర్మాత తనకు పూర్తిగా మద్దతుగా నిలిచారన్నారు. అదేవిధంగా ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ తనకు సహకరించారని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ తాను దర్శకుడు అవ్వాలని నిర్ణయించుకున్నానని, అందుకు భార్య రాజ్యలక్ష్మి మద్దతుగా నిలిచినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఫినిక్స్ చిత్రానికి చాయాగ్రాహకుడు వేల్ రాజ్, సంగీత దర్శకుడు శ్యామత సీఎస్ మూలస్తంభాలు అని పేర్కొన్నారు. ఎడిటర్ రూబెన్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని తెలిపారు. ఈ చిత్ర విజయం తనతో పాటు ఇందులో పనిచేసిన అందరికీ చెందుతుందన్నారు. సూర్య విజయ్సేతుపతికి మంచి భవిష్యత్తు ఉందని దర్శకుడు అనల్ అరసు అన్నారు. ఫినిక్స్ చిత్ర యూనిట్ -
డీఎంకేలో వార్ రూం!
సాక్షి, చైన్నె: ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టే విధంగా డీఎంకే నేతృత్వంలో వార్ రూమ్(కంట్రోల్) ఏర్పాటైంది. అన్నా అరివాలయంలో ఏర్పాటు చేసిన ఈ వార్ రూమ్ నుంచి సభ్యత్వ నమోదు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమగ్ర వ్యవహారాలను శనివారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పరిశీలించారు. వివరాలు.. 2026లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలకు డీఎంకే పదును పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒకే జట్టుగా తమిళనాడు నినాదంతో ప్రజల్ని ఏకం చేసే విధంగా 45 రోజుల ప్రచార పర్యటన, సభ్యత్వ నమోదుకు ఈనెల ఒకటో తేది నుంచి శర వేగంగా జరుగుతోంది. పది రోజులలో సుమారు 75 లక్షల మంది కొత్త సభ్యులు చేరినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే, ఇంటింటా ప్రభుత్వ పథకాలను విస్తృతం చేసే దిశగా స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగారు. మీ తో స్టాలిన్ నినాదంతో ఈనెల 15 నుంచి అధికారిక వేడుకగా ప్రభుత్వ సంబంధిత సేవలను త్వరితగతిన పొందేందుకు వీలుగా శిబిరాల ఏర్పాటుకు కార్యచరణ సిద్ధం చేశారు. ఇక, ఇప్పటికే సోదరా కదిలిరా నినాదంతో నియోజకవర్గాల వారీగా నేతలతో స్టాలిన్ సమావేశం అవుతూ వస్తున్నారు. శనివారం దిండుగల్, వేడచందూరు, వేపన హల్లి నియోజకవర్గాల నేతలతో వన్ టూ వన్గా వేర్వేరుగా నేతలతో స్టాలిన్ సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాలలో పరిస్థితులను అధ్యయనం చేసి నేతలకు పలు సూచనలు ఇచ్చి పంపించారు. అలాగే, తరచూ డివిజన్ల వారీగా నియమించిన ఇన్చార్జ్లు, పార్టీ 78 జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నేతలతో స్టాలిన్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో ఎన్నికలకు సంబంధించిన అన్ని వ్యవహారాల గురించి చర్చించడం,నిర్ణయం తీసుకోవడంతో పాటుగా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా తనకు వచ్చే వివరాలను పరిశీలించడం, సభ్యత్వ నమోదు తదితర ప్రక్రియల మీద దృష్టి పెడుతూ ప్రత్యేకంగా వార్రూమ్ను ఏర్పాటు చేయించారు. పరిశీలించిన స్టాలిన్ 3 నియోజకవర్గ నేతలతో భేటీ తిరుచ్చి శివాకు బాధ్యతలు అన్నా అరివాలయంలో ఏర్పాటు చేసిన ఈ వార్ రూమ్ను శనివారం స్టాలిన్ పరిశీలించారు. ఇక్కడి ఏర్పాట్లను గురించి మంత్రి టీఆర్బీ రాజ , సీనియర్ నేత ఆర్ఎస్ భారతీ స్టాలిన్కు వివరించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు వివరాల శాతం గురించి, ఇతర సమాచారాల గురించి నియోజకవర్గాల వారీగా స్టాలిన్ పరిశీలించారు. ముందుగా సీనియర్ నేత పొన్ముడిని తొలగించడంతో ఆయన స్థానంలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పార్టీ కార్యాలయంలోని ఛాంబర్లో కేటాయించిన సీటులో స్టాలిన్ కూర్చోబెట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్, ఆర్ఎస్ భారతీ, టీకేఎస్ ఇలంగోవన్, పూచ్చి మురుగన్ వంటి నేతలు ఈసందర్భంగా శివకు శుభాకాంక్షలు తెలియజేశారు. -
నిఘా నీడలో గ్రూప్– 4 పరీక్ష
● 3,935 పోస్టులకు 13.89 లక్షల మంది హాజరు ● పలుచోట్ల అభ్యర్థుల ఆగ్రహం సాక్షి, చైన్నె: వీఏఓ, జూనియర్ అసిస్టెంట్తో సహా పలు పోస్టుల భర్తీ నిమిత్తం శనివారం నిఘా నీడలో గ్రూప్ 4 పరీక్షల జరిగింది. 3,935 పోస్టులకు గాను 13.89 లక్షల మంది పరీక్షకు హజరయ్యారు. అనేక చోట్ల కాస్త ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించక పోవడంతో అక్కడి భద్రతా సిబ్బందితో వాగ్వివాదం తప్పలేద. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 4 పోస్టుల్లో 3,935 ఖాళీల భర్తీకి ఇటీవల 25న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో గ్రామ పరిపాలనా అధికారి వీఏఓ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 1,621, జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ 239, టైపిస్ట్ 1,099, షార్ట్హ్యాండ్ టైపిస్ట్ (గ్రేడ్ 3) 368, అసిస్టెంట్ కన్సర్వేటర్ 519, తదితర పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణతను విద్యార్హతగా నిర్ణయించినా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13 లక్షల 89 వేల 738 మందిని పరీక్షకు అర్హులుగా ఎంపిక చేశారు. వీరిలో 5,26,553 మంది పురుషులు,8,63,688 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 354 ప్రాంతాలలో 4,922 పరీక్ష వేదికలను ఎంపిక చేశారు. 20 మంది అభ్యర్థికి ఒక ఇన్విజిలేటర్ను నియమించారు. అన్ని వ్యవహారాలను వీడియో రికార్డు చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. కట్టుదిట్టంగా ఆంక్షలు.. ఆదివారం రాత పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరిగింది. ఈ పరీక్ష నిమిత్తం ఆయా సెంటర్ల వద్దకు ఉదయాన్నే ఏడు గంటలకే అభ్యర్థులు చేరుకున్నారు. 8.30 గంటల నుంచి క్షుణ్ణంగా తనీఖల అనంతరం అనుమతించారు. కట్టుదిట్టమైన ఆంక్షలు, భద్రతనడుమ లోనికి పంపించారు. కాపీయింగ్కు ఆస్కారం ఇవ్వకుండా పరీక్షల ప్రక్రియ నిఘా నీడలో జరిగింది. కొన్ని నిమిషాల పాటుగా ఆలస్యంగా వచ్చిన ఏ ఒక్కర్నీ లోనికి అనుమతించ లేదు. అనేక సెంటర్లలో నలుగురైదుగురు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చి అధికారులను వేడుకున్నా ఫలితం శూన్యం. ఎవర్నీ లోనికి అనమతించ లేదు. దీంతో తీవ్ర నిరాశతో కొందరు హాల్ టికెట్లను అక్కడే చించి పడేసి వెళ్లి పోయారు.మరి కొందరు కాళ్లా లేవలా పడ్డా అధికారులు అంగీకరించ లేదు. తమకు కేటాయించిన సమయం వరకు అనుమతించామని, తాము ఏమి చేయలేమంటూ కొందరు అధికారులు అభ్యర్థులను బుజ్జగించి వెనక్కి పంపించేశారు. చైన్నెలో అయితే, 310 సెంటర్లలో పరీక్ష జరిగింది. ఈ పరీక్షలను పలు సెంటర్లలో టీఎన్పీఎస్సీ చైర్మన్ ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫలితాలను మూడు నెలల్లో వెల్లడిస్తామన్నారు. 13.89 లక్షల మంది పరీక్షలకు హాజరైనట్టుగా అంచనా వేస్తున్నామన్నారు. -
కొత్త ఉద్యోగులకు రూ.15 వేలు ప్రోత్సాహం
– పీఎఫ్ జోన్ కమిషనర్ దేబీ ప్రసాద్ భట్టాచార్య కొరుక్కుపేట: కొత్త ఉద్యోగులకు రూ.15వేలు ప్రోత్సాహం అందిస్తున్నట్టు చైన్నె నార్త్ జోన్ ప్రాడిడెంట్ ఫండ్ కమీషనర్ దేబీ ప్రసాద్ భట్టాచార్య ప్రకటించారు . దీనిని సంబంధించి ఒక ప్రకటనలో పేర్కొంటూ.. కేంద్రమంత్రివర్గం ఇటీవల ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించిందని.. దీని ద్వారా 3.5 కోట్లమంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.99.45 కోట్లు కేటాయించింది. ఈ పథకం ఆగస్టు 1 నుంచి జూలై 31, 2027 వరకు సృష్టించబడిన ఉపాధి అవకాశాలకు వర్తిస్తుందన్నారు. ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్లో నమోదు చేసుకున్న ఉద్యోగులకు రెండు విడతలుగా రూ.15 వేలు వరకు ప్రోత్సాహకం ఇస్తుందని వెల్లడించారు. ఈ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారన్నారు. చైన్నెలో 11 స్క్వాయర్ ప్రారంభం సాక్షి,చైన్నె : చైన్నె వళ్లువర్ కోట్టం హైరోడ్డులో విలేజ్ స్క్వాయర్ భవనంలో కొత్తగా 11 స్క్వాయర్ శాఖను ప్రారంభించినట్టు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు ప్రారంభో త్సవం సందర్భంగా లోగోను ఆవిష్కరించారు. ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నగర వాసులను ఆహ్లాద పరిచేరీతిలో ఈ 11 స్క్వాయర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో పసందైన భోజనంతోపాటు క్యూరేటెడ్ సంగీతం , స్టైలిష్ వాతావరణంతో మిళితం చేసి కొత్త అనుభూతులను కల్పించనున్నామన్నారు. ప్రతీ వారం డిజే నైట్స్ తోపాటుగా ఎల్లప్పుడూ ఏదో ఒక కొత్తదనం కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపారు . ప్రముఖ గాయనీ గాయకులను సైతం ఆహ్వానించి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తేని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి మృతి – బంధువులు రోడ్డు దిగ్బంధం అన్నానగర్: తేని జిల్లా పూదిప్పురం సమీపంలోని వాలైయతు పట్టి గ్రామానికి చెందిన కార్తీక్ భార్య గర్భిణి జయలక్ష్మి(23). ఆమెను జూలై 9వ తేదీన ప్రసవం కోసం తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత ఆమెకు చికిత్స అందించారు. జూలై 10న సిజేరియన్ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శస్త్రచికిత్స కారణంగా గర్భాశయం నుంచి రక్తస్రావం ఆగకపోవడంతో గర్భాశయాన్ని తొలగించినట్లు తెలుస్తుంది. ఈ స్థితిలో రక్తస్రావం కొనసాగుతోందని జయలక్ష్మి ప్రాణాలకు ప్రమాదం ఉందని పేర్కొంటూ, సరైన చికిత్సను అందించలాని డిమాండ్ చేస్తు శుక్రవారం సాయంత్రం తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి ముందు జాతీయ రహదారిపై అనారోగ్యంతో ఉన్న మహిళ బంధువులు కూర్చుని రోడ్డును దిగ్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న ఆండిపట్టి డీఎస్పీ శివసుప్పు నేతత్వంలోని పోలీసులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. రోడ్డు దిగ్బంధం కారణంగా దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జయలక్ష్మి చికిత్స ఫలించక మృతి చెందింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా మెడికల్ కాలేజీ వద్ద పోలీసులను మోహరించి భద్రతా పనిలో నిమగ్నమై ఉన్నారు. 18 మంది బాలికలకు లైంగిక వేధింపులు – అనాథ శరణాలయం యజమాని సహా ముగ్గురి అరెస్ట్ తిరువొత్తియూరు: ఓ ఆశ్రయంలో 18 మంది బాలికలను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో యజమాని సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివరాలు.. వండలూర్ సమీపంలోని ఉనమంచెరి ప్రాంతంలో ఓ ప్రైవేట్ అనాథ శరణాలయం నడుస్తోంది. ఈ అనాథ శరణాలయంలో 30 మందికి పైగా బాలికలు నివసిస్తున్నారు. వారందరూ ఒకే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ క్రమంలో అనాథ శరణాలయంలోని బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్టు చిన్నారులు భద్రత సంక్షేమ శాఖ అధికారులకు రహస్య సమాచారం అందించారు. దీంతో వండలూర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. దీని ఆధారంగా, శరణాలయ యజమాని అరుల్ దాస్, షెల్టర్ సభ్యురాలు ప్రియ, శరణాలయ డ్రైవర్ పళనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేశారు. బాలికలను లైంగికంగా వేధించిన విషయంపై వారి వద్ద దర్యాప్తు చేస్తున్నారు. ఈ శరణాలయం 15 సంవత్సరాలు గా నడుస్తోందని, పళని గత 3 నెలలకు ముందు పనిలో చేరి నట్లు తెలిసింది ఈ ఘటన ఉనమంజేరి ప్రాంతంలో సంచలనం సృష్టించింది. -
జాన్ కుమార్కు మంత్రి పదవి
● 14న ప్రమాణ స్వీకారం సాక్షి, చైన్నె: పుదుచ్చేరి ఎన్. రంగస్వామి కెబినెట్లోకి కొత్త మంత్రిగా జాన్కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే, బీజేపీకి చెందిన మరో ముగ్గురునేతలకు నామినేటెడ్ ఎమ్మెల్యేల పోస్టులు దక్కాయి. వివరాలు.. 2021లో ఎన్ఆర్ కాంగ్రెస్తో కలిసి ఎన్నికలలోకి వెళ్లిన బీజేపీ బ్రహ్మాండ విజయాన్ని దక్కించుకుంది. బీజేపీ – ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి సీఎంగా ఉన్నారు. అధికారంలో బీజేపీ భాగస్వామ్యంగా ఉంది. అయితే, గత నెల రోజులుగా పుదుచ్చేరి బీజేపీలో అనూహ్యమార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీలోని పార్టీ అధినేతల నుంచి వచ్చిన సమాచారంతో తొలుత ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. క్షణాలలో వీరి రాజీనామాను స్పీకర్ ఎన్బలం సెల్వం ఆమోదించారు. మరుసటి రోజే మంత్రి పదవికి బీజేపీ ఎ మ్మెల్యే సాయి శరవణ కుమార్ రాజీనామా చేశారు. అదే సమయంలో బీజేపీ కొత్త అధ్యక్షుడిగా వీపీ రామలింగం ఎంపికయ్యారు. బీజేపీలో సాగిన పరిణామాలు సీఎం రంగస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి కొత్త సమస్యగా మారింది. మరో ముగ్గురికి నామినేటెడ్ పోస్టులు బీజేపీలో ఆది నుంచి అసంతృప్తి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ వచ్చిన జాన్కుమార్కు ప్రస్తుతం మంత్రి పదవి దక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో పదినెలలు సమయం ఉన్న నేపథ్యంలో తాజాగా జాన్కుమార్కు మంత్రి పదవి కట్టబెట్టారు. అదే సమయంలో పార్టీకి చెందిన ముగ్గురు నేతలైన దీపయన్, సెల్వం, రాజశేఖర్లకు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులు కట్ట టెట్టారు. కేంద్ర హోం శాఖ ఆమోదం నేపథ్యంలో కొత్త మంత్రి, నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఈ నెల 14వ తేదీన రాజ్ నివాస్లో ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నట్టు పుదుచ్చేరి నుంచి సమాచారాలు అందుతున్నాయి. -
రాందాసు సామాజిక మాధ్యమాలు హ్యాక్
● డీజీపీకి ఫిర్యాదు ● పార్టీకి నేనే భవిష్యత్తు అని వ్యాఖ్య సాక్షి, చైన్నె: పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు సామాజిక మాధ్యమ ఖాతాలను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. దీనిపై ఆన్లైన్ ద్వారా డీజీపీకి ఆయన తరపున శనివారం ఫిర్యాదు చేశారు. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య సాగుతూ వచ్చిన సమరం ప్రస్తుతం డిజిటల్ వార్కు పరిస్థితులు కల్పించి ఉన్నాయి. తన నివాసంలో ట్యాపింగ్ పరికరం వెలుగు చూసినట్టుగా రాందాసు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే తన సోషల్ మీడియా ఖాతాలన్నీ హ్యాక్ చేసినట్టు రాందాసు ప్రకటించారు.దీనిని హ్యాక్ చేసిన వారిని గుర్తించిచర్యలు తీసుకోవాలని రాందాసు డిమాండ్ చేశారు. అలాగే, డీజీపీ కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇది ఓ వైపు ఉంటే, మరో వైపు కేడర్కు రాందాసు లేఖ రాశారు. పీఎంకేకు భవిష్యత్తు తానే అని స్పష్టం చేశారు. పీఎంకే రాజకీయ వ్యూహాలకు పదును పెట్టానని, మరింత దూకుడుగా ముందుకెళ్తామని సూచించారు. 40 స్థానాలలో అభ్యర్థుల గెలుపు దిశగా ఉరకలు తీద్దామని కేడర్కు లేఖ రాశారు. ఇదిలా ఉండగా, రాందాసు నివాసంలో లండన్లోని కొనుగోలు చేసినట్టుగా పేర్కొన్న ట్యాపింగ్ పరికరం గురించి విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్బుమణి డిమాండ్ చేశారు. -
ఎప్పటికీ చెరగని పేరు నాగేష్
ఉరుట్టు ఉరుట్టు ఆడియోను ఆవిష్కరించిన ఆర్వీ ఉదయకుమార్, విక్రమన్, కస్తూరిరాజా, యూనిట్ సభ్యులు తమిళసినిమా: తమిళ చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ మరువని శాశ్వత పేరు నగేష్. నా కుమారుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన కాదల్ కొండేన్ చిత్రంలో నాగేష్ నటించారు. ఆయన గురించి మాట్లాడకుండా ఏ సినిమా మీడియా ఉండలేదు. అన్ని విజయాలు సాధించిన నటుడు నాగేష్. అలాంటి తండ్రి బాధకు ఉపశమనం కలిగించేది గజేష్ నాగేష్. నువ్వు కథానాయకుడిగా నటించిన ఉరుట్టు ఉరుట్టు చిత్రం మంచి విజయాన్ని సాధించాలి. చిత్తం నిర్మాతకు నా అభినందనలు అని సీనియర్ దర్శకుడు ధనుష్, దర్శకుడు సెల్వరాఘవన్ తండ్రి అయిన కస్తూరిరాజా ఉరుట్టు ఉరుట్టు చిత్ర ఆడియో ఆవిష్కరణ వేడుకలో అన్నారు. జై స్టూడియో క్రియేషన్న్స్ పతాకంపై సాయి కావ్య, సాయి కై లాష్ సమర్పణలో పద్మరాజు జయశంకర్ నిర్మించిన చిత్రం ఉరుట్టు ఉరుట్టు. భాస్కర్ సదాశివం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గజేష్ నాగేష్ కథానాయకుడిగా నటించారు. నటి రిత్విక శ్రేయ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి యువరాజ్ బాలరాజ్ చాయాగ్రహణం, అరుణగిరి సంగీతాన్ని, కార్తీక్ కృష్ణన్ నేపథ్య సంగీతాన్ని అందించారు. త్వరలో ఈచిత్రం తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. ఆనందబాబు మాట్లాడుతూ తనను ఆదరించినట్లుగానే తన కుమారుడిని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. -
ఘనంగా నాబార్డ్ 44వ వ్యవస్థాపక దినోత్సవం
కొరుక్కుపేట: నేషల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం రాత్రి చైన్నె వేదికగా ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను భారత ప్రభుత్వ ఫైనాన్సియల్ సర్వీసెస్ విభాగం సెక్రటరీ ఎం నాగరాజు , తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎన్ . మురునందం, నాబార్డ్ ఛైర్మెన్ శ్రీషాజీ కెవి ,నాబార్డ్ డిఫ్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఏకే సూద్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు ఎండీలు, నాబార్డ్ సీనియర్ అధికారులు ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ముందుగా నాబార్డు 44 సంవత్సరాల ప్రయాణంలో గ్రామీణ పరివర్తన పట్ల అచంచలమైన నిబద్దతో పనిచేస్తుందన్నారు. ఆర్థిక, మౌలిక సదుపాయాలను అందుబాటలోకి తీసుకురావటం నుంచి ఆవిష్కరణ, స్థితిస్థాపకతలను పెంపొందించడం వరకు లక్షలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. భారతదేశం సమ్మిళిత వృద్ది వైపు వేగంగా అడుగులు వేయటంతోపాటూ డిజిటల్ పరివర్తన, గ్రామీణ సంస్థలకు మద్దతు, అట్టడుగు స్థాయి వారిని ప్రోత్సహించడంలో నాబార్డ్ కృషి ఎనలేదనిదని ఈసందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం అతిథిగా పాల్గొన్న ఎం. నాగరాజు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలకు పైగా నాబార్డ్ భారతదేశ గ్రామీణాభివృద్ధ్ది వ్యూహానికి మూలస్తంభంగా పనిచేసిందని కొనియాడారు. తమిళనాడులో నాబార్డ్ సహకారాలను తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం కొనియాడుతూ గ్రామీణ జీవనోపాధిని పెంపొందించటంలో నాబార్డ్ కీలక పాత్రపోసించిందని అని ప్రసంశించారు. సరిహద్దు ఔట్రీచ్ను బలోపేతం చేయడానికి న్యూ సబ్ – ఆఫీస్ ఇన్ లెఫ్, గ్రిప్ ప్రోగ్రామ్, రూరల్ టెక్ కోల్యాబ్, నివారన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. -
క్లుప్తంగా
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ● అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశం కొరుక్కుపేట: తంజావూరు సమీపంలో చెరువులో మునిగి మృతిచెందిన పిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో తంజావూరు జిల్లా పూతలూరు తాలూకాలోని మరుదగుడి గ్రామా నికి చెందిన తిరువెంకటయ్యన్ పట్టికి చెందిన జశ్వంత్ (8), మాధవన్ (10) ఈనెల 11వ తేదీ ఉరానికుళం వద్ద ఉన్న చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి మృతిచెందారు. ఈ విషాద వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారని సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. సీఎం జనరల్ రిలీఫ్ ఫండ్ నుంచి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.3లక్షలు అందించాలని సీఎం అధికారు లను ఆదేశించారు. చైన్నె వీఐటీలో ఫ్రెంచ్ భాష క్లబ్ వేలూరు: చైన్నె వీఐటీ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన ఎంబీఏ ఫ్రెషర్స్ ఇండక్షన్–2025 కార్యక్రమంలో ఫ్రెంచ్ భాష క్లబ్ను ప్రారంభించారు. వీటిలో పుదుచ్చేరి, చైన్నె ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ హిజ్ ఎక్స్లెన్సీ మిస్టర్ ఎటియన్ రోలాండ్ పీగ్ హాజరై క్లబ్ను ప్రారంభించి ప్రసంగించారు. ఇది పోటీ ప్రపంచమని పోటీ ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చైన్నె వీఐటీ క్యాంపస్లో ఫ్రెంచ్ భాష క్లబ్ను ఏర్పాటు చేయడం ద్వారా తమ సంస్కృతిని కాపాడుకుంటూ ఫ్రెంచ్ సంస్కృతిని అనుభవిస్తారని తెలిపారు. వీఐటీ చాన్స్లర్ విశ్వనాథన్ మాట్లాడుతూ ఎంబీఏ విద్యార్థులు మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం మాట్లాడుతూ విద్యార్థులు సవాళ్లను ఎదుర్కోవడమే కాకుండా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. వీఐటీ ప్రొ వైస్ చాన్స్లర్ డాక్టర్ త్యాగరాజన్, డాక్టర్ పీకే, అదనపు రిజిస్ట్రార్ మనోహరన్ పాల్గొన్నారు. అలయన్స్ ఫ్రాంకై జ్ ఆఫ్ మద్రాస్, వీఐటీ చైన్నె మధ్య అవగాహన ఒప్పందం చేసుకున్నారు. హుండీలో చోరీ: వ్యక్తి అరెస్ట్ తిరువొత్తియూరు: తిరువణ్ణామలైలోని అన్నామలైయార్ ఆలయంలోని హుండీలో నగదు చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం అన్నామలైయార్ ఆలయానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి బంగారు ధ్వజస్తంభం వద్ద ఉన్న హుండీ నుంచి నగదు చోరీ చేశాడు. హుండీ నుంచి నగదు చోరీ చేస్తుండగా చూసిన ఆలయ సిబ్బంది, ఆలయ నిర్వాహకులు తిరువణ్ణామలై నగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు తిరువణ్ణామలై నగర పోలీసులు, అన్నామలై ఆలయ హుండీ నుంచి రూ.5వేలను చోరీ చేసిన తిరువరూర్ జిల్లాకు చెందిన పళని కుమారుడు శబరినాథన్ (40)ను అరెస్టు చేశారు. అరెస్టు అయిన శబరినాథన్ నుంచి పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. పారిశుధ్య కార్మికులకు యూనిఫాం పంపిణీ సేలం: ఈరోడ్ కార్పొరేషన్లో జోన్–1లోని పారిశుధ్య కార్మికులకు యూనిఫాం పంపిణీ చేశారు. ఈరోడ్ కార్పొరేషన్లోని 4 జోన్లలోని మొత్తం 60 వార్డుల్లో ప్రత్యేకంగా మాస్ క్లీనింగ్ జరుగుతోంది. ఇందులో జోన్ 1 పరిధిలోని చిన్నప్ప లేఔట్లో శుభ్రపరిచే పని జరిగింది. ఈ పనిని కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ధనలక్ష్మి ప్రారంభించారు. జోన్–1 అధ్యక్షుడు పి.కె.పళనిస్వామి ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొని సామూహికంగా శుభ్రపరచడంలో పాల్గొన్న 50 మంది పారిశుధ్య కార్మికులకు యూనిఫాం అందజేశారు. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పిచ్ముత్తు, హెల్త్ ఆఫీసర్ తంగరాజ్, హెల్త్ ఇన్స్పెక్టర్ సతీష్, జూనియర్ ఇంజినీర్లు తిరుమూర్తి, సువరన్సింగ్, డీఎంకే కార్యనిర్వాహకులు పాల్గొన్నారు. బస్సులో రూ.16.30 లక్షలు స్వాధీనం ● ఒకరి అరెస్ట్ వేలూరు: బస్సులో రూ.16.30లక్షలు తీసుకెళుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుకుడి జిల్లాకు చెందిన 25 సంవత్సరాల మహిళ బెంగళూరులోని ప్రయివేటు కంపెనీలో పనిచేస్తుంది. ఈమె వేలూరులోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువును చూసేందుకు భర్తతో పాటు బెంగళూరు నుంచి ఓ ఏసీ బస్సులో బయలు దేరింది. బస్సు శుక్రవారం అర్ధరాత్రి తిరుపత్తూరు జిల్లా మాదనూరు వద్ద టీతాగేందుకు నిలిపారు. ఆ మహిళ టీ తాగి భర్తతో పాటు బస్సు ఎక్కింది. ఆ సమయంలో బస్సులో ఉన్న ఓ యువకుడు మహిళను సెల్ఫోన్లో ఫొటో తీశాడు. గమనించిన మహిళ ఆ యువకుడితో గొడవకు దిగింది. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేలూరు నార్త్ పోలీసులు బస్సు వద్దకు చేరు కుని యువకుడిని అరెస్ట్ చేశారు. విచారణలో యువకుడు తూత్తుకుడి జిల్లా కయల్పట్టణంకు చెందిన ఇంద్రీస్ అని తెలిసింది. అతని బ్యాగు ను తనఖీ చేయగా అందులో రూ.16.30 లక్షల హవాలా నగదు ఉన్నట్లు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు నగదును కోర్టులో అప్పగించారు. -
సెంజి కోటకు యునెస్కో గుర్తింపు
సాక్షి, చైన్నె: సెంజికోటకు యునెస్కో గుర్తింపు దక్కింది. పురాతన ప్రదేశాల అధ్యయనంలో వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. రాష్ట్రంలో తంజావూరులోని బృహదీశ్వరాలయం, మహాబలిపురం, కుంబకోణం ఐరాతీశ్వరర్ ఆలయం, నీలగిరులు వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తింపును దక్కించుకుని ఉన్నాయి. తాజా గా జాబితాలో మరాఠా రాజుల స్థావరంగా ఉన్న సెంజి కోటను ప్రభుత్వ సిఫారసు మేరకు యునెస్సో గుర్తింపు కల్పిస్తూ ప్రకటన వెలువడింది. 1678లో మరాఠాలు సెంజి కోటను తమ గుప్పెట్లోకి తెచ్చుకు న్నారు. ఇది ప్రస్తుతం విల్లుపురం జిల్లాలో ఉంది. సెంజి అనే ప్రాంతంగానే ఈ కోట పేరిట పట్టణం వెలసి ఉంది. గత ఏడాది సెప్టెంబరులో అప్పటి మైనారిటీ శాఖ మంత్రి సెంజి మస్తాన్, నాటివిల్లుపురం కల్టెర్ పళణి నేతృత్వంలో ప్రత్యేక బృందం సెంజి కోటకు సంబంధించిన సమగ్ర నివేదికను సిద్ధం చేసింది.ఈ కోటలోని కల్యాణ మహల్, దర్బార్ హాల్, ఎలిఫెంట్ పూల్, మ్యూజియం, కోటలోని వంతెన, కొండపై ఉన్న ఫిరంగులు వంటి అనేక అంశాలు ఈనివేదికలో పేర్కొన్నారు.ప్రస్తుతం అన్నిరకాల పరిశీలన తదుపరి మహారాష్ట్రాలోని చత్రపతి శివాజీ పాలించిన కోటలను, తమిళనాడులోని విల్లుపురం జిల్లా సెంజికోటను వారసత్వ ప్రదేశంగా యూనెస్కో గుర్తింపు కల్పించింది. సెంజి కోట -
సంకీర్ణంలో వాటా.. బాటలోనే అమిత్ షా
● వెనక్కి తగ్గని కేంద్ర మంత్రి ● సంపూర్ణ మెజారిటీతో అధికారం మాదే: పళణి ● బీజేపీ తమకు ప్రత్యర్థి అన్న విజయ్ సాక్షి, చైన్నె: బీజేపీ – అన్నాడీఎంకే కూటమి ఏర్పడినప్పటి నుంచి అధికారంలోకి వస్తే సీఎం ఎవరో, సంకీర్ణ ప్రభుత్వమా..? అన్న చర్చ తమిళనాట విస్తృతంగా సాగుతూ వస్తోంది. ఇటీవల ఓ తమిళ మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే అన్నాడీఎంకేలో దారి తీశాయి. సీఎం అభ్యర్థి ఎవరో అన్నది తేల్చక పోవడం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తథ్యం అన్న ఆయన వ్యాఖ్యలు అన్నాడీఎంకేను ఇరకాటంలో పడేశాయి. అదే మాట.. కూటమి పాలన విషయంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి. 2026 ఎన్నికలలో కూటమి గెలిస్తే అధికారంలో వాటాతథ్యమన్నారు. తమిళనాడులో నెలకొన్న పరిస్థితులు, శాంతి భద్రతల విచ్ఛిన్నం, వారసత్వ రాజకీయం, తదితర అంశాలతో ప్రజలుమార్పును ఆశిస్తున్నారని, ఈసారి తమ కూటమి అధికారంలోకి రావడాన్ని ఎవ్వరూ ఆపలేరని వ్యాఖ్యలు చేశారు. ఈ కూటమిలోని పీఎంకే,విజయ్ టీవీకేలతో పాటుగా చిన్న పార్టీలను ఒకే గొడుగు నీడన తీసుకొచ్చే ప్రయత్నాలలో ఉన్నామని ప్రకటించారు. అమిత్ షా వ్యాఖ్యలు మళ్లీ అన్నాడీఎంకేలో చర్చకు దారి తీయడంతో ఈ సారి వ్యూహాత్మకంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఎదురు దాడి వ్యాఖ్యలను పేల్చారు. శనివారం మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2026 అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంపూర్ణ మెజారిటీతో అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను గుర్తు చేయగా, తాను స్పష్టం చేశానుగా అన్నాడీఎంకే సంపూర్ణ మెజారిటీతో అధికారం చేజిక్కించుకుంటుందంటూ పరోక్షంగా సంకీర్ణ పాలనకు అవకాశం లేదని పళణి తేల్చి చెప్పడం గమనార్హం. అదే సమంయలో కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ను ప్రశ్నించగా, అమిత్ షా వాక్కు వేద వాక్కు అని స్పష్టం చేశారు. ఆయన తమ అధినేతలు అని, వారి ఆదేశాలే కీలకం అని, వారు చెప్పిందే జరుగుతుందని, ఇదే తమకు వేద వాక్కు అని పేర్కొనడం గమనార్హం. ఇక, తమను పదే పదే కూటమిలోకి ఆహ్వానించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు అమిత్ షా వ్యాఖ్యలు చేయడాన్ని తమిళగ వెట్రి కళగం తీవ్రంగానే పరిగణించింది. తమ అధ్యక్షుడు విజయ్ తరపున పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శి రాజ్ మోహన్ స్పందిస్తూ, పార్టీ ఆవిర్భావ సమయంలోనే స్పష్టం చెప్పామని, అలాగే, ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీలోనూ స్పష్టతను మరింతగా వ్యక్తం చేశామన్నారు. తమ డీన్ఏలోనే బీజేపీకి వ్యతిరేకంగా నిర్ణయం ఉంందన్నారు. తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీ బీజేపీని ఎప్పుడో ఎంపిక చేశామని, ఎట్టి పరిస్థితులలోనూ వారితో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. -
మద్యం తాగొద్దన్నందుకు వ్యక్తి హత్య
● నిందితులను అరెస్టు చేయాలని రాస్తారోకో తిరువళ్లూరు: ఇంటికి సమీపంలో మద్యం తాగుతూ వీరంగం చేస్తున్న యువకులను వారించిన వ్యక్తిని మద్యం మత్తులో వున్న యువకులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన తిరువళ్లూరు జిల్లా ఈకాడు సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా ఈకాడు కండ్రిగ ప్రాంతానికి చెందిన కార్తికేయన్(42). ఇతను చైన్నెలోని ప్రయివేటు సంస్థలో ఉద్యోగి. ఇతని భార్య సంధ్య(34). వీరికి ఇద్దరు కుమార్తెలు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి యథావిధిగా విధులు ముగించుకుని ఈకాడు కండ్రిగలోని ఇంటికి తిరువళ్లూరు నుంచి బయలుదేరాడు. ఇంటికి సమీపం వస్తుండగా ఆ సమయంలో అక్కడ మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. దీంతో కార్తికేయన్ వారిని మందలించాడు. మద్యం మత్తులో వున్న యువకులు కార్తికేయన్పై దారుణంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని బంధువులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. విషయం తెలిసి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు డీఎస్పీ కార్యాలయం వద్ద శనివారం ఉదయం రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. నిందితులను శిక్షిస్తామన్న డీఎస్పీ హామీ మేరకు రాస్తారోకో విరమించారు. -
కొండ ప్రాంత ప్రజల జీవన విధానమే కేవీ
తమిళసినిమా: కొడైకెనాల్లోని కొండ వాసీ ప్రజల కష్టాలు, బాధలు వంటి జీవన వినోదాన్ని తెరపై ఆవిష్కరించే కథా చిత్రం ఠెవి అని ఆ చిత్రం దర్శకుడు తెలిపారు. ఆర్ట్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫిలిం కంపెనీ పతాకంపై పెరుమాళ్.జీ.జగన్ జయసూర్య నిర్మించిన చిత్రం కేవీ. తమిళ్ దయాళన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆదవన్ కథానాయకుడిగా పరిచయం కాగా నటి శీలా రాజ్ కుమార్ నాయకిగా నటించారు. జాగ్వలిన్, చార్లెస్, వినోద్, చిదంబరం ధర్మదురై జీవా ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 18వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వివరాలు తెలుపుతూ మనం సాధారణంగా కొడైకెనాల్ వంటి కొండ ప్రాంతాలకు విహార యాత్రలు చేసి వస్తున్నాయన్నారు. అయితే అక్కడి కొండ వాసీయుల జీవితా, గురించి పట్టించుకోమన్నారు. అలా కొడైకెనాల్ సమీపంలోని కెవి అనే గ్రామంలోని ఆ ప్రకృతితో కలిసి జీవించే చాలా మందికి తెలియని ప్రజల బాధలు, కష్టాలు మొదలగు వారి జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రమే ఇదని చెప్పారు. పుట్టడం ప్రకృతిలో భాగమైతే మనిషి చావడం హింసాత్మకమైయిందన్నారు. ఇకపై ఎవరైనా అలాంటి చావు రాకూడదని, వారు సమాజంలో ఒకరిగా గుర్తించబడాలని చెప్పే చిత్రం కేవీ అని చెప్పారు. అలాంటి ప్రాంతంలో 110 రోజులు చిత్రం షూటింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే ఇది అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని బాలసుబ్రమణియన్.జి, ఎస్.రాజా రవివర్మన్, జగన్ జయసూర్య చాయాగ్రహణం అందించారు. -
గ్రూప్–4 పరీక్షలు ప్రశాంతం
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా జరిగిన గ్రూప్–4 పరీక్షలు పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలో వున్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో గత ఆరు నెలల క్రితం ప్రభుత్వం గ్రూప్–4 నోటిపికేషన్ను విడుదల చేసింది. ఈ క్రమంలో జిల్లా నుంచి మొత్తం 38,117 మంది ధరఖాస్తులు చేసుకున్నారు. 99 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పర్యవేక్షించడానికి 126 ఇన్విజిలేటర్లు, 39 తనిఖీ బృందాలు, తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో స్పెషల్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతించారు. కాగా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మొత్తానికి 38,117 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా, 31,082 మంది హాజరయ్యా రని కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. కై వండూరు, తిరుప్పాచ్చూర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పకడ్బందీగా గ్రూప్–4 పరీక్షలు వేలూరు: వేలూరు జిల్లాలో జరిగిన గ్రూప్–4 పరీక్షలు శనివారం పకడ్బందీగా జరిగాయి. 84 పరీక్ష కేంద్రాల్లో 20,110 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. వేలూరు జిల్లాలోని ప్రభుత్వ ముస్లిం పాఠశాల, కాట్పాడిలోని వీఐటీ పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలను కలెక్టర్ సుబ్బలక్ష్మి పరిశీలించారు. ఈవేరా పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన 11 మందిని అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. -
వినూతతో సన్నిహితంగా ఉంటున్నాడనే రాయుడి హత్య?
