Tamil Nadu
-
బీజేపీకి బై చెప్పి.. టీవీకేలో చేరిన బీజేపీ నాయకురాలు
చెన్నై: తమిళనాడులో అధికార పార్టీ తమిళగ వెట్రీ కళగం (టీవీకే)లోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు.. సీఎం విజయ్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎస్ విజయధరణి, అన్నాడీఎంకే నేత బాలగంగ తదితరులు శనివారం టీవీకేలో చేరారు. వీరికి పార్టీ కండువాలతో మంత్రులు ఎన్. ఆనంద్, ఆధవ్ అర్జున స్వాగతం పలికారు.టీవీకే చేరడం సంతోషంగా ఉందని ఎస్ విజయధరణి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "తమిళనాడులో టీవీకే మార్పును తీసుకువచ్చింది. జోసఫ్ విజయ్ నాయకత్వంలోని ప్రభుత్వం అవినీతిని రూపుమాపుతూ, మహిళలకు భద్రతను కల్పిస్తోంది. ముఖ్యమంత్రి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చారు. ప్రజల కోసం పనిచేసే అవకాశాన్ని టీవీకే నాకు కల్పించింది, ఆ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు.మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి..విజయధరణి ఇటీవల జరిగిన శానససభ ఎన్నికల్లో కన్యాకుమారి జిల్లాలోని విలవంకోడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అంతకుముందు ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేశారు. 2016లో ఆమె కర్ణాటక వ్యవహారాల బాధ్యతతో కూడిన అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చదవండి: రంగస్వామితో విజయ్ దూత రహస్య భేటీ!2011లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత వరుసగా 2016, 2021లోనూ గెలిచారు. 2024, ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కన్యాకుమారి లోక్సభ టికెట్ కోసం ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఆమెకు బీజేపీ లోక్సభ టికెట్ ఇవ్వలేదు. తాజాగా ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా విజయం దక్కలేదు. దీంతో బీజేపీని వీడి టీవీకే పార్టీలోకి వచ్చారు. -
బీజేపీని వీడినా తగ్గని పాపులారిటీ.. అన్నామలై క్రేజ్పై కొత్త చర్చ!
కోయంబత్తూరు: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా తన ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు. తాజాగా కోయంబత్తూరుకు చేరుకున్న అన్నామలైకి అభిమానులు, మద్దతుదారులు, యువత పెద్ద ఎత్తున స్వాగతం పలకడంతో నగరం రాజకీయ సందడితో మార్మోగిపోయింది. కాగా, విమానాశ్రయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల వరకు వందలాది వాహనాలతో ర్యాలీలు నిర్వహించగా, మద్దతుదారులు పూలమాలలు, నినాదాలతో అన్నామలైకి ఘన స్వాగతం పలికారు. ఆయన కొత్త రాజకీయ ప్రయాణానికి మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.బీజేపీకి రాజీనామా..గత కొంతకాలంగా తమిళనాడు రాజకీయాలపై తన ఆలోచనలు, బీజేపీ కేంద్ర నాయకత్వ వైఖరికి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని అన్నామలై బహిరంగంగానే చెప్పారు. చివరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన, ఈ నిర్ణయం ఒక్కసారిగా తీసుకున్నది కాదని గత 18 నెలలుగా పార్టీ అగ్రనేతలతో చర్చించిన తర్వాతే తీసుకున్నానని వెల్లడించారు.Annamalai 🔥 pic.twitter.com/ufI7oyRHGx— 𝙎𝙄𝙑𝘼Ⓖ (@mrharichandrar1) June 13, 2026కొత్త ఉద్యమానికి శ్రీకారంబీజేపీని వీడిన వెంటనే అన్నామలై "We The Leaders" పేరుతో కొత్త ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. వారసత్వ రాజకీయాలకు ప్రత్యామ్నాయం అందించడం, యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడం, ప్రజలే నాయకులుగా ఎదిగే వేదికను నిర్మించడమే ఈ ఉద్యమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. అన్నామలై ప్రారంభించిన కొత్త ఉద్యమానికి అనూహ్య స్పందన లభించింది. ఉద్యమం ప్రారంభమైన తొలి 24 గంటల్లోనే 13 లక్షల మందికి పైగా సభ్యత్వం నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇది తమిళనాడులో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, అన్నామలై రాజకీయ ప్రయాణంలో కోయంబత్తూరుకు ప్రత్యేక స్థానం ఉంది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆయన రాజకీయంగా ఎదిగిన ప్రాంతాల్లో కోయంబత్తూరు ఒకటి. భవిష్యత్తులో తన రాజకీయ ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా కూడా కోయంబత్తూరును అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.கோவையில் அண்ணாமலை அண்ணா அவர்களுக்கு உற்சாகமான வரவேற்பு! pic.twitter.com/GJJUEfnpL7— Army of Dheeran Annamalai (@annamalai_chap2) June 13, 2026బీజేపీలో కలకలంఅన్నామలై రాజీనామా తర్వాత తమిళనాడు బీజేపీలో అసంతృప్తి పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు నేతలు, కార్యకర్తలు కూడా పార్టీకి రాజీనామా చేయడంతో బీజేపీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్ కార్యకర్తలను పార్టీని వీడవద్దని కోరుతూ ప్రత్యేక పిలుపునిచ్చారు. మరోవైపు.. అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమం భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఆయనకు లభిస్తున్న ప్రజా స్పందన చూస్తే, తమిళనాడు రాజకీయ సమీకరణాల్లో కొత్త మార్పులకు ఇది నాంది కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పుట్టినరోజు నాడే.. విజయ్ నుంచి బిగ్ లాంచ్?
రాజకీయాల్లో గెలవాలంటే కేవలం ప్రజాబలం మాత్రమే కాదు.. తమ మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లే ‘బలం’ కూడా అవసరమే. అందుకే డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను అన్లిమిటెడ్గా వాడేసుకుంటున్నాయి పార్టీలు. అలాగే.. పార్టీలకు అనుకూలంగా పేపర్లు, టీవీ చానెల్స్ ఉండటం కొత్త విషయం కాదు. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత జోసెఫ్ విజయ్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ అఖండ విజయం సాధించింది. అయితే ఆ గెలుపులో మీడియా కంటే.. సోషల్ మీడియానే అధిక పాత్ర పోషించింది. అందుకు కారణం.. అప్పటి అధికార, ప్రతిపక్షాల చేతుల్లోనే మీడియా చానెల్స్, పేపర్లు మొత్తం ఉండడం. ఆ సమయంలో ఆయన ఈ పరిస్థితిని పార్టీ మీటింగ్లోనూ ప్రస్తావించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు తన టీవీకే పార్టీ తరఫున కొత్త వార్తా చానెల్ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. జూన్ 22న ‘వెట్రి న్యూస్’ అనే న్యూస్ చానెల్ సీఎం విజయ్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోందట. అదే రోజు ఆయన పుట్టినరోజు కావడం గమనార్హం. తమిళగ వెట్రి కగళం అంటే తమిళ విక్టరీ క్లబ్ అని అర్థం. విజయ్ తన పేరులోని విజయాన్ని పార్టీకి పెట్టారు. ఇప్పుడు చానెల్కు కూడా వెట్రి(విజయం) అనే ఉంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ప్రముఖ ఇన్ఫ్లున్సెయర్, పొలిటికల్ అనలిస్ట్గా పేరుగాంచిన మణికందన్ భాస్కరన్ తన bbtrackermanix ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విషయం ప్రకటించారు. దీంతో టీవీకే వర్గాలు ఫుల్ జోష్లో ఉన్నాయి. రాజకీయ పార్టీలు, మీడియా మధ్య ఉన్న అనుబంధం దేశంలో.. తమిళనాడులో కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా రాజకీయాలు, మీడియా రంగం పరస్పరం ప్రభావితం చేసుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీలు మీడియా వేదికలను వినియోగించుకోవడం సాధారణంగా మారిపోయింది.తమిళనాడులో అధికార డీఎంకేకు మద్దతుగా భావించే మీడియా సంస్థల్లో ప్రముఖంగా సన్ టీవీ గ్రూప్ పేరు వినిపిస్తుంది. డీఎంకే తొలి కుటుంబంతో సన్ గ్రూప్కు ఉన్న సాన్నిహిత్యం బహిరంగ రహస్యమే. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేకు అనుబంధంగా జయ టీవీ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. పార్టీ కార్యక్రమాలు, నాయకత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ ఛానెల్ కీలక పాత్ర పోషించింది. అలాగే విజయ్కాంత్ పార్టీ కోసం కెప్టెన్ అనే ఓ చానెల్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతెందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (AMMK) నేత టీవీవీ దినకరన్కు అనుకూలంగా జయా న్యూస్, ఇతర మీడియా వేదికలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అధికారాన్ని అందుకున్న విజయ్ ఇప్పుడు మీడియా రంగంలో కూడా తన ముద్ర వేయాలనుకుంటున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ విధానాలు, రాజకీయ సందేశాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘వెట్రి న్యూస్’ వేదికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఛానెల్ పూర్తిస్థాయి వార్తా సంస్థగా పనిచేస్తుందా? లేదంటే పార్టీ అనుకూల వేదికగా నిలుస్తుందా? అన్నది ప్రారంభం తర్వాతే స్పష్టత రానుంది. వెట్రి న్యూస్ చానెల్ యాజమాని ఎవరు?.. దాని వెనుక ఏ సంస్థ అయినా స్పాన్సర్షిప్ ఉండనుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. విజయ్కు అత్యంత ఆప్తుడైన ఓ వ్యాపారవేత్త ఈ చానెల్ను టేకప్ చేస్తారని.. డీఎంకే హయాంలో వివాదాస్పదుడిగా పేరుగాంచిన ఓ ప్రముఖ న్యూస్ యాంకర్ ఆ చానెల్ను హ్యాండిల్ చేయబోతున్నారని ప్రచారం మాత్రం జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే శాటిలైట్, డిజిటల్ విభాగాల కోసం జర్నలిస్టులు, వీడియోగ్రాఫర్లు, జిల్లా రిపోర్టర్లు, న్యూస్ ఎడిటర్లు తదితర పోస్టులకు నియామక ప్రకటనలు కూడా వెలువడటం చర్చనీయాంశంగా మారింది. ఇటు ఛానెల్ ప్రారంభంపై తమిళగ వెట్రి కళగం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. -
తమిళ్ తాయ్ వాళ్తు వివాదం
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు సాక్షి, చైన్నె: తమిళనాడులో నిర్వహించే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను తమిళ్ తాయ్ వాళ్తు (తమిళ తల్లి ప్రార్థనా గీతం)తోనే ప్రారంభించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్న్పై సమ గ్ర వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శు క్రవారం మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివాదానికి ఆజ్యం ప్రమాణ స్వీకారం మే 10న జరిగిన తమిళనాడు సీఎం విజయ్, మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సంప్రదాయానికి భిన్నంగా మొదట వందేమాతరం, ఆ తర్వాత జాతీయ గీతం (జనగణమన) ఆలపించి, మూడో ప్రాధాన్యతగా తమిళ్ తాయ్ వాళ్తును వినిపించారు. దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని పక్కనబెట్టి రాష్ట్ర గీతాన్ని మూడో స్థానానికి పరిమితం చేయడం తమిళ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై చైన్నెకి చెందిన అనన్య రాధాకృష్ణన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ ప్రధాన అభ్యంతరాలు తమిళనాడులో ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా తమిళ్ తాయ్ వాళ్తుతో ప్రారంభమవడం, జాతీయ గీతంతో ముగియడం అనేది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయంగా కోర్టుకు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పద్ధతిని నీరుగారుస్తూ రాష్ట్ర గీతం కంటే ముందు వందేమాతరం, జాతీయ గీతాన్ని ఆలపించడం సరికాదని వివరించారు. కేంద్ర హోంశాఖ ఈ ఏడాది జనవరి 28న జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను వందేమాతరంతో ప్రారంభించాలని సూచించినప్పటికీ, రాష్ట్ర గీతాన్ని ఆలపించడాన్ని ఎక్కడా నిషేధించలేదన్నారు. తమిళ్ తాయ్ వాళ్తు ఆలపించడం అనేది కేవలం ఒక ప్రభుత్వ సంప్రదాయం కాదని, ఇది తమిళుల భావోద్వేగం, సంస్కృతి, అస్తిత్వానికి ప్రతీక అని వివరించారు. ఈ సాంస్కృతిక ఘర్షణలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సదరు ఉత్తర్వులను రద్దు చేయాలని, భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో తమిళ్ తాయ్ వాళ్తుకే ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి మొదట ఆలపించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. కోర్టు ఆదేశం పిటిషన్న్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, న్యాయమూర్తి జి.అరుళ్ మురుగన్న్లతో కూడిన ధర్మాసనం విచారించింది. వాదనలను పరిశీలించిన బెంచ్, ఈ వివాదంపై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఎనిమిది వారాల గడువు ఇస్తూ విచారణను వాయిదా వేశారు. -
వెళ్లిన వారిని వదిలేయండి
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతంపై బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్షా నివాసంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ నేతలతో మూడు గంటల పాటు సుదీర్ఘ సంప్రదింపుల సమావేశం జరిగింది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, అంతర్గత విభేదాలను పక్కనబెట్టి ముందుకు సాగడానికి ఈ సమావేశం వేదికగా అమిత్షా దిశానిర్దేశం చేశారు. సుదీర్ఘ మంతనాలు గురువారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబిన్, జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.ఎల్.సంతోష్ ముఖ్యభూమిక పోషించారు. తమిళనాడు నుంచి కేంద్ర కమిటీ సభ్యులు, సీనియర్ నేతలు నైనార్ నాగేంద్రన్, ఎల్. మురుగన్, పొన్రాధాకృష్ణన్, డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, వానతి శ్రీనివాసన్ పాల్గొన్నారు. మొదటి రెండు గంటల పాటు నితిన్ నబిన్ సమక్షంలో ఎన్నికల ఓటమికి గల కారణాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరుపై నేతలు విస్తృతంగా చర్చించారు. తమిళనాడులో గెలవలేమా?: అమిత్ షా రాత్రి 9 గంటల ప్రాంతంలో సమావేశానికి చేరుకున్న అమిత్షా గంటసేపు రాష్ట్ర నేతలతో మాట్లాడి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నట్టు తెలిసింది. ఆమేరకు పార్టీని విడిచిపెట్టి వెళ్లిన వారి గురించి మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. పోయిన వారిని వెళ్లనివ్వండి. ప్రస్తుతం పార్టీలో ఎవరున్నారు, వారిని లీడర్లుగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదే ముఖ్యం’ అని సూచనలు చేసి ఉండటం గమనార్హం. ఒకప్పుడు తమిళనాడు కంటే చాలా బలహీనంగా ఉన్న పశ్చిమబెంగాల్లోనే ఊహించని విజయం సాధించి పెద్ద శక్తిగా ఎదిగామని, మరి తమిళనాడులో విజయం సాధించడం అసాధ్యమా? కచ్చితంగా సాధించగలం అన్న ధీమాను వ్యక్తం చేసినట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కొత్త స్ఫూర్తిని ఇచ్చింది ఢిల్లీ సంప్రదింపుల సమావేశం అనంతరం డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ‘అమిత్షా అచంచలమైన భవిష్యత్ ప్రణాళిక, సంస్థాగత వ్యూహాలు, నితిన్ నబిన్ మార్గదర్శకత్వం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని వివరించారు. మరింత కష్టపడి పనిచేసి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడం తథ్యమని, సరికొత్త ఉత్సాహంతో తమిళనాడు బీజేపీ ఈ సమావేశం నుంచి బయటకు వచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. -
బాలకార్మిక రహిత జిల్లాగా వేలూరు
వేలూరు: బాల కార్మికుల రహిత జిల్లాగా వేలూరును చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ లీలఅలెక్స్ అన్నారు. బాలకార్మికుల దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లాలోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లోని అధికారులతో బాలకార్మికులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ మాట్లాడుతూ 14 సంవత్సరాల పిల్లలను బడిలోకి పంపించాలని కోరారు. అదేవిధంగా 14 సంవత్సరాలలోపు పిల్లలను బాలకార్మికులగా పెట్టుకుంటే యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో 50 మంది బాలకార్మికులను ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో ఉంచామన్నారు. బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం బాలకార్మికులు పాఠశాలల్లో చదివి కళాశాల విద్యకు వెళ్లే విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. పట్టణంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా బాలకార్మికులు ఉండే అవకాశం ఉన్నందున అధికారులతోపాటు ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. బాలకార్మికుల వ్యతిరేక పథకం జాయింట్ అధికారి గుణశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ సంగీత, బాలకార్మికుల శాఖ ఇన్స్పెక్టర్లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
లిడియన్కు ఘన స్వాగతం
సాక్షి, చైన్నె : లండన్ సింఫనీ ఆర్కెస్ట్రాకు చెందిన 92 మంది అంతర్జాతీయ సంగీత విద్వాంసులతో కలిసి, చిన్న వయసులోనే స్వయంగా సొంత సింఫనీ సంగీతాన్ని సృష్టించి సరికొత్త చరిత్ర సృష్టించిన తమిళనాడు యువకిరణం లిడియన్ నాదస్వరం శుక్రవారం చైన్నెకి చేరుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రులు రాజ్మోహన్, వన్నియరసు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కూడా పాల్గొని లిడియనన్ను అభినందించారు. మీడియాతో లిడియన్ నాదస్వరం మాట్లాడుతూ తాను చైన్నెలోనే పెరిగానని, తన సంగీత ప్రస్థానమంతా ఇక్కడే ప్రారంభమైందన్నారు. ఈనెల 21న చైన్నె మ్యూజిక్ అకాడమీలో తాను రూపొందించిన సింఫనీ ఒక అద్భుతమైన సంగీత కళాఖండంగా అలరించనుందన్నారు. త్వరలోనే ఈ పూర్తి సింఫనీని లండన్ , చైన్నె నగరాలలో పెద్ద ఎత్తున ప్రదర్శించబోతున్నాని తెలిపారు. తాను సంగీత దర్శకులు ఇళయరాజా వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నానని అన్నారు. యువ సంగీతకారుడి అసాధారణ ప్రతిభను కొనియాడుతూ రాష్ట్ర మంత్రి రాజ్మోహన్ మాట్లాడుతూ, లిడియన్ భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ మైలురాళ్లను అధిగమించడానికి తమిళనాడు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలనైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం లిడియన్ మాజీ సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. -
మా విజయాలపై.. మీ ప్రచార స్టిక్కర్లా?
సాక్షి, చైన్నె: తమిళనాడులో డీఎంకే ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో సాధించిన అద్భుత విజయాలను, అభివృద్ధిని తాజా సీఎం విజయ్ ఆయన ఖాతాలో వేసుకుంటున్నారని డీఎంకే యువజన నేత, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆయన సోఫా మోడల్ ప్రభుత్వంగా అభివర్ణించారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం విజయ్ చేసిన ప్రసంగంపై శుక్రవారం ఉదయనిధి తన ఎక్స్ పేజీలో స్పందించారు. అవన్నీ డీఎంకే సాధించినవే.. ఎన్నికల ప్రచారంలో తమిళనాడు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, పాతాళానికి పడిపోయిందని అబద్దపు కథనాలను ప్రచారం చేసిన విజయ్, ఇప్పుడు అధికారంలోకి రాగానే, ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో, తమిళనాడు సాధించిన ఘనతలను ఒక పెద్ద జాబితా రూపంలో చదివి వినిపించారని గుర్తు చేశారు. తమిళనాడు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, దేశంలో ఉద్యోగాలు చేసే మొత్తం మహిళల్లో 42 శాతం మంది తమిళనాడుకు చెందినవారేనని సీఎం విజయ్ అక్కడ ప్రస్తావించారని గుర్తు చేశారు. అలాగే మహిళా విద్య, రక్షణ, ఆరోగ్యం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధిపై కూడా సీఎం మాట్లాడారన్నారు. ఇవన్నీ ఆయన అధికారంలోకి వచ్చిన ఈ ఒక నెల రోజుల సోఫా మోడల్ పాలనలో జరిగినవా? లేక ఐదేళ్లపాటు తమ డీఎంకే ప్రభుత్వం రాత్రింబవళ్లు కష్టపడి సాధించిన ద్రావిడ మోడల్ విజయాలా అని ప్రశ్నిస్తూ, దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మౌనం ఎందుకో... ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత విజయ్ తీసుకున్న యూ–టర్న్లపై ఉదయనిధి మండిపడ్డారు. నీట్ పరీక్షే ప్రపంచమా అని ఎన్నికల సమయంలో వ్యాఖ్యలు చేసిన విజయ్, ఇప్పుడు అదే నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీ వరకు వెళ్లిన సీఎం కర్ణాటకలో అధికారంలో ఉన్న తన కొత్త మిత్రపక్ష పార్టీతో కానీ, నీతి ఆయోగ్ సమావేశంలో కానీ, మేఘధాతు వ్యవహారంపై నోరు విప్పలేదని ఆరోపించారు. మనకెందుకులే వచ్చిన గొడవ అన్నట్లుగా ఆయన మౌనంగా తిరిగి వచ్చేశారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి నీతి ఆయోగ్ సమావేశంలో డీఎంకే ప్రభుత్వ విజయాలపై ఈ సోఫా మోడల్’ ప్రభుత్వం పూర్తిగా వారి స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుందని ధ్వజమెత్తారు. -
శివాలయాల్లో ప్రదోష పూజలు
వేలూరు : వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని ఆలయాల్లో ప్రదోష దినోత్సవాన్ని పురష్కరించుకొని శుక్రవారం ప్రదోష పూజలను ఘనంగా నిర్వహించారు. ముందుగా తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అధికార పెద్దనంది భగవాన్కు శివాచార్యులు వేద మంత్రాలతో మేళ తాళాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టి కాయగూరలు, పుష్పాలంకరణలు చేశారు. అనంతరం భక్తుల అధిక సంఖ్యలో చేరుకొని హరోంహర నామ స్మరణాల మధ్య శివాచార్యులు వేద మంత్రాల నడుమ కర్పూర హారతులు పట్టారు. అనంతరం స్వామివారిని అధికార నందీ వాహనంలో ఆశీనులు చేసి మాడ వీధుల్లో మేళ తాళాల నడుమ ఊరేగించారు. అదేవిధంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో నంది భగవాన్కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి కాయగూరలతో అలంకరించారు. అనంతరం నంది భగవాన్కు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. నంది భగవాన్కు అభిషేకం చేస్తున్న శివాచార్యులు, హాజరైన భక్తులు -
సూరి మండాడికి డేట్ ఫిక్స్
తమిళసినిమా: విడుదలై చిత్రంతో కథానాయకుడిగా అవతారమెత్తిన హాస్య నటుడు సూరి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అలా ఈయ న తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మండాడి. ఆర్ ఎస్.ఇన్ఫోటెయిన్ మెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మదిమారన్ పుహళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటి మహిమా నంబియార్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ నటుడు సుహాస్ కీలక పాత్రలో పరిచయం అవుతున్నారు. నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాలా శరవణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని, ఎస్ఆర్.కదీర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇది సముద్ర తీర ప్రాంతంలోని మత్చ్యకారుల జీవన విధానాన్ని, సముద్రంలో సాహసోపేతమైన బోటుల పోటీలను తెరపై ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని నిర్మాత ఎల్రెడ్.కుమార్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం నటుడు సూరి పూర్తిగా మేకోవర్ అయ్యినట్టు చెప్పారు. ఆయన పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పారు. చిత్రం టైటిల్, గ్లింప్స్ను విడుదల చేయగా విశేష స్పందన వచ్చిందన్నారు. చిత్ర ఆడియో, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న మండాడి చిత్రాన్ని సెప్టెంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత అధికారికంగా వెల్లడించారు. -
బాలుడి హత్య కేసు నిందితుల అరెస్ట్
తిరుత్తణి: కోళ్ల సంఖ్య రోజు రోజుకి తగ్గడంతో ఆగ్రహించిన కోళ్ల వ్యాపారి పనిచేసే బాలుడిపై తీవ్రంగా దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ హత్య నాలుగు నెలలకు వెలుగు చూసింది. పోలీసుల సమక్షంలో మృతదేహం వెలికి తీసి వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించారు. హత్యకు సంబంధించి కోళ్ల వ్యాపారితో పాటు అతని భార్య, మైనర్ కూతురు సహా నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తిరుత్తణిలోని ఎంజీఆర్ నగర్కు చెందిన బాల మురుగన్(39) ఏడాది కిందట మురుక్కంపట్లు గ్రామంలో వ్యవపాయ పొలం లీజుకు తీసుకుని కోళ్లఫారం పెట్టి నాటు కోళ్లు పెంచి కుటుంబంతో కాపురం అక్కడే ఉంటున్నాడు. అతని ఫారంలో పని చేసేందుకు తిరుత్తణి ఇంద్రనగర్కు చెందిన వినోద్కుమార్(20) అనే యువకుడు అతని సమీప బందువు వెన్నెల(35) ఆమె ముగ్గురు బిడ్డలను తీసుకొచ్చి పనిలో పెట్టాడు. వెన్నెల అతని ముగ్గురు మగ పిల్లలతో ఆరు నెలలుగా కోళ్లఫారంలో పనులు చేసుకుంటూ వెన్నెల అక్కడే ఉండేవారు. ఈ క్రమంలో వెన్నెల పెద్ద కొడుకు సురేష్(15) అనే బాలుడు నాటు కోళ్లను మేపుతూ ఉండేవాడు. ఈ క్రమంలో కోళ్ల సంఖ్య రోజు రోజుకి తగ్గుతున్నాయన్న ఆగ్రహంతో నాలుగు నెలల కిందట సురేష్ను తల్లి కళ్లముందే తీవ్రంగా కొట్టాడు. దీంతో సురేష్ మృతిచెందాడు. దీంతో చేసేదేమీ లేక పేదరికంలో ఉన్న వెన్నెలకు ఇల్లు కట్టిస్తానని డబ్బులు ఆశలు చూసి నోరు మూయించాడు. వినోద్కుమార్ సాయంతో సురేష్ మృతదేహాన్ని కోళ్లఫారంలో పూడ్చిపెట్టి కోళ్లు నీళ్లు తాగేందుకు అక్కడ నీటితొట్టె కట్టారు. దీంతో నాలుగు నెలలు పూర్తికావడంతో వెన్నెలకు చెప్పిన మాట ప్రకారం ఇల్లు కట్టివ్వలేదు. అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడడంతో కోళ్ల పారం నుంచి తప్పించుకుని గురువారం రాత్రి తిరుత్తణి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆమె సమాచారం మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు బాలమురుగన్, వినోద్కుమార్లను అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం ఎస్పీ వివేకానంద శుక్ల, ట్రైనీ కలెక్టర్ పవిత్ర, న్యాయమూర్తి నళినిదేవి తదితరుల బృందం సమక్షంలో కోళ్లఫారంలో మృతదేహం జేసీబీతో వెలికి తీసి తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించారు. నలుగురి అరెస్ట్ కోళ్లఫారంలో తల్లి ఎదుట సురేష్ను కొట్టి చంపిన బాల మురుగన్ అతనికి సాయం చేసిన వినోద్కుమార్, సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న బాలమురుగన్ భార్య భువన(35) వారి 15 ఏళ్ల మైనర్ కూతురు సహా నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. -
న్యాయం ఇతివృత్తంతో నిళల్
తమిళసినిమా: చట్టం ధనవంతులకు చుట్టంగా మారుతుందనే చాలా కాలంగా జరుగుతున్న చర్చ. ఒక్కోసారి పోలీస్ వ్యవస్థ కూడా గొప్పోళ్లకు గులాం చేస్తుంది. అలాంటప్పుడు సగటు మనిషికి న్యాయస్థానంలో న్యాయం ఎలా జరుగుతుంది. దీనికి పరిష్కారం ఏమిటి తదితర కథాంశంతో రూపొందిన చిత్రం నిళల్. ఒక ప్రేమైక కుటుంబం, ఇద్దరు కవల పిల్లలను తల్లిదండ్రులు ప్రేమానురాగాలతో పెంచి ప్రయోజకులను చేస్తారు. అందులో ఒక యువతి ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తుంది. ఇంకొకరు క్రీడాకారిణి. అలా ఆనందంగా సాగిపోతున్న వారి కు టుంబంలో అనూహ్య సంఘటన జరుగుతుంది. ఆ ఇద్దరు కవ ల పిల్లల్లో ఒకరిపై హత్యాయత్నం జరుగుతుంది. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన కథా చిత్రం నిళల్. చిత్రం ధన మదాందుల దుర్మార్గాలు, ప్రతిఘటనలు, పోలీసులు, న్యాయస్థానం చుట్టూ తిరుగుతుంది. బాధితులు న్యాయం కోసం పోరాడగా, హంతకులు దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా న్యాయంపై అన్యా యం పైచేయి అయితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనే ఇతివృత్తంతో రూ పొందిన ఈ చిత్రాన్ని ఏకే.మూవీస్ పతాకంపై ఏకే.కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నటి జనని, కౌశిక్, శిరి వికాస్, దివ్య కృష్ణన్, హరి విజయ్, రమేష్ ఖన్నా, అభిషేక్ శంకర్, సబితా ఆనంద్, కలైమామణి శివన్ శ్రీనివాసన్, దిలీపన్, బాయ్స్ రాజన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. దీనికి అబుబకర్ సంగీతాన్ని అందించారు. -
నైల్లెలో అద్భుతం
సాక్షి,చైన్నె: కాలం కొన్నిసార్లు నమ్మశక్యం కాని అద్భుతాలను సృష్టిస్తుంది. అలాంటి ఒక అరుదైన, ఆశ్చర్యకరమైన ఘటనే తమిళనాడులోని తిరునల్వేలి (నైల్లె) పరిధిలోని పెరుమల్పురంలో శుక్రవారం వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు వేర్వేరు సంవత్సరాలలో, కానీ ఒకే తేదీన, ఒకే ఆస్పత్రిలో, ఒకే వైద్యురాలి చేతుల మీదుగా జన్మించి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. ఈ అరుదైన ఘటన నైల్లె పాళయంంకోటకు చెందిన జెబాసన్, ఆయన భార్య సిబామానోస్ దంపతుల కుటుంబంలో చోటుచేసుకుంది. వీరికి జహస్లీల్ మానోస్ కుమారుడు, సెరాఫిన్, ఐసానియా షేర్ (జానియా) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ముగ్గురి జననం వెనుక ఉన్న జూన్ 10 తేదీ ఓ మ్యాజిక్గా మారింది. వేర్వేరు సంవత్సరాలు.. ఒకే తేదీఈ దంపతుల పెద్ద కుమారుడు 2015లో, 2017లో రెండవ సంతానంగా కుమార్తె , ఆ తర్వాత 8 సంవత్సరాల వ్యత్యాసంతో మరో కుమార్తె 2025లో జన్మించారు. సరోగసీ విధానం ద్వారా జన్మించిన ఈ ముగ్గురు పిల్లల మధ్య కొన్ని సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. కానీ, వీరంతా జూన్ 10వ తేదీనే జన్మించడం విశేషం. ఒకే డాక్టర్ – ఒకే ఆస్పత్రి ఈ ముగ్గురు పిల్లల ఆరోగ్యకరమైన ప్రసవాలు పెరుమల్పురంలోని ఒకే ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో జరిగాయి. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రామోలా జనెట్ డయానానే ఈ ముగ్గురు పిల్లలకూ ప్రసవం చేశారు. ఈ అరుదైన ఘటనలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ ముగ్గురు పిల్లలకు చికిత్స అందించి, ప్రసవం చేసిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రామోలా జానెట్ డయానా పుట్టినరోజు కూడా సరిగ్గా జూన్ 10వ తేదీనే కావడం గమనార్హం. దీంతో జూన్ 10 అనేది ఆ కుటుంబానికి, ఆ జంటకు, సదరు వైద్యురాలికి అత్యంత ప్రత్యేకమైన, మరువలేని రోజుగా మారిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు సంవత్సరాల వ్యత్యాసంలో ఒకే రోజున, ఒకే ఆస్పత్రిలో, ఒకే వైద్యుని ద్వారా ఆరోగ్యకరమైన ప్రసవాల రూపంలో జన్మించడం ప్రపంచంలోనే అత్యంత అరుదైన సంఘటనగా రికార్డులకుకెక్కింది. దీనిని పరిశీలించిన యూనివర్సల్ అచీవర్స్ సంస్థ ఈ అపురూప ఘనతను ప్రపంచ రికార్డుగా ఆమోదించి, బ్లూ చెక్ కార్డ్లను మంజూరు చేసింది. ఈ రికార్డుకు సంబంధించిన అధికారిక కార్యక్రమం ఈనెల 15వ తేదీన చైన్నెలో జరగనుంది. -
బైపాస్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఫిర్యాదు
తిరుత్తణి: షోళింగర్లో బైపాస్ రోడ్డు ఏర్పాటును ప్రత్యామ్నాయ మార్గంలో నిర్మించాలనే కోరిక మేరకు గ్రామీణులు తిరుత్తణి ఆర్డీఓను శుక్రవారం కలుసుకుని వినతిపత్రం అందజేశారు. షోళింగర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించే విధంగా హైవేశాఖ ద్వారా బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి స్థలం స్వాధీనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి పట్టణ శివారులో ఆర్కేపేట మండలంలోని పద్మాపురం గ్రామం ద్వారా బైపాస్ రోడ్డు పనులు చేపట్టనున్నారు. దీంతో ఆందోళన చెందిన ఆ గ్రామానికి చెందిన 50 మంది తిరుత్తణిలోని ఆర్డీఓ కణిమొళిని కలుసుకుని తమ సమస్య వివరించారు తమ గ్రామంలో బైపాస్ రోడ్డు నిర్మిస్తే తాము కష్టపడి కొనుగోలు చేసిన ఇంటి స్థలాలు కోల్పోవాల్సి ఉంటుందని, ప్రత్యామ్నాయ మార్గంలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఇందుకు రాణిపేట హైవేశాఖ అధికారులతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఆర్డీఓ రాణిపేట జిల్లా అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైల్లో 1.5 కిలోల నగలు చోరీ అన్నానగర్: గురువాయూర్ నుంచి చైన్నెకి వెళుతున్న రైలులో ఒక బంగారు ఆభరణాల దుకాణ ఉద్యోగి నుంచి ఒకటిన్నర కిలోల బంగారు ఆభరణాలను చోరీ చేసిన కేసులో ప్రధాన నిందితులు ముగ్గురిని రైల్వే స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1,083 గ్రాముల బంగారు కడ్డీలు, రూ. 47 లక్షల నగదును కూడా రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్రిశూర్కు చెందిన జోస్ (47) గత నెల 6వ తేదీ రాత్రి 11.15 గంటలకు, కేరళలోని గురువాయూర్ నుంచి చైన్నెకి రిజర్వేషన్ చేసుకొనివెళుతున్నాడు. అతని వద్ద తన యజమాని జయసన్ నైల్లెలోని వల్లియూర్ జ్యువెలర్స్కు పంపిన 1473.97 గ్రాముల బంగారు ఆభరణాలను అతను ఒక భుజం సంచిలో పెట్టుకుని తీసుకొచ్చాడు. రాత్రి అతను బ్యాగును తన పక్కనే పెట్టుకుని నిద్రపోయాడు. తెల్లవారుజామున రైలు కులీతురై సమీపానికి చేరుకున్నప్పుడు, జోస్ మేల్కొని చూడగా, నగలు ఉన్న సంచి కనిపించలేదు. అతను, కుళీతురై రైల్వేస్టేషన్న్లో ఫిర్యాదు చేశాడు. విచారణలో, అభా ఠాకిర్, డోలీ సిద్ధిక్, గోపకుమార్, సరబుద్దీన్, రంజిత వీరు జోస్ ప్రయాణిస్తున్న రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో అతడిని వెంబడిస్తున్నారని, అతను గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతని నగల సంచిని దొంగిలించి, కుళీతురై రైల్వేస్టేషన్లో పారిపోయినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. చైన్నె సైబర్ క్రైమ్ రైల్వే పోలీసుల సాయంతో, కేరళలో మోహరించిన ప్రత్యేక పోలీసు దళం, సెల్ ఫోన్ టవర్కు అందిన నంబర్లను పరిశీలించడం ద్వారా, నగల దొంగలు ఉపయోగించిన సెల్ ఫోన్ సంభాషణల ఆధారంగా త్రిశూర్లో దాక్కున్న అబు ఠాకిర్, డోలీ గోపకుమార్, సర్ పుతిన్ సిద్ధిఖీ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసులు పట్టుకున్న 8 మంది నుంచి 1083.930 గ్రాముల విలువైన 5 బంగారు కడ్డీలు, రూ.47 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
క్లుప్తంగా
మంత్రి ఆదవ్ అర్జున అడ్డగింత వేలూరు: రాష్ట్ర పంచాయితిరాజ్ శాఖ, క్రీడా మంత్రి ఆదవ్అర్జునను తిరువణ్ణామలై జిల్లా ఇన్చార్జిమంత్రిగా నియమించడంతో శుక్రవారం ఉదయం ఆయన తిరువణ్ణాలైకు చేరుకున్నారు. ఆయనకు పార్టీ కార్యకర్తలతో పాటు అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఉదయం తిరువణ్ణామలై ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రిలోని వసతులపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన్ను రోగులు, బంధువులు ఉన్న ఫలంగా ముట్టడించారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల వద్ద సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఇవ్వకుంటే సరైన వైద్యం అందజేయడం లేదన్నారు. సమస్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గిరివలయం రోడ్డులో భద్రత పెంచుతాం: మంత్రి ఆదవ్అర్జున తిరువణ్ణామలైలో మంత్రి ఆదవ్అర్జున విలేకరులతో మాట్లాడుతూ తిరువణ్ణామలై గిరివలయం రోడ్డులో రాత్రి సమయంలో భద్రతను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బైక్ ట్యాక్సీ సేవల క్రమబద్ధం కోసం..! కొరుక్కుపేట: తమిళనాడులో రాపిడో, ఓలా, ఉబెర్ వంటి డిజిటల్ సర్వీస్ సెంటర్ బైక్ ట్యాక్సీలు పెరుగుతున్నాయి. వీటికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మరోవైపు బైక్ రైడర్లకు జరిమానాలు, వాహనాల జప్తు, క్రిమినల్ కేసుల నమోదు, శిక్షలు.. మొదలైనవి ప్రతిబంధకంగా మారాయి. తమిళనాడులో ఈ సేవలపై ఎలాంటి నియంత్రణ లేదు. అవి పూర్తిగా సంబంధిత డిజిటల్ కంపెనీలపై ఆధారపడి ఉండటం, రాష్ట్రంలో ఆ కంపెనీలు ఎక్కడా కార్యకలాపాలు నిర్వహించకపోవడం..ఇత్యాది కారణాల నేపథ్యంలో బైక్ ట్యాక్సీల డ్రైవర్లపై చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మదురైకు చెందిన న్యాయవాది నవీన్కుమార్ మదురై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం కింద కేసు దాఖలు చేశారు. చట్ట ప్రకారం లైసెన్సులు జారీ చేసి బైక్ టాక్సీ సేవలను నిర్వహించడానికి అనుమతించే నిబంధనలను రూపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. వైద్యలింగంకు మళ్లీ చిక్కులు? – కోర్టులో డీవీఏసీ పిటిషన్ సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే హయాంలో గృహ నిర్మాణ మంత్రిగా ఉన్న సమయంలో నమోదైన కేసు ఉచ్చు తాజాగా డీఎంకే నేత వైద్యలింగంకు మళ్లీ కొత్త చిక్కులు సృష్టించనున్నాయి. గత డీఎంకే ప్రభుత్వం హయాంలో ఈ అవినీతి కేసుకు ముగింపు పలకగా, తాజా టీవీకే ప్రభుత్వం మళ్లీ విచారణ దిశగా శుక్రవారం కోర్టును ఆశ్రయించింది. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్ (డీవీఏసీ) ద్వారా ఈ పిటిషన్ను తాజాగా దాఖలు చేశారు. రూ.28 కోట్ల లంచం కేసు నేపథ్యం 2011–2016 అన్నాడీఎంకే ప్రభుత్వంలో గృహ నిర్మాణ మంత్రిగా వైద్యలింగం వ్యవహరించారు. చైన్నె పెరుంగళత్తూర్ పరిధిలో ఓ భారీ భవన నిర్మాణ అనుమతుల విషయంలో రూ. 28 కోట్లు లంచం పుచ్చుకున్నట్టు అరప్పోర్ ఇయక్కం 2022లో డీవీఏసీకి ఫిర్యాదు చేసింది. 2024లో అధికారులు ఈ ఫిర్యాదుపై అధికారికంగా కేసు నమోదు చేశారు. ఈడీ సైతం రంగంలోకి దిగి మనీ లాండరింగ్ కేసు నమోదుతో దర్యాప్తు చేపట్టింది. డీఎంకేలో చేరికతో కేసు ముగింపు: ఈ కేసు కోర్టులో పెండింగ్లో ఉండగానే, ఈ ఏడాది జనవరిలో వైద్యలింగం అన్నాడీఎంకేను వీడి డీఎంకేలోచేరారు. పార్టీ మారిన కొద్ది రోజులలోనే వైద్యలింగంపై ఉన్న ఆఽరోపణలకు ఆధారాలు లేవంటూ కేసుకు ముగింపు పలుకుతూ కోర్టులో నివేదికను అధికారులు సమర్పించారు. దీనిని అరప్పోర్ ఇయక్కం, ఈడీలు వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేశాయి. మళ్లీ మొదటికి వచ్చిన విచారణ తాజాగా రాష్ట్రంలో అధికారం మారడంతో వైద్యలింగం మెడకు ఈ కేసు ఉచ్చుగా మారింది. టీవీకే ప్రభుత్వం మళ్లీ విచారణపై దృష్టి పెట్టింది. గతంలో ఈ కేసును ముగిస్తూ దాఖలు చేసిన నివేదికను వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని కోరుతూ డీవీఏసీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. చైన్నె ప్రాథమిక సెషన్న్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్.కార్తికేయన్ సమక్షంలో విచారణకు వచ్చింది. కేసును ముగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, దీనిపై ఇప్పటికే పిటిషన్ వేశామని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వైద్యలింగం తరఫున న్యాయవాది స్పందిస్తూ, ఈడీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు. ఈ కేసు ముగింపును వ్యతిరేకిస్తున్న అరప్పోయర్ ఇయక్కం వాదనలు వినిపించింది. వాదనల అనంతరం ఈ కేసుకు సంబంధించి అన్ని పిటిషన్లు తర్వాత విచారణను ఈనెల 29వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఈ కేసును మళ్లీ తవ్వేందుకు టీవీకే ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుండడం గమనార్హం. -
సినిమా ఎంటర్టైన్మెంట్ మాత్రమే!
