breaking news
Tamil Nadu
-
కరూర్ విషాద ఘటన.. విజయ్ మరో కీలక నిర్ణయం
సాక్షి, చైన్నె: తమిళనాడులో(Tamil Nadu) కరూర్ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన నుంచి బాధితులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. మరవైపు.. టీవీకే అధినేత విజయ్(TVK Vijay).. పలువురు బాధితులను పరామర్శించినట్టు సమాచారం. వీడియోలో వారిని పలకరించినట్టు తెలుస్తోంది. కాగా, బాధితులను కలిసేందుకు విజయ్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీని అనుమతి కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.వివరాల ప్రకారం.. కరూర్(Karur Stampade) బాధితులల్లోని పలువురికి టీవీకే నేత విజయ్ వీడియో కాల్ ద్వారా పరామర్శించినట్టు తెలిసింది. త్వరలో నేరుగా వచ్చి కలుస్తానని వారికి ఆయన భరోసా ఇచ్చినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీకి సంబంధిత స్థానిక నేతల ద్వారా సేకరించిన నెంబర్ల ఆధారంగా బాధితులకు విజయ్ వీడియో కాల్ చేసి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కరూర్ బాధితులను కలిసేందుకు విజయ్.. రాష్ట్ర డీజీపీ(Tamil Nadu DGP) కోరినట్టు సమాచారం. ఈ మేరకు తమిళనాడు డీజీపీకి విజయ్ ఈమెయిల్ పంపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, విజయ్ మెయిల్కు డీజీపీ ఎలాంటి సమాచారం ఇచ్చారు అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. గత నెల 27వ తేదీన కరూర్లో టీవీకే విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెనువిషాద ఘటనలో 41 మంది మరణించారు. వీరికి విజయ్ పార్టీ తరపున తలా 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. స్థానికంగా ఉన్న కొందరు నాయకులు బాధితులను కలుస్తూ తమ సానుభూతి తెలియజేసే పనిలో పడ్డారు. ముఖ్య నేతలందరూ కేసులకు భయపడి అజ్ఞాతంలో ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విజయ్ కరూర్ నుంచి చైన్నెకు వచ్చేయడం చర్చకు దారి తీసింది. ఇందుకు ఆయన వీడియో రూపంలో వివరణ కూడా ఇచ్చారు. కరూర్కు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టును సైతం విజయ్ ఆశ్రయించి ఉన్నారు.అదే సమయంలో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ సైతం ఈ కేసుపై విచారణను వేగవంతం చేసింది. మూడో రోజుగా ఈ బృందం తాంథోని మలైలోని అతిథి గృహంలో తిష్ట వేసి, పోలీసులు సమర్పించిన నివేదిక, లభించిన సీసీ ఫుటేజీలతో పాటూ బాధితుల నుంచి సేకరించిన సమాచారాలను సమగ్రంగా పరిశీలించే పనిలో నిమగ్నమైంది. -
'డ్రాగన్' తెచ్చిన లక్.. కాయదు లోహర్కి మరో ఛాన్స్!
హీరోయిన్లకు మొదట ఒకే ఒక్క ఛాన్స్ వస్తుంది. అదృష్టం కలిసొచ్చి ఆ మూవీ హిట్ అయితే తర్వాత అవకాశాలు వెల్లువలా వస్తాయి. కాయదు లోహార్ పరిస్థితి ఇప్పుడు అలానే ఉన్నట్లు కనిపిస్తోంది. 2021లో కన్నడ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులోనూ 'అల్లూరి' అనే మూవీ చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గతేడాది తమిళంలో వచ్చిన 'డ్రాగన్'.. ఈమె కెరీర్ని మలుపు తిప్పేసింది. దీంతో ప్రస్తుతం తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.(ఇదీ చదవండి: వీడియో: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. ముఖంలో పెళ్లికళ)తమిళంలో ఇదయం మురళి అనే సినిమా చేయగా.. ఇది విడుదలకు సిద్ధమైంది. తెలుగులోనూ విశ్వక్ సేన్ 'ఫంకీ'లో ఈమెనే హీరోయిన్. ఇప్పుడు తమిళంలో విశాల్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. దర్శకుడు సుందర్.సి-విశాల్ కాంబోలో ఈ ఏడాది 'మదగజరాజా' వచ్చింది. హిట్ అయింది. దీంతో ఇప్పుడు రిపీట్ కాబోతున్న కాంబోలోకి కాయదు వచ్చి చేరినట్లు తెలుస్తోంది.సుందర్.సి చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాముఖ్యత ఉంటుంది. అలానే ఒకరికి మించి హీరోయిన్లు ఉంటారు. గ్లామర్ కూడా అధిక మోతాదులోనే ఉంటుంది. త్వరలో విశాల్ హీరోగా తీయబోయే సినిమాలో ఇద్దరు బ్యూటీస్కి చోటు ఉంది. అందులో ఒక హీరోయిన్గా కాయదు లోహర్ని ఎంపిక చేసినట్లు సమాచారం. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: పవన్ సినిమాలో మూడు కోట్ల ఆఫర్.. నేను ఒప్పుకోలేదు: మల్లా రెడ్డి) -
పోలీసు అధికారులకు సత్కారం
అద్భుతమైన పనితీరును కనపరిచిన 29 మంది పోలీసు అధికారులను స్వయంగా ఆహ్వానించి నగర పోలీసు కమిషనర్ అరుణ్ అవార్డులతో ఘనంగా సత్కరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ గంజాయి విక్రయాలు , గంజాయి స్వాధీనం చేసుకోవడం, అలాగే ద్విచక్ర వాహనాలు ,సెల్ఫోన్లు స్వాదీనం చేసుకోవడం వంటి చర్యల్లో నిమగ్నమై పోలీసు అధికారులును ప్రశంసిస్తూ అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ అరుణ్ పాల్గొని పోలీసు అధికారులను ప్రశంసిస్తూ అవార్డులతో సత్కరించారు. – కొరుక్కుపేట -
కయాదు లోహర్కు మరో లక్కీ ఛాన్స్?
తమిళసినిమా: హీరోయిన్లకు మొదట ఒకే ఒక్క ఛానన్స్. ఆ తర్వాత ఒకే ఒక్క హిట్. అంతే ఆపై వరుసగా అవకాశాలే అవకాశాలు. నటి కయాదు లోహార్ పరిస్థితి ఇప్పుడు ఇదే అని చెప్పవచ్చు. 2021లో కన్నడ చిత్రపరిశ్రమలోకి కథానాయకిగా అడుగుపెట్టిన బ్యూటీ ఈమె. ఆ తర్వాత మలయాళం, తెలుగు, మరాఠీ, తమిళం అంటూ పాన్ ఇండియా కథానాయకిగా ఎదిగిపోయారు. తమిళంలో నటించిన డ్రాగన్ చిత్రం ఈమెకు సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తమిళం, మలయాళం తదితర భాషల్లో నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి అధర్వకు జంటగా నటిస్తున్న ఇదయం మురళి. ఈ చిత్రం త్వరలో సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కయాదు లోహర్ను మరో లక్కీ ఛాన్న్స్ వరించినట్లు సమాచారం. మదగజ రాజా చిత్రంతో సూపర్ హిట్ ఇచ్చిన నటుడు విశాల్, దర్శకుడు సుందర్.సి కాంబో రిపీట్ కాబోతున్నట్లు సమాచారం. సుందర్.సి చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాముఖ్యత కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అదే విధంగా ఒకరికి మించి హీరోయిన్లు ఆయన చిత్రాల్లో ఉంటారు. గ్లామర్ కూడా అధిక మోతాదులోనే ఉంటుంది. అదేవిధంగా ఆయన విశాల్ హీరోగా తెరకెక్కించనున్న తదుపరి చిత్రంలోనూ ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం. అందులో ఒక హీరోయిన్గా నటి కయాదు లోహర్ ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు. ప్రస్తుతం విశాల్ సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న మకుటం చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా సుందర్.సి నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మూక్కుత్తి అమ్మన్ –2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తరువాత విశాల్, సుందర్.సి కాంబోలో చిత్రం సెట్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దీపావళి రేసులో డీజిల్తమిళసినిమా: ఇటీవల వరుసగా హిట్లతో దూసుకుపోతున్న నటుడు హరీష్ కళ్యాణ్ ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన పార్కింగ్, లబ్బర్ బంతు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం డీజిల్. థర్డ్ ఐ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి షణ్ముగం ముత్తు స్వామి కథ ,దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. నటి అతుల్యా రవి కథానాయకిగా నటించిన ఇందులో వినయ్ ,సాయికుమార్ ,అనన్య, కరుణాస్, వివేక్ ప్రసన్న, సచిన్ కేతేకర్, జహీర్ హుస్సేన్, తంగతురై, కె పి వై దీనా తదితరు ముఖ్య పాత్రలు ప్రశ్నించారు. కాగా నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈనెల 17వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర వివరాలను నటుడు హరీష్ కళ్యాణ్ తెలుపుతూ ఇది 2014 ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. ముఖ్యంగా డీజిల్ దోపిడీ ఇతివృత్తంతో ఈ చిత్ర కథ సాగుతుందన్నారు. సముద్రంలో తయారైన క్రూడ్ ఆయిల్ను పైపుల ద్వారా బయటకు తీస్తారన్నారు. అలా పైపుల ద్వారా వచ్చిన క్రూడ్ ఆయిల్ను కొందరు అక్రమంగా దోచుకుంటారన్నారు. దాన్ని చిత్ర కథానాయకుడు ఎలా అరికట్టగలిగాడు అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం అని చెప్పారు. ఇందులో తాను మత్స్యకారుడిగా నటించానని, నటి అతుల్య రవి న్యాయవాదిగా నటించారని చెప్పారు. ఆమె పాత్ర సెకెండ్ ఆఫ్లో కథను మలుపు తిరగడానికి కీలకం అవుతుందని చెప్పారు. తాను కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ కథా చిత్రం డీజిల్ అని పేర్కొన్నారు. అదేవిధంగా దీపావళి సందర్భంగా విడుదలవుతున్న తన తొలి చిత్రం ఇదేనని హరీష్ కల్యాణ్ చెప్పారు. -
అరసన్గా.. శింబు
తమిళసినిమా: నటుడు శింబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈయన వెట్రి మారన్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత కలైపులి ఎస్.ధాను తన వీ క్రియేషనన్స్ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల చైన్నెలో ప్రారంభమైంది. అదేవిధంగా దర్శకుడు వెట్రి మారన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేశారు. అది శింబు అభిమానుల్లో ఫుల్ జోష్ను నింపింది. కాగా ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టార్స్ ఇతివృత్తంతో సాగే కథా చిత్రమని సమాచారం. లేకపోతే ఇందులో నటుడు శింబు ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో దర్శక, నటుడు సముద్రఖని, కిషోర్, నటి ఆండ్రియా, దర్శకుడు నెల్సన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా నటి సమంత ఈ చిత్రంలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి అధికార ప్రకటన కాలేదన్నది గమనార్హం. త్వరలోనే ఇందులో నటించే కథానాయకి, ఇతర సాంకేతిక వర్గం వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు. కాగా శింబు 49వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి అరసన్ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ టైటిల్ చిత్ర నిర్మాత కలైపులి ఎస్. ధాను మంగళవారం తన ఎక్స్ మీడియాలో టైటిల్తో కూడిన పోస్టర్ను పోస్ట్ చేశారు. అదేవిధంగా అందులో ఆళ పిరంద అరసన్. విజయంతో సిలంబరసన్ ( ఏలడానికి పుట్టిన రాజు. విజయంతో సిలంబరసన్) అనే ట్యాగ్ను పొందుపరిచారు. ఈ చిత్ర పోస్టర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారడంతో పాటు శింబు అభిమానులను ఫిదా చేస్తోంది. -
సమన్వయంతో.. ముందుకు!
– పళణితో బీజేపీ నేతల భేటీ సాక్షి, చైన్నె : ఎన్నికల వ్యవహారాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే దిశగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె పళణిస్వామితో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ అభిజయంత్ పండా చర్చలు జరిపారు. మంగళవారం పళణి స్వామితో ఆయన భేటీ అయ్యారు. వివరాలు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, బీజేపీ తరపున పార్టీ సంబంధించిన అంశాలను పర్యవేక్షించేందుకు ఎన్నికల ఇన్చార్జ్గా అభిజయంత్ ఇటీవల నియమితులయ్యారు. చైన్నె వచ్చిన ఆయన ముందుగా కమలాలయంలో పార్టీ వర్గాలతో సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షు డు నైనార్ నాగేంద్రన్, రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అరవింద్మీనన్, కో ఇన్చార్జ్ సుధాకర్రెడ్డిలతో పాటుగా పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం పళణి స్వామి నివాసంకు అభిజయంత్, నైనార్ నాగేంద్రన్లు వెళ్లారు. సుమారు గంట పాటుగా వీరి భేటీ జరిగింది. 2026 అసెంబ్లీ ఎన్నికల వ్యూహాల అమలు, సమన్వయంతో ముందుకు సాగడం, ఉమ్మడి ప్రచారం, జిల్లాల నేతల సమధ్య ఐక్యత, సమిష్టి ప్రయాణం, తదితర అంశాలతో పాటుగా అసె ంబ్లీ నియోజకవర్గాల ఎంపికకు సంబంధించిన చర్చకు సాగినట్టుసంకేతాలు వెలువడ్డాయి.ఇందులో కొన్ని నియోజకవర్గాల గురించి అన్నాడీఎంకే ముందు బీజేపీ ప్రతిపాదనను ఉంచినట్టు సమాచారం. అయితే, పార్టీ వర్గాలతో చర్చించే ఏ నిర్ణయమైనా తీసుకుంటానని పళణి స్వామి వారికి సూచించినట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. -
క్లుప్తంగా
కారు దగ్ధం సేలం: పార్క్ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వివరాలు.. పెరుండురై రోడ్డులోని ఓ గిడ్డంగి దగ్గర మలైసామికి చెందిన కారు ఆగి ఉంది. అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కాలిపోవడం మొదలైంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. అయితే, ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. విద్యుత్ లీకేజీ వల్ల మంటలు సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విద్యార్థినిని వ్యభిచారంలోకి దింపిన కేసులో.. – సినిమా సహాయ నటుడి అరెస్టు తిరువొత్తియూరు: కోయంబేడులో 9వ తరగతి విద్యార్థినిని పడువు వృత్తిలోకి తీసుకెళ్లిన కేసులో కేకే నగర్కు చెందిన పూంగోడి, నెసపాక్కం ప్రాంతానికి చెందిన భారతి కన్నన్, డీఎంకే నాయకుడు రమేష్తో సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అరెస్టయిన భారతి కన్నన్ సినీ సహాయ నటుడిగా పనిచేస్తున్నారు. ఇతనే పూంగోడి ద్వారా విద్యార్థినిని ధనవంతులైన కస్టమర్లకు పంపి లైంగిక వృత్తిలో పెట్టించినట్లు తెలిసింది. అరెస్టు అయిన భారతి కన్నన్పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అప్పీల్పై 10న విచారణకు సుప్రీం ఆదేశం కొరుక్కుపేట: బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్మ్స్ట్రాంగ్ను జూలై 5, 2024 దుండగులు హత్య చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 27 మందిని అరెస్టు చేశారు. ఈ కేసు చైన్నె ప్రిన్సిపల్ సెషనన్స్ కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసును దర్యాప్తు కోసం సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించాలని కోరుతూ ఆర్మ్స్ట్రాంగ్ సోదరుడు ఇమ్మాన్యుయేల్ ఆర్మ్స్ట్రాంగ్ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన చైన్నె హైకోర్టు ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించింది. దీని తర్వాత, హైకోర్టు ఉత్తర్వులపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఈ కేసులో దర్యాప్తు నిర్వహించి, ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఈ అప్పీల్ను అత్యవసర కేసుగా విచారించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వ న్యాయవాది సబరీష్ సుబ్రమణియన్ ప్రధాన న్యాయమూర్తి పి.ఆర్. కవాయి ముందు అప్పీల్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి ఈ అప్పీల్ను స్వీకరించి, తమిళనాడు ప్రభుత్వ అప్పీల్ను 10వ తేదీన విచారిస్తామని వెల్లడించారు. దండలు, శాలువలకు బదులుగా.. – బియ్యం అడుగుతున్న మహిళా కాంగ్రెస్ నాయకులు తిరువొత్తియూరు: తమిళనాడు మహిళా కాంగ్రెస్ పేదలకు సహాయం చేయడానికి ఒక వినూత్న ఏర్పాటు చేసింది. దీని ప్రకారం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హసీనా సయ్యద్ను కలవడానికి వచ్చేవారు దండలు, శాలువలు, పూలగుత్తులు, చీరలు వంటివి తీసుకురావద్దని, వాటికి బదులుగా కనీసం కిలో బియ్యం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ ప్రకటన మహిళా కాంగ్రెస్ కార్యాలయం వెలుపల అతికించారు. ఎవరైనా పేదలు ఇక్కడ 5 కిలోల బియ్యం కూపన్ను తీసుకుని దగ్గరలోని దుకాణంలో కొనుగోలు చేయవచ్చు. అక్కడ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. హసీనా సయ్యద్ మాట్లాడుతూ, శ్రీమేం సేకరించిన బియ్యాన్ని పండుగ రోజుల్లో పేదలకు కనీసం 5 కిలోల చొప్పున పంచుతాం. రాబోయే దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 11న బియ్యం పంపిణీ చేయనున్నాం. కనీసం వెయ్యి మందికి పంపిణీ చేయాలని ‘లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని అన్నారు. లయన్స్ గేట్ ప్లేలో కోర్టు రూమ్ సాక్షి, చైన్నె : రవి గోగుల లీగల్లీ వీర్ హై స్టేక్స్ కోర్టు రూమ్ థ్రిల్లర్ అక్టోబరు 10న లయన్స్ గేట్ ప్లేలో ప్రసారం కానుంది. దీని గురించి దర్శకుడు రవి గోగుల స్థానికంగా మాట్లాడుతూ, లీగల్లీ వీర్ విచారణే కథకు ఇంజన్ అని పేర్కొంటూ, కోర్టు గదిలో అధికారం , వ్యక్తుల మనస్తత్వం గురించి ఇందులో వివరించినట్టు పేర్కొన్నారు. ఒక హత్య కేసు విచారణ..చివరకు న్యాయం గెలుస్తుందా..? అన్నది అక్టోబరు 10న లయన్స్ గేట్ ప్లే ప్రసారం ద్వారా తెలుసుకోవచ్చు అని పేర్కొన్నారు. నటుడు మలికి రెడ్డి వీర్రెడ్డి మాట్లాడుతూ, వీర్ పాత్రలో నటించినట్టు పేర్కొన్నారు. కాగా, వీర్ ప్రయాణం కేవలం ఒక కేసుగురించి కాకుండా, శక్తి వంతుల కోసం మోసగించబడిన వ్యవస్థ గురించి అని వ్యాఖ్యానించారు. -
95 ఏళ్ల వద్ధుడికి అరుదైన యాంజియో ప్లాస్టీ శస్త్రచికిత్స
సాక్షి,చైన్నె: 95 ఏళ్ల వృద్దుడికి అరుదైన యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్సను విజయవంతంగా చేసి చైన్నెకు చెందిన ప్రోమెడ్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుతం వృద్ధుడు ఆరోగ్యంగా ఉన్నట్టు ఆసుపత్రి కార్డియాలజీ హెడ్ అండ్ డైరెక్టర్ అరుణ్ కల్యాణ సుందరం తెలిపారు. మంగళవారం స్థానికంగా జరిగిన విలేకర్లసమావేశంలో అరుణ్ కల్యాణ సుందరం పాల్గొని శస్త్రచికిత్స వివరాలను వెల్లడించారు . సంక్లిష్టమైన కార్డియాక్ సమస్యతో భాదపడతున్న 95 ఏళ్ల వద్ధుడికి రక్షిత యాంజియోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన గుండె పనితీరు తీవ్రంగా బలహీనపడిందన్నారు. ఈ క్రమంలో అధిక రక్తపోటు, రక్తహీనత, గతంలో స్ట్రోక్ వంటి అనేక పరిస్థితులు ఉన్నప్పటికీ, కార్డియాలజీ డైరెక్టర్ – హెడ్ డాక్టర్ అరుణ్ కళ్యాణసుందరం నేతత్వంలోని కార్డియాక్ బందం అత్యంత సంక్లిష్టమైనప్పటికీ మల్టీ–వెసెల్ పెర్క్యటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్ (పీసీఐ) విధానంతో చేపట్టి విజయవంతం చేసినట్టు వెల్లడించారు. -
28 ఏళ్ల యువకుడికి అరుదైన శస్త్ర చికిత్స
సాక్షి, చైన్నె : అరుదైన, ప్రాణాంతకమైన గుండెజబ్బుతో బాధపడుతున్న కేరళకు చెందిన 28 ఏళ్ల యువకుడైన ఇంజినీరింగ్ విద్యార్థికి సిమ్స్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. మంగళవారం ఈ శస్త్ర చికిత్స వివరాలను సిమ్స్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజు శివస్వామి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ డైరెక్టర్ డాక్టర్ వివి బాషి, కార్డియోథొరాసిక్ సర్జన్ మహ్మద్ ఇధ్రీస్లు వివరించారు. రెండు నెలలుగా తీవ్రమైన శ్వాస సమస్యతో బాధ పడుతూ వచ్చిన ఈయువకుడిని సిమ్స్కు తీసుకువచ్చారని పేర్కొన్నారు. తాము నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతడికిరెండు తీవ్రమైన గుండె సమస్య ఉన్నట్టు గుర్తించామన్నారు. ఇది అరుదైన కలయికతో ఉన్నట్టు నిర్ధారించామన్నారు. పింగాణి బృహద్దమని, బృహద్దమణి కవాటం స్టెనోసిస్( గుండె నుంచి రక్తప్రవాహాన్ని నియంత్రించే వాల్వ్)కు శస్త్ర చికిత్స అనివార్యమైందన్నారు. ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులలో ప్రత్యేక బృందంగా ఏర్పడి. తీవ్ర పరిశోధనతో అరుదైన, ఆధునిక విధానం అనుసరించామని వివరించారు. యాంత్రీక అయోర్టిక్ వాల్వ్ను భర్తి చేశారు. బృహద్దమని కవాటం ఉండే నిర్మాణంలో కుట్లు అన్నది అసాధ్యం కావడంతో పింగాణి బృహద్దమని లోని సమస్య కారణంగా శస్త్ర చికిత్స సంక్లిష్టంగా మారిందన్నారు. అయినా 5 గంటల పాటూ శ్రమించి శస్త్ర చికిత్సను విజయవంతం చేశామని, ప్రస్తుతం ఆ యువకుడు ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. దక్షిణ భారత దేశంలో ఇలాంటి శస్త్ర చికిత్స అతి చిన్న వయస్కుడికి జరగడం ఇదే ప్రథమంగా పేర్కొన్నారు. -
కడలూరు సత్యజ్ఞాన సభకు శింబు
తమిళసినిమా: నటుడు శింబు ప్రస్తుతం తన 49వ చిత్రంలో నటిస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర టైటిల్ను మంగళవారం ప్రకటించారు. దీనికి అరసన్ అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ సందర్భంగా నటుడు శింబు మంగళవారం ఉదయం కడలూరు జిల్లా, వడలూర్లోని సత్యజ్ఞాన సభకు వెళ్లారు. వళ్లవర్ నెలకొల్పిన జ్ఞానసభ ఇది. ప్రతి ఏడాది తైపూస జ్యోతి దర్శనం ఉత్సవాలను ఈయన విరివిగా నిర్వహిస్తుంటారు. భక్తులు భారీ ఎత్తున్న ఈ ఉత్సవానికి తరలి వస్తుంటారు. కాగా శింబు ఈ సత్యజ్ఞాన సభను సందర్శించారు. అనంతరం వళ్లవర్ను దర్శించుకున్నారు. అక్కడ గంటకుపైగా ధ్యానం చేశారు. ఈ సందర్భంగా శింబు మీడియాతో మాట్లాడుతూ వళ్లవర్ నిరుపేదలకు, అనాథలకు మూడు పూటలా అన్నదానం చేస్తుంటారని చెప్పారు. అదేవిధంగా తాను చిన్నారులకు అన్నదానం చేయాలని వేడుకున్నట్లు చెప్పారు. అందుకే వళ్లవర్ పిలిచిన వెంటనే సత్యజ్ఞాన సభకు వచ్చి ఆయన్ని దర్శించుకున్నట్లు శింబు పేర్కొన్నారు. -
పరిశుభ్రత లేకుండా చేస్తే చర్యలు
తిరువళ్లూరు: పరిశుభ్రత లేకుండా స్వీట్స్ తయారు చేసి విక్రయిస్తే సంబంధిత దుకాణంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ కదిరవన్ హెచ్చరించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని తిరువళ్లూరు జిల్లాలోని స్వీట్స్, బేకరీ యజమానులతో ఫుడ్సేఫ్టీ అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. పట్టణంలోని ప్రయివేటు హాలులో జరిగిన సమావేశానికి కదిరవన్ హాజరై స్వీట్స్ తయారీ, విక్రయాలపై హోటల్స్, స్వీట్స్, బేకరీ యజమానులకు దిశానిర్దేశం చేశారు. డాక్టర్ కదిరవన్ మాట్లాడుతూ నాణ్యత లేకుండా వస్తువులను తయారు చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొలతల్లోనూ తేడా రాకుండా చూసుకోవాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి వ్యాపారులు వ్యవహరిస్తే ఆహార భద్రత చట్టం కింద రూ.10లక్షలు వరకు జరిమానా విధించే అవకాశం వుందన్నారు. హోటల్స్ యజమానులు, ఫుడ్సేఫ్టీ అధికారులు, స్వీట్స్, బేకరీ యజమానులు పాల్గొన్నారు. -
108 అంబులెన్స్ కార్మికుల ధర్నా
వేలూరు: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 108 అంబులెన్స్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నవీన్ అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్రన్ మాట్లాడుతూ రోజుకు 12 గంటలపాటు విధులు నిర్వహించే 108 అంబులెన్స్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించిన 15 శాతం వేతనం పెంచకుండా 10 శాతం మాత్రం పెంచి మిగిలిన ఐదు శాతాన్ని పెంచకుండా నిలిపి వేయడం సరికాదన్నారు, గత ఐదేళ్లుగా ఒకే వేతనంతో పనులు చేస్తున్నామని ప్రతి సంవత్సరం తమకు వేతనం పెంచాలని కార్మికుల డిమాండ్తో ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరపకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువులకు అనుగుణంగా వేతనాన్ని పెంచి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శామ్యూల్, చైన్నె రీజినల్ కార్యదర్శి సహదేవన్, రీజినల్ కార్యదర్శి రంజిత్కుమార్, కార్మికులు పాల్గొన్నారు. -
భక్తులతో కిటకిటలాడిన గిరివలయం
వేలూరు: తమిళ పెరటాసి మాస పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం మధ్యాహ్నం నుంచి తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ గిరివలయం రోడ్డు భక్తులతో కిటకిటలాడింది. ఈనెల పౌర్ణమి ఈనెల 6న సోమవారం మద్యాహ్నం 11.49 ప్రారంభమై మంగళవారం ఉదయం 9.53 గంటలకు ముగిసింది. దీంతో సోమవారం సాయంత్రం మాడ వీధులు భక్తులతో కిటకిటలాడాయి. ఇదిలా ఉండగా ఉదయం 4 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. రాత్రి పూర్తిగా గిరివలయం చుట్టి వచ్చిన భక్తులు వేకువజామునే అధిక సంఖ్యలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ అధ్యక్షతన ఆలయంలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. అదేవిధంగా ఆలయంలోని అన్నామలైయార్ సమేత ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు చేశారు. మాడ వీధులతోపాటు గిరివలయం రోడ్డులోనూ భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో తిరువణ్ణామలైలో సోమవారం రాత్రితోపాటు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గిరివలయం రోడ్డు భక్తులతో కిటకిటలాడింది. స్వామివార్లను మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. -
సహకార బ్యాంకు ఉద్యోగుల సమ్మె
తిరువళ్లూరు: సహకార బ్యాంకు, రేషన్ దుకాణ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ దశల వారిగా ఉద్యోగులు ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో విధులను బహిష్కరించి సమ్మెబాట పట్టారు. వేతన పెంపులో పాఽరదర్శకత ప్రదర్శించాలని, పక్షపాతం, యూనియన్ల వర్గీకరణ లేకుండా 20 శాతం మేరకు వేతన పెంపును వెంటనే చేయాలని, 2021లో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇచ్చే వెయ్యి రూపాయల పింఛన్ను రూ.5వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. అయినా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదు. ఈక్రమంలో సోమవారం విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టిన ఉద్యోగులు మంగళవారం నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా వున్న ప్రాతమిక సహకార బ్యాంకులు, రేషన్ దుకాణాలను మూసివేసి సమ్మెకు దిగారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించారు. ఉద్యోగుల ఆందోళనతో రేషన్ సరుకుల సరఫరా ఆగిపోయింది. -
ఆలయాలను రక్షించాలి
కొరుక్కుపేట: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, అలాగే పురాతన దేవాలయాలను రక్షించాలని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్రసరస్వతి స్వామి సూచించారని అరుణ్ ఎక్స్సెల్లో ఎండీ పి సురేష్ తెలిపారు. ఈమేరకు చైన్నెలో జరిగిన విలేకర్ల సమవేశంలో ఆయన మాట్లాడారు. మహాబలిపురంలోని జీవా యాక్టివ్ రిటైర్మెంట్ కమ్యూనిటీని శంకర విజయేంద్ర సరస్వతి సందర్శించారని అన్నా రు. ప్రస్తుతం ఈ కమ్యూనిటీలో 400 మంది సీనియర్ సిటిజన్లు ఉంటున్నారని తెలిపారు. వీరికి ఆహారం, ఆరోగ్యం, భద్రత నిర్వహణ అవసరాలను కంపెనీ పూర్తిగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. శంకర విజయేంద్ర సరస్వతి స్వామి జీవాను సందర్శించి, నివాసితులు, సిబ్బంది ఆనందం, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారని చెప్పారు. తరువాత ఆయన శివ విష్ణు ఆలయాలు అనంతరం గోశాలను సందర్శించి మైత్రి హాల్ను ఆయన ప్రారంభించారని చెప్పారు. కార్యక్రమంలో అరుణ్ సురేష్ పాల్గొన్నారు. -
క్లుప్తంగా
తీర్థీశ్వరుడి ఆలయంలో పూర్ణాహుతి – ముగిసిన పవిత్రోత్సవాలు తిరువళ్లూరు: తీర్థీశ్వరుడి ఆలయంలో ఐదు రోజులుగా జరిగిన పవిత్రోత్సవాలు మంగళవారం రాత్రి జరిగిన పూర్ణాహుతితో ముగిశాయి. తిరువళ్లూరులోని త్రిపుర సుందరి సమే త తీర్థీశ్వరుడి ఆలయంలో పవిత్ర ఉత్సవాలు గత గురువారం పవిత్ర యాగంతో ప్రారంభమయ్యాయి. ఐదవ రోజు మంగళవారం ఉద యం యాగపూజలు పవిత్ర సమర్పణ నిర్వహించారు. రాత్రి 9 గంటలకు మహా పూర్ణాహుతితో ఉత్సవాలను ముగించారు. ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుత్తణిలో న్యాయవాదుల ధర్నా తిరుత్తణి: సీజేఐపై దాడికి నిరసనగా తిరుత్తణి న్యాయవాదులు ధర్నా చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై న్యాయవాది దాడి ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు నిరసనగా తిరుత్తణిలోని సంయుక్త కోర్టు న్యా యవాదులు మంగళవారం ధర్నా చేశారు. నిందితుడని వెంటనే అరెస్టు చేయాలని, దేశంలో న్యాయమూర్తులు, న్యాయవాదులకు భద్రత కొరవడిందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. మద్యానికి డబ్బివ్వలేదని.. – తండ్రిపై కుమారుడి దాడి అన్నానగర్: చైన్నెలోని తిరుమంగళంలోని పెరియార్ తేరుపడి కుప్పం ప్రాంతంలో నివసిస్తున్న మాణిక్యం (65). కూలీ అయిన ఇతను తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఇతని కుమారుడు సుందర్ (27). నేరస్థుడైన ఇతను మద్యానికి బానిసై తాగేవాడు. సోమవారం రాత్రి, అతను తన తండ్రిని మద్యం తాగడానికి డబ్బు అడిగాడు. మాణిక్యం అతనికి డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ఇద్దరూ గొడవ పడ్డారు. దీంతో కోపోద్రిక్తుడైన సుందర్ పక్కనే ఉన్న ఇటుకను తీసుకుని తన తండ్రి తలపై కొట్టాడు. మాణిక్యానికి తీవ్ర రక్తస్రావం అవుతూ, నొప్పితో కేకలు పెడుతున్నాడు. సమీపంలోనే ఉన్న అతని మేనల్లుడు శరవణన్, మాణిక్యంను రక్షించి చికిత్స కోసం కిల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. తిరుమంగళం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మటన్ బిర్యానీలో బొద్దింక – యువకుడికి అస్వస్థత అన్నానగర్: చైన్నె పెరంబూర్ మాధవరం హైవే పెరంబూరులో ఓ ప్రసిద్ధ బిర్యానీ దుకాణం ఉంది. ఇందులో మంగళవారం పెరంబూరు మునియప్పచెట్టి వీధి ప్రాంతానికి చెందిన యోగేంద్రబాబు (30) మటన్ బిర్యాని కొని ఇంటికి తీసుకుని వచ్చి తిన్నాడు. బిర్యానీలో చనిపోయిన బొద్దింకను చూసి అతను దిగ్భ్రాంతి చెందాదు. వెంటనే బిర్యానీ దుకాణానికి వెళ్లి అడిగాడు, కానీ ఉద్యోగులు సరైన సమాధానం ఇవ్వలేదు. ఆ తర్వాత అతను ఉద్యోగులతో వాగ్వాదానికి దిగాడు. ఇంతలో, యుగేంద్రబాబు అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని పెరియార్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. యోగేంద్రబాబు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సెంబియం పోలీసులు కేసు నమోదు చేసి, ఆహార భద్రతా శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సిరప్ తయారీ యాజమాన్యానికి నోటీసులు సాక్షి, చైన్నె : దగ్గు సిరప్ తాగి మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్లలో చిన్నారులు మరణించిన కేసులో ఆ మందు తయారీ సంస్థకు తమిళనాడు డ్రగ్ కంట్రోలర్ అధికారి మణిమేఘలై మంగళవారం నోటీసులు జారీ చేశారు. కాంచీపురంలో ఉన్న ఈ పరిశ్రమ వద్ద నోటీసులు అంటించారు. ఈ సంస్థను పుదుచ్చేరికి చెందిన రంగనాథన్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. 14 ప్రశ్నలను సంధిస్తూ, వారం రోజులలో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేని పక్షంలో చట్ట పరంగా చర్యలు తప్పదన్న హెచ్చరికలు చేశారు. 3 సెల్ఫోన్లు చోరీ తిరువొత్తియూరు: చైన్నెలోని కోయంబేడు ప్రాంతంలో నివసిస్తున్న ఓ ఆటోడ్రైవర్ అశోక్కుమార్ (22) కోయంబేడు క్రైమ్ డివిజన్ పోలీస్స్టేషన్లో ఓ ఫిర్యాదు చేశారు. అందులో నేను వసతి గృహంలో ముగ్గురితో కలిసి ఉంటున్నాను. నా సెల్ఫోన్కు చార్జింగ్ పెడుతున్నప్పుడు, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వసతి గృహంలోకి చొరబడి 3 ఖరీదైన సెల్ఫోన్న్లను చోరీ చేశారు. చోరీకి గురైన ఫోన్న్లను గుర్తించి తిరిగి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కేసు నమోదు చేసి, నిఘా కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజీ ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. -
నేరం చేయకుంటే పరామర్శించాలి
వేలూరు: టీవీకే అధ్యక్షుడు విజయ్ నేరం చేయకుంటే అతని అనుచరులతో కలిసి బాధితులను నేరుగా వెళ్లి పరామర్శించి ఉండవచ్చు కదా అతను నేరం చేశాడు కాబట్టే అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నాడని రాష్ట్ర మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని మోర్దన డ్యామ్లో ఇటీవల కురిసిన వర్షాలకు నిండి మొరవ పారుతోంది. వీటిని పరిశీలించేందుకు మంగళవారం ఉదయం ఆయన అధికారులతో కలిసి వెళ్లారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కచ్చదీవుల గురించి బీజేపీ అధ్యక్షుడు నైనా నాగేంద్రన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు కచ్చ దీవుల గురించి ఏ మాత్రం అవగాహన లేదని ఎవరో రాసి ఇస్తే వాటిని చదివి ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తాను చూస్తున్న మోర్దన డ్యామ్ను 1990వ సంవత్సరంలో తాను శంకుస్థాపన చేసి 2001వ సంవత్సరంలో పూర్తి చేసి ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం ఈ డ్యామ్ నిండి నీరు బయటకు పోవడంవల్ల 12 చెరువులకు, 25 గ్రామాల్లోని 3,937.63 ఎకరాలకు సాగు నీరు అందుతోందన్నారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని ఆరుతడి పంటలను పండించుకోవాలన్నారు. కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఎమ్మెల్యే అములు, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ పవలకన్నన్, ఇంజినీర్ వెంకటేష్, వేలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్కుమార్ పాల్గొన్నారు. -
గంగై అమరన్కు చేదు అనుభవం
తిరుత్తణి: తిరుత్తణి మురుగన్ ఆలయంలో వేల్ పూజల్లో పాల్గొనేందుకు వెళ్లిన సినీ దర్శకుడు గంగై అమరన్కు చేదు అనుభవం ఎదురైంది. ఆలయ అధికారులు దర్శనానికి అనుమతి నిరాకరించారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విశ్వ హిందూపరిషత్ జిల్లా అధ్యక్షుడు దురైపాండ్యన్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం కొండ ఆలయంలోని నెమలి మండపంలో వేల్ పూజలు నిర్వహించారు. ఇందులో గంగైఅమరన్ పాల్గొన్నారు. వేల్ పూజలు నిర్వహించిన అనంతరం వేల్ను మురుగన్ సన్నధిలో వుంచి పూజలు చేసేందుకు వీఐజీ గేట్ ద్వారంలో గంగైఅమరన్ సహా ఐదుగురు ప్రముఖులు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వేల్ పూజకు అనుమతి లేదని, వీఐపీ గేట్ ద్వారా స్వామి దర్శనానికి అనుమతి లేదని ఆలయ అధికారులు నిరాకరించడంతో కాసేపు హడావుడి చోటుచేనుకుంది. రూ.100, ఉచిత దర్శనానికి అవకాశం వున్నప్పటికీ గంగైఅమరన్ స్వామి దర్శనం చేసుకోకుండా వెళ్లిపోవడం గమనార్హం. -
సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
వేలూరు: విద్యుత్శాఖ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలకు చెందిన విద్యుత్ కార్మికులు కాట్పాడిలోని ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తమిళనాడు విద్యుత్ కార్మికుల సంఘం వేలూరు జిల్లా అధ్యక్షుడు కామరాజ్, తిరుపత్తూరు జిల్లా అధ్యక్షుడు జయపాల్, క్రిష్ణగిరి జిల్లా అధ్యక్షుడు దురై అద్యక్షత వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి హాజరై మాట్లాడుతూ 2019వ సంవత్సరం నుంచి తమకు అందజేయాల్సిన ఆరు శాతం వేతన పెంపును వెంటనే కార్మికులను అందజేయాలని, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, విద్యుత్ షాక్తో గాయాలైన కార్మికులను కార్యాలయ ఆవరణలోనే విధులు నిర్వహించే విధంగా చూడాలని, ఒక జిల్లాకు చెందిన కార్మికులను మరొక జిల్లాలో విధులు నిర్వహించాలనే చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మికుల సమస్యలపై విద్యుత్శాఖ సీనియర్ ఇంజినీర్కు వినతి పత్రాన్ని అందజేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోవిందరాజ్, కార్మికులు పాల్గొన్నారు. -
నేతలకు ఉదయనిధి, కమల్ పరామర్శ
సాక్షి, చైన్నె : రెండు పార్టీల అధినేతలు అపోలో ఆస్పత్రిలో ఉండడంతో వారిని పరామర్శించేందుకు ఇతర పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం సైతం అపోలో ఆస్పత్రిలోచికిత్సలో ఉన్నారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు చైన్నె అపోలో ఆస్పత్రిలో చికిత్సలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం వైగోను డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాందాసు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అనంతరం మక్కల్ నీది మయ్యం నేత, ఎంపీ కమలహాసన్ వైగో, రాందాసులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితుల గురించి వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అలాగే, బద్రీనాధ్ పర్యటనలో ఉన్న సినీ నటుడు రజనీకాంత్ రాందాసును ఫోన్ ద్వారా పరామర్శించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అస్వస్థత కారణంగా అపోలోలో చేరారు. ఆయనకు వైద్యులు పరిశోదనలు నిర్వహించారు. సాధారణ పరీక్షలేనని ఒక రోజులో డిశ్చార్జ్ చేస్తామని అపోలో వర్గాలు ప్రకటించాయి. కొత్త మోసగాళ్లు! – జాగ్రత్తగా ఉండాలని పోలీసుల హెచ్చరిక సాక్షి, చైన్నె : విద్యా రుణాలు, స్కాలర్ షిప్ల పేరిట కొత్త మోసగాళ్లు తెర మీదకు వచ్చినట్టు పోలీసులు హెచ్చరించారు. సెల్ఫోన్లు వచ్చే ఇలాంటి కాల్స్ను విస్మరించాలని ప్రజలకు సూచిస్తున్నారు. మోసగాళ్లు రోజుకో కొత్త రకం మార్గాలను ఎంచుకుంటూ వస్తున్నారు. పోలీసులు కేసులు చేధించే కొద్ది, కొత్త కొత్త అన్వేషణలతో జనాన్ని బురిడి కొట్టించే పనిలో మోసగాళ్లు ఉన్నారు. తాజాగా ప్రభుత్వం విద్యార్థులకు మద్దతుగా అమలు చేస్తున్న పథకాలను అస్త్రంగా చేసుకుని తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలలోని నగదును మాయం చేసే యత్నాలలో ఉన్నట్టు పోలీసుల దృష్టికి చేరింది. విద్యార్థులకు ప్రభుత్వం నుంచి స్కాలర్ షిప్లు మంజూరైనట్టు, బ్యాంక్ రుణాలు మంజూరైనట్టు, ఇతర నగదు ప్రోత్సాహాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా అనర్గళంగా తమిళంలో మాట్లాడుతూ మోసాలకు పాల్పడే ముఠా గుట్టు ఓ విద్యార్ధి తండ్రి ద్వారా వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రుల సెల్ నంబర్లు సేకరించి, విద్యార్థులకు సంబంధించిన సమగ్ర సమాచారాలు సేకరించి ఫోన్ కాల్స్ చేస్తూ రావడం బయట పడింది. తమ పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వివరాలను తెలియజేస్తుండడంతో తల్లిదండ్రులు నమ్మే పరిస్థితి ఉండటం గమనార్హం. తమ పిల్లల పేరిట స్కాలర్ షిప్లు, రుణాలు మంజూరైందన్న ఆనందంతో మోసగాళ్లు అడిగే వివరాలను ఇచ్చేసి, చివరకు ఓటీపీ వచ్చినట్టుగా పేర్కొంటూ బ్యాంక్ ఖాతాలలో నగదు మాయం చేసే పనిలో ఈ ముఠా ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి విద్యా సంబంధిత ఫోన్కాల్స్ను విస్మరించాలని హెచ్చరిస్తున్నారు. మోసగాళ్ల మాయ మాటలను నమ్మి మోస పోవద్దని, బ్యాంక్ డీటైల్స్ వంటి వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని చైన్నె సైబర్ క్రైం పోలీసులు సూచించారు. 32 పోస్టుల భర్తీకి ఎన్పీఎస్సీ నోటిఫికేషన్ తిరువొత్తియూరు:గ్రూప్ 5ఏ పోస్టులలో ఖాళీగా ఉన్న 32 పోస్టులను భర్తీ చేయడానికి టీఎన్పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు నవంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. వివరాలు.. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్పీఎస్సీ) ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–గ్రూప్ 5ఏ పోస్టుల కోసం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులలో హెడ్ ఆఫీస్ (లా అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ మినహా) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 22 పోస్టులు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 3 పోస్టులు, హెడ్ ఆఫీస్ (లా అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ మినహా) అసిస్టెంట్ 5 పోస్టులు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. మొత్తం 32 పోస్టులను భర్తీ చేయడానికి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం నవంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్పీఎస్సీ) కార్యదర్శి గోపాల సుందరరాజ్ మంగళవారం తెలిపిన ప్రకటనలో పేర్కొంటూ.. ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గ్రూప్ 5ఏ పోస్టుల కోసం 2025 సంవత్సరానికి టీఎన్పీఎస్సీ వార్షిక ప్రణాళికలో పేర్కొన్న విధంగా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు మంగళవారం నుంచి నవంబర్ 5వ తేదీ వరకు కమిషన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష డిసెంబర్ 21న నిర్వహిస్తామన్నారు. -
ప్రేమలతకు మాతృవియోగం
సాక్షి, చైన్నె : డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ తల్లి అంస వేణి(83) వయోభారం, అనారోగ్య సమస్యలతో చైన్నెలో కన్నుమూశారు. ఈ సమాచారంతో ధర్మపురిలో ఉన్న ప్రేమలత విజయకాంత్, ఆమె సోదరుడు సుఽధీష్ హుటాహుటిన చైన్నెకు చేరుకున్నారు. అంసవేణి చైన్నెలోని శాలి గ్రామం ఇంట్లో ఉంటూ వచ్చారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమై ఉన్నా రు. మంగళవారం ఉదయం ఆమె కన్నుమూశారు. ఽకెప్టెన్ రథ యాత్రను ధర్మపురిలో ముగించుకుని ఈరోడ్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రేమలత, సుదీష్ దృష్టికి ఈ మరణ సమాచారం చేరింది. దీంతో ప్రేమలత తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. రథయాత్ర పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన తన సోదరుడితో కలిసి కారులోనే 5 గంటలు ప్రయాణించి చైన్నెకు చేరుకున్నారు. శాలిగ్రామం నివాసంలో ఉంచిన తల్లి భౌతిక కాయాన్ని చూసిన ఆమె విలపించారు. ప్రేమలతకు సీఎం స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్తో పాటూ పలు పార్టీల నేతలు తమ సానుభూతిని తెలియజేశారు. అంసవేణి మృతికి సంతాపం తెలియజేశారు. డీఎండీకే వర్గాలు పెద్ద సంఖ్యలో శాలిగ్రామంకు చేరుకుని అంసవేణి భౌతిక కాయానికి అంజలి ఘటించాయి. -
ఉత్పత్తి రంగంలో తమిళనాడు దేశానికే లీడర్గా అవతరిస్తున్నదని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. 2032 నాటికి పారిశ్రామికంగా రూ. 75 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రకటించారు. చైన్నెలో ఏరో స్పేస్ రక్షణ పరిశ్రమల అంతర్జాతీయ ఎక్స్ పో, సదస
సదస్సులో సీఎం స్టాలిన్ ప్రసంగం సాక్షి, చైన్నె: నందంబాక్కం వర్తక కేంద్రం వేదికగా ఏరో డెఫ్కాన్ 2025 పేరిట మూడు రోజుల అంతర్జాతీయ రక్షణ సదస్సుకు చర్యలు అధికారులు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థ టిడ్కో, ఫ్రాన్స్కు చెందిన బీసీఐ ఏరోస్పేస్, ఏరోస్పేస్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కన్సార్టియం, ఏరో స్పేస్ల నేతృత్వంలో ఇది సాగింది. వివరాలు.. తమిళనాడులో వేగంగా అభివద్ధి చెందుతున్న ఏరోస్పేస్ రంగానికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా రక్షణ పరిశ్రమకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలతో ఒక కొత్త వేదిక రూపకల్పన దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడులో అమలు చేస్తున్న రక్షణ పరిశ్రమ రంగంలో రోడ్మ్యాప్, అంతర్జాతీయ ఉమ్మడి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై దృష్టి పెట్టే విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.23 వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రంగంలోకి రాగా, రూ. 5 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. 2032 నాటికి రూ. 75 వేల కోట్ల పెట్టుబడి ఈ రంగంలో పెట్టేందుకు మార్గంగా ఈ వేదికను తాజాగా ఎంపిక చేశారు. బోయింగ్, ఎయిర్బస్, లాక్హీడ్ మార్టిన్, డస్సాల్ట్, ఏవియేషన్, హెచ్ఏ ఎల్, బీఈఎల్, ఎల్ అండ్ టీ డిఫెన్స్, రోల్స్–రాయిస్, సఫ్రాన్ , టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్లతో పాటుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు డీఆర్డీఓ, ఇస్రో, హెచ్ ఏఎల్, బీడీఎల్, ఏవీఎన్ఎల్లు తమ ఆవిష్కరణలను ఇక్కడ స్టాల్స్ రూపంలో కొలువు దీర్చాయి. వీటన్నింటినీ సీఎం స్టాలిన్ సందర్శించారు. తమిళనాడు 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడానికి ఏరోస్పేస్, రక్షణ, నౌకానిర్మాణం విభాగాలు ప్రధాన స్తంభాలుగా ఈ వేదిక ద్వారా నిలుస్తాయన్న ధీమాను ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు అన్బరసన్, టీఆర్బీ రాజా, ఎంపీ టి.ఆర్. బాలు, శాసనసభ సభ్యుడు కరుణానిధి, కోస్ట్ గార్డ్ చీఫ్ డైరెక్టర్ పరమేష్ శివమణి, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన డాక్టర్ పి.కె. దాస్, పరిశ్రమ, పెట్టుబడి ప్రోత్సాహక సంస్థ , వాణిజ్య కార్యదర్శి వి. అరుణ్ రాయ్, కెరీర్ గైడెనన్స్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ ధారేష్ అహ్మద్, డీఐటీసీఓ ఎండీ సందీప్ నండూరి, ఏరోస్పేస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ స్టీఫెన్ కాస్టెట్, ఎయిర్ కమాండర్ శర్మ, రక్షణ పరిశోధన సంస్థ మాజీ అధ్యక్షుడు ఎస్. క్రిస్టోఫర్, జీఐఎల్ ఇండియా చైర్మన్ బాలసుబ్రమణియన్, భారత నౌకాదళ అధికారి సతీష్ షినాయ్, భారత సాయుధ దళాలు, రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, ఉన్నత స్థాయి స్టార్టప్లు , రక్షణ పరిశోధన సంస్థల అధికారులు హాజరయ్యారు.ఆకర్షిస్తున్న తమిళనాడు.. ఈ సదస్సులో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, తమిళనాడు నేడు భారతదేశాన్ని ఆకర్షించే స్థితిలో ఉందని , ప్రపంచాన్ని ఆకర్షించే రాష్ట్రంగా ఎదిగిందంటూ ఆ మేరకు మార్గదర్శకం వహిస్తున్నట్టు వివరించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సభలు, ఎక్స్పోలకు తమిళనాడు వేదికగా మారిందన్నారు. అన్ని రకాల పరిశ్రమలతో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తమిళనాడు అవతరించి ఉందన్నారు. కొత్త వ్యాపార ఒప్పందాలను స్థాపించడానికి ఒక వేదిక ఈ సమావేశాన్ని మరింత మెరుగ్గా సమన్వయం చేయడం అభినందనీయమన్నారు. తమిళనాడు అన్ని రకాల పరిశ్రమలలో తనదైన ముద్ర వేస్తోందని, తయారీ రంగంలో అగ్రగామిగా మారుతోందన్నారు. ఎగుమతులు, ఉత్పత్తి అయ్యే మొత్తం ఆటోమేటిక్ వాహనాల సంఖ్యలో తమిళనాడు వాటా కేవలం దేశంలోనే 40 శాతంగా ఉన్నట్టు ప్రకటించారు. ద్విచక్ర వాహనాల్లో మూడింట రెండు వంతులు ఎలక్ట్రిక్ వాహనాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. 2024–25లో 14.6 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి, ఎగుమతిలో నంబర్ –1గా అవతరించినట్టు ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడులో 45,000 కంటే ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయని, దేశంలో అత్యధిక ఉత్పాదక ఉత్పత్తి తమిళనాడులో ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం 20 శాతం వాటాను తమిళనాడు కలిగి ఉందని దేశంలోనే ఉత్పత్తి రంగంలో లీడర్గా అవతరిస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. భారతదేశం 11.19 శాతంతో రెండంకెల ఆర్థిక వృద్ధి రేటును కలిగిన ఏకై క’ రాష్ట్రం తమిళనాడు అని పేర్కొంటూ, తమిళనాడు రక్షణ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్ట్ విభాగం అభివృద్ధికి మలుపుగా వ్యాఖ్యలు చేశారు. ఈ రంగంలో తమిళనాడు భారతదేశ తయారీ కేంద్రంగా మారాలని తాను ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.. రక్షణ పరిశ్రమ కారిడార్ భవిష్యత్లో ముఖ్యమైనదని పేర్కొంటూ, ఇందులో కలక పాత్రను పోషిద్దామని పిలుపు నిచ్చారు. అధిక నాణ్యత కలిగిన జెట్ ఇంజిన్ భాగాల నుండి డ్రోన్ తయారీ వరకు ఇక్కడ జరగబోతోందని, పెరుగుతున్న అంతరిక్ష సాంకేతికత ఆధారిత తయారీ యూనిట్లు కూడా ఇందులో ఉన్నాయని వివరించారు. తమిళనాడు రక్షణ పరిశ్రమ రోడ్ మ్యాప్ అని, ఈ దార్శనికత కేవలం ఒక ఆలోచన కాదు, అనేక ప్రధాన ప్రాజెక్టుల అమలుతో, భారతదేశ రక్షణ రంగంలో భవిష్యత్తులో తమిళనాడు స్థానం పదిలం కాబోతోందన్నారు. కారిడార్లు.. కోయంబత్తూరులో 360 ఎకరాల్లో రక్షణ పరిశ్రమ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని, విమానాల మరమ్మతు, నిర్వహణ, సమన్వయ పనులు, నేరుగా రన్వే యాక్సెస్తో సూలూరులో 200 ఎకరాల్లో ఈ స్పేస్ పార్క్ ఏర్పాటు చేశామని, తిరుచ్చిలో 90 కి పైగా ఎంఎస్ఎంఈ మెకానికల్ ఇంజినీరింగ్లో నిమగ్నమై ఉన్నాయని, చైన్నె సమీపంలోని వల్లం వడకల్ వద్ద డిజైన్, పరిశోధన, ప్రయోగాత్మక అంతరిక్ష సంస్థల కోసం ఏరో–హబ్ ప్రాజెక్ట్ త్వరలో పూర్తవుతుందని ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడు రక్షణ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులో రూ. 23 వేల కోట్ల పెట్టుబడులు సేకరించామని, ఇందులో 5 వేల కోట్ల ప్రాజెక్టులు అమల్లోకి తెచ్చామన్నారు. భారీగా పెట్టుబడులు.. 2032 నాటికిఈ రంగంలో రూ. 75,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వేచి ఉండాల్సిన అవసరం లేదని తమిళనాడు ఎల్లప్పుడూ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పిలుపు నిచ్చారు. కొత్త శకానికి నాంది పలికే విధంగా దేశ భద్రతకే కాదు, ప్రపంచానికి కూడా శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి శక్తిగా తమిళనాడు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. జాతీయ స్థాయి వృత్ధి శిక్షణ పరీక్షలలో టాపర్లుగా నిలిచిన 40 మంది తమిళనాడు విద్యార్థులను అభినందించారు. విరుదునగర్, తిరువణ్ణామలై, తూత్తుకుడి, శివగంగై లలో శ్రీలంకతమిళుల పునావాస శిబిరాలలో రూ. 44.48 కోట్లతో నిర్మించిన 772 గృహాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో తమిళనాడు మాజీ సైనికుల సంక్షేమ విభాగం సాధించిన ఉత్తమ ప్రదర్శన ట్రోఫిని సీఎంకు అందజేశారు. -
అవినాశి వంతెనకు జీడీ నాయుడు పేరు
– రేపు కోవై వాసులకు అంకితం సాక్షి, చైన్నె: క్లాసికల్ సిటీ కోయంబత్తూరు వన్నె తెచ్చే విధంగా భారీ వంతెన రూపుదిద్దుకుంది. 10 కి.మీ మేరకు నిర్మితమైన ఈ వంతెనకు జీడీ నాయుడు పేరును ఖరారు చేస్తూ సీఎం స్టాలిన్ ప్రకటించారు. వివరాలు.. కోయంబత్తూరు నగరంలో అవినాశి రోడ్డును అనుసంధానించే విధంగా 2020లో భారీ వంతెన మార్గానికి పునాదులు వేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే పాలకులు 2021లో ఈపనులపై దృష్టి పెట్టారు. 10 కి.మీ దూరం వంతెన మార్గానికి రూ. 1,791 కోట్లు కేటాయించారు. పనుల వేగాన్ని పెంచారు. కోయంబత్తూరు వాసుల దీర్ఘకాలిక కోరిక, ట్రాఫి క్ కష్టాలనుంచి గట్టెక్కించే ఈ వంతెన మార్గం పనులు పూర్తి అయ్యింది. దీనిని గురువారం సీఎం స్టాలిన్ ప్రారంభించనున్నారు. కోయంబత్తూరు నగరంలోనే అతిపెద్ద బ్రహ్మాండ వంతెనగా రూపుదిద్దుకుని దీనికి శాస్త్ర వేత్త, పారిశ్రామికవేత్త జీడీ నాయడు పేరు ఖరారు చేశారు. కోయంబత్తూరు అంటే భారత దేశం గర్వించ దగిన వ్యక్తి జీడీ నాయుడు గుర్తుకు వస్తారని సీఎం ప్రకటించా రు. ఆయన పేరును ఈ వంతెనకు పెట్టడం ఆనందంగా ఉందన్నారు. కాగా జీడీ నాయుడు నాటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కోయంబత్తూరు కళంగల్లో తెలుగు కుటుంబంలో జన్మించారు. తెలుగు సంతతికి చెందిన జీడీ నాయుడుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ అతి పొడవైన వంతెనకు ఆయన పేరు పెట్టడం గమనార్హం.జీడీ నాయడు, వంతెన -
బాధితులకు విజయ్ వీడియో కాల్
సాక్షి, చైన్నె: కరూర్ బాధితులల్లోని పలువురికి టీవీకే నేత విజయ్ వీడియో కాల్ ద్వారా పరామర్శించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. త్వరలో నేరుగా వచ్చి కలుస్తానని వారికి ఆయన భరోసా ఇచ్చినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. గత నెల 27వ తేదీన కరూర్లో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెనువిషాద ఘటనలో 41 మంది మరణించారు. వీరికి విజయ్ పార్టీ తరపున తలా 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. స్థానికంగా ఉన్న కొందరు నాయకులు బాధితులను కలుస్తూ తమ సానుభూతి తెలియజేసే పనిలో పడ్డారు. ముఖ్య నేతలందరూ కేసులకు భయపడి అజ్ఞాతంలో ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విజయ్ కరూర్ నుంచి చైన్నెకు వచ్చేయడం చర్చకు దారి తీసింది. ఇందుకు ఆయన వీడియో రూపంలో వివరణ కూడా ఇచ్చారు. కరూర్కు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టును సైతం విజయ్ ఆశ్రయించి ఉన్నారు. అదే సమయంలో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ సైతం ఈ కేసుపై విచారణను వేగవంతం చేసింది. మూడో రోజుగా ఈ బృందం తాంథోని మలైలోని అతిథి గృహంలో తిష్ట వేసి, పోలీసులు సమర్పించిన నివేదిక, లభించిన సీసీ ఫుటేజీలతో పాటూ బాధితుల నుంచి సేకరించిన సమాచారాలను సమగ్రంగా పరిశీలించే పనిలో నిమగ్నమైంది. ఈ పరిస్థితులలో బాధితులకు విజయ్ వీడియో కాల్ ద్వారా పరామర్శించడం వెలుగులోకి వచ్చింది. పార్టీకి సంబంధిత స్థానిక నేతల ద్వారా సేకరించి నెంబర్ల ఆధారంగా బాధితులకు విజయ్ వీడియో కాల్ చేసి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. వేదనను పంచుకుంటూ.. బాధిత కుటుంబాల వేదనలో తాను పాలు పంచుకుంటున్నట్టు విజయ్ పేర్కొని, తాను ఉన్నానన్న భరోసాను ఇచ్చినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే త్వరలో అందర్నీ స్వయంగా వచ్చి కలుస్తానని విజయ్ పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ ఘటనకు పూర్తి బాధ్యతను విజయ్ వహించాలని వీసీకే నేత తిరుమావళవన్ డిమాండ్ చేశారు. కరూర్లో బాధితుల చిత్ర పటాలకు నివాళులర్పించినానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయ్పై చట్ట పరంగా ఈ కేసులో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో బీజేపీ నేత హెచ్ రాజ మాట్లాడుతూ, ఈ ఘటన జరిగిన సమాచారంతో విజయ్ చైన్నెకు తిరుగు పయనమై పెద్ద తప్పు చేశారని మండి పడ్డారు. ఆయన అక్కడే ధైర్యంగా ఉండి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవహారంలో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇక, మక్కల్ నీది మయ్యం నేత, ఎంపీ కమల్ పేర్కొంటూ, కరూర్ వ్యవహారం విచారణ లో ఉందని, ఇక పదేపదే దీని గురించి మాట్లాడడం అందరూ తగ్గించాలని హితవు పలికారు. -
పెరుగుతున్న డెంగీ కేసులు
సాక్షి, చైన్నై: రాష్ట్రంలో డెంగీ కేసులు విజృంభిస్తున్నాయి. గత మూడు వారాలలో అమాంతం కేసుల సంఖ్య పెరిగినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ఆందోళన వ్యక్తం చేశారు. నైరుతి రుతు పవనాల ప్రభావంతో పశ్చిమ కనుమలలోని జిల్లాలలో సంవృద్ధిగా వర్షాలు పడ్డాయి. మిగిలిన జిల్లాలో మోస్తరుగా వర్షం కురిసింది. ఈ పవనాల సీజన్ ముగియడంతో ప్రస్తుతం ఈశాన్య సీజన్ ప్రవేశం నిమ్తితం ఎదురు చూపులలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా వాతావరణం పూర్తిగా మారింది. ఎండ, వాన, చలి అంటూ అనేక జిల్లాలో ప్రభావం ఉంటూ వస్తోంది. చైన్నె, శివారు జిల్లాలతోపాటూ పది జిల్లాలలో ప్రస్తుతం తెరపించి తెరపించి వర్షం పడుతోంది. కొన్ని సందర్భాలలో భారీ వర్షం కూడా అనేక చోట్ల కురిశాయి. ఈ వాతావరణ మార్పుతో జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడే వారికి సంఖ్య పెరుగుతోంది. చైన్నె, శివారులతో పాటూ పలు జిల్లాలో క్లీనిక్లు, ప్రభుత్వ ఆస్పత్రులకు జ్వరాలతో వచ్చే వారి సంఖ్య పెరిగింది. వీరిలో అనేక మంది డెంగీ , కరోనా పరిశోదనలు సైతం చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డెంగీ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం కలవరం రేపుతోంది. ఈ వివరాలను స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ మంగళవారం ప్రకటించారు. చైన్నెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత మూడు వారాలలో రాష్ట్రంలో డెంగీ కేసుల సంఖ్య పెరిగినట్టు వివరించారు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, వైద్య చికిత్స అందుతున్నాయని పేర్కొన్నారు. డెంగీ నివారణ చర్యలు విస్తృతం చేస్తున్నామని, అదే సమయంలో ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ నివారణే లక్ష్యంగా పది వేల వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, ఎక్కడెక్కడ కేసులు అధికంగా ఉన్నాయో ఆరాతీసి, శిబిరాలను విస్తృతం చేయడానికి అధికారులతో సమావేశమై నిర్ణయాలు తీసుకున్నారు. -
కరూర్ తొక్కిసలాట.. బాధిత కుటుంబాలకు విజయ్ పరామర్శ
చెన్నై: కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలను విజయ్ ఇవాళ (మంగళవారం అక్టోబర్ 7) వీడియో కాల్లో పరామర్శించారు. వారిని ఓదార్చిన విజయ్.. త్వరలో కరూర్లో పర్యటిస్తానని తెలిపారు."నేను మీతో ఉన్నాను, మీకు అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అయితే, వీడియో కాల్ సమయంలో ఫోటోలు తీసుకోవద్దని.. రికార్డ్ చేయవద్దని ఆయన బృందం కోరింది. ప్రతి వీడియో కాల్ సుమారు 20 నిమిషాల పాటు సాగిందని సమాచారం. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కరూర్ తొక్కిసలాట తమిళనాడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే పార్టీకి చెందిన కొందరు నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, మొదట వ్యతిరేకించిన కోర్టు.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. కాగా, టీవీకే పార్టీకి 10 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ సుమారు 30 వేల మందికి పైగా హాజరయ్యారు. భారీగా జనం హాజరవుతారని అధికారులు ముందుగా అంచనా వేయలేకపోయారు. -
‘మరీ ఇంత దిగజారిపోవాలా కమల్?’
తమిళ అగ్రనటుడు, మక్కల్ నీధి మయ్యమ్(MNM) అధినేత కమల్ హాసన్పై బీజేపీ నేత అన్నామలై(Annamalai Slams Kamal) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరూర్ ఘటనలో స్టాలిన్ ప్రభుత్వంపై కమల్ హాసన్ ప్రశంసలు గుప్పించడాన్ని ప్రస్తావిస్తూ.. మరీ డీఎంకేకు తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ అన్నామలై మండిపడ్డారు.సెప్టెంబర్ 27వ తేదీన కరూర్లో జరిగిన విజయ్ టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఆ బాధితులను డీఎంకే నేతలతో కలిసి రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ పరామర్శించారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై, పోలీసులపై ఆయన ప్రశంసలు గుప్పించాడు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ అన్నామలై భగ్గుమన్నారు.రాజ్యసభ సీటు కోసం తన అంతరాత్మను అమ్మేసుకున్నారంటూ అన్నామలై, ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్పై మండిపడ్డారు. ‘‘కరూర్ బాధితుల పరామర్శకు వెళ్లి.. తొక్కిసలాటలో ప్రభుత్వానిది ఎలాంటి తప్పు లేదని అంటే ఎవరైనా అంగీకరిస్తారా?. ఆయన మరీ ఇంత దిగజారాలా?. అసలు ఆయన మాటలను తమిళనాడు ప్రజలేం పట్టించుకునే పరిస్థితిలో లేరు’’ అని అన్నామలై అన్నారు. View this post on Instagram A post shared by Asian News International (@ani_trending)ఇదిలా ఉంటే.. కరూర్ బాధితులను పరామర్శించిన అనంతరం కమల్ మీడియాతో మాట్లాడారు. ఈ విషాదంపై విచారణ జరుగుతున్న దశలో రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదు. దీనిని మానవీయ కోణంలోనే చూడాలి. ప్రభుత్వం ప్రజల పక్షాల నిలబడాలి. సీఎం స్టాలిన్ నాయకత్వ లక్షణం కనబరిచారు. పోలీసులు, అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించారు అని అన్నారు. అదే సమయంలో ‘‘క్షమాపణ చెప్పి.. తప్పు ఒప్పుకోవాల్సిన సమయం ఇది’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీవీకే విజయ్ను ఉద్దేశించినవేనన్న కామెంట్(Kamal Blames Vijay on Karur Incident) బలంగా వినిపిస్తోందక్కడ. ఇదీ చదవండి: విజయ్కు సపోర్ట్గా బీజేపీ, ఆ పార్టీ కూడా! -
వామ్మో దగ్గు మందు!
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడడంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా.. ఎడపెడా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు వాడొద్దంటూ సూచనలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కోల్డ్రిఫ్ కేసులో ఇప్పుడు సంచలన విషయం ఒకటి బయటపడింది. చిన్నారుల మరణాలు, అస్వస్థత నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ యూనిట్ను అప్రమత్తం చేసింది. ఆ విభాగం కాంచీపురంలోని కోల్డ్రిఫ్ దగ్గు మందు(Coldrif Syrup) తయారైన శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్లో(Sresan Pharmaceuticals) అక్టోబర్ 1, 2 తేదీల్లో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో 16 మంది చిన్నారుల మరణానికి కారణంగా భావిస్తున్న కోల్డ్రిఫ్ తయారీని చూసి అధికారులు సైతం విస్తోపోయారట!. ఎన్డీటీవీ ఇచ్చిన కథనం ప్రకారం.. తయారీ కేంద్రంలో కనిపించిన దృశ్యాలు ఇలా ఉన్నాయి. ఆ యూనిట్లో గ్యాస్ స్టవ్లపైనే రసాయనాలను వేడి చేస్తున్నారు. తుప్పుపట్టిన పరికరాలు, మురికి పట్టిన పైపులు. గ్లౌజులు, మాస్కులు లేకుండా సిబ్బంది పదార్థాలను మిక్స్ చేస్తున్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. అక్కడున్న కార్మికుల్లో దాదాపుగా అనుభవం లేనివారే ఉన్నారు. వీటికి తోడు.. స్వచ్ఛత పరీక్షలు జరపకుండానే సిరప్ల కోసం నీటిని ఉపయోగిస్తున్నారు. ఎయిర్ ఫిల్టర్లు, హెచ్ఈపీఏ(HEPA) వ్యవస్థ(అత్యంత సూక్ష్మ ధూళి, బ్యాక్టీరియా, వైరస్ను 99.97% వరకు తొలగించగలిగే శుద్ధి వ్యవస్థ)లు లేకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచిందట. అలాగే.. చెన్నైలోని రెండు ప్రముఖ కంపెనీల నుంచి కెమికల్స్ను నగదు రహిత లావాదేవీల ద్వారా ఇండస్ట్రీయల గ్రేడ్ కెమికల్స్ కొనుగోలు చేసినట్లు తేలింది. ప్రొపైలీన్ గ్లైకోల్ లాంటి కీలక పదార్థాన్ని ఫార్మాస్యూటికల్ ప్రమాణాలు లేని పెయింట్ పరిశ్రమ డీలర్ల నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. అన్నింటికి మించి.. డైఈథిలీన్ గ్లైకాల్(Diethylene glycol)ను టెస్టింగ్ ప్రక్రియతో సంబంధం లేకుండా సిరప్లలో కలిపారు.SR-13 డేంజర్ బ్యాచ్.. కోల్డ్రిఫ్ కఫ్ సిరప్.. SR-13 బ్యాచ్ ఈ యూనిట్లోనే ఈ ఏడాదిలోనే తయారయ్యాయి. రెండేళ్ల కాలపరిమితితో ఈ సిరప్లు.. మే నెలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, పుదుచ్చేరి మార్కెట్లోకి వెళ్లాయి. అయితే.. ఇందులో డైఈథిలీన్ గ్లైకాల్ 48.6% ఉన్నట్లు బయోప్సీ నివేదికలు వెల్లడించాయి. ఇది అనుమతించిన పరిమితికి 500 రెట్లు ఎక్కువ. ఈ పదార్థం.. కిడ్నీ, కాలేయం, నర్వస్ సిస్టమ్ మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఈ కారణంగానే ఆగస్టు–సెప్టెంబర్ మధ్య చింద్వారా జిల్లాలో చిన్నారులు మరణించారని తెలుస్తోంది. ఫార్మాకోవిజిలెన్స్ లేకపోవడం, అనుభవం లేని సిబ్బంది, నీటి స్వచ్ఛత పరీక్షలు లేకపోవడం, వెంటిలేషన్,, పెస్ట్కంట్రోల్ లేకపోవడం.. ఇలా డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ 39 క్రిటికల్, 325 మేజర్ ఉల్లంఘనకు పాల్పడింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సిట్ఏర్పాటు చేసింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం, మరోవైపు.. శ్రేసన్ కంపెనీ స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్, స్టాక్ ఫ్రీజ్, లైసెన్స్ సస్పెన్షన్ విధించారు.మధ్యప్రదేశ్ ప్రభుత్వం: ఇద్దరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్ సస్పెండ్ చేసింది. డ్రగ్ కంట్రోలర్ దినేష్ మౌర్యను ట్రాన్స్ఫర్ చేసింది. సిరప్ను రిఫర్ చేసి ఇద్దరు పిల్లల మరణానికి కారణం అయ్యాడంటూ ఓ డాక్టర్ను అరెస్ట్ చేసింది. అయితే.. ఇది కేవలం ఆ సంస్థ నిర్లక్ష్య ధోరణి మాత్రమే కాదు.. రసాయనాల కొనుగోలు నుంచి, తయారీ, పంపిణీ వరకు మొత్తం వ్యవస్థ వైఫల్యం అని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఎన్డీటీవీ వద్ద వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: సిరప్తో చనిపోతే.. డాక్టర్ తప్పెలా అవుతుంది? -
డీఎంకే నేత సెంథిల్ బాలాజీకి బిగ్ షాక్
న్యూఢిల్లీ: డీఎంకే నేత వి.సెంథిల్ బాలాజీకి(Senthil Balaji) అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) చుక్కెదురైంది. క్యాష్ ఫర్ లాండ్ కుంభకోణం కేసు పెండింగ్లో ఉన్నందున తనను తిరిగి మంత్రివర్గంలో చేర్చుకోవాలా వద్దా అనే విషయంలో గత ఉత్తర్వుపై స్పష్టత ఇవ్వాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిష్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం సోమవారం కొట్టివేసింది.మంత్రి పదవి(DMK Minister Post) గురించిన ప్రస్తావన ఆ ఉత్తర్వుల్లో లేనే లేదని స్పష్టం చేసింది. ‘మేం ఆ ఉత్తర్వును మళ్లీ చదవం. మీరు మంత్రిగా(Tamil Nadu) మారడానికి దానిని మేం చదవలేం. అయితే, మీరు మంత్రి పదవిని చేపట్టినా లేదా మరే ఇతర అధికార పదవిని నిర్వహించినా రాష్ట్ర వాతావరణం ప్రభావితమైతే, న్యాయం జరిగేలా అప్పుడే చూస్తాం’ అని ధర్మాసనం పేర్కొంది.మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీని పదవికి రాజీనామా చేయాలంటూ ఇచ్చిన తీర్పుపై మళ్లీ స్పష్టత కోరడమెందుకంటూ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ను ప్రశ్నించింది. బెయిల్ వచ్చిన కొన్ని రోజుల్లోనే తిరిగి మంత్రి పదవిని చేపట్టిన సెంథిల్ బాలాజీ, కేసుల విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నందునే జైలుకు వెళ్లడం మంచిదంటూ అప్పటి ధర్మాసనం వ్యాఖ్యానించి ఉంటుందని పేర్కొంది. -
పోలీసు అధికారుల సేవలకు ప్రశంసలు
కొరుక్కుపేట: చైన్నె పోలీస్ కమిషనరేట్లో పోలీసు అధికారులు, ఉద్యోగుల పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో అదనపు పోలీసు కమిషనర్ ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులను అభినందించి, సర్టిఫికెట్లను అందజేశారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక మినిస్టీరియల్ సూపరింటెండెంట్, ఐదుగరు పోలీస్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు , ముగ్గురు స్పెషల్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లతో సహా మొత్తం 9 మంది మినిస్టీరియల్ సిబ్బంది, పోలీసు అధికారులు గత నెల 30వ తేదీ పదవీ విరమణ చేశారు. చైన్నె నగర పోలీస్ కమిషనర్ ఎ.అరుణ్ ఆదేశాల మేరకు, అదనపు పోలీస్ కమిషనర్ విజయేంద్ర బిధారి వీడ్కోలు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్లో 25 సంవత్సరాలకు పైగా వారి అద్భుతమైన పనిని ప్రశంసించారు. వారిని శాలువాలు, పూలమాలలతో సత్కరించి, సర్టిఫికెట్లు అందజేశారు. పదవీ విరమణ చేస్తున్న పోలీసు అధికారులు, వారి ఆరోగ్యం, వారి కుటుంబాల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్లు డి.ఎన్.హరికిరణ్ ప్రసాద్(వెల్ఫేర్ అండ్ ఎస్టేట్), జి. సుబ్బులక్ష్మి(అడ్మినిస్ట్రేషన్), పోలీసు అధికారులు, పదవీ విరమణ చేస్తున్న పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ట్రాఫిక్ పోలీసుపై దాడి
సేలం: తిరుచెంగోడులోని వలరై గేట్ ప్రాంతంలో గంజాయి మత్తులో ద్విచక్ర వాహనంపై వచ్చిన డేరా తయారీ కార్మికుడు విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు అధికారి కందసామిపై దాడి చేశాడు. దీంతో డేరా తయారీ కార్మికుడు హరిహరన్ (24)పై కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోలీసులపై హరిహరన్ దాడి చేసిన వీడియో నిన్న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగర పోలీసులు చర్యలు తీసుకున్నారు. తిరుచెంగోడు నగర పోలీస్ స్టేషన్కు చెందిన ట్రాఫిక్ పోలీస్ ఫస్ట్ క్లాస్ కానిస్టేబుల్ కందసామి తిరుచెంగోడ్లోని వాలరైకెట్ ఫోర్–రోడ్ ప్రాంతంలో విధుల్లో ఉన్నాడు. కొక్కరయన్ పేట్టై రోడ్డు నుండి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఒక యువకుడు సెంటర్ మీడియన్ను ఢీకొట్టి కిందపడ్డాడు. ఇది చూసిన ట్రాఫిక్ పోలీస్ ఫస్ట్క్లాస్ కానిస్టేబుల్ కందసామి పడిపోయిన వ్యక్తిని పైకి లేపడానికి వెళ్లి ప్రయత్నించాడు. కానీ కిందపడిన మాదకద్రవ్యాల బానిస లేచి ట్రాఫిక్ పోలీసును అసభ్యకరమైన పదజాలంతో తిట్టి దాడి చేశాడు. అతనిని వెంబడించి దాడి చేయడం కొనసాగించాడు. ఇది చూసిన ప్రజలు ట్రాఫిక్ పోలీసుకు మద్దతు ఇచ్చి, మాదకద్రవ్యాల బానిసను పట్టుకుని కొట్టారు. సమాచారం అందుకున్న ఇతర ట్రాఫిక్ పోలీసులు మాదకద్రవ్యాల బానిసను ప్రజల నుండి రక్షించి తిరుచెంగోడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆ వ్యక్తి గంజాయి మత్తులో ఉన్నట్లు తేలింది. నగర పోలీసులు ద్విచక్ర వాహనంపై ట్రాఫిక్ పోలీసుపై దాడి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని విచారించగా, అతని పేరు హరిహరన్(24) అని తేలింది. మధురైలోని కొట్టంపట్టి ప్రాంతానికి చెందిన సెంథిల్ కుమార్ కుమారుడు. అతను కొంతకాలంగా తిరుచెంగోడ్లోని చానర్పాళయం ప్రాంతంలో నివశిస్తున్నాడని, ప్రస్తుతం విఠమ్మలయంలోని పిలిక్కల్ మేడు ప్రాంతంలో నివశిస్తున్నాడని కూడా వెల్లడైంది. నిందితుడిని తిరుచెంగోడ్ క్రిమినల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతన్ని 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఆదేశించారు. హరిహరన్ను జైలుకు తరలించారు. -
కార్పొరేట్ తరహాలో ప్రభుత్వాసుపత్రులు
వేలూరు: కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రులలో రోగులకు అవసరమైన వసతులు కల్పిస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గంలోని సేర్కాడు గ్రామంలో రూ.15.69 కోట్లు వ్యయంతో 60 పడుకల ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన సీఎం స్టాలిన్ చైన్నె రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో సేర్కాడులో మంత్రులు సుబ్రమణియన్, దురై మురుగన్లో జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రిలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా తనతోపాటు తమ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తరచూ ఆసుపత్రిలో తనఖీలు నిర్వహించి రోగులకు అవసరమైన అన్ని వసతులను సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్ర సీనియర్ మంత్రి దురై మురుగన్ మాట్లాడుతూ కాట్పాడి నియోజకవర్గ ప్రజలకు అవసరమైన అన్ని వసతులు చేసేందుకు తాను రుణపడి ఉంటానని తెలిపారు. ఇప్పటికే కాట్పాడిలో కోర్టు, తాలూకా కేంద్రం, ప్రభుత్వ న్యాయ కళాశాలతోపాటు అన్ని కార్యాలయాలను కాట్పాడికి తీసుకువచ్చామన్నారు. సేర్కాడు ప్రాంతం నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో వేలూరు ప్రభుత్వాసుపత్రి ఉండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడడంతోనే ఇక్కడ ప్రభుత్వాసుపత్రిని నిర్మించామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కదీర్ ఆనంద్, ఎమ్మెల్యేలు కార్తికేయన్, అములు, జడ్పీ చైర్మన్ బాబు, యూనియన్ చైర్మన్ వేల్మురుగన్, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో రామన్న
సాక్షి, చైన్నె: పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు చైన్నెలోని అపోలో ఆస్పత్రిలో వైద్యులు పరిశోధనలతో చికిత్సలు అందిస్తున్నారు. పీఎంకే నేత రాందాస్ గత కొంత కాలంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న విషయం తెలిసిందే. తనయుడు అన్బుమణి రూపంలో పార్టీలో నెలకొన్న పరిస్థితులతో మొదలైన వివాదాలు రాందాస్ను తీవ్ర మనో వేదనకు గురి చేశాయి. తనకు వ్యతిరేకంగా తనయుడు సాగిస్తున్న వ్యవహారాలపై తీవ్రంగా మండి పడుతూ వచ్చారు. ఈ పరిస్థితులలో సోమవారం ఉదయాన్నే రాందాస్ చైన్నెలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు. గుండె, యాంజియో సంబంధిత పరిశోధనలను డాక్టర్ సెంగుట్టువేల్ నేతృత్వంలోని బృందం చేపట్టింది. తండ్రి ఆస్పత్రిలో చేరిన సమాచారంతో అన్బుమణి అక్కడకు చేరుకున్నారు. అయితే ఆరు గంటలపాటుగా రాందాస్ను చూసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. రాందాస్కు గుండెకు సంబంధించిన రక్త నాళాలు బాగానే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్బుమణి వ్యాఖ్యానించారు. రెండు రోజులలో డిశ్చార్జ్ అవుతారని ప్రకటించారు. పీఎంకే గౌరవ అధ్యక్షుడు జీకే మణి మాట్లాడుతూ ఆరు గంటలు ఎవరూ చూసేందుకు వీలు లేదని వైద్యులు చెప్పడంతోనే అన్బుమణి చూడలేకపోయారని పేర్కొన్నారు. రాందాస్ ఆరోగ్యంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రాందాస్ను సీఎం స్టాలిన్, మంత్రులు నెహ్రు, ఏఈ వేలు ఆస్పత్రికి చేరుకుని, పరామర్శించారు. రాందాస్ను కలిసి భరోసా ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ సైతం రాందాస్ను పరామర్శించారు. ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎండీఎంకే నేత వైగోను సైతం ఆయన పరామర్శించడం గమనార్హం. ఇంత వరకు సీమాన్, వైగో నేరుగా కలుసుకున్న సందర్భాలు లేవు. తాజాగా వైగోను సీమాన్ పరామర్శించడం గమనించి దగ్గ విషయం. -
ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించాలి
తిరువళ్లూరు: ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని ఆ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని, తమకు ఆంధ్రప్రదేశ్ తరహాలో పరిహారం ఇవ్వాలని హిందూ ఆటో మున్ననీ నేతలు సోమవారం ఉదయం కలెక్టర్ ప్రతాప్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం హిందూ మున్ననీ ఆటో యూనియన్ కాంచీపురం మండల కార్యదర్శి వినోద్కన్నా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉబర్, ఓలా వాహనాలు పెరగడం, ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలతో సాధారణ ఆటో డ్రైవర్లత జీవనంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తరహాలో ప్రభుత్వం తమకు కూడా ఆర్థిక సాయం చేయాలని కోరారు. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు అప్పటి ప్రభుత్వం సంవత్సరానికి రూ.10 వేలు వారి అకౌంట్లో జమ చేసి, ఆదుకుందన్నారు. ఇటీవల ఏర్పడిన నూతన ప్రభుత్వం సైతం రూ.15 వేలు అందించిందన్నారు. ఈ క్రమంలో తమిళనాడులోనూ ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయాలని కలెక్టర్ ప్రతాప్కు వినతి పత్రం సమర్పించారు. -
బీజేపీ వైద్య విభాగం తిరువళ్లూరు జిల్లా అధ్యక్షుడిగా లోకేష్ ప్రభు
తిరువళ్లూరు: బీజేపీ వైద్య విభాగం తిరువళ్లూరు జిల్లా అధ్యక్షుడిగా లోకేష్ ప్రభును నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసుకోవడంపై ఆ పార్టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని విభాగాలకు అధ్యక్షులు, కార్యదర్శులను నియమించింది. బూత్కమిటీల నియామకాలను సైతం పూర్తి చేసి, వారికి ఇటీవల దిశానిర్దేశం చేసింది. ఈ క్రమంలో తిరువళ్లూరు జిల్లా బీజేపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా లోకేష్ప్రభును నియమిస్తూ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తన పేరును సిఫార్సు చేసిన జిల్లా అధ్యక్షుడు అశ్విన్కుమార్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఈవీ ఛార్జింగ్ కోసం ఎంజీ మోటార్స్ భాగస్వామ్యం
సాక్షి, చైన్నె : ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా నిర్ణయించింది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ డెవలపర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వెయ్యి రోజుల్లో వెయ్యి చార్జర్లకు మార్గం సుగమం చేసేలా ఈవీ చార్జింగ్ స్టేషన్లను విస్తరించనున్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కాన్పిడెంట్ గ్రూఫ్, టెక్నాలజీ భాగస్వామి ఐఓఎన్ఏజీఈ టెక్నాలజీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు జేఎస్ ఎంజీ మోటార్ ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. సోమవారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ వాహనచోదకులకు ఈవీ చార్జింగ్ను సులభతరం చేసేలా ఇంటి వద్ద అనుకూలమైన, నమ్మకంతో కూడిన చార్జింగ్ సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. పర్యావరణ అనుకూల రవాణా భవిష్యత్తు వైపుగా చర్యలు వేగవంతం చేశామన్నారు. ఐఓఎన్ఏజీఈ టెక్నాలజీస్ సీఈఓ విమల్కుమార్ మాట్లాడుతూ ఎలాంటి అవాంతరాలు లేని హోమ్చార్జింగ్ను కల్పించడం లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. -
నల్లబ్యాడ్జీలతో సహకార బ్యాంకు ఉద్యోగుల ఆందోళన
తిరువళ్లూరు: సహకార బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నల్లబ్యాడ్జీలు ధరించిన ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మురుగేషన్, కార్యదర్శి త్యాగరాజన్ అధ్యక్షత వహించగా జిల్లా కోశాధికారి పొన్నన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా త్యాగరాజన్ మాట్లాడుతూ వేతన పెంపులో పాఽరదర్శకత ప్రదర్శించాలని, పక్షపాతం, యూనియన్ల వర్గీకరణ లేకుండా 20 శాతం వేతన పెంపును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం నుంచి నిరాహారదీక్ష చేస్తామని ప్రకటించారు. -
క్లుప్తంగా
ఒప్పందాలు ఐపీఎఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల మధ్య ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షించేలా ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు ఐసీఎఫ్ జీఎం యు సుబ్బారావు సమక్షంలో సోమవారం జరిగింది. ఐసీఎఫ్ ఉద్యోగుల సాధారణ మరణానికి ఉచిత టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.10 లక్షలు, ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా(మరణం) రూ. కోటి, ఉచిత శాశ్వత, తాత్కాలిక వైకల్యానికికు రూ.కోటి, తదితర అంశాలతో జరిగిన ఈ ఒప్పందాలు 8,600 మంది ఉద్యోగులకు వర్తింపజేయనున్నారు. – సాక్షి, చైన్నె బాలికపై లైంగిక వేధింపులు అన్నానగర్: చైన్నె సమీపం వడపళనిలో కిరాణా దుకాణం నడుపుతున్న ఇమ్మాన్యుయేల్ మోసస్(49 ). ఇతని కిరాణా దుకాణానికి అదే ప్రాంతానికి చెందిన 5 ఏళ్ల బాలిక ఆదివారం కిరాణా సామాగ్రి కొనడానికి వెళ్లింది. ఆ సమయంలో ఆ బాలికను కిరాణా దుకాణం యజమాని ఇమ్మాన్యుయేల్ మోసెస్ లైంగికంగా వేధించాడు. బాలిక అరుపులు విని, పొరుగువారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రజలు కిరాణా దుకాణం యజమాని ఇమ్మాన్యుయేల్ మోసెస్కు దేహశుద్ధి చేశారు. తరువాత పోలీసులకు ఈ సంఘటనపై సమాచారం అందింది. పోలీసులు త్వరగా వచ్చారు. ప్రజలు ఇమ్మాన్యుయేల్ మోసెస్ను పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన తర్వాత, వడపళని మహిళా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కిరాణా వ్యాపారిని అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో అతను, పారిపోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇమ్మాన్యుయేల్ మోసెస్ కుడి చేయి విరిగింది. దీని తర్వాత పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. తరువాత ఇమ్మాన్యుయేల్ మోసెస్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అనుమానాస్పద స్థితిలో కారుడ్రైవర్ మృతిఅన్నానగర్: చైన్నెలోని మధురవాయల్ రుక్మిణి నగర్కు చెందిన శివసుబ్రమణి(55) కారు డ్రైవర్. ఇతను చైన్నెకి చెందిన విజయరాఘవన్, అతని కుటుంబాన్ని చైన్నె నుండి తిరుచ్చికి కారులో తీసుకెళ్లాడు. వారు తిరుచ్చి సెంట్రల్ బస్టాండ్ ప్రాంతంలోని ఒక హోటల్లో బస చేస్తున్నారు. హోటల్ సమీపంలోని స్టాండ్లో కారు ఆగి ఉంది. తరువాత కుటుంబ సభ్యులు కారు డ్రైవర్ శివసుబ్రమణిని తిరిగి రావాలని సెల్ఫోన్లో సంప్రదించారు. కానీ అతను ఫోన్ తీయలేదు. వారు అక్కడికి వెళ్లేసరికి శివసుబ్రమణి కారులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వారు వెంటనే అతన్ని 108 అంబులెన్స్లో తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. యువతిని కొట్టి హత్య అన్నానగర్: తిరువొత్తియూరులోని కాలడిపైట్టెలోని మెట్టుతేరు నివాసి కోలారు గోపాల్ అలియాస్ గోపాల్. తిరువొత్తియూరు, సాత్తాంగాడు పోలీస్ స్టేషన్లలో అతనిపై వివిధ క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అతని భార్య జ్యోతిక(23). వీరికి 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గోపాల్ ఆదివారం రాత్రి తిరువొత్తియూరు పోలీస్స్టేషన్ కు వచ్చాడు. తన భార్య జ్యోతిక ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉందని చెప్పాడు. దీనిపై అనుమానం వచ్చిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఇంటి గదిలో జ్యోతిక మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. జ్యోతిక ఎలా చనిపోయిందనేది మిస్టరీగా మారింది. ఆమె నుదిటిపై చిన్న గాయం మాత్రమే ఉంది. ఆమెను కొట్టి చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంలో జ్యోతిక భర్త గోపాల్ను పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. శవపరీక్ష నివేదిక ఫలితాల ఆధారంగా తదుపరి దశ దర్యాప్తు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. గుట్కా తరలిస్తున్న టీవీకే నాయకుడి అరెస్టు అన్నానగర్: కర్ణాటక నుంచి గుట్కా ఉత్పత్తులను అక్రమంగా తీసుకువచ్చి స్థానిక వ్యాపారులకు సరఫరా చేస్తున్న మేచ్చేరి టీవీకే నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లాలోని మేచ్చేరి సందైపైట్టె సమీపంలో ఒక కారు హాన్స్, గుట్కా తదితర నిషేధిత పొగాకు ఉత్పత్తులను, కిరాణా దుకాణ విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సోమవారం సమాచారం అందింది. దీని తరువాత మేచేరి పోలీసులు కారు వద్దకు వెళ్లి దానిని చుట్టుముట్టారు. కారును మేచేరి పేరూర్ తమిళనాడు విక్టరీ అసోసియేషన్ నిర్వాహకుడు సుర్జిత్(27) ఉన్నాడు. పోలీసులు అతన్ని జరిపిన విచారణలో కర్ణాటక నుండి హాన్స్, గుట్కా కొనుక్కుని వచ్చి దుకాణాలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. తదనంతరం సుర్జిత్ కారులోని 170 కిలోల హాన్స్, 30 కిలోల పొగాకు ప్యాకేజీలు, 27 కిలోలు కూల్లీఫ్ మొత్తం 227 కిలో పొగాకు, స్మగ్లింగ్ కోసం ఉపయోగించిన కారును పోలీసులు జప్తు చేశారు. -
మాతృభాష పరిరక్షణకు కృషి
కొరుక్కుపేట: మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) అధ్యక్షుడు ఆచార్య సీఎంకే రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగువారు తమ పిల్లల్ని మాతృభాషలోనే చదివించాలని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఉదయం స్థానిక కీల్పాక్లోని ఏఐటీఎఫ్ ప్రధాన కార్యాలయంలో సీఎంకే రెడ్డి జన్మదిన వేడుకలను మాతృభాష సంరక్షణ దినోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బి.చంద్రమోహన్, ఏడీజీపీ డి.కల్పన నాయక్, వీరపాండ్య కట్టబొమ్మన్ వంశీకులు ఇళయా కట్టబొమ్మన్, తెలుంగర్ మున్నెట్ర కళగం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.బాలాజీ నాయుడు, తెలుగు ప్రముఖులు, తెలుగు సంస్థల ప్రతినిధులు డాక్టర్ సీఎంకే రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నమో గాడ్ చారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ సీఎం కిషోర్ నిర్వహించగా, ఏఐటీఎఫ్ ప్రధాన కార్యదర్శి నాయకర్ నందగోపాల్ స్వాగతం పలికారు. డాక్టర్ ఎన్.నాగభూషణం వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో భాగంగా 100 మందికి పైగా నిరుపేద ప్రజలు, పారిశుధ్య కార్మికులు, వృద్ధులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎంకే రెడ్డి మాట్లాడుతూ ఏఐటీఎఫ్ తెలుగువారందరినీ ఏకతాటిపైకి తెచ్చి, వారి సమస్యలపై సమైక్యంగా పోరాడి స్ఫూర్తిని కలిగించిందన్నారు. తమిళనాడులో నివశించే తెలుగు ప్రజలంతా ఐక్యతతో ఉంటేనే మాతృభాషను కాపాడుకోవడంతోపాటు హక్కులను సాధించుకోవచ్చని ఆయన ఉద్ఘాటించారు. ఏడీజీపీ కల్పన నాయక్ మాట్లాడుతూ విద్య, వైద్యం, సామాజిక రంగాలకు ఆయన అందిస్తున్న సేవలు ఆపారమని కొనియాడారు. ఏఐటీఎఫ్ ఉపాధ్యక్షుడు లయన్ వీజీ జయకుమార్, కోశాధికారి కేవీ జనార్ధనం, నిర్మల్ చందర్, సీబీ భుజంగరామ్, వంజరపు శివయ్య, తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు వి.అనంతరామన్, లయన్ జి.మురళి, డాక్టర్ ఏ.వీ.శివకుమారి, కాంగ్రెస్ నేత విల్లివాక్కం సురేష్, పాల్ కొండయ్య, అద్దంకి ఐసయ్య, వి.దేవదానం, తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు తమ్మినేని బాబు, కార్యదర్శి పీఆర్ కేశవులు, ఎస్కేడీటీ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
‘సిట్’ విచారణ వేగవంతం
సాక్షి, చైన్నె : కరూర్ ఘటనపై సిట్ విచారణ వేగం పుంజుకుంది. రెండో రోజు ఈ ఘటనలో మరణించిన బాధితుల కుటుంబాలు, గాయపడిన వారి వద్దకే నేరుగా వెళ్లి సిట్ అధికారుల బృందం విచారణ జరిపి, సమాచారాన్ని సేకరించింది. కరూర్లోని టీవీకే నాయకులను సైతం విచారించాలని ఈ బృందం నిర్ణయించింది. కరూర్ ఘటనను ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే. తొలిరోజు ఆదివారం సంఘటనా స్థలంలో పరిశీలన, కరూర్ పోలీసులతో సమావేశాలు నిర్వహించిన ఈ బృందం, రెండో రోజైన సోమవారం ఉదయం కరూర్, పరిసరాలకు చెందిన బాధిత కుటుంబాల వద్దకు పలు బృందాలు వెళ్లాయి. మరణించిన వారి కుటుంబాల నుంచి సమాచారం సేకరించాయి. గాయపడి కోలుకున్న వారి వద్ద సమగ్ర సమాచారాలు సేకరించింది. రద్దీ పెరిగేందుకు కారణం, ఆ సమయంలో ఏమి జరిగింది.. అక్కడి పరిస్థితులపై ఆరా తీసింది. అలాగే, సభ నుంచి స్వచ్ఛంగా వెళ్లారా? లేదా ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా? అని అధికారులు విచారించారు. ఈ విచారణ మేరకు టీవీకే స్థానిక నాయకులను విచారించేందుకు సిద్ధమయ్యారు. స్థానికంగా ఉన్న నాయకుల జాబితాను సిట్ బృందం సేకరిస్తోంది. ఇదిలావుండగా, కోర్టు సిట్ విచారణకు ఆదేశాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సామాజిక మాధ్యమాల్లో చేసిన వాఖ్యలు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. కొందరు యూ ట్యూబర్లు టీవీకేకు అనుకూలంగా స్పందించడంతో వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే చైన్నెలో పలువుర్ని అరెస్టు చేయగా, సోమవారం పుదుకోట్టై, కృష్ణగిరికి చెందిన టీవీకే నాయకులను ఆయా జిల్లాల పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, తాజా పరిణామాల నేపథ్యంలో జిల్లాల కార్యదర్శులతో భేటీకి విజయ్ నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. అన్ని జిల్లాల కార్యదర్శులు చైన్నెకు రావాలన్న ఆదేశాలు వెళ్లి ఉన్నాయి. ప్రస్తుతం ప్రచార పయనం రెండు వారాలకు వాయిదా పడినా, ఆ తదుపరి ముందుకు తీసుకెళ్లే విషయమై చర్చించి, నిర్ణయాలు తీసుకునేందుకు విజయ్ కసరత్తు చేపట్టినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీలోని బీజేపీ అధిష్టానానికి కరూర్లో పర్యటించిన ఎంపీ హేమామలిని నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ తమ నివేదికను సమర్పించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, కరూర్లో బాధితులను మక్కల్ నీది మయ్యం నేత, ఎంపీ కమలహాసన్ పరామర్శించారు. -
కోలీవుడ్పై భాగ్యశ్రీబోర్సే కన్నుల
తమిళసినిమా: ఏ భారతీయ నటికి అయినా కోలీవుడ్లో నటించాలనే ఆశ ఉంటుంది. అలా ఇప్పటికే హిందీ, మరాఠి, పంజాబి, మహారాష్ట్ర, కన్నడం, మలయాళం, తెలుగు తదితర భాషలకు చెందిన భామలు తమిళ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. తాజాగా నటి భాగ్యశ్రీ బోర్సే కన్ను కోలీవుడ్పై పడింది. ఈ మహారాష్ట్రీయ బ్యూటీ మొదట్లో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి ఆ తరువాత వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. అలా తొలుత హిందీలో యారియన్–2 చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ రవితేజకు జంటగా మిస్టర్ బచ్చన్ చిత్రంలో నాయకిగా నటించి పాపులర్ అయ్యారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా, విజయ్ దేవరకొండ సరసన కింగ్డమ్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ చిత్ర అనువాదంతో తమిళ ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ చిత్రంలో నటి భాగ్యశ్రీ బోర్సే పాత్ర చాలా పరిమితం కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం కన్నడంలో దుల్కర్ సల్మాన్కు జంటగా కాంత చిత్రంలో నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటి భాగ్యశ్రీ బోర్సే దక్షిణాది సినిమా పరిశ్రమపై మాట్లాడుతూ సినిమాకు భాషా భేదం లేదన్నారు. కాబట్టి తాను తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లోనూ నటించాలని కోరుకుంటున్నానని చెప్పారు. మంచి అవకాశం వస్తే తప్పకుండా తమిళ చిత్రంలో నటిస్తానని అన్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మంచి కథా చిత్రాలు రూపొందుతున్నాయన్నారు. కథానాయికలకు మంచి గుర్తింపు లభిస్తోందని నటి భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. మొత్తం మీద తమిళ చిత్రాల్లో నటించడానికి ఈ 26 ఏళ్ల బ్యూటీ వేట మొదలెట్టారన్న మాట. నటి భాగ్యశ్రీ బోర్సే -
ఆరోగ్య సంరక్షణ సేవల విస్తరణ
సాక్షి, చైన్నె : ఆరోగ్య సేవలను అపోలో క్లినిక్ విస్తరించింది. ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలతో వేళచ్చేరిలో ఏర్పాటు చేసిన క్లినిక్ను డాక్టర్ సంగీతరెడ్డి, సినీ నటి సాక్షి అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండె ఆరోగ సంరక్షణ ప్యాకేజీని ప్రకటించారు. కొత్త క్లినికల్ ఆఫరులను విడుదల చేశారు. నాణ్యమైన ఆరోగ్య సేవలు, సంరక్షణతో పాటు అందుబాటులోకి ప్రధాన సేవలు ఇక్కడకు తీసుకొచ్చినట్టు ప్రకటించారు. 22 మంది వైద్యు నిపుణుల బృందం ఇక్కడ ప్రత్యేక వైద్య చికిత్సలను అందించనున్నట్టు వైద్యులు పేర్కొన్నారు. -
ప్రపంచ వ్యాప్తంగా తమిళులకు చేరాలనే..
తమిళసినిమా: కమర్షియల్ కథా చిత్రాల జోలికి పోకుండా, ప్రజలకు కావాల్సిన, వారు తెలుసుకోవాల్సిన కథాంశాలతో చిత్రాలను చేస్తున్న దర్శక నిర్మాత ఏజే.బాలకృష్ణన్. ఈయన రమణ కమ్యునికేషన్ పతాకంపై ఇంతకు ముందు దివంగత రాజకీయ నేత కామరాజర్ జీవిత చరిత్రను కామరాజ్ పేరుతో, గాంధీజీ జీవిత చరిత్రను వెల్కమ్ బ్యాక్ గాంధీ పేరుతోనూ చిత్రాలను రూపొందించి మంచి విజయాలను, ప్రశంసలను పొందారు. అదే విధంగా ఇటీవల తమిళంలో ప్రఖ్యాతి గాంచిన ప్రపంచవ్యాప్తంగా తమిళులు ఎంతగానో అభిమానించే తిరువళ్లువర్ జీవిత కథతో తిరుక్కురల్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఆ మధ్య తెరపైకి వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని యూట్యూబ్ చానల్లో ఉచితంగా ప్రసారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఏజే బాలకృష్ణన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ విశ్లేషకుడు, నటుడు చిత్రా లక్ష్మణన్, పారిశ్రామిక వేత్త వీజీపీ సంతోషం, రామరాజ్ గ్రూప్ అధినేత కేఆర్ నాగరాజన్, నిర్మాత పీఎల్.తేనప్పన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరువళ్లువర్ ఏ కులానికి చెందిన వారో, ఏ మతానికి చెందిన వారో తెలియదనీ, తెలిసింది ఒక్కటే ఆయన తమిళుడు అని పేర్కొన్నారు. చిత్ర దర్శక నిర్మాత ఏజే.బాలకృష్ణన్ మాట్లాడుతూ తిరుక్కురల్ చిత్రాన్ని నిర్మించడానికి కారణమైన అందరికీ ధన్యవాదాలు అన్నారు. చిత్రం విడుదలైన తరువాత సద్విమర్శలు వచ్చాయని, అయితే థియేటర్లకు ప్రేక్షకులు ఎక్కువగా రాలేదన్నారు. అందువల్ల ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చేర్చాలన్న ఆలోచనతో యూట్యూబ్ చానల్లో ఉచితంగా అందించాలని భావించామన్నారు. దీనికి రామరాజ్ గ్రూప్ అధినేత నాగరాజన్ ప్రకటన ఇచ్చి, కార్డు మాత్రమే వేయమని ఉదార మనసుతో పేర్కొన్నారన్నారని, ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. తిరుక్కురల్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా చేర్చి కాలాన్ని అధిగమిస్తుందనే నమ్మకం ఉందని ఏజే.బాలకృష్ణన్ పేర్కొన్నారు. -
4,390 బాణసంచా దుకాణాలకు అనుమతి
కొరుక్కుపేట: దీపావళి పండుగ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా 4,390 బాణసంచా దుకాణాలకు అనుమతి ఇచ్చినట్లు అగ్నిమాపక శాఖ ప్రకటించింది. రాష్ట్ర ప్రజలు ఈ నెల 20వ తేదీన దీపావళి పండుగ జరుపుకోనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి అగ్నిమాపక, పోలీసు శాఖల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిఉంది. ఆ విషయంలో, తమిళనాడు వ్యాప్తంగా 6,500 దుకాణ యజమానులు తమకు అనుమతి ఇవ్వాలని అగ్నిమాపక శాఖను కోరారు. అగ్నిమాపక శాఖ పేలుడు పదార్థాల రక్షణ చట్టం కింద తనిఖీ చేసి, అనుమతులు జారీ చేయడానికి ఆ శాఖ సిబ్బంది సంబంధిత ప్రదేశాలను స్వయంగా సందర్శించారు. గత శనివారం నాటికి, తమిళనాడు అంతటా మొత్తం 4,390 దుకాణాలకు అనుమతులు మంజూరు చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. విలువల ప్రోత్సాహంతో రూపాంతరన్ యాత్ర సాక్షి, చైన్నె : సేవా ధృక్పథం, ఆరోగ్య అవగాహన, జీవి విలువలను ప్రోత్సహించడం, చాటడం లక్ష్యంగా ఆర్సీఎం రూపాంతరన్ యాత్ర సోమవారం చైన్నెలో జరిగింది. విభిన్న వర్గాల ప్రజలకు సాధికారత కల్పించేలా తమిళనాడులో ఆర్ఎసీఎం నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఆర్సీఎం 25వ వార్షికోత్సవంలో భాగంగా 100 రోజుల ప్రయాణంగా 17 వేల కి.మీ దూరం 75 నగరాల్లో 25 ప్రధాన కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. ఆ దిశగా చైన్నెలో సోమవారం ఆర్సీఎం రూపాంతరన్ యాత్ర జరిగింది. ఆరోగ్యం, సేవ, విలువలు, పర్యావరణ వ్యవస్థ, మహిళా సాధికారత, యువ నాయకత్వం వంటి అంశాలను ప్రస్తావిస్తూ చైన్నెలో యాత్రను నిర్వహించారు. తేనాం పేటలోని కామరాజర్ అరంగం, అన్నాసాలైలో జరిగిన ఈ యాత్రకు వందలాదిగా ప్రజలు తరలి వచ్చారు. ఉదయం ఆరోగ్య, సేవా అంశాలపై సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్సీఎం సీఈఓ మనోజ్కుమార్ మాట్లాడుతూ చైన్నె, తమిళనాడులో సమగ్ర సమాజ పురోగతి దిశగా కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ఎబిలిటీ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం సాక్షి, చైన్నె : ఎబిలిటీ అవార్డులు 2026కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కెవిన్ కేర్ ప్రకటించింది. 24వ కెవిన్ కేర్ ఎబిలిటీ అవార్డుల ఎడిషన్ కోసం నామినేషన్లను ఆహ్వానించారు. కెవిన్ కేర్, ఎబిలిటీ ఫౌండేషన్లు ప్రతిభావంతులు, సాధకులను వెలుగులోకి తెచ్చేలా కథలు, ప్రోత్సాహం, అవార్డులతో ముందుకెతోంది. ఇందులో భాగంగా 2026లో ఎబిలిటీ అవార్డు ఫర్ ఎమినెన్స్, ఎబిలిటీ మాస్టరీ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డులకు అర్హులైన దివ్యాంగులు, ఇతర సాధకులు అక్టోబరు 30వ తేదీలోపు ఎబిలిటీ ఫౌండేషన్. ఓఆర్జీ, కెవిన్ కెర్ .కామ్ వెబ్ సైట్లలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. న్యాయమూర్తులపై విమర్శలా? సాక్షి, చైన్నె : ఏదేని ఉత్తర్వులు ఇచ్చిన సమయంలో న్యాయమూర్తులను సైతం వదలి పెట్టకుండా సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించడం శోచనీయమని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్కుమార్ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఓ కేసు విచారణ సమయంలో ఆయన తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో ఏ ఒక్కర్నీ వదలి పెట్టకుండా విమర్శలు, ఆరోపణలు గుప్పించే వారు పెరిగినట్టు వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడో జరిగిన ఘటనలను అస్త్రంగా చేసుకోవడం, వ్యక్తిగతంగా దాడులు చేయడం పెరుగుతున్నాయన్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా కోర్టులో ఉన్న న్యాయవాద సంఘం ప్రతినిధులు ప్రభాకర్, ఎంపీ సుధా, తదితరులు న్యాయమూర్తులకు న్యాయవాదులు ఎల్లప్పుడు అండగా ఉంటారని మద్దతు తెలిపారు. జనవరిలో కీలంబాక్కం రైల్వేస్టేషన్ ప్రారంభం కొరుక్కుపేట: కీలంబాక్కం రైల్వేస్టేషన్ జనవరిలో ప్రారంభం కానుంది. చైన్నెలో బస్ స్టాండ్ మొదట బ్రాడ్వేలో ఉండేది. తరువాత దాన్ని కోయంబేడుకు మార్చారు. ఇప్పుడు అది కీలంబాక్కంలో పనిచేస్తోంది. ఈ బస్ టెర్మినల్ వద్ద రైల్వేస్టేషన్ లేదు. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ బస్ టెర్మినల్ చేరుకోవడానికి, ఎదురుగా కొత్త రైల్వే స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. తదనుగుణంగా, నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దీనిని ప్రారంభించాలని భావించారు. కానీ జనవరికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడైంది. ఏది ఏమైనా, ఈ రైల్వేస్టేషన్ సంక్రాంతికి ముందే ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. అనుసంధానించడానికి ఒక పాదచారుల ఓవర్పాస్ను కూడా నిర్మిస్తున్నారు. రైల్వేస్టేషనన్లోని ఒక ప్లాట్ఫామ్ పనులు పూర్తిగా పూర్తయ్యాయి. పైకప్పు పనులు కూడా పూర్తయ్యాయి. మరో ప్లాట్ఫామ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. -
జనం రద్దీ
సాక్షి, చైన్నె చైన్నెలో ఉద్యోగ, వివిధ పనులు నిమిత్తం నివాసం ఉంటున్న వారు దసరా పర్వదినాన్ని తమ కుటుంబాలతో చేసుకునేందుకు స్వస్థలాలు, స్వగ్రామాలకు గత వారం బయల్దేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సారి పండుగ సెలవులకు, త్రైమాసిక పరీక్షల అనంతరం సెలవులు కలిసి వచ్చాయి. దీంతో స్వస్థలాలకు, వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు అధికం. సోమవారంతో సెలవులు ముగిశాయి. దీంతో ఉదయాన్నే జనం మళ్లీ చైన్నెకు చేరుకున్నారు. చైన్నె వైపుగా ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు కదిలాయి. ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాలలో వెళ్లి వారంతా ఒక్క సారిగా తిరుగు పయనం కావడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి అన్ని టోల్గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఉదయాన్నే ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు చైన్నె వైపు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. ఈ బస్సులన్నీ ఉదయాన్నే నగర శివారుల్లోకి ప్రవేశించడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అవస్థలు తప్పలేదు. దీపావళి స్పెషల్ దసరా వేళ చోటు చేసుకున్న రవాణా, ట్రాఫిక్ కష్టాలను పరిగణించి, దీపావళి సందర్భంగా ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ముందు జాగ్రత్తలపై రవాణా శాఖ చర్యలు చేపట్టింది. సోమవారం రవాణా మంత్రి శివశంకర్ మీడియాతో మాట్లాడుతూ వాహనాలన్నీ ఒకే సారిగా రావడంతో రహదారి స్తంభించిందని, అయినా ట్రాఫిక్ను సిబ్బంది క్లియర్ చేశారనాన్నరు. రద్దీ కారణంగా ప్రయాణ సమయం అదనంగా పట్టిందన్నారు. దీపావళి సందర్భంగా తాజా సమస్యలు ఎదురు కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 20,378 బస్సులను నడపనున్నామని, చైన్నె నుంచి 14,268 బస్సులను రోడ్డెక్కించనున్నామని ప్రకటించారు. దసరా, విజయ దశమి పండుగ, త్రైమాసిక పరీక్షా సెలవులను ముగించుకుని స్వస్థలాల నుంచి జనం చైన్నెకు తిరుగు పయనమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే జాతీయ రహదారి, రాష్ట్ర రహదారుల్లోని టోల్గేట్ల వద్ద వాహనాలు కిలోమీటర్ల కొద్ది బారులు తీరాయి. ఏ రోడ్డు చూసినా వాహనాలతో కిటకిటలాడడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. -
ఆరోగ్య శాఖకు భవనాలు
రూ.173.81 కోట్లతో నిర్మించిన ప్రజారోగ్య శాఖకు సంబంధించిన భవనాలను సీఎం స్టాలిన్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రూ.20.15 కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలకు శంకు స్థాపన చేశారు. తంజావూరు, సేలం, పాళయంకోట్టై పరిశోధన కేంద్రాలకు రూ.24 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలను అందజేశారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలలో కాట్పాడి ప్రభుత్వ ఆసుపత్రి, పళని జిల్లా ప్రధాన కేంద్రం ఆసుపత్రి, తిరుపత్తూరు జిల్లా ప్రధాన కేంద్రం ఆసుపత్రి, కూడలూరు ఆస్పత్రి, శంకరాపురం ప్రభుత్వ ఆసుపత్రి, మేలూరు ప్రభుత్వ ఆసుపత్రులలో రూ.108.50 కోట్లతో అదనపు భవనాలు ఉన్నాయి. అలాగే తెన్కాసి, తిరుపత్తూరు, కళ్లకురిచ్చి, మైలాడుతురై, మధురై, తిరునెల్వేలి, తంజావూరులలో రూ.42 కోట్లతో నిర్మించిన ఆస్పత్రుల భవనాలు, మధురైలో రూ.1.49 కోట్లతో నిర్మించిన ఫుడ్ అనాలిసిస్ కాంప్లెక్స్, రూ.14.85 కోట్ల వ్యయంతో నిర్మించిన పరిశోధన భవనం ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి ఏవీ వేలు, సీఎస్ మురుగానందం తదితరులు పాల్గొన్నారు. -
తండ్రీకొడుకుల కాంబో రెండో చిత్రం
నటుడు నట్టి హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ప్రారంభోత్సవం తమిళసినిమా: ఒకే చిత్రంలో తండ్రీ కొడుకులు కలిసి పని చేయడం అరుదే. అలా ప్రముఖ నటుడు కథను సమకూర్చగా, ఈయన వారసుడు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని కన్నన్ గ్రూప్స్, కాంతారా స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. తాత్కాలికంగా ప్రొడక్షన్ నెంబర్–6 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటుడు నట్టి కథానాయకుడిగా నటిస్తున్నారు. తంబిరామయ్య, శ్రితారావ్, చాందినీ, తమిళరసన్, వీజీ చంద్రశేఖర్, వడివుక్కరసి, ఇళవరసు, జాన్విజయ్, ఆడుగళం నరేన్, వీజే.ఆండ్రూస్, సత్యన్, శ్యామ్స్, కింగ్కాంగ్, దేవీ మహేశ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ముఖ్యంగా నటుడు నట్టి, తంబిరామయ్య కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇది కావడం విశేషం. పీజీ.ముత్తయ్య ఛాయాగ్రహణంను, దర్బుగా శివ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు తెలుపుతూ ఇది సమకాలీన రాజకీయ నేపథ్యంలో సాగే వినోదభరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో నట్టి కథానాయకుడిగా నటించడానికి అంగీకరించడం సంతోషంతోపాటు, చిత్రాన్ని జనరంజకంగా తెరకెక్కించాలన్న బాధ్యత పెరిగిందన్నారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. చిత్ర నిర్మాత కన్నన్ రవి పేర్కొంటూ ఉమాపతి రామయ్య తన తొలి చిత్రం రాజాక్కిళితోనే ప్రతిభను నిరూపించుకున్నారని, ఈయన రెండో చిత్రాన్ని రాజకీయ సైటెరికల్ కథాంశంతో తెరకెక్కించడం సంతోషంగా ఉందని చెప్పారు. అదే విధంగా ఉమాపతి, తంబిరామయ్య కాంబోలో ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. -
సహకార బ్యాంకు ఉద్యోగుల ధర్నా
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తమిళనాడు ప్రాథమిక సహకార ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశన్ అధ్యక్షత వహించాడు. జిల్లా పోరాట కమిటీ అధ్యక్షుడు విజయకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎటువంటి నిబంధనలు లేకుండా 20 శాతం వేతనం పెంచడంతోపాటు 2021 సంవత్సరం అనంతరం విధుల్లో చేరిన వారందరికి పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, తాత్కాలిక పని విధానాలను రద్దు చేసి, సీనియారిటీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. మొత్తం 25 డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఆందోళనను తీవ్ర తరం చేస్తామన్నారు. ఈ ధర్నాలో ఆ సంఘం జిల్లా కోశాధికారి ఆనందన్, ఉపాధ్యక్షుడు ధర్మలింగం, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
విద్యార్థులకు ఉపకార వేతనాలు
వేలూరు: బంగారుగుడి ఆధ్వర్యంలోని విద్యా నేత్రం పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకున్న అనంతరం ఇతరులకు సాయం చేసేందుకు ముందుకు రావాలని బంగారుగుడి శ్రీనారాయణి పీఠం పీఠాధిపతి శక్తిఅమ్మ అన్నారు. వేలూరు శ్రీపురంలోని బంగారుగుడిలో విద్యా నేత్రం పథకం కింద గ్రామీణ నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం పీఠాధిపతి శక్తిఅమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ చైర్మన్ కిషోర్ బగవానాజీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యకు శక్తిఅమ్మ స్కాలర్షిప్లు అందజేయడం అభినందనీయమన్నారు. భక్తితోపాటు వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని నిరుపేదలకు ఆర్థిక సాయం అందజేయడం, పర్యావరణం కోసం చెట్లు నాటడం తదితర కార్యక్రమాలను చేస్తుండడం సంతోషకరమన్నారు. పీఠాధిపతి శక్తిఅమ్మ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ విజయం అనే విషయం గొప్పదన్నారు. విజయంతోపాటు సాధన చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు. విజయం అనేది మనం మాత్రమే సంతోషించే విషయం. అయితే సాధన చేయాలంటే మంచి పనులను చేయగలిగితేనే అది సాధ్యమన్నారు. మంచి పనులంటే ఉన్న వాటిలో ఇతరులకు సాయం చేయడం ద్వారా ఆత్మ సంతృప్తిని ఇవ్వడంతోపాటు చరిత్రలో స్థానం సాదించవచ్చున్నారు. మనం చేసే పాపం, పుణ్యమై మనకు తిరిగి వస్తుందని మరణాంతరం మానవుడు ఎటువంటి ఆస్తులను తీసుకెళ్లలేడని, అయితే చేసిన పాపాలు, పుణ్యం మాత్రమే తీసుకెళ్లగలడన్నారు. అనంతరం నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్జోన్ విమాన యాన సంరక్షణ డీఐజీ పొన్ని, చైన్నె హైకోర్టు సీనియర్ న్యాయవాది విశ్వనాథన్, బంగారుగుడి డైరెక్టర్ సురేష్బాబు, నారాయణి ఆసుపత్రి డైరెక్టర్ బాలాజీ, ఆలయ మేనేజర్ సంపత్, ట్రస్టీ సౌందర్రాజన్ తదితరులు పాల్గొన్నారు. -
సముద్రంలో లంక దొంగల భీభత్సం
సాక్షి, చైన్నె : సముద్రంలో శ్రీలంక దొంగలు భీభత్సం సృష్టించారు. తమిళ జాలర్లపై దాడులు చేశారు. 11 మంది గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నాగపట్నం నంబియార్ నగర్కు చెందిన జాలర్లు ఆదివారం వేటకు వెళ్లారు. కొడికయరై సమీపంలో జాలర్లు వలలను విసిరి వేటలో నిగమ్నమయ్యారు. ఈ సమయంలో చంద్రబాబు అనే వ్యక్తికి చెందిన పడవపై అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా శ్రీలంక నుంచి వచ్చిన దొంగలు దాడులు చేశారు. వచ్చి రాగానే ఆయుధాలతో దాడి చేసి, పడవలో ఉన్న జీపీఎస్, బ్యాటరీలు, అదనపు మోటార్ ఇంజిన్లు, తదితర పరికరాలతోపాటు తమిళ జాలర్ల మెడలో ఉన్న వెండి గొలుసులను పట్టుకెళ్లారు. తీవ్ర గాయాలతో అతి కష్టంపై ఒడ్డుకు చేరిన జాలర్లు జరిగిన సమాచారాన్ని సోమవారం ఉదయాన్నే అధికారులకు తెలియజేశారు. 11మంది గాయలతో ఆస్పత్రిలో చేరారు. వీరంతా నంబియార్ నగర్కు చెందిన విఘ్నేష్, విమల్, సుకుమార్, తిరుమురుగన్, మురుగన్, అరుణ్, చంద్రబాబుగా గుర్తించారు. శివశంకర్ అనే జాలరి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం తంజావూరు ఆస్పత్రికి తరలించారు. తమ వారిపై సముద్రంలో శ్రీలంక దొంగలు దాడి చేశారన్న సమాచారంతో నంబియార్ నగర్ జాలర్లు సోమవారం చేపల వేటను బహిష్కరించారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు. జాలర్లపై దాడిని తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ తీవ్రంగా ఖండించారు. జాలర్లకు భద్రత కల్పించాలని, గాయపడిన వారికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సమీపంలోని కారైక్కాల్ జాలర్లు, ఆంధ్రా సరిహద్దులోని జాలర్ల మధ్య సముద్రంలో గొడవ చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
క్లుప్తంగా
మోటార్ సైకిల్పై యువకుడి ఫీట్లు తిరువొత్తియూరు: రోడ్డుపై వాహనచోదకులను భయపెట్టేలా మోటార్ సైకిల్ స్టంట్లు చేస్తున్న యువకులపై పోలీసులు నిరంతరం చర్యలు తీసుకుంటున్నారు. అయితే, వారాంతాల్లో అంబత్తూరు బైపాస్ రోడ్డు, తూర్పు తీర రహదారి, మెరీనా బీచ్ రోడ్లలో తరచుగా మోటార్ సైకిల్ రేసులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంబత్తూరు–మధురవాయల్ బైపాస్ రోడ్డులో యువకులు మోటార్ సైకిల్పై స్టంట్లు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. మోటార్ సైకిల్ ముందు చక్రం పైకి లేపి, యువకులు ప్రమాదకరంగా అరుస్తూ అతివేగంగా వెళ్లారు. దీనిని చూసిన ఇతర వాహనచోదకులు భయంతో వెళ్లడం కూడా ఆ వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియో ఆధారంగా మోటార్ సైకిల్పై సాహసయాత్ర చేసిన యువకుల గురించి పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు. రూ. 1,002 కోట్లు పన్ను వసూలు కొరుక్కుపేట: ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, చెక్కులు, ఆన్లైన్ చెల్లింపులు, బ్యాంక్ బదిలీలు, ప్రత్యక్ష డెబిట్లు, మొబైల్ ఫోన్ చెల్లింపుల ద్వారా అర్ధ వార్షిక పన్నులు వసూలు చేశామని, తద్వారా కార్పొరేషన్కు రూ.1,002 కోట్లు ఆదాయం వచ్చిందని కార్పొరేషన్ కమిషనర్ కె.మహేష్ తెలిపారు. చైన్నె మహానగర రెవెన్యూ విభాగం సంవత్సరానికి రెండు సార్లు పన్నులు వసూలు చేస్తోంది. ప్రస్తుతం పన్నులు వసూలు చేయడాన్ని సులభతరం చేశారు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం కంటే ఎక్కువ పన్నులు చెల్లించారు. విజయవంతంగా వాల్వ్ మార్పిడి సాక్షి, చైన్నె: హైబ్రీడ్ మిట్రల్ వాల్వ్ను ఆళ్వార్పేట కావేవరి ఆస్పత్రి వైద్యులు రీప్లేస్మెంట్ చేసి వైద్య చరిత్రలో కొత్త రికార్డును నమోదు చేశారు. 83 ఏళ్ల వయస్సు కలిగిన వృద్ధ మహిళకు ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సోమవారం కావేరి ఆస్పత్రి కార్డియోథొరాసిక్ వైద్యుడు అరుణ్కుమార్ కృష్ణస్వామి, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అయ్యప్పన్ పొన్నుస్వామి, వ్యవస్థాపకుడు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్, సీనియర్ కన్సల్టెంట్లు డాక్టర్ అనంతరామన్, ఆసిక్ అలీ, మహేశ్కుమార్లతో కూడిన బృందం ఈ వివరాలను స్థానికంగా ప్రకటించింది. తీవ్రమైన మిట్రల్ యాన్యులర్ కాల్సిఫికేషన్తో కలిగే తీవ్రమైన సమస్యతో మిట్రల్ వాల్వ్ పనిచేయక పోవడంతో గుండె ఆగి పోయే పరిస్థితి రావడంతో వృద్ధురాలు పదే పదే ఆస్పత్రిలో చేరాల్సి ఉండేదన్నారు. గతంలో ఆమెకు రెండు సార్లు ఛాతీకి రేడియో థెరపీ నిర్వహించి ఉన్నారని, మొదట అన్నవాహిక క్యాన్సర్కు, ఆతర్వాత రొమ్ము క్యాన్సర్కు శస్త్ర చికిత్స చేసినట్టు పేర్కొన్నారు. తాజాగా శ్వాస ఆడక పోవడం, అలసట, గుండె సమస్యలతో ప్రమాదకరంగా ఆస్పత్రిలో చేరిన ఆమెకు జరిపిన పరిశోధనతో ట్రాన్స్–కాథెటర్ టెక్నిక్ను ప్రయోగించేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. కుడి తొడ సిర ద్వారా ఈ ప్రక్రియను విజయవంతం చేశామన్నారు. ఇది వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా ప్రకటించారు. ప్రాణాలను రక్షించే సంరక్షణ అత్యంత సంక్లిష్టతతో కూడుకున్నప్పటికీ, ఆధునిక పద్ధతులతో విజయవంతంచేశామన్నారు. పల్లవరం–పుత్తేరి సరస్సు పునరుద్ధరణ కొరుక్కుపేట: పల్లవరం అసెంబ్లీ నియోజకవర్గం తాంబరం కార్పొరేషన్ పుత్తేరి సరస్సును శుభ్రం చేసి పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ డిమాండ్తో రూ.8.15 కోట్లతో పునరుద్ధరణ పనులు చేయాలని నిర్ణయించారు. ప్రజల అభ్యర్థనను అంగీకరిస్తూ ఎమ్మెల్యే ఇ.కరుణానిధి ఈ విషయాన్ని మంత్రి శేఖర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీని తరువాత ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆదేశాల మేరకు చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ సరస్సును శుభ్రం చేసి, పిల్లల ఆటస్థలం, గ్రీన్ లైన్ చుట్టుకొలత గోడ, బెంచీలు, టాయిలెట్లు, సరస్సు కట్టను బలోపేతం చేయాలని ప్రణాళిక వేశారు. దీనికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. మంత్రులు థామోఅన్బరసన్, పి.కె. శేఖర్బాబు పాల్గొని, శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. -
చెన్నై జూలో సింహం మిస్సింగ్ కలకలం!
చెన్నై వాండలూర్ జూలో ఓ సింహం కనిపించకుండా పోవడంతో అధికారులు హడలిపోయారు. రాత్రికి రాత్రే దాని ఆచూకీ కనిపెట్టేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. చివరాఖరికి దాని ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్టోబర్ 3వ తేదీన జరిగిన ఈ ఘటన.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్.. దక్షిణ భారత దేశంలో ఉన్న అతిపెద్ద జూ పార్కుల్లో ఒకటి. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఆ జూలో హైడ్రామా నడిచింది. ఎప్పటిలాగే సింహాలన్నీ సాయంత్రం కాగానే ఎన్క్లోజర్లోకి చేరుకోగా.. శేర్యార్ అనే సింహం మాత్రం తిరిగి రాలేదు(Lion Missing Zoo). దీంతో సిబ్బంది కంగారపడిపోయారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు.అంతా కలిసి ఐదు బృందాలుగా విడిపోయి సింహం కోసం జూ అంతా గాలించారు. రాత్రి పూట పని చేయగలిగే థర్మల్ డ్రోన్ల, ట్రాప్ కెమెరాల సహకారం తీసుకున్నారు. అయితే కొన్నిగంటల తర్వాత అది సఫారీలో ఓ చోట ప్రశాంతంగా కూర్చు ఉండిపోవడం గమనించారు. బౌండరీ వాల్, చెయిన్-లింక్ మెష్ ఫెన్సింగ్ ఉన్న సఫారీని నుంచి అది తప్పించుకునే అవకాశం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఐదేళ్ల వయసున్న శేర్యార్ను 2023లో బెంగళూరులోని బన్నెరఘట్ట జూలాజికల్(Bannerghatta national park) పార్క్ నుంచి తీసుకొచ్చారు. లయన్ సఫారీ అలవాటు చేయడానికి మిగతా వాటితో పాటే దానిని రెగ్యులర్గా బయటకు వదులుతున్నారట. అయితే ఈ వయసులో సింహాలకు ఇలాంట ప్రవర్తన సహజమేనని అధికారులు తెలిపారు. ఈ లయన్ మిస్సింగ్ ఘటనతోనే.. అక్టోబర్ 5న జరగాల్సిన వైల్డ్ ట్రెయిల్ రన్ కార్యక్రమాన్ని నిర్వాహకులు వాయిదా వేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: కేరళ అసెంబ్లీని కుదిపేసిన ‘శబరిమలై’ వివాదం -
సిగ్గులేని మనిషి.. పుట్టబోయే బిడ్డ శాపం తగులుతుంది!
జిల్లా, వేలైక్కారన్, మెర్సల్ తదితర చిత్రాల్లో కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేసిన జాయ్ క్రిజిల్డా (Joy Crizildaa) ప్రముఖ చెఫ్, నటుడు మాధంపట్టి రంగరాజ్తో పరిచయం పెంచుకుంది. మాధంపట్టి రంగరాజ్కు అప్పటికే వివాహితుడు కాగా, జాయ్ క్రిజిల్డాను రెండో పెళ్లి చేసుకున్నాడు. జాయ్ క్రిస్టిల్డా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తాను గర్భవతి అని ప్రకటించింది. కానీ ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు.మోసం చేశాడన్న కాస్ట్యూమ్ డిజైనర్మాధంపట్టి రంగరాజ్ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ జాయ్ క్రిజిల్డా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తన కడుపులో పెరిగే బిడ్డకు రంగరాజ్ బాధ్యత వహించాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత వారం జాయ్ను దాదాపు 6 గంటలపాటు విచారించారు. త్వరలోనే మాధంపట్టి రంగరాజ్ను కూడా విచారించనున్నారు. ఈ స్థితిలో జాయ్ క్రిజిల్డా శనివారం తన సోషల్ మీడియా పేజీలో ఒక సంచలనాత్మక పోస్ట్ చేసింది.సిగ్గులేని మనిషి“ఒక వ్యక్తి ఎలాంటి అపరాధ భావన లేకుండా తిరుగుతాడు. అతను గర్వంగా తల పైకెత్తి నడుస్తాడు. నువ్వు మంచివాడివిగా నిన్ను నువ్వు నిరూపించుకుంటూనే ఉన్నావు. నీలాంటి సిగ్గులేని మనిషిని ఇంతవరకు చూడలేదు. నువ్వు పరిగెత్తినా, దాక్కున్నా, పుట్టబోయే బిడ్డ శాపం నీడలా నిన్ను అనుసరిస్తుంది. అది నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్లదు’ అని రాసుకొచ్చింది. మరో పోస్ట్లో బిడ్డ పుట్టకముందే వదిలేసి వెళ్లిపోయావ్, నువ్వేం తండ్రివి అని తిట్టిపోసింది. View this post on Instagram A post shared by J Joy (@joycrizildaa) చదవండి: రజినీకాంత్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా! -
రజినీకాంత్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా!
ప్రదీప్ రంగనాథన్, నటి మమిత బైజు జంటగా నటిస్తున్న చిత్రం డ్యూడ్ (Dude Movie). సుధా కొంగర వద్ద ఏడెనిమిది సంవత్సరాలు సహాయ దర్శకుడిగా పని చేసిన కీర్తిశ్వరన్ ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం కాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి సింగారి అనే పాటను రిలీజ్ చేశారు.అలా కథ చెప్పాఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి ద్వారా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధినేతలకు ఈ కథను చెప్పే అవకాశం కలిగిందన్నారు. వాళ్లకు కథ నచ్చడంతో వెంటనే షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. రజనీకాంత్ 30 ఏళ్ల వయసును దృష్టిలో పెట్టుకొని డ్యూడ్ కథ రాసినట్లు తెలిపారు. ఈ పాత్రలో నటుడు ప్రదీప్ రంగనాథన్ ఒదిగిపోయారన్నారు. ఇది లవ్ సబ్జెక్ట్ అయినప్పటికీ మాస్ యాంగిల్స్ కూడా ఉంటాయన్నారు. ఒక దర్శకుడిగా తన తొలి చిత్రం దీపావళికి విడుదల కావడం అనేది.. తన కల నిజం అవుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ప్రేమలుకు ముందే..ప్రేమలు చిత్రం విడుదలకు ముందే నటి మమిత బైజు నటించిన సూపర్ శరణ్య చిత్రాన్ని చూసి ఆమెను తమ చిత్రం కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. ఆమె ఈ చిత్రంలోకి రాగానే రజనీకాంత్, శ్రీదేవి జంటగా నటించినట్లు అనిపిస్తోందన్నారు. నటుడు శరత్ కుమార్, రోహిణి, పరిదాపంగాల్ ఫేమ్ డేవిడ్ తదితరులు ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించారు.చదవండి: విలన్ రోల్స్ చేస్తున్న హీరోయిన్స్ -
నిత్యం పోరాటాలే..
● గవర్నర్పై సీఎం ఫైర్ సాక్షి, చైన్నె : మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా నిత్యం తమిళనాడు పోరాడుతూనే ఉంటుందని సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. గవర్నర్ ఆర్ఎన్ రవిని టార్గెట్ చేసి ఆదివారం ఆయన ఎక్స్ పేజీలో విరుచుకుపడ్డారు. చైన్నెలో జరిగిన వళ్లలార్ జయంతి వేడుకలో గవర్నర్ ఆర్ఎన్ రవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ తమిళనాడు ఎవరితో పోరాటంచేస్తున్నదో అంటూ పరోక్షంగా సీఎం స్టాలిన్ను టార్గెట్ చేశారు. ఇందుకు సమాధానం ఇచ్చే విధంగా సీఎం స్టాలిన్ ఎక్స్ పేజీలో విరుచుకు పడ్డారు. తమిళనాడు ఎవరితో పోరాడుతుంది? అని గవర్నర్ అడిగారంటూ గుర్తు చేశారు. హిందీని అంగీకరిస్తేనే విద్యా నిధులు అందిస్తామని ఆయన చెప్పారే అని పేర్కొంటూ, ఇలాంటి అహంకారానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, శాసీ్త్రయ ధృక్పథాన్ని పెంపొందించే విద్యా సంస్థలపై మూఢనమ్మకాలు రుద్దే విధంగా, తప్పుడు కథలు చెప్పడం ద్వారా, యువతరాన్ని వంద సంవత్సరాలు వెనక్కి లాక్కెళ్తున్న ఇలాంటి కుట్రకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం, మతతత్వాన్ని నెత్తి వరకు ఎక్కించుకుని పైశాచికత్వంతో మోసుకెళ్తున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలను అణిచేసే శక్తులతో.. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలను అణచివేసే శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం, ప్రతిసారీ గవర్నర్ అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి హక్కుల సాధనకు పోరాడుతున్నాం అని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. తమిళనాడులోకి పెట్టుబడులు రానివ్వకుండా అడ్డుకుంటున్న కుట్రదారులతో పోరాడుతున్నాం, ప్రజల ఐక్యతను నాశనం చేస్తున్న వారితో పోరాడుతున్నాం, ఆధిపత్య మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని నాశనం చేసినప్పటికీ, తమిళనాడు మాత్రం 11.19 శాతం వృద్ధిని సాధించిందని వివరించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తమిళనాడు తన మనసు మార్చుకోదని, ప్రజలలో గందరగోళం సృష్టించడానికి మాత్రమే పనిచేసే ఇలాంటి గవర్నర్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం, అంటూ, చివరికి తమిళనాడుకే గెలుపు అన్నది గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. -
పనుల్లో వేగం పెంచండి
సాక్షి, చైన్నె: వర్షాల సీజన్ నేపథ్యంలో చైన్నెలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన ముగించాలని అధికారులను సీఎం స్టాలిన్ ఆదేశించారు.టీటీకే రోడ్డు నుంచి వీనస్ కాలనీ వరకు నిర్మాణంలో ఉన్న వర్షపు నీటి పారుదల కాలువ పనులను ఆదివారం సీఎం పరిశీలించారు. వివరాలు.. ఈశాన్య రుతు పవనాల సీజన్ మరి కొద్ది రోజులలో ప్రారంభం కానుంది. ఇందుకు శుభ సూచకంగా దక్షిణ తమిళనాడు, డెల్టా, ఉత్తర తమిళనాడులలో అనేక ప్రాంతాలలో వర్షాలు మొదలయ్యాయి. ఈశాన్య రుతు పవనాల ప్రభావం అత్యధికంగా ఉత్తర తమిళనాడు, దక్షిణ తమిళనాడుపై సాధారణంగా ఉంటుంది. ఈ పరిస్థితులలో శని, ఆదివారాలలో చైన్నె, శివారు జిల్లాలో తెరపించి తెరిపించి మోస్తరుగా వర్షం పడింది. కాసేపు భానుడు, మరి కాసేపు వర్షం అన్నట్టుగా వాతావరణం మారింది. అలాగే కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశి, తేని, విరుదునగర్, దిండుగల్, మదురై తదితర జిల్లాలో అక్కడక్కడమోస్తారుగా వర్షం పడింది. కృష్ణగిరి, సేలంలలోనూ వర్షాలుపడ్డాయి. కృష్ణగిరిలో అత్యధికంగా 12 సెం.మీ వర్షంపడగా, సేలం ఎడపాడిలో 10 సెం.మీ వర్షం పడింది. ఇక, సోమవారం ఉత్తర తమిళనాడులోని విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై జిల్లాలో అనేక చోట్ల భారీ వర్షాలుపడే అవకాశం ఉందని వాతావరణం కేంద్రం హెచ్చరించింది. ఈనెల తొమ్మిదో తేది వరకు ఉపరితల ఆవర్తనం రూపంలో వర్షాలు కొనసాగుతాయని ప్రకటించింది. సీఎం తనిఖీలు చైన్నెలోనూ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు విస్తృతం అయ్యాయి. ఈ పరిస్థితులలో ఆదివారం ఉదయాన్నే టీటీకే రోడ్డు – వీనస్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న వర్షపు నీటి కాలువల పనులను సీఎం స్టాలిన్ పరిశీలించారు. తేనాంపేట జోన్ పరిధిలో జరుగుతున్న ఈ పనులను పరిశీలించిన ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. శ్రీనివాసన్ వీధి, వరదరాజపురం మెయిన్ రోడ్, కస్తూరి ఎస్టేట్ వీధి, శేషాద్రి వీధి, మురేష్ గేట్ రోడ్డు వీధులు వర్షాకాలంలో ఈ సారి నీళ్లు అన్నది నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక్కడి నుంచి నీటిని తరలించేందుకు వీలుగా జయమ్మల్ రోడ్, ఇలంగో రోడ్ క్రాస్ స్ట్రీట్, పోయేస్ రోడ్డు, వెంకటరత్నం రోడ్డు, రాజకృష్ణ రోడ్డు, వరదరాజపురం మెయిన్ రోడ్డు , టీటీవీకే రోడ్డును అనుసంధానించే విధంగా రూ. 8.21 కోట్లతో జరుగుతున్న పనులను త్వరితగతిన ముగించాలని ఆదేశించారు. రుతు పవనాల సీజన్లో వర్షాల రూపంలో, వరదల రూపంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలుగ కూడదని హెచ్చరించారు. ఎల్డమ్స్ రోడ్, సి.బి. రామసామి రోడ్, లజ్ చర్చి రోడ్, సీఐటీ కాలనీ మార్గాలలో పూర్తయిన పనులను కూడా ఈసందర్భంగా సీఎం పరిశీలించారు. ఈ అధ్యయనం సమయంలో సీఎంతో పాటూ ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణియన్, ఎమ్మెల్యే ఎలిళన్, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ చిత్త అరసు, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ కమిషనర్ జె. కుమారగురుబరన్ తదితరులు పాల్గొన్నారు. కాగా చైన్నెలో వర్షపు నీటి తరలింపునకు సంబంధించి జరుగుతున్న పనులను పరిశీలించిన మేయర్ ప్రియ మాట్లాడుతూ 20 సెం.మీ వర్షం పడ్డా, నీరు అన్నది నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు, చర్యలు చేపట్టి ఉన్నామని వివరించారు. -
ఆరోగ్య సంరక్షణపైమారథాన్
– వెనుకబడిన పిల్లలకు రూ.4.42 కోట్ల సాయం సాక్షి, చైన్నె : క్యాన్సర్ రోగులకు సహకారంగా, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు మద్దతు, పేద పిల్లలకు విద్య, వైద్య సేవలు అందించే రీతిలో నిధుల సేకరణ మారథాన్ చైన్నెలో విజయవంతంగా ఆదివారం జరిగింది. ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ఈ మారథాన్ను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అడయార్లోని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు మద్దతుగా నెవిల్లే ఎండీవర్స్ ఫౌండేషన్, నేతృత్వంలో డాన్ టు డస్క్(డీ2డీ) నినాదంతో చైన్నెలో 8వ ఎడిషన్గా అన్నావర్సిటీ ఆవరణలో మారథాన్కు చర్యలు తీసుకున్నారు. సుమారు 3,500 మందికి పైగా క్రీడాకారులు, రన్నర్లు, వాకర్లు ఈ మారథాన్కు తరలి వచ్చారు. ఇక్కడి నుంచి ఉదయాన్నే 5 గంటలకు 25 కి.మీ, 21 కి.మీ దూరం రన్ను జ్యోతి ప్రజ్వలనతో ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అన్నావర్సిటీ రిజిస్టార్ డాక్టర్ జే ప్రకాష్, ఎతిరాజ్ మహిళా కళాశాల చైర్మన్ మురళీ ధరన్, అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీఈఓ డాక్టర్ కల్పనా బాలకృష్ణన్, ఉపాధ్యక్షులు డాక్టర్ హేమంత్ రాజ్ తదితరులు హాజరయ్యారు. అనంతరం ఉదయం 6 గంటలకు 16 కి.మీ, 10 కి.మీ, 5 కి.మీ, 3 కి.మీ విభాగాలలో రన్ జరిగింది. దీనిని మాజీ డీజీపీ శైలేంద్రబాబు, నటుడు షంషాద్ ప్రారంభించారు. పాలీహౌస్ ఇండియా ఎండీ షబ్బీర్ యూసఫ్ బాయ్, ఉమ్మడి బంగారు జ్యువెలర్స్ ఎండీ ఉమ్మిడి జితేంద్రలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 6.20 గంటల 125 కి.మీ, 100 కి.మీ, 75 కి.మీ,50 కి.మీ, 25 కి.మీ, 10 కి.మీ సైక్లింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి టీవీఎస్ మొబిలిటీ డైరెక్టర్ శ్రీనాథ్ రాజం, జీఆర్టీ హోటల్స్ సీఈఓ విక్రమ్ కోట హాజరయ్యారు. అలాగే, 4 నుంచి 17 సంవత్సరాలపిల్లల కోసం కిడ్స్ రన్ ఉదయం 7.30 నుంచి నిర్వహించారు. ఎస్పీఏఆర్ఆర్సీ వ్యవస్థాపకుడు డాక్టర్ కన్నన్ పుగలేంది, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ కల్పన బాలకృష్ణన్, డీ2డీ వ్యవస్థాపకుడు నెవిల్లే బిలిమోరియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా వచ్చిన రూ.4.42 కోట్లను వెనుకబడిన పిల్లలకు విద్య, వైద్య చికిత్స కోసం సేకరించి అందజేశారు. -
12 నుంచి నైనార్ రాష్ట్ర పర్యటన
సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. ఈనెల 12 నుంచి ఆయన పర్యటన జరగనుంది. మదురైలో జరిగే సభతో ఈ పర్యటను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించానున్నారు. వివరాలు.. తమిళనాడులో పాగా వేయాలన్న లక్ష్యంతో వ్యూహాలకు బీజేపీ పదును పెట్టిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికలనుఎదుర్కొనేందుకు సిద్ధమైన బీజేపీ నేతలు తమ వంతుగా బలాన్ని చాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ప్రజా చైతన్యయాత్ర రూపంలో తన బలాన్ని చాటుకుంటూ వస్తున్నారు.ఈ పరిస్థితులో బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సైతం ప్రచార యాత్రకు సిద్ధమయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం ఆయన ప్రపథమంగా రాష్ట్రపర్యటన చేపట్టనున్నారు. ప్రచార సభల రూపంలోనే.. మదురైలో ఈనెల 12వ తేదిన జరిగే సభతో రాష్ట్ర పర్యటనకు నైనార్ శ్రీకారంచుట్టనున్నారు. ఈ పర్యటనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించనున్నట్టు బీజేపీ వర్గాలు ప్రకటించాయి. ఈ పర్యటన జయప్రదం విషయంగా ఇప్పటికే పలు మార్లు జిల్లాల కార్యదర్శులతో నైనార్ సమావేశాలు నిర్వహించారు. 12న మదురై, 13న శివగంగై,14న చెంగల్పట్టు, 15 ఉత్తర చైన్నె, 16న సెంట్రల్చైన్నె, 24వతేదీన పెరంబలూరు, అరియలూరు, 25న తంజావూరు, 28న దిండుగల్, 29 నామక్కల్లలో పర్యటించనున్నారు. నవంబర్ నెలాఖరు వరకు తొలివిడత పర్యటన, డిసెంబరులో రెండు, మూడో విడత పర్యటనలకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అయితే ప్రచార సభల రూపంలోనే యాత్ర సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్ షోలోకు అనుమతిని హైకోర్టు ఇప్పటికే నిషేధం విధించింది. అలాగే రహదారులు,జాతీయ రహదారులలో సభలకు సైతం అనుమతి రద్దు చేసి ఉండటంతో ఆయా ప్రాంతాలో మైదానాలను వేదికగా ఎంపిక చేసుకునే దిశగా బీజేపీ వర్గాలు ముందుకెళ్తున్నాయి. -
చైన్నెలో వల్లలార్ అంతర్జాతీయ సదస్సు
– మంత్రి పి.కె. శేఖర్ బాబు వెల్లడి కొరుక్కుపేట: 10 వేల మంది భక్తుల భాగస్వామ్యంతో చైన్నెలో వల్లలార్ అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నట్టు హిందూ ధర్మదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు అన్నారు. వివరాలు.. వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీర్సెల్వం నేతృత్వంలో కడలూరు జిల్లా వడలూరులో వల్లలార్ దేవ నిలయంలో 203వ వార్షికోత్సవంలో మంత్రి పీకే శేఖర్బాబు పాల్గొని ధార్మిక జెండాను ఎగురవేసి భక్తులకు అన్నదానం చేశారు. వల్లలార్ ఇంటర్నేషనల్ సెంటర్లోని శ్రీబిశ్రీ సెక్షనన్లో జరుగుతున్న నిర్మాణ పనులను కూడా వారు పరిశీలించారు. తరువాత మంత్రి పి.కె. శేఖర్బాబు చైన్నెలో వల్లలార్ నివసించిన ప్రాంతానికి వల్లలార్ నగర్ అని పేరు పెట్టారు. అలాగే ఆ ప్రాంతంలోని బస్టాప్కు కూడా ఆయన పేరు పెట్టారు. చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సీఎం స్టాలిన్ రూ. 6 కోట్ల వ్యయంతో ప్రయాణికుల అన్ని ప్రాథమిక అవసరాలను తీర్చే వ్యవస్థను అభివృద్ధి చేసే పనిని ప్రారంభించారు. వచ్చే నవంబర్, డిసెంబర్లో చైన్నెలో 10,000 మందితో ముఖ్యంగా 2,000 మందికి పైగా మహిళలు పాల్గొనే వల్లలార్ అంతర్జాతీయ సదస్సును నిర్వహించాలని నిర్ణయించామన్నారు . ఆ సమావేశంలో వల్లలార్ వైభవాన్ని పెంచే సన్మార్గులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి ప్రత్యేక గుర్తింపు ఇస్తామని తెలిపారు. వల్లార్పై ఓ పుస్తకం కూడా ప్రచురించినట్లు పేర్కొన్నారు. చిన్నమ్మకు బెదిరింపు సాక్షి,చైన్నె : దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళను ఓ వ్యక్తి ఇంటి వద్దకు వచ్చి మరీ బెదిరించి వెళ్లడం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె తరపున ప్రతినిధి తేనాంపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు.. పోయస్ గార్డెన్లో శశికళ నివాసం ఉన్న విషయం తెలిసిందే. తరచూ ఓ వ్యక్తి ఆ ఇంటి వద్దకు వచ్చి వెళ్తున్నట్టు సీసీ కెమెరాల ఆధారంగా వ్యక్తిగత భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ పరిస్థితులలో తానో పోలీసు అధికారి అంటూ ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లి మరీ శశికళను బెదిరించి వెళ్లడాన్ని తీవ్రంగా ఆమె తరపు వారు పరిగణించారు. ఆమెను బెదిరించిన వ్యక్తికి సంబంధించిన ఫొటోలను సీసీ కెమెరాలలోనమోదైన దృశ్యాలతో తేనాంపేట పోలీసు స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా నందనంలో నివాసం ఉంటున్న నటి స్వర్ణమాల్యకు ఈమెయిల్ ద్వారా బెదిరింపు రావడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎన్నికల కసరత్తు ప్రారంభించిన కాంగ్రెస్ ● ఐదుగురు సభ్యులతో సమన్వయ కమిటీ ● సెల్వ పెరుందగై ప్రకటన కొరుక్కుపేట: రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్లో పార్టీ కసరత్తు వేగవంతం చేసింది. ముఖ్యంగా ఓట్ల రిగ్గింగ్కు వ్యతిరేకంగా సంతకాల ప్రచారాన్ని గ్రామాలకు తీసుకెళ్లాలని వారు యోచిస్తున్నారు. కోటి సంతకాలను సేకరించి ఢిల్లీ నాయకత్వానికి పంపాలని వారు నిర్ణయించారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పనిని ముమ్మరం చేయడానికి రాష్ట్ర అధ్యక్షుడు సెల్వ పెరుందగై ఐదుగురు సభ్యుల సమన్వయ కమిటీని నియమించారని, సీనియర్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ కె. విజయన్, జ్యోతి, కీళనూర్ రాజేంద్రన్, డి.ఎన్. అశోకన్, కె.ఎస్. కుమార్ ఈ బృందంలో భాగం అని నేతలు పేర్కొంటున్నారు. కాగా సంతకాల డ్రైవ్ను తీవ్రతరం చేయడం, పార్టీ సమావేశాలు, రాబోయే ఎన్నికలకు సంబంధించిన పనులను ఈ బృందం సమన్వయం చేస్తుందని ప్రకటించారు. పార్టీ నాయకత్వం ప్రకటించిన అన్ని కార్యాచరణ ప్రణాళికలను నిర్ణీత సమయ వ్యవధిలో పూర్తి చేయడానికి ఈ బృందం ప్రణాళికతో పనిచేస్తుందని సెల్వ పెరుందగై వెల్లడించారు. కంటైనర్ –బస్సు ఢీ – 23 మందికి గాయాలు అన్నానగర్: ఆర్కాడ్ సమీపంలో లగ్జరీ బస్సు, ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. చైన్నె నుంచి బెంగళూరుకు 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న లగ్జరీ బస్సు రాణిపేట జిల్లాలోని ఆర్కాట్ సమీపంలో శనివారం రాత్రి చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి పై ప్రయాణిస్తుండగా, లగ్జరీ బస్సు డ్రైవర్ అనుకోకుండా నిద్రమత్తులోకి జారుకుని కాంచీపురం నుంచి కృష్ణగిరి జిల్లాకు గృహ నిర్మాణం కోసం కాంక్రీట్, సిమెంట్ దూలాలను తీసుకెళ్తున్న కంటైనర్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సులోని 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ హరీష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే ఆర్కాట్ నగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులు ఆర్కాట్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. -
ఉప్పొంగిన కుశస్థలి
పళ్లిపట్టు: కుశస్థలి నదిలో వరద ప్రవాహంతో మూడు నేలమట్టం వంతెనలు నీట మునిగాయి. రవాణా సేవలు తెగడంతో గ్రామీణులు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఆంధ్రాలోని చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలతో కృష్ణాపురం జలాశాయం పూర్తి సామర్థ్యంతో నిండింది. దీంతో జలాశయం నుంచి శనివారం రాత్రి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శనివారం అర్ధరాత్రి పళ్లిపట్టు సమీపంలోని కుశస్థలి నదిలో వరద ప్రవాహం చోటుచేసుకుంది. రాత్రి నుంచి ఆదివారం వేకువ జాము వరకు జలాశయం నుంచి మిగులు జలాలు విడుదలయ్యాయి. అంతేకాకుండా కొండ చెరియల నుంచి వర్షపు నీరు కుశస్థలికి చేరుతున్న క్రమంలో వరద ప్రవాహం ఉప్పొంగింది. దీంతో కీయ్కాళ్పట్టడ, సామంతవాడ, నెడియం ప్రాంతాల్లోని నదికి మధ్యలోని నేలమట్టం వంతనెనలు పూర్తిగా మునిగాయి. అలాగే చెక్డ్యాంలలో వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ధాటికి పళ్లిపట్టు ప్రాంతంలోని 20 నదీతీర గ్రామాల ప్రజలకు రవాణా సేవలు తెగాయి. పళ్లిపట్టు, తిరుత్తణి, తిరువలంగాడు ప్రాంతాల్లో కుశస్థలి నది వరద ప్రవహించి పూండి చెరువుకు చేరుకుంటోంది. వరద ప్రవాహంతో నదీతీర ప్రాంతాల ప్రజలకు రెవెన్యూ శాఖ ద్వారా హెచ్చరికలు జారీ చేసి, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
భగవద్గీత పుస్తకాల బహూకరణ
కొరుక్కుపేట: తెలుగు వెలుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిన్నారుల్లో ఆథాత్మిక చింతన, పెద్దలయందు గౌవరం కలిగిఉండాలన్న ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా చైన్నె వలసరవాక్కంలో జరిగిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ పాల్గొని చిన్నారులకు భగవద్గీత , దేవుని పుస్తకాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు కుటుంబానికి చెందిన భానుజీ , ధారణి పండుగల విశిష్టతలను తెలుపుతూ బొమ్మల కొలువు ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు . చిన్ననాటి నుంచే పిల్లల్లో దైవభక్తి పెంపొందించాలని, అలాగే పెద్దలంటే గౌరవం, సమాజం పట్ల బాధ్యతను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని సూచించారు. -
క్లుప్తంగా
తిరువొత్తియూరు: చైన్నె చూలైమేడుకు చెందిన ప్రతాప్, పల్లికరనైకు చెందిన జనార్థనన్, కీళ్కట్టలైకి చెందిన పూరణచంద్రన్, వేలచ్చేరికి చెందిన అబ్దుల్ వాసిం చైన్నె నగరంలో మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేసి విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.5 కిలోల ఖరీదైన గంజాయి, మత్తు మాత్రలు, రూ.2.65 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. కొరుక్కుపేట: పెరటాసి మాసం పవిత్ర దినాలలో ఉపవాసం ఉండి మాంసాహారానికి దూరంగా ఉండడం హిందువులు ఆచారం. దీని కారణంగా, కాశిమేడు చేపల మార్కెట్లో చేపల రాక తగ్గింది. సాధారణంగా, ఆదివారాల్లో, కాశీమేడు చేపల మార్కెట్ ఓ పండుగలాగా జనంతో నిండి ఉంటుంది. కానీ ఆదివారం, కాశీమేడు చేపల మార్కెట్లో చేపలు కొనే వారు కరువయ్యారు. చాలా పవర్ బోట్లు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లకపోవడంతో, తక్కువ మొత్తంలో చేపలు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. పెద్ద చేపలు సరఫరా కాలేదు. వంజీరం కిలో రూ.700, కొడువా రూ.600, శంకర రూ.300కు అమ్ముడయ్యాయి. చేపలు కొనేవారు లేక కాశీమేడు మార్కెట్ నిర్మానుష్యంగా మారిపోయింది. పురటాసి మాసం ముగిసేవరకు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. సాక్షి, చైన్నె: చైన్నె టీ నగర్లోని రామ్రాజ్ కాటన్ స్టోర్లో రమ్యం పేరిట చీరల కొలువు, ప్రీమియం సుభగా సిల్క్స్ కలెక్షన్లను సినీ నటి నదియా ఆవిష్కరించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి రామ్ రాజ్ కాటన్ వ్యవస్థాపకుడు కేఆర్ నాగరాజన్, ఎండీ బీఆర్ అరుణ్ ఈశ్వర్, డైరెక్టర్లు సుమతి నాగరాజన్, ఆర్తిక అరుణ్ ఈశ్వర్, సినీ నటి ధనలక్ష్మి హాజరయ్యారు. రమ్యంను ఆవిష్కరించిన నటి నదియా సిల్క్స్ కలెక్షన్లను పరిచయం చేశారు. ఈసందర్భంగా బీఆర్ అరుణ్ ఈశ్వర్ మాట్లాడుతూ, రమ్యం వినియోగ దారులకు నచ్చే కలెక్షన్లతో ప్రత్యేక విభాంగా కొలువు దీర్చామని వివరించారు. తమ ఆవిష్కరణలు, రమ్యం సంప్రదాయ వస్త్రాలు, కొత్త డిజైన్లు, స్టైలీష్గా తీర్చిదిద్దిన భారతీయ హస్త కళల పాత్ర గురించి ఈ సందర్భంగా వివరించారు. పండుగ సీజన్ , రోజు వారీ అనువైన వస్త్రాల కొలువుగా ఇక్కడ రమ్యం ఏర్పాటైందన్నారు. అన్నానగర్: మరైమలై నగర్ లోని తిరుచ్చి–చైన్నె జాతీయ రహదారిపై శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో, దాదాపు 10 ఆవులను తీసుకెళ్తున్న మినీ లారీ చైన్నె వైపు వేగంగా వచ్చింది. పోలీసులు లారీని ఆపమని సిగ్నల్ ఇచ్చారు. కానీ లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. దీని తరువాత, అక్కడ ఉన్న పోలీసులు కార్లు, మోటార్ సైకిళ్లలో లారీని వెంబడించారు. దాదాపు 2 కిలోమీటర్లు వెళ్లి మరైమలైనగర్ కారు ఫ్యాక్టరీ దగ్గర పట్టుకున్నారు. మిగతా ఇద్దరు పారిపోయారు. దర్యాప్తులో పట్టుబడిన యువకుడు హర్యాన రాష్ట్రానికి చెందిన ఖమర్ అలీ అని తేలింది. కాగా తప్పించుకునే క్రమంలో పశువుల అక్రమ రవాణాదారుల లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ, పెద్ద ప్రమాదం జరగలేదు. కాగా ఈ ఘటనపై మరై మలై నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొరుక్కుపేట: క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విల్లివాక్కం నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే బి . రంగనాథన్ అన్నారు. ఈ మేరకు చైన్నె మొగప్పేర్ వేస్ల్లో ఏడీకే స్పోర్ట్స్ అండ్ గేమింగ్ పావ్గేమర్స్ పార్కును ప్రముఖ నటుడు సతీష్ తోకలసి మాజీ ఎమ్మెల్యే బి. రంగనాథన్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతరం వారు మాట్లాడుతూ ప్రసుత్తం క్రీడాలకు ఆదరణ పెరుగుతుందన్నారు. అంతేకాకుండా ప్రతిభను చాటుకుంటే భవిష్యత్ను ఉజ్వలంగా మార్చుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. అంతకుముందు సంస్థ సీఈవో డీజీ శ్రీనివాసన్ మాట్లాడుతూ ఏడికే స్పోర్ట్స్ అండ్ గేమింగ్ చైన్నెలో మొట్టమొదటి స్మార్ట్ స్పోర్టింగ్ అనుభవాన్ని పరిచయం చేస్తుందన్నారు. అంతేకాకుండా చైన్నెలో తొలి స్మార్ట్ పికిల్ బాల్ కోర్టు కావడం విశేషం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అరుణ్కుమార్ పాల్గొన్నారు. -
విజయంతో కనువిప్పు కలిగించాలి
తిరువళ్లూరు: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపుతో బీజేపీకి కనువిప్పు కలగాలని డీఎంకే సీనియర్ నేత రాజ పిలుపు నిచ్చారు. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి, తిరువళ్లూరు తదితర రెండు నియోజకవర్గాలకు చెందిన బూత్ కమిటి ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఆదివారం ఉదయం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా కన్వీనర్ తిరుత్తణి ఎమ్మేల్యే చంద్రన్ అద్యక్షత వహించగా ముఖ్యఅతిధిగా కేంద్ర మాజీ మంత్రి పార్టీ డిప్యూటీ జనరల్ సెకరెట్రి రాజా హాజరై పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 2026లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేతలు కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని, డీఎంకే గెలుపుతో బీజేపీకి కనువిప్పు కలగించాలన్నారు. కార్యక్రమంలో తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్, రాష్ట్ర నాయకులు ఆర్టీఈ ఆదిశేషన్, జిల్లా అద్యక్షుడు ద్రావిడభక్తన్, పార్టీ నేతలు వీసీఆర్ కుమరన్, అరుణ, జైకృష్ణ, బీకే నాగరాజ్ పాల్గొన్నారు. -
ధరణివరాహస్వామికి గరుడ సేవ
పళ్ళిపట్టు: ధరణి వరాహస్వామి ఆలయ బ్రహ్మత్సవ వేడుకల్లో భాగంగా ప్రధానమైన గరుడసేవ శనివారం రాత్రి కమనీయంగా సాగింది. భారీసంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వివరాలు.. పళ్లిపట్టు సమీపం ఎగువ పొదటూరులో ప్రసిద్ధి చెందిన శ్రీదేవి, భూదేవి సమేత దరణి వరాహస్వామి ఆలయంలో పెరటాసి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. వేడుకలు సందర్భంగా స్వామికి విశేష అభిషేక పూజలతో పాటూ ఆభరణాలతో అలంకరించి పూజలు చేస్తున్నారు. ఉత్సవ వేడుకల్లో పెరటాని మూడవ శనివారంతో పాటు స్వామివారి గరుడ సేవ సందర్భంగా ఆలయంకు భక్తులు పోటెత్తారు. రెండు గంటల పాటూ భారీ క్యూలైన్లో వేచివుండి స్వామి దర్శనం చేశారు. రాత్రి పుష్పాలతో అలంకరించిన గరుడ వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవర్లు ధరణి వరాహస్వామి ప్రత్యేక అలంకరణలో కనువిందు చేశారు. భట్టాచార్యుల వేదమంత్రోచ్ఛారణల నడుమ మహా దీపారాధనతో స్వామివారి ఊరేగింపు ప్రారంభమైంది. ఈ ఈ సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాల్లో భారీగా వేచివున్న భక్తులు గోవిందనామస్మరణతో స్వామివారికి కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి దర్శించుకున్నారు. బాణసంచా వేడుకలు కేరళ చండీ మేళం నడుమ స్వామివారు గ్రామ వీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. -
ప్రభుత్వ పథకాలపై ఇంటింటి ప్రచారం
తిరుత్తణి: ప్రభుత్వ పథకాలు పట్ల ఇంటింటికి వెళ్లి కార్యకర్తలు ప్రచారం చేపట్టాలని ఎంపీ జగద్రక్షగన్ హితువు పలికారు. వివరాలు.. తిరుత్తణి నియోజకవర్గం స్థాయిలో మండల, నగర, టౌన్ కార్యదర్శుల సమావేశం తిరుత్తణిలో ఆదివారం నిర్వహించారు. డీఎంకే జిల్లా కార్యదర్శి, తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అరక్కోణం ఎంపీ జగద్రక్షగన్ పాల్గొని కార్యకర్తలకు సూచనలు చేశారు. ప్రదానంగా డీఎంకే ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి. దేశంలో మరే రాష్ట్రం అమలు చేయని విధంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తోందని, దీంతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారన్నారు. పెండింగ్లో వున్న పనులు పూర్తి చేయడంతో పాటూ అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ఈ మేరకు.. ప్రభుత్వ అధికారులతో పాటూ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా గ్రామస్థాయిలో పనిచేయాలన్నారు. -
షాపింగ్ సందడి
సాక్షి, చైన్నె: నగరంలో దీపావళి పండుగ షాపింగ్ సందడి మొదలైంది. పండుగకు రెండు వారాలే సమయం ఉండడంతో జనం ఆదివారం షాపింగ్ మాల్స్ బాట పట్టారు. టీనగర్, పురసై వాక్కం, తాంబరంలలోని వస్త్ర దుకాణాలు కిట కిటలాడాయి. వివరాలు.. పండుగలు సమీపిస్తున్నాయంటే చాలు రాష్ట్ర రాజధాని నగరం జనంతో కళ కళలాడుతుంది. మాల్స్లో వ్యాపారం వేగం పుంజుకోవడం జరుగుతుంది. ఇక దీపావళి పండుగంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటిల్లిపాది కొత్త బట్టలు ధరించి బాణాసంచా పేల్చుతూ, స్వీట్లు, మిఠాయిలతో ఆనందాన్ని పంచుకునేందుకు సిద్ధం అవుతారు. దీపావళి పర్వదినానికి రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. దీంతో షాపింగ్ సందడి మొదలైంది. షాపింగ్ సందడి పండుగను పురస్కరించుకుని ప్రతి రోజు సాయంత్రం వేళలల్లో జనం మాల్స్ల వైపు పోటెత్తు తుంటారు. శని, ఆదివారాలలో మరీ రద్దీ ఎక్కువగా ఉంటుంది. కొత్త బట్టలు, పండుగకు అవసరమయ్యే వస్తువులు, బాణా సంచాల కొనుగోలు కోసం వాణిజ్య కేంద్రాలకు తరలుతున్నారు. నగరంలో వాణిజ్య కేంద్రాలుగా బాసిళ్లుతోన్న టీ నగర్, పురసై వాక్కం, ప్యారీస్, తాంబరం, క్రోంపేట తదితర ప్రాంతాల వైపుగా కదులుతోన్నారు. దీంతో ఆ పరిసరాలన్నీ కిట కిటలాడుతోన్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో టీనగర్కు జనం పెద్దఎత్తున తరలి వచ్చారు. అన్ని వస్త్ర దుకాణాలు జనంతో కిట కిటలాడాయి. దీపావళి వ్యాపారం జోరందుకునే అవకాశాలు ఈసారి ఎక్కువే. జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో వాప్యారం బిజీలో మాల్స్ యజమానులు, వర్తలు నిమగ్నమయ్యారు. కొత్త కొత్త డిజైన్లను, వస్తువులను వినియోగ దారుల ముంగిట ఉంచుతున్నారు. అలాగే, ఆయా వస్త్ర దుకాణాలు పోటీలు పడి మరీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. నిఘా కట్టు దిట్టంటీ నగర్, రంగనాధం వీధి, పాండి బజార్, పురసై వాక్కం, డౌటన్, ప్యారీస్, ఎన్ఎస్సీ బోస్ రోడ్డుల్లో నగర పోలీసు యంత్రాంగం నిఘాను పెంచింది. టీ నగర్లో వెయ్యి మందిని రంగంలోకి దించారు. ఈ పరిసరాలలో 80 నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. సెలవు రోజులలో అత్యధికంగా మఫ్టీ సిబ్బంది విధులలో నియమించేందుకు చర్యలు తీసుకున్నారు. వాణిజ్య కేంద్రాలకు తరలి వస్తున్న జనాన్ని అప్రమత్తం చేసే విధంగా ప్రత్యేక చర్యల్ని పోలీసులు తీసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో నిఘా నేత్రాల్ని ఏర్పాటు చేసి, కంట్రోల్ రూం ద్వారా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. బైనాకులర్లతో ఓ వైపు నిఘాను పర్యవేక్షిస్తూ, మరో వైపు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మైక్ల ద్వారా సిబ్బంది హెచ్చరిస్తూ వస్తున్నారు. నగరం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తూ, ఆయా ప్రాంతాలలో చేపట్టిన ఏర్పాట్లను కమిషనర్ అరుణ్ పరిశీలించారు. అలాగే, తాంబరం, క్రోం పేట, వేళచ్చేరిలలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, ఆవడి పరిసరాలలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లపై అక్కడి కమిషనరేట్ల కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు దృష్టి పెట్టారు. -
సింహం అదృశ్యంతో కలకలం
సాక్షి, చైన్నె : బెంగళూరు నుంచి తీసుకొచ్చిన మగ సింహం అదశ్యం కావడంతో వండలూరు జూ పరిసరాలలో కలకలం రేగింది. అయితే, ఈ సింహం జూలోనే ఉన్నట్టు, బయటకు వెళ్లేందుకు అవకాశం లేదని అటవీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. చైన్నె శివారులోని వండలూరులో అరింజ్ఞర్ అన్నా జులాజికల్ పార్కు ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడికి నిత్యం సందర్శకులు తరలి వస్తున్నారు. ఇక్కడ లయన్ సఫారీ పార్కు కూడాఉంది. ఇందులో సింహాలు, పులులు బయటే తిరుగుతుంటాయి.సందర్శకులు ప్రత్యేక వాహనంలో వెళ్లి వీక్షించేందుకు అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో ఇటీవల బెంగళూరు నుంచి సేరు అన్న మగ సింహంను వండలూరు జూకు తీసుకొచ్చారు. దీనిని లయన్ సఫారీలో వదలి పెట్టారు. అయితే, శుక్రవారం నుంచి ఈ సింహం కనిపించడం లేదన్న సమాచారం టెన్షన్లోపడేసింది. ఆహారం కోసం రావాల్సిన సింహం రాలేదు. ఇతర సింహాలు, పులులు ఆహారంకోసం సంబంధిత ప్రాంతానికి వచ్చినా సేరు మాత్రం రాలేదు. సేరు సింహం అదృశ్యం సమాచారంతో వండలూరు చుట్టు పక్కల ఉన్న ఆలపాక్కం, కోలపాక్కం, నెడుగుండ్రం గ్రామాలలోని ప్రజలలో ఉత్కంఠ నెలకొంది. సింహం వండలూరు జూ నుంచి బయటకు వచ్చిన పక్షంలో ఈ గ్రామాల్లోకి చొరబడాల్సింది. ఆదివారం ఉదయాన్నే వెలువడ్డ సింహం అదృశ్య సమాచారంతో ఈ గ్రామాల ప్రజలలో ఆందోళన బయలు దేరింది. అయితే, సింహం వండలూరు జూ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లయన్ సఫారీ చుట్టూ ఎత్తయిన గోడలు, కంచె ఉన్నాయని, కంచెకు ముందు భాగంలో లోతైన ప్రదేశాల ఉండటంతో వీటిని దాటేందుకు పులులు, సింహాలు సాహసం చేయబోవని పేర్కొంటున్నారు. కొత్త ప్రదేశం కావడంతో ఈ సింహం ఎక్కడైనా పొదళ్లల్లో ఉండేందుకు వీలుందని , రెండురోజుల క్రితం కూడా ఆహారాన్ని పట్టుకు వెళ్లిందని, లయన్ సఫారీ అతి పెద్దది అని సింహం జూను వదలి బయటకు వెళ్లలేదని భరోసా ఇస్తున్నారు. అదే సమయంలో ఈ సింహం కోసం లయన్ సఫారీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాల ద్వారా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
పూందమల్లి– మప్పేడు మధ్య బస్సు సర్వీసు ప్రారంభం
తిరువళ్లూరు: పూందమల్లి– మప్పేడు మధ్య ఏర్పాటు చేసిన నూతన బస్సు సర్వీసును ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి నుంచి సుంగువాసత్రం వరకు బస్సు సర్వీసును కొనసాగిస్తున్నారు. సంబందిత బస్సు సర్వీసును మప్పేడు వరకు కొనసాగించాలని కోరుతూ ప్రజలు ఎమ్మేల్యే వీజీ రాజేంద్రన్కు పలుసార్లు వినతి పత్రం సమర్పించారు. ఇందుకు ఎంటిసి అధికారులు సానుకూలంగా స్పందించి సర్వీసును పొడిగించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కొండంజేరి రమేష్తోపాటూ పలువురు అధికారులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
పళణి పతనమే లక్ష్యం
– టీటీవీ స్పష్టీకరణ సాక్షి, చైన్నె: పళణి స్వామి పతనమే లక్ష్యంగా 2026 ఎన్నికలలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పనితీరు ఉంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. కరూర్ పెను విషాద ఘటనలో బాధితులకు అండగా నిలబడడంలో సీఎం స్టాలిన్ పనితీరు అభినందనీయమని కొనియాడారు. శనివారం సాయంత్రం చైన్నెలో అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ మీడియా ముందుకు వచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరబోమని పేర్కొంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామిపై విరుచుకు పడ్డారు. దీనిని తీవ్రంగా పరిగణించిన అన్నాడీఎంకే వర్గాలు ఎదురు దాడిలో నిమగ్నమయ్యాయి. అన్నాడీఎంకే శాసన సభా పక్ష ఉప నేత ఆర్బీ ఉదయకుమార్ స్పందిస్తూ, తనను నమ్ముకు వచ్చిన 18 మంది ఎమ్మెల్యేలను రాజకీయంగా అనాథలు చేసిన ఘనత దినకరన్కే దక్కుతుందని విరుచుకు పడ్డారు. అన్నాడీఎంకేను ఓడించడమే లక్ష్యంగా ఆయన పనితీరు ఉంటుందని వ్యాఖ్యలు చేయడం శోచనీయమని, ఒక్కసారి ఆయన గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని, వ్యక్తిగత దాడులను మానుకోవాలని మండిపడ్డారు. ఈ విషయంగా టీటీవీ దినకరన్ను ఆదివారం మీడియా ప్రశ్నించగా, ఆర్బీ ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు. తన లక్ష్యం పళణి స్వామి పతనం అని స్పష్టం చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు తూట్లు పొడి చేశారని, వారు రూపకల్పన చేసిన నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేశారని, సిద్ధాంతాలను తాకట్టు పెట్టేశారని, ఇప్పుడు ఉన్నది అక్కడ అన్నాడీఎంకే కాదని, ఎడపాడి డీఎంకే అని వ్యాఖ్యలు చేశారు. అందుకే ఎడపాడి పళణిస్వామి పతనమే లక్ష్యంగా 2026 ఎన్నికలలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పనితీరు ఉంటుందన్నారు. కరూర్ పెను విషాదం వ్యవహారంలో సీఎం స్టాలిన్ పనితీరును అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయంగా ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా బాధితులకు అండగా నిలబడ్డారని కొనియాడారు. అయితే, ఈ ఘటనను అడ్డం పెట్టుకుని తమిళగ వెట్రి కళగంనేత విజయ్ను దారికి తెచ్చుకుని కూటమిలో చేర్చుకునేందుకు పళణి స్వామి కుస్తీలు పడుతుండడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. -
కమనీయం.. శ్రీనివాస తిరుకల్యాణం
మార్మోగిన పెరంబూరు కొరుక్కుపేట: శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస పెరుమాల్కు తిరుకల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా సాగింది. శ్రీ వేంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో సెప్టంబర్ 27వ తేదీ నుంచి చైన్నె పెరంబూరు పటేల్ రోడ్డులో ఉన్న సమాజానికి చెందిన ఆనంద నిలయంలో పెరటాసి శనివారం ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా చివరి రోజు ఆదివారం శ్రీ వెంకటేశ్వర భక్తసమాజం అధ్యక్షులు తమ్మినేని బాబు అధ్యక్షతన శ్రీనివాస తిరుకల్యాణ వైభవాన్ని ఏర్పాటు చేశారు. పెరంబూరు ఆనంద వేలు వీధిలోని కల్కిరంగనాథన్ మాన్డ్ఫోర్ట్ హైయ్యర్ సెకండరీ పాఠశాల ప్రాంగణంలో ఉదయం తిరుమంజనం. కాశీయాత్ర, చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఊంజల సేవ భక్తిశ్రద్ధలతో చేశారు. 12.45 గంటలకు మాంగళ్యధారణ శాస్త్రోక్తంగా చేపట్టారు. గోవింద గోవిందా అంటూ గోవింద నామస్మరణతో పెరంబూరు ప్రాంతం మార్మోగింది. దాదాపు 3 వేలమందికి పైగా భక్తులు పాల్గొని కల్యాణాన్ని తిలకించి తరించారు. భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు అందించి అన్నప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో సమాజం సెక్రటరీ ఎస్ వెంకటరామన్, జాయింట్ సెక్రటరీ అనంతరామన్, కోశాధికారి కోదండరామయ్య ఇంకా వెంకటరమణుడు, రామచంద్రన్ , పాఠశాల ప్రిన్సిపాల్ సుదర్శన్ తదితరులు ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం తరపున గరుడ వాహనంపై శ్రీ శ్రీనివాస పెరుమాల్ను ఊరేగించారు. -
17న తెరపైకి గేమ్ ఆఫ్ లోన్స్
తమిళసినిమా: జేఆర్ జీ ప్రొడక్షన్స్ పతాకంపై జీవానందం నిర్మించిన చిత్రం గేమ్ ఆఫ్ లోన్న్స్. ఈ చిత్రం ద్వారా అభిషేక్ వెస్లీ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. నటుడు నివాస్ ఆదిత్తన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఇందులో అభినయ్ ప్రతి నాయకుడిగా నటించారు నటి ఎస్తర్, ఆద్విక్ తదితరులతో బాలనటి ఆద్విక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జో కోస్టా సంగీతాన్ని, శబరి ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని ఈనెల 17వ తేదీన తెరపైకి రానుంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ లాక్ డౌన్ సమయంలో ఈ చిత్ర కథ గురించి ఆలోచన వచ్చిందన్నారు తాను ఐటీలో పనిచేస్తున్న వ్యక్తిని కావడంతో ఏఐ టెక్నాలజీలో ఒక వ్యక్తి చిక్కుకుంటే ఏమవుతుంది అనే ఇతి వృత్తంతో రూపొందించిన షార్ట్ ఫిలిం కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అవార్డును గెలుచుకుందన్నారు. అదేవిధంగా లాక్ డౌన్ సమయంలో ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ లోన్ వంటి విషయాల్లో పలువురు బాధింపునకు గురైన పరిస్థుతులను నిత్యం వింటూ వచ్చానన్నారు. తన మిత్రులు కొందరు కూడా ఈ ఆన్లైన్ గేమ్లో మోసపోయారన్నారు. ఇప్పుడు ఆన్లైన్ లోన్ తీసుకోవడం సులభం అయింది కానీ, దాన్ని తిరిగి చెల్లించడం కష్టతరంగా మారింది అన్నారు. దీంతో ఇలాంటి విషయాలపై అవగాహన కలిగించే విధంగా కథను తయారు చేసి తెరకెక్కించిన చిత్రం గేమ్ ఆఫ్ లోనన్స్ అని చెప్పారు. ఆన్లైన్లో లోన్ తీసుకున్న ఓ వ్యక్తి ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదుర్కొనే సమస్యలే ఈ చిత్రకథ అని చెప్పారు. ఈ చిత్ర కథకు పాటలు కానీ, కామెడీ గానీ అవసరం అవ్వలేదన్నారు. కథ కథనం అంత ఆసక్తిగా సాగుతాయని చెప్పారు. చిత్ర షూటింగ్ను పూర్తిగా బెంగళూరులో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని ఈనెల 17వ తేదీన విడుదల చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. -
మూడు తరాల ప్రేమ కథగా అమరం
తమిళసినిమా: మూడు తరాల్లో మూడు ప్రాంతాల్లో జరిగే అమర్ ప్రేమ కథాంశంతో రూపొందుతున్న చిత్రం అమరం అని ఆ చిత్ర దర్శకుడు అరుళ్ కృష్ణన్ చెప్పారు. ఈయన దర్శకుడు గోకుల్, రాజన్ మాధవ్ల వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. అరుళ్ కృష్ణన్ కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని దివ్య క్షేత్ర ఫిలిమ్స్ పతాకంపై నిర్మల రాజన్ సమర్పణలో సీఆర్ రాజన్ నిర్మిస్తున్నారు. రాజన్ తేజేశ్వర్, ఐరా అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జార్జ్, సాయి దేనా, నాగినీడు, కల్కి రాజన్, హరీష్ పేరడీ, వాసుదేవన్ మురళి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది మూడు తరాల్లో మూడు ప్రాంతాల్లో జరిగే అమరం సినిమా ప్రేమ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇప్పటివరకు ఎవరు చూడని సన్నివేశాలతో పూర్తిగా యాక్షన్ విందుగా ఉంటుందన్నారు. స్టంట్ మాస్టర్ మిరాకిల్ మైఖేల్ ఈ చిత్రం కోసం సరికొత్త యాక్షన్ సన్నివేశాలను రూపొందించారని చెప్పారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలను ప్రముఖ బాలీవుడ్ బృందం సహకారంతో రియలిస్టిక్ పోరాట దృశ్యాలను తెరకెక్కించారని చెప్పారు. ఈ చిత్రం కోసం నాలుగు పాటలను సంగీత ప్రియులను అలరించే విధంగా రూపొందించాలని చెప్పారు. చిత్రంలోని ఒక సన్నివేశాన్ని 5వేల అడుగుల ఎత్తులో చిత్రీకరించినట్లు చెప్పారు. ఇంతవరకు ఎవరు టచ్ చేయని తూర్పు అటవీ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చితంగా ఇది ఉంటుందన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి భరత్ కుమార్, గోపీనాథ్ ద్వయం ఛాయాగ్రహణం అందించారని, చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ నటుడు శశి కుమార్ ఆవిష్కరించగా దీనికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని దర్శకుడు చెప్పారు. -
చైన్నెలో జైపూర్ జ్యువెలరీ రోడ్ షో
సాక్షి, చైన్నె: బంగారు వర్తకులు, తయారీ దారులు, జ్యువెలరీస్ ఆభరణాల పరిశ్రమలోని వారందర్నీ ఒకే వేదిక పైకి తెచ్చే విధంగా జైపూర్ జ్యువెలరీ షో 2025కు ఏర్పాట్లు చేపట్టారు. డిసెంబరు 19 నుంచి 22వ తేది వరకు నోవాటెల్ జైపూర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ ప్రదర్శన జరగనుంది. ఇందుకు బంగారు వర్తకులు, పరిశ్రమలోని వారిని ఆహ్వానించే విధంగా చైన్నెలో ఆదివారం రోడ్ షో జరిగింది. ఈ కార్యక్రమానికి మద్రాసు జ్యువెలర్స్ అండ్ డైమండ్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జయంతి లాల్ చల్లాని, చైన్నె జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హెచ్ సుల్తాన్ మోహిద్దీన్, కోశాధికారి కమల్ కొఠారి హాజరయ్యారు. రంగు రంగుల రత్నాలు, డైమండ్స్, విలువైన ఆభరణాలు, జైపూర్ వారసత్వ ఆభరణాలు అంటూ బంగారు లోకాన్ని సృష్టించేదిశగా ఈ ప్రదర్శన జరగబోతోందని వివరించారు. తమిళనాడులోని వర్తకులు, జ్యువెలరీ యాజమాన్యాలు, ఈ పరిశ్రమలోని వారంతా తరలి రావాలనిపిలుపున ఇచ్చారు. -
అమ్మ మరణం తర్వాత సినిమాలు వద్దనుకున్నా: బిగ్బాస్ బ్యూటీ
కమలహాసన్ హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్ రియాల్టీ షోలో పాల్గొని పాపులర్ అయింది అక్షర రెడ్డి (Akshara Reddy). తాజాగా రైట్ చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్కు పరిచయం అయింది. ఈ సందర్భంగా తను ఆసక్తికర విషయాలు పంచుకుంది. 2021లో తమిళ బిగ్బాస్ సీజన్ 5లో పాల్గొన్నాను. అప్పుడు 87 రోజులు బిగ్బాస్ ఇంట్లో ఉన్నాను. అది నాకు ఎన్నో రకాల అనుభవాలనిచ్చింది. ఆ హీరోయిన్స్ అంటే ఇష్టంకమల్తో కలిసి నటించాలన్నది నా కల. బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss Reality Show)లో ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం లభించింది. అప్పుడు ఆయన అందరికీ ఒక మాట చెప్పారు. నీ జీవిత స్క్రిప్టును నువ్వే రాసుకుంటున్నావు. నీ జీవితంలో రేపు ఏమి జరగాలన్నదీ నువ్వే నిర్ణయించుకోవాలి. అని ఆయన చెప్పిన విషయం నా మనసులో నాటుకు పోయింది. నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటున్నాను. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఐశ్వర్యారాయ్, శ్రీదేవిలకు వీరాభిమానిని. అలాగే శ్రుతిహాసన్ అంటే చాలా ఇష్టం. సినిమాలు వద్దనుకున్నా..ప్రస్తుతం తమిళ్లో నేను రైట్ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యాను. మా అమ్మ మరణం తర్వాత సినిమా రంగమే వద్దనే భావనకు వచ్చాను. కానీ, దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రైట్ చిత్రంలో నటించేందుకు అంగీకరించాను. నేను ఇంతకుముందే బిల్ గేట్స్ అనే కన్నడ చిత్రంలో హీరోయిన్గా చేశాను. కాలేజీ అయిపోగానే జార్జియాకు వెళ్లి సైకాలజీ చదివాను. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలను అని అక్షర రెడ్డి చెప్పుకొచ్చింది.చదవండి: 80's స్టార్స్ రీయూనియన్.. 31 మంది నటులందరూ ఒకేచోట! -
తమిళనాట ట్విస్ట్.. కరూర్ ఘటనపై కుష్బు సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడులోని(Tamil Nadu) కరూర్(Karur Stampede) ఘటన తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కరూర్ తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందని టీవీకే మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో టీవీకే నేతల ఆరోపణలకు మరింత ఆజ్యం పోస్తూ.. బీజేపీ(BJP Party) నాయకురాలు, సినీ నటి కుష్బు సుందర్(Khusbu Sundar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.కరూర్ తొక్కిసలాట ఘటనపై తాజాగా బీజేపీ నాయకురాలు కుష్బు సుందర్ స్పందించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ..‘తమిళనాడు ప్రజలందరూ కరూర్ తొక్కిసలాట ఘటన నిర్లక్ష్యంగా జరిగిందని అనుకుంటున్నారు. కానీ, ఈ ప్రమాదం ప్లాన్ ప్రకారమే ఎవరో సృష్టించినట్టు నాకు అనిపిస్తోంది. ఎందుకంటే విజయ్(TVK Vijay) ర్యాలీ నిర్వహించడానికి ప్రభుత్వం సరైన స్థలం ఇవ్వలేదు. విజయ్ ర్యాలీకి ఎంత మంది అభిమానులు, ప్రజలు వస్తారు అనేది ప్రభుత్వానికి, పోలీసులకు ముందే తెలుసు. అయినా కూడా ఇలా ర్యాలీకి తగిన స్థలం కేటాయించలేదు.VIDEO | Chennai: “Tamil Nadu CM MK Stalin should switch from mute mode, speak on Karur stampede”, says actor and BJP leader Khushbu Sundar (@khushsundar) raising questions on various viral videos of Karur tragedy.#KarurStampede (Full video available on PTI Videos -… pic.twitter.com/Fm587TeDvf— Press Trust of India (@PTI_News) October 4, 2025తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఘటన జరిగిన తర్వాత మౌనంగా ఉన్నారు. పలు ప్రశ్నలకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు?. ఈ దురదృష్టకర ఘటనలో 41 మంది మరణించారు. ఇప్పటికైనా స్టాలిన్ మాట్లాడాలి. జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారని అధికారులు చెబుతున్నారు. అలా లాఠీఛార్జ్ ఎందుకు చేశారు?. ఇది ప్రణాళికాబద్ధంగా సృష్టించబడిన ఘటన అయి ఉండాలి’ అని ఆరోపించారు.విజయ్కు బీజేపీ అగ్రనేత ఫోన్.. మరోవైపు.. కరూర్ ఘటనలో(Karur Stampede).. డీఎంకే పార్టీనే మెయిన్ టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే కంటే దూకుడు ధోరణి ప్రదర్శించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. తాజాగా టీవీకే విజయ్తో బీజేపీ అగ్రనేత ఒక్కరు ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం(BJP Phone Call to TVK Vijay). ఒకవేళ అధికార డీఎంకే అన్యాయంగా గనుక లక్ష్యంగా చేసుకుంటే.. విజయ్ ఒంటరేం కాదని ఆ అగ్రనేత చెప్పినట్లు తెలుస్తోంది. డీఎంకే ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా ఓర్పు పాటించాలని.. వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేయమని ఆ ఢిల్లీ పెద్ద, విజయ్కు సూచించినట్లు సమాచారం.సమీకరణం.. మారేనా?వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే టీవీకే వెళ్తుందని.. సింహం సింహమేనని, సింగిల్గా పోటీకి వెళ్తుందని.. డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని.. తాను ఏ కూటమిలో భాగం కాదని, అయితే అధికార ఏర్పాటులో కలిసి వచ్చే పార్టీలకు భాగం ఇస్తానని విజయ్ ఇదివరకు ప్రకటించారు. అయితే కరూర్ ఘటన నేపథ్యంలో.. ఆ నిర్ణయం మారే అవకాశం లేకపోలేదు!. -
తమిళనాడులో మరో ట్విస్ట్.. గవర్నర్కు వ్యతిరేకంగా ‘సుప్రీం’లో పిటిషన్
సాక్షి, చెన్నై: గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేసింది. అందులో కలైంజ్ఞర్ కరుణానిధి పేరిట వర్సిటీ ఏర్పాటుకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్(RN Ravi) ఎడతెగని జాప్యం చేస్తూ చివరకు రాష్ట్రపతికి పంపించినట్లు ఆరోపించింది.వివరాలు ఇలా ఉన్నాయి.. రాష్ట్ర గవర్నర్, డీఎంకే ప్రభుత్వం(MK Stalin) మధ్య వివిధ అంశాలపై నెలకొన్న వివాదాలు ఇప్పటికే సుప్రీంకోర్టు(Supreme Court) వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ‘సుప్రీం’ ఉత్తర్వులతో రాష్ట్ర ప్రభుత్వం పలు వర్సిటీల వ్యవహారాలకు సంబంధించిన ముసాయిదాలను ఆమోదించుకుంది. ఈ పరిస్థితుల్లో కుంభకోణంలో కలైంజ్ఞర్ కరుణానిధి పేరిట వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్లో నిర్ణయించింది.అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ ముసాయిదా రాజ్భవన్కు చేరింది. ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు రాజ్భవన్ నుంచి ఆమోదం రాలేదు. తాజాగా.. ఈ ముసాయిదాను రాష్ట్రపతికి పంపించినట్లు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఈ వర్సిటీ సాధన కోసం డీఎంకే ప్రభుత్వం మళ్లీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు గవర్నర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేసింది. ఇది కూడా చదవండి: మీరేం ఒంటరి కాదు.. విజయ్కు దన్నుగా ఢిల్లీ పెద్దలు! -
తిరుచ్చిపై శ్రీహరి విహారం
చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు శనివారం బంగారు తిరుచ్చి వాహనంపై విహరించారు. వారపుఉత్సవాల్లో భాగంగా శ్రీవారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు సమర్పించారు. అనంతరం దేవదేవేరులకు కనులపండువగా కల్యాణోత్సవం జరిపించారు. సాయంత్రం వేడుకగా ఊంజల్ సేవల చేపట్టారు. ఈ క్రమంలోనే ఉభయదేవేరులతో శ్రీవారిని తిరుచ్చిపై కొలువుదీర్చి ఊరేగించారు. పోటెత్తిన భక్తులు పెరటాసి మాసం మూడో శనివారం సందర్భంగా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ధ్వజస్తంభం వద్ద పిండి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. -
క్లుప్తంగా
శేషవాహనంపై వరాహస్వామి చిద్విలాసం పళ్లిపట్టు: ధరణి వరాహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారు శేషవాహన సేవలో కొలువుదీరి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మండలంలోని ఎగువ పొదటూరులో కళింగ వరాహస్వామి ఆలయంలో శుక్రవారం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సాయంత్రం స్వామివారు శేషవాహన సేవలో కొలువుదీరారు. స్వామి వారికి కర్పూర నీరాజనం పలికి మేళ తాళాలు, బాణసంచా సంబరాలు నడుమ స్వామిని గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఆస్పత్రిలో చేరిన వైగో సాక్షి, చైన్నె : ఎండీఎంకే నేత ౖవైగో శనివారం చైన్నెలోని ప్రైవేటు ఆ స్పత్రిలో చేరారు. ఆయనకు తీవ్ర జ్వరం ఉన్నట్టు వైద్యులు గుర్తించి, అందుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నారు. యువకుడు దారుణ హత్య తిరువొత్తియూరు: ఓట్టన్ చత్రం సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుడు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దిండిగల్ జిల్లా ఒట్టన్చత్రం సమీపంలోని కొసవపట్టిలోని ధనుష్కోటి కాలనీకి చెందిన సెంథమిల్సెల్వన్ (25) పలు కేసుల్లో నిందితుడు. ఇతను పళని సమీపంలోని కంజనాయక్కన్పట్టికి చెందిన సౌమ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 3 ఏళ్ల ఆడపిల్ల ఉంది. సెంథమిళ్సెల్వన్ ఇంటికి సమీపంలోనే అతని స్నేహితుడు స్టాలిన్ (23) నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా సెంథమిళ్ సెల్వన్ భార్య సెల్ఫోన్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. దీంతో అనుమానం వచ్చిన సెంథమిళ్ సెల్వన్, స్నేహితులతో కలిసి స్టాలిన్ ఇంట్లోకి చొరబడి అతనిపై దాడి చేశారు. అడ్డుకోవడానికి వచ్చిన స్టాలిన్ తండ్రి పెరియస్వామిపై కూడా దాడి చేశారు. దాడిలో స్టాలిన్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన పెరియస్వామి దిండిగల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సెంథమిళ్ సెల్వన్, అతని బావమరిది మదన్న్కుమార్ (19), స్నేహితులు ప్రకాశ్రాజ్ (21), బాలమురుగన్ (23), గాంధీ (40) అనే ఐదుగురిని శుక్రవారం అరెస్టు చేసి జైలుకు పంపారు. మండాడి చిత్ర యూనిట్కు తప్పిన ఘోర ప్రమాదం తమిళసినిమా: నటుడు సూరి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మండాడి.మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మత్స్యకారుల బోటుల పోటీల ఇతివృత్తంతో రూపొందుతోంది. ఇందులో నటుడు సూరి మత్స్యకారుడిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ను శుక్రవారం రామనాథపురం, తొండి సముద్రం తీరంలో నిర్వహించారు. నటుడు సూరికి సంబంధించిన సన్నివేశాలను నడి సముద్రంలో చిత్రీకరించారు. అందుకోసం నటుడు సూరి ఓ బోటులో, కెమెరామెన్ ఆయన సహాయకులు మరో బోటులోనూ , ఇతర చిత్ర యూనిట్ ఇంకో బోటులో సముద్రం మధ్యలోకి వెళ్లి షూటింగ్ నిర్వహించారు. అప్పుడు అనూహ్యంగా కెమెరామెన్ బృందం ఉన్న బోటు గాలి వేగం కారణంగా సముద్రంలో మునిగి పోయింది. సమీపంలో ఉన్న మత్స్యకారులు వెంటనే అక్కడికి చేరుకుని కెమెరామెన్, ఆయన సహాయకులను కాపాడారు. అలా ఘోర ప్రమాదం నుంచి తృటిలో బయట పడగలిగారు. అయితే కోట్ల ఖరీదైన కెమెరాలు, వస్తుసామగ్రి సముద్రంలో మునిగిపోవడంతో దాన్ని బయటకు తీయలేక పోయారు. ఈ సంఘటన చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. డెంగీ కేసులతో అప్రమత్తం కొరుక్కుపేట: వర్షాల నేపథ్యంలో చైన్నెలో సాధారణ జ్వరాలతో పాటూ విషజ్వరాల వ్యాప్తి పెరుగుతోంది. సాధారణంగా కేరళలో జూన్, జూలై నెలల్లో ఈ పరిస్థితి ఉంటుందని, చైన్నెలో అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇవి ఎక్కువగా వ్యాపిస్తాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం సగటున 60 నుంచి 70 మంది డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 14,000 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారని, వారిలో ఏడుగురు మరణించారని తెలిపారు. రాబోయే కాలంలో డెంగ్యూ జ్వరం ఈ సంవత్సరం చివరి నాటికి 20,000 మంది వరకు ఈ వ్యాధి బారిన పడతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, శరీర నొప్పులు, అలసట రెండు రోజులకు మించి ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. ఇంటి పరసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. -
ఘనంగా పెరటాసి శనివారం
వేలూరు: తమిళ పెరటాసి మాస మూడవ శనివారాన్ని పురస్కరించుకుని స్వామి వారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మూడవ శనివారం వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేలూరులోని టీటీడీ దేవస్థాన సమాచార మందిరంలో ఉదయం 5 గంటలకే స్వామి వారికి విశేష పూజలు చేసి వివిధ పుష్పాలతో అలంకరించారు. అదే విధంగా ఉదయం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. ఇదిలా ఉండగా టీటీడీ దేవస్థానంతో నడుస్తున్న వెంకటేశ్వర పాఠశాలలో జై శ్రీరామ్ సేవా సంఘం అధ్యక్షుడు ఇళంగోవన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. వీటిని ఎమ్మెల్యే కార్తికేయన్, బంగారుగుడి డైరెక్టర్ సురేష్బాబు ప్రారంభించారు. అదేవిధంగా వేలపాడిలోని వరదరాజ పెరుమాల్, అరసంబట్టు పెరుమాల్, బ్రహ్మపురంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అదేవిధంగా వాలాజలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి డాక్టర్ మురళీధరస్వామిజీ ఆధ్వర్యంలో శ్రీనివాస పెరుమాల్కు పూజలు చేశారు. -
అవయవదానానికి ముందుకు రావాలి
వేలూరు: అవయవాలు దానం చేసేందుకు అవగాహన కలిగి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని సినీ డైరెక్టర్ వెంకట్ప్రభు అన్నారు. వేలూరు శ్రీపురంలోని బంగారుగుడి పీఠాధిపతి శక్తి అమ్మ ఆశీస్సులతో నడుస్తున్న నారాయణి ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విశిష్ట సేవలు అందజేసిన డాక్టర్లకు వైద్యసిబ్బందికి అవార్డుల పంపిణీ కార్యక్రమం ఆస్పత్రి డైరెక్టర్ బాలాజీ అధ్యక్షతన శనివారం జరిగింది. కార్యక్రమానికి ఆయన హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. మనం తీసుకునే ఆహారం వల్లే అధికంగా గుండెపోటు వస్తుందని వీటిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండడంతోపాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల కాలంలో అధికంగా గుండెపోటుతోనే మృతి చెందుతున్నారని వీటిపై వైద్యులు పరిశోధనలు చేసి తగిన మందులను కనుగొనాలన్నారు. ఆస్పత్రి డైరెక్టర్ బాలాజీ మాట్లాడుతూ నారాయణి ఆస్పత్రిలో నిరుపేద రోగులకు అతితక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. సిబ్బంది సేవాభావాన్ని అలవాటు చేసుకొని రోగులతో ప్రేమగా నడుచుకోవాలన్నారు. నిరుపేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే శక్తిఅమ్మ ఈ ఆస్పత్రిని ప్రారంభించారన్నారు. నటి మిర్నాలిని రవి, నారాయణి ఆస్పత్రి, పరిశోధన కేంద్రం సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. -
పెరియార్ ప్రపంచానికి నెల జీతం విరాళం
సాక్షి, చైన్నె : తిరుచ్చి సిరగనూరులో నిర్మిస్తున్న ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ ప్రపంచానికి సీఎం స్టాలిన్తో పాటు డీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు నెల రోజుల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. చైన్నె శివారులోని చెంగల్పట్టు జిల్లా మరైమలై నగర్లో ద్రావిడ కళగం నేతృత్వంలో స్వీయ మర్యాద మహానాడు శనివారం జరిగింది. డీఎంకే కూటమి పార్టీల నేతలందరూ ఈ మహానాడుకు తరలివచ్చారు. రాత్రి ద్రవిడ కళగం అధ్యక్షుడు వీరమణి అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీఎం స్టాలిన్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ద్రవిడ కళగంకు వ్యతిరేకంగా డీఎంకే ఆవిర్భవించ లేదని,పెరియార్ సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళ్లడం, బలోపేతానికి ఆవిర్భవించినట్టు వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు పెరియార్ను చెప్పులు, బూట్లు, కత్తులు, ఆయుధాలతో సైతం కొట్టారని గుర్తు చేస్తూ, నేడు ఆ మహనీయుడి సిద్ధాంతాలు ఆక్స్ఫర్డ్ వర్సిటీ వరకు చేరినట్టు వివరించారు. ప్రాణం ఉన్నంత కాలం స్వీయ మర్యాదను వదులుకోమని, తమిళుల రక్షణే లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. 92 సంవత్సరాల వయస్సులోనూ వీరమణి శ్రమిస్తున్నారని గుర్తుచేస్తూ, తమ లాంటి వాళ్లు కూడా సేవ చేయడానికి ఉన్నామని, పని భారం తగ్గించుకోవాలని సూచించారు. ద్రవిడ సిద్ధాంతానికి రాజకీయ వేదికగా ఉన్న డీఎంకే ప్రపంచ వ్యాప్తంగా పెరియార్ ఘనత చాటే విధంగా ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నారు. తిరుచ్చి సిరగనూరులో ద్రవిడ కళగం నేతృత్వంలో రూపుదిద్దుకుంటున్న పెరియార్ ఉళగం (పెరియార్ ప్రపంచం) పనులకు తనతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక నెల జీతాన్ని విరాళంగా అందజేస్తున్నామని ప్రకటించారు. 2026 ఎన్నికలు తమిళుల ఆత్మగౌరవానికి సంబంఽధించినదని, ఇందులో విజయం సాధిస్తామని, తమిళుల్ని తలెత్తుకునేలా మళ్లీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పరిశీలన
తిరువళ్లూరు: చైన్నెలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణపు పనులకు అవసరమైన ఫ్రీ–ప్యాబ్రీకేటెడ్ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు రహదార్లు శాఖ మంత్రి వేలు ఉన్నత అధికారులతో కలిసి పరిశీలించారు. వివరాలు.. చైన్నె అన్నాసాలై నుంచి తరచూ ఏర్పడుతున్న ట్రాపిక్ను క్రమబద్ధీకరించడంతో పాటు తేనాంపేట నుంచి సైదాపేట వరకు సుమారు 3.20 కిమీ దూరం మేరకు 621 కోట్లు వ్యయంతో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఫ్రీ–ప్యాబ్రీకెటెడ్ విధానంలో 16,300 టన్నుల బరువుతో ఫియర్, ఫియర్క్యాప్, గిర్డర్(వంతెనెల నిర్మాణానికి ఉపయోగించే పెద్ద ఇనుము) తదితర వాటిని ముంబాయిలోని ఎస్జీ ఇనుము పరిశ్రమ, గుజరాత్ వడదోరలోని కేపి గ్రీన్ పరిశ్రమ, తెలంగాణ రాష్ట్రం హైదరబాద్లోని ఐరన్ గ్లోబల్ పరిశ్రమ, చత్తీస్గడ్ రాష్ట్రంలోని స్ట్రార్టక్ రైట్, తిరువళ్లూరు జిల్లా పెద్దపాళ్యంలోని పెన్నార్ ఇనుము పరిశ్రమలో తయారు చేస్తున్నారు. ఈక్రమంలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర తదితర రాష్ట్రాలో తయారవుతున్న పిల్లర్, పియర్క్యాప్, గిర్డర్ తయారీ పనులను మంత్రి వేలు అధికారులతో కలిసి గతంలో పరిశీలించి పనులను మరింత వేగంగా చేపట్టాలని సూచించడంతో పాటూ పనులను నిత్యం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పెద్దపాళ్యంలోని పెన్నార్(పీఐఎన్ఎన్) పరిశ్రమలో మంత్రి వేలు అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి వేలు మీడియాతో మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లా పెద్దపాళ్యంలోని ఇనుము పరిశ్రమలో 1,436 టన్నుల సామర్థ్యంతో ఇనుప పిల్లర్లను తయారు చేస్తున్నట్లు తెలిపారు. వీటిని త్వరలోనే చైన్నెకు తరలించి ఫ్లైఓవర్లకు అమర్చునున్నట్టు వివరించారు. మంత్రి వెంట రహదార్లు శాఖ ప్రభుత్వ కార్యదర్శి సెల్వరాజ్తో పాటూ పలువురు అధికారులు ఉన్నారు. -
8 అంతస్తులతో మెట్రో జంక్షన్
షోళింగనల్లూరులో నిర్మాణాలు సాక్షి, చైన్నె: ఓల్డ్ మహాబలిపురం మార్గంలోని షోళింగనల్లూరు వద్ద మెట్రో రైలు జంక్షన్ రూపుదిద్దుకోనుంది. బ్రహ్మాండ మాల్తో 8 అంతస్తుల భవనంగా ఈ స్టేషన్ను నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. చైన్నెలో రెండు మార్గాలలో మెట్రో పనులు ముగిసి రైలు సేవలు జరుగుతున్నాయి.మరో మూడు మార్గాలలో పనులు శరవేగంగా జరుగుతున్నది. ఇందులో మాధవరం – సిరుచ్చేరి , మాధవరం – షోళింగనల్లూరు మార్గంలో రైళ్లు షోళింగనల్లూరు వద్ద కలుస్తాయి. ఓల్డ్ మహాబలిపురం మార్గంలో షోళింగనల్లూరు ప్రాధాన ప్రాంతంగా ఉంటున్నది. ఇక్కడ ఐటీ కంపెనీలు మరీ ఎక్కువే . ఐటీ హబ్గా ఉన్న ఈ పరిసరాలలో మెట్రో యాజమాన్యం బ్రహ్మాండ మాల్ తరహాలో మెట్రో స్టేషన్ను నిర్మించేందుకు సిద్దమైంది. రెండు మార్గాలు కలిసే ప్రదేశంలో ఈ జంక్షన్ రూపుదిద్దుకోనున్నది. ఇక్కడ 8 అంతస్తులతో అన్ని రకాల హంగులతో నిర్మాణాలకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన నమూనాను విడుదల చేశారు. -
తిరుచ్చిపై శ్రీవారి కటాక్షం
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు శనివారం తిరుచ్చిపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తమిళ పెరటాసి నెల మూడో శనివారం కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వేకువ జామున సుప్రభాత సేవతో శ్రీవారిని మేల్కొలిపి, నిత్య కై ంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి విశేషాలంకరణ చేసి, తిరుచ్చిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు నారికేళ, కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మంగళహారతులిచ్చి పవళింపు సేవ నిర్వహించారు. -
క్లుప్తంగా
అన్నానగర్: తిరుచ్చి జిల్లా మనప్పారైలోని వైయంపట్టిలోని థామస్ నగర్లోని సవేరియార్ పురం నివాసి ఆంథోనీ ముత్తు (52). ఇతని భార్య సేవత్తియ్యమ్మాళ్. అభిప్రాయ భేదాల కారణంగా, సేవత్తియమ్మాళ్ తన భర్త నుండి విడిపోయి గత 8 సంవత్సరాలుగా అదే ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తోంది. ఆంథోనీ ముత్తు గత 7 సంవత్సరాలుగా జల్లికట్టు ఎద్దులను పెంచుతున్నాడు. శుక్రవారం రాత్రి వర్షం పడటంతో ఆంథోనీ ముత్తు అడవిలో కట్టిన ఎద్దును ఇంటికి తీసుకురావడానికి వెళ్లాడు. ఆ సమయంలో, ఎద్దు అతనిపై దాడిచేసి తోసేసింది. ఇందులో, అతని మెడ, కుడి కాలుకు తీవ్ర గాయాలై అతను అక్కడికక్కడే మరణించాడు. వైయంపట్టి పోలీసులు అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం మనప్పారై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరుత్తణి: స్టాలిన్ వైద్య శిబిరంలో భారీగా గ్రామీణులు పాల్గొని వైద్య పరీక్షలతో పాటు చికిత్స పొందారు. తిరుత్తణి శివారులోని అగూరులో ఆరగ్యశాఖ ఆధ్వర్యంలో స్టాలిన్ వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ప్రియారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని శిబిరం ప్రారంభించి గర్భిణులకు పౌష్టికాహార కిట్, ప్రత్యేక ప్రతిభావంతులకు గుర్తింపు కార్డులు అందజేశారు. శిబిరంలో తిరువళ్లూరు, తిరుత్తణి ప్రభుత్వాసుపత్రుల నుంచి వైద్యుల బృందం పాల్గొని గ్రామీణులకు వైద్య సేవలు నిర్వహించారు. తిరుత్తణి యూనియన్ వ్యాప్తంగా దాదాపు 2వేల మంది పాల్గొని వైద్య పరీక్షలు, చికిత్స పొందారు. ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ అంబిక, మండల వైద్యధి కారి కలైవాణి, మండల డీఎంకే కార్యదర్శి కృష్ణ న్, మాజీ పంచాయతీ అధ్యక్షుడు నరసింహరాజ్ సహా అనేకమంది పాల్గొన్నారు. తిరువొత్తియూరు: తిరువారూర్ జిల్లా మరువత్తూరు తోపు వీధికి చెందిన మురుగయ్యన్ (65) రైతు. అదే ప్రాంతంలోని పొలంలో కోత కోసిన వరి ధాన్యం కాపలా కోసం మరువ త్తూరు పాండవయ్యారు ఆనకట్ట సమీపంలో రహదారి పక్కన పోసిన ధాన్యం కుప్ప పక్కన శుక్రవారం రాత్రి పడుకున్నాడు. ఆ సమయంలో పాలు తీసుకొని వస్తున్న మినీ లారీ రహదారి పక్కన నిద్రిస్తున్న మురుగయ్యన్ మీదకు అదుపు తప్పి దూసుకువెళ్లింది. దీంతో మురుగయ్యన్ ఘటన స్థలంలోనే మృతి చెందా డు. ఈక్రమంలోఅదుపు తప్పిన లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నదిలో బోల్తా పడింది. లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తిరువారూర్ తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మురుగయ్యన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తిరువారూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. తిరువొత్తియూరు: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళణిస్వామి 2026లో తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తిరువొత్తియూరు త్యాగరాజ స్వామి ఆలయంలోని వడివుడైయమ్మన్, 46 నాయన్మార్ల ఉత్సవ విగ్రహాలు, ఇతర 400 దేవతలకు అభిషేకం చేసి, వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉత్తర చైన్నె ఉత్తర తూర్పు జిల్లా కార్యదర్శి ఆర్.ఎస్. రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం 2026 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాయపురం ఆర్.మనో, డి.జి. వెంకటేష్ బాబు, జిల్లా కార్యదర్శులు మాధవరం వి.మూర్తి, నా.బాలగంగ, ఆర్.ఎస్.రాజేష్, టి.నగర్ సత్య, విరుగై వి.ఎన్.రవి, మాజీ ఎం.ఎల్.ఎ. కె.గుప్పన్, తదితరులు అభిషేక ఆరాధనల్లో కూర్చున్నారు. అన్నానగర్: మీనంబాక్కం లోని తిరువల్లువర్ వీధి నివాసి గోవర్ధన్ (19 ) తరామణి లోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం, అతను తన కళాశాల స్నేహితులతో రామపురంలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంలో తిరిగి వస్తున్నాడు. పరంగిమలై హైవే మలుపు వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోవర్ధన్ తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అతనితో వచ్చిన అతని స్నేహితులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. తరువాత తదుపరి చికిత్స కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న గోవర్ధన్ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై పరంగిమలై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గోవర్దన్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం క్రోమ్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
వేడుకగా కుమరన్ జయంతి
తిరుత్తణి: జాతీయ జెండాను కాపాడి ప్రాణాలు విడిచిన స్వతంత్య్ర సమర యోధుడు కొడికాత్త కుమరన్ ( జెండా కాపాడిన కుమరన్) 122వ జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. తిరుత్తణిలో స్టార్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంకు ఆ క్లబ్ అధ్యక్షుడు పరందామన్ అధ్యక్షత వహించి కుమరన్ చిత్రపటంకు నివాళులర్పించి స్వతంత్య్ర భారతదేశంకు తిరుప్పూర్ కొడికాత్త కుమరన్ సేవలను కొనియాడారు. ఆంగ్లేయుల దాడిలో సైతం ప్రాణాలు కోల్పోతున్నా చేతిలోని జాతీయ జెండాను కిందకు దించకుండా తుది శ్వాస వరకు చేతిలో జెండాతో పోరాడి ప్రాణాలు విడిచిన కుమరన్ త్యాగ ఫలంను గుర్తు చేసుకున్నారు. జయంతి వేడుకల్లో రోటరీ క్లబ్ నిర్వాహకులు గవాస్కర్, సురేష్, వెంకటేశన్, అయ్యప్పన్, జగన్, శ్రీధర్, మాసిలామణి తదితరులు పాల్గొన్నారు. -
నవంబర్ 7న తెరపైకి అదర్స్
తమిళసినిమా: గ్రాండ్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన చిత్రం అదర్స్. నవ నటుడు ఆదిత్య మాధవన్, నటి గౌరీకిషన్, అంజు కురియన్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో ముండాసిపట్టి రామదాస్, నండు జగన్, హరీష్ పెరడి, వినోద్సాగర్, దర్శకుడు ఆర్.సుర్రాజన్ ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి నవ దర్శకుడు అబిన్ హరిహరన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. జిబ్రాన్ సంగీతాన్ని, అరవింద్సింగ్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని నవంబర్ 7న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది మెడికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే వైవిధ్య భరిత కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇటీవల చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. అదర్స్ చిత్ర కథ, కథనాలు ఆసక్తికరంగా సాగుతాయని చెప్పారు. దీంతో చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఏర్పడిందని అన్నారు. -
యానిమేషన్ చిత్రం కీకీ–కోకో
తమిళసినిమా: యానిమేషన్ కథా చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఇష్టపడి చూస్తారు. అలా తాజాగా పిల్లల నుంచి పెద్దలు వరకు చూసి ఆనందించే విధంగా రూపొందిన యానిమేషన్ చిత్రం కీకీ–కోకో. ఇనికా ప్రొడక్షన్న్స్ రూపొందించిన ఈ చిత్రానికి నారాయణన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కీకీ–కోకో చిత్రం మాత్రమే కాదని, అంతకు మించి స్నేహం, ప్రేమ వంటి అంశాలతో కథను చెప్పిన విధానం పిల్లలను ఆకట్టుకుంటుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా వినోదంతో పాటు పిల్లల్ని ఎడ్యుకేట్ చేసే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చక్కని అనుభూతిని కలిగించే ఈ మ్యాజిక్ చిత్రాన్ని చూడడానికి అందరూ థియేటర్లకు రావాలన్నారు. చిత్ర దర్శకుడు నారాయణన్ మాట్లాడుతూ అన్నింటి కంటే పిల్లలకు విద్యకు సంబంధించిన కథా చిత్రాలే చాలా అవసరం అన్నారు. అలా కీకీ–కోకో చిత్రం విద్య అవసరం గురించి చర్చించే చిత్రంగా ఉంటుందని తెలిపారు. కీకీ అంటే అందమైన ప్రాణి. కోకో అంటే యువతి అని చెప్పారు. అలా వారి మధ్య సాగే అందమైన అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ప్రేమ, స్నేహం వంటి విషయాలను నేర్చుకునే విధంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా పిల్లలతో పాటు పెద్దలను ఆకట్టుకునే విధంగా కీకీ–కోకో చిత్రం ఉంటుందని పేర్కొన్నారు. కీకీ–కోకో చిత్రంలో ఓ సన్నివేశం -
నలం కాక్కుం స్టాలిన్ కొనసాగించడం ఖాయం
వేలూరు: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తునన నలం కాక్కుం స్టాలిన్ పథకాన్ని తమ ప్రభుత్వం కొనసాగించడం ఖాయమని రాష్ట్ర సీనియర్ మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి నియోజక వర్గం పరిధిలోని సేర్కాడులోని ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగిన నలం కాక్కుం స్టాలిన్ పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం రోగుల వద్ద వసతులపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది తరచూ వస్తున్నారా? లేదా? అనే విషయాలను రోగుల వద్ద అడిగారు. అనంతరం దివ్యాంగులకు సర్టిఫికెట్లుతో పాటూ వివిధ ఆపరేషన్ల కోసం సిపార్సు అనుమతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు విరివిగా కురుస్తున్నందున అవసరమైన ముందస్తు జాగ్రత్తలను రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం చేయడం జరిగిందన్నారు. అదే విధంగా నలం కాక్కుం స్టాలిన్ పథకాన్ని రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించి రోగులకు అవసరమైన చికిత్స చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కరూరు సంఘటనపై విలేకరులు ప్రశ్నించగా వీటి గురించి విచారణ కమిషన్ విచారణ జరిపి కోర్టు తీర్పు ఇస్తుందని వీటి గురించి మనం ఏం మాట్లాడబోమన్నారు. కరూరు ఘటనపై డీఎంకేపై ప్రతి పక్ష పార్టీలకు చెందిన కొందరు దుమ్మెత్తి పోస్తున్నారని వీటిలో ఏమాత్రం నిజం లేదన్నారు. కార్యక్రమంలో కాట్పాడి యూనియన్ చైర్మన్ వేల్ మురుగన్, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్కుమార్, జోన్ చైర్మన్ పుష్పలత, డీఎంకే పార్టీ ప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
కోస్టుగార్డుకు అక్షర్ అంకితం
సాక్షి, చైన్నె : భారత కోస్టు గార్డు అమ్ముల పొదిలోకి అక్షర్ పేరిట కొత్తనౌక ప్రవేశించింది. పుదుచ్చేరిలోని కారైక్కాల్ సముద్ర తీరంలో జరిగిన కార్యక్రమంలో ఈ నౌకను గస్తీ నిమిత్తం రంగంలోకి దించారు. రక్షణ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఐడీఎఎస్ దీప్తి మోహిల్ చావ్లా, కోస్టు గార్డు తూర్పు సముద్ర తీరం కమాండర్, అదనపు డైరెక్టర్ జనరల్ డోనీ మైఖెల్ ఈ నౌకకు జెండా ఊపారు. దీనిని దేశ సముద్ర భద్రతా సామర్థ్యాలకు అనుగుణంగా 51 మీటర్ల ఫాస్ట్ పెట్రోల్ నౌకగా స్వదేశీ పరిజ్ఞానంలో తీర్చిదిదిద్దారు. గోవా షిప్ యార్డ్లో ఇది రూపుదిద్దుకుంది. దీనికి అక్షర్ అని నామకరణం చేశారు. ఇది 60 శాతం కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్తో ఆత్మ నిర్భర్ భారత్కు ఉదాహరణగా పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా చొరవతో సముద్ర శక్తిని బలోపేతం చేయడానికి ఇది దోహదకరంగా ప్రకటించారు. ఈ నౌక సుమారు 320 టన్నుల బరువు కలిగి ఉంది. 3000 కే డబ్ల్యూతో రెండు డీజిల్ ఇంజిన్ ద్వారా నడపబడుతుంది. ఇది గరిష్టంగా 27 నాట్స్ వేగాన్ని అందుకుంటుంది.ఇందులో 30 ఎంఎం సీఆర్ఎన్ –91 గన్, 12.7 ఎంఎం స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్డ్ మెషిన్ గన్లు కూడా ఉన్నాయి. ఇది పుదుచ్చేరిలోని కారైక్కాల్ కేంద్రంగా ఉంటుంది. ఈనౌక కమాండెంట్గా శుబేందు చక్రవర్తి నాయకత్వం వహిస్తారు. అలాగే ఐదుగురు అధికారులు 33 మంది సిబ్బంది ఇందులో ఉంటారు. -
పళనికి చిక్కులు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ప్రజా చైతన్య యాత్రకు కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఆయన రోడ్ షోలకు అనుమతులు నిరాకరిస్తూ అనేక జిల్లాల పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. వివరాలు.. తమిళనాడు, తమిళ ప్రజలను రక్షిద్దాం అన్న నినాదంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ప్రజా చైతన్యయాత్రను కొన్ని నెలల క్రితం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన నాలుగో విడత ప్రచారం ముగించి, ఐదో విడత ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ పరిస్థితులలో ఆయన ప్రచారాలకు తాజాగా అనుమతులు రద్దు అవుతున్నాయి. కరూర్ ఘటన నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రహదారులు, పరిసరాలలో ప్రచార సభలకు అనుమతులను హైకోర్టు శుక్రవారం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం పళనికి సైతం చిక్కులను సృష్టిస్తోంది. ఈరోడ్ తిరుచంగోడు, నామక్కల్ కుమార పాళయం, పోతనూరు తదితర ప్రాంతాలలో ఆయన రోడ్ షోలకు ముందుగా నిర్ణయించారు. ఇందులో భాగంగా అనుమతుల కోసం ఆయా జిల్లాల ఎస్పీలను ఆశ్రయించగా, ఇంత వరకు అనుమతి ఇవ్వలేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో అనుమతులు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఇతర ప్రాంతాలను వేదికగా ఎంపిక చేసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు ఎదురు కాని విధంగా స్థలాలను ఎంపిక చేసి దరఖాస్తులు చేసుకోవాలని అన్నాడీఎంకే వర్గాలకు పోలీసులు సూచించడం గమనార్హం. ఈ పరిస్థితులో శనివారం పళణి స్వామి పెన్నగరంలో తన ప్రచార పర్యటనను రైతులు, వివిధ సంఘాలతో సమావేశాల రూపంలో నిర్వహించాల్సి వచ్చింది. -
చైన్నెలో వర్షాల అలర్ట్
సాక్షి, చైన్నె: చైన్నెలో ఈశాన్య రుతు పవానాల సీజన్ ఆరంభంలో భారీ వర్షాలు పడే అవకాశాలతో ముందస్తు చర్యలపై కార్పొరేషన్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. గుంతలు తవ్వకాలకు అనుమతులు రద్దు చేశారు. రోడ్లపై ఎవ్వరైనా గోతులు తవ్విన పక్షంలో కఠిన చర్యలు తప్పదన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. నైరుతీ సీజన్ ముగిసింది. ఇక, ఈశాన్య రుతు పవనాల సీజన్ ప్రారంభం కాబోతున్నది. ఇందుకు శుభ సూచికంగా పశ్చిమ కనుమలలోని కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశిలో శుక్ర వారం రాత్రి, శనివారం భారీ వర్షాలు పడ్డాయి. ఇక్కడ జలపాతాలోకి కొండ కోనల నుంచి నీటి రాక పెరిగింది. తేనిలోనూ వర్షాలు చిరు జల్లులతో మొదలయ్యాయి. మేఘమలైలలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. తేనిసురలి జలపాతంలోకి నీటి ధార పెరిగింది. ఇక వాణియం బాడి, తిరుపత్తూరు ఉపరిసరాలలో అనేకచోట్ల భారీ వర్షం పడింది. వాణియంబాడి ప్రభుత్వ ఆస్పత్రిని వర్షపు నీరు చుట్టుముట్టింది. హోసూరులోనూ భారీ వర్షం పడింది. గడిచిన 24 గంటలలో ఇక్కడ 12 సెం.మీ వర్షం పడింది. రామేశ్వరంలోనూ వర్షం కొన్ని గంటల పాటుగా పడింది. ఇక, చైన్నె శివారులలోరాత్రికాసేపు వర్షం దంచి పెట్టింది. చైన్నె నగరంలోనూ అక్కడక్కడ వర్షం పడింది. ఈశాన్య రుతు పవనాల సీజన్ ఆరంభం కాగానేచైన్నెలో భారీ వర్షాలు పడుతాయన్నది గత అనుభవం. ఈ దృష్ట్యా, ముందస్తుచర్యలను కార్పొరేషన్యంత్రాంగం విస్తృతంచేసింది. లోతట్టు ప్రాంతాలపైదృష్టి పెట్టారు. అలాగే,నగర రోడ్లపై గుంతులు తవ్వేందుకు అనుమతులు రద్దు చేశారు. ఈ సీజన్ ముగిసే వరకు ఎలాంటి గుంతలు తవ్వేందుకు వీలు లేదని కార్పొరేషన్ యంత్రాంగం ప్రకటించింది. అలాగే ఇళ్లలో ఉన్న పనికి రాని వస్తువుల రూపంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదు రు కాకుండా వాటిని ప్రజల నుంచి సేకరించేందుకు ప్రతి శనివారం ప్రత్యేకడ్రైవ్కు సిద్ధమయ్యారు. కాగా చైన్నె సముద్ర తీరంలో శనివారం నుంచి సముద్రంలో అలలు భారీగా ఎగిసిపడుతుండడం గమనార్హం. -
40 ఏళ్ల తర్వాత అడయారుకు విదేశీ పక్షులు
తిరువొత్తియూరు: అడయారు నది ముఖద్వారం వద్ద సుమారు 40 ఏళ్ల తర్వాత సిప్పి పిడిప్పాన్, సాండర్స్ ఆలా వంటి అరుదైన విదేశీ పక్షులు మళ్లీ కనిపించాయి. ఇది చైన్నె తీర ప్రాంత పర్యావరణం మెరుగుపడుతోందనేందుకు ఈ పరిణామం ఓ ముఖ్యమైన సూచనగా పరిగణించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అరుదైన అతిథుల రాకతో పక్షి ప్రేమికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనతో మరో 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు కొరుక్కుపేట: ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, మే 1, 2016న ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద, పేద మహిళలను ఎంపిక చేసి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా గ్యాస్ స్టవ్, డిపాజిట్ మొత్తం, రబ్బరు పైపు, రెగ్యులేటర్ , మొదటి సిలిండర్ ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. సిలిండర్ కొనుగోలుకు సబ్సిడీ కూడా అందిస్తున్నారు. ఈ పథకం కింద తమిళనాడులో 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇప్పటికే అందించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో 25 లక్షల కొత్త ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించాలని నిర్ణయించింది. ఈ అంశంపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ కొత్తగా అందించనున్న 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లలో, ప్రతి రాష్ట్రానికి ఎన్ని కనెక్షన్లు కేటాయిస్తారనే విషయంపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు. మెరీనాలో చిల్డ్రన్స్ పార్కు ఏర్పాటుకు సిద్ధం తిరువొత్తియూరు: పర్యాటకులను ఆకర్షించడానికి అన్నాదురై సమాధి సమీపంలో మెరీనా బీచ్లో బీచ్ను పునరుద్ధరిస్తున్నట్లు, ఇందులో భాగంగా అన్నాసమాధి సమీపంలో 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పిల్లల పార్కు ఏర్పాటు చేయాలని చైన్నె కార్పొరేషన్ భావిస్తున్నట్లు సమాచారం. రూ.64 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ పార్కులో పిల్లల కోసం స్కేటింగ్ రింక్, ఊయల, స్లైడ్ వంటి ఆటలకు సౌకర్యాలు కల్పించనున్నారు. అదేవిధంగా, రూ. కోటి వ్యయంతో పెద్దల కోసం వ్యాయామశాల కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ బీచ్ పునరుద్ధరణతో బీచ్కు వచ్చే ప్రజలు కొంత భాగాన్ని వినోదం, ఆటల సౌకర్యాల వైపు మళ్లించవచ్చు. దీని ద్వారా అక్రమంగా ఏర్పాటు చేసే దుకాణాలు తగ్గుతాయని కార్పొరేషన్ కమిషనర్ కుమరగురుబరన్ తెలిపారు. బీచ్ చుట్టుపక్కల ఉన్న 100కు పైగా అనుమతి లేని దుకాణాలను తొలగించనున్నట్లు, కార్పొరేషన్ తరపున బ్యాడ్మింటన్ కోర్టులు, వ్యాయామం కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మళ్లీ బాంబు బూచిసాక్షి, చైన్నె: బాంబు బూచీలు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వరుసగా వస్తున్న ఈ బెదిరింపు వెనుక ఉన్న అదృశ్య శక్తులను గుర్తించడం సైబర్ క్రైం వర్గాలకు సైతం సవాలుగా మారింది. ఇప్పటికే వరసుగా వచ్చిన బెదిరింపులతో భద్రతను ఆయా ప్రాంతాలలో కట్టుదిట్టంచేశారు. తాజాగా డీఎంకే ఎంపీ కనిమొళి, మాజీ సీఎస్ వైద్యనాథన్, మాజీ డీజీపీ నటరాజ్తోపాటూ ఏడుగురిని టార్గెట్ చేస్తూ వచ్చిన బెదిరింపు మెయిల్తో ఆయా ప్రాంతాలలో శనివారం బాంబ్, డాగ్ స్క్వాడ్లు క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. ఆయా ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రోజుకో బెదిరింపు ఈ మెయిల్స్ వస్తుండటం, వీటిని పంపిస్తున్న వాడు ఐడీలు మారుస్తుండటం వంటి అంశాలతో గుర్తించడం కష్టతరంగా మారినట్టు సైబర్ క్రైం వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీకి అన్నామలై సాక్షి, చైన్నె: బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై హుటాహుటిన శనివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయ న సమావేశం నిమిత్తం ఢిల్లీ వెళ్లినట్టు మద్దతు దారులు పేర్కొంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు నైనార్ నాగేంద్ర, ఇతర నాయకులు ఎవ్వరూ లేకుండా అన్నామలై మాత్రమే ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యతకు దారి తీసింది. అదే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జిల్లాల కార్యదర్శులతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చైన్నెలో సమావేశం కావడం గమనార్హం. అన్నామలై ఢిల్లీ పయనం అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు మేరకు జరుగుతున్నట్టు ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, విజయ్ పార్టీ వర్గాల చుట్టూ బిగుస్తున్న కరూర్ ఘోర ఘటన కేసులు వంటి అంశాలను ఢిల్లీ పెద్దల దృష్టికి అన్నామలై తీసుకెళ్లబోతున్నట్టు పేర్కొంటున్నారు. విజయ్కు అభయం ఇచ్చే విధంగా ఢిల్లీలో వ్యూహ రచన జరగవచ్చు అన్న సంకేతాలు వెలువడ్డాయి. -
బతికుండగానే హెడ్మాస్టర్కు కన్నీటి అంజలి.. అంతలోనే..!
తమిళనాడు: కళ్లకురిచి జిల్లాలోని ఊలుందూరుపేట సమీపంలోని కూంతలూరు గ్రామానికి చెందిన రామదాస్ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా పని చేసి, రిటైర్డ్ అయ్యారు. తమిళనాడు టీచర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. రామదాస్ గత 30వ తేదీన ద్విచక్ర వాహనంపై ఊలుందూరుపేట నుంచి తిరుచ్చి వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొంది. గాయపడ్డ రామదాస్ను పుదుచ్చేరిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించారు. ఈ పరిస్థితిలో గురువారం ఉదయం రామదాస్ మరణించినట్లు అక్కడి నుంచి సమాచారం అందింది. దీంతో బంధువులు, స్నేహితులు,సహ ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో అతని ఫొటోలు పెట్టి కన్నీటి అంజలి ఘటించారు. బ్యానర్లు ఏర్పాటు చేసి ఆటోల్లో మృతి చెందిన విషయాన్ని ప్రచారం చేశారు. ఈస్థితిలో గురువారం రామదాస్ను ఆస్పత్రి నుంచి అంబులెన్స్లో సజీవంగా అతని స్వగ్రామం కూంతలూరుకు కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. దీంతో బంధువులు, స్నేహి తులు సంతోషంతో ఆశ్చర్యపోయారు. ఈక్రమంలో నిన్న మళ్లీ విలుప్పురం ముండియం పాక్కం ప్రభుత్వాస్పత్రిలో చేరిన రామదాస్ గురువారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
దేవదాయశాఖ కార్యాలయం ప్రారంభం
తిరువళ్లూరు: పట్టణంలో ఏర్పాటు చేసిన దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. తిరువళ్లూరుకు ప్రత్యేక జాయింట్ కమిషనర్ను నియమిస్తూ ఆగస్టు 26వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తిరువళ్లూరులో నూతన జాయింట్ కమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని మంత్రి నాజర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు.అనంతరం మంత్రి నాజర్ మాట్లాడుతూ నూతన జేసీ కార్యాలయం ద్వారా తిరువళ్లూరు, పొన్నేరి మీంజూరు, ఊత్తుకోట తదితర ప్రాంతాల్లోతో సహా పలు ప్రాంతాలకు చెందిన ఆలయాల పర్యవేక్షణ తిరువళ్లూరు నుంచే సాగనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్,కృష్ణస్వామి, చంద్రన్, టీజే గోవిందరాజన్, దురైచంద్రశేఖర్, జాయింట్ కమిషనర్లు అనిత, రమణి, డిప్యూటి కమిషనర్ శివజ్ఞానం పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో ట్రక్కులో మంటలు
సేలం: చక్కెర తరలిస్తున్న ట్రక్కులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగాయి. కర్ణాటకలోని మైసూర్ నుంచి 35 టన్నుల చక్కెరతో ట్రక్కు సేలం జిల్లాలోని బర్గూర్ పర్వత రహదారి మీదుగా తంజావూరుకు బయలుదేరింది. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో, తామరైకరై పక్కన ఉన్న పర్వత రహదారి మొదటి హెయిర్పిన్ మలుపు వద్దకు ట్రక్కు చేరుకున్నప్పుడు, ఇంజిన్లో షార్ట్ సక్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ట్రక్కు డ్రైవర్, సహాయకుడు వెంటనే ట్రక్కు నుంచి దిగి నీరు పోసి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఆ దారిన వెళుతున్న వాహనచోదకులు వెంటనే అంతియూర్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. పర్వత ప్రాంతం కావడంతో అగ్నిమాపక వాహనం రావడానికి అరగంట ఆలస్యం అయింది. అప్పటికి ట్రక్కు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపక సిబ్బంది దానిపై నీరు చల్లడం ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే మంటల వేడికి ట్రక్కులోని చక్కెర కరిగి రోడ్డుపైకి ప్రవహించింది. దీంతో పర్వత రహదారిలో ట్రాఫిక్ స్తంభించింది. చక్కెర సిరప్ తొలగించిన తర్వాతే వాహనాల రాకపోకలను అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. -
కోలాహలం సూర సంహారం
పళ్లిపట్టు: నొచ్చిలి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో ప్రధానమైన సూర సంహారం కోలాహలంగా నిర్వహించారు. పళ్లిపట్టు యూనియన్లోని నొచ్చిలిలో గిరిరాజ కన్యకాపరమేశ్వరి సమేత గంగాధరేశ్వరర్ ఆలయంలో నవరాత్రి వేడుకలు గతనెల 22వ తేదీన ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో చివరి రోజైన బుధవారం కన్యకాపరమేశ్వరి అమ్మవారికి మహిషాసురమర్ధని అలంకరణ చేసి ఊరేగింపుగా గ్రామంలోని కృష్ణ భజన మందిరం వద్ద కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. మహిషాసురమర్ధిని అలంకరణలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారు చెట్టును సంహారం చేసే ఘట్టం నిర్వహించారు. ఈసందర్భంగా బాణసంచా వేడుకలు అంబరాన్నంటాయి. వేడుకల ఏర్పాట్లను ఆలయ ధర్మకర్త గిరిరాజు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ నిర్వాహకులు చేశారు. మహిషాసురమర్ధినిగా కన్యకాపరమేశ్వరి, సూర సంహారం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు -
సాయి మందిరంలో ప్రత్యేక పూజలు
తిరుత్తణి: షిరిడీ సాయిబాబా 107వ మహా సమాధి దినోత్సవం సందర్భంగా సాయి మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. తిరుత్తణి సమీపంలోని కేజీ కండ్రిగలోని దత్తసాయి అవతార దివ్యక్షేత్రంలో షిరిడీ సాయి బాబా ఆలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. వేకువజామున బాబాకు అభిషేక పూజలు చేశారు. మధ్యాహ్నం గణపతి హోమం, సహస్రనామం, క్షీరాభిషేకం నిర్వహించారు. తిరుత్తణి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, బాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం భక్తులందరికీ అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ చైర్మన్ సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వేడుకలు నిర్వహించారు. -
తెలుగు లోగిళ్లలో దసరా కోలాహలం
కొరుక్కుపేట: రాష్ట్ర వ్యాప్తంగా దసరా వేడుకలను కో లాహలంగా జరుపుకున్నారు. అన్నింటా విజయాలు లభించాలని భక్తులు ఆలయాల్లో పూజలు చేసి, దేవతలను దర్శించుకున్నారు. చైన్నెలోని తెలుగు లోగిళ్లులో దసరా పండుగను వైభవంగా జరుపుకున్నా రు. ఆలయాల్లో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో.. చైన్నె జార్జిటౌన్లోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం సింహవాహనంపై మహిషాసుర మర్ధిని అలంకారంలో వాసవీ అమ్మవారికి పూజలను చేశారు. రాత్రి అమ్మ వారి పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఎస్కేపీడీ ఆలయ ట్రస్టీలు కుటుంబ సమేతంగా పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు. సరస్వతి ఆలయంలో.. చైన్నె పెరియపాళయం సమీపంలోని ఆర్యపాక్కంలో ఉన్న విద్యారంభ జ్ఞాన మహాసరస్వతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగా యి. గురువారం విజయదశమి సందర్శంగా ఆలయంలో అక్షరాభ్యా స మహోత్సవం భక్తిశ్రద్ధలతో చేశా రు. ఆలయ ధర్మకర్త పీవీ కృష్ణారావు సారథ్యంలో వేడుకల్లో వేదపండితులు చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఆకట్టుకున్న బొమ్మల కొలువు తెలుగు కుంటుంబానికి చెందిన తోటా బానూజీ, ధరణిలు ఏర్పాటు చేసిన బొమ్మలకొలువు ఆకట్టుకుంటున్నారు . ఈ వేడుకల్లో తెలుగు వెలుగుసంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ పాల్గొన్నారు. భానూ జీ దంపతులను అభినందిస్తూ సత్కరించారు. అలరించిన కిడాంబి సంగీత విభావరి చైన్నె మైలాపూర్లోని ఆదికేశవపెరుమాళ్ ఆలయంలో నవరాత్రి సందర్భంగా మైలై పూంబావై సభ తరఫున భక్తి సంగీత విభావరి నిర్వహించారు. ఇందులో తెలుగు సంగీత గాయకులు కిడాంబి లక్ష్మీకాంతం పాల్గొని, భక్తిగీతాలు ఆలపించారు. అన్నమాచార్య కీర్తనలు, జయదేవ అష్టపదులు, మరిన్ని తమిళ గీతాలు వినిపించి అందరి మన్నలను అందుకున్నారు. సభ తరపున కిడాంబిని సత్కరించారు.వాయిద్య సహ కారం తబలాపై సాలూరి వెంకటరావు, కీ బోర్డుపై శివకుమార్ సహకరించారు. కన్యకాపరమేశ్వరిలో పార్వేట ఉత్సవంలో ఆలయ ధర్మకర్త, ట్రస్టీలు, సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం -
క్లుప్తంగా
34 శాతం వార్షిక వృద్ధి సాక్షి, చైన్నె: సెప్టెంబర్ 2024తో పోల్చితే 34 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశామని జేఎండబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించింది. సెప్టెంబర్లో సాగిన ఎలక్ట్రిక్ వా హనాల విక్రయాలను గురించి శుక్రవారం స్థానికంగా ప్రకటించారు. సెప్టెంబర్లో 6,728 యూనిట్ల విక్రయాలు జరిగినట్టు, విండ్సర్ బలమైన పనితీరు కొనసాగుతున్నట్టు వివరించారు. ఎంజీ కామెట్, ది స్ట్రీట్ స్మార్ట్ కార్, సీవై 25కి అత్యుత్తమ అమ్మకాలను నమోదు చేసిందన్నారు. లగ్జరీ ఈవీ విభాగంలో రెండో అతి పెద్ద బ్రాండ్గా ఉన్న ఎంజీ సెలెక్ట్ అవతరించిందని, పండుగ డిమాండ్ పెరగడం, జీఎస్టీ తగ్గింపు కారణంగా విక్రయాలు పెరిగాయని ప్రకటించారు. స్కూటర్ల ఢీ.. ఇద్దరి మృతి తిరువొత్తియూరు: రెండు స్కూటర్లు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈరోడ్ జిల్లా సత్యమంగళం సమీపంలోని చెన్పగపుదూర్, మేటూర్, ఊర్ నాయక్కన్ వీధికి చెందిన రాజశేఖర్ భార్య సింధు (28) శుక్రవారం ఉదయం స్కూటర్లో బజారుకు బయలుదేరారు. అదే ప్రాంతానికి చెందిన శశి తన తల్లి పళనియమ్మాల్ (60)తో కలిసి స్కూటర్లో బయటకు బయలుదేరారు. అంబేడ్కర్నగర్ మేటూర్ రోడ్డు లోని యువరాజ్ గార్డెన్ సమీపంలోని మలు పు వద్ద రెండు స్కూటర్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సింధు, పళనియమ్మాల్ తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ముగిసిన డ్రోన్ పైలటింగ్, నిర్వహణ కోర్సు కొరుక్కుపేట: చైన్నెలోని ఎంఐటీక్యాంపస్ – అన్నావిశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఏరోస్పెస్ రీసెర్చ్ (సీఏఎస్ఆర్) ఆధ్వర్యంలో జూ నియర్ కమిషన్ ఆఫీసర్లు, ఇతర ర్యాంకుల కోసం డైరెక్టరేట్ జనరల్ రీసెట్మెంట్ (డిజిఆర్) సహకారంతో చేపట్టిన మొదటి బ్యాచ్ డ్రోన్ పైలటింగ్, నిర్వహణ శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎంఐటీ డీన్ డాక్టర్ జయశ్రీ , సీఏఎస్ఆర్ డైరెక్టర్ డాక్టర్ కె సెంథిల్ కుమార్ పాల్గొన్నారు. ముఖ్యఅతిథి అజయ్కుమార్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బ్యాడ్జీలు, సర్టిఫికెట్లను బహూకరించారు. ఆపరేషన్ హెడ్ వింగ్ కమాండర్ కెఆర్ శ్రీకాంత్ (రిటైర్డ్) తదితరులు పాల్గొన్నారు. చీరకు నిప్పంటుకుని వృద్ధురాలి మృతి అన్నానగర్: చీరకు నిప్పంటుకుని ఓ వృద్ధురాలు మృతి చెందింది. చెంగల్పట్టు జిల్లా మరైమలైనగర్ సమీపం గాంధీనగర్కు చెందిన ముత్తమ్మాల్ (85). ఈమె శుక్రవారం ఉదయం ఇంటి మూడో అంతస్తులో కట్టెల పొయ్యిలో నీటిని వేడి చేస్తోంది. ఆ సమయంలో చీరకు మంటలు అంటుకున్నాయి. ఆమె కేకలు విని ఇరుగుపొరుగు మంటలను ఆర్పారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన ముత్తమ్మాల్ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసి మరైమలైనగర్ పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి కేసులో నలుగురి అరెస్ట్ తిరువొత్తియూరు: గంజాయి కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. చైన్నెలోని కన్నగినగర్లోని శ్మశానవాటిక సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు కందగనగర్ పోలీసులకు సమాచారం అందింది. సీఐ నటరాజ్ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారి బ్యాగులను తనిఖీ చేశారు. తనిఖీల్లో 2 కిలోల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వారు కణ్ణగినగర్కు చెందిన తమిళరసన్ (34), ప్రభాకరన్ (30), దినేష్ (27), మహారాజా (32) అని, వీరు ఆంధ్రా సహా వివిధ ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేసి, కణ్ణగినగరంలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు నలుగురిని అరెస్టు చేసి వారిని కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. లైంగిక దాడి కేసులో వ్యక్తి అరెస్టు అన్నానగర్: మధురవోయల్ ప్రాంతానికి చెందిన మహిళపై లైంగిక దాడి చేసిన, వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె విరుగమ్బాక్కంలోని వెంకటేశ్వర నగర్లో నివసిస్తున్న హర్షవర్ధన్ (25) ఓ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్న సమయంలో సహవిద్యార్థినితో స్నే హం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ 2019 నుంచి ప్రేమించుకుంటు న్నారు. ఆ మహిళ తన చదువు పూర్తి చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. హర్షవర్ధన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుసార్లు ఆమైపె లైంగిక దాడి చేశాడు. అనంతరం హర్షవర్ధన్ తన ప్రియురాలిని కలవకుండా త ప్పించుకుని, ఆమె సెల్ఫోన్ను డిస్కనెక్ట్ చేశా డు. దీంతో షాక్కు గురైన బాధితురాలు అతడి ని కలిసి మాట్లాడగా ఆమెను చంపేస్తానని బెదిరించి, అనుచిత పదాలు వాడాడు. ఆ యువతి మధురవోయల్లోని ఆల్ మహిళా పోలీసుస్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ జరిపి శుక్రవారం హర్షవర్ధన్ను అరెస్టు చేశారు. -
తాగునీటి కోసం ఆందోళన
తిరుత్తణి: తాగునీటి కోసం మహిళలు రాస్తారోకో చేశారు. తిరువలంగాడు యూనియన్లోని తాళవేడు పంచాయతీలోని అరుంధతీ కాలనీలో 30 కుటుంబాలు నివాసమున్నాయి. పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామీణులకు తాగునీరు సరఫరా చేసేవారు. అయితే రెండు నెలలుగా రెండు కిలో మీటర్ల దూరంలోని తాళవేడు పంట పొలాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తుండడంతో అరుంధతీకాలనీ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం పంచాయతీ సిబ్బందికి పలుసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో ఆగ్రహం చెందిన మహిళలు 30 మంది ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. నల్లాట్టూరు రోడ్డులో బైఠాయించి, నిరసన తెలిపారు. గంట పాటు మహిళలు ఆందోళన చేసినా అధికారులు రాకపోవడంతో మహిళలు నిరాశతో వెనుతిరిగారు. -
భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం
తిరుత్తణి: పట్టణంలోని వనదుర్గాదేవి ఆలయంలో గురువారం రాత్రి అగ్నిగుండ ప్రవేశం ఘనంగా నిర్వహించారు. 500 మందికి పైగా భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుత్తణిలోని వనదుర్గాదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు 22న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా 11వ రోజు గురువారం అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు కంకణాలు ధరించి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అగ్ని గుండానికి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి, అమ్మవారు పుష్పలంకరణలో అగ్నిగుండం ముందు కొలువుదీరగా, అశేష భక్తజనం నడుమ భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి, మొక్కులు చెల్లించారు. అగ్నిగుండ ప్రవేశం చేస్తున్న భక్తులు, విశేషాలంకరణలో వనదుర్గాదేవి -
ఘనంగా ధ్వజారోహణం
– పురటాసి పండుగ ప్రారంభం –12వ తేదీన రథోత్సవం కొరుక్కుపేట: మనలి పుదునగర్లోని అయ్య వైకుంఠ ధర్మపతి ఆలయంలో శుక్రవారం ధ్వజారోహణంతో పురటాసి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పూలతో అలంకరించిన పవిత్ర జెండాను మోసుకెళ్లిన భక్తులు అయ్యల హరోహర శివ నామాన్ని జపిస్తూ, పాఠశాల హాలు చుట్టూ 5 సార్లు ప్రదక్షిణ చేసి, ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జెండా ఎగురవేశారు. పండుగ రోజుల్లో, అయ్యవారి పాగలం పఠనం జరుగుతుంది. ప్రతి రోజు సాయంత్రం ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ నెల 12 న రథోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వహకులు వెల్లడించారు. యువకుడి అరెస్టు తిరువొత్తియూరు: యువతిని మోసం చేసిన కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె ముఖప్పేర్ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువతి ఇస్ట్రాగామ్ ద్వారా ఆదిత్యన్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. అతను ఆ యువతికి మాయ మాటలు చెప్పి, తాను నిన్ను ప్రేమిస్తున్నానని, ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన ఆ యువతి, ఆదిత్యన్తో వివాహేతర సంబంధం నడిపింది. ఈ పరిస్థితిలో ఇరు కుటుంబాల అంగీకారంతో ఆ యువతి, ఆదిత్యన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాబోయే డిసెంబర్ ఒకటో తేదీ వివాహం జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, గత నెలలో ఆదిత్యన్ తల్లిదండ్రులు 50 సవర్ల బంగారు నగలు కట్నంగా అడిగారు. ఈ విషయం గురించి ఆ యువతి తన తల్లిదండ్రులతో కలిసి ప్రస్తుతం 50 సవర్లు ఇవ్వలేమని చెప్పడం కోసం ఆదిత్యన్ ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆదిత్యన్, అతని తల్లిదండ్రులు అసభ్యకరమైన మాటలతో మాట్లాడి, పెళ్లి చేసుకోడానికి నిరాకరించారు. ఈ విషయం గురించి యువతి తిరుమంగళం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆదిత్యన్ ను అరెస్టు చేశారు. మౌలిక వసతుల కోసం రాస్తారోకోతిరువళ్లూరు: కాకలూరులోని నాలుగో వార్డులో మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు రాస్తారోకో చేపట్టారు. దీంతో దాదాపు గంట పాటు ట్రాపిక్కు అంతరాయం కలిగింది. తిరువళ్లూరు జిల్లా కాకలూరు పంచాయతీ పరిధిలోని 4వ వార్డులో సుమారు 500 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు, వీధిఽ దీపాలు, మురికి నీటి కాలువ, తాగునీటి కొళాయి తదితర వసతులు కల్పించాలని పలుసార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన నాలుగో వార్డు వాసులు రోడ్డురోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు, పంచాయతీ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. మౌలిక సదుపాయాలను కల్పించే విషయంపై ఉన్నతాఽధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఇచ్చిన హమీ మేరకు ఆందోళన విరమించారు. -
అందరికీ ఐఐటీఎం నినాదం
కొరుక్కుపేట: అందరికీ ఐఐటీఎం అనే నినాదంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు ముందుకెళుతున్నట్టు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి అన్నారు. ఐఐటీ మద్రాసులోని ఐఐటీ మద్రాసు శాస్త్ర మ్యాగజైన్ ద్వారా భారతదేశం అంతటా ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థులకు క్యూరేటెడ్ శిక్షణ కార్యక్రమంతో సన్నద్ధం చేయడానికి జాతీయ ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్ శిక్షణ అండ్ మూల్యాంకనం(నిప్టా)ను అందుబాటులోకి తెచ్చారు. దీనిని ఐఐటీ మద్రాసు క్యాంపస్లో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతులమీదుగా నిప్టాను ప్రారంభించారు. కామకోటి మాట్లాడుతూ విద్యార్థులు ఇంటర్న్షిప్ తీసుకుని రావడానికి, వివిధ సంస్థల్లో నియామకాలు తీసుకోవడానికి నిప్టా దోహదపడుతుందని అన్నారు. ఐఐటీఎం శాస్త్ర మ్యాగజైన్ ఎడిటోరియల్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ శ్రీకాంత్ వేదాంతం పాల్గొన్నారు. -
తగ్గని బాంబు బూచీలు
– సీఎం, నటి త్రిష ఇంటికి బెదిరింపు సాక్షి, చైన్నె : బాంబు బూచీలు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. శుక్రవారం సీఎం స్టాలిన్, నటి త్రిషతో పాటు పలువురి ఇళ్లల్లో బాంబులు పేలుతాయంటూ బెదిరింపుల మెయిల్స్ రావడం కలకలం రేపింది. ఇటీవల కాలంగా కంట్రోల్ రూమ్కు ఫోన్కాల్ లేదా ఈ మెయిల్ బెదిరింపు రావడంతో పోలీసులు పరుగులు తీయడం పరిపాటిగా మారింది. ఇన్నాళ్లు చైన్నె విమానాశ్రయం, చైన్నెలోని విద్యా సంస్థలకు అధికంగా బాంబు బెదిరింపులు వచ్చేవి. ఈ పరిస్థితుల్లో గత పది రోజులుగా అధికారులు, రాజకీయనాయకుల పేరిట సైతం బాంబు బూచీలు పెరిగాయి. పంజాబ్ సీఎం భగవంత్మాన్, డిప్యూటీ సీఎం స్టాలిన్ పేర్లతో సైతం హెచ్చరికల ఫోన్కాల్స్ వచ్చాయి. ఇక, సీఎం స్టాలిన్ నివాసానికి సైతం ఓ వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరికలు చేయడం, అతడిని పోలీసులు గురిపెట్టడం జరిగాయి. మదురైలో ఐటీ మంత్రి పళణివేల్ త్యాగరాజన్ను టార్గెట్ చేసినట్టుగా కూడా బెదిరింపులు గత రెండు, మూడు రోజులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం ఏకంగా పది చోట్ల బాంబులు ఉన్నట్టుగా వచ్చిన బెదిరింపు చైన్నె పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేశాయి. తేనాంపేటలోని ఆడిట్ జనరల్ కార్యాలయానికి వచ్చిన బెదిరింపు మెయిల్తో పోలీసులు పరుగులు తీశారు. చైన్నెలో మొత్తం పది చోట్ల బాంబులు ఉన్నట్టుగా వచ్చిన హెచ్చరికలతో పోలీసులు ఆయా ప్రాంతాలకు వెళ్లి సోదాలు నిర్వహించి బూచీగా తేల్చారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సైతం బాంబులు ఉన్నట్టుగా కంట్రోల్ రూమ్కు వచ్చిన బెదిరింపుతో అక్కడ కూడా సోదాలు చేశారు. తాజాగా సీఎం స్టాలిన్ నివాసం, పరిసరాల్లో బాంబులు పెట్టినట్టుగా, నటి త్రిష ఇంట్లోనూ బాంబు పెట్టినట్టుగా వచ్చిన బెదిరింపు మెయిల్తో ఉదయాన్నే పోలీసులు పరుగులు తీశారు. అన్నిచోట్ల క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఇది బెదిరింపు బూచీ అని తేల్చారు. అయితే, ఈ బూచీలు ఇస్తున్న వారెవ్వరో అన్నది తేలడం లేదు. వీరిని గుర్తించేందుకు సైబర్ క్రైం వర్గాలు తీవ్రంగా కుస్తీ పడుతున్నాయి. సీఎం, త్రిష ఇంటి పరిసరాలలో తనిఖీలు ముగియగానే, విమానాశ్రయంలో బాంబులు ఉన్నట్టు వచ్చిన సమాచారంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. -
ఎన్ఎల్సీ సీఎండీకి అవార్డు
సాక్షి, చైన్నె : తమిళనాడులోని కడలూరు జిల్లా నైవేలిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎల్సీ ఇండియా సీఎండీ ప్రసన్నకుమార్ మోటుపల్లిని మహాత్మా అవార్డు వరించింది. వ్యాపారం, స్థిరత్వంసామాజిక ప్రభావంలో నాయకత్వం, వ్యక్తిగత విభాగంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు–2025ను ఢిల్లీలో ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో రిటైర్ట్ మహిళా ఐపీఎస్ అధికారి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీతోపాటు ఇతర ప్రముఖులు ఈ జీవిత సాఫల్య సాధన, వ్యాపార నాయకత్వ అవార్డును ప్రసన్నకుమార్కు ప్రదానం చేశారు. మహాత్మా అవార్డును ప్రముఖ సీఎస్ఆర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గడించిన అమిత్ సచ్దేవా–2016లో ఆదిత్య బిర్లా గ్రూప్ మద్దతుతో స్థాపించారు. సమాజ మార్పనకు కృషి చేసే వారిని, సంస్థలకు ప్రదానం చేసే ఈ అవార్డు ప్రపంచంలోనే అత్యున్నత గౌరవాల్లో ఒకటిగా గుర్తించబడింది. జాతిపిత గాంధీ గౌరవార్థం ఈ అవార్డు సత్యంఅహింస, సామాజిక న్యాయం, సమానత్వం, కరుణ, స్థిరత్వం అనే విలువలను ప్రతిబింబిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన సంస్థలు సహా 500 మందిని ఇప్పటివరకు ఈ అవార్డుతో సత్కరించారు. 2025 మహాత్మా అవార్డుకు జ్యూరీ మూల్యాంకన ప్రక్రియ మేరకు మోటుపల్లిని ఎంపిక చేశారు. ఎన్ఎల్సీ ఇండియా స్థిరమైన, సమగ్ర వృద్ధి వైపు నడిపించడంలో ఆయన దార్శనిక నాయకత్వానికి ఈ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న ప్రసన్నకుమార్ మాట్లాడుతూ మహాత్మా అవార్డు తనకు దక్కడం ఎంతో గౌరవంగా పేర్కొన్నారు. ఈ గుర్తింపు ఎన్ఎల్సీ ఇండియా బృందానికి చెందుతుందన్నారు. -
ఎందుకీ వివక్ష!
సాక్షి, చైన్నె: తమిళనాడు, తమిళ ప్రజలు భారత దేశంలో లేదా వీరు భారతీయులు కారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రామనాథపురంలో ప్రగతి పనులకు శుక్రవారం సీఎం స్టాలిన్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం రామనాథపురంలో పర్యటించారు. ఇక్కడ జరిగిన ప్రభుత్వ కార్యాలయంలో రూ.176 కోట్లతో పూర్తి చేసిన పనులు, రూ.132 కోట్లతో చేపట్టనున్న పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ.426 కోట్ల 83 లక్షలతో 50,752 మంది లబ్ధిదారులకు సంక్షేమాలు అందించారు. మంత్రులు కె.కె.ఎస్.ఎస్.ఆర్. రామచంద్రన్, మంత్రి తంగం తెన్నరసు, కేఆర్.పెరియకరుప్పన్, ఆర్.ఎస్. రాజకన్నప్పన్, పార్లమెంటు సభ్యుడు నవాజ్ఖని, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కేంద్రంతో ఒరిగిందేమీ లేదు శ్రీలంక నౌకాదళం దాడిలో ముందుగా గాయపడేది ఇక్కడి జాలర్లే అని ఆవేదన వ్యక్తం చేస్తూ, వీరిని రక్షించేందుకు, భద్రత కల్పించే విధంగా చర్యలకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. పదే పదే తాము విజ్ఞప్తి చేస్తున్నా, కచ్చదీవుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. తమిళనాడు భారతదేశంలో లేదా, తమిళ జాలర్లు భారతీయులు కాదా? అని ఈసందర్భంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమిళులపై బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు అంత కోపం, వివక్ష అని మండిపడ్డారు. కేంద్రం నిర్ణయాలు, విధానాల రూపంలో జీఎస్టీ రూపంలో పన్నులను కోల్పోయామని, ఇందులోనూ వాటాగానీ, ఇతర పథకాలకు నిధులు గానీ సక్రమంలో ఇవ్వడం లేన్నారు. తమిళనాడును కేంద్రంలోని బీజేపీ పాలకులే కాదు, ఇక్కడి ఆ పార్టీ నాయకులు సైతం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల కాలంలో తమిళనాడు మూడు ప్రధాన విపత్తులను ఎదుర్కొందని, వేలాదిమంది ప్రజలు అష్టకష్టాలు పడ్డారని వివరించారు. అప్పుడు తమిళనాడుకు రాని కేంద్ర ఆర్థిక మంత్రి, ఇప్పుడు కరూర్ ఘటనకు పరామర్శ అంటూ పరుగులు తీశారని విమర్శించారు. మణిపూర్ అల్లర్లు,గుజరాత్ ప్రమాదాలు, కుంభమేళాలో జరిగిన ఘటనల గురించి నిజనిర్ధారణ కమిటీ వేయని ఈ బీజేపీ వాళ్లు, ఇప్పుడు ఓ కమిటీ వేయడం, వాళ్లు కరూర్కు వచ్చి వెళ్లడం వంటి అంశాలను ప్రజలు గుర్తించాలని సూచించారు. బీజేపీ రాష్ట్రాల రాష్ట్రాల హక్కులను లాగేసుకోవడం ధ్యేయంగా ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న అన్నాడీఎంకే బీజేపీకి బానిసగా ఈ రాష్ట్రంలో మారిందని, ప్రజాప్రయోజనాలను విస్మరించి, స్వప్ర యోజనాల కోసం ఆ పార్టీ వర్గాలు పరుగులు తీస్తున్నారని విమర్శించారు. వీరి రాజకీయ కుట్రలను తిప్పికొట్టి, తమిళనాడును, తమిళ ప్రజలను రక్షించడమే ధ్యేయంగా తాను ముందు నిలబడతానని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ద్రవిడ మోడల్ పాలన కొనసాగుతుందని, 2.ఓ పాలన విభిన్నంగా ఉంటుందన్నారు. అనంతరం ీస్టాలిన్ కీలడికి వెళ్లారు. అక్కడ పురావస్తు తవ్వకాలను పరిశీలించారు. ఎగ్జిబిషన్ను సందర్శించారు. సామరస్యం రాజ్యమేలే భూమి సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఎంతో సుందరంగా కనిపించే రామనాథపురం సముద్ర తీరం గురించి ప్ర స్తావించారు. అన్ని మతాలు, వర్గాల ప్రజల సామ రస్యం రాజ్యమేలే భూమి ఇది అని వ్యాఖ్యానించారు. రామనాథపురంలో రూ.616 కోట్లతో కావేరి ఉమ్మడి తాగునీటి ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చామన్నారు. రామనాథపురం బస్టాండ్, తంగచ్చి మఠం ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల భవనం, కోవిలాంగులంలో, పరమకుడిలో సామాజిక న్యాయ హాస్టల్ ప్రారంభించామన్నారు. రామనాథపురంలో చేపట్టనున్న తొమ్మిది కొత్త ప్రాజెక్టులకు సంబంఽధించి ప్రత్యేక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్ట్లు త్వరలో అమల్లోకి వస్తాయన్నారు. -
సిట్కు కరూర్ ఘోరం
సాక్షి, చైన్నె: కరూర్ ఘోర ఘటనను ప్రత్యేక సిట్కు అప్పగిస్తూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నార్త్ జోన్ ఐజీ అష్రాకార్గ్ ఐపీఎస్ను విచారణ అధికారిగా నియమించారు. కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని దాఖలైన పిటిషన్లు అన్నీ తిరస్కరణకు గురయ్యాయి. టీవీకే నేతలు భుస్సీఆనంద్, నిర్మల్కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరించబడడంతో వారిని అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. కరూర్లో తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ ప్రచార సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈకేసును కరూర్ పోలీసులు విచారిస్తున్నారు. అదేసమయంలో మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో టీవీకేతో పాటు పలువురు ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని కోరుతూ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్లు వేశారు. తొమ్మిది పిటిషన్లు దాఖలైనట్టు సమాచారం. ఈ పిటిషన్లపై మదురై ధర్మాసనం బెంచ్ న్యాయమూర్తులు విచారణ జరిపారు. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఎలా సీబీఐ విచారణను కోరుతారని పిటిషనర్లను న్యాయమూర్తులు కోరారు. కేసు విచారణలో సంతృప్తి లేనప్పుడు సీబీఐ విచారణకు ఆశ్రయించవచ్చని, కేసే ప్రాథమిక దశలో ఉండడాన్ని పరిగణిస్తున్నామని ప్రకటించారు. అదే సమయంలో పిటిషన్లు దాఖలు చేసిన వారు బాధితులా అని ప్రశ్నిస్తూ ఒక్కసారి బాధిత కుటుంబాలను చూడండి అని వ్యాఖ్యలు చేశారు. కేసును సీబీఐ విచారణకు కోరుతూ దాఖలైన పిటిషన్లన్నీ తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. అదే సమయంలో టీవీకే నేతలు భుస్సీ ఆనంద్, నిర్మల్కుమార్ల ముందుస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. ఈ సమయంలో కరూర్ ఘటన ప్రమాదం అంటూ భుస్సీఆనంద్ తరఫు న్యాయవాదులు వాదన వినిపించడం గమనార్హం. వాదనల అనంతరం తీర్పును న్యాయమూర్తులు రిజర్వులో పెట్టారు. మధ్యాహ్నం తర్వాత వీరికి ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ, పిటిషన్లు తిరస్కరించారు. అలాగే, నామక్కల్ టీవీకే జిల్లా కార్యదర్శి సతీష్కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా తిరస్కరించారు. దీంతో భుస్సీఆనంద్, నిర్మల్కుమార్లను అరెస్టు చేయడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మదురై ధర్మాసనంలో సాగిన పిటిషన్ల వాదనల సమయంలో న్యాయమూర్తులు తీవ్రంగానే స్పందించారు. కోర్టును రాజకీయ వేదికగా మార్చకండి అని హితవు పలికారు. విచారణ అధికారిగా అష్రాకార్గ్ సిట్కు అప్పగింత సభలు, సమావేశాల నిర్వహణకు వేదికల ఎంపికకు మార్గదర్శకాలను రూపకల్పన చేయాలని దాఖలైన పిటిషన్ను కోర్టు పరిగణించింది. న్యాయమూర్తులు స్పందిస్తూ, కరూర్ ఘటనపై విజయ్ పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టు కనిపించడం లేదన్న అసంతృప్తిని జడ్జిలు వ్యక్తం చేశారు. ఘటన తర్వాత టీవీకే నిర్వాహకులు అంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్టుందని అసహనం వ్యక్తం చేశారు. అలాగే, జాతీయ, రాష్ట్ర రహదారుల్లో, ఆ పరిసరాలలో రాజకీయపక్షాల బహిరంగ సభలు, సమావేశాలు, మహానాడుకు అనుమతి ఇవ్వకూడదని ఆదేశించారు. ప్రస్తుతం ఎవరైనా అనుమతి పొంది ఉంటే జరుపుకోవచ్చని, ఇక అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అలాగే, సభలు, సమావేశాలు, మహానాడుల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. చివరకుగా ఈ కేసును సిట్కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నార్త్ జోన్ ఐజీ అష్రాకార్గ్ను విచారణ అధికారిగా నియమించారు. ఆయనకు కేసుకు సంబంఽధించిన సమగ్ర వివరాలను సమర్పించాలని కరూర్ పోలీసులను కోర్టు ఆదేశించింది. అలాగే, టీవీకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున వివాదాస్పద ట్విట్ గురించి సైతం కేసు విచారణకు వచ్చింది. ఆయన ట్వీట్ను పరిగణించిన కోర్టు ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం గమనార్హం. చట్టపూర్వక చర్యలు తీసుకోవచ్చని కోర్టు ఆదేశించడంతో ఆదవ్ను సైతం అరెస్టు చేయడానికి పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. -
కరూర్ తొక్కిసలాటపై హైకోర్టు ఆగ్రహం..‘విజయ్లో నాయకత్వ లక్షణాలు లేవు’
సాక్షి,చెన్నై: సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై తమిళనాడు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్పై కోర్టు విమర్శలు గుప్పించింది. శుక్రవారం (సెప్టెంబర్ 03) కరూర్ తొక్కిసలాటపై విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా ‘విజయ్ మీకు నాయకత్వ లక్షణాలు లేవు.. ఉంటే ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయేవారు కాదు.‘41 మంది చనిపోతే కోర్టు కళ్లు మూసుకోదు. ఈవెంట్ నిర్వాహకులపై సానుభూతి ఎందుకు చూపించాలి?’అని ప్రశ్నించింది. బాధితుల పట్ల కనీస పచ్చాత్తాపం కూడా వ్యక్తం చేయని విజయ్ మానసిక స్థితిని ఇది ప్రతిబింబిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్ ఐజీ ఆస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ విచారణకు ఆదేశించింది.ఈ సందర్భంగా టీవీకే నేతలందరూ ఘటన తర్వాత ఎక్కడికి వెళ్లారు?. బాధితులను ఎందుకు పట్టించుకోలేదు?. విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు? అని మండిపడింది. అనంతరం, టీవీకే నేతల ముందస్తు బెయిల్పై తీర్పును రిజర్వ్ చేసింది. తొక్కిసలాట ఘటన కేసును సీబీఐకి అప్పగించాలని టీవీకే విజ్ఞప్తిని తోసిపుచ్చింది. pic.twitter.com/FipkqoLlmB— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025 -
కరూర్ ఘటన: విజయ్ టీవీకేపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళగ వెట్రి కళగం పార్టీపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ఆ పార్టీ వేసిన పిటిషన్ను కొట్టిపారేసింది. దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉన్నందున అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.‘‘ప్రారంభ దశలోనే సీబీఐకి బదిలీ చేయాలని కోరితే ఎలా?. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుతో సంతృప్తి కలగనప్పుడు కోర్టును ఆశ్రయించండి. అసలు పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు తాగు నీరు, ఆహారం సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయారు?.. దయచేసి న్యాయస్థానాలను రాజకీయ వేదికలుగా మార్చొద్దు’’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్ను కొట్టేసింది. మరోవైపు.. రాజకీయ ర్యాలీలు, సభల విషయంలో అనుమతులు ఎలా జారీ చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందించిన ప్రభుత్వ లాయర్.. ఈ విషయమై అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్పష్టమైన నియమాలు ప్రభుత్వం రూపొందిస్తుందని, అప్పటిదాకా ఎలాంటి రాజకీయ ర్యాలీలకు అనుమతి ఇవ్వబోదని తెలిపారు. అలాగే.. రోడ్డుపై సభకు ఎలా అనుమతి ఇచ్చారని పోలీసులను హైకోర్టు నిలదీసింది. దీంతో వివరణకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరడంతో అంగీకరించింది. మరోవైపు.. బాధితులకు పరిహారం పెంపు పిటిషన్కు రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో కుట్ర కోణం ఉందని.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని టీవీకే ఓ పిటిషన్ వేసింది. అలాగే తమ కార్యదర్శులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ వేసింది. ఈ రెండింటితో పాటు కరూర్కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్, మరో నాలుగు వేర్వేరు పిటిషన్లు.. మొత్తం ఏడింటిని కలిపి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విచారణ చేపట్టింది. -
తమిళనాడులో బాంబు బెదిరింపు కలకలం.. స్టాలిన్, గవర్నర్, త్రిషా సహా..
చెన్నై: తమిళనాడులో(Tamil Nadu) మరోసారి బాంబు బెదిరింపుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నివాసం, గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi)భవనం, సినీనటి త్రిష(Trisha) నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి శుక్రవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బాంబు స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Tamil Nadu CM MK Stalin and TN Governor gets bomb threat.@PramodMadhav6 with more details.#TamilNadu #FirstUp | @AishPaliwal pic.twitter.com/526VQAqbIT— IndiaToday (@IndiaToday) October 3, 2025 -
పండుగ పూట ఘోర ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
చెన్నై: దసరా పండుగ పూట తమిళనాడులో(Tamil nadu) విషాదకర ఘటన చోటుచేసుకుంది. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road Accident) ముగ్గురు యువకులు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు ీతీవ్రంగా గాయపడటంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. పండుగ సందర్భంగా ఐదుగురు యువకులు చెన్నై(Chennai) నుంచి మున్నార్కు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో వారంతా ఓ కారులో గురువారం తెల్లవారుజామున ట్రిప్కు బయలుదేరారు. కారు విల్లుపురం వద్దకు రాగానే విక్రవాండి దగ్గర అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. దీంతో, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం సమయంలో కారు నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. -
కరూర్ తొక్కిసలాట.. టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం
సాక్షి, చెన్నై: కరూర్ ర్యాలీ దుర్ఘటనతో సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గత శనివారం సాయంత్రం తమిళనాడులోని కరూర్లో విజయ్ నిర్వహించిన మీట్ ద పీపుల్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విజయ్పై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తొక్కిసలాట దుర్ఘటనలో టీవీకే పార్టీకి చెందిన పలువురు నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విజయ్ సైతం కరూర్ బాధిత కుటుంబాల్ని పరామర్శిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో బుధవారం (అక్టోబర్1)విజయ్ తన టీవీకే పార్టీ రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారాన్ని రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు టీవీకే తన అధికారిక ‘ఎక్స్’ ట్వీట్ చేసింది. ‘మా ప్రియమైన వారిని కోల్పోయినందుకు మేము బాధలో ఉన్నాం. ఈ పరిస్థితిలో రాబోయే రెండు వారాల పాటు టీవీకే బహిరంగ సభలను తాత్కాలికంగా వాయిదా వేస్తుంది’అని ట్వీట్లో పేర్కొంది. పార్టీ అధినేత విజయ్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో పార్టీ భవిష్యత్ కార్యచరణకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తాం’అని తెలిపింది. pic.twitter.com/FipkqoLlmB— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025 -
ఆయుధ పూజ.. సందడి
ఐ యామ్ స్ట్రాంగెస్ట్ అవార్డుల ప్రదానం సాక్షి, చైన్నె: ఆర్మీకి విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన వారిని ఐయామ్ స్ట్రాంగెస్ట్ అవార్డులతో షారన్ ఫ్లై సత్కరించింది. ప్రముఖ ఫ్లైవుడ్ బ్రాండ్గా ఉన్న షారన్ ఫ్లై 6వ వార్షిక అవార్డుల వేడుక మంగళవారం చైన్నెలో జరిగింది. ఇందులో ఐయామ్ స్ట్రాంగెస్ట్ 2025 అవార్డులను ప్రదానం చేశారు. పదవీ విరమణ పొందిన సీనియర్ ఆర్మీఅ ధికారులు లెఫ్టినెంట్ జనరల్ ఎస్. హరి మోహన్ అయ్యర్, లెఫ్టినెంట్ జనరల్ దుష్యంత్ సింగ్, లెప్టినెంట్జనరల్ పీఆర్శంకర్, మేజర్ జనరల్ రాజీవ్ నారాయణన్కు ఈ అవార్డులను షారన్ ఫ్లై వ్యవస్థాపకుడు , ఎండీ విష్ణు ఖేమాని సత్కరించారు. దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు, ఆర్మీ అధికారుల మార్గదర్శకాలు, దేశ సరిహద్దులలో భద్రత విధులలో ఉన్న వారి సేవలను ఈసందర్భంగా గుర్తుచేస్తూ వారందరికీ వీర వందనం సమర్పించారు. ● ప్రారంభం సేవల విస్తరణలో భాగంగా చైన్నె పళ్లికరనైలో కరూర్ వైశ్యా బ్యాంక్ కొత్త శాఖ ఏర్పాటు చేశారు. దీనిని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ పి పొన్నయ్య, పళ్లికరనై వేలమ్మాల్ బోధిక్యాంపస్ ప్రిన్సిపాల్ సి జమునా శక్తి వేల్లు ప్రారంభించారు. – సాక్షి, చైన్నె ● ఆవిష్కరణ మానుషులలో ఐక్యతను చాటే విధంగా స్రంగీత దర్శకుడు నవనీత్ సుందర్ కొత్తగా ఒరు మాలై నేరత్తిల్ పేరిట ఆల్బమ్ను రూపొందించారు. ఏఐ విజువల్స్తో రూపొందించిన ఈ ఆల్బామ్ను స్థానికంగా మంగళవారం ఆవిష్కరించారు. అక్టోబరు 2వ తేదీన దీనిని విడుదల చేయనున్నారు. – సాక్షి, చైన్నె ● ఐఐటీ అక్వాటిక్స్ మీట్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా ఐఐటీ మద్రాసులో39వ ఇంటర్ – ఐఐటీ అక్వాటిక్స్ మీట్ మంగళవారం ప్రారంభమైంది. ఐఐటీ హైదరాబాద్, తిరుపతిలతో కలిసిఅక్టోబరు 5వ తేదీ వరకు జరగనున్న ఈమీట్ను అర్జున అవార్డు గ్రహీత సెబాస్టియన్ జేవియర్, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామ కోటి, డీన్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్గుమ్మడిలు ప్రారంభించారు. ఇందులో 17 ఐఐటీలు పాల్గొంటున్నాయని, ప్రధాన క్రీడోత్సవం డిసెంబర్లో జరుగుతుందని ఈసందర్భంగా ప్రకటించారు. – సాక్షి, చైన్నె : ప్రమాదాలపై అవగాహన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ సీమా అగర్వాల్ ఆదేశాలతో చైన్నె బ్రాడ్ వే షావుకారు పేటలోని డేరా పంత్ జైన్ విద్యాలయంతో పాటూ ఉత్తర చైన్నెలోని పాఠశాలలో దీపావళి సందర్భంగా ఏదేని ప్రమాదాలు జరిగిన పక్షంలో సహాయక చర్యల గురించి రెస్క్యూ డ్రిల్ మంగళవారం జరిగింది. నార్త్ జోన్ అగ్నిమాపక శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణన్, ఉత్తర చైన్నె జిల్లా అధికారి రాబిన్ కాస్ట్రో, అసిస్టెంట్ డ్రిస్టిక్ ఆఫీసర్ మురుగన్, సబర్బన్ జిల్లా అధికారులు లోకనాథన్ నేతృత్వంలో వందలాదిగా అగ్నిమాపక వీరులు వీరోచితంగా శ్రమిస్తూ సహాయక చర్యలలో మునిగే విధంగా ముందుకు సాగారు. బాణసంచా కారణంగా ఎదురయ్యే ప్రమాదాలను విద్యార్థులకు వివరించారు. వాటిని ఎలా జాగ్రత్తగా కాల్చాలో వివరించారు. – సాక్షి, చైన్నె రాష్ట్రంలో మంగళవారం నుంచే ఆయుధ పూజ సందడి నెలకొంది. పండుగ బుధవారమైనప్పటికీ ఒక రోజు ముందుగానే కోలాహలం మిన్నంటింది. పూజా సామాగ్రి కొనుగోలుకు జనం మార్కెట్లకు పోటెత్తారు. అన్ని రకాల పూజా సామాగ్రి ధరలకు రెక్కలు వచ్చాయి. ఇంటిళ్లి పాది పండుగను ఆనందోత్సాహలతో జరుపుకునేందుకు చైన్నె నుంచి లక్షలాది మంది ప్రత్యేక బస్సులు, రైళ్ల ద్వారా స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. సాక్షి, చైన్నె: రాష్ట్రంలో వినాయక చవి తదుపరి వచ్చే ఆయుధ పూజ, విజయ దశమి పర్వదినాలకు ప్రజలు మరింత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోంది. ఇందులో చిన్న చిన్న దుకాణాల మొదలు అతి పెద్ద ఫ్యాక్టరీల వరకు, కూలీల మొదలు రైతుల వరకు తాము ఉపయోగించే వివిధ రకాల సామాగ్రి, పనిమూట్లకు పూజలు నిర్వహించే రీతిలో ఆయుధ పూజను అత్యంత భక్తి శ్రద్ధల పర్వదినంగా భావిస్తుంటారు. ఇంటిళ్లి పాది అత్యంత భక్తితో ఈ పర్వదినాన్ని జరుపుకోవడం జరుగుతోంది. స్వస్థలాలకు పయనం ఈ ఏడాది పండుగకు ముందే శని, ఆదివారాలు కలిసి రావడంతో సోమ, మంగళ సెలవు పెట్టుకుని అత్యధిక శాతం మంది ప్రజలు ఇప్పటికే స్వస్థలాలకు వెళ్లారు. బుధవారం ఇంటిళ్లి పాది ఆయుద పూజను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. చైన్నె వంటి నగరాలలో వివిధ పనులు చేసుకుంటూ, ఉద్యోగాలలో ఉన్న వాళ్లు దక్షిణ తమిళనాడు, కొంగు మండలంలలోని స్వస్థలాలకు అత్యధికంగా బయలుదేరి వెళ్లారు. మంగళవారం రాత్రంతా ప్రత్యేక బస్సులను చైన్నె నగరం, శివారులలోని బస్టాండ్ల నుంచి రోడ్డెక్కించడంతో లక్షల మంది ఆయుధ పూజ నిమిత్తం స్వస్థలాలకు వెళ్లినట్టు రవాణా సంస్థ పరిశీలనలో తేలింది. ఇదే అదనుగా ఆమ్నీ ప్రైవేటు బస్సులు చార్జీలను పెంచేశాయి. విమాన టికెట్లు సైతం గాల్లో ఎగిరాయి. మదురై, తిరుచ్చి, తూత్తుకుడి,సేలంలకు విమాన చార్జీలు రెడింతలు పెరిగాయి. ఈ బస్సులపై నిఘా ఉంచి తనిఖీలు ముమ్మరంగా జరిగాయి. మంత్రి శివ శంకర్ సైతం తనిఖీలలో నిమగ్నమయ్యారు. నేతల శుభాకాంక్షలు ఆయుధ పూజ, విజయ దశమి పండుగలను ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు వివిధ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, అమ్మ మక్కల్మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్, మాజీ సీఎం పన్నీరు సెల్వం, తమిళ మానిల కాంగ్రెస్ నేత జికే వాసన్, బీజేపీ నేతలు నైనార్ నాగేంద్రన్, తమిళి సై సౌందరరాజన్, శరత్కుమార్, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ , పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి తదితరులు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు. సాక్షి, చైన్నె: గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ తరపున టీ నగర్సౌత్ ఉస్మాన్ రోడ్డు– సి.ఐ.టి. నగర్ ప్రధాన రోడ్డు ను అనుసంధానిస్తూ బ్రహ్మాండంగా నిర్మించిన వంతెనకు జె. అన్భుళగన్ ఫ్లై ఓవర్ అని నామకరణం చేశారు. దీనిని రూ.164.92 కోట్లతో నిర్మించారు. వివరాలు.. పెరుగుతున్న ట్రాఫిక్ను పరిగణనలోకి తీసుకుని, ప్రజలు సులభంగా రవాణా మార్గం కల్పించే విధంగా గత నాలుగు సంవత్సరాలలో చైన్నె మెట్రోపాలిటన్ కార్పొరేషన్ తరపున రూ.300.16 కోట్లతో 13 ప్రదేశాలలో కొత్త వంతెన మార్గాలను నిర్మించి ప్రజా ఉపయోగంలోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నిత్యం రద్దీతో ఉండే టీ నగర్ పరిసరాలలో ట్రాపిక్ పద్మవ్యూహానికి మోక్షం కల్పించే విధంగా అత్యాధునిక సాంకేతికతతో బ్రహ్మాండ వంతెన నిర్మించారు. టీ నగర్ సౌత్ఉస్మాన్ రోడ్డు – సి.ఐ.టి. నగర్ ప్రధాన రోడ్డు అనుసంధానం దిశగా 3,800 మెట్రిక్ టన్నుల ఇనుముతో రూ. 164 కోట్ల వ్యయంతో వంతెనను నిర్మించారు.ఇది చైన్నెలో నిర్మించిన తొలి ఇనుప ఫ్లై ఓవర్కావడం గమనార్హం. దీనికి దివంగత డీఎంకే నేత జే అన్భళగన్ ఫ్లై ఓవర్ అని నామకరణం చేశారు. ఈ వంతెన నిర్మాణానికి కృషి చేసిన దివంగత ఎమ్మెల్యే జే అన్బుళగన్ పేరునే పెట్టడం విశేషం. 800 మీటర్ల పొడవుతో.. నాలుగు జంక్షన్లను అనుసంధానించే విధంగా ఈ వంతెన రూపుదిద్దుకుంది. సౌత్ ఉస్మాన్ రోడ్డు, బర్కిత్రోడ్డు, బోగ్ రోడ్డు జంకషన్, సీఐటీ నగర్ జంక్షన్లు కలుపుతూ 1,200 మీటర్ల పొడవు, 8.40 మీటర్ల వెడల్పు, 53 ఇనుప స్తంభాల వెడల్పుతో రెండు లేన్ల రహదారిగా నిర్మించారు. సౌత్ ఉస్మాన్ రోడ్డులో ఇది వరకు ఉన్న 800 మీటర్ల పొడవైన కాంక్రీట్ ఫ్లైఓవర్తో తాజా హైటెక్ వంతెనను అనుసంధానించారు. ఈ ఫ్లైఓవర్ టీ నగర్ బస్టాండ్ నుంచి 2 కిలో మీటర్ల దూరం , సౌత్ ఉస్మాన్ రోడ్డులో 120 మీటర్ల దూరంతోపాటూ ఇరు వైపులా పాదచారులు నడిచేందుకు వీలుగా ఏర్పాటు, సర్వీసు రోడ్డు కూడా రూపుదిద్దుకుంది. సగటున రోజుకు 1 ,00,000 మంది, 40 వేలకు పైగా వాహనాలు ప్రయాణించే దిశగా సుమారు 2 లక్షలకు పైగా సాధారణ ప్రజలు ప్రయోజనంగా ఈ వంతెన ఉంటుందని ప్రకటించారు. సింగార చైన్నె వైపు ప్రయాణంలో కొత్త కొత్త సాంకేతికత చిహ్నంగా ఈ వంతెనను ప్రకటించారు. ఈ వంతెన గోడలు, రిటైనింగ్ వాల్స్పై టీ నగర్ విశిష్టతను చాటే పెయింటింగ్ను తీర్చిదిద్దారు. ఈ వంతెనను సీఎం స్టాలిన్ ప్రారంభించి, కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రు, ఎం సుబ్రమణియన్, శేఖర్బాబు, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మేయర్ ఆర్. ప్రియ, ఎంపీ ఎ.రాజ, ఎమ్మెల్యేలు జె. కరుణానిధి, టి.వేలు, తాయకం కవి, డిప్యూటీ మేయర్ ఎం. మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వంతెనపై నడుచుకుంటూ వెళ్తున్న సీఎం స్టాలిన్, మంత్రులు బ్రహ్మాండ వంతెనను ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: కరూర్లో విజయ్ ప్రచార పర్యటన సందర్భంగా పెను విషాద ఘటన జరిగి మంగళవారంతో నాలుగు రోజులైంది. ఈ కేసును తీవ్రంగా పరిగణించి కరూర్ పోలీసులు టీవీకే వర్గాలపై కేసుల నమోదును వేగవంతం చేశారు. అరెస్టుల ప్రక్రియపై దృష్టి పెట్టారు. ఈనేపథ్యంలో కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మది అళగన్, కరూర్ నగర్ ఇన్చార్జ్ మాశి పొన్ రాజ్ను అరెస్టు చేశారు. ఈ ఇద్దరికి ఉదయాన్నే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కరూర్ కోర్టులో న్యాయమూర్తి భరత్ కుమార్ ఎదుట హాజరు పరిచారు. ఈ సమయంలో వాడివేడిగా వాదనలు, వాగ్వాదాలు సైతం చోటు చేసుకున్నాయి. తాము ఏ తప్పూ చేయలేదంటూ వాదిస్తూనే, కొన్ని ఆధారాలను న్యాయమూర్తికి టీవీకే తరపు న్యాయవాదులు సమర్పించారు. అయితే వాటిని ఆయన పరిగణించ లేదు. అనేక ప్రశ్నలను సంధించారు. విజయ్ను చూసేందుకు చిన్న పిల్లల మొదలు పెద్దల వరకు వస్తారన్నది తెలియదా? అని అసహనం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చి ఉన్నారన్న విషయాన్ని ముందుగానే విజయ్ దృష్టికి తీసుకెళ్లారా?, చిన్న స్థలంలో కాకుండా ఏదేని మైదానంను వేదికగా ఎంపిక చేసి ఉండ వచ్చుగా? అన్న అనేక ప్రశ్నలను సంధించారు. పోలీసుల తరపు న్యాయవాదులు వాదన సమయంలో జనం రద్దీ గురించి తాము ముందే భుస్సీ ఆనంద్ దృష్టికి తీసుకెళ్లామని, ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున్కు వివరించినా ఆయన అంగీకరించకుండా, విజయ్ ప్రచార రథాన్ని మరింత ముందుకు తీసుకెళ్లినట్టు వివరించారు. కరూర్ జంక్షన్ తదుపరి మునియప్పన్ ఆలయం వద్ద విజయ్ తన ప్రచార రథంలోకి వెళ్లి పోయారని, ఆయన తన సీటులోనే కూర్చుని ఉండి ఉంటే, ఆయన్ని చూసిన జనం అక్కడి నుంచి వెళ్లి పోయి ఉండే వారని, అయితే, ఆయన లోనికి వెళ్లడంతో చూడాలన్న ఆశతో ఆ రథం వెనుక పరుగులు తీశారని న్యాయమూర్తికి వివరించారు. వాదనల అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ, కరూర్నే కాదు, దేశాన్నే ఈ ఘటన కుదిపి వేసిందని, 41 మంది మరణించారని, ఇందులో 10 మంది పిల్లలు కూడా ఉన్నారని పేర్కొంటూ, ఈ కేసులో మనసాక్షికి కట్టుబడి ఆదేశాలు ఇస్తున్నానంటూ, ఆ ఇద్దరికి అక్టోబరు 14వ తేదీ వరకు రిమాండ్ విధించారు. కాగా, తమ భర్తలను పోలీసులు చిత్ర హింసలకు గురి చేసే అవకాశం ఉందని, వారికి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ మది అళగన్ సతీమణి రాణి, పౌన్ రాజ్ సతీమణి మాలతి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పోలీసులు అరెస్టుల ప్రక్రియపై దృష్టి పెట్టడంతో ఈకేసులో కీలకంగా ఉన్న భుస్సీ ఆనంద్, నిర్మల్కుమార్ ముందస్తు బెయిల్ కోసం మధురై ధర్మాసనంలో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు శుక్రవారం విచారణకు రానున్నాయి. ఇదిలా ఉండా కరూర్ ఘటన వ్యవహారంలో వదంతులు సృష్టిస్తున్న 25 మందిని గుర్తించి చైన్నె పోలీసులు కేసు నమోదు చేశారు.యూ ట్యూబర్ ఫెలిక్స్ను, టీవీకేకు చెందిన ఇద్దర్ని, బీజేపీకి చెందిన ఒకర్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినానంతరం రిమాండ్కు తరలించారు. బీజేపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన కరూర్ ఘటనకు సంబంధించి వాస్తవాలను తెలుసుకునేందుకు బీజేపీ నిజనిర్ధాణ కమిటీ మంగళవారం పర్యటించింది. ఆ పార్టీ ఎంపీ హేమ మాలిని నేతృత్వంలో 8 మంది ఎంపీలు కరూర్లో పర్యటించారు. తొలుత ఘటన జరిగిన ప్రదేశంలో పరిశీలించారు. అక్కడి వారితో మాట్లాడారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని చికిత్సలో ఉన్న వారిని పరామర్శించి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా హేమమాలిని మీడియాతో మాట్లాడుతూ, విజయను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో వస్తారని తెలిసినప్పుడు , ఎలా చిన్న రోడ్డును కేటాయించారని ప్రశ్నించారు. ప్రచార సభ కోసం సరైన స్థలం కేటాయించలేదన్నారు. ఇరుకై న రోడ్డు, విద్యుత్ సరఫరా ఆగడం, చెప్పులు విసరడం వంటి అంశాలను పరిగణిస్తే, ఈ ఘటన యాధృచ్చికంగా జరిగినట్టు కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర వేదన అంటూ 41 మంది మరణించారని, 51 మంది చికిత్సలో ఉన్నారని గుర్తు చేశారు. ఈ ఘటనలో ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ పాలకులా... నిర్వాహకులా..? అని ప్రశ్నించారు. తమ అధిష్టానానికి నివేదికను సమరిస్తామని ముందుకు సాగారు. కాగా, కోయంబత్తూరు నుంచి కరూర్కు వచ్చే మార్గంలో హేమామాలిని పర్యటించిన కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. కాగా, కరూర్లో బీజేపీ ఎంపీల బృందం పర్యటనపై వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ స్పందించారు. బహిరంగ రాజకీయా వ్యూహాలకు ఢిల్లీ పదును పెట్టినట్టుందని మండి పడ్డారు. జాతీయ కాంగ్రెస్ సైతం ఓ కమిటీని రంగంలోకి దించాలని సూచించారు. ఎండీఎంకే నేత వైగో స్పందిస్తూ, ఈ ఘటనలో విజయ్ను ఎందుకు అరెస్టు చేయకూడదని ప్రశ్నించారు. డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ, ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని హితవు పలికారు. మంత్రి అన్బిల్ మహేశ్ స్పందిస్తూ ఘటన జరిగిన రోజున అక్కడి పరిస్థితిని చూసి తాను ఉద్వేగానికి లోనైనట్టు, దీనిని కూడా విమర్శించడం శోచనీయమన్నారు. ఇక, ఈ ఘటనలో విజయ్ను అరెస్టు చేయాలని కోరుతూ డీజీపీ కార్యాలయంలో ఒరువన్ సామాజిక సంస్థ అధ్యక్షుడు అరివళగన్ వినతి పత్రం సమర్పించారు. విజయ్కు వ్యతిరేకంగా, మద్దతుగా తిరుచ్చి, కరూర్ తదితర ప్రాంతాలలో పోస్టర్లు హోరెత్తడం గమనార్హం. ఇక, విజయ్ను అరెస్టు చేయాలని వీడియో విడుదల చేసిన సినీ నటి ఓవియాను టార్గెట్ చేస్తూ, సామాజిక మాధ్యమాలలో పోస్టులు వెల్లువెత్తాయి.బాధితులతో మాట్లాడుతున్న బీజేపీ బృందం టీవీకే నేతలను అరెస్టు చేసి తీసుకెళుతున్న పోలీసులు నాలుగో రోజు వీడియో రూపంలో జనం ముందుకు విజయ్ ఘటన జరిగిన మూడు రోజులైనా విజయ్ బయటకు రాలేదు. కేవలం సంతాపం, ఎక్స్గ్రేషియా ప్రకటనతో సరి పెట్టారు. ఇంత పెద్ద ఘటన జరిగితే కనీసం టీవీకే వర్గాలు ఏ ఒక్కరూ బాధితులను పరామర్శించక పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం చేసే పనిలో పడ్డారు. డీఎంకే ఎంపీ కనిమొళి సైతం విజయ్ తీరును ఎండగట్టారు. ఈ పరిస్థితులలో నాలుగో రోజైన మంగళవారం సాయంత్రం మూడున్నర గంటల సమయంలో ఓ వీడియో రూపంలో జనం ముందుకు విజయ్ వచ్చారు. వీడియోలోని వివరాలు ఆయన మాటల్లోనే ‘‘ అందరికీ నమస్తే.., నా జీవితంలో ఇంత వేదన ఎన్నడూ అనుభవించ లేదు. నన్ను చూడాలని ప్రచార సమయంలో జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని, నా మీద చూపుతున్న ప్రేమా అభిమానాలకు ఎల్లప్పుడు రుణ పడి ఉంటాను. ఆప్తులను కోల్పోయాం, కుటుంబాలను కోల్పోయాం..మరింత వేదనగా ఉంది..అందరి కుటుంబాలకు నా సంతాపం.. ఏం చెప్పినా లోటును తీర్చలేం. ఆస్పత్రిలో ఉన్న వాళ్లంతా త్వరగా కోలుకోవాలి. త్వరలో అందర్నీ కలుస్తా. ఈ సమయంలో నా వేదనలతో, బాధలో అండగా నిలబడ్డ రాజకీయ పక్షాల నేతలందరికీ’’ కృతజ్ఞతలు తెలియజేశారు. -
మధుమేహం, ఊబకాయంపై అధ్యయనం
సాక్షి, చైన్నె : నేచర్ మెడిసినల్లో ప్రచూరితమైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ – ఇండియా డయాబెటిస్ అధ్యయనం నుంచి సేకరించిన తాజా ఆధారాల మేరకు జరిగిన అధ్యయన వివరాలను మంగళవారం స్థానికంగా ప్రకటించారు. ఆహారపు అలవాట్లు మధుమేహం, ఊబకాయంలో నాటకీ పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయని ఈ అధ్యయన ఫలితాలలో వెలుడు చూసినట్టు వివరించారు. ఈ ఫలితాలను మద్రాసు డయాబెటిస్రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో క్రాస్– సెక్షనల్ సర్వే నుంచి 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల, నేషనల్ క్యాపిటల్ టెరిటరీలలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో జరిపినట్టు ఆ రెసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్వీ మోహన్ , సీనియర్ సైంటిస్టు డాక్టర్ సుధా, ఆ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఆర్ఎం అంజనాలు వివరించారు. ఈ పరిశోధన మేరకుఅధ్యయనంలో స్థూల పోషకాలు(కార్బోహైడ్రేట్, కొవ్వు, ప్రొటీన్) తీసుకోవడం ద్వారా ఆహార ప్రొఫైల్ల ప్రధాన ఫలితాలను వెలువడినట్టు వివరించారు. అధిక కార్బోహైడ్రేట్ కేలరీలు జీవ క్రియ ప్రమాదాన్ని పెంచుతాయని వివరించారు. ఒకసాధారణ ఆహార సర్దుబాటు జీవ ప్రక్రియ ప్రమదాన్ని తగ్గంచడంలో సహాయ పడే అంశాలను ఈసందర్భంగా విశదీకరించారు. ప్రతికూల ఆహార ప్రొఫైల్ను మధుమేహం, ఊబకాయంతో అనుసంధానిస్తున్న ల్యాండ్ మార్క్గా ఈ అధ్యయనం ఉన్నట్టు పేర్కొన్నారు. సెంగోట్టయన్ మద్దతుదారులపై వేటు సాక్షి, చైన్నె: ఎమ్మెల్యే సెంగోట్టయన్ మద్దతుదారులకు ఉద్వాసన పలికే విధంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి చర్యలు చేపట్టారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిన వాళ్లు, బహిష్కృత నేతలను మళ్లీ అక్కున చేర్చుకోవాలని ఇటీవల సెంగోట్టయన్ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన చేతిలో ఉన్న పార్టీ పదవిని పళణిస్వామి లాగేసుకున్నారు. ఆయన వెన్నంటి ఉన్న ముఖ్య నేతలను పార్టీ పదవుల నుంచి తప్పించారు. ఈ పరిస్థితులలో సెంగోట్టయన్కు మద్దతుగా వ్యవహరిస్తున్న 40 మంది నాయకులను గుర్తించి వారిని పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈరోడ్ జిల్లాలోని ఈ నేతలను ఒకే రోజు పదవుల నుంచి తప్పించడం చర్చకు దారి తీసింది. -
క్లుప్తంగా
108లో ఆక్సిజన్ లేక రోగి మృతి తిరువొత్తియూరు: చైన్నె దురైపాక్కం ఎళిల్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో నివసించే రాజేష్ (39) మంగళవారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. వెంటనే అతని బంధువులు 108 అంబులెన్స్లో రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్లో రాజేష్ను పరీక్షించిన అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులు అతనికి ఆక్సిజన్ అవసరమని తెలిపారు. రాజేష్కు ఆక్సిజన్ ఇవ్వడానికి యత్నించగా ఆక్సిజన్ రాలేదు. ఈ విషయాన్ని అంబులెన్స్ టెక్నీషియన్, డ్రైవర్తో చెప్పారు. ఈ క్రమంలో ఆస్పత్రికి వెళ్లి ఆక్సిజన్ అవసరాన్ని చూసుకోవచ్చు అని చెప్పి అంబులెన్స్ డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడిపాడు. తరువాత రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన రాజేష్ కొద్దిసేపటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆక్సిజన్ ఇవ్వకుండా అంబులెన్స్లో తీసుకువచ్చినందువల్లే రాజేష్ మరణానికి కారణమని బంధువులు ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించి, ఆసుపత్రి ఉద్యోగులతో మరణించిన రాజేష్ బంధువులు మాట్లాడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించే అంబులెన్స్ వాహనాల్లో కనీస వైద్య సౌకర్యాలు కూడా లేకపోవడం వల్ల నిరుపేదల ప్రాణాలు బలి అవుతున్నాయని సోషల్ మీడియాలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి, రాజేష్ బంధువులు ఆసుపత్రి స్టేషన్ వైద్య అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉచిత నర్సింగ్ శిక్షణ ప్రారంభం వేలూరు: వేలూరు శ్రీపురంలోని బంగారుగుడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ నారాయణి ఆసుపత్రిలో 50 మంది విద్యార్థులకు ఉచిత డిప్లమో కోర్సులను ఎమ్మెల్యే నందకుమార్ ప్రారంభించారు. బంగారు గుడి పీఠాధిపతి శక్తి అమ్మ అధ్యక్షతన ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన జన్మ దినోత్సవాన్ని పురష్కరించుకుని మంగళవారం ఉదయం ఆసుపత్రి డైరెక్టర్ బాలాజీ అధ్యక్షతన నారాయణి ఆసుపత్రిలో ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శక్తి అమ్మ జయంతి సందర్బంగా ప్రస్తుతం ఉచిత శిక్షణ ఇవ్వడం ద్వారా నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థినిలు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద రోగులకు సేవ చేసేందుకు ఆసక్తి చూపాలన్నారు. అదే విధంగా ప్రస్తుతం అనేక మంది ఉద్యోగాలకు వెల్లడం ద్వారా వారి తల్లిదండ్రులను చూసుకునేందుకు సమయం లేక ఇంటిలోనే నర్శులను ఏర్పాటు చేస్తారన్నారు. ప్రస్తుతం ఇక్కడ శిక్షణ పొంది మీ ప్రాంతంలోనే ఉంటూ నెలకు సుమారు రూ. 20 వేలు వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ అధికంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే ఉండడంతో ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మాధవి, డాక్టర్ గీత, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. రూ.కోటి వ్యయంతో అభివృద్ధి పనులు తిరుత్తణి: తిరుత్తణిలో రూ.కోటి వ్యయంతో అభివృద్ధి పనులు చేసేందుకు మున్సిపల్ సమావేశంలో తీర్మానం ఆమోదించారు. తిరుత్తణి మున్సిపల్ కౌన్సిలర్ల సాధారణ సమావేశం సోమవారం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ సరస్వతి అధ్యక్షత వహించారు. వైస్ చైర్మన్ స్వామిరాజ్ స్వాగతం పలికారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఆదాయ ఖర్చుల వివరాల పట్టిక ప్రవేశపెట్టారు. పట్టణంలోని 21 వార్డులో 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ. కోటి వ్యయంతో సిమెంట్ రోడ్లు, తాగునీటి పైపులైన్లు ఏర్పాటు సహా నిత్యావసర అవసరాలు కోసం సభ్యులు తీర్మానం ఆమోదించారు. అలాగే చిరు వ్యాపారులు రోడ్డు మార్గాల్లో వ్యాపారాలకు సంబంధించి ఏడాదికి సుంకం చెల్లింపునకు సంబంధించి సమావేశంలో అనుమతిస్తూ తీర్మానం ఆమోదించారు. తాగునీటి కనెక్సన్ కోసం మున్సిపాలిటీకి ఇళ్లు, దుకాణాలు, పరిశ్రమలకు చెల్లింపులకు సంబంధించి తీర్మానించారు. జైలు ఖైదీకి గంజాయి తిరువొత్తియూరు: చైన్నె పుళల్ జైలులో ఖైదీకి గంజాయి సరఫరా చేసిన లాయర్పై పోలీస్ స్టేషన్న్లో ఫిర్యాదు నమోదైంది. చైన్నె సెంట్రల్ జైలులోని రెండో నంబర్ గదిలో విచారణ ఖైదీ శిలంబరసన్ (28) గంజాయి దాచిపెట్టినట్లు జైలు అధికారులకు రహస్య సమాచారం అందింది. దీని ఆధారంగా జైలు అధికారులు ఖైదీ శిలంబరసన్ గదికి వెళ్లి తనిఖీ చేశారు. అప్పుడు టాయిలెట్లో దాచిపెట్టిన 54 గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జైలు గార్డులు గంజాయి దాచిపెట్టిన విషయంపై ఖైదీ శిలంబరసన్న్ను విచారించగా, దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈక్రమంలో ఉదయం ఖైదీ శిలంబరసన్న్ను కలవడానికి వచ్చిన అతని లాయర్ హేమంత్, గంజాయిని రహస్యంగా తీసుకొచ్చి, ఇంటర్వ్యూ జరిగిన ప్రదేశంలో గంజాయిని విసిరి వెళ్లిపోయినట్లు, ఆ తర్వాత ఖైదీ శిలంబరసన్ ఆ గంజాయిని తీసుకుని టాయిలెట్లో దాచిపెట్టినట్లు తెలిసింది. -
డెంగీ నిర్మూలన అవగాహన ర్యాలీ
తిరుత్తణి: డెంగీ నిర్మూలనపై పాఠశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుత్తణి డాక్టర్ రాధాకృష్ణన్ ప్రభుత్వ మహోన్నత పాఠశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు శ్రమదానం శిబిరం నిర్వహిస్తున్నారు. 26వ తేదీన ప్రారంభమైన శిబిరం రెండవ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా పాఠశాల, ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు, పబ్లిక్ ప్రాంతాలను పరిశుభ్రం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం డెంగీ నిర్మూలన అవగాహన శిబిరం నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీని పాఠశాల హెచ్ఎం బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ అధికారి లీలా మనోహరన్ సమక్షంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు 50 మంది పాల్గొని పట్టణంలో చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ర్యాలీగా వెళ్లి పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. -
ఘనంగా ఆడియో వేడుక
వీర తమిళచ్చి చిత్ర ఆడియోను ఆవిష్కరించిన ఆర్వీ ఉదయకుమార్, పేరరసు తదితరులతో యూనిట్ సభ్యులు తమిళసినిమా: మగిళిని కలైకూడం పతాకంపై శారద మణివన్నన్,మగిళిని కలిసి నిర్మించిన చిత్రం వీరం తమిళ్ చూచి. సంజీవ్ వెంకట్, ఇళయ, నటి సుస్మిత సురేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా సురేష్ భారతి దర్శకుడుగా పరిచయం అయ్యారు. ఈయన ఓ భవన నిర్మాణ కార్మికుడు కావడం గమనార్హం. సినిమాలపై ఆసక్తితో పలు షార్ట్ ఫిలింస్ తీసి వీర తమిళచ్చి చిత్రంతో దర్శకుడుగా అవతారం ఎత్తారు. జూబిన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ.ఉదయ్ కుమార్, కార్యదర్శి పేరరసు, దర్శకుడు రాజకుమారన్, శరవణసుబ్బయ్య తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. అనంతరం చిత్ర దర్శకుడు సురేష్ భారతి మాట్లాడుతూ ఓ భవన నిర్మాణ కార్మికుడినైనా తాను సినిమాల షూటింగ్ కూడా చూడలేదన్నారు. అయినప్పటికీ సినిమాలపై ఆసక్తితో 2016లో కొంచెం కొంచెమాగ అనే షార్ట్ ఫిలిం చేశానన్నారు. దానికి ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదగా ఉత్తమ అవగాహనా లఘు చిత్రం అవార్డును అందుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత వరుసగా మొత్తం 18 షార్ట్ ఫిలింస్ చేశానని, వాటిలో ఏది అపజయం పొందలేదని చెప్పారు. అదేవిధంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్న ఇది వత్తంతో తెరకెక్కించిన ఈ వీర తమిళచ్చి చిత్రం కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ కుటుంబంలో జరిగే అన్ని నిజాలను ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్లంతా వీర తమిళులేనని పేర్కొన్నారు. ఆ విధంగా దర్శకుడు రాజ్ కుమారన్ వీర తమిళుడు అని అన్నారు. ఆయన ఈ వేదికపై వాస్తవాలను గుక్క తిప్పుకోకుండా వల్లించారన్నారు. మనం ఇప్పటివరకు దర్శకుడు రాజకుమారన్ భార్య నటి దేవయానిని చాలా సాఫ్ట్ గానే చూశామని, అయితే ఇంట్లో ఆమె యాక్షన్ హిరోయిన్ అన్నది ఇప్పుడే తెలిసిందని చమత్కరించారు. ప్రయత్నానికి, నిరంతర ప్రయత్నానికి చాలా తేడా ఉందన్నారు. మనం చేసేది ప్రయత్నం అని, మనల్ని వదలని ప్రయత్నం నిరంతర ప్రయత్నం అని పేర్కొన్నారు. అలా ఒక భవన నిర్మాణ కార్మికుడు నిరంతర ప్రయత్నంతో వీర తమిళచ్చి చిత్రం ద్వారా దర్శకుడు అయ్యారన్నారు. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. -
విజయవంతంగా విద్యార్థుల సదస్సు
కొరుక్కుపేట: చైన్నె పట్టాభిరామ్లోని ధర్మమూర్తిరావు బహదూర్ కలవల కన్నన్ చెట్టి హిందూ కళాశాల, తెలుగు శాఖ, తెలుగు భాషా సమితి తరఫున మంగళవారం ‘ఆధునిక తెలుగు కవులు వారి రచనలు‘ అనే అంశం పైన విద్యార్థులకు సదస్సు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్లో మహాకవి గురజాడ, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, కవిశేఖరుడు గుర్రం జాషువాల జయంతులను పురస్కరించుకుని ఈ సదస్సు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అదే శాఖకు చెందిన పూర్వ శాఖాధ్యక్షులు డా. పి. సీతమ్మ పాల్గొని 16 మంది విద్యార్థుల పత్ర సమర్పణకు అధ్యక్షత వహించారు. అశ్విని, కిశోర్, మేఘకుమారిలకు చెందిన పత్రాలకు మొదటి, రెండు, మూడు స్థానాలతో సీతమ్మ జ్ఞాపికలనిచ్చి సత్కరించారు. తెలుగు శాఖాధ్యక్షుడు డా.సురేష్, అధ్యాపకులు డా జి. కల్విక్కరసి, కళాశాల సంచాలకుడు డా. ఎన్. రాజేంద్ర నాయుడు, డా. తుమ్మపూడి కల్పన పాల్గొన్నారు. అనంతరం సరస్వతీ పూజ నిర్వహించారు. -
గ్రామాలకూ సేవలు విస్తరించాలి
వేలూరు: రెడ్క్రాస్ సభ్యులు పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు సేవా కార్యక్రమాలను విస్తరింపజేయాలని వేలూరు కార్పొరేషన్ మొదటి జోన్ చైర్పర్సన్ పుష్పలత అన్నారు. కాట్పాడి జూనియర్ రెడ్క్రాస్ సంఘం, సీఎంసీ కంటి ఆస్పత్రి, వేలూరు జిల్లా దృష్టి లోప నివారణ సంఘం సంయుక్తంగా కాట్పాడిలోని రెడ్క్రాస్ భవనంలో రెడ్క్రాస్ కార్యదర్శి జనార్ధన్ అధ్యక్షతన ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. పుష్పలత మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకే జీన్ హెండ్రీ డోనాండీన్ ఈ సంఘాన్ని ప్రారంభించారన్నారు. వీటిలోని సభ్యులు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రస్తుతం ఉచిత వైద్యశిబిరం నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేసేందుకు అవసరమైన సాయం అందజేయాలన్నారు. రెడ్క్రాస్ సంఘం సమన్వయకర్త రబిరాజన్, సీఎంసీ కంటి ఆస్పత్రి శిబిరం మేనేజర్ జాన్ హిట్లర్, కౌన్సిలర్ చాముండీశ్వరి, రెడ్క్రాస్ ఉపాధ్యక్షులు విజయకుమారి, కోశాధికారి పయణి, శ్రీనివాసన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రాధాక్రిష్ణన్, ఆనంద్కుమార్, సుధాకర్, రెడ్క్రాస్ సభ్యులు పాల్గొన్నారు. -
తెలంగాణలో రైతులకు ప్రత్యేక శిక్షణ
తిరువళ్లూరు: తమిళనాడు సహకార యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు చెందిన 75 మంది రైతులకు మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ముల్కానూర్ ప్రాంతానికి తీసుకెళ్లి ప్రత్యేక శిక్షణ అందించారు. రాష్ట్రంలోని సహకార సంఘంలో సభ్యులుగా వున్న రైతులను వేర్వేరు రాష్ట్రాలకు తీసుకెళ్లి వ్యవసాయంలో సాగు పద్ధతులు, సహకార సంఘాల నిర్వాహణ, పాల ఉత్పత్తి సంఘాల పనితీరు, విత్తనాల వినియోగంపై శిక్షణ ఇప్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, చెంగల్పట్టు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లోని జిల్లా ప్రాథమిక సహకార సంఘాలకు చెందిన 75 మంది రైతులను తెలంగాణ రాష్ట్రం సహకార శాఖ కేంఽద్రం, హైదరాబాదులోని ఇండియ వరి పరిశోధన కేంద్రానికి తీసుకెళ్లి శిక్షణ ఇచ్చారు. దీంతోపాటు ముల్కానూర్ మహిళా పాల ఉత్పత్తి సంఘంలోనూ శిక్షణ ఇప్పించారు. శిక్షణలో సంఘాల పనితీరును నేరుగా పరిశీలించడంతో పాటు వేర్వేరు అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో తమిళనాడు సహకార యూనియన్ అదనపు రిజిస్ట్రార్, డైరెక్టర్ రవిచంద్రన్ కరీంనగర్ రైతులతో ముచ్చటించి అక్కడి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనటలో ఇండియ వరి పరిశోధన హైదరాబాదు కేంద్రం డైరెక్టర్ గణేష్, కోఆర్డినేటర్ ప్రేమ్కుమార్, తమిళనాడు సహకార యూనియన్ సూపరింటెండెంట్ గోపినాఽథ్ భువన, మైథిలి, జిల్లా సంఘాల చెందిన డైరెక్టర్లు విజయశరవణన్, వేలు, కన్నన్, ధర్మేంద్రన్, మేనేజర్ ఆడలరసన్, మురళి, జయశీలన్, దేవరాజ్, దండపాణి పాల్గొన్నారు. -
రాజరాజేశ్వరి అలంకరణలో కన్నికాపరమేశ్వరి
పళ్లిపట్టు: రాజరాజేశ్వరి అలంకరణలో కన్నికాపరమేశ్వరి దేవి కనువిందు చేశారు. పళ్లిపట్టు బజారువీధిలోని కన్నికాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా మంగళవారం అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులను కటాక్షించారు. భక్తులు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే పళ్లిపట్టు గ్రామ దేవత కొళ్లాపురమ్మ ఆలయంలో సైతం నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా రోజూ కోళ్లాపురమ్మకు అభిషేక పూజలు చేసి సాయంత్రం సమయాల్లో ఉత్సవర్లను వివిధ అలంకరణలో పట్టణ వీధుల్లో ఊరేగిస్తున్నారు. -
పా.రంజిత్ దర్శకత్వంలో శోభిత
తమిళసినిమా: పా.రంజిత్ దర్శకత్వం వహించి, తన నీలం ప్రొడక్షనన్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం వెట్టువన్. నటుడు గెత్తు దినేష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. నటుడు ఆర్య మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈయనది ప్రతినాయకుడు పాత్ర అని ప్రచారం జరుగుతోంది. ఇది మోడ్రన్ గ్యాంగ్ స్టర్ కథా చిత్రం అని సమాధానం. ఇందులో నటుడు మణికంఠన్ మరో కీలక పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్ర షూటింగ్ 90 శాతం పూర్తి అయ్యిందని సమాచారం. ఇప్పటి వరకు హీరోయిన్ ఎవరన్నది యూనిట్ వర్గాలు వెల్లడించకుండా సస్పెనన్స్ కొనసాగిస్తూ వచ్చారు. కాగా తాజాగా ఈ క్రేజీ చిత్రంలో టాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ శోభిత ధూళిపాళ నటిస్తున్నట్లు తెలిసింది. ఈ బ్యూటీ ఇంతకు ముందు పొన్నియిన్ సెల్వం చిత్రంలో కీలక పాత్రను పోషించి మంచి గుర్తింపు పొందారన్నది గమనార్హం. అంతే కాకుండా అదే ఈమెకు కోలీవుడ్లో తొలి చిత్రం. కాగా తాజాగా పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న వెట్టువన్ చిత్రంలో పూర్తి స్థాయి హీరోయిన్గా నటి శోభిత ధూళిపాళ నటిస్తున్నట్లు సమాచారం. కాగా దళిత సామాజిక వర్గాల సమస్యలు ఇతివృత్తంతో చిత్రాలు చేసే పా.రంజిత్ గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో చిత్రం చేయడం, అందులో నటి శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటించడం వంటి సంఘటనలతో వెట్టువన్ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. శోభిత ధూళిపాళ -
●భార్య, ప్రియుడి సహా ముగ్గురి అరెస్ట్
దుర్గా అలంకారంలో వాసవీ అమ్మవారు కొరుక్కుపేట: అశ్వవాహనంపై దుర్గా అలంకారంలో శ్రీవాసవి అమ్మవారు భక్తులను కటాక్షించారు. 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 9వ రోజు మంగళవారం ఉదయం వేద పండితులు వేదపారాయణం, శ్రీకన్యకాపరమేశ్వరి మూలమంత్ర హోమం, అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ వాసవీ అమ్మవారిని అశ్వవాహనంలో దుర్గా అలంకారంలో కొలువుదీర్చి విన్నపాలు, దీపారాధన పూజలను చేశారు.పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి దర్శించుకుని తరించారు. జనని గణేష్ భరతనాట్య ప్రదర్శన, తెలుగు తరుణి మహిళా సభ్యులు, సహాన గ్రూప్ల భక్తిగీతాలాపన, పద్మలత వీణా వాయిద్య కచేరీలు వీణులవిందు చేసింది. భర్త హత్య కేసులో.. కొరుక్కుపేట: సేలంలో దారుణం చోటుచేసుకుంది. భర్తను భార్య హత్యచేసిన సంఘటన కలకలం రేపింది. దీంతో భార్య, ప్రియుడు ,సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లాలోని అడవికి 10 కి.మీ దూరంలో ఉన్న కీరై కాడులోని ఎర్కాడ్ గ్రామంలో నివసించే మోయా గౌంధర్ కుమారుడు శివకుమార్ (36) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు . 13 సంవత్సరాల క్రితం మారైని వివాహం చేసుకున్నారు. అతనికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివకుమార్ ఆదివారం తన బైక్పై కుప్పనూర్లోని మార్కెట్కు వెళ్లి, ఇంటికి అవసరమైన కిరాణా సామాగ్రి, కూరగాయలు కొని, ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ పరిస్థితుల్లో సోమవారం రాత్రి శివకుమార్ తలకు తీవ్ర గాయంతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వైద్యులు, అటవీ అధికారులు, పోలీసుల దర్యాప్తులో నకిలీ నోట్లకు అడ్డుచెప్పాడని శివకుమార్ను హత్య చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు భార్య, ప్రియుడు , అతని స్నేహితులు అని ,దీంతో భార్య ,ప్రియుడితో సహా ముగ్గురుని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
ఇంటి పట్టాలు కేటాయించాలని ఆందోళన
అఖిల భారత కిషాన్ సంఘం మహాధర్నా తిరువళ్లూరు: అభ్యంతరాలు లేని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకుని నివాసం వుంటున్న వారికి, ఇంటి స్థలాలు లేని వారికి కొత్త స్థలం కేటాయించి పట్టాలను మంజూరు చేయాలని కోరుతూ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వందలాది మంది మంగళవారం ఉదయం తిరువళ్లూరులో ఆందోళన చేశారు. ధర్నా ఆందోళనలో అఖిల భారత కిషాన్ సంఘం జిల్లా కన్వీనర్ సంపత్ అధ్యక్షత వహించారు. సంపత్ మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలుకా పరిధిలోని పుదుపేటై, జీఆర్ కండ్రిగ, మేల్ముదలాంబేడు, అప్పావరం, స్వామిరెడ్డి కండ్రి, పొన్నేరి తాలుకా పరిధిలోని చోళిపాళ్యం, ఆరణి, అత్తికుళం, నల్లారు, చిన్నంబేడు, ముస్లింనగర్ ఆవడి తాలుకా పరిధిలోని బమ్మాత్తుకుళం, కన్నిమానగర్, తిరునిండ్రవూర్లోని ధర్మరాజ కోవిల్ వీధి తిరువళ్లూరు తాలుకా పరిధిలోని కొమక్కంబేడు, తామరపాక్కం, చెంబేడు, కొడువెళి, ఊత్తుకోట తాలుకా పరిధిలోని మెయ్యూరు, తిరుకండలం, తామరకుప్పంతో ఆర్కేపేట, పళ్లిపట్టు, తిరుత్తణి తాలుకా పరిధిలోని గ్రామాలకు చెందిన అర్హులకు పట్టాలను వెంటనే మంజూరు చేయాలని నినాదాలు చేశారు. ఇప్పటికే అభ్యంతరాలు లేని ప్రాంతాల్లో నివాసం వున్న వారికి పట్టాలు ఇవ్వడం, ఇంటి స్థలం లేని వారికి వెంటనే పట్టాలను ఇవ్వాలని సూచించారు. సంఘం నేత తమిళరసు పాల్గొన్నారు. -
రూ.200 కోట్లతో పదకొండు బస్టాండ్లు
తిరువళ్లూరు: చైన్నె మెట్రో డెవలప్మెంట్ ఆథారిటీ ఆధ్వర్యంలో పాడియనల్లూరు సహా 11ప్రాంతాల్లో రూ.200 కోట్లతో నూతన బస్టాండ్లను నిర్మించనున్నట్టు మంత్రి శేఖర్బాబు తెలిపారు. పాడియనల్లూరులో నూతన బస్టాండుకు రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి శేఖర్బాబు మంగళవారం ఉదయం భూమిపూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ తిరువికేనగర్, అంబత్తూరు, తిరువాన్మిమయూర్, ఆవడి, వల్లలార్నగర్ సహా 11 ప్రాంతాల్లో రూ.200 కోట్లతో కొత్త బస్టాంఉ్ల నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తిరువికే నగర్, పెరియార్నగర్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా గత ఆగస్టులో నిర్మాణ పనులకు భూమిపూజ చేశామన్నారు. తండయార్పేట, ములైనగర్, కన్నదాసన్నగర్, అంబత్తూరు ప్రాంతాల్లో నిర్మిస్తున్న బస్టాండు పనులు పూర్తయిన క్రమంలో త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. తిరువాన్మియూర్, ఆవడి, అయ్యప్పన్తాంగెళ్ బస్టాండు నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నందన్న మంత్రి, త్వరలోనే మిగిలిన ప్రాంతాల్లోనూ పనులను ప్రారంబిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి ప్రకాష్, కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యే సుదర్శనం పాల్గొన్నారు. -
దివ్యరూపం.. మహాతేజం
తిరుమల : ఏడు కొండల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన కాంతుల్లో మలయప్ప స్వామి దేదీప్యమానంగా భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం సూర్య కాంతుల మధ్య స్వర్ణకాంతులీనుతూ భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయంలోని రంగ నాయక మండపంలో బ్రహ్మోత్సవాల్లో మూడో స్నపన తిరు మంజనంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు సేద తీరారు. సాయంత్ర వేళలో ఆలయం వెలుపల సహస్ర దీపాలంకరణ సేవలో స్వామి ఊయలూగుతూ దర్శనమిచ్చారు. ఆ తర్వాత రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహన సేవలో దివ్య మంగళ రూపంలో దర్శనమిచ్చారు. ఏడో రోజు వాహన సేవల్లో కళాకారులు, వివిధ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కళాకారులు అభినయం భక్తులను ఆకట్టుకుంది. ఆలయంతో పాటు ఫల, పుష్ప ప్రదర్శన శాలలోని పుష్ప, విద్యుత్ అలంకరణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక నాదనీరాజనం, ఆస్థాన మండపంలో కళాకారులు భక్తి, సంగీత కార్యక్రమాలు అలరించాయి. పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.నేడు శ్రీవారి రథోత్సవానికి సర్వం సిద్ధం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం శ్రీవారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 7.00 గంటల నుంచి ఆలయ మాడ వీధుల్లో స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపటి చక్రస్నానం కోసం పుష్కరిణిలో ఏర్పాట్లు పూర్తి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు గురువారం ఉదయం చక్రస్నానం నిర్వహించనున్నారు. వైదికంగా నిర్వహించే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం టీటీడీ పుష్కరిణిలో భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులను ఉదయం 4 గంటల నుంచి పుష్కరిణిలోకి అనుమతిస్తారు. భక్తులు రోజంతా పుణ్యస్నానాలు చేయవచ్చని ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. -
రాష్ట్రాభివృద్ధికి కోసం సంపూర్ణ మద్దతు
పరిశ్రమలశాఖ మంత్రి డాక్టర్ రాజా కొరుక్కుపేట: రాష్ట్రాభివృద్ధికి కోసం వాణిజ్య సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టీఆర్బీ రాజా హామీ ఇచ్చారు. ఈ మేరకు హిందూస్తాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (హెచ్సీసీ) 79వ వార్షిక సమావేశానికి మంత్రి శ్రీ డాక్టర్ టీఆర్బీ రాజా ముఖ్యఅతిథిగా హాజరై 80వ వార్షికోత్సవాన్ని, దాని లోగోను విడుదల చేసి ప్రారంభించారు. ఆయన తన ప్రసంగంలో ఇలాంటి చాంబర్ల ప్రాముఖ్యతను వివరించి చెప్పారు. ప్రభుత్వంతో వాణిజ్యం, పరిశ్రమల ప్రయోజనం కోసం సహకార పరస్పర చర్య కోసం రాష్ట్రంలో హెచ్సీసీ ఏర్పడిందని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వాణిజ్య సంస్థలకు ప్రభుత్వం మద్దతును ఆయన హామీ ఇచ్చారు. హిందుస్తాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ 80వ అధ్యక్షుడిగా దుగర్ ఫైనాన్న్స్– ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, చైర్మన్ రమేష్ దుగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . 2025–26 సంవత్సరానికి హిందుస్తాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ 80వ అధ్యక్షుడిగా సేవలందిస్తారు. గౌరవ అతిథిగా ది సన్మార్ గ్రూప్ చైర్మన్, ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్ విజయ్శంకర్, టి. ప్రవీణ్కుమార్ తాటియా పాల్గొన్నారు. -
సూర్య మరో నిర్మాణ సంస్థ?
తమిళసినిమా: కోలీవుడ్లో ప్రముఖ హీరోలలో ఒకరిగా రాణిస్తున్న నటుడు సూర్య. ఇంతకుముందే బాలీవుడ్కు పరిచయమైన ఈయన పలు అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నేరుగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఇకపోతే ఈయన తన భార్య జ్యోతికతో కలిసి తన పిల్లల పేరుతో 2డీ ఎంటర్టెయిన్మెంట్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇక తన బంధువుల చిత్ర నిర్మాణ సంస్థల్లోనూ చిత్రాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య మరో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం.ఈయన నగరం స్టూడియోస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ సంస్థలో మొదటి చిత్రంగా మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించి నిర్మించనున్నట్లు తెలిసింది. ఆ తరువాత పా.రంజిత్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా విడుదల కానుందని తెలిసింది. ఆ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తెరపైకి రానుంది. -
రెండో బ్యానర్ స్టార్ట్ చేయనున్న హీరో సూర్య!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యారు. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నేరుగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఇకపోతే ఈయన తన భార్య జ్యోతికతో కలిసి 2డీ ఎంటర్టెయిన్మెంట్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే! తాజాగా సూర్య మరో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.నగరం స్టూడియోస్ పేరుతో కొత్త బ్యానర్ లాంచ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంస్థలో మొదటి చిత్రంగా మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించి నిర్మించనున్నట్లు తెలిసింది. ఆ తరువాత పా.రంజిత్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా విడుదల కానుందని తెలిసింది. ఆ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తెరపైకి రానుంది.చదవండి: జ్ఞాపకాలను మోయడం ఆపేశాను -
థర్మల్ పవర్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
సాక్షి,చెన్నై: ఎన్నోర్ థర్మల్ పవర్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తొమ్మిదిమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై ఎన్నోర్లో అనల మిన్ స్టేషన్ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో వందలాది మంది ఉత్తర భారత కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మించిన శ్లాబు కూలింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిని చెన్నై రాయపురం స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషాదకర ఘటన ఎన్నోర్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. #Breaking:- चेन्नई में बड़ा हादसा, थर्मल पावर प्लांट में गिरी मचान, 9 मजदूरों की मौत#Chennai #chennaitharmalplant # pic.twitter.com/5HvEYf8bfD— Ritesh Pathak (@VoiceOFRites_7) September 30, 2025 ప్రమాదంపై తమిళనాడు విద్యుత్ బోర్డు (TNEB) చైర్మన్ జె.రాధాకృష్ణన్ మాట్లాడారు.‘ఈ ప్లాంట్లో మొత్తం 3,700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. భద్రతా అధికారులు, అధికారులు సమీపంలోని మూడు ప్లాంట్ల బృందాలతో పాటు, తనిఖీలు నిర్వహిస్తున్నారు.మరిన్ని సమస్యలు తలెత్తకుండా చూసుకుంటున్నారు’అని అన్నారు. Tamil Nadu: Chairman of the Tamil Nadu Electricity Board (TNEB) J. Radhakrishnan says, "...One person has been injured and is currently stable. The plant employs roughly 3,700 workers overall. Safety officers and officials are on site, along with teams from three nearby plants,… pic.twitter.com/3ma6Y4OEOR— IANS (@ians_india) September 30, 2025 -
దారుణం: ఏపీ యువతిపై తమిళనాడు పోలీసుల అత్యాచారం
తిరువణ్ణామలై: తమిళనాడు:రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఏపీకి చెందిన యువతిపై తమిళనాడు పోలీసులు అత్యారానికి పాల్పడ్డారు. తిరువణ్ణామలైలో ఏపీకి చెందిన యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి ఒడిగట్టారు. కానిస్టేబుల్స్ సుందర్ రాజ్, సురేష్ రాజ్లు సదరు యువతిపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు. అత్యాచారం చేసిన పోలీసులను అరెస్టు చేసి రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి(సోమవారం, సెప్టెంబర్ 29వ తేదీ) తిరువణ్ణామలై సమీపంలోని ఎంథాల్ బైపాస్ రోడ్డుపై ఈ దారుణం చోటు చేసుకుంది. టమోటో లోడ్తో వెళుతున్న వాహనంలో డ్రైవర్తో పాట ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ సమయంలోనే గస్తీ కాస్తున్న ఇ ద్దరు పోలీసులు.. ఆ వాహనాన్ని ఆపారు. వాహనంలో ఉన్న వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసిన ఆ ఇద్దరు పోలీసులు.. మహిళల్ని కిందకు దింపారు. అందులో లక్ష్మీ అనే యువతిని విచారణ పేరతో అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసే సమయంలో ఆ యువతి ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొట్టారు. ఆపై అత్యాచారానికి పాల్పడి బైపాస్ రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 30వ తేదీ) తెల్లవారుజామున 4 గంటలకు అక్కడికి వచ్చిన గ్రామస్తులు లక్ష్మిని రక్షించి, 108 అంబులెన్స్ ద్వారా చికిత్స కోసం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న తిరువన్నమలై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుధాకర్, అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్ సతీష్ బాధితురాలిని విచారణ చేశారు. దాంతో పోలీసలే తనను కొట్టి అత్యాచారానికి పాల్పడ్డారని సదరు బాధితరాలు చెప్పడంతో అసల విషయం వెలుగచూసింది.ఇదీ చదవండి:తమిళనాట పట్టుకోసం బీజేపీ ఎత్తులు -
‘నా గుండె పగిలింది’.. కరూర్ తొక్కిసలాటపై టీవీకే అధినేత విజయ్
సాక్షి,చెన్నై: ‘నన్ను టార్గెట్ చేయండి.. ప్రజల్ని కాదు’ అంటూ కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్ తొలిసారి స్పందించారు. ఈ మేరకు విజయ్ మంగళవారం (సెప్టెంబర్30న) ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ‘ఈ ఘటన నన్ను కలచివేసింది. నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది. నా గుండె ముక్కలైంది. మాటలు రావట్లేదు. త్వరలో బాధితుల్ని కలుస్తా. నిజాలన్నీ బయటకు వస్తాయి. నేను తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకుంటాను’ అని వ్యాఖ్యానించారు. pic.twitter.com/FipkqoLlmB— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025శనివారం రాత్రి కరూర్లో విజయ్ మీట్ ది పీపుల్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సభలో విజయ్ ప్రసంగిస్తుండగా అభిమానులు,టీవీకే కార్యకర్తలు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. షెడ్యూల్ ప్రకారం .. విజయ్ కేఎస్ థియేటర్ వద్ద ఉదయం తొమ్మిది గంటలకు జరగాల్సిన ప్రచార సభ మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగింది. నామక్కల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి, జనసమూహం నడుమ రాత్రి ఏడుగంటలకు కరూర్ నగరంలోని వేలు స్వామిపురం సభాస్థలికి చేరుకున్నారు.దాదాపు ఏడు గంటల పాటు వేచివున్న వేలాది మంది జనం... విజయ్ను చూడాలని ఒక్కసారిగా ఎగబడడంతో తొలుత చిన్న స్థాయి తోపులాట చోటు చేసుకుంది. పలువురు అస్వస్థతకు గురయ్యే పరిస్థితి నెలకొనడంతో తన వాహనం నుంచి పదుల సంఖ్యలో వాటర్ బాటిళ్లను విజయ్ వారికి అందజేశారు. త్వరితగతిన ప్రచారం ముగించి అక్కడి నుంచి వెళ్లి పోయారు. -
తమిళనాట పట్టుకోసం బీజేపీ ఎత్తులు
దేశంలో ఇంతపెద్ద రాష్ట్రాన్ని అయినా జయిస్తున్న భారతీయజనతా పార్టీకి దక్షిణాది మాత్రం కోరుకుడుపడడం లేదు.. ఇటువైపున్న ద్రావిడ రాష్ట్రాలు తమిళనాడు.. కర్ణాటక.. కేరళ.. ఏపీ.. తెలంగాణ.. పాండిచ్చేరి.. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి అంతంతమాత్రమే.. ఏదో నానా యాతనా పడి..ఏదోలా కర్ణాటకలో ఏదోలా అధికారం దక్కించుకున్నా అది మూన్నాళ్ళ ముచ్చటే అవుతోంది తప్ప మళ్ళా అక్కడ అధికారాన్ని నిలుపుకోవడం బీజేపీకి సాధ్యం కావడం లేదు. ఇక ప్రాంతీయపార్టీలు ఆలవాలమైన తమినాడులో అయితే దశాబ్దాలుగా పోరుతున్నా బీజేపీ అడుగుకూడా పెట్టేందుకు వీలు చిక్కడంలేదు. అక్కడ ఉంటే అన్నాడీఎంకే.. కూడా డీఎంకే.. ఇక మిగతావన్నీ చిన్నా చితకాపార్టీలు మాత్రమే.. దేశాన్ని 75 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ కూడా తమిళనాట నాడు కరుణానిధి.. నేడు స్టాలిన్ చాటున మనుగడసాగించడమే తప్ప సొంతంగా అక్కడ సాధించిందేమీ లేదు.. ఇక బీజేపీ మాత్రం ఇప్పుడు ఎలాగైనా అక్కడ పాగా వేయాలని తీవ్రంగా తాపత్రయపడుతోంది. ఆ రాష్ట్ర శాసన సభలో 234 సీట్లుండగా అక్కడ 2026 ఏప్రిల్.. మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.. ప్రస్తుతానికి 46 శాతం ఓట్లు సాధించిన స్టాలిన్ సారధ్యంలోని డీఎంకే 159 సీట్లు సాధించి అధికారంలో ఉంది.. తరువాత 74 సీట్లతో పాళనిస్వామి సారథ్యంలోనే అన్నా డీఎంకే ప్రతిపక్ష పాత్రలో ఉంది.. ఇక ఇక్కడ బీజేపీకి స్థానం తక్కువే.. కానీ ఆశ చావని బీజేపీ నేతలు దింపుడుకల్లం ఆశతో తమిళనాడువైపు చూస్తూనే ఉన్నారు..ఇదిలా ఉండగానే మొన్న సినిమా నటుడు విజయ్ కరూర్ లో ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ రాజకీయ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించగా వందమందికి పైగా గాయపడ్డారు.. ఇది రాజకీయ సభలకు సంబంచింది దేశంలోనే అతి పెద్ద దుర్ఘటనగా చెబుతున్నారు.. అయితే ఈ ప్రమాద సంఘటన తరువాత బీజేపీ జాతీయ నాయకత్వం ఎంపీ హేమామాలిని సారధ్యంలోని ఎనిమిది మంది ఎంపీలతో ఒక కమిటీని వేసింది. తెలుగుదేశం.. శివ సేన వంటి ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకూ ఈ కమిటీలో స్థానం కల్పించిన బీజేపీ అక్కడి పరిస్థితిని అధ్యయనం చేస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ సభలో జరిగిన ప్రమాదాన్ని సైతం రాజకీయంగా ఎలా వాడుకోవాలన్నదానిగురించి బీజేపీ యోచన చేస్తోంది. అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 2. 62 శాతం ఓట్లు తెచ్చుకుని కేవలం నాలుగు స్థానాల్లోనే గెలిచింది. ఇప్పుడు కూడా బీజేపీకి అన్నా డీఎంకేతో వెళ్లడం మినహా మరో మార్గం లేకుండా పోయింది.. ఈ విజయ్ సభ ప్రమాదాన్ని సైతం బీజేపీ రాజకీయంగా వినియోగించుకునే అవకాశాన్ని అన్వేషిస్తోంది. ప్రాంతీయ పార్టీలు ప్రజలను ఓటర్లుగా వాడుకుని లబ్ధిపొందుతారుతప్ప వారి యోగ క్షేమాలు.. భద్రతా ఏమాత్రం పట్టించుకోవు అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే అంశాన్ని పార్టీ పరిశీలిస్తోంది. ఈ ప్రమాదాన్ని సామాజిక అంశంగా మార్చుకుని రాజకీయంగా లబ్ధిపొందడానికి ఉన్న అన్ని అవకాశాలను బీజేపీ వెతుకుతోంది.. ఇకనైనా రాష్ట్రంలో అన్నా డీఎంకేతో కలిసి అధికారంలోకి వస్తుందా చూడాలి.. సిమ్మాదిరప్పన్నఇదీ చదవండి: అలాంటి పని విజయ్ ఏనాడూ చేయబోరు -
భార్యతో వీడియోకాల్ మాట్లాడుతూ భర్త ఆత్మహత్య
తిరువొత్తియూరు: కోయంబత్తూరు పీలమేడు సమీపంలోని వి.కె.రోడ్, చేరన్ నగర్, 4వ బస్టాప్ ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు జయపాల్(47). ఇతని భార్య వాలెంటినా(40). వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాలెంటినా తన కొడుకుతో కలిసి మధురైలోని బంధువుల ఇంటికి వెళ్లింది. సంఘటన జరిగిన రాత్రి జయపాల్ తన భార్యకు సెల్ఫోన్లో వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అప్పుడు, అతను తన భార్యతో తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పాడు. అంతేకాకుండా వీడియో కాల్లో భార్యతో మాట్లాడుతూనే ఇంట్లో ఉన్న తన భార్య చుడీదార్ ప్యాంటు తీసుకుని ఫ్యాన్కు తగిలించి ఉరి వేసుకున్నాడు. వీడియో కాల్లో ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన అతని భార్య, వెంటనే కోయంబత్తూరులోని తమ ఇంటి సమీపంలో నివశిస్తున్న బంధువులకు ఫోన్ చేసి, తమ ఇంటికి వెళ్లి చూడాలని కోరింది. వారు అక్కడికి వెళ్లి జయపాల్ను రక్షించడానికి ప్రయత్నించారు. అతను ఉన్న గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి ఉరి వేసుకున్న అతన్ని కిందకు దించారు. ఆ తర్వాత అంబులెన్స్లో సింగనల్లూరు ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అతను ఆసుపత్రికి వచ్చే మార్గంలోనే మరణించినట్లు తెలిపారు. భర్త ఉరి వేసుకుని వేలాడుతుండడం చూసిన వాలెంటీనా వెంటనే కోయంబత్తూరుకు తిరిగి వచ్చింది. ఆమె కుమారుడితో కలసి మరణించిన జయపాల్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై వాలెంటినా కోయంబత్తూరు పీళమేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
అలాంటి పని విజయ్ ఏనాడూ చేయబోరు
కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో.. రెండు మానాడులు, సామాజిక యాత్రలో భాగంగా ర్యాలీలు నిర్వహించినా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం చూసుకోలేకపోయారంటూ తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా ఆ పార్టీ నేత ఒకరు చేసిన పని ఆ పార్టీని మరింత ఇబ్బంది పెడుతోంది.శ్రీలంక, నేపాల్లో జెన్జీ నిరసనలు ప్రభుత్వాల్ని గద్దె దించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో.. తమిళ యువత కూడా డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగాలంటూ విజయ్ పేరిట ఓ ప్రచారం నడుస్తోంది. అయితే కరూర్ ఘటన జరిగిన కొన్ని గంటలకే ఇది తెరపైకి రావడంతో.. ఇటు రాజకీయ ప్రత్యర్థులు, అటు నెటిజన్లు విజయ్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. టీవీకే(TVK) అధికారికంగా స్పందించింది. ఆ ప్రకటనతో విజయ్కిగానీ, పార్టీకిగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. విజయ్ ఏనాడూ ప్రజలను రెచ్చగొట్టరని, హింసకు ప్రేరేపించే ప్రయత్నాలు చేయబోరని ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ కూడా ఈ సిద్ధాంతానికే కట్టుబడి ఉందని ప్రకటించింది. అయితే ఈ ప్రకటన టీవీకే సీనియర్ నేత ఆధవ్ అర్జున చేయడం చేసిన సోషల్ మీడియా పోస్టుతో వైరల్ అయ్యింది. కరూర్ ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే యువతను రెచ్చగొట్టేలా ఆధవ్ అర్జున(TVK Aadhav Arjuna) పోస్ట్ చేశారంటూ అధికార డీఎంకే మండిపడింది. 41 మందిని బలిగొన్న కూడా ఆ పార్టీ ఇంకా బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తోంది. యువతను ఉసిగొల్పి హింసను ప్రేరేపించాలని చూస్తే సహించేది లేదు అని డీఎంకే ఎంపీ కనిమొళి(Kanimozhi) హెచ్చరించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన ఆ ట్వీట్ డిలీట్ చేశారు. అయితే.. ఆ ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. దీని ఆధారంగా డీఎంకే ఫిర్యాదునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్న ఆధవ్ అర్జున.. కరూర్ ఘటనలో కుట్ర కోణం ఉందంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఘటనపై దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ కోర్టును కోరారాయన. అలాగే బాధిత కుటుంబాలను విజయ్ పరామర్శించేందుకు అనుమతించాలంటూ రిక్వెస్ట్ చేశారు కూడా. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కరూర్ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో కమిటీ కూడా వేసింది.ఇదీ చదవండి: కరూర్ ఘటన 21 మందిపై కేసు.. తొలి అరెస్ట్ -
మొరాయించిన సర్వర్
తిరువళ్లూరు: రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన సర్వర్ మొరాయించడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయింది. దీంతో ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్తితి ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా తిరువళ్లూరు, మనవాలనగర్, ఊత్తుకోట, పొన్నేరి, గుమ్మిడిపూండి, పేరంబాక్కం, పూందమల్లితోపాటు పలు ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పని చేస్తున్నాయి. ఈ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జనన, మరణాలు, వివాహం, భూముల రిజిస్ట్రేషన్లు, కాపీ ఆప్ డాక్యుమెంట్, ఈసీతో సహా 23 రకాల సేవలను అందిస్తున్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధిచి ఆన్లైన్ పద్ధతిలోనే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మంచి రోజు కావడంతో వివాహ, భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తిరువళ్లూరులో మూడువందల మంది దరఖాస్తు చేసుకుని టోకెన్లను పొందారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఇందు కోసం అధికారులు, రిజిస్ట్రేషన్ చేయడానికి టోకెన్లు పొందిన వారు ఉదయం పది గంటలకే ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్ సర్వర్ మొరాయించడంతో జనం పడిగాపులు కాశారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు సర్వర్ పని చేయడం ప్రారంభించింది. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మెల్లగా నడిచింది. సర్వర్ మొరాయించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
శారదోత్సవ్ ప్రారంభం
సాక్షి, చైన్నె: ఎస్ఎంసీఏలో దేవీ నవరాత్రులలో భాగంగా శారదోత్సవ్ పేరిట 47వ వార్షికోత్సవ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆదివారం రాత్రి జరిగిన బ్రహ్మాండ పూజలతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఐదు రోజుల పాటుగా జరిగే ఈ ఉత్సవాలలో శక్తి దేవత–దుర్గా మాత విగ్రహాలకు పూజలు, సాంస్కృతిక, కళా ప్రదర్శనలు, భక్తీ గీతాలపన కార్యక్రమాలు జరగనున్నాయి. ఎస్ఎంసీఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10 వేల మందికి 3రోజులు ఆహారం పంపిణీకి చర్యలు తీసుకున్నారు. అలాగే విద్య, ఆరోగ్య సేవలకు చర్యలు తీసుకున్నారు. మణిపూర్ రిటైర్డ్ జస్టిస్ మురళీధరన్, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సెంథిల్కుమార్ తొలి రోజు కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్వాహకులు కౌసిక్ గంగూలి, సందీప్, భాస్కర్, అనితా రమేష్ తదితరులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
బల్టీకి మంచి ఆదరణ
తమిళసినిమా: సినిమా ఇప్పుడు ఒక్క భాషలో రూపొందితే పెట్టిన పెట్టుబడి రాబట్టడం కష్టతరంగా మారింది. దీంతో మంచి కంటెంట్తో యూనిక్ కథాంశంతో చిత్రాలను రూపొందించడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అలా తాజాగా తెరకెక్కిన చిత్రం బల్టీ. దీన్ని సంతోష్ సి.కురువిల్లా, బినూ జార్జ్ కలిసి నిర్మించారు. నూతన దర్శకుడు ఉన్ని శివలింగం కథ, కథనం,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ మలయాళం,తెలుగు భాషల్లో రూపొందింది. కబడ్డీ క్రీడను గ్యాంగ్ ముఠాలతో కలిపి తెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ఈ చిత్రంలో షేన్ నిగమ్, శాంతను భాగ్యరాజ్, దర్శకుడు సెల్వరాఘవన్, నటి ప్రీతి అస్రాణి,అల్ఫోన్స్ పుత్రన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రం గత శుక్రవారం తెరపైకి వచ్చింది. వీథి కబడ్డీ క్రీడను ఆడే రెండు జట్టుల్లోని ఒక జట్టును డబ్బు ఆశ చూపి ఓ రౌడీ ముఠా నాయకుడు తన వైపునకు తిప్పుకుని, వారిని తన దౌర్జన్యాలకు ఎలా వాడుకున్నాడు? అతని ట్రాప్లో పడిన ఆ జట్టు ఎలాంటి పరిణాయాలను ఎదుర్కొన్నారు? చివరికి అతని బంధనాల నుంచి బయట పడగలిగారా? వంటి పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో కూడిన బల్టీ చిత్రాన్ని ప్రేక్షకుల ఎంజాయ్ చేస్తున్నారని చిత్ర వర్గాలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు సెల్వరాఘవన్ విలనిజం చిత్రానికి బలంగా మారిందనే చెప్పాలి. కాగా కథా, కథనాలు కొత్తగా ఉండటమే చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభించడానికి ప్రధాన కారణం అంటున్నాయి చిత్ర వర్గాలు. నటి మహిమా నంబియార్ -
కొనసాగుతున్న అరుణాజగదీషన్ విచారణ
సాక్షి, చైన్నె : కరూర్లో తమిళగ వెట్రికళగం (టీవీకే ) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ప్రచారం తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఆస్పత్రిలో చికిత్సలో ఉన్న సుగుణ అనే మహిళ మరణించారు. ఆస్పత్రి మార్చురీలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మినహా తక్కిన వారందరి మృతదేహాలను ఆయా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఏలురు పుదుర్ గ్రామానికి చెందిన ఐదుగురు మరణించడంతో అందరి మృతదేహాలను ఒకే చోట ఖననం చేశారు. విశ్వనాథపురిలో తల్లి, ఇద్దరు బిడ్డలు మరణించడంతో వీరి మృతదేహాలను పక్కపక్కనే ఖననం చేశారు. ఆస్పత్రిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారందరూ కోలుకున్నట్టే అని వైద్యులు ప్రకటించారు. అదే సమయంలో సంఘటన జరిగిన రోజు రాత్రికి రాత్రే మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహణపై అనుమానాలు సైతం వ్యక్తం చేసే వారు పెరిగారు. రాత్రులలో పోస్టుమార్టం చేయడానికి వీలు లేనప్పడు ఎలా చేస్తారని ప్రశ్నించే వారు పెరగడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కేంద్రం 2021 నవంబర్ 15న ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా అన్ని రకాల వసతులు ఉంటే రాత్రులలో సైతం పోస్టుమార్టం చేయ వచ్చు అని స్పష్టం చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత పోస్టుమార్టం చేయకూడదన్నది తప్పడు సమాచారం, వదంతులు అని, రాత్రులలో కూడా పోస్టుమార్టం చేయవచ్చు అని వివరించారు. ఆలస్యమే కారణం.. టీవీకే స్థానిక నేత మది అళగన్ విజ్ఞప్తి మేరకు వేలు స్వామి పురంను వేదికగా ఎంపిక చేసి, 500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని ఎఫ్ఐఆర్లో వివరించారు. అనుమతి సమయంలో ఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల సలహా, ఆదేశాల మేరకు 11 నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు. కరూర్కు విజయ్ 12 గంటలకు ఆ పార్టీ ఎక్స్ పేజీలో పేర్కొనడంతో ఆ సమయానికే జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చేశారని వివరించారు. అయితే నిర్ణీత సమయంలో ఆయన రాలేదని, సాయంత్రం 4.45 గంటలకు కరూర్ సరిహద్దులలోకి ప్రవేశించినట్టు తెలియజేశారు. ఈ జాప్యం కారణంగా మదురై బైపాస్, కోయంబత్తూరు మార్గం, మునియనప్పన్ జంక్షన్, తిరుకాంబులియూరు జంక్షన్, వేలుస్వామి పురం మెయిన్ రోడ్డులలోకి జనం రాక మరింతగా పెరిగిందన్నారు. ఇక్కడి నుంచి విజయ్ నిబంధనలకు విరుద్దంగా రోడ్ షో నిర్వహించారని, రాంగ్ రూట్లో ప్రవేశించడంతో ట్రాఫిక్ జాంతో పాటూ రద్దీ మరింత ఎక్కువ కావడంతో కట్టడి చేయడానికి తీవ్రంగా పోలీసులు శ్రమించినట్టు వివరించారు. రాజకీయ ఉద్దేశంతో అక్కడక్కడ ఆహ్వాన ఏర్పాట్లు చేసుకుంటూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి పని గట్టుకుని జాప్యం చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొనడం గమనార్హం. రాత్రి 7 గంటలకు వేలు స్వామి పురం వద్దకు విజయ్ వచ్చారని, అప్పటికే అక్కడ రద్దీ మరింతగా ఉండటంతో పదే పదే కట్టడి చేయాలని, జనం నీళ్లు, ఆహారం లేక నీరశించి ఉన్నట్టుగా ఆ పార్టీ నేతలు భుస్సీ ఆనంద్, నిర్మల్కుమార్ దృష్టికి తీసుకెళ్లినా ఖాతర చేయలేదని, జనం ఊపిరి ఆడక ఇబ్బందులు పడుతారని హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదని పేర్కొనడం గమనార్హం. రద్దీ పెరిగే కొద్ది అక్కడున్న రేకుల షెడ్డులు, చెట్ల పైకి చేరిన వాళ్లు మరీ ఎక్కువ అని, అవి విరిగి పడడంతో ఎటు వెళ్లాలో తెలియక తోపులాట చోటు చేసుకుంది. విజయ్ ఆరు గంటలకు పైగా ఆలస్యంగా రావడం, నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించడం, జనాన్ని కట్టడి చేయడంలో విఫలం కావడం, వారికి కావాల్సిన నీళ్లు , ఆహారం లేక నీరసించి ఊపిరి ఆడక రద్దీలో సొమ్మసిల్లి పడి మరణించి వాళ్లే అధికం అని పేర్కొన్నారు. ఇది కూడా మరణాల సంఖ్య పెరిగేందుకు గల కారణాలుగా వివరించారు. పై నుంచి కింద పడ్డవారు, రద్దీలతో సొమ్మసిల్లిన వారు, పక్కనే ఉన్న కాలువలో జారి పడిన వాళ్లు అంటూ మరణాల సంఖ్య క్షణాలలో పెరిగినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొంటూ, నిబంధనల ఉల్లంఘణ, ఆలస్యమే ఉసురు తీసిందని స్పష్టం చేయడం గమనార్హం. 10 వేల మందికి ఉండాల్సిన చోట 20 వేల మందికి పైగా ఉండడం కూడా ప్రమాదానికి కారణాలుగా ప్రకటించారు. అన్నీ నిబంధనలు ఉల్లంఘించారు కరూర్ ఘటన గురించి రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ విచారణను వేగవంతం చేసింది. రెండోరోజూ ఆమె ఘటనా స్థలిని పరిశీలించారు. ఆ పరిసర వాసులతో మాట్లాడారు. అలాగే ఐదుగురు మరణించిన ఏలురు పుదురు, ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన విశ్వనాధపురి గ్రామానికి వెళ్లి అక్కడి బాధితులతో మాట్లాడారు. మరణించిన 41 మంది కుటుంబాలను కలిసి వారివద్ద వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కమిషన్ విచారణ ఓ వైపు జరుగుతుంటే, మరోవైపు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. ఈ కేసు విచారణ అధికారిగా ఇది వరకు నియమితులైన డీఎస్పీ సెల్వరాజ్ను తప్పించారు. ఆయన స్థానంలో ఏడీఎస్పీ ప్రేమానంద్ను సోమవారం రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో భద్రతా విధులలో ఉన్న మణివణ్ణన్ అనే ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరూర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీకే కరూర్ జిల్లా కార్యదర్శి మది అళగన్, రాష్ట్ర కార్యదర్శి భుస్సీ ఆనంద్, సంయుక్త కార్యదర్శి నిర్మల్కుమార్తో పాటూ ఇతరులు అంటూ మొత్తం నలుగురిపై ఐదు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అలాగే తనపై దాడి చేశారంటూ అంబులెన్స్ డ్రైవర్ ఈశ్వర్ ఇచ్చిన ఫిర్యాదుతో 10 మంది గుర్తు తెలియని టీవీకే వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఐదు సెక్షన్లతో నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో సమగ్ర వివరాలను పొందు పరిచారు. ఇందులో పేర్కొన్న అంశాలు విజయ్ మెడకు సైతం మున్ముందు ఉచ్చు పడేనా? అన్న చర్చ ఊపందుకుంది. రంగంలోకి ఫోరెన్సిక్ బృందం వేలు స్వామిపురంలో చిందర వందరంగా పడి ఉన్న చెప్పులు, వస్తువులును తొలగించ లేదు. ఆ పరిసరాలను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని మరింతగా విచారణ చేస్తున్నారు. తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరు నుంచి ప్రత్యేక ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగి అనువణువు పరిశీలిస్తోంది. ఘటన రోజున డ్రోన్ల ద్వారా చిత్రీకరించిన వీడియో ఫుట్టేజీలను విచారణ బృందం స్వాధీనం చేసుకుని పరిశీలిస్తోంది. కాగా తొక్కిసలాట సందర్భంగా సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు, ఎత్తయిన ప్రాంతాలలో ఉన్న వారు తమ కెమెరాలలో బంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి రావడంతో రద్దీలో చిక్కుకున్న జనం పడ్డ నరకయాతన తీవ్ర ఉద్వేగానికి గురి చేస్తోంది. -
అవకాశాల కోసం అడగలేదు..
తమిళసినిమా: నటుడు రంజిత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఇరుదు ముయర్చి. నటి మేగలి నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని వరం సినిమాస్ పతాకంపై వెంకటేశన్ పళనిస్వామి నిర్మించారు. వెంకట్ జనా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్లో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్బంగా చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ఆడియో ఆవిష్కరణ వేడుకలో తమిళనాడు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయకుమార్, కార్యదర్శి పేరరసు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను విడుదల చేశారు. ఈ వేదికపై చిత్ర దర్శకుడు వెంకట్ జనా మాట్లాడుతూ తన గత ఐదేళ్ల క్రితం తిరుపూర్లో జరిగిన ఘటన ఆధారంగా తెరకెక్కించిన కథా చిత్రం ఇదని చెప్పారు. ఓ వ్యాపారవేత్త కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడతాడన్నారు. ఆ ఘటనకు కారణాలేమిటి? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో ఇరుదు ముయర్చి చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఈ కథలో ఒక ఆత్మ ఉందని, అదే అందరినీ బాగా నటించేలా చేసిందని పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు రంజిత్ మాట్లాడుతూ కోడంబాక్కమ్, వడపళని,సాలిగ్రామం రోడ్లలో 30 ఏళ్ల ముందు పయనించినప్పుడు, ఇప్పుడు పయనిస్తున్నప్పుడు మనసు బరువెక్కుతుందన్నారు. ఎందుకంటే సినిమాల్లో ఏదో ఒక్క రోజు సాధించలేమా అని జీవితాలను త్యాగం చేసిన వారి సంఖ్య ఎక్కువని పేర్కొన్నారు. తన విషయానికి వస్తే తానెప్పుడూ అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లలేదన్నారు. ఒక సారి దర్శకుడు ఆర్కే సెల్వమణి తన ఫొటోను చూసి ఆఫీస్కు పిలిపించి నటించే అవకాశాన్ని కల్పించారన్నారు. అలా అయన్ని కలిసి హీరోగా ఎంపిక అయ్యేవరకూ వణుకు పుట్టిందన్నారు. ఆ రోజుల్లో కథకు సరిపోయే నటులనే దర్శకులు ఎంపిక చేసేవారని చెప్పారు. అలా ఆర్కే సెల్వమణి కథకు తాను సరిగా ఉంటానని భావించడంతోనే తాను హీరోగా ఎంపికయ్యానని పేర్కొన్నారు. ఇక ఇరుదు ముయర్చి చిత్రం విషయానికి వస్తే దర్శకుడు వెంకట్ జనా తనను కలిసి కథ చెప్పారన్నారు. ముందుగా తాను నటించడానికి సందేహించానని, అయితే కథ తనను ఆకట్టుకోవడంతో నటించడానికి సమ్మతించినట్లు చెప్పారు. తన 30 ఏళ్ల సినీ కెరీర్లో సంతృప్తిని కలిగించిన చిత్రం ఇదని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయడానికి ముందుకు వచ్చిన అజయ్ ఫిలింస్ ఫ్యాక్టరీ అధినేత అజయ్కు కృతజ్ఞతలు తెలిపారు. -
క్లుప్తంగా
కొరుక్కుపేట: బంగారు రథంపై కొలువై శ్రీవాసవీ అమ్మవారు భక్తులను కటాక్షించారు. చైన్నె జార్జిటౌన్లోని 300 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన శ్రీకన్యకాపరమేశ్వరీ దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా 8వ రోజు సోమవారం ఉదయం వేదపండితుల వేదపారాయణం, శ్రీ కన్యకా పరమేశ్వరి మూలమంత్ర హోమం, అభిషేకాలు నేత్రపర్వంగా చేపట్టారు. సాయంత్రం శ్రీవాసవీ అమ్మవారిని బంగారు రథంపై కొలువుదీర్చి దూపదీపారాధనలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అంతకుముందు జి.నేహ గాత్ర కచేరీ, శ్రీసాయి నాట్యాలయ భరతనాట్య ప్రదర్శనలు, కీరవాణి బృందం భక్తిగీతాలాపనలు, ఊరా ఆంజనేయులు గాత్ర కచేరీ అమితంగా ఆకట్టుకున్నాయి. భక్తులందరికీ అన్నప్రసాదాలను అందించారు. కొరుక్కుపేట: తూత్తుకుడి జిల్లా మేగ్నానపురంలోని చెమ్మరికులం కస్బాలో 8 అడుగుల పొడవు, 300 కిలోల బరువున్న మాజీ సీఎం పెరుంతలైవర్ కామరాజ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తమిళనాడు మత్స్య, మత్స్యకారుల సంక్షేమం, మత్స్య శాఖ మంత్రి అనితా రాధాకష్ణన్ ప్రత్యేక అతిథిగా హాజరై కామరాజ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, కామరాజ్ పై ఒక పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించిన గొప్ప నాయకుడు కామరాజ్ అని, ముఖ్యంగా విద్యార్థులకు విద్యకు పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. మాజీ ప్రదాని స్వర్గియ ఇందిరా గాంధీ ప్రధానమంత్రి కావడానికి కామరాజ్ కారణం అని, మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయనే ప్రవేశపెట్టారన్నారు. ఆ పథకాన్ని ప్రస్తుతం సీఎం స్టాలిన్ అద్భుతంగా విస్తరించారని కొనియాడారు. కొరుక్కుపేట: అంతర్జాతీయ స్థాయిలో తమ సేవలను విస్తరించడమే లక్ష్యంగా ముందుకెళుతామని సిన్సియర్ సిండికేషన్ సంస్థ సీఈఓ శివరామకృష్ణన్ తెలిపారు. ఈ మేరకు చైన్నెలో సోమవారం సిన్సియర్ సిండికేషన్ మూడో కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణన్ మాట్లాడుతూ ప్రస్తుతం 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సిన్సియర్ సిండికేషన్, రెండు వందల కుటుంబాలకు విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగిందన్నారు. తమ ఉనికిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా మరింత విస్తరించాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. కొరుక్కుపేట: ఐఐటీమద్రాసు మేనేజ్మెంట్ విభాగం కొత్తగా రెండు సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ను లక్ష్యంగా చేసుకుని తీసుకుని వస్తున్న ఈ కోర్సు ఆధునిక వ్యాపారాలను నడిపించడానికి సమకాలీన నిర్వాహణ జ్ఞానాన్ని పొందుపరచడానికి వీలుగా ఈ కోర్సు తీసుకుని వచ్చినట్టు ఆ విభాగాధిపతి ప్రొఫెసర్ సాజి కె.మాథ్యూ తెలిపారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు. షార్ట్ లిస్టు చేయబడిన విద్యార్థులు నవంబర్ 8, 9వ తేదీల్లో ఐఐటీ మద్రాసు క్యాంపస్లో ఎంపిక ప్రక్రియ ద్వారా వెళుతారు. ఇందులో రాతపూర్వక ఆప్టిట్యూట్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. డిసెంబర్లో ఫలితాలు అందించబడి, జనవరి నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించా రు. అక్టోబర్ 19లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు htt p://doms.iitm.ac.in/admission/ చూడవచ్చునని వెల్లడించారు. తిరువొత్తియూరు: భారత రెడ్క్రాస్ సొసైటీ తమిళనాడు శాఖ ఆధ్వర్యంలో ఎగ్మూరులోని కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని రెడ్క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షుడు జస్టిస్ జయచంద్రన్ ప్రారంభించారు. రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షుడు, గవర్నర్ ఆర్.ఎన్.రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ న్యాయ కళాశాల విద్యార్థులు, పనిమలర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు, రెడ్క్రాస్ సొసైటీ ఉద్యోగులు వంద మందికి పైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు కృష్ణన్, కార్తి నారాయణన్, ఆత్మనాథన్, ఓం ప్రకాష్, శంకర్ ప్రకాష్, థామస్ జాన్ పాల్గొన్నారు. -
బీజేపీ నిజనిర్ధారణ కమిటీ
సాక్షి, చైన్నె : కరూర్ ఘటనపై సమగ్ర విచారణకు బీజేపీ నేతృత్వంలో జాతీయ అధిష్టానం నిజనిర్ధాణ కమిటీని నియమించింది. ఎంపీ హేమామాలిని నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైనట్టు ఢిల్లీ నుంచి సమాచారం వెలువడింది. ఈ పరిస్థితులలో కరూర్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, సహాయ మంత్రి ఎల్. మురుగన్ సోమవారం పర్యటించారు. ఘటన జరిగిన వేలు స్వామి పురంను పరిశీలించారు. ఇక్కడి పరిస్థితులను గురించి కలెక్టర్ తంగ వేల్ అన్ని వివరాలను వారికి తెలియజేశారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చరు. నిర్మలా సీతారామన్ వెన్నంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్తో పాటూ ముఖ్య నేతలు ఉన్నారు. ఇదిలా ఉండగా కరూర్ ఘటన పై సమగ్ర విచారణకు బీజేపీ జాతీయ అధిష్టానం సైతం నిర్ణయించింది. ఎంపీ హేమామాలిని నేతృత్వంలో తేజస్వీ సూర్య తదితర ఎంపీలు, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరుల కూడిన 8 మందితో ఈ కమిటీని నియమించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ కమిటీకి హేమామాలిని నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. ఈ బృందం మంగళ వారం లేదా గురువారం కరూర్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. -
కరూర్ ప్రమాదం.. ఘోర విషాదం
సాక్షి, చైన్నె: కరూర్ ఘటన గురించి సీఎం స్టాలిన్ సోమవారం వీడియో విడుదల చేశారు. ఇది ఘోర విషాదం. భయంకరమైన విషాదం, గతంలో ఎన్నడూ తాను చూడ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఇలాంటి ఘటన ఎన్నడూ జరగ కూడదని వ్యాఖ్యలు చేశారు. ఆస్పత్రిలో తాను ప్రత్యక్షంగా చూసిన దృశ్యాలు మనస్సును ద్రవింప చేస్తున్నాయని, ఇంకా కళ్ల ముందే దృశ్యాలు కనిపిస్తున్నాయని ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. బరువెక్కిన హృదయంతోనే తాను ఈ వీడియో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఘటన సమాచారంతో ఆ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, ఇంట్లో ఉండలేక తానూ స్వయంగా గురించి గుర్తు చేశారు. పిల్లలు, మహిళలు అంటూ 41 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి మృతదేహాలు చూసిన సమయంలో, వారి కుటుంబాల వేదన తననుమరింతగా కలిచి వేశాయన్నారు. ఈ ఘటనకు సంబంధించి జస్టిస్ అరునా జగదీశన్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ లోపు సామాజిక మాధ్యమాలలో సాగుతున్న పుకార్లను నమ్మవద్దు అని విన్నవించారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, అతని మద్దతుదారులైనా అమాయక పౌరులు ఇలాంటి కార్యక్రమాలలో చనిపోవాలని కోరుకోరు అని పేర్కొంటూ, ఈ ఘటనలో, మరణించిన వాళ్లు ఏ పార్టీకి చెందినవారు అన్నది ముఖ్యం కాదన్నారు. అందరూ తమిళులు అని, అందరూ తమిళ బంధాలు అని ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. విచారం, దుఃఖం చుట్టుముట్టబడిన ఈ సమరంలో బాధ్యతారహితమైన, హానికరమైన సందేశాలను నివారించాల్సిన అవశ్యం ఉందన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంస్థలు భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలకు కొత్త మార్గదర్శకాలను తీర్చిదిద్దబోతున్నామన్నారు. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా నియమ, నిబంధనలు విధిస్తామని, రాజకీయ వైరుధ్యాలు, విధాన వైరుధ్యాలు, వ్యక్తిగత శత్రుత్వాలను పక్కన పెట్టి, అందరూ, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలని విన్నవించారు. తమిళనాడు ఎల్లప్పుడూ దేశానికి అనేక విధాలుగా మార్గదర్శకంగా ఉంటోందని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా నిరోధించడం అందరి కర్తవ్యంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా బాధిత కుటుంబాలను డీఎంకే ఎంపీ కనిమొళి పరామర్శించి ప్రభుత్వం తరపున రూ. 10 లక్షలు చెక్కును అందజేశారు. ఇక, దుబాయ్ పర్యటనకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో పర్యటనను రద్దు చేసుకున్న డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ సోమవారం మళ్లీ తన ప్రయాణాన్ని చేపట్టారు. సీఎం స్టాలిన్ -
సీబీఐ విచారణకు పట్టు
విజయ్కు రాహుల్ ఫోన్కాల్ కరూర్ నుంచి రాగానే పనయూరు ఇంటికే విజయ్ పరిమితమయ్యారు. కాగా ఆ ఇంటి ని పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో భద్రతను పెంచారు. 34 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చారు. సోమవారం ఉదయాన్నే పనయూరు నివాసం నుంచి మకాంను నగరంలోని పట్టినంబాక్కం ఇంటికి విజయ్ మార్చేశారు. ఈ పరిస్థితులలో ఉదయాన్నే కరూర్ ఘటన గురించి సీఎం స్టాలిన్తో మాట్లాడిన ఏఐసీసీ నేత, లోక్సభ ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ విజయ్తో సైతం ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిసింది. 15 నిమిషాల పాటూ వీరు మాట్లాడుకున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. విజయ్ వద్ద వివరాలను సేకరించిన రాహుల్ ఓదార్చినట్టు చెబుతున్నారు. అదే సమయంలో ఉదయాన్నే ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు వచ్చిన కాంగ్రెస్ జాతీయ ప్రతినిధుల బృందం టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగైతో కలిసి కరూర్కు వెళ్లింది.సాక్షి, చైన్నె:కరూర్ ఘటనను సీబీఐ విచారణకు అప్పగించాలని కోరుతూ తమిళగ వెట్రి కళగం మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున తరపున ఈ పిటిషన్ దాఖలైంది. కరూర్ ఘటనపై టీవీకే న్యాయవాద బృందం ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి దండపాణిని కలిసిన సమయంలో ఆయన ఇచ్చిన సూచనతో మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం ఆదవ్ అర్జున తరపున న్యాయవాదుల బృందం ఈ పిటిషన్ వేశారు. వేలు స్వామి పురంలో చోటు చేసుకున్న ఘటన ప్రమాదమా? పథకం ప్రకారం జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్లో వివరాలను పొందు పరిచారు. ప్రచారంలోకి రాళ్లు విసరడం, పోలీసులు లాఠీచార్జ్ చేయడం, విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. పోలీసులు భద్రతా వైఫల్యంను సైతం వివరిస్తూ, మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కేసును సీబీఐకు అప్పగించాలని విన్నవించారు. అలాగే విజయ్ కరూర్ వెళ్లి బాధితులను పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాలని, గట్టి భద్రత కల్పించాలని కోరారు. ఈ పిటిషన్ మంగళవారం లేదా అక్టోబరు 3వ తేదీన విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పిటిషన్ దాఖలు తదుపరి ఆదవ్ అర్జున ఓ ప్రకటన విడుదల చేస్తూ, తనలోని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తన కుటుంబంలోని వ్యక్తులు మరణించినంతగా గుండెవేదనతో ఉన్నట్టు పేర్కొన్నారు. భారీగా నిరసనలు.. విజయ్కు వ్యతిరేకంగా ఓ వైపు పోస్టర్లు హల్చల్ చేస్తూ వస్తుంటే, మరోవైపు తిరుచ్చితోపాటూ పలు చోట్ల ఆందోళనలు ప్రారంభమయ్యాయి. కరూర్ ఘటనకు ఆయన్న బాధ్యుడిగా చేరుస్తూ అరెస్టు చేయాలన్న నినాదంతో తెర మీదకు వచ్చింది. కొన్ని కుటుంబాలు అయితే, విజయ్ ప్రకటించిన ఆర్థిక సాయం తమకు వద్దని తిరస్కరించే విధంగా ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా కరూరల్లోని టీవీకే ముఖ్య నిర్వాహకులు కుటుంబాలతో సహా అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు విచారణ, అరెస్టు భయంతోనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. అలాగే విజయ్ పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి నేతలు పలువురు వైదొలగుతుండడం గమనార్హం. ఇక, విజయ్ తరపున ఇంత వరకు బాధితులను ఎవ్వరూ పరామర్శించక పోవడం విమర్శలకు దారి తీస్తున్నాయి. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో విజయ్తో కలిసి నిలబడుదాం అని సీనీ వర్గాలకు దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్ పిలుపు ఇవ్వడం విశేషం. ఇలాంటి రాజకీయ కార్యక్రమాలకు పిల్లలను దయ చేసి వెంట బెట్టుకుని వెళ్ల వద్దంటూ నటుడు రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. ఇక టీవీకే గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది సెల్వకుమార్ మధురై ధర్మాసనంలో పిటిషన్ వేశారు. ఆడిటర్ గురుమూర్తితో సంప్రదింపులు? బీజేపీకి అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడ్డ ఆడిటర్ గురు మూర్తితో టీవీకే వర్గాల సంప్రదింపు వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి గురుమూర్తి నివాసానికి టీవీకే ముఖ్యులు పలువురు వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన గురుమూర్తిని కలవడం ప్రాధాన్యతకు దారి తీసినట్లయ్యింది. విజయ్ ఒకటి రెండురోజులలో ఆయన్ని కలిసే అవకాశాలు ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. -
ఏడాది చివరికి 50 ఆలయాల్లో కుంభాభిషేకం
– మంత్రి పి.కె. శేఖర్ బాబు వెల్లడి కొరుక్కుపేట: చైన్నె జిల్లాలకు చెందిన జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ అధికారుల అధ్యయన బృందం హిందూ మత కమిషనర్ కార్యాలయంలో మంత్రి పి.కె. శేఖర్ బాబు నేతృత్వంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. చైన్నె మండలాల్లో మాత్రమే ఒట్టేరి చెల్లపిళ్లైరాయర్ ఆలయం, విల్లివాక్కం, అగతీశ్వర ఆలయం, కొడుంగయ్యూరు అరుల్మిగు భవానీయమ్మన్ ఆలయం, కొండి తోపు కాశీ విశ్వనాథ ఆలయం, కొలత్తూరు సోమనాథ ఆలయం ఉన్నాయి. ఇంకా తేనంపేట్ బాల సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, పోరూర్ రామ నాథీశ్వరర్ ఆలయంలో త్వరలో కుంభాభిషేకం నిర్వహించనున్నారు. అలాగే ఈ సంవత్సరం చివరి నాటికి నాలుగు మండలాల్లోని 50 ఆలయాలను పునరుద్ధరించాలని, కుంభాభిషేకం నిర్వహించడానికి పనులను వేగవంతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో హిందూ మత దేవాదాయ శాఖ కమిషనర్ పి.ఎన్. శ్రీధర్, చీఫ్ ఇంజినీర్ పి. పెరియసామి తదితరులు పాల్గొన్నారు. తుపాకీ గురిపెట్టి 12 మంది మత్స్యకారుల అరెస్టు – శ్రీలంక నేవీ దాష్టీకం కొరుక్కుపేట: శ్రీలంక నావికాదళం తుపాకీతో బెదిరించి 12 మంది కారైకల్ మత్స్యకారుల అరెస్టు చేయడం కలకలం రేపింది. వివరాలు.. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు తరచూ సరిహద్దు దాటి చేపలు పడుతున్నారని శ్రీలంక నావికాదళం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మత్స్యకారుల అక్రమ నిర్బంధాన్ని అంతం చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నప్పటికీ శ్రీలంక నావికాదళం తీరు మార్చుకోవడం లేదు. తాజాగా 12 మంది కారైకల్ మత్స్యకారులను తుపాకీ గురిపెట్టి అరెస్టు చేశారు. శ్రీలంక నావికాదళం చేసిన ఈ దుందుడుకు చర్య మత్స్యకారులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈనేపథ్యంలో శ్రీలంక నేవీ దురాక్రమణను ఆపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని జాలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆయుధ పూజ పండుగకు ప్రత్యేక రైళ్లు తిరువొత్తియూరు: రాష్ట్ర ప్రజలు ఆయుధ పూజ, సరస్వతి పూజ బుధ, గురువారాల్లో జరుపుకోనున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ సెలవులు వరుసగా వస్తున్నాయి. శుక్రవారం ఒక రోజు సెలవు తీసుకుంటే వరుసగా 5 రోజులు సెలవు వస్తోంది. దీంతో పలువురు స్వస్థలాలకు వెళ్తున్నారు. రద్దీని తగ్గించడానికి ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. సెప్టెంబర్ 30 మంగళవారం చైన్నె నుంచి తిరువనంతపురం, సెంగోట్టై, మదురై వంటి ప్రత్యేక ప్రాంతాలకు రైళ్లు నడుపుతున్నారు. ఇక చైన్నె ఎగ్మూర్ నుంచి తిరువనంతపురానికి నేడు (మంగళవారం) రాత్రి 10.15 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 2.05 గంటలకు తిరువనంతపురం నార్త్ స్టేషన్కు చేరుకుంటుంది. అలాగే, అక్టోబర్ 5న తిరువనంతపురం నార్త్ నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఎగ్మూర్ చేరుకుంటుంది. ఈ రైలు పెరంబూర్, తిరువళ్లూరు, అరక్కోణం, కాట్పాడి, సేలం, ఈరోడ్ మీదుగా నడుస్తుంది. తాంబరం నుంచి మంగళవారం సాయంత్రం 4.15 గంటలకు సెంగోట్టైకి ప్రత్యేక రైలు నడుపనున్నారు. ఈ రైలు మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు సెంగోట్టై చేరుకుంటుంది. ఇది విలుప్పురం, అరియలూర్, తిరుచ్చి మీదుగా వెళ్లనుంది. రామన్నతో సీవీ షణ్ముగం సమావేవం సాక్షి, చైన్నె: పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుతో సోమవారం తైలాపురంలో అన్నాడీఎంకే సీనియర్ నేత, ఎంపీ సీవీ షణ్ముగం భేటీ అయ్యారు. గంటన్నర పాటుగా వీరి సమావేశం సాగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్య బయల్దేరిన వివాదానికి కొలిక్కి తెచ్చే దిశగా బీజేపీ పెద్దలు దృష్టి పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. రాందాసుతో సీవీ షణ్ముగం సన్నిహితంగా మెలుగుతుండడం, తరచూ వీరు సమావేశం కావడాన్ని బీజేపీ అధిష్టానం పరిగణించినట్టు సమాచారం. రాందాసును అన్నాడీఎంకే–బీజేపీ కూటమిలోకి తీసుకొచ్చే వ్యూహంలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఢిల్లీకి వెళ్లి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తొలుత విల్లుపరంలో సీవీ షణ్ముగంతో గత వారం చివర్లో భేటీ అయ్యారు. ఈ భేటీ తదుపరి సోమవారం ఉదయాన్నే సీవీ షణ్ముగం తైలాపురం వెళ్లడం ప్రాధాన్యతకు దారి తీసింది. సుమారు గంటన్నర పాటుగా వీరి మధ్య రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్టు తైలాపురం వర్గాలు పేర్కొంటున్నాయి. వివాదాలకు ముగింపు పలికే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్టు చెబుతున్నారు. -
కరూర్ తొక్కిసలాట ఘటనలో తొలి అరెస్ట్
చెన్నై: కరూర్లో తమిళగ వెట్రికళగం(TVK) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్(Vijay) ప్రచారం తొక్కిసలాట ఘటనలో తొలి అరెస్ట్ జరిగింది. టీవీకే జిల్లా సెక్రటరీ మతియఝగన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, విజయ్ ప్రచారం తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది.కరూర్ ఘటన గురించి రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ విచారణను వేగవంతం చేసింది. రెండోరోజూ ఆమె ఘటనా స్థలిని పరిశీలించారు. ఆ పరిసర వాసులతో మాట్లాడారు. అలాగే ఐదుగురు మరణించిన ఏలురు పుదురు, ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన విశ్వనాధపురి గ్రామానికి వెళ్లి అక్కడి బాధితులతో మాట్లాడారు. మరణించిన 41 మంది కుటుంబాలను కలిసి వారివద్ద వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.ఈ కమిషన్ విచారణ ఓ వైపు జరుగుతుంటే, మరోవైపు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. ఈ కేసు విచారణ అధికారిగా ఇది వరకు నియమితులైన డీఎస్పీ సెల్వరాజ్ను తప్పించారు. ఆయన స్థానంలో ఏడీఎస్పీ ప్రేమానంద్ను సోమవారం రంగంలోకి దించారు.ఘటనా స్థలంలో భద్రతా విధులలో ఉన్న మణివణ్ణన్ అనే ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరూర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీకే కరూర్ జిల్లా కార్యదర్శి ∙మది అళగన్, రాష్ట్ర కార్యదర్శి భుస్సీ ఆనంద్, సంయుక్త కార్యదర్శి నిర్మల్కుమార్తో పాటూ ఇతరులు అంటూ మొత్తం నలుగురిపై ఐదు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అలాగే తనపై దాడి చేశారంటూ అంబులెన్స్ డ్రైవర్ ఈశ్వర్ ఇచ్చిన ఫిర్యాదుతో 10 మంది గుర్తు తెలియని టీవీకే వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఐదు సెక్షన్లతో నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో సమగ్ర వివరాలను పొందు పరిచారు. ఇందులో పేర్కొన్న అంశాలు విజయ్ మెడకు సైతం మున్ముందు ఉచ్చు పడేనా? అన్న చర్చ ఊపందుకుంది. -
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి
వేలూరు: దివ్యాంగుల సమస్యలపై విచారణ జరిపి వెంటనే న్యాయం చేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం వేలూరు కలెక్టరేట్లో ప్రజా విన్నపాల దినోత్సవం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మారు మూల గ్రామాల నుంచి వికలాంగులు, వృద్ధులు ఎంతో కష్టపడి కలెక్టరేట్ చేరుకొని వినతులు అందజేస్తున్నారని వీటిపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విచారణ జరిపి వారికి న్యాయం చేయాలన్నారు. అర్జీ దారులను కార్యాలయాల చుట్టూ తిప్పించకుండా వారికి పరిష్కార మార్గం చూపాలన్నారు. అనంతరం అంతర్జాతీయ చెవిటి మూగ దినోత్సవాన్ని పురష్కరించుకుని అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ సత్వచ్చారి, హోలీక్రాస్ పాఠశాల తదితర ప్రాంతాలకు వెళ్లి కరపత్రాలు అందజేసి అవగాహన కల్పించారు. ముందుగా జిల్లాలోని పోలీసు అధికారులతో శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మాలతి, సబ్ కలెక్టర్ సెంథిల్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన గ్రావిటాస్–25 సైన్స్ ఎగ్జిబిషన్
వేలూరు: ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా తయారయ్యేందుకు ఉన్నత విద్య, పరిశోధనలు ముఖ్య పాత్ర వహిస్తుందని నీతి అయోగ్ డైరెక్టర్ సషాంస దెరి అన్నారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఆవరణలో మూడు రోజుల పాటూ జరిగే గ్రావిటాస్–25 ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో వివిధ ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటూ నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలన్నారు. ఉన్నత విద్య అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. కర్ణాటక రాష్ట్రం హొసకోట ఎమ్మెల్యే, విద్యుత్శాఖ అభివృద్ధి చైర్మన్ శరత్కుమార్ మాట్లాడుతూ నూతన టెక్నాలజీ ఉపయోగించి లెదర్ను రాణిపేట జిల్లాలో తయారు చేయడం అభినందనీయమన్నారు. దేశంలో 10 శాతం నష్టాలు,75 శాతం ఖర్చులతో ఉన్నాయన్నారు. ప్రస్తుతం విద్యార్థులు వివిధ పరిశోధనలు చేయడం అభినందనీయమన్నారు. మరిన్ని పరిశోధనలు చేసేందుకు ముందుకు రావాలన్నారు. వీఐటీ ఉపాద్యక్షులు శంకర్ విశ్వనాథన్ మాట్లాడుతూ ప్రస్తుతం మొత్తం 13 వేల మంది విద్యార్థులు గ్రావిటాస్లో కలుసుకొని పలు పరిశోధనల ఎగ్జిభిషన్లను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ఈ పరిశోధన పోటీల్లో గెలుపొందిన వారికి రూ: 30 లక్షలు విలువ చేసే బహుమతులను అందజేస్తున్నామన్నారు. అనంతరం వివిధ ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శేఖర్, కార్యనిర్వహన డైరెక్టర్ సంద్యా పెంటారెడ్డి, విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
నటి మహిమా నంబియార్ హెచ్చరిక
తమిళసినిమా: గత 15 ఏళ్లగా కథానాయకిగా రాణిస్తున్న మలయాళీ బ్యూటీ మహిమా నంబియార్. మాతృభాషలోనే కాకుండా తమిళంలోనూ పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా టాలీవుడ్లో ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కథానాయకిగానే కాకుండి ప్రతి నాయకి పాత్రల్లోనూ మెప్పిస్తున్న మహిమా నంబియార్కు ప్రస్తుతం మలయాళంలో ఒక చిత్రం, తమిళంలో ఒక చిత్రం చేతిలో ఉన్నాయి. కాగా సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్గా ఉండే ఆ బామ గ్రామరస్ పాత్రల్లో నటించడానికి వెనుకాడటం లేదు. దీంతో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ ఈమెను పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్నాయి. అదే ఇప్పుడు ఈమెకు కోపాన్ని రేకెత్తిస్తోంది. దీంతో మహిమా నంబియార్ యూట్యూబ్ ఛానల్స్కు హెచ్చరికలు జారీ చేశారు. దీని గురించి ఈమె తన ఇన్స్ట్రాలో పేర్కొంటూ ఇటీవల కాలంలో తన గురించి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అవాస్తవాలను ప్రసారం చేస్తున్నాయన్నారు. అలాంటి వదంతులను ఇప్పటి వరకూ సహిస్తూ వచ్చానని, ఇకపై సహించేది లేదని చట్టపరమైన చర్చలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇంత కాలం తన గురించి జరుగుతున్న వదంతులను శాంతంగా సహిస్తూ వచ్చానని, ఇకపై అలా ఉండనని, తాను మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదని, అదే విధంగా తన వ్యక్తగత విషయాల్లో జోక్యం చేసుకోరాదని అన్నారు. ఒక వేళ మీరు హద్దులు మీరితే కచ్చతం తనపై అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్చలు తీసుకుంటాననీ, ఇదే తన చివరి హెచ్చరిక అని నటి మహిమా నంబియార్ పేర్కొన్నారు. ఇంతకీ ఈ మూడు పదుల అమ్మడు అంతగా హర్ట్ అయిన ప్రచారం ఏమిటో అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.