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడి హత్య కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. వినూతతో సన్నిహితంగా ఉండడమే రాయుడు హత్యకు ప్రధాన కారణం అయి ఉంటుందని చెన్నై పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. తన దగ్గర పని చేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడిని హత్య చేసిన కేసులో జనసేన పార్టీ ఇంచార్జి(తాజా మాజీ) వినూత కోటా (Vinutha Kotaa) శనివారం అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు ఇచ్చిన సమాచారంతో వేకువజామున 3గం. టైంలో వినూత, ఆమె భర్త చంద్రబాబు (Chandrababu Kotaa)ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటిదాకా సాధించిన పురోగతి వివరాలను చెన్నై కమిషనర్ ఏ అరుణ్ మీడియాకు వెల్లడించారు. శ్రీనివాసులు(రాయుడు)ని ఆంధ్రాలో హత్య చేసి.. చెన్నైకి తీసుకొచ్చి పడేశారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారానే నిందితులను గుర్తించాం. హత్యకు ఉపయోగించిన కారు నెంబర్ ట్రేస్ చేసి నిందితులను అరెస్ట్ చేశాం. ప్రస్తుతం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది అని అన్నారాయన. కోటా వినూతతో శ్రీనివాసులు సన్నిహితంగా మెలగడమే హత్యకు కారణమని భావిస్తున్నట్లు చెప్పారాయన.ఏం జరిగిందంటే.. చెన్నై మింట్ పీఎస్ పరిధిలో ఈ నెల 8వ తేదీన కూవం నదిలో ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో.. పోస్టుమార్టంలో చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లుగా తేలింది. చేతి మీద జనసేన సింబల్తో పాటు వినూత అనే పేరు ఉండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా.. ముగ్గురు నిందితులు దస్త సాహెబ్(షేక్తసన్), శివకుమార్, గోపిలను అరెస్ట్ చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆపై మృతదేహం ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసుల(రాయుడు)దిగా నిర్ధారించారు. చిత్రహింసలకు గురి చేసి..బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సీహెచ్ శ్రీనివాసులు(రాయుడు) గత 15 ఏళ్లుగా వినూత కోటా దగ్గర నమ్మిన బంటుగా ఉన్నాడు. డ్రైవర్గా, ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగానూ పని చేశాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. జూన్ 21వ తేదీన ఆమె ఓ బహిరంగ ప్రకటన చేశారు. అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఇటు పేపర్లో.. అటు సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేశారు. ఇక మీదట శ్రీనివాసులుకి, తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. అయితే.. ప్రత్యర్ధుల దగ్గర డబ్బు తీసుకుని తమ సమాచారం వాళ్లకు చేరవేస్తున్నారనే అనుమానంతో రాయుడిని ఆమె విధుల నుంచి తొలగించామని తొలుత ఆ దంపతులు పోలీసులకు చెప్పారు. అయితే లోతైన విచారణలో.. డ్రైవర్తో తన భార్య సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం భరించలేక చంద్రబాబు ఈ హత్య చేయించినట్లు తేలింది. ఈ క్రమంలో.. ఆ భార్యభర్తలు ప్లాన్ చేసి మరో ముగ్గురి సహాయంతో కాళహస్తిలోని ఓ గోడౌన్లో రాయుడిని టార్చర్ చేసి చంపారు. ఆపై రాయుడి మృతదేహాన్ని చెన్నైలో తమ వాహనంలో ఆ భార్యభర్తలు మృతదేహాన్ని మోసుకెళ్లి పడేశారు. ఇదిలా ఉంటే..శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ తరఫున ఆమె చేసిన హడావిడి అంతాఇంతా కాదు. హత్య కేసు తెర మీదకు రావడంతో వినూత కోటాను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు జనసేన ప్రకటించింది.చదవండి: పవన్ @ పెద్దమ్మ భాషా పితామహ.. -
క్లుప్తంగా
రైల్లో మహిళ నగలు చోరీ అన్నానగర్: రైల్లో ఓ మహిళ నుంచి 17 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. చైన్నెలోని మేడవాక్కం ప్రాంతానికి చెందిన జయరామన్. ఇతని భార్య తమిళసెల్వి (27). వీరికి ముగ్గురు కుమారులు. వారికి మదురై జిల్లాలోని తిరుమంగళం కామరాజపురం ఉత్తర ప్రాంతంలో ఇల్లు ఉంది. గతవారం, తమిళసెల్వి చైన్నె నుంచి తిరుమంగళంకు అనంతపురి రైలులో వెళ్లింది. ఆమె బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు హాజరై గురువారం రాత్రి ముత్తునగర్ ఎక్స్ప్రెస్ రైలులో చైన్నెకి తిరిగి వెళ్లింది. ఇంటికి వెళ్లి పర్సు చూడగా 17 సవర్ల బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించింది. రైల్వే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరువణ్ణామలై–నరసాపూర్ మధ్య ప్రత్యేక రైలు వేలూరు: ఆంధ్ర రాష్ట్రం నుంచి తిరువణ్ణామలైకి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తిరువణ్ణామలై నుంచి ఆంధ్ర రాష్ట్రంలోని నరసాపురం వరకు వారాంతపు ప్రత్యేక రైలు నడిపేందుకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో తిరువణ్ణామలై నుంచి తన మొదటి ప్రయాణాన్ని వారాంతపు రైలు గురువారం బయలుదేరింది. తిరువణ్ణామలై నుంచి ఉదయం 11 గంటలకు బయ లుదేరి వేలూరు, కాట్పాడి, చిత్తూరు, పాకాల, తిరుపతి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, బ్రహ్మవరం మీదుగా నరసాపురం రైల్వేస్టేషన్కు అర్ధరాత్రి 2 గంటలకు చేరుకుందని రైల్యే అధికారులు తెలిపారు. ఈ వారంతపు ప్రత్యేక రైలు ఈనెల 17, 24, ఆగస్టు మాసంలో 7,14, 21, సెప్టెంబర్ 4, 25వ తేదీల్లో ఈ ప్రత్యేక రైలు తిరువణ్ణామలై నుంచి బయలుదేరి నరసాపురానికి చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. గిరివలయం రోడ్డులో భక్తుడి హత్య ● ఇద్దరి అరెస్ట్ వేలూరు: తిరువణ్ణామలైలో అన్నామలైయార్ ఆలయ దర్శనానికి వెల్లి గిరివలయంలో నడిచి వెళుతున్న తెలంగాణ భక్తుడిని హత్య చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, యాదగిరి జిల్లాలోని సౌందరిపురానికి చెందిన విద్యాసాగర్(32) ఈనెల 7న తిరువణ్ణామలైలోని స్వామి వారి దర్శనార్థం వచ్చాడు. 8వ తేదీన రాత్రి అతను అన్నామలైయార్ ఆలయం నుంచి గిరివలయం రోడ్డులో నడిచి వెలుతుండగా ఇద్దరు యువకులు బైకులో వచ్చారు. ఆ సమయంలో విద్యాసాగర్ను అదుపు తప్పి ఢీకొట్టినట్లు తెలిసింది. దీంతో విద్యాసాగర్, ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆగ్రహించిన ఆ యువకులు కత్తితో విద్యాసాగర్పై దాడి చేసి పరారిపోయారు. విషయం తెలిసి తిరువణ్ణామలై పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యాసాగర్ గురువారం సాయంత్రం మృతిచెందాడు. పోలీసులు సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. అనంతరం తిరువణ్ణామలైకి చెందిన గణేశ్వరన్, తమిళరసన్లను అరెస్ట్ చేశారు. మూడు కార్లు ఢీ: ఏడుగురికి గాయాలు తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని జాతీయ రహదారిలో మూడు కార్లు ఢీకొన్న ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి తిరుత్తణి పోలీసుల కథనం మేరకు..చైన్నెకి చెందిన ముకుందన్(51), వదరరాజన్(53) తిరుమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుని శుక్రవారం మధ్యా హ్నం చైన్నెకి బయలుదేరారు. తిరుత్తణి సమీపం చైన్నె తిరుపతి జాతీయ రహదారిలోని పొన్పాడి రైల్వేస్టేషన్ క్రాస్ వద్ద తిరుత్తణి సమీపం మురుకంబట్టుకు చెందిన విజయ్(29), అన్న విగ్నేష్(30) కొత్తూరులో బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కార్లో వెళుతుండగా, తిరుపతి నుంచి చైన్నె వైపు వెళుతున్న కారును ఢీకొని అదుపుతప్పి తిరుపతి నుంచి చైన్నెకి వెళుతున్న మరో కారును సైతం ఢీకొంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరుత్తణి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గిరివలయం రోడ్డు
కిటకిటలాడిన వేలూరు: తమిళ ఆణి మాస పౌర్ణమిని పురష్కరించుకుని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ గిరివలయం రోడ్డు భక్తులతో కిటకిటలాడింది. అరుణాచలేశ్వరాలయంలో పౌర్ణమి గురువారం వేకువజామున 2.33 గంటలకు ప్రారంభమై శుక్రవారం 3.08లకు ముగియడంతో కార్తీకదీపం తరహాలోనే భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. అదేవిధంగా ఆలయంలోని అన్నామలైయార్ సమేత ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు చేశారు. పౌర్ణమి సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తిరువణ్ణామలై చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు అధికసంఖ్యలో రావడంతో తిరువణ్ణామలైలో గురువారం రాత్రి గిరివలయం రోడ్డు, ఆలయ మాడ వీధులు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు 6గంటల పాటు క్యూలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని మాడ వీధుల్లో ఊరేగించడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. -
కాట్టుపల్లిలో నౌకాదళం కీల్ లేయింగ్
సాక్షి, చైన్నె: భారత నౌకాదళానికి థర్డ్ ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎప్ఎస్ఎస్) కీల్ లేయింగ్ను చైన్నె శివారులోని కాట్టుపల్లి ఎల్అండ్టీ షిప్ యార్డ్లో ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ వివరాలను నౌకాదళం వర్గాలు ప్రకటించాయి. వైస్ అడ్మిరల్ రాజారామ్ స్వామినాథన్, కంట్రోలర్ వార్షిప్ ప్రొడక్షన్– అక్విజిషన్ , ఇండియన్ నేవీ, హిందూస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్, మెస్సర్స్ ఎల్అండ్టీ నుంచి సీనియర్ అధికారుల సమక్షంలో దీనిని ఏర్పాటు చేసినట్టు వివరించారు. భారత నౌకాదళం ఆగస్టు 2023లో ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ కొనుగోలు కోసం హెచ్ఎస్ఎల్తో ఒప్పందంపై సంతకం చేసిందిని, డెలివరీ షెడ్యూల్ 2027 మధ్యలో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం బలాన్ని ప్రదర్శిస్తూ, దేశంలో నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి డెలివరీ కోసం కఠినమైన సమయపాలనను తీర్చడానికి హెచ్ఎస్ఎల్ రెండు నౌకల నిర్మాణాన్ని కాట్టుపల్లి ఎల్అండ్టీ షిప్ యార్డ్కు సబ్ కాంట్రాక్ట్ చేసినట్టు వివరించారు. సముద్రంలో ఫ్లీట్ షిప్లను తిరిగి నింపడం ద్వారా భారత నౌకాదళం ‘బ్లూ వాటర్’ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నదని ప్రకటించారు. 40వేల టన్నుల కంటే ఎక్కువ రవాణా కలిగిన ఈ నౌకలలో ఇంధనం, నీరు, మందుగుండు సామగ్రి, నిల్వలను కలిగి ఉంటాయని వివరించారు. ఇవి సముద్రంలో నౌకాదళంకు దీర్ఘకాలిక, స్థిరమైన కార్యకలాపాలకు వీలు కల్పిస్తాయని, తద్వారా పరిధి అన్నది పెరుగుతుందన్నారు. -
జనాభా నియంత్రణకు సహకరించాలి
వేలూరు: జనాభా నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురష్కరించుకుని వేలూరులో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ జనాభా 743 కోట్లుగా ఉందని అన్నారు. సంవత్సరానికి జిల్లాలో 55 వేల మంది జన్మిస్తున్నారన్నారు. వీరిలో రెండవ చిన్నారులకు పైగా జన్మించే వారి సంఖ్య 12.8 శాతంగా ఉందన్నారు. వీటి శాతాన్ని తగ్గించేందుకు ప్రజలకు అవగాహన అవసరమన్నారు. విద్యా వేత్తలు, విద్యార్థులు మీ సమీపంలోని కుటుంబీకుల వద్ద ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు. అనంతరం జనాభా నియంత్రణపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. ముందుగా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, జోన్ చైర్మన్ వెంకటేశన్, ఆరోగ్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మణిమేగలై, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రూ.18 కోట్ల వస్తువుల రికవరీ
తిరువళ్లూరు: ఆవడి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 28 పోలీస్స్టేషన్లో నమోదైన కేసులను ఛేదించిన పోలీసులు రూ.18 కోట్ల విలువ చేసే బంగారు, వెండి వస్తువులు, నగదును రికవరీ చేసి బాధితులకు కమిషనర్ శంకర్ అప్పగించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 28 పోలీసుస్టేషన్లు వున్నాయి. గత ఆరు నెలల కాలంలో చోరీలు, స్నాచింగ్, మోసాలపై వేర్వేరు కేసులు నమోదయ్యాయి. వీటిని పోలీసులు ఛేదించారు. చోరీ చేసిన వ్యక్తుల నుంచి 87 సవర్ల బంగారు నగలు, 922.989 కిలోల వెండి, రూ.3.96 లక్షల నగదు, 317 సెల్ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు, 90 ఏసీలతో పాటు వస్తువులను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి మోసాలకు పాల్పడిన సంఘటనలపై 16 కేసులు నమోదు చేసి రూ.6.89 కోట్ల ఆస్తులను రికవరీ చేశారు. ● బాధితులకు అప్పగించిన ఆవడి పోలీసు కమిషనర్ -
నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
కొరుక్కుపేట: చైన్నె ట్రిప్లికేన్ నియోజకవర్గం స్వతంత్ర నగర్ ఆది ఆంధ్ర ప్రజా సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. స్వతంత్ర నగరంలో రామాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వాహకులైన మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు ఎస్ బాలాజీ, ఎన్ హరినారాయణ, గ్రామ పెద్ద ఏటీ వెంకటేష్ల పర్యవేక్షణలో ప్రమాణస్వీకారం జరిగింది. ఇందులో స్వతంత్ర నగర్ ఆదిఆంధ్ర ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎం.కృష్ణమూర్తి, సెక్రటరీగా యూ. హరి, కోశాధికారిగా కేఎల్ శ్రీనివాసన్, ఉపాధ్యక్షుడు టి.వెంకటయ్య, ఉపకార్యదర్శి కె.ఎస్.విష్ణు ప్రసాద్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సత్కరించారు. టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయేల్, రామనగర్ టామ్స్ నేత పాల్ కొండయ్య పాల్గొన్నారు. -
ఘనంగా అయగు ముత్తుకోన్ జయంతి
వేలూరు: స్వాతంత్య్ర పోరాట యోధుడు అయగు ముత్తుకోన్ 268వ జయంతిని వేలూరులోని ఆయర్ కుల యాదవర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వేలూరు పాత కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అయగు ముత్తుకోన్ చిత్ర పటాన్ని ఉంచి గురు పూజోత్సవంఫొటో ఆవిష్కరణ కార్యక్రమం సంఘం అధ్యక్షుడు జీకే గంగాధరన్ అధ్యక్షతన జరిగింది. అనంతరం ప్రజలకు స్వీట్లు పంచి పెట్టి అన్నదానం చేశారు. ఎమ్మెల్యే కార్తికేయన్, సంఘం ప్రధాన కార్యదర్శి ఎంజీ రమేష్, కోశాధికారి సతీష్కుమార్, అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శి ఎస్ఆర్కే అప్పు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాధికారి సీకే దేవేంద్రన్, కార్పొరేటర్ టీటా, పారిశ్రామిక వేత్తలు సీకే గణేశన్, వీజీ తులసిరామన్, జీజీఆర్ గోకుల్, తమిళ్మణి, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆగస్ట్ 1న తెరపైకి సరెండర్
తమిళసినిమా: నటుడు దర్శన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సరెండర్. లాల్, సుజిత్ శంకర్, మునీష్కాంత్, పళనికుమార్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆఫ్ బీట్ పిక్చర్స్ పతాకంపై వీఆర్వీ.కుమార్ నిర్మించారు. ఈచిత్రం ద్వారా గౌతమ్ గణపతి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు అరివళగన్ వద్ద అసోసియేట్గా పనిచేశారన్నరది గమనార్హం. వికాశ్పడిశ సంగీతాన్ని, మెయ్యేంద్రన్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఆగస్ట్ ఒకటవ తేదీన తెరపైకి రానుంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఎన్నికలకు ముందు 5 రోజుల్లో జరిగే కథా చిత్రం అని చెప్పారు. ఒక పోలీస్స్టేషన్లో ఒక మెటీరియల్, అదేవిధంగా ఒక గ్యాంగ్ ఎన్నికల కోసం పంచాల్సిన డబ్బు మిస్ అవుతుందన్నారు. ఈ రెండు అంశాలతో సాగే కథా చిత్రం అని పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ను చైన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించినట్లు, మునీష్కాంత్కు సంబంధించిన షూటింగ్ను తిరుచ్చిలో నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో పాటలు ఉండవని అన్నారు. ఇందులో లాల్ పోలీస్స్టేషన్లో నిజాయితీగల రైటర్గా నటించారని, దర్శన్ పోలీస్ అధికారిగా నటించారని చెప్పారు. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది అనే కాన్సెప్ట్తో తెరకెక్కించిన కథా చిత్రం ఇదన్నారు. చిత్రం చూసిన ప్రేక్షకులు గుడ్ ఫీల్తో బయటకు వస్తారని దర్శకుడు పేర్కొన్నారు. -
వనితా విజయ్కుమార్పై ఇళయరాజా పిటిషన్
తమిళసినిమా: ఈ మధ్య కొత్త చిత్రాల్లో పాటలు హిట్ అవుతున్నాయో లేదోగానీ, పాత పాటల రీమిక్స్లు మాత్రం ఆయా చిత్రాల వసూళ్లకు ప్లస్ అవుతున్నాయి. దీంతో పలువురు దర్శక నిర్మాతలు పాత చిత్రాలను తమ చిత్రాల్లో వాడుకోవడానికి ఆసక్తి చూపితున్నారు. కాగా ప్రముఖ సంగీతదర్శకుడు ఇళయరాజా తన పాటలను అనుమతి లే కుండా ఎవరైనా తమ చిత్రాల్లో వాడితే వెంటనే వారిపై నష్టపరిహారం కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తారు. తాజాగా నటి వనితావిజయ్కుమార్ పై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వనితా విజయ్కుమార్ తొలి సారిగా దర్శకత్వం వహించి నాయకిగా నటించిన చిత్రం మిసెస్ అండ్ మిస్టర్. డాన్స్ మాస్టర్ రాబర్ట్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని వనితా విజయ్కుమార్ కూతురు జోవిక విజయ్కుమార్ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా ఇందులో నటుడు కమలహాసన్ మైఖెల్ మదన కామరాజన్ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. కాగా ఆ చిత్రంలోని శివరాత్తిరి అంటూ సాగే పాటను మిస్సెస్ అండ్ మిస్టర్ చిత్రంలో వాడారు. దీంతో తన అనమతి పొందకుండా వనిత తన పాటను వాడారంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో చిత్రం నుంచి తన పాటను వెంటనే తొలిగించాలని, లేకుంటే నష్ట పరిహారం కోరడం జరుగుతుందని ఇళయరాజా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. వచ్చే సోమవారం విచారించనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. పాటను వాడుకోవడానికి ఇళయరాజా అనుమతి తీసుకున్నాట్లు, అందుకుగానూ చిత్ర టైటిల్ కార్డులో ఆయనకు కృతజ్ఞతలు తెలిపినట్లు ఆ చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. -
చిత్ర నిర్మాణ రంగంలోకి..
తమిళసినిమా: ఇంతకుముందు పలు మ్యూజికల్ ఈవెంట్స్ను సక్సెస్ఫుల్గా నిర్వహించిన నాయిస్ అండ్ గ్రెయిన్స్ సంస్థ ఇప్పుడు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ సంస్థ అధినేతలు కార్తీక్ శ్రీనివాస్, మహావీర్ అశోక్ నిర్మిస్తున్న ప్రొడక్షన్–2 చిత్రం శుక్రవారం ఉదయం చైన్నెలో ప్రారంభమైంది. ఈ చిత్రానికి కిశోర్ రాజ్కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కోమాలి, ఖైదీ, వీఐపీ–2, ఇమైకా నొడిగల్, కీ చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. కాగా తాజాగా ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అన్నాబెన్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ప్రేమతో కూడిన వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం రూపొందడానికి దర్శకుడు కే.భాగ్యరాజ్ సహకారం చాలా ఉందని పేర్కొన్నారు. కాగా మళ్లీ ఆయన చిత్రాలను గుర్తుకు తెచ్చే విధంగా తమ చిత్రం ఫీల్ గుడ్ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈచిత్రంలో అన్నాబెన్ నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ బాలు చాయాగ్రహణం, సహ కథా రచయితగానూ పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. -
దేశాభివృద్ధికి అడ్డు లేకుండా పెరుగుదల
తిరువళ్లూరు: దేశాభివృద్ధికి ఆటంకం లేకుండా జనాభా పెరుగుదల ఉండాలని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురష్కరించుకుని తిరువళ్లూరు జిల్లా కలెక్టరేట్ నుంచి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీని కలెక్టర్ ప్రతాప్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ 1987వ సంవత్సరంలో జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లకు దాటిన క్రమంలో అప్పటి నుంచి ప్రతి ఏటా జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభా 143.81 కోట్లు, రాష్ట్ర జనాభా 7.7 కోట్లకు దాటిందన్నారు. సీ్త్రలకు వివాహ వయస్సు 21గా నిర్ణయించారని, బిడ్డ అన్నారు. తక్కువ వ్యవఽధిలో పిల్లలు కనడం ద్వారా వారిలో పోషక లోపం వుంటుందన్న విషయాన్ని గుర్తించుకోవాలని ఆయన సూచించారు. జాయింట్ డైరెక్టర్లు అంబిక, డిప్యూటీ డైరెక్టర్ శేఖర్, ప్రియ, ప్రభాకరన్ పాల్గొన్నారు. -
ముగిసిన మొహర్రం వేడుకలు
● సీఎంతో సైఫుద్దీన్ భేటీ సాక్షి, చైన్నె: చైన్నెలో పది రోజుల పాటు జరిగిన చారిత్రాత్మక అషారా ముబారకా (మొహర్రం) వేడుకలు ముగిశాయి. దావూదీ బోహ్రాల సామాజిక వర్గం నాయకడు సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్న్కు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం ఆతిథ్యం ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 43,000 మందికి పైగా దావూదీ బోహ్రాలు తమ వార్షిక మొహర్రం సమాజం కోసం చైన్నెకు తరలి వచ్చిన విషయం తెలిసిందే. ఆశారా ముబారకా సభ ముగింపుతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం చైన్నెలోని క్యాంప్ కార్యాలయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దావూదీ బోహ్రా ముస్లిం సమాజం 53వ నాయకుడు ిసయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్కు ఆతిథ్యం ఇచ్చారు. తమిళనాడు హిందూ మత ధార్మిక శాఖ మంత్రి పీకే శేఖర్బాబుతో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. సయ్యద్నా నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో జరిగే వార్షిక మొహర్రం సమాజం ఆశారా ముబారకా గురించి, జూన్ 27 నుంచి జూలై 5, 2025 వరకు చైన్నెలో జరిగిన కార్యక్రమం గురించి ఈసందర్భంగా సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమం తమిళనాడులో కమ్యూనిటీలో అతిపెద్ద అంతర్జాతీయ సమావేశాల్లో ఒకటిగా నిలిచిందని, 50 సంవత్సరాల విరామం తర్వాత చైన్నెలో జరిగినట్టు తెలియజేశారు. వేలాది మంది హాజరైన వారికి అన్ని సౌకర్యాలు, భద్రత కల్పించిన ప్రభుత్వం, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్, చైన్నె పోలీసులు, ఇతర ప్రజా సేవా విభాగాలకు సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ తన హృదయపూర్వక కృతజ్ఞతలను ఈసందర్భంగా తెలుపుకున్నారు. దావూదీ బోహ్రా సమాజం, క్రమశిక్షణ సంస్థ, పౌర దృక్పథం, వాణిజ్యం, వ్యాపారం, సామాజిక అభివృద్ధికి సహకారాన్ని ఈసందర్భంగా సీఎం స్టాలిన్ గుర్తుచేశారు. -
● రూ. 100 కోట్లతో పనులు ● 63 ఆలయాల ఎంపిక ● తమిళాభివృద్ధి సంస్థకు రూ.2.15 కోట్లు ● తిరుక్కురల్ పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : వెయ్యి సంవత్సరాల నాటి పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని హిందూమత, దేవదాయ శాఖ విస్తృతం చేసింది. తాజాగా రూ.100 కోట్లతో పునరుద్ధరణ పనుల నిమిత్తం 63 ఆలయాలను ఎంపిక చేశారు. ఈపనులను సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్లో శుక్రవారం ప్రారంభించారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. 3,297 ఆలయాలను ఇప్పటివరకు అభివృద్ధి చేశారు. ఆక్రమణల్లోని ఆలయాల ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో రాజుల కాలంలో నిర్మించిన ఆలయాలను అక్కడి శాసనాలు, శిల్పాల ఆధారంగా వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాల వివరాల సేకరణను విస్తృతం చేశారు. 714 ఆలయాలు 1000 సంవత్సరాల క్రితం నిర్మించినట్టు గుర్తించారు. వీటి స్వరూపం చెక్కు చెదరకుండా పునరుద్ధరించే విధంగా 2022–2023 ఆర్థిక సంవత్సరం నుంచి రూ.425 కోట్ల నిధులను కేటాయించారు. ప్రభుత్వ నిధులు, సేకరించిన విరాళాలతో మొత్తం రూ.571.55 కోట్లతో వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన 352 దేవాలయాల పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకున్నారు. ఇందులో 60 ఆలయాల పునఃప్రతిష్ఠ పూర్తి చేశారు. కుంభాభిషేకాలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో మరో 63 ఆలయాల పునరుద్ధరణకు సిద్ధమయ్యారు. రూ.100 కోట్ల పనులను సచివాలయం నుంచి సీఎం స్టాలిన్ ప్రారంభించారు. దేవాలయాల ప్రాచీనత, వాస్తుశిల్పంపై భవిష్యత్తు అధ్యయనాలు భవిష్యత్ తరాలకు అందించడం లక్ష్యంగా వాటి పురాతనం చెక్కు చెదరకుండా పనులకు ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మంత్రులు దురైమురుగన్, పి.కె.శేఖర్బాబు, ప్రధాన కార్యదర్శి ఎన్.మురుగానందం పాల్గొన్నారు. తమిళాభివృద్ధి కొనసాగింపు లక్ష్యం అనంతరం జరిగిన కార్యక్రమంలో తమిళాభివృద్ధి సంస్థ అభివృద్ధి పనులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగే విధంగా సీఎం చర్యలు తీసుకున్నారు. తమిళ అభివృద్ధి సంస్థకు రూ.2 కోట్ల 15 లక్షల చెక్కు అందజేశారు. ఈ మొత్తాన్ని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎం.రాజేంద్రన్అందుకున్నారు. 2025–2026 వార్షిక సమావేశం నిర్ణయం మేరకు తమిళ అభివృద్ధి సంస్థ అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటుంది అని సమాచార మంత్రి స్వామినాథన్ ప్రకటించారు. ఇందు కోసం రూ.2 కోట్లు నిధి అందజేస్తామన్నారు. రూ.2 కోట్లు డిపాజిట్గా అందజేశారు. ఇందులో నుంచి వచ్చే ఆదాయం సహా మొత్తం రూ. 2.15 కోట్లకు చెక్కును రాజేంద్రన్కు సీఎం స్టాలిన్ అందజేశారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రి స్వామినాథన్ పాల్గొన్నారు. తిరుక్కురల్ శ్రీ పుస్తకావిష్కరణ సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ తరఫున, తిరుక్కురల్– సార్వత్రిక జ్ఞానం, ప్రపంచానికే నిధి అన్న పుస్తకాన్ని రూపొందించారు. ప్రపంచ తమిళ భాషా ఫౌండేషన్న్ సంయుక్త ప్రచురణ ఆంగ్ల అనువాదం కూడా చేశారు. దీనిని సీఎం స్టాలిన్ విడుదల చేశారు. ఉదయనిధి స్టాలిన్, మంత్రులు ఏవీ వేలు, అన్బిల్ మహేశ్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ అధికారుల వినియోగం కోసం 198 వాహనాలను సీఎం స్టాలిన్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయా అధికారులకు తాళాలను అందజేశారు. అనంతరం అధికారులు, మంత్రులతో సీఎం స్టాలిన్ వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. -
ఘనంగా ఐఐటీ స్నాతకోత్సవం
సాక్షి, చైన్నె : ఐఐటీ మద్రాసు 62వ స్నాతకోత్సవం శుక్రవారం చైన్నె క్యాంపస్లో ఘనంగా జరిగింది. 3,227 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఇండియన్ నాలెడ్జ్ సెంటర్ను ఈసందర్భంగా ప్రారంభించారు. జాతీయ విలువ కలిగిన అత్యున్నత సంస్థగా ఐఐటీ మద్రాసును భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అభివర్ణించారు. ఐఐటీ మద్రాసు ఆవరణలో ఉదయం జరిగిన స్నాతకోత్సవంలో 3,661 విద్యార్థులకు డిగ్రీలు (జాయింట్, డ్యూయల్ డిగ్రీలు సహా) ప్రదానం చేశారు. మొత్తం 529 మందికి పీహెచ్డీలు కూడా ప్రదానం చేశారు. కార్యక్రమానికి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత భరతనాట్య నృత్యకారిణి డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఐఐటీ మద్రాస్ గవర్నర్ల బోర్డు చైర్మన్ డాక్టర్ పవన్ గొయాంకా స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించారు, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. జాతీయ విలువ కలిగిన సంస్థ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులను , వివిధ బహుమతి విజేతలను అందుకున్న వారిని అభినందిస్తూ, అజిత్ దోవల్ మాట్లాడుతూ, జాతీయ విలువ కలిగిన మార్గదర్శక సంస్థ ఐఐటీ మద్రాసు అని అభివర్ణించారు. ఇక్కడ ఉండటం ఒక గౌరవంగా పేర్కొన్నారు. ఐఐటీ పూర్వ విద్యార్థుల నెట్వర్క్ గురించి ప్రస్తావిస్తూ, విదేశాలలో వ్యక్తిగత సౌకర్యాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకండి, నిజమైన విజయం నివసించే చోట కాదు, అందించే దానిలో ఉంటుంది.్ఙ అని అజిత్ దోవల్ పిలుపు నిచ్చారు. ప్రశంసల కోసం మాత్రమే కాకుండా, ప్రభావం కోసం ఆవిష్కరణలు చేయండి అని పిలుపునిచ్చారు.అలాగే, ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ భారత సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టాయని వివరించారు. అయితే, కొన్ని అంతర్జాతీయ మీడియా తప్పుడు సమాచారాన్ని బయటకు ప్రచారంచేసినట్టు అసహనం వ్యక్తం చేశారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మట్లాడుతూ 3,227 మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీలను ప్రదానం చేశామన్నారు. ఈసందర్భంగా తమ పూర్వ విద్యార్థులు, కార్పొరేట్ సంబంధాలు, సంస్థాగత అభివృద్ధి ద్వారా 2024–25లో రూ. 320 కోట్లు సేకరించామన్నారు. ఐఐటీ మద్రాస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ పవన్ గోయాంకా మాట్లాడుతూ, 100 సంవత్సరాల స్వాతంత్య్రం జరుపుకునే సమయానికి ప్రధానమంత్రి వీక్షిత్ భారత్ఙ్ మేరకు పూర్తిగా అభివృద్ధి చెందిన భారతదేశం చూడవచ్చు అని వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ పద్మ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఐఐటీ తన ఉత్సవాల ద్వారా ప్రదర్శనలలో కళలకు ఎల్లప్పుడూ ప్రాముఖ్యతను ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఇండియన్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభోత్సవం ఐఐటీ మద్రాస్లో సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ (ఐకేఎస్) కారిడార్ను ప్రారంభించారు. ఈ కేంద్రం ఇంటర్ డిసిప్లినరీ పరిశోధన కేంద్రంగా పనిచేస్తుంది, విభిన్న విభాగాల నుంచి అధ్యాపకులను ఒకచోట చేర్చుతుంది. దీని పరిశోధన విస్తృత శ్రేణి నేపథ్య రంగాలను కలిగి ఉంటుంది. అలాగే, కృష్ణ చివుకుల బ్లాక్లో ఐకేఎస్ కారిడార్ను అజిత్ దోవల్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్ గురుమూర్తి, ప్రొఫెసర్ రాజేష్ కుమార్, హెచ్ఎస్ఎస్ విభాగం ఐకేఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ దీపక్ పరమశివన్ పాల్గొన్నారు. బీఎస్ అనిరుద్కు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైజ్, భారతరత్న ఎం విశ్వేశ్వరయ్య మెమోరియల్ ప్రైజ్, అనిత్ ఆనంద పొహెలికి ఇనిస్టిట్యూట్ మెరిట్ ప్రైజ్, వీఆర్ అభినవ్కు డాక్టర్ శంకర్ దయాల్శర్మ ప్రైజ్, రాజ గోపాల సుబ్రమణియంకు గవర్నర్ ప్రైజ్ను బహుమతిగా అందజేశారు. 3,227 మంది విద్యార్థులకు డిగ్రీల ప్రదానం ఇండియన్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు జాతీయ విలువ కలిగిన సంస్థగా అజిత్ దోవల్ అభివర్ణన -
27, 28 తేదీల్లో మోదీ పర్యటన
సాక్షి, చైన్నె : తమిళనాడులోని మూడు జిల్లాల్లో ఈనెల 27, 28 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉన్నట్టు సమాచారం తెలిసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కసరత్తులు జరుగుతున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పతనం లక్ష్యంగా బీజేపీ, అన్నాడీఎంకే వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఓ వైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మరోవైపు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రజల్ని ఆకర్షించే పర్యటనల్లో ఉన్నారు. అమిత్షా తరచూ రాష్ట్రానికి వస్తుంటే, పళణిస్వామి తమిళనాడును కాపాడుదాం అనే నినాదంతో యాత్రను విస్తృతం చేశారు. ఈయాత్ర పలు జిల్లాలో ప్రజల్ని ఆకర్షించే విధంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వీరికి మరింత బలాన్ని చేకూర్చే దిశగా ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. డెల్టా జిల్లాల్లో అరియలూరు, పెరంబలూరు వెనుకబడిన జిల్లాలు. అలాగే, తంజావూరు వ్యవసాయానికి ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందిది. ఈ మూడు జిల్లాల్లో ఇంతవరకు బీజేపీ అధినాయకుల పర్యటనలు జరగలేదు. తాజాగా మోదీ పర్యటనకు కసరత్తులు జరుగుతున్నాయి. అరియలూరు జిల్లాలో గంగై కొండ చోళపురంలో ఈనెల 20వ తేదీ నుంచి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం 27వ తేదీ జరగనుంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు మోదీ రానున్నట్టు సమాచారం. ఇందుకు సంబందించిన ఏర్పాట్లపై బీజేపీ వర్గాలు దృష్టిపెట్టినట్టు తెలిసింది. 28వ తేదీ పెరంబలూరు, తంజావూరులలోనూ పర్యటించే విధంగా మోదీ కార్యక్రమాలకు కసరత్తులు జరుగుతున్నాయి.ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఏఐ టెక్నాలజీతో గుర్తించాం! తీవ్రవాదుల అరెస్టుపై డీజీపీ శంకర్జివాల్ సాక్షి, చైన్నె: ఏఐ టెక్నాలజీ ఆధారంగా తమ వద్ద ఉన్న అజ్ఞాతంలో ఉన్న తీవ్రవాదుల ఫొటోలను ప్రస్తుతం ఎలా ఉంటారో అలా తీర్చిదిద్ది ముగ్గుర్ని అరెస్టు చేశామని డీజీపీ శంకర్ జివాల్ తెలిపారు. కోయంబత్తూరు బాంబు పేలుడుతో పాటు పలు కేసుల్లో నిందితులుగా ఉన్న అజ్ఞాత తీవ్రవాదులు అబూబక్కర్ సిద్ధిక్, మహ్మద్అలీ, టైలర్ రాజ అలియాస్ సాధిక్లను తమిళనాడు తీవ్ర వాద నిరోధక విభాగం బృందం గుర్తించి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి అరెస్టు గురించి శుక్రవారం డీజీపీ శంకర్ జివాల్ మీడియాతో మాట్లాడారు. ఆ ముగ్గుర్ని పట్టుకోవడంలో తమకు అత్యాధునిక సాంకేతికత ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. ముఫ్పై సంవత్సరాల క్రితం వారు ఎలా ఉన్నారో అనే ఫొటో మాత్రమే తమ వద్ద ఉండేదని, వాటి ఆధారగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ప్రస్తుతం ఎలా ఉన్నారో గుర్తించ గలిగామన్నారు. ఈ ముగ్గురు పూర్తిగా తమ పాత ఐడెంటిటీని రూపు మాపి, కొత్త ఐడెంటితో రియల్టర్గా, కూరగాయల మార్కెట్ నడుపుతూ విదేశాలకు సైతం వెళ్లి వచ్చినట్టు తేలిందన్నారు. వీరి కోసం ఆరు నెలల పాటు ప్రత్యేక బృందం శ్రమించిందన్నారు. వీరిని మరింతగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక చోట జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకుని పోలీసు వ్యవస్థపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదని తిరుభువనంలో సెక్యూరిటీ అజిత్కుమార్ లాకప్ డెత్ ఘటనపై డీజీపీ వ్యాఖ్యలు చేశారు. నాకు వ్యతిరేకంగా కుట్ర సాక్షి, చైన్నె: తనకు వ్యతిరేకంగా పెద్ద కుట్రే జరుగుతోందని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఆరోపించారు. తన నివాసం నుంచి ట్యాపింగ్ పరికరాన్ని గుర్తించామన్నారు. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి రాందాసు మధ్య సమరం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అన్బుమణిని పార్టీ నుంచి తప్పించే దిశగా రాందాసు తుది నిర్ణయానికి వచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు. పీఎంకే రెండు ముక్కలయ్యేనా అన్నట్టుగా తాజా పరిస్థితులు కనబడుతున్నాయి. తన నేతృత్వంలోని మద్దతు వర్గాన్ని అన్బుమణి శుక్రవారం చైన్నెకి పిలిపించారు. వారితో జరిగిన సమావేశంలో తన నేతృత్వంలో పీఎంకే సభ్యత్వ నమోదు వేగవంతం చేయించాలని ఆదేశించారు. బలోపేతం దిశగా అడుగులు వేద్దామని సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాందాసు మరోబాంబు పేల్చారు. తనకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాను ఏమిచేస్తున్నాను, ఏమి మాట్లాడుతున్నానో పసిగట్టేందుకు ట్యాపింగ్ పరికరాన్ని ఉపయోగించారని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం తైలాపురం గెస్ట్ హౌస్లో తన గదిలో సోపా కింద దీనిని గుర్తించామన్నారు. ఇది లండన్లో తయారు చేసినట్టుగా ఉందని పేర్కొన్నారు. మైలాడుతురై జిల్లా శీర్గాలిలో వన్నియర్ మహిళా సంఘ మహానాడుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఆగస్టు 10న జరగనున్న మహానాడు ఏర్పాట్లను రాందాసు పరిశీలించారు. -
14న మద్దతుదారులతో పన్నీరు భేటీ
సాక్షి, చైన్నె: చైన్నెలో ఈనెల 14న తన మద్దతుదారులతో సమావేశానికి మాజీ సీఎం పన్నీరుసెల్వం నిర్ణయించారు. వేప్పేరిలో ఈ సమావేశానికి ఏర్పాట్లు చేపట్టారు. అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు పన్నీరుసెల్వం విస్తృతంగా న్యాయపోరాటం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి రాజకీయంగా రాష్ట్రంలో బలపడ్డారు. తన బలాన్ని మరింతగా చాటుకునే దిశగా రాష్ట్రంలో చైతన్య యాత్ర పేరిట పర్యటనల్లో నిమగ్నమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో తర్వాత కార్యాచరణపై పన్నీరుసెల్వం దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా ఈనెల 14న మద్దతుదారులతో సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీ సైతం తనను పక్కన పెట్టిన నేపథ్యంలో పన్నీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఎదురుచూపులు పెరిగాయి. అదే సమయంలో అన్నాడీఎంకే వివాదంపై కేంద్ర ఎన్నికల కమిషన్ జాప్యం చేస్తుండడం హైకోర్టుకు శుక్రవారం చేరింది. అన్నాడీఎంకే వ్యవహారాలకు సంబంధించిన పిటిషన్ విచారణ సమయంలో న్యాయమూర్తులు స్పందిస్తూ ఎన్నికల కమిషన్ తీరును ఖండించారు. జాప్యమేలా అంటూ ప్రశ్నలు వేశారు. -
విద్యా కేంద్రంగా తమిళనాడు
● మంత్రి అన్బిల్ మహేశ్సాక్షి, చైన్నె: భారత దేశానికే తమిళనాడు అత్యున్నత విద్యా కేంద్రంగా అవతరించిందని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి తెలిపారు. క్రెసెంట్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ స్వర్ణోత్సవ సంబరాలు గురువారం రాత్రి చైన్నెలో జరిగాయి. అన్నాసాలైలోని కామరాజ్ అరంగంలో జరిగిన స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోళి ప్రసంగిస్తూ, ఐదు దశాబ్దాలుగా నాణ్యమైన విద్యకు, నమ్మకానికి, సమర్థులైన యువతులను తీర్చిదిద్దడంలో ఈ పాఠశాల పాత్రను ప్రశంసించారు. మిస్తైల్ మ్యాన్ శ్రీడాక్టర్ అబ్దుల్ కలాం నుంచి మాజీ రాష్ట్రపతి నారాయణన్ వరకు ఎందరో ద్విభాషా విధానం అమలైన పాఠశాలల్లో చదువుకుని ఉన్నత స్థానానికి చేరారని వివరించారు. ఈ విధానమే ప్రతి విద్యార్థి భవిష్యత్ అని, ఆ దిశగా తమిళనాడు ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలంగా రూపొందించి ఉందన్నారు., అందరికీ అందుబాటులో ఉండే, సమానమైన, నాణ్యమైన విద్యను నిర్ధారించడానికి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు వ్యవస్థలను తమిళనాడు కలిగి ఉందన్నారు. నేడు తమిళనాడు దేశంలోనే అత్యున్నత విద్యాకేంద్రంగా మారిందన్నారు. నాగపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆలూర్ షానవాస్ పాల్గొని బలమైన విలువలతో కూడిన అకడమిక్ ఎక్సలెన్స్ను నిర్ధారించడంలో సీత కతి ట్రస్ట్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీత కతి ట్రస్ట్ చైర్మన్ ఆరీఫ్ బుహారీ రెహమాన్, కార్యదర్శి ఖలీద్ బుహారీ, ది రైస్ గ్లోబల్ వ్యవస్థాపకుడు రెవరెండ్ డాక్టర్ జగత్ గాస్పర్రాజ్, ఐయూఎంఎల్ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు ఫాతిమా ముజఫర్, పాఠశాల కరస్పాండెంట్ షరీఫా ఎ.అజీజ్, ప్రిన్సిపల్ బుష్రా అమౌల్లా, జాయింట్ కరస్పాండెంట్ మరియం హబీబ్, వైస్ ప్రిన్సిపల్ , కోఆర్డినేటర్ జమీరా ఆఫ్రాన్ పాల్గొన్నారు. -
ఒక్క సాక్ష్యమైనా ఉందా?