తమిళసినిమా: సినిమా చాలా పవర్ ఫుల్. దీనికి ఆకర్షణ శక్తి అధికం. చిన్న ఆసక్తి ఉంటే ఎలాంటి పెద్ద వ్యాపారవేత్తనైనా సినిమా లోనికి లాగేస్తుంది. ఒకవేళ నష్టాలు ఎదురైనా, మళ్లీ మళ్లీ చిత్రాలు చేయిస్తుంది. ఇందుకు చిన్న ఉదాహరణ నిర్మాత, దర్శకుడు, నటుడు ఇసక్కీ కార్వణన్. ఈయన తాజాగా లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై నిర్మించి, కథానాయకుడిగా నటించిన చిత్రం అట్టి. నటి అయిలి వెబ్ సిరీస్ ఫేమ్ అభి నక్షత్ర నాయకిగా నటించిన ఇందులో నటుడు కాదల్ సుకుమార్, సౌందర్, ప్రవీణ్ పళనిసామి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్ సంస్థ అధినేత సురేష్ కామాక్షి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, నటుడు ఇసక్కీ కార్వణన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ఇంతకు ముందు మహిళలు పోరాడి స్వాతంత్య్రాన్ని తెచ్చుకున్నారు. అలా అబలను, అత్యాచారాలకు గురయ్యే అభాగ్యులను కాపాడే ప్రయత్నం చేసే వీరనారీమణుల ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం ఆట్టి అని చెప్పారు. తాను ఇందులో పోలీస్ అధికారిగా నటించినట్లు చెప్పారు. ఊరు నుంచి తరిమివేయబడ్డ వ్యక్తిలా తాను సొంత ఊరి నుంచి ముంబయి వెళ్లి పడ్డానని, ఆ తరువాత వ్యాపార రంగం లోకి నెట్టబడ్డానని చెప్పారు. అలా వందలాది మందికి ఉపాధి కల్పించే లాజిస్టిక్స్ వ్యాపారంతో పారిశ్రామిక వేత్తగా ఎదిగానని, అలా 25 ఏళ్లు వ్యాపార రంగంలో కొనసాగుతున్న తనను సినిమాపై ఆసక్తి ఈ రంగంలో తీసుకొచ్చిందని చెప్పారు. అలా మొదట నిర్మాతగా ముదల్ కనవే అనే చిత్రాన్ని నిర్మించానన్నారు. అలా కొన్ని చిత్రాలు చేసిన తరువాత నటుడిగా మారి చిత్రాలు నిర్మిస్తున్నానని చెప్పారు. అలా దర్శకుడిగానూ మారి బకరి, పెట్టికడై, తమిళ్ కుడిమగన్, పరమశివమత ఫాతిమా తదితర చిత్రాలు చేశానని చెప్పారు. తాజాగా ఆట్టి చిత్రం చేశానని పేర్కొన్నారు. ఇవన్నీ మంచి సందేశంతో కూడిన కథా చిత్రాలని చెప్పారు. తాను సినిమా గురించి నేర్చుకున్నది ఏమింటే నిజ జీవితం వేరు, సినిమా వేరు అని అన్నారు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసమే అనీ, సందేశాత్మక కథా చిత్రాలు చాలా నిరాశనే మిగిల్చాయని నటుడు, దర్శక నిర్మాత ఇసక్కీ కార్వణన్ పేర్కొన్నారు. -
ఆదర్శవంతమైన జిల్లాగా తిరుచ్చి
సాక్షి,చైన్నె: రాబోయే ఐదేళ్ల కాలంలో తిరుచిరాపల్లి (తిరుచ్చి) జిల్లాను తమిళనాడులోనే అత్యంత ఉత్తమమైన, ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర హిందూ దేవదాయశాఖ మంత్రి ఎస్.రమేష్ ధీమా వ్యక్తం చేశారు. తిరుచ్చి జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. కలెక్టర్ ప్రతీక్దయాల్ సమక్షంలో జరిగిన సమావేశంలో జిల్లాలో సాగుతున్న పలు అభివృద్ధి పనులపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి రమేష్ మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలను వెల్లడించారు. సమావేశాన్ని మూడు ముఖ్యమైన విభాగాలుగా విభజించి నిర్వహించామని ఆయన తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం అమల్లో ఉన్న వివిధ ప్రజా సంక్షేమ పథకాల పురోగతిని పరిశీలించామని, వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనుల ప్రస్తుత స్థితిపై చర్చించామని, రాబోయే రోజుల్లో ప్రజల కోసం తీసుకురావాల్సిన కొత్త ప్రాజెక్టులపై అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు. అభివృద్ది పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని అధికారులు ఆదేశించామని చెప్పారు. సీఎం విజయ్ ప్రజల కోసం ఎన్నో అద్భుతమైన పథకాలను రూపొందిస్తున్నారని, వాటిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. ఎలాంటి అవినీతి, దోపిడీకి తావులేకుండా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా ప్రజలకు చేరాలనేదే తమ ఉద్దేశం అన్నారు. వచ్చే ఐదేళ్లలో తిరుచ్చి జిల్లా రూపురేఖలను పూర్తిగా మార్చేసి, రాష్ట్రంలోనే నంబర్ వన్ జిల్లాగా మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
విజయ్ ఎఫెక్ట్.. స్టాలిన్ కళ్లు తెరిపించిన నివేదిక
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కోల్పోవడంపై నియోజకవర్గాల వారీగా తెప్పించుకున్న క్షేత్రస్థాయి విచారణ నివేదికలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్కు షాక్ తగిలే విధంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల్లో ఘోర పరాజయానికి గల కారణాలను విశ్లేషిస్తూ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు రెండు రోజుల క్రితమే ఒక సమగ్ర నివేదికను స్టాలిన్కు సమర్పించాయి.తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడం, మహిళల్లో వ్యక్తమైన తీవ్ర అసంతృప్తి పార్టీని పూర్తిగా ముంచేసిందని ఈ నివేదిక తేల్చిచెప్పింది. శుక్రవారం డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో ఈ ప్రత్యేక కమిటీతో స్టాలిన్ సమావేశమయ్యారు. ఇందులోని అంశాలను పరిశీలించి, నియోజకవర్గాల వారీగా చర్చించారు. ఓటమికి ప్రధాన కారణాలు తాజా నివేదిక మేరకు వెలుగులోకి వచ్చాయి.విజయ్ను తక్కువగా అంచనా విజయ్ క్షేత్రస్థాయిలో సాధిస్తున్న ప్రజాదరణను, ఆయనకు లభిస్తున్న నిశ్శబ్ద మద్దతును డీఎంకే జిల్లా అధికారులు, స్థానిక నాయకత్వం గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని తేలింది. గెలుపు గుర్రాలైన స్థానిక పలుకుబడి కలిగిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి, కొత్త ముఖాలను పోటీలో పెట్టడం కూడా ఓటమికి ఓ కారణంగా గుర్తించారు. నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య కనీస సమన్వయం లేదని నివేదిక స్పష్టం చేసింది.ఇక యాక్షన్ ప్లాన్ ఈ పరాజయం నేపథ్యంలో డీఎంకేలో భారీ సంస్థాగత మార్పునకు ఎం.కె. స్టాలిన్ శ్రీకారం చుట్టారు. పార్టీ పరిపాలనా యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పెద్ద జిల్లాల పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల వరకు ఒక జిల్లా కార్యదర్శి ఉండగా, ఆ నియోజకవర్గాల సంఖ్యను తగ్గించి కేవలం రెండు లేదా మూడు నియోజకవర్గాలకు ఒక జిల్లా కార్యదర్శిని నియమించేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం పార్టీ పరంగా ఉన్న 78 మంది జిల్లా కార్యదర్శుల సంఖ్యను 115కు పెంచనున్నారు. ఈ విభజన ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మరో 30 మంది పార్టీ కోసం పనిచేసే కొత్త వారికి జిల్లా కార్యదర్శులుగా అవకాశం దక్కనుంది.దక్షిణ, కొంగు మండలాలపై దృష్టి డీఎంకే తీవ్రంగా దెబ్బతిన్న దక్షిణ జిల్లాలు, పశ్చిమ ప్రాంతమైన కొంగు మండలం పార్టీని పునరుద్ధరించడానికి ప్రత్యేక కమిటీని రంగంలోకి దించారు. అలాగే, పార్టీ అగ్రనాయకత్వంలో కూడా అధికార వికేంద్రీకరణ జరగబోతోందని అరివాలయం వర్గాలు తెలిపాయి. కలైంజ్ఞర్ కాలం నాటి పాత రాజకీయ వ్యూహాలు ఇప్పుడు పని చేయవని, కొత్త తరం ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా సరికొత్త నాయకత్వ ఫార్ములాను స్టాలిన్ సిద్ధం చేసినట్టు తెలిసింది.కనిమొళి, ఉదయనిధి: ఇప్పటికే యువజన విభాగంలో కీలకంగా ఉదయనిధి స్టాలిన్తో పాటు, ఢిల్లీ రాజకీయాల్లో అపార అనుభవం, మహిళల్లో మంచి పట్టు ఉన్న సీనియర్ నేత కనిమొళికి కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. వీరిద్దరిని కలిపి ద్వంద్వ బృందం పద్ధతిలో పార్టీని నడిపించేందుకు అధిష్ఠానం కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే జరగబోయే డీఎంకే జనరల్ సర్వసభ్య సమావేశంలో ఈ సంచలన మార్పులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.మహిళా లబ్దిదారుల ఆగ్రహం.. డీఎంకే హయాంలో ప్రవేశపెట్టిన మహిళా హక్కుల పథకం డీఎంకే ఓటమికి ప్రధాన కారణంగా నిలవడం గమనార్హం. రాష్ట్రంలో 2 కోట్ల 20 లక్షల రేషన్ కార్డులు ఉంటే, కేవలం ఒక వర్గానికి మాత్రమే కోటి 34 లక్షల మందికి ఈ సాయం అందించడం, ఇందులోనూ ఇతర పార్టీల వారు ఉండడంతో, మిగిలిన కోటి మంది మహిళలు డీఎంకేకు వ్యతిరేకంగా ఓటు వేశారన్నది స్పష్టం కావడం ఆలోచించ దగ్గ విషయం. అలాగే, ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ప్రభుత్వం అందించిన రూ.5వేలు వేసవి సాయాన్ని కూడా కేవలం కొద్దిమంది అర్హులకు మాత్రమే పరిమితం చేయడం వలన సాధారణ మహిళా ఓటర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమై ఓట్లను దూరం చేసినట్టు తేటతెల్లమైంది.సోఫా మోడల్ ప్రభుత్వం.. మరోవైపు.. తమిళనాడులో డీఎంకే ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో సాధించిన అద్భుత విజయాలను, అభివృద్ధిని తాజా సీఎం విజయ్ ఆయన ఖాతాలో వేసుకుంటున్నారని డీఎంకే యువజన నేత, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆయన సోఫా మోడల్ ప్రభుత్వంగా అభివర్ణించారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం విజయ్ చేసిన ప్రసంగంపై శుక్రవారం ఉదయనిధి తన ఎక్స్ పేజీలో స్పందించారు.అవన్నీ డీఎంకే సాధించినవే.. ఎన్నికల ప్రచారంలో తమిళనాడు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, పాతాళానికి పడిపోయిందని అబద్దపు కథనాలను ప్రచారం చేసిన విజయ్, ఇప్పుడు అధికారంలోకి రాగానే, ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో, తమిళనాడు సాధించిన ఘనతలను ఒక పెద్ద జాబితా రూపంలో చదివి వినిపించారని గుర్తు చేశారు. తమిళనాడు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, దేశంలో ఉద్యోగాలు చేసే మొత్తం మహిళల్లో 42 శాతం మంది తమిళనాడుకు చెందినవారేనని సీఎం విజయ్ అక్కడ ప్రస్తావించారని గుర్తు చేశారు. అలాగే మహిళా విద్య, రక్షణ, ఆరోగ్యం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధిపై కూడా సీఎం మాట్లాడారన్నారు. ఇవన్నీ ఆయన అధికారంలోకి వచ్చిన ఈ ఒక నెల రోజుల సోఫా మోడల్ పాలనలో జరిగినవా? లేక ఐదేళ్లపాటు తమ డీఎంకే ప్రభుత్వం రాత్రింబవళ్లు కష్టపడి సాధించిన ద్రావిడ మోడల్ విజయాలా అని ప్రశి్నస్తూ, దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మౌనం ఎందుకు? ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత విజయ్ తీసుకున్న యూ–టర్న్లపై ఉదయనిధి మండిపడ్డారు. నీట్ పరీక్షే ప్రపంచమా అని ఎన్నికల సమయంలో వ్యాఖ్యలు చేసిన విజయ్, ఇప్పుడు అదే నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీ వరకు వెళ్లిన సీఎం కర్ణాటకలో అధికారంలో ఉన్న తన కొత్త మిత్రపక్ష పార్టీతో కానీ, నీతి ఆయోగ్ సమావేశంలో కానీ, మేఘధాతు వ్యవహారంపై నోరు విప్పలేదని ఆరోపించారు. మనకెందుకులే వచ్చిన గొడవ అన్నట్లుగా ఆయన మౌనంగా తిరిగి వచ్చేశారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి నీతి ఆయోగ్ సమావేశంలో డీఎంకే ప్రభుత్వ విజయాలపై ఈ సోఫా మోడల్’ ప్రభుత్వం పూర్తిగా వారి స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుందని ధ్వజమెత్తారు. -
నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు
సాక్షి, చైన్నె: పదవులకు రాజీనామా చేసిన నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు ప్రారంభమయ్యాయని తమిళనాడు శాసనసభ స్పీకర్ జె.సి.డి.ప్రభాకర్ స్పష్టం చేశారు. వారి రాజీనామాలకు గల కారణాలపై 7 రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని కోరుతూ అధికారిక నోటీసులు పంపినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం చైన్నెలోని సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన పలు కీలక విషయాలను పంచుకున్నారు. వివాదం నేపథ్యం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు మధురాంతకం –మరగదం కుమ వేల్, తారాపురం– సత్యభామ, పెరుందురై–జయకుమార్, అంబానముద్రం–ఇసక్కి సుబ్బయ్య తమ పదవులకు రాజీనామా చేసి, టీవీకే పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయించిన ఈ నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్నాడీఎంకే విప్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో స్పీకర్ ప్రభాకర్ వారికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సభ్యులకు శిక్షణ తాజాగా అసెంబ్లీలో కొత్త ముఖాలే అత్యధికంగా ఉన్నాయి. వీరికి అసెంబ్లీ వ్యవహారాల గురించి ఈనెల 16, 17 తేదీల్లో శిక్షణ తరగతులకు స్పీకర్ నిర్ణయించారు. శిక్షణ తరగతులను సీఎం విజయ్కలైవానర్ అరంగం వేదికగా ప్రారంభిస్తారని స్పీకర్ ప్రభాకర్ తెలిపారు. సభలో సభ్యులు ఎలా నడుచుకోవాలి, అనుసరించాల్సిన పద్ధతులు, అసెంబ్లీ నిబంధనలు, చట్టపరమైన అంశాలపై అసెంబ్లీ సెక్రటరీ, నైపుణ్యం ఉన్న నిపుణులు కొత్త సభ్యులకు శిక్షణ ఇస్తారని, ఎమ్మెల్యేలందరూ తప్పకుండా ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ప్రత్యేక్ష ప్రసారాలకు పరిశీలన అసెంబ్లీ సమావేశాల వ్యవహారాలన్నీ ప్రజలందరూ చూసేలా పూర్తిస్థాయిలో ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. సభలో అధికార, ప్రతిపక్షాల సభ్యులందరి అభిప్రాయాలకు తాను సమాన గౌరవం ఇస్తానన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే గవర్నర్ ప్రసంగం ప్రతులను ఆయనకు అందజేస్తామన్నారు. ఈనెల 18న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నాడీఎంకే విప్ పదవికి సంబంధించిన అంశంపై వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తున్నామని, వీటిపై అధికారికంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. -
కీర్తిచక్ర వీరుడికి బ్రహ్మరథం
సాక్షి, చైన్నె: దేశ రక్షణలో అద్వితీయ సాహసాన్ని ప్రదర్శించి, భారత సైన్యపు అత్యున్నత పురస్కారమైన ‘కీర్తి చక్ర’ అందుకున్న తమిళనాడు వీరజవానుకు స్వగ్రామంలో అపూర్వస్వాగతం లభించింది. తేని జిల్లా కంబం సమీపంలోని కామయగవుండన్పట్టి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మీనాక్షిసుందరం (33) సెలవులపై శుక్రవారం మధ్యా హ్నం తన స్వగ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థు లు, మాజీ సైనికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి బాణసంచా కాలుస్తూ, సంప్రదాయ డప్పు వాయిద్యాల ఆయనకు పూలమాలలు వేసి బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికారు. ఉగ్రవాదులను హతమార్చిన సాహసం లాన్స్ నాయక్ హోదాలో ఇండియన్ ఆర్మీకి చెందిన కశ్మీర్ రాష్ట్రీయ రైఫిల్స్ విభాగంలో మీనాక్షి సుందరం సేవలందిస్తున్నారు. 2025 డిసెంబర్ 19న దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో ఐదుగురు కరుడుగట్టిన ఉగ్రవాదులకు, భారత సైన్యానికి మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ పోరాటంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మీనాక్షి సుందరం కుడి భుజం, నోటి భాగంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్ర రక్తస్రావమవుతున్నా, ప్రాణా పాయ స్థితిలోనూ ఆయన వెనకడుగు వేయలేదు. అసాధారణ ధైర్యసాహసాలతో పోరాడి, ఆ ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టడమే కాకుండా, తన బృందంలోని తోటి సైనికుల ప్రాణాలను కాపాడారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం ఆయన ప్రదర్శించిన ఈ వీరోచిత సాహసానికిగానూ భారత ప్రభుత్వం ‘కీర్తి చక్ర’ అవార్డును ప్రకటించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం ఏడుగురు వీరజవాన్లకు ఈ పురస్కారం దక్కగా, అందులో తమిళనాడు నుంచి ఎంపికైన ఏకై క వీరుడు మీనాక్షిసుందరం. ఈనెల 8న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన అధికారిక వేడుకలో భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అత్యున్నత అవార్డును అందుకున్నారు. గ్రామస్తుల ఆనందోత్సాహాలు.. ఊరేగింపు అవార్డు అందుకున్న తర్వాత మొదటిసారి స్వగ్రామానికి వచ్చిన మీనాక్షి సుందరానికి బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికి గ్రామస్తులు శాలువాలు, పుష్పగుచ్ఛాలు, పూలమాలలతో సత్కరించి, గ్రామంలో ఘనంగా ఊరేగించారు. స్థానిక మాజీ సైనికులు మాట్లాడుతూ అత్యంత వీరత్వానికిగానూ భారత సైన్యం అందించే పురస్కారాలలో ‘అశోక చక్ర’ తర్వాత స్థానంలో ఉండే అత్యున్నత అవార్డు ఈ ‘కీర్తి చక్ర’ అని, అలాంటి ప్రతిష్టాత్మక అవార్డును తమ గ్రామానికి చెందిన బిడ్డ కై వసం చేసుకోవడం తమందరికి, దేశానికి గర్వకారణంగా పేర్కొన్నారు. -
● తెరచుకోని మేట్టూరు గేట్లు ● అన్నదాతల్లో కలవరం ● పలు చోట్ల ఆందోళనలు ● రూ.134 కోట్లతో కరువై ప్యాకేజీ
సాక్షి, చైన్నె: ప్రతి ఏటా జూన్ 12న డెల్టా జిల్లాల వర ప్రదాయిని మేట్టూరు జలాశయం నుంచి సాగు నిమిత్తం నీటిని విడుదల చేయడం ఆనవాయితీ. 2020 వరకు నిర్ణీత సమయంలో నీళ్లు ఎప్పడూ విడుదల కాకపోవడంతో రైతులు కష్టాలను ఎదుర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం నైరుతి రుతు పవనాల ప్రభావం ఆశాజనకంగానే ఉంటూ వచ్చింది. కర్ణాటకలో పవనాలు ప్రభావం చూపించడంతో కావేరి పరవళ్లు తొక్కింది. అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లు మేట్టూరు జలాశయం పలు మార్లు పూర్తిగా నిండి ఉబరి నీరు డెల్టా జిల్లాల వైపు ఉగ్రరూపంతో ప్రవహించింది. దీంతో 2021, 2022లో నిర్ణీత సమయం కంటే ముందుగానే నీటిని సాగు నిమిత్తం జలాశయం నుంచి విడుదల చేశారు. 2023లో నిర్ణీత సమయంలోనే నీళ్లు విడుదలయ్యాయి. 2024లో నీరు కరువుతో కాస్త ఆలస్యమైంది. 2025లో నిర్ణీత సమయంలోనే నీరు విడుదల కావడంతో గత ఐదేళ్లలో డెల్టాలో ఐదు లక్షల ఎకరాల్లో కురువై సీజన్ వరి సాగు చేయగా, మరో 17 లక్షల ఎకరాల్లో ఇతర పంటల సాగు జరిగింది. అయితే, ఈఏడాది రైతులు పొలం దుక్కి దున్నేందుకు వెనుకాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడుకు ఇవ్వాల్సిన నీటిని కర్ణాటక విడుదల చేయక పోగా, మేఘధాతు వద్ద డ్యాం నిర్మాణ పనులు చేపట్టడంతో వివాదానికి దారి తీసింది. అదేసమయంలో రాష్ట్రంలో అధికారం మారింది. టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వంలో తొలిసారిగా నీరు విడుదల కోసం ఎదురు చూసిన డెల్టా రైతులకు మిగిలింది నిరాశే. ప్రస్తుతం మేట్టూరు డ్యామ్లో నీటిమట్టం 79.56 అడుగులు మాత్రమే ఉండడంతో సాగుకు నీరు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. కంటి తుడుపు చర్యే మేట్టూరు డ్యామ్ తెరవడం అసాధ్యం కావడంతో తంజావూరు, నాగపట్నం, తిరువారూర్, మైలాడుతురై వంటి డెల్టా జిల్లాల కురువై సాగు ఈ ఏడాది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం 90 శాతం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో ఉన్నారు. డెల్టాల్లో యాభై చోట్ల శుక్రవారం రైతు సంఘాలు ఆందోళనలకు దిగాయి. డెల్టాను కరువుప్రాంతంగా ప్రకటించాలని నినదించాయి. కురువై ప్యాకేజీపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి స్పందిస్తూ, ప్యాకేజీ ఓ డ్రామా అని మండిపడ్డారు. 24 గంటల ఉచిత విద్యుత్ను 18 గంటలకు తగ్గించడం విచారకరమని అన్నారు. రుణ మాఫీపై మాట తప్పినట్టుగానే, తాజాగా కురువై విషయంలో రైతులను నట్టేట ముంచేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. డెల్టాలో రూ.2 వేల కోట్ల మేరకు సాగు ఉత్పత్తి నష్టం ఈ సీజన్లో తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.రీల్స్మోడల్ పాలన: స్టాలిన్ ప్యాకేజీతో ప్రయోజనాలు: వరి సాగులో ఆధునిక యాంత్రీకరణను పెంచేందుకు వీలుగా యంత్రాల ద్వారా నాటు వేయడం, నేరుగా విత్తడం చేపట్టే రైతులకు ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు అందుతాయి. నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాల పంపిణీతోపాటు జీవ ఎరువులు, మైక్రోన్యూట్రిజెంట్ ఎరువుల మిశ్రమాలను భారీ సబ్సిడీపై అందిస్తారు. మోటార్ల ద్వారా సాగు చేసుకునే రైతులకు రోజుకు 18 గంటలపాటు నిరంతర త్రీ–ఫేజ్ విద్యుత్ను సరఫరా చేస్తారు. ఈ సీజన్కు ఇప్పటికే 10,714 మెట్రిక్ టన్నుల వరి విత్తనాలను, 4.02 లక్షల మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులను ప్రభుత్వం జిల్లాల్లో సిద్ధంగా ఉంచింది. రూ.110 కోట్లతో కాలువల పూడికతీత పనులు పూర్తి. సాగునీరు వృథా కాకుండా చివరి ఆయకట్టు భూముల వరకు చేరేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. డెల్టా రైతుల వరప్రదాయిని మేట్టూరు డ్యాం గేట్లు శుక్రవారం తెరుచుకోలేదు. రిజర్వాయర్లో నీళ్లు తక్కువగా ఉండడంతో కురువై సాగుకు నీరు కరువైంది. ఈ సీజన్లో అన్నదాతకు మిగిలింది కన్నీరే అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సీఎం విజయ్ ప్రభుత్వం ప్రత్యేక కరువై ప్యాకేజిని ప్రకటించింది. రూ.134 కోట్లతో రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టే దిశగా చర్యలు చేపట్టారు. ఇది కంటి తుడుపేనని డీఎంకే, అన్నాడీఎంకేలు మండిపడ్డారు. రైతు సంఘాలు పోరుబాట పట్టాయి. తమిళనాడులో రైతుల జీవనోపాధిని కాపాడేందుకు సీఎం విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెల్టా, నాన్–డెల్టా జిల్లాల్లో కురువై సీజన్లో వరి దిడుబడిని పెంచే లక్ష్యంతో రూ.134.83 కోట్ల వ్యయంతో కురువై ప్రత్యేక ప్యాకేజీ–2026ను సీఎం విజయ్ శుక్రవారం ప్రకటించారు. డెల్టా జిల్లాల్లోని బోరు బావులు, ఫిల్టర్ పాయింట్ల ద్వారా 3.55 లక్షల ఎకరాల్లో సాగును విజయవంతం చేసేందుకు రూ.77.50 కోట్లు కేటాయించారు. నాన్–డెల్టా ప్రాంతాలలో రూ.57.33 కోట్లతో కురువై, స్వర్ణవారి పంటలు వేసే రైతులకు అవసరమైన రాయితీలు అందించేందుకు నిధులు కేటాయించారు. ఇది రీల్స్ మోడల్ పాలన, పొయ్యి వెలిగించకుండా వంట చేసినట్టే ఉంది సీఎం విజయ్ ప్యాకేజీ అని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. అనుభవం లేని ఈ ప్రభుత్వం మేట్టూరును పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. క్యారవాన్కు పరిమితమైన వారికి రైతుల కష్టాలు ఏం తెలుసునని ప్రశ్నించారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమిళనాడులోని టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా ఉండడంతోనే, మేఘధాతు విషయంలో ఈ పాలకులు మౌనం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు అడిగితే, ప్యాకేజీతో సర్దుకోవాలని పేర్కొనడం శోచనీయమన్నారు. -
రాష్ట్రానికి ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ రాక
సాక్షి, చైన్నె: ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్ ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజులపాటు తమిళనాడు, పుదుచ్చేరిలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎన్సీసీ చీఫ్ చైన్నె డైరెక్టరేట్లో ఎన్సీసీ క్యాడెట్లు, అధికారులు, సిబ్బందిని కలవనున్నారు. యువతలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందించేందుకు, ప్రాంతీయ ఎన్సీసీ కార్యక్రమాల పురోగతిని సమీక్షించనున్నారు. వీఐటీ చైన్నె క్యాంపస్లో సైబర్ శిక్షణను పరిశీలించనున్నారు. ఎస్ఆర్ఎంలోని ఎన్సీసీ మౌలిక వసతులను వీక్షించనున్నారు. చైన్నెలోని ప్రముఖ ఎంఓపీ వైష్ణవ్ మహిళా కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనకు ఆయన హాజరవుతారు. ఎన్సీసీలో అత్యుత్తమ సేవలందిస్తూ అసాధారణ ప్రతిభ కనబరిచిన, ఎంపిక చేసిన ఎన్సీసీ క్యాడెట్లు, అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్లు, సిబ్బందికి డీజీ వీరేంద్ర వత్స్ అవార్డులను అందజేయనున్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం
వేలూరు: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర జౌళి, ఖాదీ శాఖా మంత్రి, వేలూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి విజయ్బాలా జీ అన్నారు. మొట్టమొదటి సారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వేల్మురుగన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం విజయ్ పుట్టినరోజు పురష్కరించుకొని వేలూరులోని జననీ బిగ్బజారు అధినేత సతీష్కుమార్ ఆధ్వర్యంలో వేలూ రు అన్నారోడ్డులోని మసీదులో ప్రార్థనలు చేశారు. అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంచి పెట్టారు. ఎమ్మెల్యేలు వినోద్కన్నన్, సుధాకర్, తెండ్రల్కుమార్, కూ టమి పార్టీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాహీద్బాషా, టీవీకే పార్టీ జిల్లా కోశాధికారి ప్రశాంత్, న్యాయ వాది దాస్, నాగరాజ్, సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం వేలూరులోని ప్రభుత్వ వసతి గృహంలో అధికారులతో పాటు కార్యకర్తలను పరిచయం చేసుకొని అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్నిశాఖల ఉన్నతాధికారులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. -
రాజకీయాల్లోకి లారెన్స్?
సాక్షి, చైన్నె: తమిళనాట సినిమా స్టార్ల పొలిటికల్ ఎంట్రీల పరంపర తమిళనాట కొనసాగుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. తిరుచ్చి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారనే వార్త కోలీవుడ్తోపాటు రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఈ ఊహాగానాలపై ఎట్టకేలకు రాఘవ లారెన్స్ స్పందించారు. శుక్రవారం ఉదయం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా 18 నిమిషాల నిడివిగల ఒక వీడియోను విడుదల చేస్తూ క్లారిటీ ఇచ్చారు. పొలిటికల్ జర్నీపై లారెన్స్ ఏమన్నారంటే..? తాను ఎప్పుడూ పదవుల కోసమో, డబ్బు సంపాదించాలనే ఆశతోనో రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని లారెన్స్ స్పష్టం చేశారు. నేను నమ్మే, నాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే.. అతనికి అండగా నిలిచి, నేను వ్యక్తిగతంగా చేస్తున్న సామాజిక సేవను మరింత విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన మాత్రమే నాకు ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు నన్ను రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి అని పేర్కొన్నారు. అలాగే, కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన ఈ వీడియోలో పంచుకున్నారు. మొదటి అడుగు జల్లికట్టు నిరసనల్లో పాల్గొనడం, ఆ తర్వాత రాజకీయ పార్టీ నేత సీమాన్ చేసిన విమర్శలకు తాను బదులివ్వడమే రాజకీయాల్లో తన మొదటి అడుగుగా భావిస్తున్నట్లు చెప్పారు. గతంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు ఆయనకు మద్దతు ఇవ్వాలని అనుకున్నానని, అయితే ఆయన రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారని గుర్తు చేసుకున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పినప్పుడల్లా, రాజకీయాలు ఒక పెద్ద భారం.. నీకొద్దని తన తల్లి వారించినట్టు లారెన్స్ తెలిపారు. విజయ్ విజయం.. మారిన అమ్మ మనసు తన మిత్రుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నికల్లో ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయాన్ని తన తల్లికి వివరించినట్లు చెప్పారు. దీంతో అమ్మ మనసు మారి నీకు నచ్చింది నువ్వు చెయ్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.ఫ్యాన్స్ కోర్టులోకి బంతి ఫలితాలపై ఆశలు పెట్టుకోకుండా మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించండి. నేను రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది మీరే నిర్ణయించాలి అని నిర్ణయం బంతిని ఫ్యాన్స్ కోర్టులోకి లారెన్స్ నెట్టారు. ఈ వీడియో చూసి అభిప్రాయాలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మీరు వద్దు అని చెబితే..నేను రాజకీయాల్లోకి రాను, ఎప్పటిలాగే నా సామాజిక సేవలను కొనసాగిస్తాను. ఒకవేళ మీరు అవును అని చెబితే ప్రజాశీర్వాదంతో నా రాజకీయ ప్రయాణాన్ని ఎప్పుడు, ఎవరితో కలిసి ప్రారంభించబోతున్నానో త్వరలోనే వెల్లడిస్తాను అని లారెన్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున రాజకీయాలలోకి రావాలని కామెంట్లు పెడుతూ మద్దతు తెలుపుతున్నారు. ఎక్కువ శాతం మంది టీవీకే విజయ్తో కలిసి పనిచేయాలని పిలుపునివ్వడం విశేషం. మరికొందరు మాత్రం రాజకీయాల కంటే సేవా కార్యక్రమాలే మంచిది అంటూ సలహాలు ఇస్తున్నారు. ఈ దృష్ట్యా, లారెన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. -
మహిళల ఆగ్రహమే ముంచేసింది
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కోల్పోవడంపై నియోజకవర్గాల వారీగా తెప్పించుకున్న క్షేత్రస్థాయి విచారణ నివేదికలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్కు షాక్ తగిలే విధంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల్లో ఘోర పరాజయానికి గల కారణాలను విశ్లేషిస్తూ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు రెండు రోజుల క్రితమే ఒక సమగ్ర నివేదికను స్టాలిన్న్కు సమర్పించాయి. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడం, మహిళల్లో వ్యక్తమైన తీవ్ర అసంతృప్తి పార్టీని పూర్తిగా ముంచేసిందని ఈ నివేదిక తేల్చిచెప్పింది. శుక్రవారం డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో ఈ ప్రత్యేక కమిటీతో స్టాలిన్ సమావేశమయ్యారు. ఇందులోని అంశాలను పరిశీలించి, నియోజకవర్గాల వారీగా చర్చించారు. ఓటమికి ప్రధాన కారణాలు తాజా నివేదిక మేరకు వెలుగులోకి వచ్చాయి. విజయ్ను తక్కువగా అంచనా విజయ్ క్షేత్రస్థాయిలో సాధిస్తున్న ప్రజాదరణను, ఆయనకు లభిస్తున్న నిశ్శబ్ద మద్దతును డీఎంకే జిల్లా అధికారులు, స్థానిక నాయకత్వం గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని తేలింది. గెలుపు గుర్రాలైన స్థానిక పలుకుబడి కలిగిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి, కొత్త ముఖాలను పోటీలో పెట్టడం కూడా ఓటమికి ఓ కారణంగా గుర్తించారు. నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య కనీస సమన్వయం లేదని నివేదిక స్పష్టం చేసింది. ఇక యాక్షన్ ప్లాన్ ఈ పరాజయం నేపథ్యంలో డీఎంకేలో భారీ సంస్థాగత మార్పునకు ఎం.కె. స్టాలిన్ శ్రీకారం చుట్టారు. పార్టీ పరిపాలనా యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పెద్ద జిల్లాల పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల వరకు ఒక జిల్లా కార్యదర్శి ఉండగా, ఆ నియోజకవర్గాల సంఖ్యను తగ్గించి కేవలం రెండు లేదా మూడు నియోజకవర్గాలకు ఒక జిల్లా కార్యదర్శిని నియమించేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం పార్టీ పరంగా ఉన్న 78 మంది జిల్లా కార్యదర్శుల సంఖ్యను 115కు పెంచనున్నారు. ఈ విభజన ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మరో 30 మంది పార్టీ కోసం పనిచేసే కొత్త వారికి జిల్లా కార్యదర్శులుగా అవకాశం దక్కనుంది. దక్షిణ, కొంగు మండలాలపై దృష్టి డీఎంకే తీవ్రంగా దెబ్బతిన్న దక్షిణ జిల్లాలు, పశ్చిమ ప్రాంతమైన కొంగు మండలం పార్టీని పునరుద్ధరించడానికి ప్రత్యేక కమిటీని రంగంలోకి దించారు. అలాగే, పార్టీ అగ్రనాయకత్వంలో కూడా అధికార వికేంద్రీకరణ జరగబోతోందని అరివాలయం వర్గాలు తెలిపాయి. కలైంజ్ఞర్ కాలం నాటి పాత రాజకీయ వ్యూహాలు ఇప్పుడు పని చేయవని, కొత్త తరం ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా సరికొత్త నాయకత్వ ఫార్ములాను స్టాలిన్ సిద్ధం చేసినట్టు తెలిసింది. కనిమొళి, ఉదయనిధి : ఇప్పటికే యువజన విభాగంలో కీలకంగా ఉదయనిధి స్టాలిన్తో పాటు, ఢిల్లీ రాజకీయాల్లో అపార అనుభవం, మహిళల్లో మంచి పట్టు ఉన్న సీనియర్ నేత కనిమొళికి కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. వీరిద్దరిని కలిపి ద్వంద్వ బృందం పద్ధతిలో పార్టీని నడిపించేందుకు అధిష్ఠానం కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే జరగబోయే డీఎంకే జనరల్ సర్వసభ్య సమావేశంలో ఈ సంచలన మార్పులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. మహిళా లబ్ధిదారుల ఆగ్రహం డీఎంకే హయాంలో ప్రవేశపెట్టిన మహిళా హక్కుల పథకం డీఎంకే ఓటమికి ప్రధాన కారణంగా నిలవడం గమనార్హం. రాష్ట్రంలో 2 కోట్ల 20 లక్షల రేషన్ కార్డులు ఉంటే, కేవలం ఒక వర్గానికి మాత్రమే కోటి 34 లక్షల మందికి ఈ సాయం అందించడం, ఇందులోనూ ఇతర పార్టీల వారు ఉండడంతో, మిగిలిన కోటి మంది మహిళలు డీఎంకేకు వ్యతిరేకంగా ఓటు వేశారన్నది స్పష్టం కావడం ఆలోచించ దగ్గ విషయం. అలాగే, ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ప్రభుత్వం అందించిన రూ.5వేలు వేసవి సాయాన్ని కూడా కేవలం కొద్దిమంది అర్హులకు మాత్రమే పరిమితం చేయడం వలన సాధారణ మహిళా ఓటర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమై ఓట్లను దూరం చేసినట్టు తేటతెల్లమైంది. -
క్లుప్తంగా
మా పోస్టర్లు మేమే తొలగిస్తాం తిరువొత్తియూరు: తూర్పు తాంబరంలో భారత మాతా రోడ్డులోని రైల్వేస్టేషన్ గోడలపై రాజకీయ పార్టీల నిర్వాహకులు పోస్టర్లు అంటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో తాంబరం మొత్తం శుభ్రంగా ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉద యం తాంబరం కార్పొరేషన్ నగర విభాగ అధికారులు సిబ్బంది భారత మాతా రోడ్డులోని గోడలపై అంటించి ఉన్న రాజకీయ పార్టీల పోస్టర్లను చింపి తొలగించారు. ఆ సమయంలో అక్కడ డీఎంకే పోస్టర్లను తొలగించడానికి ప్రయత్నించగా, జోనల్ కమిటీ చైర్మన్ ఇందిరన్ నాయకత్వంలో డీఎంకే శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ పార్టీ పోస్టర్లను తామే తొలగించుకుంటామని, అధికారులు వాటిని ముట్టుకోకూడదని వారు తేల్చి చెప్పారు. దీంతో అధికారులు డీఎంకే పోస్టర్లను తొలగించకుండానే వెనుదిరిగారు. లంచం కేసులో బిల్కలెక్టర్ అరెస్ట్ పళ్లిపట్టు: వరి కొనుగోలుకు రైతు నుంచి లంచం తీసుకున్న బిల్ కలెక్టర్ను ఏసీబీ పోలీసులు గురువారం రాత్రి అరె స్టు చేశారు. ఆర్కేపేట యూనియన్లోని దామనేరి గ్రామంలో ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నా రు. అందులో తాత్కాలిక బిల్కలెక్టర్గా పళ్లిపట్టు కు చెందిన సౌందర్(28) విధులు నిర్వహిస్తున్నా రు. అతను రైతుల నుంచి వరి కొనుగోలుకు లంచం డిమాండ్ చేస్తున్నట్లు పిర్యాదులున్నాయి. లంచం ఇవ్వని రైతుల వరి కొనుగోలులో ఆలస్యం చేస్తున్నట్లు తెలిసింది. ఈక్రమంలో రంగాపురానికి చెందిన సెల్వం అనే రైతు వరి విక్రయించేందుకు వెళ్లగా లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. లంచం ఇష్టపడిని రైతు తిరువళ్లూలోని ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు 215 బస్తాలకు రూ.10, 750 లంచం డబ్బులు తీసుకుని గురువారం సాయంత్రం ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రానికి వెళ్లి సౌందర్కు ఇచ్చాడు. ఆసమయంలో అక్కడే వున్న ఏసీబీ సీఐ తమిళరసి, బృందం సభ్యులు సౌందర్ను రెడ్హ్యేండడ్గా పట్టుకుని అరెస్టు చేశారు. తిరువళ్లూరు కోర్టులో హజరుపరిచి పుళళ్ జైలుకు తరలించారు. లారీడ్రైవర్ దారుణ హత్య తిరువొత్తియూరు: లారీడ్రైవర్ తల నరికిన స్థితిలో దారుణ హత్యకు గురయ్యాడు. తెన్కాసి జిల్లా కడయనల్లూర్ సమీపం కరడి కుళం గ్రామానికి చెందిన మారిముత్తు (35) లారీడ్రైవర్. ఇతని భార్య ఇసైక్కలై, కుమారుడు మిథున్ రాహుల్, కుమార్తె అనన్య. గురువారం రాత్రి మారిముత్తు బైక్లో పొయ్గై ప్రాంతానికి వెళుతున్నాడు. కరుప్పన్ ఆలయానికి వెళ్లే రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను అడ్డుకున్నారు. మారిముత్తును వేటకొడవళ్లతో నరికి, చంపి తలని శరీరం నుంచి వేరు చేసి పారిపోయారు. విషయం తెలిసి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆగ్రహించిన మారిముత్తు బంధువులు, స్థానికులు నాలుగు గంటలపాటు రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వారితో చర్చలు జరిపి రాస్తారోకో విరమింపజేశారు. హంతకులను పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. తిరువలంగాడులో నగలు చోరీ తిరుత్తణి: తిరువలంగాడులో ఇంటి తలుపులు పగులగొట్టి దుండగులు 15 సవర్ల నగలు చోరీ చేశారు. తిరువలంగాడు కూడల్వాడి గ్రామానికి చెందిన శివకుమార్(55). ఇతను తిరువలంగాడులోని తిరుత్తణి సహకార చక్కెర ఫ్యాక్టరీలో కార్యాలయ సిబ్బందిగా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి ఇంట్లో శివకుమార్, భార్య భవాని నిద్రిస్తున్నారు. ఈక్రమంలో ఇంటి వెనుక తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువాలోని 15 సవర్ల నగలు, రూ.30 వేల నగదు చోరీ చేసుకెళ్లారు. శుక్రవారం ఉదయం శివకుమార్ నిద్ర లేచి చూసి చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరువలంగాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయురాలు సస్పెన్షన్ తిరువొత్తియూరు: పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సస్పెన్షన్కు గురయ్యారు. తెన్కాసి జిల్లా సెంగోట్టైలోని ఎస్ఆర్ఎం ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ పాఠశాలలో 2వేల మందికి పైగా విద్యార్థినులు చదువుకుంటున్నారు. పురాతనమైన ఈ పాఠశాల భవనం గోడలపై నాచు పేరుకుపోయి, శిథిలాస్థకు చేరుకుంది. అంతేకాకుండా, పాఠశాల ప్రాంగణంలో తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు సరిగ్గా లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలోని ప్రాథమిక సదుపాయాలను మెరుగుపరచాలని, భవనానికి మరమ్మతు చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయురాలు జీవాకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె దీనిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. ఆమైపె మరిన్ని ఆరోపణలు రావడంతో, ఈ విషయాన్ని సీఈఓ రేణుక దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం, జీవాను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. -
రాజకీయాల్లోకి లారెన్స్.. కీలక ప్రకటన
ప్రముఖ నటుడు రాఘవా లారెన్స్ ఎట్టకేలకు ఊహాగానాలపై స్పందించారు. గత కొంతకాలంగా ఆయన రాజకీయాల్లోకి వస్తారని.. ఫలానా పార్టీలో చేరి ఉపఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. అయితే రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ఇంకొంత కాలం సస్పెన్స్ను కొనసాగించాలనే ఆయన నిర్ణయించారు. రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేదానిని లారెన్స్ ప్రశ్నార్థకంగా వదిలేశారు. ఈ అంశాన్ని ప్రజలే నిర్ణయించాలంటూ ఎక్స్ ఖాతాలో తాజాగా ఆయనో వీడియో రిలీజ్ చేశారు. కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ నటుడైన లారెన్స్.. అటు సమాజ సేవతోనూ మంచి గుర్తింపు పొందారు. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై కుతూహలం నెలకొంది. ఈ ప్రచారం స్వయంగా ఆయనే స్పందించారు. తాను ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని.. పదవి కోసమో లేదంటే డబ్బు కోసం రాజకీయాలను ఆశ్రయించడం లేదని రాఘవ లారెన్స్ స్పష్టం చేశారు. అయితే తనకు నమ్మకమైన, సన్నిహిత వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే.. అతనికి అండగా నిలిచి, వ్యక్తిగతంగా చేస్తున్న సమాజ సేవను మరింత పెద్ద స్థాయిలో చేయాలనే ఆలోచన మాత్రమే తనకు ఉందన్నారు. ప్రస్తుతం పరిస్థితులు తనను రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన స్థితికి తీసుకొచ్చాయని పేర్కొన్నారు. రాజకీయాలపై తానే ఓ కీలక ప్రకటన చేస్తానని లారెన్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. అయితే దర్శక దిగ్గజం భారతీరాజా మృతితో ఆ ప్రకటనను ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈ తరుణంలో ఓ వీడియో రిలీజ్ చేశారిప్పుడు. ప్రజలు ఆమోదిస్తేనే తాను రాజకీయాల్లోకి వస్తానని, లేకుంటే లేదని తేల్చేశారు. ప్రజాశీర్వాదంతోనే.. తాను ఏ పార్టీలో చేరతాననేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఆయన కామెంట్ సెక్షన్లో పలువురు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఆయన ట్వీట్ సారాంశం.. Do your duty sincerely, without expecting anything in return.After watching this video, please share your advice and guidance in the comments. If you say “No,” I will not enter politics and will continue my selfless service to society. But if you say “Yes,” I am ready to enter… pic.twitter.com/VwPFjdaUqy— Raghava Lawrence (@offl_Lawrence) June 12, 2026ఫలితాలపై ఆశలు పెట్టుకోకుండా మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. మీరు 'వద్దు' అంటే నేను రాజకీయాల్లోకి రాను.. సమాజ సేవనే కొనసాగిస్తాను. 'అవును' అంటే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు, ఎవరితో కలిసి నా రాజకీయ ప్రయాణం ప్రారంభమవుతుందో త్వరలో వెల్లడిస్తాను.అయితే.. లారెన్స్ కేవలం నటుడిగానే కాదు, కొరియోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాతగానూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. చిన్న డ్యాన్సర్గా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. నటుడిగా, తర్వాత స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగారు. అనంతరం హీరోగా మారి ముని, కాంచన, కాంచన-2, కాంచన-3 వంటి హారర్-కామెడీ చిత్రాలతో భారీ విజయాలు అందుకున్నారు. ముఖ్యంగా కాంచన సిరీస్తో దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు తన తల్లి పేరిట దివ్యాంగులు, అనాథలు, పేద విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేశారు. అందుకే ఆయన రాజకీయ అరంగేట్రంపై తమిళనాడులో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు లారెన్స్కు మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో విజయ్ నటించిన పలు చిత్రాలకు లారెన్స్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే లారెన్స్ సేవా కార్యక్రమాలకు విజయ్ ఆర్థిక సాయం అందించారు. దీంతో లారెన్స్ టీవీకే పార్టీలో చేరతారని, విజయ్ రాజీనామాతో(రెండింటిలో ఒకటి రాజీనామా చేయాల్సిన పరిస్థితిలో) ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో టీవీకే పార్టీ ఇప్పటిదాకా ఓ స్పష్టమైన ప్రకటన చేయలేదు. -
ఆ కారణంగానే టీవీకేకు మద్దతు.. చిదంబరం కీలక వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ స్పష్టత నిచ్చింది. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం పూర్తిగా సమర్థించారు. ‘మతసామరస్యం , రాష్ట్ర హక్కుల పరిరక్షణ అనే రెండు ప్రాథమిక సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నంత వరకు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు.గురువారం చైన్నెలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, తమిళనాడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఊహించని మహా విజయంమీడియా, రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందకుండా టీవీకే పార్టీ ఎన్నికల్లో ఏకంగా 35 శాతం ఓట్లను కొల్లగొట్టిందని కొనియాడారు. పార్టీ స్థాపించిన కేవలం రెండేళ్లలోనే ఇంతటి ఘనవిజయం సాధించడం అద్భుతమని విజయ్ను అభినందించారు. తమిళనాడు ప్రజలు ఇప్పుడు మళ్లీ ముందస్తు ఎన్నికలను కోరుకోవడం లేదని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే, రాష్ట్రపతి పాలన నెపంతో బీజేపీ దొడ్ది దారి గుండా అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉందని, అందుకే ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ప్రజాస్వామ్యబద్ధంగా సరైన నిర్ణయమని ఆయన విశ్లేషించారు. ప్రస్తుత టీవీకే ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా 31 మంది మంత్రులకు అసెంబ్లీలో ఎలాంటి ముందస్తు అనుభవం లేదన్నారు. అలాగే 101 మంది ఎమ్మెల్యేలు మొదటిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టారని వివరించారు. వీరందరికీ కొంత సమయం ఇవ్వాలని చిదంబరం కోరారు. బీజేపీ నుండి బయటకు వచ్చి అన్నామలై ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించడం గురించి స్పందిస్తూ, అది రాజకీయ పార్టీగా మారుతుందో లేదో నాకు తెలియదన్నారు. అయితే, బీజేపీలో ఆయనకు సరైన గుర్తింపు, గౌరవం దక్కలేదనే విషయం పలు ఇంటర్వ్యూలు చూస్తే స్పష్టంగా అర్థమవుతోందన్నారు. తాను ఇటీవల మాజీ సీఎం స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలిశానని, ఆయన ఇండియా కూటమి నుండి వైదొలుగుతున్నట్లు తనతో ఏమీ చెప్పలేదని వివరణ ఇచ్చారు. -
నిర్మాణాత్మక సహకారం
సాక్షి, చైన్నె : న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్క్కృతిక కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోషెఫ్ విజయ్ ప్రపథమంగా గురువారం హాజరయ్యారు. ఆయన ఇందులో కీలక ప్రసంగం చేశారు. తమిళనాడు ప్రజలు తమ ప్రభుత్వానికి చారిత్రాత్మక తీర్పునిచ్చారని గుర్తు చేస్తూ.. రాష్ట్ర హక్కులను కాపాడుకుంటూనే, కేంద్ర ప్రభుత్వంతో నిర్మాణాత్మక సహకారానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తమిళనాడు వృద్ధి రేటును, దేశ ప్రగతిని కాంక్షిస్తూ సీఎం జోసెఫ్ విజయ్ నీతి ఆయోగ్ వేదికగా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధానాంశాలు, డిమాండ్లు వివరాలను చైన్నెలోని సచివాలయం ప్రజా సంబంధాల విభాగం విడుదల చేసింది. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే , సమసమాజ, సగర్వ భారతదేశాన్ని నిర్మించగలం అని ఈ సమావేశంలో విజయ్ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానంతరం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం విజయ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.పీఎం మోదీతో సీఎం విజయ్ విజ్ఞప్తులు.. డిమాండ్లు 2036 నాటికి 1.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా పేర్కొంటూ, భారతదేశంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తమిళనాడు దూసుకుపోతోందన్నారు. తమ లక్ష్య దార్శనికత అన్నది యువత, పేదలు, మహిళలు, రైతులు అనే నాలుగు ముఖ్య స్తంభాలపై ఆధారపడి ఉందన్నారు. వైద్య విద్య కోర్సుల ప్రవేశాల కోసం కేంద్రం నిర్వహి స్తున్న నీట్ పరీక్షను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. గ్రామీణ, సామాజిక, ఆర్థికంగా వెనుకబడి విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తంచేస్తూ, ప్లస్టూ మార్కుల ఆధారంగానే రాష్ట్ర కోటా సీట్లను భర్తీ చేసుకునేందుకు తమిళనాడుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని విన్నవించారు. ఏడాదికి 5 లక్షల మంది యువతకు స్టైపెండ్తో కూడిన ఇంటర్న్షిప్లు, నైపుణ్య శిక్షణ అందించేందుకు యువ నైపుణ్య – ఉపాధి మిషన్కు శ్రీకారం చుట్టనున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ, సెమీకండక్టర్ రంగాల్లో శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర సాయం చేయాలని కోరారు. కోయంబత్తూరులో రాష్ట్ర ప్రభుత్వ స్థలంలో రెండో ఎయిమ్స్ ఆసుపత్రిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేదరిక నిర్మూలనలో భాగంగా తమిళనాడులో అర్హులైన కుటుంబాలను గుర్తించి, అందరికీ ఇళ్లు, స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు పేద రహిత తమిళనాడు ఉద్యమంకు శ్రీకారం చుట్టనున్నామని ప్రకటించారు. మహిళా భద్రతకు సింగప్పెన్ రంగంలోకి దిగినట్టు గుర్తు చేస్తూ, తమిళనాడులోనే అత్యధికంగా 42 శాతం మంది మహిళలు వివిధ సంస్థలలో ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. రైతుల సంక్షేమం కోసం తమిళనాడు ప్రభుత్వం ఇటీవల రూ.2,045 కోట్ల సహకార పంట రుణాలను మాఫీ చేసినట్లు గుర్తుచేస్తూ, మత్స్యకారులకు రక్షణ కల్పించాలని, శ్రీలంక ఆధీనంలో ఉన్న పడవలను విడుదల చేయించాలని కోరారు. తమిళనాడు ఆర్థిక వృద్ధికి కీలకమైన పలు జాతీయ రహదారులు ఎన్ హెచ్ 32, ఎన్హెచ్ 81,87 లను , చైన్నె – కన్యాకుమారి హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులకు తక్షణమే ఆమోదం తెలపాలని కేంద్ర రైల్వే, రహదారుల శాఖలను కోరారు. కొత్త విద్యా విధానం లేదా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలనే నిబంధనలు పెట్టకుండా, తమిళనాడు కు రావాల్సిన రూ.3,284 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హొగ్నెకల్ 3వ విడత ఉమ్మడి తాగునీటి పథకానికి కేంద్రం వాగ్దానం చేసిన రూ.2,283.40 కోట్ల నిధులను మంజూరు చేయాలన్నారు. కులశేఖరపట్నంలో ఇస్రో భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న స్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ను జాతీయ స్పేస్ట ఉత్పాదక కేంద్రం’గా ప్రకటించాలని కోరారు. భారతదేశ లౌకిక విలువలకు అద్దం పట్టే ప్రపంచ ప్రసిద్ధ, అత్యంత పురాతనమైన తమిళ గ్రంథం ’తిరుక్కురళ్’ను జాతీయ సాహిత్యంగా ప్రకటించాలి. -
స్మార్ట్చాయిస్ ఫీచర్ ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగ దారుల కోసం స్మార్ట్ చాయిస్ ఫీచర్ను ఆవిష్కరించి, 10 కొత్త విభాగాలకు విస్తరించినట్టుఅమెజాన్ ఇండియా డైరెక్టర్ జెబా ఖాన్ తెలిపారు. లాప్టాప్లు, టాబ్లెట్లు, ఆడియో డివైజ్లు, కెమెరాలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు , మానిటర్లు, పీసీ యాక్సెసరీలు వేరబుల్స్ వంటి విభాగాలలో ఈ సేవలు ఇకపై అందుబాటులోకి రానున్నాయని వివరించారు. త్వరలోనే టెలివిజన్లు, స్మార్ట్ఫోన్లను కూడా ఈ జాబితాలో చేర్చనున్నామన్నారు. సాధారణంగా ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనేటప్పుడు వందలాది స్పెసిఫికేషన్లు చూసి వినియోగదారులు కన్ఫ్యూజ్ అవుతుంటారని, అలా కాకుండా, కస్టమర్ల నిజ జీవిత అవసరాలకు అనుగుణంగా సరైన వస్తువును ఎంచుకోవడానికి ఈ ఫీచర్ సహాయపడుతుందని వివరించారు. ఈ సిఫార్సుల కోసం అమెజాన్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకోసిస్టమ్ అయిన రూఫస్ , లెన్స్ ఏఐ, ఏఐ రివ్యూ సమ్మరీలు, ప్రైస్ హిస్టరీ టూల్స్ను ఉపయోగిస్తున్నట్టు పేర్కొంటూ, గురువారం నుంచి స్మార్ట్ చాయిస్ డేస్ విక్రయాలకు శ్రీకారం చుట్టామని ప్రకటించారు. అన్నానగర్: తిరుపత్తూరు జిల్లా జోలార్పేటై సమీపంలోని ఏలగిరిమలై పాడనూర్ సమీపంలోని ప్రాంతానికి చెందిన దేవేంద్రన్, చిత్ర దంపతుల కుమార్తె అంజలి (23) సేలంలోని కళాశాలలో చదువుతోంది. ఈ స్థితిలో అదే కళాశాలలో చదువుతున్న, ధర్మపురి జిల్లాలోని బాపిరెడ్డి ప్రాంతానికి చెందిన విద్యార్థి కేశవన్, అంజలి ప్రేమలో పడ్డారు. వారిద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో, ఇద్దరి తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించలేదు, అప్పటి నుండి ఒక సంవత్సరం గడిచింది. పెళ్లికి ముందు, వాళ్లిద్దరూ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయి, పెళ్లి చేసుకుని జీవిస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్లకు ఒక ఆడపిల్ల ఉంది.ఈ స్థితిలో, అంజలి తల్లి చిత్ర హృదయ విచారకరంగా బాధపడి, తన కూతురు అంజలిని, మనవడిని ఏలగిరి కొండల పాదాల వద్ద ఉన్న మంజన్ వట్టం ప్రాంతానికి తీసుకువచ్చింది. ఇది చూసి, చిత్ర సోదరుడు కృష్ణన్ నాటు తుపాకీ తెచ్చి అంజలిని కాల్చడానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ విషయం ఏలగిరి కొండ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కొరుక్కుపేట: చైన్నె, పరిసర ప్రాంతాల్లో రాత్రంతా విద్యుత్ కోతలు కొనసాగడంతో, ప్రజలు గుమిగూడి రోడ్లను దిగ్బంధించారు, విద్యుత్ బోర్డు కార్యాలయంపై దాడి చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి సుమారు 9 గంటలకు చైన్నెలోని సైదాపేటలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీని కారణంగా, తీవ్రమైన వేడిమి, దోమల బెడదతో బాధపడుతున్న ప్రజలు విద్యుత్ బోర్డు కార్యాలయాన్ని సంప్రదించడానికి ప్రయత్నించగా, ఆ ప్రాంతంలోని లైన్మెన్ల నుండి ఉన్నతాధికారుల వరకు అందరి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి. ఆగ్రహించిన ప్రజలు అక్కడ ఉన్న విద్యుత్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. విషయం తెలిసుకుని విద్యుత్ శాఖ మంత్రి నిరంతరాయ విద్యుత్ సరఫరాను కొనసాగిస్తామని వాగ్దానం చేశారు. ఆ తర్వాత ప్రజలు నిరసనను విరమించారు. కార్వేటినగరం: కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు గురువారం రాత్రి గజవాహనంపై , ఉదయం హనుమంత వాహనంపై స్వామివారు పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. చెక్కభజనలు, కోలాట ప్రదర్శనలు, భక్తజనుల గోవింద నామస్మరణల నడుమ వాహన సేవలు వైభవంగా సాగాయి. కాగా బ్రహ్మోత్సవాల్లో నేడు సూర్య, చంద్రప్రభ వాహనంపై విహరిస్తారని ఆలయాధికారి చంగ్రల్రాజు తెలిపారు. -
అలరించిన దుర్యోధన వధ
ఐరాల: మండలంలోని నాంపల్లెలో దౌపదీ సమేత ధర్మరాజుల ఆలయంలో నిర్వహిస్తున్న మహా భారత యజ్ఞంలో భాగంగా గురువారం దుర్యోధన వధ ఘట్టం ప్రదర్శించారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాల అనంతరం పురవీధుల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహంతో పాటు శ్రీకృష్ణ, భీమ, అర్జున, నకుల, సహదేవ ఉత్సమూర్తులను ఊరేగించారు. మధ్యాహ్నం ఆలయ ఆవరణలో మట్టితో దుర్యోధనుడి ప్రతిమను రూపొందించారు. గంగ మడుగులో దాగి ఉన్న దుర్యోధనుడిని రెచ్చగొట్టి భీముడు బయటకు తీసుకువచ్చి హతమార్చడం మహాభారత గాథ. ఈ ఘట్టాన్ని కళాకారులు రౌద్రంగా కలియబడుతూ, గదాయుద్ధం చేస్తూ, తమ ప్రదర్శనతో రక్తి కట్టించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసిన జనంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. -
తేనికి తరలి వచ్చిన సినీలోకం
భారతీరాజా పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు భారీగా తేనికి తరలివచ్చారు. కవి వైరముత్తు, నటి రాధికా శరత్కుమార్, సుహాసిని, నిరోషా, దీప, నటులు భాగ్యరాజా, పార్తీబన్, వడివేలు, సముద్రఖని, నిలగళ్ రవి, శ్రీరామ్, కరుణాస్, విఘ్నేష్, దర్శకులు ఆర్.కె. సెల్వమణి, పేరరసు, రామ్, సీమాన్, అమీర్, మాజీ సీఎం పన్నీరు సెల్వం, మాజీ మంత్రి ఐ.పెరియసామి, ఎంపీలు వెంకటేశన్, తంగ తమిళ్ సెల్వన్, సీపీఎం నేత షణ్ముగం, అన్నాడీఎంకే సీనియర్ నేత సెల్లూరు రాజు తదితరలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కడసారిగా భారతీ రాజాపార్తీవ దేహం వద్ద కన్నీటి అంజలి ఘటించారు. నటుడు వడివేలు కన్నీటి పర్యంతమయ్యారు. ఓ దశలో ఆయన సొమ్మ సిల్లే పరిస్థితి నెలకొంది. బంధువులు , ఆప్తులు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. తేని పరిసర గ్రామాలలోని వృద్ధులు పెద్ద ఎత్తున వచ్చి అంజలి ఘటించారు. -
స్విస్ ప్రతినిధులతో మంత్రి ఆనంద్ భేటీ
సాక్షి, చైన్నె: తమిళనాడులో స్విస్ ‘గ్రీన్ శానిటేషన్’ ప్రాజెక్ట్ గురించి స్విస్ ప్రతినిధి బృందంతో గురువారం మంత్రి ఆనంద్ సమావేశమయ్యారు. తమిళనాడు గ్రామీణాభివద్ధి, జలవనరుల శాఖ మంత్రి ఎన్. ఆనంద్ ను స్విట్జర్లాండ్కు చెందిన ని–వాటర్ సంస్థ ప్రతినిధులు బృందం కలిశారు. వి లివ్ సస్టెయిన్ ప్రోగ్రామ్ మేరకు ఈ సంస్థ తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా రసాయన రహిత క్లీనింగ్ , జల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా అమలు చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో స్విస్ ని–వాటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ, స్విట్జర్లాండ్ పార్లమెంట్ మాజీ సభ్యుడైన డాక్టర్ గిలాడ్ బెగ్లేతో పాటు కంపెనీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బ్యానర్లు, కటౌట్లు పెడితే కఠిన చర్యలు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ జూన్ 22న జరుపుకోబోతున్న మొదటి పుట్టినరోజు సందర్భంగా హంగు ఆర్భాటాలకు చెక్ పెట్టారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి ఆనంద్ నేతృత్వంలో పనయూరులోని టీవీకే కార్యాలయంలో సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయకూడదని హెచ్చరించారు.బ్యానర్ సంస్కతికి పూర్తిగా స్వస్తి పలకాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వారికి ఆనంద్ వివరించారు. టీవీకే తరఫున జరిగే ఏ కార్యక్రమాల్లోనూ బ్యానర్లు కనిపించకూడదని, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఏ ఒక్కరూ ప్రవర్తించరాదని స్పష్టం చేశారు. హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ రాష్ట్రవ్యాప్తంగా పేదలకు, నిరుపేదలకు అపూర్వమైన రీతిలో భారీ ఎత్తున సంక్షేమ సహాయం అందించాలని పిలుపు నిచ్చారు. -
నీలం ప్రొడక్షన్స్లో నటుడు మణికంఠన్
తమిళసినిమా: దర్శకుడు పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్ కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తూ పలు వైవిధ్య భరిత కథా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థలో ఎక్కువగా పా.రంజిత్ శిష్యులే దర్శకత్వం వహిస్తున్నారు. పా.రంజిత్ ఇంతకు ముందు పరియేరుమ్ పెరుమాళ్,సార్పట్ట పరంపరై వంటి పలు విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. కాగా తాజాగా ఈ సంస్థ నూతన చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రం ద్వారా నా.రంజిత్ శిష్యుడు సంతోష్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నటుడు మణికంఠన్ కథానాయకుడిగా నటించనున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న మణికంఠన్ ఇంతకు ముందు గుడ్ నైట్, లవర్స్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా దర్శకుడు పా.రంజిత్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి మక్కళ్ కావలన్ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఇది సాధారణ ప్రజల జీవన విధానాన్ని, రాజకీయాలను చర్చించే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. త్వరలో ప్రారంభం కానునున్న ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. నా.రంజిత్ నిర్మించనున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. -
కార్మికుడిపై ఎస్ఐ కాల్పులు కేసు
సాక్షి, చైన్నె: తమిళనాడులోని తెన్కాశి జిల్లాలో కార్మికుడి పై సబ్ ఇన్స్పెక్టర్ తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనపై మదురై హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక పోలీసుల విచారణపై నమ్మకం లేదంటూ బాధితుడి తండ్రి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయ స్థానం ఈ కేసును తక్షణమే సీబీసీఐడీ దర్యాప్తునకు బదిలీ చేస్తూ గురువారం సంచలన తీర్పునిచ్చింది. అసలు ఏం జరిగిందంటే..? తెన్కాశి జిల్లా ఆలంగుళం సమీపంలోని మరుతం పూత్తూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ సేట్ కుమారుడు మణికంఠన్. ఇతను తాటి నుంజులు, నీరా, పదనీర్(కల్లు) తీసే వృత్తిని జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నాడు. ఏప్రిల్ 7వ తేదీన ఆలంగుళం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఇసక్కిరాజా కొందరు పోలీసులు సివిల్ డ్రస్లో మణికంఠన్ ఇంటికి వచ్చారు. తాటి చెట్లకు కట్టిన కుండల్లో కల్లు ఉందా లేదా నీరా ఉందా అని తనిఖీ చేయాలంటూ మణికంఠన్ను బలవంతంగా తోటలోకి తీసుకెళ్లారు. కుల వివక్షతో కాల్పులు మణికంఠన్ చెట్టు ఎక్కుతున్న సమయంలో ఎస్ఐ ఇసక్కిరాజా అతనిని కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిని అక్కడే ఉన్న మణికంఠన్ తండ్రి, అతని కూతురు నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్ఐ, మణికంఠన్ చెట్టు దిగి కిందకు రాగానే తన వద్ద ఉన్న తుపాకీతో అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మణికంఠన్ రెండు కాళ్లకు తీవ్ర బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైకోర్టును ఆశ్రయించిన తండ్రి ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, నిందితుడు అదే పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ కావడంతో స్థానిక పోలీసుల విచారణ వల్ల తమకు న్యాయం జరగదని మణికంఠన్ తండ్రి పెరుమాళ్ సేట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐ లేదా మరేదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలంటూ ఆయన హైకోర్టు మదురై బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురువారం న్యాయమూర్తి పుగళేంది ఎదుట విచారణకు వచ్చింది. బాధితుడి తరపు వాదనలను విన్న న్యాయమూర్తి, పిటిషనర్ అభ్యర్థనను అంగీకరించారు. ఒక సామాన్య కార్మికుడిపై పోలీసు అధికారి కాల్పులు జరపడం తీవ్రమైన విషయమని భావిస్తూ.. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించేందుకు వీలుగా విచారణ బాధ్యతలను సీబీసీఐడీ విభాగానికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
పోలీసులే కిడ్నాపర్లు..!