చెన్నై: ఆపరేషన్ సిందూర్ విషయంలో విదేశీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని జాతీయ భద్రతా సలహాదారు అజిద్ దోవల్ మండిపడ్డారు. ఈ ఆపరేషన్లో భారత్కు నష్టం వాటిల్లినట్లు కనీసం ఒక్క ఫొటో అయినా చూపించగలరా? కనీసం ఒక గాజు ముక్క అయినా పగిలినట్లు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టడానికి భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారత్కు గర్వించదగ్గ ఘట్టమని అభివర్ణించారు. ఈ ఆపరేషన్లో భారత్ సైతం భారీగా నష్టపోయిందంటూ అంతర్జాతీయ మీడి యాలో వస్తున్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో శుక్రవారం ఐఐటీ–మద్రాసు 62వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి అజిత్ దోవల్ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భూభాగంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఒక్క టార్గెట్ కూడా గురి తప్పలేదని స్పష్టంచేశారు. ఎవరు(ఉగ్రవాదులు) దాక్కున్నారో తమకు తెలుసని, మే 7వ తేదీన కేవలం 23 నిమిషాల్లో తొమ్మిది శిబిరాలు నేలమట్టం అయిపోయాయని పేర్కొన్నారు. సరిహద్దుకు దూరంగా సరిగ్గా ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేశామని తెలిపారు. అవన్నీ పాకిస్తాన్ ఫొటోలే.. ‘‘పాకిస్తాన్లో 13 ఎయిర్బేస్లు ధ్వంసమైనట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. మే 10వ తేదీకి ముందురోజు, తర్వాతి రోజు ఫొటోలను ప్రచురించింది. అవి పాకిస్తాన్లోని సర్గోధా, రహీంయార్ఖాన్, చాక్లాలా ప్రాంతాలకు సంబంధించిన చిత్రాలే. వాటిలో భారత్కు సంబంధించిన ఫొటో ఒక్కటైనా ఉందా? అలాంటప్పుడు భారత్కు నష్టం జరిగిందని ఎలా అంటారు? పాకిస్తాన్ సైన్యం ఇండియాకు వ్యతిరేకంగా అది చేసింది, ఇది చేసింది అంటూ అంతర్జాతీయ మీడియా చెబుతున్నదాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇండియాకు నష్టం జరిగినట్లు ఒక్క సాక్ష్యం ఉన్నా చూపించాలి. పాకిస్తాన్పై దాడులు చేసి వెనక్కి వస్తుండగా ఒక్క గాజు ముక్క కూడా పగిలిపోలేదు. పాక్ ప్రయోగించిన క్షిపణులను మన గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే కూల్చివేసింది. ఆపరేషన్ సిందూర్లో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృత స్థాయిలో ఉపయోగించినందుకు గర్వపడుతున్నాం. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చేయగలమని ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం నిరూపించింది. మన సైన్యం శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది’’ అని అజిత్ దోవల్ వివరించారు. ఏఐ ఒక గేమ్ చేంజర్ యుద్ధ తంత్రానికి టెక్నాలజీ అనుసంధానించడం చాలా కీలకమని అజిత్ దోవల్ చెప్పారు. మన అవసరాలకు తగ్గట్టుగా దేశీయంగానే టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్లో బ్రహ్మోస్ క్షిపణులు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కంట్రోల్, కమాండ్ సిస్టమ్ ఉపయోగించామని, ఇవి దేశీయంగానే అభివృద్ధి చేసుకున్నవేనని గుర్తుచేశారు. కృత్రిమ మేధ(ఏఐ) ఒక గేమ్చేంజర్ అని తెలియజేశారు. దానిని కేంద్ర బిందువుగా చేసుకోవాలన్నారు. -
విచారణ కమిషన్కు సిద్ధం
వేలూరు: డీఎంకే ప్రభుత్వంలో చేసిన అప్పులకు విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఎడపాడి చెప్పడం విడ్డూరంగా ఉందని వీటికి తాము అందుకు సిద్ధమని రాష్ట్ర మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని అరుంబర్తి గ్రామంలో నాబార్డు నిధుల నుంచి రూ: 24.82 కోట్లతో నిర్మించిన చెక్డ్యామ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్డ్యామ్ నిర్మాణ పనుల కోసం అడుగు భాగంలో ఎనిమిది అడుగులలోతు తీసి పనులు చేస్తున్నామన్నారు. ఈ చెక్డ్యామ్ ఏర్పాటు చేయడం వల్ల కాట్పాడి నియోజక వర్గంలోని పలు గ్రామాలకు నీటి సమస్య లేకుండా ఉంటుందన్నారు. వీటితో పాటు కావనూరు చెరువు నిండి అందులో నుంచి వచ్చే నీరు పూర్తిగా ఈ చెక్డ్యామ్కు వస్తుందన్నారు. అదేవిధంగా అరుంబర్తి గ్రామంలో రూ.50 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామన్నారు. డీఎంకే ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను చూసి ఎడపాడి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. కలెక్టర్ సుబ్బలక్ష్మి, డిప్యూటీ మేయర్ సునీల్కుమార్, యూనియన్ చైర్మన్ వేల్ మురుగన్, వైస్ చైర్మన్ శరవణన్, అధికారులు పాల్గొన్నారు. -
క్రైస్తవ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ధర్నా
తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి తద్వారా సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేయాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ పీపుల్స్ పార్టీ నేతలు గురువారం ఉదయం ఽతిరువళ్లూరులో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడు ఐజాక్ హాజరై ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న క్రైస్తవులకు ప్రత్యేకంగా 10.5 శాతం రిజర్వేషన్ కల్పించాలి. పంచమీ భూములను స్వాధీనం చేసుకుని నిరుపేదలైన క్రైస్తవులకు పంచిపెట్టాలి. రాష్ట్రంలో అనుమతులు కోసం ఎదురు చూస్తున్న క్రైస్తవ మిషనరీలు, కళాశాలలు, యూనీవర్శిటీలకు వెంటనే అనుమతులను ఇవ్వాలని నినాదాలు చేశారు. క్రైస్తవులు, చర్చి ప్రసంగీకులపైన జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్కుట్టి, జిల్లా అధ్యక్షుడు రాజన్, శ్యామ్యూల్ రాజ్సెడ్రిక్బెనోతో పాటూ పలువురు పాల్గొన్నారు. -
వేడుకగా మన్నారుస్వామి వార్షికోత్సవం
తిరుత్తణి: మన్నారుస్వామి ఆలయ వార్షికోత్సవం గురువారం వేడుకగా నిర్వహించారు. తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగలో శ్రీదేవి, భూదేవి సమేత మన్నారుస్వామి ఆలయం జీర్ణోద్ధరణ పనులు చేపట్టి మూడేళ్ల కిందట మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈక్రమంలో ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా స్వామికి అభిషేక, ఆరాధన పూజలు నిర్వహించారు. వేడుకల్లో తెన్నేటి కుటుంబీకులతో పాటు గ్రామీణులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. పంచాయతీ మాజీ సర్పంచ్ మునిరత్నం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. -
జైలు నుంచి విడుదలైన నటులు శ్రీరామ్, కృష్ణ
తమిళసినిమా: కోలీవుడ్లో మాదక ద్రవ్యాల వ్యవహారంలో కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. మాదక ద్రవ్యాల వాడిని కేసులో నటుడు శ్రీరామ్ (తమిళంలో శ్రీకాంత్) ను పోలీసులు గత నెల 23వ తేదీన అరెస్ట్ చేసి పుళల్ జైలుకు తరలించిన విషయం, అదే కేసులో మరో నటుడు కృష్ణ ను గత నెల 26వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా పోలీసుల విచారణలో తమ తప్పును అంగీకరించిన ఈ నటులు బెయిల్ కోసం చైన్నె మాదక ద్రవ్యాల నిరోధక విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ కోర్టు వీరి బెయిల్ పిటిషన్ను కొట్టి వేసింది. దీంతో శ్రీరామ్, కృష్ణ తరుపు న్యాయవాదులు చైన్నె హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ను విచారించిన న్యాయస్థానం శ్రీరామ్, కృష్ణకు రెండు రోజుల క్రితం నిబంధనలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో కోర్టు ఉత్తర్వుల ప్రతులను న్యాయవాదులు జైలు అధికారులకు అందించారు. అనంతరం ప్రొసీజర్స్ పూర్తి చేసిన జైలు అధికారులు బుధవారం రాత్రి నటులు శ్రీరామ్, కృష్ణను విడుదల చేశారు. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొరుక్కుపేట: తమిళనాడు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వేడిగాలులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు గురువారం తెలిపారు. ఇప్పటికే ఉత్తర భారత ప్రాంతాలపై ఉన్న అల్పపీడన ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలపై కొత్తగా ఏర్పడిన అల్పపీడన ప్రాంతాల్లో పవనాలు పశ్చిమ దిశగా కదులుతున్నాయి. ఈక్రమంలో గాలులు పాకిస్తాన్ నుంచి మహారాష్ట్రకు వర్షాలు తాకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పొరుగు దేశాలలో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంది. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక తమిళనాడు వాతావరణం గుండా పసిఫిక్ మహాసముద్రం వైపు చైనా వైపు గాలులు వీస్తున్నట్టు వెల్లడించారు. దీని కారణంగా చైనాలో భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళనాడు ఉత్తర తీరం వెంబడి వర్షం పడుతుంది. ఏర్కాడ్, కల్వరాయణమాలయ, కొడైకెనాల్ ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. ఇక 12వ తేదీన తిరువళ్లూరు, చైన్నె, కాంచీపురం జిల్లాల్లో వర్షం కురుస్తుందని చైన్నె వాతావరణ శాఖ ప్రకటించింది. వృద్ధురాలి హత్య నగలు చోరీ తిరువొత్తియూరు: వృద్ధురాలిని దారుణంగా హతమార్చి దుండగలు నగలు చోరీ చేసిన ఘటన కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. కడలూరు జిల్లా బువనగిరి సమీపంలోని చెట్టికుళం ప్రాంతంలోని నాథమేడుకు చెందిన వేలు. ఇతని భార్య చంద్ర (60). ఈమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. సోమవారం రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా, ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంటి వెనుక తలుపు పగులగొట్టి లోపలికి చొరబడి చంద్ర ముఖంపై దిండుతో నొక్కడంతో ఊపిరాడక మృతిచెందింది. వృద్ధురాలి మెడలోని చైన్, గాజులు దోచుకుని అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు దర్యాప్తులో అదే ప్రాంతానికి చెందిన నాగరాజన్ కుమారుడు పశుపతి (27) వృద్ధురాలిని హత్య చేసి నగలు దొంగిలించాడని తేలింది. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూ కాంప్లెక్స్లో 29 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 76,501 మంది స్వామి వారిని దర్శించుకోగా 29,033 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
క్లుప్తంగా
విద్యార్థిని బలవన్మరణం తిరువొత్తియూరు: నామక్కల్ జిల్లా పరమతి వెల్లూర్ తాలూకా, వడకర యత్తూరు, ప్రాంతానికి చెందిన నటరాజ్ (45) అతని కుమార్తె ప్రాణిక (13) ఆ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో విద్యార్థి ప్రాణిక, బుధవారం సాయంత్రం ఇంటిలో ఎవరూ లేని సమయంలో చీరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రాణిక తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసరికి, కుమార్తె ఉరి వేసుకుని వేలాడుతూ ఉండటం చూసి వారు బోరున విలపించారు. తరువాత, ఇరుగు పొరుగు వారు బాలికను చికిత్స కోసం వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ పరీక్షించిన వైద్యులు ప్రాణిక మృతి చెందిందని తెలిపారు. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రభుత్వ బస్సు అద్దం ధ్వంసం తిరుత్తణి: ప్రభుత్వ బస్సు అద్దం ధ్వంసం సంఘటన ప్రభుత్వ డిగ్రీ కళాశాల బస్టాప్ వద్ద కలకలం రేపింది. తిరుత్తణి సమీపంలోని తిరుపతి చైన్నె–జాతీయ రహదారి సమీపంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు బస్సుల్లో తిరుత్తణికి వచ్చి చదువుకుంటున్నారు. ఈక్రమంలో గురువారం మధ్యాహ్నం కళాశాల ముగిశాక విద్యార్థులు బస్సుల కోసం బస్టాప్ వద్ద వేచివున్నారు. ఈ సమయంలో తిరుత్తణి నుంచి తిరువళ్లూరుకు వెళుతున్న బస్సులో విద్యార్థులు తొక్కిసలాడుతూ ఎక్కారు. బస్సు ఫుల్ కావడంతో డ్రైవర్ బస్సు కదల్చగా వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బస్సు అద్దాన్ని పగులగొట్టారు. డ్రైవర్ బస్సును అక్కడే ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుత్తణి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారైకల్ ఆలయంలో మామిడి పండగ సంబరాలు ● రాత్రిపూట అమృత నైవేద్య కార్యక్రమం కొరుక్కుపేట: కారైకల్ భారతీ నగర్ వీధిలో అమ్మన్ ఆలయం ఉంది. దేవతను పూజించడానికి మామిడి పండ్లను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో కారైకల్ అమ్మన్ ఆలయంలో ఏటా మామిడి ఉత్సవ పండుగ సాంప్రదాయకంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ పండుగ 8వ తేదీ సాయంత్రం ప్రారంభమైంది. ఈ పండుగలో ప్రధాన కార్యక్రమం బుధవారం కారైకల్ అమ్మైయార్ ఆలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి పౌర సరఫరాల మంత్రి తిరుమురుగన్, ఎమ్మెల్యే నజీమ్ , పుదుచ్చేరి డిఐజి సత్య సుందరం, కారైకల్ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మీ చౌజన్య, డీఎంకే వ్యవసాయ విభాగం నిర్వాహకుడు ప్రభు అలియాస్ సృథ్వీరాజ్, ఆలయ పరిపాలన అధికారి కనిదాసన్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మామిడి పండుగలో పాల్గొన్న భక్తులు తమ ఇళ్ల పైకప్పు నుంచి మామిడి పండ్లను విసిరారు. భక్తులు ఉత్సాహంగా మామిడి పండ్లను పట్టుకున్నారు. ఈ మామిడి పండ్లు తినడం వల్ల సంతానోత్పత్తిలో శుభం కలుగుతుందని నమ్ముతారు. అందువల్ల, చాలా మంది మహిళలు కూడా ఈ ఉత్సవంలో పాల్గొని మామిడి పండ్లను పట్టుకున్నారు. వీధుల నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు ఈ వేడుకలో పాల్గొని పూలమాలలు, పట్టు వస్త్రాలు సమర్పించి, దేవత దర్శనం చేసుకున్నారు. రెండు లారీలు ఢీ ముగ్గురు దుర్మరణం తిరువొత్తియూరు: రెండు లారీలు ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందారు. విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై బైపాస్ రోడ్డు పునరుద్ధరణ పనులు గత కొన్ని నెలలుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తూత్తుకుడి నుంచి పళనికి పౌడర్తో కంటైనర్ లారీ అర్ధరాత్రి బయలుదేరింది. లారీడ్రైవర్ జయమురుగన్ లారీ నడుపుతున్నాడు. అదేవిధంగా, ఇలాంటి పౌడర్ పైపులను తీసుకుని వెళుతున్న మరో లారీ మదురై నుంచి తూత్తుకుడికి వెళుతోంది. ఈలారీని ముత్తురాజ్ నడుపుతున్నాడు. ఈరెండు లారీలు అరుప్పుకోట్టై జంక్షన్ వద్ద అరుప్పుకోట్టై–తూత్తుకుడి నాలుగు లేన్ల రహదారిపై గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్లు జయమురుగన్, ముత్తురాజ్, లారీలోని మరొక ప్రయాణికుడు మృతిచెందారు. సమాచారం అందుకున్న అరుప్పుకోట్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని లారీల్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు కూడంకుళంలో కలకలం మత్స్యకారుల ఆందోళన తిరువొత్తియూరు: నైల్లె జిల్లాలోని కుడంకుళం సమీపంలోని కూటపుల్లి గ్రామంలో నివసించే సంధ్య, సూసయి, సూడి, పెలికాన్, తిపుర్సియన్, దీపన్, దీపగురుస్, తెలస్, రూబన్ , అజిత్ అనే 10 మంది మత్స్యకారులు తమ సొంత పడవలను కలిగి ఉండి చేపల వేటలో నిమగ్నమై ఉన్నారు. ఈ పడవలు తమిళనాడు వెట్రి కలగం పార్టీ రంగులు పెయింటింగ్ చేసి వుండడాన్ని కారణంగా చూపుతూ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పడవల యజమానులకు ఈ నెలకు ఇవ్వాల్సిన 250 లీటర్ల సబ్సిడీ కిరోసిన్ నూనెను అధికారులు నిలిపివేశారు. దీంతో జాలర్లు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సంఘటన కూడంకుళం ప్రాంతంలో కలకలం రేపింది. -
శరవేగంగా పుష్కరిణి పనులు
తిరుత్తణి: ఆడికృత్తిక తెప్పోత్సవం సందర్భంగా శరవణ పుష్కరిణి సిద్ధం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వచ్చే నెల 14 నుంచి 18 వరకు ఐదు రోజుల పాటు ఆడికృత్తిక తెప్పోత్సవం నిర్వహించనున్నారు. లక్షలాది మంది భక్తులు కావళ్లతో తిరుత్తణి ఆలయం చేరుకుని స్వామికి మొక్కులు చెల్లించనున్నారు. ఆగస్టు 16న ఆడికృత్తికతో పాటు తొలిరోజు తెప్పోత్సవం సందర్భంగా శరవణ పొయ్గై పుష్కరిణి శుభ్రం చేసేందుకు వీలుగా ఉభయదారుల నిధుల సాయంతో రూ.23.50 లక్షలతో కోనేటి నుంచి నీటిని తొలగించి పూడిక పనులు రెండు నెలలుగా నిర్వహించారు. ప్రస్తుతం కోనేటిలో కలుషిత నీటిని తొలగించి పూడికతీసి పరిశుభ్రం చేశారు. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి కోనేరులో నింపుతున్నారు. మరో వారంలో కోనేటిలో భక్తులు స్నానాలు ఆచరించేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
ఇక, అన్బుమణి మాత్రమే!
● నా పేరు వాడొద్దు ● రాందాసు స్పష్టీకరణసాక్షి, చైన్నె : తండ్రి తనయుడి మధ్య వార్లో మరో ట్విస్టు గురువారం చోటు చేసుకుంది. ఇక మీదట అన్బుమణి అని మాత్రమే వాడండీ. ఆయన పేరు వెనుక తన పేరును ఉపయోగించ వద్దు అని పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు స్పష్టం చేశారు. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు వారసుడు అన్బుమణి అన్న విషయం తెలిసిందే. ఆది నుంచి ఆయన్ని అందరూ అన్బుమణి రాందాసు అని పిలవడం, పేరును రాయడం జరుగుతూ వస్తోంది. తాజాగా తండ్రి, తనయుడి మధ్య వివాదం తారస్థాయికి చేరిన నేపథ్యంలో రాందాసు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కుంబకోణంలో తంజావూరు, తిరువారూర్ జిల్లాలో వన్నియర్ సంఘాల నేతలు, పార్టీ వర్గాలతో రాందాసు సమావేశమయ్యారు. ఇందులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన్బుమణి చర్యలను ఎండగట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. అన్బుమణి తన పేరును ఇనీషియల్గా వాడుకోవచ్చు అని పేర్కొంటూ, అయితే, ఆయన పేరు వెనుక అన్బుమణి రాందాసు అని మాత్రం వాడ వద్దు అని సూచించారు. ఇక మీదట అన్బుమణి అని మాత్రమే వాడాలని పేర్కొంటూ, ఈ విషయాన్ని విస్తృతంగా అందరిలోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అదే సమయంలో తనకు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్కు బుధవారం రాందాసు లేఖ రాసిన నేపథ్యంలో గురువారం అన్బుమణి సైతం మరో లేఖ రాశారు. రాందాసు నేతృత్వంలో జరిగిన కార్యనిర్వాహక కమిటీ తీర్మానాలను ఆమోదించ వద్దని కోరారు. ఈ సమావేశానికి చైర్మన్, ప్రధాన కార్యదర్శి హాజరు కాలేదని, ఈ దృష్ట్యా, ఆ సమావేశ తీర్మానాలకు ఎలాంటి మద్దతు లేదని,వాటిని తిరస్కరించాలని ఎన్నికల కమిషన్ను అన్బుమని కోరారు. -
మాతృభాషపై మమకారాన్ని పెంచుకోవాలి
కొరుక్కుపేట: మాతృభాషపై మమకారాన్ని పెంచుకోవాలని అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక సమితి అధ్యక్షుడు అజంతా డాక్టర్ శంకరరావు పిలుపునిచ్చారు. సమితి తరఫున 23వ వార్షిక పోటీలు గురువారం టి.నగర్లోని బాలానంద విద్యాలయంలో కార్యవర్గ సభ్యులు పసుమర్తి జయశ్రీ , డాక్టర్ టి.కల్పన, శివసుబ్రహ్మణ్యం, దామెర్ల పద్మావతి, బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని 8 పాఠశాలల నుంచి 130 మందికి పైగా తెలుగు విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పద్య పఠనం, వ్యాస రచన, చిత్ర లేఖనం, వక్తృత్వ ఇతర పోటీలను నిర్వహించారు. న్యాయ నిర్ణేతలుగా ఆముక్తమాల్యద, శారద, లలిత, వసంతలక్ష్మి, కె.రమాదేవి, గజగౌరీ, వసుంధర, లావణ్య, కమల, లలిత వ్యవహరించారు. దిట్టకవి అనంత పద్మనాభమూర్తి, పాల్గొన్నారు. -
రూ.36.06 కోట్లతో ఆవడిలో బస్టాండ్
తిరువళ్లూరు: ఆవడిలో రూ.36.06 కోట్లతో నూతనంగా నిర్మించనున్న బస్టాండుకు మంత్రులు శేఖర్బాబు, నాజర్ భూమిపూజ చేశారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలో నూతన బస్టాండు నిర్మాణం కోసం 2024–25 బడ్జెట్లో నిధులను కేటాయించారు. 1.90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ బస్టాండుకు భూమిపూజను గురువారం ఉదయం నిర్వహించారు. మంత్రి శేఖర్బాబు మాట్లాడుతూ ఆవడిలో నిర్మించనున్న బస్టాండులో తాగునీరు, ఇంటర్నెట్ సదుపాయం, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, ప్రయాణికుల సీటింగ్ సదుపాయంతో నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ పనులను ఏడాదిలోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రకాష్, అదనపు కార్యదర్శి శివజ్ఞానం, ఎంటీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుశంకర్, మేయర్ ఉదయకుమార్ పాల్గొన్నారు. -
ఉత్సాహంగా స్నిగ్ద 2025 పోటీలు
కొరుక్కుపేట:శ్రీ కన్యకాపరమేశ్వరి మహిళా కళాశాలలోని కళాలయ ఫైన్ ఆర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ స్నిగ్ద 2025శ్రీ పేరిట రెండు రోజుల పాటు నిర్వహించిన సాంస్కతిక పోటీలు, ఫ్రెషర్స్ డే ఉత్సవాలు గురువారం విజయవంతంగా ముగిసాయి. గురువారం ఆన్ స్టేజ్ ఈవెంట్లుగా పాటలు, నత్యం తదితర పోటీలు నిర్వహించగా మొదటి సంవత్సరం విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యాపారవేత్త రాధాకష్ణన్ బాలాజీ హాజరై నక్షత్ర స్టూడెంట్ కౌన్సిల్ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు బ్యాడ్జీలు పంపిణీ చేశారు. ముందుగా కళాశాల కరెస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్, కశాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ వణిత తదితరులు కలిసి అతిథిని ఘనంగా సత్కరించారు. నక్షత్ర స్టూడెంట్ కౌన్సెల్ ప్రారంభం -
క్లుప్తంగా
14 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన మేనమామ ●పోక్సో చట్టం కింద అరెస్టు అన్నానగర్: చైన్నెలోని తిరుమంగళం ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అందులో శ్ఙ్రీనా 14 ఏళ్ల కుమార్తె గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. మేము ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఆమె 2 నెలల గర్భవతి అని చెప్పారు. అది విని మేము దిగ్భ్రాంతి చెందాం. మేము నా కుమార్తెను దీని గురించి అడిగినప్పుడు, ఆమె గర్భధారణకు నా సోదరుడు కారణమని చెప్పడం విని మేము చాలా బాధపడ్డాం. దీనిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలిశ్రీశ్రీ అని పేర్కొంది. దీంతో తిరుమంగళం ఆల్ ఉమెన్ పోలీసులు కేసు నమోదు చేసి, బాలికను గర్భవతిని చేసినందుకు పోక్సో చట్టం కింద ఆమె మేనమామను గురువారం అరెస్టు చేసి జైలులో పెట్టారు. నైల్లెయప్పర్ ఆలయ ఊరేగింపులో చోరీ ●భక్తుల నుంచి 15 సవర్ల నగలు, 18 సెల్ఫోన్లు అపహరణ అన్నానగర్: నైల్లెయప్పర్ ఆలయ ఊరేగింపు సందర్భంగా దుండగులు భక్తుల నుంచి 15 సవర్ల నగలను దొంగిలించారు. అదేవిధంగా 18 మంది సెల్ ఫోన్లు చోరీ చేశారు. వివరాలు.. నైల్లె పట్టణం నైల్లెయప్పర్–కండిమతి అంబాల్ ఆలయంలో ఆనితిరువిళ రథోత్సవ ఊరేగింపు బుధవారం జరిగింది. ఇందులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. జనసమూహాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు పలువురి బంగారు ఆభరణాలను దొంగిలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిఘా కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా దొంగలను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు మత్స్యకారులపై రాళ్ల దాడి ●రూ.2లక్షల విలువైన చేపల వలలు కట్ చేసిన శ్రీలంక సముద్రపు దొంగలు అన్నానగర్: నాగపట్నం జిల్లా వేదారణ్యం పక్కనే ఉన్న ఆరుకాట్టుతురై నివాసి చంద్రమోహన్ బుధవారం తిరునావుకరసన్ (35), రంజిత్ (30), చోళరాజ్ (30)తో కలిసి తన సొంత పైబర్ బోటులో చేపలు పట్టడానికి వెళ్లాడు. వారు అర్ధరాత్రి తమిళనాడు సరిహద్దు కొడియకరైకి ఆగ్నేయంగా చేపలు పడుతున్న సమయంలో, రెండు పడవల్లో ఆ ప్రాంతానికి వచ్చిన ఆరుగురు శ్రీలంక సముద్రపు దొంగలు రాళ్లు రువ్వుతూ దాడి చేశారు. తర్వాత రూ.2 లక్షల విలువైన 300 కిలోల వలను కట్ చేసి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే ఆరుకాట్టుతురైకి చెందిన పొన్నుదురై, కార్తీకు చెందిన పడవలపై కూడా మత్స్యకారులు రాళ్లు రువ్వి వారిని తరిమికొట్టారు. ఈమేరకు గురువారం ఒడ్డుకు తిరిగి వచ్చిన మత్స్యకారులు వేదారణ్యం తీరప్రాంత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్లస్–1 విద్యార్థిని ఆత్మహత్య అన్నానగర్: నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ప్లస్–1 విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తిరుచ్చి జిల్లా ఇనియనూర్కు చెందిన పెరియసామి (48 ) టీ దుకాణం యజమానుడు. ఇతని భార్య దర్శన సత్య. వీరి కుమార్తె దర్శన (16) ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్లస్–1 చదువుతోంది. ఆమె నీట్ పరీక్ష కోసం కోచింగ్ క్లాస్కు వెళ్తోంది. ఇదిలా ఉండగా, కోచింగ్ సెంటర్లో నిర్వహించిన నీట్ పరీక్షలో మొదటి సెమిస్టర్ లో ఆమెకు తక్కువ మార్కులు వచ్చాయని తెలుస్తుంది. దీంతో మనస్తాపం చెందిన దర్శన ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. బుధవారం సాయంత్రం ఎప్పటిలాగే చదువుకోవడానికి ఇంటి పై అంతస్తుకు వెళ్లిన దర్శన రాత్రి 7 గంటల తర్వాత కూడా తినడానికి రాకపోవడంతో ఆమె తల్లి సత్య పైకి వెళ్లి చూసింది. అప్పుడు ఆమె చీరతో ఫ్యాన్కు వేలాడుతూ ఉండటం చూసి దిగ్భ్రాంతి చెంది ఏడ్చింది. ఆమె అరుపులు విన్న పొరుగువారు దర్శనను రక్షించి వెంటనే సోమరసంపేట లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు దర్శన మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ ఘటన పై సోమరసంపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉపకార వేతనాల వితరణ తిరువళ్లూరు: రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె నందవనం ఆధ్వర్యంలో మనవాలనగర్లోని విద్యార్థులకు విద్యా ఉపకరణాలను అందజేశారు. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్లో మథర్ థెరిస్సా బధిరుల పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో సుమారు 100 మంది చెవిటిమూగ విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యార్దులకు సుమారు నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే బ్యాగులు, పుస్తకాలు, దుస్తులు, లంచ్బాక్సులు తదితర వాటిని అందజేశారు. ఈ కార్యక్రమానికి రోటరీ సంఘం అద్యక్షుడు నబీన్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా ఏజీ హరిశ్వరన్, సెక్రెటరీ ఢిల్లీబాబు, రీజినల్ సెక్రెటరీ మణిమారన్ తదితరులు హాజరై వస్తువులను పంపిణీ చేశారు. భవిషత్తులోనూ నిరుపేదలు, బధిర విద్యార్థులకు విద్యా ఉపకరణాలను అందజేస్తామని హమీ ఇచ్చారు. -
18న తెరపైకి యూదుమ్ అరియన్
తమిళసినిమా: పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం యాదుమ్ అరియాన్. బ్రేకింగ్ పాయింట్ పిక్చర్స్ పతాకంపై ఎం.గోపీ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా దినేష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ప్రముఖ కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఇంతకు ముందు చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈయన కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం యాదుమ్ అరియాన్. నటి ప్రణా నాయకిగా నటించిన ఈ చిత్రానికి ఎల్ టి.ఛాయాగ్రహణం, ధర్మ ప్రకాష్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 18వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత ఎం.గోపీ మీడియాతో మాట్లాడుతూ ఇది సైకో, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. చిత్ర కథ 2024లో ప్రారంభం అయ్యి 2026లో ముగిసేలా ఉంటుందన్నారు. చిత్ర ట్రైలర్ను ఇటీవల విడుదల చేయగా విశేష ఆదరణ పొందుతోందని చెప్పారు. చిత్రంలో నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రి అయినట్లు చూపించడం గురించి వివరిస్తూ తాను విజయ్ అభిమానిని పేర్కొన్నారు. ఆయనతో ఒక్క చిత్రం అయినా చేయకపోతానా అని ఎదురు చూస్తున్న తరుణంలో విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించి సినిమాలకు స్వస్తి చెబుతున్నట్లు జరుగుతున్న ప్రచారం తనను తీవ్ర ద్విగ్భ్రాంతికి గురి చేసిందన్నారు దీంతో ఆయన ముఖ్యమంత్రి అయినట్లు సన్నివేశాలను పొందుపరచే అవకాశం ఈ చిత్రంలో కలగడంతో ఆ సన్నివేశాలను చేర్చినట్లు చెప్పారు. అంతే గాని రాజకీయాలకు ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ చిత్రం కోసం 15 రోజుల పాటు రేయింబవళ్లు షూటింగ్ చేసి శ్రమించినట్లు నటుడు దినేష్ చెప్పారు. తన కుటుంబ నేపథ్యాన్ని పక్కన పెట్టిన ఈ చిత్రంలో దర్శకుడు చెప్పినట్లు నటించినట్లు ఆయన పేర్కొన్నారు. -
ధనుష్ 54వ చిత్రం ప్రారంభం
తమిళసినిమా: నటుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న 54వ చిత్రం గురువారం ఉదయం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న నటుడు ధనుష్. ఈయన కధానాయకుడిగా నటించిన కుబేర చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా హిందీలో నటిస్తున్న చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు. కాగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఇడ్లీ కడై త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నారు. ఇందులో ధనుష్కు జంటగా మాలీవుడ్ బ్యూటీ మమిత బైజు నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇది అన్నది గమనార్హం. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని, తేనీ ఈశ్వర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఇందులో దర్శకుడు కేఎస్.రవికుమార్, కరుణాస్, జయరాం, సురాజ్ వెంజరముడు, పృథ్వీ పాండియ రాజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇదని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ను మనదేశంలోని పలు ప్రాంతాలలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం నటుడు ధనుష్ కెరీర్లో మరో భారీ చిత్రంగా ఇది ఉంటుందని, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. -
తిరుప్పూర్లో ఘోర అగ్ని ప్రమాదం
● గ్యాస్ సిలిండర్లు పేలి 35 ఇళ్లు నేలమట్టం అన్నానగర్: తిరుప్పూర్లోని చిక్కన్న ప్రభుత్వ కళాశాల ఎదురుగా ఉన్న ఎంజీఆర్ కాలనీలోని పులియంతోట్టం ప్రాంతానికి చెందిన సాయాదేవి (50) తన తోటలోని ఓ భాగంలో 35 టిన్ షెడ్లను నిర్మించారు. తిరువణ్ణమలై, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల నుంచి, విదేశీ కార్మికులు ఇక్కడ నివసిస్తున్నారు. వారు నిర్మాణ కార్మికులుగా, కంపెనీలలో పనిచేస్తున్నారు. ఈ స్థితిలో, బుధవారం నివాసితులు ఎప్పటిలాగే పనులకు వెళ్లారు. మధ్యాహ్నం కొన్ని ఇళ్లలో మహిళలు మాత్రమే ఉన్నారు. మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే, ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలింది. వెంటనే, అక్కడ ఉన్న మహిళలు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. మంటలు నెమ్మదిగా పొరుగు ఇళ్లకు వ్యాపించాయి. గాలి వేగం ఎక్కువగా ఉండటంతో మంటలు వ్యాపించి ఇళ్లులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది 2 వాహనాల్లో వచ్చి మంటలను ఆర్పారు. కానీ అప్పటికి ఆ ప్రాంతంలోని 35 ఇళ్లు కాలిపోయి నేలమట్టమయ్యాయి. 2 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా, ఇంట్లో ఉన్న సామాగ్రి కాలిపోయాయి. ఈ ప్రమాదంలో 6కి పైగా సిలిండర్లు పేలిపోయాయని వెల్లడైంది. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మార్షల్గా కార్తీ
తమిళసినిమా: స్టార్ హీరోల్లో నటుడు కార్తీ ఒకరు. ఈయన వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. కార్తీ ఇటీవల నటించిన మెయ్యళగన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వా వాద్దియార్ చిత్రంతో పాటు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో సర్ధార్–2 చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో వా వాద్దియార్ చిత్రం ముందుగా విడుదలయ్యే అవకాశం ఉంది. తాజాగా కార్తీ మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇది ఈయన నటించే 29వ చిత్రం అవుతుంది. ఈ చిత్రాన్ని ఐవీవై ఎంటర్టెయిన్మెంట్ సంస్థతో కలిసి వారియర్ పిక్చర్స్ సంస్థ అధినేత ఎస్ ఆర్.ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ నిర్మిస్తున్నారు. టాణాకారన్ చిత్రం ఫేమ్ తమిళ్ దీనికి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తునున్నారు. ఈ చిత్రానికి మార్షల్ అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ చిత్రం గురువారం చైన్నెలోని ప్రసాద్ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటి కల్యాణి ప్రియదర్శన్ కథానాయకిగా నటిస్తుండగా, సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కన్, ఈశ్వరీరావు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తరువాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ–2 చిత్రంలో కార్తీ నటించే అవకాశం ఉంది. దీనికి సాయి అభయంకర్ సంగీతాన్ని, సత్యన్ సూర్యన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం తెలిపింది. -
వినూత్న అవగాహన
ఒమేగా హెల్త్ కేర్ సీఎస్ఆర్ విభాగం ఒమేగాఫోరం ఫర్ సోషల్ ఇంపాక్ట్, విండ్ డాన్సర్స్ ట్రస్ట్ ఇండియా నేతృత్వంలో షీ మ్యాటర్స్ 2.ఓ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా మూడు రోజుల పాటుగా మన్ముకి గ్రామంలో నిర్వహించారు. అట్టడుగు వర్గాల మహిళలను ఒకే వేదిక మీదకు తెచ్చి కథ చెప్పం, థియేటర్, నృత్యం, సృజనాత్మక వ్యక్తీకరణ , కాట్రాడి కళల ఆధారితంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఓఎఫ్ఎస్ఐ సీఈఓ సునంద రంగరాజన్,మన్ముకి గ్రామ ప్రమోటర్ సుజాత నటరాజన్లు హాజరయ్యారు. – సాక్షి, చైన్నె -
పోలీస్ అధికారి
దర్శకుడు అయినతమిళసినిమా: సినిమా చాలా శక్తివంతమైన మాధ్యమం. ఎలాంటి వారినైనా ఆకర్షిస్తుంది. అలా ఇంజినీర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు ఈ రంగంలోకి వచ్చారు. తాజాగా ఒక పోలీసు అధికారి శివరాజ్ దర్శకుడిగా మారారు. ఈయన దర్శకత్వం వహించిన చిత్రం ట్రెండింగ్. రామ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మీనాక్షి ఆనంద్ నిర్మించిన ఈ చిత్రంలో నటుడు కలైయరసన్, నటి ప్రియలయ హీరో హీరోయిన్లుగా నటించారు. నటుడు ప్రేమ్ కుమార్, బెసెంట్ రవి అలెగ్జాండర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్యామ్.సిఎస్ సంగీతాన్ని, ప్రవీణ్ బాలు ఛాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు చేస్తున్న ఈ చిత్రం ఈనెల 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బుధవారం సాయంత్రం చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత మీనాక్షి ఆనంద్ మాట్లాడుతూ ఇది తమ తొలి ప్రయత్నం అని చెప్పారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే నిర్మించడానికి సిద్ధమైనట్లు వెల్లడించారు. కలైయరసన్ ప్రతిభావంతుడైన నటుడని, ఆయన దీటుగా నటి ప్రియా లయ నటించారని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు శివరాజ్ మాట్లాడుతూ ఇది ప్రస్తుత సోషల్ మీడియా ముఖాన్ని తెరపై ఆవిష్కరించే కథాచిత్రమని చెప్పారు. ముఖ్యంగా నేటి సమాజానికి చాలా అవసరమైన చిత్రమని పేర్కొన్నారు. దీన్ని తాను చిన్న చిత్రంగా చేయాలి భావించానని, అయితే కలైయరసన్, సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ రావడంతో ట్రెండింగ్ పెద్ద చిత్రంగా మారిందన్నారు. నటుడు కలైయరసన్ మాట్లాడుతూ ఇది తనకు చాలా ముఖ్యమైన చిత్రంగా పేర్కొన్నారు. -
ఘనంగా సిపాయిల తిరుగుబాటు దినోత్సవం
● అమర వీరులకు అధికారుల ఘన నివాళివేలూరు: వేలూరులో 219వ సిపాయిల తిరుగుబాటు దినోత్సవాన్ని పురష్కరించుకుని అమర వీరుల స్థూపానికి కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఎస్పీ మదివాణన్, అధికారులు పుష్పగుచ్ఛం ఉంచి ఘన నివాలలు అర్పించి గౌరవ వందనం చేశారు. 1806 జూలై 10వ తేదిన వేలూరు కోటలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మొట్ట మొదటి సారిగా ఇండియ సిపాయిలు తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో బ్రిటీష్ వారిని సుమారు 250 మంది బ్రిటీష్ అధికారులు, సిబ్బందిని అంతమొందించి బ్రిటీస్ దేశ జెండాను కోటపై దించి యూనియన్ జాక్ జెండాను ఎగర వేశారు. టిప్పు సుల్తాన్ పులి జెండాను కూడా ఎగరవేశారు. అయితే కోట బయట వున్న మేజర్ గూడ్స్ అనే వ్యక్తి అప్పటి రాణిపేటలోని ఉన్న గుర్రపు వీరులు వేలూరుకు వచ్చి తుపాకీతో వచ్చి కోట తలుపులు తెరిచిలోనికి ప్రవేశించి తిరుగుబాటు చేసిన 850 మంది ఇండియన్ ఆర్మీ సిబ్బందిని కాల్చి చంపారు. అదే విధంగా కోట బయట ఉన్న 600 మంది వీరులను పట్టుకొని వేలూరు, తిరుచ్చారాపల్లి జైలులో ఉంచారు. 1806 సంవత్సరంలో జరిగిన ఈ యుద్ధంలో మరణించిన వీరులను వేలూరు మకాన్ సిగ్నిల్ వద్ద పెద్ద గుంత చేసి వాటిలో పాతి పెట్టారు. దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన స్థలంగా, దేశంలోనే మొదటిసారి స్వాతంత్ర ఉద్యమం వేలూరులో జరగడంతో ఇండియ వీరులను పాతి పెట్టిన స్థలంలో పెద్ద స్థూపాన్ని ఏర్పాటు చేశారు. దీంతో సిపాయిల తిరుగుబాటు దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థూపానికి వివిధ పుష్పాలంకరణలు చేసి వర్ధంతి దినంగా ప్రతి సంవత్సరం జూలై 10వ తేదీన జరుపుకుంటున్నారు. అందులో భాగంగా గురువారం ఉదయం కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఎస్పీ మదివాణన్, డీఆర్ఓ మాలతి, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణన్, ఎమ్మెల్యే కార్తికేయన్, మాజీ సైనికుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ వేలు, అధికారులు స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. -
తారాపురంలో ఈదురు గాలులు
● కూలిపోయిన జెయింట్ విండ్మిల్ అన్నానగర్: తిరుప్పూర్ జిల్లాలోని తారాపురం–పొల్లాచ్చి రహదారికి సమీపంలోని శీలనాయకన్పట్టి చెరియన్ కడుతోట్టమ్లో చైన్నెలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఏ ప్రైవేట్ కంపెనీ విండ్ ఫామ్ నిర్వహిస్తోంది. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అక్కడ బలమైన గాలి వీచింది. ఇందులో, ఆ భారీ గాలి వేగాన్ని తట్టుకోలేక జెయింట్ విండ్మిల్ పూర్తిగా విరిగి కింద పడిపోయింది. దెబ్బతిన్న పవన విద్యుత్ టర్బైన్ విలువ రూ.5 కోట్లు ఉంటుందని పవన విద్యుత్ టర్బైన్ కంపెనీ ఉద్యోగులు తెలిపారు. అలాగే అక్కడి విద్యుత్ స్తంభాలు కూడా దెబ్బతిన్నాయి. ఫలితంగా నివాసాలకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీని వల్ల గ్రామస్తులు ఇబ్బందులకు గురయ్యారు. అదృష్టవశాత్తూ, పవన విద్యుత్ టర్బైన్ విరిగి కూలిపోయినప్పుడు ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. -
తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెన్నైలో తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, తిరుమల మిల్క్ డెయిరీలో రూ.45కోట్ల మేర మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఫిర్యాదు వచ్చాయి. దీంతో, పోలీసులు.. దీనిపై విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాకుండానే నవీన్ ఆత్మహత్య చేసుకున్నారు.వివరాల ప్రకారం.. తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం రాత్రి చెన్నై బ్రిటానియా నగర్, ఫస్ట్ స్ట్రీట్లోని తన ఇంట్లో నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, డెయిరీలో మనీ ల్యాండరింగ్ జరిగిందని.. దీనిపై విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. దీనిపై విచారణకు హాజరు కాకుండానే ఇలా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరెస్ట్ భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆత్మహత్యకు గల కారణాలు తల్లికి, స్నేహితులకు, బంధువులకు నవీన్ మెయిల్స్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆయన ఆత్మహత్య అనంతరం, నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నవీన్ బొల్లినేని స్వస్థలం కృష్ణా జిల్లాగా తెలుస్తోంది. -
స్టాలిన్ చాణక్యం.. ఏకమైన మారన్ బ్రదర్స్!
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మరోసారి చక్రం తిప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తలనొప్పిగా మారిన కుటుంబ వివాదాన్ని చక్కదిద్దారు. డీఎంకే పార్టీకి ఇబ్బందికరంగా మారిన మారన్ సోదరుల ఆస్తి గొడవకు ముగింపు పలికారు. సరైన సమయంలో కల్పించుకుని అన్నదమ్ముల వివాదాన్ని పరిష్కరించారు. తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ద్రవిడర్ కజగం అధ్యక్షుడు కె వీరమణి, హిందూ దినపత్రిక మాజీ సంపాదకుడు ఎన్ రామ్ సహాయంతో మారన్ సోదరుల మధ్య సయోధ్య కుదిర్చారు. మారన్ కుటుంబంతో పాటు డీఎంకేలోనూ అలజడి రేగకుండా కాచుకున్నారు.భారీగా దయా'నిధి'ఆస్తుల్లో తనకు రావాల్సిన వాటా కోసం అన్న కళానిధి మారన్పై కోర్టుకెక్కిన డీఎంకే ఎంపీ దయానిధి మారన్కు భారీగానే నిధి దక్కినట్టు తెలుస్తోంది. దాదాపు రూ. 800 కోట్ల నగదు.. అంతే విలువైన చెన్నైలోని ఎలైట్ బోట్ క్లబ్ ప్రాంతంలో ఎకరం భూమిని పొందారని మారన్ కుటుంబం, డీఎంకే ఉన్నత వర్గాలు వెల్లడించినట్టు 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' తెలిపింది. మొత్తానికి దయానిధి మారన్ (Dayanidhi Maran) తాను అనుకున్నది సాధించారని సన్నిహిత వర్గాలు గుసగసలాడుతున్నాయి. ఎందుకంటే ఆస్తుల వివాద పరిష్కారానికి తనకు రూ. 1500 కోట్లు ఇవ్వాలని అంతకుముందు ఆయన డిమాండ్ చేసినట్టు తెలిసింది.అసలేంటి గొడవ?తన అన్నయ్య కళానిధికి జూన్ ప్రారంభంలో దయానిధి లీగల్ నోటీసు పంపడంతో మారన్ సోదరుల వివాదం బయట ప్రపంచానికి తెలిసింది. సన్ టీవీ నెట్వర్క్ షేర్లను అక్రమంగా తన పేరు మీద బదలాయించుకున్నారని దయానిధి ఆరోపించారు. సన్ టీవీ నెట్వర్క్ ఒక ప్రైవేట్ కంపెనీగా ఉన్నప్పుడు.. మోసపూరిత వాటా కేటాయింపులు, కార్పొరేట్ దుష్పరిపాలన, ఏకపక్ష నిర్ణయాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అన్నపై దావా వేశారు. అయితే దయానిధి రూ.1500 కోట్లు చెల్లించాలని కోరగా, కళానిధి రూ.500 కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పడంతోనే ఆస్తుల గొడవ రచ్చకెక్కిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా, తనపై తమ్ముడు చేసిన ఆరోపణలను కళానిధి కొట్టిపారేశారు. జూన్ 20న స్టాక్ ఎక్స్ఛేంజ్కు అధికారికంగా వివరణ ఇచ్చారు. పబ్లిక్ లిస్టింగ్కు ముందు సన్ నెట్వర్క్ కంపెనీకి చెందిన లావాదేవీలన్నీ చట్టబద్ధంగానే జరిగాయని తెలిపారు. వ్యక్తిగతంగానే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.స్టాలిన్ చొరవ.. సమసిన గొడవమారన్ సోదరుల మధ్య ఆస్తుల వివాదం ముదిరి పాకాన పడక ముందే పరిష్కరించాలని భావించిన సీఎం స్టాలిన్.. వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి స్వయంగా రంగంలోకి దిగారు. తాను చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఆయన రూటు మార్చారు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వీరమణి, ఎన్. రామ్లతో మంత్రాంగం నడిపించారు. ఇందులో భాగంగా మూడు దఫాల చర్చలు జరిగాయని.. వాటిలో రెండు వ్యక్తిగతంగా, ఒకటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగాయి. అయితే అన్నదమ్ముల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఈ చర్చలు జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 'మొదట మారన్ కుటుంబానికి వీరమణి ఫోన్ చేశారు. ఆ తర్వాత ఇతరులు కూడా చేరారు. జూన్ చివరి వారం నుంచి జూలై మొదటి వారం వరకు మూడు రౌండ్ల చర్చలు జరిగాయి. వివాదం గురించి ఇరు వర్గాలు మీడియాతో మాట్లాడకుండా ఉండాలని, సమస్య పరిష్కార దిశగా ముందుకు సాగాలని మధ్యవర్తులు సూచించార'ని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వివాదం కారణంగా డీఎంకే, మారన్ కుటుంబానికి ప్రతిష్టకు కలిగే భంగం.. ఎక్కువ కాలం వ్యాజ్యం కొనసాగడం వల్ల కలిగే నష్టం, కోర్టు ఖర్చుల గురించి కూడా చర్చల్లో పెద్దలు ప్రస్తావించినట్టు సమాచారం.వారిద్దరే ఎందుకు?మారన్ సోదరుల ఆస్తుల గొడవ పరిష్కారానికి ఎంకే స్టాలిన్ (MK Stalin) వ్యూహాత్మకంగా రాజకీయ కురువ`ద్ధుడైన వీరమణి, ప్రఖ్యాత జర్నలిస్ట్ ఎన్. రామ్లను ఎంచుకున్నారు. ఈ డిసెంబర్లో 93వ ఏట అడుగుపెట్టనున్న వీరమణి తమిళ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు. అంతేకాదు ద్రవిడ ఉద్యమంలో గౌరవనీయమైన వ్యక్తిగా ఆయన గుర్తింపు ఉంది. ఇంకో కీలక అంశం ఏమిటంటే సన్ నెట్వర్క్తో ఆయన ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు. స్టాలిన్ కుటుంబానికి మాత్రం ఇందులో 20 శాతం వాటా ఉంది. మారన్ కుటుంబానికి బంధువైన సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ (N Ram) సైద్ధాంతికంగా డీఎంకేకు దగ్గరగా ఉన్నారు. మీడియాలో విశ్వసనీయత ఆధారంగా మధ్యవర్తిత్వానికి ఆయనను స్టాలిన్ ఎంచుకున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వివాదం పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉందన్న భావనతో పరిస్థితిని చక్కదిద్దడానికి స్టాలిన్ జోక్యం చేసుకున్నారని డీఎంకే నేత ఒకరు వెల్లడించారు.వేర్వేరు రంగాల్లో..కళానిధి, దయానిధి తండ్రి దివంగత మురసోలి మారన్ (Murasoli Maran) కరుణానిధి మేనల్లుడు. డీఎంకే పార్టీ అండతో ఆయన పలు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన బతికున్నంత కాలం మారన్ కుటుంబంలో ఎటువంటి పొరపొచ్చాలు లేవు. ఇద్దరు కుమారులు వేర్వేరు రంగాల్లోకి ప్రవేశించి ముందుకెళ్లారు. కళానిధి 1993లో సన్ టీవీని ప్రారంభించి ప్రాంతీయ టెలివిజన్ మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. దయానిధి మారన్ తండ్రి వారసత్వాన్ని ఉపయోగించుకుని రాజకీయాల్లోకి ప్రవేశించి 2000లో కేంద్ర టెలికాం మంత్రి అయ్యారు.అక్కడి నుంచే మొదలు..మారన్ కుటుంబ వార్తాపత్రిక దినకరన్ కార్యాలయంపై 2007లో డీఎంకేలోని ఎంకే అళగిరి (MK Alagiri) మద్దతుదారులు దాడికి పాల్పడడం అప్పట్లో సంచలనంగా మారింది. స్టాలిన్ను కరుణానిధి రాజకీయ వారసుడిగా పేర్కొంటూ దినకరన్ పేపర్లో రావడంతో కోపోద్రిక్తులైన అళగిరి మద్దతుదారులు హింసాత్మకంగా స్పందించారు. పెద్ద కొడుకునైన తనను కాదని స్టాలిన్ను రాజకీయ వారసుడిగా వర్ణించడంతో అళగిరి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య దూరం కొనసాగుతోంది. తాజాగా మారన్ సోదరులు ఆస్తుల కోసం కోర్టుకెక్కడం తమిళ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అయింది. చదవండి: ఇందిరా గాంధీపై శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు -
14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి
తమిళనాడు: చెంగల్పట్టు సిటీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో తన తల్లిదండ్రులతో నివసిస్తున్న ఓ 10వ తరగతి బాలుడు రోజూ సాయంత్రం వేళల్లో ట్యూషన్కు వెళ్లేవాడు. ఈనేపథ్యంలో చెంగల్పట్టులో మెకానిక్గా పనిచేస్తున్న పాండిచ్చేరి వాసి అమితు అబ్దుల్ ఖాదర్ 13.04.2024న ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఆ బాలుడిని తన ద్విచక్ర వాహనం ఎక్కమని అడిగాడు. అతను ఎక్కనని చెప్పాడు. దానికి ప్రతిస్పందనగా, అబ్దుల్ ఖాదర్ ఆ బాలుడిని కత్తితో బెదిరించి తన బైకుపై తీసుకెళ్లి తిరుమణి రైల్వే గేట్ సమీపంలోని ఒక పొదలో లైంగిక దాడికి పాల్పడ్డాడు.నేను పిలిచినప్పుడల్లా రాకపోతే నీ తల్లిదండ్రులను చంపేస్తానని కూడా బెదిరించాడు. భయంతో ఆ బాలుడు తనకు జరిగిన విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఈ సందర్భంలో, గత 03.05.2024న, ట్యూషన్ పూర్తి చేసుకుని, రాత్రి 8.30 గంటలకు కాంచీపురం హై రోడ్కు తిరిగి వస్తున్న బాలుడిని కిడ్నాప్ చేసి, చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ముళ్ల పొదలో బంధించి కత్తితో బెదిరించి మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధను భరించలేక, ఆ బాలుడు తనకు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో షాక్ కు గురైన ఆ బాలుడి తల్లిదండ్రులు చెంగల్పట్టు నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా అమీద్ అబ్దుల్ ఖాదర్పై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అంతేకాకుండా, చెంగల్పట్టు పోక్సో కోర్టు ఈ కేసును దర్యాప్తు చేపట్టింది. బుధవారం ఈ కేసును విచారించిన ప్రభుత్వ న్యాయవాది లక్ష్మి అమీద్ అబ్దుల్ ఖాదర్కి యావజ్జీవ శిక్షను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇకపై ప్రమాదానికి ఆస్కారం ఇవ్వొద్దు!
– బాణసంచాల ప్రమాదంపై ట్రిబ్యునల్ సాక్షి, చైన్నె: విరుదునగర్లో జిల్లాలో ఇకపై ఒక్క బాణసంచా ప్రమాదానికి ఆస్కారం ఇవ్వొద్దని గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులను హెచ్చరించింది. విరుదునగర్ జిల్లా శివకాశి, సాత్తూరు పరిసరాలు బాణసంచాల తయారీకి ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడి ప్రజలకు బాణసంచా పరిశ్రమల్లో కూలీ పనులే దిక్కు. అదే సమయంలో నిత్యం ఇక్కడ ప్రమాదాలు సైతం తప్పడం లేదు. ఈ ఆరు నెలల్లో పదికి పైగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ ప్రమాదాలపై దక్షిణ భారత గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా పరిగణించింది. చైన్నెలోని ట్రిబ్యునల్ బుధవారం విరుదునగర్ జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఒక్కటంటే ఒక్క ప్రమాదం జరగడానికి వీలు లేదని హెచ్చరించింది. పది రోజుల్లో ఇక్కడున్న అన్ని పరిశ్రమల్లో కలెక్టర్ నేతృత్వంలో ఒక బృందం, పేలుడు పదార్థాల క్రమబద్ధీకరణ విభాగం అధికారులతో కూడిన మరో బృందం తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఇక్కడ కార్మికులకు ఉన్న భద్రత, ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకుండా చేపట్టిన చర్యలను సమగ్రంగా పరిశీలించి నివేదికలను సమర్పించాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. -
ఈసీఆర్లో కొత్త ఐకానిక్గా రాజ్ పారిస్
– బ్రాండ్ అంబాసిడర్గా శ్రుతిహాసన్ సాక్షి, చైన్నె: ఈస్ట్ కోస్టు రోడ్డులో కొత్త ఐకానిక్గా బ్రహ్మాండ లగ్జరీ ప్రాజెక్టుగా రాజ్ పారిస్ బ్లూ జ్యువెల్ను ఆవిష్కరించనున్నారు. ఇందుకు బ్రాండ్ అంబాసిడర్గా సినీ నటి శృతి హాసన్ వ్యవహరిస్తున్నారు. చైన్నెలో బుధవారం జరిగిన సమావేశంలో నిర్మాణ సంస్థ రాజ్ పారిస్ 2030 నాటికి రూ. 500 కోట్ల ఆదాయ సంస్థగా మార్చే విధంగా కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది. ఆ సంస్థ వ్యవస్థాపకులు ఆర్ సచ్చిదానందం, ఎండీ ఆర్ జయకుమార్, రాజ్కుమార్ సచ్చిదానందం మాట్లాడుతూ ఈసీఆర్లోని ముట్టు కాడులో ప్రశాంత పూరిత పరిసరాలలో సముద్ర తీరంలో ఒక బోటిక్ లగ్జరీ ప్రాజెక్టుగా బ్లూ జ్యువెల్ను 55 కుటుంబాల కోసం బహుళ అంతస్తుల భవనాన్ని ఒక కొత్త ఐకానిక్గా నిలిచే విధంగా తీర్చిదిద్దనున్నామని వివరించారు. కాంచీపురం, మదురైలతో పాటు చైన్నెలోని వెంచర్లను సకాలంలో పూర్తి చేసి ఉన్నామన్నారు. రాజ్ పారిస్ బ్లూ జ్యువెల్ ప్రాజెక్టుకు సినీ నటి శ్రుతిహాసన్ను అంబాసిడర్గా ఎంపిక చేశామన్నారు. ఈ సందర్భంగా వీడియో ద్వారా శ్రుతిహాసన్ ఆ ప్రాజెక్టులోని లగ్జరీ సేవలను వివరించారు. -
మహిళా బృందాల ఉత్పత్తులపై అధ్యయనం
● స్వయం సహాయక బృందాలతో డిప్యూటీ సీఎం భేటీ సాక్షి, చైన్నె: కరూర్ కార్పొరేషన్లో మహిళా స్వయం సహాయక బృందాల తయారు చేసే ఉత్పత్తులను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ బుధవారం అధ్యయనం చేశారు. అక్కడి ఉత్పత్తుల గురించి బృందాల సభ్యులతో సమావేశంలో అడిగి తెలుసుకున్నారు. వివరాలు.. కరూర్ కార్పొరేషన్లోని తిరునగర్ ప్రాంతంలో తలిర్ మహిళా స్వయం సహాయక కేంద్రం, సపోర్ట్ గ్రూప్ పేపర్ బ్యాగ్ తయారీ వర్క్షాప్ ఉంది. కరూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ప్రత్యేక ప్రాజెక్ట్ ప్రాసెసింగ్ విభాగం అదనపు ముఖ్య కార్యదర్శి ప్రదీప్తో కలిసి డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ బుధవారం సందర్శించారు. మహిళా స్వయం సహాయ బృందాలకు పెద్ద పీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రుణాలు,ప్రోత్సహం వంటి అంశాలను పరిగణించి సాగుతున్న వివిధ ఉత్పత్తులను అధ్యయనం చేవారు. గత నాలుగు సంవత్సరాలలో 19,12,927 గ్రూపులలోని 2,48,68,051 మంది సభ్యులకు రూ.1,20,240 కోట్ల విలువైన బ్యాంకు రుణాలు అందించడం ద్వారా తమిళనాడు ఆర్థిక పురోగతిలో మహిళా బృందాలు భాగస్వామ్యయ్యాయని ఈసందర్బంగా ఉదయ నిధి పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాలలో, 41,275 మంది మహిళలు 3,175 కొత్త స్వయం సహాయక బృందాలు ఏర్పాటైనట్టు తెలిపారు. రుణాలు పొంది.. కరూర్ కార్పొరేషన్లో తిరునగర్ ప్రాంతంలో 12 మంది మహిళా సభ్యులు తలిర్ మహిళా స్వయం సహాయక బృందంగా ఏర్పడి కరూర్ సిటీ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రుణాలను పొంది పేపర్ బ్యాగ్ తయారీతో పాటుగా వివిధ శిక్షణలు అందిస్తూ రావడం అభినందనీయమన్నారు. అంతే కాకుండా ఇంట్రా–గ్రూప్లోన్ మొత్తంతో రెస్టారెంట్ నిర్వహణ, వస్త్ర వ్యాపారం, ఫార్మసీ, టైలరింగ్ మొదలైన ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు. పేపర్ బ్యాగ్ తయారీ వర్క్షాప్లో పేపర్ బ్యాగు తయారీ యంత్రాల పనితీరును స్వయంగా తాను పరిశీలించాలని, ఇక్కడ వివిధ రకాల బ్యాగ్లను తయారు చేస్తున్నారన్నారు. మహిళా బృందంతో జరిగిన సమావేశంలో తలిర్ మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంకు రసీదులు, ఖర్చులు,రుణ చెల్లింపులు, సభ్యులకు తిరిగి చెల్లింపు, అంతర్గత క్రెడిట్తో సహా కమిటీ కార్యకలాపాలను ఆయన వివరంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జ్యోతి మణి, ఎమ్మెల్యే లుమాణిక్యం, ఆర్. ఇలంగో, కె శివకామ సుందరి, ప్రత్యేక ప్రాజెక్టు అమలు విభాగం అదనపు కార్యదర్శి డాక్టర్ ఎస్. ఉమ, జిల్లా కలెక్టర్ ఎం. తంగవేల్, మేయర్ కె. కవిత. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
మహాబలిపురానికి విద్యుత్ శోభ
– రూ. 13 కోట్లతో అభివృద్ధి పనులు సాక్షి, చైన్నె : మహాబలిపురానికి మరింత వన్నె తెచ్చే విధంగా విద్యుత్ వెలుగులతో శోభాయమానంగా తీర్చిదిద్దనున్నారు. రూ. 13 కోట్లతో పనులు చేపట్టనున్నారు. సాగతీరంలో ఉన్న పురాతన పట్టణం మహాబలిపురంలోని శిల్ప సందపలు, పర్యాటక అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడకు నిత్యం సందర్శకులు తరలి వస్తూ ఉన్నారు. అయితే అభివృద్ధి, వసతులు, శుభ్రత అంత మాత్రమే. గతంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్రాకతో ఈ పర్యాటక కేంద్రం నవ్య శోభను సంతరించుకుంది. తళ తళ మెరిసే రోడ్లు, శిల్ప సందలకు కొత్త సొబగులు, సాగర తీరంలో ఆహ్లాదకరం అన్నట్టుగా పరిస్థితి మారింది. అయితే, ఇవన్నీ చైనా అధ్యక్షుడి పర్యటన ముగిసే వరకే. మళ్లీ యాథారాజ తథా ప్రజా అన్నట్టుగా పరిస్థితి మారడంతో ఇక్కడి ఎన్నో ఆందాలు,శిల్ప సందలు , నిత్యం తరలి వచ్చే సందర్శకులు, పర్యాటకులకు ఏదీ శాశ్వత సౌకర్యాలు అంటూ హైకోర్టు సైతం ఇటీవల ఓ కేసు విచారణ సమయంలో ప్రశ్నించింది.దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వాస్తవానికి సాయంత్రం ఆరు గంటల సమయంలోచీకటి పడితే చాలు శిల్ప సంపదలను చూసేందుకు వీలుండదు. ఆమేరకు ఇక్కడ అద్వన్నంగా పరిస్థితులు ఆది నుంచి ఉన్నాయి. తాజాగా నిత్యం సందర్శకులు శిల్ప సందలు, అక్కడి అందాలను వీక్షించేందుకు వీలుగా విద్యుత్ వెలుగుల మయంలో ముంచెత్తేందుకు సిద్ధమయ్యారు. బుధవారం తమిళనాటు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీరు కె. శరవణన్, మహాబలిపురం టూరిజం అధికారి టి. శక్తివేల్ ఇక్కడ చేపట్టబోతున్నట్టు ఏర్పాట్లలో భాగంగా పరిశీలన జరిపారు. రూ. 13 కోట్లతో మహాబలిపురంను విద్యుత్ వెలుగు మయంలో శోభాయమానంగా తీర్చిదిద్దనున్నారు. అలాగే, కృత్రిమ మ్యూజికల్ నీటి ధార, ఎమరాల్డ్ పార్కు వద్ద బ్రహ్మాండ ఉద్యాన వనం, మినీ 5డీ థియేటర్, లేజర్ లైటింగ్ షో, శిల్ప సందపలు కొలువై ఉన్న వివిధ ప్రాంతాలలో మరింత ఆకర్షనీయమైన విద్యుత్ వెలుగులను నింపే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. -
ఎన్నికల కమిషన్కు రామన్న లేఖ
– నేనే పీఎంకే అధ్యక్షుడ్ని అని వివరణ సాక్షి, చైన్నె: కేంద్ర ఎన్నికల కమిషన్కు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు బుదవారం లేఖ రాశారు. తానే పీఎంకేకు వ్యవస్థాపక అధ్యక్షుడ్ని అని అందులో వివరించారు. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న అధికార సమయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా రాందాసు కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయిస్తూ లేఖ రాశారు. పీఎంకేలో అన్బుమణి ప్రస్తానం గురించి వివరిస్తూ, పీఎంకే నియమ నిబంధనలను ఆ లేఖలో వివరించారు. అన్బుమణి అధ్యక్ష పదవి కాలం ముగిసిందని వివరిస్తూ, ఎగ్జిక్యూటివ్ కమిటీ గురించి ప్రస్తావించారు. మే నెల నుంచి తానే పీఎంకేకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నట్టు వివరించారు. పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగాఎ గ్జిక్యూటీవ్ కమిటీలోని 21 మంది గురించి వివరిస్తూ, వీరితో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు. పార్టీకి సంబంధించి అంశాలు, వ్యవహారాలు, ఎన్నికల సందర్భంగా బీ ఫామ్లలోసంతకాలు చేసే అధికారం తనకే ఉందనివివరించారు. అన్బుమణి అధ్యక్ష పదవి మే నెల 28వ తేదిన ముగిసిందంటూ ప్రత్యేకంగా ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. అలాగే, ఆయన పేలవమైన పనితీరు కారణంగా ఎగ్జిక్యూటీవ్ పదవి నుంచి తప్పించినట్టు వివరించారు. 21 మంది ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యుల మద్దతు తనకే ఉందని, ఈ దృష్ట్యా, పార్టీకి తానే అధ్యక్షుడ్ని అని స్పష్టం చేస్తూ లేఖలో మరిన్ని వివరాలను పొందు పరిచారు. -
శివప్పు మల్లి, నటి ముచ్చర్ల అరుణ ఇంట్లో ఈడీ సోదాలు
తమిళసినిమా: చైన్నెలోని నటి ముచ్చర్ల అరుణ ఇంట్లో బుధవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బహుభాషా నటి ముచ్చర్ల అరుణ.ఈమె తమిళంలో కళ్లుక్కుళ్ ఈరం చిత్రం ద్వారా నటిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత, కరవమేడు కరవాయన్ మొదలగు పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. అదే విధంగా తెలుగు, కన్నడం భాషల్లోనూ నటించారు. కాగా అరుణ, మోహన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తరువాత నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల యూట్యూబ్ చానల్ను ప్రారంభించారు. అదే విధంగా మళ్లీ కన్నడం, మలయాళం భాషల్లో నటించడం మొదలెట్టారు. ఇకపోతే అరుణ భర్త ఇంటీరియర్ డిజైనర్ కావడం గమనార్హం. ఈయనపై మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో బుధవారం చైన్నె, నీలాంగరై ప్రొంతంలోని ముచ్చర్ల అరుణ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. -
సర్వదర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో 21 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 78,320 మంది స్వామివారిని దర్శించుకోగా 24,950 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి భక్తులు కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
క్లుప్తంగా
దేవుళ్లను అవమానించారంటూ.. – నటుడు సత్యరాజ్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తమిళసినిమా: సీనియర్ సినీ నటుడు సత్యరాజ్ నాస్తికుడు అన్న విషయం తెలిసిందే. ఈయన ద్రావిడర్ కళగం పార్టీ అధ్యక్షుడు పెరియార్. దేవుడి లేడు అనే సిద్ధాంతంతో జీవించారీయన. కాగా పెరియార్ వీరాభిమాని అయిన నటుడు సత్యరాజ్ ఇటీవల ఒక సందర్భంలో ఆస్తికానికి, నాస్తికానికి మధ్య భేదం ఏమిటన్న పెరియార్ను అడగ్గా ఆయన దేవాలయాల్లో హుండీలు పెడుతుంటారే అది ఆస్తికం అని పేర్కొన్నారన్నారు. ఆలయంలోని విగ్రహాలను చూపించి అది వెండినా, ఇత్తడినా అని అడిగితే అక్కడ పూజారి రాయి అని చెప్పారన్నారు. తనను ఆస్తికుల గురించి అడిగిన వారికి పెరియార్ ఈ విషయం గురించి చెప్పీ మీరెందుకు గొడవ పడతారు, దేవుడు అదృశ్యం అయ్యే కల్పితం అని పెరియార్ చెప్పారని నటుడు సత్యరాజ్ పేర్కొన్నారు. కాగా సత్యరాజ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హిందూ మక్కళ్ సమాఖ్య వ్యవస్థాపకుడు ఆర్డీ ప్రభు, చైన్నె కార్యవర్గ నిర్వాహకుడు సతీష్ బుధవారం చైన్నె పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో దేవుళ్లను అవమానించే విధంగా మాట్లాడిన నటుడు సత్యరాజ్ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్లో అగ్నిప్రమాదం తిరువళ్లూరు: తిరువళ్లూరులోని ఫాస్ట్ఫుడ్ సెంటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని సీవీ నాయుడు రోడ్డులో కింగ్స్ ఫాస్ట్ఫుడ్ సెంటర్ వుంది. ఈ సెంటర్ను నెల్లైకి చెందిన కుమార్(45) నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం యథావిధిగా వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్లిపోయారు. అయితే బుధవారం ఉదయం హఠాత్తుగా ఫాస్ట్ఫుడ్ సెంటర్ నుంచి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అప్పటికే వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలి –జాక్టోజియో ధర్నా తిరువళ్లూరు: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాక్టోజియో ఆధ్వర్యంలో బుధవారం మెడికల్ కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆందోళనలో జాక్టోజియో రాష్ట్ర కో–ఆర్డినేటర్లు దాస్, జ్ఞానశేఖరన్ హాజరై ప్రసంగించారు. జ్ఞానశేఖరన్ మాట్లాడుతూ ఉపాధ్యాయలు, ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి, పాత పింఛన్ విధానాన్ని అమలు చే యాలని డిమాండ్ చేశారు. సంఘం నిర్వాహకు లు ప్రభాకరన్, దివ్య, రాజాజి, జవహర్, షేక్ గఫూర్, సెంథిల్కుమార్, వెన్నెల పాల్గొన్నారు. దంపతుల ఆత్మహత్య తిరువొత్తియూరు: కుటుంబ కలహాలతో అధిక మోతాదులో బీపీ ట్యాబెట్లు మింగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. చైన్నె మనలి పుదునగర్కు చెందిన వేదగిరి (45), హేమమాలిని(44) దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో విరక్తి చెంది వేదగిరి బీపీ మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలిసి ఆమె కూడా బీపీ మాత్రలు మింగింది. వెంటనే కుమారుడు ఇద్దరిని ప్రభుత్వాస్పత్రిలో చేర్చాడు. అక్కడ చికిత్స పొందుతూ దంపతులు ఇద్దరు మృతిచెందారు. మనలి పుదునగర్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. మద్యం మత్తులో పాఠశాలకు.. అన్నానగర్: మద్యం మత్తులో ఓ టీచర్ పాఠశాలకు వెళ్లారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అన్నామలై పెట్టిన పోస్ట్లో...పాఠశాల విద్యాశాఖా మంత్రి సొంత జిల్లా తిరుచ్చి మనప్పారై సమీపంలోని వైయమలై పాలయం పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో ఒక టీచర్ మద్యం మత్తులో పాఠశాలకు వచ్చాడు. తరగతి గదులు లేకుండా చెట్ల కింద విద్యార్థులు చదువుకుంటున్న తిరుచ్చి జిల్లాలో, ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు మద్యం తాగి పాఠశాలకు వస్తున్నాడు. ఇవి పాఠశాల విద్యారంగం దుస్థితిని తెలియజేస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత, పాఠశాల విద్యా రంగంలో తరగతి గదుల కొరత, శాంతిభద్రతలు దారుణంగా ఉండడంతో డీఎంకే ప్రభుత్వ విభాగాలన్నీ కుంటుపడుతున్నాయి. కానీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వీటిపై ఆందోళన చెందకుండా మరోసారి ప్రజలను మోసం చేయడానికి బయలుదేరారు. పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు బాధ్యత వహిస్తారని అన్నామలై పోస్ట్ చేశారు. -
రోడ్డులో సంచరిస్తున్న పశువుల పట్టివేత
తిరువళ్లూరు: వాహనదారులకు ఇబ్బంది కలిగేలా రోడ్డులో అడ్డదిడ్డంగా సంచరిస్తున్న పశువులను మున్సిపల్శాఖ అధికారులు పట్టి గోశాలకు తరలించారు. తిరువళ్లూరులో తిరుపతి–చైన్నె, తిరుత్తణి–తిరువళ్లూరు, ఊత్తుకోట–తిరువళ్లూరు, తిరువళ్లూరు–పేరంబాక్కం, తిరువళ్లూరు–రెడ్హిల్స్ మార్గాల్లో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈక్రమంలో రోడ్డులో పశువులు అడ్డదిడ్డంగా తిరగడం, రాత్రి సమయంలో రోడ్డుకు మధ్యలో పడుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో రోడ్డులో సంచరించే పశువులను పట్టాలని వాహనచోదకులు కలెక్టర్ సహా ఉన్నతాధికారులకు విన్నవించారు. ఇందులో భాగంగానే రోడ్డుపై సంచరించే పశువులను పట్టి గోశాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో తిరువళ్లూరు మున్సిపాలిటీలోని 27 వార్డులో సంచరిస్తున్న 78 పశువులను పట్టుకుని గోశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న కొందరు పశువుల యజమానులు గోశాలకు వెళ్లి రూ.2 నుంచి రూ.3వేల వరకు జరిమానా చెల్లించిన వారికి పశువులను అప్పగించారు. ఇకపై రోడ్డుపై పశువులను వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. -
కిడ్నాప్ కేసులో నిందితుల విచారణ
తిరువళ్లూరు: బాలుడి కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఐదుగురి వద్ద సీబీసీఐడీ పోలీసులు భారీ పోలీసు బందోబస్తు నడుమ బుధవారం తిరువళ్లూరులోని వారి కార్యాలయంలో విచారణ చేశారు. తిరువళ్లూరు జిల్లా తిరువేళాంగాడు సమీపంలోని కిళాంబాక్కం గ్రామానికి చెందిన ధనుష్. ఇతను తేని జిల్లాకు చెందిన విజయశ్రీ అనే యువతిని ఇన్స్ట్రాగామ్ ద్వారా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి ఇష్టంలేని యువతి తండ్రి వనరాజా, బంధువులు మణిగంఠన్, గణేషన్, మహేశ్వరి, శరత్కుమార్ కలిసి యువకుడి తమ్ముడిని కిడ్నాప్ చేశారు. ఐదుగురిని గత నెల 13న పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పురచ్చిభారతం పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేవీ కుప్పం ఎమ్మెల్యే జగన్మూర్తి, ఏడీజీపీ జయరామ్లకు సంబంధం వుందన్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. జగన్మూర్తి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకోగా, ఏడీజీపీ అరెస్టు కాకుండా స్టే తెచ్చుకున్నారు. ఈనేపథ్యంలోనే కేసు విచారణ సీబీసీఐడీకి బదిలీ జరిగింది. నిందితులను కస్టడీకి అనుమతించాలని కోర్టుతో సీబీసీఐడీ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతి ఇచ్చిన క్రమంలో బుధవారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ తిరువళ్లూరులోని సీబీసీఐడీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. విచారణ రెండు రోజుల పాటు సాగనుంది. విచారణ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రతిభ చాటిన విద్యార్థినులు
కొరుక్కుపేట: విద్యార్థినిల్లోని ప్రతిభా పాటవాలను వెలికితీసేలా శ్రీ కన్యకాపరమేశ్వరీ మహిళా కళాశాలలో స్నిగ్ధా –2025 పేరిట సాంస్కృతిక ఉత్సవాలను రెండు రోజులు పాటు ఏర్పాటు చేశారు . తొలి రోజు బుధవారం ఉదయం కళాశాలలోని కళాలయా ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ తరపున ఆఫ్ స్టేజ్ ఈవెంట్గా హెయిర్ డూ, నెయిల్ ఆర్ట్ ,బాటిల్ ఆర్ట్ ,మండల ఆర్ట్ పోటీలు నిర్వహించారు . ఈ సందర్భంగా మొదటి సంవత్సవంలో చేరిన విద్యార్థినిలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆయా పోటీల్లో ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా జి స్వప్న, ఎస్ హరిణి , మరియాకెన్సీ వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చందన దీపా మాట్లాడుతూ ప్రతీ ఏడాది స్నిగ్థాపేరిట పోటీలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. విద్యార్థినుల్లో ప్రతిభను వెలికితీయటమే ఈపోటీల ప్రధాన లక్ష్యం అని అన్నారు . కళాశాల కరస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్ ప్రోత్సాహంతో ఈపోటీలను చేపట్టినట్టు ఆమె వెల్లడించారు. విజేతలకు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. -
12న వేలూరులో క్రికెట్ క్రీడాకారుల ఎంపిక
వేలూరు: రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12న క్రికెట్ క్రీడాకారుల ఎంపిక జరగనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ చైర్మన్, నరువి ఆసుపత్రి చైర్మన్ జీవి సంపత్ ఒక ప్రకటనలో తెలిపారు. బాగాయంలోని తందై పెరియార్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో 25 సంవత్సరాలు లోపు ఉన్న క్రీడాకారులు వారి ఆధార్ కార్డు తో పాటు క్రికెట్ యూనిఫామ్ తో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని పేర్కొన్నారు. నమ్మకానికి మద్దతుగా ఆవిష్కరణలు సాక్షి, చైన్నె: రైతులు తమపై ఉంచిన నమ్మకానికి మరింత మద్దతుగా నిలిచే విధంగా ఆవిష్కరణలపై దృష్టి పెట్టామని ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ జాయింట్ ఎండీ రామన్ మిట్టల్ తెలిపారు. బుధవారం స్థానికంగా ఎఫ్వై 26లో కొత్త రికార్డు నమోదును వివరించారు. అత్యాధునిక ఇంజినీరింగ్ సామర్థ్యాలకు నిదర్శనంగా దమ్ ఆగే బద్నేకా అనే బ్రాండ్ వాగ్దానంతో 20–120 హెచ్పీ ట్రాక్టర్ విభాగంలో గణనీయమైన పురోగతిని ప్రతి రైతుకు అందించామన్నారు. రైతులకు ఖరీప్లో మరింత తోడ్పాటుగా, మెరుగైన ఆదాయం తీసుకొచ్చే విధంగా ఆవిష్కరణలలో సాంకేతితను ఉపయోగించనున్నామని ఆయన వివరించారు. -
రూ.276 కోట్ల కస్టమ్స్ సుంకం చెల్లించాలి
● నాలుగు టోల్ ప్లాజాల గుండా ప్రభుత్వ బస్సులు నడపొద్దు ● హైకోర్టు ఆదేశాలు కొరుక్కుపేట: దక్షిణ జిల్లా రహదారులపై ఉన్న 4 టోల్ బూత్ల వద్ద ఈనెల 10వ తేదీ నుంచి ప్రభుత్వ బస్సులను అనుమతించకూడదని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. మధురై, కన్యాకుమారి, తిరునేల్వేల్లి సహా దక్షిణ జిల్లాల్లోని ప్రదాన రహదారులపై నాలుగు టోల్ బూత్లనునిర్వహిస్తున్న కంపెనీలు మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన కేసులలో తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ చాలా కాలంగా తమ కంపెనీలకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించలేదని, ఇంకా రూ.276 కోట్ల బకాయిలను ఖర్చు చేయలేదని ఆరోపించాయి. ఉద్యోగులు టోల్ బూత్ల వద్ద బస్సులను ఆపి చార్జీలు వసూల చేయలేని పరిస్థితి ఉందని, ఈ విషయంలో తగినచర్యలు తీసుకోవాలని కోరారు . ఈ కేసు విచారించిన న్యాయమూర్తి ఆనంద వెంకటేష్ మాట్లాడుతూ రవాణా సంస్థలు బకాయిలను పరిష్కరించకుండా వివాదాన్ని పొడిస్తూనే ఉంటే బకాయిలు రూ. 300 కోట్ల నుంచి రూ.400 కోట్లకు పైగా పెరుగుతాయన్నారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకునేందుకు ప్రభుత్వ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాగా రవాణా సంస్థలు చర్యలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసును గురువారానికి వాయిదా వేశారు. -
కదం తొక్కిన కార్మిక లోకం
–200 మంది కార్మికుల అరెస్ట్ తిరువళ్లూరు: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్మికుల డిమాండ్లను పరిస్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చిన విష యం తెలిసిందే. తిరువళ్లూరులోని రైతుబజార్ వద్ద నిర్వహించిన ఆందోళనకు డీఎంకే, ఐఎన్టీయూసీ, ఏ ఐటీయూసీ, సీఐటీయూ, ఏఐసీటీయూ, యూటీయూ సీ కార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరైయ్యారు. కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బ్యాంకులు, రైల్వే, ఇన్సూరెన్స్, పోర్టులను ప్రైవేటీకర ణ చేయకూడదన్నారు. పాత పింఛన్ విధానాన్ని వెంటనే అమల్లోకి తేవాలని, కార్మిక సంఘాల సంక్షేమ బో ర్డులను నిర్వీర్యం చేయకూడదని అన్నారు. కార్మిక వ్య తిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కనీస వేతనం కింద రూ.26 వేలు అందించాలని డి మాండ్ చేశారు. అనంతరం అనుమతి లేకుండా రాస్తారోకో చేశారన్న నెపంతో రెండు వందల మందిని అరె స్టు చేశారు. తమ డిమాండ్లను పరిస్కరించని పక్షంలో ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. -
ఉన్నత విద్య కోసం కోస్టుగార్డు ఒప్పందం
సాక్షి, చైన్నె : కోస్టు గార్డు కుటుంబాలకు చెందిన వారికి విద్యా అవకాశాలు, సంక్షేమానికి మద్దతు ఇచ్చే విధంగా ఎస్ఆర్ఎం ఐఎస్టీ, సీజీడబ్ల్యూడబ్ల్యూఏ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. కాటన్ కొళత్తూరులోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ సంక్షేమ సంస్థ అయిన కోస్ట్ గార్డ్ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ అసోసియేషన్(సీజీడబ్ల్యూడబ్ల్యూఏ) మధ్య జరిగిన సమావేశానంతరం ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ వివరాలను బుధవారం ప్రకటించారు. చైన్నెలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ రీజినల్ హెడ్ క్వార్టర్స్ (తూర్పు)లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ అవగాహన ఒప్పందంపై ఎస్ఆర్ఎం ఐఎస్టీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. పొన్నుసామి, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆర్ హెచ్ క్యూ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డిఐజి అనురాగ్ కౌశిక్, సీజీడబ్ల్యూడబ్ల్యూఏ అధ్యక్షురాలు ప్రియా పరమేష్ అధికారికంగా సంతకం చేశారు. ఎస్ఆర్ఎం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సి. ముత్తమిళ్చెల్వన్ ఈసందర్భంగా మాట్లాడుతూ, తమ సంస్థలో బహుళ విభాగం విద్య, పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇందులో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్, సీజీడబ్ల్యూడబ్ల్యూఏ సహకారంతో దేశానికి సేవ చేసే వారి కుటుంబాలకు నాణ్యమైన విద్యా అవకాశాలను అందించడం ద్వారా సామాజిక బాధ్యత తమ అంకితభావాన్ని చాటుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ ఒప్పందం సేవలందిస్తున్న, పదవీ విరమణ చేసిన కోస్ట్ గార్డ్ సిబ్బంది పిల్లలు, జీవిత భాగస్వాముల ఉన్నత విద్యకు మద్దతు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే మరణించిన లేదా వైకల్యంతో జీవిస్తున్న కోస్టు గార్డు సిబ్బంది కుటుంబాలకు కూడా ఒప్పందం వర్తిస్తుందన్నారు. అవగాహన ఒప్పందం నిబంధనల ప్రకారం తమ క్యాంపస్లలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ , డాక్టోరల్ ప్రోగ్రామ్లలో ట్యూషన్ ఫీజు రాయితీలతో పాటూ రిజర్వుడ్ సీట్లు అందిస్తామన్నారు. -
● ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతే లక్ష్యం కావాలి ● సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలవండి ● విద్యార్థులకు సీఎం ఎంకే స్టాలిన్ పిలుపు ● ఐక్యంగా ఉంటే ఎవ్వరూ ఓడించ లేరని వ్యాఖ్య