సాక్షి, చైన్నె: కోయంబత్తూరు జిల్లాలో గత రెండు రో జులుగా కలకలం రేపుతూ వచ్చిన కిడ్నాప్ కేసును పోలీసులు చేదించారు. ఈ కిడ్నాప్ ఉదంతంలో నిందితులు మరెవరో కాదు.. సాక్షాత్తు శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే అని గురువారం తేలడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కిడ్నాప్.. కోయంబత్తూరు పోతనూర్ సమీపంలోని సిద్ధన్నపురం ప్రాంతానికి చెందిన నవీన్ (29) అనే యువకుడు వెల్లలూర్ హౌసింగ్ యూనిట్ ఏరియాలో ఉంటూ ఆన్లైన్ ట్రేడింగ్ వ్యాపారం చేస్తున్నాడు. జూన్ 8వ తేదీ మధ్యాహ్నం నవీన్ సోదరి పరమేశ్వరి మొబైల్కు ఒక అపరిచిత నంబర్ నుండి ఫోన్ వచ్చింది. ‘నీ తమ్ముడు నవీన్ను మేము కిడ్నాప్ చేశాం.. వాడు ప్రాణాలతో తిరిగి రావాలంటే వెంటనే రూ.50 లక్షలు సిద్ధం చేయాలి‘ అని అవతలి వ్యక్తి బెదిరించి ఫోన్ కట్ చేశాడు. ఆందోళనతో పరమేశ్వరి తమ్ముడి ఇంటికి వెళ్లి చూడగా.. ఇల్లు లాక్ చేసి ఉండటం, అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో కలవరంలో పడింది. అదే సమయంలో నవీన్ స్నేహితుడైన నిర్మల్ కుమార్ (29) భార్య జెనితా కూడా తన భర్త కనిపించడం లేదంటూ పరమేశ్వరిని సంప్రదించింది. అదే రోజు రాత్రి నవీన్ ఫోన్ నంబర్ నుండి నిర్మల్ భార్య జెనితాకు మళ్లీ కిడ్నాపర్ల ఫోన్ వచ్చింది. ఇద్దరు యువకులూ తమ ఆధీనంలో ఉన్నారని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఇద్దరినీ చంపేస్తామని కిడ్నాపర్లు హెచ్చరించారు. నిందితులు పోలీసులే.. బాధితుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోతనూర్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాపర్లు మాట్లాడిన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా, ఘటనా స్థలాల్లోని సీసీటీవీ విజువల్స్ పరిశీలించి పోలీసులు తిరుపూర్లో నిందితులను పట్టుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. బుధవారం రాత్రి డబ్బులు తీసుకునేందుకు తిరుపూర్ నల్లూరు ప్రాంతానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా షాకింగ్ సమాచారం తప్పలేదు. పట్టుబడిన ఆ ఇద్దరూ తిరుపూర్ నల్లూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న మోహన్, ఆనంద్గా తేలింది. ఇద్దర్నీ అరెస్టు చేసి విచారించగా ఆన్లైన్ ట్రేడింగ్లో చేతుల నిండుగా ఆర్జిస్తున్న ఈ ఇద్దర్ని కిడ్నాప్ చేసి పెద్ద మొత్తాన్ని రాబట్టే ప్రయత్నం చేసినట్టు తేలింది. వీరు ఇచ్చిన సమాచారంతో తిరుప్పూర్కు చెందిన కాళిదాసు, ఆనందన్ మోహన్, రామ్కుమార్లతో పాటుగా ఆరుగుర్ని అరెస్టు చేశారు. వీరి చెర నుంచి ఆ ఇద్దర్నీ రక్షించారు. పట్టుబడ్డ కానిస్టేబుళ్లు ఇద్దర్నీ సస్పెండ్ చేస్తూ, తిరుపూర్ పోలీసు కమిషనర్రాజేంద్రన్ ఆదేశాలు ఇచ్చారు. -
సెల్వపెరుంతొగై అవుట్?
సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్ కమిటీలో త్వరలోనే భారీ నాయకత్వ మార్పు జరగబోతున్నట్లు కాంగ్రెస్ కార్యాలయం సత్యమూర్తి భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కె. సెల్వపెరుంతొగై స్థానంలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన విరుదునగర్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తులు చేస్తున్నట్టు సంకేతాలువెలువడ్డాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలను పునర్వ్యవస్థీకరించి, పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలని ఏఐసీసీ భావిస్తున్న నేపథ్యంలో తాజాగా తమిళనాడులో కూడా ఈ మార్పు జరగబోతోందన్న చర్చ జరుగుతున్నది. సెల్వపెరుంతొగై రాజీనామా అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగబోనని సెల్వపెరుంతొగై ఇదివరకే ప్రకటించారు. అధికారికంగా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే సమాచారాలు వెలువడ్డాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సరికొత్త రాజకీయ సమీకరణాలు ,కూటములు తెరపైకి వచ్చాయి. ఇలాంటి కీలక సమయంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తులలో పడింది. రేసులో.. సెల్వపెరుందగై స్థానాన్ని భర్తీ చేయడానికి ఢిల్లీ పెద్దలు మాణిక్యం ఠాగూర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తుడు, నమ్మకమైన కోర్ టీమ్ మెంబర్గా గుర్తింపు పొందారు. ఢిల్లీ రాజకీయాలతో పాటూ ఇతర రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై కూడా ఆయనకు మంచి పట్టు ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను యాక్టివ్ చేయడంలో, దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన దిట్ట అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. డీఎంకేను ఆది నుంచి విమర్శించడమే కాకుండా, ఆ పార్టీ వర్గాలకు మాటకు మాట అన్నట్టుగా సమాధానాలు ఇవ్వడంతో మాణిక్యం ముందుంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో డీఎంకేను ఢీ కొట్టాలంటే మాణిక్యం ఠాగూర్ పార్టీకి నాయకత్వం వహిండం ద్వారానే సాధ్యమన్న నిర్ణయానికి ఏఐసీసీ వర్గాలు వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. -
పోలీసు దుస్తులతో వేడుకలు
వేలూరు: వేలూరు జిల్లా ఒడుగత్తూరు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 32 సంవత్సరాల వయస్సు గల వివాహిత ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఈమె భర్త రైతు. ఈ నేపథ్యంలో మేల్ అరసంబట్టు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కుమరేషన్తో అక్రమ సంబంధం కలిగి ఉంది. ఈమెకు పోలీస్ దుస్తులు వేసుకోవాలని ఆశ ఉండేది. బుధవారం వేలూరులోని ఒక బేకరీలో నిర్వహించిన కుమరేషన్ జన్మదినోత్సవ వేడుకల్లో ఆమె డీఎస్పీ దుసుల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో వేలూరు నార్త్ పోలీసులు వాహణ తనఖీలు చేపట్టారు. ఆ సమయంలో డీఎస్పి దుస్తువులు వేసుకున్న మహిళ వద్ద విచారణ జరిపారు. కాగా నిందితురాలు ఉమాహేశ్వరిపై పలు కేసులు పెండింగ్లో ఉన్నట్లు తేలడం గమనార్హం. -
ఉద్రిక్తతల నడుమ ఆక్రమణల తొలగింపు
తిరువళ్లూరు: పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డును ఆక్రమించుకుని ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా ఏర్పాటు చేసిన పలు దుకాణాలను రెవెన్యూ అధికారులు ఉద్రిక్తతల నడుమ గురువారం ఉదయం తొలగించారు. పట్టణంలోని సీవీ నాయుడు, జేఎన్ రోడ్డు, మాడవీధి, బజారువీధిలో రోడ్డుకు ఇరువైపులా పూలు, పండ్ల దుకాణాలు, చిన్నపాటి టిఫెన్ సెంటర్లు, కూరగాయల విక్రయాల దుకాణాలు వెలిశాయి. రోడ్డుకు ఇరువైపులా వెలిసిన దుకాణాలతో ట్రాఫిక్కు అంతరాయం కలగడంతోపాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా వున్న ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్ కవితకు వినతులు వచ్చాయి. దీంతో తిరువళ్లూరు ఆర్డీఓ రవిచంద్రన్, తహసీల్దార్ బాలాజీ, ఆర్అండ్బీ, మున్సిపల్శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రెండు రోజుల నుంచి ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఇందులోభాగంగానే గురవారం ఉదయం పుష్కరిణి వీధుల్లో అక్రమ కట్టడాలను తొలగించారు. ఆక్రమణల తొలగింపు సందర్భంగా కొందరు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో రెవెన్యూ అధికారులు పోలీసుల సాయంతో ఉద్రిక్తతల నడుమ ఆక్రమణలను తొలగించారు. -
మంత్రి హాజరైన కార్యక్రమంలో టీవీకే పార్టీ గీతం
● ప్రభుత్వ అధికారులు, విద్యార్థుల దిగ్భ్రాంతి కొరుక్కుపేట:విల్లుపురం జిల్లాలోని ముండియంబాక్కం ప్రభుత్వ వైద్య కళాశాల 11వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ లూసీ నిర్మల్ మడోన్నా, షేక్ అబ్దుల్ రెహమాన్, పీఎంకే ఎమ్మెల్యే శివకుమార్ హాజరయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్ రాజ్ ప్రత్యేక అతిథిగా హాజరై, 2020–26 విద్యా సంవత్సరంలో వైద్య విద్యను పూర్తి చేసిన 89 మంది విద్యార్థినులకు (బాలురు, బాలికలు) డిగ్రీలను ప్రదానం చేసి, ప్రత్యేక ప్రసంగం చేశారు. ఆ సమయంలో వైద్య విద్యార్థులు అంకితభావంతో సమాజంలోని నిమ్న వర్గాలకు సేవ చేయాలని ఆయన అన్నారు. నీట్ పరీక్ష గ్రామీణ విద్యార్థుల హక్కులకు, రాష్ట్రానికి వ్యతిరేకమని, ’ఒకే దేశానికి ఒక ఎన్నిక’ అన్నట్లుగా ఇది కూడా ఐక్యతా సూత్రానికి విరుద్ధమని ఆయన అన్నారు. వైద్య విద్యను రాష్ట్ర విద్యా జాబితా పరిధిలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. మంత్రి తన ప్రసంగాన్ని ముగించిన కొద్ది క్షణాలకే, ’తమిళ జెండా ఎగుర వేసి టీవీకే పార్టీ గీతాన్ని ప్లే చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ గీతాన్ని ప్లే చేయడం పట్ల అక్కడ ఉన్న అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అసంతప్తి వ్యక్తం చేశారు. మంత్రి కార్యక్రమానికి అప్పటికే ఆలస్యంగా రావడంతో, చివరలో గ్రూప్ ఫోటో కోసం విద్యార్థులను వేచి ఉండేలా చేశారు. ఆ సమయంలో, హాలులో ఒక విద్యార్థి అకస్మాత్తుగా సృహ కోల్పోవడంతో, కొద్దిసేపు గందరగోళం నెలకొంది. రాజ్యసభకు ప్రవీణ్ చక్రవర్తి ఏకగ్రీవ ఎన్నిక సాక్షి, చైన్నె : తమిళనాడు నుండి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ చక్రవర్తి ఏకగ్రీవంగా ఈ మేరకు తమిళనాడు శాసనసభ అధికారి, ఎన్నికల అధికారి గువవుఆరం సాయంత్రం ప్రకటించారు. తమిళనాడు నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు సి.వి. షణ్ముగం గత నెల 7న ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఏర్పడిన ఈ ఖాళీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది. తమిళనాడు శాసనసభలోని అధికార పక్షం, దాని మిత్రపక్షాల బలాన్ని బట్టి ఈ స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ చక్రవర్తికి టీవీకే చీఫ్, సీఎం విజయ్ కేటాయించారు. గడువు ముగిసే సమయానికి బలమైన ప్రత్యర్థులు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో, ప్రవీణ్ చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ అధికారికంగా ధృవీకరించింది.తమిళనాడు అసెంబ్లీ సభ్యుల మద్దతుతో ఎన్నికై న ప్రవీణ్ చక్రవర్తి త్వరలోనే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
చరిత్రలో ఇలాంటి చిత్రం రాలేదు..!
తమిళసినిమా: ప్రేమ, యాక్షన్, సెంటిమెంట్ వంటి కమర్షియల్ అంశాలతో చాలా చిత్రాలు వస్తుంటాయి. అయితే సహజత్వం కూడిన మనసును హత్తుకునే చిత్రాలు చాలా తక్కువగానే వస్తుంటాయి.తాజాగా రూపొందిన అలాంటి చిత్రం హబిబి. ఒక మధ్య తరగతికి చెందిన ఇస్లామిక్ కుటుంబం నేపధ్యంలో రూపొందిన చిత్రం ఇది. మూడు తరాలుగా చేనేత వృత్తి నమ్ముకుని అత్యంత సాధారణ జీవితాన్ని అనుభవించే ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలి, సంతోషంగా జీవించాలని భావించి, కొత్తగా పెళ్లి చేసుకుని భార్యను కూడా వదిలి దుబాయ్కి వెళ్తాడు. అక్కడ పలు ఏళ్లు పని చేసే సంపాదించిన డబ్బుతో సొంత ఊరికి తిరిగి వస్తాడు. అదే విధంగా తన అన్నయ్య కొడుకును కూడా దుబాయ్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అయితే చదువుకునే రోజుల్లోనే సహా విద్యార్థినిపై మనసు పడ్డ అతను ఆమెకు దూరం కావడం ఇష్టం లేక దుబాయ్ కి వెళ్లడానికి అయిష్టత వ్యక్తం చేస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రేయసికి దూరం కావలిసిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో అతను కూడా దుబాయ్ కి వెళ్తాడు. తిరిగి వచ్చిన తరువాత మరో యువతితో కుటుంబ సభ్యులు పెళ్లి ప్రయత్నాలు చేస్తారు. ఆ పెళ్లి జరిగిందా ? మొదట ప్రేమించిన యువతి ఏమైయ్యింది? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో అత్యంత సహజత్వంగా రూపొందిన చిత్రం హబిబి. ఇస్లామీయ సమాజంలోని ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లలను యధార్థంగా తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రానికి మీరా కదిరవన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సీనియర్ దర్శకుడు కస్తూరి రాజా ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నటి మాళవిక మనోజ్ మరో ముఖ్య పాత్రను పోషించారు. శ్యామ్ సి ఎస్.సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని నేశం ఎంటర్ టైన్మెంట్ ,జీకేఎస్ బ్రోస్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్ణయించాయి.కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ అధినేత రాహుల్ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇలాంటి చిత్రం గత 110 ఏళ్ల సినీ చరిత్రలో రాలేదని ప్రధాన పాత్రను పోషించిన దర్శకుడు కస్తూరి రాజా పేర్కొన్నారు. తమిళసినిమా: ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది నానుడి. అయితే కొందరు ఇందుకు భిన్నంగా తమ కెరీర్ను ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వారిలో నటి అవంతిక సుందర్ చేరుతున్నారు. ప్రముఖ దర్శకుడు సుందర్ .సీ, నటి కుష్బూ దంపతులకు అవంతిక, ఆనందించే అనే ఇద్దరు కూతుళ్లు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ఆనందిత చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు.మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశారు. ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో పని చేసిన అనుభవంతో ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తి డబుల్ ఆక్యుపెంసీ అనే చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.ఇక సుందర్ సి, కుష్బూ మరో వారసురాలు అవంతిక విషయానికి వస్తే ఈ బ్యూటీ కథానాయకిగా రంగప్రవేశం చేశారు. అయితే ఈ చిన్నది మొదట మలయాళంలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఆరంభం అనే చిత్రంలో కథానాయికిగా నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే కోలీవుడ్ అవకాశాన్ని అందుకున్నారు. నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన నిలవుక్కు ఎన్ మేల్ ఎప్నడీ కోపం చిత్రంతో హీరోగా పరిచయం అయ్యిన పవీష్ తాజాగా నటిస్తున్న రెండవ చిత్రంలో అవంతిక హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు పా.రంజిత్ శిష్యుడు ధామో నాగభూషణం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన కథ, దర్శకత్వం బాధ్యతలను ఈ చిత్రానికి అట్టాకర్ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇది వాలీబాల్ క్రీడ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో ఇండియాకు చెందిన పలువురు వాలీబాల్ క్రీడాకారులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారని తెలిపారు. అట్టాకర్ చిత్ర షూటింగ్ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో జరుపుకుంటోందని యూనిట్ వర్గాలు తెలిపారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు.ఈ చిత్రానికి సినిమా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్్ పతాకంపై దినేష్ రాజ్ నిర్మిస్తున్నారు. నటి అవంతిక సుందర్ కోలీవుడ్ ఎంట్రీ షురూ -
డీఎంకే కూటమిలో లేం!
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల అనంతరం సమీకరణాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. దశాబ్దాలుగా ఉన్న పొత్తులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. తాజా పరిణామాలపై భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ గురువారం స్పష్టత నిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము డీఎంకే కూటమిలో కొనసాగడం లేదని ఆయన అధికారికంగా ప్రకటించారు. కోయంబత్తూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ గందరగోళం , తమ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. ప్రస్తుతం తమిళనాడులో పొత్తుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. డీఎంకే కూటమి నుండి కాంగ్రెస్ ఇప్పటికే తప్పుకుందని గుర్తు చేశారు. డీఎంకే కూడా తాము ఇండియా కూటమిలో భాగం కాబోమని ప్రకటించిందన్నారు. ఇలాంటి మారుతున్న సమీకరణాల నేపథ్యంలో, ప్రస్తుతానికి తాము డీఎంకే కూటమిలో లేమని స్పష్టం చేశారు. టీవీకేకు బయటి నుంచే మద్దతు కొత్తగా ఏర్పడిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి తాము బయటి నుండే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని లెఫ్ట్ పార్టీలకు తానే చెప్పానంటూ మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను వీరపాండియన్ తప్పుబట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్సభ ఎన్నికల సమయంలో పార్టీలో సుదీర్ఘంగా చర్చించి, ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది ఆయా సమయాల్లో నిర్ణయిస్తామని చెప్పారు. గత ప్రభుత్వాల మాదిరిగానే ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కూడా తమిళనాడు ద్విభాషా విధానానికి కట్టుబడి ఉండాలని సూచించారు. తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకే , టీవీకే పార్టీలను తాము ప్రజాస్వామ్య శక్తులుగానే చూస్తామన్నారు. దేశ ప్రయోజనాల కోసం వారితో కలిసి పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తమకు ఉన్న ఏకై క సిద్ధాంత శత్రువు ఆర్ఎస్ఎస్, బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. సీఎం విజయ్ తరచూ ప్రెస్ మీట్లు పెట్టి మీడియాతో మాట్లాడాలని, అదే నిజమైన ప్రజాస్వామ్యమని హితవు పలికారు. -
ఫామ్ హౌస్లో శాశ్వత నిద్రలోకి..
సాయంత్రం ఫామ్హౌస్ ఆవరణలో ప్రభుత్వ గౌరవ వందనాలతో భారతీరాజా అంత్యక్రియలు జరిగాయి. ఆయన భౌతికకాయం తన ప్రాణప్రదమైన మట్టిలో కలిసిపోయింది. ఆయన లేకపోయినా, ఆయన సృష్టించిన అద్భుతమైన చిత్రాల రూపంలో భారతీరాజా ఎప్పటికీ మన మధ్యే ఉంటారు. భారతీరాజా పార్థివదేహాన్ని చూసి అక్కడికి వచ్చిన ప్రజలు, అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అంత్యక్రియల ప్రాంగణానికి చేరుకున్న నామ్ తమిళర్ కట్చి నేత, దర్శకుడు సీమాన్, రచయిత వైరముత్తులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. భారతీరాజా కుమార్తెను జననీని, భారతీరాజా సోదరుడు జయరాజ్ను వారు కన్నీటి పర్యంతంతో ఓదార్చారు. మాజీమంత్రి సెల్లూరు రాజు రాక -
చివరి కోరిక నెరవేర్చిన కుమార్తె..
అనారోగ్యంతో మలేషియాలోని తన కుమార్తె జనని ఇంట్లో చికిత్స పొందుతున్న సమయంలో, భారతీరాజా తన అంతిమ కోరికను ఆమెకు తెలియజేశారు. ‘‘ నేను చనిపోయాక నన్ను చైన్నెలో వద్దు, నేను పుట్టిన తేని జిల్లాలోని వత్తలకుండు ఘాట్ రోడ్ ఫామ్హౌస్లో పాతిపెట్టండి. అక్కడైతేనే నేను అమ్మఒడిలో ఉన్నట్లు ప్రశాంతంగా నిద్రపోగలను’’ అని కుమార్తెతో ఆప్యాయంగా చెప్పారు. తండ్రి చివరి కోరికను జనని అక్షరాలా ప్రస్తుతం నెరవేర్చారు. దీంతో గురువారం అంతా చైన్నె నీలాంకరై నివాసంలో పార్తీవ దేహాన్ని ఉంచారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో ప్రత్యేక వాహనంలో తేనికి తరలించారు. దారి పొడవున అక్కడక్కడ అభిమానులు పార్తీవ దేహానికి పుష్పాంజలి ఘటించారు. -
క్లుప్తంగా
వేలూరు: ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాణిపేట జిల్లా వాలాజ సమీపంలోని వీసీ మోటూరు గ్రామానికి చెందిన వినాయకం. ఇతనికి సొంతమైన అట్ట, ప్టాస్టిక్ వస్తువుల గోడౌన్ ఉంది. బుధవారం రాత్రి హఠాత్తుగా గోడౌన్ నుంచి మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు వెంటనే రాణిపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. వెంటనే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ప్లాస్టిక్ వస్తువులు కావడంతో మంటలను అదుపు చేసేందుకు కుదరలేదు. దీంతో 10 అగ్నిమాపక వాహనాలు, గంటల పాటు పోరాడి మంటలను అదుపు చేశారు. అప్పటికే గోడౌన్లో నిల్వ ఉంచిన రూ.50 లక్షల విలువ చేసే వస్తువులు అప్పటికే పూర్తిగా దగ్ధమయ్యాయి, ఈ మేరకు వాలాజ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అర్థరాత్రి సమయంలో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం పూర్తిగా పొగతో నిండుకుంది. కొరుక్కుపేట: తమిళనాడు మైనారిటీల ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా చైన్నె జిల్లాలో వివిధ రుణ పథకాలను అమలు చేయాలని కలెక్టర్ ఎస్.మాలతిహెలెన్ అభ్యర్థించారు. ఈ విషయమై జారీచేసిన పత్రికా ప్రకటనలో ఆమె పేర్కొంటూ మైనారిటీ ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఈడీసీ), చైన్నె జిల్లాలో నివసిస్తున్న వివిధ మైనారిటీ వర్గాలకు ఉపాధి కోసం, ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలను ప్రారంభించడం కోసం తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తుంది. ఈపథకం కింద, వ్యక్తిగత, స్వయం సహాయక బృందాలకు చిన్న వ్యాపార, చేతి వృత్తుల వారికి, విద్యా పత్రాల రుణాలు అమలు చేస్తారని, ఈ రుణాలను పొందేందుకు, లబ్ధిదారుల ఆదా యం ఆధారంగా రెండు వేర్వేరు పథకాలను విభజించారు. ఆమేరకు పథకం కింద లబ్ధి పొందాలనుకునే వారి వార్షిక కుటుంబ ఆదాయం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రూ.3లక్షలు మించకూడదన్నారు. వేలూరు: తిరుపత్తూరు జిల్లా కెరటి ప్రాంతానికి చెందిన పయణి ఇతను గత కొద్ది రోజుల క్రితం తన బైకును ఇంటి ముందు నిలిపి ఉన్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బైకును చోరీ చేసి తీసుకెళ్లారు. అదే విధంగా అదే ప్రాంతంలో తరచూ బైకులు చోరీ జరుగుతున్నట్లు పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చింది. దీంతో పలువురు తిరుపత్తూరు పోలీసులకు బైకు చోరీ కేసుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వీటిపై విచారణ చేపట్టారు. వీటిపై పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. తిరుపత్తూరు ప్రాంతం సమీపంలోని చెల్లరపట్టి గ్రామానికి చెందిన క్రిష్ణన్ తరచూ బైకు చోరీలు చేసినట్లు తెలియ వచ్చింది. దీంతో పోలీసులు క్రిష్ణన్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. క్రిష్ణన్ తరచూ మద్యం అలవాటు ఉండటంతో మద్యం సేవించడానికి ఇంటి సమీపంలో నిలిపి ఉన్న బైకులను చోరీ చేసి వాటిని రావతంబట్టి గ్రామానికి చెందిన ప్రతాప్కు విక్రయం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితులను అరెస్టు చేశారు. తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్ ఆరణి తమిళ్కాలనీలోకి సమీపంలోని స్మశానం వద్ద కొందరు యువకులు గంజాయిని నిల్వ వుంచి విక్రయిస్తున్నట్టు ఆరణి పోలీసులకు రహస్య సమాచారం అందింది.సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు అక్కడ అనుమానస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో పట్టుబడిన యువకులు ఆరణి ప్రాంతానికి చెందిన బాలాజీ(26), నరేష్(23), శింగపెరుమాల్ ఆలయం ప్రాంతానికి చెందిన చిరంజీవి(21)గా గుర్తించారు. వీరు ఆంధ్ర నుంచి గంజాయిని తరలించి విక్రయిస్తున్నట్టు నిర్ధాచించారు. వారి నుంచి మూడు సెల్ఫోన్లు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పొన్నేరి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుతుంది. సర్వ దర్శనానికి 18గంటలు పడుతోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 86,124 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 41,520 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. భక్తులు హుండీలో రూ.3.97 కోట్లు సమర్పించారు. -
ఘనంగా విశిష్ట రైల్ సేవా పురస్కార్ ప్రదానం
సాక్షి, చైన్నె: భారతీయ రైల్వే 71వ రైల్వే వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం దక్షిణ రైల్వేలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని సత్కరించేందుకు ఉద్దేశించిన విశిష్ట రైల్ సేవా పురస్కార్ 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. చైన్నె ఐసీఎఫ్లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్.ఎన్. సింగ్ హాజరై అవార్డులను అందజేశారు. దక్షిణ రైల్వే జోన్ పరిధిలోని డివిజన్లలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఇచ్చే అత్యున్నత జీఎమ్ ఇంటర్–డివిజనల్ ఓవరాల్ ఎఫిషియన్సీ షీల్డ్ను ఈసారి రెండు డివిజన్లు ఉమ్మడిగా గెలుచుకున్నాయి. మొత్తం 101 మంది ఉద్యోగులు, అధికారులకు వ్యక్తిగత అవార్డులను ప్రదానం చేశారు. వీటితో పాటూ వివిధ విభాగాలలో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు 38 ఎఫిషియన్సీ ఫీల్స్డ్స్ అవార్డులు, రైల్వే సిబ్బంది పిల్లలకు స్టూడెంట్ మెరిట్ సర్టిఫికెట్లను జీఎం అందజేశారు. -
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని రక్షించిన పోలీసులు
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి రైల్యే సిబ్బంది గురువారం వేకువ జామున 2.40 గంటల సమయంలో సిబ్బంది ట్రాక్ నిర్వహణ పనులు ముగించుకొని కాట్పాడి రైల్వే స్టేషన్కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ సమయంలో కాట్పాడి– లత్తేరి మధ్య పట్టాలపై ఒక వ్యక్తి తన తలను పెట్టుకొని ఉండడాన్ని రైల్వే పోలీసులు గమనించారు. వీటిని గమనించిన రైల్యే పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో చైన్నె నుంచి జోలార్పేట మీదుగా వస్తున్న ధనబాద్ –ఆలపుయ ఎక్స్ప్రెస్ రైలు వస్తున్న విషయాన్ని గమనించి వెంటనే కాట్పాడి రైల్యే అధికారులకు సమాచారం అందజేసి రైలును నిలిపి వేయాలని తెలిపారు. అప్పటికే రైల్వే అధికారులు రైలు ఇంజిన్ డ్రైవర్కు సమాచారం చేరవేసి రైలును మధ్యలోనే నిలిపి వేశారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైలు పట్టాలపై పడుకొని ఉన్న కార్మికుడిని అదుపులోకి తీసుకొని రైల్యే స్టేషన్కు తీసుకొచ్చి విచారణ జరిపారు. ఇతను వేలూరుకు చెందిన రామచంద్రన్గా తెలియ వచ్చింది. తర్వాత అతన్ని వేలూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. రైల్యే సిబ్బంది అర్థరాత్రి సమయంలో పట్టాలు సరి చేస్తుండగా ఒక కార్మికుడు ప్రాణాలు కాపాడిన సంఘటన సంచలనం రేపింది. -
ఆ విషయంలో తగ్గేదేలే.. నీతి ఆయోగ్ భేటీలో సీఎం విజయ్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్ కీలక డిమాండ్లు లేవనెత్తారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్షను తీవ్రంగా వ్యతిరేకించిన విజయ్.. 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య సీట్లను భర్తీ చేసేందుకు అనుమతించాలని కోరారు. దీంతో పాటు కోయంబత్తూరులో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు, పెండింగ్లో ఉన్న రూ.3,284 కోట్ల విద్యా నిధుల విడుదల, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఆమోదం, శ్రీలంక, పాకిస్తాన్లలో బందీలుగా ఉన్న తమిళ మత్స్యకారుల విడుదల కోసం కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష వల్ల గ్రామీణ, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎం విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటును కోరుతూ.. కోయంబత్తూరులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఏర్పాటుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని సీఎం విజయ్ కేంద్రానికి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వైద్య విద్యను, అత్యాధునిక ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయవచ్చని ఆయన వివరించారు.పాక్ జలసంధి ప్రాంతంలో భారతీయ మత్స్యకారుల సాంప్రదాయ చేపల వేట హక్కులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయ్ కోరారు. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్తాన్ దేశాల జైళ్లలో మగ్గుతున్న తమిళనాడు మత్స్యకారులను, వారి బోట్లను విడిపించేందుకు అత్యవసర దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర రోడ్డు రవాణా, రైల్వే మంత్రిత్వ శాఖలు కింది ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారుసమగ్ర శిక్షా అభియాన్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.3,284 కోట్ల పెండింగ్ నిధులను ముందస్తు షరతులు లేకుండా విడుదల చేయాలన్నారు. అలాగే, ఆధునిక భారతదేశ లౌకిక విలువల చాటిచెప్పే ప్రాచీన తమిళ గ్రంథం 'తిరుక్కురళ్' (Thirukkural)ను జాతీయ సాహిత్యంగా ప్రకటించాలని కౌన్సిల్ ముందు ప్రతిపాదించారు. -
70 ఏళ్ల నా భర్త నాతో కాపురం చేయడం లేదు..!
తమిళనాడు: కోర్టు ఆదేశాల మేరకు భార్యకు జీవనాంశం ఇవ్వని 70 ఏళ్ల వృద్ధుడికి 17 నెలల జైలుశిక్ష విధిస్తూ పళ్ళిపట్టు న్యాయస్థానం ఆదేశించింది. ఆంధ్రాలోని తిరుపతి జిల్లా నారాయణవనంకు చెందిన అన్నాదురై(70)కు మొదటి భార్య మృతితో పళ్ళిపట్టు సమీపంలోని సొరకాయపేటకు చెందిన నిర్మల(45) అనే ప్రత్యేక ప్రతిభావంతురాలిని వివాహం చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు అమ్మాయిలు వున్నారు. గత కొన్నేళ్ల కిందట భార్యను ఆన్నాదురై విడిచిపెట్టడంతో సొరకాయపేటలోని పుట్టింట్లో ఇద్దరు ఆడ బిడ్డలతో నిర్మల వుంటున్నారు.తన భర్త తనతో కాపురం చేయకుండా విడిచిపెట్టినట్లు దీంతో తనకు బిడ్డలకు జీవనం కష్టంగా మారిందని బాధితురాలు 2022లో పళ్లిపట్టు మున్సిల్ జ్యుడిషియల్ కోర్టులో కేసు దాఖలు చేసారు. నిర్మల తరపున న్యాయవాధి భరత్కుమార్ వాదనలు వినిపించారు. భార్య బిడ్డలను విడిచిపెట్టిన అన్నాదురై వారి జీవనాంశంగా ప్రతినెలా రూ. 20 వేలు చెల్లించాలని 2022లో న్యాయస్థానం ఆదేశించింది. అయితే అన్నాదురై నిర్మలకు జీవనాంశం చెల్లించపోవడంతో 2024లో మళ్లీ కోర్టు మెట్లెక్కారు. ఈ కేసుకు సంబందించి అన్నాదురైకు న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీచేసింది. దీంతో పొదటూరుపేట పోలీసులు అన్నాదురైను మంగళవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసుకు సంబందించి న్యాయస్థానం ఆదేశాలు ఎందుకు పాటించలేదని, జీవనాంశం ఎందుకు చెల్లించలేదని న్యాయమూర్తి వెంకటేశన్ ప్రతివాదిని ప్రశ్నించగా సమాదానం లేక పోవడంతో అన్నాదురైకు 17 నెలల జైలుశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు అన్నాదురైను అరెస్టు చేసి పుళళ్ సెంట్రల్ జైలుకు తరలించారు. -
ఇద్దరూ కావాలి సార్.. ఎవరినీ వదులుకోలేను!
చెన్నై : దిండుక్కల్ జిల్లాలోని వడమదురై సమీపంలో ఉన్న సెంగురిచికి చెందిన సడైయాండి (28) వెల్డర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి, సుమతి (26)కి వారి తల్లిదండ్రుల అంగీకారంతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ విషయాలకు సంబంధించి భార్యాభర్తల మధ్య తరచుగా వివాదాలు జరుగుతూ ఉంటాయి. సడైయాండి ఇంటికి వచ్చినప్పుడల్లా తన సెల్ ఫోన్లో ఒంటరిగా మాట్లాడుకుంటాడు. ఇతని భార్య ఎవరితో మాట్లాడుతున్నావని అడిగినప్పుడు, అతను ఆమెను మందలిస్తాడు. ఈ విషయం ఇలాగే కొనసాగుతుండగా, సడైయాండి అకస్మాత్తుగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో సుమతి వడమదురై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తు వచ్చారు. ఈ స్థితిలోసడైయాండి పుత్తూరు పిచంపట్టికి చెందిన నాగేశ్వరి (21) అనే మహిళను వివాహం చేసుకుని ఆమెతో కలిసి జీవిస్తున్నాడని వెల్లడైంది. అతను పెళ్లికానివాడిలా నటించి, ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకుని ఆమెతో కలిసి జీవించడం ప్రారంభించాడు. ఈ విషయం పోలీసులు మొదటి భార్యకు తెలియజేశారు. సుమతి బంధువులు అక్కడికి వెళ్లి రెండో భార్యను వడమదురై పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అప్పగించారు. తనకు ఇద్దరు భార్యలూ కావాలని సడైయాండి కోరాడు. రెండో భార్య తాను తన భర్తతో వెళ్తానని పట్టుబట్టింది. దీంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. -
క్లుప్తంగా
అన్నానగర్: బైక్ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పెరియపాలయం సమీపంలోని పనప్పాక్కం గ్రామంలోని వినాయగర్ కోవిల్ వీధిలో నివసించే రితిశ్రీ (20). ఇతను రెడ్హిల్స్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. బుధవారం ఉదయం ఇతను రెడ్హిల్స్ నుంచి బైక్లో ఇంటికి బయలుదేరాడు. పెరియపాలయం–చైన్నె జాతీయ రహదారిపై జయపురం వద్ద వెళుతుండగా, రోడ్డు పనుల కోసం మళ్లించిన మార్గంలో బైకులో వచ్చాడు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న లారీ బైక్ను ఢీకొంది. ప్రమాదంలో రితిశ్రీ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరువళ్లూరు: బీజేపీ నుంచి వైదొలగిన మాజీ చీఫ్ అన్నామలై కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేక యాప్ను రూపొందించి తనతో కలిసి నడవడానికి ఆసక్తిగా వున్న వారిని సభ్యులుగా చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అన్నామలైకు మద్దతుగా బీజేపీతోపాటు అన్నాడీఎంకేలోని కొందరు నేతలు ముందుకొచ్చారు. అన్నామలైకు మద్దతుగా ఆన్లైన్లో 20 లక్షల మంది సభ్యులుగా చేరిన క్రమంలో తిరువళ్లూరు జిల్లాకు చెందిన నేతలు సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టారు. తిరువళ్లూరు రైల్వేస్టేషన్లో సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేసి విజయవంతంగా సభ్యులను చేర్చారు. అన్నామలై మద్దతుదారులకు సైతం స్థానికులు, యువకుల నుంచి మంచి స్పందన లభించింది. తిరుత్తణి: పళ్లిపట్టు యూనియన్లోని మేళపూడి దళితవాడకు చెందిన మహిళలు వందమంది బుధవారం తిరుత్తణిలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కణిమొళిని కలుసుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తమ గ్రామంలో 150కు పైబడిన కుటుంబీకులం నివశిస్తున్నామని, చాలా మందికి ఇంటి పట్టాలు లేక పోవడంతో ప్రభుత్వ సహాయకాలు పొందడం కష్టం వుందని వాపోయారు. స్పందించిన ఆర్డీఓ విచారణ చేపట్టి అర్హులకు ఉచిత ఇంటి పట్టాలతో పాటూ నివాస కుటుంబాలకు పట్టాలు అందజేస్తామని తెలిపారు. సాక్షి, చైన్నె: కలెక్టర్లు, ప్లేయర్లు, ఇన్వెస్టర్లు, హాబీ ప్రియుల కోసం దేశంలోని తొలిసారిగా అధికారిక ట్రేడింగ్ కార్డ్ ప్రదర్శనకు చర్యలు తీసుకున్నట్టు కార్డ్ షో సహ వ్యవస్థాపకుడు ఎస్ సాగర్ పిలుపు నిచ్చారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జూన్ 14వ తేదీ ఆదివారం బెంగళూరు, బనశంకరిలోని ఆదిసంకల్ప్ బ్యాంకెట్ హాల్శ్రీ లో నిర్వహించనున్నామని స్థానికంగా బుధవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కలెక్టబుల్స్ పరిశ్రమను ఒకే తాటిపైకి తెస్తూ.. పోకీమాన్ స్పోర్ట్స్, కార్డ్స్, ట్రేడింగ్ కార్డ్ గేమ్స్, యానిమే కార్డ్స్, ఇతర అరుదైన కలెక్టబుల్స్ ప్రియుల కోసం ఈ వేదికను సిద్ధం చేశామన్నారు. దేశం నలు మూలల నుంచి వెండర్లు, కలెక్టర్లు తమ వద్ద ఉన్న అరుదైన ట్రేడింగ్ కార్డ్లను, ప్రత్యేక ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నారన్నా రు. ఇక్కడి హాబీ ప్రియులు తమకు నచ్చిన కార్డ్లను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి లేదా పరస్పరం మార్చుకోవడానికి అవకాశం కల్పించామని ప్రతిఒక్కరూ తరలి రావొచ్చునని పిలుపునిచ్చారు. తిరువొత్తియూరు: బాలికపై లైంగక వేధింపులకు పాల్పడిన ఓ ఆటోడ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విల్లుపురం జిల్లా సెంచి సమీపంలోని పెరియనోనంబై గ్రామానికి చెందిన పాల్ దినకరన్ (41) చైన్నెలో 108 అంబులెన్న్స్ డ్రైవర్. ఇతని భార్య గర్భవతి కావడంతో తిరువణ్ణామలై జిల్లా కలసపాక్కం సమీపంలోని తన పుట్టింట్లో ఉంటోంది. భార్యను చూడడానికి పాల్ దినకరన్ తరచూ అక్కడికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో గత 4వ తేదీన అదే వీధిలో అనుకుంటున్న బాలికను రహస్య ప్రదేశానికి తీసుకు వెళ్లి లైంగిక వేధింపులు ఇచ్చాడు. విషయం తెలిసి బాలిక తల్లి పోలురు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలూరు మహిళా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పాల్ దినకరన్న్ను అరెస్టు చేశారు. బుధవారం ఉదయం అతడిని తిరువణ్ణామలై పోక్సో కోర్టులో హాజరుపరిచి, అనంతరం ఆదేశాల మేరకు వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. -
కలెక్టరేట్కు బాంబు బెదిరింపు
తిరువళ్లూరు: కలెక్టరేట్లో ఆవరణలో బాంబు పెట్టినట్టు అగంతకుడి నుంచి వచ్చిన ఈ–మెయిల్ బాంబు బెదిరింపులతో కలెక్టరేట్ వద్ద బుధవారం ఉదయం కలకలం రేపింది. తిరువళ్లూరు కలెక్టరేట్కు నిత్యం వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రజలు, జిల్లాకు చెందిన పలువురు అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల రాకపోకలతో నిత్యం రద్దీగా వుంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ–మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చింది. కలెక్టరేట్లోని ప్రహరీగోడ వద్ద బాంబు పెట్టామని, త్వరలోనే పేల్చేస్తామని ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు దిగారు. సమాచారం అందిన వెంటనే పోలీసులకు కలెక్టరేట్ సిబ్బంది అప్రమత్తం చేయడంతోపాటు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన బాంబుస్క్వాడ్ అధికారులు అన్ని ప్రాంతాలను అణుఅణువునా గాలించారు. కలెక్టరేట్ను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత బాంబు బెదిరింపు నకిలీగా భావించిన పోలీసులు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. నిత్యం రద్దీగా వుండే కలెక్టరేట్లో పోలీసులు, బాంబు తనిఖీ బృందం హఠాత్తుగా రంగంలో దిగి గాలింపు చర్యలు చేపట్టం కలకలం రేపింది. -
ఓటమిపై స్టాలిన్కు సమగ్ర నివేదిక
క్షేత్ర స్థాయి పరిశీలన సాక్షి, చైన్నె: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించలేక అధికారాన్ని కోల్పోయిన డీఎంకే పార్టీ తన ఓటమికి గల కారణాలపై క్షేత్రస్థాయి పరిశోధన పూర్తి చేిసింది. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను బుధవారం పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్కు సమర్పించారు. ఓటమిపై అధ్యయనం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై క్షేత్రస్థాయి విశ్లేషణ కోసం డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ గత నెల 14వ తేదీన 36 మంది సభ్యులతో కూడిన 19 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈబృందాల సభ్యులు నియోజకవర్గాల వారీగా పర్యటించి, స్థానిక నిర్వాహకులు, వాలంటీర్ల అభిప్రాయాలను సేకరించి నివేదికను సిద్ధం చేశారు. బుధవారం ఈబృందం సభ్యులు ఆల్వార్పేటలోని ఎం.కె. స్టాలిన్ నివాసానికి వెళ్లి నివేదికను అధికారికంగా అందజేశారు. నివేదికలో ఓటమికి ప్రధాన కారణాలు ఎన్నికల సమయంలో అనేక నియోజకవర్గాల్లో మిత్రపక్షాల నుండి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని ఈ నివేదిక తేట తెల్లం చేసింది. కూటమి పార్టీల సహకారం అన్నది అనేక నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో లేనట్టు తేలింది. గతంలో మంచి ఓట్లు సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి, సరైన కారణం లేకుండా కొత్త ముఖాలకు సీట్లు కేటాయించడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి కూడా ఓటమికి కారణంగా వెలుగు చూసింది. మరికొన్ని చోట్ల అంతర్గత కుమ్ములాటల వలన ఓట్లు నష్టపోయినట్టు గుర్తించారు. నిర్లక్ష్యం ఎన్నికల సమయంలో పలువురు నేతలు, బాధ్యులు క్షేత్రస్థాయిలో సరిగ్గా పనిచేయకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివి జరిగినట్టు గురితచారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకే ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా సొంతంగా ఒంటరిగానే పోటీ చేయాలని మెజారిటీ వాలంటీర్లు పట్టుబడుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. భవిష్యత్తులో కూటమి పార్టీలకు సీట్లు ఇచ్చేటప్పుడు.. ఆయా నియోజకవర్గాల్లో సదరు పార్టీలకు నిజంగానే పలుకుబడి ఉందా, గెలిచే సత్తా ఉందా అనే విషయాలను కింది స్థాయి నుండి విచారించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని నివేదికలో సూచించారు. ప్రతి రెండు శాసనసభ నియోజకవర్గాలకు ఒక జిల్లా కార్యదర్శిని నియమించాలని కమిటీ ప్రతిపాదించింది. ఈ నివేదిక సమర్పణ సందర్భంగా స్టాలిన్ తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం స్టాలిన్ నిర్వహించారు. ఈ భేటీలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎ. రాజా, ఎం.ఆర్. పన్నీర్సెల్వం తదితరులు పాల్గొన్నారు. ఈ క్షేత్రస్థాయి నివేదిక ఆధారంగా త్వరలోనే బాధ్యులైన వారిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే సమాచారాలు వెలువడుతున్నాయి. -
అమ్మ ఫార్మసీలో తనిఖీలు
తిరువళ్ళూరు: తిరువళ్లూరు జిల్లా, ఎల్లాపురం యూనియన్, పెరియపాలయంలోని అమ్మ ఫార్మసీని తమిళగ వెట్రి కళగం పార్టీ నిర్వాహకులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో, గడువు ముగిసిన మందులు ఉన్న ఒక బ్యాగును వారు తెరిచి పారవేశారు. గడువు ముగిసిన మందులను ఎలా విక్రయిస్తున్నారని విధుల్లో ఉన్న ఉద్యోగులను పదేపదే ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గడువు ముగిసిన మందులను ఎప్పుడూ వేరే ప్యాకేజీల్లో ఉంచి, ఆ తర్వాత వాటిని పడేస్తామని వివరించారు. ఒకానొక సమయంలో, ‘ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు లేకుండా మీరు విచారణ ఎలా నిర్వహించగలరని ప్రజలు ప్రశ్నించారు. చదవడం, రాయడం రాని వృద్ధులు వచ్చి గడువు ముగిసిన ఈ మందులను కొన్నారని టీవీకే నిర్వాహకుడు ఆశ్చర్యపోయి చెప్పాడు. ఫార్మసీలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు నిర్వహించాల్సిన తనిఖీ పనుల్లో ప్రభుత్వ యంత్రాంగమే జోక్యం చేసుకోవడం ప్రభుత్వ ఉద్యోగులకే తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
మోటారు సైకిల్ సీజ్ తిరుపతి అన్నమయ్యసర్కిల్: జిల్లాలోని తాయిమాంబపురం వద్ద 77 ఎర్రచందనం దుంగలతోపాటు, ఒక కారు, మోటారు సైకిల్ను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆర్ఎస్ఐ కేఎస్కే లింగాధర్ బృందం, ఎఫ్ఆర్ఓ సుభాష్తో కలసి తిరుపతి డివిజన్ పుత్తూరు రేంజ్ నారాయణవనం బీట్కు మంగళవారం రాత్రి చేరుకున్నారు. పుత్తూరు–నేసనూరు మార్గంలోని తాయిమాంబపురం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బుధవారం తెల్లవారుజామున ఒక మోటారు సైకిల్, దాని వెనుక ఒక కారు వేగంగా రావడంతో అనుమానం వచ్చిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ వాహనాలను అడ్డగించే ప్రయత్నం చేశారు. అయితే ఆ వాహనాలు కొద్దీ దూరంలోనే ఆపి పారిపోతున్న కొందరు వ్యక్తులను టాస్క్ఫోర్స్ సిబ్బంది వెంబడించి వారిలో ఇద్దరిని పట్టుకున్నారు. వారిలో ఒకరిని పుత్తూరు మండలానికి చెందిన వ్యక్తిగా, మరొకరు తమిళనాడు తిరువణ్ణామలైకు చెందిన వ్యక్తిగా గుర్తించి, అరెస్టు చేశారు. నిందితులసహా వాహనాలు, దుంగలను టాస్క్ఫోర్స్ పోలీసుస్టేషన్కు తరలించారు. పట్టుబడిన వారిని డీఎస్పీ వీ.శ్రీనివాసులు రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ విచారించారు. ఈ కేసు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఖాదర్ బాషా తెలిపారు. -
ప్రజల అర్జీలపై స్పందించాలి
పళ్లిపట్టు: ప్రజల అర్జీలపై రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఎమ్మెల్యే తహసీల్దార్కు సూచించారు. పళ్లిపట్టు తహసీల్దార్ భారతిని తిరుత్తణి ఎమ్మెల్యే హరి బుధవారం కలుసుకున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా ప్రభుత్వ పథకాలు అర్హులకు వెంటనే అందేందుకు అధికారులు కృషిచేయాలని, పేదలు ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందే విధంగా అధికారులు అర్జీలు పరిశీలించి వీలైనంత న్యాయం చేయాలని, అర్జీల పట్ల కాలయాపన చేయకుండా వెను వెంటనే స్పందించాలని, వీఆర్వోలు గ్రామాల్లో వుంటూ సేవచేయాలని అధికారులను కోరారు. ఉచిత ఇంటి పట్టాలు, వృద్ధాప్య పింఛన్లు, సహా వివిధ సర్టిఫికెట్లు కోసం అధికారులు, ఉత్సాహంగా విధులు నిర్వహించి నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటూ ఉత్తమ ససేవలందించాలని కోరారు. అన్నాడీఎంకే యూనియన్ కార్యదర్శులు కృష్ణమనాయుడు, టీడీ.శ్రీనివాసన్ పాల్గొన్నారు. -
గరుడ వాహన గోవిందా
కార్వేటినగరం: స్తానిక వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ రోజు బుధవారం రాత్రి గరుడ వాహన సేవ కనుల పండువగా జరిగింది. స్వామివారు గరుడుడిపై కొలువుదీరి ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపి, నిత్యకై ంకర్యాలు చేశారు. ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు స్వామి వారు మోహినీ అవతారంలో పల్లకిలో కొలువై నగర వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. 10 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం చేపట్టారు. రాత్రి టీటీడీ అధికారులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రి 7 గంటలకు విశేషాలంకృతుడైన వేణుగోపాలుడు గరుడ వాహనంపై కొలువుదీరి పట్టణంలో ఊరేగారు. ఈ సందర్భంగా కోలాటాలు, చెక్కభజనలు, రాజమండ్రి వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. అశేష సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. -
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి అరెస్ట్
తిరువళ్లూరు: ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇంటి పట్టాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మాజీ వార్డు మెంబర్ తహసీల్దార్ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి యత్నించిన సంఘటన కలకలం రేపింది. బుధవారం ఉదయం కొడువెళి, అయనం, పుదుకుప్పం, అమ్మనంబాక్కం, ఆయల్చ్చేరి, మాగరల్, గురువాయల్, అగరంపట్టు, వెంగల్, వెంగల్కుప్పంతోపాటు 15 గ్రామాలకు జమాబందీని నిర్వహించారు. ఆర్డీఓ రవిచంద్రన్, తహసీల్దార్ బాలాజీ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అమ్మనంబాక్కంకు చెందిన మాజీ వార్డు మెంబర్ ఉమాపతి తాను నివాసం వుంటున్న స్థలానికి పట్టా ఇవ్వాలని వినతి సమర్పించారు. అయితే అప్పటికే ఉమాపతి భార్య, తండ్రి పేరుతో పట్టాలు ఇచ్చామని ప్రస్తుతం వున్న స్థలం ప్రభుత్వానికి చెందిన భూమి కావడంతో అక్కడ పట్టా ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఆగ్రహించిన ఉమాపతి పెట్రోల్ను ఒంటిపై పోసుకుని ఆత్మహుతికి యత్నించాడు. అప్రమత్తమైన సిబ్బంది ఉమాపతిని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు తహసీల్దార్ కార్యాలయంలో బెదిరింపులకు దిగిన ఉమాపతిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. -
2,545 పోస్టులకు నోటిఫికేషన్
కొరుక్కుపేట: మహిళలు, పిల్లల రక్షణ కోసం ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం సింగప్పెన్ ప్రత్యేక కార్యదళాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సింగప్పెన్శ్రీ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ప్రాజెక్ట్ కోసం 2,545 కొత్త పోస్టులను సృష్టించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పోస్టుల కోసం రూ.354 కోట్లు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి విజయ్ ఈ ప్రాజెక్ట్ను ప్రకటించిన మరుసటి రోజే దీనికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడింది. ఆమేరకు 49 జిల్లా కేంద్రాల్లో 343 ఇన్న్స్పెక్టర్ పోస్టులు, 98 ఎస్ఐలు, 196 గ్రేడ్–2 పోలీస్ కానిస్టేబుళ్లు, 270 ఫీల్డ్ యూనిట్లకు 540 మంది మహిళా ఎస్ఐలు, 1,620 మంది మహిళా పోలీస్ అధికారులు, కంట్రోల్ రూమ్ సాంకేతిక విభాగంలో 2 ఇన్స్పెక్టర్లు , 3 ఎస్ఐలు, కార్యాలయ సిబ్బంది 12 పోస్టులు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు. వేలూరు: ఆంబూరు సమీపంలో ఒకే రోజు రాత్రి మొత్తం నాలుగు ఇళ్లలో చోరీ జరగడం సంచలనం రేపింది. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని పెరియాంకుప్పం కారక్కల్ వీధిలో మొత్తం నాలుగు ఇళ్లలో కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వారు నిద్ర మత్తులో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంటిలోని బంగారం, వెండి వంటి వాటిని చోరీ చేశారు. ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో అవాకై ్కన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు గ్రామంలోనికి చొరబడి గ్రామంలోని సీసీటీవి కెమరాలను తనఖీ చేస్తున్నారు. డీఎస్పీ నాగలింగం కేసు విచారణ చేస్తున్నారు. తిరువొత్తియూరు: పొల్లాచ్చి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి హెల్మెట్లు ధరించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై పట్టా కత్తులు పట్టుకుని బైక్పై చెక్కర్లు కొట్టిన సంఘటన కలకలం సృష్టించింది. పొల్లాచ్చి–ఉడుమలై రోడ్డులోని కోలార్ పట్టి వద్ద ఉన్న ఒక పాత ఇనుప దుకాణం వద్దకు దుండగులు పట్టా కత్తులతో ఆప్రాంతంలో తిరుగుతూ కనిపించారు. సీసీటీవీ కెమెరాలో ఒక వ్యక్తి కత్తిని తిప్పుతూ దుకాణం తలుపు తట్టాడు. లోపల ఉన్న వ్యక్తి శబ్దం విని తలుపు కొద్దిగా తీసి చూడగా, దుండగులు లోపలికి చొరబడడానికి ప్రయత్నించారు. లోపల ఉన్న వ్యక్తి అప్రమత్తమై తలుపు వేసి గడియ పెట్టుకోవడంతో దుండగుల ప్రయత్నం విఫలమైంది. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కోమంగళం పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
2 నెలలుగా అందరి వరి ధాన్యం బకాయిలు
కొరుక్కుపేట: తమిళనాడులో డెల్టా జిల్లాల తర్వాత విల్లుపురం జిల్లా రెండవ అతిపెద్ద వరి ఉత్పత్తిదారు. ఈ పరిస్థితిలో, రైతుల డిమాండ్ను మన్నించి, తమిళనాడు ప్రభుత్వ కార్పొరేషన్ 100కు పైగా ప్రదేశాలలో ప్రభుత్వ వరి సేకరణ కేంద్రాలను ప్రారంభించింది. రైతుల నుండి నేరుగా వరిని తూకం వేసి కొనుగోలు చేశారు. సాధారణ విక్రయ కేంద్రాల కంటే ఇక్కడ ధరలు ఎక్కువగా ఉండటంతో, రైతులు ఉత్సాహంగా వరి బస్తాలను తీసుకువచ్చారు. ఈ విధంగా, వరి కొనుగోలుకు సంబంధించిన డబ్బును వారం రోజుల్లోగా అందించాలి. కానీ విల్లుపురం జిల్లాలో, రెండు నెలలు దాటినా కొనుగోలు చేసిన వరికి ధర చెల్లించకపోవడంతో రైతులు నిరాశ చెందారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడిచినా, తమకు కోట్ల రూపాయలు బకాయి ఉండటంతో రైతులు బాధపడుతున్నారు. అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఎలాంటి చర్య తీసుకోనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కార్పొరేషన్ అధికారులు, కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ రైతులు కొన్ని రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఆ సమయంలో, ఒకటి రెండు రోజుల్లో డబ్బు విడుదల చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, తిరుపచావడి మేడు, గోవిందపురం, వెంగ దేశపురం ప్రాంతాల రైతులు వినతిపత్రం సమర్పించేందుకు విల్లుపురం తాలూకా కార్యాలయంలో జరిగిన ఫిర్యాదుల పరిష్కార సమావేశానికి వచ్చారు, అయితే పరిపాలనా కారణాల వల్ల ఆ సమావేశం వాయిదా పడింది. దీంతో చెవులకు పువ్వులు పెట్టుకుని విల్లుపురం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం దాఖలు చేసిన రైతులు.. అకస్మాత్తుగా రద్దు ప్రకటనతో నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలి వారు పోలీసులకు విన్నవించుకున్నారు. అనంతరం రైతులు మాట్లాడుతూ, ‘విల్లుపురం జిల్లాలో 2,000 మందికి పైగా రైతుల నుంచి వరిని కొనుగోలు చేశారు. వారికి రూ. 100 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. తాము అధికారులను అడగడానికి వెళ్తే, వాళ్లు దాక్కుంటారు. తాము విషం తాగి ఆత్మహత్య చేసుకుంటేనే డబ్బులు ఇస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. -
క్లుప్తంగా
మనవడి దాడిలో అమ్మమ్మ మృతి అన్నానగర్: కల్పాక్కం సమీపంలో మద్యం మత్తులో బామ్మ చెంపపై కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయి మరణించగా, ఈ ఘటనకు సంబంధించి ఆమె మనవడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చెంగల్పట్టు జిల్లాలోని కల్పాక్కం సమీపంలోని వెంబాక్కం గ్రామం పూన్ తండలం ప్రాంతానికి చెందిన మునుస్వామి. ఇతను తల్లి నాయనమ్మ సరోజ (94), తన భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మంగళవారం రాత్రి మునుస్వామి తల్లి సరోజ ఇంటి గుమ్మం ముందు మంచం మీద పడుకుని ఉంది. ఆ సమయంలో మునుస్వామి కుమారుడు మహేష్ (26) అక్కడికి మద్యం మత్తులో వచ్చాడు. వృద్ధాప్యం కారణంగా నాయనమ్మ సరోజ ఏడుస్తూ ఉంది. అమ్మమ్మ సరోజ ఏడుపు విన్న రాజేష్ ఆమె చెంపపై కొట్టాడు. సరోజ స్పృహ తప్పి మంచం మీద పడిపోయి మరణించించారు. విచారణలో మహేష్ మద్యం మత్తులో తన నాయనమ్మను కొట్టాడని తేలడంతో అరెస్టు చేసి చెంగల్పట్టు జైలుకు తరలించారు. ఏటీఎం కార్డుల దొంగ అరెస్టు అన్నానగర్: చైన్నెలోని అరుంబాక్కం ప్రాంతానికి చెందిన తిలకేష్ కుమార్. ఇతను కోయంబేడు నురోడి రోడ్డులోని ఏటీఎం కేంద్రంలో డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వెళ్లినప్పుడు, తన ఏటీఎం కార్డును బయటకు తీయడం మర్చిపోయి మెషీన్లోనే వదిలేశాడు. ఈ స్థితిలో, అదే ఏటీఎం కార్డు ద్వారా 4 విడతలలో రూ. 50 వేలు విత్డ్రా అయినట్లు తన సెల్ ఫోన్కు మెసేజ్ రావడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. కోయంబేడు బస్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిఘా కెమెరా రికార్డింగ్లను పరిశీలించగా, సాలిగ్రామం ప్రాంతానికి చెందిన విశ్వనాథన్ (62) ఏటీఎం మెషీన్లో వదిలేసిన కార్డును దొంగిలించి డబ్బులు విత్డ్రా చేసినట్లు తేలింది. పోలీసులు అతడిని బుధవారం అరెస్టు చేసి, అతని వద్ద నుంచి మరో 30కి పైగా ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా పనపాక్కం గారమానికి చెందిన రిత్తిశ్రీ(22) రెడ్హిల్స్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం యధావిధిగా విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో రెడ్హిల్స్ నుంచి పనపాక్కంకు బయలుదేరాడు. ప్రస్తుతం చైన్నె–పెద్దపాళ్యం మార్గంలో రోడ్డు విస్తరణ పనులు సాగుతున్న క్రమంలో జయపురం వద్ద వన్వేగా మార్చి పనులు సాగిస్తున్నారు. దీంతో జయపురం వద్ద వన్వేలో రిత్తిశ్రీ వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలోరిత్తిశ్రీ ఘటనా స్థఽలంలోనే మృతి చెందాడు. పెద్దపాళ్యం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సెల్ఫొన్ల దొంగ అరెస్టు తిరుత్తణి: తిరుత్తణిలో ప్రయాణికుల రద్దీని వినియోగించుకుని చేతివాటం ప్రదర్శించే సెల్ఫోన్ దొంగను ప్రయాణికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుత్తణిలో కొత్త బస్టాండు, పాత బస్టాండు, బైపాస్, రైల్వే స్టేషన్ సహా ప్రధాన ప్రాంతాల్లో బస్టాండ్ల వద్ద ప్రయాణికుల రద్దీని వినియోగించుకుని తొందగా ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలో సెల్పొన్లు చోరీ ఘటనలు ఇటీవల అధికమయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం బైపాస్ బస్టాపు వద్ద తిరుత్తణికి చెందిన సంతోష్(22) అనే యువకుడు బస్సు ఎక్కి సమయంలో అతని షర్ట్ ఫ్యాకట్లోని సెల్ఫొన్ చోరీకి విఫలయత్నం చేసిన యువకుడిని ప్రయాణికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుత్తణి సీఐ శివకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తులో తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కం ప్రాంతంకు చెందిన చిన్నదురై(22) అనే వ్యక్తి రద్దీని వినియోగింయచుకుని ప్రయాణికుల వద్ద సెల్ఫోన్లు చోరీ చేసినట్లు గుర్తించారు. 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. జుట్టు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సాక్షి, చైన్నె: ప్రస్తుతం జుట్టు సంరక్షణపై అత్యధిక శాతం మంది దృష్టి పెడుతున్నారని బ్యూటీ గ్యారేజ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జిగర్ రవారియా పేర్కొన్నారు. జుట్టు సంరక్షణలో సాంప్రదాయక నూనెలకు, నిజమైన తేమను నిలిపి ఉంచే విధానానికి మధ్య గల వ్యత్యాసాన్ని వివరిస్తూ బుధవారం ఆయన స్థానికంగా వివరాలను ప్రకటించారు. ఇందులో షే బటర్ పాత్ర ఎంత కీలకమైనదో వివరించారు. జుట్టులో ఉన్న తేమ బయటకు పోకుండా లాక్ చేయడానికి మాత్రమే నూనెలు ఉపయోగ పడుతాయని పేర్కొన్నారు.అందుకే నూనె రాసిన కొద్దిసేపటికే జుట్టు మళ్లీ పొడిబారిపోతుందన్నారు. జుట్టు ఆరోగ్యంగా, స్థితిస్థాపకతతో ఉండాలంటే కేవలం పైన నూనె పూయడం సరిపోదని, జుట్టు అంతర్గత నిర్మాణాన్ని బలోపేతం చేసి, ఎక్కువసేపు నీటిని నిలిపి ఉంచేలా చేయడం ముఖ్యం అని వివరించారు. ఆధునిక ప్రొఫెషనల్ హెయిర్ కేర్ ప్రోడక్టులు తాజాగా ఈ విధానంపైనే దృష్టి పెడుతున్నాయని వివరించారు. -
విద్యలో నాణ్యత పెంపునకు కృషి
వేలూరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచేందుకు హెచ్ఎంలు కృషి చేయాలని కలెక్టర్ ప్రియ అన్నారు. రాణిపేట జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా ఉత్తీర్ణత శాతం తక్కువగా వచ్చిన హెచ్ఎంలు, అదనపు హెచ్ఎంలతో కలెక్టర్ సమీక్ష సమావేశం రాణిపేట కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఫ్లస్టు, పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో వెనుకంజలో ఉందని వీటిని పెంచాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయుల పైనే ఉందన్నారు. కార్పోరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులున్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని విద్యా ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. పాఠశాలలో ఒక టీచరు మాత్రమే ప్రయత్నం చేస్తే విజయం సాధించలేరని విద్యార్థులు, టీచర్లు కలిసి ఒకటిగా ప్రయత్నం చేస్తేనే విజయం సాధించ వచ్చాన్నారు. విద్యాశాఖ సీఈఓ మేగల, డీఈఓ శివరామన్, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంలు పాల్గొన్నారు. -
వేధింపులకు పాల్పడే వారి సమాచారం ఇవ్వండి
తిరువళ్లూరు: విద్యార్థినులు, యువతులకు ఎక్కడైనా వేధింపులు ఉంటే తక్షణం తమకు సమాచారం ఇవ్వాలని సింగపెన్నే టీమ్ ఎస్ఐ సుగంతి సూచించారు. మహిళల భద్రత కోసం సీఎం ప్రత్యేక చొరవతో సింగపెన్నే టీమ్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి దశలో తిరువళ్లూరు జిల్లాకు గాను ఎస్ఐ సుగంతి, మాల ఆధ్వర్యంలో రెండు సింగపెన్నే టీమ్లను ఏర్పాటు చేశారు. ఈ టీమ్లో ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుల్ వుంటారు. వీరు నిత్యం జనసంచార ప్రాంతాల్లో నిఘా వుంచడంతో పాటూ మహిళలకు వేధింపులు ఎదురైనట్టు ఫోన్కాల్ వస్తే తక్షణం అక్కడికి వెళ్ళి చర్యలు తీసుకోకున్నారు. కాగా తిరువళ్లూరులో ఎస్పి వివేకానందశుక్లా ప్రత్యక్ష పర్యవేక్షణలో టీమ్ తమ విధులను నిర్వహించనుంది. కొత్తగా ఏర్పాటైన సింగపెన్నే టీమ్ బుధవారం ఉదయం తిరువళ్లూరు బస్టాండులో గస్తీ నిర్వహించారు. విద్యార్దులతో ముచ్చటించి వారికి బ్యాడ్టచ్, గుడ్టచ్పై అవగాహన కల్పించారు. -
భారతీరాజా నెరవేరని కోరిక..
సాక్షి,చైన్నె: తన బంధువులందరినీ ఒకే చోటికి పిలిచి, పెద్ద విందు ఏర్పాటు చేసి అందరితో కలిసి సంతోషంగా గడపాలని భారతీరాజా ఆశపడ్డారని, అయితే, ఆ కోరిక నెరవేరకుండానే ఆయన కన్నుమూశారంటూ బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తేని జిల్లాలోని అల్లి నగరం (కీరైకల్ స్ట్రీట్)లో భారతీ రాజ తల్లిదండ్రులు పెరియమాయ దేవార్, కరుత్తమ్మ నివసించే వారు. భారతీరాజా తోబుట్టువులైన చెల్లెలు భారతి తన అన్నయ్యను గుర్తుచేసుకుంటూ రోదిస్తున్నారు. ‘అన్నయ్యకు తాను అంటే చాలా ఇష్టమని, అందుకే తన అసలు పేరైన చిన్నస్వామిని మార్చుకుని.. తన పేరులోని మొదటి ముక్కను (భారతి), అన్నయ్య జయరాజ్ పేరులోని రెండో ముక్కను (రాజా) కలిపి ’భారతీరాజా’ అని పేరు మార్చుకున్నారని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే కథలు చెప్పడం, నాటకాలు వేయడం ఆయనకు అలవాటు‘ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. కుమారుడి మరణం.. గుండెకోత ఆయన బంధువులు సుబ్బురాజ్, రవి మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం వరకు ఆయన సొంత ఊరికి, తను చిన్నప్పుడు పెరిగిన ఇంటికి తరచూ వచ్చేవారన్నారు. గతంలో కంబమ్ ప్రాంతంలో జరిగిన ఒక కుటుంబ వేడుకకు వచ్చినప్పుడు బంధువులందరినీ చూసి ఎంతో సంబరపడ్డారని పేర్కొన్నారు. సొంత వాళ్లందర్నీ పిలిచి ఒక పెద్ద విందు ఇవ్వాలని ఎప్పుడూ అనేవారని, కుమారుడు మనోజ్ మరణించడంతో ఆయన మానసికంగా తీవ్రంగా కుంగిపోయారన్నారు. దాంతో ఆ విందు కోరిక నెరవేరకుండానే నిష్క్రమించారు అని పేర్కొన్నారు. తోటలోనే అంత్యక్రియలు.. తాను మరణిస్తే తేని జిల్లాలోని దేవదానపట్టి కాట్రోడ్ పరిసరాల్లో ఉన్న తన సొంత తోటలోనే(ఫామ్ హౌస్) అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన తరచూ చెప్తుండేవారని, ఆయన చివరి కోరిక మేరకే భౌతికకాయాన్ని తేని జిల్లాకు తీసుకొచ్చి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నామని బంధువులు తెలిపారు. తాజాగా భారతీ రాజాతీ అల్లి నగరం లాంటి చిన్న పల్లెటూరులో విషాదం నెలకొంది. బంధువులు, తేని జిల్లా ప్రజలను, ఆయన అభిమానులను తీవ్ర శోకసముద్రంలో ముంచెత్తింది. ఈరోజు సాయంత్రం తేని బంగళామేడు ప్రాంతంలో జిల్లా అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది. -
● మూగబోయిన ఎన్ ఇనియ తమిళ్ మక్కలే గళం ● శోకసంద్రంలో తమిళ సినీపరిశ్రమ ● దర్శక దిగ్గజానికి ఘన నివాళి అర్పిస్తున్న నేతలు, ప్రజలు
తమిళసినిమా: తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరానికి చెందిన ఓ సాధారణ కుటుంబమైన పెరియ మాయదేవర్, మీనాక్షి అమ్మాళ్ల నలుగురు సంతానంలో ఒకరే భారతీ రాజా. 1941 జూలై 17న జన్మించారు. చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి కలగడంతో నాటకాలు చూస్తూ పెరిగారు. అది నాటకాలు ఆడేంతలా కథలను రాసే స్థాఽయికి జ్ఞానాన్ని పెంపొందింది. విద్యను పూర్తి చేసిన భారతీరాజా హెల్త్ ఆఫీసర్గా ప్రభుత్వ కొలువులో చేరారు. పన్నైపురం నుంచి చైన్నె వైపుగా.. పన్నైపురంలో జరిగిన సంగీత కచ్చేరి ఇఽళయరాజా, గంగైఅమరన్, భాస్కర్ను కలిసే సందర్భం ఆయనకు కలిగింది. అలా వారు స్నేహితులుగా మారారు. ఆ తరువాత భారతీరాజా దర్శకత్వం వహించిన ఊర్ సిరిక్కిరదు, సుమ్మా ఒరు కథై నాటకాలు కొత్తగా ఉండటంతో వీరి నాటకాల ఆసక్తిని చూసిన కమ్యునిస్ట్ పార్టీ నేత శంకరయ్య అన్న కొడుకు అన్నక్కిళి సెల్వరాజ్ స్నేహితుడిగా మారారు. వీరంతా సినిమాల్లోకి వెళ్లితే మంచి పేరు తెచ్చుకోవచ్చునని భావించారు. అలా ఇళయరాజా, గంగైఅమరన్, భారతీరాజా చైన్నెకి వచ్చారు. వీరిలో భారతీరాజా ప్రముఖ దర్శకుడు పుట్టన్న కనక వద్ద సహాయకుడిగా చేరారు. అలా ఆయన దర్శకత్వం వహించిన ఇరుళుమ్ ఒళియుమ్ అనే చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆ తరువాత కేఆర్జీ నిర్మించిన అదృష్టం అళైక్కిరదు చిత్రానికి ఏ .జగన్నాధన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. భారతీరాజ ప్రతిభను గుర్తించిన నిర్మాత కేఆర్జీ ఆయనకు దర్శకత్వం అవకాశం కల్పించారు. ముత్తురామన్, జయలలిత జంటగా నటించనున్న ఆ చిత్రానికి సొంత వీడు అనే టైటిల్ను నిర్ణయించారు. అయితే చిత్ర షూటింగ్ ప్రారంభానికి ముందే నటి జయలలిత చిత్రం నుంచి వైదొలగడంతో ఆ చిత్రం డ్రాప్ అయ్యింది. ఆ తర్వాత లభించిన అవకాశంతో 16 వయదినిలేతో దర్శకుడయ్యారు. తొలి చిత్రంతోనే తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నారు భారతీరాజా. ఆ తరువాత ఎస్ఏ.రాజకన్న సంస్థలో సుధాకర్, రాధిక జంటగా నటించిన కిళక్కు పోగుం రైయిల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రంతో నటి రాధికను పరిచయం చేశారు. ఆ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఆ తరువాత కమలహాసన్, శ్రీదేవి జంటగా శివప్పు రోజాగళ్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అదీ సూపర్హిట్ అయ్యింది. ఆ తరువాత తన శిష్యుడు కే.భాగ్యరాజ్ను హీరోగా పరిచయం చేస్తూ పుదియ వార్పుగళ్ చిత్రాన్ని చేశారు. ఆ చిత్రం ద్వారా భారతీరాజా నిర్మాతగానూ మారారు. అలా వరుసగా విజయాలను సాఽధిస్తున్న భారతీరాజా కళ్లుక్కుల్ ఈరం అనే చిత్రం ద్వారా కథానాయకుడిగానూ పరిచయం అయ్యారు. అవార్డుల రారాజు.. కాగా ఈ చిత్రం ఉబ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికై ంది. భారతీరాజా తన తల్లి పేరుతో తెరకెక్కించిన కరుత్తమ చిత్రానికి జాతీయఅవార్డు రాగా, ఆ అవా ర్డును భారతీరాజా తల్లి అందుకోవడం విశేషం. ఈ చిత్రం భారతీరాజాకు ఉత్తమ నిర్మాత, దర్శకుడిగా జాతీయ అవార్డును అందించింది. 2004లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. తెలుగు చిత్రం సీతాకోక చిలుక చిత్రానికి గానూ 1982లో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నారు. 1988లో వేదంపుదిదు చిత్రం కూడా జాతీయ అవార్డును తెచ్చి పెట్టింది. 1996లో అందిమందామరై చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. పల్లెవెలుగులను తెరపై ఆవిష్కరించిన దర్శకుడు తమిళనిసిమాను భారతీరాజాకు ముందు, ఆ తరువాత అంటారు. అంతకు ముందు వరకూ స్టూడియోలకే పరిమితం అయిన తమిళ సినిమాను బాహ్య ప్రపంచంలోకి తీసుకు వచ్చిన దర్శకుడు భారతీరాజా. ముఖ్యంగా మట్టి వాసనను ప్రేక్షకులకు పరిచయం చేసి విజయాలను సాధించారు. అయితే, గత ఏడాది వారసుడు మనోజ్ హఠాన్మరణం ఆయన్ని ఎంతగానో కృంగదీసింది. అంతకు ముందు ఉత్సాహంగా సినిమాల్లో నటించిన ఆయన ఆరోగ్యం కుంటుపడింది. కొంత కాలం వైద్య చికిత్స ఆయన్ని కాపాడినా, ఇంటిలోనే ఉంటూ వచ్చారు. అలాంటిది బుధవారం వేకువ జామున కన్నుమూశారు. దీంతో మలేషియాలో నివశిస్తున్న కుమార్తె జనని వెంటనే చైన్నెకి చేరుకున్నారు. కాగా భారతీరాజా మృతి యావత్ సినీ లోకానికి తీరని లోటు అని నటీ నటులు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు కొనియాడారు. తమిళనాడు గవర్నర్ ఆర్వీ అర్లేకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, నటుడు విశాల్, ఆర్ కె సెల్వమణి తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారతీరాజా మృతికి సంతాపంగా గురువారం షూటింగ్లను రద్దు చేశారు. భారతీయ సినీ పరిశ్రమ దిగ్గజ దర్శకుడు భారతీరాజా సేవలను బుధవారం కోల్పోయింది. భారతీరాజా అనేది పేరు కాదు. ఒక బ్రాండ్. ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్ధాయిలో చాటిన దర్శక హిమయం. వర్ధమాన దర్శకులకు ఆయన చరిత్ర ఒక పుస్తకం. భారతీరాజా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ముందుగా ఎన్ ఇనియ తమిళ్ మక్కలే (నా ప్రియమైన తమిళ్ ప్రజలే) అంటూ సంబోధించే వారు. ఇప్పుడు ఆ గళం మూగబోయింది. పలు భాషలలో ముద్ర తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ వంటి భాషల్లోనూ భారతీరాజా తన జెండా పాతారు. మొత్తం 44 చిత్రాలకు పైగా దర్శకత్వం వహి ంచారు. వాటిలో టిక్ టిక్ టిక్, కాదల్ ఓవియం, వాలిభమే వావా, మన్వాసనై, పుదుమై పెన్, ఒరు ఖైదీయిన్ డైరీ, ముదల్ మరియాదై, కడలోర కవిదైగళ్, వేదం పుదిదు, కొడిపరక్కుదు, ఎన్ఉయిర్తోళన్, పుదునెల్లు పుదు నాత్తు, నాడోడితెండ్రల్, కెప్టెన్ మగళ్, కిళక్కు సీమయిలే, కరుత్తమ్మ, పసుమ్పెన్, తమిళ్సెల్వన్, తాజమహాల్ వంటి పలు చిత్రాలు భారతీరాజా కేరీర్లో మైలు రాయిగా నిలిచిపోయారు. నటీనటులు, దర్శకులు కే.భాగ్యరాజ్,రాధిక, రాధ, రేవతి, రంజిత, మణివన్నన్, మనోబాలా, నెపోలియన్, సుధాకర్, పాండియన్, నిళల్గళ్ రవి, పొన్వన్నన్, జనకరాజ్, నటి వడివుక్కరసి, అరుణ, విజయశాంతి, రేఖ, ఉషా, గౌండమణి,కార్తీక్, త్యాగరాజన్ వంటి వారందర్నీ పరిచయంచేసింది భారతీ రాజయే కావడం విశేషం. తన వారసుడు మనోజ్ను హీరోగా పరిచయం చేసి తాజ్మహాల్ అనే ప్రేమ కథా చిత్రాన్ని చేశారు. -
రాజీనామాల ఆమోదానికి వ్యతిరేకంగా పిటిషన్
సాక్షి, చైన్నె : టీవీకేలో చేరిన అన్నాడీఎంకేకు ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదాన్ని సవాల్ చేస్తూ మద్రాసు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దేశీయ మక్కల్ శక్తి కట్చి అధ్యక్షుడు ఎం.ఎల్. రవి ఈ పిటిషన్ దాఖలు చేశారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేకు చెందిన 47 మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో జరిగిన సీఎం విజయ్ విశ్వాస పరీక్ష తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేకు చెందిన మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమర వేల్,పెరుంతురై ఎమ్మెల్యే జయకుమార్, ఽతారాపురం ఎమ్మెల్యే సత్య భామాలు తొలుత తమ పదవులకు రాజీనామా చేశారు. క్షణాలలో అధికార టీవీకేలో చేరారు. ఆతదుపరి అంబా సముద్రం ఎమ్మెల్యే ఇసక్కి సుబ్బయ్య కూడా రాజీనామా చేసి టీవీకేలో చేరారు. వీరంతా విశ్వాస పరీక్ష సమయంలో అన్నాడీఎంకే విప్ను ధిక్కరించినట్టుగా ఫిర్యాదు విచారణలో ఉన్న సమయంలో రాజీనామాను స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆగమేఘాలపై ఆమోదించడం చర్చకు దారి తీసింది. అనర్హత వేటు అంశం పెండింగ్లో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ తాజాగా పిటిషన్ దాఖలైంది. అనర్హత వేటు చర్యల నుండి తప్పించుకోవడానికే ఈ ఎమ్మెల్యేలు రాజీనామా దారి ఎంచుకున్నారని, దాన్ని స్పీకర్ ఆమోదించడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని, ప్రజల తీర్పును పూర్తిగా అవహేళన చేయడమే అవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇలాంటి ఫిరాయింపులు, తదుపరి ఉపఎన్నికల వల్ల ప్రభుత్వంపై, ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ధర్మాసనానికి వివరించారు. స్పీకర్ జారీ చేసిన రాజీనామా ఆమోద ఉత్తర్వులను రద్దు చేయాలని, సదరు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని కోరారు. త్వరలో ఈ పిటిషన్ విచారణకు రానుంది. హైకోర్టు -
నీతి ఆయోగ్ భేటీకి సీఎం విజయ్
సాక్షి, చైన్నె: తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించినానంతరం రెండోసారిగా బుధవారం విజయ్ ఢిల్లీకి వెళౠ్లరు. గురువారం జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. బుధవారం ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. తమిళనాడు భవన్లో బస చేశారు. ముందుగా ఆయనకు తమిళనాడు భవన్భద్రతా సిబ్బంది గౌరవ వందనంతో ఆహ్వానించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్రపతి భవన్కు సీఎం విజయ్ తొలిసారిగా వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ను కలుసుకున్నారు. సాయంత్రం ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా విజయ్ కలిశారు. తొలి రోజు పర్యటన అంతా మర్యాద పూర్వక పలకరింపులేనని అధికార వర్గాలు ప్రకటించాయి. నేడు నీతి ఆయోగ్ భేటికి హాజరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో నీతి ఆయోగ్ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు కూడా పాల్గొంటున్నారు. ఈ వేదికపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తొలి సారిగా కనిపించనున్నారు. దీంతో ఆయన ఏం మాట్లాడుతారో అన్న ఎదురు చూపులు పెరిగాయి. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రత్యేక నిధుల కేటాయింపు, కేంద్రం నుండి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని అధికారికంగా విజ్ఞప్తి చేయనున్నారు. కాగా, గత నెల 27న ప్రపథమంగా విజయ్ సీఎం హోదాలో ఢిల్లీ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. గత భేటీలో సోనియా, రాహుల్ గాంధీతో భేటీ కాలేని పరిస్థితి నెలకొంది. అయితే, తాజాగా ఆయన వారితో సమావేశం కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి విజయ్ విడిగా సమావేశమై రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు చైన్నెకు సీఎం విజయ్ తిరుగు పయనం కానున్నారు. -
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
వేలూరు: వేలూరు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తాగునీటి ఎద్దడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జెడ్పీ చైర్మన్ బాబు అన్నారు. వేలూరు అన్నారోడ్డులోని జెప్డీ కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యులతో సమావేశం జరిగింది. ముందుగా సభ్యులు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సభ్యులు వివిధ సమస్యలపై సమీక్షించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉందని వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ సమస్యలపై సమీక్షించడంతో పాలు పలు తీర్మాణాలను చేశారు. -
మోక్షం లభించేనా..?
ధనుస్కోడి తీరం సాక్షి, చైన్నె: సుమారు రూ. 733 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రామేశ్వరం – ధనుస్కోడి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు తమిళనాడులో కొత్తగా బాధ్యతలు చేపట్టిన టీవీకే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందా..? అని రైల్వే అధికారులు ఎదురు చూస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఇదీ.. బ్రిటిష్ పాలన కాలంలో, 1914 ఫిబ్రవరి 24న చైన్నె ఎగ్మూర్ నుండి ధనుస్కోడికి ప్రతిష్టాత్మకమైన బోట్ మెయిల్ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ధనుస్కోడి నుండి శ్రీలంకలోని తలైమన్నార్కు ప్రయాణికుల నౌకల సేవలు కూడా నడిచేవి. ఈ సేవలు భారతదేశం–శ్రీలంక మధ్య రవాణాకు అత్యంత కీలకమైన మార్గంగా ఉండేవి. ఈ రైలు సర్వీస్ గోల్డెన్ జూబ్లీ (స్వర్ణోత్సవ) సంవత్సరంలో, అంటే 1964 డిసెంబర్ 22న సంభవించిన ఘోర తుపాను ధనుస్కోడిని పూర్తిగా అతలాకుతలం చేసింది. ఈ ప్రకృతి వైపరీత్యంలో రైల్వే స్టేషన్, రేవులో ఉన్న వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ధనుస్కోడికి వెళ్తున్న బోట్ మెయిల్ రైలు కూడా సముద్ర అలల ధాటికి కొట్టుకుపోవడంతో, అందులో ప్రయాణిస్తున్న 200 మందికి పైగా ప్రయాణికులు జలసమాధి అయ్యారు. ఈ తుపాను దెబ్బకు రామేశ్వరం – ధనుస్కోడి మధ్య ఉన్న రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైపోయింది. 55 ఏళ్ల అనంతరం దృష్టి.. తుపానుతో అతలాకుతమైన 55 ఏళ్ల తర్వాత, రైల్వే మంత్రిత్వ శాఖ రామేశ్వరం నుండి ధనుస్కోడి వరకు 17.20 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ను పునరుద్ధరించాలని నిర్ణయించింది.దీనికి సంబంధించిన సర్వే పనులను పూర్తి చేసి, 2019 మార్చి 1న కన్యాకుమారిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మొదట ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 208 కోట్లుగా నిర్ణయించారు. అయితే మద్రాసు ఐఐటీ ఇంజనీర్లు ఈ ప్రాంతాన్ని పరిశీలించి కీలక సూచనలు చేశారు. భవిష్యత్తులో వచ్చే తుఫానులు, సముద్రపు గాలులు, వరదల నుండి రైల్వే లైన్ను రక్షించాలంటే ట్రాక్ను రోడ్డు మట్టం కంటే ఐదు మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించారు. 1964లో తుఫాను వచ్చినప్పుడు పాత ట్రాక్ రోడ్డు మట్టం కంటే ఒక మీటరు లోపే ఉండటం వల్లే అది త్వరగా కొట్టుకుపోయిందని గుర్తుచేశారు. ఈ భద్రతా ప్రమాణాల మార్పుల కారణంగా ప్రాజెక్ట్ బడ్జెట్ రూ. 208 కోట్ల నుండి ఏకంగా రూ. 733 కోట్లకు పెరిగింది. ఏడేళ్లుగా మూలనపడ్డ ప్రాజెక్ట్ గత డీఎంకే ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుపై పెద్దగా ఆసక్తి చూపలేదు. రామేశ్వరం – ధనుస్కోడి ప్రాంతం పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం అని, ఇక్కడ కొత్త రైల్వే లైన్ నిర్మిస్తే తీరప్రాంత పర్యావరణం దెబ్బతింటుందని పేర్కొంటూ, ఈ ప్రాజెక్టును విరమించుకోవాలని గత ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. దీనివలన ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి ఏడేళ్లు దాటినా ఈ ప్రాజెక్ట్ ఎలాంటి పురోగతి లేకుండా నిలిచిపోయింది. ధనుస్కోడి పాత రైల్వే స్టేషన్ దశాబ్దాల కల.. ప్రస్తుతం తమిళనాడులో అధికార మార్పు నేపథ్యంలో రైల్వే వర్గాలు ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టాయి. తాజా ప్రభుత్వం సహకరించేనా అన్న భావనలో పడ్డారు. తాజాగా 17.20 కిలోమీటర్లు సింగిల్ లైన్ బ్రాడ్ గేజ్ – విద్యుద్దీకరణతో కూడిన ట్రాక్ ఏర్పాటు కావాల్సి ఉంది. అలాగే జటాయు తీర్థం, కోదండరామర్ కోవిల్, ముకుందరాయర్ చతిరంలో రైల్వే స్టేషన్లు నిర్మించాల్సి ఉంది. పాత రైల్వే లైన్ పరిధిలోని 28.6 హెక్టార్ల భూమి అటవీ శాఖ ఆధీనంలో ఉంది. ఇది కాకుండా 43.81 హెక్టార్ల రాష్ట్ర ప్రభుత్వ భూమి, 3.66 హెక్టార్ల ప్రైవేట్ భూమిని సేకరించాల్సి ఉంది.పర్యావరణ సాకులతో గత డీఎంకే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని, ఇప్పుడు తమిళనాడులో కొత్తగా బాధ్యతలు చేపట్టిన టీవీకే ప్రభుత్వం గనుక పూర్తి స్థాయిలో సహకరించి, భూసేకరణకు మద్దతు ఇస్తే.. దశాబ్దాల కాలంగా కలగా మిగిలిపోయిన రామేశ్వరం – ధనుష్కోడి రైల్వే లైన్ పనులను వెంటనే ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ప్రస్తుతం రామేశ్వరం వరకు వివిధ నగరాల నుంచి రైలు సేవలు సాగుతున్న విషయం తెలిసిందే. -
రంగంలోకి దిగిన ‘సింగప్పెన్’
సాక్షి, చైన్నె : తమిళనాడు వ్యాప్తంగా మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సరికొత్తగా ఏర్పాటైన సింగప్పెన్ మహిళా ప్రత్యేక పోలీసు దళం బుధవారం నుండి అధికారికంగా రంగంలోకి దిగింది. సీఎం విజయ్ మంగళవారం చైన్నెలో 18 సబ్ యూనిట్లతో ఈ ప్రత్యేక టాస్క్ పోర్సును ప్రారంభించగా, బుధవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ దళం ముమ్మర గస్తీలో నిమగ్నమైంది. రెండు షిఫ్టుల్లో నిరంతర నిఘా పోలీస్ కమిషనర్ కార్యాలయాల పరిధిలోని అన్ని కీలక ప్రాంతాల్లో ఈ ప్రత్యేక దళాలు మోహరించాయి. ఒక సబ్–ఇన్స్పెక్టర్ నేతృత్వంలో రెండు బృందాలుగా విడిపోయి. ప్రత్యేక ంగా కేటాయించిన వాహనాల్లో ఉదయం నుండి రాత్రి వరకు రెండు షిఫ్టులలో ఈ మహిళా విభాగం భద్రతా విధులను నిర్వహిస్తోంది. జిల్లాలో ఎస్పీల పర్యవేక్షణలో పాఠశాలలు, కళాశాలలు, ,జన సంచారం ఎక్కువగా ఉండే మార్కెట్లు, బస్టాండ్లు , మహిళలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాల పరిసరాలలో ఈ దళాలు ముమ్మరంగా గస్తీలో నిమగ్నమయ్యాయి. మహిళలపై ఎలాంటి వేధింపులు లేదా అకృత్యాలు జరిగినా క్షణాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకునేలా వీరు పనిచేస్తున్నారు. ప్రత్యేక శిక్షణ – అసాధారణ ధైర్యం ఈ ప్రత్యేక ఫోర్స్ గురించి ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ఈ దళంలోని మహిళా పోలీసులకు ప్రత్యేక శిక్షణా కేంద్రాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారన్నారు. బాధితులైన మహిళలతో అత్యంత దయతో, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూనే.. వేధింపునకు లేదా దుర్వినియోగానికి పాల్పడే ఆకతాయిలపై సింగప్పెన్ దూకుడుగా , కఠినంగా వ్యవహరించే విధంగా శిక్షణ ఇచ్చి ఉన్నారని వివరించారు. మహిళలకు ఏ ఆపద వచ్చినా తామున్నామనే నమ్మకాన్ని, ధైర్యాన్ని ఈ దళం కలిగిస్తుందని పేర్కొన్నారు. కాగా టాస్క్ ఫోర్స్’ కోసం 2,545 కొత్త పోస్టుల మంజూరు చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన కసరత్తులలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ – జిల్లా ప్రధాన కార్యాలయాల్లో 343 , సబ్–ఇనన్స్పెక్టర్లు – 98, ప్రత్యేక సబ్ ఇన్స్పెక్టర్లు 540, మహిళా పోలీసు కానిస్టేబుళ్లు 1620 మందిని నియమించేందుకు, కంట్రోల్ – టెక్నికల్ డివిజన్లో 2 ఇన్స్పెక్టర్ పోస్టులతో పాటు 12 సాంకేతిక సిబ్బంది పోస్టుల రూపకల్పనకు చర్యలు చేపట్టారు. -
Tamil Nadu: కాంగ్రెస్ వర్సెస్ టీవీకే
సాక్షి, చెన్నై : కన్యాకుమారి జిల్లా కిల్లియూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే , మంత్రి రాజేష్ కుమార్ ఎన్నికను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు టీవీకే అభ్యర్థి సబీన్ నిర్ణయించారు. ఆయన గెలుపు చెల్లదని ప్రకటించాలని కోరుతూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికలలో 1,311 ఓట్లతో రాజేష్ కుమార్ సబీన్పై గెలిచారు. సోమవారం సబీన్ స్వయంగా కన్యాకుమారి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించిన ఫిర్యాదు లేఖను కిల్లియూర్ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కౌన్సిల్ కార్యదర్శి , ప్రధాన ఎన్నికల కమిషనర్కు కూడా పంపినట్టు ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోస్టల్ ఓట్ల నిర్లక్ష్యం : ఎన్నికల నిబంధనల ప్రకారం లెక్కింపు జరపాల్సిన అనేక పోస్టల్ ఓట్లను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ నిర్దేశిత సమయం కంటే ముందే, అంటే ఉదయం 6 గంటలకే ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారని వివరించారు. సాంకేతిక లోపం పేరిట ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదని, తాము ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా, కౌంటింగ్ అధికారులు సరైన వివరణ ఇవ్వకుండా రకరకాల కారణాలు చెబుతూ తుది ఫలితాన్ని ఏకపక్షంగా ప్రకటించారని సబీన్ ఆరోపించారు.నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ లెక్కింపు ఆధారంగా ప్రకటించిన రాజేష్ కుమార్ విజయాన్ని తక్షణమే రద్దు చేయాలని సబీన్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోతే, త్వరలోనే ఉన్నత న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయించి ఎన్నికల పిటిషన్ దాఖలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.కాగా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యే గెలుపును వ్యతిరేకిస్తూ అధికార పక్షం అభ్యర్థి న్యాయ పోరాటానికి సిద్ధం కావడం చర్చకు దారి తీసింది. -
కాంగ్రెస్కు చెక్.. వ్యూహం మార్చిన స్టాలిన్!
సాక్షి, చెన్నై: జాతీయ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకోనుంది. ప్రస్తుత విపక్షాల ఇండియా కూటమి స్థానంలో, జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలతో ఒక సరికొత్త ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడానికి ద్రావిడ మున్నేట్ర కళగం(డీఎంకే) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ ఈ మేరకు సరికొత్త వ్యూహానికి అమలు చేసే దిశగా పార్టీ కీలక నేతలైన సీనియర్ ఎంపీలను రంగంలోకి దించనున్నట్టు సమాచారం.ఈ జాతీయ కూటమి ఏర్పాటుకు సంబంధించి చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో సీనియర్లుగా ఉన్న ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కీలక ఎంపీలకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం గమనార్హం. ఈ ప్రతిపాదిత కూటమిలో భాగస్వామ్యం కావాల్సిందిగా ప్రాంతీయ పార్టీలకు డీఎంకే ఆహ్వానాలు పంపబోతున్నట్టు చర్చ జరుగుతోంది. నిన్నటి ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్, రాహుల్ తీరును అనేక పార్టీల నేతలు తీవ్రంగా దుయ్యబట్టి ఉండటాన్ని పరిగణించి ప్రాంతీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ముఖ్య ప్రతినిధులతో తన ఎంపీల ద్వారా మాట్లాడించే దిశగా స్టాలిన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు తమిళనాట చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్కు స్థానం లేదు.. ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కానున్న జట్టులో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టాలన్న నిర్ణయానికి స్టాలిన్ రావడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కొత్త జట్టును ఏర్పాటు చేయడంలో భాగంగా పలు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉంటూ, కాంగ్రెస్ రూపంలో నష్టపోయిన పార్టీ నేతలతో సంప్రదింపునకు సన్నద్దం అవుతుండటం గమనార్హం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకం చేయడమే లక్ష్యంగా ఎంకె గ్రూప్ (డీఎంకే) అడుగుల వేగాన్ని మున్ముందు పెంచనున్నట్టు చర్చ జరుగుతున్నది. ‘ఇండియా’ కూటమి ఏర్పడినప్పటి నుండి కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే తాజాగా కాంగ్రెస్కు చెక్ పెట్టడం లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయనున్నడంతో మున్ముందు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో అన్న ఆసక్తి పెరిగినట్లయ్యింది. -
మహిళల రక్షణ కోసం ‘సింగప్పెన్’
సాక్షి, చెన్నై: మహిళలపై జరిగే నేరాలను అడ్డుకునేందుకు తమిళనాడు ప్రత్యేకంగా సింగప్పెన్ అనే ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. సీఎం విజయ్ మంగళవారం ఈ యూనిట్ను ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలపై నేరాల కట్టడికి డ్రోన్ పెట్రోలింగ్ విధానాన్ని తీసుకువస్తామన్నారు. మహిళల భద్రతకు కొత్త విభాగం మరింత సహాయకారిగా ఉంటుందని సీఎం విజయ్ తెలిపారు. ఈ విభాగం కోసం ప్రత్యేకంగా కాకీ ప్యాంటు, బ్లూ షర్ట్తో యూనిఫాంను రూపొందించారు. ఈ విభాగం లోగోను సీఎం విడుదల చేశారు. సింగప్పెన్ అంటే తమిళంలో ఆడసింహం వంటి ధైర్యశాలి అయిన మహిళ అని అర్థం. సింగప్పెన్ కోసం రూ.354 కోట్లు కేటాయిస్తామని, కొత్తగా 2,500 మందిని నియమిస్తామని ప్రకటించారు. -
సీఎం విజయ్ రాకతో నెరవేరిన 56 ఏళ్ల కల
తమిళనాడు: బస్సు లేక 56 ఏళ్లుగా అవస్థలు పడుతున్న కొండ గ్రామ ప్రజల కలలో తమిళనాడు ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో ఆ గ్రామ ప్రజలు పాఠశాల విద్యార్థులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. వివరాలు.. తేని జిల్లాలోని మారుమూల కోటగుడి కొండ గ్రామం ప్రాంతం చాలా మంది సినిమాటోగ్రాఫర్లను ఆకర్షించింది. ఈ ప్రాంతంలోని కోటగుడి కొండ గ్రామంలో 200కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇది నీలగిరి పరిధిలో ఉంటుంది.ఈ గ్రామానికి చెందిన 25 మందికి పైగా పిల్లలు పోడి నాయక్కనూరులోని ప్రభుత్వ , ప్రభుత్వ – సహాయక పాఠశాలల్లో చదువుకుంటున్నారు. కోటగుడి నుండి బస్సు సౌకర్యాలు లేకపోవడంతో, ఇక్కడి నుండి పాఠశాలకు వెళ్లే పిల్లలు రోజూ 2 నుండి 3 కిలోమీటర్లు నడిచి, ఆ తర్వాత పాఠశాలకు వెళ్లడానికి కోటగుడి డివిజన్ సమీపంలోని కురంగానికి బస్సు ఎక్కవలసి వచ్చేది. దీంతో కోటగుడి కొండ గ్రామానికి బస్సు, మినీబస్సు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు చాలాసార్లు నిరసనలు చేపట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తాజాగా సీఎం ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ తక్షణ చర్యలు తీసుకున్నారు. కోట గుడి కొండకు ప్రభుత్వ బస్సు సర్వీసును ప్రారంభించే విషయంపై అధ్యయనం చేయాలని తేని జిల్లా కలెక్టర్ వైద్యనాథన్ రాష్ట్ర రవాణా సంస్థ అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం, కోట గుడి రోడ్డుపై బోడి నుండి కురంగణి వరకు ఉదయం 3.30 నుండి సాయంత్రం 5.30 వరకు బస్సును నడపాలని నిర్ణయించారు. మొదటిసారిగా బస్సు గ్రామంలోకి ప్రవేశించడాన్ని చూసి మలై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. -
భర్తను ముక్కలు ముక్కలుగా నరికి సూట్కేస్లో కుక్కింది.!
పెరంబూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్పై సూట్కేసులో దొరికిన కుళ్లిపోయిన తల చేతులు కాళ్లు లేని మృతదేహం కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసి, శవాన్ని ముక్కలుగా నరికినట్లు దర్యాప్తులో తేలింది. తల కాళ్లు, చేతులు లేక పోవడం, మొండెం మాత్రం ఉండటంతోకేసు పోలీసులకు సవాలుగా మారింది. అయితే మృతదేహంపై ఉన్న బ్రాండెడ్ బట్టల బార్కోడ్ ఆధారంగా దర్యాప్తు చేయగా, ఆ దుస్తులను కొనుగోలు చేసిన షాపును గుర్తించారు. దీనిని ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు తెలింది. కాల్ డేటా రికార్డ్, వాట్సాప్ లోకేషన్ ఆధారంగా నిందితులు తేనాంపేట, టి.నగర్ పరిసరాలలో ఉన్నట్టు గుర్తించారు. హత్యకు గల కారణాలు.. పోలీసుల విచారణలో మరణించిన వ్యక్తి అస్సాంకు చెందిన అమీర్ గుర్తించారు. నిందితురాలు రోకిమాకు అస్సాంలోనే మొదటి వివాహమై ఒక కుమార్తె ఉంది. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఆమె అమీర్ అలీని రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2022 నుండి తేనాంపేటలోని థామస్ రోడ్ హౌసింగ్ బోర్డు క్వార్టర్స్లో నివసిస్తున్నారు. అయితే అమీర్ అలీకి ఇతర మహిళలతో ఉన్న సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రోకిమాకు టి.నగర్లో కూరగాయల దుకాణం నడుపుతున్న అస్సాంకు అష్రఫ్ (31)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వేధింపుల గురించి రోకిమా అతడికి చెప్పగా పథకం ప్రకారం మట్టుబెట్టినట్టు తేలింది. హత్య తర్వాత తన భర్త అమీర్ అలీ స్వయంగా పెట్టినట్లుగా.. తనకు ఇక బతకాలని లేదు, ఎవరూ వెతకవద్దు అని హిందీలో ఒక నకిలీ సందేశాన్ని అతడి ఫెస్బుక్లో రోకిమా పోస్టు చేసింది. మానసిక క్షోభతో∙అమీర్ ఎక్కడికో వెళ్లిపోయాడని బంధువులను నమ్మించేందుకే యత్నించింది.శవాన్ని ముక్కలుగా నరికి.. పథకం ప్రకారం, జూన్ 4వ తేదీ రాత్రి అమీర్ అలీ నిద్రపోతున్న సమయంలో రోకిమా, ఆమె ప్రియుడు అష్రఫ్ అతని గొంతు కోసి హత్య చేశారు. అతని తల, చేతులు, కాళ్లను ముక్కలుగా నరికారు. మొండెం భాగాన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రి కవర్లో చుట్టి సూట్కేసులో కుక్కారు. జూన్ 5వ తేదీ రాపిడో ఆటోలో ప్రయాణించి ఆ సూట్కేసును పెరంబూర్ రైల్వే స్టేషన్లో వదిలేశారు. కాగా, నరికిన చేతులు, కాళ్లను ఒక కాలువలో వేయగా, తలను మాత్రం చెంగల్పట్టు జిల్లా పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టారు. కాగా భర్త శరీర బాగాలను నరికేటప్పుడు ఆనందంగా భార్య ఆనందంతో సెల్ఫీలు తీసుకోవడం గమనార్హం.-సాక్షి, చెన్నై -
విజయ్ ఫొటో కోసం.. కుర్చీ ఖాళీ!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రజాదరణ ఇప్పుడు కేవలం రాజకీయ సభలకే పరిమితం కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాల్లోనూ ఆయన ఫొటోలు ప్రధాన చర్చగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ చిత్రపటాన్ని అన్ని కార్యాలయాల్లో ఉంచి తీరాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే.. తిరునెల్వేలిలో చివరకు మేయర్ ‘కుర్చీ’నే ఖాళీ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు అక్కడ జరిగిందంటే.. తిరునెల్వేలి కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మేయర్ జి. రామకృష్ణన్ కార్యాలయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ ఫొటో ఏర్పాటు చేశారు. అయితే దానిని గదిలో మధ్యభాగంలో, మేయర్ కుర్చీకి నేరుగా పైన ఉంచాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కార్యకర్తలు కోరినట్లు సమాచారం. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రామకృష్ణన్.. తన నిరసనను మరోలా వ్యక్తం చేశారు. ఆయన తన కుర్చీలో కూర్చోకుండా పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని కార్యాలయ పనులు నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నారని.. నిరసన తెలిపేందుకే తాను ఇలా చేస్తున్నానని అన్నారాయన. రెండు వారాల క్రితం కార్పొరేషన్ కార్యాలయంలోని అన్ని గదుల్లో విజయ్ ఫొటోలను ఏర్పాటు చేయాలని కోరగా అంగీకరించామని, ఇప్పుడు తన కుర్చీ పైనే ఫొటో ఉండాలని పట్టుబడటం అనవసర వివాదాలకు దారితీస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రజా సేవలకు ఆటంకం కలిగిస్తున్నాయని అన్నారు.అసలు వివాదం రెండు వారాల క్రితమే మొదలైంది. అప్పట్లో కూడా మేయర్ రామకృష్ణన్ నిరసనగా తన టేబుల్పై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఫొటోను ఉంచి సమావేశాలు నిర్వహించారు. దీంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఇదే తరహా వివాదం కోయంబత్తూరులోనూ చోటుచేసుకుంది. అక్కడ మేయర్ ఆర్. రంగనాయకి తొలుత తనకు కేటాయించిన గదిలో విజయ్ ఫొటో పెట్టడాన్ని వ్యతిరేకించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో చివరకు అంగీకరించారు. అయినప్పటికీ స్టాలిన్ ఫొటోను తొలగించేందుకు మాత్రం నిరాకరించారు.కరూర్లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ వివాదం మరింత ముదిరింది. విజయ్ ఫొటో పక్కనే స్టాలిన్ ఫొటోను కూడా ఉంచాలని డీఎంకే సభ్యులు డిమాండ్ చేశారు. దీనికి అన్నాడీఎంకే, కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ నేతల ఫొటోలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో సమావేశం రాజకీయ వాగ్వాదాలకు వేదికగా మారింది.కూనూర్లో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విజయ్ ఫొటోతో పాటు స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి చిత్రాలను ఉంచగా, టీవీకే కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆ ఫొటోలను తొలగించడంతో వివాదం చెలరేగింది. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద మోహరించాల్సి వచ్చింది.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం ఫొటోల వివాదం మాత్రమే కాదు. స్థానిక సంస్థల్లో టీవీకే ఎమ్మెల్యేలు, డీఎంకే లేదంటే ఇతర పార్టీల కౌన్సిలర్ల మధ్య సమన్వయ లోపానికి ఇది ప్రతిబింబంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ ఆధిపత్య పోరు మరింత తీవ్రమవుతోందని వారు భావిస్తున్నారు. అయితే ఈ రాజకీయ పోరులో ప్రజా సమస్యలు పక్కన పడుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Polimer News (@polimernews) VIDEO Credits: polimernews -
ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల నజరానా
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మక నార్వే ఓపెన్ చెస్ టోర్నిలో టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన తమిళనాడు గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందకు నగదు ప్రోత్సాహకం లభించింది. విజేత హోదాలో చెన్నై వచ్చిన ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో సోమవారం సచివాలయంలో సీఎం విజయ్ను కలిశాడు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందను విజయ్ సత్కరించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహానికి గాను చెక్ను అందజేశారు. అనంతరం ప్రజ్ఞానందతో చెస్ బోర్డు తెచ్చావా? అని అడిగి మరీ విజయ్ 15 నిమిషాలపాటు స్నేహపూర్వక గేమ్ ఆడారు. వీరిద్దరి మధ్య గేమ్ను ఛాంబర్లో ఉన్న క్రీడా మంత్రి ఆధవ్ అర్జునతో పాటుగా అ«ధికారులు ఆసక్తితో తిలకించారు. గేమ్లో తనను ఓడించిన ప్రజ్ఞానందను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. -
విద్యుత్ కోతలపై వివాదం
– టీవీకే ఎమ్మెల్యే పల్లవికి డీఎంకే లీగల్ నోటీసు సాక్షి, చైన్నె: తమిళనాడులో నెలకొన్న విద్యుత్ కోతల సమస్యకు డీఎంకే నాయకులే కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తిరు వి.కా నగర్ నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే పల్లవికి డీఎంకే తరపున నష్టపరిహారం , అవమానకర వ్యాఖ్యల నోటీసు పంపినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన శరవణన్ అన్నాదురై, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వంపై, సీఎం విజయ్ పరిపాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.టీవీకే ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదన్నారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక టీవీకే ప్రభుత్వం, ఆ పార్టీ మంత్రులు పూర్తిగా అయోమయంలో పడిపోయారన్నారు. విద్యుత్ కోతలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. వేసవి కాలంలో ఎదురొయ్యే ఈ పరిస్థితిని గత ఐదేళ్లుగా తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, అయితే, ఇప్పుడు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డీఎంకేపై నిందలు వేస్తున్నారన్నారు. టీవీకే మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో రకమైన పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.తిరు వి.క నగర్ ఎమ్మెల్యే పల్లవి అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పవర్ కట్స్కు డీఎంకే వారే కారణమంటూ బురదజల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆమెకు లీగల్ నోటీసు పంపామని, తాను చేసిన అబద్ధపు ఆరోపణలకు గాను ఎమ్మెల్యే పల్లవి బహిరంగంగా డీఎంకే పార్టీకి క్షమాపణలు చెప్పాలని శరవణన్ అన్నాదురై డిమాండ్ చేశారు. సముద్రంలో గల్లంతైన జాలర్ల రక్షింపు తిరువొత్తియూరు: కడలూరు జిల్లా పరంగిపేట్టై పుదుపేట షణ్ముగ నగర్కు చెందిన రవి అలియాస్ రమేష్ (28), అదే ప్రాంతానికి చెందిన మనోహర్ (27), పుదుచ్చేరి రాష్ట్రం కనకచెట్టికుళం తెర్కు వీధికి చెందిన నాగవేల్ (40) అనే ముగ్గురు జాలర్లు ఈనెల 2వ తేదీ ఓ ఫైబర్ బోటులో సముద్రంలో వేటకు వెళ్లారు. మరుసటి రోజు (3వ తేదీ) వారు తిరిగి రావాల్సి ఉండగా, ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తోటి మత్స్యకారులు గాలించినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, మత్స్యకారులు పరంగిపేట్టై సమీపంలోని అన్నన్ కోవిల్ ప్రాంతంలో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో మత్స్యశాఖ అధికారులు జాలర్ల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో అన్నన్ కోవిల్ గ్రామానికి వెళ్లిన చిదంబరం నియోజకవర్గ ఎమ్మెల్యే తమిళన్.. అన్సారీ మాయమైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను కలిసి, పడవ యజమానితో సహా మత్స్యకారులతో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పరిస్థితిలో, సోనంకుప్పంకు చెందిన నలుగురు మత్స్యకారులు సోమ వారం చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. అక్కడ నడి సంద్రంలో ఆగిపోయిన బోట్లో గల్లంతైన జాలర్లు స్పృహ తప్పి పడి ఉన్నట్లు గుర్తించి వారిని తమ పడవలోకి ఎక్కించుకున్నారు. దీని గురించి తమ వద్ద ఉన్న వైర్లెస్ పరికరం ద్వారా మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. దాని ప్రకారం, మత్స్యశాఖ అధికారులు తీరంలో 108 అంబులెనన్స్తో సిద్ధంగా ఉన్నారు. పడవ తీరానికి రాగానే, వారిని పడవ నుండి దించి 108 అంబులెన్స్ ద్వారా కడలూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొకై న్ స్మగ్లింగ్లో నిందితుడికి 10 ఏళ్లు జైలు సాక్షి, చైన్నె : తూత్తుకుడిలో రూ. 2,000 కోట్ల విలువైన కొకై న్ డ్రగ్స్ అక్రమ రవాణా చేసిన కేసులో నిందితుడికి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించించింది. వివరాలు.. 2021 ఏప్రిల్లో విదేశాల నుండి కార్గో షిప్ ద్వారా తూత్తుకుడి ఓడరేవుకు ఒక ప్రత్యేక కంటైనర్ వచ్చింది. ఇందులో మాదకద్రవ్యాలు ఉన్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థల నుండి భారత రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు రహస్య సమాచారం అందింది.దీని ఆధారంగా రంగంలోకి దిగిన అధికారులు, సదరు కంటైనర్ రికార్డులను పరిశీలించి తూత్తుకుడిలోని ఒక డిపార్ట్మెంట్ స్టోర్ గోడౌన్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ దిగుమతి చేసుకున్న టేకు కలప దుంగల మధ్య అత్యంత చాకచక్యంగా దాచి ఉంచిన 303 కిలోల నాణ్యమైన కొకై న్ని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 2,000 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ కంటైనర్ చైన్నెకి చెందిన ఓ లాజిస్టిక్స్ కంపెనీ ఐపీ అడ్రస్, ఆఫీస్ సిబ్బంది అయిన సతీష్ కుమార్ అనే ఉద్యోగి మొబైల్ నంబర్ ఉన్నట్లు తేలింది.అధికారులు సతీష్ కుమార్ను విచారించగా, తన బ్రాంచ్ మేనేజర్ అయిన లియో రోసారియో జోసెఫ్ (49) ఆదేశాల మేరకే తాను ఆ కార్గో పెట్టె రాకను పర్యవేక్షించానని అంగీకరించారు. తుది విచారణ అనంతరం మధురై కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నిందితుడు లియోకి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో చైన్నె మన్నడి ప్రాంతానికి చెందిన రషీద్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారి అని విచారణలో తేలింది. నేటీకి పరారీలో ఉన్న రషీద్ కోసం పోలీసులు, ప్రత్యేక నిఘా సంస్థలు చురుగ్గా గాలిస్తున్నాయి. -
దిండుగల్ జిల్లాలో మహిళా శక్తి
సాక్షి, చైన్నె: దిండుగల్ జిల్లా పరిపాలనలో మహిళా అధికారులు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. కలెక్టర్ మొదలుకొని వివిధ ప్రభుత్వ శాఖల అగ్ర శ్రేణి పోస్టుల వరకు మహిళలే అత్యధిక సంఖ్యలో నియమితులవడంతో, జిల్లా యంత్రాంగం మొత్తం మహిళల ఆధిపత్యం, నాయకత్వంలో ముందుకు సాగుతోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం దిండుగల్ జిల్లాలో కీలక పదువులలో ఉన్న వారి బదిలీలు జరిగాయి. ఆమేరకు ఇటీవలే దిండుగల్ జిల్లా కొత్త కలెక్టర్గా దుర్గామూర్తి బాధ్యతలు స్వీకరించారు, అలాగే రెవెన్యూ , గ్రామీణాభివృద్ధి శాఖలను జిల్లా కలెక్టర్ తర్వాత అత్యంత కీలకమైన రెవెన్యూ విభాగాన్ని డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ జయభారతి పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని భూపరిపాలన, రెవెన్యూ వ్యవహారాలన్నీ ఈమె నియంత్రణలోనే ఉన్నాయి. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల అమలును డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గంగాధరణి పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ అంతర్గత పరిపాలన, సమన్వయ బాధ్యతలను కలెక్టర్ వ్యక్తిగత సహాయకురాలు జయంతి చూసుకుంటున్నారు. కొడైకెనాల్ ఆర్డీఓగా కీర్తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవి అయిన జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ముత్తు శారద విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖను చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉష లీడ్ చేస్తున్నారు. జిల్లా సామాజిక సంక్షేమ అధికారిగా కరోలిన్ సెల్వరాణి, జిల్లా సమగ్ర బాలల అభివృద్ధి పథకం) అధికారిగా పూంగొడి సేవలందిస్తున్నారు. ఇక, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్గా గాయత్రి, జిల్లా పంచాయతీ సెక్రటరీగా రాజేశ్వరి పనిచేస్తున్నారు. కలెక్టర్ దుర్గామూర్తి బాధ్యతలు స్వీకరించిన తరుణంలో.. మహిళల సంక్షేమం, రక్షణ, జీవనోపాధి మరియు బాలల హక్కుల పరిరక్షణకు తాము ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని అగ్ర శ్రేణి పోస్టుల్లో ప్రతిభావంతులైన మహిళా అధికారులే ఉండటం వలన , ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఉన్న చివరి లబ్ధిదారునికి కూడా పారదర్శకంగా అందుతాయని, జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని దిండుగల్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కార్పొరేషన్లో ఆస్తుల వివాదం
సాక్షి, చైన్నె : చైన్నె మహానగర కార్పొరేషన్ లో చట్ట నిబంధనలను తుంగలో తొక్కుతూ మేయర్ ఆర్. ప్రియ, డిప్యూటీ మేయర్ మహేష్ కుమార్లతో పాటు ఏకంగా 157 మంది కార్పొరేటర్లు తమ ఆస్తుల వివరాలను సమర్పించలేదనే సంచలన విషయం సమాచార హక్కు చట్టం ద్వారా సోమవారం వెలుగుచూసింది. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం మరో 8 నెలల్లో ముగియనున్న తరుణంలో, ప్రజాప్రతినిధుల తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చట్టం ఏం చెబుతోంది? తమిళనాడు ప్రభుత్వం 1998లో తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల చట్టాన్ని తీసుకువచ్చింది. దీనికి 2022లో కీలక సవరణలు చేస్తూ 34ఏ అనే కొత్త నిబంధనను చేర్చారు. దీని ప్రకారం.. పట్టణ స్థానిక సంస్థల్లోని మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు తాము పదవీ బాధ్యతలు స్వీకరించిన 90 రోజులలోపు తమ స్వంత ఆస్తులతో పాటు తమ భార్య, భర్త, పిల్లల ఆస్తుల వివరాలను కార్పొరేషన్లో సమర్పించాలి. అనంతరం 2023లో తెచ్చిన నిబంధనలలోని రూల్ 183 ప్రకారం.. ఈ ఆస్తి వివరాల పత్రాలను కార్పొరేషన్ కమిషనర్కు అందజేయాలి. కమిషనర్ వాటిని అత్యంత భద్రంగా దాచాల్సి ఉంటుంది. సమాచార విచారణలో షాకింగ్ నిజాలు ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన న్యాయవాది శంకర్.. చైన్నె కార్పొరేటర్ల ఆస్తి వివరాల సమర్పణపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు. దీనికి కార్పొరేషన్ యంత్రాంగం ఇచ్చిన సమాధానం అందరినీ షాక్కు గురిచేసింది. చైన్నె కార్పొరేషన్లోని మొత్తం 200 వార్డు లలో కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో మేయర్ ప్రియ, డిప్యూటీ మేయర్ మహేశ్కుమార్తో పాటుగా 157 మంది తమ ఆస్తుల వివరాలను సమర్పించక పోవడం గమనార్హం. కేవల 43 మంది మాత్రమే తమ వివరాలను సమర్పించి ఉన్నారు. మిగిలిన వారిలో నలుగురు ఇప్పటికే మరణించగా, ఇద్దరు అనర్హతకు గురయ్యారు. చట్టాన్ని గౌరవించకుండా, నిబంధనలను ఉల్లంఘించిన ప్రజాప్రతినిధుల జాబితాను కూడా కార్పొరేషన్ అధికారికంగా విడుదల చేయడం గమనార్హం.కార్పొరేషన్ భవనం చర్యలకు చట్టంలో చోటు లేదు ఈ ఉల్లంఘనపై సదరు కార్పొరేటర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని అధికారులను ప్రశ్నించగా, వారు చేతులెత్తేశారు. నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధులు 90 రోజుల్లోగా ఆస్తి వివరాలు సమర్పించాలని మాత్రమే పేర్కొన్నారు. ఒకవేళ ఆ గడువులోగా వివరాలు ఇవ్వకపోతే వారిపై ఎలాంటి చట్టపరమైన లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలో సవరించిన చట్టంలో ఎక్కడా స్పష్టంగా పొందుపరచలేదన్నారు. చర్యలకు చట్టంలో ఆస్కారం లేనందున ఏమీ చేయలేకపోతున్నామన్నారు. అదే సమయంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో అందరికీ నోటీసులు పంపించామని, 30 రోజులలోపు వివరాలను సమర్పించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. -
సీఎం విజయ్ వ్యాఖ్య
● నార్వే చెస్ విజేత ప్రజ్ఞానందకు నగదు ప్రోత్సాహం ● రూ.50 లక్షలు అందజేసిన సీఎం సాక్షి, చైన్నె: తమిళనాడు క్రీడా శాఖ తరపున గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. ఈ సందర్భంగా గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీలో తాను గెలుచుకున్న చారిత్రాత్మక విజేత ట్రోఫీని సీఎం విజయ్కు చూపించి, ఆయన అభినందనలు, ఆశీస్సులు అందుకున్నారు. క్రీడల అభివృద్ధికి తమిళనాడు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్టు, క్రీడా రంగంలో తమిళనాడును దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని ఈసందర్భంగా సీఎం విజయ్ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర అథ్లెట్లు పాల్గొని పతకాలు సాధించేలా వారికి అత్యాధునిక శిక్షణ అందించడం, విజేతలకు భారీ నగదు బహుమతులు ప్రకటించడం , క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయడం వంటి అనేక విప్లవాత్మక చర్యలను ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. ఇందులో భాగంగానే, గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందకు తమిళనాడు క్రీడాభివృద్ధి సంస్థ ప్రతిష్టాత్మక ‘ఎలైట్’ స్కాలర్షిప్ పథకం కింద ఏటా రూ.30 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు వివరించారు. నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో సరికొత్త చరిత్ర సృష్టించి ప్రతిష్టాత్మక టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ గ్రాండ్మాస్టర్గా రికార్డు నెలకొల్పిన ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. చైన్నెలోని సచివాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సీఎం సి. జోసెఫ్ విజయ్ చేతుల మీదుగా ప్రజ్ఞానందకు రూ.50 లక్షల భారీ ప్రోత్సాహక నగదు బహుమతి చెక్కును అందజేశారు. చైన్నెలో ‘హోమ్ ఆఫ్ చెస్’ అకాడమీ క్రీడలను కేవలం ఒక ఆటగా కాకుండా, సామాజిక మార్పునకు ఒక శక్తివంతమైన సాధనంగా సీఎం సి. జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఈసందర్భంగా ప్రకటించారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను సరైన దిశలో మళ్లించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా వివిరించారు. ఈ లక్ష్య సాధన కోసం చైన్నెలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ‘హోమ్ ఆఫ్ చెస్‘ పేరిట ఒక ప్రత్యేకమైన చెస్ అకాడమీని తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈ అకాడమీ ద్వారా యువ క్రీడాకారులకు క్రమబద్ధమైన శిక్షణ శిబిరాలు నిర్వహించడం, అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని కల్పించడం, మోడరన్ సాఫ్ట్వేర్ టూల్స్తో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నట్టు వివరించారు.అలాగే, ఆటగాళ్ల మానసిక దృఢత్వం, వ్యూహాత్మక ప్రణాళికలు , మేధో వికాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తక్కువ వయసులోనే క్రీడాకారులు ఇంటర్నేషనల్ మాస్టర్ , గ్రాండ్మాస్టర్ వంటి అత్యున్నత హోదాలను సాధించేలా ప్రోత్సహించడమే ఈ అకాడమీ ప్రధాన లక్ష్యంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు ప్రజాపనులు, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఆధవ్ అర్జున, క్రీడాభివృద్ధి సంస్థ సభ్య కార్యదర్శి జె. మేఘనాథ రెడ్డి, గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద తల్లిదండ్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
డీవీఏసీ డైరెక్టర్ అరుణ్పై ఫిర్యాదు
– సవుక్కు శంకర్ సంచలన వ్యాఖ్యలు సాక్షి, చైన్నె: అవినీతి నిరోధక శాఖ (డీవీఏసీ) డైరెక్టర్ అరుణ్ ఐపీఎస్ తనను హతమార్చేందుకు ముంబైకి చెందిన కిరాయి ముఠాను రంగంలోకి దించారంటూ ప్రముఖ యూట్యూబర్, సామాజిక విశ్లేషకుడు సవుక్కు శంకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం రాతపూర్వక ఫిర్యాదును అందజేశారు.అనంతరం మీడియాతో మాట్లాడిన సవుక్కు శంకర్, తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం , పోలీసు అధికారుల తీరుపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగలోకి ముంబై నుంచి కిరాయి ముఠా ప్రస్తుతం డీవీఏసీ డైరెక్టర్గా ఉన్న అరుణ్ ఐపీఎస్ తనను అంతమొందించేందుకు ముంబై నుండి కిరాయి ముఠాను రంగంలోకి దించినట్టు ఆరోపించారు.ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తనకు ఈ సమాచారం అందిందన్నారు. అందుకే వెను వెంటనే చైన్నె కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశానన్నారు. గత ఏడాది సెప్టెంబర్ కూడా అరుణ్, సెల్వనాథరత్నం వరుణ్కుమార్ ఐపీఎస్ల సాయంతో దక్షిణ తమిళనాడుకు చెందిన ఒక ముఠాను తనను చంపడానికి పురమాయించారని ఆరోపించారు. అప్పట్లో తాత్కాలిక డీజీపీ వెంకట్రామన్న్ను కలిసి ఫిర్యాదు చేసి, మీడియాకు వివరించడంతో ఆ ప్లాన్ విరమించుకున్నారన్నారు. ఇప్పుడు రెండోసారి తనను టార్గెట్ చేశారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇళ్లపై మలమూత్రాల దాడి.. పోలీసుల ఆలస్యంగా, దేశంలో ఎవరికీ జరగని అరాచకాలు తనపై జరిగాయని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటి బెడ్రూమ్, కిచెన్ భాగాల్లో మలమూత్రాలు, డ్రైనేజీ వ్యర్థాలను తెచ్చి పోశారని, ఆ సమయంలో పెట్రోలింగ్ వాహనానికి ఫోన్ చేస్తే, కీల్పాకం నుండి రావడానికి 45 నిమిషాల సమయం పట్టిందన్నారు. దానికి ట్రాఫిక్ జామ్ అన్న నెపం నెట్టారని ఆయన మండిపడ్డారు. అరుణ్ గనుక శాంతిభద్రతల విభాగంలో ఉండి ఉంటే.. తనపై 15 కేసులు పెట్టి గుండా యాక్ట్ కింద జైల్లో పెట్టించేవారని, ఇప్పుడు డీవీఏసీలో ఉండటం వలన ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కిందిస్థాయి సిబ్బంది వసూళ్ల పర్వం సీఎం దృష్టికి ఒక షాకింగ్ విషయాన్ని తీసుకెళ్తున్నానని చెప్తూ.. చైన్నె పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన మిని స్టీరియల్ స్టాఫ్ అయ్యప్పన్, యాంటీ వైస్ స్క్వాడ్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ప్రస్తుతం డీవీఏసీలో అరుణ్ వద్ద డెప్యుటేషన్పై పని చేస్తున్నారని, వీరిద్దరూ కలిసి స్టార్ హోటల్ బార్ల నుండి భారీగా మామూళ్ల వసూళ్లకు పాలడుతున్నారని ఆరోపించారు. సీఎం ఈ నియమకాలను పునఃసమీక్షించాలని కోరారు. తమిళనాడు విద్యుత్ బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన హార్డ్ డిస్క్ల మాయం గురించి స్పందిస్తూ, పేరుకే శివశంకర్ గతంలో మంత్రిగా ఉంట, తెర వెనుక నుంచి మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ వ్యవహారాలు సాగించారని, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం ఎందుకు తేలికగా తీసుకుంటుందో అర్థం కావడం లేదు.ఐఏఎస్ అధికారి రాధాకృష్ణన్ గతంలో విద్యుత్ బోర్డు ఛైర్మన్గా ఉన్నారని, ఇప్పుడూ ఆయనే కొనసాగుతున్నారని గుర్తు చేస్తూ, ఆయనను మార్చకుండా అవినీతిని ఎలా బయటపెడతారు? మొదటి అనుమానం ఆయనపైనే రావాలి అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే కు అనుకూలమైన, అవినీతికి సహకరించిన అధికారులనే ఈ ప్రభుత్వం కూడా కీలక పోస్టుల్లో ఎందుకు నియమించుకుందో.? అంటూ ఈ ప్రభుత్వంలో పై స్థాయిలో తిమింగలాలే అఽధికంగా ఉన్నాయని ఆరోపించారు. -
యాక్షన్ సన్నివేశాల్లో రైసా విల్సన్ ప్రతిభ
తమిళసినిమా: యాక్షన్ సన్నివేశాల్లో హీరోల కంటే హీరోయిన్లు చేస్తే కిక్కే వేరు. అలాంటి యాక్షన్ సన్నివేశాల్లో నటి రైసా నెల్సన్ అదరగొట్టారట. ప్యార్ ప్రేమ కాదల్ చిత్రం ఫేమ్ నటి రైసా విల్సన్ చిన్న గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం నోవా. ఇంతకు ముందు ఆది, హన్సిక జంటగా నటించిన పార్టనర్ చిత్రాన్ని నిర్మించిన రాయల్ ఫార్చ్యూనా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం నోవా. ఫేస్ ఒన్ –ది అరైవల్ అనే ఉపశీర్షికతో కూడిన ఈ చిత్రం ద్వారా మిలో అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు.ఈయన ఇంతకు ముందు 20కి పైగా వాణిజ్య ప్రకటనను రూపొందించారు. కథానాయికిగా నటి రైసా విల్సన్ నటించిన ఈ చిత్రంలో కర్ణాటకకు చెందిన అద్విక శెట్టి, బెంగాలి నటి కతిక బిశ్వాస్, మలయాళ నటుడు జో జాన్ సాక్కో,సెండ్రయన్, యూట్యూబ్ ఫేమ్ ఫైనలీ స్వాతిక తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది హారర్ సైనన్స్ ఫిక్షన్ సూపర్ నాచురల్ ఫ్యాటసీ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని నటి రైసా విల్సన్ తెలుపుతూ ఇది ఒక కథలో మరో కథ అనే విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రం అని చెప్పారు. ఇందులో నేను ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే. సన్నివేశాల ముఖ్యమైన పాత్రలో నటించినట్లు చెప్పారు. ఇలాంటి కథా చిత్రంలో తాను ఇంతకు ముందు ఎప్పుడూ నటించలేదనీ, అందుకే కథ నచ్చడంతో వెంటనే నటించడానికి సమతించినట్లు చెప్పారు.కేరళాలోని మరైయూర్ అడవుల్లో ఈ చిత్రం షూటింగ్ జరిగిందన్నారు అనుమతి లభించడమే కష్టం అయినా గంధపు చెట్ల నడుము రక్తాన్ని పీల్చే పురుగులు, అధిక మంచు, వర్షం అడవి జంతువులు వంటి భయాన్ని కలిగించే ప్రాంతంలో షూటింగ్ చేశాం అని చెప్పారు. అయితే అంత శ్రమ ఉంటుందని తాను ముందు ఊహించలేదు అన్నారు. ఇంతకు ముందు నటించిన చిత్రాలకు ఇంత కష్టపడలేదన్నారు. ఈ చిత్రంలో ఒల్లు గగుర్పాటు చెందేలాంటి పోరాట సన్నివేశాల్లో నటించినట్లు చెప్పారు. -
క్లుప్తంగా
తిరువళ్లూరు: తామరపాక్కంలో ప్రసిద్ధి చెందిన గంగమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారి ఊరేగింపు, అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమం వైభవంగా జరిగింది. తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలో ప్రసిద్ధి చెందిన గంగమ్మ జాతర ఉత్సవాలను 13 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఉత్సవాలు భక్తుల కాపుధారణతో ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా రోజూ అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. చివరి రోజైన ఆదివారం అమ్మవారి ఊరేగింపుతో అగ్నిగుండ మహోత్సవం చేపట్టారు. తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని అగూరు గ్రామంలో మే 29న ద్రౌపదీదేవి ఆలయ అగ్నిగుండ వేడుకలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి రోజూ పగటి సమయాల్లో మహాభారత ప్రవచనాలు, రాత్రి వేళల్లో వీధి నాటకం ప్రదర్శించారు. వేడుకలు సందర్భంగా భక్తులు కంకణాలు ధరించారు. ఆదివారం అగ్నిగుండ వేడుకలు సందర్భంగా భక్తులు పసుపు దుస్తులు ధరించి ఊరేగంపుగా సాయంత్రం ఆలయం వద్దకు చేరుకున్నారు. అగ్నిగుండానికి ప్రత్యేక పూజలు చేపట్టి ద్రౌపదీదేవి అగ్నిగుండం ముందు కొలువుదీరగా బాణసంచా వేడుకలు నడుమ భక్తులు గోవింద నామస్మరణతో వెయ్యిమంది కంకణాలు ధరించిన భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి తమ మొక్కులు చెల్లించారు. సాక్షి, చైన్నె: బాలల వినోద రంగంలో సరికొత్త విప్లవానికి మార్గంగా ప్రముఖ కిడ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ సోనీ వైఏవై ఒక వినూత్నమైన ప్రకటన చేసింది. ఈవిషయంగా సోమవారం స్థానికంగా ఆసంస్థ బిజినెస్ హెడ్ అంబేష్ తివారి వివరిస్తూ బుల్లితెరపై తన అల్లరితో, నవ్వులు పూయించే డైలాగులతో దశాబ్దాలుగా పిల్లలను, పెద్దలను అలరిస్తున్న ప్రముఖ కార్టూన్ క్యారెక్టర్లను అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా ద్వారా ఇకపై అభిమానులు షిన్ చాన్తో నేరుగా మాట్లాడే ఇంటరాక్టివ్ వాయిస్ అనుభవాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఈ సరికొత్త ఫీచర్ను ఉపయోగించడం చాలా సులభం. అలెక్సా సపోర్ట్ చేసే డివైజ్ లేదా స్మార్ట్ఫోన్ యాప్లో అడిగితే చాలు, షిన్ చాన్ తన ట్రేడ్మార్క్ వాయిస్తో, ఊహించని ఫన్నీ సమాధానాలతో మాట్లాడేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ అనుభూతి పిల్లలకు సరికొత్త థ్రిల్ను ఇస్తుందన్నారు. తిరువొత్తియూరు: కన్యాకుమారి జిల్లాలో ఒకే యువతిని ఇద్దరు యువకులు ప్రేమించారనే నెపంతో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. వివరాలు.. నాగర్కోవిల్కు చెందిన ఓ యువతి, అారల్వాయిమొళి ప్రాంతానికి చెందిన యువకుడు గత 6 నెలలుగా ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయమయ్యారు. ఇదే క్రమంలో తొలైయావట్టం ప్రాంతానికి చెందిన మరో యువకుడు కూడా అదే యువతిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇద్దరి మధ్య ఇన్స్ట్రాగామ్లో వాగ్వాదం మొదలైంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి వారు కరుంగల్ పోలీస్ స్టేషన్ సమీపంలో సమావేశమయ్యారు. అక్కడ ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో అక్కడ ఆపి ఉంచిన పోలీస్ ఇన్ స్పెక్టర్ వాహనంపై రాళ్లు పడటంతో దాని అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రెండు వర్గాలకు చెందిన సుమారు ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. తిరువొత్తియూరు: విల్లుపురం జిల్లా మరక్కాణంకు చెందిన యువకుడు నిషాంత్ (24). ఇతను కడలూరులో కాలేజీ చదువుతున్నప్పుడు పుదుచ్చేరి కరువడికుప్పం ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. ప్రస్తుతం ఆ యువతి ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. నిషాంత్ ఆ ఉపాధ్యాయురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో చనువుగా ఉన్నాడు. ఆ సమయంలో ఆమెకు తెలియకుండానే తన సెల్ఫోన్లో వీడియోలు తీసుకున్నట్లు సమాచారం. అయితే గత కొద్దిరోజులుగా నిషాంత్ ఆమెతో మాట్లాడటం మానేశాడు. దీని గురించి ఆమె నిలదీయగా, నిషాంత్ వేరే యువతిని ప్రేమిస్తున్నాడని తెలిసి ఆమె షాక్కు గురైంది. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా, నిషాంత్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో కోపానికి గురైన నిషాంత్, తామిద్దరూ కలిసి ఉన్నప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని ఆమెను బెదిరించాడు. దీనిపై సదరు ఉపాధ్యాయురాలు లాస్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిషాంత్ను అరెస్ట్ చేశారు. -
ప్రభుత్వ సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం ప్రాంతానికి చెందిన చెందిన 14 ఏళ్ల వయస్సు వున్న మైనర్ బాలికకు అరక్కోణం ప్రాంతానికి చెందిన కయళ్విళియన్ మధ్య గత 2024 వ సంవత్సరం నుంచి ప్రేమ వ్యవహారం సాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అప్పట్లో బాలిక గర్బం దాల్చిన క్రమంలో కయల్విళియన్ను పోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం అతడిపై గూండా చట్టాన్ని సైతం ప్రయోగించిన క్రమంలో దాదాపు ఏడాది పాటు పుళల్ జైలు శిక్షను అనుభవించి ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడు. బెయిల్పై వచ్చిన కయళ్విళియన్ మళ్లీ బాలికతో ప్రేమ వ్యవహరం నడిపినట్టు తెలుస్తోంది. దీంతో బాలిక గర్బం దాల్చిడంతో ఆమె తల్లిదండ్రులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లను ఆశ్రయించారు. పోలీసులు, సాంఘిక సంక్షేమశాఖ అధికారుల అనుమతితో తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు బాలికకు అబార్షన్ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం బాలికతో పాటు ఆమె తల్లి ఆదివారం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు. బాలికతో పాటు ఆమె తల్లి మాత్రమే లోపలికి రావాలని కోరగా, యూట్యూబర్ మధుమిత సైతం తాను ఆపరేషన్ రూమ్కు వస్తానని కోరారు. అందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ శివగామసుందరి నిరాకరించడంతో డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బందిని దుర్బుషలాడారు. అసిస్టెంట్ ప్రోఫెసర్ శివగామ సుందరి తిరువళ్లూరు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మధుమితను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలి
వేలూరు: మహిళలు స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలని కలెక్టర్ వీఎస్ లీల అన్నారు. వేలూరు కలెక్టరేట్లో ప్రజా విన్నపాల దినోత్సవం సోమవా రం జరిగింది. ఇందులో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించుకున్నారు. అదే విధంగా ప్రజలు ఇచ్చిన సమస్యలను తీసుకున్న వివిధ శాఖల ఉన్నతాధికారులు వాటిలో కొన్నింటిని అక్కడిక్కడే పరిష్కరించగా మరిన్ని వినతులపై విచారణ జరిపి న్యాయం చేస్తామని తెలిపారు. అదే విధంగా వివిధ శాఖల ద్వారా ప్రజలకు వివిద సంక్షేమ పథకాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ప్రజల నుంచి వచ్చే సమస్యలను 15 రోజుల్లో పు ఆయా శాఖల అధికారులు నేరుగా విచారణ జరి పి న్యాయం చేయాలన్నారు. అదేవిధంగా గ్రీవెన్సెల్కు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నా రు. ఇదిలా ఉండగా కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో సంక్షేమ పథకాలు అధికంగా వచ్చే అవకాశం ఉందనే ఆశతో అర్జీదారులతో కలెక్టరేట్ నిండి పోయింది. జిల్లా రెవవెన్యూ అధికారి శివసుబ్రమణియన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పళని ఆలయంలో ఆకస్మిక తనిఖీలు
సాక్షి, చైన్నె: దిండుగల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పళని అరుల్మిగు దండాయుధపాణి స్వామి ఆలయంలో తమిళనాడు హిందూ ధార్మిక దేవాదాయ శాఖ మంత్రి ఎస్. రమేష్ సోమవారం ఉదయం పర్యటించారు. ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న మౌలిక వసతులను స్వయంగా పరిశీలించిన మంత్రి, అక్కడి లోపాలపై అధికారులను నిలదీశారు. రూ.1.05 కోట్ల అభివృద్ధి పనులు పళణి పర్యటనలో భాగంగా మంత్రి రమేష్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పళని – కొడైకెనాల్ రోడ్డులో రూ.53 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ఎంట్రన్స్ ఆర్చ్ ప్రారంభించారు. పశ్చిమ రథం వీధిలో రూ.52 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఉద్యానవనంను భక్తులకు అంకితం చేశారు.ఆ తర్వాత ఆలయంలో రూ.100 కోట్ల బడ్జెట్తో జరుగుతున్న మెగా మాస్టర్ ప్లాన్ అభివృద్ది పనుల ప్రగతిని మంత్రి పరిశీలించారు. భక్తులతో ముఖాముఖి.. అధికారులపై ఆగ్రహం కొండపైకి వెళ్లే వించ్ రైలు కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తుల వద్దకు మంత్రి నేరుగా వెళ్లి మాట్లాడారు. తాగునీరు, మరుగుదొడ్ల వసతులపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు వేచి ఉండే హాల్లో అనారోగ్యంతో ఉన్న ఒక కుక్క తిరుగుతుండటం చూసి మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దానిని వెంటనే అక్కడి నుండి తరలించాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మరుగుదొడ్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని గమనించిన మంత్రి, వెంటనే అదనపు తాత్కాలిక, శాశ్వత టాయిలెట్లను నిర్మించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి ఉపయోగం లేకుండా పక్కన పెట్టిన కొత్త వించ్ రైలును ఎందుకు అందుబాటులోకి తీసుకు రాలేదని అధికారులను ప్రశ్నించారు. పళని ప్రసిద్ధ పంచామృతం తయారీ కేంద్రాన్ని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు, రోజువారీ ఉత్పత్తి, విక్రయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రొటోకాల్ వివాదం..: మంత్రి పర్యటన ప్రారంభోత్సవ కార్యక్రమాలపై స్థానిక పళని నియోజకవర్గ అన్నా డీఎంకే ఎమ్మెల్యే రవిమనోహరన్కు ఆలయ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం స్థానికంగా వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే మద్దతుదారులు మంత్రి రమేష్ను కలిసి ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి రమేష్, ఆలయ జాయింట్ కమిషనర్ను తీవ్రంగా మందలించారు. తనకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో, ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక ఎమ్మెల్యేకు కూడా అదే గౌరవం ఇవ్వాలని తేల్చి చెప్పారు. అనంతరం స్వయంగా ఎమ్మెల్యే రవిమనోహరన్ను కలిసి, జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తూ ఆయనను శాంతింపజేశారు. ఆ తర్వాత మంత్రి రోప్ కార్ ద్వారా కొండపైకి వెళ్లి మురుగన్ దర్శించుకున్నారు. -
చైన్నె బేసిన్ బ్రిడ్జ్ వద్ద ఘోర ప్రమాదం
దూసుకెళ్లిన లారీ సాక్షి, చైన్నె: చైన్నె బేసిన్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ సిగ్నల్ వద్ద సోమవారం లారీ అదుపు తప్పి బైక్లను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సిగ్నల్ వద్ద దూసుకొచ్చిన లారీ చైన్నె ప్రజల అవసరాల కోసం బియ్యం, పప్పుధాన్యాలు వంటి నిత్యావసర వస్తువులను రైల్వే వ్యాగన్ల ద్వారా వ్యాసార్పాడి గూడ్స్ షెడ్కు తరలిస్తుంటారు. అక్కడి నుండి రేషన్ బియ్యం బస్తాలను లోడ్ చేసుకుని ఓ లారీ ఆయిల్ మిల్ రోడ్ వైపు బయలుదేరింది. ఈ లారీని కోయంబత్తూరు భారతి నగర్కు చెందిన కుమార్ (46) నడిపాడు.లారీ బేసిన్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా బ్రేకులు పడలేదని సమాచారం. దీంతో పూర్తిగా అదుపు తప్పిన లారీ, అక్కడ సిగ్నల్లో వేచి ఉన్న వాహనాలపైకి వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో మద్రాసు హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ మురళీధరన్ (56), ఆవడి ప్రాంతానికి చెందిన గౌతమ్ (60) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే స్కూటర్పై వెళ్తున్న షావుకారు పేట నివాసి రాజేశ్వరి (45),వ్యాసార్పాడికి చెందిన బాలకృష్ణన్ (63) తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఇద్దరికి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. పలువురు వాహనదారులు గాయపడ్డారు. నాలుగు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. కళ్లెదుటే జరిగిన ఈ దారుణాన్ని చూసి స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రమాదానికి కారణమైన లారీపై రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. లారీ డ్రైవర్ను పట్టుకుని దేహశుద్ధి చేసేందుకు యత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జాం నెలకొంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించిన వాషర్మెన్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. -
క్లుప్తంగా
విరుగంబాక్కంలో గ్రీవెన్స్ కార్యాలయం – ప్రారంభించిన మంత్రి ఎన్. ఆనంద్ కొరుక్కుపేట: విరుగంబాక్కంలో ఎమ్మెల్యే , శాసనసభ చీఫ్ విప్ ఆర్. శబరినాథన్ నేతృత్వంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రజా ఫిర్యా దుల పరిష్కార కార్యాలయంగా ఆదివారం ఏర్పాటు చేశారు. స్థానిక విరుగం బాక్కం పరిధిలోని సాలిగ్రామంలోని అరుణాచలం రోడ్డులో ఉన్న కొత్తగా పునరుద్ధరించిన కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న టి.వి.కె. ప్రధాన కార్యదర్శి, మంత్రి ఎన్. ఆనంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఎన్. ఆనంద్కు డప్పుల మోతతో ఘన స్వాగతం లభించింది. కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్. ఆనంద, అసెంబ్లీ సభ్యుడు, విప్ ఆర్. శబరినాథన్ను అభినందించి, ఆయనను కుర్చీలో కూర్చోబెట్టారు. వేలాది మందికి భోజనం వడ్డించారు. ముఖ్యమంత్రి విజయ్ సహాయకుడు, విప్ ఆర్. శబరినాథన్ తండ్రి అయిన రాజేంద్రన్ కూడా హాజరయ్యారు. రేషన్ డీలర్ల సమ్మె సైరన్ కొరుక్కుపేట: తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రేషన్ దుకాణం కార్మికులు సమ్మెను ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ రేషన్ దుకాణం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజేంద్రన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలేష్ కుమార్ ఈమేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ సంఘర్షణలు, సహకార శాఖ ఉన్నతాధికారుల తీవ్రమైన బెదిరింపుల కారణంగా డీలర్లందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ, మనశ్శాంతిని కోల్పోతున్నార ని పేర్కొన్నారు. డీలర్ల సంక్షేమం కోసం 8 సూత్రాల డిమాండ్లను జూన్ నెలాఖరులోగా డిమాండ్లు నెరవేర్చకపోతే, జూలై 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరిస్తామన్నారు. ఉద్యోగుల మనశ్శాంతిని కాపాడేందు కు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ జోక్యం చేసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలల్లో కౌన్సెలింగ్ ప్రారంభం కొరుక్కుపేట: తమిళనాడులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ సోమ వారం ప్రారంభమైంది. ఆయా కళాశాలల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలల్లో ప్రవేశాల కోసం సుమారు 24 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారి స్కోర్ల ఆధారంగా వారిని కౌన్సెలింగ్కు ఆహ్వానించారు. సోమవారం ప్రతి కళాశాలకు వెయ్యికి పైగా విద్యార్థులు వచ్చారు. చైన్నెలో రాజధాని కాలేజ్, వ్యాసర్పాడి అంబేడ్కర్ కాలేజ్, నందనం ఆర్ట్స్ కాలేజ్, ఆర్.కె. నగర్ ఆర్ట్స్ కాలేజ్, క్వీన్ మేరీ ఉమెన్స్ కాలేజ్ సహా పలు ప్రభుత్వ కళాశాలల్లో చేరడానికి విద్యార్థు లు ఉత్సాహంగా వచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ల నాయకత్వంలో సహాయ ఆచార్యులు కౌన్సెలింగ్ నిర్వహించారు. 400 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు తొలి రోజు కౌన్సెలింగ్ చేపట్టారు. రిటైల్ రంగంలో విస్తరణలు సాక్షి, చైన్నె : ప్రముఖ స్ప్రింగ్ మ్యాట్రెస్, స్లీప్ సొల్యూషనన్స్ బ్రాండ్ పెప్స్ ఇండస్ట్రీస్, తమిళనాడులో తన రిటైల్ నెట్వర్క్ను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మణివాక్కంలో ప్రతిష్టాత్మకమైన 135వ గ్రేట్ స్లీప్ స్టోర్ను ప్రారంభించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న చైన్నె పరిసర ప్రాంతాల వినియోగదారులకు ప్రీమియం, సాంకేతిక ఆధారిత నిద్ర ఉత్పత్తులను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త ఎక్స్పీరియన్షియల్ స్టూడియోను అందుబాటులోకి తెచ్చారు. పెప్స్ ఇండస్ట్రీస్ సేల్స్ జనరల్ మేనేజర్ ఎస్. రాజేష్, స్థానిక ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వండలూర్ – వాలాజాబాద్ మెయిన్ రోడ్డులో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఈ స్టూడియో డిజైన్ చేయబడిందని , ఇక్కడ పెప్స్ బ్రాండ్కు చెందిన పూర్తి స్థాయి అన్ని ఉత్పత్తులను పరిశీలించ వచ్చు అని . పెప్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ జి. శంకర్ రామ్ తెలిపారు. తమిళనాడు అత్యంత కీలకమైన మార్కెట్ అని, ఇందులోనూ చైన్నె నగరం తమ వృద్ధికి ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. అతిగా మద్యం తాగి యువకుడి మృతి తిరువొత్తియూరు: దిండివనం సమీపంలోని పెరపేరి మారియమ్మన్ కోవిల్ వీధికి చెందిన సెల్వం కుమారుడు అజిత్ (26) కూలి పనులు చేస్తుంటాడు. అతడికి మద్యపానం అలవాటు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో, అతను విపరీతంగా మద్యం సేవించి పడిపోయాడు. స్థానికులు దిండివనం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడిని పరీక్షించిన వైద్యులు, అజిత్ ఆసుపత్రికి తీసుకువచ్చే దారిలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెల్లిమేడుపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
డిజిటల్ డేటా పెయింటింగ్లతో అద్భుత సమ్మేళనం
సాక్షి, చైన్నె: చైన్నె నగరంలోని ప్రముఖ ఆర్ట్ గ్యాలరీ ’అశ్వితాస్’లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సమకాలీన కళాకారుల ద్వయం తుక్రాల్ – తాగ్రా రూపొందించిన సరికొత్త కళాఖండాల ప్రదర్శనకు ఉంచారు. మైమెసిస్ను ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. డిజిటల్ డేటా పెయింటింగ్లతో అద్బుత సమ్మేళనంగా ఇక్కడ చిత్రాలను కొలువు దీర్చారు. ఈ అద్భుతమైన ప్రదర్శన జూలై 17వ తేది వరకు జరగనున్నది. మంగళవారం నుండి శనివారం వరకు, సాయంత్రం 4.00 గంటల నుండి రాత్రి 7.00 గంటల వరకు ముందస్తు అనుమతితో సందర్శించవచ్చు అని నిర్వాహకు లు సోమవారం ప్రకటించారు. ఆర్బోరెటమ్ నుండి మైమెసిస్ వరకు తుక్రాల్ – తాగ్రా గతంలో నిర్వహించిన ఆర్బోరెటమ్ సిరీస్ విజయవంతమైన నేపథ్యంలో, దానికి కొనసాగింపుగా ఈ ’మైమెసిస్’ రూపుదిద్దుకుంది. వృక్షాలు, మానవ స్మృతులు, సజీవ ఆర్కై వ్ల చుట్టూ సాగిన ప్రయాణం తాజాగా సేంద్రీయ పర్యావరణ వ్యవస్థల నుండి డిజిటల్ క్షేత్రాలలోకి అడుగుపెట్టింది. డిజిటల్ ప్రపంచంలో పిక్సెల్లు, బా ర్లు, విచ్ఛిన్నమైన విజువల్ యూనిట్లుగా ఎలా రూ పాంతరం చెందుతుందో ఈ ఎగ్జిబిషన్ అన్వేషిస్తుండటం విశేషం. ఊహాజనిత డేటా రూపాలతో కూడిన వందలాది పెయింటెడ్ కాన్వాస్ల ద్వారా.. వేగవంతమైన డిజిటల్ వ్యవస్థలను చిత్రలేఖనంలోని స్పర్శాత్మకమైన భౌతికత్వంతో ఎలా అనుసంధానించవచ్చో ఈ కళాఖండాలు అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాయి. -
పెళ్లిపేరుతో బాలికపై అఘాయిత్యం
● యువకుడి అరెస్ట్ తిరువొత్తియూరు: చెంగల్పట్టు సమీపంలో 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని ఆశచూపి, అపహరించి లైంగిక వేధింపులకు గురిచేసిన శక్తివేల్ (19) అనే యువకుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. బాలిక తల్లి తన భర్తకు దూరంగా ఉంటూ, తన పిల్లలతో కలిసి పడప్పై ప్రాంతంలో నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన శక్తివేల్ అనే యువకుడు ఈ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి, గతంలో ఒకసారి అపహరించాడు. అతని వద్ద నుంచి బాలికను విడిపించుకొని హెచ్చరించి అతన్ని వదిలేశారు. మళ్లీ ఇప్పుడు ఆ బాలికను తీసుకుని పరారవ్వడంతో, తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో శక్తివేల్ తన అన్న ఇంట్లో బాలికతో కలిసి దాక్కున్నట్లు తెలిసింది. పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను రక్షించి, నిందితుడు శక్తివేల్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. తిరువొత్తియూరు: చైన్నె తురైపాక్కం రేడియల్ రోడ్డులో బైక్లు ఢీకొని యువకుడు మృతి చెందారు మరో ఇద్దరు స్నేహితులకు తీవ్ర గాయాలు అయ్యాయి చైన్నె వేళచ్చేరి సమీపంలోని పెరియ కోవిలంబాక్కంకు చెందిన జగన్నాథన్ (23) పెయింటర్.ఇతను తన స్నేహితులు రమేష్ (46), అన్బళగనన్తో కలిసి మద్యం సేవించి, బైక్పై వెళ్తుండగా తురైపాక్కం 200 అడుగుల రేడియల్ రోడ్డులో ఓ ప్రైవేట్ కార్ సర్వీస్ సెంటర్ వద్ద వేగంగా వచ్చిన మరో బైక్ వీరిని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని వెంటనే తాంబరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ జగన్నాథన్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. రమేష్, అన్బళగన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్లికరణై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేలూరు: జాతీయ రహదారిలో బ్యాటరీలు తీసుకెళ్తున్న లారీ ఉన్న ఫలంగా దగ్ధం కావడంతో సుమారు గంట పాటూ ట్రాఫిక్ స్తంభించింది. వివరాలు.. చైన్నె నుంచి పూనేలోని ఓ ప్రైవేటు ఐటీ కంపెనీకి బ్యాటరీలను తీసుకెళ్తు లారీ వేలూరు జిల్లా పల్లిగొండ వద్ద జాతీయ రహదారిపై మంటల్లో చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన క్రిష్ణగిరికి చెందిన లారీ డ్రైవర్ తమిళరసన్ వెంటనే లారీని రోడ్డు పక్కన నిలిపి వేసి అక్కడ నుంచి పరుగులు తీశాడు. అప్పటికే లారీలోని బ్యాటరీలు పెద్ద శబ్దంతో పేలుతూ మంటలు చెలరగేడంతో చేసేది లేక అక్కడ నుంచి పరుగులు తీశారు. వెంటనే విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అయితే అప్పటికే లారీలోని బ్యాటరీలు పూర్తిగా దగ్ధమైంది. -
ధాన్యం కొనుగోలు చేయాలని వినతి
తిరువళ్లూరు: రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే చేపట్టాలని కోరుతూ దాదాపు 20 మంది రైతులు కలెక్టర్ కవితకు సోమవారం ఉదయం వినతి పత్రం సమర్పించా రు. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్లోని ఎరయూరు, మన్నవేడు, రాజపాళ్యం, సోమదేవన్పట్టు, ఒదపై, కొరక్కతండలం, మొయ్యూరు, రాజపాళ్యంతో పాటు పది గ్రామాలకు చెందిన దాదాపు వంద మంది రైతులు ఉన్నారు. దాదాపు 500 హెక్టారులో వరి సాగులో ఉంది. ఇక్కడి రైతులు సాగు చేసిన వరి పంటలను మన్నవేడులోని ప్రభుత్వం ఏర్పాటు చేసి వరి కొనుగోలు కేంఽద్రం ద్వారా కొనుగోలు చేయాల్సి వుంది. అయితే కొంత మంది రైతుల నుంచి మాత్రమే వరిని కొనుగోలు చేసి అధికారులు చేతులు దులుపుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 5 వేల వరి బస్తా లు వర్షంలో తడుస్తున్నా ఇంత వరకు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, అఽధికారులను కోరితే ప్రభుత్వం నిర్ధేశించి లక్ష్యం మేరకు కొనుగోలు చేశామని, ఉన్నత అధికారుల నుంచి ఉత్తర్వులు వస్తే తప్ప మళ్లీ కొనుగోలు చేయలేమని సమాధానమిస్తునన్నట్టు కలెక్టర్ కవితను కలిసి సోమవారం రైతులు వినతి పత్రం సమర్పించారు. దాదాపు నెల రోజుల నుంచి వేచివున్నా ఇంత వరకు తమ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయలేదని వాపోయారు. న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ వారికి హమీ ఇచ్చారు. -
తమిళనాడులో డీఎంకే కూటమి లేదు