సాక్షి, చైన్నె : తిరుచ్చి జమాల్ మహ్మద్ కళాశాలలో కోరల్ ఫెస్టివల్ ఆఫ్ ది ఇయర్ ప్రారంభోత్సవ వేడుక, గ్లోబల్ జమాలియన్స్ బ్లాక్ భవనం ప్రారంభోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం ఎంకే స్టాలిన్ విద్యార్థులను పలకరిస్తూ ముందుకెళ్లారు. ఆయనతో కరచాలనానికి పెద్దసంఖ్యలో విద్యార్థులు ఎగబడ్డారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినా అనంతరం సీఎం స్టాలిన్ ప్రసంగించారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిరంతరం ప్రయాణిస్తున్నానే ఉన్నానని, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటునే ఉన్నానని గుర్తు చేశారు. అంతే కాదు, క్షేత్రస్థాయి అధ్యయన సమావేశాలకు కూడా హాజరవుతూ, నిరంతరం ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ తానూ ఇక్కడున్న వారిలా తానూ ఒక్కడ్నే అని వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులను కలిసినప్పుడు తనలో కొత్త శక్తి వస్తుందని, అందుకే విద్యార్థులు పాల్గొనే కార్యక్రమం అయితే, వెంటనే అంగీకరించడం జరుగుతున్నట్టు చెప్పారు. తాను తిరువారూర్ పర్యటనకు వె ళ్తూ ఇక్కడకు వచ్చినట్టు వివరిస్తూ, 2006లో ఇక్కడ జరిగిన కళాశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుక కోసం వచ్చానని, 2022లో జమాలియ బ్లాక్ శంకుస్థాపన వీడియో కాన్పరెన్స్ ద్వారా చేసినట్టు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన శ్రీఇస్లామిక్ తమిళ సాహిత్య సదస్స్ఙుకు తాను హాజరయ్యారనని, ఐక్యత, సోదరభావాన్ని ఎలా బలోపేతం చేయవచ్చో, స్నేహం , సమాజంలో అందరం ఒక్కటే అని చాటేనట్టు వివరించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సామరస్యానికి ప్రతీకగా ఈ కళాశాలలను అభివర్ణించ వచ్చు అని వివరించారు. విద్యారంగంలో 75 సంవత్సరాలుగా కలలను నిజం సాకారం చేస్తూ వస్టున్నటు వివరించారు. గాడ్సే మార్గం వద్దు.. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో హాజీ జమాల్ ముహమ్మద్ సాహిబ్ కీలక పాత్ర పోషించి ఉన్నారని వివరిస్తూ, 1931లో మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన పోరాటంలో ఆయన పాల్గొన్నారని తెలిపారు. లండన్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలోగాంధీజీకి ఒక బ్లాంక్ చెక్కును కూడా అందించారని, ఇందులో మీకు ఎంత డబ్బు కావాలన్నా రాసుకోండని, దాన్ని పోరాటానికి మద్దతు నిధిగా ఉపయోగించమని పేర్కొని ఉన్నారన్నారు. అలాగే, ఖాజా మియాన్ రౌథర్ కూడా వ్యక్తిగతంగా ఓ కాటన్ మిల్లును నడిపి ప్రజలకు ఉచితంగా వస్త్రాన్ని అందించండని ముందుకు వచ్చారని, ఈ ఇద్దరు గాంధీ మార్గాన్ని అనుసరించారన్నారు. ఇక్కడ అనేక మార్గాలు ఉన్నప్పటికీ, గాంధీ మార్గం – అంబేడ్కర్ మార్గం – పెరియార్ మార్గంను విద్యార్థులు ఎంపిక చేసుకోవాలని, అయితే, గాడ్సే గుంపులో మాత్రం కలవ వద్దు అని, ఈ మార్గం వద్దే వద్దు అని హితవు పలికారు. విద్యార్థులకు విద్య చాలా ముఖ్యం అని, ఆత్మవిశ్వాసం మెండుగా నింపుకుని సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కళాశాలలో చదువుకున్న వారెందరో ఉన్నత పదవులలో ఉన్నారని, పూర్వ విద్యార్థుల జాబితాను పరిశీలిస్తే అధికారులుగా, న్యాయమూర్తులుగా, శాస్త్ర వేత్తలుగా, మంత్రులుగా కూడా ఇక్కడ చదువుకున్నవారే ఉన్నారని వివరించారు. తన కేబినెట్లోని మంత్రి కేఎన్ నెహ్రూ, ఎంఆర్కే పన్నీరు సెల్వం ఇద్దరు ఈ కళాశాల పూర్వ విద్యార్థులు కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇలాంటి ఉన్నత పదవుల జాబితాలో ఇక్కడున్న విద్యార్థులు అధిరోహించాలని, తమిళనాడు అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. అందరం ఐక్యంగా ఉంటే తమిళనాడును ఎవ్వరూ ఓడించ లేరని ధీమా వ్యక్తం చేశారు. తాను ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడటం లేదని, అ యితే, ఈ కళాశాల ఎందరో నాయకుల్ని తమిళనాడుకు ఇచ్చిందని, సమాజానికి సేవకులను అందించిందని, సామరస్య స్ఫూర్తి, దేశ భక్తిని కలిగించిందన్నారు. విద్యార్థులతో కరచాలనంవిద్యకు ప్రాధాన్యత.. ద్రావిడ మోడల్ ప్రభుత్వం నిరంతరం ప్రజాభివృద్ధితో పాటుగా విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నట్టు వివరించారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలన్న కాంక్షతో వివిధ పథకాలను అందించడమే కాదు, నైపుణ్యాల అభివృద్ధికి సైతం తోడ్పాటును అందిస్తున్నామని గుర్తు చేశారు. వివిధ విద్యా పథకాల ద్వారా తమిళ సమాజాన్ని జ్ఞాన సమాజంగా మార్చడం, కొత్త అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. నేటి యువతరం అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని, ఎల్లప్పుడూ యువతకు మద్దత ఇచ్చే విధంగా తమ పయనం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ అన్నీ.. అనేది తమ నినాదం! ఇదే.ద్రవిడ మోడల్ ! గత పాఠాలు, ప్రస్తుత అవకాశాలను ఉపయోగించుకోవడం ద్వారా భవిష్యత్తు సుసంపన్నం చేసుకోవచ్చు అని, భవిష్యత్తు మీదే అని సూచించారు. విద్య ను అనేక సామాజిక పోరాటాల ద్వారా సాధించుకున్నామని, తమిళనాడు పోరాట ఫలితమే సామాజిక న్యాయం అని వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ‘ఓరనియిల్ తమిళనాడు’ ( తమిళనాడు అంటే ఒకే జట్టు) అని చాటుదామని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.ఎన్. నెహ్రూ, గోవి చెలియాన్, అన్బిల్ మహేష్ పొయ్యామొళి, మెయ్యనాథన్, టీఆర్ పీ రాజా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఖాదర్ మొహిద్దీన్, ఎంపీలు తిరుచ్చి శివ, నవాజ్ ఖని, సల్మా , శాసనసభ సభ్యులు ఇనిగో ఇరుదయరాజ్, అబ్దుల్ సమద్, తిరుచ్చి జిల్లా కలెక్టర్ శరవణన్, జమాల్ మొహమ్మద్ బిలాల్, జమాల్ మొహమ్మద్ కళాశాల అధ్యక్షుడు, సెక్రటరీ ఖాజా నజీముద్దీన్, కోశాధికారి జమాల్ మహమ్మద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జార్జ్ అమల రత్నం తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిరువారూర్ పర్యటనకు వెళ్లిన సీఎం స్టాలిన్కు జనం బ్రహ్మారథం పట్టరు. దారి పొడవున ఆయనకు ఘనస్వాగతం పలికారు. రోడ్ షోలో జనాన్ని పలకరిస్తూ సీఎం స్టాలిన్ ముందుకు సాగారు. -
కానరాని సార్వత్రిక సమ్మె ప్రభావం
● కేవలం నిరసనలతో సరి ● కేరళ, పుదుచ్చేరికి ఆగిన రవాణా సాక్షి, చైన్నె : కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మే బుధవారం తమిళనాట ప్రభావాన్ని చూపించ లేదు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. సాధారణంగానే రవాణా సేవలుతో పాటూ ఇతర సేవలు సాగాయి. అయితే ఎల్ఐసీ, ఆదాయ పన్ను, పోస్టల్ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖలలో పనిచేసే కార్మిక సంఘాలు విధులను బహిష్కరించారు. కార్మిక సంఘాల నేతృత్వంలో నిరసనలు పలు చోట్ల జరిగాయి. వివరాలు.. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, నాలుగు లేబర్కడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్దరించాలన్న నినాదంతో కార్మిక సంఘాలు ఒక రోజు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ సమ్మేకు తమిళనాట స్పందన కరువైంది. తమిళనాడులో డీఎంకే కార్మిక సంఘం, సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఎన్టీయూసి , తదితర 13 కార్మిక సంఘాలు ఈసమ్మేకు మద్దతు ప్రకటించాయి.అయితే, ప్రజలకు ఎలాంటి నష్టం అన్నది కలుగ కుండా కేవలం నిరసనలకు పరిమితం చేశారు. యథా ప్రకారం, ఆటో, బస్సులు, రైళ్ల సేవలన్నీ సాగాయి. రవాణా వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలుగల లేదు. వ్యాపార సంఘాలు ఈ సమ్మేకు మద్దతు ఇవ్వని దృష్ట్యా అన్ని రకాల దుకాణాలన్నీ తెరిచే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, సిబ్బంది విధులకు హాజరయ్యారు. సాధారణ రోజులలో ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి కొనసాగింది. అయితే, పోస్టల్, ఆదాయ పన్ను, ఎల్ఐసీ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. కొన్ని చోట్ల విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. ఈ సమ్మె ప్రభావం అన్నది తమిళనాట కాన రాలేదు. అయితే, కేరళ పూర్తి స్థాయిలో, పుదుచ్చేరిలలో కొంత మేరకు సమ్మె ప్రభావం కనిపించింది. దీంతో తమిళనాడు నుంచి కేరళ, పుదుచ్చేరి వైపుగా వెళ్లిన బస్సులు రాష్ట్రాల సరిహద్దులకే పరిమితం చేశారు. కోయంబత్తూరు, సెంగోట్టై, కన్యాకుమారి , తేని, నీలగిరిలలోని కేరళ సరిహద్దుల చెక్ పోస్టుల వరకే తమిళనాడు బస్సులు సాగాయి. పుదుచ్చేరి వైపుగా కడలూరు, విల్లుపురం సరిహద్దులకే పరిమితం చేశారు. ధర్నాలను అడ్డుకున్న పోలీసులు కార్మిక సంఘాల నేతృత్వంలో చైన్నెతో పాటూ పలు నగరాలలు, జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రామాలు జరిగాయి. ధర్నాలు , రాస్తారోకోలకు నిరసన కారులు దిగగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. చైన్నెలో అన్నా సాలై, గిండి, అంబత్తూరు, తిరువొత్తియూరులలో కార్మిక సంఘాలు రాస్తారోకోకు దిగడంతో వాహనాల రాక పోకలకు ఆటంకం తప్పలేదు. అన్నాసాలై, గిండిలలో నిరసనలతో నగరంలో రెండు గంటల పాటూ తీవ్ర వాహన రద్దీతో ట్రాఫిక్ కష్టాలు వాహన దారులకు తప్పలేదు. చైన్నెలో నిరసనకు దిగిన 1,500 మంది కార్మిక సంఘాల ముఖ్య నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. -
తిరువణ్ణామలైలో ఆర్కే రోజా పూజలు
వేలూరు: తిరువణ్ణామలైలో పౌర్ణమి రోజున శివుడిగా భావించే అన్నామలైయర్ కొండను 14 కిలోమీటర్ల దూరం చుట్టి రావడం ఆనవాయితీ. మంగళవారం సాయంత్రం ప్రదోష దినోత్సవం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో గిరి వలయం వచ్చారు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సినీ నటి రోజా గిరి వలయం రోడ్డులో 14 కిలోమీటర్ల దూరం కాలినడకన నడిచి వచ్చారు. దారిలోని అష్ట లింగ ఆలయంలో దీపాన్ని వెలిగించి పూజలు చేశారు. భక్తులు ఆమెతోపాటు సెల్ఫీ తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ఇండో – రొమేనియా సంబంధాలు మరింత బలోపేతం సాక్షి, చైన్నె : ఇండో – రొమేనియా సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా సాంస్కృతిక దౌత్యాన్ని చాటుకునే విధంగా హెచ్ ఐటీఎస్ 21వ శతాబ్దపు స్టూడియో ఏర్పాటు చేశారు. హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ చైన్నె క్యాంపస్లో జరిగిన విశిష్ట ఉపన్యాసం కార్యక్రమం ద్వారా 21వ శతాబ్దపు స్టూడియోను ప్రారంభించడం ద్వారా ఇండో–రొమేనియన్ సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించామని బుధవారం నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమం రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సహకారం , సాంస్కృతిక సహకారం కీలకం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రపంచానికి రొమేనియా సహకారం , ఇండో–రొమేనియన్ స్నేహంపై భారతదేశంలో రొమేనియా రాయబారి సేనా లతీఫ్ ప్రసంగించారు. సృజనాత్మక పరిశ్రామికం, వీడియో చిత్రీకరణ, విద్యను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అత్యాధునిక 21వ శతాబ్దపు వీడియో స్టూడియో ను ఈసందర్భంగా ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, కేరళకు సంబంధించిన రొమేనియా గౌరవ కాన్సుల్ జనరల్ డాక్టర్ విజయ్ మెహతా, స్ట్రాటజిక్ గ్లోబల్ అడ్వైజర్, ఫిల్మ్ మేకర్ , సామాజిక కార్యకర్త డాక్టర్ సంజానా జోన్, హిందుస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – సైన్స్ ప్రో చాన్స్లర్ డాక్టర్ అశోక్ జార్జ్ వర్గీస్, డిప్యూటీ డైరెక్టర్ ఎనిద్ వర్గీస్ జాకబ్, ప్రో చాన్స్లర్ డాక్టర్ అశోక్ జార్జ్ వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్తో ఐఐటీ మద్రాసు ఒప్పందం కొరుక్కుపేట: ఐఐటీ మద్రాసు లోని వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఏఐ, టెక్నాలజీ అండ్ డేటా కంపెనీ అయిన లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు బుధవారం జరిగిన కార్యక్రమంలో వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఏఐ అధిపతి ప్రొ ఫెసర్ బలరామన్ రవీంద్రన్, లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సీఈవో శిరీష వోరుగంటి సమక్ష్యంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. పరిశోధన ఆధారిత పారిశ్రామిక ప్రాజెక్టులు , లోతైన పరిశోధన ప్రాజెక్టులు తోపాటు పరిశోధన అవకాశాలను పెంపొందించేలా ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించారు. 13 మందికి సమన్లు సాక్షి, చైన్నె: గేట్ కీపర్, రైల్వే అధికారులు, సిబ్బంది సహా 13 మందికి సమన్లు జారీ అయ్యాయి. దక్షిణ రైల్వే ఉన్నత స్థాయి కమిటీ ఎదుట వీరు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. వివరాలు.. కడలూరు జిల్లా సెమ్మంకుప్పం రైల్వే క్రాసింగ్లో స్కూల్ వ్యాన్ను రైలు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈప్రమాదంలోముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. మరో విద్యార్థి గాయాలతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణకు దక్షిణ రైల్వే ఆదేశించింది. దీంతో గేట్కీపర్ పంకజ్ శర్మతోపాటు, రైల్వే అధికారులు, సిబ్బంది సహా 13 మందికి సమన్లు జారీ అయ్యాయి. దీంతో వారంతా విచారణకు హాజరు కావాల్సి ఉంది. అలాగే ప్రమాద ఘటనపై పోలీసులు సైతం దర్యాప్తు వేగవంతం చేశారు. గేట్ కీపర్ ఉత్తరాది వాసి కావడంతో వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో పంకజ్శర్మను విధుల నుంచి తప్పించి విచారణ పరిధిలోకి తెచ్చారు. అతని స్థానంలో తమిళనాడుకు చెందిన ఆనంద్ రాజ్ను గేట్ కీపర్గా నియమించారు. -
అభివృద్ధి పనులు వేగవంతం
తిరువళ్లూరు: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడంతో పాటు పనులు నాణ్యతగా ఉండేలా చూడాలని అంచనాల కమిటీ అధ్యక్షుడు గాంధీరాజన్ ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లాలోని 2024–26 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన వేర్వేరు అభివృద్ధి పనులను గాంధీరాజన్ నేతృత్వంలోని కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు కరుమాణిక్యం, చిన్నదురై, వెంకటేషన్, రాజా, ఎస్.ఎస్ బాలాజి, సుదర్శనం, పన్నీర్సెల్వం, కలెక్టర్ ప్రతాప్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు, వాటి నాణ్యతను సైతం పరిశీలించి పలు సూచనలు చేశారు. పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్లో సహకార, దేవదాయ, మున్సిపల్, వ్యవసాయం, రోడ్డు భవనాలు, విద్యాశాఖ సహా 20 శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. గాంధీరాజన్ మాట్లాడుతూ తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మహాకుంభాబిషేకం జరిగినా అక్కడ అర్ధాంతరంగా ఆగిన అభివృద్ధి పనుల కోసం రూ.16.50 కోట్లను కేటాయించి పనులు చేస్తున్నట్టు వివరించారు. 500 మంది భక్తులు కూర్చునేలా కల్యాణమండపం, రూ.14 కోట్లతో నాలుగు మండపాలను నిర్మిస్తున్నామని, పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం నూతన అన్నదాన సత్రం నిర్మాణాన్ని రూ.26 కోట్లతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. తిరువళ్లూరులో రూ.37 కోట్లతో నిర్మిస్తున్న బస్టాండు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, తిరుత్తణి చంద్రన్, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాన్, అదనపు కార్యదర్శి సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
ఆణి రథోత్సవం
నెల్లయ్యప్పర్ సన్నిధిలోజ్యేష్టాభిషేక ఉత్సవాలు ప్రారంభంసాక్షి, చైన్నె: తిరునల్వేలిలో ప్రసిద్ధి చెందిన నెల్లయ్యప్పర్ ఆలయంలో ఆణి బ్రహ్మోత్సవాల భాగంగా మంగళవారం రథోత్సవం కనుల పండువగా జరిగింది. గత వారం రోజులుగా తిరునల్వేలి(నెల్లై) నగర నడి బొడ్డున నెల్లయ్యప్పర్, గాంధీ మది అమ్మన్ పేరిట శివ, పార్వతిలు కొలువై ఉన్నారు. ఇక్కడ ఆణి ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ధ్వజారోహణం గత వారం జరిగింది. ఈ ఉత్సవాలలో ముఖ్యఘట్టం మంగళవారం జరిగింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్త జనం సోమవారం రాత్రే నెల్లైకు చేరుకున్నారు. హరోం..హర.., మహాదేవ నామస్మరణలు మార్మోగాయి. వేకువ జామున రెండు గంటల నుంచే ఆలయంలో ఉత్సవ వేడుక మొదలైంది. ఉదయాన్నే రథోత్సవం కనుల పండువగాజరిగింది. స్వామి అమ్మవారు రథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. మహాదేవా...శంభో శంకరా అన్న నామస్మరణనడుమ స్వామి వారి రథం కదిలింది. దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు, స్పీకర్ అప్పావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కాంగ్రెస్ ఎంపీ రాబర్డ్ బ్రూస్ ఒకే వేదిక భక్తి కార్యాక్రమంలో కనిపించారు. నలుగురు ఒకే చోట నిలబడి రథాన్ని లాగుతూ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్త జనుల జయజయ ధ్వానాలు, మేళ తాళాల నడుమ కనుల పండువగా రథోత్సవం జరిగింది. భక్తులు లక్షల్లో తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. రౌడీ అరెస్టు అన్నానగర్: 15 ఏళ్లుగా పరారీలో ఉన్న చూలైమేడు రౌడీ ఆవు దినేష్ పోలీసులు అరెస్టు చేశా రు. చైన్నెలోని చూలైమేడుకు చెందిన ప్రముఖ రౌడీ దినేష్పై వివిధ కేసులు ఉన్నాయి. దినేష్ 15 ఏళ్ల నుంచి పరారీలో ఉన్నాడు. ఈ పరిస్థితిలో తన సహచరుల ద్వారా తాను చనిపోయానని పోలీసులను నమ్మించిన దినేష్, అజ్ఞాతంలో ఉంటూ పలు నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. దీనిపై నిఘా పెట్టిన చైన్నె పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, ఆంధ్రప్రదేశ్లో దాక్కున్న ఆవు దినేష్ను అరెస్టు చేశారు. మద్యం, లాటరీ టికెట్ల కేసులో ఇద్దరు.. సేలం: మద్యం, లాటరీ టికెట్ల విక్రయం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈరోడ్ జిల్లా లోని భూతప్పడిలో మద్యం బాటిళ్లను నిల్వ చేసి, మద్యం షాపులు మూసివేసినప్పుడు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అమ్మపైట్టె పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ కార్తీ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఈరోడ్ పీపీ అగ్రహారం కామరాజ్నగర్కు చెందిన కార్తి (45) ని అరెస్టు చేసి, 27 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, గోపి శార ద మరియమ్మన్ ఆలయం వెనుక ప్రాంతంలో సబ్ ఇన్స్పెక్టర్ సత్యన్ గస్తీకి వెళ్లిన సమయంలో ప్రభుత్వం నిషేధించిన కేరళ రాష్ట్ర లాటరీ టికెట్ల ను విక్రయి స్తున్న సిద్ధోడ్ నల్లకుండంపాళయానికి చెందిన సుబ్రమణి (75)ని అరెస్టు చేసి, 20 లాటరీ టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. భవానీసాగర్లో పెరిగిన నీటిమట్టం సేలం: భవానీసాగర్ ఆనకట్టలో నీటిమట్టం పె రిగింది. ఈరోడ్ జిల్లా ప్రజలకు తాగు,సాగు నీ టికి భవానీసాగర్ ఆనకట్ట ప్రధాన వనరు. 105 అడుగులు భవానీసాగర్ ఆనకట్ట పరిధి లోని ఈరోడ్, తిరుప్పూర్, కరూర్ జిల్లాల్లో 2.5 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి ఈ ఆనకట్ట ద్వా రా సాగునీరు అందుతుంది. గత కొన్నిరోజులు గా నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నందున, భవానీసాగర్ ఆ నకట్టకు నీటి ప్రవాహం పెరుగుతోంది. ఫలితంగా ఆనకట్టలో నీటి మట్టం కూడా పెరుగుతోంది. మంగళవారం ఉదయం నాటికి భవానీసాగ ర్ ఆనకట్ట నీటిమట్టం 95.31 అడుగులకు పెరిగింది. 3,249 క్యూబిక్ అడుగుల నీరు ఆనకట్టలోకి వస్తోంది. భవానీసాగర్ ఆనకట్ట నుంచి తాగునీటి కోసం 100 క్యూబిక్ అడుగుల నీటిని,తాడపల్లి–అరక్కన్కోట్టై నీటిపారుదల కోసం 800 క్యూబిక్ అడుగుల నీటిని, కళింగరాయన్ నీటిపారుదల కోసం 400 క్యూబిక్ అడుగుల నీటిని భవానీ నదికి విడుదల చేస్తున్నారు. లో యర్ భవానీ కెనాల్ ద్వారా సాగునీటి కోసం 5 క్యూబిక్ అడుగుల నీటితోసహా మొత్తం 1,305 క్యూబిక్ అడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. లారీ ఢీకొని ఇద్దరు విద్యార్థుల మృతితిరువొత్తియూరు: పుదుచ్చేరిలో తండ్రితో బైకులో వెళుతున్న సమయంలో లారీ ఢీకొని ఇద్దరు విద్యా ర్థులు మృతి చెందారు. పుదుచ్చేరి ముత్తయ్య పా లయం ప్రాంతానికి చెందిన నడన సభాపతి ప్రభు త్వ ఉద్యోగి. ఇతనికి భార్య అనిత, జీవా (14), తువర శేషు (8) పిల్లలు ఉన్నారు. జీవా తొమ్మిదో తరగతి, తువర శేషు మూడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో నడన సభాపతి రోజు తన కుమారులను ముత్తయ్య పాలయం నుంచి పాఠశాలకు బైకులో తీసుకుని వెళ్లి వదిలిపెట్టి వస్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తన ఇద్దరు పిల్లలను బైక్లో తీసుకుని వెళుతుండగా ఉగటేరి, పొరయురు రోడ్డులో ఓ లారీ, వారి బైక్ ను ఢీకొంది. ఈ ఘటనలో సభాపతి, జీవా, తువ ర శేషు ఎగిరి, లారీ చక్రం కింద పడి, అక్కడికక్కడే మృతి చెందారు. సభాపతి స్వల్పంగా గాయపడ్డారు. అక్కడికి చేరుకున్న ప్రజలు లారీని అడ్డుకుని డ్రైవర్ను పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. సేలం : త్రయోదశి తిథి, కేట నక్షత్రం సందర్భంగా ఈరోడ్ కోటలోని కస్తూరి అరంగనాథర్ ఆలయంలో జ్యేష్టాభిషేకం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్స వాల తొలి ఘట్టంగా ఉదయం 7 గంటలకు తిరుప్ప ల్లాండు, తిరుప్పళ్లియాజుల్చి, పుణ్యకవజనై హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు తిరుమంజనం, మూలవర్లకు తైలంసత్తుపది నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత కస్తూరి అరంగనాథర్ మూలవర్కు మహా దీపారాధన చేశారు. బుధవారం ఉదయం 7 తిరుప్పల్లాండు, తిరుప్పళ్లియాజుల్చి, తిరుమంజనం, తిరుపవడై పూజ, మహా దీపారాధన చేసి, భక్తులకు స్వామి ప్రసాదాలు అందజేస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉదయం అభిషేక పూజ, నాలాయిర దివ్య ప్రబంధ సేవ నిర్వహిస్తారన్నారు. 26న మండలపూజతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. నడిరోడ్డులో ప్రియుడిపై యువతి దాడితిరువొత్తియూరు: నడిరోడ్డులో ప్రియుడిపై ఓ యువతి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కోయంబత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరం నిర్వహించారు. శిబిరం ముగిసే సమయానికి జనసమూహం తగ్గుతూ కనిపించింది. కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు తమ పని ముగించుకుని, ఇళ్లకు తిరిగి వెళుతున్నారు. ఆ సమయంలో, ఒక యువ జంట కలెక్టరేట్ కార్యాలయం ముందు మాట్లాడుకుంటుండగా, ప్రజల ముందు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఆగ్రహించిన యువతి తన ప్రేమికుడి చెంపపై ముఖంపై కొట్టింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంతంలో భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వడవల్లికి చెందిన ఆ యువతిని ప్రేమించిన తిరుప్పూర్ అవినాసిపాళయం ప్రాంతానికి చెందిన యువకుడు 9 నెలలుగా కోవైలో ప్రత్యేక ఇల్లు తీసుకుని, పెళ్లి చేసుకుంటానని ఇద్దరు కాపురం చేశారు. అనంతరం వివాహం చేసుకోనని నమ్మించి మోసం చేశాడని తెలిసింది. దీంతో పోలీసులు యువతి వద్ద ఫిర్యాదు తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. కిడ్పాప్ కేసులో యువకుడి అరెస్టుఅన్నానగర్: తమిళనాడు విక్టరీ పార్టీ కార్యక్రమంలో ఫుడ్ పార్శిల్ కొనడానికి వెళ్లిన బాలికను కిడ్నాప్ చేసినందుకు ఒక యువకుడిని అరెస్టు చేశారు. చైన్నె మనలిలోని వడువైద్యయమ్మన్ నగర్లో సోమవారం తమిళ విక్టరీ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. అదే ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలిక ఆహార పదార్థాలు కోసం వెళ్లింది. తరువాత ఆ బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఆమె కోసం చాలా చోట్ల వెతికారు. కానీ ఆమె ఆచూకీ కనిపించలేదు. ఇదిలా ఉండగా, అదే ప్రాంతానికి చెందిన మురళి (23) అనే వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసి, తన ఇంట్లో బంధించాడని తెలిసింది. తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి వెళ్లి చూడగా, బాలిక ఏడుస్తూ కనిపించింది. దీనిపై మురళిని ప్రశ్నించగా, తాను తాగి ఉన్నానని చెప్పాడు. అతను విరుద్ధంగా మాట్లాడాడు. దీంతో అతని చెరలో ఉన్న అమ్మాయి రక్షించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనాలి పుదునగర్ పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి మురళి పారిపోయాడు. ప్రత్యేక పోలీసు బృందం సభ్యులు గాలింపు చర్యలు చేపట్టి, సోమవారం రాత్రి అంబత్తూరులో దాక్కున్న మురళిని అరెస్టు చేశారు. అతను బాలికను ఎందుకు కిడ్నాప్ చేశాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి అరెస్టు
తిరువళ్లూరు: కత్తి చూపించి చైన్ స్నాచింగ్కు పాల్పడడంతోపాటు ఆటో, ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసిన కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 19 సవర్ల బంగారు నగలు, ఆటో, ద్విచక్ర వాహనంతోపాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలోని విజయలక్ష్మీపురం ప్రాంతానికి చెందిన భగవాన్దాస్(64) తన ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని యువకుడు కత్తి చూపి, అతడి మెడలోని బంగారు గొలుసును లాక్కుకుని పరారయ్యాడు. అలాగే అంబత్తూరు సమీపంలోని పుదూరు గ్రామానికి చెందిన రాజ(52) తన ఇంటి ముందు ఆపి ఉన్న ఆటో సైతం చోరికి గురైంది. దీంతో పాటు విజయలక్ష్మీపురం గ్రామానికి చెందిన వెంకటేషన్(46) అనే వ్యక్తి వద్ద రూ.12 వేలు అపహరించారు. మూడు సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ పుటేజీల ఆధారంగా అంబత్తూరు కల్లికుప్పం గ్రామానికి కృష్ణన్ కుమారుడు అజిత్(27)ఈ చోరీలకు పాల్పడినట్టు గుర్తించారు. అతడిని అరెస్టు చేసి, ఆటో, ద్విచక్ర వాహనం, బంగారునగలను స్వాధీనం చేసుకున్నారు. -
చంద్రగిరిలో క్రీడలకు శిక్షణ
తిరుపతి అర్బన్: క్రీడల అభివృద్ధికి పునాదులు వేద్దామని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఒలింపియన్ స్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ రజనితోపాటు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. క్రీడారంగంలో ఆసక్తి ఉన్న 6–8ఏళ్ల విద్యార్థులను గుర్తించి, చంద్రగిరిలో వారికి వసతులు కల్పించడంతోపాటు క్రీడలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఆగస్ట్ మొదటి వారంలో వారికి పోటీలు నిర్వహించడానికి ఎస్సీ, బీసీ హాస్టళ్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. క్రీడారంగంలో విద్యార్థులను ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై క్రీడాకారిణి రజని పలు సూచనలు చేశారు. ప్రధానంగా హాకీ, కబడ్డీ, ఫుట్బాల్ తదితర క్రీడల్లో విద్యార్థులు రాణించడానికి తీసుకోవాల్సిన విషయాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్కుమార్రెడ్డి, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి భరత్కుమార్రెడ్డి, డీఎస్డీఓ శశిధర్, ఆంధ్ర హాకీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి, హాకీ కోచ్ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి వేలూరు: కనీస వసతులు కల్పించాలని శక్తినగర్ వాసులు కార్పొరేషన్ కార్యాలయాన్ని ము ట్టడించారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలోని సేన్బాక్కం శక్తినగర్లో 15 ఏళ్లుగా సుమారు 500 కుటుంబాలకుపైగా నివశిస్తున్నాయి. తమ ప్రాంతంలో కనీస వసతులు కల్పించాలని కోరుతూ స్థానికులు మేయర్ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఆ సమయంలో మేయర్ ఇది వరకే శక్తినగర్కు నిధులు కేటాయించి, పనులు చేయక పోవడంతోనే రోడ్డు వసతి, డ్రైనేజీ కాలువ, తదితర వసతులు చేయలేక పోయామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధు లు కేటాయించి పనులు చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహించిన శక్తినగర్ వాసులు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి, ధర్నా నిర్వహించారు. తమ ప్రాంతంలో కనీస వసతులు కల్పించాలని, డ్రైనేజీ కాలువ లేక పోవడంతో నీరు పూర్తిగా వీధులపై రావడంతో దోమల బెడదతోపాటు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆరో పించారు. తమ ప్రాంతంలో పన్నులు మాత్రం వసూలు చేసుకుని కనీస వసతులు కల్పించడం లేదని, దీనిపై కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. వేలూరులో అన్నాడీఎంకే ధర్నా వేలూరు: పెట్ల్యాండ్ ప్రభుత్వాస్పత్రి మూసివేత నిరసనగా అన్నాడీఎంకే కార్యకర్తలు ధర్నా చేశా రు. వేలూరులో పెట్ల్యాండ్ ప్రభుత్వాస్పత్రిని రూ.198 కోట్ల వ్యయంతో నిర్మించి, గత నెల 25వ తేదీన సీఎం స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఆస్పత్రిలో రోగులకు ఎటువంటి కనీస వసతులు లేకపోవడంతో ఆస్పత్రిని మూసి వేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి మూసివేతకు నిరసనగా అన్నాడీఎంకే పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం వేలూరు అన్నారోడ్డులో ధర్నా నిర్వహించనున్న ట్లు ప్రకటించారు. ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ఆ పార్టీ మాజీ మంత్రి ముక్కూరు సుబ్రమణియన్, జిల్లా కార్యదర్శి ఎస్ఆర్కే అప్పు, ఐటీ విభాగం రీజినల్ కార్యదర్శి జననీ సతీష్కుమార్, జిల్లా కోశాధికారి మూర్తి, జిల్లా మాజీ కార్యదర్శి రాముల అధ్యక్షతన కార్యకర్తలు అధిక సంఖ్యలో అన్నారోడ్డు వద్దకు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకుని, ధర్నా నిర్వహించేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ కార్యకర్తలు ధర్నా చేయడంతో పోలీసులు చేసేది లేక కార్యకర్తలను అరెస్టు చేసి ప్రైవేటు కళ్యాణ మండపంలో ఉంచారు. థింఫామ్ పర్వత రహదారిలో చిరుత సంచారం సేలం : థింఫామ్ పర్వత రహదారిలో చిరుతపులి సంచరిస్తుండగా ఓ వాహనచోదకుడి చూసి, భయాందోళనకు గురయ్యాడు. ఈరోడ్ జిల్లా సత్యమంగళం సమీపంలోని తింబం కొండల్లోని రోడ్డు మీదుగా కర్ణాటక నుంచి సత్యమంగళం ప్రాంతానికి రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. తింబం కొండల్లో ఏనుగులు, చిరుతలు ఉన్నాయి. సోమవారం రాత్రి తింబం కొండ రోడ్డులోని 3వ హెయిర్పిన్ మలుపు వద్ద ఒక వ్యక్తి వాహనంలో వెళుతుండగా అక్కడ ఉన్న రిటైనింగ్ వాల్పై చిరుతపులి పడుకుని ఉండడం చూసి అతను షాక్ అయ్యాడు. వాహనం కాంతిని చూసి, రిటైనింగ్ వాల్పై ఉన్న చిరుతపులి అకస్మాత్తుగా మేల్కొంది. దీనితో భయపడిన డ్రైవర్ నెమ్మదిగా తన వాహనాన్ని వెనక్కి తిప్పాడు. అక్కడి నుంచి లేచిన చిరుతపులి కొంతసేపు రోడ్డు వెంట నడిచి, ఆపై అడవిలోకి వెళ్లింది. రోడ్డు ప్రమాదంలో నలుగురు చైన్నె వాసుల మృతి అన్నానగర్: కారును లగేజీ వ్యాను ఢీకొన్న సంఘటనలో చైన్నెకి చెందిన నలుగురు మృతి చెందారు. చైన్నెలోని పెరుంగళత్తూర్కు చెందిన కుమార్ (57). అతని భార్య జయ (55), కుమార్తె మోనిషా (30), బంధువులు స్టాలిన్ (36), అతని భార్య దుర్గ (32), వారి కుమార్తె నీలవేణి సూర్య(3) కారులో తంజావూరు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లారు. వారు మంగళవారం ఉదయం కుంభకోణంలోని ఆలయాన్ని సందర్శించిన తర్వాత తంజావూరులోని పెద్ద ఆలయాన్ని సందర్శించడానికి బయలుదేరారు. తంజావూరు సమీపంలోని విక్రవాండి బైపాస్లో కారు వెళుతుండగా ఎదురుగా వస్తున్న లగేజ్ వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో జయ అక్కడికక్కడే మరణించింది. కుమార్, దుర్గ, మోనిషా, స్టాలిన్, నీలవేణి సూర్య, మినీ లారీ డ్రైవర్ విఘ్నేష్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న తంజావూరు తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని చికిత్స కోసం తంజావూరు ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. కుమార్, దుర్గ, బాలిక నీలవేణి సూర్య ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. మోనిషా, స్టాలిన్, లారీ డ్రైవర్ విఘ్నేష్ చికిత్స పొందుతున్నారు. -
డివైడర్ను ఢీకొన్న మినీ బస్సు
వేలూరు: డివైడర్ను మినీ బస్సు ఢీకొన్న సంఘటనలో పదిమంది గాయపడ్డారు. అనకట్టు నియోజక వర్గంలోని తట్టాన్గుట్టై గ్రామంలో సోమవారం సాయంత్రం వివాహ వేడుకలు జరిగాయి. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం సేలం నుంచి మొత్తం 15 మంది కళాకారులు మినీ వ్యాన్లో వచ్చి నాట్య కళను ప్రదర్శించి, అనంతరం మంగళవారం ఉదయం అదే వ్యాన్లో సేలం నగరానికి బయలు దేరారు. వ్యాన్ పింజీమందై అటవీ ప్రాంతం వద్ద వెళుతున్న సమయంలో మినీ బస్సు అదుపు డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో 10 మంది కళాకారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. తోటి కళాకారులు వెంటనే అంబులెన్స్కు సమాచారం అందజేశారు. అంబులెన్స్ రావడానికి ఆలస్యం కావడంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనచోదకులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు అనకట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● పది మందికి తీవ్ర గాయాలు -
మొక్కలతోనే మానవ మనుగడ
రామచంద్రాపురం : మానవాళి జీవన గమనానికి మొక్కలు ప్రధాన భూమిక పోషిస్తాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. మండల పరిధిలో కుప్పంబాదురు సమీపంలోని ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ –2025 కార్యక్రమాన్ని ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కై లాస్ గురూజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆశ్రమం వద్దకు చేరుకున్న ఆయనకు నిర్వాహుకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆశ్రమంలో మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాణాయోగ ఆశ్రమం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉందని తెలిపారు. ప్రాణయోగ ఆశ్రమాన్ని నూతన టెక్నాలజీతో నిర్మించడం కారణంగా ఇక్కడి వాతావరణంలో కార్బన్ శాతం తగ్గించి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉందని తెలిపారు. అడవులలో మొక్కల పెంపకానికి ముందు కొచ్చిన ప్రాణ యోగ ఆశ్రమ పీఠాధిపతి కై లాస్ గురూజీకి అభినందనలు తెలిపారు. అనంతరం ప్రాణ యోగ ఆశ్రమం ఆధ్వర్యంలో వేప, మర్రి చెట్లు నాటారు. ఆశ్రమం పక్కన ఉన్న ఫారెస్ట్ భూమిలో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం 300 మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో తిరుపతి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ, ఐఆర్ఎస్ అధికారిణి పాయల్ గుప్తా, డాక్టర్ సత్యనారాయణరాజు, ఎంపీడీఓ ఇందిరమ్మ, డిప్యూటీ తహసీల్దార్ అన్వర్ భాష, ఏపీవో సుజాత, వ్యవసాయ శాఖ అధికారిణి మమత తదితరులు పాల్గొన్నారు. -
ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి..!