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంది. రాష్ట్రంలో డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమి అధ్యాయం ముగిసిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయనో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సీఎం విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వాన్ని అటు డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్, ఇటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అనవసరంగా విమర్శించడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో విజయ్ నేతృత్వంలో సంకీర్ణ పాలన సాగుతున్న విషయం తెలిసిందే. ఈ కూటమికి సీపీఎం బయటి నుంచి మద్దతు ఇస్తూ వస్తున్నది. ఈ ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కమ్యూనిస్ట్లు, మిత్ర పక్షాల నేతలంతా డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ను కలిసి చర్చించారని, స్టాలిన్ అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నటు సమాచారాలు ఉన్నాయి. ఈ కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకేలు భాగస్వామ్యమైనప్పటికీ, సీపీఎం, సీపీఐలు మాత్రం బయట నుంచి మద్దతు ఇస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఆయా పార్టీలు డీఎంకే కూటమిని పూర్తిగా వీడినట్లు పేర్కొంటూ వస్తున్నారు. కొందరు నాయకులు తాము ఇంకా పాత కూటమిలోనే ఉన్నామని చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో డీఎంకే కూటమి ఉనికి కోల్పోయిందని షణ్ముగం తాజాగా స్పష్టం చేయడం గమనార్హం. ఈ కూటమి అన్నది ప్రస్తుతం లేదని, ఇది ముగిసిన అధ్యయం అని ఆయన వ్యాఖ్యలు చేయడంచర్చకు దారితీశాయి. -
ప్రముఖ యూట్యూబర్ మారీదాస్పై కన్నెర్ర
– మదురైలో అరెస్ట్ చేసిన చైన్నె పోలీసులు సాక్షి, చైన్నె: ప్రముఖ యూట్యూబర్ మారీదాస్ను చైన్నె సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం ఉదయం మదురైలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ స్థానికంగా , సోషల్ మీడియా వేదికల్లో తీవ్ర వ్యతిరేకత, చర్చకు దారి తీసింది. ప్రభుత్వంపై విమర్శల నేపథ్యంలో.. మదురైలోని తమిళనాడు తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు క్వార్టర్స్ సమీపంలో నివసిస్తున్న మారీదాస్, యూట్యూబ్ వేదికగా రాజకీయ విశ్లేషణలు చేస్తుంటారు. ఇటీవల తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం, అలాగే రాష్ట్ర మంత్రులపై ఆయన నిరంతరం తీవ్ర విమర్శలు చేస్తూ పలు వీడియోలను విడుదల చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై చైన్నె నగర సైబర్ క్రైమ్ పోలీసులు మారీదాస్పై కేసు నమోదు చేశారు. మదురైలో అరెస్ట్ ఈ కేసు దర్యాప్తులో భాగంగా మారీదాస్ను అరెస్ట్ చేసేందుకు చైన్నె సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందం ఉదయం మదురై చేరుకుంది. స్థానిక మదురై కె.పుదూర్ పోలీసుల సహాయంతో మారీదాస్ నివాస గృహానికి చేరుకున్న చైన్నె పోలీసులు, అకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించి మారీదాస్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు మారీదాస్ను తదుపరి విచారణ నిమిత్తం మదురై నుండి చైన్నెకి తీసుకొస్తున్నారు.అ యితే, ఈ అరెస్టును సర్వత్రా తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో యూ ట్యూబర్లకు, డిజిటల్ మీడియాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన సీఎం విజయ్ సారూ..ఇదేనా మార్పు అంటూ సామాజిక మాధ్యమాలలో ప్రశ్నించే వాళ్లు పెరిగారు. వాక్ స్వాతంత్య్ర గురించి గతంలో వీరావేశంగా వ్యాఖ్యలు చేసిన తమరే ఓ యూ ట్యూబర్ గళాన్ని అరెస్టుతో నొక్కేయడం భావ్యమా అని ప్రశ్నిస్తున్నారు. ఇక, ఈ అరెస్టును నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్, బీజేపీ మహిళా నేత తమిళసై సౌందరరాజన్ తదితరులు తీవ్రంగా ఖండించారు. -
ఎస్పీబీకి భారత రత్న ఇవ్వాలి
కొరుక్కుపేట: గాన గాంధర్వుడు, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాల నుబ్రహ్మణ్యానికి భారతరత్న ఇవ్వాలని డాక్టర్ ఎస్పీబీ కల్చరల్ ట్రస్ట్ –చైన్నె, డాక్టర్ ఎస్.పి బి కల్చరల్ కాన్సెర్ట్ తరపున కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఆ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కేఎం కొండయ్య తెలిపారు. ఈ మేరకు డాక్టర్ ఎస్పీబీ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్ పి బాల సుబ్రమణ్యం 80వ జయంతిని ఆదివారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. దీనికి చైన్నె అరుంబాక్కంలోని పిల్లయార్ కోయిల్ వీదిలో ఉన్న సౌండ్ ప్రో డబ్బింగ్ స్టూడియో వేదికై ంది. ముఖ్యఅతిధిగా ప్రముఖ గాయకులు, ఎస్పీబీ సన్నిహితులు తులసీధరన్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఎస్పీబి తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యాంతం అయ్యారు. బాలుకు ఇష్టమైన పాటలను ఆలపించి తులసీ ధరన్ ఆకట్టుకున్నారు. ఎస్పీబీ జయంతి సందర్భంగా గాయనీ గాయకులకు, ట్రస్ట్ కు సహకరిస్తున్న దాతలకు ఎస్పీబీ అవార్డులను అందజేశారు. అలాగే ప్లస్ టూ పబ్లిక్ పరీక్షల్లో 500లకు 493 మార్కులు సాధించిన కమలేష్ అనే విద్యార్థిని ఘనంగా సత్కరించి పతకాన్ని, నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సందర్భంగా కెఎం కొండయ్య మాట్లాడుతూ చైన్నె బీచ్ నుంచి తామరైపాక్కంలో ఉన్న ఎస్పీబీ సమాధి వద్దకు ప్రత్యేక బస్సును వేయాలని కోరారు. ఇందులో ట్రస్ట్ ట్రెజరర్ కె.బాలాజీ రావు, డాక్టర్ ఎస్పీబీ కల్చరల్ కాన్సెర్ట్ ప్యాట్రన్ కె సౌందరరాజన్తోపాటూ ఎస్ఎన్ దురై, రమేష్, కృష్ణ వేణి, విజయ బాలు,, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రీమియం లూబ్రికేషన్లో కొత్త ప్రమాణాలు
హైపర్ సిరీస్ విడుదల సేలం: ఇండియన్ ఆయిల్ సోమవారం తన అత్యంత అధునాతన ప్రీమియం లూబ్రికెంట్ ఉత్పత్తి శ్రేణి అయిన సెర్వో హైపర్ సిరీస్ను ప్రారంభించింది. ఈ కొత్త ఉత్పత్తి ఆధునిక ఇంజన్లు, అభివృద్ధి చెందుతున్న అధిక పని తీరు గల పారిశ్రామిక పరికరాల అవసరాలను తీర్చడానికి రూపొందించారు. అధునాతన సింథటిక్ ఆధారిత నూనెలు, నెక్ట్స్ జనరేషన్ యాడిటివ్ టెక్నాలజీలను ఉపయోగించి అభివృద్ధి చేయబడిన సెర్వో హైపర్ సిరీస్, కఠినమైన ఆపరేటింగ్ వాతావరణాలలో కూడా ఉన్నతమైన ఇంజిన్ పనితీరును, మెరుగైన ఇంధన పొదుపును మరియు సుదీర్ఘ సేవా జీవితాన్ని అందిస్తుంది. దీనిపై వ్యాఖ్యానిస్తూ, ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ డైరెక్టర్ సౌమిత్ర పి. శ్రీవాస్తవ ఇలా అన్నారు: పరిశ్రమ భవిష్యత్తును మూడు స్తంభాలు తీర్చిదిద్దుతాయి. సాంకేతికత, పనితీరు, విశ్వాసం. సెర్వో హైపర్ సిరీస్ ఈ మూడింటినీ కలిగి ఉందని శ్రీవాస్తవ అన్నారు. -
సత్య శోధనపై చర్చించే ‘ప్రామిస్’
తమిళసినిమా: నా జీవితమే ఒక సత్య శోధన. సత్యాన్ని పరిశోధించబడిన విధానాన్ని తెలుసుకోవాలంటే నా సత్య శోధన అనే జీవిత చరిత్రను చదవండి అని మహాత్మా గాంధీ చెప్పారు. ఆయన రాసిన సత్య శోధన జీవిత చరిత్ర చదివిన తరువాత ఆయన జీవితంలో సత్యం, నిజం,సాయం వంటివి విషయాల గురించి తెలుసుకోవచ్చు. గాంధీజీకి మార్గదర్శిగా సత్యహరిచంద్రుడు సత్యం కోసం చేసిన పోరాటం కథ అని చెప్పవచ్చు. ఇలా సత్యం అనేది మన పారంపర్యం, సంస్కృతి సాంప్రదాయాల నుంచి వస్తోంది.అలాంటి సత్యం జీవితంలో ఆడే ఆటను తెరపై ఆవిష్కరించే కథా చిత్రం ప్రామిస్ అని.. దర్శక, కథానాయకుడు అరుణ్ కుమార్ శేకర్ చెప్పారు. నటి నదియా సోము నాయకుడిగా నటించిన ఇందులో సుజన్, అమ్రీష్, ప్రతాప్, గోకుల్, సుందరవేల్,రాజ్ కుమార్,కలైవాణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్.నాగరాజ్ సమర్పణలో సంఘమిత్రన్ ప్రొడక్షన్స్,అమ్మన్ ఆర్ట్స్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో సత్య శోధన పరిస్థితులను ఎదుర్కొంటాడు. అలా ఈ చిత్రంలో కథానాయకుడు ఎదుర్కొనే సత్య శోధన సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించిన చిత్రం ప్రామిస్. ఇటీవల చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ దర్శకుడు చేరన్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా చిత్ర ట్రైలర్ ఏబీ ఇంటర్నేషనల్ ఛానల్ లో విడుదలై ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రామిస్ చిత్రాన్ని ఈ నెల 26వ తేదీన యాక్షన్ రీ యాక్షన్ సంస్థ అధినేత జెనీశ్ విడుదల చేస్తున్నారు అని.. దర్శకుడు చెప్పారు. కాగా ఈ చిత్రానికి వినోద్ కుమార్ ఛాయాగ్రహణం, సర్వాణి దీపన్ సంగీతాన్ని అందించారు. నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో కొత్త చిత్రంతమిళసినిమా: దక్షిణాది నటీమణుల్లో నటి నిత్యామీనన్ ప్రత్యేకమనే చెప్పాలి. చాలా ముక్కుసూటి మనిషి. మనసులో అనిపించింది చెప్పే భామ. పాత్రల్లో జీవించే నటీమణి. కాస్త బొద్దుగా ఉన్నా, దాన్నే అలంకారంగా భావించే బ్యూటీ. కథా పాత్రలు నచ్చితేనే నటించడానికి అంగీకరించే నటి. విమర్శలను అస్సలు పట్టించుకోని సంచలన నటి. సెలెక్టీవ్ చేసే నిత్యామీనన్ ఇటీవల తమిళంలో నటించిన తలైవన్ తలైవి చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత మరో చిత్రం కమిట్ కానీ ఈమెను తాజాగా ఒక కథ తెగ నచ్చేసిందట. దీంతో ఆ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపేసినట్లు తాజా సమాచారం. అవును ఇంతకు ముందు యామిరుక్క భయమే, కాట్టేరి, కవల్ వేండామ్ వంటి చిత్రాలను తెరకెక్కించిన డీకే తాజాగా తన కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉమెన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటి నిత్యామీనన్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈమెకు దర్శకుడు కథ చెప్పగానే తెగ నచ్చేసిందనీ దీంతో ఆమె వెంటనే నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో నటించడానికి చిన్న మొత్తాన్నే అడ్వాన్స్గా తీసుకున్నారని, మిగిలింది చిత్రానికి వచ్చే లాభాల్లో షేర్ను తీసుకోవడానికి నిత్యామీనన్ అంగీకరించినట్లు సమాచారం. చాలాకాలంగా నిర్మాతలు కోరుకుంటోంది ఇదే కావడంతో.. ఈ విషయంలో పలువురికి నిత్య మీనన్ మార్గదర్శిగా నిలుస్తారని చెప్పవచ్చు. కాగా ఈమె నటించనున్న తాజా చిత్రానికి సంబంధించి న పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా, వెల్లడించే అయ్యే అవకాశం ఉంది. -
30 ఏళ్ల పోరాటానికి ఫలితం
తమిళసినిమా: కొంచెం ఆలస్యం అవుతుందేమో గాని న్యాయం ఎప్పుడూ ఓడిపోలేదు. గెలిచే తీరుతుంది. ఇదే నటి సుకన్య విషయంలోనూ జరిగింది. పుదు నెల్లు పుదు నాత్తు చిత్రం ద్వారా 1991లో కథానాయకిగా పరిచయం అయిన నటి సుకన్య. ఆ తరువాత చిన్నకౌండర్, ఇండియన్, వాల్టర్ వెట్రివేల్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రముఖ కథానాయికిగా రాణించిన ఈమె 2002లో శ్రీధర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. అయితే కొద్ది కాలానికే మనస్పర్ధలు కారణంగా భర్త నుంచి విడిపోయి వివాహ రద్దు పొందారు. కాగా ఈమె గంధపు చెక్కల స్మగ్లర్ల్ వీరప్పన్ ఒక భేటీలో చెప్పినట్లుగా జరిగిన వ్యవహారంపై ఓ ప్రైవేటు ఛానల్ చర్చా వేదికలో తన గురించి జరిగిన అసత్య ప్రచారంపై చైన్నె హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్ 30 ఏళ్ల తర్వాత సుకన్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పూర్వ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కొడుకుకు నటి సుకన్యకు అక్రమ సంబంధం ఉందని వీరప్పన్ ఒక భేటీలో పేర్కొంటున్నారు. అయితే అందులో నిజం లేదని, అది పూర్తిగా అసత్య ఆరోపణ అనీ నటి సుకన్య 1996లో చైన్నె హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆ ప్రైవేట్ ఛానల్ లో ప్రచారం చేసిన అంశాలు తన పేరుకు కళంకం వచ్చేలా ఉన్నాయ ని పిటిషన్లో పేర్కొన్నారు. ఆమె పిటీషన్ పై పలు మార్లు విచారణ జరిపిన న్యాయస్థానం 2015లో సుకన్యకు అనుకూలంగా తీర్పు ఇస్తూ ఆమెకు నష్ట పరిహారంగా రూ. 10 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ సంబంధిత ప్రైవేట్ ఛానల్ నిర్వాహకులు చైన్నె హైకోర్టు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సోమవారం విచారించిన చైన్నె హైకోర్టు ప్రైవేట్ ఛానల్ పిటిషన్ను కొట్టి వేసి ఇంతకు ముందు కింది కోర్టు ఇచ్చిన తీర్పును ధృఢపరిచింది. క్రింది తీర్పు ప్రకారం నటి సుకన్య కు నష్ట పరిహారంగా రూ. 10 లక్షలు వెంటనే చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. -
వక్ఫ్ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తే లేదు
– మంత్రి షాజహాన్ సాక్షి, చైన్నె : తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన వక్ఫ్ సవరణ చట్టాన్ని ఇప్పటివరకు అమలు చేయలేదని, భవిష్యత్తులో కూడా అమలు చేయబోమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి షాజహాన్ స్పష్టం చేశారు. ఈ అంశంపై తదుపరి చర్యల కోసం చట్టపరమైన నిపుణులతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. తమిళనాడు నుంచి సౌదీ అరేబియాలో మక్కా ,మదీనా నగరాలకు బక్రీద్ పండుగ సందర్భఃగా హజ్ యాత్రకు వెళ్లిన బృందాలు తిరుగు పయనం అయ్యాయి. ఈ యాత్రను ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన యాత్రికులకు చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రభుత్వం తరపున సోమవారం ఉదయం ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి షాజహాన్ మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ సవరణ చట్టంపై అసెంబ్లీలో తీర్మానం మంత్రి షాజహాన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ కొత్త వక్ఫ్ చట్టం అమలు కాలేదని గుర్తుచేశారు. తమిళనాడు ప్రభుత్వం ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలిపారు.‘తమిళనాడులో వక్ఫ్ సవరణ చట్టాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయనివ్వమని, ఈ సవరణ చట్టంలో ఉన్న పలు వివాదాస్పద నిబంధనలను (షరతులను) తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దీనికి వ్యతిరేకంగా తమిళనాడు శాసనసభలో ప్రత్యేక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి ఆమోదిస్తామన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ ‘ఉమిద్’ పోర్టల్లో వక్ఫ్ ఆస్తుల వివరాలను నమోదు చేయడంలో అనేక సాంకేతిక సవాళ్లు ఎదురవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అధికారులు తమ శాయశక్తులా వివరాలను అప్లోడ్ చేశారని, ఇంకా నమోదుకాని ఆస్తుల వివరాలను కూడా త్వరలోనే క్రమబద్ధంగా నమోదు చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
ఇదేం జెలసీ లోకేశ్?
చారాణ కోడికి.. బారాణా మసాలా!. కానీ, ఏపీలో ఏ కోడి కోయకుండానే చంద్రబాబు సర్కార్ మసాలా నూరుతోంది. లేని అభివృద్ధిని ఉన్నట్లుగా చూపించేందుకు డిజిటల్ ప్రమోషన్ల పేరిట కోట్లు కుమ్మరిస్తోంది. అదే సమయంలో పొరుగు రాష్ట్రంలో యువ ఐటీ మంత్రి.. అందునా ఫస్ట్ టైం మహిళా ఎమ్మెల్యే.. అతితక్కువ ఖర్చుతో పెట్టుబడుల్ని ఆకర్షించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తేడా సహజంగానే రాజకీయ వర్గాల్లో పెద్ద డిబేట్కు దారితీసింది..విజయ్ కేబినెట్లో పరిశ్రమల మంత్రిగా ఉన్న ఎస్. కీర్తన ప్రస్తుతం సోషల్ మీడియా స్టైల్ పాలనతో హాట్ టాపిక్గా మారారు. మొన్నటి ఎన్నికల్లో శివకాశిలో నెగ్గిన ఆమె.. కొన్నిచోట్ల తెలుగులో ప్రచారం చేసి అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు పాలనలోనూ అదే జెన్జీ మార్క్ చూపిస్తూ రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలకు నేరుగా డిజిటల్గా రిక్వెస్టులు పంపడం, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్ వాడటం వంటివి తమిళనాడులో కొత్త చర్చకు దారి తీశాయి.దీంతో సహజంగానే కొంతమంది కంపెనీల దృష్టి తమిళనాడు వైపు మళ్లుతోందన్న ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కీర్తనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ “రీల్స్ మంత్రిగా పాలన సాగుతోంది” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఈ విమర్శలపై ఆమె మాత్రం “అంత తొందరెందుకు?.. వెయిట్ అండ్ సీ ఫర్ రిజల్ట్” అంటూ స్పందిస్తూ తన దారి తాను కొనసాగిస్తున్నారు.ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అక్కడి రాజకీయాల్లో వేలు పెట్టడం.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ మొత్తం వివాదానికి మరింత వేడి పెంచాయి. పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టాలని కీర్తనకు ఇచ్చిన సూచన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీసింది. ఒకవైపు ఇది సాధారణ సలహాగా కనిపించినా.. మరోవైపు ఈ వ్యాఖ్యల తర్వాత తమిళనాడులో ప్రతిపక్షాలు ఆ అంశాన్ని పట్టుకుని కీర్తనపై విమర్శలు మరింత తీవ్రతరం చేసినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇక ఈ మొత్తం వ్యవహారం వెనుక మరో కోణం కూడా చర్చలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా మారకముందు కీర్తన పొలిటికల్ కన్సల్టెంట్గా పలు రాష్ట్రాల ఎన్నికలకు పని చేసిన అనుభవం ఉంది. ఇందులో భాగంగా టీడీపీ సోషల్ మీడియా విభాగంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారని వినికిడి. విశేషం ఏంటంటే.. ఆ సమయంలోనే ఆమె తెలుగు నేర్చుకోవడంతో పాటు డిజిటల్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్లపై మంచి పట్టు సాధించారట. అయితే వేగంగా పెంచుకుంటున్న డిజిటల్ ఇమేజ్, యువతలో కీర్తనకు లభిస్తున్న ఫాలోయింగ్ వంటి అంశాలు కొందరు రాజకీయ వర్గాల్లో కంటగింపుగా మారుతున్నాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యమే లోకేష్ ఎంట్రీకి కారణమైందని చర్చ నడుస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలో కీర్తన చేస్తున్న కొత్త తరహా ప్రయోగాలు.. ఏపీలోని సంప్రదాయ ప్రమోషన్ మోడల్ను ప్రశ్నిస్తున్నాయన్న భావన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంతోనే ‘మీ రాష్ట్రం సంగతి మీరు చూస్కోవచ్చు కదా!’ అంటూ కొందరు తమిళులు లోకేశ్ను నిలదీస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్తో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒకవైపు కీర్తన ప్రయత్నం చేస్తుంటే.. ప్రజాధనాన్ని అభివృద్ధి కంటే ఇమేజ్ బిల్డింగ్కు అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది కూటమి ప్రభుత్వం. కీర్తన నేపథ్యానికి తోడు.. వాడుతున్న డిజిటల్ కమ్యూనికేషన్ స్టైల్, యువతలో ఆమెకు పెరుగుతున్న ఫాలోయింగ్ కూడా లోకేష్ వర్గానికి అసౌకర్యంగా మారిందన్న చర్చ ఉంది. దీంతో ఈ మొత్తం వ్యవహారం పాలసీ డిబేట్ కంటే వ్యక్తిగత రాజకీయ ఈర్ష్యగా మారిందన్న వ్యాఖ్యలు గట్టిగా వినిపిస్తున్నాయి. వెరసి ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు ‘జెలసీ పాలిటిక్స్’ చర్చగా మారింది. -
‘తమ్ముడూ విజయ్.. ప్రాణం ఒక్కసారే పోతుంది!’
సాక్షి, చైన్నై: తమిళనాడు సీఎం విజయ్పై అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.బి. ఉదయకుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి రాకముందు కూటమి కోసం ఎంతగానో మొత్తుకున్నారని, అప్పుడు ఒక చిన్న లెటర్ ప్యాడ్ పార్టీ గానీ, తమర్ని నమ్మి రాలేదరన్నారు. అయితే, ఇప్పుడు ఏదో మాయాజాలం జరిగి అధికారం దక్కేసరికి.. ఆ పవర్ను చూసి అందరూ తమరి వెనుక పరిగెత్తుకుంటూ వస్తున్నారని విజయ్ను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. మదురై తెప్పకుళం మరియమ్మన్ ఆలయ కుంభాభిషేకం సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఉదయకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ వీడుతున్న అన్నాడీఎంకే నేతలపై, సీఎం విజయ్ రాజకీయ వ్యూహాలపై ఘాటుగా స్పందించారు. అన్నాడీఎంకే చావలేదు.. మళ్లీ పుంజుకుంటుందిపారీ్టలో కొన్ని విభేదాల వల్ల నేతలు శత్రువుల వైపు వెళ్తున్నారని, గతంలో ఎంజీఆర్, జయలలిత హయాంలోనూ నెడుంచెజియన్, ఎస్టీఎస్ వంటి పెద్ద నేతలు పార్టీని వీడి మళ్లీ తిరిగి వచ్చారని ఉదయకుమార్ గుర్తుచేశారు. సొంత పార్టీ విలువ తెలియక కొందరు ప్రేమ, ఆదరణ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్తుండటం బాధాకరమన్నారు. కొందరు చిల్లర గాళ్లు తమను చూసి నవ్వుతున్నారని, తాము కేవలం ఎన్నికల్లో ఓడిపోయామే కానీ, చచ్చిపోలేదన్నారు. అన్నాడీఎంకే ఎన్నో శోధనలు, వేదనలను తట్టుకుని నిలబడిన పార్టీ అని, కోట్ల మంది కార్యకర్తలే ఈ పార్టీకి బలమైన పునాదిగా పేర్కొన్నారు. విజయ్లు ఎంతమంది వచ్చినా తాము చూస్తాం్ఙ అని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ ఏదేని జరిగిన పక్షంలో అందుకు అన్నాడీఎంకేమాత్రం బాథ్యులు కాదన్నారు. విజయ్ తమ్ముడూ.. నీకు హెచ్చరిక ముఖ్యమంత్రి విజయ్ను ‘తమ్ముడు’ అని సంబోధిస్తూ ఉదయకుమార్ కీలక హెచ్చరికలు చేశారు ‘విజయ్ తమ్ముడూ.. ప్రాణం ఒక్కసారే పోతుంది. నీకు హెచ్చరికగా, ప్రేమతో చెబుతున్నాను. జీవితం అనేది ఒకవృత్తం, పైన ఉన్నది కిందకు రావడం ప్రకృతి నియమం. కష్టపడి నమ్ముకున్న వాళ్లతో పార్టీ నడిపితే ఫలితం ఉంటుంది కానీ, దొరికిన వాళ్లనల్లా చేర్చుకుని పార్టీ నడిపితే లాభం లేదు. భవిష్యత్తులో నీకు ఏమైనా జరిగితే దానికి అన్నాడీఎంకే బాధ్యత వహించదు’ అని స్పష్టంచేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఎందుకు? ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి నిర్మల్ కుమార్ గతంలో ఏఎంఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే.. ఇప్పుడు టీవీకేలో చేరారని గుర్తుచేస్తూ, రేపు అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందని తెలిస్తే మళ్లీ ఆయన జంప్ జిలానీ తథ్యమన్నారు. అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలను విజయ్ కలిసి శాలువాలు కప్పడం.. ఆయన తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలో 65 శాతం మంది ప్రజలు విజయ్ వద్దు అని ఓటేశారని ,ఈ విషయం అర్థమైతే ఆయన ఇలా ఆపరేషన్ ఆకర్ష్ పనులు చేయరని ఎద్దేవా చేశారు. లెక్కలు తెలియక కొందరు చేతికూలీలను పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. ఆ మంత్రికి పిచ్చి పట్టింది తమ పారీ్టలో 50 శాతం మందిని లాగేసుకున్నామని టీవీకే మంత్రి ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలపై ఉదయకుమార్ మండిపడ్డారు. ఆధవ్ అర్జున అనే ఆ పిచ్చి మంత్రికి నిజంగానే మైండ్ పాడైందా అనిపిస్తుందన్నారు. ఇలాంటి సగం తెలివితేటల ముఖాలను తీసుకెళ్లి కేబినెట్లో కూర్చోబెట్టారని, ఇలాంటి వాళ్లను చూడాల్సి రావడం మన దురదృష్టం అంటూæ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీజేపీని ఎదుర్కొనే ధైర్యం విజయ్కు లేదా?
తమిళనాడు రాజకీయాల్లో రాజ్యసభ సీటు సరికొత్త హీటు పుట్టిస్తోంది. పార్టీ పుట్టి, అధికారంలోకి వచ్చాక తమ తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్కు కేటాయించింది విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే పార్టీ. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్ష డీఎంకే ఘాటు విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారం వెనుక కృతజ్ఞత కాదని.. రాజకీయ లెక్కలు ఉన్నాయని అంటోంది. ఆ విమర్శలు ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి.తమిళగ వెట్రి కళగం (TVK) తన తొలి రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్కు కేటాయించడంపై అధికార డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి విజయ్ ఉద్దేశపూర్వకంగానే తన పార్టీ నేతలను రాజ్యసభకు పంపకుండా కాంగ్రెస్కు సీటు ఇచ్చారని ఆరోపించింది. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే ఈ పని చేశారని ఎద్దేవా చేసింది. డీఎంకే అధికార ప్రతినిధి శ్రవణన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "రాజ్యసభకు వెళ్తే ప్రతి జాతీయ అంశంపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా నేరుగా పోరాడాల్సి ఉంటుంది. అందుకే టీవీకే నుంచి ఎవరినీ రాజ్యసభకు పంపలేదు" అని విమర్శించారు. విజయ్ బీజేపీపై తన అసలు రాజకీయ వైఖరిని బయటపెట్టేందుకు సిద్ధంగా లేరని.. పార్లమెంట్ వేదికపై బీజేపీని నేరుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని భావించే ఆ బాధ్యతను కాంగ్రెస్పైకి నెట్టేశారని డీఎంకే ఆరోపిస్తోంది.If you go to Rajya Sabha you’ll have to take a stand on every issue. More importantly you have to oppose BJP directly. That’s the only reason no member from TVK was sent to Rajya Sabha. Let’s not forget that Mr. Vijay did not even meet the Congress leaders, Mrs. Sonia Gandhi,… pic.twitter.com/qZZnS7jGAM— Saravanan Annadurai (@saravofcl) June 3, 2026ఇదిలా ఉండగా.. తన తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్కు కేటాయించడం ద్వారా రెండు పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరింత బలపరిచినట్లు టీవీకే చెబుతోంది. మరీ ముఖ్యంగా ఇరు పార్టీల సంబంధాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ ఏర్పాటు దిశగా జరిగిన మంతనాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడినే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే డీఎంకే ఈ నిర్ణయాన్ని రాజకీయ వ్యూహంగా కాకుండా.. విజయ్ రాజకీయ సంకోచంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో తాము ముందుంటే, టీవీకే మాత్రం స్పష్టమైన వైఖరి వెల్లడించకుండా ముందుకెళ్తోందని డీఎంకే వాదిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో అసలు చర్చ రాజ్యసభ సీటు గురించి కాదు.. విజయ్ నిజంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు కట్టుబడి ఉన్నారా? లేదంటే రాజకీయంగా తటస్థంగా ఉండాలనుకుంటున్నారా? అన్నదే డీఎంకే లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు ఇచ్చిన ఒక రాజ్యసభ సీటు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద సిద్ధాంతపరమైన చర్చకు దారి తీసింది. డీఎంకే విమర్శలకు టీవీకే ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ 7.50 కోట్ల మోసం
తిరువొత్తియూరు: తిరుపూర్లో డిజిటల్ అరెస్ట్ పేరుతో పదవీ విరమణ చేసిన మహిళా ప్రొఫెసర్ను నమ్మించి రూ.7.50 కోట్ల రూపాయలు మోసం చేసిన ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాలు.. తిరుపూర్ ఊత్తుక్కుళి రోడ్డుకు చెందిన 65 ఏళ్ల మహిళ, ఓ ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆమె సెల్ ఫోన్ నంబర్కు ఇటీవల ఓ కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి తాను ఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ పోలీసని పరిచయం చేసుకున్నాడు. ఆమె ఆధార్ నంబర్ను ఉపయోగించి అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు, అందుకే ఆమెను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు భయపెట్టారు. తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండాలంటే, తాము సూచించిన బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపాలని చెప్పారు. దీనిని నమ్మిన ఆ మహిళ వారి ఖాతాకు రూ. 7.50 కోట్లు బదిలీ చేసింది. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం తిరువొత్తియూరు: తిరుచ్చిలోని పాలక్కరై ప్రాంతంలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో పోలీసులు ఏడుగురు బాలురు సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులు విడిపోవడంతో బాలిక బంధువుల ఇంట్లో ఉంటోంది. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. అరెస్ట్ అయిన ఏడుగురు మైనర్లను అబ్జర్వేషన్ హోమ్కు, మిగిలిన ఇద్దరు మోహన్ రాజ్ (19), కిషోర్ (20)ను జైలుకు తరలించారు. తిరుచ్చి తూర్పు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. తిరువళ్లూరు: బస్టాండుతోపాటు జనసంచారం రద్దీగా వున్న ప్రాంతంలో శనివారం రాత్రి ఎస్పీ వివేకానందశుక్లా, డీఎస్పీ కార్తికేయన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ వివేకానందశుక్లా ఆకస్మిక తనిఖీల పేరిట రాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగానే ఇప్పటికే పెద్దకుప్పంతో పాటు ఇతర ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. బస్టాండులో ప్రయాణికుల వద్ద వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో ఎమైనా ఇబ్బందులు వస్తున్నాయా, మద్యం మత్తులో యువకుల వేధింపులపై ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బంది వస్తే 24 గంటల్లో ఎప్పుడైనా ఫోన్ చేసి తమకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. పోలీసులు సైతం వేగంగా స్పందిస్తారని హామీ ఇచ్చారు. డీఎస్పీ కార్తికేయన్, సీఐలు విజయకుమార్, దామోదరన్ పాల్గొన్నారు. -
3 నెలలైనా నిలబడతారా?
సాక్షి,చైన్నె: టీవీకే ప్రభుత్వ పాలనపై స్టాలిన్ మరో సారి మండిపడ్డారు. వారిది తుమ్మితే ఊడిపోయే మక్కులాంటి ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. ఇక డీఎంకేను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాధ్యత, కష్టం, పని చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో పార్టీ కోసం కష్టపడేందుకు సిద్ధంగా ఉన్న పనయూర్ బాబును, ఆయన అనుచరులను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల ముందే మాట్లాడాల్సి వచ్చింది: రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి పాలన సాగుతోందో ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యలు చేశారు. దీని గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన సమయంలోనే తాను ఒక మాట చెప్పానని గుర్తు చేశారు. తొలి ఆరు నెలల వరకు తాను ఈ ప్రభుత్వం గురించి ఏమీ మాట్లాడనని పేర్కొన్నట్టు గుర్తు చేస్తూ , అయితే, ఆరు నెలలు తిరగక ముందే దీనిపై మాట్లాడాల్సిన దుస్థితి, భయాందోళనలు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. మూడు నెలల ముచ్చటేనా?: ప్రస్తుత ప్రభుత్వంపై నలుమూలల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆరు నెలలు, ఐదు నెలలు లేదా నాలుగు నెలలు కాదు... కనీసం ఒక 3 నెలలైనా ఈ ప్రభుత్వం తట్టుకుని నిలబడుతుందా? అనే అనుమానంతోనే ప్రస్తుతం ఇక్కడ పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇటువంటి అస్థిరమైన పరిస్థితుల్లోనే, వీరంతా డీఎంకే సిద్ధాంతాలను నమ్మి పార్టీ బలోపేతం కోసం తరలివచ్చారని, పార్టీ చేపట్టబోయే ప్రతి ప్రజాపోరాటంలోనూ నూతన కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. వీసీకేకు షాక్ ఇది వరకు డీఎంకే కూటమిలో ఉన్న వీసీకే నేత తిరుమావలవన్ నమ్మిన బంటులలో ఒకరైన పనయూరు బాబు తాజాగా డీఎంకేలో చేరారు. పనయూర్ బాబు గతంలో చేయ్యూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. డీఎంకేలో చేరడానికి ముందు ఆయన వీసీకే పార్టీలో రాష్ట్ర మీడియా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతల్లో కొనసాగారు. ఇప్పుడు ఆయన తన అనుచరులతో కలిసి డీఎంకే గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అన్నా అరివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎంకే కోశాధికారి టి.ఆర్. బాలు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి కరుణానిధి, శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, పార్టీ ఉన్నత స్థాయి కార్యాచరణ కమిటీ సభ్యుడు ఎ.వి. వేలు, కాంచీపురం సౌత్ జిల్లా కార్యదర్శి సుందర్, చైన్నె సౌత్ జిల్లా కార్యదర్శి ఎం. సుబ్రమణియన్ మాజీ ఎమ్మెల్యే అరవింద్ రమేష్ తదితరులు ఉన్నారు. తమిళనాడులో ప్రస్తుత పాలన తీరుపై డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం కనీసం మూడు నెలలైనా తట్టుకుని నిలబడుతుందా..? అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యలు చేశారు. వీసీకేలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పనయూర్ బాబు ఆదివారం డీఎంకేలో చేరారు. చైన్నెలోని అన్నా అరివాలయంలో పనయూరు బాబు తన అనుచరులు వెయ్యి మందితో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, తమిళనాడు ప్రస్తుత రాజకీయ, ప్రభుత్వ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. -
ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో కొత్త విధానం
సాక్షి, చైన్నె: తమిళనాడు రిజిస్ట్రేషన్ శాఖ ప్రజల సౌకర్యార్థం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లకుండానే ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా ఆన్లైన్ ద్వారా పత్రాల రిజిస్ట్రేషన్ చేసుకునే ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానాన్ని త్వరలోనే విధిగా అమలు చేయనున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ సీఎం విజయ్ ఆదేశాలుతో ప్రకటించింది. ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేయడానికి, అవినీతికి తావులేకుండా చేయడానికి ఈ డిజిటల్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రజలు ఏడాదిలో 365 రోజులు, 24 గంటల పాటు ఎక్కడి నుండైనా తమ పత్రాలను వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. పత్రాల పరిశీలన పూర్తి చేసి సబ్రిజిస్ట్రార్ ఆమోదం తెలపగానే, ఆయన డిజిటల్ సంతకంతో కూడిన అసలు పత్రం నేరుగా లబ్ధిదారుడి అకౌంట్ లాగిన్లోకి లేదా వారి మొబైల్ వాట్సాప్ నంబర్కు పంపుతారు. దాన్ని వారు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫీసుకు వెళ్లకుండానే రిజిస్ట్రేషన్ అయ్యే పత్రాలు తొలిదశలో పత్రాల రిజిస్ట్రేషన్కు కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని ప్రకటించారు. తమిళనాడు హౌసింగ్ బోర్డు విక్రయ పత్రాలు,బ్యాంకుల నుండి పొందే రుణాల తాలూకు మార్టిగేజ్, రశీదు పత్రాలు. సజావుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి ప్రజలు, నిర్మాణ సంస్థలు, డాక్యుమెంట్ రైటర్లు, బ్యాంకులు, న్యాయవాదులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్సైట్లో సొంతంగా లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకొని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మోసాలను అరికట్టడానికి భద్రతా ప్రమాణాలను కఠినతరం చేశారు. పత్రాలు రాసిచ్చేవారు, రాసి తీసుకునేవారు, సాక్షులు వీరందరి అధికారిక గుర్తింపు కార్డును వెబ్సైట్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. అలాగే ఐడెంటిఫికేషన్ అథారిటీ ద్వారా వేలిముద్రలు లేదా కంటిపాప (ఐరీష్) గుర్తింపు ప్రక్రియతో బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరమైన సాంకేతిక పరికరాలు ఈ సేవలను వినియోగించుకోవడానికి వినియోగదారుల వద్ద మంచి ఇంటర్నెట్ కనెక్షనన్తో పాటు, ప్రభుత్వం అఽఽఽధీకృతం చేసిన ఎల్1 వేలిముద్రల స్కానర్ లేదా ఐరిష్ స్కానర్, వెబ్క్యామ్ ఉండాలి. సందేహాల నివృత్తికి హెల్ప్లైన్ నంబర్లు ఈ సరికొత్త ఆన్లైన్ విధానంలో ప్రజలకు లేదా అధికారులకు సాంకేతిక సమస్యలు తలెత్తితే సంప్రదించాల్సిన నంబర్లను ప్రభుత్వం విడుదల చేసింది. హార్డ్వేర్ సమస్యల కోసం–మహ్మద్ యూనస్, అరుణ్ కుమార్ – 7397574067, 9940446694, సాఫ్ట్వేర్ సమస్యల కోసం– శ్రీనివాస్ గణేష్, ఢిల్లీబాబు – 63697 98973, 85258 05957 నెంబర్లను ప్రకటించారు. -
అన్నామలైతో బీజేపీకి నష్టం లేదు
సాక్షి,చైన్నె: తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకురా లు తమిళసై సౌందరరాజన్ ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల పై, పార్టీ అంతర్గత పరిణామాలపై సంచలన వ్యాఖ్య లు చేశారు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పార్టీని వీడి వెళ్లినంత మాత్రాన బీజేపీ బలహీనపడలేదని, ఆయన వెళ్లాకే పార్టీ మరింత బలంగా మారిందని ఆమె స్పష్టం చేశారు. మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తమిళసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వంపై, విద్యుత్ శాఖ మంత్రిపై , అన్నామలై కొత్తగా పెట్టిన రాజకీయ ప్రస్థానంపై ఆమె ఘాటుగా విమర్శలు గుప్పించారు. హిందూ ప్రజల సెంటిమెంట్లను, దైవ భక్తిని గౌరవించనందుకే గత ఎన్నికల్లో డీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసి, అధికారాన్ని కోల్పోయిందన్నారు. తిరుప్పరంకుండ్రం ఆలయ దీపస్తంభంపై దీపం వెలిగించే విషయంలో కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, శాంతిభద్రతల పేరిట భక్తుల భావాలను గాయపరచడం కరెక్ట్ కాదన్నారు. ఈ విషయంలో గత డీఎంకే ప్రభుత్వం చేసిన తప్పులనే ప్రస్తుత ప్రభుత్వం కూడా పునరావృతం చేస్తునదని మండిపడ్డారు. విద్యుత్ శాఖలో 26 హార్డ్ డిస్క్లు మాయమవడం వెనుక ఉన్న అవినీతిని దాచడానికే మంత్రి నిర్మల్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. అన్నామలై వెళ్తే పోయేదేమీ లేదు అన్నామలై కొత్తగా ప్రారంభించిన ఉద్యమం, పార్టీలో లక్షలాది మంది చేరుతున్నారనే ప్రచారంపై తమిళసై తీవ్రంగా స్పందించారు. బీజేపీ పార్టీ కోసం రక్తం, చె మట చిందించిన అసలైన కార్యకర్తలు ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారన్నారు.. కేవలం స్వార్థపరులు మాత్రమే పార్టీని వీడి వెళ్లారన్నారు. ప్రజా సేవ చేయాలనుకునే వారు ఎక్కడికీ పోలేదు. అన్నామలై రాకతో పార్టీకి అ దనంగా వచ్చిన బలమేమీ లేదన్నారు. ఆయన వెళ్లినంత మాత్రాన పార్టీ కోల్పోయిన బలమేమీ లేదన్నారు. బీజేపీలో ఉన్న ఒక తామర రేకును కూడా ఎవరూ కదల్చలేరని, 2031లో తమిళనాడులో బీజేపీ ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. మోదీ, అమిత్ షా మద్దతు లేదు బీజేపీకి ఉన్నది ఒకటే ముఖం అని, వేరే ముసుగులు వేసుకొని రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. అన్నామలై వెనుక ప్రధాని మోదీ, అమిత్ షాల మద్దతు ఏమాత్రం లేదన్నారు. ఆయన పార్టీ ఎందుకు వీడారో ఆయననే అడగాలి అని ఆమె పేర్కొన్నా రు. తమిళనాడులో కొత్తగా ఏర్పడిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం నెల రోజుల పాలనను తడబడుతూ పూర్తి చేసిందని తమిళసై విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, గంజాయి, డ్రగ్స్ సంస్కృతి పెరిగిందన్నారు. వృద్ధులు, చిన్న పిల్లలపై లైంగిక దాడులు జరుగుతు న్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుందా లేదా అనేది వారి చేతుల్లో లేదన్నారు. ఈ ప్రభుత్వ తలరాత ప్రస్తుతం కమ్యూనిస్టులు, వీసీకే చేతుల్లో ఉందన్నారు. వెనుక నుండి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ వీరికి తాత్కాలికంగా మద్దతు ఇస్తున్నారన్నారు. ఈ సపోర్ట్ తీసేస్తే ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని తమిళసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. -
ఉత్తర చైన్నెలో జీ స్క్వేర్ భారీ ప్రాజెక్ట్
సాక్షి, చైన్నె: జీ స్క్వేర్ గ్రూప్ ఉత్తర చైన్నె పరిధిలోని కరణోడై సరికొత్త ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్ల ప్రాజెక్ట్ జీ స్క్వేర్ క్షేత్ర పేరిట ప్రారంభించింది. చైన్నె పెరిఫెరల్ రింగ్ రోడ్ అనుకుని, ఔటర్ రింగ్ రోడ్కు అత్యంత సమీపంలో వ్యూహాత్మక ప్రాంతంలో ఈ భారీ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ను లేఅవుట్ చేశారు.ఈ కారిడార్ పరిధిలో ప్రస్తుతం మార్కెట్ ధర చదరపు అడుగుకు రూ.4,000 నుండి రూ. 6,000 వరకు పలుకుతుండగా, జీ స్క్వేర్ సంస్థ మొదటి 50 బుకింగ్స్కు మాత్రమే వర్తించేలా చదరపు అడుగుకు కేవలంరూ1,890 ప్రత్యేక ప్రారంభ ధరను ప్రకటించింది. ఇది ప్రస్తుత మార్కెట్ ధర కంటే 50 శాతం తక్కువ కావడం గమనార్హం.అంతేకాకుండా, సంస్థ ఒక వినూత్నమైన సవాల్ను విసిరింది. తమ ప్రాజెక్ట్ నుండి 3 కిలోమీటర్ల పరిధిలో దీనికంటే తక్కువ ధర ఎక్కడైనా చూపిస్తే, కేవలం రూ. 1కే ప్లాట్ ఇస్తాం అని జీ స్క్వేర్ ప్రకటించింది. ఇది వినియోగదారులకు అత్యంత లాభదాయకమైన పెట్టుబడి అవకాశమని సంస్థ తెలిపింది. పారిశ్రామిక హబ్లకు సమీపంలో.. శ్రీసిటీ, థర్వాయ్ కండిగై సిప్కాట్, గుమ్మిడిపూండి సిప్కాట్, మనల్లూరు, ఆరంబాక్కం సిప్కాట్, మిచెలిన్ టైర్స్ ప్లాంట్, రాబోయే మహీంద్రా వరల్డ్ సిటీ , శ్రీపెరంబుదూర్ పారిశ్రామిక ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్ చాలా దగ్గరగా ఉంది. కాట్టుపల్లి, అదానీ, ఎన్నోర్ పోర్టుల ద్వారా ఇక్కడ పారిశ్రామిక కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తుండటం గమనార్హం. ఈ లాంచ్ సందర్భంగా జీ స్క్వేర్ గ్రూప్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ బాల రామాజయం మాట్లాడుతూ మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక వృద్ధి కారణంగా ఉత్తర చైన్నె రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. ప్రస్తుతం కరణోడై ప్రాంతం ఈ అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. -
అలరించిన ‘దుర్యోధన వధ’
గుడిపాల: మండలంలో పిళ్లారికుప్పంలోని ద్రౌపదీ సమేత ధర్మరాజుల ఆలయంలో 18 రోజులుగా నిర్వహిస్తున్న మహాభారత ఉత్సవాలు ఆదివారం దుర్యోధన వధ ఘట్టంతో ముగిశాయి. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. తదుపరి భాగవతారిణి గీతావాణి హరికథాగానం చేశారు. అనంతరం మధ్యాహ్నం దుర్యోధన వద ఘట్టాన్ని కళాకారులు రక్తి కట్టించారు. దుర్యోధనుడు గంగ మడుగులో దాక్కుని ఉండగా.. భీమసేనుడు బయటకి లాక్కొచ్చి చేసే యుద్ధ సన్నివేశం ప్రేక్షకులను అలరించింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్యోధనుడి ప్రతిమ వద్ద సాగిన భీమ, దుర్యోధన వేషధారులు వధ ఘట్ట ప్రదర్శనతో ఆద్యంతమూ ప్రేక్షకులను రోమాంఛితుల్ని చేశారు. అనంతరం ధర్మరాజుల పట్టాభిషేకం, సాయంత్రం అమ్మవారి అగ్నిగుండ ప్రవేశాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం యడంవారిపల్లెలో జరుగుతున్న మహాభారత ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. 18 రోజులు సాగిన మహాభారత యుద్ధంలో కీలక ఘట్టమైన దుర్యోధన వధను ఆదివారం కళాకారులు అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. భీముడు–దుర్యోధనుడి మధ్య జరిగిన యుద్ధం, దుర్యోధన వధ ఘట్టాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. -
డీఎంకేపై మాణిక్యం ఠాకూర్ ఫైర్
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. గత డీఎంకే ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు గుప్పించారు. డీఎంకే నాయకులు చేసిన భారీ అవినీతి, వసూలు చేసిన కమిషన్లను తాము పక్కనే ఉండి చూసినప్పటికీ, కూటమి ధర్మం కోసమే ఇన్నాళ్లూ బయటపెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. శివకాశిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాణిక్యం ఠాగూర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, డీఎంకే వైఖరి, సీమాన్ విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. డీఎంకే 36శాతం కమీషన్ల పాలన.. తమిళనాడులో గత ప్రభుత్వ హయాంలో హైవేల శాఖ, పట్టణాభివృద్ధి శాఖల్లో ఏకంగా 36 శాతం కమిషన్లు నడిచాయన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ఒక్కో ఎకరానికి 7 లక్షల రూపాయల చొప్పున డీఎంకే విరాళాల పేరిట వసూలు చేసిందన్నారు. ఇదంతా తాము పక్కనే ఉండి చూశామన్నారు. అయితే, కూటమి ధర్మానికి కట్టుబడి నోరు విప్పలేదన్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వంలో ఆ అవినీతి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోందన్నారు. ఉదయనిధి స్టాలిన్ హయాంలో పూర్తిగా పాడైపోయిన ప్రభుత్వ యంత్రాంగాన్ని చక్కదిద్దడానికి ప్రస్తుత ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలని మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. సీమాన్, ఉదయనిధిపై ధ్వజం 2026 ఎన్నికల ఓటమి చాలామందికి షాక్ ఇచ్చిందన్నారు. ఆ బాధ నుండి తేరుకోలేక కొందరు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ఇన్నాళ్లూ ఉదయనిధి స్టాలిన్ నుండి వచ్చిన అరుపులు, పెడబొబ్బలు.. ఇప్పుడు నామ్ తమీళర్కట్చి నేత సీమాన్ నుండి వస్తున్నాయన్నారు. సొంత జిల్లాలోనే డిపాజిట్ దక్కించుకోలేని సీమాన్, వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన మర్యాదగా మాట్లాడకపోతే కాంగ్రెస్ శ్రేణులు అదే రీతిలో బుద్ధి చెబుతాయన్నాయన్నారు. సవాల్కు సిద్ధమా?: డీఎంకే మద్దతుతో గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలని సీమాన్ డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేస్తూ, మొదట కాంగ్రెస్ ఓట్లతో గెలిచిన ఉదయనిధి స్టాలిన్ను రాజీనామా చేయమనండి అని సూచించారు. ఆయన రాజీనామా చేసిన 24 గంటల్లోనే తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఈ సవాల్కు సిద్ధమేనా అని సీమాన్ తన సోదరుడు ఉదయనిధిని అడిగి చెప్పాలన్నారు. బీజేపీతో ఉదయనిధి అండర్ డీలింగ్స్ కరుణానిధి మరణం తర్వాత డీఎంకే ఏ దిశగా వెళ్తుందో అర్థం కావడం లేదని మాణిక్యం ఠాగూర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన డీఎంకే కార్యకర్తలు ఇళ్లలోనే ఉండిపోయారన్నారు. ప్రస్తుతం అద్దెకు తెచ్చుకున్న వాళ్లతో రాజకీయం నడుపుతున్నారన్నారు. కొత్తగా గెలిచిన విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, ఆయన సీఎం కాకుండా అడ్డుకోవడానికి బీజేపీ వేసిన ప్లాన్లో ఉదయనిధి స్టాలిన్ ఒక ముఖ్య సూత్రధారిగా పేర్కొన్నారు. ఆయన బీజేపీతో పెట్టుకున్న లోపాయికారీ ఒప్పందాలను త్వరలోనే ప్రజల ముందు పెడుతామన్నారు. జూన్ 8న జరగబోయే ఇండియా కూటమి సమావేశానికి డీఎంకే దూరంగా ఉండటమే ఆ పార్టీ బీజేపీకి బీ–టీమ్ అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అని ఆరోపించారు. తమిళనాడులో రాబోయే కాలంలో ఉదయనిధి నేతృత్వంలోని డీఎంకే భారీ పతనాన్ని చూస్తుందని ఆయన జోస్యం చెప్పారు. డీఎంకేతో కలవడం వల్లే గతంలో కాంగ్రెస్ పార్టీ 18 మంది ఎమ్మెల్యేల నుండి ఐదుగురికి పడిపోయిందని, చేరకూడని చోట చేరి మోసపోయామని అన్నారు. సీఎం విజయ్, రాహుల్ గాంధీల మధ్య ఉన్న సత్సంబంధాలు అందరికీ తెలిసినవేనని, ఈ స్నేహం, కూటమి భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతాయని ధీమా వ్యక్తంచేశారు. -
జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు
చిత్తూరు అర్బన్: ముందస్తు నేరాల నియంత్రంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. కార్వేటినగరంలో నాటు సారా తయారీకి ఉపయోగించే 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. చిత్తూరు వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 20 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 70 మందికి డ్రగస్స్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా చిత్తూరు తాలూకా, యాదమరి ప్రాంతాల్లో ఐదుగురికి మాదకద్రవ్యాల పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వీళ్లకు ప్రత్యేకించి కౌన్సెలింగ్ చర్యలు హెచ్చరించారు. నగరి: నగరి డివిజన్ పరిధిలో ఆదివారం విస్తతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు సీఐ మల్లికార్జున తెలిపారు. నగరితోపాటు నిండ్ర, విజయపురం, పాలసముద్రం, ఎస్ఆర్ పురం మండల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ శాఖ కిట్లతో అనుమానితులకు గంజాయి పరీక్షలు చేశారు. అనంతరం సీఐ మాట్లాడారు. గంజాయి రహిత జిల్లాగా మార్చాలని ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగానే వివిధ మం లాల్లోని కరకంఠాపురం, వేదాంతపురం ఎస్టీ కాలనీ, కేవీపురం దళితవాడ, పచ్చికాపల్లం, పాలసముద్రం దళితవాడ, పొదలపల్లె, కొటార్వేడులో కార్డన్ సెర్చ్తో ప్రతి గృహాన్ని తనిఖీ చేశామన్నారు. వాహనాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించామన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచామన్నారు. కొటార్వేడులో సారాఊట ధ్వంసం చేసినట్లు చెప్పారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ(డీటీసీ) జే.రాంబాబు డివిజన్లోని ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు. తిరుమల: బెంగళూరుకు చెందిన నిర్మాణ సంస్థ సముద్ర గ్రూప్ డైరెక్టర్ నవీన్ కుమార్ అనే భక్తుడు ఆదివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11,11,111 లక్షలు విరాళం ఇచ్చారు. టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమలలోని అదనపు ఈఓ చాంబర్లో విరాళం డీడీని దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు నాగారం మురళి, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
వైభవం.. సీతారాముల కల్యాణం
కొరుక్కుపేట: లోక క్షేమాన్ని కాంక్షిస్తూ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. చైన్నె పెరంబూరు పటేల్ రోడ్డులోని ఆనంద నిలయం వేదికగా వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో సీతారముల కల్యాణ వైభవంలో భాగంగా శనివారం రాత్రి వసంత కేళికై , పవలింపు, ఆంజనేయోత్సవం అనంతరం ఆదివారం ఉదయం 8గంటలకు అష్టపది, గీతాగోవిందం, ఉపచార పూజ, దీపారాధన, డోలోత్సవాన్ని వైష్ణవ ఆగమనం ప్రకారం వేదపండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం సీతారాముల తిరుకల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆనంద భాగవతర్ నేతత్వంలోని కళాకారుల బృందం సంగీతంతో అందించిన కీర్తనలకు హైదరాబాదుకు చెందిన శ్రీకాంత్ అభినయం ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. ముఖ్యఅతిథి డి.జంబు, పురప్రముఖులను తమ్మినేని బాబు సత్కరించారు. సమాజం సెక్రటరీ వెంకటరామన్, కోశాధికారి కోదండరామయ్య, జాయింట్ సెక్రటరీ రవికుమార్, జాయింట్ కోశాధికారి వెంకట రమణుడు, ట్రస్టీ రామచంద్రన్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం కీల్పాక్లో ఉన్న మదర్ థెరిస్సా వృద్ధాశ్రమంలో ఎం.జయరామన్ స్మారకార్థం అన్నదానం చేశారు. -
కుశస్థలినదిలో ఊట బావులకు గ్రామీణుల వ్యతిరేకత
తిరుత్తణి: కుశస్థలి నదిలో ఊటబావులు ద్వారా తిరుత్తణి కొండ ఆలయానికి తాగునీరు సరఫరా చేయడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించి మంగళవారం నిరసన తెలిపారు. తిరువలంగాడు యూనియన్లోని నల్లాట్టూరు సమీపంలోని కుశస్థలినది నుంచి రూ.11 కోట్ల వ్యయంతో మూడు ఊటబావులు నిర్మించి రోజూ తిరుత్తణి ఆలయంకు 5 లక్షల లీటర్ల తాగునీరు సరఫరాకు చర్యలు తీసుకున్నారు. వాటర్బోర్డు ద్వారా ఊటబావుల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో మంగళవారం నల్లాట్టూరు గ్రామస్తులు ఊటబావుల పనులను అడ్డుకుని వ్యతిరేకత తెలిపారు. దీంతో పనులు ఆగడంతో వాటర్బోర్డు ఏడీ సంపత్. తహసీల్దారు కుమార్, ఆలయ ఇంజినీరు నేతాజీ తదితరులు గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. నదిలో 15 అడగుల లోతు ఊటబావులు ఏర్పాటు చేసి మూడు అడుగుల లోతు నుంచి ఊట నీటిని మాత్రమే పైపులైన్లు ద్వారా తరలించనున్నట్లు తద్వారా గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏర్పడదని గ్రామీణులకు తెలిపారు. అయితే ఇప్పటికే మూడు ఊటబావులు నిర్మించి మూడు గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్న క్రమంలో భూగర్భజలాలు అడుగంటే ప్రమాదమున్నట్లు గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేశారు. వేరే ప్రాంతంలో ఊటబావులు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అయితే ఊట బావుల ద్వారా భూగర్భజలాలు అడుగంటే అవకాశమే లేదని ఊట నీటిని మాత్రమే వినియోగిస్తామని అధికారులు చెప్పడంతో గ్రామీణులు ఆందోళన విరమించారు. -
భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం
నిండ్ర (నగరి): నిండ్ర మండలం అత్తూరు గ్రామ పంచాయతీలోని ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల తిరునాళ్లలోభాగంగా ఆదివారం అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. తొలుత ఉదయం దుర్యోధన వధ ఘట్టం అనంతరం భక్తులు దేవాలయం వద్ద పొంగళ్లు పెట్టి, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయం ఎదుట మైదానంలో అగ్ని గుండాన్ని అర్చకులు పూజల నిర్వహించి రగిలించారు. ఆ తర్వాత ద్రౌపదీదేవి ఉత్సవమూర్తిని పలు పుష్పాలతో విశేషంగా అలంకరించి గ్రామ సరిహద్దు నుంచి కంకణం ధరించిన భక్తులు గోవింద నామస్మరణతో అమ్మవారి వెంట అగ్నిగుండం వద్దకు చేరారు. సాంప్రదాయ పూజలు నిర్వహించి భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. రాత్రి అమ్మవారిని పురవీధులలో ఊరేగించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరి రూరల్ సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో నిండ్ర, విజయపురం ఎస్ఐలు మల్లికార్జున వెంకట సుబ్బయ్య బందోబస్తు నిర్వహించారు. -
లోక్భవన్.. ముట్టడిస్తాం!
సాక్షి, చైన్నె : సీబీఎస్ఈ పాఠశాలల్లో సిలబస్ ద్వారా హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని నిరసిస్తూ, అలాగే విశ్వవిద్యాలయాల అధికారాలను లాగేసుకునే వీపీఎస్ఏ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 23వ తేదీన చైన్నెలోని లోక్ భవన్, పుదుచ్చేరిలోని లోక్ నివాస్ను ముట్టడించనున్నట్టు డీఎంకే విద్యార్థి విభాగం ప్రకటించింది. వివరాలు.. పుదుచ్చే రి రాష్ట్ర డీఎంకే విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్లు, నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల అత్యవసర సమీక్షా సమావేశం ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. డీఎంకే పుదుచ్చేరి రాష్ట్ర కన్వీనర్ శివ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తమిళనాడు డీఎంకే విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి వీరమణి ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం అనంతరం వీరమణి మీడియాతో మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై తమిళనాడులోని ప్రస్తుత తమిళగ వెట్రి కళగం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యావ్యవస్థను తాకట్టు పెడుతున్నారు పీఎం శ్రీ పేరిట పాఠశాలల వ్యవహారంలో తమిళనాడులోని టీవీకే ప్రభుత్వం పూర్తిగా మౌనం వహిస్తోందని ధ్వజమెత్తారు. దీనిపై పరిశీలిస్తున్నామని విద్యాశా ఖ మంత్రి చెబుతుండటం హాస్యాస్పదం. విద్యావ్యవస్థను కేంద్రానికి తాకట్టు పెట్టేందుకు టీవీకే ప్రభుత్వం సన్నద్దమైందన్నారు. జూలై నెల నుండి సీబీఎస్ఈ స్కూళ్లలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని ప్ర యత్నిస్తునదన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ లు చేయనివ్వమని, తమిళనాడులో హిందీని దొడ్డి దా రిన తీసుకురావాలని చూస్తున్నారని మండిపడ్డారు. 9 వ తరగతిలో మూడో భాషకు మార్కులు ఉండవని చె బుతారని, అయితే, ఆ తర్వాత 10వ తరగతికి వచ్చే సరికి అదే మార్కులను తప్పనిసరి చేస్తారన్నారు. ఇది విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిని పెంచడమేనని పేర్కొన్నా రు. సీబీఎస్ఈ సిలబస్ ద్వారా జరుగుతున్న హిందీ వి ధింపును అడ్డుకోవడానికి, వర్సిటీల స్వయంప్రతిపత్తి ని దెబ్బతీసే వీపీఎస్ఏ విధానాన్ని రద్దు చేయాలని డి మాండ్ చేస్తూ జూన్ 23న చైన్నెలోని గవర్నర్ బంగ్లా లోక్భవన్, పుదుచ్చేరిలోని లోక్ నివాస్ల ముట్టుడి ది శగా డీఎంకే విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ఎ త్తున నిరసన ప్రదర్శన, ధర్నా చేపట్టనున్నట్లు వీరమ ణి స్పష్టం చేశారు. పుదుచ్చేరి డీఎంకే విద్యార్థి విభాగం నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
శత జయంతోత్సవాలకు ముస్తాబు
ఏర్పేడు: ఏర్పేడులో వెలసిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీవ్యాసాశ్రమం స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శత జయంతోత్సవాలకు ముస్తాబవుతోంది. 1926లో కేరళ రాష్ట్రానికి చెందిన సద్గురు మలయాళ స్వామి ఏర్పేడులో శ్రీవ్యాసాశ్రమాన్ని నెలకొల్పారు. శ్రీవ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి ఆధ్వర్యంలో ఆగస్ట్ 27వ తేదీ నుంచి వారం రోజులపాటు ఆశ్రమ ప్రాంగణంలో శత జయంతోత్సవాలు జరగనున్నాయి. దీంతో వ్యాసాశ్రమంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. సద్గురు మలయాళ స్వామి అధిష్టాన మందిరం వద్ద పచ్చదనాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రమంలోని అన్ని భవనాలను ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. అన్నదాన కేంద్రం నవీకరణ పనులు చేపడుతున్నారు. కాశీబుగ్గతీర్థం ప్రాంగణంలో చలువరాతి నిర్మాణాలు , అన్నదాన కేంద్రం సమీపంలో పార్క్ తీర్చిదిద్దారు. శ్రీవాల్మీకి మహర్షితో పాటు వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు మలయాళస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. -
అరక్కోణం యార్డులో ఇంజినీరింగ్ పనులు
సాక్షి, చైన్నె: అరక్కోణం రైల్వే యార్డులో అత్యవసర ఇంజినీరింగ్, ట్రాక్ ఆధునీకరణ పనులు జరగనున్నందున, చైన్నె సబర్బన్ పరిధిలో నడిచే 47 ఎలక్ట్రికల్ (లో కల్) రైళ్ల సర్వీసుల్లో మార్పులు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మార్పులు సోమవారం 8వ తేదీ నుంచి ఈనెల 12వ తేదీ వరకు మొత్తం 5 రోజులు అమలులో ఉంటాయని వివరించారు. ఈ మేరకు చైన్నె రైల్వే డివిజన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. పూర్తిగా రద్దయిన రైళ్లు జూన్ 8 నుండి 12వ తేదీ వరకు 5 రైళ్లు పూర్తిగా రద్దు చే శారు. ఇందులొఓ అరక్కోణం – తిరుత్తణి మధ్య తెల్లవారుజామున 4.00 గంటలకు, 5:00 గంటలకు నడిచే లోకల్ రైళ్లు, తిరుత్తణి – అరక్కోణం మధ్య రాత్రి 9:15 గంటలకు, 11:10 గంటలకు నడిచే లోకల్ రైళ్లు. తిరుత్తణి – చైన్నె సెంట్రల్ మధ్య ఉదయం 6:30 గంటలకు నడిచే లోకల్ రైలు ఉన్నాయి పాక్షికంగా రద్దయిన రైళ్లు చైన్నె సెంట్రల్,బీచ్ నుండి అరక్కోణం వైపు వెళ్లే పలు రైళ్లను తిరువాలాంగడు స్టేషన్ వరకే పరిమితం చేశారు. ఇవి తిరువాలాంగడు – అరక్కోణం మధ్య నడవవు అని ప్రకటించారు. ఇందులో చైన్నె బీచ్ – అరక్కోణం మధ్య తెల్లవారుజామున 4.05, మధ్యాహ్నం 2.25 గంటల రైళ్లు, ఆవడి – అరక్కోణం మధ్య ఉదయం 6.20 గంటల రైలు, చైన్నె సెంట్రల్ – అరక్కోణం మధ్య ఉదయం 6.30, 9.10, 10.30, 11.00, మధ్యాహ్నం 12.40, 1.25, రాత్రి 3.45, సాయంత్రం 4.45, 5.15, 5.45, 6.05, 6.40, రాత్రి 7.30, 8.20, 9.10, 10.00, 10.55 గంటలకు బయలుదేరే రైళ్లు తిరువాలాంగడు వరకే నడుస్తాయి. అలాగే అరక్కోణం నుండి చైన్నె సెంట్రల్కు బయలుదేరాల్సిన కింద పేర్కొన్న సమయాల రైళ్లు అరక్కోణానికి బదులుగా తిరువాలాంగడు స్టేషన్ నుండే చైన్నెకి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారం. ఈమేరకు తెల్లవారుజామున 3.45, 4.25, 5.25, ఉదయం 6.40, 8.15, 8.55, 11.15, మధ్యాహ్నం 2.25, రాత్రి 3.40, సాయంత్రం 4.50, 6.00, 7.00, 7.25, రాత్రి 8.25, 8.50, 9.45 గంటల రైళ్లు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా అరక్కోణం – చైన్నె బీచ్ మధ్య నడిచే మరో 4 లోకల్ రైళ్లు కూడా పాక్షికంగా రద్దయ్యాయి. -
విక్రమ్ @63
విక్రమ్ రియా శిబు తమిళసినిమా: విక్రమ్ చిత్రం అంటేనే సమ్ థింగ్ స్పెషల్గా ఉంటుంది. వీర ధీర సూరన్ చిత్రం తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని నటించడానికి సిద్ధమయ్యారు విక్రమ్. ఈయన నటిస్తున్న 63వ చిత్రం ఆదివారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైనట్టు సమాచారం. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకు విక్రమ్, దర్శకుడు ఆనంద్ శంకర్ కాంబినేషన్లో ఇరుమురున్ అనే చిత్రం 2016లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతోంది. ఇందులో సర్వంమాయ మలయాళ చిత్రం ఫేమ్ రియాశిబు కథానాయకిగా నటిస్తున్నారు. ఈమె ఇంతకుముందు విక్రమ్ హీరోగా వీర ధీర సూరన్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఇంకా పేరు నిర్ణయించని విక్రమ్ 63వ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న చిత్రంలోని పాత్ర కోసం విక్రమ్ దర్శకుడి సూచనల మేరకు మేకోవర్ అయినట్లు సమాచారం. ఎంఎస్ భాస్కర్, ఊర్వశి ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసింది. మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. తమిళసినిమా: అందం, ఐశ్వర్యం, ఆనందం, ఆసక్తి, ఆకర్షణ, నిరాకరణ, సంతృప్తి, అసంతృప్తి, ఆవేదన అన్నీ కలగలిపిన పరిశ్రమ సినిమా. ఇక్కడ ప్రతిభ, అదృష్టాలను పరీక్షించుకుని ఉన్నంత స్థాయికి చేరుకున్న వారు ఎందరో. తమ కలలను పండించుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నా వారు ఉన్నారు. అదే సమయంలో వివక్ష గొంతెత్తే వారు ఉంటూనే ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు కాజల్ అగర్వాల్ చేరారు. లక్ష్మీకల్యాణం అనే తెలుగు చిత్రంతో కథానాయికిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత వరుసగా అవకాశాలను అందుకుంటూ అగ్ర కథానాయిక స్థాయికి చేరారు. కాజల్ బిజీగా ఉన్న తరుణంలోనే పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి ప్రవేశించారు. అలా ఒక బిడ్డకు తల్లి కూడా అయినా ఈ ఉత్తరాది భామ మళ్లీ నటనపై దృష్టి పెట్టారు. కాజల్ తాజాగా నటించిన ది ఇండియా స్టోరీ చిత్రం జూలై 24న తెరపైకి రానుంది. కమలహాసన్తో కలిసి నటించిన ఇండియన్– చిత్రం విడుదల కావలిసి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ సందర్భం వచ్చినప్పుడల్లా గ్లామర్ ను ప్రదర్శిస్తూ అవకాశాల వేటలో పడుతున్నారు. తాజాగా చిత్రపరిశ్రమలో వివక్ష గురించి ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. పారితోషికం విషయంలో ఆడ, మగ మధ్య వివక్ష లేదని చెప్పలేను కానీ ఈ పరిస్థితి మారాలి. సినిమా ఇప్పుడు కార్పొరేట్గా మారిపోతోంది. అయినా ఆడ, మగ మధ్య పారితోషికం విషయంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. నాకు దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆసక్తి ఎక్కువ. నాకు అక్కడ లేని సౌకర్యం దక్షిణాది చిత్ర పరిశ్రమలో కలుగుతుందని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. త్వరలో ది ఒన్ విత్తిన్ యూ తమిళసినిమా: హరీష్ణి పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై గోపాల్ బాలకృష్ణన్, శివరామనాథన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ది ఒన్ విత్తిన్ యూ. ఆదిరా రాకెప్పన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్, టీజర్లను విడుదల చేశారు. చిత్రం వివరాలను దర్శకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలుపుతూ ఇది హైపర్ లింక్ డ్రామాతో కూడిన యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. మానవ అనుబంధాలతో కూడిన వైవద్యభరిత కథ ఇదని చెప్పారు. ఒకరికొకరు సంబంధం లేని వ్యక్తుల జీవితాల్లో విధి, పరిస్థితుల కారణంగా ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే పోరాటమే ది ఒన్విత్తిన్ యూ అని అన్నారు. కోయంబత్తూర్ పశ్చిమ కొండ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు అనూహ్య సంఘటనల కారణంగా ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు? వంటి ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రం అని చెప్పారు. ఇందులో నటి లియోమోల్జోస్ నటిస్తుండగా, పరుత్తివీరన్ శరవణన్, పావల్ నవగీతన్, నమిత కృష్ణమూర్తి, గీతాకై లాసం, ప్రవీణ్ రాజా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. జిబ్రాన్ సంగీతాన్ని, వినోద్ రాజా చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర టైటిల్, టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని త్వరలోనే ఆడియో, చిత్ర విడుదలకు సంబంధించిన వివరాల వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. చిత్ర పరిశ్రమలో వివక్ష ఉంది -
స్నేహమేరా జీవితం..
గుడిపాల: స్నేహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతం– అని రెండున్నర దశాబ్దాల తర్వాత వారంతా సందడి చేశారు. తమ భవితకు బాటలు వేసిన పాఠశాలలో ఆదివారం కలిశారు. జ్ఞాపకాల పేజీలు తిరగేస్తూ బాల్య స్మతులతో కేరింతలు కొట్టారు. మండలంలోని నరహరిపేట ఉన్నత పాఠశాలలో 2002–2003లో పదవ తరగతి చదివిన విద్యార్థులు కాలక్రమంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. మళ్లీ అందరూ కలవాలని ఫోన్లలో పరస్పరం చర్చించుకుని డేట్ నిర్ణయించడంతో ఆలస్యం ఎక్కడెక్కడి నుంచో అందరూ వాలిపోయారు. తమ తరగతి గదుల్లో తిరుగుతూ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లారు. తమ విద్యాబుద్ధులు చెప్పిన గురుదేవులను సన్మానించి ఆశీస్సులు అందుకున్నారు. స్కూల్ అభివృద్ధి కోసం రూ.50వేలు విరాళంగా అందజేశారు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు దూర్వాసులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
తిరువొత్తియూరు: తిరుచ్చిలో ఓ రౌడీ దారుణ హత్యకు గురయ్యాడు. తిరుచ్చి అరియమంగళం ప్రాంతానికి చెందిన మహబూబ్బాషా కుమారుడు బాషా (25). ఇతను పేరు మోసిన రౌడీ. ఇతను శనివారం రాత్రి 11.30 గంటలకు బైక్లో కాట్టూర్ ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంక్ సమీపంలో వెళుతున్నాడు. ఆసమయంలో అతన్ని ముగ్గురు వ్యక్తులు వెంబడించారు. ఒక మలుపు వద్ద బాషా బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో, వెనుకనే వచ్చిన ముగ్గురు అతడి తలపై వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. బాషా అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల విచారణలో గత సెప్టెంబర్లో కూడా బాషాపై దాడి జరిగిందని, అప్పట్లో అతడి వేళ్లు తెగిపోయాయని తెలిసింది. తిరువెరుంబూర్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. తిరువొత్తియూరు: హత్య కేసులో ఓ మహిళ, ఆమె ప్రియుడిని పోలీసులు గూండా చట్టం కింద అరెస్ట్ చేశారు. కృష్ణగిరి జిల్లా పాలక్కురికి చెందిన సైనిక ఉద్యోగి మహేష్ కుమార్ (36), తండ్రి, మాజీ సైనికుడు సెల్లప్పన్ (64)లను మే 11న హత్య చేసి, పెట్రోల్ పోసి కాల్చివేశారు. మహేష్కుమార్ భార్య భానుప్రియ. ఈమె తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కారణంతో ప్రియుడు పూవరసన్తో కలిసి దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాల మేరకు, వీరిద్దరిపై గూండా చట్టం ప్రయోగించారు. పూవరసనను సేలం కేంద్ర కారాగారానికి, భానుప్రియను కోయంబత్తూర్ మహిళా ప్రత్యేక జైలుకు తరలించారు. చంద్రగిరి: తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో వారాంతపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిరుపతికి చెందిన కొండ రవి బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాకారులు వరణ్య, షణ్ముఖ, ప్రియ, సాత్విక, కార్తీక, విహాన, సహస్ర, భార్గవి, మన్య, హన్విత, జ్ఞాపిక, క్రియాంశ అద్భుతమైన ప్రదర్శనలతో అలరించారు. మంత్రముగ్ధులైన ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందనలు తెలిపారు. అనంతరం ఖాదర్వల్లి, ఇన్చార్జ్ ఏఓ సూర్యతేజ కళాకారులతోపాటు గురువులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. వెంకటగిరి రూరల్: చిల్లర దుకాణానికి బైక్పై సిగరేట్ కోసం వచ్చి ఒంటరిగా ఉన్న మహిళ చెవులోని కమ్మను అపహరించుకెళ్లిన ఘటన వెంకటగిరి–నాయుడుపేట మార్గంలోని బాలాయపల్లి మండలం, మేల్చూరు గ్రామం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. మేల్చూరుకి చెందిన కాసరం కృష్ణమ్మ చిల్లర దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు గుర్తుతెలియని యువకులు మోటారు సైకిల్పై వచ్చి సిగరేట్లు అడిగారు. వాటిని ఇవ్వబోయే సమయంలో కృష్ణమ్మ మెడలోని బంగారు సరుడు లాగ బోయారు. ఈ మేరకు కృష్ణమ్మ కేకలు వేయడంతో ఆ యువకులు ఆమె చెవిలోని 3 గ్రాముల బంగారు కమ్మను లాక్కెళ్లారు. బాధితురాలు బాలాయపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు విచారణలో ఉంది. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయం మూడో గేటు సమీపంలోని జల వినాయకుడి వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎల్సీడీ స్క్రీన్ పది రోజులుగా పనిచేయకుండా నిలిచిపోయింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాలను భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఈ స్క్రీన్న్ఎంతో ఆడంబరంగా ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసిన నాలుగు నెలలకే అది పనిచేయకుండా పోవడం గమనార్హం. -
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుతుంది. శనివారం అర్ధరాత్రి వరకు 90,107 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 52,236 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. -
తిరుత్తణి ఆలయంలో భక్తుల రద్దీ
తిరుత్తణి: వారాంతపు సెలవు దినంతో పాటు శుభ ముహూర్తదినం సందర్భంగా ఆదివారం తిరుత్తణి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం సెలవు దినంతో పాటు శుభముహూర్త దినం సందర్భంగా ఆలయ అధికారుల అనుమతితో ఆలయ మండపాల్లో 15 వివాహాలు జరిగాయి. దీంతో పాటు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుత్తణి కొండ ఆలయంకు పోటెత్తారు. దీంతోపాటు పట్టణ వ్యాప్తంగా ప్రయివేటు కల్యాణ మండపాల్లో 50కు పైబడిన వివాహాలు జరిగాయి. వివాహాలు ద్వారా ఏకమైన నవ దంపతులతో పాటు వారి కుటుంబీకులు, బందువులు స్వామి దర్శనంకు కొండ ఆలయంకు పోటెత్తారు. సర్వ దర్శన క్యూలైన్లతో పాటు రూ. వంద ప్రత్యేక దర్శన మార్గాల్లో భక్తులు మూడు గంటల పాటు వేచివుండి స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. రాత్రి ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. తిరుత్తణి కొండ ఆలయంలో భక్తుల రద్దీ అలంకరణలో ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామి -
గ్యాస్ ధర పెంపుతో మధ్యతరగతి అస్తవ్యస్తం
– ఎస్డీబీఐ పార్టీ మండిపాటు కొరుక్కుపేట: గ్యాస్ ధరలను పెంచుతూ పేద ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఎస్డీబీఐ పార్టీ రాష్ట్ర కోశాధికారి ముస్తఫా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరను మరోసారి పెంచింది. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్న సాధారణ, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ను ఇది పూర్తిగా అస్తవ్యస్తం చేస్తుందన్నారు. ఇటీవల వాణిజ్య అవసరాల కోసం వాడే సిలిండర్ల ధరను గణనీయంగా పెంచినప్పటికీ, ఇప్పుడు గృహ వినియోగం కోసం వాడే సిలిండర్ల ధరను పెంచడం పేద, సామాన్య ప్రజలను మోసం చేయడమే అని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు తగ్గే సమయాల్లో, ప్రజలకు ప్రయోజనాలు కల్పించకుండా ధరలను తగ్గించడానికి ప్రభుత్వం నిరాకరిస్తుంది. ధరలు పెరిగినప్పుడు మాత్రమే ఆ భారాన్ని వెంటనే ప్రజలపై మోపుతుంది. అందువల్ల, పేద, సామాన్య ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం ఈ ధరల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు. -
క్లుప్తంగా
టాస్మాక్ దుకాణం ధ్వంసం తిరువొత్తియూరు: విల్లుపురం జిల్లా తిరువైన్నెనల్లూర్ సమీపం కడియప్పాక్కం గ్రామంలో ఉన్న టాస్మాక్ (మద్యం) దుకాణాన్ని తొలగించాలని కోరుతూ మహిళలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పలుమార్లు విన్నవించినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళలు, దుకాణంపై కరల్రతో దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. ఈ మద్యం దుకాణం పాఠశాలకు సమీపంలో ఉండటం వల్ల స్థానికులకు, విద్యార్థులకు తీవ్ర అసౌ కర్యం కలుగుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం దుకాణాన్ని తెరిచేందుకు సిబ్బంది ప్రయత్నించగా, వందలాది మంది మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపారు. సుమారు 50 మంది మహిళలపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. స్నేహితుడిని హత్య కేసులో యువకుడి అరెస్ట్ తిరువొత్తియూరు: మద్యం మత్తులో ఘర్షణ పడి స్నేహితుడిని హత్య చేసిన యువకుడిని పోలీసు లు అరెస్ట్ చేశారు. చైన్నె చోళవరానికి సమీపంలో ఉన్న వండలూర్ బైపాస్ సర్వీస్ రోడ్డులో జూన్ 5వ తేదీ రాత్రి ఒక మృతదేహం పడి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు, 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. పరీక్షించిన వైద్యులు ఆ వ్యక్తి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడు చైన్నె వ్యాసార్పాడికి చెందిన మణికంఠన్ (29) అని తెలిసింది. పోలీసుల విచారణలో మణికంఠన్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించడానికి వెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో స్నేహితుల మధ్య గొడవ జరగడంతోటింకర్ సెంథిల్ (44) అనే వ్యక్తి మణికంఠన్ను కర్రతో కొట్టి చంపినట్లు తెలిసింది. పోలీసులు సెంథిల్ కుమార్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న విక్కీ కోసం వెతుకుతున్నారు. విద్యార్థినులకు లైంగిక వేధింపులు – కళాశాల యాజమాన్యంపై కేసు తిరువొత్తియూరు: దిండుకల్ సమీపం వత్తలగుండులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాల హాస్టల్ వార్డెన్ సెల్ఫోన్ ద్వారా విద్యార్థినులకు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారు 30 మందికి పైగా విద్యార్థినులు దిండుకల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ విశాఖను కలిసి ఫిర్యాదు చేశారు. హాస్టల్లో కనీస వసతులు లేవని, నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ రాత్రి సమయాల్లో విద్యార్థినులకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థినులు పేర్కొన్నారు. దీనిపై గత 6 నెలలుగా కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. తమను వెంటనే వేరే కళాశాలకు మార్చాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకో వాలని విద్యార్థినులు కోరారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు వ్యక్తులపై (కళాశాల కరస్పాండెంట్, వార్డెన్ సహా) ఎస్సీ/ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, మహిళలపై వేధింపుల నిరోధక చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వాకింగ్ చేస్తూ మిద్దైపె నుంచి పడి.. – గర్భిణి మృతి తిరువొత్తియూరు: వాకింగ్ చేస్తున్న సమయంలో మేడపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. విల్లుపురం జిల్లా తిరువైన్నెనల్లూర్ సమీపం పెరియ సెవలై గ్రామానికి చెందిన వీరప్పన్ కుమార్తె యువశ్రీ (25). ఈమెకు, తిరువైన్నెనల్లూర్ సమీపంలోని మాంబరై గ్రామానికి చెందిన రాజదురైకి గతేడాది వివాహం జరిగింది. రాజదురై ఆర్మూర్ వద్ద ఐటిబిపి విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. గర్భిణి అయిన యువశ్రీ ప్రసవం కోసం కొన్ని రోజుల క్రితం పెరియ సెవలైలోని తన పుట్టింటికి వచ్చింది. శనివారం సాయంత్రం ఆమె తన ఇంటి మేడపై నడుస్తుండగా ఊహించని విధంగా ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే విల్లుపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ తీవ్ర చికిత్స విభాగంలో చికిత్స పొందుతూ, శనివారం రాత్రి 11 గంటల సమయంలో చికిత్స ఫలించక యువశ్రీ , ఆమె కడుపులోని బిడ్డ ఇద్దరూ మరణించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మత్తుమాత్రల విక్రయం – ఇద్దరు యువకుల అరెస్ట్ తిరువళ్లూరు: మత్తుమాత్రలను అక్రమంగా తరలించి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటలో మత్తుమాత్రలను విక్రయిస్తున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టి అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో పట్టుబడిన యువకులు తాంబరం ప్రాంతానికి చెందిన రాజ్కుమారుడు శరవణన్(24), విశ్వనాథన్ కుమారుడు కమలేష్(23)గా గుర్తించారు. వీరు ఒడిశా నుంచి మత్తుమాత్రలను తీసుకొచ్చి యువత, విద్యార్థులే లక్ష్యంగా విక్రయిస్తున్నట్టు నిర్ధారించిన పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
విజయ్ ప్రభుత్వం 3 నెలలైనా ఉంటుందా?
చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వంపై డీఎంకే చీఫ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే ప్రభుత్వం మూడు నెలలు కూడా కొనసాగడం కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు 60 ఏళ్ల కాలంలో ఏర్పడిన ఏకైక డీఎంకేయేతర, అన్నాడీఎంకేయేతర ప్రభుత్వం విజయ్ జోసెఫ్ సారథ్యంలో మేలో ఏర్పడటం తెల్సిందే. ఆదివారం చెన్నైలో వీసీకే ఎమ్మెల్యే పనైయూర్ బాబు డీఎంకేలో చేరిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో స్టాలిన్ ప్రసంగించారు. ‘‘ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటిదో నేను చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, మరో ఆరు నెలల వరకు ఎలాంటి విమర్శలు చేయబోనని చెప్పా. ప్రస్తుత పరిస్థితులను చూసి మాట్లాడక తప్పడం లేదు. ఈ ప్రభుత్వం ఎన్ని నెలలు ఉంటుందనికాదు, కనీసం మూడు నెలలయినా మనుగడ సాగిస్తుందా అన్నదే అసలు ప్రశ్న’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమ పార్టీలోకి కొత్తగా వచ్చే వారు తాము వచ్చిన పార్టీని విమర్శించవద్దని కోరారు. -
జల్లికట్టు ఉద్యమం చూపిన పాఠం మరవొద్దు: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత బాధ్యతతో పరిశీలించి, సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.నేటి భారతదేశంలో లక్షలాది మంది యువకులు ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ తగిన ఉద్యోగ అవకాశాలు లేక నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, ఉద్యోగ నియామకాలపై అనిశ్చితి వంటి అంశాలు యువతలో ఆందోళనను పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ప్రభుత్వాలు కేవలం పరిపాలనా అంశాలుగానే కాకుండా సామాజిక సమస్యలుగా కూడా చూడాల్సిన అవసరం ఉందన్నారు.చరిత్రను పరిశీలిస్తే ప్రజల హృదయాల్లో పుట్టిన ఉద్యమాలను ఏ శక్తీ అడ్డుకోలేదని ఆయన గుర్తు చేశారు. 2017లో చెన్నైలోని మేరినా బీచ్ వేదికగా జరిగిన జల్లికట్టు ఉద్యమం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రారంభంలో కొద్దిమంది యువకులు, విద్యార్థులతో మొదలైన ఆ ఉద్యమం క్రమంగా లక్షలాది మంది ప్రజల మద్దతు పొందిందన్నారు. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకే లక్ష్యంతో ఐక్యమై ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు.జల్లికట్టు ఉద్యమం రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కాకుండా ప్రజల ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజా ఉద్యమంగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ప్రజల సంకల్పం ఎంత బలంగా ఉంటుందో ఆ ఉద్యమం దేశానికి చూపించిందని వ్యాఖ్యానించారు. ప్రజల భావోద్వేగాలను గౌరవించిన ప్రభుత్వాలు చట్టసవరణలు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు.యువతలో నిరాశ, నిరుత్సాహం పెరిగినప్పుడు వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి రెండు ప్రజాస్వామ్య మార్గాలను ఎంచుకుంటారని కేతిరెడ్డి పేర్కొన్నారు. ఒకటి శాంతియుత ప్రజా ఉద్యమాలు కాగా, మరొకటి బ్యాలెట్ ద్వారా తమ ఆకాంక్షలను వ్యక్తపరచడం అని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్పై ఉన్న అనిశ్చితి కారణంగా యువతలో అసంతృప్తి పెరిగిందని, అది రాజకీయ వ్యవస్థలో మార్పు కోరే భావనగా కూడా వ్యక్తమవుతోందన్నారు.జల్లికట్టు వంటి ప్రజా ఉద్యమాలు ఒకవైపు కనిపిస్తుండగా, ఎన్నికల రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయాలను పరిశీలించే ధోరణి కూడా కనిపించిందన్నారు. దీనికి తమిళ సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కళగం పార్టీ సాధించిన అనూహ్య ప్రజాదరణ ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిణామాలు సహజమని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా యువతలో అభద్రతాభావం పెరగడానికి విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షల నిర్వహణ వంటి అనేక కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ అంశాలపై యువతలో చర్చలు, ఆందోళనలు పెరుగుతున్నాయని, వాటిని పాలకులు సకాలంలో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యువత ఆవేదనను నిర్లక్ష్యం చేయడం ఏ ప్రభుత్వానికీ మంచిది కాదని హెచ్చరించారు.ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు పరిష్కారం సంభాషణ, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన ద్వారానే సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా ఉద్యమాలు పుట్టుకురావడానికి కారణమయ్యే పరిస్థితులను ముందుగానే గుర్తించి నివారించడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. అలా జరగని పక్షంలో ప్రజా ఉద్యమాలు అనివార్యమవుతాయని పేర్కొన్నారు.ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని, వారి సమస్యలను సకాలంలో పరిష్కరించే ప్రభుత్వాలే చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. యువత శక్తిని తక్కువ అంచనా వేయరాదని సూచిస్తూ, యువత కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో, శాంతియుత మార్గాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని కోరారు. ప్రభుత్వాలకు హెచ్చరికలు ఇవ్వడం కంటే శాంతియుత మార్గాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. -
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి..
రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే వారిని గుర్తించి, శిక్షించేందుకు తనిఖీలను ముమ్మరం చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. పబ్లిక్ కంపార్ట్మెంట్ల తగ్గింపు, రైళ్ల కొరత వంటి అవకతవకల కారణంగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రైల్వే పరిపాలన విభాగం టికెట్ ఇన్స్పెక్టర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ల నెలవారీ ఆదాయ లక్ష్యాన్ని గణనీయంగా పెంచింది.జరిమానాలు వసూలు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాల ని ప్రణాళిక వేస్తున్నారు. ప్రయాణికుడు ప్రయాణించిన దూరం ఆధారంగా ఈ జరిమానాను లెక్కిస్తారు. రిజర్వేషన్ లేకుండా రెగ్యులర్ స్లీపర్ కోచ్లలో ప్రయాణించే సీజన్ టికెట్ హోల్డర్లను టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణించి జరిమానా విధిస్తారు. ప్రస్తుతం పాలక్కాడ్ డివిజన్లో స్లీపర్ కోచ్లను పర్యవేక్షించే టికెట్ ఇన్స్పెక్టర్ నెలవారీ జరిమానా పరిమితిని రూ.10,000 నుంచి రూ. 25,000కు పెంచారు. దీనివల్ల సంవత్సరానికి రూ. 27 కోట్ల వరకు జరిమానా విధించాల్సి వస్తుంది. సరైన అనుమతి లేకుండా ఖరీదైన బాక్సులకు మారడం వంటి చిన్నపాటి ఉల్లంఘనలకు ఇకపై జరిమానాలు విధిస్తారు. ఈ తీవ్రమైన చర్య ఉద్యోగులు, ప్రయాణికుల మధ్య అనవసర ఘర్షణలకు దారితీయవచ్చని రైల్వే కార్మిక సంఘాలు హెచ్చరించాయి.మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లకు విధించే కనీస జరిమానాలను ఈమేరకు సవరించారు. జనరల్ కోచ్లో 50 కి.మీ. వరకు ప్రయాణానికి రూ. 320, సిట్టింగ్ రిజర్వ్ కంపార్ట్మెంట్లో 50 కి.మీ. వరకు ప్రయాణానికి రూ. 335, స్లీపర్ కోచ్లో ప్రతి 200 కిలోమీటర్లకు రూ. 530 జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా, ఏసీ కోచ్కు కనీస జరిమానా రూ. 745గా, థర్డ్ ఏసీ కోచ్లో ప్రతి 300 కిలోమీటర్లకు రూ.2,070గా , సెకండ్ ఏసీ కోచ్లో ప్రతి 800 కిలోమీటర్లకు రూ. 2,070గా నిర్ణయించారు. అదే సమయంలో రెగ్యులర్, సీజన్ టికెట్ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, రైల్వే పరిపాలన రిజర్వేషన్ లేని జనరల్ కోచ్ల సంఖ్యను పెంచలేదు. దీనికి విరుద్ధంగా, ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ కోచ్లను తగ్గించి, వాటిని ఏసీ కోచ్లుగా మారుస్తున్నారు. తగినన్ని రైళ్లు లేకపోవడంతో, నిత్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఓఎంఆర్లో శాటిలైట్ కార్యాలయం
రెసిడెన్స్ కేంబ్రిడ్జ్ సాక్షి, చైన్నె: డీఏసీ డెవలపర్స్ నేతృత్వంలో చైన్నెలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్ అయిన ఓల్డ్ మహాబలిపురం రోడ్లో కొత్త శాటిలైట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. శనివారం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యుబీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌరవ్ కుమార్ , డీఏసీ డెవలపర్స్ వ్యవస్థాపకుడు సతీష్ కుమార్ సంతానం హాజరయ్యారు. రూ. 250 కోట్ల భారీ పెట్టుబడి ప్లాట్ఫారమ్గా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ. 66 కోట్ల నిధులను యుబి సమకూర్చిందని ప్రకటించారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, రాబోయే ఏడాది కాలంలో భూసేకరణ అవకాశాలను పెంపొందించుకోవడానికి ముందుకెళ్లనున్నట్టు వివరించారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు, డీఏసీ డెవలపర్స్ తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ డీఏసీ కేంబ్రిడ్జ్ ను అధికారికంగా ప్రారంభించారు. ఇంగ్లాండ్లోని ప్రముఖ కేంబ్రిడ్జ్ నగర నిర్మాణ శైలి, అక్కడి చారిత్రాత్మక వైభవం, ఆకర్షణీయమైన ఆర్కిటెక్చర్ స్ఫూర్తితో ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ను రూపకల్పన చేశారు. -
పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు
తిరువళ్లూరు: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్మిస్తున్న పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కవిత హెచ్చరించారు. తిరువళ్లూరు జిల్లా తండలం గ్రామంలో సుమారు రూ.17.20 కోట్లు వ్యయంతో బ్రిడ్జి నిర్మాణ పనులు, కూవం నదిలో రూ.5.98 కోట్లు వ్యయంతో ఆనకట్ట పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులను కలెక్టర్ కవిత అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల నాణ్యత, వేగాన్ని పరిశీలించారు. కాంట్రాక్టర్లకు నిర్ణయించిన వ్యవధిలోపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యతను అధికారులు తరచూ పర్యవేక్షించాలని ఆదేశించిన కలెక్టర్, పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కడంబత్తూరు యూనియన్ సత్తరై గ్రామంలో 14.5 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణపు పనులను సైతం కలెక్టర్ పరిశీలించి వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కొరుక్కుపేట: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపూ ఉందని ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఐసీడబ్ల్యూఓ) కార్యదర్శి ఏ జే హరిహరన్ అన్నారు. గ్రేటర్ చైన్నె కార్పోరేషన్ నిరాశ్రయుల ఆశ్రమంలోని నివాసితులు, సిబ్బంది భాగస్వామ్యంతో, దాని పైకప్పుపై ఒక రూఫ్ గార్డెన్న్ను ఏర్పాటు చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య సామాజిక అభివృద్ధి అధికారి (సీసీడీఓ), సామాజిక అభివృద్ధి అధికారి(సీఈఓ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సహాయ ఇంజినీర్ (ఏఈ) హాజరయ్యారు. అనంతరం, ఆశ్రమంలోని నివాసితులు పర్యావరణంపై అవగాహన కల్పించే రెండు నాటకాలు, ఒక పాటను ప్రదర్శించారు. అధికారులు ఆశ్రమవాసుల కృషిని అభినందించి, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. -
క్లుప్తంగా
తిరువొత్తియూరు: తమిళనాడులోని శీర్కాళి, వైదీశ్వరన్ కోయిల్, పరిసర ప్రాంతాల్లో గత కొన్ని వారాలుగా అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కరెంటు లేకపోవడంతో ప్రజలు నిద్రలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు కూడా దెబ్బతింటున్నాయి. గోవిందరాజ్ నగర్ వంటి ప్రాంతాల్లో సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 వరకు కరెంటు ఉండటం లేదని స్థానికులు వాపోతున్నారు. దీనికి నిరసనగా సుమారు 200 కుటుంబాలకు చెందిన మహిళలు, పిల్లలు, వద్ధులు రోడ్లపైకి వచ్చి శుక్రవారం రాత్రి కాగడాలు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నివాస ప్రాంతాల సమీపంలో ఉన్న చెత్త కుప్పల వల్ల పాములు, తేళ్లు వంటి విషజంతువులు ఇళ్లలోకి వస్తున్నాయని, కరెంటు లేని సమయంలో వాటి వల్ల ప్రాణభయం కలుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ ప్రాంతానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను కోరారు. తిరుత్తణి: తిరుత్తణిలో పోలీసుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పిటిషన్ మేళాలో 50 పెటిషన్లను పరిష్కరించారు. పోలీస్ స్టేషన్లలో చాలా కాలంగా పెండింగ్లో వున్న పెటిషన్లకు పరిష్కారం కనుగొనే విధంగా పిటిషన్ మేళా తిరుత్తణిలోని పోలీసుల బేరక్స్లో శనివారం నిర్వహించారు. ఏఎస్పీ శుభమ్ధిమాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాలో తిరుత్తణి సబ్ డివిజన్లోని తిరుత్తణి, తిరువలంగాడు, కనకమ్మసత్రం, పొదటూరుపేట, ఆర్కేపేట, పళ్ళిపట్టు సహా 6 పోలీస్ స్టేషన్ల నుంచి పిటిషనర్లు పాల్గొన్నారు. పోలీసుల సమక్షంలో వాది, ప్రతివాదులు పాల్గొని పెటిషన్ల పట్ల పరిష్కారంకు చర్యలు చేపట్టి 50 పెటిషన్లను పరిష్కరించారు. ఇందులో ఇన్స్పెక్టర్లు కార్తిక్, శివకుమార్ సహా పోలీసులు పాల్గొన్నారు. తిరువొత్తియూరు: పొన్నేరి ప్రాంతంలో తమిళనాడు ప్రభుత్వం నిషేధించిన గుట్కా ఉత్పత్తులను గోడౌన్లలో దాచి ఉంచి, చిల్లర దుకాణాలకు విక్రయిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తమిళన్బన్కు రహస్య సమాచారం అందింది. దీని ఆధారంగా ఇన్స్పెక్టర్, పోలీసులు కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పొన్నేరి సమీపంలోని తిరువాయుర్పాడిలో ఉన్న ఒక చిన్న దుకాణంలో తనిఖీలు నిర్వహించగా, చిన్నకావణం ప్రాంతానికి చెందిన హరి బాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో, దుకాణాలకు హోల్సేల్గా గుట్కా సరఫరా చేస్తున్నది ఎవరో తెలిసింది. తిరువేంగడపురంకు చెందిన అరుణ్ కుమార్, పులిక్కుళం ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, అక్కడ బస్తాల కొద్దీ గుట్కాను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.దీంతో పోలీసులు అరుణ్ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ 75 వేల విలువైన 106 కిలోల గుట్కా ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పొన్నేరి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొరుక్కుపేట: బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. వివరాలు.. తేని జిల్లా లోని పెరియకుళం వడకరైకి చెందిన ముత్తుపాండి (34) పెరియకుళంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ అతను అరువుపై గృహోపకరణాలు కొనుగోలు చేసి, వాటికి డబ్బు చెల్లించకుండా, పనికి వెళ్లకుండా ఉండేవాడు. ఈ విషయమై ఆ ప్రైవేట్ కంపెనీ తేని పోలీస్ స్టేషన్లో సబ్–ఇన్ స్పెక్టర్ షేక్ సమీకి ఫిర్యాదు చేసింది. అయితే, ఆ ఫిర్యాదుపై సబ్–ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేయలేదు. ఈ పరిస్థితిలో, కొన్ని రోజుల క్రితం, తాను పనిచేస్తున్న కంపెనీకి కొత్తగా వచ్చిన ముత్తుపాండి మేడ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీని తర్వాత, అతడిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై పోలీసులు ఆ ప్రైవేట్ కంపెనీకి చెందిన ఐదుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, ప్రైవేట్ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదుపై ముందుగా విచారణ జరపని సబ్–ఇన్స్పెక్టర్ షేక్ సమీమ్ను, ఫిర్యాదు గురించి సమాచారం ఇవ్వని స్పెషల్ సబ్–ఇన్స్పెక్టర్ అరుల్ను జిల్లా ఎస్పీ స్నేహ సస్పెండ్ చేశారు. వేటకు వెళ్లిన జాలర్లు అదృశ్యం తిరువొత్తియూరు: సముద్రంలో వేటకు వెళ్లిన ముగ్గురు జాలర్లు అదృశ్యమయ్యారు. కడలూరు జిల్లా సి.పుదుపేట షణ్ముగ నగర్కు చెందిన రవి(28), మనోహర్ (27), పుదుచ్చేరి రాష్ట్రం కనకచెట్టికుళంకి చెందిన నాగవేల్ (40) ఈనెల 2న పుదుపేట ఇందిరానగర్కు చెందిన వీరవేల్ ఫైబర్ బోటులో వేటకు వెళ్లారు. వారు మరుసటి రోజే ఒడ్డుకు తిరిగి రావాల్సి ఉంది. కానీ వారు తిరిగి రాకపోవడంతో తోటి జాలర్లు వారి కోసం వెతికారు. కోస్ట్ గార్డ్ ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నామని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. త్వరలోనే వారిని కనిపెడతామని హామీ ఇచ్చారు. -
300 మంది పోలీసు అధికారులకు సీఎం పతకాలు
కొరుక్కుపేట: పోలీసు శాఖలో ప్రతిభ కనబరిచిన 300 మంది పోలీసు అధికారులకు సీఎం పతకాలను ప్రదానం చేశారు. శనివారం జరిగిన కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ అమల్ రాజ్ చేతుల మీదుగా వాటిని పోలీసు అధికారులను అందజేసి ప్రశంసించారు. వీరిలో చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ లా అండ్ ఆర్డర్ డివిజన్కు చెందిన 157 మంది పోలీసు అధికారులు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, సాయుధ దళాలు , మోటార్ వెహికల్స్ డివిజన్, ఇంటెలిజెన్స్ బ్రాంచ్, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, చైన్నెలోని మోడరన్ పోలీస్ కంట్రోల్ రూమ్కు చెందిన 94 మంది పోలీసు అధికారులు ఉన్నారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్లో పనిచేస్తున్న 300 మంది పురుష, మహిళా పోలీసు అధికారులకు సీఎం పతకాల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. వీరిలో సెక్యూరిటీ పోలీస్ యూనిట్, హైకోర్టు సెక్యూరిటీ పోలీస్ యూనిట్, క్రిమినల్ రికార్డ్స్ బ్యూరో, ప్రివెన్షన్ యూనిట్ వంటి ప్రత్యేక విభాగాలలో పనిచేస్తున్న 49 మంది పోలీసు అధికారులు కూడా ఉన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ సాక్షి, చైన్నె : తమిళనాడులో వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెడతామని, కావేరి జలాలలను త్వరలోనే సాగు నిమిత్తం విడుదల చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ తెలిపారు. కుంభకోణం పరిధిలోని కోవిలాచ్చేరి, మిళలై ప్రాంతాలలో సి, డి విభాగం కాలువల పూడికతీత పనులను వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ శనివారం ప్రారంభించారు. వ్యవసాయ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో కోవిలాచ్చేరి మిళలైలో 6.9 కి.మీ., కల్లూర్లో 14.6 కి.మీ., తిరునల్లూర్లో 2.6 కి.మీ., నీరత్తనల్లూర్లో 2.5 కి.మీ చొప్పున మొత్తం 26.65 కి.మీ పొడవునా రూ.9.25 లక్షల అంచనా వ్యయంతో ఈ పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం మంత్రి వినోద్ మీడియాతో మాట్లాడారు. జూన్ 12వ తేదీన మేట్టూరు డ్యాం నుంచి కావేరి జలాలలను సాగు నిమిత్తం విడుదల చేస్తారా? అని ప్రశ్నించగా, ముందస్తుగానే కావేరి నీటిని త్వరలోనే విడుదల చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి విడిగా ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం, అరసలాటి నదిలో 3వ విడతగా 4.30 కి.మీ పొడవునా జరుగుతున్న పూడికతీత పనులను కూడా మంత్రి వినోద్ స్వయంగా పరిశీలించి ప్రారంభించారు. మీడియాను సీఎం కలవాల్సిన అవసరం లేదు సాక్షి, చైన్నె : సీఎం విజయ్ మీడియాను కలవడానికి నిర్దిష్టమైన, రోజువారీ పద్ధతి ఏమీ లేదని మంత్రి నిర్మల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మదురైలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుప్పర కుండ్రం దీపం వ్యవహారంలో ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో రెండేళ్ల క్రితం ఎలాంటి పరిస్థితి ఉందో, అదే పరిస్థితి ఇప్పుడూ కొనసాగాలన్నదే ప్రభుత్వ విధానంగా వ్యాఖ్యలు చేశారు. మత శక్తులు ఇక్కడ రాజకీయం చేయడానికి తాము నూటికి నూరు శాతం అనుమతించమన్నారు. తాము ఇక్కడ రాజకీయాలు చేయడానికి లేమని, ప్రజా సేవలోనే ఉన్నామని స్పష్టంచేశారు. మీడియా విధానం సీఎం విజయ్ మీడియాను కలిసే విధానంపై మంత్రి నిర్మల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం మీడియాను కలవడానికి నిర్దిష్టమైన, రోజువారీ పద్ధతి ఏమీ లేదు’ అని వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉన్న పాలకులు తమ సొంత ప్రచారం కోసం, ఉనికిని చాటుకోవడానికి రోజూ మీడియా ముందుకు వచ్చేవారన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్తోందని, మంత్రులు రోజూ ప్రజలను కలుస్తున్నారన్నారు. విద్యుత్ బోర్డులో హార్డ్ డిస్క్ల మయం విషయంగా డీఎంకే నేత సెంథిల్ బాలాజీ స్పందించడం ఏమిటో? అని విమర్శించారు. ఈ విషయాలతో సెంథిల్ బాలాజీకి ఉన్న సంబంధం ఏంటి? ఆయన ఎందుకు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు? విచారణ తర్వాత అన్ని విషయాలూ బయటకు వస్తాయని స్పష్టం చేశారు. -
ముందే చెప్పే బయటకు వచ్చాం!
సాక్షి, చైన్నె: డీఎంకేకు ముందే చెప్పే కూటమి నుంచి బయటకు వచ్చామని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం వ్యాఖ్యలు చేశారు. శనివారం చైన్నెలో సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర పాండియన్తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం పార్టీలను తమ కూటమిలోకి చేర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీ ( సీపీఐ ) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి. వీరపాండ్యన్ను కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కలవడం ప్రాధాన్యతకు దారి తీసింది. చైన్నె టి.నగర్ లోని సీపీఐ ప్రధాన కార్యాలయం బాలన్ ఇల్లంలో ఈ భేటీ జరిగింది. రాబోయే రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం చిదంబరం ను మీడియా ప్రశ్నించగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను, ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ ను కేవలం మర్యాదపూర్వకంగా కలవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. చాలా సంతోషం, ధన్యవాదాలని చిదంబరం క్లుప్తంగా ముగించారు. డీఎంకే కూటమి గురించి.. అదే సమయంలో డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఎన్నికల తర్వాత కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా టీవీకే పార్టీకి మద్దతుగా వెళ్లిపోయిందనే విమర్శలు ఉన్నాయి కదా? అని ప్రశ్నించగా, తాను ఈ విషయంలో లోతుగా వెళ్లాలనుకోవడం లేదన్నారు. అయితే, తాము డీఎంకేకు ముందే చెప్పే వచ్చామని, దీనికి మించి తానేమీ మాట్లాడనన్నారు. మళ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అటు పార్టీగానీ, ఇటు తమిళనాడు ప్రజలుగానీ సిద్ధంగా లేరన్నారు. ఇదే అభిప్రాయాన్ని సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు కూడా వ్యక్తం చేశాయన్నారు. తమ వైఖరిలో, ఇతర మిత్రపక్షాల వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. వారు రెండు రోజుల తర్వాత నిర్ణయం తీసుకున్నారని, తాము మరుసటి రోజే నిర్ణయం తీసుకున్నామని, కేవలం సమయంలోనే తేడా తప్ప, తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని వ్యాఖ్యలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ మాట్లాడుతూ పి. చిదంబరం తమ కార్యాలయానికి రావడం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని స్పష్టం చేశారు. గతంలో చిదంబరంతో కలిసి పనిచేసిన మోహన్ కుమారమంగళం, ఎ.ఎమ్. గోపు, టి పాండియన్, కె.డి.కె. తంగమణి, వి.పి. చింతన్ వంటి సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకుల గురించి తాము చర్చించామన్నారు. అలాగే ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, ప్రజల తీర్పుపై సాధారణంగా మాట్లాడుకున్నామన్నారు. కాంగ్రెస్ కూటమిలోకి కమ్యూనిస్టులు?: కాంగ్రెస్ ప్రయత్నాలపై స్పందిస్తూ, కమ్యూనిస్ట్ పార్టీ అంత సులభంగా ఏ కూటమిలోనూ చేరదన్నారు. అలాంటి నిర్ణయాలు తాము ఒంటరిగా తీసుకోమని, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు పార్టీ కమిటీ ద్వారానే నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం తాము సెక్యులర్ ప్రోగ్రెసివ్ కూటమి(డీఎంకే) లోనే ఉన్నామన్నారు. ఆ కూటమిలో ఉంటూనే టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామన్నారు. ఇండియా కూటమి సమావేశానికి డీఎంకే హాజరు కాక పోవడం వారి వ్యక్తిగత నిర్ణయమి తాము ఇండియా కూటమిలోనే ఉన్నామన్నారు. జాతీయ స్థాయిలో జరిగే సమావేశంలో తమ పార్టీ కేంద్ర నాయకులు పాల్గొంటారన్నారు. చిదంబరం -
రజనీ చిత్రానికి మళ్లీ మార్పు
తమిళసినిమా: రజనీకాంత్ 173వ చిత్రం గురించి ఏ ముహూర్తాన అనుకున్నారో గానీ దర్శకుల మార్పు జరుగుతూనే ఉంది. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న జైలర్–2 చిత్రాన్ని పూర్తి చేసేశారు. ఈ చిత్రం సెప్టెంబర్లో రిలీజ్కి సిద్ధం అవుతోంది. దీంతో తర్వాత తన 173వ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని కమలహాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నట్లు ప్రకటించి చాలా కాలమైంది. ఈ చిత్రానికి చాలా మంది దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరికి సుందర్ సి పేరును ఖరారు చేశారు. ఈయనతో చిత్ర పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే అనూహ్యంగా సుందర్ సి చిత్రం నుంచి వైదొలిగారు.ఆ తరువాత పార్కింగ్ చిత్రం దర్శకుడు రామ్కుమార్ బాలకృష్ణన్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అదీ సెట్ కాలేదు. ఆ తరువాత డాక్టర్, డాన్ చిత్రాల దర్శకుడు సిబి చక్రవర్తి చెప్పిన కథ రజనీకాంత్కు నచ్చడంతో ఆయన పేరు ఖరారైంది. ఈ చిత్రాన్ని కచ్చితంగా హిట్ చేస్తానని సిబి చక్రవర్తి ఒక వేదికపై చాలా నమ్మకంగా చెప్పారు. అలాంటిది ఆ తరువాత ఆయన పేరు మారిన వారి లిస్ట్లో చేరిపోయింది. తాజాగా ఓమై కడవులే, డ్రాగన్ చిత్రాల ఫేమ్ అశ్వద్ మారిముత్తు పేరు వినిపిస్తోంది. అంతే కాదు ఈయన ఫిక్స్ అనే. ప్రచారం జరుగుతోంది. ఇందులో దర్శకుడు మిష్కిన్ ఒక కీలక పాత్రను పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీటిలో ఏ విషయాన్ని యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. కథ నచ్చే వరకు తమ అన్వేషణ కొనసాగుతుంది అని కమలహాసన్ ఇంతకుముందే పేర్కొన్నారు అన్నది గమనార్హం. అశ్వద్ మారిముత్తు, రజనీకాంత్ -
12న తెరపైకి మూండ్రామ్ కన్
తమిళసినిమా: విదార్థ్, కలైయరసన్, త్రిగుణ్, సంతోష్ ప్రతాప్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మూండ్రామ్ కన్. ట్రెండింగ్ ఎంటర్టెయిన్మెంట్ అండ్ వైట్ హార్స్ స్టూడియోస్ సంస్థపై కే.శశికుమార్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా సహోగణేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తేజుఅశ్విని, అతుల్య చంద్ర హీరోయిన్లుగా నటించిన ఇందులో జాన్విజయ్, కేపీవై శరత్ ముఖ్యపాత్రలు పోషించారు. రాజ్ ప్రతాప్ సంగీతాన్ని,ఉదయ్ కుమార్ చాయాగ్రహణం అందించారు. ఈనెల 12న చిత్రం తెరపైకి రానుంది. శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు చిత్రం గురించి తెలుపుతూ హైపర్ లింక్, ఆంథాలజీ నేపథ్యంలో రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఇది ఉంటుందని చెప్పారు. కథ చెప్పగానే నూతన దర్శకుడు అని ఆలోచించకుండా తనపై నమ్మకంతో చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాత శశికుమార్ కు ధన్యవాదాలు అన్నారు. చిత్ర నిర్మాత శశికుమార్ మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ తనకు చాలా బాగా నచ్చిందని, దీంతో వెంటనే నిర్మించడానికి సిద్ధమైనట్లు చెప్పారు. ప్రణాళిక ప్రకారం చిత్రాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు సహోగణేశన్ ధన్యవాదాలు అన్నారు. -
తమిళనాడు అసెంబ్లీకి తొలి మహిళా కార్యదర్శి
– బాధ్యతలు స్వీకరించిన శాంతి సాక్షి, చైన్నె : తమిళనాడు అసెంబ్లీకి తొలి మహిళా కార్యదర్శిగా శాంతి నియమితులయ్యారు. ఆమె శనివారం తన బాధ్యతలను స్వీకరించారు.సీఎం విజయ్, అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. కె. శాంతి తమిళనాడు శాసనసభ సచివాలయంలో దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ అధికారి. ఆమె నేరుగా ఐఏఎస్ కేడర్ అధికారి కాకపోయినప్పటికీ, అసెంబ్లీ సెక్రటేరియట్ సర్వీసెస్ ద్వారా పదోన్నతులు పొందుతూ ఈ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. అసెంబ్లీ నిబంధనలు, చట్టసభల పనితీరుపై ఉన్న పట్టు కారణంగా ఆమె మార్చి లో శాసనసభ ప్రత్యేక కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఇప్పటివరకు కార్యదర్శిగా ఉన్న శ్రీనివాసన్ రాజీనామాతో తమిళనాడు ప్రభుత్వం ఆమెను పూర్తిస్థాయి కార్యదర్శిగా నియమించింది. ఆమె పదవీకాలం జూలైతో ముగియాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి మరో ఏడాది పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమిళనాడు అసెంబ్లీ చరిత్రలోనే ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. కాగా, సభలో ఏవైనా రాజ్యాంగపరమైన లేదా చట్టపరమైన చిక్కులు వచ్చినప్పుడు స్పీకర్కు తగిన సలహాలు ఇచ్చే మొదటి వ్యక్తి కార్యదర్శే. సభ నియమ నిబంధనల పుస్తకంపై వీరికి పూర్తి అథారిటీ ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరగాలనే తేదీల అధికారిక నోటిఫికేషన్లను జారీ చేయడం. సభలో రోజూ ఏయే బిల్లులు ప్రవేశపెట్టాలి, ఏ అంశాలపై చర్చ జరగాలనే అజెండా ముందుగానే సిద్ధం చేయడం , కొత్త చట్టాల రూపకల్పన ప్రక్రియలోలోపాలు లేకుండా పర్యవేక్షించడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారు. -
సంతానోత్పత్తే లక్ష్యంగా సముద్రంలోకి షార్క్స్
సాక్షి, చైన్నె: సముద్ర జీవుల సంరక్షణ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచే ఘట్టం శనివారం ఆవిష్కృత మైంది. చైన్నెలోని విజీపీ మైరెన్ కింగ్డమ్ తమ అక్వేరియంలో కృత్రిమ వాతావరణంలో పుట్టి పెరిగిన శ్రీబ్యాండెడ్ బాంబూ షార్క్క్ను రకం సొరచేపలను విజయవంతంగా సముద్రంలోకి విడుదల చేసింది. సుస్థిర సముద్ర జీవవైవిధ్య సంరక్షణ , బాధ్యతాయుతమైన ఆక్వాకల్చర్ దిశగా ఈ ప్రయత్నం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి ఎ. శ్రీనాథ్ సమక్షంలో ఈ చారిత్రాత్మక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సముద్ర జీవశాస్త్రవేత్తలు, పర్యావరణ సంరక్షణ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శాసీ్త్రయ అక్వేరియం నిర్వహణకు నిదర్శనం సముద్రంలోకి విడుదల చేసిన సొరచేపలు పూర్తిగా విజీపీ మైరెన్ కింగ్డమ్ సముద్ర జీవ నిపుణుల పర్యవేక్షణలో జన్మించి, పెరిగాయి. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ బ్యాండెడ్ బాంబూ షార్క్స్ను విజయవంతంగా సంతానోత్పత్తి చేసినట్లు విజీపీ మైరెన్ కింగ్డమ్ ప్రకటించింది. ఈసందర్భంగా మంత్రి ఎ. శ్రీనాథ్ మాట్లాడుతూ, ఈ వినూత్న కార్యక్రమం ఎంతో అభినందనీయమన్నారు. రాబోయే తరాలలో సముద్ర జీవుల సంరక్షణపై అవగాహన పెంచడం చాలా అవసరం అన్నారు. శాసీ్త్రయ పరిశోధనలు, ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఇలాంటి బాధ్యతాయుతమైన ప్రయత్నాలు భారతదేశ సంపన్న సముద్ర వారసత్వాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విజీపీ గ్రూప్స్ చైర్మన్ వి.జి. సంతోష్ మాట్లాడుతూ, విజీపీ కుటుంబంలో సీనియర్ సభ్యుడిగా, సమాజానికి, సముద్ర సంరక్షణకు ఉపయోగపడే ఇంతటి గొప్ప ప్రాజెక్ట్ను విజీపీ మైరెన్ కింగ్డమ్ విజయవంతం చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నదన్నారు. భావితరాలకు పర్యావరణంపై అవగాహన కల్పించేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోవిజీపీ మైరెన్ కింగ్డమ్ ఎండీ వి.జి.పి. రవిదాస్, డైరెక్టర్ వి.జి.పి.ఆర్. ప్రేమ్దాస్ తదితరులు పాల్గొన్నారు. -
మలేషియా సంస్థతో చైన్నెస్ అమృత ఒప్పందం
సాక్షి, చైన్నె: ప్రపంచవ్యాప్త ఉద్యోగ అవకాశాలను విస్తరించేందుకు నగరానికి చెందిన చైన్నెస్ అమృత గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మలేషియన్ అసోసియేషన్ ఆఫ్ హోటల్స్(ఎంఏహెచ్)తో చారిత్రాత్మక అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. ఈ మేరకు స్థానికంగా జరిగిన సమావేశంలో చైన్నెస్ అమృత ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ భూమినాథన్ , మలేషియన్ అసోసియేషన్ ఆఫ్ హోటల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఐజాక్రాజ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ముందుగా చైన్నెకి చెందిన అమృత విద్యార్థులు తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. పండ్లు, కూరగాయల చెక్కడాలు, కళ్లకు గంతలు కట్టుకుని నాప్కిన్లను మడవడం, సృజనాత్మక టవల్ ఆర్ట్ ప్రదర్శనలతో తమ అసాధారణమైన ఆతిథ్య నైపుణ్యాలను ప్రదర్శించారు. అనంతరం ఆర్. భూమినాథన్ మాట్లాడుతూ హాస్పిటాలిటీ విద్యార్థులకు అంతర్జాతీయ కెరీర్ మార్గాలను మెరుగుపరిచే దిశగా మలేషియా సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 1,100కు పైగా హోటళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న మలేషియాలోని మలేషియన్ అసోసియేషన్ ఆఫ్ హోటల్స్తో ఒప్పందం కుదుర్చుకోవటం తమ విద్యార్థులు అదృష్టమని అన్నారు. ఈ సహకారం కింద, మలేషియాలోని ఎంఏహెచ్ అనుబంధ హోటళ్లలో ఏటా 1,000 మందికి పైగా విద్యార్థులు ప్లేస్మెంట్ అవకాశాలతో ప్రయోజనం పొందుతారన్నారు. ఈ భాగస్వామ్యం విద్యార్థులకు అమూల్యమైన ప్రపంచవ్యాప్త అనుభవాన్ని, అంతర్జాతీయ పని అనుభవాన్ని పొందగలరని పేర్కొన్నారు. చైన్నెస్ అమృత ఇప్పటికే 31,651 జాతీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్ల అద్భుతమైన రికార్డుతో హాస్పిటాలిటీ విద్యారంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఇందులో ఫ్యూచర్ డ్రీమ్ అకాడమీ సీఈఓ కలైయరసన్, చైన్నెస్ అమృత ఇన్స్టిట్యూట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బానుమతి తదితరులు పాల్గొన్నారు. -
సోనీ ఖాతాలో టెక్సాస్ టైగర్ ఆడియో
తమిళసినిమా: యూకే స్క్వాడ్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం టెక్సాస్ టైగర్. ఫ్యామిలీ పడం చిత్రం ఫేమ్ సెల్వ కుమార్ తిరుమారన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో డ్యూడ్ చిత్రం ఫేమ్ హిరుదు హరూన్, సంయుక్త విశ్వనాథన్, రోహిణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు సెల్వకుమార్ తిరుమారన్ తెలుపుతూ ఎంటర్టెయిన్మెంట్, భావోద్రేకాలతో కూడిన సన్నివేశాలు, ఆసక్తికరమైన అంశాలతో సాగే ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉంటుందని చెప్పారు. చిత్ర ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ సంస్థ సోనీ పొందిందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత పొందిన ఈ మ్యూజిక్ సంస్థ తమ చిత్రం ఆడియో హక్కులను పొందడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఎంతో అంకితభావంతో శ్రమించిన చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్రానికి, ఆడియోకు ప్రపంచ ప్రేక్షకుల అందించే ఆదరణను చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్ర ఆడియో, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని దర్శకుడు తెలిపారు. -
వివాహితపై అత్యాచారం కేసులో..
తిరువళ్లూరు: ఆలయ ఉత్సవానికి వెళ్లి కారులో తిరుగు ప్రయాణమైన మహిళను బలవంతంగా లాక్కెళ్లి ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడంతో పాటూ ఆమె వద్ద వున్న బంగారు నగలను లాక్కెళ్లారు. ఈ కేసులో ఆరుగురికి జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి జూలియట్ పుష్ప శనివారం తీర్పును వెలువరించారు. వివరాలు.. దిండివనం ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వయస్సు వున్న వివాహిత మహిళ తన భర్తతో కలిసి తిరువళ్లూరు జిల్లా పూందమల్లి అయ్యప్పన్తాంగెల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గత 2022వ సంవత్సరంలో దిండివనంలో జరిగిన ఆలయ ఉత్సవానికి వెళ్లిన మహిళ కారులో తిరుగు ప్రయాణమైంది. పూందమల్లి సమీపంలోని తెల్లియర్ అగరం ప్రాంతానికి సమీపంలో వస్తున్న సమయంలో అక్కడ మద్యం సేవిస్తున్న ఆరుగురు వ్యక్తులు కారును అడ్డగించారు. అనంతరం కారు డ్రైవర్ ఇళంగోవన్పై దాడి చేసి కారులో వున్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. కారు డ్రైవర్, బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోరూర్ ఎస్ఆర్ఎం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులు అయ్యప్పన్ తాంగెల్ ప్రాంతానికి చెందిన వేలు కుమారుడు సూర్య(22), చిన్నయ్య కుమారుడు కరుప్పయ్య(27), అయ్యపాక్కం ప్రాంతానికి చెందిన అన్బళగన్ కుమారుడు దినేష్(28) కారపాక్కం ప్రాంతానికి చెందిన సెందిల్కుమార్ కుమారుడు గణేష్(19), సుందర్ కుమారుడు సంతోష్కుమార్(22) సుధాకర్ కుమారుడు సుభాష్(19)గా గుర్తించి అప్పట్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాధిత మహిళ షెడ్యూల్ కులానికి చెందినవారు కావడంతో అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కేసు విచారణ తిరువళ్లూరు కోర్టులో సాగింది. తాజాగా విచారణ పూర్తయిన క్రమంలో ఐదుగురు నిందితులకు జీవితఖైదు శిక్షతో పాటు ఒక్కోక్కరికి రూ.67 వేలు జరిమానాను జడ్జి విధించారు. మరో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటూ రూ.27 వేలు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం నిందితులను పుళల్ జైలుకు తరలించారు. బాధిత మహిళకు ఓ ఎయిడెడ్ పాఠశాలలో ఉద్యోగాన్ని కల్పించారు. -
స్థానిక సంస్థలకు 16 సూత్రాల మార్గదర్శకాలు
సాక్షి,చైన్నె : తమిళనాడు పట్టణ ప్రాంతాలలో, చైన్నె కార్పొరేషన్ పరిధిలో స్థానిక సంస్థల సేవలను మెరుగుపరచడానికి, నగర సుందరీకరణతో పాటుగా ఆదాయ వనరులను పెంచడానికి సీఎం సి. జోసెఫ్ విజయ్ చర్యలు చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పురపాలక పరిపాలన, నీటి సరఫరా శాఖ శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 16 సూత్రాల మార్గదర్శకాలు ● పారిశుధ్య పనులను, వీధుల శుభ్రతను పర్యవేక్షించడానికి కార్పొరేషన్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, , జోనల్ అధికారులు అందరూ ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు క్షేత్రస్థాయికి (ఫీల్డ్ విజిట్) చేరుకోవాలి. ● ప్రజల రాకపోకలు పెరగక ముందే తెల్లవారుజామునే వీధులను శుభ్రం చేయాలి. బహిరంగ మరుగుదొడ్లు నిరంతరం శుభ్రంగా, చెత్తాచెదారం లేకుండా ఉండేలా ఉన్నతాధికారులు ప్రతిరోజూ తనిఖీలు నిర్వహించాలి. ● నగరం సుందరీకరణను పాడుచేసేలా బహిరంగ గోడలపై ఇష్టానుసారంగా పోస్టర్లు అతికించడాన్ని పూర్తిగా నిషేధించారు. కేవలం ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక ప్రదేశాలలో మాత్రమే ప్రకటనలు ప్రదర్శించాలి. ● నగరంలోని వీధి దీపాలను వారానికి ఒకసారి ఖచ్చితంగా తనిఖీ చేయాలి. ఎక్కడైనా దీపాలు వెలగకపోతే లేదా పాడైపోతే సమాచారం అంది న 24 గంటలలోపు వాటిని మరమ్మత్తు చేయాలి. ● చైన్నెలోని సుమారు 3.11 లక్షల వీధి కూడళ్ల పరిధిలో ప్రతిరోజూ సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజీ వ్యవస్థలను తనిఖీ చేసి, 99.2 శాతం ప్రాంతాలను తక్షణమే క్రిమిరహితం చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ● స్థానిక సంస్థల ఆర్థిక వనరులను బలోపేతం చేయడానికి ఆస్తి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని, నీటి పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు. ప్రజ్ఞానందకు అభినందనలు నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో టైటిల్ గెలుచుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా సరికొత్త చరిత్ర సృష్టించిన యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందకు సీఎం సి. జోసెఫ్ విజయ్ అభినందనలు తెలిపారు. ఒకే టోర్నమెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ను రెండుసార్లు ఓడించడమే కాకుండా, వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి ప్రజ్ఞానంద అద్భుతమైన రికార్డు సృష్టించడం ఆనందంగా ఉందన్నారు. -
ప్రైవేట్ ఆమ్నీ బస్సులకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, చైన్నె: చైన్నె నగరం నుండి నడిచే ప్రైవేట్ ఆమ్ని (ట్రావెల్స్) బస్సులు కచ్చితంగా కిలాంబాక్కం బస్టాండ్ నుండే నడపాలని, నగరంలోకి ప్రవేశించకూడదని రాష్ట్ర రవాణా శాఖ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను చైన్నె హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. వివరాలు.. చైన్నె నుండి దక్షిణ జిల్లాలకు వెళ్లే అన్ని ప్రైవేట్ ఆమ్ని బస్సులు కిలాంబాక్కం బస్ టెర్మినల్ నుండే కార్యకలాపాలు సాగించాలని, నగర పరిధిలోకి రాకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని 2024 జనవరి 22న రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, ఆమ్ని బస్సు యజమానుల సంఘం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. గతంలో ఈ కేసును విచారించిన హైకోర్టు.. పోరూర్, సూరపట్టు ప్రాంతాలలో ప్రయాణికులను ఎక్కించుకోవడానికి, దించడానికి బస్సులకు అనుమతినిస్తూనే, దక్షిణ జిల్లాలకు వెళ్లే బస్సులు కిలాంబాక్కం బస్టాండ్ లోపలికి వెళ్లి రావాలని తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తుది తీర్పుతో ఊరట ఈ కేసుపై తుది విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ బెంచ్ శనివారం తీర్పును వెలువరించారు. తమిళనాడు మోటార్ వాహనాల చట్టం ప్రకారం, ఒక బస్ టెర్మినల్ ఏర్పాటుకు రవాణా శాఖ అనుమతి కోరుతూ చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దరఖాస్తు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. కేవలం సంబంధిత స్థానిక సంస్థ మాత్రమే దరఖాస్తు చేయాలన్నారు. ఈదృష్ట్యా కిలాంబాక్కం బస్టాండ్ అనుమతి కోసం కాటాన్ కొళత్తూరు పంచాయతీ యూనియన్ రాష్ట్ర రవాణా కమిషనరేట్కు దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించారు. ఒక నిర్దిష్ట రూట్లో బస్సును నడపడానికి రూట్ లైసెన్స్ మంజూరు చేసిన తర్వాత, దానిని అడ్డుకునే హక్కు రవాణా శాఖకు లేదని స్పష్టంచేశారు. ఆమ్ని బస్సులు కిలాంబాక్కం నుండే నడపాలన్న రవాణా శాఖ ఉత్తర్వులను న్యాయమూర్తి రద్దు చేశారు. అలాగే జనవరిలో రవాణా శాఖ అధికారులు, ఓమ్ని బస్సు యజమానుల మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని కోర్టు ప్రస్తావించింది. పోరూర్ టోల్గేట్, సూరపేడు ప్రాంతాల తరహాలోనే.. మాధవరం రౌండానా సమీపంలోని ప్రాంతాన్ని కూడా ప్రయాణికులను ఎక్కించడానికి, దించడానికి ఉపయోగించుకోవాలని, ఈ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాలని రవాణా అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. ఆమ్నీ బస్సులు -
వేదికపై నటుడు సత్యరాజ్ ఉద్వేగం
సాక్షి, చైన్నె: డీఎంకే నేతృత్వంలో జరిగిన సభలో పాల్గొన్న ప్రముఖ నటుడు సత్యరాజ్ భావోద్వేగంగా మాట్లాడుతూ, ప్రత్యర్థులపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను సాధారణంగా చాలా వ్యంగ్యంగా మాట్లాడతానని, ప్రతిదానిని హాస్యంగా తీసుకోలేనని, కొందరు తనను ఇన్స్ట్రాగామ్లో రకరకాలుగా తిడుతున్నారని వివరించారు. అయితే తాను వాటి గురించి అస్సలు చింతించనని పేర్కొన్నారు. నటుడు విజయ్ స్థాపించిన పార్టీని ఉద్దేశిస్తూ.. ‘కేవలం పేర్లు మార్చితే సరిపోదు, ద్రావిడ మోడల్ ఇప్పటికే ఎన్నో మార్పులు తెచ్చిందన్నారు. సినిమాపై అభిరుచి ఉండటం వేరు, రాజకీయం వేరు అంటూ మార్పు కావాలనుకున్నప్పుడు, అది ఎలాంటి మార్పు అనేది ఆలోచించాల్సిన అవశ్యం ఉందన్నారు.. ద్రావిడ సామాజిక న్యాయ భావజాలానికి భిన్నమైన సిద్ధాంతాలు వస్తే ప్రజలు ఆలోచించాలని సూచించారు. సోదరుడు విజయ్.. అంబేడ్కర్, ద్రావిడ , తమిళ జాతీయవాదం తన రెండు కళ్లు అంటున్నారని, ఇక్కడ కేవలం నాయకులు, వ్యక్తులు మాత్రమే మారుతున్నారన్నారు. పార్టీలలో లోపాలు ఉంటే వాటిని ప్రశ్నించి, పరిష్కరించే వారికే ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు. కొలత్తూరు యోజకవర్గంలో ఎం.కె. స్టాలిన్ గెలవలేదంటూ వస్తున్న విమర్శలపై సత్యరాజ్ స్పందిస్తూ, అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. రాబోయే రోజుల్లో కూడా స్టాలిన్ నాయకత్వమే బలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇద్దరు బాలికలకు లైంగిక వేధింపులు – తల్లి రెండో భర్త అరెస్ట్ తిరువొత్తియూరు: సేలం సమీపంలోని అయోధ్యపట్నంకు చెందిన మహిళ (38) తన మొదటి భర్త నుండి విడిపోయి, తన 17 ఏళ్ల, 15 ఏళ్ల కుమార్తెలతో కలిసి నివసిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం, ఆమె రమేష్ (36) అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. గత కొన్ని రోజులుగా, రమేష్ తన ఇద్దరు సవతి కుమార్తెలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అతని వేధింపులను భరించలేక, ఆ బాలికలు శుక్రవారం అమ్మపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీస్ ఇన్స్పెక్టర్ పంకజం నేతృత్వంలో విచారణ చేపట్టిన పోలీసులు, రమేష్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం అతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
ఉద్యమానికి అనూహ్య మద్దతు
సాక్షి, చైన్నె : తమిళనాట భారతీయ జనతా పార్టీలో కలవరం మొదలైంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలైకు మద్దతుగా ఆ వర్గాలు కదులుతున్నాయి. ఆయన స్థాపించిన వీ ది లీడర్స్ ఉద్యమంలోకి ఒక్క రోజులో 15 లక్షల మందికి పైగా చేరారు. ఇక కోయంబత్తూరు రీజియన్లో ఆయనకు మద్దతుగా వీజేపీ కీలక జిల్లా నేతలు పెద్దఎత్తున పార్టీని వీడారు. వీరంతా అన్నామలై ఉద్యమం వైపు అడుగులు వేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అన్నామలై వీ ది లీడర్స్ రాజకీయ ఉద్యమానికి శుక్రవారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు మద్దతుగా సంబంధిత వెబ్ సైట్లో చేరికలు క్రమంగా పెరిగాయి. ఆయన పిలుపు మేరకు ఒక్క రోజులో 15 లక్షల మందికి పైగా ఉద్యమంలో చేరారు. ఇది బీజేపీ బి–టీమ్ కాదు అన్నామలై తీవ్ర మద్దతుదారుడు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ ఉత్తమ రామసామి మీడియాతో మాట్లాడుతూ.. తామంతా అన్నామలై ప్రారంభించిన వీ ద లీడర్స్ అనే నూతన సంస్థలో సభ్యులుగా చేరామని, ఇది బీజేపీకి బి–టీమ్ మాత్రం కాదన్నారు. రాబోయే ఉపఎన్నికలు లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నామలై పోటీ చేస్తారని ప్రకటించారు. ఇకపై తమిళనాడు రాజకీయాల్లో కేవలం విజయ్ , అన్నామలై మధ్య మాత్రమే పోటీ అంటూ, వీరిద్దరే ప్రధాన శక్తులుగా బరిలో ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కోవై దక్షిణ జిల్లా బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాటుగా మరో 14 మంది జిల్లాల నేతలు పార్టీని వీడారు. వందలాది మంది కార్యకర్తలు కూడా అన్నామలై బాటలోనే నడిచారు. గత లోక్సభ ఎన్నికల్లో పొల్లాచ్చి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ జిల్లా అధ్యక్షుడు కె. వసంతరాజన్ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. కాగా, అన్నామలై అడ్డగా మారిన కొంగునాడు ప్రాంతంలో ఒకేసారి పెద్ద ఎత్తున కీలక నేతలు పార్టీని వీడటం తమిళనాడు బీజేపీలో తీవ్ర కలకలం రేపింది. బీజేపీకి తిరిగి రండి : నైనార్ నాగేంద్రన్ బీజేపీ నుంచి అన్నామలై ఉద్యమంలోకి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నేతలు కదులుతుండటంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ , కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్లో చైన్నె పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. కేడర్ను రక్షించుకునే దిశగా వ్యూహా రచనలో పడ్డారు. అనంతరం నైనార్ మీడియాతో మాట్లాడుతూ,. తెలిసి తెలియక పార్టీ వీడిన వారు ఎప్పుడైనా సరే తిరిగి రావచ్చు అని, వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోబోమన్నారు. అన్నామలైతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. వీ ద లీడర్స్ అనేది కేవలం ఒక ఉద్యమం మాత్రమేనని, ప్రధాని మోదీ ఆశీస్సులు తమకున్నాయని ఆ ఉద్యమ నేతలు పేర్కొంటుండటాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ లేదా అమిత్ షాల ఆశీస్సులు ఏ ఇతర ఉద్యమానికి లేవు అని స్పష్టం చేశారు. ఆ ఉద్యమంలో ఉంటూనే బీజేపీలోనూ కొనసాగవచ్చని కొందరు చెబుతున్నారని, అది సాధ్యం కాదని, బీజేపీ సిద్ధాంతాలు, దేశభక్తి పునాదులపై నడిచే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని, కార్యకర్తలు ఇలాంటి ప్రచారాలను నమ్మి ఎక్కడికీ వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా పాల్గొన్న ప్రతి వేదికపైనా అన్నామలై ముందుండి కార్యక్రమాలను నడిపారని, అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా 100 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఒకవేళ పార్టీతో ఏవైనా విభేదాలు ఉంటే ఆయన అప్పుడే చెప్పి ఉండాల్సిందని, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. పార్టీ వీడిన కొందరు నేతలు మళ్లీ బీజేపీ గూటికే చేరడం చరిత్రలో చూశామని, తాజాగా తెలిసి తెలియక వెళ్లిన వారంతా తిరిగి రావాలని పిలుపునిస్తున్నానని,. వారిపై ఎలాంటి చర్యలు ఉండవని బీజేపీ ఎప్పుడూ బలంగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అన్నామలై వైపుగా బీజేపీ నేతల అడుగులు -
అగ్నిప్రమాదాల్లో జాగ్రత్తలపై అవగాహన
తిరుత్తణి: అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే విధంగా తిరుత్తణిలో శనివారం మాక్డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక శాఖ ద్వారా అగ్ని ప్రమాదాలు పట్ల ప్రజలకు అవగహన కల్పించే విధంగా రండి నేర్చకుందాం నినాదంతో రెండు రోజుల పాటూ అగ్రిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను రాష్ట్రవాప్తంగా అగ్ని ప్రమాద శాఖ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుత్తణిలోని అగ్ని ప్రమాద శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాద అధికారి సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన మాక్డ్రిల్ శిబిరంలో పట్టణ ప్రజలతో పాటూ కార్మికులు, విద్యార్ధులు పాల్గొన్నారు. -
చైన్నెలో 570 ఎలక్ట్రిక్ మినీ ఏసీ బస్సులు
సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో ప్రజా రవాణాను మెరుగుపరచడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి మహానగర రవాణా సంస్థ ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు పెద్ద బస్సులు వెళ్లలేని ఇరుకై న రోడ్లు, రద్దీ ప్రాంతాలు , శివారు ప్రాంతాలు, మెట్రో రైలు, సబర్బన్ ఎలక్ట్రిక్ రైల్వే స్టేషన్లతో అనుసంధానించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 570 ఎలక్ట్రిక్ మినీ ఏసీ బస్సుల నిర్వహణ కోసం టెండర్లు పిలిచారు. వీటిలో ఇప్పటికే 300 బస్సులు సిద్ధమై వినియోగంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ లో–ఫ్లోర్ ఏసీ బస్సులు. ఇందులో 13 సీట్లు ఉంటాయి, మరో 10 మంది నిలబడేందుకు వీలుంది. ఈ బస్సుల్లో కండక్టర్ ఉండరు, కేవలం డ్రైవర్ మాత్రమే ఉంటారు. ప్రయాణికులు టిక్కెట్లను చైన్నె రవాణా యాప్ , స్మార్ట్ కార్డ్లు, లేదా నగదు ద్వారా డ్రైవర్ వద్దే చెల్లించి ప్రయాణించవచ్చు. ప్రతి 15 నిమిషాలకు ఒక మినీ బస్సు నడిచేలా టైమ్ టేబుల్ రూపొందించారు. ఈ సేవలు త్వరలో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. -
భక్తులతో అన్నామలైయార్ కిటకిట
వేలూరు: తిరువణ్ణామలై అన్నామలైయార్ ఆలయంలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు దీరారు. పాఠశాల, కళాశాలలకు వేసవి సెలవులు ఇతర రాష్ట్రాల్లో ముగియనున్న నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శనివారం వేకువ జామున ఆలయాన్ని తెరిచి అన్నామలైయార్, ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, పుష్పాలంకరణలు చేసి మహాదీపారాధన పూజలు చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. క్యూలు భక్తులు నిండి పోవడంతో ఆలయంలో ఎటుచూసినా భక్తులతోనే కనిపించింది. సామాన్య దర్శనంలో రాజగోపురం, అమ్మనియమ్మన్ ఆలయం దారిలో భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తుల దర్శన సౌకర్యాలను ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్, ఆలయ అధికారులు పరిశీలించారు. -
విజయవంతంగా రోబోటిక్ హార్ట్ సర్జరీ
సాక్షి, చైన్నె: వైద్య సంరక్షణ రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేలా, సరిహద్దులతో సంబంధం లేకుండా వైద్య సేవలు అందించే రోబోటిక్ అసిస్టెడ్ కార్డియాక్ టెలిసర్జరీ (రోబోట్ సహాయంతో సుదూర ప్రాంతం నుండి చేసే గుండె ఆపరేషన్)ను వైద్యులు విజయవంతం చేశారు. పూర్తిగా భారతదేశంలోనే తయారైన ఐ మంత్ర సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ ద్వారా కేవలం 4 గంటల 50 నిమిషాలలో ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా ముగించారు. రోబోటిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ గయానా రాజధాని జార్జ్టౌన్లోని పబ్లిక్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఐ మంత్రాసన టెలి–సర్జన్ కన్సోల్’ (కూర్చుని ఆపరేట్ చేసే కమాండ్ సిస్టమ్)లో కూర్చుని శస్త్రచికిత్సను విజయవంతం చేశారని శనివారం స్థానికంగా ఆ సంస్థ వివరాలను ప్రకటించింది. అలాగే, గయానా నుండి డాక్టర్ సుధీర్ తన చేతులతో చేసిన కదలికలను ఇండోర్లోని రోబోటిక్ చేతులు అత్యంత ఖచ్చితత్వంతో అనుకరిస్తూ రోగికి గుండె ఆపరేషన్ చేశాయని వివరించారు. ఈ శస్త్రచికిత్సకు మణిపాల్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ లలిత్ మాలిక్, భండారీ హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రామ్ శుక్లా, ఐఆర్సీఏడీ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ మోహిత్ భండారీ నేతృత్వంలోని బృందం సాయం చేసినట్టు పేర్కొన్నారు. -
మన దయాదాక్షిణ్యాల వల్లే..!
సాక్షి, చైన్నె: ‘‘మన కూటమిలో ఉన్న పార్టీల దయాదాక్షిణ్యాల వల్లే తమిళనాడులో తాజాగా తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం నడుస్తోంది’’ అని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. చైన్నెలోని డీఎంకే ప్రదాన కార్యాలయం అన్నా అరివాలయం జరిగిన రాజకీయ కార్యక్రమంలో.. చెంగల్పట్టు అసెంబ్లీ నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి, కాటాంకొళత్తూర్ నార్త్ యూనియన్ సెక్రటరీ గజేంద్రన్ నేతృత్వంలో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు డిఎంకెలో చేరారు. ఈ సందర్భంగా స్టాలిన్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సాధారణంగా ఒక పార్టీని వీడి మరో పార్టీలోకి వెళ్లేటప్పుడు.. ఏదో ఒక లాభాన్ని, సదుపాయాలను ఆశించి అధికార పార్టీ వైపు వెళ్తుంటారన్నారు. అయితే తాజాగా డీఎంకే అధికారంలో లేదని, . అధికార పీఠం కోల్పోయి ప్రతిపక్ష స్థానంలో ఉందన్నారు. ఈ సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో పార్టీలోకి వచ్చారంటే పదవుల కోసం కాకుండా , ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, తమిళ సమాజం కోసం పని చేయాలనే పట్టుదలతో రావడం ఆనందంగా ఉందన్నారు. ఓటమితో కుంగిపోం రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అవి మారుతూ ఉంటాయన్నారు.. గెలిచినప్పుడు విరవ్రీగడం, ఓడినప్పుడు కుంగిపోవడం డీఎంకే డిక్షనరీలోనే లేదున్నారు. అధికారం కోల్పోయినా సరే.. ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేవాడే నిజమైన డీఎంకే కార్యకర్త అని ధీమా వ్యక్తం చేశారు. మన అనుమతితోనే వారు వెళ్లారు.. రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్నదే మన దయ వల్ల అనే విషయాన్ని ఎవ్వరూ మరచిపోకూడదన్నారు. డీఎంకే నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగామన్నారు. అయితే, కూటమిలో ఉండి, ప్రస్తుతం టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఆయా పార్టీల నేతలే స్వయంగా ఒక విషయం చెప్పారన్నారు. తాము వెళ్లేటప్పుడు డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్కు చెప్పే వచ్చామని వారు బహిరంగంగానే పేర్కొనడాన్ని గమనించాలన్నారు. ఆ పార్టీల నేతలు తనను కలిసి వారి నిర్ణయాన్ని చెప్పినప్పుడు.. తాను మీ ఇష్టం, అది మీ ప్రజాస్వామ్య హక్కు, నేను అడ్డుకోను.. అని చెప్పి పంపానని వివరించారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన రాకూడదు, దాని ద్వారా బీజేపీ ఇక్కడ అధికారం చలాయించకూడదనే ఉద్దేశంతోనే తాను వారిని పంపానని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా, మన దయతో నడుస్తున్న ఈ ప్రభుత్వానికి త్వరలోనే ముగింపు పలకాలని ఈ వేదికగా శపథం చేద్దామని పిలుపు నిచ్చారు. -
కేవీబీ నెట్ వర్క్ విస్తరణ
సాక్షి, చైన్నె: కరూర్ వైశ్యా బ్యాంక్ తమిళనాడులో తన నెట్వర్క్ను మరింత విస్తరిస్తూ చైన్నెలోని విల్లివాక్కంలో సరికొత్త శాఖను ప్రారంభించింది.దేశవ్యాప్తంగా కరూర్ వైశ్యా బ్యాంకుకు ఇది 903వ బ్రాంచ్ కావడం విశేషం. తమిళనాడు పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ డాక్టర్ ఎం.ఎస్. షణ్ముగంఈ కొత్త శాఖను ప్రారంభించారు. కేఆర్ఎమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ట్రస్టీ డాక్టర్ వసంత గౌరి సాంప్రదాయబద్ధంగా గాయత్రీ జ్యోతిని వెలిగించారు. బ్యాంక్ ఎండీ రమేష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉత్తర చైన్నె పరిధిలోని నివాస ప్రాంతమైన విల్లివాక్కం ప్రజలకు, వ్యాపారులకు ఆధునిక బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడమే ఈ బ్రాంచ్ లక్ష్యంగా వివరివంచారు.స్థానిక నివాసితులు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలు, వర్తకులకు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ లోన్లు, ట్రేడ్ ఫైనాన్స్, డిజిటల్ పేమెంట్ టూల్స్ అందించడానికి కేవీబీ కట్టుబడి ఉందన్నారు. ఈ కొత్త బ్రాంచ్ ద్వారా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్తో కూడిన సమగ్ర డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. -
అందులోనే నిజమైన ఆనందం
తమిళసినిమా: మానవ సేవే మాధవ సేవ అంటారు. దీన్ని ఎంత మంది పాటిస్తారో తెలియదు కానీ మానవత్వం ఉన్న ప్రతిమనిషి చేతనైనా సాయం చేస్తుంటారు. అలాంటి సేవా భావం గురించి, అందులో కలిగే ఆనందం గురించి మృణాల్ఠాకూర్ ఇప్పుడే తెలుసుకున్నారట. ఈ ఉత్తరాది భామ బాలీవుడ్లో కంటే దక్షిణాదిలోనే నేమ్, ఫేమ్ తెచ్చుకున్నారు అని చెప్పవచ్చు. సీతారామం అనే తెలుగు చిత్రంతో దక్షిణాదిలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఆ ఒక్క చిత్రంతోనే కావలసిన దానికంటే ఎక్కువ పాపులర్ అయ్యారు. ఆ తరువాత నటించిన హాయ్నాన్నా వంటి చిత్రాలు మృణాల్ఠాకూర్ కెరీర్కు ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న ఈ భామను కోలీవుడ్ ఎంట్రీకి ప్రయత్నాలు ముమ్మరంగానే జరుగుతున్నాయి. వాస్తవానికి ఇంతకుముందే శివకార్తికేయన్తో జత కట్టే అవకాశం వరించింది. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రంలో నటించలేకపోయారు. తాజాగా ధనుష్ చిత్రంతో దిగుమతి అవడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ బ్యూటీ ఇటీవల ఒక కార్యక్రమంలో జీవితంలో నిజమైన ఆనందం గురించి పేర్కొంటూ నేను ఇప్పటివరకు ఏదేదో ఆనందాన్ని ఇస్తుంది అని అనుకున్నాను.అయితే ఉన్నదానిలో ఇతరులకు ఇవ్వడంలోనే అసలైన సంతోషం కలుగుతుంది అని తెలుసుకున్నాను. పెద్ద మొత్తంలో కాకపోయినా ఉన్నదానితో కొంత లేనివారికి సాయం చేయాలి. కర్మపై నాకు చాలా నమ్మకం ఉంది. అయితే చేసిన సాయానికి ప్రతిఫలం ఉంటుందా అన్నదాని గురించి ఎదురు చూడను. అయితే చేసిన సాయం వల్ల ఎవరైనా సంతోష పెడితే చాలు అని మృణాల్ఠాకూర్ అన్నారు. మృణాల్ఠాగూర్