కీర్తి సురేష్ కొత్త అవతారం?తమిళసినిమా: పరము, సెల్ఫిష్ చిత్రాల ఫేమ్ మాణిక్ జయ్.ఎన్ దర్శకత్వం వహించిన మూడవ చిత్రం కై మేర. వచ్చిక్కవా చిత్రంలో హీరోగా నటించిన ఈయన పరము చిత్రంతో దర్శకుడిగా అవతారమెత్తారు. కాగా కై మేర చిత్రం ద్వారా ఎల్ఎన్టీ ఎతీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. తారై కృష్ణన్, రంజిత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో మరో కీలక పాత్రలో దర్శకుడు మాణిక్ జయ్.ఎన్ నటించారు.నటి సౌమ్య, కష్ణ నందు, జ్ఞానేశ్వరి మొదలగు ముగ్గురు కథానాయికలు నటించారు. దీనికి విఘ్నేశ్ రాజా సంగీతాన్ని అందించారు. ఈ మనిషి శరీరంలో మృగం సెల్స్ చేరితే జరిగే పరిణామాలే ఏమిటన్న ఇతివృత్తంతో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ కథా చిత్రం ఈ నెల 18న తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్వీ.ఉదయకుమార్, పేరరసు తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను విడుదల చేశారు. ఈ వేదికపై దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ఈ చిత్ర కథానాయకుడు తమిళంలో మాట్లాడాలా ఆంగ్లంలో మాట్లాడాలా, కన్నడంలో మాట్లాడితే తప్పు అవుతుందా ? అన్న భావనతో కాస్త తడబడ్డారని, అయితే తమకు భాషతో పనిలేదని,ప్రతిభ ఉంటే చాలని చూస్తామన్నారు. నటుడు రజనీకాంత్ ను ఇక్కడ సూపర్ స్టార్ కొనియాడుతున్నామని, తమిళనాడు నుంచి వెళ్లిన ఒక కథానాయకిని అక్కడ కొనియాడబడుతున్నారా ?అని ప్రశ్నించారు. కాగా తమిళ చిత్రపరిశ్రమలో భాషా భేదం లేదని పేర్కొన్నారు.ఇకపోతే ప్రస్తుతం కోలీవుడ్లో మాదక ద్రవ్యాల సంస్కృతి అధికం అవుతోందని, ఈ విషయంలో సినిమా వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. కాగా సస్పెనన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన కై మేర చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు. -
తిరుమళిసై సిడ్కోలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
తిరువళ్లూరు: తిరుమళిసై సిడ్కో ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, వర్షపు నీరు వెళ్లడానికి కాలువల నిర్మాణం తదితర అంశాలపై కలెక్టర్ ప్రతాప్ ఆకస్మిక తనిఖీ చేశారు. తిరువళ్లూరు జిల్లా తిరుమళిసైలో సిడ్కో ప్రాంతంలో సుమారు 300కు పైగా పరిశ్రమలున్నాయి. వీటితోపాటు భారీ పరిశ్రమలు పదికి పైగా ఉన్నాయి. గత రెండు సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు నేమం చెరువు నుంచి మొతాదుకు మించి నీటిని విడుదల చేయడంతో పరిశ్రమలు మునిగిపోయి భారీ నష్టం కలిగింది. దీంతో అప్పటి నుంచి తిరుమళిసై సిడ్కోలో వర్షపు నీరు కాలువలు, పరిశ్రమల నుంచి వెలువడే కెమికల్ నీటిని శుద్ధీకరణ కేంద్రానికి తరలించడానికి ప్రత్యేక కాలువలను నిర్మించాలన్న ప్రతిపాదనలున్నాయి. ఈ క్రమంలో కలెక్టర్ ప్రతాప్ అధికారులతో కలిసి మంగళవారం ఉదయం తిరుమళిసై సిడ్కో ప్రాంతంలో తనిఖీ చేశారు. కాలువల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. సిడ్కోలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఇతర సదుపాయాలను కల్పించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని కలెె క్టర్ తెలిపారు. -
అన్భుమణిపై చర్యకు నిర్ణయం
– రామన్న భేటీలో తీర్మానం సాక్షి, చైన్నె : పీఎంకే నుంచి అన్బుమణి తొలగించేందుకు రాందాసు సిద్ధమయ్యారు. ఆయనపై చర్యకు పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో మంగళవారం తీర్మానం చేశారు. పీఎంకేలో తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య సాగుతున్న సమరం క్లైమాక్స్ దశకు వచ్చినట్టుంది. అన్బుమణి చర్యలను తీవ్రంగా పరిగణించిన రాందాసు ఆయన్ని పార్టీ నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా మంగళవారం తైలాపురంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు నేతృత్వంలో జరిగిన సమావేశంలో అన్బుమణి చర్యలపై తీవ్రంగా చర్చించారు. అన్బుమణి కారణంగా పార్టీకి తీవ్ర నష్టం కలుగుతున్నట్టు పలువురు నేతలు వ్యాఖ్యలు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్బుమణి వెన్నంటి ఉన్న వాళ్లను దారిలోకి తెచ్చుకోవాలంటే, వేటు పడాల్సిందేనని నినదించినట్టు సమాచారం. చివరగా సమావేశంలో 2026 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని నిర్ణయాలను తీసుకునే అధికారాన్ని రాందాసుకు అప్పగించారు. అలాగే అన్బుమణిపై చర్యలు తీసుకునేలా తీర్మానించడం గమనార్హం. ఈ పరిణామాలు చూస్తే అన్బుమణిని పీఎంకే నుంచి తప్పిస్తారా..? తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనన్న చర్చ బయలు దేరింది. తైలాపురంలో వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న వేళ చైన్నె టీనగర్లో అన్బుమణి తన మద్దతు దారులతో చర్చలలో మునగడం గమనార్హం. -
● అపూర్వ కలయిక
కోయంబత్తూరులోని గవర్నర్ మెంట్ కాలేజ్ ఆఫ్టెక్నాలజీ(జీసీటీ)లో 2000 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిశారు. సిల్వర్జూబ్లీ వేడుకగా పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తామ చదువుకున్న తరగతిగదులు, ల్యాబ్, హాస్టళ్లను పరిశీలించారు. నాటి జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు. ఇలాంటి కలయిక అన్నది జీసీటీ కెరీర్లోనే కాదు, తమ విలువలను, బంధాలను మరింత బలోపేతం చేసినట్టుగా నిర్వాహకురాలు సుభద్రతా శ్రీధరన్ పేర్కొన్నారు. – సాక్షి, చైన్నె -
ఎక్సార్చిస్ట్ తరహాలో జన్మనక్షత్రం
తమిళసినిమా: నటుడు తమన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జన్మనక్షత్రం. అమోఘం స్టూడియోస్, వైట్ లాంప్ పిక్చర్స్ సంస్థల కలిసి నిర్మించిన చిత్రం ఇది. మణివర్మన్ దర్శకత్వం వహించిన ఇందులో నటి మల్వీ మల్హోత్రా నాయకిగా నటించిన ఈ చిత్రానికి ఒరు నొడి వంటి సక్సెస్ ఫుల్ చిత్రం టీమ్ పని చేయడం విశేషం. సంజయ్ మాణిక్ సంగీతాన్ని , కేజీ.మెయ్యప్పన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న తెరపైకి రానుంది. ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను రోమియో పిక్చర్స్ సంస్థ అధినేత రాహుల్ పొందారు. ఈ సందర్భంగా చిత్ర ఆడియో,ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళం ఉదయం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ వహించారు. చిత్ర నిర్మాత విజయ్ మాట్లాడుతూ తాను ఓరున్నది చిత్రాన్ని చూసి చాలా ఇంప్రెస్స్ అయినట్లు పేర్కొన్నారు. దీంతో వేరే రంగంలో రాణిస్తున్న తాను చిత్రం నిర్మాణ సంస్థలు ప్రారంభించి ఒరు నొడి చిత్ర టీం తోనే చిత్రం చేయాలని నిర్ణయించుకున్నన్నట్లు చెప్పారు. కాగా తాను ఊహించిన దానికంటే జన్మ నక్షత్రం చిత్రం బ్రహ్మాండంగా వచ్చిందని చెప్పారు. చిత్ర కథానాయకుడు తమన్ మాట్లాడుతూ ఇంతకుముందు వచ్చిన హాలీవుడ్ చిత్రాలు ఎక్సార్చిస్ట్ ఒమన్ చిత్రాల తరహాలో ఈ జన్మ నక్షత్రం ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే ఇది ఓమన్ చిత్రానికి రీమేక్ అని చెప్పవచ్చు అన్నారు. ఆరు నొడి చిత్ర కై ్లమాక్స్ ఎలా ఆశ్చర్యం కలిగించిందో, అంతకంటే ఎక్కువగా ఈ చిత్ర కై ్లమాక్స్ అనూహ్య ఘటనలతో ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం కోసం యూనిట్ సభ్యులందరూ ఒక కుటుంబంలా శ్రమించినట్లు పేర్కొన్నారు. -
విజయ్ చేసిన ఒక్క ఫోన్ కాల్తో..
తమిళసినిమా: బిగ్బాస్ సీజన్ 5లో టైటిల్ విజేతగా నిలిచిన రాజు రాజమోహన్ కథానాయకుడిగా పరిచయం అయిన చిత్రం బన్ బట్టర్ జామ్. రెయిన్ ఆఫ్ ఆరోస్ పతాకంపై సురేష్ సుబ్రమణియమ్ నిర్మించిన ఈ చిత్రానికి రాఘవ్ మిర్ధాధ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఆద్య ప్రసాద్, భవ్య ట్రిక్కా హీరోయిన్లుగా నటించిన ఇందులో చార్లీ, శరణ్య పొన్వన్నన్, దేవదర్శిని, మైఖెల్, వీజే పప్పు, ధర్మదురై తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బాబు ఛాయాగ్రహణం, నివాస్ కె. ప్రసన్న సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు రాజు రాజమోహన్ మాట్లాడుతూ బిగ్ బాస్ వల్లే తనకు కథానాయకుడిగా నటించే అవకాశం వచ్చిందన్నారు. తనను అందరూ హీరో అంటున్నారని, సినిమాల్లో హీరో అమ్మను కాపాడటం, ఆపదలో ఉన్న స్నేహితులను కాపాడటం చేస్తామన్నారు.కాగా తనను హీరోగా చేసిన నిర్మాతను కాపాడినప్పుడే తాను హీరో అని చెప్పుకుంటానని పేర్కొన్నారు. ఇది ఆబాలగోపాబాలం చూసి ఆనందించే ప్రేమ వినోదం, యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రం అని చెప్పారు. ప్రేక్షకులు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఈ చిత్రం వేస్ట్ చేయదన్నారు. కాగా ఒక్క ఫోన్ కాల్ తో ఈ చిత్రం చాలా మందికి తెలిసిందన్నారు. ఆయనకు తనపై ఎలాంటి అభిప్రాయం ఉందీ, తాను ఆయనకు ఇష్టమా? ఎందుకు తనకు శుభాకాంక్షలు అందించారు అన్నవి తనకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందని పేర్కొన్నారు. -
ఐటీ ఉద్యోగుల రక్తదానం
వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున రోజా, జహీర్ హుస్సేన్ తదితరులు ప్రసంగిస్తున్న రోజా, వేదికపై జహీర్ హుస్సేన్, సునీల్ తదితరులు పేదల కోసం పరితపించిన దివంగత మహానేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి చైన్నెలో ఘన నివాళులర్పించారు. మంగళవారం రాజన్న జయంతిని పలుచోట్ల వైఎస్సార్ సీపీ సేవాదళ్ – తమిళనాడు నేతృత్వంలో సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ప్రతి పేదోడి గుండెల్లో కొలువైన మహానేతపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు. వైఎస్సార్ అంటే ఎమోషన్...అఫెక్షన్ అని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆర్కే రోజా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.సాక్షి, చైన్నె: జన హృదయ నేత, నిత్య కృషీవలుడు, అపర భగీరధుడు దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతిని మంగళవారం చైన్నెలో పలు చోట్ల తమిళనాడు వైఎస్సార్ సీపీ సేవాదళ్ విభాగం అధ్యక్షుడు ఏకే జహీర్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించారు. ఉదయాన్నే పెరంబూరులోని పార్టీ కార్యాలయంలో రాజన్న చిత్ర పటానికి నేతలు నివాళులర్పించారు. ఓఎంఆర్ మార్గంలోని ఫాతీమా అనాథ పిల్లల బడిలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రాజన్న కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. ఉదయం పిల్లలకు, వృద్ధులకు అల్పాహారం అందజేశారు. స్కూల్ పిల్లలకు పుస్తకాలు, విద్యా ఉపకరణలు అందజేశారు. మధ్యాహ్నం ఇక్కడి సమీపంలోని మరో ఆశ్రమంలో బిర్యాని పంపిణీ చేశారు. ఏపీ ఐటీ విభాగం అధ్యక్షుడు సునీల్, ప్రతినిధులు నిరంజన్, మణికంఠ, స్థానిక నాయకులు మాల్యాద్రి రెడ్డి, రామచంద్ర రెడ్డి, వెంకట్, రమణయ్య, రవి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం బ్రహ్మాండ వేడుకగా తురై పాక్కంలోని టెక్ టవర్లో మహానేత జయంతి వేడుక జరిగింది. పేదవాడి గుండెల్లో దైవం ఈ కార్యక్రమంలో వైఎస్సార్కు నివాళులర్పించిన అనంతరం రోజా మాట్లాడుతూ ప్రతి పేదవాడికి విద్యా వైద్యం అందాలన్న లక్ష్యంతో శ్రమించిన మహామనీషి వైఎస్సార్ అని వ్యాఖ్యానించారు. రాముడి పాలన గురించి విన్నాం, రాజన్న పాలనను చూశాం అంటూ, ప్రతి పేదవాడి గుండెల్లో కొలువైన దైవం వైఎస్సార్ అని కొనియాడారు. వైఎస్సార్ అంటే ఎమోషన్ , వైఎస్సార్ అంటే అఫెక్షన్ అని వ్యాఖ్యానించారు. రైతులకు రుణ మాఫీ, ఉచిత విద్యుత్ ఇచ్చి ఆదుకున్నారని, పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలన్న కాంక్షతో ఫీజ్ రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆయన హయాంలోనే లక్షలాది మంది ఇంజినీర్లు అయ్యారని, సుమారు మూడు లక్షల ఐటీ ఉద్యోగాలు దరిచేర్చారని వివరించారు. ఆరోగ్యశ్రీ, 108 ద్వారా పేదవారి ఆరోగ్యాన్ని కాపాడిన దేవుడు ఆయన అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ ఇప్పటికీ కూడా అవి సజీవంగా పేదలకు ఉపయోగపడుతోందన్నారు. పేదవారి కోసం రాజన్న రెండడుగులు ముందుకు వేస్తే, ఆయన వారసుడు జగనన్న నాలుగడుగులు ముందుకి వేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయే పథకాలను ఐదేళ్ల పాటూ అందించారని వివరించారు. ఈవీఎంలలో అవకతవకలు, ప్రలోభాలు, మోసాలతో జగనన్నను ఓడించినా, జనం గుండెల నుంచి మాత్రం జగనన్నను వేరుచేయలేక పోయారని వ్యాఖ్యానించారు. మోసగాడైన చంద్రబాబు, వేషగాడైన పవన్ పాలనలో జనం నరకాన్ని అనుభవిస్తున్నారని, త్వరలో వీరి పాలన అంతమై జగనన్న నేతృత్వంలో మళ్ళీ రాజన్న రాజ్యం రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కల్యాన్ టైం పాస్ కోసం రాజకీయాలలోకి వచ్చిన నాయకుడు అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్, ఎంజీర్, జయలలితలు సినీ రంగం నుంచే రాజకీయాలలోకి వచ్చారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో న్యాయం చేశారని ఈసందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాజకీయాలలో నమ్మి ఓట్లు వేసిన జనాన్ని మోసం చేయ కూడదని పేర్కొంటూ పవన్ ప్రజల్ని విస్మరించి షూటింగ్ బిజీలో పడ్డారని విమర్శించారు. ఇంటింటికీ తీసుకెళ్దాం ఏపీ ఐటీ విభాగం అధ్యక్షుడు సునీల్ మాట్లాడుతూ, బెంగళూరు, హైదరాబాద్తో పోటీ పడే విధంగా చైన్నెలో బలం ఉందని అన్నారు. ఐటీ వింగ్లోని వారంతా పార్టీ కోసం కష్టపడాలని, శ్రమించాలని పిలుపు నిచ్చారు. ఇప్పటి నుంచి జగనన్న చేసిన మంచి పనులను ప్రజలలోకి విస్తృతంగా, ఇంటింటా తీసుకెళ్లే రీతిలో ప్రతి ఒక్కరూ సైనికుల వలే పనిచేయాలని కోరారు. జగనన్నకు మరింత బలాన్ని ఇచ్చిన ఆర్మీగా మారుదామని రానున్న మూడున్నర సంవత్సరా కాలం ఎల్లో మీడియా ప్రచారాన్ని తిప్పి కొట్టే విధంగా దూసుకెళ్దామని పిలుపు నిచ్చారు. చైన్నెలో ఘనంగా వైఎస్సార్ జయంతి చిత్ర పటానికి నేతలు, అభిమానుల ఘన నివాళి తమిళనాడు సేవాదళ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఐటీ వింగ్ రక్తదానం వైఎస్సార్ అంటే ఓ ఎమోషన్..అఫెక్షన్: మాజీ మంత్రి రోజా ఇంటింటా జగనన్న చేసిన మంచిని తీసుకెళ్దాం: సునీల్ టెక్ టవర్లో సేవాదళ్, ఐటీ వింగ్ నేతృత్వంలో జరిగిన బ్రహ్మాండ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా హాజరయ్యారు. ఇక్కడ ఏర్పాటు చేసిన దివంగత నేత రాజశేఖర్రెడ్డి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.రక్తదాన శిబిరాన్ని రోజా ప్రారంభించారు. రక్తదాతలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులు, అభిమానులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. అనంతరం జహీర్ హుస్సేన్ అధ్యక్షతన రాజన్నను స్మరిస్తూ కార్యక్రమం జరిగింది. ఇందులో భారీ కేక్ను రోజా కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. రాజన్నకు జోహర్లు అర్పిస్తూ నినాదాలు హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సూర్యారెడ్డి, అధికార ప్రతినిధి కృతిక, కార్యదర్శి శివ, నేతలు శరత్ కుమార్ రెడ్డి, నరేన్ రెడ్డి, రెడ్డి శేఖర్రెడ్డి , ఉమా రెడ్డి, భాస్కర్రెడ్డి, కేవి కృష్ణారెడ్డి , బాబు, ఐటీ వింగ్ ప్రతినిధులు వరుణ్, మణి కంఠ,నిరంజన్, తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
తిరుత్తణి: ట్రాఫిక్ నిబంధనలపై ద్విచక్ర వాహన చోదకులకు ట్రాఫిక్ ఎస్ఐ గంగాధరన్ మంగళవారం అవగాహన కల్పించారు. తిరుత్తణిలో ద్విచక్ర వాహన చోదకులతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతోపాటు హెల్మెట్ వినియోగం, రోడ్డు నిబంధనలు పాటించడంపై పోలీసులు తరుచూ అవగాహన కల్పిస్తున్నా వాహన చోదకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా పట్టణంలో నిత్యం రద్దీ నెలకొని వాహనాలు ట్రాఫిక్ స్తంభించి, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ గంగాధరన్ మంగళవారం అరక్కోణం రోడ్డులో నిబంధనలు పాటించకుండా వెళ్లిన ద్విచక్ర వాహన చోదకులను ఆపి, హెల్మెట్ వినియోగించడం, రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించి, హెచ్చరించి పంపారు. -
తిరుత్తణిలో అసెంబ్లీ మూల్యాంకన కమిటీ తనిఖీ
తిరుత్తణి: తిరువళ్లూరు జిల్లాలో అసెంబ్లీ మూల్యాంకన కమిటీ సభ్యులు మంగళవారం పలు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా తొలుత తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మాస్టర్ప్లాన్ పథకం ద్వారా రూ.87 కోట్లు వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి కమిటీ చైర్మన్ గాంధీరాజన్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు 10 మంది తనిఖీలు చేశారు. అన్నదాన కేంద్రంలో స్టాక్ గదిలో ఉంచిన బియ్యం, పప్పు సహా ఆహార వస్తువులు నిల్వ, నాణ్యతను పరిశీలించారు. అన్నదాన కేంద్రం విస్తరణకు సంబంధించి చేపట్టిన పనులు తనిఖీ చేశారు. అలాగే రాజగోపురం నుంచి మాడవీధికి లింగ్ మెట్లు నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం ఆలయ కల్యాణ మండపాల నిర్మాణ పనులు, ఆలయ సిబ్బందికి శిక్షణకు నిర్మిస్తున్న కేంద్రాలు పరిశీలించారు. తిరువలంగాడు సమీపంలోని మనవూరు వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యంత్రాల సాయంతో వరి సాగు పద్ధతులను పరిశీలించారు. -
కడలూరులో ఘోరం
సేలం: లెవల్ క్రాసింగ్లో ఉన్న గేట్ను మూయకుండా కీపర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ముగ్గురు విద్యార్థులు బలయ్యారు. అతివేగంగా వస్తున్న ప్యాసింజర్ రైలును గుర్తించకుండా స్కూల్ వ్యాన్ను డ్రైవర్ ముందుకు తీసుకెళ్లడంతోనే మంగళవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. దీంతో విల్లుపురం – మైలాడుతురై మార్గంలో రైళ్ల సేవలకు తీవ్ర ఆటంకం నెలకొంది. వివరాలు.. కడలూరు జిల్లా సెమ్మంకుప్పం గ్రామం సమీపంలోని ఆలపాక్కం వద్ద రైల్వే క్రాసింగ్ ఉంది. సెమ్మంకుప్పం నుంచి ఉదయాన్నే నలుగురు విద్యార్థులను ఎక్కించుకుని కుమార పురానికి చెందిన ఓ ప్రైవేటు వ్యాన్ డ్రైవర్ శంకర్ బయలుదేరాడు. సరిగ్గా 7.45 గంటల సమయంలో అక్కడి రైల్వే క్రాసింగ్ను దాటుతుండగా విల్లుపురం నుంచి మైలాడుతురై వైపుగా 95 కి.మీ వేగంతో వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొంది. రైలు ఢీ కొన్న వేగానికి ఆ వ్యాన్ 50 అడుగుల దూరంలో ఎగిరిపడి నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనను చూసిన అటు వైపుగా వెళ్తున్న ఓ రైతుతో పాటుగా మరో ఇద్దరు పెట్టిన కేకలతో ఆలపాక్కం, సెమ్మంకుప్పం గ్రామల నుంచి జనం పరుగులు తీశారు. వ్యానులో రక్తగాయాలతో పడి ఉన్నపిల్లలను రైతు రక్షించే క్రమంలో విద్యుత్ తీగలు తెగడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో వ్యాన్ వద్దకు వెళ్లేందుకు జనం సాహసించ లేని పరిస్థితి ఏర్పడింది. భిన్న వాదనతో కలకలం రైల్వే గేట్ కీపర్గా పనిచేస్తున్న ఉత్తరాదికి చెందిన పంకజ్ శర్మ రైలు వస్తున్న సమయంలో గేట్వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలింది. అతడు నిద్రలో ఉన్నట్టుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గేట్ తెరిచి ఉండడంతోనే వ్యాన్ ముందుకెళ్లినట్టు పేర్కొంటున్నారు. క్రాసింగ్ ఉన్న చోట కనీసం రైలు డ్రైవర్ హారన్ కూడా కొట్టనట్టుగా డ్రైవర్ శంకర్ ఆరోపించాడు. అయితే గేట్ కీపర్ పంకజ్ వాదన మరో విధంగా ఉండటం గమనార్హం. గేట్ మూస్తున్న సమయంలో వ్యాన్తో పాటూ మరో రెండు మోటారు సైకిళ్లు వచ్చాయని,రైలు వచ్చేలోపు వెళ్లి పోతామని బలవంతం చేసి గేటు మూయనివ్వకుండా చేశారని గేట్ కీపర్ పేర్కొనడంతో రైల్వే అధికారులు తమ తప్పు లేదన్నట్టుగా వ్యాఖ్యలు అందుకున్నారు. చివరకు వ్యవహారం ఉత్కంఠకు, వివాదానికి దారి తీయడంలో గేట్ కీపర్ను సస్పెండ్ చేశారు. అదే సమయంలో పోలీసులు అతడ్ని అరెస్టుచేశారు. రైల్వే అధికారులు, జిల్లా అఽధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతి చెందిన పిల్లల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించారు. ఈ ప్రమాదం కారణంగా ఎక్కడి రైళ్లు అక్కడే ఆగడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. సుమారు ఐదు గంటల అనంతరం రైలు సేవలను పునరుద్ధరించారు. స్కూల్ వ్యాన్ను ఢీకొన్న రైలు ముగ్గురు విద్యార్థుల బలి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు గేట్ మూయకుండా కీపర్ నిర్లక్ష్యం తీవ్ర ఉత్కంఠ.. అతి కష్టంపై వ్యాన్ను సమీపించారు. నుజ్జునుజ్జయిన వ్యాన్ నుంచి చెల్లా చేదరుగా పుస్తకాలు, బ్యాగ్లు పడి ఉండటంతో పాటుగా ఓ విద్యార్ధి మృత దేహం సైతం పట్టాల మీద కనిపించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వ్యాన్లో ఉన్నపిల్లల పరిస్థితి ఏమిటో అన్న ఆందోళన తప్పలేదు. చివరకు వ్యాన్లో ఉన్ననలుగురు విద్యార్థులు, డ్రైవర్శంకర్ను అతి కష్టంమీద అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. ఈ సమాచారంతో కడలూరు జిల్లా యంత్రాంగం, రైల్వే వర్గాలు ఉరకలు తీశాయి. మంత్రి సీవీ గణేషన్ హుటా హుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న బాధితులను, వారి కుటుంబాలను ఓదార్చారు. నుజ్జు నుజ్జైన వ్యాన్ను అక్కడి నుంచితొలగించారు.తెగి పడ్డ విద్యుత్ తీగలను తొలగించారు. విద్యుత్ లైన్లకు మరమ్మతుల మీద దృష్టి పెట్టారు. కూతవేట దూరంలో ఆగిన ప్యాసింజర్ రైలుతో పాటూ విల్లుపురం వైపుగా మైలాడుతురై నుంచి రావాల్సిన రైళ్లు ఎక్కడికక్కడ ఆపేశారు.విల్లుపురం నుంచి వెళ్లాల్సిన రైళ్లు ఆగాయి. ఈ ప్రమాదంలో మరణించిన చారుమతి, చెలియన్ అక్క, తమ్ముడిగా తేలింది. ప్లస్ ఒన్,పదో తరగతి వీరిద్దరు చదువుతున్నారు. దీంతో ఆకుటుంబ తీవ్ర శోక సంద్రంలో మునిగింది. అలాగే మరో విద్యార్ధి విశ్వేష్గా గుర్తించారు. అతడి సోదరుడు నివాస్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సలో ఉన్నారు.డ్రైవర్ శంకర్కు సైతం చికిత్స అందిస్తున్నారు. -
హ్యూందాయ్ ఆధ్వర్యంలో హెచ్టీడబ్ల్యూ వో ఇన్నోవేషన్ సెంటర్
●ఆవిష్కరించిన మంత్రి టీఆర్బీ రాజా కొరుక్కుపేట: చైన్నెలోని తైయూర్లోని ఐఐటీ మద్రాసు డిస్కవరీ శాటిలైట్ క్యాంపస్లో తమిళనాడు ప్రభుత్వం భాగస్వామ్యంతో హ్యూందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఏఐఎస్ ) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు (ఐఐటీ మద్రాసు ) సంయుక్తంగా కలిసి హ్యూందాయ్ హెచ్టిడబ్ల్యూవో ఇన్నోవేషన్ సెంటర్ డిజన్ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ అండ్ వాణిజ్య శాఖ మంత్రి టీఆర్బీ రాజా పాల్గొన్ని గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ , దాని పర్యావరణ వ్యవస్థ రంగంలో ఆవిష్కరణలకు ఉత్పేరకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రం అయిన హ్యూందాయ్ హెచ్టీడబ్ల్యూవో ఇన్నోవేషన్ సెంటర్ డిజన్ను ఆవిష్కరించారు. ఈ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి, హ్యూందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్షూ కిమ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. -
తప్పెవరిది?.. తమిళనాడు ఘోర ప్రమాదంపై చర్చ
తమిళనాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఓ స్కూల్ వ్యాన్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.సాక్షి, చెన్నై: తమిళనాడు కడలూరులో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం చెమ్మంగుప్పం వద్ద ఓ స్కూల్ వ్యాన్ రైలు పట్టాలను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విధ్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే.. గేట్మేన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందన్న విమర్శలు వినిపిస్తుండగా.. మరోవైపు డ్రైవర్ కోరితేనే తాను గేటు తెరిచానని గేట్మేన్ చెబుతున్నాడు. ఈ క్రమంలో తప్పెవరిదనే చర్చ నడుస్తోంది. ఈలోపు గేట్మేన్ పంకజ్శర్మను రైల్వే అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రమాదం ధాటికి వ్యాన్ చిన్నారుల మృతదేహాలు ముక్కలై పడ్డాయి. రైలు ఢీ కొట్టిన వేగానికి 50 మీటర్ల దూరం ఎగిరిపడి తుక్కు అయిన వ్యాన్ దృశ్యాలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి.கேட் கீப்பரின் அலட்சியத்தால் பள்ளி வேன் மீது ரயில் மோதி 2 மாணவர்கள் ப**யான கோர விபத்து... தண்டவாளத்தில் சிதறிக்கிடந்த புத்தகப்பை... மனதை நொறுக்கிய காட்சிகள்....!#Cuddalore | #SchoolVan | #RailwayTrack | #GateKeeper | #CuddaloreAccidentUpdate | #TrainAccident | #PolimerNews pic.twitter.com/yv79s6oamO— Polimer News (@polimernews) July 8, 2025 -
మహా కుంభాభిషేకానికి పోటెత్తిన జనం
పళ్ళిపట్టు: నాదాదీశ్వరర్ ఆలయంలో సోమవారం నిర్వహించిన మహాకుంభాభిషేకం వేడుకలకు వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి అనుసంధానంగా ఉన్న పళ్లిపట్టు సమీపం కరింబేడు నాదాదీశ్వరర్ ఆలయం వెయ్యేళ్ల చరిత్ర కలిగిఉంది. స్వామి స్వయంభుగా భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ఈ ఆలయ మహాకుంభాభిషేకం నిర్వహించి 13 సంవత్సరాలు పూర్తి కావడంతో తిరుత్తణి ఆలయం నిర్వాహకులు, కరింబేడు గ్రామీణులు సంయుక్తంగా కుంభాభిషేకానికి ఏర్పాట్లు చేపట్టి ఆలయ గోపురాలకు జీర్ణోద్ధరణ పనులు చేపట్టి అందంగా ముస్తాబు చేశారు. శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు నిర్వహించిన మహాకుంభాభిషేకం వేడుకలు సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుద్దీపాలతో అలంకరించి హోమగుండ పూజలు జరిగాయి. సోమవారం ఉదయం తిరుత్తణి ఆలయ అర్చకుల బృందం ఆధ్వర్యంలో మహాపూర్ణాహుతి హోమం అనంతరం మేళతాళాల నడుమ పవిత్ర పుణ్యతీర్థాల కలశాలు బయల్దేరి ఊరేగింపుగా రాజగోపురం, విమాన గోపురం సహా ఇతర గోపురాలకు పుణ్య తీర్థాలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఇందులో తిరుత్తణి, పళ్లిపట్టు, నగరి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో నిర్వహించిన కుంభాభిషేక వేడుకల్లో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్, పళ్లిపట్టు నార్త్ మండల కార్యదర్శి సీజే శ్రీనివాసన్, తిరుత్తణి ఆలయ మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు సురేష్బాబు, పళ్లిపట్టు పట్టణ కార్యదర్శి సెంథిల్కుమార్, జానకిరామన్, అయ్యప్పన్, కుమార్, మాధవన్ సహా అనేక మంది పాల్గొన్నారు. తొక్కిసలాటలో భక్తుల ఇక్కట్లు మహాకుంభాభిషేకం వేడుకల్లో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పోలీసులు గవర్నర్ తిరుమల నుంచి తిరుత్తణి మార్గంలో సోమవారం ఉదయం చైన్నెకు పయనం కావడంతో భద్రత కోసం డీఎస్పీ కందన్ ఆధ్వర్యంలో పోలీసులు వెళ్లిపోగా కుంభాభిషేకంలో భద్రత ఏర్పాట్లకు పోలీసులు లేక పోవడంతో ఒక్కసారిగా ఆలయ ప్రవేశమార్గం వద్ద చేరుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఎమ్మెల్యే, జాయింట్ కమిషనర్ సహా మహిళలు, చిన్నారులు, వృద్ధులు చిక్కుకోవడంతో అర్ధగంట పాటు ఇబ్బందులు తలెత్తాయి. ఆలయ సిబ్బంది పరిస్థితులు చక్కదిద్దారు. దీంతో పరిస్థితులు చక్కబడ్డాయి. -
క్లుప్తంగా
లైంగిక దాడి కేసులో హెచ్ఎం అరెస్టు అన్నానగర్: ఐదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన తెక్కడిలోని ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లా హోసూర్ సమీపంలోని మత్తి గిరి నేతాజీ నగర్లో సారథి(57) నివశిస్తున్నారు. ఆయన రాయకోట్టై సమీపంలోని పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలిక గత 3వ తేదీ పాఠశాలకు వెళ్లి సాయంత్రం అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చింది. మరుసటి రోజు(4వ తేదీ) ఉదయం, పాఠశాలకు వెళ్లను అని ఏడ్చినప్పుడు ఆమె తల్లి బాలికను ఎందుకు అని అడిగింది. 3వ తేదీ మధ్యాహ్నం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సారథి తనను ఒంటరిగా తీసుకెళ్లి శారీరకంగా వేధించాడని, నొప్పితో తాను కేకలు వేయడంతో కొట్టాడని, తన ముక్కు నుండి రక్తం వచ్చినట్లు పేర్కొంది. ఇది విని షాకై న బాలిక తల్లి ఆదివారం తేన్ కనికొట్టై ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ భువనేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు సారథి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడైంది. దీని తరువాత పోక్సో కేసు నమోదు చేసి, ప్రధానోపాధ్యాయుడు సారథిని అరెస్టు చేశారు. పంచవర్ణేశ్వరుడికి కుంభాభిషేకం తిరువళ్లూరు: ఈకాడులోని త్రిపుర సుందరి సమేత పంచవర్ణేశ్వరుడి ఆలయంలో మహా కుంభాభిషేకం సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. తిరువళ్లూరు జిల్లా ఈకాడులో త్రిపుర సుందరి సమేత పంచవర్ణేశ్వరుడి ఆలయ మహాకుంబిషేకం కార్యక్రమానికి శుక్రవారం గణపతి హోమంతో శ్రీకారం చుట్టారు. ఉదయం 9 గంటలకు లక్ష్మీహోమం, నవగ్రహ హోమం, పూర్ణాహుతి, దీపారాధన సాయంత్రం ఐదు గంటలకు వాస్తుశాంతి, ప్రవేశబలి తదితర పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం 8.30 గంటలకు మంగళ హారతి, తీర్థసంగ్రహణం, యాగ అలంకరణ సాయంత్రం 5.30 గంటలకు అంకురార్పరణతోపాటు ఇతర పూజలను నిర్వహించారు. మూడో రోజు ఉదయం 8 గంటలకు మంగళవాయిద్యం నడుమ ఆలయ గోపురంపై పుణ్యజలాలు వదిలి కుంభాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. నాథం విశ్వనాథన్ పిటిషన్ కొట్టివేత అన్నానగర్: తనపై ఉన్న ఎన్నికల కేసును కొట్టివేయాలని కోరుతూ అన్నాడీఎంకే ఎమ్మెల్యే నాథం విశ్వనాథన్ దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మే 5న జరిగిన ఎన్నికల్లో దిండుక్కల్ జిల్లా నుంచి అన్నాడీఎంకే తరఫున మాజీ మంత్రి నాథం విశ్వనాథన్ పోటీ చేశారు. తనపై పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి అండి అంబలంపై 11,932 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. తన విజయాన్ని సవాలు చేస్తూ డీఎంకే అభ్యర్థి అండి అంబలం మద్రాస్ హైకోర్టులో ఎన్నికల కేసు దాఖలు చేశారు. ఆ పిటిషన్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యే నాథం విశ్వనాథన్ తన నామినేషన్లో అనేక సమాచారాన్ని దాచిపెట్టారు. ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడం ద్వారా ఆయన అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారు. సెంట్రల్ ఓటింగ్కు ముందు గత 48 గంటల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ప్రచారంలో పాల్గొ న్నారని, ఎన్నికల కమిషన్ నిర్ణయించిన పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేశారని కూడా ఆయన పిటిషన్లో ఆరోపించారు. ఈ కేసును జస్టిస్ పి.డి.ఆశా విచారించారు. ఆ సమయంలో తనపై ఉన్న ఎన్నికల కేసు దర్యాప్తు కొనసాగించడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంటూ, డీఎంకే అభ్యర్థి అండి అంబలం దాఖలు చేసిన ఎన్నికల కేసును కొట్టివేయాలని కోరుతూ నాథం విశ్వనాథన్ తన తరఫున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి ఆశా ఎన్నికల కేసును దర్యాప్తు చేయడానికి తగిన కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల కేసును కొట్టివేయాలని కోరుతూ నాథం విశ్వనాథన్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేశారు. పార్కింగ్ స్థలాలకు టెండర్ నోటీసు తిరువొత్తియూరు: చైన్నెలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి, వీధుల్లో పార్కింగ్ను తగ్గించడానికి, చైన్నె కార్పొరేషన్ తిరువొత్తియూర్, కోడంబాక్కంలో 2 కొత్త బహుళ అంతస్తుల పార్కింగ్ స్థలాలను నిర్మించబోతోంది. తిరువొత్తియూరులోని మున్సిపల్ కార్పొరేషన్ ఫార్మసీ కాంప్లెక్స్ సమీపంలో 1,563 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ పార్కింగ్ స్థలాన్ని నిర్మిస్తున్నారు. ఈ పార్కింగ్ స్థలంలో 1,052 మోటార్ సైకిళ్లు, ఒక వాణిజ్య సముదాయం ఉంటాయి. ఈ ప్రాజెక్టును రూ.15.98 కోట్ల వ్యయంతో ఖర్చు చేస్తున్నారు. అలాగే కోడంబాక్కం ఫ్లైఓవర్ సమీపంలో ఎకరం స్థలంలో మరో బహుళ అంతస్తుల కార్ పార్కింగ్ నిర్మిస్తున్నారు. 1,667 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.17.86 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
● అయత్తూరులో స్థానికుల రాస్తారోకో ● గుంతలో పడి ఒకరు.. లారీ ఢీకొని మరొకరు మృతి తిరువళ్లూరు: రోడ్డు నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి రైల్వే విశ్రాంత ఉద్యోగి మృతి చెందగా, మట్టి లారీ ఢీకొని మరో వృద్ధుడు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా బుజ్జిన్కండ్రిగ గ్రామానికి చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి కృష్ణన్(70) ఆదివారం రాత్రి అయత్తూరులో జరిగిన అమ్మవారి జాతర ఉత్సవాలకు హాజరయ్యారు. రాత్రి పది గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. అయత్తూరుకు సమీపంలో వెళ్తున్న సమయంలో ఎన్నూరుపోర్టు–మహాబలిపురం వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా తీసిన గుంతల్లో పడి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఇతడి కోసం రాత్రంతా బంధువులు గాలించినా ఫలితం లేకపోగా సోమవారం అయత్తూరు వద్ద గుంతలో శవమై కనిపించాడు. రోడ్డు నిర్మాణం కోసం గుంతలు తవ్విన క్రమంలో అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డు లేకపోవడంతోనే ప్రమాదం జరిగి వృద్ధుడు చనిపోయాడని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న సెవ్వాపేట ఇన్స్పెక్టర్ జయకుమార్ సంఘటన స్థలానికి హాజరై ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఇకపై రోడ్డు నిర్మాణం కోసం తవ్వకాలు చేపడితే అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హమీ మేరకు స్థానికులు ఆందోళన విరమించారు.మట్టి లారీ ఢీకొని.. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా మట్టి క్వారీలు పదుల సంఖ్యలో నడుస్తున్నాయి. క్వారీల నుంచి మట్టితో వెళ్తున్న లారీలు అతివేగంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో విడయూర్ క్వారీ నుంచి మట్టితో లారీ సోమవారం ఉదయం బయల్దేరింది. పట్టణంలోని రైతు బజారు వద్ద వెళ్తుతున్న సమయంలో ముందుగా ద్విచక్ర వాహనంలో వెళ్తున్న వృద్ధుడిని ఢీకొట్టడంతో అతడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాలను ఆరా తీశారు. మృతుడు సీయంజేరి గ్రామానికి చెందిన లోకనాథన్(67)గా గుర్తించారు. ఇతను భార్య జగదీశ్వరితో కలిసి జయానగర్లో నివాసం ఉంటున్నాడు. కూరగాయలు కొనడానికి వెళ్తుతున్న సమయంలోనే ప్రమాదానికి గురై, సంఘటన స్థలంలోనే మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
శ్మశాన దారి ఆక్రమణపై ధర్నా
వేలూరు: శ్మశాన దారి ఆక్రమణను తొలగించాలని కోరుతూ గ్రామస్తులు వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, నినాదాలు చేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లో కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన ప్రజా విన్నపాల దినోత్సవం నిర్వహించారు. దీంతో వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఇదిలా ఉండగా ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా కాట్పాడి తాలూకా ఏరంతాంగల్ గ్రామానికి చెందిన మహిళలు వినతీ పత్రాలతో వచ్చి ధర్నా నిర్వహించారు. మహిళలు మాట్లాడుతూ తమ గ్రామంలోని శ్మశానాన్ని అఽధికార పార్టీకి చెందిన కొందరు ఆక్రమించుకొని ఉన్నారని, వీటిపై గ్రామస్తులు పలు మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు సైతం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వీటిపై విచారణ జరిపి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు. అదే విధంగా అనకట్టు తాలూకా కీల్క్రిష్ణాపురం గ్రామానికి చెందిన ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులో తమ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 10 మంది విద్యార్థులు చదువుతున్నారని విద్యార్థులు లేని కారణం చూపి అధికారులు టీచర్లను నియమించలేదన్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు కూడా విద్యా బోధన చేసే వారు లేరన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో పాఠశాలను మూసి వేసే పరిస్థితి ఉంటుందని వెంటనే పాఠశాలకు టీచర్ను నియమించాలని కోరారు. వినతులను స్వీకరించిన అధికారులు వివిధ శాఖల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేశారు. -
భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ మహోత్సవం
పళ్లిపట్టు: వడకుప్పంలోని ద్రౌపదీదేవి ఆలయ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి అగ్నిగుండ వేడుకలు కోలాహలంగా నిర్వహించగా భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించారు. పళ్లిపట్టు సమీపంలోని వడకుప్పం గ్రామంలో జూన్ 26ప ద్రౌపదీదేవి ఆలయ అగ్నిగుండ వేడుకలకు ధ్వజారోహణం నిర్వహించారు. 11 రోజులపాటు నిర్వహించిన వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం అగ్నిగుండ వేడుకలు సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుదీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. సాయంత్రం 6 గంటల సమయంలో అగ్నిగుండానికి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేపట్టి అగ్నిగుండం ముందు అలంకరణలో ద్రౌపదీదేవి కొలువుదీరగా, భక్తులు గ్రామ వీధుల్లో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో బాణసంచా సంబరాలు నడుమ భక్తులు గోవింద నామస్మరణతో 200 మందికి పైగా భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించారు. -
వైభవంగా ఆలయ కుంభాభిషేకం
– హాజరైన కంచీ మఠం పీఠాధిపతులు తిరువళ్లూరు: ఆరణి, తండలం తదితర రెండు గ్రామాల్లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో జరిగిన అష్టబంధన మహా కుంభాబిషేకం సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్ తండలం గ్రామంలో ధరణీశ్వరుడి ఆలయం ఉంది. ఆలయంలో మహాకుంభాభిషేకం సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా చేపట్టారు. మహాకుంభాభిషేకం సందర్భంగా గత రెండున గణపతి హోమం, గోపూజ, వాస్తుశాంతి, నవగ్రహ పూజ, మహాలక్ష్మీ పూజను నిర్వహించారు. అనంతరం సోమవారం ఉదయం పది గంటలకు విమానగోపురం, మూలస్థానం పరివారమూర్తి తదితర ఉత్సవ మూర్తులకు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి, శ్రీసత్య చంద్రశేఖర సరస్వతి తదితరులు గోపుర కలశంపై పుణ్యజలాలను వదిలి కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు పాలు పెరుగు, పన్నీరు, చందనం తదితర వాటితో అభిషేకం నిర్వహించారు. అనంతరం మూలవర్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇదే విధంగా తిరువళ్లూరు జిల్లా ఆరణిలో శ్రీకంచి కామకోటి పీఠం శంకర మఠం ఆలయంలో శ్రీఆదిశంకరుడికి మహా కుంభాభిషేకం నిర్వహించారు. అంతకు ముందు గణపతి హోమం, మహాలక్ష్మీపూజ, గోపూజతోపాటు ఇతర పూజలను నిర్వహించారు. అనంతరం ఏడు గంటలకు ఆదిశంకరుడు సహా పలు మూలవర్లకు మహాకుంభాభిషేకం నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పళ్లిపట్టు: బైకు ప్రమాదంలో పళ్లిపట్టుకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. పళ్లిపట్టు రాధానగర్కు చెందిన వేలు కుమారుడు ముకేష్(22) ఇంజినీరింగ్ చదువుకుని బెంగళూరులోని ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అదే కంపెనీలో విధులు నిర్వహిస్తున్న తేని జిల్లా ఆండిపట్టికి చెందిన విజయ్పాండి(25) ఇంట్లో శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముకేష్, విజయ్పాండితో కలిసి శనివారం సాయంత్రం బైకులో తేనికి బయల్దేరారు. బైకును ముకేష్ నడిపాడు. హాసూరు వద్ద బైకు వెళ్లుతుండగా జాతీయ రహదారికి మధ్యలో కుక్క రావడంతో బైకు అదుపుతప్పి రోడ్డు బోల్తా కొట్టింది. ప్రమాదంలో పళ్లిపట్టుకు చెందిన ముకేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విజయ్కుమార్ తీవ్ర గాయాలతో హాసూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై హాసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిత్రుడితో కలిసి వెళ్లుతున్న సమయంలో బైకు ప్రమాదంలో పళ్లిపట్టుకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉరి వేసుకుని యువతి ఆత్మహత్యఅన్నానగర్: చైన్నె నెర్కుండ్రం ప్రాంతానికి చెందిన రాజేశ్వరి. ఇతని భర్త ఆరుముగం, రెండు సంవత్సరాల ముందు మృతి చెందాడు. వీరి కుమారుడు దినేష్ (27), సినిమాలో అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. వీరి కుమార్తె దీపిక(23) ఆమె అంబత్తూరు ప్రాంతంలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. ఆదివారం ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో నివశించే దీపిక చాలా సేపు బయటకు రాకపోవడంతో ఆమె వెళ్లి గది తలుపు తట్టింది. కానీ తలుపు తెరవకపోవడంతో కిటికీ నుంచి చూడగా, బెడ్రూమ్లో దీపిక ఉరి వేసుకుని కనిపించింది. పొరుగువారి సహాయంతో వారు తలుపు పగలగొట్టి దీపికను రక్షించి వెంటనే ఆమె మృతదేహాన్ని కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీపిక అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న కోయంబేడు పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. విచారణలో దీపిక ఇంట్లో బాడుగకు నివశించే అరుణ్ ను ప్రేమిస్తున్నానని చెప్పి డబ్బు, నగలు మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. దీపిక పుట్టినరోజునే మృతి చెందడం గమనార్హం. అజ్ఞాతంలో ఉన్న అరుణ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. -
అజిత్ కుమార్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
● హైకోర్టు ఽమధురై ధర్మాసనానికి నేడు నివేదిక ఇవ్వనున్న దర్యాప్తు అధికారిఅన్నానగర్: శివగంగ జిల్లాలో ఆలయ కాపలాదారుగా పనిచేస్తున్న అజిత్ కుమార్, ఆభరణాలు పోయాయనే ఫిర్యాదుపై విచారణకు తీసుకెళ్లిన తర్వాత మరణించాడు. అతన్ని దారుణంగా కొట్టి అరెస్టు చేసిన ఐదుగురు పోలీసులపై హత్య కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన కేసు మధురై హైకోర్టులో విచారణకు వచ్చింది. అజిత్ కుమార్ మృతిపై విచారణ జరిపి 8వ తేదీలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈమేరకు హైకోర్టు అదనపు జిల్లా న్యాయమూర్తి జాన్ సుందర్ లాల్ సురేష్ను దర్యాప్తు అధికారిగా నియమించింది. ఆ తర్వాత, ఆయన తిరుప్పువనంలోని హైవేస్ డిపార్ట్మెంట్ యాజమాన్యంలోని హాస్టల్లో బస చేసి 4 రోజులు దర్యాప్తు నిర్వహించారు. మాధపురం ఆలయ పూజారి ప్రవీణ్ కుమార్, వినోద్ కుమార్. ఆటో డ్రైవర్ అరుణ కుమార్, ఆలయ సీసీటీవీ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాసన్, ఛారిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ పెరియసామి, పోలీసులు అజిత్ కుమార్ పై దాడి చేయడాన్ని వీడియో తీసిన శక్తిశ్వరన్ సహా చాలా మందిని విచారించి, వారి ద్వారా వాగ్మూలం వీడియోను రికార్డు చేశారు. అజిత్ కుమార్ తల్లి మాలతి, సోదరుడు నవీన్ కుమార్, సోదరి రమ్య శరవణకుమార్ , అఖీ పి. సుకుమారన్, తిరుప్పువనం పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ సహా అనేక మందిని కూడా విడివిడిగా విచారించారు. ఆటో డ్రైవర్ అయ్యనార్, తిరుభువనమ్ గవర్నమెంట్ మెడికల్ వైద్యుడు కార్తికేయన్, అజిత్ కుమార్ మతదేహాన్ని పోస్ట్ మార్టం చేసిన మధురై రాజాజీ ఆసుపత్రి వైద్యులు సదాశివం, ఏంజెల్ కూడా న్యాయమూర్తికి వాంగ్మూలాలు ఇచ్చారు. తరువాత, తిరుప్పు వనం పోలీస్ స్టేషన్లోని పోలీసులను కూడా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. అజిత్ కుమార్ హత్య కేసులో అరెస్టు చేయబడి మధురై సెంట్రల్ జైలులో ఉన్న ఐదుగురు పోలీసు అధికారులను విచారించడానికి న్యాయమూర్తి జాన్ సుందర్ లాల్ అనుమతి పొందినట్లు తెలుస్తుంది. దీంతో ఆయన ఎప్పుడైనా జైలుకు వెళ్లి విచారణ చేపడతారని తెలుస్తుంది. కాగా న్యాయమూర్తి దర్యాప్తు నివేదికలో అనేక కీలక సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
పరిశోధన విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
వేలూరు: విద్యార్థినులు పరిశోధన విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ సంధ్యా పెంటారెడ్డి అన్నారు. కాట్పాడిలోని అగ్జిలియమ్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినుల యూనియన్ 71వ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిప ల్ సిస్టర్ ఆరోగ్య జయశీలి అధ్యక్షతన ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విద్యార్థినులు పట్టుదలతో ప్రయత్నం చేస్తే జీవితంలో అభివృద్ధి చెందగలరన్నారు. కార్యక్రమంలో అగ్జిలియమ్ కళాశాల కార్యదర్శి మేరి జోసెఫిన్ రాణి, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ నాగరాజన్, విద్యార్థినిలు, ఫ్రొఫెసర్లు పాల్గొన్నారు. -
కేజేఆర్ హీరోగా నూతన చిత్రం ప్రారంభం
తమిళసినిమా: నటుడు కేజేఆర్ హీరోగా నటిస్తున్న రెండవ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈయన అంగీకారం అనే చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. దీంతో కేజేఆర్ తాజాగా రెండో చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇంతకు ముందు మార్క్ ఆంటోని వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన మినీ స్టూడియోస్ సంస్థ అధినేత ఎస్.వినోద్కుమార్ నిర్మిస్తున్న 15వ చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా విళంగు వెబ్ సిరీస్, మామన్ చిత్రాల ఫేమ్ ప్రసాద్ పాండిరాజ్ శిష్యుడు రీగన్ టానీస్లాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో కేజేఆర్తో పాటు అర్జున్ అశోకన్, శ్రీదేవి, సింగంపులి, జయప్రకాశ్, హరీశ్కుమార్, పృధ్వీరాజ్, ఇందుమతి, అశ్విన్ కే.కుమార్, అభిషేక్ జోసప్ జార్జ్, అజూ వర్గీస్, శ్రీకాంత్ మురళీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీవీ.శంకర్ ఛాయాగ్రహణం, జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. -
తాంబరం–నాగర్కోయిల్ ప్రత్యేక రైలు రెండు వారాల పొడిగింపు
కొరుక్కుపేట: తాంబరం–నాగర్కోయిల్ మధ్య వారానికో ప్రత్యేక రైలు (నెం. 06011) గత నెల వరకు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ప్రయోజనాల దష్ట్యా ప్రత్యేక రైలును మరో రెండు వారాల పాటు పొడిగించారు. దీని ప్రకారం తాంబరం నుంచి నాగర్కోయిల్కు వెళ్లే ప్రత్యేక రైలు ఈ నెల 14వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు తాంబరంలో బయలుదేరి, చెంగల్పట్టు, మేల్మరువత్తూరు, విల్లుపురం, చిదంబరం, మైలాడుతురై, కుంభకోణం, తంజావూరు, త్రిచీ, తంజావూరు, తిరుచ్చి, దివ్యనగర్, తంజావూరు, మీదుగా 14వ తేదీ సోమవారం ఉదయం 5.15 గంటలకు నాగర్కోయిల్కు చేరుకుంటుందని ఈ మేరకు దక్షిణ రైల్వే వెల్లడించింది. సెంట్రల్ రైల్వే స్టేషన్లో 13 కిలోల గంజాయి సీజ్ ● ఇద్దరు అరెస్ట్ తిరువొత్తియూరు: చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్ 5వ ప్లాట్ఫామ్కు ఆదివారం పినాకిని ఎక్స్ప్రెస్ రైలు చేరుకుంది. ఆ సమయంలో, అనుమానాస్పదంగా పెద్ద సంచులను తీసుకెళ్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా, వారి వద్ద గంజాయి ప్యాకెట్లు కనిపించింది. తరువాత ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించగా, వారు శివగంగై జిల్లా నెహ్రూ బజార్ ప్రాంతానికి చెందిన విష్ణు వర్ధన్ (23) తిరుబువనం తాలూకాకు చెందిన హేమనాథ్ బాబు (22) అని తెలిసింది. వారు విజయవాడ నుంచి తీసుకుని వచ్చిన 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తరువాత, ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. నెహ్రూ సోదరుడికి ఊరట సాక్షి, చైన్నె: ఆర్థిక వ్యవహారం విషయంగా దాఖలైన కేసులో మంత్రి కేఎన్ నెహ్రూ సోదరుడు రవిచంద్రన్కు ఊరట కలిగింది. సీబీఐ దాఖలు చేసిన కేసును మద్రాసు హైకోర్టు సోమవారం కొట్టి వేసింది. మంత్రి నెహ్రూగా సోదరుడు రవిచంద్రన్ డైరెక్టర్గా ఉన్న సంస్థలో ఆర్థిక వ్యవహారాలలోమోసం జరిగినట్టు ఆరోపణలు గతంలో బయలుదేరాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి రూ. 30 కోట్లు రుణం తీసుకుని ఇతర సంస్థలకు ఆయన దారి మళ్లించినట్టుగా విచ్చన ఫిర్యాదుతో సీబీఐ రంగంలోకి దిగింది. రవిచంద్రన్తో పాటూ పలువురిపై 2021లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఎగ్మూర్ కోర్టులో ఈ కేసు విచారణలో ఉంది. ఈ కేసు రద్దు కోసం హైకోర్టును రవిచంద్రన్ ఆశ్రయించారు. విచారణ అనంతరం సోమవారం తీర్పును న్యాయమూర్తి భరత చక్రవర్తి వెలువరించారు. ఈ కేసులో ఎలాంటి మోసం అన్నది జరగలేదని, అదే సమయంలో ప్రభుత్వ అధికారులకు ఇందులో సంబంధాలు లేదు అని తేల్చిచెప్పారు. ఈ కేసులో మోసం అన్నది జరగని దృష్ట్యా, విచారణను ఇంతటితో ముగిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈకేసుకు సంబంధించిన నగదు వ్యవహారంలో జరిమానాను మాత్రం విధిస్తున్నట్టు ప్రకటించారు. రూ. 30 లక్షలు జరిమానాను రవిచంద్రన్కు విధిస్తూ, ఇందులో 15 లక్షలు సంబంధిత బ్యాంక్కు, మరో 15 లక్షలు సామరస్య ఒడంబడిక సంబంధించిన విచారణ కమిటీకి అప్పగించాలని ఆదేశించారు. అన్నాడీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదు – టీవీకే సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే కూటమితో పొత్తు ప్రసక్తే లేదని తమిళగ వెట్రికళగం (టీవీకే) ప్రకటించింది. గత వారం జరిగిన తమిళగ వెట్రి కళగం కార్యనిర్వాహక సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ కూటమి విషయంగా స్పష్టతను ఇచ్చారు. బీజేపీ, డీఎంకేలను టార్గెట్ చేసి విరుచుకు పడ్డారు. బీజేపీతో గానీ, డీఎంకేతో గానీ పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా ఈ కూటమిలతో పొత్తు ఉండదని, తమిళగ వెట్రికళగం నేతృత్వంలోనే కూటమి అన్నది స్పష్టం చేశారు. అలాగే, విజయ్ను సీఎం అభ్యర్థిగా ఆ సమావేశంలో ప్రకటించారు. అదే సమయంలో అన్నాడీఎంకే విషయంగా విజయ్ ప్రస్తావన తక్కువగా ఉండటంతో కొత్త చర్చ బయలుదేరింది. బీజేపీని వీడి అన్నాడీఎంకే బయటకు వస్తే పొత్తు పెట్టుకుంటారా? అన్న ప్రచారం ఊపందుకుంది. ఇందుకు అనుగుణంగా ఏకం అవుదాం అంటూ పరోక్షంగా విజయ్కు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి పిలుపు నివ్వడం మరింత చర్చకు దారి తీసింది. దీంతో తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్ తరపున ఆ పార్టీ ప్రచార ప్రధాన కార్యదర్శి అరుణ్ రాజ్ మాట్లాడుతూ, అన్నాడీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకే మీద ప్రజలకు నమ్మకం పోయిందని, మార్పు కోసం తమవైపుగా చూస్తున్నారన్నారు. తమతో కూటమి విషయంగా ఎలాంటి సంప్రదింపులు, చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. -
గ్రీవెన్స్డేలో 415 వినతులు
తిరువళ్లూరు: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్డేలో 415 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్రీవెన్స్డేను నిర్వహించారు. ఇందులో పట్టాల కోసం 45 వినతులు, పక్కాగృహాల కోసం 60, ఉపాధి కోసం 50, మౌలిక సదుపాయాలతో సహా ఇతర వాటి కోసం 193 వినతులతో కలిపి మొత్తం 415 వినతులు వచ్చాయి. వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు బదిలీ చేసిన కలెక్టర్ ప్రతాప్, వాటిని తక్షణం పరిస్కరించాలని ఆదేశించారు. అనంతరం దాదాపు గంట పాటూ అధికారులతో గత వారం స్వీకరించిన వినతులపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్వో సురేష్, పీఏజీ వెంకట్రామన్, స్పెషల్ తాహసీల్దార్ బాలమురుగన్తో తదితరులు పాల్గొన్నారు. కాగా గ్రీవెన్స్డేకు రెవెన్యూ, పోలీసులు, పీడబ్ల్యూడీ, గ్రామీణాభివృద్ధి, అగ్నిమాపశాఖ, ఎడ్యుకేషన్, సర్వేయర్ విభాగంతో పాటూ అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. -
ఇక, సామాజిక న్యాయ హాస్టళ్లు
సాక్షి, చైన్నె: తమిళనాడు వ్యాప్తంగా వివిధ విభాగాల పరిధిలోని సంక్షేమ హాస్టళ్ల పేర్లన్నీ ఒకే గూటికి చేరాయి. ఈ హాస్టళ్లను సామాజిక న్యాయ హాస్టళ్లుగా పిలిచే విధంగా సీఎం స్టాలిన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. రాష్ట్రంలో కులం పేరుతో, మతం పేరుతో , వివిధ సామాజిక వర్గాల పేర్లతో సంక్షేమ హాస్టళ్లు విద్యార్థుల కోసం ఏర్పాటై ఉన్న విషయం తెలిసిందే. కుల ,మత భేదాలను, అసమానతలను పూర్తిగా తొలగించే ప్రయత్నంలో అందరికీ అన్నీ నినాదంతో పరుగులు తీస్తున్న సీఎం స్టాలిన్ ఈ హాస్టళ్ల విషయంగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా చేసిన ప్రకటన మేరకు ఇక, మీదట కాలనీలను అన్న పదం వాడకుండా ఆదేశాలు జారీ చేశారు. అలాగే, రోడ్లు, ప్రాంతాలకు కులం, మతం పేర్లను తొలగించి అందమైన తమిళ పేర్లు, పండ్లు,పుష్సాల పేర్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే,ప్రభుత్వ బడులలోనూ కులం, మతం, సామాజిక వర్గాల పేర్లను తొలగించేందుకు చర్యలు చేపట్టారు.ఈ పరిస్థితులలో.. ఆది ద్రావిడ, గిరిజన తదితర పేర్లతో, వివిధ సామాజికవ ర్గాల పేర్లతో ఉన్న అన్ని హాస్టళ్ల పేర్లనుమార్చే విధంగా సూచించారు. ఈ హాస్టళ్లను సామాజిక న్యాయ హాస్టళ్లుగా పిలిచే విధంగా ఉత్తర్వులుజారీ చేశారు. తమిళనాడు ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని, నేటి యువకులందరూ, కులమతాలకు అతీతంగా, ఐక్యంగా ఉండి భవిష్యత్తును నిర్మించుకోవాలని సీఎం ఆకాంక్షించారు. పునరావాస శిబిరాలలో గృహాలు అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విల్లుపురం, తిరుప్పూర్, సేలం, ధర్మపురి, విరుదునగర్ జిల్లాల్లోని శ్రీలంక తమిళుల పునరావాస శిబిరాలలో రూ. 38.76 కోట్లతో కొత్తగా నిర్మించిన 729 గృహాలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఈ శిబిరాలలో రూ.7.33 కోట్లతో పూర్తి చేసిన కాలువలు, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు, తాగునీటి సౌకర్యాలతో పాటుగా ఇతర ప్రాథమిక సౌకార్యలను శ్రీలంక తమిళులకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.కె.ఎస్.ఎస్.ఆర్. రామచంద్రన్, ఎస్.ఎం. నాసర్, ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్. మురుగానందం, తదితరులు పాల్గొన్నారు. అలాగే రెవెన్యూ శాఖ తరపున ధర్మపురి జిల్లాలో రూ.36.62 కోట్లతో నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. రూ. 18.18 కోట్లతో మదురై జిల్లా – మేలూర్, ధర్మపురి జిల్లా – పెన్నాగారం, తూత్తుకుడి జిల్లా – ఒట్టపిడారం మరియు దిండిగల్ జిల్లా –దిండిగల్ పశ్చిమం తాలుకా కార్యాలయాలకు భవనాలనుప్రారంభించారు. కన్యాకుమారి జిల్లా – తక్కలై , కడలూరు జిల్లా – బన్రూటిలో రూ. 65 లక్షల 76 వేలతో నిర్మించి రెండు రెవెన్యూ ఇన్స్పెక్టర్లకార్యాలయాల భవనాలుకూడా ప్రారంభించారు. యాత్రకు ఆర్థిక సాయం తమిళనాడు నుంచి బౌద్ధ, జైన, సిక్కు సమాజిక వర్గాలు వారి పురాతన, పవిత్ర స్థలాలను సందర్శించేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే రీతిలో ఈసందర్భంగా సీఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముస్లీంలకు హజ్యాత్రకు, క్రైస్తవులకు జెరూసలెం సందర్శనకు, హిందువులకు మానస సరోవరం, కేథార్ నాథ్ల సందర్శనకు కల్పిస్తున్న రాయితీలు, ఆర్ధిక సాయం తరహాలో తమిళనాడు ప్రభుత్వ సమానత్వ వైఖరి మత సామరస్యంను ఉదాహరిస్తూ బౌద్ధమతం, జైన, సిక్కు మతంలోని వారు వారి పవిత్ర స్థలాలను సందర్శించే అవకాశం కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ ఆర్థిక సాయం ప్రకటనతో సీఎం స్టాలిన్ను రాష్ట్ర మైనారిటీ కమిషన్ సభ్యులు పొన్.రాజేంద్ర ప్రసాద్, ప్రవీణ్ తాటియా , రమిత్ కుమార్ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉండగా సీఎం స్టాలిన్ 9,10 తేదీలలో క్షేత్రస్థాయి పర్యటన నిమిత్తం తిరువారూర్కు వెళ్లనున్నారు. ఇక్కడరోడ్ షోతో ప్రజల్ని కలిసేందుకు అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. కాగా, సోమవారం ఒక్క రోజు సీఎం స్టాలిన్ పది శాఖల అఽధికారులు, మంత్రులతో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో కలిసి సమీక్షా సమావేశాన్ని వేర్వేరుగా నిర్వహించారు. ప్రకటనలు ఉత్తర్వులు కావాలని ఈసందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. తాను ఇచ్చి కొత్త సూచనలు, ప్రకటనలన్నీఅ మల్లోకి వచ్చే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రాజెక్టులు, పథకాల అమలు మరింత వేగం పెంచాలని ఆదేశించారు. పేర్ల మార్పునకు సీఎం ఆదేశాలు పునరావస శిబిరాలలో గృహాలు పది శాఖల అధికారులతో సమీక్ష -
చైతన్య యాత్రకు పళణి శ్రీకారం
● అన్నతాలతో భేటీ ● ప్రజలతో మమేకం అవుతూ రోడ్ షోసాక్షి, చైన్నె మక్కలై కాప్పోం..తమిళగల్తై కాప్పోం ( ప్రజలను, తమిళనాడును కాపాడుకుందాం) అన్న నినాదంతో పురట్చి తమిళర్ ఎలుచ్చి పయనం ( విప్లవ తమిళుడి చైతన్య యాత్ర)కు సోమవారం ఉదయం మేట్టు పాళయం వేదికగా అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శిపళని స్వామి శ్రీకారంచుట్టారు. మేట్టుపాళయం, గౌండం పాళయం నియోజకవర్గాల పరిధిలో ప్రజా క్షేత్రంలో దూసుకెళ్లారు. వివరాలు.. 2026 అసెంబ్లీ ఎన్నికల ద్వారా అధికార పగ్గాలను చేజిక్కించుకోవడం లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె పళణి స్వామి రాష్ట్ర పర్యటనకు నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలి విడతగా 23వ తేది వరకు ఆయన పర్యటన జరగనున్నది. ప్రజాక్షేత్రంలోకి దివంగత సీఎం జే జయలలిత బాణిని అనుసరించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఒక మినీ బస్సును ప్రచార రథంగా తీర్చిదిద్దారు.్ఙ మక్కలై కాప్పోం..తమిళగల్తై కాప్పోంశ్రీ అన్న పాటలు, పురట్చి తమిళర్ ఎలుచ్చి పయనం అన్న నినాదాలు మిన్నంటే విధంగా ప్రచార చైతన్య యాత్రకు కొంగు మండలంలోని కోయంబత్తూరు జిల్లా మేట్టు పాళయం నియోజవకర్గంలో ఉదయం శ్రీకారం చుట్టారు. ముందుగా ఇక్కడి వన భద్ర కాళి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలను స్వయంగా పంచి పెట్టారు. ఇక్కడ నుంచి యాత్రకు శ్రీకారం చుడుతూ రోడ్ షోతో ప్రజలతో మమేకం అయ్యేవిధంగా అడుగులు వేశారు. మార్గ మధ్యలో రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.వారి సమస్యలు విన్నారు. తాము అధికారంలోకి వస్తే అత్తి కడవు – అవినాశి నీటి పథకం రైతుల అభిష్టానికి అనుగుణంగామార్చడంజరుగుతుందని ఈ సందర్భంగా పళనిస్వామి ప్రకటించారు. బీజేపీ నేతలతో కలిసి.. మధ్యాహ్నం వరకు రోడ్ షోగా సాగింది. ఆయన విశ్రాంతి తీసుకున్న హోటల్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, ఇన్చార్జ్ అరవింద్ మీన న్,కేంద్ర సహాయ మంత్రిఎల్ మురుగన్ వచ్చారు. పళణిస్వామికి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛాలను అందజేశారు. ఆ తదుపరి పళణి స్వామి వాహనం నుంచిఅభిమానులను పలకరిస్తూ ముందుకు సాగారు. మేట్టు పాళయంకీరమడై బస్టాండ్ వద్ద జరిగిన సభలో ప్రసంగించారు. పళణిస్వామి వాహనం మీద నుంచి బీజేపీ నేతలు నైనార్, సహాయ మంత్రి ఎల్ మురుగన్తో పాటూ అన్నాడీఎంకే నేతలు ప్రజలకు అభివాదం చేశారు. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి బలాన్ని చాటే విధంగారెండు పార్టీల జెండాలు హోరెత్తించారు. రాత్రి గౌండం పాళయం నియోజకవర్గం పరిధిలోని శరవణ పట్టిలోజరిగిన బహిరంగ సభతో తొలి రోజు పర్యటనను పళణిస్వామి పూర్తిచేశారు. -
20 శాతం సీట్ల పెంపు
● ఆర్ట్స్ అండ్ సైన్స్కు మరింత అవకాశం ● ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు శ్రీకారం ● 7.5 శాతం కోటా సీట్ల భర్తీ సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఆర్ట్స్ అండ్సైన్స్ కోర్సులకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో సీట్ల సంఖ్యను 20 శాతం పెంచుకునే విధంగా కళాశాలలకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇంజినీరింగ్ కోర్సుల కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. తొలి రెండు రోజులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకుఅ మలు చేస్తున్న 7.5 శాతం కోటా సీట్ల భర్తీకి చర్యలు తీసుకున్నారు. వివరాలు.. ఈ ఏడాది ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులకు రాష్ట్రంలో డిమాండ్ అన్నది మరింతగా పెరిగి విషయం తెలిసిందే. 180 ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలలో ఒక లక్షా 25 వేల సీట్లు ఉన్నాయి. ఈసీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించగా 2.25 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో ఒక లక్షా 84 వేల 762 మంది దరఖాస్తు రుసుం సైతం చెల్లించారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఏ తమిళ్, బీకాం, బీఏ ఇంగ్లీషు, బిబిఏ, బీఎస్సీ కెమిస్ట్రీ కోర్సులకు డిమాండ్ మరింతగా పెరిగింది. 2025–26 విద్యా సంవత్సరానికి మరింతగా విద్యార్థులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల సీట్ల కోసం ఎదురు చూస్తుండటంతో సీట్ల ను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయంగా సోమవారం ఉన్నత విద్యా మంత్రి కోవి చెలియన్ పరిశీలనానంతరం ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో సీఎం స్టాలిన్తో చర్చించి విద్యార్థులకు మరింత భరోసా కల్పించే విధంగా సీట్ల పెంపునకు చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. విద్యార్థుల అడ్మిషన్ల దరఖాస్తుల సంఖ్యను ఆధారంగా చేసుకుని ప్రభుత్వ కళాశాలలో 20 శాతం పెంచేందుకు నిర్ణయించామన్నారు. అలాగే, ఎయిడెడ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలకు 15 శాతం, స్వయం ప్రతి పత్తి హోదా కలిగిన కళాశాలలకు 10 శాతం సీట్లను పెంచుకునే అవకాశం కల్పిస్తూ చర్యలు తీసుకున్నామన్నారు. 7.5 శాతం కోటా సీట్ల భర్తీ బీఈ, బీటెక్ వంటి ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశం నిమిత్తం ఆన్లైన్ ద్వారా కౌన్సెలింగ్ ప్రక్రియ ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈనెల 11వ తేది వరకు క్రీడా, దివ్యాంగులు, మాజీ సైనికుల కోటా సీట్ల భర్తీ జరగనుంది. తొలి రెండు రోజులు రాష్ట్ర ప్రభుత్వ బడులలోచదువుకున్న విద్యార్థులకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న 7.5 శాతం రిజర్వుడ్ కోటా సీట్ల భర్తీ మీద దృష్టి పెట్టారు. కటాఫ్ మార్కుల ఆధారంగా ఈ సీట్లను దక్కించుకునే విధంగా, ఉత్తమ కళాశాలలను ఎంపిక చేసుకునే దిశలో ప్రభుత్వ బడులలోని విద్యార్థులు ముందుకెళ్తున్నారు. -
క్లుప్తంగా
పులియం తోపులో విరిగిపడిన మట్టి చర్యలు తిరువొత్తియూరు: చైన్నెలోని పులియం తోపులోని 77వ వార్డులోని టిమ్లర్స్ రోడ్డులో వర్షపు నీరు ప్రవహించేందుకు పెద్ద గుంతలు తవ్వి పనులు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి అక్కడ మట్టి చరియలు విరిగిపడ్డాయి. ఇది చూసిన ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. సమాచారం అందుకున్న, పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ ప్రదేశంలో అడ్డుపెట్టి వాహనాల మరో మార్గంలో మళ్లించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి నష్టం వాటిళ్లలేదని అధికారులు తెలిపారు. ఎతిహాద్ ఎయిర్ వేస్ సేవల విస్తరణ సాక్షి, చైన్నె: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ విమాన సంస్థ ఎతిహాద్ ఎయిర్ వేస్ సేవలు విస్తృతం అయ్యాయని ఆసంస్థ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అరిక్ దే తెలిపారు. ఎతిహాద్ ఎయిర్ వేస్ జైపూర్ – అబుదాబి మధ్య సేవలకు శ్రీకారం చుట్టి ఏడాది పూర్తైందన్నారు. 2024 జూన్ 16న నాలుగు విమానాలతో నాన్ స్టాప్ సేవలు మొదలైనా,డిసెంబరు నాటికి వారానికి పది సేవలు విస్తరించామన్నారు. ఇండియా నెట్వర్క్లో జైపూర్కు ప్రాముఖ్యత పెరుగుతున్నట్టు , ఈ ఏడాది సేవలు ఒక మైలురాయిగా పేర్కొన్నారు. ఎతిహాద్ సేవలను నెట్వర్క్లలో సౌకర్యవంతమైన కనెక్షన్ల ద్వారా విమాన షెడ్యూల్ ఆప్టిమైజ్ చేయడం, సేవల విస్తరణ దిశగా చర్యలు విస్తృతం చేశామన్నారు. కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం వేలూరు: వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని స్వామియార్ మఠం వద్ద ఉన్న అటవీ ప్రాంతం ఆనుకొని ఓ ప్రైవేటు కొబ్బరి పీచు ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో సోమవారం మధ్యాహ్నం ఉన్న ఫలంగా మంటలు చెలరేగాయి. మంటలను చూసిన కార్మికులు వెంటనే మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అయితే ఫ్యాక్టరీలో అధికంగా కొబ్బరి పీచులు ఉండడంతో మంటల ఎగిసి పడ్డాయి. దీంతో కార్మికులు గుడియాత్తం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అగ్నిమాప సిబ్బంది వెంటనే ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని సుమారు 2 గంటల పాటు పోరాడి మంటలను అదుపు చేశారు. ఈ మేరకు గుడియాత్తం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. పొత్తు లేకుంటే గెలుపు కష్టమే ● రెండు ద్రవిడ పార్టీలకు తిరుమావళవన్ సూచన కొరుక్కుపేట: రెండు ద్రావిడ పార్టీలకు పొత్తు లేకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమే అవుతుందని, ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా లేదని వీసీకే పార్టీ నిర్వాహకులు తిరుమావలవన్ పేర్కొన్నారు. పొన్నేరిలో ఓ జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాతీయ పార్టీలు బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడతాయి. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి జనతా పార్టీ ఏర్పడినప్పుడు, ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. పాలక పార్టీ బలం పుంజుకున్నప్పుడే సంకీర్ణ ప్రభుత్వ వ్యవస్థ అమ ల్లోకి వస్తుంది. 1967 తర్వాత ద్రావిడ పార్టీలు నేటి వరకు ప్రజాదరణ కలిగి ఉన్నాయని అన్నారు. రాష్ట్రాలలో ద్వేష రాజకీయాల ద్వారా క్రమబద్ధమైన హింస జరుగుతోంది. తమిళనాడులో కుల ఆధారిత దౌర్జన్యాలు , పోలీసుల దౌర్జన్యాలు ఎక్కువై పోయాయన్నారు. వీటిని నియంత్రించి పూర్తిగా నిర్మూలించాలని, అధికారంలో ఉన్నవారు దీనిపై ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. రెండు ద్రవిడ పార్టీలు తమిళనాడులో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలంగా లేవని, అవి అధికారంలోకి రావాలంటే సంకీర్ణం తప్పనిసరి అన్నారు. టీఎన్సీసీ అధ్యక్షుడికి నో ఎంట్రీ సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సెల్వపెరుంతొగైకు వెల్ల కోట్టై మురుగన్ ఆలయ కుంభాభిషేకంలో పాల్గొనేందుకు అనుమతించక పోవడం వివాదాస్పదంగా మారింది. శ్రీపెరంబదూరు రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి గెలిచిన సెల్వ పెరుంతొగై తొలుత కాంగ్రెస్ శాసన సభా పక్ష నేతగా వ్యవహరించారు. ప్రస్తుతం టీఎన్సీసీ అధ్యక్షుడయ్యారు. ఈ పరిస్థితులలో కాంచీపురం జిల్లా పరిధిలోని తన నియోజకవర్గంలో ఉన్న వెల్ల కోట్టై మురుగన్ ఆలయ కుంభాభిషేకానికి ఆయన వెళ్లారు.అయితే, ఆయన్ను అనుమతించ లేదు. జనంలో జనంగా ఆయన దూరంగా ఉండి కుంభాభిషేకాన్ని తిలకించారు. ఆయన వెల్ల కోట్ట మురుగన్ ఆలయంలో వేడుకలో భాగస్వామ్యం కాలేక పోవడానికి ఆయన సామాజిక వర్గం అడ్డుగా మారినట్టైంది. ఇక్కడ రెండు సామాజిక వర్గాల మధ్య రెండు దశాబాద్దాలుగా సాగుతున్న సమరమే కారణంగా పేర్కొన బడుతున్నది. అయితే, తనను అనుమతించక పోవడం గురించి సెల్వ పెరుంతొగై మాట్లాడుతూ, దశాబ్దా కాలంగా సాగుతున్న వివాదానికి ముగింపు ఎప్పుడో అంటూ, తాను మాత్రం జనంలో జనంగా ఉండి కుంభాభిషేకాన్ని తిలకించి వచ్చినట్టు వ్యాఖ్యానించారు.అధికారులు కూడా పట్టించుకోకుండా వ్యవహరించడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
మాలీవుడ్లోకి సాయి అభయంకర్
తమిళసినిమా: యువ సంగీత తరంగం సాయి అభయంకర్ ఇప్పుడు దక్షిణాది చిత్రం పరిశ్రమను చుట్టేస్తున్నారనే చెప్పాలి. ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్స్ ద్వారా పాపులర్ అయిన ఈయన ఇప్పుడు సింగీత దర్శకుడిగా పలు భాషల్లో బిజీ అయ్యిపోయారు. ముఖ్యంగా తమిళంలో ప్రముఖ కథానాయకుల చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. నటుడు శింబు హీరోగానటిస్తున్న ఆయన 49వ చిత్రానికి, తెలుగులో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న డ్యూడ్ చిత్రానికి,లోకేశ్ కనకరాజ్ నిర్మిస్తున్న బెంచ్ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా తాజాగా ఈయన మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. పల్టీ అనే మలయాళ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈయన్ని నటుడు మోహన్లాల్ మలయాళ చిత్ర పరివ్రమలోకి ఆహ్మానిస్తున్న ఒక వీడియోను చిత్ర వర్గాలు విడుదల చేశారు. అందులో పల్లీ ఓనం, సాయి అభయంకర్ పేర్లతో శుభాకాంక్షలు తెలిపారు. కాగా పల్టీ చిత్రంలో షేన్ నిగామిన్ హీరోగా నటిస్తున్నారు. ఇది ఆయన నటిస్తున్న 25వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం ద్వారా ఉన్ని శివలింగం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇది కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఉంటుందని, సంగీతానికి, ఫైట్స్ అఽధిక ప్రాముఖ్యత ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. చిత్ర పాటలను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వస్తోందన్న ఆనందాన్ని చిత్ర వర్గాలు వ్యక్తం చేశారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఓనం పండగ సందర్భంగా ఈ చిత్రం తెరపైకి రానుంది. సంగీత దర్శకుడు సాయి అభయంకర్ -
మామిడి రైతులను ఆదుకోవాలని బీజేపీ ధర్నా
వేలూరు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు దశరథన్ అద్యక్షతన ఆ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఇందులో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాత్యాయిని మాట్లాడుతూ మామిడికి గిట్టుబాటు ధరలు లేక రైతులు పండించిన పంటలను మార్కెట్లో విక్రయం చేసుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడం సరికాదన్నారు. గతంలో ఆంధ్ర రాష్ట్రంలోని జాస్ ఫ్యాక్టరీలకు మామిడిని తరలించి విక్రయించుకునే వారిని ఈ సంవత్సరం ఆంధ్ర రాష్ట్రానికి మామిడిని తీసుకెళ్లలేక సరిహద్దు ప్రాంతంలోనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోనే అధికంగా వేలూరు, సేలం జిల్లాలోనే మామిడి పంటలపై రైతులు ఆధారపడి జీవిస్తున్నారని రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఆ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
మహా కుంభాభిషేకం : భక్తజన సంద్రం.. తిరుచెందూరు
సాక్షి, చెన్నై: తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం (Arulmigu Subramania Swamy Temple) ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడకు నిత్యం భక్తులు పోటెత్తుతుంటారు. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాలను తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలిరావడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ ఆలయ మహా కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన పనులకు హిందూ మత దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పదిహేను సంవత్సరాల తర్వాత ఈ మహోత్సవం జరగనున్నడంతో దేశ విదేశాల నుంచి మురుగన్ భక్తులు తిరుచెందూరు వైపుగా కదిలారు. ఏర్పాట్లు పూర్తి.. కుంభాభిషేకం మహోత్సవం నిమ్తితం జూలై 1 నుంచి పూజలు మొదలయ్యాయి. ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన యాగ శాలలో విశిష్ట పూజలు జరుగుతూ వచ్చాయి. యాగాలు,హోమాలు విజయవంతంగా పూర్తి చేశారు. మహాకుంభాభిషేకం నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించ లేదు. ఆలయం ఆవరణలో మూల విరాట్, వళ్లి, దేవానై అమ్మవార్లకుయాగాది పూజలు జరిగాయి. రాత్రి నుంచి వేకువ జాము వరకు 12 కాల యాగ పూజలు జరిగాయి. Thoothukudi, Tamil Nadu: The Maha Kumbabhishekam at Tiruchendur Subramania Swamy Temple marked the culmination of ₹300 crore renovations. Held with elaborate rituals, holy water anointing, drone blessings, and live broadcasts, it drew thousands of devotees, secured by 6,000… pic.twitter.com/1OHDv5u40O— IANS (@ians_india) July 7, 2025 సోమవారం ఉదయం 6.15 గంటల నుంచి 6.50 గంటల మధ్య రాజగోపురంలోని తొమ్మిది కుంభ కలశాలలో పవిత్ర జలాలలను పోయనున్నారు. అదే సమయంలో విమాన ప్రకారం, మూల విరాట్, షణ్ముగర్, వళ్లి, దేవానై, పెరుమాల్, నటరాజర్ వంటి అన్ని పరివార మూర్తుల గోపురంలోని కలసాలలోపవిత్ర జలాలను పోసి శా్రస్తోక్తంగా కుంభాభిషేక మహోత్సవం పూర్తి చేయడానికి సర్వందం చేశారు. ఈ మహోత్సవాన్ని భక్తులు తలికించేందుకు వీలుగా సముద్ర తీరం, పరిసరాలలో భారీ ఏర్పాట్లు చేశారు. స్వామి ఆలయం పరిసరాలలో విద్యుత్ వెలుగులు, సప్తవర్ణ పుష్పాలతో దేదీప్యమానంగా వెలుగొందుతు న్నాయి. ఈ మహోత్సవం కోసం రూ.15 లక్షలు విలువగల డ్రై ఫుడ్స్తో మాలలను స్వామి, అమ్మవార్ల కోసం సిద్ధం చేశారు. తిరుచెందూరులో మహా కుంభాభిషేకం వేడుకకు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం జరిగే ఈ వేడుకను కనులార వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుచెందూరు వైపుగా పోటెత్తుతున్నారు. దీంతో నిఘా వలయంలోకి ఆధ్యాత్మిక పట్టణాన్ని తీసుకొచ్చారు. నిఘా కట్టుదిట్టం నిఘా నీడలో.. భక్తులకు మెరుగైన సేవలే కాదు, భద్రత పరంగా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఇలం భగవత్, ఎస్పీ ఆల్బర్ట్ జాన్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మానవ రహిత విమానాలను రంగంలోకి దించారు. సముద్ర తీరంలో జనం చొచ్చుకు వెళ్లకుండబా పెద్ద ఎత్తున రక్షణ కవచంగా బారికెడ్లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తిరుచెందూరు వైపుగా పోటెత్తుతుండటంతో ప్రత్యేక బస్టాండ్లను ఏర్పాటు చేశారు. తిరుచెందూరు వైపుగా పలు పట్టణాలు,నగరాల నుంచి బస్సులు రోడ్డెక్కించారు. పది లక్షల మంది భక్తులు తరలి రావచ్చు అన్న సంకేతాలతో అందుకు తగిన ఏర్పాట్లు జరిగాయి.ఆహారం, తాగునీరు వంటి సౌకార్యలు కల్పించారు. అక్కడక్కడ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. -
భక్తజన సంద్రం.. తిరుచెందూరు
తిరుచెందూరులో మహా కుంభాభిషేకం వేడుకకు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం జరిగే ఈ వేడుకను కనులార వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుచెందూరు వైపుగా పోటెత్తుతున్నారు. దీంతో నిఘా వలయంలోకి ఆథ్యాత్మిక పట్టణాన్ని తీసుకొచ్చారు. ● మహాకుంభాభిషేకానికి సన్నద్ధం ● నేడు ప్రత్యేక వేడుకలు ● నిఘా కట్టుదిట్టం సాక్షి, చైన్నె: తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడకు నిత్యం భక్తులు పోటెత్తుతుంటారు. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాలను తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలిరావడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ ఆలయ మహా కుంభాభిషేక పనులకు హిందూ మత దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పదిహేను సంవత్సరాల తర్వాత ఈ మహోత్సవం జరగనున్నడంతో దేశ విదేశాల నుంచి మురుగన్ భక్తులు తిరుచెందూరు వైపుగా కదిలారు. ఏర్పాట్లు పూర్తి.. కుంభాభిషేకం మహోత్సవం నిమ్తితం జూలై 1 నుంచి పూజలు మొదలయ్యాయి. ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన యాగ శాలలో విశిష్ట పూజలు జరుగుతూ వచ్చాయి. యాగాలు,హోమాలు విజయవంతంగా పూర్తి చేశారు. మహాకుంభాభిషేకం నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించ లేదు. ఆలయం ఆవరణలో మూల విరాట్, వళ్లి, దేవానై అమ్మవార్లకుయాగాది పూజలు జరిగాయి. రాత్రి నుంచి వేకువ జాము వరకు 12 కాల యాగ పూజలు జరిగాయి. సోమవారం ఉదయం 6.15 గంటల నుంచి 6.50 గంటల మధ్య రాజగోపురంలోని తొమ్మిది కుంభ కలశాలలో పవిత్ర జలాలలను పోయనున్నారు. అదే సమయంలో విమాన ప్రకారం, మూల విరాట్, షణ్ముగర్, వళ్లి, దేవానై, పెరుమాల్, నటరాజర్ వంటి అన్ని పరివార మూర్తుల గోపురంలోని కలసాలలోపవిత్ర జలాలను పోసి శాస్త్రోక్తంగా కుంభాభిషేక మహోత్సవం పూర్తి చేయడానికి సర్వందం చేశారు. ఈ మహోత్సవాన్ని భక్తులు తలికించేందుకు వీలుగా సముద్ర తీరం, పరిసరాలలో భారీ ఏర్పాట్లు చేశారు. స్వామి ఆలయం పరిసరాలలో విద్యుత్ వెలుగులు, సప్తవర్ణ పుష్పాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఈ మహోత్సవం కోసం రూ.15 లక్షలు విలువగల డ్రై ఫుడ్స్తో మాలలను స్వామి , అమ్మవార్ల కోసం సిద్ధం చేశారు. నిఘా నీడలో.. భక్తులకు మెరుగైన సేవలే కాదు, భద్రత పరంగా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఇలం భగవత్, ఎస్పీ ఆల్బర్ట్ జాన్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మానవ రహిత విమానాలను రంగంలోకి దించారు. సముద్ర తీరంలో జనం చొచ్చుకు వెళ్లకుండబా పెద్ద ఎత్తున రక్షణ కవచంగా బారికెడ్లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తిరుచెందూరు వైపుగా పోటెత్తుతుండటంతో ప్రత్యేక బస్టాండ్లను ఏర్పాటు చేశారు. తిరుచెందూరు వైపుగా పలు పట్టణాలు,నగరాల నుంచి బస్సులు రోడ్డెక్కించారు. పది లక్షల మంది భక్తులు తరలి రావచ్చు అన్న సంకేతాలతో అందుకు తగిన ఏర్పాట్లు జరిగాయి.ఆహారం, తాగునీరు వంటి సౌకార్యలు కల్పించారు. అక్కడక్కడ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. -
● నేటి నుంచి పంపిణీ ●ఈనెల 15 నుంచి 45 రోజుల స్వీకరణ ●‘మీతో స్టాలిన్’కు కసరత్తు వేగవంతం ●మహిళా హక్కు పథకానికీ అవకాశం
కలైంజ్ఞర్ మహిళా హక్కు పథకం కోసం ఇంటింటా సోమవారం నుంచి దరఖాస్తుల పంపిణీకి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈనెల 15వ తేది నుంచి ఈ దరఖాస్తులను 45 రోజుల పాటూ స్వీకరించి, అర్హులైన వారిని రూ. 1000 నగదు పంపిణి పథకం నిమిత్తం ఎంపిక చేయనున్నారు. ఇందు కోసం మీతో స్టాలిన్ శిబిరాలు విస్తృతంగా నిర్వహించనున్నారు. సాక్షి, చైన్నె: ఎన్నికల వాగ్దానంగా ఏడాదిన్నర్న క్రితం కలైంజ్ఞర్ మగళిర్ ఉరిమై తిట్టం( మహిళా హక్కు పథకం)ను ద్రావిడ మోడల్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. తొలి విడతగా ఒక కోటి 6 లక్షల మందికి ఈ పథకం వర్తింప చేశారు. ఈ మేరకు అర్హులైన గృహిణులకు నెలకు రూ. వెయ్యి నగదు బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరుగుతున్నది. అదే సమయంలో తమ కంటే తమకు లబ్ధి చేకూరడం లేదంటూ మహిళలు నినదించడంతో మరో మారు దరఖాస్తులు ఆహ్వానించగా, 11 లక్షల మందికి పైగా మహిళా అర్జీలు దాఖలు చేసుకున్నారు. వీటిని సమగ్రంగా పరిశీలించి సుమారు 7.35 లక్షల లక్షలమందికి వర్తింప చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మీద కోటి 15 లక్షల మంది మహిళలకు ఈ పథకం వర్తింపజేస్తున్నారు. అయినా తమ కంటే తమకు రావడం లేదని నినాదించే వారి సంఖ్య అధికంగానే ఉంది. అదే సమయంలో కొన్ని నిబంధనల కారణంగా అర్హులైన మహిళలు ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం స్టాలిన్ అర్హులైన మహిళలు అందరికి పథకం వర్తింప చేయడమే లక్ష్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి స్వీకరణ మహిళా ఉద్యోగిణులు, పెన్షనర్లు, పదవీ విరమణ పొందిన వారందర్నీ ఈ పథకంకు తాజాగా అర్హులుగా ప్రకటించారు. అలాగే నాలుగు చక్రల వాహనాలు కలిగిన వారికి సైతం అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. వీరికి అవకాశం కల్పించే విధంగా ఈనెల 15 నుంచి నీతో స్టాలిన్ నినాదంతో ప్రత్యేక శిబిరాల నిర్వహనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు పది వేల శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. కడలూరు జిల్లా చిదంబరం వేదికగా ఈ శిబిరాలకు సీఎం స్టాలిన్ ఈనెల 15వ తేదీన శ్రీకారం చుట్టనున్నారు. నవంబర్ వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. తమిళనాడులోని లక్షలాది మంది ప్రజలు రోజూ ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో 3,768 శిబిరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 6,232 శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లో పట్టణ ప్రాంతాల్లోని 13 ప్రభుత్వ విభాగాల నుంచి 43 సేవలు అందుబాటులో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో 15 విభాగాలకు చెందిన 46 సేవలు అందించనున్నారు. ఒక్క మహిళా హక్కు పథకమే కాదు, వివిధ ప్రభుత్వ శాఖల పథకాలు, సేవలను వివరించే విధంగా, వాటి ప్రయోజనాలు, అర్హతల గురించి అవసరమైన సమగ్ర సమాచారాలను బుక్లెట్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. శిబిరం రోజున అర్హతగల మహిళలు అధికారుల్ని సంప్రదించి మహిళ హక్కు పథకం దరఖాస్తును సమర్పించే వీలు కల్పించారు. ఈ శిబిరాలలో స్వీకరించే దరఖాస్తులను 45 రోజులలో పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా మీతో స్టాలిన్ నినాదాన్ని మరింతగా ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా స్వచ్ఛం సేవకులు లక్ష మంది ద్వారా ఇంటింటా దరఖాస్తులు, సమాచార బుక్ లెట్లను సోమవారం నుంచి పంపిణి చేయడానికి నిర్ణయించారు. -
కౌన్సెలింగ్ వేళాయె
● నేటి నుంచి బీఈ, బీటెక్ అడ్మిషన్ల ప్రక్రియ ● 14 నుంచి జనరల్ కౌన్సెలింగ్ సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే ఇంజినీరింగ్ కళాశాలలో ప్రభుత్వ కోటాసీట్ల భర్తీ నిమిత్తం కౌన్సెలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి రిజర్వుడ్ కోటా బీఈ, బీటెక్ కోర్సుల సీట్ల భరత జరగనున్నది. 14 నుంచి జనరల్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. వివరాలు.. రాష్ట్రంలో అన్నావర్సిటీ, సాంకేతిక విద్యా డైరెక్టరేట్ పరిఽధిలో ఉన్న 430 మేరకు ఇంజినీరింగ్ కళాశాలలో కౌన్సెలింగ్ నిమిత్తం దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగిసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుల ఆధారంగా ర్యాండం నెంబర్లను ప్రకటించారు. ప్లస్–2 మార్కుల ఆధారంగా కటాఫ్ నిర్ణయించి ర్యాంకుల జాబితాను సిద్ధం చేశారు. గత నెలాఖరులో సాంకేతిక విద్యా డైరెక్టరేట్లో ఉన్నత విద్యా మంత్రి కోవి చెలియన్ ర్యాంకుల జాబితాను ప్రకటించారు. నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రభుత్వ కోటాలోని సుమారు రెండు లక్షల సీట్ల భర్తీ నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానించగా, 3,02,374 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 2 లక్షల 50 వేల 298 మంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. గత ఏడాది కంటే ఈసారి 40,645 మంది అదనంగా నమోదు చేసుకున్నారు. ఇంజినీరింగ్ కోర్సుల కౌన్సెలింగ్కు అర్హత సాధించిన వారిలో మొత్తం 2 లక్షల 41 వేల 641 మంది ఉన్నారు. వీరిలో రిజర్వుడ్ కోటా క్రీడలు, దివ్యాంగులు, మా జీ సైనికులు తదితర సీట్ల భర్తీ సోమవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ర్యాంకుల జాబితా, ర్యాండం నెంబర్ల ఆధారంగా కౌన్సెలింగ్ తేదీలకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ ద్వారా ఇప్పటికే తెలియజేశారు. ఆన్లైన్ ద్వారా సోమవారం నుంచి ఐదు రోజులు రిజర్వుడ్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ జరగనుంది. ఆ తర్వాత జనరల్ కోటా కౌన్సెలింగ్ జూలై 14 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అనుబంధ కౌన్సెలింగ్ ఆగస్టు 21 నుంచి 23 వరకు జరుగనుంది. అన్నాయూనివర్సిటీ -
ఇంటింటా దరఖాస్తులు..!
సమగ్ర కంటి సంరక్షణ సేవలు విస్తృతం ● ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణియన్ సాక్షి, చైన్నె : ప్రతి ఒక్కరికి కంటి సంరక్షణ అందేవిధంగా సమగ్ర సేవలను విస్తృతం చేయాలని ఆరోగ్యమంత్రి ఎం. సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. కోయంబత్తూరుకు చెందిన ఐ ఫౌండేషన్ గ్రూఫ్ నేతృత్వంలో చైన్నె వడపళణిలో 25వ సిగ్నేచర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇందులో తమిళనాడులో తొలిసారిగా స్కిల్ టెక్నాలజీని పరిచయం చేశారు. కంటి సంరక్షణలో ఒక విప్లవాత్మక పురోగతిని తీసుకొచ్చే విధంగా అధునిక సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సెంటర్ను ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, సేవలను వివరించారు. తమిళనాడులో వైద్యం విస్తృతంగా అందుతోందని, చైన్నె నగరంతో పాటూ పలునగరాలలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఈ సందర్భంగా ఐ ఫౌండేషన్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ డి. రామమూర్తి మాట్లాడుతూ, అత్యాధునిక వైద్యవిధానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పద్మ భూషన్ డాక్టర్ నల్లికుప్పుస్వామి చెట్టి, ఆల్ ఇండియా ఆప్తాల్మోలాజికల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ పార్థ బిశ్వాస్, గాయని నిత్యశ్రీ మహాదేవన్, ఆ పౌండేషన్కు చెందిన డాక్టర్ చిత్రా రామమూర్తి, డాక్టర్ అంకిత బిసాని, డాక్టర్ శ్రేయస్ రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
చైన్నె –తూత్తుకుడి విమానంలో ఇంజిన్ లోపం
– రన్వేపైనే ఆగిపోయిన వైనం కొరుక్కుపేట: చైనె – తూత్తుకుడి విమానంలో ఇంజిన్ లోపం కారణంగా రన్ వేపైనే విమానం ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చైన్నె నుంచి తూత్తుకుడికి వెళ్లే విమానం ఆదివారం ఉదయం 10.10 గంటలకు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. విమానంలో 65 మంది ప్రయాణికులు, ఐదుగురు విమాన సిబ్బంది సహా మొత్తం 70 మంది ఉన్నారు. విమానం రన్ వే వద్దకు వస్తున్న సమయంలో పైలట్ విమానం ఇంజిన్లో వైఫల్యం ఉందని గుర్తించారు. అనంతరం విమానాన్ని గాల్లోకి ఎగరవేయడం ప్రమాదకరమని గ్రహించి అతను వెంటనే విమానాన్ని ఆపి వేసి ఆ సమాచారాన్ని కంట్రోల్ రూమ్కు తెలియజేశారు. దీని తరువాత సిబ్బంది విమానానికి టో ట్రక్కును ఉపయోగించి మరమ్మతులు చేపట్టారు. ఆ తరువాత చైన్నె నుంచి తూత్తుకుడికి ఆలస్యంగా బయలుదేరింది. ఫైలట్ సకాలంలో ఇంజిన్ లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం సాక్షి, చైన్నె : మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ప్రచారానికి హిందూస్థాన్ ఇంటర్నేషనల్ స్కూల్ శ్రీకారం చుట్టింది. మార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఎస్పీ దీపక్ కౌశిక్ నాయకత్వంలో ఆదివారం అవగాహన ప్రచారం ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలు, ఆరోగ్యకరంగా ఎదురయ్యే సమస్యలు, జీవితం మీద పడే ప్రభావం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ కౌశిక్ మాట్లాడుతూ, యువత పెడదోవ పట్టకుండా, వారిని పరిరక్షించే విధంగా అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేశామన్నారు. వీటి వాడకం వల్ల జీవితం నాశనం కావడమేకాకుండా, కుటుంబాలు సైతం తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా ఆయన వాస్తవిక అంశాలతో కొన్ని కథలను వివరించారు. హిందూస్థాన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్ మాట్లాడుతూ బాధ్యతాయుతమైన , భావోద్వేపరంగా ఈ అవగాహన ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నామన్నారు. రియల్ ప్రకటనలపై మరిన్ని ఆంక్షలు సాక్షి, చైన్నె : రియల్ ఎస్టేట్ సంబంధిత ప్రకటనలకు రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భవన నిర్మాణ, స్థల క్రమబద్ధీకరణ కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రియల్ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. విచ్చల విడిగా ఆయా సంస్థలు పోటీలు పడి మరీ టీవీ,ఎఫ్ఎం, సామాజిక మాధ్యమాలు, పత్రికలలో ప్రకటనలు ఇచ్చుకుంటూ వస్తున్నాయి.అయితే, కొన్ని ప్రకటనల కారణంగా ప్రజలు మోసగించబడుతున్నట్టు, అదే సమయంలో అనేక ప్రకటనలలో సెలబట్రీలు సైతం ఉండటం వంటి అంశాలతో సాగుతున్న పరిణామాలను పరిగణించి కొన్ని ఆంక్షలు, నిబంధనలు విధించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రకటనలలో క్యూర్ కోడ్, సంబంధిత సంస్థలకు సంబంధించిన సమగ్ర వివరాలు, ఆయా సంస్థల గ్రూఫ్ల వివరాలను తప్పని సరిగాపొందు పరిచే విధంగా పాటుగా మరికొన్ని ఆంక్షలతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్బుమణి అవుట్ – పీఎంకే లెటర్ పాడ్లో పేరుమాయం సాక్షి, చైన్నె: పీఎంకేలో వివాదం మరింత రక్తికట్టిస్తోంది. అన్బుమణిని ఆ పార్టీ నుంచి తొలగించారా? అన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన పేరు తొలగించి లెటర్ పాడ్ విడుదల చేయడం ఆదివారం చర్చకు దారి తీసింది. వివరాలు.. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్యజరుగుతున్న వార్లో మరో కీలక మలుపు ఆదివారం జరిగింది. పార్టీలో 21 మందిని నియమిస్తూ వ్యవస్థాపక అధ్యక్షుడి హోదాలో రాందాసు ప్రకటన విడుదల చేశారు. పార్టీ లెటర్ పాడ్తో కూడిన ఈ ప్రకటనలో అన్బుమణి పేరు గల్లంతైంది. ఇది అన్బుమణి మద్దతు దారుల్ని విస్మయంలో పడేసింది. అదే సమయంలో అన్బుమణిని కూడా పార్టీ నుంచి తప్పించేందుకు రాందాసు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అందుకే ఆయన పేరునులెటర్ పాడ్ నుంచి తొలగించనట్టు సమాచారాలు వెలువడ్డాయి. తండ్రి, తనయుడి మధ్య వివాదం బయలు దేరినప్పటి నుంచి పలువురి తొలగింపు, పలువురికి కొత్త పదవులు కేటాయిస్తూ రాందాసు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్బుమణి పేరును లాటర్ పాడ్లో పొందుపరుస్తూ విడుదల చేశారు. తాజాగా అది కూడా గల్లంతు కావడం పీఎంకేలో చర్చకు దారి తీసింది. అన్బుమణిని పార్టీ నుంచి రాందాసు తప్పించబోతున్నారన్న సంకేతాల నేపథ్యంలో ఈ వివాదం మరింతగా రక్తికట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్బుమణి పీఎంకేను చీల్చి కొత్త పార్టీ ప్రకటిస్తారా? అన్న చర్చ కూడా తెర మీదకు వచ్చినట్లయ్యింది. -
రేపు చైన్నెలో రాజన్న జయంతి వేడుకలు
● అభిమానులకు పిలుపు ● రక్తదానం, అన్నదానం వంటి సేవలకు ఏర్పాట్లు సాక్షి, చైన్నె: సంక్షేమమే శ్వాసగా, పేదల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగి జన హృదయాల్లో చెరని ముద్ర వేసుకున్న మహానాయకుడు వైఎస్సార్ జయంతి వేడుకలను చైన్నెలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్ సేవాదళ్, ఐటీ విభాగాలు సిద్ధమయ్యాయి. మంగళవారం చైన్నెలో అన్నదానం, రక్తదానం వంటి పలు సేవలకు నిర్ణయించారు. ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో అభిమానులు, మద్దతు దారులు, సేవాదల్,వైఎస్సార్ సీపీ వర్గాలు తరలి వచ్చి భాగస్వామ్యం కావాలని తమిళనాడు వైఎస్సార్ సేవాదళ్ అధ్యక్షుడు ఏకే జహీర్ హుస్సేన్ పిలుపు నిచ్చారు. వివరాలు.. రైతు బాంధవుడిగా, జల యజ్ఞ ప్రదాతగా, పేదల పెన్నిదిగా ప్రతి తెలుగు వాడి గుండెల్లో గూడు కట్టుకున్న మహా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డికి చైన్నెతో విడదీయని బంధం ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన వారసుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి వెన్నంటి ఇక్కడి అభిమాన లోకం కదులుతోంది. వైఎస్సార్ సేవాదళ్ తమిళనాడు విభాగం వేదికగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో మంగళవారం మహానేత రాజన్న జయంతి సందర్భంగా ఏర్పాట్ల మీద దృష్టి పెట్టారు. అభిమానులకు పిలుపు మహానేత 76వ జయంతి సందర్భంగా ఆయన్ను స్మరిస్తూ సేవా కార్యక్రమాలకు తమిళనాడు వైఎస్సార్ సేవాదళ్, ఐటీ విభాగం సిద్ధమయ్యాయి. పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ విషయంగా జహీర్ హుస్సేన్ మాట్లాడుతూ, వైఎస్సార్ జయంతి సందర్భంగా ఐటీ విభాగంతో కలిసి ఓఎంఆర్లో రక్తదాన శిబిరంకు ఏర్పాట్లు చేశామన్నారు. ఫాతీమా అనాథ ఆశ్రమం, పాఠశాలలకు ఉదయం అల్పాహారం పంపిణీతో పాటూ అక్కడి పిల్లలకు పుస్తకాలను , విద్యా ఉపకరణాలను అందించనున్నామన్నారు. కేక్ కట్టింగ్లతో పాటూ రాజన్నను స్మరిస్తూ ప్రత్యేక ప్రార్ధనలు, వివిధ సేవా కార్యక్రమాలకు చర్యలు తీసుకున్నామన్నారు. మధ్యాహ్నం అందరికి బీర్యాని పంచి పెట్టనున్నామని వివరించారు. ఈ జయంతి వేడుకకు పెద్దసంఖ్యలో వైఎస్సార్ సీపీ, సేవాదళ్ వర్గాలు, వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులు, మద్దతు యువ సమూహం, ఐటీ విభాగంలోకి వర్గాలు పెద్ద సంఖ్యలతో తరలి రావాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా, ఐటీ విభాగం నేత సునీల్ తదితరులు హాజరు అవుతున్నారని పేర్కొన్నారు. -
ముగ్గురు పిల్లల తల్లి.. యువకుడితో వివాహేతర సంబంధం..!
తమిళనాడు: వివాహితతో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీసి బెదిరింపులకు దిగుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత మహిళ న్యాయవాదులతో కలిసి ఎస్పీ శ్రీనివాసపెరుమాల్కు వినతిపత్రం సమర్పించారు. తిరువళ్లూరుజిల్లా ఆర్కేపేట ఎస్వీజీపురం ప్రాంతానికి చెందిన కౌసల్య(35)కు వివాహమై, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థలు రావడంతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో చిత్తూరుజిల్లా పాలసముద్రం మండలం వెంగళరాజకుప్పం గ్రామానికి చెందిన పద్విన్తో నాలుగేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి నాలుగేళ్లుగా సహజీవనం కొనసాగించాడు. ఈ క్రమంలోనే గత నెల 10 తేదీన పద్విన్ సెల్ఫోన్ను కౌసల్య పరిశీలించగా ఇద్దరూ ఏకాంతంగా ఉన్న ఫొటోలు, వీడియోలు కనిపించడంతో షాక్కు గురైంది. ఈ విషయమై అతడ్ని నిలదీయగా విషయాన్ని బయటకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని హెచ్చరించాడు. పోలీసులకు వెళితే హత్య చేస్తామని బెదిరించాడు. దీంతో కౌసల్య ఆర్కేపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇన్స్పెక్టర్ జ్ఞానశేఖరన్, ఎస్ఐ రాకీకుమారి విచారణ చేపట్టారు. ఇద్దరి సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకుని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఆర్కేపేట పోలీసులు తనకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ బాధితురాలు ఎస్పీ శ్రీనివాసపెరుమాల్కు న్యాయవాదులతో కలిసి ఫిర్యాదు చేసింది. ప్రిది్వన్తోపాటు అతడి పిన్ని ఉమ, బంధువు పయణి, స్నేహితుడు అయ్యప్పన్ తదితరులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వివరించింది. అలాగే మానవహక్కుల సంఘం, మహిళ కమిషన్, ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి సైతం ఫిర్యాదు చేసినట్టు న్యాయవాదులు తెలిపారు. కాగా కౌసల్య ఫిర్యాదుపై అడిషనల్ ఎస్పీ హరికుమార్ విచారణ జరిపారు. కాగా ఆర్కేపేట పోలీసులు ఈ విషయమై వివరణ ఇస్తూ కౌసల్య ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపామని, అయితే ప్రిది్వన్ సెల్ఫోన్ను స్వాదీనం చేసుకుని వీడియోలు, ఫొటోలను ల్యాబ్కు పంపి నిగ్గుతేలుస్తామన్నారు. ఇది ఇలా వుండగా పద్విన్కు ఇటీవల పెళ్లి చూపులు చూడడంతో కౌసల్యకు దూరం అయినట్టు తెలుస్తుంది. తనతోపాటు కలిసి జీవించాలని కౌలస్య కోరడం, అందుకు ప్రిది్వన్ నిరాకరించడంతోనే వివాదం మొదలైందని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. -
గెలుపే లక్ష్యం
సాక్షి, చైన్నె : అధికారం కొనసాగే రీతిలో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో విస్తృతంగా పనిచేయాలని నేతలకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ఆదేశించారు. సోదరా కదిలిరా నినాదంలో భాగంగా నియోజవర్గాల నేతలతో నిర్వహిస్తున్న ఒన్ టూ ఒన్ కార్యక్రమం శనివారం డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో జరిగింది. తాజాగా పాపనాశం, మనాప్పరై, పట్టుకోట్టై నియోజకవర్గాల ముఖ్య నేతలతో స్టాలిన్ సమావేశమయ్యారు. బూత్కమిటీల పనితీరు, గ్రామాల్లో పార్టీ పరంగా జరుగుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ప్రజల్లోకి వెళ్లాయని ఆరా తీశారు. గ్రామాల్లో కార్యక్రమాలు మరింత వేగం పెరగాలని, అధికారం కొనసాగే రీతిలో గెలుపే లక్ష్యంగా ఒక్కో నియోజకవర్గంలో నేతల పనితీరు ఉండాలని ఆదేశించారు. సభ్యత్వ నమో దు ప్రక్రియలో ఎలాంటి పొరబాట్లకు ఆస్కారం ఇవ్వకుండా చేయాలని సూచించారు. -
స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలి
వేలూరు: నిరుపేదలు స్వయం ఉపాధిని ఎంచుకుని, తద్వారా అభివృద్ధి చెందాలని రెప్కో బ్యాంక్ చైర్మన్, రెప్కో హోమ్ పైనాన్స్ డైరెక్టర్ సంతానం తెలిపారు. తమిళనాడు నుంచి ఇతర దేశాలకు వెళ్లి, తిరిగి స్వదేశాలకు వచ్చిన వారికి వేలూరు బ్రాంచ్ రిటర్నీస్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు, వారి పిల్లలకు విద్యా స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమం వేలూరు బ్రాంచ్ మేనేజర్ విఘ్నేశ్వరి అధ్యక్షతన శనివారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రెప్కో బ్యాంకు నిరుపేదలకు చేరువలో ఉందన్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి సభ్వత్యం చేయించి, వారి పిల్లలను ఆదుకునేందుకు అవసరమైన సహకారం అందజేస్తుందన్నారు. ప్రస్తుతం నిరుపేద మహిళలను గుర్తించి, కుట్టు మిషన్లు అందజేస్తున్నామని, వీటి ద్వారా మీ ప్రాంతంలో దుకాణం ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. అన్ని బ్యాంకుల కన్నా తక్కువ కాలంలో రుణాలు అందేలా తమ బ్యాంకు సిబ్బంది అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రెప్కో బ్యాంక్ హోమ్ పైనాన్స్ వేలూరు రీజినల్ మేనేజర్ ఖాదర్బాషా, బ్యాంక్ కౌన్సిల్ ప్రతినిధి ఇలంగోవన్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటేందుకు ముందుకు రావాలి
వేలూరు: ప్రతి గ్రామ పంచాయతీలోనూ మొక్కలు నాటేందుకు ప్రజలు ముందుకు రావాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని అగరంజేరి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జూన్ 5వ తేదీ నుంచి ఇప్పటికే అన్ని తాలుకాలోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామని, మొత్తం 35 వేల మొక్కలను జిల్లాలోని రోడ్లకిరువైపులా నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని చెప్పారు. ఇందుకు జిల్లాలోని విద్యార్థులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్రస్తుతం నాటుతున్న మొక్కలను గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కింద ఒక సంవత్సరం వరకు సంరక్షించించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంబూరు ఎమ్మెల్యే విల్వనాథన్, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారి తిరుమాల్, మాదనూర్ యూనియన్ చైర్మన్ సురేష్కుమార్, సర్పంచ్ వత్సల, బీడీఓ శరవణన్, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నాకు న్యాయం చేయండి!
● వివాహితతో ఆంధ్ర యువకుడు సహజీవనం ● రాసలీల వీడియో స్నేహితులకు షేర్పై ఎస్పీకి ఫిర్యాదు తిరువళ్లూరు: వివాహితతో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీసి బెదిరింపులకు దిగుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత మహిళ న్యాయవాదులతో కలిసి ఎస్పీ శ్రీనివాసపెరుమాల్కు వినతిపత్రం సమర్పించారు. తిరువళ్లూరుజిల్లా ఆర్కేపేట ఎస్వీజీపురం ప్రాంతానికి చెందిన కౌసల్య(35)కు వివాహమై, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థలు రావడంతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో చిత్తూరుజిల్లా పాలసముద్రం మండలం వెంగళరాజకుప్పం గ్రామానికి చెందిన ప్రిద్విన్తో నాలుగేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి నాలుగేళ్లుగా సహజీవనం కొనసాగించాడు. ఈ క్రమంలోనే గత నెల 10 తేదీన ప్రిద్విన్ సెల్ఫోన్ను కౌసల్య పరిశీలించగా ఇద్దరూ ఏకాంతంగా ఉన్న ఫొటోలు, వీడియోలు కనిపించడంతో షాక్కు గురైంది. ఈ విషయమై అతడ్ని నిలదీయగా విషయాన్ని బయటకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని హెచ్చరించాడు. పోలీసులకు వెళితే హత్య చేస్తామని బెదిరించాడు. దీంతో కౌసల్య ఆర్కేపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇన్స్పెక్టర్ జ్ఞానశేఖరన్, ఎస్ఐ రాకీకుమారి విచారణ చేపట్టారు. ఇద్దరి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఆర్కేపేట పోలీసులు తనకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ బాధితురాలు ఎస్పీ శ్రీనివాసపెరుమాల్కు న్యాయవాదులతో కలిసి ఫిర్యాదు చేసింది. ప్రిద్విన్తోపాటు అతడి పిన్ని ఉమ, బంధువు పయణి, స్నేహితుడు అయ్యప్పన్ తదితరులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వివరించింది. అలాగే మానవహక్కుల సంఘం, మహిళ కమిషన్, ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి సైతం ఫిర్యాదు చేసినట్టు న్యాయవాదులు తెలిపారు. కాగా కౌసల్య ఫిర్యాదుపై అడిషనల్ ఎస్పీ హరికుమార్ విచారణ జరిపారు. కాగా ఆర్కేపేట పోలీసులు ఈ విషయమై వివరణ ఇస్తూ కౌసల్య ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపామని, అయితే ప్రిద్విన్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని వీడియోలు, ఫొటోలను ల్యాబ్కు పంపి నిగ్గుతేలుస్తామన్నారు. ఇది ఇలా వుండగా ప్రిద్విన్కు ఇటీవల పెళ్లి చూపులు చూడడంతో కౌసల్యకు దూరం అయినట్టు తెలుస్తుంది. తనతోపాటు కలిసి జీవించాలని కౌలస్య కోరడం, అందుకు ప్రిద్విన్ నిరాకరించడంతోనే వివాదం మొదలైందని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. -
గాయని ఎస్పీ శైలజకు శ్రీకాంత పురస్కారం ప్రదానం
కొరుక్కుపేట: తెలుగు తరుణి 10వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. చైన్నె టి.నగర్లోని జీఎన్ చెట్టి రోడ్డులోని సర్ పిట్టి త్యాగరాయర్ హాలు లో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నేపథ్యగాయని ఎస్పీ శైలజ విచ్చేశారు. గౌరవ అతిథిగా చైన్నె, ఆకాశవాణి, ప్రోగ్రామ్స్ హెడ్, (రిటైర్డ్) డాక్టర్ జి లలిత పాల్గొన్నారు. ప్రత్యేక అతిథులుగా డాక్టర్ ఉష అయ్యగారి, రచయిత్రి లింగమనేని సుజాత విచ్చేశారు. ఇందులో గాయని ఎస్పీ శైలజకు శ్రీకాంత’ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. ఇందులో తెలుగు మాధ్యమంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు.