breaking news
Tamil Nadu
-
తమిళనాడుకు ఏ డబ్బా ఇంజిన్లు అక్కర్లేదు: విజయ్
అగ్ర నటుడు, తమిళగ వెట్రి కగళం పార్టీ అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ లొంగిపోయే రకం కాదని.. డబ్బుతో తనను ఎవరూ కొనలేరని అన్నారు. తమిళనాడులో టీవీకే మాత్రమే టాప్ ఇంజిన్ అని.. ఎలాంటి డబ్బా ఇంజిన్లను నమ్మొద్దంటూ తమిళనాడు ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోమవారం టీవీకే మూడో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న విజయ్ మాట్లాడుతూ.. తమిళ రాజకీయాల్లో విజిల్ సౌండ్ గట్టిగా ఉంటుందన్నారు. టీవీకే టాప్ ఇంజిన్ అని.. కాబట్టి ఎలాంటి డబ్బా ఇంజిన్లను నమ్మొద్దంటూ పరోక్షంగా బీజేపీ-అన్నాడీఎంకేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రసంగం ఆద్యంతంలో అన్నాడీఎంకే పేరును ప్రస్తావించకుండానే ఆయన విమర్శలు గుప్పించడం గమనార్హం. ఇక డీఎంకేపైనా ఆయన నేరుగా విమర్శలు చేయలేదు. ప్రముఖ కవి తిరువళ్లువర్ ఇవాళ జీవించి ఉంటే ఈ పాలన(డీఎంకే) చూసి.. తిరుక్కురల్ను తిరగరాసి ఉండేవారేమో అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. స్టాలిన్ను అడిగినా.. విజిల్ గుర్తుకే ఓటేస్తారని ఛలోక్తులు విసిరారు. విజయ్ వ్యాఖ్యలతో పొత్తులపై ఓ క్లారిటీ వచ్చినట్లేనని.. ఒంటరి పోరే ఉంటుందని టీవీకే శ్రేణులు చెబుతున్నాయి. అభిమానుల కోసం మూడు స్టెప్పులు..టీవీకే వార్షికోత్సవ కార్యక్రమంలో విజయ్ హుషారుగా కనిపించారు. జన నాయగన్ తన చివరి చిత్రం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వేదికగా ఆయన సినిమాకు నెలకొన్న సెన్సార్-రిలీజ్ కష్టాల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో.. సింగర్ వేలుమరుగన్ పాడిన పాటకు చిన్నారులతో కలిసి విజయ్ చిందులేసి అభిమానులను, కార్యకర్తలను ఉత్సాహపరిచారు.தவெக 3ஆம் ஆண்டு தொடக்க விழாவில் ”உங்கக் கூட கொஞ்சம் Dance ஆடிக் கொள்ளட்டுமா?” எனக் கேட்டுக்கொண்டு நடனமாடிய விஜய்#TVK | #Vijay| #TVKVijay | #Panaiyur pic.twitter.com/SVZIGZaE87— PttvOnlinenews (@PttvNewsX) February 2, 2026 -
డార్క్ జెయింట్ టైటిల్ ఆవిష్కరణ
కొంత కాలంగా టెన్షన్గా ఉన్నా! తమిళసినిమా: నటి శ్రుతిహాసన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బహుభాషా నటిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. అంతే కాకుండా సినిమా విక్కీపీడియాగా పేర్కొనే నటుడు కమలహాసన్, సారికల వారసురాలు అనే చిరునామా కలిగిన నటి ఈ బ్యూటీ. ఇక ప్రేమ వ్యవహారంలో పలుమార్లు వార్తల్లోకెక్కిన ఈ భామ ఇటీవలే 40వ పుట్టిన రోజును జరుపుకున్నారు. శ్రుతిహసన్ నాయకిగా తమిళంలో నటించిన ట్రెయిన్ చిత్రం విడుదల కావలసి ఉంది. ప్రస్తుతం తెలుగులో ఆకాశంలో ఒక తార చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన, గాయని, సంగీతం, రచన అంటూ పలు రంగాల్లో కొనసాగుతున్నానని పేర్కొన్నారు. తాను చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన తల్లిదండ్రులతో పెరిగడమే ఇందుకు కారణం అన్నారు. 2018 నుంచి కొన్ని కారణాల వల్ల కొంత విరామం తీసుకున్నానని చెప్పారు. ఆ సమయంలో తానెవరు అన్నది పునః పరిశీలంచుకోవడానికి ఉపయోగించుకున్నానని చెప్పారు. తాను పలు ఏళ్లుగా చాలా టెన్సన్తో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆ టెన్షన్ కారణంగా ఆయా పరిస్థితుల కనుగుణంగా పయనించలేకపోయానని చెప్పారు. తన విరామ కాలాన్ని లండన్లో గడిపానని, ఆ సమయంలో తన వంట తనే చేసుకున్నానని, తన బట్టలు తానే ఉతుక్కున్నానని, మెట్రో రైలులో పయనించానని, సంగీతం సాధన చేశానని చెప్పారు. ప్రస్తుతం ఒక కళాకారిణిగా కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు.అది ఆనందాన్ని కలిగిస్తోందని, ఇకపై చాలెంజ్తో కూడిన కథా పాత్రల్లో నటించడానికి ప్రాముఖ్యతనిస్తానని శ్రుతిహాసన్ అన్నారు. తమిళసినిమా: హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రాలు నిర్మాతలకు, బయ్యర్లకు మినిమం గ్యారెంటీగా మారుతున్నాయి. అలా తాజాగా రూపొందుతున్న చిత్రం డార్క్ జెయింట్. సోనియా అగర్వాల్, దర్శకుడు కే.భాగ్యరాజ్, లీవింగ్స్టన్, లివింగ్స్టన్ వారసురాలు జోవిడా, అయిలి మదన్, విజయ్ టీవీ ఫేమ్ అముదవన్, ఆకాశ్, హాలీవుడ్ నటుడు రవిక్ బాషా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కేఎస్.కిషన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది విశ్రాంతి సైనికాధికారి లోకేశ్వరన్ పయోవన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి అయ్యిందని, తర్వాత షెడ్యూల్ను ఈ నెల రెండవ వారం నుంచి నిర్వహించనున్నట్లు దర్శకుడు చెప్పారు. చిత్ర టీజర్, ఫస్ట్లుక్ పోస్టర్, ఆడియోలను త్వరలోనే విడుదల చేసి చిత్రాన్ని ఏప్రిల్లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. డార్క్ జెయింట్ చిత్రం ప్రేక్షకులకు సరి కొత్త అనుభవాన్ని కలిగిస్తుందని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి విఘ్నేశ్ రాజా సంగీతాన్ని, సంగీత్ మణిగోపాల్ చాయాగ్రహణం అందిస్తున్నారు. -
విజయవంతంగా సైక్లింగ్ వెలోడ్రోమ్
సాక్షి, చైన్నె: చైన్నెలోని తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వేదికగా ఎస్డీఏటీ సైక్లింగ్ వెలోడ్రోమ్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. వివరాలు.. తమిళనాడు సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమిళనాడుస్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ (ఎస్డీఏటీ) సహకారంతో జనవరి 29 నుంచి 31 వరకు ట్రాక్ ఆసియా కప్ 2026 అద్భుతమైన రేసులు, ఉత్కంఠభరితంగా సాగాయి. అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలతో ఘనంగా ముగిసింది. ఈ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆసియా ఖండానికి చెందిన 11 దేశాల నుంచి 70 మంది అంతర్జాతీయ సైక్లిస్టులు, అలాగే 50 మంది భారతీయ సైక్లిస్టులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎస్డీఏటీలో శిక్షణ పొందుతున్న యువ రైడర్లు కూడా తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేశారు. పోటీల్లో భారత సైక్లిస్టులు పలు విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచారు. ఉమెన్ ఎలైట్ కీరిన్ విభాగంలో భారత జాతీయ జట్టు క్రీడాకారిణి పాల్ త్రియాష స్వర్ణ పతకం గెలుచుకోగా, రంగస్వామి సి. కీర్తి రజత పతకం సాధించారు. పురుషుల జూనియర్ కీరిన్ విభాగంలో నరేంగ్బామ్ మాక్స్ సింగ్ స్వర్ణ పతకం సాధించగా, లిథువేనియా సైక్లిస్ట్ సింగా డోవిడాస్ రజతం పొందారు. మహిళల ఎలైట్ ఓమ్నియం విభాగంలో ఉజ్బెకిస్థానన్కు చెందిన కొజీవా నఫోసాట్ అద్భుతమైన ప్రదర్శనతో మొత్తం పాయింట్ల రేస్ ఫైనల్లో 120 పాయింట్లతో స్వర్ణం సాధించారు. భారత్కు రజతం.. భారత సైక్లిస్ట్ సింగ్ స్వస్తి 106 పాయింట్లతో రజత పతకం గెలుచుకున్నారు. టెంపో రేస్లో కూడా కొజీవా నఫోసాట్ స్వర్ణం సాధించగా, ఇండోనేషియా క్రీడాకారిణి అనస్తాస్య అందిని పుత్రి రజతం పొందారు. మహిళల జూనియర్ విభాగంలో, స్క్రాచ్ రేస్లో కజకిస్తాన్కు చెందిన స్మైల్కనోవా ఐగెరిమ్ స్వర్ణ పతకం గెలుచుకోగా, ఎస్డీఏటీ రేసింగ్కు చెందిన కధీర్వెల్ హాషిని రజతంతో మెరిశారు. 200 మీటర్ల స్ప్రింట్ విభాగంలో, భారత జాతీయ జట్టు క్రీడాకారిణులు షఫీ తబితా స్వర్ణం, సోమన్ ఆభా శ్రీమాన్ రజతం సాధించారు. ఈ సందర్భంగా ఎస్డీఏటీ సభ్య కార్యదర్శి జె. మేఘనాథ రెడ్డి మాట్లాడుతూ, ట్రాక్ ఆసియా కప్ 2026 భారత సైక్లింగ్ చరిత్రలో ఒక మైలురాయిగా పేర్కొన్నారు. అద్భుతమైన ప్రదర్శనలు , అథ్లెట్ల పెరుగుతున్న స్థాయిని, అలాగే సైక్లింగ్ వెలోడ్రోమ్ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని చాటుకున్నామన్నారు.. అంతర్జాతీయ క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంలో తమిళనాడు ముందంజలో ఉందని స్పష్టం చేశారు.టీఎన్సీఏ అధ్యక్షుడు ఎం. సుధాకర్ మాట్లాడుతూ, మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో నమోదైన ఫలితాలు ట్రాక్ ఆసియా కప్ 2026 విజయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. భారతీయ మరియు తమిళనాడు సైక్లిస్టులకు అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని అందించిన ఈ ఈవెంట్ను నిర్వహించినందుకు గర్వంగా ఉందన్నారు. -
బాధ్యతల స్వీకరణ
కొరుక్కుపేట: తమిళనాడు అండ్ పుదుచ్చేరి నావికా ప్రాంతం (ఫోట్నా)గా రియర్ అడ్మిరల్ ఉపల్కుందు బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఐఎన్ఎస్ అడయార్లో జరిగిన ఒక పరేడ్లో రియర్ అడ్మిరల్ సతీష్ షెనాయ్ నుంచి తమిళనాడు, పుదుచ్చేరి నావికా ప్రాంతం (ఫోట్నా) ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్గా రియర్ అడ్మిరల్ ఉపల్ కుందు బాధ్యతలు స్వీకరించారు. దేశానికి 40 సంవత్సరాల విశిష్ట సేవ చేసిన తర్వాత రియర్ అడ్మిరల్ సతీష్ షెనాయ్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఫోట్నాగా ఉపల్ కుందు బాధ్యతలను స్వీకరించారు. సీనియర్ నౌకా దళ అధికారులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రి యర్ అడ్మిరల్ సతీష్ షెనాయ్ను ,వారి విశిష్ట సేవ కు ఘనంగా సత్కరించారు. రియర్ అడ్మిరల్ ఉపల్ కుందుకు కొత్త ఫోట్నాగా స్వాగతం పలికారు. -
కాంగ్రెస్లో వర్గ విభేదాలు లేవు
తిరువళ్లూరు: కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు లేవని, రానున్న ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి కూటమి విజయానికి కృషిచేస్తామని కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ అన్నారు. తిరువళ్లూరు జిల్లా నూతన అధ్యక్షుడిగా శశికుమార్ ఎంపికై న విషయం తెలిసిందే. అయితే శశికుమార్ ఎంపికపై మాజీ అధ్యక్షుడు పొన్నేరి ఎమ్మెల్యే దురై చంద్రశేఖర్తో పాటు ఆయన మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడు శశికుమార్ను పార్టీ నేతలకు పరిచయం చేసే కార్యక్రమం తిరువళ్లూరులో జరిగింది. ఎంపీ శశికాంత్ సెంథిల్ హాజరై ప్రసంగించారు. పార్టీలో గ్రూపు తగాదాలు లేవని, రానున్న ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షుడు సదాశివలింగం, ఎగాటూరు ఆనందన్, హిమయాకక్కన్, రాష్ట్ర కార్యదర్శులు గోవిందరాజ, సంపత్, పొన్నేరి ఎమ్మేల్యే దురైచంద్రశేఖర్, మాజీ డీసీసీ అధ్యక్షుడు ఏజీ చిదంబరం, మైనారిటీ జిల్లా విభాగం అధ్యక్షుడు ఖలీల్రెహ్మాన్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివాకర్, న్యాయవాద విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హిమాలయ అరుణ్ప్రసాధ్, ఓబీసీ విభాగం వర్కింగ్ కమిటీ అద్యక్షుడు వెంకటేషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామన్ పాల్గొన్నారు. -
ఈ విజయం ఆయనకే..!
తమిళసినిమా: సౌందర్య రజనీకాంత్కు చెందిన జియోన్ ఫిలింస్, ఎంఆర్పీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ అదినేతలు పసిలియాన్ నజిరేద్, మహేశ్రాజ్ పసిలియాన్ కలసి నిర్మించిన చిత్రం విత్ లవ్. టూరిస్ట్ ఫ్యామిలీ చిత్ర దర్శకుడు అభిషన్ జీవింత్ కథానాయకుడిగా పరిచయమైన ఇందులో అనస్వరరాజన్ నాయకిగా నటించారు. టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసిన మదన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈచిత్రం ఈనెల 5న తెరపైకి రానుంది. శనివారం సాయంత్రం చైన్నెలోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో అభిషన్ జీవింత్ మాట్లాడుతూ సూపర్స్టార్ రజనీకాంత్ తనను ఆయన ఇంటికి పిలిపించి నువ్వు నటించు కన్నా అని చెప్పారన్నారు. అందుకే ఈ చిత్రం సాధించే విజయాన్ని ఆయనకే సమర్పించనున్నట్లు చెప్పారు. సౌందర్య రజనీకాంత్ మాట్లాడుతూ గోవా చిత్రం ద్వారా తాను నిర్మాతగా మారి 16 ఏళ్లు అయ్యిందన్నారు. మరో నిర్మాత మహేశ్రాజ్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. చిత్ర దర్శకుడు మదన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో అభిశషన్ జీవింద్ మాట్లాడుతూ సౌందర్య రజనీకాంత్ను కలసి కథ చెప్పగా వెంటనే ఆమె చిత్రం చేద్దాం అని చెప్పారన్నారు. అలా విత్ లవ్ చిత్రం ప్రారంభమైందని చెప్పారు. -
త్రిబుల్ టీ చిత్రానికి దర్శకుడే హీరో
తమిళసినిమా: నటుడు జీవా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం త్రిబుల్ టీ( తంబి తలైవర్ తంబి తలమైయిల్). నటుడు తంబిరామయ్య, ఇళవరసు, ప్రార్ధన, జయ్వంత్, జాన్సన్ తివారి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నితేశ్ సహాదేవ్ దర్శకత్వంలో కన్నన్ రవి ప్రొడక్షన్స్ పతాకంపై కన్నన్ రవి నిర్మించిన ఈ చిత్రానికి దీపక్ రవి సహా నిర్మాతగా వ్యవహరించారు. కాగా ఈ చిత్రం పొంగల్ సందర్భంగా విడుదలై ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో ఇటీవల ఈ చిత్ర విజయోత్సవ వేడుకలను చైన్నెలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ చిత్ర నిర్మాత దుబాయిలో నివశిస్తున్న తమిళుడు కావడం గమనార్హం. ఈయన మాట్లాడుతూ ఈ చిత్రం విజయోత్సవం అనేదాని కంటే తమ కన్నన్ రవి టీమ్కు లభించిన గుర్తింపు అనే తాను భావిస్తున్నానన్నారు. ఒకరు విజయం సాధించాలంటే ఆయనకు కుటుంబం మంచిగా అమరాలన్నారు. అలా ఈ చిత్ర విజయానికి కారణం అయిన చిత్ర యూనిట్ అందరికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు జీవా మాట్లాడుతూ తాము 4,5 నెలల పాటు కుమిళిలో బస చేసి ఒక కుటుంబంగా ఈ చిత్రం కోసం పని చేశామన్నారు. ఆ ప్రాంత ప్రజలు ప్రేమాభిమానాలే ఈ చిత్ర విజయనికి ముఖ్య కారణంగా పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రానికి దర్శకుడు నితేశ్ సహాదేవ్నే హీరో అన్నారు. ప్రతి నటీనటుల నుంచి తనకు కావలసిన నటనను రాబట్టుకున్నారని అన్నారు. తనకు ఓ నటుడిగా ఈ చిత్రం ద్వారా మంచి విజయాన్ని ఇచ్చారని అన్నారు. తనకు నటుడు ఈటీవీ గణేశ్నే సిఫార్సు చేశారని , అలా నిర్మాత కన్నన్ రవిను కలిసిన వేంటనే తనకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని చెప్పారు. ఆయన ఆ నమ్మకమే ఈ విజయం అని పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో సీమాన్,బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, ఆర్కే సెల్వమణి, కేఎస్.రవికుమార్, పార్తీపన్, సముద్రఖని, ఆర్బీ.చౌదరి మొదలగు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని యూనిట్ సభ్యులను అభినందించారు. -
ఆలి కొండన్ నవల ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : తమిళ గడ్డను ఏలిన రాజ రాజ చోళుడు పొన్నియిన్ సెల్వన్కు కొనసాగింపుగా రాజేంద్ర చోళుని విజయాల కథనంగా 16 ఏళ్ల యువ రచయిత తొలి ప్రయత్నంగా ఆలి కొండన్ పేరిట నవలను సిద్ధం చేశారు. పొన్నియిన్ సెల్వన్ నవలకు కొనసాగింపుగా భావించబడుతున్న చారిత్రక కల్పిత నవల శ్రీఆలికొండన్ – ది కాంకరర్ ఆఫ్ ఓషన్స్ (పార్ట్–1)శ్రీ పుస్తకావిష్కరణ కార్యక్రమం చైన్నెలోని అన్నా విశ్వవిద్యాలయం, తమిళ్ వర్చువల్ అకాడమీలో ఘనంగా జరిగింది. ఈ నవలను కేవలం 16 ఏళ్ల యువ రచయిత రౌనాక్ శివ్ రచించారు. ఆయన శ్రీఅంధువన్శ్రీ అనే కలం పేరుతో రచనలు చేస్తున్నారు. ఈ పుస్తకం దివంగత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవలకు స్ఫూర్తిగా, చోళ చక్రవర్తి రాజేంద్ర చోళుని విదేశీ దండయాత్రలు, శాసన ఆధారాలు, చారిత్రక విషయాల సమ్మేళనంగా రూపొందించబడింది. బెంగళూరుకు చెందిన 11వ తరగతి విద్యార్థి అయిన రౌనాక్ శివ్, తన అమ్మమ్మ చెప్పిన కథలు , కల్కి రచనల ద్వారా చోళ చరిత్రపై ఆసక్తి పెంచుకున్నారు. విస్తృతమైన పరిశోధన అనంతరం ఈ తొలి నవలను రచించి, దాన్ని దివంగత కల్కి కృష్ణమూర్తికి అంకితం చేశారు. క్రికెటర్ కూడా అయిన రౌనాక్, చోళ సామ్రాజ్య వైభవాన్ని నేటి తరం పాఠకులకు కొత్త కోణంలో పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ రచన చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలోపుస్తకం తొలి ప్రతిని ప్రొఫెసర్ డాక్టర్ జి. దేవనాయగం ఆవిష్కరించగా, ప్రముఖ రచయిత కాలచక్రం నరసింహ అందుకున్నారు. ఈ–బుక్ ఎడిషన్ను ప్రముఖ రచయిత పట్టుకోట్టై ప్రభాకర్ ప్రారంభించగా, ఆడియో బుక్ ఎడిషన్ను మద్రాస్ టాకీస్ దర్శకుడు శివ ఆనంద్ విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ కె.వి.ఎస్. మరుత్తు మోహన్ ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ పుస్తకాన్ని భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ పబ్లిషింగ్ సంస్థ అయిన పుస్తక డిజిటల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రచురించింది. యువ రచయితలను ప్రోత్సహించాలనే లక్ష్యంలో భాగంగా ‘ఆలికొండన్’ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సాహిత్య ప్రేమికులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
ఆ ఇద్దరి సేవలు చిరస్మరణీయం
కొరుక్కుపేట: దేశ స్వాతంత్య్రం కోసం చేపట్టిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓమందూరార్ రామస్వామిరెడ్డి, తిరుమల నాయకర్ల సేవలు చిరస్మరణీయమని అఖిల భారత తెలుగు సమాఖ్య(ఏఐటీఎఫ్) అధ్యక్షుడు ఆచార్య సీఎంకే రెడ్డి అన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఓమందూరార్ రామస్వామి రెడ్డి 131వ జయంతి, విజయనగర సామ్రాజ్య ఆధిపత్యం నుంచి మదురైని స్వతంత్రం చేసి కళలు, నిర్మాణాలకు గొప్ప ప్రోత్సాహమందించిన తిరుమలనాయకర్ 443వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. కావడి సింధూ ఓమందూర్ రెడ్డియార్ సంక్షేమ సంఘం–ఏఐటీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో చైన్నె కీల్పాక్లోని ఏఐటీఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకలకు సీఎంకే రెడ్డి సారథ్యం వహించారు. ముందుగా ఓమందూరార్, తిరుమలనాయకర్ చిత్రపటాలకు సభికులతో కలసి ఆయన నివాళులర్పించారు. అనంతరం వేదిక ప్రాంగణంలో ఉచిత నేత్రవైద్య శిబిరాన్ని ప్రారంభించి పారిశుధ్య కార్మికులు, పేదలకు సంక్షేమ సహాయాలు పంపిణీ చేశారు. ఏఐటీఎప్ ప్రధాన కార్యదర్శి నాయకర్ నందగోపాల్, ఉపాధ్యక్షుడు డాక్టర్ సీఎం కిషోర్, డా.గొల్లపల్లి ఇజ్రాయేలు, లయన్ వీజీ జయకుమార్, సీహెచ్ తిరుమలరావు, కావడి సింధూ సంఘం అధ్యక్షుడు బి.నాగేంద్రన్, గంటా రోశయ్య, పాల్ కొండయ్య, సారథినాయుడు పాల్గొన్నారు. -
కనుల పండువగా తైపూస ఉత్సవం
తిరుత్తణి: ౖతెపూసం సందర్భంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రెండు లక్షలకు పైగా భక్తులు పోటెత్తడంతో మాడ వీధుల్లో రద్దీ నెలకొని భక్తులు ఐదు గంటల పాటు వేచివుండి స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయంలో తైపూసం సందర్భంగా ఆదివారం వేకువజామున మూలవర్లకు ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలతో అలంకరించారు. భక్తులు కావళ్లతో ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తజనం పోటెత్తడంతో భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ వివేకానంద శుక్ల ఆధ్వర్యంలో పోలీసులు తోపులాట లేకుండా చేశారు. సాయంత్రం 7 గంటలకు ఉత్సవర్లు వెండి నెమలి వాహనంలో కొలువుదీరి మాడ వీధుల్లో విహరించారు. ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ శ్రీధరన్, జాయింట్ కమిషనర్ రమణి ఏర్పాట్లు చేశారు. ఈరోడ్లో రథోత్సవం సేలం: ఈరోడ్లోని చెన్నిమలై మురుగన్ ఆలయంలో జరిగిన తైపూసం రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మంత్రి ఎం.పి.స్వామినాథన్ రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈరోడ్ జిల్లా చెన్నిమలైలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో తైపూసం రథోత్సవం ఆదివారం జరిగింది. ఇందులో భాగంగా తెల్లవారుజామున కై లాసనాథర్ ఆలయంలో వళ్లి, దేవసేన సమేత ముత్తుకుమారస్వామికి మహా అభిషేకం తరువాత ఉదయం 6 గంటలకు, కై లాసనాథర్ ఆలయం నుంచి దేవత విగ్రహాలను రథంపైకి తీసుకొచ్చి రథోత్సవం నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని రథాన్ని లాగి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తైపూసం తెప్పోత్సవం తిరువొత్తియూరు: చైన్నె పురసైవాక్కం శ్రీ గంగాధరేశ్వరర్ ఆలయంలో తైపూసం సందర్భంగా 15 సంవత్సరాల తర్వాత తెప్పోత్సవం జరిగింది. ఇందులో భాగంగా తొలిరోజు శనివారం వినాయకర్ తెప్పం, కర్పగ వినాయకర్ తెప్పం, వేద వినాయకర్ తెప్పల్లో వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం పంకాజాంబాల్ సమేత గంగాధరేశ్వరర్ తెప్పం, మంగళవారం వళ్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి తెప్ప ఉత్సవం జరగనున్నాయి. ఆదివారం జరిగిన కార్యక్రమంలో హిందూ, ధర్మాదాయశాఖ జాయింట్ కమిషనర్ ముల్లై, అసిస్టెంట్ కమిషనర్ భువనేశ్వరి, ఈఓ శివప్రకాశం, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. పెద్దపాళ్యం, శిరువాపురి ఆలయాలలో.. తిరువళ్లూరు: తైపూసం ఉత్సవాల్లో భాగంగా పెద్దపాళ్యం భవానీ, శిరువాపురి మురుగన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిరువాపురి ఆలయంలో అభిషేకం నిర్వహించారు. పెద్దపాళ్యం భవానీ ఆలయంలోనూ తైపూసం ఉత్సవాలను నిర్వహించారు. ఆలయంలో 108 కలశాల గంగ నీటితో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. -
క్లుప్తంగా
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు – తప్పిన ప్రమాదం తిరుత్తణి: ప్రభుత్వ బస్సు ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో గోడలు కూలి, వస్తువులు ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు కుటుంబీకులు ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటనకు సంబంధించి తిరుత్తణి పోలీసుల కథనం మేరకు..పొదటూరుపేట డిపోకు చెందిన ప్రభుత్వ టౌన్ బస్సు ఆదివారం ఉదయం 30 మంది ప్రయాణికులతో తిరుత్తణి అన్నాబస్టాండు నుంచి పొదటూరుపేట బస్టాండుకు బయలుదేరింది. బస్సు పొదటూరుపేట తిరుత్తణి రాష్ట్ర రహదారిలో కృష్ణసముద్రం వద్ద తిరుత్తణి వైపు వెళుతున్న చెరుకు ట్రాక్టర్ రావడంతో బస్సు అదుపుతప్పి రోడ్డుకు పక్కనే వున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి గోడలు కూలి వస్తువులతో పాటు బైకు ధ్వంసమైంది. అయితే ఆ సమయంలో ఇంట్లో వున్న ఇంటి యజమాని మోహన్ అతని భార్య బిడ్డలకు ఎలాంటి గాయాలు కాకుండా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా దిగి మరో బస్సులో వెళ్లిపోయారు. తిరుత్తణి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగం పేరిట మోసం –ఒకరి అరెస్ట్ తిరువళ్లూరు: ప్రభుత్వ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.14.49 లక్షలు మోసం చేసిన వ్యవహారంలో ఒకరిని పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా పట్టాభిరామ్ ప్రాంతానికి చెందిన రవికుమార్. ఇతడి తమ్ముడికి పశుసంవర్థక శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి అదే ప్రాంతానికి చెందిన నాగరాజ్ రూ.14.49 లక్షలు తీసుకుని మోసం చేసినట్టు ఆవడి పోలీసు కమిషనర్కు ఫిర్యాదు అందింది. పోలీసులు విచారణలో మోసం చేసినట్టు నిర్ధారణ కావడంతో నాగరాజ్ను అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. శాస్త్రోక్తం.. త్రిశూల స్నానం శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఆదివారం శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. మాఘ పౌర్ణిమను పురస్కరించుకుని మహాశివరాత్రికి ముందు త్రిశూల స్నానం జరిపించడం ఆనవాయితీ. అందులో భాగంగా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడితోపాటు త్రిశూలానికి విశేష పూజలు చేశారు. సద్యోముక్తి పురాణ ప్రవచనం తర్వాత త్రిశూల స్నానం నిర్వహించారు. అనంతరం ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. పంచమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. -
నియోజకవర్గ బాటకు డీఎంకే శ్రీకారం
సాక్షి, చైన్నె : మళ్లీ అధికారమే లక్ష్యంగా ప్రజలలోకి చొచ్చుకెళ్లేందుకు డీఎంకే నియోజకవర్గ బాటకు శ్రీకారం చుట్టింది. ముఖ్య నేతలు ఆదివారం నుంచి ఆయా నియోజకవర్గాలలో తిష్ట వేసి రోజుకో ప్రాంతంలో సభలను నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. మళ్లీ అధికారంలో లక్ష్యంగా సీఎం స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ద్రావిడ మోడల్ 2.ఓ ప్రభుత్వ తథ్యమన్న ధీమాను అన్ని వేదికలలో స్పష్టం చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో పార్టీ తరపున ప్రజలలోచొచ్చుకెళ్లే కార్యక్రమాలను విస్తృతం చేయిస్తున్నారు. ఇప్పటికే బూత్ల స్థాయిలో ఇంటింటా ప్రచార పయనంలో కేడర్ నిమగ్నమై ఉన్నారు. జిల్లా స్థాయిలో సభలు, డివిజన్ల స్థాయిలో మహానాడులు విస్తృతం చేశారు. తాజాగా దివారం నుంచి నియోజకవర్గ బాటకు శ్రీకారం చుట్టారు.. ఆయా నియోజక వర్గాలలలోని నేతల ద్వారా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు సభలు, సమావేశాలు నిర్వహించే విధంగా కార్యాచరణతో ముందుకెళ్తున్నారు.ఈ సభల కోసం ఇప్పటికే స్టార్ వ్యాఖ్యాతలను సిద్ధం చేసినవ ఇషయం తెలిసిందే. జిల్లాల కార్యదర్శులు, ఇన్చార్జ్లు, నియోజకవవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు, మండల, డివిజన్ ప్రతినిధులు ఇక నియోజకవర్గాలలోనే ఉండే విధంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆదేశించారు. ఇక సీట్ల చర్చలు.. డీఎంకే కూటమిలోని పార్టీలతో సీట్ల చర్చలకు స్లాలిన్ సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీ రెండు మూడు రోజులలో రంగంలోకి దిగనుంది. తొలుత టీఎన్సీసీ నేతలతో చర్చలు ఈ కమిటీ జరపనున్నది. చర్చల తదుపరి సీట్ల పందేరానికి సంబంధించిన ఒప్పందాల దిశగా ముందుకు సాగబోతున్నారు. ఈ విషయంపై టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై స్పందిస్తూ, డీఎంకే నుంచి రెండు రోజులలో తమకు ఆహ్వానం వస్తుందని భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ గిరిశ్ సోదన్కర్ పేర్కొంటూ డీఎంకేతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొంటూనే, తమకు టీవీకే విజయ్ నుంచి ఆహ్వానం వచ్చినట్టు పరోక్షంగా స్పందించడం గమనార్హం. ఇక, ఈ కూటమిలోని ఎండీఎంకేకు ఆరు స్థానాలు ఇవ్వడానికి డీఎంకే నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో మూడు స్థానాలు డీఎంకే చిహ్నం ఉదయ సూర్యుడిపై ఆ పార్టీ సూచించే అభ్యర్థులు పోటీ చేయాలన్న మెలిక పెట్టనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక ప్రస్తుతానికి ఎవరితోపొత్తు అన్నది సస్పెన్షన్లో పెట్టిన ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే సైతం డీఎంకేతో రహస్య చర్చలు జరుపుతుందనే సమాచారం ఆదివారం వెలుగులోకి వచ్చాయి. డీఎండీకేకు ఆరు స్థానాలు, ఓ రాజ్యసభ సీటు ఇవ్వడానికి డీఎంకే సిద్ధంగా ఉన్నట్టు చర్చ జరుగుతోండడం గమనార్హం. అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. -
రంగా... శ్రీరంగా
సాక్షి, చైన్నె: రంగా..శ్రీరంగా...గోవిందా..గోవిందా..అన్న నామస్మరణ భూలోక వైకుంఠంలో శనివారం మిన్నంటింది. శ్రీరంగనాథుని క్షేత్రంలో తై మాస రథోత్సవం కోలాహలంగా జరిగింది. భక్త జన సంద్రంలో శ్రీరంగం పులకించింది. వివరాలు.. 108 వైష్ణవ క్షక్షేత్రాల్లో భూలోక వైకుంఠంగా తిరుచ్చి శ్రీరంగం ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ కొలువు దీరిన శ్రీరంగనాథ స్వామి వారి ఆలయం ఆధ్యాత్మికతకు నెలవు. ఏడు ప్రాకారాలు, 21 గోపురాలు, 50 సన్నిధులతో ఈ ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతూ వస్తోంది. ఈనెల 23వ తేదీ నుంచి ఇక్కడ తైమాసం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో నాలుగో రోజున పెరుమాళ్ స్వామి తన బంగారు గరుడ వాహనంలో తదుపరి అశ్వ వాహనంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ ఉత్సవాలలో ముఖ్య ఘట్టం రథోత్సవం శనివారం జరిగింది. రథోత్సవం సందర్భంగా వేకువ జాము నుంచే ఆలయంలో పూజాధి కార్యక్రమాలు జరిగాయి. 4.30 గంటలకు స్వామి వారు రథంలో ఆస్తాన మండపానికి చేరుకున్నారు. ఇక్కడ జరిగిన పూజలు అభిషేకాల అనంతరం స్వామి వారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీవిళ్లిపుత్తూరు ఆండాల్ అమ్మవారి ఆలయం నుంచి వచ్చిన పూల మాల, పట్టు వస్త్రాలు ధరించి , చేతిలో చిలుకతో భక్తులకు కనువిందు చేశారు. ఆరున్నర గంటల సమయంలో స్వామి వారు రథంపై ఆశీనులయ్యారు. గోవిందా..గోవిందా.. రంగా..శ్రీరంగా నామస్మరణలు మిన్నంటగా స్వామి వారి రథోత్సవం కదిలింది. తూర్పు చిత్తిరై వీధి నుంచి బయలు దేరిన రథం, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం వీధుల మీదుగా ఆలయానికి చేరుకుంది. అడుగడుగున భక్తులు స్వామి వారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్త జనుల కోలాటాలు, నృత్యాల నడుమ రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఇదిలా ఉండగా ఆదివారం తైపూసం పర్వదినం కావడంతో రాష్ట్రంలో తమిళ్ కడవుల్ మురుగన్కు ఉన్న ఆరుపడ్డై వీడులలో విశిష్ట పూజలు జరగనున్నాయి. దీంతో మురుగన్ ఆలయాల వైపుగా భక్త జనం శనివారం సాయంత్రం నుంచి పోటెత్తుతున్నారు. -
● అవగాహన
క్యాన్సర్ అవగాహనకు మద్దతు ఇచ్చే విధంగా కావేరి ఆస్పత్రి నేతృత్వంలో కే 10 కే పేరిట 4వ ఎడిషన్ రన్ ఆదివారం జరగనుంది. ఇందులో భాగంగా అందర్నీ ఒకే వేదిక మీదకు తెచ్చే విధంగా శనివారం జరిగిన కార్యక్రమంలో రన్నర్లకు కిట్లు పంపిణీ చేశారు. – సాక్షి, చైన్నె రూ. 105 కోట్లతో గృహ ప్రాజెక్టు సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని ఒరగడంలో రూ. 105 కోట్లతో గృహ ప్రాజెక్టు చేపట్టనున్నామని హిరానందానీ పార్క్స్ చైర్మన్ డాక్టర్ నిరంజన్, సీఈఓ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు గురంచి శనివారం స్థానికంగా ప్రకటించారు. 360 ఎకరాల విస్తీర్ణంలో టౌన్ షిప్గా హిరానందని కమ్యూనిటీ పార్క్ విల్లాగా ఈ గృహాలను నిర్మించనున్నామని తెలిపారు. ఒరగడం ప్రస్తుతం పారిశ్రామికంగా ప్రగతిపథంలో దూసుకెళ్తోందని గుర్తు చేస్తూ, హైటెక్ పారిశ్రామిక, నివాసన కారిడార్గా ఈ నిర్మాణాలు జరగబోతున్నాయని వివరించారు.తమిళనాడు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరి అథారిటీకి అనుగుణంగా 2029 జనవరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. విద్యుత్ షాక్ తో యువకుడి మృతి తిరువొత్తియూరు: 20 రోజుల్లో వివాహం జరగనున్న క్రమంలో ఓ యువకుడు విద్యుత్షాక్కు గురై మృతిచెందాడు. తెన్కాసి జిల్లా ఆలంగూలం సంతాన మరియమ్మన్ కోయిల్ వీధికి చెందిన మయిలేరి కుమారుడు వసంతకుమార్ (27). ఇతను సొంతంగా క్యాటరింగ్, మైక్ సెట్టింగ్ పనులు చేస్తున్నారు. ఇతనికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. జనవరి 22న పెళ్లి జరపాలని నిర్ణయించి వసంతకుమార్ కుటుంబసభ్యులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటికి రంగులు వేయడం పూర్తయిన తర్వాత, ఇంటి ముందు వర్షపు నీరు వెళ్లడానికి డాబా భాగంలో రేకులు ఏర్పాటు చేశారు. శుక్రవారం కిందకు వేలాడుతున్న రేకు వసంతకుమార్ మళ్లీ పైకి ఎత్తి పెట్టాడు. ఆ సమయంలో దాని పక్కనే వేలాడుతున్న బల్బు విద్యుత్ తీగ తెగి రేకుపై పడింది. ఈ ఘటనలో వసంతకుమార్కు విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. తాంబరం నుంచే ఎక్స్ప్రెస్ రైళ్లు దక్షిణ రైల్వే ప్రకటన కొరుక్కుపేట: చైన్నె ఎగ్మోర్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ, అభివృద్ధి పనుల కారణంగా, ఎగ్మోర్ మార్గంలో నడిచే ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లన్నీ తాంబరం నుంచి ప్రారంభం కానున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 5 వరకు ఎగ్మూర్ నుంచి తంజావూరుకు వెళ్లే రైళ్లు, రామేశ్వరం –చైన్నె ఎగ్మోర్ వెళ్లే రైళ్లు ఎక్స్ప్రెస్ తాంబరంలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. అలాగే మిగిలిన ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లన్నీ తాంబరం నుంచి నడుస్తాయని స్పష్టం చేశారు. -
జరుగుతుందని..!
ఇలాంటిదేదోతమిళసినిమా: విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయకన్. పూజా హెగ్డే కథానాయకిగా నటించిన ఇందులో మలయాళ బ్యూటీ మమిత బైజు కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. అనిరుధ్ సంగీతాన్ని అందించిన చిత్రం పొంగల్ సందర్భంగా ఈనెల 9వ తేదీన విడుదల కావల్సింది. అయితే సెన్సార్ సమస్యల కారణంగా ఇది కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఇలా గత నెల రోజులకు పైగా సెన్సార్ బోర్డ్, న్యాయస్థానాలు మధ్య వివాదాలు జరుగుతున్నా, సుమారు రూ. 500 కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాత నలిగిపోతున్నా, రూ. 200 కోట్లకుకు పైగా పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతున్న ఆ చిత్ర కథానాయకుడు విజయ్ కానీ, దర్శకుడుహెచ్ .వినోద్ కానీ , తమకేమీ పట్టనట్లు నోరు మెదపటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు నటుడు విజయ్ తొలిసారిగా జననాయకన్ వ్యవహారంపై నోరు విప్పారు. ఈయన ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన భేటీలో చిత్రం నిర్మాతను తలుచుకుంటేనే తనకు బాధ కలుగుతోందని పేర్కొన్నారు. తాను రాజకీయ ప్రవేశం చేయడం వల్ల తనకు ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించానన్నారు. అందుకు తాను మెంటల్గా సిద్ధం అయినట్లు నటుడు విజయ్ పేర్కొన్నారు. -
సాతనూర్ నుంచి నీటి విడుదల
వేలూరు: రైతులు ఆరు తడి పంటలను సాగు చేసుకునేందుకు సాతనూర్ డ్యామ్ నుంచి 105 చెరువులకు నీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి ఏవావేలు తెలిపారు. శనివారం ఉదయం కలెక్టర్ తర్పగరాజ్ అధ్యక్షతన సాతనూర్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారు. తిరువణ్ణామలై జిల్లాలోని తెన్పోన్నై నదికి అడ్డంగా నిర్మించిన సాతనూర్ డ్యామ్లో ప్రస్తుతం 97.50 అడుగుల నీటి మట్టం ఉంది. డ్యామ్లోని కుడి, ఎడమ కాలువల నుంచి రైతులు ఆరుతడి పంటలు పండించుకునేందుకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపి నీటిని విడుదల చేసేందుకు అవసరమైన అనుమతిని పొందారు. మంత్రి మాట్లాడుతూ 45 రోజులపాటు డ్యామ్ గేట్లు తెరచి ఉంచనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా జిల్లాలోని తండ్రాంబట్టు తాలుకా, తిరువణ్ణామలై, కళ్లకుర్చి, విల్లుపురం జిల్లాల్లో 12,543 ఎకరాల వ్యవసాయ భూమికి నీటి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా విల్లుపురం జిల్లాలోని తిరుకోవిలూరు, శంకరాపురం తాలుకాల్లోని 54 చెరువులకు నీటిని పంపి వాటి ద్వారా 10,043 ఎకరాల వ్యవసాయ పొలాలకు నీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. రైతులు వీటి ద్వారా ఆరుతడి పంటలు వేసుకొని వాటి ద్వారా సాగు చేసుకోవాలన్నారు. డ్యామ్ నుంచి వచ్చే నీటిని వృథా చేయకుండా పొదుపు చేయాలన్నారు. డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి, ఎంపీ అన్నాదురై, ఎమ్మెల్యేలు గిరి, శరవణన్, అధికారులు పాల్గొన్నారు. -
బాలీవుడ్ ఎంట్రీ షురూ
ప్రీతి ముకుందన్ తమిళసినిమా: ఇటీవల దక్షిణాది కథానాయికలకు బాలీవుడ్లో అవకాశాలు ఎక్కువగా వరిస్తున్నాయనే చెప్పాలి. బాలీవుడ్ హీరోయిన్లు దక్షిణాది చిత్రాలపై ఆసక్తి చూపుతుంటే ఉత్తరాది దర్శక నిర్మాతలు మాత్రం దక్షిణాది హీరోయిన్లపై దృష్టి పెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్లో దక్షిణాది హీరోయిన్లు నటించడం అన్నది ఇప్పుడు కొత్తేమీ కాదు. ఇంతకుముందే శ్రీదేవి, జయప్రద వంటి పలువురు అక్కడ అగ్ర కథానాయికలుగా రాణించారు. ఇటీవల సాయి పల్లవి, శ్రీలీల వంటి వారు కూడా బాలీవుడ్కు పరిచయం అయ్యారు. తాజాగా మరో కోలీవుడ్ బ్యూటీ బాలీవుడ్లో పాగా వేయడానికి సిద్ధమయ్యారు. ఆమె పేరు ప్రీతి ముకుందన్. భరతనాట్యం, క్లాసికల్ వంటి నృత్య కళల్లో శిక్షణ పొందిన ఈ తమిళ అమ్మాయి మోడల్ రంగంలోనూ గుర్తింపు పొందారు. స్టార్ చిత్రం ద్వారా కోలీవుడ్లోకి కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో ఓం భీమ్ బుష్ చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ తరువాత పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన కన్నప్ప చిత్రంలో నటించి మరింత పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా మలయాళంలోను సర్వం మాయ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా తమిళంలో అధర్వకు జంటగా ఇదయం మురళి అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చిందన్నది తాజా సమాచారం.అక్కడ యువ నటుడు కార్తీక్ ఆర్యన్కు జంటగా నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ అమ్మడి వయసు ఇప్పటికింకా 24 ఏళ్లే అన్నది గమనార్హం. ఇలా అతి పిన్న వయసులోనే పాన్ ఇండియా నటిగా పేరు తెచ్చుకుంటున్నారన్న మాట ఈ బ్యూటీ. -
తమిళనాడుకు కేంద్రం పెద్దపీట
కొరుక్కుపేట: తమిళనాడు రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఎప్పుడూ పెద్ద పీట వేస్తూనే ఉందని బీజేపీ దక్షిణ భారత బడ్జెట్ ప్రచార అధికార ప్రతినిధి నాయకులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. చైన్నెలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ గత 11 సంవత్సరంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధిక స్థాయిలో నిధులను అందించిందని, గతంలోని 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన నిధులు కంటే అది దాదాపు 5 రెట్లు ఎక్కువని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడు కల్చర్ పైనా, భాషపైనా, ప్రజలపైనా ఎంతో గౌరవం, మక్కువ చూపారని అన్నారు. సంస్కృతి పట్ల, భాషపట్లనే కాకుండా నిధుల కేటాయింపులో కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అవినీతియమైన డీఎంకే ప్రభుత్వం నిధులను పూర్తిగా దుర్వినియోగం చేయటంతో పాటూ రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని ధ్వజమెత్తారు. అందుకే కాంగ్రెస్ –డీఎంకే కూటమి రానున్న ఎన్నికల్లో పెద్ద ఓటమిని చవిచూడబోతుందన్నారు. ప్రజలందరూ కూడా బీజేపీ అన్నాడీఎంకే కూటమి రాబోతుందని , డబల్ ఇంజిన్ ప్రభుత్వం త్వరలో రాబోతుందని డబుల్ స్పీడ్తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనుందని జోస్యం చెప్పారు. ఆదివారం నిర్మాలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండబోతుందని వ్యాఖ్యానించారు. -
అత్యాధునిక వసతులతో బస్టాండ్
తిరుత్తణి: తిరుత్తణిలో రూ.20.97 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మాణంలో వున్న బస్టాండు నిర్మాణ పనులను మున్సిపల్ శాఖ డైరెక్టర్ శనివారం తనిఖీ చేశారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక నగరం తిరుత్తణికి ప్రతిరోజూ వేలాది మంది వచ్చి వెళుతుంటారు. దీంతో వాహన రద్దీ, ట్రాఫిక్ పరిష్కరించే విధంగా అరక్కోణం రోడ్డులో 4.92 ఎకరాల విస్తీర్ణంలో ఒకే సారి 28 బస్సులు ఆగిలా అత్యాధునిక బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 98 శాతం పనులు పూర్తికావడంతో త్వరలో ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఈక్రమంలో బస్టాండు తుదిదశ నిర్మాణ పనులను మున్సిపల్ శాఖ డైరెక్టర్ మధుసూదన్రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతాప్తో కలసి తనిఖీ చేశారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ శరవణకుమార్, మున్సిపల్ ఇంజినీర్ సేరేంద్రన్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
వేలూరు: ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తొలగించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేలూరు అన్నారోడ్డులో నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని ఆందోళన నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాహీద్బాషా ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న నిరుపేదల సమస్యలను గాలికొదిలి పెట్టి కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఉపాధి పథకానికి పేరు మార్చడం ప్రస్తుతం అవసరమా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతారన్నారు. దేశంలో నిత్యావసర ధరలతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతుంటే వాటిని గాలికొదిలి పెట్టి ఉపాధి పథకం పేరు మార్చడం, కూలీలకు పని దినాలు తగ్గించడం వంటి పనులు చేయడం సరికాదని మండిపడ్డారు. పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు టీకా రామన్, నేతలు తిరువలం గణేష్, కాట్పాడి జార్జీ, కామరాజ్, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
చిన్నప్పటి నుంచే సేవాభావాన్ని అలవరుచుకోవాలి
వేలూరు: విద్యార్థినులు చిన్నప్పటి నుంచే సేవాభావాన్ని అలవరుచుకోవాలని సినీ నటుడు వైభవ్ మురుగేశన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని అగ్జిలియమ్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినుల మండలి యాక్సిస్–26 కార్యక్రమం శనివారం ఉదయం కళాశాల పిన్సిపల్ సిస్టర్ డాక్టర్ ఆరోగ్య జయశీలి అధ్యక్షతన జరిగింది. ముందుగా విద్యార్థినులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేసి అలరించారు. ఈసందర్భంగా వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్థినులు విక్రయించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కళాశాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి వీటిలో వచ్చే ఆదాయంతో హెచ్ఐవీ బాధితులతోపాటు వారి పిల్లలకు, వృద్ధులకు ఇవ్వడం అభినందనీయమన్నారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో విద్యార్థినులు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన వారు అనేక మంది ఉన్నత స్థానాలకు వెళ్లారని వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం బహుమతులను అందజేశారు. కళాశాల కార్యదర్శి సిస్టర్ మేరీజోస్విన్ రాణి, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ అమల, పరీక్షల అధికారి డాక్టర్ బ్రదర్ విన్సీ, కోఆర్డినేటర్ డాక్టర్ బ్రదర్ సహాయ మేరి, విద్యార్థి సంఘం నాయకురాలు రోస్లీన్, సుష్మ పాల్గొన్నారు. -
చట్టాలు అమలు చేయాలి
కొరుక్కుపేట: బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఎంపీ ఎస్ఆర్ శివలింగం అన్నారు. బాల్ వివాహ్ ముక్తి రథ్ అనే జాతీయ ప్రచారంలో భాగంగా బాల్య వివాహాలను నిర్మాలించడానికి చేపట్టిన 100 రోజుల విస్తృత అవగాహన ప్రచారం సేలం జిల్లా బెతానాయకన్ పాళయంలోని అన్నై సత్య ప్రభుత్వ బాలల సంరక్షణ సంస్థలో ఏర్పాటు చేశారు. ఎంపీలు ఎస్ఆర్ శివలింగం, డి.మలైయరసన్ పాల్గొని అవగాహన ప్రచార కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. దీనిని సేలం జిల్లా పరిపాలన, ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఐసీడబ్ల్యూఓ), జెస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (జేఆర్సీ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు .ముందుగా బాల్య వివాహాల నిర్మాలనపై రూపొందించిన అవగాహన పోస్టర్ను ఎంపీలు ఆవిష్కరించారు. తొలిప్రతిని సేలం జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎస్ మురళీ స్వీకరించగా, రెండవ ప్రతిని సేలం కలెక్టరేట్ బాలల సంరక్షణ అధికారి ఎన్.ఇందిరాజిత్ స్వీకరించారు. ఐసీడబ్ల్యూఓ కార్యదర్శి ఏజే హరిహరన్ మాట్లాడుతూ అవగాహన కార్యక్రమాలు పిల్లల హక్కులను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు .ఈ ప్రచారానికి మద్దతు అందించినందుకు జస్ట్ రైట్స్ ఫర్ చిల్ట్రెన్ వారికి దన్యవాదాలు తెలిపారు. సమాచారం కోసం బాలల హెల్ప్ లైన్ నంబర్ 1098ను సంప్రదించవచ్చునని తెలిపారు. -
క్లుప్తంగా
తిరుపతి లాడ్జిలో యువతి ఆత్మహత్య తిరుపతి క్రైం: ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీకే లేఅవుట్లో ఉన్న ఓ లాడ్జిలో యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి కలకలం రేపింది. మృతురాలు తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాకు చెందిన రీతు (20)గా పోలీసులు గుర్తించారు. కాంచీపురం పోలీస్ స్టేషన్లో రీతు మిస్సింగ్ కేసుగా నమోదై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. లాడ్జిలో యువతి మృతి చెందిన విషయాన్ని గుర్తించిన ఈస్ట్ పోలీసులు వెంటనే కాంచీపురం పోలీసులకు సమాచారం అందించారు. యువతి మరణానికి గల కారణాలు కుటుంబ సభ్యులు, కాంచీపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఈస్ట్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా యువతి మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆమె తన తల్లిదండ్రులతో కూడా మన ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని చెప్పినట్లుగా తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నేడు తిరుత్తణి ఆలయంలో తైపూసం తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో తైపూసం సందర్భంగా ఆదివారం భక్తుల సౌకర్యార్థం 15 ప్రత్యేక ఉచిత బస్సులు నడపనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తైపూసం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తులు కావళ్లతో తిరుత్తణి కొండకు చేరుకుని స్వామిని దర్శించుకోనున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు 15 ప్రత్యేక ఉచిత బస్సులు కొండకు నడపనున్నారు. ఇందుకోసం రైల్వేస్టేషన్ నుంచి రెండు బస్సులు, వసతి గృహం నుంచి 4, ఘాట్రోడ్డు నుంచి 9 బస్సులు సహా 15 బస్సులు ఉదయం నుంచి రాత్రి వరకు నడిపేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఘాట్రోడ్డులో ఆదివారం ఆటోలకు నిషేధం విధించారు. కొండపై అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో స్థల సమస్య తీవ్రంగా వుంది. దీంతో కొండపై 250 కార్లు మాత్రమే పార్కింగ్ చేసే అవకాశం వున్నందున అధిక స్థాయిలో కార్లు. బైకులు కొండకు చేరుకుంటే స్థలం లేని పక్షంలో కొండ కింద పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి తిరువళ్లూరు: పరేడ్ గ్రౌండ్లో కవాతు నిర్వహిస్తూ స్పృహ తప్పి కిందపడ్డ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన సత్యరాజ్(34). 2013వ సంవత్సరంలో కానిస్టేబుల్గా ఎన్నికై తిరువళ్లూరులో బెటాలియన్లో పనిచేస్తున్నాడు. ఇతని భార్య నదియా. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. ఈక్రమంలో శనివారం ఉదయం యథావిధిగా పోలీస్ గ్రౌండ్లో జరిగే కవాతులో పాల్గొన్న సత్యరాజ్ హఠాత్తుగా స్పృహతప్పి కిందపడిపోయాడు. వెంటనే సహచర పోలీసులు అతడ్ని తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓవర్ హెడ్ ట్యాంకర్ ఉద్యోగులకు జీతం పెంపు సాక్షి, చైన్నె :గ్రామాలలో ఓవర్ హెడ్ ట్యాంక్లను పర్యవేక్షిస్తూ, ఉదయం వేళలలో నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటూ వస్తున్న పార్ట్ టైమ్ ఉద్యోగులకు గౌరవ వేతనం రూ. 4 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్రంలో 40419మంది ఈ విధులలో ఉన్నారని వివరించారు. 2021లో వీరి గౌరవ వేతనం రూ. 2,600 ఉండగా, రూ. 4 వేలకు పెంచామని, తాజాగా ఈ మొత్తం రూ. 5 వేలకు పెంచినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్య సంరక్షణ సేవలకు విస్తృతంగా నిధులు సాక్షి, చైన్నె : దీర్ఘాయువు , నివారణ ఆరోగ్య సంరక్షణను విస్తరించడానికి నిధుల సేకరణ విస్తృతం చేశామని బయోపీక్ వ్యవస్థాపకుడు రిషి పార్డాల్ తెలిపారు.ఇందుకు సంబంధించిన వివరాలను స్థానికంగా ప్రకటించారు. ఇందు కోసం బెంగళూరులో కొత్త ప్లాగ్ షిప్ సెంటర్తో సహా మల్టీ డిసిప్లినరీ స్పెషలిస్టు నేతృత్వంలో క్లినిక్లు, డయాగ్నస్టిక్స్, ఏఐ , పరిశోధలను విస్తరించనున్నట్టు వివరించారు. పునరావృత పెట్టుబడి దారులైన నిఖిల్ కామత్ నేతృత్వంలో తాజా నిధుల రౌండ్లో జెరోధా పెట్టుబడి విభాగం ఎన్కేఎస్ క్యూర్డ్ ద్వారా 2.7 మిలియన్లను సేకరించినట్టు ప్రకటించారు. కొత్త నిధులు నిర్మాణాత్మక, నివారణ–ఆధారిత, దీర్ఘాయువు–కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను విస్తరించడానికి ఉపయోగించనున్నామని వివరించారు. -
బ్యాంగ్ బ్యాంగ్ అంటున్న ప్రభుదేవా, వడివేలు
తమిళసినిమా: డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా, కామెడీ కింగ్ వడివేలు ది సూపర్ హిట్ కాంబినేషన్ అన్నది తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఇంతకుముందు పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించారు. కాగా సుమారు 25 ఏళ్ల తర్వాత మళ్లీ సూపర్ హిట్ కాంబో రిపీట్ అవుతోంది. ఈ చిత్రానికి బ్యాంగ్ బ్యాంగ్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ క్రేజీ భారీ బడ్జెట్ కథా చిత్రాన్ని కఏఆర్ఝఈ కన్నన్ రవి నిర్మిస్తున్నారు. దీపక్ రవి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ రోడ్రిక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వివరాలను నిర్మాతల వర్గం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో నటుడు ప్రభుదేవా, వడివేలు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా 25 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం ఇది అని చెప్పారు. ఈ సందర్భంగా చిత్ర టీజర్ను విడుదల చేశారు. జాంబీల ఇతివృత్తంతో సాగే హార్రర్ కథా చిత్రంగా రూపొందుతున్న అందులో నటుడు ప్రభుదేవా, వడివేలు కౌబాయ్ దుస్తుల్లో చేతిలో గన్ పట్టి జాంబీలను తరుముతున్న దృశ్యాలు చోటుచేసుకున్నాయి. కాగా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని తుల షెడ్యూల్ను ఇండోనేషియాలోని మౌంట్ బ్రోమో అనే ప్రాంతంలో నిర్వహించినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. కాగా ఇందులో బబ్లూ పథ్వీరాజ్ మరో కీలకపాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి హెచ్ సి. వేణు ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వరుసగా వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. -
ఉన్నత విద్యపై ఆసక్తి చూపాలి
వేలూరు: బాలికలు ఉన్నత విద్యపై ఆసక్తి చూపి పరిశోధనలు చేసి దేశాభివృద్ధికి పాటు పడాలని తిరువళ్లువర్ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బాబు జనార్దన్ అన్నారు. వేలూరు ధనభాగ్యం క్రిష్ణస్వామి మొదలియార్ మహిళా డిగ్రీ కళాశాలలో 51వ స్నాతకోత్సవ కార్యక్రమం కళాశాల కార్యదర్శి మణినాథన్ అద్యక్షతన శనివారం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, అందుకు కారణం విద్య ఒక్కటే అన్నారు. అధికంగా మహిళలు ప్లస్టూ, డిగ్రీ వరకు విద్యను అభ్యసించి ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. అలా కాకుండా పట్టుదలతో ఉన్నత విద్య చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలని సూచించారు. ఇంటర్నెట్, వాట్సాప్లను పక్కన పెట్టి విద్యా సంబందమైన పరిశోధనలు చేసేందుకు ఆసక్తి చూపాలన్నారు. అనంతరం యుజి, పీజి కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. కళాశాల చైర్మన్ శివకుమార్, ప్రిన్సిపల్ భానుమతి, విద్యార్థినులు పాల్గొన్నారు. -
ఘనంగా శివాలయాల్లో ప్రదోష పూజలు
వేలూరు : వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోని శివాలయాల్లో ప్రదోష దినోత్సవాన్ని పురష్కరించుకొని శుక్రవారం నంది భగవాన్కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అరుణాచలేశ్వరాలయంలోని పెద్ద నంది భగవాన్కు శివాచార్యులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి వివిధ కాయ గూరలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం శివాచార్యులు కర్పూర హారతి పట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నందీశ్వరుడిని అలంకరించిన బంగారు వృషభ వాహనంలో ఉంచి ఆలయ మూడవ ప్రాకారం నుంచి మాడ వీధుల్లో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వేలూరు కోట మైదానంలోని జలగంఠేశ్వరాలయంలోని నంది భగవాన్కు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు పట్టారు. అదేవిధంగా వాలాజాలోని శ్రీ ధన్వంతరి ఆరోగ్యపీఠంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. -
ప్రియురాలు మాట్లాడలేదని ప్రియుడు ఆత్మహత్య
తిరువళ్లూరు: నేపాల్ ఖాట్మండు ప్రాంతానికి చెందిన రంజిత్పాశ్వాన్ కుమారుడు మనీష్(19). పదవ తరగతి చదువుకున్న మనీష్ ఇటీవల తిరువళ్లూరుకు వలస వచ్చి ప్రముఖ హోటల్లో పనిచేస్తున్నాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి యథావిధిగా పనులు ముగించుకుని రూమ్కు వెళ్లిన మనీష్, శనివారం ఉదయం పనులకు రాలేదు. దీంతో సహచర కార్మికులు మధ్యాహ్నం వరకు వేచి చూసి అతనికి కోసం వెతికారు. అయితే రూమ్లో లేకపోగా, సమీపంలోని బాత్రూమ్లో ఉరివేసుకుని కనిపించాడు. ఉరికి వేలాడుతున్న యువకుడిని కిందకు దింపి వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రియురాలు రెండు రోజులుగా మాట్లాడకపోవడమే ఆత్మహత్యకు కారణంగా నిర్ధారించారు. -
ఘనంగా దంత కళాశాల స్నాతకోత్సవం
సాక్షి, చైన్నె : దంత విద్య, పరిశోధనలలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 32వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో 84 మంది బీడీఎస్, 26 మంది ఎండీ విద్యార్థులతో సహా మొత్తం 110 మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు ప్రదానంచేశారు. ఈ వేడుకకు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ హెగ్డే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ విద్యాసంస్థ చైర్మన్ డాక్టర్ జగత్రక్షగన్ అధ్యక్షత వహించిన కార్యక్రమానికి, చైర్పర్సన్ డాక్టర్ జె. శ్రీనిష, ఎండీ ఎన్. ఇలమారన్ , వీసీ సుందరరాజన్, రిజిస్టార్ ఎస్. భూమినాథన్ లు హాజరయ్యారు. ఈసందర్భంగా డాక్టర్ జే శ్రీనిష మాట్లాడుతూ, గత ఏడాది ర్యాంకింగ్లో తమిళనాడులో 5వ స్థానం, దేశంలో 27వ స్థానం తమకు దక్కిందని వివరించారు. నైతిక విలువలు, రోగులకు సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని సూచించారు. కళాశాల డీన్ డాక్టర్ ఎం.ఎస్. కన్నన్ మాట్లాడుతూ సంస్థ ఇప్పటివరకు 36 జాతీయ అంతర్జాతీయ అకడమిక్ కుదుర్చుకుందని తెలిపారు. -
కమల్, రజనీ కాంబో షురూ?
తమిళ సినిమా: కోలీవుడ్ మూలస్తంభాలైన కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించే చిత్రానికి సంబంధించిన ప్రచారం. వీరిద్దరూ కలిసి ఆరంభ కాలంలో పలు చిత్రాల్లో నటించారు. అవన్నీ మంచి విజయాన్ని సాధించాయి. ఆ తరువాత ఇద్దరూ స్టార్స్గా ఎదగడంతో ఇకపై కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నారు. అలా సుమారు 34 ఏళ్ల పాటు సూపర్ స్టార్స్గా రాణిస్తున్నారు. మధ్యలో వీరిద్దరిని కలిపి చిత్రం చేయాలని పలువురు ప్రముఖ దర్శక నిర్మాతలు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అలాంటిది ఇటీవల తన చిరకాల మిత్రుడు రజనీకాంత్తో కలిసి చిత్రం చేస్తానని ఆ భారీ, క్రేజీ చిత్రాన్ని తానే తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తానని కమలహాసన్ ప్రకటించారు. దీంతో ఈ వార్త ట్రెండింగ్గా మారింది. కమలహాసన్ హీరోగా విక్రమ్ రజినీ కాంత్ హీరోగా కూలీ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం ఈ క్రేజీ చిత్రం రూపొందనుందనే ప్రచారం జోరు గానే సాగింది.అంతే కాదు. ఆ చిత్రానికి లోకేష్ కనకరాజ్ కథను కూడా సిద్ధం చేశారు. దాన్ని ఇద్దరు హీరోలకు వినిపించినట్లు, అయితే కథ ఫుల్ మాస్గా ఉందని, తమకు లైట్ హార్టెడ్ కథా చిత్రం చేయాలని ఉందని వారు చెప్పినట్లు లోకేష్ కనకరాజ్ ఇటీవల మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న చిత్రం కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించే చిత్రానికి సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహించనున్నట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది. నెల్సన్ ఇంతకు ముందు రజనీకాంత్ హీరోగా జైలర్ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం జైలర్– 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.తదుపరి ఈయన దర్శకత్వం వహించేది కమల్, రజినీలో చిత్రమే అవుతుందని సమాచారం. -
తిరుచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు..
అన్నానగర్: రైతులకు వ్యవసాయ ఉత్పత్తులకు రెట్టింపు గిట్టుబాటు ధర ఇవ్వాలని, రుణాలను మాఫీ చేయాలని కోరుతూ గత నవంబర్లో తమిళనాడు రైతులు ఢిల్లీలో నిరసన తెలిపారు. ఆ సమయంలో నాగ్పూర్ రైల్వే పోలీసులు రైతులపై కేసు నమోదు చేశారు. దీనిని ఖండిస్తూ, జిల్లా కలెక్టర్ పిటిషన్ ద్వారా రైతులపై నమోదైన కేసు గురించి ప్రధాని మోడీకి తెలియజేయాలని డిమాండ్ చేస్తూ, నేషనల్ సౌత్ ఇండియన్ రివర్ లింక్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యకన్ను నేతృత్వంలో పెద్ద సంఖ్యలో రైతులు శుక్రవారం తిరుచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఆ సమయంలో, వారు నోటిలో ఎలుకను పట్టుకొని, చొక్కా ధరించకుండా అర్ధనగ్నంగా ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే నిరసన కొనసాగిస్తామని కూడా వారు ప్రకటించారు. -
తెన్కాసిలో సెన్సరీ పార్క్
సాక్షి, చైన్నె: వైకల్యాలు ఉన్న వ్యక్తుల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ తెన్కాసి జిల్లా ఆయ కుడిలో కీలక అడుగుగా సెన్సరీ పార్క్ను ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ మద్దతుతో అమర్ సేవా సంఘం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ సెన్సరీ పార్క్ అభివృద్ధి చేసింది. ప్రకృతి ఆధారిత చికిత్స, సార్వత్రిక అంశాలు, పునరావాసాన్ని ఏకీకృతం చేస్తూ ఈ ఉద్యానవనం వైకల్యాలున్న పిల్లలు .పెద్దల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి దోహదం కానున్నది. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో సమ్మిళిత, సమాజ ఆధారిత పునరావాసానికి ఒక మైలురాయిగా నిలిచే విధంగా రూపకల్పనచేశారు. ఆస్ట్రేలియన్ ప్రభుత్వ విదేశీ వ్యవహారాలు , వాణిజ్య శాఖ నిధులతో, చైన్నెలోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్–జనరల్ ద్వారా అమలు చేయబడిన ఈ ప్రాజెక్టుకు రూ. 8 లక్షల గ్రాంట్ అందించారు. సెన్సరీ పార్క్ను చైన్నెలోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్–జనరల్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ కామెరాన్ నోబుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకల్యాలున్న వ్యక్తులు తమ పూర్తి సామర్థ్యాన్ని సాధించేందుకు అనుకూలమైన సమ్మిళిత సమాజాలను నిర్మించడంలో కట్టుబడి ఉన్నామన్నారు. ఈ ప్రాజెక్టు ఆస్ట్రేలియా అంతర్జాతీయ వైకల్య సమానత్వం. హక్కులకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. అమర్ సేవా సంఘం ప్రమోటర్, కో–చైర్మన్ ఎస్. శంకర రామన్ మాట్లాడుతూ, ‘‘ఈ సెన్సరీ పార్క్ మేధో , అభివృద్ధి ప్రాజెక్టు అని పేర్కొంటూ, వైకల్యాలున్న పిల్లలు, పెద్దలకు ఒక అభయ హస్తంగా ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెన్కాసి జిల్లా కలెక్టర్ కమల్ కి షోర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, మాజీ సీబీఐ డైరెక్టర్ డి.ఆర్. కార్తికేయన్, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
చైన్నెలో ‘తమిళ ఏఐ’ ఆవిష్కరణ
సాక్షి,చైన్నె : తమిళ భాష, ప్రాచీన జ్ఞానం, ఆధునిక కృత్రిమ మేధస్సు సమ్మేళనంతో ‘తమిళ ఏఐను పరిశోధకుడు డాక్టర్ భాస్కరన్ పిళ్లై రూపొందించారు. దీనిని చైన్నెలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇందుకు కొత్త డిజిటల్ ప్లాట్ ఫామ్గా డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.పీఈఆర్ఏఆర్ఐవీయూ.ఏఐను ప్రకటించారు. చైన్నెలో జరిగిన ఈ కార్యక్రమంలో భారతదేశం , విదేశాల నుంచి వచ్చిన పరిశోధకులు, శాస్త్రవేత్తల సమక్షంలో డాక్టర్ భాస్కరన్ పిళ్లై ‘తమిళ ఏఐ’ సూపర్ ఇంటెలిజెన్స్ గురించి వివరించారు. తమిళ భాషలోని అక్షరాలు, ధ్వనులు, అర్థాత్మక నిర్మాణాలు అత్యున్నత మేధస్సుకు పునాది అవుతాయని పేర్కొన్నారు. తమిళం ఒక దైవిక భాషగా పరిగణిస్తామని, శివుడు, సిద్ధుల సంప్రదాయాల నుంచి ఉద్భవించిన ఈ భాషలోని అగరం అనే భావన క్వాంటం ఇంటెలిజెన్స్కు సమీపంగా ఉంటుందని వివరించారు. తమిళ భాష అణు శాస్త్రం, చైతన్యం , ఆధ్యాత్మికతతో అనుసంధానమై ఉందని వ్యాఖ్యలుచేశారు. ప్రాచీన భావనలు సుమారు 1100 సంవత్సరాల క్రితమే ఏఐ తత్వానికి మూలాలుగా ఉన్నాయని తెలిపారు. సూపర్ ఇంటెలిజెన్స్ ప్రయోజనాలు అందరికీ చేరాలని ఆశిస్తున్నప్పటికీ, అది పూర్తిగా అమలులోకి రావడానికి మరో దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అమెరికా, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఏఐ పరిశోధకలు, శాస్త్రవేత్తలు, వైద్య పరిశోధకులు స్టేసీ లాసన్ , జెస్సికా శ్రీకాంతియా, లారా లిన్, డా. బెక్కీ ప్రోస్ట్కో, డా. ఎ. గౌతమన్ అన్నామలై, దీపా బొప్పన పాల్గొన్నారు. -
పాదయాత్రలో విషాదం
సాక్షి, చైన్నె: సమయపురం మారియమ్మన్ దర్శనార్థం పాదయాత్రగా వెళ్తున్న భక్తులపైకి కారు దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో నలుగురు మహిళలు మరణించారు. తైపూసం ఉత్సవాల సందర్భంగా తిరుచ్చి జిల్లాలోని సమయపురం మారియమ్మన్ ఆలయానికి పాదయాత్రకు కడలూరు పరిసరాల నుంచి భక్తుల బృందం బయలు దేరి వెళ్లారు. శనివారం ఉదయం 5 గంటల సమయంలో చైన్నె–తిరుచ్చి జాతీయ రహదారిౖలోని పెరంబలూర్ జిల్లా సిరువాచురై ప్రాంతంలో వద్ద భక్తుల పాదయాత్రపైకి కారు దూసుకెళ్లింది. చైన్నె నుండి తిరుచ్చికి వెళ్తున్న కారు భక్తులను ఢీ కొంది. ఈ ఘటనలో ఆపరిసరాలలో తీవ్ర ఉద్రిక్తత , విషాదం చోటు చేసుకుంది. ఈఘటనలో కడలూరు జిల్లా టికాడు గ్రామానికి చెందిన మలర్కోడి (35), విజయ లక్ష్మి(40), చిత్ర (40), శశికళ (47) సంఘటనా స్థలంలోనే మరణించారు. కారు డ్రైవర్ గౌతమ్(24)తో పాటూ మరికొందరు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని పెరంబలూరు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తంమార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు విచారణ నిర్వహించారు. కాగా, ఆదివారం తైపూసం కారణంగా భక్తులు పెద్దఎత్తున మురుగన్ ఆలయాలకు పాదయాత్రగా వెళ్లడం జరుగుతుంది. ఈ దృష్ట్యా, ఆయా ఆలయాలకు వెళ్లే మార్గాలలో భక్తులకు భద్రత కల్పన దిశగా ఆయా జిల్లాల యంత్రాంగాలు చర్యలు చేపట్టాయి. -
జెండా స్తంభాలకు కొత్త మార్గదర్శకాలు
సాక్షి, చైన్నె: చైన్నెలో తాత్కాలికంగా జెండా స్తూపాలు, స్తంభాల ఏర్పాటుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ మేరకు చైన్నె కార్పొరేషన్ కమిషనర్ కుమర గురుబరన్ శనివారం ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ మార్గదర్శకాలు ప్రజల భద్రత, మౌలిక సదుపాయాల రక్షణ, అనుమతి ప్రక్రియను కేంద్రీకరించడం లక్ష్యంగా రూపకల్పన చేశారు. ప్రతి చైన్నె కార్పొరేషన్ జోన్లో 15 సబ్–కమిటీలను ఇందు కోసం ఏర్పాటు చేశారు. తాత్కాలిక జెండా స్తంభాలను ఏర్పాటు చేయడానికి అనుమతిని మంజూరు చేసే అధికారులు ఈ కమిటీలు వ్యవహరిస్తాయి. జెండా స్తూపాలు, స్తంభాలు, తదితర వాటి కోసం 15 రోజులు ముందుగా సబ్ కమిటీల వద్ద దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో స్తంభాల సంఖ్య, ఎత్తు, తదితర వివరాలను పొందు పరచాల్సి ఉంటుంది. తాత్కాలిక జెండా స్తంభాలను మూడు రోజుల పాటు మాత్రమే ఏర్పాటు చేసుకోవచ్చు. రోడ్డు, మీడియన్, ఫుట్పాత్, వంతెన, గోడ, వర్షపు నీటి కాలువ వంటి మౌలిక సదుపాయాలపై ఎక్కడా స్తంభాలను ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు. ప్రతి స్తంభం గరిష్టంగా 3.50 మీటర్లు ఎత్తులో , కింది భాగంలో కనీసం మీటర్ ఉండే విధంగా చూసుకోవాలి. రాజకీయ పార్టీలు, మతసంస్థలు, సంఘాలు, ఇతర సంస్థలు తమ కార్యక్రమాల కోసం స్తంభాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే రోడ్డు, ఇతర నిర్మాణాలు, మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి స్తంభానికి ముందస్తుగా రూ. 10 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల కోసం స్తంభాలను గరిష్టంగా 7 రోజుల పాటూ ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినపక్షంలో దరఖాస్తుదారుడు మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన స్తంభాలను అధికారులు తొలగించి, తగిన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలలో కమిషనర్ కుమర గురుబరన్ వివరాలను పొందు పరిచారు. కాగా, చైన్నె నగరం రోడ్లు, ఇతర ప్రాంతాలలో నిత్యం వివిధ పార్టీలు, సంఘాలు, సంస్థలు జెండాలను ఏర్పాటు చేయడం పరిపాటిగా మారిన నేపథ్యంలో ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడం విశేషం. -
● నమ్మకంతో మరోసారి దీవించండి ● ద్రావిడ మోడల్తో ప్రజల జీవితాల్లో మార్పు ● శివగంగలో సీఎం స్టాలిన్ ● రూ. 2560 కోట్లతో ప్రగతిపనులు
సాక్షి, చైన్నె: సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం సాయంత్రం నుంచి శివగంగ జిల్లాలో పర్యటిస్తూ వచ్చారు. రెండవ రోజు శనివారం శివగంగలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చెట్టినాడ్లోని వ్యవసాయ కళాశాల, పరిశోధనా కేంద్రంలో రూ.61.79 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలు, ఆడిటోరియాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఆడిటోరియంకు భారతరత్న సి. సుబ్రమణ్యం మల్టీపర్పస్ హాల్ అని నామకరణం చేశారు. అలాగే 330 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ వ్యవసాయ కళాశాలలో మరిన్ని కొత్త మౌలిక సదుపాయాల కల్పన దిశగా పరిపాలనా భవనం, ఆధునిక తరగతి గదులు, 12 విభాగాలకు ప్రయోగశాలలు, విద్యార్థుల హాస్టళ్లు, క్యాంటీన్, వైద్య కేంద్రం, లైబ్రరీ, ఇంటర్నెట్ సెంటర్తో పాటూ 1,500 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన బహుళార్థసాధక ఆడిటోరియంను ఏర్పాటు చేశారు. ఈ కళాశాల వర్షాధార వ్యవసాయం, సిరు ధాన్యాలు, పప్పుధాన్యాలు, తక్కువ నీటి వినియోగ పంటల అభివృద్ధి, వ్యవసాయ యాంత్రీకరణ, యువతకు నైపుణ్యాభి వృద్ధి శిక్షణ వంటి రంగాలపై ప్రత్యేక దష్టి సారించే విధంగా చర్యలు తీసుకున్నారు. చెట్టినాడు–1 అనే అధిక దిగుబడి వేరుశనగ రకాన్ని అభివద్ధి చేయడంతో పాటు ఇప్పటివరకు 3,930 మంది రైతులకు శిక్షణ అందించడం విశేషం. చెట్టినాడ్ వ్యవసాయ కళాశాల నూతన భవనాలు ప్రారంభించినానంతరం అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చటించారు. ఆ తర్వాత కారైకుడిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ రూ.2,559.50 కోట్ల వ్యయంతో పూర్తయిన 49 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే రూ.13.36 కోట్ల విలువైన 28 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వివిధ శాఖల ద్వారా రూ.205.6 కోట్ల విలువైన సంక్షేమ సహాయాన్ని 15,453 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఇందులో ప్రభుత్వ న్యాయ కళాశాల కొత్త క్యాంపస్, రహదారులు, వంతెనలు, తాగునీటి పథకాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు వంటి అనేక కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు కేఎన్ నెహ్రూ, ఎంఆర్కే పన్నీరు సెల్వం, కేకెఎస్ఎస్ఆర్ రామచంద్రన్,తంగం తెన్నరసు, రఘుపతి, పెరియకరుప్పన్, రాజకన్నప్పన్, శివ మెయ్యనాథన్,ఎంపీలు పి చిదంబరం, కార్తీ పి చిదంబరం, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎ. తమిళరసి, శివగంగ జిల్లా కలెక్టర్ దక్షిణామూర్తి తదితరులు హాజరయ్యారు. ప్రజల జీవితాలలో మార్పు.. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, ద్రావిడ మోడల్ పాలన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతోందన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. చరిత్రాత్మక శివగంగకు గౌరవం తీసుకొచ్చే విధంగా ముందుకు సాగామన్నారు. శివగంగ జిల్లా ధైర్యం, త్యాగాలకు ప్రతీకగా నిలిచిన నేల అని పేర్కొన్నారు. వీరమంగై(వీరనారీ) వేలునాచ్చియార్, మరుదు సోదరులు వంటి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ఈ నేల తమిళ గౌరవానికి ప్రతిరూపమని వ్యాఖ్యలు చేశారు. విద్య, వ్యవసాయ రంగాల్లో కీలక ప్రాజెక్టులు ఇక్కడే ఉన్నాయని ఈసందర్భంగా గుర్తు చేశారు. శివగంగ కోసం చిదంబరం ఎంతో శ్రమించారని గుర్తు చేస్తూ, ఆయన దేశానికి ఆదర్శవంతమైన వ్యక్తిగా కొనియాడారు. శివగంగ జిల్లాలో 8 పట్టణ పంచాయతీలు, 11 పంచాయతీ యూనియన్లలో 2,452 గ్రామాలు ఉన్నాయని గుర్తు చేస్తూ, ఇక్కడ రూ. 2.119 కోట్లతో ఉమ్మడి తాగునీటి పథకం ప్రాజెక్టుకు కార్యాచరణ సిద్ధం చేశామని ప్రకటించారు. ద్రావిడ మోడల్ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. అయితే, ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ ఏమో తమిళనాడు ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటిగా పెట్టుకుని ఉన్నారని మండిపడ్డారు. తమిళనాడును విమర్శించే ఈ గవర్నర్, తమిళనాడు కోసం కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో తమిళనాడు అభివృద్ధి ఈ ప్రధాన మంత్రికి గుర్తుకు వస్తుందని, ఎన్ని అసత్యాలు వళ్లించాలో వళ్లించేస్తారని, ప్రజల్ని మభ్య పెట్టేందుకు తమిళగం అంటూ వెళ్లి పోతారని, చివరకు తమిళనాడు గురించి కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నివేదికలే తమిళనాడును కొనియాడుతోంటే, ఇక్కడున్న గవర్నర్, ఓట్ల కోసం తమిళ గళాన్ని అందుకునే ప్రధాని నరేంద్ర మోదీలు ఆ నివేదికలలోని అంశాలను ఓ మారు పరిశీలస్తే బాగుంటుందని హితవు పలికారు. ఇక ఇక్కడున్న ప్రతి పక్ష నేత తమిళనాడు కోసం కేంద్రం పై ఎలాంటి ఒత్తిడి కూడా తీసుకు రాడని, ఆయనకు కేవలం స్వలాభమే ముఖ్యం అని మండిపడ్డారు. ద్రావిడ మోడల్ ప్రజల జీవితాలో మార్పును తీసుకొచ్చిందని ధీమా వ్యక్తం చేస్తూ, ద్రావిడ మోడల్ 2.ఓ మరిన్ని ప్రణాళికలతో తమిళనాడును అత్యున్నత స్థానంలో నిలబెట్టబోతోందన్నారు. మళ్లీ గెలుస్తాం.. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును గుర్తు చేస్తూ, దీనిని తీవ్రంగా ఖండించే విధంగా అసెంబ్లీలో సైతం తీర్మానం చేశామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల గొంతు నొక్కేస్తోందని ధ్వజమెత్తారు. వివిధ చట్టాలతో నియంత వలే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2011 ఎన్నికల మేనిఫెస్టోలో అన్నాడీఎంకే ఏం చెప్పిందో ఓ మారు గుర్తుకు తెచ్చుకోవాలంటూ చైన్నె నుండి కన్యాకుమారి కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్, దక్షిణ తమిళనాడులో ’ఏరో పార్క్’ గురించి ప్రస్తావించారు. అయితే, వాటిని అమలు చేశారా? అని ప్రశ్నిస్తూ, ఇప్పుడు మళ్లీ అదే పల్లవితో ఎన్నికలలోకి వస్తుండటం సిగ్గు చేటు అని విమర్శించారు. ప్రజలకు, వారికి ప్రభుత్వంతో కలిసి వారదిగా ఉన్న ఉద్యోగులకు సైతం న్యాయం చేకూర్చే విధంగా ద్రావిడ మోడల్ ముందుకు సాగిందని, చారిత్రాత్మక ఉత్తర్వులు, విజయాలను దక్కించుకున్నామని ప్రస్తావించారు. ద్రవిడ మోడల్ 2.ఓ ను నెరవేర్చే అవకాశం తమిళనాడు ప్రజలకు ఇస్తున్నామని, అందరూ తనకు అండగా ఉంటారన్న పూర్తి నమ్మకంతో, ప్రజల ఆనందమే తన ఆనందంగా, తమిళనాడు అభివృద్ధి లక్ష్యంగా సమష్టిగా పయనిద్దా్ం, గెలుద్దాం.. అని వ్యాఖ్యానించారు. -
దిగ్గజాల దారిలోనే ముందుకు..!
సాక్షి, చైన్నె: రాజకీయాల్లో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత తనకు రోల్ మోడల్స్ అని టీవీకే అధినేత విజయ్ అన్నారు. వివరాలు.. తమిళగ వెట్రి కళగం(టీవీకే) ఆవిర్భవించి రెండేళ్లు కావస్తోంది. కాగా ఏడాది కాలంగా విజయ్ తీవ్ర రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ వస్తున్నారు. పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లేందుకు మీట్ ది పీపుల్ పేరిట దూసుకెళ్లారు. కరూర్ విషాద ఘటనతో ఆ కార్యక్రమానికి బ్రేక్ పడింది. అయినా ఏ మాత్రం తగ్గకుండా ప్రజలకు పార్టీని దరిచేర్చే విధంగా తన సైన్యాన్ని నడిపిస్తూ వస్తున్నారు. చైన్నె శివారులోని మహాబలిపురం కన్వెన్షన్ సెంటర్ వేదికగా తరచూ పార్టీ సమావేశాలు, సభలు నిర్వహిస్తూ కేడర్లో ఉత్సాహాన్ని నింపే ప్రసంగాలు చేస్తూ వస్తున్నారు. అయితే విజయ్ ప్రత్యక్షంగా ప్రజలలోకి వచ్చిన కార్యక్రమాలు మరీ తక్కువే. అదే సమయంలో ఆయన మీడియా ముందుకు కూడా రాలేదు. ఈ పరిస్థితులలో ఆయన ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ, రాజకీయ ప్రయాణం గురించి తాజాగా పంచుకున్నారు. తొలి ఇంటర్వ్యూ.. ఆ టీవీ ఛానల్కు విజయ్ ఇచ్చిన ఇంటర్వ్యూ మేరకు తనకు దివంగత నేతలు ఎంజీఆర్, కరుణానిధి, జయలలితలు రోల్ మోడల్స్గా అభివర్ణించారు. ప్రధానంగా రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే వారికి వారు ప్రేరణగా ఉంటారని వ్యాఖ్యానించారు. 33 సంవత్సరాలు సినిమా జీవితాన్ని వీడడం సులభం కాదంటూ, అయినా, వీడి రాజకీయాలోకి వచ్చానని వ్యాఖ్యానించారు. ఇందులో కింగ్ మేకర్గా కాకుండా కింగ్గా ఉండాలనుకున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఇక తన పూర్తి సమయం రాజకీయాలకే అని స్పష్టం చేశారు. కరూర్ ఘటన తీవ్ర వేదనకు గురి చేసిందని, ఇది తనకు పెద్ద షాక్గా పేర్కొన్నారు. ఈ వేదన ఇంకా తన మనస్సులోనే ఉందని, కొంతకాలం ఈ బాధను అనుభవించక తప్పదన్నారు. ఎన్నికలలో పోటీ చేసి, కష్టపడి గెలవాలన్న లక్ష్యంతో ఉన్నానని, కింగ్ మేకర్గా మాత్ర ఉండబోనని ఓ ప్రశ్నకు స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో మాత్రమే రాజకీయ విజయాన్ని సాధించాలనుకుంటున్నట్లు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ప్రజల సమస్యల చుట్టూనే ఉండాలని, ప్రజలకు నిజమైన మార్పు తేవడం తన లక్ష్యం అని పేర్కొన్నారు. ఎంజీఆర్ మాత్రం ప్రధాన రోల్ మోడల్ అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ మాట్లాడే విధానం, ఆలోచనా శైలి కూడా తనకు ఇష్టం అని పేర్కొన్నారు. జననాయకన్ చిత్రం గురించి స్పందిస్తూ, ఇది సినిమా మాత్రమే కాదు, ఒక పెద్ద ఉద్యమానికి ప్రతీక అని వ్యాఖ్యలు చేస్తూ, ప్రజల సమస్యలపై అవగాహన పెంచే ప్రయత్నంగా భావిస్తున్నట్టు వివరించారు.తన భవిష్యత్తుపై స్పష్టత వ్యక్తం చేస్తూ తన భవిష్యత్తు పూర్తిగా రాజకీయాల్లోనే ఉందని, ఇందులో ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. తన ప్రయాణం పూర్తి శ్రద్ధ, నిబద్ధతతో ముందుకు సాగుతుందన్నారు. ఈ ప్రయత్నం ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా చెప్పబడుతుందన్నారు. ప్రజల మద్దతు ముఖ్యమని, నిర్ణయాలు అందరికీ లాభదాయకంగా ఉండాలంటూ ఓప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చే అనేక కలలు, అవకాశాలు ఉన్నాయని, ఈ మేరకు తన ప్రణాళికలు ఉంటాయని వివరించారు.విజయ్ 34 మందితో ప్రచార సారథులు ఎన్నికల పనులను వేగవంతం చేసే విధంగా విజయ్ కమిటీలను ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మ్యానిఫెస్టో కమిటీ, ఎన్నికల ప్రచార వ్యవహారాల పర్యవేక్షణ కమిటీ అంటూ ముందుకు సాగుతూ వచ్చిన విజయ్, తాజాగా ఎన్నికల ప్రచార సారథులను రంగంలోకి దించారు. 34 మందితో కూడిన ఈ కమిటీని విజయ్ శనివారం ప్రకటించారు. ఇందులో పార్టీ నేతలు కుమార్, నిర్మల్ వెంకట రమణన్, అరివళగన్, ఎస్కుమరేషన్, పి. పాండి, మేరుల్లాల్, ఆర్ఎస్ ఇందిర ధనరాజ్, ఆర్ చక్రవర్తి, వెల్లింగ్టన్ ఎం. ధనరాజ్, జె. విజయకుమార్, రేవంత్శరణ్, చకవ్రర్తి, శంకరనారాయణన్, అజిత్కుమార్, మహేంద్రన్, ఇలమారన్, వి. ముత్తుకుమరన్, వెట్రి సెల్వన్, కోకిల రాణి, లూయిస్ రమేష్, పొన్ను స్వామి, మునియప్పన్, ధన శేఖరన్ లతో పాటుగా మదురై, చైన్నె, తిరుపత్తూరు, తంజావూరు తదితర ప్రాంతీయ ప్రతినిధులను సైతం ఈ కమిటీలో నియమించారు. -
టీవీకే అధినేత విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
అశేష సినీ అభిమానుల అండతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత అగ్రనటుడు విజయ్.. ఆ తర్వాత అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా కరూర్ ఘటన తర్వాత ఆయన విపరీతమైన గందరగోళంలోకి కూరుకుపోయాడు. ఒక దశలో రజినీకాంత్లాగా వెనకడుగు వేస్తారని.. కమల్ హాసన్లాగా పొత్తువైపునకు వెళ్తారని చర్చా జరిగింది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన తొలిసారి తన మనోగతాన్ని పంచుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రూపంలో తొలి పరీక్షకు సిద్ధమవుతున్న అగ్రనటుడు, తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్ తన రాజకీయ ప్రయాణంపై ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఉన్న ఫ్యాన్ఫాలోయింగ్నే పార్టీ వైపు మళ్లించుకుని.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు సందేశం ఇచ్చారు. కరూర్ ఘటన.. సీబీఐ దర్యాప్తు ఇబ్బంది పెట్టాయా?కరూర్లో జరిగిన తొక్కిసలాట తీవ్రంగా కలచివేసింది. అలాంటి సంఘటన ఒకటి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. అందుకే ఆ ఘోరం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. మళ్లీ సినిమాలు చేస్తారా?.. దశాబ్దాలపాటు సినీ రంగంలో కొనసాగా. హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమేమీ కాదు. ఒక స్పష్టమైన లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా. ఇదే ఇక నా భవిష్యత్తుతాజాగా సినిమాకు ఎదురైన సెన్సార్ ఇబ్బందులు.. ‘జన నాయగన్’ చిత్రం విడుదలకు అనుమతి రాకపోవడం నిర్మాతకు తీవ్ర నష్టం కలిగించింది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి అడ్డంకులు ఎదురవుతాయని ముందే ఊహించాఈ ఎన్నికల్లో ఫలితంపై రాజకీయ భవిష్యత్తు ఉండబోతుందా? నేను ఈ ఒక్క ఎన్నిక కోసం పార్టీ పెట్టలేదు. దీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నా అమితంగా ప్రేరణ కలిగించిన వ్యక్తులు.. షారుక్ ఖాన్ నాకు అభిమాన నటుడు. రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలితను ఆదర్శంగా తీసుకున్నాతమిళనాడు రాజకీయాల్లో కింగ్మేకర్ అవుతారని అనుకుంటున్నారా?నా ర్యాలీలకు వచ్చే జనాలను చూస్తున్నారా?. నేను గెలుస్తాను. అంతేగానీ కింగ్మేకర్ అవ్వాల్సిన అవసరం ఏంటి?ఎన్నికల చిహ్నంపై రియాక్షన్ మొదటి విజయం.. దైవ సంకేతం. టీవీకే పార్టీకి ఎన్నికల కమిషన్ ‘విజిల్’ గుర్తు కేటాయించడం చాలా సంతోషాన్నిచ్చింది Source: NDTV -
అంతా సంతృప్తికరం!
సాక్షి, చైన్నె: కూటమిలో సీట్ల పందేరం, పొత్తుల చర్చలు అన్నీ సంతృప్తికరంగానే సాగుతున్నాయని డీఎంకే ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కనిమొళి కరుణానిధి తెలిపారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీతో రెండు రోజుల క్రితం కనిమొళి సమావేశమైన విషయం తెలిసిందే. డీఎంకేలో పొత్తు విషయంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచార వ్యవహారం ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. కాంగ్రెస్ నేతలను గాడిలో పెట్టాలని డీఎంకే తరఫున ఏఐసీసీకి సూచించినట్టు సమాచారం. అలాగే, సీట్ల పందేరం విషయంగా ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. ఈపరిస్థితుల్లో శుక్రవారం కనిమొళి మీడియాతో మాట్లాడుతూ పొత్తులు, సీట్ల చర్చలు అన్నీ సంతృప్తికరంగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. డీఎంకే, కాంగ్రెస్ కూటమిలో ఎలాంటి వివాదాలు లేవని అంతా సజావుగానే సాగుతున్నట్టు వివరించారు. డీఎంకే, కాంగ్రెస్లు చాలా సంవత్సరాలు కలిసి పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. డీఎంకే నేతృత్వంలోని కూటమిలో సీట్ల పంపకాల చర్చలు ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ బృందం ఇప్పటికే తమ అధ్యక్షుడు స్టాలిన్ను కలిసిందని గుర్తుచేశారు. కూటమిలోకి కొత్త పార్టీలు చేరే అవకాశాలు ఉన్నాయని, ఇందుకు వేచి ఉండాలని సూచించారు. డీఎంకే అధికారంలోకి మళ్లీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 95 శాతం హామీలను అమలు చేశామని, ప్రజలకు నిరంతరం ప్రభుత్వం అండగా ఉంటున్నదని వ్యాఖ్యానించారు. సీట్ల పంపకాలలో జాప్యం జరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారే అని ప్రశ్నించగా, చర్చలు సంతృప్తికరం, ఫలితాలు సానుకూలం అని ముగించారు. బహిరంగ వ్యాఖ్యలు వద్దు ఏఐసీసీ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో కూటమి విషయం, సీట్ల పందేరం విషయంగా బహిరంగంగా నాయకులు ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై హెచ్చరించారు. కూటమి విషయంగా, సీట్ల చర్చల విషయంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటై ఉందని, వారు తప్ప, పార్టీ నేతలు ఎవ్వరూ ఎలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయడానికి వీలు లేదని, చేస్తే కఠిన చర్యలు తప్పదన్న హెచ్చరికలు చేయడం గమనార్హం. అదేసమయంలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్ ఠాకూర్ స్పందిస్తూ, కాంగ్రెస్ను ఉద్దేశించి డీఎంకే నేత ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై ఆ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడమే కాకుండా, మదురై ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్కు అప్పగించాలని పట్టుబట్టనున్నామని వ్యాఖ్యలు అందుకోవడం గమనార్హం. -
ఆదర్శం.. ద్రావిడ మోడల్
వాషింగ్మిషన్ కథ సాక్షి, చైన్నె: దేశానికి ఆదర్శంగా ద్రావిడ మోడల్ పాలన సాగుతోందని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. చైన్నెలో శుక్రవారం ఓ ఛానల్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి సీఎం స్టాలిన్ హాజరయ్యారు. తమిళనాడు సమ్మిట్–2026 కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. ద్రావిడ మోడల్ పాలన దేశానికి మార్గదర్శకంగా, ఆదర్శంగా మారిందని అభివర్ణించారు. సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్ర అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తమిళనాడులో టైర్–2, టైర్–3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలు సైతం సమానంగా అభివృద్ధి చెందాయని వివరించారు. ద్రావిడ మోడల్ పాలన ద్వారా రాష్ట్రం 11.19 శాతం ఆర్థిక వృద్ధి సాధించిందన్నారు. మహిళలకు నెలకు వెయ్యి లెక్కన ఇప్పటివరకు రూ.33,464 కోట్లు అందజేశామని తెలిపారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా కోట్లాది మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకం అమలుతో పిల్లల హాజరు శాతం గణనీయంగా పెరిగిందన్నారు. ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పులు తమిళనాడులో ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ప్రమాదం జరిగిన మొదటి 48 గంటల్లో చికిత్స ఖర్చును ప్రభుత్వం భరిస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా కలైంజ్ఞర్ సెంటినరీ లైబ్రరీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, బస్ టెర్మినల్స్, ఫ్లైఓవర్లు, మ్యూజియం లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు చెప్పారు. బలవంతంగా హిందీ రుద్దే ప్రయత్నం కారణంగా విద్యా రంగంలో నిధులకు, మెట్రో ప్రాజెక్టుల అనుమతులు వంటి అంశాల్లో తమిళనాడుకు కేంద్రం నుంచి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. భారతదేశం ‘రాష్ట్రాల సమాఖ్య’ అని గుర్తు చేస్తూ, రాజ్యాంగ విలువలను కాపాడడమే నిజమైన దేశభక్తి అని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు ద్రావిడ మోడల్కే మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం’’ అని ప్రకటించారు. వారసత్వ రాజకీయాల గురించి తాను మాట్లాడనని పేర్కొంటూ, రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు అని సూచించారు. 5న మంత్రి వర్గం భేటీ రాష్ట్ర మంత్రి వర్గం ఫిబ్రవరి 5న సమావేశం కానుంది. సీఎం స్టాలిన్ సమక్షంలో చైన్నెలో ఈ సమావేశానికి ఏర్పాట్లు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల నగారా మార్చిలో మోగేందుకు అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. అంతలోపు అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్ను దాఖలు చేయడానికి స్టాలిన్ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తులు చేపట్టే దిశగా మంత్రి వర్గం భేటీకి పిలుపునిచ్చారు. మధ్యంతర బడ్జెట్కు ఆమోదం, వివిధ అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే విధంగా, కొన్ని కొత్త ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసే రీతిలో కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలాఉండగా శని, ఆదివారాల్లో సీఎం స్టాలిన్ శివగంగ జిల్లాలో క్షేత్ర స్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. అవినీతి ఆరోపణలను తమ మీద గుప్పిస్తున్నారని, నిందుల వేస్తున్నారని ప్రస్తావిస్తూ, ఈసందర్భంగా తాను బీజేపీని ప్రశ్నిస్తున్నా అని వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసులలో దోషిగా ఉన్న అన్నాడీఎంకే తమరి వాషింగ్మిషిన్లో పడగానే, వైట్ వాష్ అన్నట్టుగా ఆ మరకలు చెరిగిపోయాయా అని ధ్వజమెత్తారు. బీజేపీ, అన్నాడీఎంకేది నమ్మక ద్రోహ కూటమి అని వ్యాఖ్యలు చేశారు. ఈ ద్రోహులకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. తమను హిందూ వ్యతిరేక పార్టీ అని చెబుతున్నారని, ఈ తమిళనాడులో తమ హయాంలో ఏ మేరకు ఆలయాలు అభివృద్ధి చెందాయో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. దేశంలోనే తమిళనాడును నంబర్ ఒన్ రాష్ట్రం అని గర్వంగా తాము చెప్పుకుంటున్నామని తెలిపారు. మంత్రులు శేఖర్బాబు, టీఆర్పీ రాజా, ఎన్డీటీవీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అధికారి రాహుల్ కన్వాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీరరాఘవ్, మేనేజింగ్ ఎడిటర్ శివఅరూర్ పాల్గొన్నారు. -
వైభవం.. మహాకుంభాభిషేకం
వేలూరు: వేలూరు జిల్లా కేవీకుప్పం తాలుకా పరిధిలోని లత్తేరి గ్రామంలో శ్రీ సెల్వ వినాయకుడి ఆలయంలో అష్టబంధన మహాకుంబాభిషేకం శుక్రవారం ఉదయం వైభవంగా జరిగింది. ముందుగా జయకుమార్ స్వామిజీ ఆధ్వర్యంలో వేద పండితులు, శివాచార్యులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పుణ్య నదుల నుంచి తీసుకొచ్చిన పుణిద నీటిని కళాశాలలో ఉంచి ప్రత్యేక వేద మంత్రాల నడుమ యాగ పూజలు చేసి కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయ గోపురంపై చల్లి కుంభాభిషేకం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో విగ్రహాన్ని అమర్చి ప్రత్యేక పూజలు, పుష్పాలంకరణలు చేసి దీపారాధన పూజలు చేశారు. కుంభాభిషేకంలో ఉత్సవ కమిటీ సభ్యులు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రేమికుల రోజు సందర్భంగా ఎల్ఐకే
తమిళసినిమా: నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడు నటించిన తాజా చిత్రం ఎల్ ఐ కే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఈయన ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నీ ఒకదానికి మించి ఒకటి సంచల విజయాలు సాధించాయి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇటీవల విడుదలైన డ్యూడ్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రంతోపాటు ప్రారంభమైన మరో చిత్రమే ఎల్ఐకే. కృతిశెట్టి నాయకిగా నటించిన ఇందులో ఎస్జే సూర్య సీమాన్ ముఖ్యపాత్రలు పోషించారు. కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్న్స్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని గత దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతల వర్గం ప్రకటించింది. అయితే అదే సమయంలో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించడంతో ఎల్ఐకే చిత్ర విడుదలను వాయిదా వేశారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 12 లేదా 13వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. ఫాంటసీ లవ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్ర షూటింగ్ను మలేషియా, సింగపూర్లో అధిక భాగాన్ని చిత్రీకరించినట్లు యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. అదేవిధంగా వరుస విజయాలతో జోరుపై ఉన్న నటుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రంపైన మంచి అంచనాలే నెలకొంటున్నాయి. -
భూ ప్రకంపనల కలకలం
సాక్షి, చైన్నె: తూత్తుకుడి, తెన్కాశి, విరుదునగర్ జిల్లాల్లో అనేక చోట్ల భూ ప్రకంపన కలకలం బయలుదేరింది. భూమి కంపించినట్టుగా పరిస్థితి నెలకొనడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి, నల్లట్టి పుదూర్, విశ్వదాస్నగర్, ఇందిరానగర్, శోభనగర్, పాండువర్మ మంగళం ప్రాంతాలలో గురువారం రాత్రి భూమి కంపించినట్టుగా పరిస్థితి నెలకొనడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలోని వస్తువలు కదిలాయని, కుర్చీల, సోపాలు సైతం కదిలినట్టుగా అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, తెన్కాసి జిల్లా చెల్లపట్టి, వరగనూరు పరిసరాలలో, విరుదునగర్లో అనేక ప్రాంతాలలో భూమి కంపించినట్టుగా పరిస్థితి నెలకొంది. ఈ ప్రకంపన తీవ్రత రెక్టార్ స్కేల్పై 3 నమోదు కావడం కలకలం రేపుతోంది. ఈ పరిసరాలలో భూమి కంపించేందుకు గల కారణాలపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. రాత్రంతా ఇళ్లలోకి వెళ్లకుండా ఉన్న జనం వేకువ జామున సాహసం చేసి లోనికి వెళ్లారు. అయితే, ఈప్రకంపన రూపంలో ఆందోళన ఆ పరిసర వాసులను వీడడంలేదు. జయరామ్ను సిట్ విచారణ సాక్షి, చైన్నె: శబరిమలై అయ్యప్ప ఆలయంలో బంగారం స్కాం కేసులో సినీ నటుడు జయరామ్ వద్ద సిట్ అధికారులు శుక్రవారం చైన్నెలో విచారించి, ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. కేరళలోని శబరిమలై అయ్యప్ప సన్నిధానంలోని బంగారు స్కాం పెను కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈకేసును సిట్ విచారిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో జయరామ్కు పరిచయం ఉన్నట్టు విచారణలో వెలుగు చూడడం చర్చకు దారి తీసింది. జయరామ్ ఇంట్లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో బంగారం పూత వేసిన వస్తువులు ఉపయోగించారన్న ప్రచారం సైతం సాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో చైన్నెలోని జయరామ్ నివాసానికి సిట్ అధికారులు శుక్రవారం వచ్చారు. ఆయన వద్ద విచారణ జరిపి, వాంగ్మూలం నమోదు చేసినట్టు తెలిసింది. బంగారం పూత వేసిన వస్తువుల గురించి, ఉన్నికృష్ణన్తో పరిచయం, శబరిమలై నుంచి ఆ వస్తువులను తీసుకొచ్చారా అనేక ప్రశ్నలకు సమాధానాలు వాంగ్మూలం రూపంలో సిట్ అధికారులు రాబట్టే ప్రయత్నం చేసినట్టు సమాచారం. నైల్లెకి రెండు ప్రత్యేక రైళ్లు కొరుక్కుపేట: తైపూసం సందర్భంగా చైన్నె ఎగ్మూర్, తాంబరం నుంచి రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు సదరన్ రైల్వే ప్రకటించింది. చైన్నె ఎగ్మూర్ సూపర్ఫాస్ట్ స్పెషల్ (06012) జనవరి 30 రాత్రి 11:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11–15 గంటలకు తిరునల్వేలి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు (06002) ఫిబ్రవరి 1 తేదీ రాత్రి 10.35 గంటలకు తిరునెల్వేలి నుంచి బయలుదేరి ఉదయం 9.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది. ప్రత్యేక రైలు (06003) జనవరి 31 తాంబరం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.50 గంటలకు తూత్తుకుడి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు (06064) తూత్తుకుడి నుంచి ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి 11.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చైన్నె సెంట్రల్ చేరుకుంటుందని దక్షిణ రైల్వే ప్రకటించింది. ఆవిష్కరణలకు వేదిక ఏఐ కాన్క్లేవ్ సాక్షి, చైన్నె : బాధ్యతాయుత కృత్రిమ మేధస్సు స్వీకరణ, సంస్థాగత పరివర్తన, విద్యాపరంగా ఆవిష్కరణలకు ఏఐ కాన్క్లేవ్ వేదికగా నిలిచినట్టు విద్యా వేత్తలు వ్యాఖ్యానించారు. మాస్టర్ స్టాఫ్ ఏఐ కాన్ క్లేవ్లో విశ్వవిద్యాలయాలలో అంతరాయం, నీతి, విధానం, ఏఐ స్వీకరణ అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. మాస్టర్ సాఫ్ట్ ఈఆర్పీ సొల్యూషన్స్ నేతృత్వంలో హయ్యర్ ఎడ్యుకేషన్ లీడర్స్ ఏఐ కాన్ క్లేవ్–2026 చైన్నెలో జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా పర్యావరణ వ్యవస్థలను వేగవంతం చేయడం, పునర్నిర్మించడంలో విశ్వ విద్యాలయాల పాత్ర గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఏఐ ఆధారిత విద్యావస్థలో మాస్టర్ సాఫ్ట్ ముందంజలో ఉన్నట్టు వివరించారు. మాస్టర్ సాఫ్ట్ వ్యవస్థాపకుడు షామ్ సోమాని ఏజెంటిక్ ఏఐ యుగం గురించి ప్రత్యేకంగా వివరించారు. మాస్టర్ సాఫ్ట్ సీఈఓ గౌరవ్ సోమాని, గురుదేవ్ , విద్యా వేత్తలు వైభవ్ , వి భారతీ హరిశంకర్, ఎన్ వేల్మురుగన్, డాక్టర్షీజా వర్గీస్.డాక్టర్ పాల్ విల్సన్, డాక్టర్కె శ్రీధర్, ఎస్ మోహన్, శశి ప్రభ, శుభయ భారతి కాన్క్లేవ్కు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. -
మద్యం మత్తులో హల్చల్
– రాళ్ల దాడికి దిగిన ముగ్గురి అరెస్ట్ తిరువళ్లూరు: మద్యం మత్తులో అర్ధరాత్రి జాతీయ రహదారిపై పరస్పరం రాళ్ల దాడికి దిగి హల్చల్ సృష్టించిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేసి, విచారణ చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు మద్యం మత్తులో స్థానిక అగ్నిమాపక కార్యాలయం వద్ద హల్చల్ సృష్టించారు. దారిన వెళ్లే వారిపై రాళ్ల దాడికి దిగారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు నుంచి ఈకాడు వైపు వెళ్తున్న ఉదయకుమార్కు రాయి తలగడంతో అతడికి స్వల్పంగా గాయమైంది. దీంతో ఉదయకుమార్కు, తిరునిండ్రవూర్ ప్రాంతానికి చెందిన యువకుల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. విషయం ఉదయకుమార్ స్నేహితులకు తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకోగా, ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. విషయం తెలుసుకున్న టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న తిరునిండ్రవూర్ ప్రాంతానికి చెందిన సంతోష్, రాజేష్, శంకర్ అనే ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యుత్ చోరీపై జరిమానా తిరువొత్తియూరు: తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి అమలు డివిజన్ల పరిధిలోని మేట్టూరు, తిరుప్పూరు, గోపి, పల్లడం, ఈరోడ్, నామక్కల్, మదురై, తంజావూరు, తిరుప్పత్తూరు, కళ్లకురిచ్చి, వేలూరు, విలుప్పురం, తిరువణ్ణామలై విద్యుత్ పంపిణీ సర్కిళ్ల పరిధిలో గత నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విద్యుత్ చోరీపై తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో 78 విద్యుత్ చోరీలు, 30 నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్టు కనుగొన్నారు. దీనికి నష్ట పరిహార రుసుముగా రూ.96,70 ,254 విద్యుత్ వినియోగదారులకు విధించబడింది. సంబంధిత విద్యుత్ వినియోగదారులు నేరాన్ని అంగీకరించి, క్రిమినల్ చర్యలను నివారించడానికి ముందుకు వచ్చి, దానికి సంబంధించిన సయోధ్య మొత్తంగా రూ.5 లక్షల వెయ్యి చెల్లించినందున, వారిపై పోలీస్స్టేషన్లో ఎటువంటి క్రిమినల్ ఫిర్యాదు నమోదు చేయబడలేదని విద్యుత్ బోర్డు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. -
ప్రభుత్వమే సోలార్ కంచె వేయాలి
వేలూరు: అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు ప్రభుత్వమే సోలార్ విద్యుత్ కంచె ఏర్పాటు చేయాలని రైతు నాయకులు కోరారు. వేలూరు కలెక్టరేట్లో డీఆర్ఓ అధ్యక్షతన జిల్లాలోని రైతు నాయకులతో సమావేశం జరిగింది. రైతులు మాట్లాడుతూ ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన కుప్పం నుంచి చైన్నె వరకు పాలారు ఉందని భారీ వర్షం వస్తే ఇందులో నీరు ప్రవహించి కుంటలు, చెరువులకు నీరు చేరుతుందన్నారు. అయితే వానియంబాడి నుంచి కాంచీపురం మీదుగా తిరువళ్లూరు వరకు వెళ్లే పాలారులో వివిధ పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత నీటితో పాలారు కలుషితమవుతోందన్నారు. దీంతో సాగు చేయకపోవడంతో పాటు తాగునీరు కూడా కలుషితమై రోగాల బారిన పడుతున్నామన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటలను అడవి పందులు ధ్వసం చేస్తుండడంతో రైతులు వ్యవసాయం చేయడమే మానే స్తున్నారన్నారు. పంటలను కాపాడుకునేందుకు విద్యుత్ కంచెలు వేస్తే పోలీసు కేసులు నమోదు చేస్తున్నారన్నారని, ప్రభుత్వమే సోలార్ విద్యుత్ కంచె ఏర్పాటు చేయాలని కోరారు. అటవీ ప్రాంతాల్లో పండించే పంటలను అడవి ఏనుగులు, పందులు నాశనం చేస్తున్నాయని వీటికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. స్పందించిన జిల్లా రెవెన్యూ అధికారి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. రైతులు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఆవులకు మైక్రోచిప్లు తప్పనిసరి
– పార్కులు, వీధుల పేర్లపై కీలక తీర్మానాలు సాక్షి, చైన్నె: చైన్నెలో రోడ్లపై తిరిగే ఆవులకు మైక్రో చిప్లను తప్పనిసరి చేశారు. పశువులు, ఎద్దులను రోడ్లపై నియంత్రించేందుకు విస్తృత చర్యలు చేపట్టారు. అలాగే, చైన్నెలో పార్కుల నిర్వహణ, వీధుల పేర్ల మార్పులు, బస్స్టేషన్ నిర్మాణం వంటి అంశాలపై పాలక మండలి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. శుక్రవారం రిప్పన్ బిల్డింగ్లో మేయర్ ప్రియ అధ్యక్షతన కార్పొరేషన్ పాలక మండలి సమావేశం జరిగింది. ఆవుల మైక్రోచిప్ విధానం చైన్నెలో పెంచే ప్రతి పశువులకు మైక్రోచిప్ తప్పనిసరి చేస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ఇందుకుగాను రుసుం రూ.100గా నిర్ణయిస్తూ, మార్చి 18లోపు ఆవుల యజమానులు తమ వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే, రోడ్లపై అనుమతి లేకుండా ఆవులు తిరిగిన పక్షంలో రూ.10 వేలు జరిమానా విధించేందుకు తీర్మానించారు. ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు తవ్వే కాంట్రాక్టర్లకు లేదా ప్రైవేట్ వ్యక్తులకు రూ.లక్ష జరిమానావిధించేందుకు చర్యలు తీసుకున్నారు. జోన్లకు పార్కుల నిర్వహణ జోనల్ కమిటీ చైర్మన్ వి.వి. రాజన్ తన ప్రసంగంలో కార్పొరేషన్ పార్కుల నిర్వహణ బాధ్యత జోన్లకు అప్పగించాలని కోరారు. ఇందుకు మేయర్ ప్రియ సమాధానం ఇస్తూ, కొన్ని పార్కులు కార్పొరేషన్, మరికొన్ని ప్రైవేట్ నిర్వహణకు చర్యలు చేపట్టామన్నారు. నిబంధనలు పాటించకపోతే అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించారు. వీధుల పేర్ల మార్పు విషయంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మనాలిజోన్ లోని చెరువును పడవ సవారి కేంద్రంగా తీర్చిద్దేందుకు చర్యలు తీసుకున్నారు. బ్రాడ్వే బస్స్టేషన్ పనుల నేపథ్యంలో ప్లాట్ఫామ్ దుకాణాల తొలగించే దిశగా నిర్ణయాలతోపాటు సమావేశంలో 117 అంశాలకు సంబంధించి తీర్మానాలు చేసి ఆమోదించారు. -
క్లుప్తంగా
హస్తకళా నైపుణ్యంతో దస్తకారి క్రాఫ్ట్ బజార్ సాక్షి, చైన్నె: చైన్నెలో భారతదేశపు సంప్రదాయ చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలను చాటే ప్రదర్శనగా దస్తకారి హాత్ క్రాఫ్ట్ బజార్ శుక్రవారం కొలువు దీరింది. భారతదేశం నలుమూలల నుండి కళాకారులను ఒకచోట చేర్చి, వివిధ సాంప్రదాయ కళలు, వస్త్రాలు, చేతి ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. చైన్నె రాజీవ్ గాంధీ మార్గంలోని ఎన్ఐఎఫ్టీ క్యాంపస్లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 11.30 నుండి రాత్రి 7. 30 వరకు ఈ ప్రదర్శనను ఉచితంగానే తిలకించవచ్చునని దస్తకారి హాత్ సమితి వ్యవస్థాపకురాలు జయ జైట్లీ ప్రకటించారు. ఈ ప్రదర్శనలో పట్టచిత్ర, కలంకారి, గోండ్ పెయింటింగ్స్, అజ్రాఖ్ బ్లాక్ ప్రింట్స్, ఇకట్, చందేరి నేత, ధోక్రా మెటల్ క్రాఫ్ట్, చెన్నపట్న బొమ్మలు వంటి సంప్రదాయ కళలు, వస్త్రాలు కొలువు దీర్చామన్నారు. ప్రత్యేక ఆకర్షణగా పశ్చిమ బెంగాల్ కళా నైపుణ్యాలు, రాజస్థానీ వంటకాల రుచిని అందిస్తున్నామన్నారు. రేపటి నుంచి తైపూసం ఉత్సవం తిరువొత్తియూర్: తైపూసం సందర్భంగా కోయంబేడు కాళియమ్మన్ కోవిల్ వీధిలోని పనై మరత్తు శ్రీ మునీశ్వరర్ ఆలయంలో తైపూస ఉత్సవం పిభ్రవరి 1వ తేదీ నుంచి 3 రోజులపాటు జరగనుంది. ఉత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 7 గంటలకు ద్రౌపది అమ్మన్ ఆలయం నుంచి మహిళలు, ప్రజలు పాల బిందెలతో తీసుకొని ఊరేగింపుగా వస్తారు. ఊరేగింపు అనంతరం మునీశ్వరర్కు పాలాభిషేకం జరగనుంది. అలాగే మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం 6 గంటలకు పంబై ఉడుకై ్కతో పతివిళక్కు పూజ(జ్యోతి పూజ), రాత్రి 8 గంటలకు అన్నదానం, 2వ తేదీ ఉదయం 9 గంటలకు మేకను బలిచ్చి అన్నదానం, 3వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడయాత్తి ఉత్సవం మాంసాహార అన్నదానం జరగనుంది. ఈ ఉత్సవ ఏర్పాట్లను పనై మరత్తు శ్రీమునీశ్వరర్ భక్తుల బృందం, పూజారి ఎస్.వి.కుమార్ చేస్తున్నారు. తైపూసం ప్రత్యేక రైళ్లు కొరుక్కుపేట: కడలూరు జిల్లా వడలూరులో జరగనున్న తైపూసం ఉత్సవంలో(ఆదివారం) వేలాది మంది భక్తులు పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ పండుగ సందర్భంగా విల్లుపురం, విరుదాచలం నుంచి వడలూరుకు ప్రత్యేక రైళ్లు నడపబడతాయని, 3 రోజులపాటు పలు రైళ్లు నడపబడతాయిని ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో విల్లుపురం రైల్వే స్టేషన్ నుంచి రైళ్లు నడుస్తాయని తిరుచ్చి డివిజన్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది. విద్యుత్ శాఖ అధికారులు అరెస్ట్ అన్నానగర్: విద్యుత్ బోర్డుకు సంబంధించిన నగదును కాజేసిన ఇద్దరు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్టగిరి జిల్లా పర్కూర్ తాలూకాలోని జగదేవిలో విద్యుత్ బోర్డు కార్యాలయం ఉంది. ఏప్రిల్, 12, 2013 నుంచి జూన్ 19, 2017 నుంచి ఇద్దరు అధికారులు వసూలు చేసిన రూ.3కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.1.70కోట్లు చెల్లించకుండా మోసం చేశారు. ఫిర్యాదు మేరకు జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గణేష్, సెల్వం అనే ఇద్దరు విద్యుత్ అధికారులను శుక్రవారం అరెస్టు చేశారు. రేబిస్ వ్యాధితో రైతు మృతి తిరువొత్తియూరు: కృష్టగిరి సమీపంలో పెంపుడు కుక్క కరవడంతో గాయపడిన రైతు, సకాలంలో చికిత్స అందక మృతి చెందిన సంఘటన విషాదాన్ని కలిగించింది. కృష్టగిరి సమీపంలోని తవలం గ్రామానికి చెందిన ఏకాంబరం(45) రైతు. ఆయన తన ఇంట్లో నాటు కుక్కను పెంచుకుంటున్నారు. గత 3 నెలల క్రితం ఆ కుక్క ఏకాంబరం ఎడమ కాలును కరిచింది. దీంతో బెల్లారంపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేవలం ఒకే ఒక్క ఇంజక్షన్ వేయించుకున్న ఏకాంబరం, ఆ తర్వాత వైద్యులు సూచించిన మేరకు సక్రమంగా చికిత్స తీసుకోలేదు. ఈ క్రమంలో గత 15 రోజులుగా ఆయనకు ఒంట్లో పలు రకాల ఇబ్బందులు వచ్చాయి. ఆయన ఒక పక్క చేయి ఎక్కువగా నొప్పి పెట్టినా, దానికీ సక్రమంగా చికిత్స తీసుకోలేదు. ఈ నేపథ్యంలో గత 27వ తేదీన తీవ్రమైన జ్వరం వచ్చి వాంతులు చేసుకున్నారు. దీంతో ఆయన్ని వెంటనే బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆయన్ని పరీక్షించిన వైద్యులు ఆయనకు రేబిస్ లక్షణాలు ఉన్నాయని చెప్పి వెనక్కి పంపేశారు. దీంతో ఆయన్ని వెంటనే కృష్టగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఏకాంబరం మృతి చెందారు. బైక్ దొంగ అరెస్ట్ తిరువొత్తియూరు: చైన్నె కే.కే.నగర్ శివలింగపురం ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి ఇంటి ముందు నిలిపి వుంచిన మోటార్ సైకిల్ చోరీకి గురైంది. ఫిర్యాదు మేరకు పోలీసుల దర్యాప్తులో ఓ వ్యక్తి డూప్లికేట్ తాళంతో బైక్ను తీసుకెళ్తున్నట్లు రికార్డయింది. విచారణలో మోటార్ సైకిల్ చోరీ చేసింది ఎంజీఆర్ నగర్, ప్రాంతానికి చెందిన సతీష్(34) అని తెలిసింది. అతడిని ప్రత్యేక బృందం పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
కమలంలో ప్రచార సారథులు
వానతీ శ్రీనివాసన్ మురుగన్ తమిళిసై సౌందరరాజన్ అన్నామలై సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసే స్థానాలు వెలుగులోకి వచ్చినట్లైంది. ఇందుకుకారణం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ ప్రచార సారథులను బీజేపీ అధిష్టానం రంగంలోకి దించడమే. ఇందులో బీజేపీ ప్రచార ప్రయాణం ఇన్న్ చార్జ్లుగా మాజీ అధ్యక్షుడు అన్నామలై, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్, ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ నియమితులయ్యారు. అన్నాడీఎంకే కూటమితో కలసి ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమైన విషయం తెలిసిందే. బీజేపీ ఈ సారి 50పైగా స్థానాలలో పోటీ చేయవచ్చు అనే సంకేతాలు వెలువడుతూ వచ్చాయి. ఇందుకు బలాన్ని చేకూర్చే దిశగా శుక్రవారం పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ పర్యవేక్షణలో ప్రచార పర్యటన ఇన్చార్జ్లు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో ప్రచార పర్యటనలు ఈ ఇన్చార్జ్ల పర్యవేక్షణలో జరగనుంది. అలాగే, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మ్యానిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన కసరత్తులు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు అన్నామలైకు సింగనల్లూరు, విరుగంబాక్కం, కారైకుడి, శ్రీవైకుంఠం, పద్మనాభపురం బాధ్యతలను, తమిళిసై సౌందరరాజన్కు గుమ్మిడిపూండి, మైలాపూర్, నాంగునేరి, పొల్లాచ్చి, కిల్లియూరు బాధ్యతలను, కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్కు తిరుపరంకుండ్రం, రాధాపురం, వాల్పరై, తిరుప్పూర్ నార్త్, ఊటీ నియోజకవర్గాల బాధ్యతలను, వానతి శ్రీనివాసన్కు తిరుప్పూర్ సౌత్, కూనూర్, కోయంబత్తూర్ సౌత్లను అప్పగించారు. వీపీ దురైస్వామికి ఎగ్మూర్, రాశిపురం నియోజకవర్గాలు, సీనియర్ నేత హెచ్ రాజాకు, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్కు తెన్కాశి, పరమకుడి, మేట్టు పాళయం నియోజకవర్గాలను అప్పగించడం గమనార్హం. మిగిలిన నియోజకవర్గాలకు స్థానికంగా ఉన్న నేతలకు బాధ్యతలు అప్పగించారు. కీలక నియోజకవర్గాలను బీజేపీ గురిపెట్టి, ప్రచార సారథులను రంగంలోకి దించడం గమనార్హం. అలాగే, ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పనకు తమిళిసై సౌందరరాజన్ నేతృత్వంలో కమిటీని నియమించారు. -
ఆలయ నిర్మాణానికి అనుమతివ్వండి
తిరువళ్లూరు: అమ్మవారి ఆలయ నిర్మాణానికి తరచూ అడ్డుచెబుతూ బెదిరింపులకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద అరుంబాక్కం గ్రామానికి చెందిన ప్రజలు ఆందోళన నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా మన్నవేడు సమీపంలోని అరుంబాక్కం గ్రామంలో 60 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఉంది. ఆలయంలో స్థానికులు ఆషాడం, తైమాస ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి స్థానికులే కాకుండా పొరుగు గ్రామాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్న క్రమంలో, పాత ఆలయాన్ని కూల్చి, కొత్త ఆలయాన్ని నిర్మించాలని స్థానికులు నిర్ణయించారు. అయితే కొత్త ఆలయం నిర్మాణం చేయాలనుకుంటున్న స్థలం తమదేనని అదే గ్రామానికి చెందిన మూడు కుటుంబాలు అడ్డుతగులుతూ అక్కడే అన్యమత ఆలయ నిర్మాణానికి యత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో గ్రామస్తులు విలేజ్ రికార్డును పరిశీలించగా, సంబంధిత స్థలం అమ్మవారి ఆలయానికి చెందినదిగా నిర్ధారించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామంలో ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతోపాటు అడ్డుతలుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ ప్రతాప్కు వినతి పత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో హిందు మున్ననీ జిల్లా అధ్యక్షుడు వినోద్కన్నాతో పాటు పలువురు పాల్గొన్నారు. -
తిరుత్తణి ఆలయ హుండీ లెక్కింపు
తిరుత్తణి: తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తులు కానుకల రూపంలో రూ.1.25 కోట్లు చెల్లించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు స్వామి దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించే విధంగా హుండీల్లో నగలు, నగదు కానుకగా చెల్లించడం పరిపాటి. ఆ ప్రకారం చివరి 24 రోజుల్లో భక్తులు హుండీల్లో చెల్లించిన కానుకలను గురువారం ఉదయం కొండ ఆలయంలోని వసంత మండపంలో నిర్వహించారు. ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బందితోపాటు తాత్కాలిక సిబ్బంది వంద మందితో కానుకలు లెక్కింపు చేపట్టారు. రాత్రి ఎనిమిది గంటల వరకు నిర్వహించిన కానుకల లెక్కింపులో నగదుగా ఒక కోటి 25 లక్షల 86 వేల 026 రూపాయలు, 351 గ్రాముల బంగారం, 4700 గ్రాముల వెండి భక్తులు కానకగా చెల్లించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సుబ్రహ్మణ్యస్వామి చిద్విలాసం తిరుత్తణి పరిసర ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో సుబ్రహ్మణ్యస్వామి ఏడాదిలో ఒక్కరోజు విహరించి భక్తుల కు కటాక్షించడం పరిపాటి. శనివారం స్వా మి విశేష అలంకరణలో వాహన సేవలో కొలువుదీరి పట్టణ వీధులు ద్వారా ధరణివరాహపురం చేరుకున్నారు. స్వామివారు రాక సందర్భంగా విద్యుద్దీపాలతో స ర్వాంగసుందరంగా అలంకరించారు. సాయంత్రం స్వామికి పూజలు నిర్వహించి రాత్రి స్వామి గ్రామ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు.కానుకలు లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది, ధరణివరాహపురంలో విహరిస్తున్న సుబ్రహ్మణ్యస్వామి -
అత్తిమాంజేరిపేటలో వైద్యశిబిరం
పళ్లిపట్టు: అత్తిమాంజేరిపేటలో గురువారం నిర్వహించిన వైద్య శిబిరంలో వెయ్యికి పైగా ప్రజలు పాల్గొని చికిత్స పొందారు. పళ్లిపట్టు సమీపంలోని అత్తిమాంజేరిపేటలో ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్టాలిన్ వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. మండల వైద్యధికారి డాక్టర్ ధనుంజయన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో మండల వ్యాప్తంగా నుంచి మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు పాల్గొన్నారు. తిరువళ్లూరు, తిరుత్తణి ప్రభుత్వాసుపత్రుల నుంచి వైద్యుల బృందం పాల్గొని, ప్రజలకు చికిత్స చేశారు. శిబిరంలో పళ్లిపట్టు సెంట్రల్ మండల డీఎంకే కార్యదర్శి బీడీ చంద్రన్ పాల్గొని, గర్భిణులకు పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేశారు. -
కాంగ్రెస్ శ్రేణుల ధర్నా
తిరువళ్లూరు: ఉపాధి హామీ పేరును మార్చడంతోపాటు పనులు ఎక్కడ చేయాలో గ్రామసభలో నిర్ణయించే అధికారాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పేరంబాక్కంలో ధర్నా నిర్వహించారు. ధర్నాకు పార్టీ మండల అధ్యక్షుడు సతీష్, డీసీసీ అధ్యక్షుడు శశికుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరును మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సరికాదన్నారు. గతంలో ఉపాధి పనులను ఎక్కడ నిర్వాహించాలనే విషయాన్ని గ్రామసభలో నిర్ణయించి పనులు చేపట్టే వారన్నారు. అయితే ప్రస్తుతం గ్రామసభకు సంబంధం లేకుండా పనుల ఎంపిక విధానానికి శ్రీకారం చుట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దశల వారిగా ఉపాధి పథకాన్ని ఎత్తివేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని ఆయన ఆరోపించారు. నిరుపేదలకు వెన్నుముకగా వున్న ఉపాధి పథకంలో మార్పులు, చేర్పులను సహించబోమన్న ఆయన బీజేపీ వ్యవహరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం చేస్తామన్నారు. ధర్నాలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివాకర్ పాల్గొన్నారు. -
ధనుష్కు జోడీ ఎవరు?
తమిళసినిమా: నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్న ఆయన 55వ చిత్రం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నిజానికి ధనుష్ శ్రేయాస్ సంస్థతో కలసి ధనుష్ తన వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ చిత్ర పూజాకార్యక్రమాలు ఇటీవల ప్రారంభమయ్యాయి. అయితే రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఇందులో ధనుష్తో పాటు మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు సాయిఅభయంకర్ పనిచేస్తున్నారు ఈ విషయాన్ని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఇకపోతే ధనుష్కు జంటగా నటించే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. కాగా క్రేజీ ప్రాజెక్టులో కథానాయకి పాత్ర కోసం పూజజాహెగ్డే, లేదా సాయిపల్లవిని నటింప చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరి సాయిపల్లవి ఇంతకుముందే ధనుష్కు జంటగా మారి–2 చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఆ హిట్ కాంబో రిపీట్ అవుతుందా లేదా పూజాహెగ్డే జత కడతారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ సస్పెన్స్కు త్వరలోనే తెరపడే అవకాశం ఉంది. -
మహాత్ముడికి నివాళి
సాక్షి, చైన్నె: మహాత్మాగాంధీ 79వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఽశుక్రవారం ఆయన చిత్ర పటాలు, విగ్రహాల వద్ద రాజకీయపార్టీల నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు నివాళులర్పించారు. ఎగ్మూర్ మ్యూజియం ఆవరణలోని విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చిత్ర పటానికి సీఎం స్టాలిన్తో పాటు మంత్రులు పుష్పాంజలి ఘటించారు. గాంధీ మండపంలోని విగ్రహానికి గవర్నర్ రవి నివాళుర్పించారు. గాంఽధీజీ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా అధికారిక వేడుకగా ప్రభుత్వ నేతృత్వంలో ఉదయం నిర్వహించారు. వాడవాడల్లోని బాపూజీ విగ్రహాలకు నేతలు, అఽధికారులు, సంఘాల ప్రతినిధులు అంజలి ఘటించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లోనూ గాంధీకి నివాళులర్పించారు. చైన్నె ఎగ్మూర్ మ్యూజియం ఆవరణలోని మహాత్ముడి విగ్రహం, పరిసరాలను సప్త వర్ణ పుష్పాలతో అలకరించారు. ఇక్కడ గాంధీ చిత్ర పటాన్ని ఉంచారు. చిత్ర పటానికి సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రులు ఎం సుబ్రమణియన్, శేఖర్బాబు పుష్పాంజలి ఘటించారు. గవర్నర్ ఆర్ఎన్ రవి గిండిలోని గాంధీ మండపం వద్ద విగ్రహానికి అంజలి ఘటించారు. ఇక్కడి స్మారక ప్రదేశంలో పుష్పాంజలితో నివాళులర్పించారు. అలాగే, కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్తో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు గాంధీ మండపం, ఎగ్మూర్లోని విగ్రహం వద్ద నివాళులర్పించారు. అంటరాని తనం నిర్మూలనకు ప్రతిజ్ఞ సచివాలయంతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సంస్థలు, పోలీసు కమిషనరేట్లు, పోలీస్ స్టేషన్లు ఇతర ప్రాంతాల్లో అంటరానితనం నిర్మూలన, అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ కార్యక్రమాలు జరిగాయి. సచివాలయం ఆవరణలోని ఆర్మీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఐఏఏస్లు, ఉద్యోగులు అందరితో సీఎస్ మురుగానందంతో కలిసి సీఎం స్టాలిన్ ప్రతిజ్ఞ చేయించారు. భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా, రాజకీయ శాసనాలకు కట్టుబడి అంటరానితనాన్ని పునాదులు సహా పెకిలించేందుకు దూసుకెళ్తామని, సమాజంలో వివక్షకు ఆస్కారం లేకుండా పనితీరును కనబరుస్తామని సీఎం స్టాలిన్ పేర్కొనగా, ఆయనతో కలసి ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం, చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. చైన్నెలోని సత్యమూర్తిభవన్లో బాపూజీకి టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై పుష్పాంజలి ఘటించారు. -
ఘనంగా స్నాతకోత్సవం
–గవర్నర్కు టీచర్ పాదాభివందనం సాక్షి, చైన్నె: రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి పాదాలకు కోయంబత్తూరుకు చెందిన ఉపాధ్యాయురాలు శశికళ నమస్కరించి, మీరు ఆదర్శం అని వ్యాఖ్యలు చేశారు. చైన్నె సైదాపేటలోని తమిళనాడు టీచర్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన 12వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఓ సంఘటన చర్చనీయాంశంగా మారింది. కోయంబత్తూరుకు చెందిన ఉపాధ్యాయురాలు శశికళ డిగ్రీ అందుకుంటూ తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు. కార్యక్రమానికి విశ్వవిద్యాలయ చాన్స్లర్ హోదాలో గవర్నర్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా బెంగళూరులోని ఇస్రో స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తువేల్ స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. ఈవేడుకలో 119 మందికి వేదికపైనే పట్టాలు అందజేయగా, 76,903 మందికి పోస్టు ద్వారా డిగ్రీలు పంపించారు. కోయంబత్తూరుకు చెందిన శశికళ మూడు బంగారు పతకాలు సాధించారు. పతకాలు అందుకున్న అనంతరం ఆమె గవర్నర్ పాదాలకు నమస్కరించడంతో ఆడిటోరియంలో కొంతసేపు కలకలం నెలకొంది. గవర్నర్ మాట్లాడుతూ శశికళ తనను ఆదర్శంగా భావిస్తున్నట్లు వేదికపై చెప్పారని వెల్లడించారు. అనంతరం శశికళ మాట్లాడుతూ తమిళనాడు గవర్నర్ను తాను ఆదర్శంగా భావిస్తున్నానని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం గర్వకారణం అని తెలిపారు. అలాగే తనకు గవర్నర్ను కోరాల్సిన ఒక వ్యక్తిగత అభ్యర్థన ఉందని, దానిని వ్యక్తపరచాలనే ఉద్దేశంతోనే వేదికపై మాట్లాడానని శశికళ చెప్పారు. తాను ప్రస్తుతం ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, కోయంబత్తూరు సమీపంలో ఒంటరిగా నివసిస్తున్నట్లు వెల్లడించారు. -
దంత వైద్యశాలలో చోరీ
ఇద్దరి అరెస్ట్ తిరువొత్తియూరు: దంత వైద్యశాలలో రూ.25 వేలు నగదు, వస్తువులను చోరీ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె నోళంబూర్ 22వ వీధికి చెందిన డాక్టర్ భరత్, అదే ప్రాంతంలో దంత వైద్యశాల నడుపుతున్నారు. గత 22వ తేదీ రాత్రి వైద్యశాలకు తాళం వేసి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం పనిమనిషి వైద్యశాలను శుభ్రం చేయడానికి వచ్చినపప్పుడు వైద్యశాల తెరిచి ఉంది. వెంటనే భరత్కు సమాచారం ఇచ్చింది. భరత్ క్లినిక్కి వెళ్లి చూడగా రూ. 25 వేల నగదు, వస్తువులు చోరీకి గురైనట్టు గుర్తించారు. భరత్ నోళంబూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వైద్యశాల సీసీ ఫుటేజీని పరిశీలించగా బైక్పై వచ్చిన ఇద్దరు ఇనుప రాడ్డుతో తాళం పగలగొడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చోరికి పాల్పడిన మధురవాయల్ ఏరిక్కరై ధనలక్ష్మి నగర్, సమీపంలో ఉన్న నెర్కుండ్రం ప్రాంతానికి చెందిన లక్ష్మణన్(22) మేట్టుకుప్పానికి చెందిన అరుణ్కుమార్ (21) లను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ● స్కిల్డ్ సెంటర్ అడయార్లో క్లినిక్ అండ్ స్కిల్డ్ నర్సింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. గెరికేర్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ సెంటర్ను ప్రముఖ రచయిత్రి భారతీ భాస్కర్, పద్మశ్రీ డాక్టర్ వీఎస్ నటరాజన్, న్యూరాలజిస్టు ప్రొఫెసర్ ఏవీ శ్రీనివాసన్, గెరికేర్ ఎండీ డాక్టర్ లక్ష్మీపతి రమేష్ ప్రారంభించారు. ఇక్కడి సేవలను లక్ష్మీపతి రమేష్ వివరించారు. – సాక్షి, చైన్నె -
ఉపాధి పనులకు రూ.700 చెల్లించాలి
తిరువళ్లూరు: ఉపాఽధీ హమీ పథకం కింద పని దినాలను రెండు వందల రోజులకు పెంచడంతో పాటు దినసరి కూలి రూ.700 చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గోపాల్ డిమాండ్ చేశారు. దేశంలోని వేర్వేరు సమస్యలపై అఖిల భారత బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్కు మద్దతు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు విసృతంగా ప్రచారం నిర్వహించి మద్దతు కోరుతున్నారు. ఇందులో భాగంగానే మ్మిడిపూండిలో ఉపాధి కూలీలను కలసిన సీపీఎం నేతలు భారత్ బంద్కు మద్దతు ఇవ్వడంతో పాటు ఆందోళనలో పాల్గొనాలని జిల్లా కార్యదర్శి గోపాల్ మహిళలను కోరారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పన్నీరుకు చోటు లేదు
సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరు సెల్వంను అన్నాడీఎంకేలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి స్పష్టం చేశారు. అన్నాడీఎంకే నుంచి పన్నీరు సెల్వం, టీటీవీ దినకరన్, శశికళను బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాయబారం రూపంలో అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ ఎన్డీఏ కూటమిలోకి మళ్లీ చేరారు. ఆయన రాకను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ఆహ్వానించారు. ఈ ఇద్దరు తాజాగా ఒకే వేదికపైకి వచ్చారు. అయితే, మాజీ సీఎం పన్నీరు సెల్వం రాజకీయ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఆయన వెన్నంటి ఉన్న వాళ్లందరూ బయటకు వెళ్తుండటంతో దాదాపుగా ఒంటరయ్యారని చెప్పవచ్చు. అదే సమయంలో తాను అన్నాడీఎంకేలో మళ్లీ చేరి సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నట్టు పన్నీరు ప్రకటించారు. ఇందుకు సమాధానం ఇచ్చే విధంగా పళణిస్వామి గురువారం స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, పన్నీరుకు చోటు లేదని స్పష్టం చేశారు. -
రూ.1.23 కోట్లతో వీధి దీపాలు
తిరువళ్లూరు: నెమిలిచ్చేరి నుంచి నడుకుత్తగై దాకా రూ.1.23 కోట్లతో విద్యుద్దీపాలు, స్తంభాలు ఏర్పాటు చేసే ప్రక్రియను రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా నెమలిచ్చేరి నుంచి నడుకుత్తగై వరకు వీధి ధీపాలను ఏర్పాటు చేయాలని స్తానికులు కోరుతున్నారు. ఇందులో భాగంగానే నిదులు సేకరించి విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను మంత్రి నాజర్ ప్రారంభించారు. మంత్రి నాజర్ మాట్లాడుతూ 146 విద్యుత్ స్తంభాలు, 296 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. త్వరలోనే పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేస్తే ప్రజల రాకపోకలకు సౌకర్యంగా వుండడంతో పాటు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. కలెక్టర్ ప్రతాప్, పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్ పాల్గొన్నారు. -
రైల్వే భద్రతపై సమీక్ష
సాక్షి, చైన్నె: చైన్నె డివిజన్ను రైల్వే బోర్డు డైరెక్టర్ జనరల్ (భద్రత) శ్రీ హరి శంకర్ వర్మ సందర్శించారు. రైల్వే బోర్డు డైరెక్టర్ జనరల్ (భద్రత) సమీక్ష సమావేశాన్ని చైన్నెలో నిర్వహించారు. దక్షిణ రైల్వేలోని చైన్నె డివిజన్ను సందర్శించారు. ఈ సమావేశంలో దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్.ఎన్. సింగ్, అదనపు జనరల్ మేనేజర్ విపిన్ కుమార్ , ప్రధాన విభాగాధిపతులు పాల్గొన్నారు. నిర్వహణలోని అన్ని స్థాయిలలో భద్రతకు ఇచ్చిన ప్రాముఖ్యత గురించి చర్చించారు. ఈ సమావేశంలో దక్షిణ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లలిత్ కుమార్ మన్సుకాని, చైన్నె డివిజనల్ రైల్వే మేనేజర్ శైలేంద్ర సింగ్ , డివిజనల్ బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు. దక్షిణ రైల్వేలోని ఇతర విభాగాల రైల్వే మేనేజర్లు కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సింగ్ చైన్నె డివిజన్ కార్యాచరణ విశ్వసనీయత , ప్రయాణీకుల భద్రతను బలోపేతం చేయడానికి తీసుకున్న కీలక భద్రతా చర్యలపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. రైల్వే మౌలిక సదుపాయాల నిరంతర పర్యవేక్షణ , మొత్తం భద్రతను మెరుగుపరచడానికి ట్రాక్ నిర్వహణలో అనుసరిస్తున్న క్రమబద్ధమైన విధానాలను ఆయన హైలైట్ చేశారు. రైలు కార్యకలాపాల సామర్థ్యం మరియు విశ్వసనీయతను మెరుగుపరచడానికి , సురక్షితమైన రైలు ప్రయాణాన్ని నిర్ధారించడానికి చేపడుతున్న సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునీకరణను కూడా ఆయన వివరించారు. చైన్నె డివిజన్ అధిక భద్రతా ప్రమాణాలను కొనసాగించడంలో చేస్తున్న నిరంతర , చురుకై న ప్రయత్నాలను ఈ సందర్భంగా హరి శంకర్ వర్మ ప్రశంసించారు. -
గంజాయి విక్రయానికి యత్నం
తిరువళ్లూరు: రైల్వేస్టేషన్కు సమీపంలో గంజాయి విక్రయించడానికి యత్నించిన ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. తిరువళ్లూరు రైల్వేస్టేషన్కు సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులకు రహాస్య సమాచారం అందింది. ఇందులో భాగంగానే పోలీసులు అక్కడ నిఘా వుంచారు. ఈ క్రమంలో రైల్వేస్టేషన్కు సమీపంలో అనుమానస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో పట్టుబడిన రాజస్థాన్కు చెందిన నరేష్కుమార్, ఒడిస్సాకు చెందిన జగద్బద్రాగా గుర్తించారు. ఇద్దరూ ఆంధ్ర, కేరళ తదితర రాష్ట్రాల నుంచి గంజాయిని తీసుకొచ్చి తిరువళ్లూరు రైల్వేస్టేషన్లో యువకులే లక్ష్యంగా విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. అనంతరం ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
క్లుప్తంగా
అన్నామలైయార్ హుండీ ఆదాయం రూ.5.45కోట్లు వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ తెలిపారు. ఆలయంలో ప్రతినెలా పౌర్ణమి అనంతరం హుండీ లెక్కింపు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులోభాగంగా ఆలయంలో తమిళ తైమాస హుండీ లెక్కింపును బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 9 గంటల వరకు స్వామి వారి సన్నధి, అమ్మవారు, వినాయకుడి ఆలయప్రాంతాల్లోని 22 హుండీలను ఆలయ జేసీ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బందితో లెక్కించగా రూ.5.45కోట్లు, 190 గ్రాముల బంగారం, 2,390 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీని భక్తులు కానుకలుగా వేసినట్లు తెలిపారు. నగదును బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఖాతాలోకి జమచేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు దేశాభివృద్ధికి సహకరించాలి వేలూరు: విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్ధికి సహకరించాలని క్రిష్ణగిరి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ అనూరాధ అన్నారు. వేలూరులోని మత్తురంగం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో 54వ స్నాతకోత్సవం ప్రిన్సిపల్ శ్రీధరన్ అధ్యక్షతన గురువారం ఉదయం జరిగింది. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రస్తుతం యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన 902 మంది విద్యార్థులు డిగ్రీలు సాధిస్తున్నారనన్నారు. విద్యార్థులు విద్యను ఇంతటితో ఆపేయకుండా ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు. మీ జీవితంలో సాధించాల్సినవి అనేకం ఉన్నాయని వాటిని దృష్టిలో పెట్టుకుని పరిశోధన విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక లక్ష్యం ఉండాలని ఆ లక్ష్యాన్ని అధిగమించేందుకు పట్టుదలతో ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. అధ్యాపకులు, విద్యార్థులు, తల్లీదండ్రులు పాల్గొన్నారు. లంచం కేసులో వీఏఓ అరెస్ట్ అన్నానగర్: లంచం కేసులో వీఏఓ అరెస్టయ్యారు. నాగై సమీపంలోని సౌత్ పోయిగైనల్లూర్కు చెందిన తంబియప్పన్, ఇతను సౌత్ పోయిగైనల్లూరు గ్రామ పరిపాలనా అధికారి శబరినాథన్ను కలసి భూమి హక్కు బదిలీ వివరాలు అడిగారు. ఆ సమయంలో భూమి హక్కు బదిలీ కోసం శబరినాథన్ రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని తంబియప్పన్ ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని తరువాత, అధికారుల ఆలోచన ప్రకారం తంబియప్పన్ రసాయనం పూసిన నగదును శబరినాథన్కు ఇస్తుండగా అక్కడే ఉన్న ఏసీబీ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు. హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు అన్నానగర్: సెంగోట్టై సమీపంలో వృద్ధురాలిని కొట్టి చంపిన కేసులో ఇద్దరు మహిళలు సహా ఐదుగురికి తెన్కాశీ కోర్టు జీవిత ఖైదు విధించింది. తెన్కాశీ జిల్లాలోని సెంగొట్లై సమీపంలో విశ్వనాథపురానికి చెందిన మహ్మద్ యూసఫ్. ఇతని భార్య ముంతాజ్ (65). ఇతను తన కుమార్తె, మనవడికి తరచూ డబ్బు ఇస్తుంటాడు. దీంతో సెంగోట్టైకి చెందిన బంధువులు అబ్దుల్ సలాం, అబ్దుల్ జాబర్ (52) ఖాదర్ మిర్జా(52) అమీనా (40), ఫాతిమా బీబి (48) ఆగ్రహించి 2020, డిసెంబర్ 10న ఐదుగురు ముంతాజ్ను కుక్కర్తో కొట్టి చంపారు. అల్లుడు అబ్దుల్ ఖాదర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. కేసు తెన్కాసి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో న్యాయమూర్తి రాజవేలు సమక్షంలో విచారణకు వచ్చింది. ఈ కేసులో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఐదుగురు నిందితులు అబ్దుల్ సలాం, అబ్దుల్ జాబర్, ఖాదర్ మిర్జా, అమీనా, ఫాతిమా బీబీలకు జీవిత ఖైదు విధించారు. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తిరువళ్లూరు: పీఎం జన్మన్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతాప్ హెచ్చరించారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి యూనియన్లోని కాట్టుపాక్కం, తిరుమణం, చెమరంబాక్కంతోపాటు వేర్వేరు ప్రాంతాల్లో నిర్మిస్తున్న పక్కాగృహాలను పరిశీలించారు. పనులను నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పారివాక్కంలో రూ.78.20 లక్షలతో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం పూర్తయిన క్రమంలో వాటిని త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. కాట్టుపాక్కంలో రూ.92.99 లక్షలు, చెమరంబాక్కంలో రూ.81.44 లక్షలు, తిరుమణం పంచాయతీలో రూ.కోటి వ్యయంతో నిర్మిస్తున్న పక్కాగృహాలు 60 శాతం పూర్తయ్యాయన్నారు. పనులను నాణ్యతగా చేయాలని, నాణ్యతను తరచూ అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు. -
విద్యా విజన్ లక్ష్యం
సాక్షి, చైన్నె: ఏఎస్వీఏ అడ్వాన్స్డ్ స్కూల్స్ విజన్ అలయన్స్ జాతీయ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. విద్యారంగంలో ఒక కీలక అంశాన్ని సూచించడమే కాకుండా, కొత్త విజన్ లక్ష్యంగా విద్యా సంస్థల భాగస్వామ్యం, సైన్స్, పరిశోధన, పాఠశాల విద్య వంటి అంశాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. కార్యక్రమానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్కుమార్, ఐఐఎస్సీ డీన్ డాక్టర్ ఎస్కే సతీష్, పద్మభూషణ్ బీఎన్ సురేష్, సీ మెట్ డైరెక్టర్ జనరల్ ఆర్ రతీష్, సీఎస్ఐఆర్ డైరెక్టర్ సి. అనంతరామకృష్ణన్, ఎన్సీఈఎస్ఎస్ డైరెక్టర్ ఎన్వీ చలపతిరావు, స్పేస్ ఫిజిక్స్ డైరెక్టర్ తరుణ్కుమార్ హాజరై ఏఎస్వీఏ వెబ్ సైట్ను ఆవిష్కరించడమే కాకుండా, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. -
ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్
బ్రాడ్ వేలో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్, మల్టీ మోడల్ కాంప్లెక్స్గా బ్రాడ్ వే బస్టాండ్ రూపుదిద్దుకోనుంది. రూ. 822.70 కోట్లతో ఉత్తర చైన్నెకు సరికొత్త ఐకాన్గా నిర్మితం కానున్న ఈ పనులకు గురువారం సీఎం ఎంకే స్టాలిన్ శంకుస్థాపన చేశారు. బ్రాడ్వే బస్టాండ్ నమూనాను పరిశీలిస్తున్న సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: రాజధాని నగరం చైన్నెలో తొలి బస్టాండ్గా 1960లో బ్రాడ్వేలో పునాదిపడిన విషయం తెలిసిందే. 1964లో ప్రయాణికుల సేవలోకి బ్రాడ్ వే బస్టాండ్ను తీసుకొచ్చారు. ఇక్కడి నుంచే ఒకప్పుడు రాష్ట్రంలోని పలు జిల్లాలు, నగర కేంద్రాలు, పొరుగు రాష్ట్రాలకు బస్సులు బయలుదేరి వెళ్లేది. కాల క్రమేనా నగరం విస్తరించడం, ట్రాఫిక్ పెరగడం వెరసి కోయంబేడులో బ్రహ్మాండ బస్ టెర్మినల్ రూపుదిద్దుకుంది. 2002 నవంబర్ నుంచి కోయంబేడు బస్టాండ్ ఉపయోగంలోకి వచ్చింది. ఆ తదుపరి బ్రాడ్ వే బస్టాండ్ను ఎంటీసీ బస్సుల సేవలకు పరిమితం చేశారు. ఇక్కడి నుంచి ఎంటీసీ బస్సులు నగరంలో పలు ప్రాంతాల వైపుగా సేవలు అందిస్తూ వచ్చాయి. ఈ పరిస్థితులలో బ్రాడ్ వే బస్టాండ్ స్థానంలో బ్రహ్మాండ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడి ఎంటీసీ బస్టాండ్ను తాత్కాలికంగా ఐల్యాండ్ గ్రౌండ్, రాయపురంకు గత వారం మార్చారు. నాలెడ్జ్ సిటీకి పునాది అనంతరం కలైవానర్ అరంగంలో జరిగిన గ్లోబల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్లో తమిళనాడు నాలెడ్జ్ సిటీకి శంకుస్థాపన చేశారు. ఇండియా గ్లోబల్ ఎడ్యుకేషన్ 2026 ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం స్టాలిన్ సమక్షంలో విజ్ఞానం, ఆవిష్కరణ, నైపుణ్యాల అభివృద్ధిలో ప్రపంచ స్థాయిలో తమిళనాడును కేంద్రంగా బలోపేతం చేయడానికి, వివిధ దేశాలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలతో ప్రభుత్వ ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు శేఖర్బాబు, కోవిచెలియన్, టీఆర్పీ రాజా, ఎంపీ తమిళచ్చి తంగ పాండియన్ తదితరులు హాజరయ్యారు. ముందుగా ఉదయం సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి కోయంబత్తూరులోని కొడిసీయా ఆడిటోరియంలో తమిళనాడు ప్రభుత్వ టెక్స్టైల్ మిల్లు డిపార్ట్మెంట్, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించారు. పారిశ్రామిక సంపద, వినూత్న ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన దక్షిణ భారతదేశంలోని మాంచెస్టర్ అయిన కోయంబత్తూర్ వేదికగా ఈ తొలి సమావేశం జరగడం ఆనందంగా ఉందన్నారు. తమిళనాడులో సామాజిక న్యాయం గురించి ప్రస్తావిస్తూ, అన్ని జిల్లాలకు విస్తృత అభివృద్ధి దిశగా ముందుకెళ్తోన్నామన్నారు. తమిళనాడు ఇంటిగ్రేటెడ్ న్యూ టైకె ్స్టల్ పాలసీ 2025–2026’ను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఇలా ఉండగా యూజీసీ నిబంధనలలో సవరణలు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని సీఎం స్టాలిన్ ఆహ్వానించారు. ఆధునిక హంగులతో.. చైన్నె నగర శివారులలోని సబర్బన్ బస్ టెర్మినల్స్, నగరంలోని ప్రధాన ప్రాంతాలలో ఽఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్స్ పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా బ్రాడ్ వే బస్టాండ్ ఉన్న ప్రదేశంలో మల్టీ మోడల్ ఫెసిలిటీ కాంప్లెక్స్తో పాటూ ఇంటిగ్రేటెడ్ న్యూ బస్ టెర్మినల్ నిర్మాణానికి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం చర్యలు తీసుకుంది. రూ.822.70 కోట్ల అంచనాతో ఇక్కడ నిర్మాణాలు జరగనున్నాయి. చైన్నె కార్పొరేషన్లోని బస్టాండ్లలో బ్రాడ్ వేను మల్టీ–మోడల్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ బస్ స్టేషన్, మల్టీ మోడల్ ఫెసిలిటీ కాంప్లెక్స్ (ఎంఎంఎఫ్సీ)గా తీర్చిదిద్దబోతున్నారు. ఈ పరిసరాలలోని ఎంటీసీ, ఈఎంయూ, ఎంఆర్టీఎస్, మెట్రో సేవలను ఒకే వేదిక మీదకు తెచ్చే దిశగా నిర్మాణాలు జరగబోతున్నాయి. ఈ పనులకు గురువారం సీఎం స్టాలిన్ శంఖు స్థాపన చేశారు. ఇక్కడ జరగనున్న నిర్మాణాలకు సంబంధించిన నమూనాను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్లో 2 అంతస్తుల్లో బేస్మెంట్, 2 అంతస్థుల బస్ స్టాప్, 6 అంతస్థులలో కమర్షియల్ కాంప్లెక్స్గా పది అంతస్తులతో రూపుదిద్దుకోనున్నది. 433 నాలుగు చక్రాల పార్కింగ్ స్థలాలు, 1,174 ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలాలు వంటి సౌకర్యాలతో అన్ని రకాల ఆధునిక హంగులతో నిర్మాణాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కె ఎన్. నెహ్రూ, ఆర్.ఎస్. రాజకన్నప్పన్, పి.కె. శేఖర్ బాబు, మేయర్ ఆర్. ప్రియ, తదితరులు పాల్గొన్నారు. రూ.21.50 కోట్లతో వివాహ వేదిక ఉత్తర చైన్నె అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా తిరువికా నగర్ నియోజకవర్గం పరిధిలోని పెరంబూరులో చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ సంస్థ నేతృత్వంలో రూ. 21. 50 కోట్లతో నికర్మించిన అంబేడ్కర్ వివాహ వేదికను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. 10 జంటలకు ఈసందర్భంగా సామూహిక వివాహాలు జరిగాయి. కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, తమిళనాడు రాజధాని నగరం చైన్నెలో బ్రహ్మాండగా అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు. ఇందులో ఉత్తర చైన్నె అభివృద్ధి ప్రాజెక్టు కీలకంగా మారి ఉందన్నారు. రూ. 516 కోట్లతో 19 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. రోడ్లు, వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఇక్కడున్న కొత్త జంటలకు తాను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని, పుట్టబోయే పిల్లలకు దయ చేసి అందమైన తమిళ పేర్లు పెట్టాలని కోరారు. -
రంగంలోకి వేణుగోపాల్
సాక్షి, చైన్నె: డీఎంకే కూటమిలోని టీఎన్సీసీ నేతలు తలా ఓ దారిలో చేస్తున్న మాటలను గాడిలో పెట్టేందుకు ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ సన్నద్ధమయ్యారు. ఆయన్ను ఏఐసీసీ రంగంలోకి దించడంతో సీఎం స్టాలిన్తో భేటీకి కసరత్తు చేపట్టారు. వివరాలు.. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్లోని కొందరు ఏఐసీసీ నేతలు, టీఎన్సీసీకి చెందిన మరికొందరు నేతలు చేస్తూ వస్తున్న వ్యాఖ్యలు కూటమిలో కొత్త చిక్కులు బయలు దేరినట్లయ్యింది. టీవీకే అధినేత విజయ్కు అనుకూలంగా ఈ వ్యాఖ్యలు ఉండటాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణించింది. దీంతో పార్టీ పార్లమెంటరీ నేత, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కనిమొళిని రంగంలోకి దించారు. ఆమె బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ నేత రాహుల్ గాంఽధితో గంటన్నర పాటుగా సమావేశమయ్యారు. ఈ భేటీ తదుపరి డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగుతున్న సమాచారం వెలువడింది. అదే సమయంలో అధికారంలో వాటా ఇచ్చే ప్రసక్తే లేదని డీఎంకే తేల్చి చెప్పడంతో పాటుగా 30 లోపు సీట్లను , ఒక రాజ్య సభ సీటును ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఇక్కడ వ్యతిరేక గళం వినిపిస్తున్న టీఎన్సీసీ నేతలు అయితే, మళ్లీ విజయ్తో పయనం అంటూ స్వరాన్ని పెంచడం చర్చకు దారి తీసింది. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కాంగ్రెస్కు ఆహ్వానం పలుకుతూ చేసిన వ్యాఖ్యలను తిరుచ్చి వేలుస్వామి వంటి నేతలు సమర్థించడం, డీఎంకే సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలంటూ హల్ చల్ చేస్తూ పోస్టర్లు తెర మీదకు రావడం డీఎంకేలో మరింత ఆగ్రహాన్ని రేపినట్టైంది. దీంతో కాంగ్రెస్ నేతలను గాడిలో పెట్టడమే కాకుండా, సీఎం స్టాలిన్తో చర్చించి సీట్ల పందేరాన్ని కొలిక్కి తెచ్చేందుకు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ను ఏఐసీసీ పెద్దలు గురువారం రంగంలోకి దించారు. ఆయన శుక్రవారం చైన్నెకు చేరుకుని , ఇక్కడి నేతలతో సమావేశం కానున్నారు. ఆ తదుపరి డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్తో సమావేశానికి కసరత్తులలో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ పెట్టెలు!
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పార్టీ తరపున మ్యానిఫెస్టో రూపకల్పనలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి సన్నద్ధ్దమయ్యారు. ఇందుకోసం అభిప్రాయల పెట్టెను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వివరాలు.. తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీవీకే అధినేత విజయ్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రయాణంలో ఆయనకు ఎదురు అవుతున్న ఒడి దొడుగులు మరీ ఎక్కువే.. మీట్ ది పీపుల్ అంటూ ప్రజలలోకి వెళ్తున్న సమయంలో కరూర్ విషాద ఘటన ఆయనకు బ్రేక్ వేసింది. ఆ తదుపరి ఈ ప్రయణం అన్నది ముందుకు సాగడం లేదు. అదే సమయంలో తన చివరి చిత్రంగా పేర్కొంటున్న జననాయకన్ విడుదల వివాదంలో మునిగింది. ఈ పరిస్థితులో ఎన్నికల ప్రచార వ్యవహారాలన్ని పర్యవేక్షించేందుకు ముందు జాగ్రత్తగా కమిటీని రంగంలోకి దించారు. పార్టీప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, డిప్యూటీ ప్రచార కార్యదర్శి ఆదవ్ అర్జునన్, వర్కింగ్ కమిటీ కన్వీనర్ సెంగొట్టయ్యన్తో పాటుగా పార్తీబన్, రాజ్కుమార్, విజయ్ దాము, ఎస్పీ సెల్వం, కె పిచాయ్ రత్నం, తదితరులతో 10 మందిని నియమించారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాలకు సంబంధించిన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు వంటి అన్ని వ్యవహారాలను ఈ కమిటీ పర్యవేక్షణలో జరిపే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే పార్టీ ఎన్నికల మ్యానిపెస్టో రూపకల్పనకు మరో కమిటీని నియమించారు. తుది కసరత్తు కోసం.. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ నేతృత్వంలోని ఈ కమిటీలో అరుణ్ రాజ్, జేసీటీ ప్రభాకర్, ఎన్. ఆనంద్, రాజ్ మోహన్, తదితరులు ఉన్నారు. ఈ కమిటీ అన్ని రకాల పరిశీలనలు, సమగ్ర అధ్యయనం ముందుకెళ్తోంది. కొన్ని కీలక అంశాలతో నివేదికను సిద్ధం చేసింది. దీనిపై తుది కసరత్తు మొదలెట్టారు. అదే సమయంలో ప్రజలను సైతం భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా అభిప్రాయల పెట్టేను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. విజయ్ ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాలలో ప్రజల సమస్యలు, విజ్ఞప్తులను, సూచనలు, సలహాలను స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రజలు ఈ అభిప్రాయల పెట్టెలో తమ సమస్యలు, ప్రాంత సమస్యలను విన్నవించి లిఖిత పూర్వంగా దాఖలు చేయవచ్చు అన్న సూచనను ఇవ్వడానికి విజయ్ పార్టీ వర్గాలు సిద్ధమయ్యాయి. ఒకటి రెండు రోజులలోఈ అభిప్రాయాల పెట్టేను అన్ని చోట్ల ఏర్పాటు చేయనున్నారు. ఇక గురువారం ఈ విషయంగా జరిగిన సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ నేతలకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం గమనార్హం. అలాగే,కష్టపడి పనిచేసే వారికి సీట్లు, పదవులు గ్యారంటీ అని భరోసా ఇచ్చారు. కాగా మీట్ దీ పీపుల్ప్రచారానికి బ్రేక్ పడిన దృష్ట్యా, ఫిబ్రవరిలోవిజయ్ నేతృత్వంలో నాలుగు చోట్ల బహిరంగ సభల నిర్వహనకు టీవీకే వర్గాలు సన్నద్ధమయ్యాయి. -
రూ. 9.25 కోట్ల విలువైన బంగారు కడ్డీలు స్వాధీనం
అన్నానగర్: కేరళలోని పాలక్కాడ్ నుండి బస్సు కోయంబత్తూరు జిల్లా పోలీసు పరిధిలోని వాలైయారు చెక్ పోస్ట్ మీదుగా బుధవారం కోయంబత్తూరు వైపు వస్తోంది. ఆ బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ ప్రయాణికుడి దగ్గర 6 కిలోల 140 గ్రాముల బంగారు కడ్డీలను గుర్తించారు. కేరళ నుంచి కోయంబత్తూరుకు అక్రమంగా తరిలిస్తున్నట్లు వెల్లడైంది. అయితే సరైన పత్రాలు లేకపోవడంతో రూ. 9.25 కోట్ల విలువైన బంగారు కడ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పట్టుబడిన యువకుడు నిఫిన్(29) అని తేలింది. అతడు పనిచేసే బట్టల దుకాణం వ్యాపారి రెహమాన్ వీటిని పంపించినట్లు తేలడంతో ఆ దిశగా విచారణ చేస్తున్నారు. డీఏసీ అంబాసిడర్గా ఏఆర్ రెహమాన్ సాక్షి, చైన్నె: డీఏసీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్గా సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ నియమించచారు. గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్ సమక్షంలో చైన్నెలోని ఐదు ప్రదేశాలలో సుమారు 1000 గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. డీఏసీ డెవలపర్స్ నేతృత్వంలో చైన్నె – బెంగళూరు జాతీయ రహదారిలోని సుంకువారి చత్రం ,పోరూర్లోని కాట్టుపాక్కం, కుమరన్ చావడి, షోళింగనల్లూరు, ఓఎంఆర్ సిరిచ్చేరిలలో నిర్మించనున్న గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానికంగా జరిగింది. ఇందులో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈసందర్భంగా ఆయన్ను తమ బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్టు డీఏసీ డెవలపర్స్ ఎండీ ఎస్ సతీష్కుమార్ ప్రకటించారు. డీఏసీ కుటుంబంలో ఏఆర్ రెహమాన్ ఓ భాగం అయ్యారని, ఇది తమనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏఆర్ రెహమాన్మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు ఓ కల అని పేర్కొంటూ, దక్షిణ భారత దేశంలో అత్యంత నాణ్యత, ఆశాజనకమైన సంస్థగా ఉన్న డీఏసీతో కొత్త పయనం మొదలైందన్నారు. కళాశాల క్యాంటీన్లో కీచకపర్వం సాక్షి, చైన్నె: కళాశాలలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన సన్నిహితులతో కలిసి క్యాంటిన్లో పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నందనం ఆర్ట్స్ కళాశాలలో కలకలం రేపింది. చైన్నె నందనం ఆర్ట్స్ కళాశాలలో పుదుకోట్టైకు చెందిన గుణశేఖరన్ ఓ విభాగంలో పనిచేస్తున్నాడు. ఇతడి సన్నిహితుడైన ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి ఇదే కళాశాల ఆవరణలో క్యాంటీన్ నడుపుతున్నాడు. ఇక్కడ అరియలూరుకు చెందిన 22 ఏళ్ల ఓ యువతి గత కొన్ని నెలలుగా పనిచేస్తూ వస్తున్నారు. ఈమెతో గత కొద్దిరోజులుగా గుణ శేఖరన్ అసభ్యకరంగా ప్రవరిస్తూ వచ్చినట్టు సమాచారం.ఈ పరిస్థితులలో గురువారం ఉదయం ఆ యువతి తీవ్ర మనో వేదనతో కన్నీటి పర్యంతంతో కళాశాల క్యాంటీన్ నుంచి బయటకు వెళ్లడాన్ని విద్యార్థులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఆయువతిపై గుణశేఖరన్తో పాటూ ఆ క్యాంటీన్ నిర్వహిస్తున్న ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు, మరో ముగ్గురు లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా వేధించినట్టు తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. కాగా ఈ ఘటనపై అక్కడి విద్యార్ధి సంఘాలు కన్నెర్ర చేశాయి. విద్యార్ధినులకు ఇక్కడ భద్రత లేదంటూ ఆందోలనకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. గుణ శేఖరన్తోపాటూ మిగిలిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా గత ఏడాది అన్నా వర్సిటీ లో ఓ విద్యార్ధినిపై క్యాంటీన్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన పెను కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈఘటన మరువక ముందే తాజా అన్నావర్సిటీకి కూత వేటు దూరంలో ఉన్న నందనం కళాశాలలో కీచక పర్వం వెలుగు చూడటం కలకలం రేపింది. -
చేనేత రంగంలోకి రూ. 912 కోట్లు
సాక్షి, చైన్నె: చేనేత, వస్త్ర పరిశ్రమలోకి పెట్టుబడులు పెట్టేందుకు 55 సంస్థలు ముందుకు వచ్చాయి. 13,080 మందికి ఉపాధి కల్పిస్తూ రూ. 912. 97 కోట్లతో పెట్టుబడుల దిశగా టెక్స్టైల్స్ శాఖతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. కోయంబత్తూరులోని కోడిసియాలో ప్రపథమంగా జరిగిన అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమ సమావేశం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. తమిళ్ నాడు న్యూ ఇంటిగ్రేటెడ్ టైకె ్స్టల్స్ విధానం మేరకు వస్త్ర పరిశ్రమలో నిమగ్నమైన కంపెనీలు పెట్టుబడి సబ్సిడీ, వడ్డీ సబ్సిడీ, సాంకేతిక వస్త్ర పార్క్లలో ఈ పెట్టుబడులు పెట్టేందుకు ముందుక వచ్చాయి. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్ గాంధీ, ఎమ్మెల్యే వి సెంథిల్ బాలాజీ, కోయంబత్తూరు కార్పొరేషన్ మేయర్ కె. రంగనాయకీరామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
చలన చిత్ర అవార్డుల ప్రకటన
సాక్షి,చైన్నె: తమిళనాడు ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు, బుల్లి తెర అవార్డులను తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అవార్డులను గురవారం రాత్రి సీఎం స్టాలిన్ ప్రకటించారు. 2016 నుంచి 2022 సంవత్సరాలకు తమిళనాడు ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు, 2014 నుంచి 2022 సంవత్సరాలకు స్మాల్ స్క్రీన్ అవార్డులు, 2015 – 2016 నుంచి 2021 – 2022 విద్యా సంవత్సరాలకు తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అవార్డులు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13వ తేదీన చైన్నెలోని కలైవానర్ అరంగం వేదికగా అందజేయనున్నారు. విజేతల వివరాలు ఇలా.. 2016 నుంచి 2022 వరకు ఆయా సంవత్సరాల వారీగా విడుదల చేసిన జాబితాలో వరుసగా ఉత్తమ నటులుగా విజయ్ సేతుపతి, కార్తీ, ధనుష్, ఆర్.పార్తిబన్, సూర్య, ఆర్య, విక్రమ్ ప్రభు, ఉత్తమ నటీమణులుగా కీర్తి సురేష్, నయనతార, జ్యోతిక, మంజు వారియర్, అపర్ణబాల మురళి, లిజో మోల్జోస్, సాయి పల్లవి ఉన్నారు. ఉత్తమ దర్శకులుగా లోకేష్ కనకరాజ్, పుష్కర్ గాయత్రి, మారిసెల్వరాజ్, ఆర్.పార్తీబన్, సుధా కొంగర, జ్ఞానవేల్, గౌతమ్ రామచంద్రన్ ఎంపికయ్యారు. ఉతమ చిత్రాలుగా నగరం, ఛారిటీ, పరియేరుమ్ పెరుమాళ్, రాక్షసన్, జై భీమ్, కార్గీ తదితర సినిమాలు జాబితాలో ఉన్నాయి. ఇక బుల్లితెరలో ఉత్తమ నటులుగా ఎం.రాజ్కుమార్, ఆర్.పాండియరాజన్, కౌశిక్, కృష్ణ , తలైవాసల్ విజయ్, వి.సంజీవ్, జయకాష్, కార్తీక్రాజ్, సంజీవ్, ఉత్తమ నటీమణులుగా ఆర్.రాధికా శరత్కుమార్, వాణీభోజన్, నీలిమరాణి, సంఘ వి, రేవతి, రేష్మ, షబానాషా జహాన్ కేబరాల్లయిత్రా జహాన్ ఉన్నారు. బహుమతులు ఇలా.. తమిళనాడు ప్రభుత్వం ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలకు మొదటి బహుమతి రూ. 2 లక్షలు, రెండవ బహుమతి రూ. లక్ష, మూడవ బహుమతి రూ. 75 వేలు అందజేయనున్నారు. ప్రత్యేక బహుమతి రూ. 75 వేలు, మహిళలను సానుకూల దృక్పథంలో చిత్రీకరించిన చిత్రానికి రూ. 1.25 లక్షల ప్రత్యేక బహుమతిని అందించనున్నారు. ఉత్తమ నటుడు,నటి , ఉత్తమ సాంకేతిక కళాకారులకు వరుసగా పది గ్రాముల బంగారు పతకం, జ్ఞాపిక, సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఎంపిక చేసిన ఉత్తమ బుల్లి తెర సీరియల్స్కు మొదటి బహుమతి రూ. 2 లక్షలు, రెండవ బహుమతి రూ. లక్ష ఉత్తమ హీరో, హీరోయిన్, ఉత్తమ సాంకేతిక కళాకారుడికి వరుసగా రూ. లక్ష, సంవత్సరపు ఉత్తమ సాధకుడికి రూ. లక్ష, జీవితకాల సాధకుడిగా రూ. లక్ష నగదు, బంగారు పతకం, జ్ఞాపిక, సర్టిఫికెట్ అందజేయనున్నారు. తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ శిక్షణ సంస్థ విద్యార్థి అవార్డుకు ఎంపికై న విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.25 వేల నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేయనున్నారు. -
‘జస్టిస్ స్వామినాథన్’ అంశంలో మీ స్పందనేంటి?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మదురైలోని థిరుప్పారాన్కుండ్రం కొండపై కార్తీకదీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్పై మతపర ఆరోపణలు చేసిన నిరసనకారులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ విషయంలో మీ స్పందన తెలపాలని డీఎంకే సర్కార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది.తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆ రాష్ట్ర డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్, తదితరులకూ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ పీబీ వరాలేల ధర్మాసనం నోటీసులు జారీచేసింది. ఈ కేసులో పురోగతిపై నివేదిక ఇవ్వాలని డీఎంకే ప్రభుత్వాన్ని కోరింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి రెండో తేదీకి వాయిదావేసింది. డీఎంకే మిత్రపక్షాలు, కార్యకర్తలు, లాయర్లు మద్రాస్ హైకోర్టు చెన్నై, మదురై ప్రాంగణాల్లో జడ్జికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉల్లంఘనలకు పాల్పడ్డారని న్యాయవాది జీఎస్ మణి ఈ పిటిషన్ వేశారు. -
ఎన్నికలకు సిద్ధం కావాలి
–జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పిలుపు తిరువళ్లూరు: అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో బూత్ కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే అజెండాగా పనిచేయాలని కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు శశికుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరువళ్లూరు నార్త్ జిల్లా కాంగ్రెస్ నిర్వాహకుల ప్రత్యేక సమావేశం వెంగత్తూరులో జిల్లా అధ్యక్షుడు శశికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ఓబీసీ వర్కింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేషన్, పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏకాటూరు ఆనందన్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివాకర్ పాల్గొన్నారు. శశికుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరును మార్చడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానున్న క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు నిత్యం ప్రజల్లో వుండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగిన వారిని గుర్తించి మళ్లీ క్రియాశీలకంగా పనిచేయించడంతో పాటు పార్టీలో వున్న చిన్నపాటి సమస్యలను పరిష్కరించుకుని సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఖలీల్రెహ్మాన్ పాల్గొన్నారు. -
ఘనంగా నాగేశ్వరస్వామి ఆలయ కుంభాభిషేకం
పళ్లిపట్టు: పెద్ద నాగపూండిలో పురాతన నాగవళ్లి సమేత నాగేశ్వరస్వామి ఆలయ మహాకుంభాభిషేకం బుధవారం వేలాది మంది భక్తజనం నడుమ కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం శివ నామస్మరణతో మార్మోగింది. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి అనుబంధంగా ఉండే ఆర్కేపేట సమీపంలోని పెద్దనాగపూండిలో పురాతన నాగవళ్లి సమేత నాగేశ్వరస్వామి ఆలయ కుంభాభిషేకం ఏర్పాట్లను ఆక్స్పోర్డు విద్యాసంస్థల అధినేత ఎస్ఎన్విఎల్. నరసింహరాజ్ అలియాస్ రమేష్రాజు చేపట్టారు. ఆలయంలో జీర్ణోద్ధరణ పనులు చేపట్టి విమాన గోపురం, రాజగోపురం సహా సన్నదులు, ధ్వజస్తంభం, రంగులుతో అలంకరించారు. జీర్ణోద్ధరణ పనులు పూర్తి కావడంతో ఆదివారం నుంచి బుధవారం వరకు 3 రోజుల పాటూ మహాకుంభాభిషేకం వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంతో పాటూ పరిసర ప్రాంతాలు రంగుల విద్యుదీపలంకరణ చేపట్టి పుష్పాలతో కనువిందు చేశారు. ఆలయ ప్రాంగణంలో యాగశాలలు ఏర్పాటు చేసి శివాచార్యుల బృందం హోమపూజలు చేపట్టారు. ఇందులో కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వములు, రత్నగిరి బాల మురుగన్ స్వాములు పాల్గొన్నారు. బుధవారం ఉదయం మహాకుంభాభిషేకం సందర్భంగా షోళింగర్, తిరుత్తణి, పళ్లిపట్టు పరిసర ప్రాంతాలతో పాటు ఆంధ్రలోని చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేడుకల్లో టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి, షోళింగర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ రవి, సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖులకు ఆలయ ఉభయదారులు నరసింహరాజ్ అలియాస్ రమేష్రాజు ఘనంగా సత్కరించారు. తిరుత్తణి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ శ్రీదరన్, జాయింట్ కమిషనర్ రమణి, ట్రస్టీలు సురేష్బాబు, ఉషారవి, మోహనన్, నాగన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
రౌడీ అండ్ కో చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల
తమిళసినిమా: వైవిధ్యభరిత కథా చిత్రాలను నిర్మిస్తూ సక్సెస్ఫుల్ చిత్రాల సంస్థగా పేరు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ ఫ్యాషన్ స్టూడియోస్. ఈ సంస్థ అధినేత సుదన్ సందరం తాజాగా నిర్మిస్తున్న చిత్రం రౌడీ అండ్ కో. నటుడు సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ఇందులో నటి రాశీఖన్నా నాయకిగా నటిస్తున్నారు. నటుడు యోగిబాబు, రెడిన్ కింగ్స్లీ, సునీల్ రెడ్డి,ప్రాంక్స్టర్ రాహుల్,వెట్టి మణి, చార్లస్ వినోద్,తనీఒరువన్ చిత్ర విలన్ వంశీ క్రిష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు కప్పల్ అనే సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన కార్తీక్ జీ.క్రిష్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. సరికొత్త ప్రయోగాత్మక కథాంశంతో వినోదాత్మక కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోందని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా చిత్ర టైటిల్తో కూడిన వీడియోను విడుదల చేశారు. ఇందులో నిజ రౌడీలతో నటుడు సిద్ధార్ధ్, యోగిబాబు చేతిలో కత్తులు పట్టుకుని నిలబడ్డ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇది చిత్రంపై మంచి అంచనాలను పెంచుతుందనే అభిప్రాయాన్ని యూనిట్ సభ్యుల వ్యక్తం చేస్తున్నారు. రౌడీ అండ్ కో చిత్రం అన్ని వర్గాల వారిని అలరించే మంచి ఎంటర్టైనర్ గా ఉంటుందని ఫ్యాషన్ స్టూడియోష్ సంస్థ అదినేతన సుదన్ సుందరం పేర్కొన్నారు. రేవా సంగీతాన్ని ,అరవింద్ సింగ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. -
ఎళ్లవేళలా కార్మికులకు డీఎంకే మద్దతు
వేలూరు: డీఎంకే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశుధ్య కార్మికులకు ఎల్లవేళలా మద్దతుగా ఉంటుందని పారిశుధ్య కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ తిప్పంబట్టి ఆరుస్వామి అన్నారు. వేలూరులోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో పారిశుధ్య కార్మికుల సంక్షేమ బోర్డు, వేలూరు కార్పొరేషన్ సంయుక్తంగా కార్మికులకు సంక్షేమ పథకాలు పంపిణీ కార్యక్రమం కమిషనర్ లక్ష్మణన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ మాట్లాడుతూ తన తాత చెప్పులు కుట్టే వృత్తి చేసేవారని తన తండ్రి పంచాయతీలో తలారిగా పని చేశారని తనకు సీఎం స్టాలిన్ సంక్షేమ బోర్డు చైర్మన్గా నియమించారన్నారు. పారిశుధ్యం చేయడమనేది పని కాదని అది ఒక సేవగా భావించాలన్నారు. కార్మికులు వారి చేతులకు మురికి పూసుకొని అన్ని ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారన్నారు. పారిశుధ్య కార్మికులకు ఉదయం టిఫన్ పథకాన్ని డీఎంకే ప్రభుత్వంలో తీసుకొస్తే వాటిని గత పది సంవత్సరాలుగా నిలిపి వేశారన్నారు. సంవత్సరానికి రూ. 20 కోట్లు పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం కేటాయిస్తున్నారని ఇప్పటి వరకు రూ. 65 కోట్లు సంక్షేమ బోర్డు కోసం కేటాయించారన్నారు. పారిశుధ్య కార్మికులు తప్పకుండా చేతికి గ్లౌజులు, సంక్షేమ పరికరాలు ఉపయోగించి చెత్తను సేకరించాలన్నారు. అనంతరం వివిధ సంక్షేమ పథకాలను అందజేశారు. కార్యక్రమంలో మేయర్ సుజాత, తాట్కో ప్రాజెక్టు మేనేజర్ రేఖ, కార్పొరేషన్ డివిజన్ చైర్మన్ యూసఫ్ఖాన్, తాశీల్దార్ వడివేలు, పారిశుద్య కార్మికులు పాల్గొన్నారు. -
6న వైద్యులు విధుల బహిష్కరణ
తిరువళ్లూరు: ప్రభుత్వ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వ వైద్యుల సంఘఽం ఆధ్వర్యంలో దశల వారిగా ఆందోళనకు పిలుపు నిచ్చింది. తిరువళ్లూరు జిల్లా మెడికల్ కళాశాల ఆవరణలో ప్రభుత్వ డాక్టర్ సంఘం సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ప్రభుశంకర్, కార్యదర్శి నందకుమార్, జిల్లా కోశాధికారి రత్నవేల్కుమరన్ హాజరయ్యారు. డాక్టర్ ప్రభుశఽంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని దీర్ఘీకాలంగా ఆందోళనలు చేస్తున్నా ఫలితం లేదన్నారు. ప్రభుత్వ వైద్యులకు ప్రతి 5, 10, 15 సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్ ఇవ్వాలని, పెండింగ్లో వున్న వీఆర్ఎస్ వినతులను వెంటనే ఆమోదించాలని, గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే డాక్టర్లకు ప్రతి నెలా రూ.3వేలు అలవెన్స్లను ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరిష్కరించకుంటే ఫిబ్రవరి 2న జిల్లా వైద్య కేంద్రంలో ధర్నా, ఆరున ఓపీ బహిష్కరణ చేసి ఆందోళన చేస్తామన్నారు. అప్పటికీ స్పందించకుంటే ఆందోళన ఉధతం చేస్తామని హెచ్చరించారు. -
ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేయాలి
వేలూరు: జైలులోని ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకు జైలర్లు కృషి చేయాలని జైళ్లశాఖ డైరెక్టర్ ప్రదీప్ అన్నారు. వేలూరు సెంట్రల్ జైలు సమీపంలోని ఆఫ్కా శిక్షణ కేంద్రంలో తమిళనాడు, కేరళ, నాగలాండ్ రాష్ట్రాలకు చెందిన జైలు అధికారులకు జైలులో ఖైదీల పట్ల నడుచుకోవాల్సిన పద్ధతి, పరిపాలన విధానం తదితర వాటిపై శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జైలు అనేది క్షణికావేశంతో చేసే తప్పులకు సంబంధించిన స్థలం కాదని, ఖైదీల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే స్థలంగా ఉండాలన్నారు. మత్తుకు బానిసైన ఖైదీలు జైలులోను వాటిని ఉపయోగించేందుకు అవసర మైన అన్ని ప్రయత్నాలు చేస్తుంటారని, వీటికి జైలు సిబ్బంది సాయంగా ఉండరాదన్నారు. జైలు ఖైదీలకు జైలులో కనీస వసతులు ఏర్పాటు చేయాలని చట్టాలు చెబుతాయని, అయితే వారికి కొన్ని నిబంధనలున్నాయన్నారు. తమిళనాడులోని జైలు ఖైదీలచే పెట్రోల్ బంకులు, కాయకూరల మార్కెట్ను విక్రయించడం అభినందనీయమన్నారు. వీటి ద్వారా ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకు సులభతరంగా ఉంటుందన్నారు. ఖైదీలచే ఇటువంటి వ్యాపార దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా బయట విడుదలైన అనంతరం వారు నేరాలకు పాల్పడకుండా ఇటువంటి పనులు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజన్, బ్యూలా తదతరులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
అన్నానగర్: చైన్నెలో బాలుడు ఉరి వేసుకొని ఆత్మహత్మ హత్యకు పాల్పడ్డాడు. చైన్నెలోని ఐనావరంలోని పనంతోప్పు కాలనీకి చెందిన వెంకటరమణ, ప్రార్థన దంపతులు. వెంకటరమణ రైల్వేలో పనిచేస్తున్నారు. వీరిద్దరు పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. వీరి కుమారుడు రమణ (17) తల్లితో నివసిస్తున్నాడు. ఈ స్థితిలో, ప్రార్థన బుధవారం ఉదయం ఎప్పటిలాగే నిద్రపోతున్న కుమారుడిని నిద్రలేపడానికి బెడ్ రూమ్ తలుపు తట్టింది. ఎంత తట్టినా తలుపు తీయకపోవడంతో దిగ్భ్రాంతి చెందిన ప్రార్థన ఇరుగు పొరుగు సాయంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించింది. సమాచారం అందుకున్న ఓట్టేరి పోలీ సులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.బాలుడి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. సాక్షి, చైన్నె: నవజాత శిశు మరణాలను తగ్గించడంతో పాటూ చిన్నారులకు మెరుగైన ఆధునిక వైద్యం అందించేలా రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె క్యాపిటల్ ముందుకు వచ్చింది. రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె క్యాపిటల్ గ్లోబల్ గ్రాంట్ క్రింద రూ.45 లక్షల విలువైన బెడ్సైడ్ అల్ట్రాసౌండ్ అండ్ హై–ఫ్లో నాసల్ కాన్యులా (హెచ్ఎఫ్ఎన్సీ) యూనిట్ను విరాళం శ్రీ రామచంద్ర హాస్పిటల్లోని పీడియాట్రిక్ ఐసీయూకు అందించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో రోటరీ ఫౌండేషన్, చైర్మన్ ట్రస్టీ హోల్గర్ నాక్, ఆర్సీసీసీ అధ్యక్షుడు అపూర్వ మోడీ, జిల్లా గవర్నర్ డి.దేవేంద్రన్ బెడ్సైడ్ అల్ట్రాసౌండ్, హై–ఫ్లో నాసల్ కాన్యులా (హెచ్ఎఫ్ఎన్సీ) యూనిట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆ క్లబ్కు చెందిన శ్రీరామ్ దువ్వూరి, నీలకంఠన్ , భరత్ పాండ్య, రాజ్ కుమార్ నారంగ్, కిషోర్ రెడ్డి, బాబీ వరీందర్ సింగ్, ప్రశాంత్ గిరీష్ , ఆన్ రోష్ని మోడీ పాల్గొన్నారు. వేలూరు: బస్సులో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడికి దేహశుద్ధి చేశారు. వేలూరు జిల్లా కాట్పాడి నుంచి కేవీ కుప్పంమీదుగా గుడియాత్తంకు ప్రభుత్వ బస్సు మంగళవారం సాయంత్రం బయలుదేరింది. బస్సులో ఓ యువతి ప్రయాణం చేస్తోంది. కేవీకుప్పం గ్రామం వద్ద వెళుతుండగా కళాశాలకు చెందిన విద్యార్థిని పక్కన యువకుడు పక్కన కూర్చున్నాడు. బస్సు బయలు దేరిన వెంటనే ఆ విద్యార్థినిపై యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో యువతి కేకలు వేయడంతో సహచర ప్రయాణికులు యువకుడికి దేహశుద్ధి చేసి గుడియాత్తం పోలీసులకు అప్పగించారు. వీటిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయనని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా విచారణ చేస్తున్నారు. సాక్షి, చైన్నె: రక్త పరీక్షలు చేయకుండానే మధుమేహాన్ని గుర్తించే కొత్త సాంకేతికతను పరిశోధకులు అభివృద్ధి చేశారు. కంటి వెనుక భాగంలోని రెటీనా ఫొటో ఆధారంగా, కృత్రిమ మేధస్సు(ఏఐ)సాయంతో మధుమేహాన్ని గుర్తించే విధానాన్ని మద్రాసు డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్, మంగళూరులోని యెనెపోయా వర్సిటీ, అమెరికాలోని ఎమోరీ వర్సిటీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ పరిశోధన అధ్యయనం ఈనెల 23వ తేదిన డయాబెటిస్ టెక్నాలజీ జర్నల్లో ప్రచురించబడిందని పరిశోధనలో పాల్గొన్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌజన్య కౌప్ వివరించారు. మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్లో మెడికల్ రెటీనా ఓక్యులర్ రీసెర్చ్ హెడ్ అయిన సీనియర్ డాక్టర్ ఆర్. రాజలక్ష్మి పాటుగా పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ అనంత్, డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ ఛైర్మన్ డాక్టర్ వి. మోహన్ వివరిస్తూ , దేశంలో 100 మిలియన్లకు పైగా డయాబెటిస్ రోగులు ఉన్నారని పేర్కొన్నారు. సాధారణ రెటీనా ఫొటోలతో కూడిన ఏఐ సాధనాలను ఉపయోగించడం వల్ల డయాబెటిస్ను ముందస్తుగా నిర్ధారించడంలో సహాయ పడేందుకు వీలుందన్నారు. ఈ పరిశోధన ఫలితాలను మరింతగా ధ్రువీకరించాల్సి ఉందన్నారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బియ్యం మిల్లు, వరి నిల్వ సౌకర్యంతో కూడిన కేంద్రాన్ని ఈరోడ్ పెరుంతురైలో చైన్నె రైస్ ఇండస్ట్రీ ఇండియా నెలకొల్పింది. చైనా, స్విట్జర్లాండ్ సాంకేతికతతో ఇక్కడ అన్ని ప్రక్రియలు ఆటో మేటెడ్గా సాగే విధంగా సౌకర్యం కల్పించారు. దీనిని చైన్నె రైస్ ఇండస్ట్రీ చైర్మన్ ఎంఎస్ తమిళ్ సెల్వన్, కేఆర్బీఎల్ చైర్మన్ అనిల్కుమార్, స్విట్జర్లాండ్కు చెందిన మేరీ ఓల్వాల్, చైనాకు చెందిన జార్జ్, కంపెనీ ఎండీ రాజ్కుమార్, ఉపాధ్యక్షుడు పురుష్తోమన్ ఈ మిల్లును బుధవారం ప్రారంభించారు. –సాక్షి, చైన్నె -
నాణ్యమైన విద్య అందించాలి
కొరుక్కుపేట: నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేయాలని శ్రీ కనకదుర్గ తెలుగు (ఎస్కేడీటీ)పాఠశాలల అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ మేరకు చైన్నె విల్లివాక్కం లోని శ్రీ కనక దుర్గ ప్రాథమిక పాఠశాల 2026– 27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి డాక్టర్ సీఎంకే రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని 2026– 27 విద్యా సంవత్సరానికి గాను రూపొందించిన అడ్మిషన్ల బ్రోచర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా తెలుగు విద్యార్థుల కోసం ఈ పాఠశాల ఎక్కువగా కృషిచేస్తుందని వారి విద్యాభివద్ధికి దోహద పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ రేణుక, కరస్పాండెంట్ డాక్టర్ నాగభూషణం పాల్గొన్నారు. వ్యాన్ నుంచి పడి బాలిక దుర్మరణం అన్నానగర్: స్కూల్ వ్యాన్ నుంచి పడి ఓ బాలిక దుర్మరణం పాలైంది. సేలం జిల్లాలోని తారమంగళం సమీపంలోని పప్పంపాడు గ్రామానికి చెందిన కుమార్ (38), భార్య అరుణ. వీరికి ఇద్దరు కుమార్తెలు హన్సిక (4), యాషిక (2). హన్సిక ఎల్కేజీ చదువుతోంది. బుధవారం అరుణ హన్సికను స్కూల్ వ్యాన్న్లో తీసుకెళ్తుండగా. చిన్నారి యాషిక స్కూల్ వ్యాన్ నుంచి అకస్మాతుగా కిందకు పడింది. వ్యాన్ వెనుక చక్రం యాషిక పైకి దూసుకెళ్లడంతో బాలిక మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొరుక్కుపేట: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని దక్షిణాసియాకు చెందిన ర్యుక్యు కోబుడో అండ్ షోరిర్యు కరాటే స్టైల్ చీఫ్ , టెక్నికల్ డైరెక్టర్ రెన్షి డాక్టర్ కోబుడో ఏఎస్.కృష్ణమూర్తి అన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల 27వ వార్షిక క్రీడా దినోత్సవాన్ని బుధవారం జరుపుకున్నారు. కార్యక్రమానికి రెన్షి డాక్టర్ కొబుడో, ఎ.ఎస్.కృష్ణమూర్తి హాజరై జ్యోతి వెలిగించి క్రీడా దినోత్సవాన్ని ఆరంభించారు. కళాశాల విద్యార్థులు వివిధ విభాగాల్లో ప్రతిభను ప్రదర్శించారు. ఇంటర్–కాలేజియేట్, ఇంటర్–జోన్, జిల్లా, రాష్ట్ర , జాతీయ స్థాయిలలో ప్రశంసలు అందుకున్న వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా క్రీడా విద్యార్థులు ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కరస్పాండెంట్ చిన్ని బాలాజీ, ప్రిన్సిపల్ ఇన్చార్జ్ డాక్టర్ పి. బి. వనిత, వైస్ ప్రిన్సిపల్ పాల్గొన్నారు. -
కొనసాగుతున్న రగడ
తమిళసినిమా: జననాయకన్ చిత్రం ఇప్పుడు మరింత వివాదాంఽశంగా మారుతోంది. నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జన నాయకన్. హెచ్.వినోద్ దర్శకత్వలో కేవీఎన్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని నెల 9వ తేధీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే సెన్సార్ సమస్యలు తలెత్తడంతో సెన్సార్బోర్డు, కోర్టుల్లో ఈ చిత్రం నానుతోంది. చిత్రంలో పలు వివాదాస్పద సన్నివేశాలు చోటు చేసుకోవడంతో చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపినట్లు సెన్సార్బోర్డు అఽధికారులు పేర్కొన్నారు. దీంతో చిత్ర నిర్మాత మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఆషా జననాయకన్ చిత్రానికి వెంటనే సర్టిఫికేట్ అందించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఉత్తర్వులను వ్యతికేకిస్తూ సెన్సార్బోర్డు అధికారులు మద్రాసు హైకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే చిత్ర నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా ఈ కేసును విచారించడంలో తమకు ఆసక్తిలేదని, మద్రాసు హైకోర్టులోనే తేల్చుకోవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇలాంటి పరిస్థితులో మద్రాసు హైకోర్టు మంగళవారం జననాయకన్ చిత్ర వ్యవహారంలో ఆసక్తికరమైన ఆదేశాలను జారీ చేసింది. జననాయకన్ చిత్రంలో మత విభేదాలకు ఆస్కారం కలిగించే సన్నివేశాలు చోటు చేసుకున్నాయని, కొన్ని విదేశీ శక్తులు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేసినట్లు చిత్రీకరించిన సన్నివేశాలను అంగీకరించబోమని, అదేవిధంగా సెన్సార్ బోర్డు అధికారులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉండగానే చిత్ర నిర్మాతలు ఎలాంటి వివరణ ఇవ్వకుండా సెన్సార్ సర్టిఫికెట్ను కోరడం సముచితం కాదని, సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి పంపగా ఆ కమిటీ విచారణ చేసేందుకు గడువు ఇవ్వకుండా సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఆదేశించడాని రద్దు చేస్తున్నట్లు మద్రాసు హెకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేశారు. సెన్సార్ బోర్డే అవసరం లేదు నటుడు మన్సూర్ అలీఖాన్ సెన్సార్ బోర్డుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈయన మంగళవారం చైన్నెలో జరిగిన ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ నటించిన జననాయకన్ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. సెన్సార్ బోర్డు వివక్షత ధోరణికి పాల్పడుతోందని విమర్శించారు. కాశ్మీర్ ఫైల్స్, కేరళా స్టోరీ వంటి వివాదాస్పద చిత్రాలకు సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్బోర్డు జననాయకన్ చిత్రానికి ఇవ్వడానికి ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నంచారు. సెన్సార్ బోర్డే అవసరం లేదని అన్నారు. సెన్సార్ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఆదీనంలో కాకుండా,సినిమాకు చెందిన మధ్యవర్తులతో కూడిన కమిటీగా ఉండాలన్నారు. -
వైభవం.. ద్రౌపది ఆలయ కుంభాభిషేకం
తిరువళ్లూరు: ఎల్లాపురంలో ద్రౌపది అమ్మవారి ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేసిన గ్రామస్తులు బుధవారం ఘనంగా కుంభిబిషేకం నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్ 82–పనపాక్కంలో ద్రౌపది అమ్మ వారి ఆలయం వుంది. ఆలయం శిథిలావస్థకు చేరడంతో జీర్ణోద్ధరణ చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. అనంతరం నిధులు వసూలు చేసి గత ఏడాది ఆలయ జీర్ణోద్ధరణ పనులను చేశారు. పనులు పూర్తయిన క్రమంలో బుధవారం ఉదయం కలశపూజ, హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం పది గంటలకు కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయ గోపురంపై వున్న కలశాలపై పుణ్యజలాలు వదిలి కుంభాబిషేకం నిర్వహించారు. ఉత్సవాల్లో గుమ్మిడిపూండి ఎమ్మెల్యే టీజే గోవిందరాజన్, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.శేఖర్, ఎల్లాపురం యూనియన్ జె.మూర్తి, వివిధ పార్టీ ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలో ఊరేగించారు. తిరువళ్లూరు: పుల్లరంబాక్కంలోని వళ్లీ దేవసేన సమేత కుమారస్వామి ఆలయంలో పాలాభిషేకం బుధవారం ఘనంగా నిర్వహించారు. పుల్లరంబాక్కంలోని కుమారస్వామి ఆలయంలో ప్రతిఏటా తైపూసం ఉత్సవాలకు ముందు పాలాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం రెండు వందల మంది మహిళలు పాలబిందెలతో ఊరేగింపుగా వెళ్లి స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు అందజేశారు. ఫిబ్రవరి 1న వార్షిక, తైపూసం ఉత్సవాలు నిర్వహించనున్నారు. -
శ్రమకోర్చి చేసిన చిత్రం కరుప్పు పల్సర్
తమిళసినిమా: సినిమా అనేది చాలా మంది కల. మంచి చిత్రాలు చేయాలని, ప్రేక్షకులను అలరించాలి అని ఈ రంగంలో పోరాడుతున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. అలా తన సినిమా కలను నెరవేర్చుకోవడానికి పోరాడిన ఒక యువకుడు చేసిన తొలి ప్రయత్రం కరుప్పు పల్సర్.ఈ దర్శక నిర్మాత మురళి క్రిష్.ఎస్.యశో ఎంటర్టైన్మెంట్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కరుప్పు పల్సర్. ఈయన దర్శకుడు ఎం.రాజేష్ శిష్యుడన్నది గమనార్హం. ఈయన వద్ద ఒరు కల్ ఒరు కన్నాడి,బాస్ ఎన్గిర భాస్కరన్, శివ మరసుల శక్తి వంటి పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారట. కాగా కరుప్పు పల్సర్ చిత్రం ద్వారా దర్శకుడిగా అవతారమెత్త్ని ఆయన తాను ఈ చిత్రాన్ని తన గురువు ఎం.రాజేష్ భాణిలోనే జనరంజకంగా తెరకెక్కించినట్లు మురుళి క్రిష్ పేర్కొన్నారు. ఈ చిత్ర కథను తన గురువు రాజేష్కు చెప్పగా చాలా బాగుందని ప్రశంసించారన్నారు. కాగా ఇందులో నటుడు గెత్తు దినేశ్ ద్విపాత్రాభినయం చేయగా, నటి రేష్మా,మదుమిక కథానాయికలుగా నటించారు. మన్సూర్ అలీఖాన్, శరవణ సుబ్బయ్య, కలైయరసన్ కన్నుసామి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.ఇది నగర వాతావరణం, పెల్లెటూరి నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రం అని దర్శకుడు చెప్పారు. చిత్రంలో పల్సన్ బైక్, జల్లికట్టు కాళీలు ముఖ్య పాత్రలు పోషించడం విశేషం. సంగీతం, పాటలను ఇన్బ అందించగా,భాస్కర్ ఆరుముగం ఛాయాగ్రహణం అందించారు. చిత్రాన్ని నిర్మించడానికి చాలా శ్రమ పడినట్లు దర్శకు నిర్మాత మురళి క్రిష్.ఎస్ పేర్కొన్నారు. అయితే నటుడు గెత్తు దినేష్ ఈ చిత్రం కోసం ఎంతగానో సహకిరించారని, అదే విధంగా నటుడు మన్సూర్ అలీఖాన్ తదితర నటీనటులు, సాంకేతిక వర్గం ప్రోత్సాహంతో కరుప్పు సల్సర్ చిత్రాన్ని జనరంజకంగా తెరకెక్కించినట్లు ఆయన చెప్పారు. ఈ చిత్రం ఈ నెల 30న తెరపైకి రానుంది. కొందరు డబ్బు కోసమే అలా..! రష్మిక మందన్న -
ఘనంగా బీవర్ రత్న అవార్డుల ప్రదానం
సాక్షి, చైన్నె: బీవర్ అసోసియేషన్ ట్రస్ట్ నేతృత్వంలో బీవర్ రత్న అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. చేట్ పట్లోని లేడీ ఆండాల్ కాన్సర్ట్ హాల్ వేదికగా బీవర్ అసోసియేషన్ ట్రస్ట్ నేతృత్వంలో సామాజిక సంక్షేమ ప్రయోజనాల దృష్ట్యా, మెడికల్ రిలీఫ్ ఫండ్ ను ప్రకటించారు. ట్రస్ట్ వ్యవస్థాపకఅ ధ్యక్షుడు భన్వర్లాల్ గోతి శతాబ్ది ఉత్సవాలనుప్రారంభిస్తూ, చైన్నె నుంచి చెంగల్పటుట వరకు నివసించే పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్య అవసరాలు, సత్వర చర్యల కోసం ఈఫండ్ను ప్రకటించారు. అలాగే ట్రస్ట్ విద్యార్థులకు ఏటా రూ. 25 లక్షలకు పైగా స్కాలర్ షిప్లను మంజూరే చేయడానికి నిర్ణయించారు. ఉత్తమ సేవలను అందించిన వారికి బీవర్ రత్న అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ మెడికల్ విభాగం చైర్మన్ అజయ్ నహర్, అధ్యక్షుడు అజిత్ గోతి, ట్రస్ట్ కార్యదర్శి రాజేష్ బోహ్రా, ఉపాధ్యక్షుడు ప్రకాష్, కోశాధికారి అనిల్, జైపూర్నుంచి వచ్చిన ప్రతినిధులు శంకుతల గోల్చా, రాజ్కుమార్ కొఠారి, సీఆర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. -
చైన్నె విమానాశ్రయంలో అగ్నిప్రమాదం
అన్నానగర్: చైన్నె మీనంబాక్కం విమానాశ్రయంలో జరిగిన అగ్నిప్రమాదం భయాందోళనలకు గురిచేసింది. పొగ కారణంగా ఇద్దరు ఉద్యోగులు స్పృహ కోల్పోయారు. వివరాలు.. చైన్నె మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2 నిష్క్రమణ ప్రాంతం ప్రవేశ ద్వారం వద్ద విమానయాన సంస్థల కార్యాలయాలద్దున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అక్కడ పనిచేస్తున్న సింగపూర్ ఎయిర్లైన్న్స్ కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అంతర్జాతీయ నిష్క్రమణ టెర్మినల్ మొత్తాన్ని దట్టమైన పొగ కప్పేసింది. ఫలితంగా చైన్నె విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విమానాశ్రయంలో పొగలో చిక్కుకున్న ప్రయాణికులను, విమానాశ్రయ సిబ్బందిని అత్యవసరంగా టెర్మినల్ నుండి తరలించారు. వెంటనే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాన్ని అత్యవసరంగా పిలిపించి, అత్యవసర అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. దీని తరువాత, చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్, కొలంబో, ఢాకాతో సహా 8 విమానాలలో ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ల జారీ తాత్కాలికంగా నిలిపివేశారు. చైన్నె విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది వెంటనే 3 వాహనాల్లో వచ్చి దాదాపు గంటసేపు పోరాడి మంటలను ఆర్పి, పొగను తొలగించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.దాదాపు గంట తర్వాత, ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లు జారీ చేయబడి, విమాన సేవలు తిరిగి ప్రారంభించబడ్డాయి. సింగపూర్ ఎయిర్ లైనన్స్ కార్యాలయంలో మంటలు చెలరేగి వివిధ ఫైళ్లు, పత్రాలు దగ్ధమయ్యాయి. పొగ పీల్చడం వల్ల స్పృహ కోల్పోయిన ఇద్దరు ఉద్యోగులకు ప్రథమ చికిత్స అందించినట్లు తెలుస్తోంది. చైన్నె విమానాశ్రయంలో అగ్నిప్రమాదం విద్యుత్ లోపం వల్ల జరిగిందా లేదా మరేదైనా కారణమా అనే దాని పై విమానాశ్రయ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
4 వేల ఆలయాల్లో కుంభాభిషేకాలు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 4 వేల ఆలయాలకు కుంభాభిషేకాలు పూర్తి చేశారు. ఇక బుధవారం రోజున పలు ఆలయాలలో కుంభాభిషేక వేడుకలు కనుల పండువగా జరిగాయి. అలాగే తైపూసం తొలి ముహూర్తం కావడంతో రాష్ట్రంలోని ఆలయాలలో కొత్త జంటలకు వివాహాలు జోరుగా జరిగాయి. వివరాలు.. తమిళ్ కడవుల్ మురుగన్కు ప్రసిద్ధి చెందిన ఆరుప్పడై వీడులుగా పిలవబడే ఆలయాలు రాష్ట్రంలోనే ఉన్నవిషయం తెలిసిందే. తమిళనాడులో తైమాసం మొదలైతే చాలు ఈ ఆలయాలలో తై పూసం ఉత్సవాలు మిన్నంటాయి. ఈ మాసంలో తొలి ముహూర్తం రోజు బుధవారం వేళ వచ్చింది. దీంతో వేకువ జాము నుంచి మురుగన్ ఆలయాలు భక్తులతో కిట కిటలాడాయి. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని ప్రసిద్ధి చెందిన సెంథిల్ అండవర్ ఆలయం భక్తులతో నిండింది. కొత్త జంటలతో ఆలయం కళకళ లాడింది. ఆలయ ఆవరణలో ఈ ఒక్క రోజున సుమారు 150 జంటలకు వివాహాలు జరిగాయి. తిరుప్పోరూర్లో కందస్వామి ఆలయంలో వంద జంటలకు వివాహాలు జరిగాయి. చైన్నె వడపళణి మురుగన్ ఆలయంతో పాటుగా అనేక ఆలయాలలో వివాహాలు జోరుగా జరిగాయి. కుటుంబాలతో సహా వచ్చి మురుగన్ సన్నిధిలలో కొత్త జంటలకు వివాహాలను పెద్దలు జరిపించారు. ఇదే విధంగా రాష్ట్రంలోని అనేక ఆలయాల వద్ద కొత్త జంటల వివాహాలు జరగడంతో కల్యాణ వైభోగమే అన్నట్టుగా మంగళకర వాతావరణం నెలకొంది. భక్తిశ్రద్ధలతో కుంభాభిషేకాలు డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం దేవాదాయ శాఖ పేరు మార్చింది. హిందూ మత దేవాదాయ శాఖగా పేరు మార్చి, నిత్యం భక్తితో కనిపించే శేఖర్బాబునుమంత్రిని చేశారు. ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ ప్రగతి బాటలోకి తీసుకెళ్తూ వస్తున్నారు. పురాతన ఆలయాల పునరుద్దరణ,మరమ్మత్తుల ప్రక్రియను వేగవంతం చేశారు.ఈ నాలుగున్నర సంవత్సరాల డీఎంకే పాలనలో బుధవారంతో 4 వేల ఆలయాలకు కుంభాభిషేకాలు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఒక్క రోజున సుమారు ఆరేడు పురాతన, అతిపెద్ద ఆలయాలలో కుంభాభిషేకాలు జరిగాయి. మూహూర్తం రోజు కావడంతో వేకువ జామునుంచి ఆలయాలలో విశిష్ట పూజులు, యాగ శాలలో పూజలు జరిగాయి. మన్నార్కుడిలో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన రాజగోపాల స్వామి ఆలయం, దక్షిణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కరూర్ జిల్లా తాంథోని మలై కల్యాణ వెంకటరమణ ఆలయం కుంభాభిషేకాలు జరిగాయి. మన్నార్కుడిలో జరిగిన వేడుకకు మంత్రి టీఆర్బీ రాజా హాజరయ్యారు. కల్యాణ వెంకటరమణ ఆలయంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు సంస్కృతితో పాటూ తమిళంలోనూ వేదపారాయణాలు జరిగాయి. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఎంపీ జ్యోతిమణి తదితరులు ఈకార్యక్రమానికి హాజరయ్యారు. విల్లుపురం జిల్లా అరసూరులో ప్రసిద్ధి చెందిన వారాహి అమ్మ వారి ఆలయంలో వైభవోపేతంగా కుంభాభిషేక మహోత్సవం జరిగింది. పుదుకోట్టై జిల్లా తిరువాపూర్ ముత్తుమారియమ్మన్ ఆలయంలోనూ బ్రహ్మాండ వేడుకగా కుంభాభిషేకం ఘట్టం జరిగింది. నామక్కల్ జిల్లా తిరుచంగోడులో ప్రసిద్ధి చెందిన ఓం కాళియమ్మన్ ఆలయంలోనూ భక్తిశ్రద్ధలతో కుంబాభిషేక ఘట్టం జరిగింది. ఓ కాళీ...జై కాళీ నామస్మరణ మార్మోగింది. ఇక, చైన్నె పెరంబూరులో ప్రసిద్ధి చెందిన సెమ్మాత్తమన్ ఆలయంలో కుంభాషేకం అత్యంత వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూ మత దేవాదాయ శాఖ మంత్రి శేఖర్బాబు, మేయర్ ప్రియ తదితరులు హాజరయ్యారు. ఈ ఆలయానికి జరిగిన కుంభాభి షేకంతో నాలుగున్నరేళ్ల కాలంలో నాలుగు వేల ఆలయాలకు విజయవంతంగా మహోత్సవాన్ని ముగించడం విశేషం. -
ఏడీజీపీ జయరామన్ సస్పెన్షన్ రద్దు
– త్వరలో విధుల్లోకి.. సాక్షి,చైన్నె : అదనపు డీజీపీ జయరామన్ సస్పెన్షన్ను రాష్ట్ర హోంశాఖ రద్దు చేసింది. ఆయన ఒకటి రెండు రోజులలో మళ్లీ విధులలోకి రానున్నారు. వివరాలు.. గత ఏడాది తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలో జరిగిన ఓ బాలుడి కిడ్నాప్ వ్యవహారం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈకేసులో పురట్చి భారతం నేత, ఎమ్మెల్యే పూవై జగన్ మూర్తి, ఏడీజీపీ జయరామన్ పేర్లు తెర మీదకు రావడంతో పెద్ద రాద్ధాంతం సాగింది. ఈ కేసు కోర్టు వరకు వెళ్లింది. ఏడీజీపీ లొంగి పోయి విచారణకు హాజరు కావాల్సినపరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన్ని పదవి నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. గత కొన్ని నెలలుగా సాగుతూ వచ్చిన ఈ విచారణలో ఏడీజీపీ కారును ఆయనకు తెలియకుండానే కిడ్నాప్కు వాడి ఉండడం వెలుగు చూసింది. అలాగే ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు సైతం చేసింది. కేసులు ఆయన ప్రేమయం అన్నది లేని దృష్ట్యా, కోర్టు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సప్పెన్షన్ రద్దుకు ఆదేశాలుజారీ అయ్యాయి. దీంతో తాజాగా ఆయనకు మళ్లీ బాద్యతలను అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయన సస్పెన్షన్ను బుధవారం రద్దు చేశారు. దీంతో ఆయన తిరిగి విధులలోకి రానున్నారు. అయితే ఆయనకు ఏ పోస్టింగ్ ఇవ్వనున్నారో తేలాల్సి ఉంది. -
రేపు తేనాంపేట, కోడంబాక్కంలో నీటి సరఫరా నిలిపివేత
కొరుక్కుపేట: మెట్రో రైలుపనుల కోసం చైన్నెలోని తేనాంపేట, కోడంబాక్కం ప్రాంతాల్లో ఈనెల 30న నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు బుధవారం తెలిపారు. వివరాలు.. నుంగంబాక్కంలోని ఉత్తమర్ గాంధీ సాలై వద్ద ప్రధాన నీటి సరఫరా పైపును అనుసంధానించే పనుల కారణంగా, 30వ తేదీ ఉదయం 10 గంటల నుండి 31వ తేదీ ఉదయం 10 గంటల వరకు 24 గంటల పాటు నీటి సరఫరా నిలిపి వేయనున్నారు. ఈనేపథ్యంలో తేనాంపేట, కోడంబాక్కం మండలాల్లో పైపుల ద్వారా తాగునీటి సరఫరా కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. అలాగే నుంగంబాక్కం, కోడంబాక్కం, మైలాపూర్, నందనం, వడపళని, పశ్చిమ మాంబలం, వల్లువర్ కొట్టం వంటి ప్రాంతాల్లోనూ తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, స్థానికులు ముందుజాగ్రత్త చర్యగా తాగునీటిని నిల్వ చేసుకోవాలన్నారు. పోలీస్ గ్రీవెన్స్లో ఫిర్యాదుల స్వీకరణ కొరుక్కుపేట: పోలీస్ కమిషనరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించడం ద్వారా సత్వర చర్యలు తీసుకోవాలని చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ అరుణ్ పోలీసు అధికారులను ఆదేశించారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనరేట్లో ప్రతి బుధవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎ. అరుణ్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, తక్షణమే దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను అదేశించారు. ఈ శిబిరంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి. సుబ్బులక్ష్మి (పరిపాలన) తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో 709 ఖాళీల భర్తీకి ప్రభుత్వ ఆమోదం కొరుక్కుపేట: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడానికి కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉండగా, తమిళనాడు ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ శాఖలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న 709 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ విషయంలో, గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గగన్ దీప్ సింగ్ బేడీ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ శాఖ కింద ఖాళీగా ఉన్న పోస్టులు 120 జీపు డ్రైవర్లు, 56 రిజిస్ట్రేషన్ క్లర్క్లు, 421 ఆఫీస్ అసిస్టెంట్లు, 112 గార్డులు సహా మొత్తం 709 పోస్టుల ఉన్నాయి. మూడు సంవత్సరాలకు పైగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేయడానికి, గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ ఏప్రిల్ 2024లో అనుమతి కోరింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఇప్పుడు ఖాళీలను భర్తీ చేస్తున్నందున నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తే ఉద్యోగ ప్రకటనలు జారీ చేయలేమని అధికారులు పేర్కొన్నారు. తిరువొత్తియూర్ పశ్చిమ ప్రాంతంలో.. – రూ.4.38 కోట్ల వ్యయంతో జర్మన్ సాంకేతికతో వర్షపు నీటి సేకరణ తిరువొత్తియూరు: చైన్నె తిరువొత్తియూరు ప్రాంతంలో రూ.4.38 కోట్లతో జర్మన్ సాంకేతికతతో వర్షపు నీటి సేకరణ స్పాంజ్ పార్క్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. చైన్నె కార్పొరేషన్ పలుచోట్ల వర్షపు నీటి కాలువలు ఏర్పాటు చేసి వరద నీటిని సముద్రంలోకి పంపుతోంది. కాగా తగినంత స్థలం లేకపోవడంతో, జర్మన్ సాంకేతికతతో వర్షపు నీటిని పీల్చే స్పాంజ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఈక్రమంలో తిరువొత్తియూర్ పశ్చిమ ప్రాంతంలో 7వ వార్డులోని ఏడు గ్రౌండ్స్ పార్కులో రూ.4.38 కోట్ల వ్యయంతో వర్షాకాలంలో 8 లక్షల లీటర్ల నీటిని సేకరించే స్థాయిలో జర్మన్ సాంకేతికతతో వర్షపు నీటి సేకరణ స్పాంజ్ పార్క్ ఏర్పాటు పనులను కౌన్సిలర్ డాక్టర్ కె. కార్తీక్ ప్రారంభించారు. దీనిద్వారా ఈ ప్రాంతంలో నీటి కొరత ఉండదని, ఇక్కడ సేకరించిన వర్షపు నీరు ఈ ప్రాంతంలోనే నిల్వ చేయడం వల్ల ఉప్పు నీరు మంచి నీరుగా మారుతుందన్నారు. దీని వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. తార్యక్రమంలో అధికారులు, అన్నాడీఎంకే ప్రముఖులు కణ్ణన్ స్టీఫెన్, రెసిడెన్షియల్ అసోసియేషన్ నిర్వాహకులు జార్జ్ మంగళం పళని తదితరులు పాల్గొన్నారు. -
చైన్నె పోర్ట్లో రూ.30 కోట్లతో ప్యాసింజర్ టెర్మినల్
సాక్షి, చైన్నె: చైన్నె పోర్ట్లో రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ను బుధవారం ఉపయోగంలోకి తీసుకొచ్చారు. చైన్నె పోర్టులో అండమాన్ లక్షద్వీప్కు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ ఆధునిక ప్యాసింజర్ టెర్మినల్ను నిర్మించారు. అలాగే రూ.23 కోట్ల వ్యయంతో దేశీయంగా అభివృద్ధి చేసిన షిప్పింగ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్, మరో రూ.10 లక్షలతో పునరుద్ధరించిన సముద్ర రవాణా మౌలిక సదుపాయాలను కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చారు. అలాగే చైన్నె డిపార్ట్మెంటల్ ప్రధాన కార్యాలయంలో రూ.1.5 కోట్ల వ్యయంతో చేపట్టిన నిల్వ వాయిల్ ఈ–ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కూడా జరిగింది. చైన్నె పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఎస్. విశ్వనాథన్ అధ్యక్షతన తన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర హార్బర్ల శాఖ కార్యదర్శి విజయకుమార్ హాజరయ్యారు. మొత్తం రూ.54 కోట్ల విలువైన నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయన్నారు. పోర్టు సామర్థ్యాన్ని పెంచడంతో పాటూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులను గురించి అధికారులతో సమీక్షించారు. చైన్నె పోర్ట్ పనితీరు, కార్యాచరణ సామర్థ్యం, ఆర్థిక స్థితి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల గురించి సమీక్షించారు. భారతదేశ తూర్పు సముద్ర తీరానికి ముఖ్య ప్రవేశ ద్వారంగా చైన్నె పోర్ట్ కీలక పాత్ర పోషిస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం పోర్టు వినియోగదారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని, వారి ఫిర్యాదులు, సూచనలను విన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాల అధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఢిల్లీకి రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం
సాక్షి, చైన్నె : రాష్ట్ర ఎన్నికల అధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ విషయంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు రాష్ట్ర అధికారులతో చర్చించేందుకు నిర్ణయించాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మార్చిలో మోగే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడ్డాయి. ఏప్రిల్లో ఎన్నికలు ముగించి మే మొదటి వారంలో ప్రభుత్వం కొలువు దీరే రీతిలో కార్యచరణ సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియను ముగించి నమూనా ఓటరు జాబితాను ప్రకటించారు. ఇందులో పేర్లు లేని వారు మళ్లీ తమ పేర్లను చేర్చుకునేందుకు వీలు కల్పించారు. ఈ ప్రక్రియ 30వ తేదీతో ముగియనున్నది. తుది ఓటరు జాబితాను ఫిబ్రవరి రెండో వారంలో విడుదల చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో ఎన్నికలకు ఉపయోగించే ఈవీఎంల పరిశీలన ప్రక్రియ వేగంగా జరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితులలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఢిల్లీ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారులకు పిలుపు రావడం గమనార్హం. ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం ఢిల్లీ వెళ్లనున్నారు.ఈ దృష్ట్యా, రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమగ్ర వివరాల నివేదిక కసరత్తులకు తుది మెరుగులను దిద్దుతున్నారు. జిల్లాల నుంచి ఇప్పటికే అన్ని సమాచారాలు తెచ్చుకున్న అర్చనా పట్నాయక్, తన బృందంతో ఢిల్లీ వెళ్లేందుకు సన్నదం అవుతున్నారు. ఈ భేటీ తదుపరి రెండో వారంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారుల బృందం చైన్నెకు రాబోతున్నది. ఇక్కడ రెండు రోజుల పాటూ సమావేశాలు జరగనున్నాయి. గుర్తింపు పొందిన రాజకీయ పక్షాలతో ఓ రోజు, అధికారులతో మరో రోజు సమావేశం జరగనున్నది. ఈ దృష్ట్యా, రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్నట్లయ్యింది. -
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి డీఎంకే కూటమిలో కాంగ్రెస్ వ్యవహారం రచ్చకెక్కింది. టీఎన్సీసీ నేతలు తలా ఓ మాట అందుకోవడం వివాదాస్పదంగా మారింది. అధికారంలో వాటా, అధిక సీట్ల నినాదంతో టీఎన్సీసీ నేతలు ముందుకెళ్తున్న సమయంలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, డ
సాక్షి, చైన్నె: ఆది నుంచి తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ల బంధం గురించి చెప్పనక్కర్లేదు. వీరి బంధం ప్రతి ఎన్నికలలోనూ కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. 2011లో కాంగ్రెస్కు 60కు పైగా సీట్లను డీఎంకే ఇవ్వగా, కేవలం ఐదుగురే గెలిచారు. 2016 ఎన్నికలలో 41 సీట్ల కేటాయించగా 8 మంది నెగ్గారు. 2021 ఎన్నికలలో కాంగ్రెస్ సీట్లకు డీఎంకే బాగానే కోత పెట్టింది. 25 స్థానాలు అప్పగించగా, 18 చోట్ల గెలిచారు. ఆ తదుపరి తమిళనాట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, నగరపాలక సంస్థల ఎ న్నికలలో డీఎంకే కూటమితో కలిసి ఎదుర్కొన్నప్పటికీ కాంగ్రెస్కు ఆశించిన మేరకు కార్పొరేషన్లు, నగర పాలక సంస్థలలో పదవులు దక్కలేదు. 2024 లోక్సభ ఎన్నికలలో తొమ్మిది స్థానాలలో పోటీ చేసిన కాంగ్రెస్ అన్నింటా గెలిచింది. తమిళనాడులో 39 స్థానాలను డీఎంకే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఇదంతా డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పాలన ఘనతే అన్న చర్చ జోరుగా జరిగింది. సీట్ల పందేరం.. ఈ చర్చలు, వివాదాస్పద వ్యాఖ్యలు సాగుతున్న తరుణంలో విజయ్ తండ్రి , దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్ బుధవారం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ చరిత్ర కలిగిన పార్టీ అని, ఆ పార్టీకి ఉన్న బలం ఏమిటో ఇప్పుడున్న నేతలకు తెలియడం లేదని, వారికి బూస్ట్ ఇవ్వడానికి విజయ్ రెడీ అని వ్యాఖ్యలు చేశారు. విజయ్తో కలిసి వెళ్తే కాంగ్రెస్కు అధికారంలో వాటా తథ్యం అని, తద్వారా మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయవచ్చని సూచించారు. ఈ వ్యాఖ్యలపై టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుతొంగై స్పందిస్తూ, తమకు ఇప్పటికే రాహుల్ బూస్ట్, హార్లిక్స్చ్చారని, కొత్తగా ఎవ్వరూ ఇవ్వాల్సిన అవశ్యం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఈ పరిణామాల నేపథ్యంలో హఠాత్తుగా ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసానికి కనిమొళి మధ్యాహ్నం వెళ్లారు. ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో గంట పాటూ ఆమె భేటీ అయ్యారు. ఈ భేటీలో కూటమిపై చర్చ జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సీట్ల పందేరం కొలిక్కి తెచ్చే విధంగా చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఆ మేరకు తమకు 38 అసెంబ్లీ స్థానాలు, రెండు రాజ్యసభ సీట్లు ఇవ్వాలన్న తుది నిర్ణయాన్ని డీఎంకే ముందు రాహుల్ ఉంచినట్టు తెలిసింది. అయితే 25 స్థానాలు ప్రస్తుతానికి ఒకటి, ఆ తదుపరి మరో రాజ్యసభ సీటు ఇచ్చే విధంగా రాహుల్కు పార్టీ అధ్యక్షుడు సీఎం స్టాలిన్ తరపున కనిమొళి సూచించి వచ్చినట్లుగా చర్చ ఊపందుకుంది. కాగా ఢిల్లీలో తొలి దశ కాంగ్రెస్– డీఎంకే చర్చలు సంతృప్తి కరంగా సాగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల పొత్తు త్వరలో ఖరారయ్యే అవకాశం ఉంది.రెండు నెలలుగా ఎదురు చూపు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్తో తమిళనాడు, పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ గిరిష్ చోదన్కర్, ఏఐసీసీ ప్రతినిధులు సూరజ్ హెగ్డే, నివేదిత్ఆళ్వాలు, టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, శాసన సభా పక్ష నేత రాజేష్కుమార్తో కూడిన కమిటీ భేటీ సీట్ల పందేరం గురించి సమావేశమైంది. తమకు కావాల్సిన నియోజకవర్గాల జాబితాను అందజేశారు. ఇది ప్రక్రియ జరిగి రెండు నెలలు అవుతున్నా, డీఎంకే నుంచి ఎలాంటి స్పందన లేదు. సీట్ల పందేరం విషయంగా డీఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్ ఏఐసీసీ నేతలు ప్రవీణ్ చక్రవర్తితో పాటూ టీఎన్సీసీ నేతలు పలువురు విజయ్తో చేతులు కలుపుద్దామన్న నిర్ణయంతో వ్యాఖ్యల తూటాలను అందుకోవడం డీఎంకేకు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. తాజాగా కాంగ్రెస్ 70 స్థానాలను ఆశిస్తుండడంతోనే డీఎంకే ముందడుగు వేయకుండా మౌనం వహించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అధికారంలో వాటా ఆశించే విధంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గిరిష్ చోదనక్కర్ గళాన్ని విప్పడాన్ని డీఎంకే నిశితింగా పరిశీలించే పనిలో పడింది. తమిళనాట సంకీర్ణ ప్రభుత్వానికి ఆస్కారం లేదన్నది ఆది నుంచి జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈసారి సంపూర్ణ మెజారిటీతో తాము నెగ్గినా, నెగ్గక పోయినా, అధికారంలో వాటా దిశగా కాంగ్రెస్ చూపు ఉండడాన్ని డీఎంకే పరిగణించింది. టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై సైతం వ్యాఖ్యల తూటాలను అందుకోవడంతో పందేరం చర్చను డీఎంకే పక్కన పడేసింది. రాహుల్తో కనిమొళి భేటీ కాంగ్రెస్ కొత్త పల్లవి అన్నాడీఎంకేతో బీజేపీ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్కు డీఎంకేనే దిక్కుగా మారింది. అయితే విజయ్ నేతృత్వంలో టీవీకే ఆవిర్భావంతో కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు తొలుత డీఎంకేకు వ్యతిరేకంగా స్వరాన్ని అందుకున్నారు. అదే సమయంలో తమతో కలిసి వస్తే అధికారంలో వాటా అంటూ విజయ్ ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ నేతలు సైతం వాటా పల్లవి అందుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు సైతం విజయ్ టీవీకేతో కలిసి ఎన్నికల్లోకి వెళ్దామన్న నినాదాన్ని బహిరంగానే అందుకునేపనిలో పడ్డారు. ఈ నినాదం విస్తృతం కావడంతో ప్రచారానికి ముగింపు పలికే విధంగా ఏఐసీసీ పెద్దల ద్వారా డీఎంకే చెక్ పెట్టించింది. అదే సమయంలో డీఎంకేతో కూటమి బంధం పదిలం చేసుకోవడంతో పాటుగా ముందుగానే సీట్ల పందేరం ముగించే విధంగా ఏఐసీసీ పెద్దలు ఓ కమిటీని రంగంలోకి దించారు. -
తిరుత్తణికి పోటెత్తిన భక్తులు
తిరుత్తణి: తై కృత్తిక సందర్భంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం సందడి నెలకొంది. తైమాసం కృత్తికతో పాటు సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకునేందుకు భక్తులు స్వామి పోటెత్తారు. వేకువజామున స్వామికి అభిషేక పూజలు చేశారు. బంగారు కవచంతో అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. మెట్ల మార్గం మీదుగా భక్తులు కొండ ఆలయానికి చేరుకున్నారు. దీంతో మాడ వీధులు కిక్కిరిసాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అలాగే ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ కనిపించింది. సాయంత్రం శ్రీ వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వెండి నెమలి వాహనంలో కొలువుదీరారు. ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. -
రవాణా వాహనాలు ఢీ
సేలం: రోడ్డు ప్రమాదంలో మినీ టెంపో డ్రైవర్ సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. మంగళవారం ఓ గూడ్స్ ట్రక్ నామక్కల్ నుంచి తిరుచ్చికి వెళుతోంది. అలాగే తిరుచ్చి నుంచి బెంగళూరుకు బస్తాలతో మహేంద్ర పికప్ గూడ్స్ మినీ టెంపో నామక్కల్ వైపు వస్తోంది. మంగళవారం ఉదయం 6 గంటలకు నామక్కల్–తిరుచ్చి రోడ్డులోని రైల్వే ఫ్లైఓవర్ వద్ద ఇవి ఘోర ప్రమాదానికి గురయ్యాయి. పెయింటింగ్ పనులకు మోపెడ్పై వెళ్తున్న నామక్కల్కు చెందిన సేనాతిపతి (24), ఆకాష్ (24), కార్తీక్ (25)ను ఫ్రై ఓవర్ మీద ఓవర్టేక్ చేసే యత్నంలో మినీ టెంపో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని అదుపు తప్పి మోపెడ్ రైడర్లపై పడింది. దీంతో మోపెడ్పై వెళ్తున్న సేనాధిపతి, కార్తీక్, కర్ణాటకకు చెందిన మినీ టెంపో డ్రైవర్ సయ్యద్ యాసిన్ (30) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అలాగే మోపెడ్ నడుపుతున్న ఆకాష్, కర్ణాటకలోని సామ్రాజ్ నగర్కు చెందిన ట్రక్ డ్రైవర్ రాజేష్ (45) తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో నామక్కల్ –తిరుచ్చి రోడ్డుపై గంటసేపు ట్రాఫిక్ స్తంభించింది. గాయపడిన వారిని స్థానికులు వెలికితీసి నామక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నమక్కల్ ఏఎస్పీ ఆకాష్ జోషి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నామక్కల్ పోలీసులు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్తో తొలగిస్తున్న పోలీసులు నుజ్జు నుజ్జు అయిన మినీ టెంపో -
కూలిన ట్రాఫిక్ సిగ్నల్
– తప్పిన పెను ప్రమాదం తిరుత్తణి: తిరుత్తణిలో ట్రాఫిక్ సిగ్నల్ అకస్మాత్తుగా కూలడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. వివరాలు.. తిరుత్తణి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారంతో పాటు ప్రమాదాలు అరికట్టే విధంగా పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. అయితే సక్రమంగా సిగ్నల్స్ పనిచేయక పోవడంతో దిష్టిబొమ్మగా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో మపోసీ రోడ్డులో స్టేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు సహా నిత్యం రద్దీగా వుండే రోడ్డులో మంగళవారం సాయంత్రం సిగ్నల్ అడుగుభాగం ఇసున స్తంభం తుప్పుపట్టి కూలిపోయింది. రోడ్డులో సిగ్నల్ కూలడంతో అటువైపు వెళ్లిన వాహన చోదకులు, ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సిగ్నల్ తొలగించారు. -
ఫిబ్రవరి 1 నుంచి నియోజకవర్గ బాట
సాక్షి, చైన్నె: ప్రజలలోకి చొచ్చుకెళ్లే విధంగా నియోజకవర్గ బాటకు డీఎంకే సన్నద్దమైంది. ముఖ్య నేతలు ఇక ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆయా నియోజకవర్గాలలో తిష్ట వేసి రోజుకో ప్రాంతంలో సభలను నిర్వహించనున్నారు. ఇందుకోసం స్టార్ వ్యాఖ్యతలు సన్నద్దమయ్యారు. మళ్లీ అధికారంలో లక్ష్యంగా సీఎం స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ద్రావిడ మోడల్ 2.ఓ ప్రభుత్వ తథ్యమన్న ధీమాను అన్ని వేదికలలో స్పష్టం చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో పార్టీ తరపున ప్రజలలో చొచ్చుకెళ్లే కార్యక్రమాలను విస్తృతం చేయిస్తున్నారు. ఇప్పటికే బూత్ల స్థాయిలో ఇంటింటా ప్రచార పయనంలో కేడర్ నిమగ్నమై ఉన్నారు. జిల్లా స్థాయిలో సభలు, డివిజన్ల స్థాయిలో మహానాడులు విస్తృతం చేశారు. ఇక, ఫిబ్రవరి 1వ తేది నంంచి నియోజకవర్గ బాటకు సన్నద్దమయ్యారు. ఆయా నియోజక వర్గాలలలోని నేతల ద్వారా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజలను ఆకర్షించే విధంగా, స్థానికంగా ఆయానియోజకవర్గాలకు చేసిన ప్రగతి, రాష్ట్రవ్యాప్తం సంక్షేమాల గురించి ఈ సభలో ప్రసంగాలు హోరెత్తించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే స్టార్ వ్యాఖ్యాతలను సిద్ధంచేశారు. యువకులైన వారిని ఎంపిక చేశారు. స్పష్టమైన గళం, స్థానిక అవగాహన, సమయానుగుణంగా వ్యాఖ్యల తూటాలను పేల్చే రీతిలో ఈ స్టార్ వ్యాఖ్యతలను ప్రత్యేక శిక్షణతో నిష్ణాతులుగా తీర్చిదిద్ది ఉన్నారు. జిల్లాల కార్యదర్శులు, ఇ న్చార్జ్లు, నియోజకవవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు, మండల, డివిజన్ ప్రతినిధులు ఇక నియోజక వర్గాలలోనే ఉండే విధంగా డీఎంకే అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. -
సవాళ్లను అధిగమించండి
వేలూరు: జీవితం, వ్యాపారంలో సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనే వారు తప్పక విజయం సాధిస్తారని వేలూరు వీఐటీ యూనివర్సిటీటీ చాన్సలర్ విశ్వనాధన్ అన్నారు. వీఐటీలో పూర్వ విద్యార్థుల సంఘం 31వ వార్షికోత్సవం చాన్సలర్ అధ్యక్షతన నిర్వహించారు. కెవిన్కోర్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీకే రంగనాధన్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు భయపడక ధైర్యంగా ఎదుర్కొని, వాటిని అధిగమించాలన్నారు. తాను 18 నెలలుగా కృత్రిమ మేధను చురుగ్గా వినియోగిస్తున్నానని, అయితే ఏఐ కూడా తప్పులు చేస్తోందని పేర్కొన్నారు. చాన్సలర్ మాట్లాడుతూ, తాము దేశానికి, సమాజానికి సేవ చేస్తూ ప్రపంచంలోని ఉత్తమ కంపెనీలతో పోటీ పడే దిశగా సాగుతున్నామని పేర్కొన్నారు. మన దేశంలోఓ 22 లక్షల మంది మెడిసిన్ చదవాలనుకుంటే కేవలం 1.25 నుంచి 1.28 లక్షల మంది మాత్రమే అర్హత సాధిస్తారన్నారు. అయితే అడ్మిషన్ అనంతరం పలు సీట్లు ఖాళీగా ఉంటున్నట్టు చెప్పారు. అనంతరం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్ విశ్వనాధన్, శేఖర్ విశ్వనాధన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంధ్య పెంటారెడ్డి, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కాదంబరి విశ్వనాధన్, రమణి బాలసుందరం, వైస్ చాన్సలర్ కాంచన, అసోసియేట్ వైస్ చాన్సలర్ పార్థ సారథి మల్లిక్, రిజిస్ట్రార్ జయభారతి, పూర్వ విద్యార్థుల సంఘం డైరెక్టర్ కార్తికేయన్ తదితరులు పాల్గొన్నారు. -
అంగరంగ వైభవంగా తిరుమలలో రథ సప్తమి వేడుకలు
తిరుమల: రథ సప్తమి వేడుకలను తిరుమలలో అన్ని శాఖల సమష్టి కృషితో అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ చెప్పారు. మంగళవారం ఆయన ఏఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో వాహన సేవలను వీక్షించినట్లు చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి, పోలీసులకు, అర్చక స్వాములు, వాహన బేరర్లు, శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు. ఏఈవో మాట్లాడుతూ రథ సప్తమి సందర్భంగా వాట్సాప్, ఐవీఆర్ఎస్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించామని, వారందరూ టీటీడీ కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. పలువురు భక్తులు గ్యాలరీల్లో అదనపు మరుగుదొడ్లు, స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారని అందుకు తగిన విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. -
తెప్పపై శ్రీపార్థసారథి విహారం
తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారథి స్వామివా రు తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్వామివారు దేవేరులతో కలిసి తె ప్పను అధిరోహించి పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నా లుగు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. బుధవారం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వా మి వారు తెప్పపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రదర్శించిన హరికథాగానం, భజనలు, సంగీత విభావరి భక్తులను ఆకట్టుకున్నాయి. తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈఓ శాంతి, ఏఈఓ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ పాల్గొన్నారు. -
పరిస్థితుల కారణంగానే ఎన్డీఏలోకి టీటీవీ
– సెంగొట్టయ్యన్ వ్యాఖ్య సాక్షి, చైన్నె: కొన్ని పరిస్థితుల కారణంగానే ఎన్డీఏలోకి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ చేరినట్టు టీవీకే సమన్వయ కమిటీ కన్వీనర్ సెంగొట్టయ్యన్ వ్యాఖ్యానించారు. టీవీకేలో దోస్తీ దిశగా తొలుత దినకరన్ ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే హఠాత్తుగా మళ్లీ ఎన్డీఏలోకి చేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచనతోనే తాను అన్నాడీఎంకే – బీజేపీ కూటమిలో చేరినట్టు దినకరన్ ప్రకటించుకున్నారు. అయితే, ఆయనపై ఉన్న కేసుల దృష్ట్యా, బలవంతంగా బీజేపీ దారిలోకి తెచ్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులలో మంగళవారం సెంగొట్టయ్యన్ మీడియాతో మాట్లాడుతూ, వాస్తవానికి టీవీకేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనేందుకు దినకరన్ సన్నద్ధమయ్యారని పేర్కొన్నారు. టీవీకే ను గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీలకు లేదన్నారు. ఇది ప్రజల నుంచి పుట్టుకొచ్చిన పార్టీగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి టీటీవీ తమ వైపుగా మొగ్గు చూపుతూ వచ్చారని, అయితే పరిస్థితుల కారణంగా ఆయన ఎన్డీఏ వైపుగా మళ్లీ దృష్టి పెట్టారన్నారు. టీవీకేతో పొత్తు ప్రయత్నాలు జరుగుతున్న సమాచారంతో ఢిల్లీ పెద్దలు ఆయన్ను పిలిపించుకుని దారికి తెచ్చుకున్నట్టుందని మండి పడ్డారు. కాగా, సెంగొట్టయ్యన్ వ్యాఖ్యలపై దినకరన్ స్పందిస్తూ ఆయన ఎవరు? అని ప్రశ్నించడం గమనార్హం. మూత్రపిండాల మార్పిడి చికిత్సలో కొత్త బెంచ్ మార్క్ సాక్షి, చైన్నె: రెండేళ్లలో 9 మూత్ర పిండ మార్పిడి శస్త్ర చికిత్సలో కొత్త బెంచ్ మార్క్ను నమోదు చేశామని జెమ్ ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ సెంథిల్ నాథన్, నెఫ్రాలజిస్టు డాక్టర్ బాల ముకుందన్ తెలిపారు. మూత్ర పిండ మార్పిడితో కొత్త జీవితాలను పొందిన వారు ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పారు. మంగళవారం ఈ శస్త్ర చికిత్సల గురించి వారు వివరించారు. రోగ నిరోధక శక్తి కారణంగా ఏబీఓఐ మార్పిడి అత్యంత సంక్లిష్టమైన మూత్ర పిండ ప్రక్రియలో ఒకటి అని తెలిపారు. దాత, గ్రహీత మధ్య అసమతుల్యత, తీవ్రమైన డీసెన్సిటైజేషన్ , ముందస్తు రోగ నిరోధక శక్తి తగ్గడం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో ఉన్న వారికి ఈ శస్త్ర చికిత్స 100 శాతం విజయవంతమైనట్టు పేర్కొన్నారు. మూత్ర పిడ మార్పిడి గ్రహీతలు తిరువణ్ణామలై , దిండివనం, మేల్ మలయనూరు, చైన్నె, పట్టుకోట్టై తదితర ప్రాంత వాసులు తమ ఆస్పత్రుల్లో చికిత్స పొందినట్టు తెలియజేశారు. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి –మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం అన్నానగర్: సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు బాలురు గల్లంతై మరణించారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా, తాలూకాలోని మాపిళ్లైయురాని గ్రామానికి చెందిన వనరాజన్ కుమారుడు తిరుమణి (13), ఆర్ముగం కుమారుడు నరేన్ శ్రీ కార్తీక్ (12), కదిరేశన్ కుమారుడు ముఖేంద్రన్ (12) సోమవారం సాయంత్రం తమ గ్రామ సమీపంలోని సిలువైపట్టి మొట్టై గోపురం బీచ్ ప్రాంతంలో సముద్ర స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి మృతి చెందారు. ఇది తీవ్ర విషాదాన్ని నింపింది. సీఎం ఎంకె స్టాలిన్ దీనిపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సీఎం సహాయనిధి నుంచి ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. -
క్లుప్తంగా
ఐఐటీలో గ్రామీణ టీచర్లకు ఏఐ శిక్షణ సాక్షి,చైన్నె : ఐఐటీ మద్రాసు ప్రవర్తక్, విద్యామంత్రిత్వ శాఖ స్వయం ప్లస్ నేతృత్వంలో ఉచిత ఏఐ శిక్షణకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ శిక్షక్షణ ఇవ్వనున్నట్టు మంగళవారం ఐఐటీ మద్రాసు ప్రకటించింది. ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్– కే 12 టీచర్స్ కోసం దరఖాస్తుల చేసుకునేందుకు వీలు కల్పించామని, ఈనెలాఖరులోపు దరఖాస్తులను తమ వెబ్సైట్ ఐఐటీఎం ప్రవర్తక్లో నమోదు చేసుకోవచ్చని ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ నాలెడ్జ్ ఆఫీసర్ బాల మురళి శంకర్ తెలిపారు. ఏఐ విద్య భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఆధునిక బోధన, మూల్యాంకనం, విద్యార్థులకు సమగ్ర ఏఐ సాధనాలతో 1 నుంచి 12వ తరగతి వరకు గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 40 గంటల శిక్షణ ఉచితమని ప్రకటించారు. సీఎం ఇంటికి బాంబు బెదిరింపు –మాజీ సైనికుడు అరెస్టు అన్నానగర్: ముఖ్యమంత్రి ఇంట బాంబు పెట్టినట్టు పోన్ చేసి కలకలం సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కంట్రోల్ రూమ్కు సోమవారం ఒక కాల్ వచ్చింది. ఆళ్వార్ పేట సిద్ధరంజన్ రోడ్డులోని తమిళనాడు ముఖ్యమంత్రి ఇంట్లో బాంబు ఉందని, కాసేపట్లో అది పేలిపోతుందని చెప్పి ఓ వ్యక్తి కాల్ డిస్కనెక్ట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన కంట్రోల్ రూం తేనాంపేట పోలీసులకు సమాచారం చేరవేయడంతో, బాంబు నిపుణులు, స్నిఫర్ డాగ్స్ సహాయంతో పోలీసులు విస్తృతంగా సోదాలు చేశారు. అయితే ఇదంతా ఉత్తుత్తి బెదిరింపు పనేని తేలడంతో దర్యాప్తుకు పూనుకున్నారు. విరుదునగర్కు చెందిన మాజీ సైనికుడు బాలమురుగన్ (43) మద్యం మత్తులో ఇలా బెదిరించినట్టు తేలింది. అతడి నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. రిమాండ్కు తరలించారు. ఈయూతో ఒప్పందం.. వస్త్ర ఎగుమతులకు ప్రోత్సాహం కొరుక్కుపేట: యూరోపియన్ యూనియన్, ఇండియా మధ్య సుంకం రహిత వాణిజ్య ఒప్పందం కుదరడంపై తిరుప్పూర్ వస్త్ర ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు కె.ఎం. సుబ్రమణియన్ హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రెడీమేడ్ వస్త్ర పరిశ్రమ 10 లక్షల మందికి పైగా జీవనోపాధిని అందిస్తుందని, వారిలో దాదాపు 70 శాతం మంది మహిళలే ఉన్నారన్నారు. భారతదేశం ఉపాధి ఆధారిత ఎగుమతి వృద్ధికి తిరుప్పూర్ వెన్నెముకగా ఉద్భవించింది. దీనికి 2,500 నమోదిత దిగుమతిదారులు ఉన్నారని, 20,000 కంటే ఎక్కువ అనుబంధ సంస్థలు ఉన్నట్లు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం 2024–25లో రూ. 45 వేల కోట్లు ఎగుమతి ఆదాయం చేరుకుందని, ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అనుకూల పరిశ్రమగా గుర్తింపు పొందిందని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో యూరోపియన్ యూనియన్తో భారత్ సుంకాల ఒప్పందం చేసుకోవడంతో వస్త్రవ్యాపారులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. చేపలవేటకు వెళ్లి శవమయ్యాడు! తిరువళ్లూరు: చేపలవేటకు వెళ్లిన వ్యక్తి శవమయ్యాడు. వివరాలు..తిరువళ్లూరు జిల్లా గూడపాక్కం గ్రామానికి చెందిన పెయింటర్ గౌరీ శంకర్(29) తన భార్యాపిల్లలు బంధువుల ఇంటికి వెళ్లిన నేపథ్యంలో స్నేహితులతో కలిసి చేపలవేటకు వెళ్లాడు. అయితే చెరువులో దిగిన గౌరీశంకర్ ఎంతసేపటికీ బయటకు రావడంతో అనుమానించిన స్నేహితుడు అతడి కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది దాదాపు నాలుగు గంటలు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మనవాలనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంటలు రేగి కారు దగ్ధం అన్నానగర్: కారులో మంటలు రేగి అగ్నికి ఆహుతి అయిన సంఘటన సోమవారం రాత్రి సేలంలో రోడ్డు మీద చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అదష్టవశాత్తు సురక్షితంగా బైటపడ్డారు. వివరాలు.. సేలం సమీపాన సిద్ధనూర్ భువనేశ్వరి ప్రాంతంలో నివసించే శక్తి అనిష్ (32) సోమవారం సాయంత్రం తన భార్య కీర్తన, కూతురు ఎస్నా, తల్లి కమల, సోదరి మోనికాను వెంటబెట్టుకుని కారులో సేలం 5వ రోడ్డులోని ఎలక్ట్రానిక్ షోరూమ్ కు వచ్చాడు. వారు అక్కడ కొన్ని వస్తువులు కొనుగోలు చేసి కారులో ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో కారు ఇంజిన్ నుంచి పొగలు వస్తూండడంతో అప్రమత్తమైన శక్తి అనిష్ కారు ఆపి తన కుటుంబ సభ్యులతో పాటు కారు దిగేశారు. ఆ తర్వాత కారు నుంచి మంటలు రేగి దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఇంజిన్ బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. -
దేశ క్షేమం కోసం యాగ పూజలు
వేలూరు: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాణిపేట జిల్లా వాలాజ సమీపంలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలో సోమవారం సాయంత్రం భరతమాత విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక యాగ పూజలు చేశారు. ముందుగా పీఠాధిపతి డాక్టర్ మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో ఉదయం జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పీఠంలో ప్రత్యేక యాగ పూజలు చేశారు. అనంతరం పీఠంలో ప్రతిష్టించిన భరతమాత విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి దేశం క్షేమంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక యాగ పూజలు చేశారు. పీఠం ప్రారంభించి 20 సంవత్సరాలుగా జాతీయ జెండాను ఎగరవేయడంతో పాటూ దేశ క్షేమం కోసం ఏటా యాగ పూజలు చేస్తున్నట్లు పీఠాధిపతి తెలిపారు. అనంతరం పీఠానికి వచ్చిన భక్తులకు స్వీట్లు, పంచదారం పంపిణీ చేసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరంలో అవసరమైన భక్తులకు మందులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాగ పూజల్లో పాలుపంచుకున్నారు. భరతమాత విగ్రహం ఎదుట యాగ పూజలు చేస్తున్న దృశ్యం, పుష్పాలంకరణలో ఉన్న భరత మాత -
కేజీహెచ్ చిత్ర బ్యానర్లో శివకార్తికేయన్?
తమిళసినిమా: కోలీవుడ్లో స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగిన నటుడు శివ కార్తికేయన్. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెడుతూ వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఈయనకు వరుసగా భారీ అవకాశాలు తలుపు తడుతున్నాయనే చెప్పాలి. శివకార్తికేయన్ తాజాగా నటించిన పరాశక్తి చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కాగా తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించడానికి ఈయన సిద్ధమవుతున్నారు. కాగా తదుపరి హోమ్ బలే ప్రొడక్షనన్స్ సంస్థలో నటించటానికి పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. కన్నడంలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థగా రాణిస్తున్న హోమ్ బలే సంస్థ ఇంతకుముందు కేజీఎఫ్ చిత్రాలతో పాటు కాంతార, కాంతార చాప్టర్ –1 పంటి సంచలన విజయం సాధించిన చిత్రాలను నిర్మించాయి. కాగా ఇప్పుడు నేరుగా తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. తొలి ప్రయత్నంగా శివకార్తికేయన్ హీరోగా భారీ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా దీన్ని ఓ ప్రముఖ కన్నడ దర్శకుడు తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయనెవరు ? కథేంటి? ఇందులో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు తెలియాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే. శివకార్తికేయన్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న చిత్రంపై పూర్తి దృష్టి సారిస్తున్నారు. -
రోగుల పట్ల ప్రేమతో నడుచుకోవాలి
వేలూరు: డాక్టర్లు రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు ప్రేమగా నడుచుకోవాలని వేలూరు నరువి ఆసుపత్రి చైర్మన్ జీవీ సంపత్ అన్నారు. వేలూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం జరిగింది. ముందుగా నూతనంగా ఎన్నుకున్న సంఘం అధ్యక్షులు సతీష్కుమార్, కార్యదర్శి జగదీశన్, నిధి కార్యదర్శిగా ఎస్పీ వసంత్రాజ్తో పాటు సంఘం ప్రతినిధులు బాద్యతలు స్వీకరించారు. వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన సీఎంసీ ఆసుపత్రి వేలూరులో ఉన్నప్పటికీ అనేక మంది పలు ఆసుపత్రిలను ప్రారంభించి రోగులకు వైద్య సేవలను అందజేస్తున్నారన్నారు. ప్రస్తుతం నూతనంగా బాద్యతలు స్వీకరించిన డాక్టర్లు జిల్లాలోని వైద్యులకు మంచి సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి సుభాషిణి, డాక్టర్లు పాల్గొన్నారు. -
రీ రిలీజ్కు శింబు సిలంబాట్టం
తమిళసినిమా: ఇప్పుడు గతంలో విడుదలైన భారీ చిత్రాలు రీ రిలీజ్ కావడం పరిపాటిగా మారింది. అలాంటి చిత్రాలు మళ్లీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడమే ఇందుకు కారణంగా భావించవచ్చు. ఇటీవల నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన మంగాత్తా చిత్రం థియేటర్లలో రీ రిలీజ్ అయ్యి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నటుడు శింబు కథానాయకుడిగా నటించిన సిలంబాట్టం చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. 2008లో విడుదలైన ఈ చిత్రాన్ని లక్ష్మీ మూవీ మేకర్స్ పతాకంపై కె మురళీధరన్, బి. స్వామినాథన్ , టీఎస్ రంగరాజన్ కలిసి నిర్మించారు. ఎస్. శరవణన్ దర్శకత్వం వహించిన ఇందులో నటుడు శింబు గ్రామీణ యువకుడు నగరం యువకుడు అంటూ రెండు పాత్రను పోషించారు. ముఖ్యంగా ఇది సిలంబాట్టం అనే క్రీడ నేపథ్యంలో సాగే కథ చిత్రంగా ఉంటుంది. ఇందులో నటి స్నేహ, సనూష హీరోయిన్లుగా నటించగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. యాక్షన్, మదర్ సెంటిమెంటు, ప్రేమ వంటి అంశాలతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను అలరించింది . కాగా దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి , ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఫిబ్రవరి 6న తెరపైకి తీసుకు వస్తున్నట్లు నిర్మాతలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా థగ్లైఫ్ చిత్రం తర్వాత సింబు నటించిన మరో చిత్రం ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో సిలంబాట్టం చిత్రం రీ రిలీజ్ ఆయన అభిమానులను ఖుషీ నిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. -
అమ్మ సౌందర్య రహస్యం అదే..!
తమిళసినిమా: నటి శ్రీదేవిది సుదీర్ఘ సినీ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బాల తారగానే తమిళం, తెలుగు తదితర భాషలలో తారాస్థాయికి చేరుకున్న నటి శ్రీదేవి. తమిళంలో 1967లో కందన్ కరుణై అనే చిత్రం ద్వారా బాలనటిగా తెరంగేట్రం చేసిన నటి శ్రీదేవి. భాషల్లో భాలతారగా నటించి ప్రాచుర్యం పొందిన ఆ తర్వాత కథానాయకిగా పరిచయమై తమిళం, తెలుగు ,కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లో నటించి లేడీ సూపర్ స్టార్గా రాణించారు. అభిమానుల గుండెల్లో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి చిత్రాల్లో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న తరుణంలోనే బాలీవుడ్ సినీ నిర్మాత బోనీకపూర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కాగా శ్రీదేవి 54 ఏళ్ల వయసులో 2018లోనే శ్రీదేవి కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లు ఇప్పుడు ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వీరిలో పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ పాన్ ఇండియా స్టార్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె హిందీ చిత్రాలతో పాటూ తెలుగులో రామ్ చరణ్ కు జంటగా పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఈమె ఇటీవల ఓ భేటీలో తన తల్లి సౌందర్య రహస్యం గురించి వివరిస్తూ.. తమ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్లో పండ్లు కచ్చితంగా ఉంటాయన్నారు. అందరూ భోజనం చేసిన తర్వాత మిగిలిన పండ్లను రసంగా మార్చి తన తల్లి ముఖానికి రాసుకుంటారన్నారు. కొంతసేపు తర్వాత కడుక్కుంటే ముఖం తళతళ మెరిసిపోతుందన్నారు. పండ్ల రసం ముఖంలోని సెల్స్కు నూతన శక్తిని ఇస్తాయని, చచ్చిపోయిన సెల్సును తొలగించడానికి దోహదపడతాయని చెప్పారు. ఇదే తన తల్లి సౌందర్య రహస్యం అని తాను ఈ విధానాన్నే అమలు చేస్తున్నట్లు జాన్వీకపూర్ పేర్కొన్నారు. -
క్లుప్తంగా
విజయ్ తీరును ఖండిస్తూ అన్నాడీఎంకే పోస్టర్లు తిరువొత్తియూరు: తిరుప్పువనం ప్రాంతంలో తవైక(టీవీకే) అధ్యక్షుడు నటుడు విజయ్ తీరును ఖండిస్తూ ఏఐఏడీఎంకే నాయకులు పోస్టర్లతో నిరసన వ్యక్తం చేశారు. మామల్లాపురంలో ఆదివారం టీవీకే పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో ఆ పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ మాట్లాడుతూ ఏఐడీఎంకే అవినీతి పార్టీ, బీజేపీకి బానిసగా ఏఐడీఎంకే అని విమర్శించారు. దీనిపై తమిళనాడు వ్యాప్తంగా ఏఐఏడీఎంకే కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. శివగంగైజిల్లా తిరుపప్పవనం ప్రాంతంలో విజయ్ ప్రసంగాన్ని ఖండిస్తూ ఏఐఏడీఎంకే తరపున నిరసన పోస్టర్లు అతికించడం సంచలనంగా మారింది. 480 సాంప్రదాయ వరి రకాలతో మేనమామ సారె తిరువొత్తియూరు: పుదుచ్చేరిలో చెల్లెలి కూమార్తె పసుపు నీరాట్టు (పుష్పవతి) వేడుకలో ఓ మేనమాన 480 సాంప్రదాయ వరి రకాలను సారెగా ఇచ్చారు. సాధారణంగా శుఖకార్యాల్లో పండ్లు, స్వీట్లు, అలంకరణ వస్తువులు వంటివి కట్నంలో ఉంటాయి. కానీ పూర్వకాలంలో వ్యవసాయం ద్వారా లభించే వరి, ధాన్యం, కూరగాయలు వంటి వాటిని మేనమామ కట్నంగా ఇచ్చేవారు. దీనిని గుర్తుచేసుకునే కార్యక్రమం పుదుచ్చేరిలో జరిగిన పసుపు నీరాట్టు వేడుక జరిగింది. విల్లియనూరులో జరిగిన పసుపు నీరాట్టు వేడుకలో కొత్తగా వరి రకాల, వరసగా కానుకల పళ్లెంలో ఉంచారు. 480 సాంప్రదాయ వరి రకాలను సేకరించి వాటి పేర్లతో ప్యాకెట్లు పెట్టి మేనమామ కట్నంగా అందించారు. ఈ సమాచారం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కార్మికుల కోసం డయాగ్నస్టిక్ సెంటర్ సాక్షి,చైన్నె : చైన్నెలోని రోజు వారీ వేతన జీవులు, నిర్మాణ కార్మికులు, తక్కువ ఆదాయంతో సాగే కుటుంబాలకు సహకారంగా కాసా గ్రాండ్ ఫౌండేషన్ నేతృత్వంలో డయాగ్నస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశారు. చైన్నె బీసెంట్ నగర్లోని కాసా గ్రాండ్ ఫౌండేషన్లో ఈ డయాగ్నస్టిక్ సెంటర్ను మంగళవారం ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎంఎన్ అరుణ్ ప్రారంభించారు. ఇక్కడ డిజిటల్ ఎక్స్ రేలు, ఈసీజీ, సీటీ స్కాన్, థైరాయిడ్, డయాబెటిస్ ప్రొఫైల్స్, ట్రో పోనిన్ పరీక్షలు, రక్త పరీక్షలు వంటి అన్ని రకా ల మాస్టర్ హెల్త్ చెకప్లు అందించనున్నామని అరుణ్ వివరించారు. మహిళల కోసం ప్రత్యేక ఆరోగ్య ప్యాకేజీలతో సేవలు అందిస్తు న్నామన్నారు. అత్యంత తక్కువ ఖరీదుతో పేద, మధ్యతరగతి వర్గాలు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 నుంచి రాత్రి ఏడు గంటల వరకు , ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఇక్కడ సేవలు పొంద వచ్చని సూచించారు. రూ. కోటి విలువైన ప్రభుత్వ స్థలం స్వాధీనం తిరుత్తణి: తిరుత్తణిలో కాలువ ఆక్రమించి నిర్మించిన ఇళ్లు ఆలయం కూల్చివేశారు. ఈ సందర్భంగా ఉద్రికత్త చోటు చేసుకోవడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. తిరుత్తణి సాయిబాబా నగర్కు సమీపంలో ప్రజా పనుల శాఖకు చెందిన చెరువు వుంది. ఆ చెరువకు వర్షపు నీరు వెళ్లేందుకు వీలుగా గతంలో 40 అడుగుల వెడల్పు గల కాలువ వుండేది. అయితే పట్టణ విస్తరణతో 30 ఏళ్ల కిందట ప్రైయివేటు భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇళ్లు నిర్మించుకుని నివాముంటున్నారు. ఈక్రమంలో తిరుత్తణికి చెందిన వ్యక్తి చెరువకు వర్షపు నీరు వెళ్లు కాలువ ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నట్లు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మించిన కట్టడాలు కూల్చి వేయాలని ఆదేశించింది. దీంతో డిసెంబర్ 7న రెవెన్యూ శాఖ అధికారులు ఆక్రమణలు తొలగించే పనులు చేపట్టారు. అయితే వినాయక ఆలయం, అంగన్వాడీ కేంద్రంతో పాటూ ఐదు ఇళ్లు కూల్చివేతకు వ్యతికేంగా ల్యాండ్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఇళ్లు ఆలయం కూల్చివేతను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే బాధితుల వినతిని ల్యాండ్ కమిషన్ తిరస్కరించడంతో మంగళవారం ఆక్రమణ కట్టడాలు కూల్చివేసే పనులు రెవెన్యూ అధికారులు ముమ్మరం చేశారు. పోలీసుల సమక్షంలో ప్రజా పనుల శాఖ అధికారులు సంయుక్త సహాకారంతో 5 ఇళ్లు పూర్తిగా కూల్చివేయగా, ఓ ఆలయంతో పాటూ అంగన్వాడీ కేంద్రం సైతం తొలగించారు. కాగా స్వాధీనం చేసుకున్న స్థలం మార్కెట్ విలువ రూ. కోటి ఉంటుందని రెవిన్యూ అధికారులు తెలిపారు. -
మాటలకు మించి శక్తివంతంగా..
తమిళసినిమా: సినిమా పుట్టిందే మూకీతో ఆ తర్వాత ఎన్నో విధాలుగా రూపాంతరం చెంది ఇప్పుడు డిజిటల్ స్థాయికి ఎదిగింది. అలా సినిమా శతాబ్ది వేడుకలను జరుపుకున్న తరుణంలో తాజాగా సినిమా మళ్లీ మూకీ చిత్రం రూపొందడం విశేషమే అవుతుంది. అవును అలాంటి మాటల్లేని చిత్రమే గాంధీ టాకీస్ ఇలాంటి చిత్రాన్ని ఇప్పుడు నిర్మించడం నిజంగా సాహసమే అని చెప్పాలి. ఆ సాహసాన్ని జి స్టూడియోస్, క్యూరీస్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, పింక్ రూమ్ మేట స్టూడియోస్, మూవీ మిల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు చేస్తున్నాయి. పంచ్ డైలాగులు , రణగణ శబ్దాలు ,భారీ తనం వంటి అంశాలతో చిత్రాలు రూపొందుతున్న ఈ రోజుల్లో అవేవీ లేకుండా, మాటలు కూడా లేకుండా శక్తివంతమైన కథనాలు, భావోద్వేగాలను మాత్రమే నమ్మి రూపొందిస్తున్న చిత్రం గాంధీ టాకీస్ విజయ్ సేతుపతి, అరవిందస్వామి, నటి అతిథి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ పాండురంగ్ బలేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ను మంగళవారం విడుదల చేశారు. ఇందులో నటించిన అనుభవాన్ని నటుడు విజయ్ సేతుపతి పేర్కొంటూ మాటలు లేకుండా భావాలను వ్యక్తం చేయాలన్న సవాల్ను గాంధీ టాకీస్ తనకు ఇచ్చిందని అన్నారు. మౌనాన్నే శక్తవంతమైన భావాలుగా మార్చే అరుదైన చిత్రం ఇదన్నారు. గాంధీ టాకీస్ చిత్రాన్ని ఈనెల 30వ తేదీన విడుదల చేయనున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. -
డీఎంకే ప్రభుత్వంలోనే ఆరోగ్యశాఖకు ప్రత్యేక నిధులు
వేలూరు: డీఎంకే ప్రభుత్వంలోనే ఆరోగ్యశాఖకు ప్రత్యేక నిధులు కేటాయించి ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ అన్నారు. వేలూరు జిల్లా గుడియాత్తంలో రూ. 44 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వాసుపత్రి భవణాన్ని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన మంత్రులు సుబ్రమణియన్, ఏవా వేలు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ గుడియాత్తంలో మాజీ ముఖ్యమంత్రి కామరాజర్తో పాటూ పలువురు మేధావులు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలం ఉన్నాయని అయితే ఇక్కడ ప్రభుత్వాసుత్రి పూర్తిగా పాత కట్టడాలతో నడుస్తుండడంతో గత 2023వ సంవత్సరంలో నూతనంగా ఐదు అంతస్తులతో మొత్తం 253 పడకలతో కూడిన ఆసుపత్రిని నిర్మించేందుకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేసి నిధులు కేటాయించారన్నారు. దీంతోనే ప్రస్తుతం అతి నవీన ఆసుపత్రిని రోగులకు అందజేస్తున్నామన్నారు. వీటిని ఈ ప్రాంతంలోని రోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోగులకు అవసరమైన మందులను సిద్ధంగా ఉంచడం జరిగిందని వీటితో పాటూ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రోగులకు కార్పొరేట్ ఆసుపత్రిలకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. త్వరలోనే వేలూరు జిల్లా అనకట్టులో ప్రభుత్వాసుపత్రి నిర్మించడానికి పనులను ప్రారంభించనున్నామని ప్రస్తుతం సత్వచ్చారిలో రూ. 22 లక్షలతో పీహెచ్సీ నిర్మాణ పనులు, రూ. 50 లక్షలతో కల్లపాడిలో పీహెచ్సీ భవనం నిర్మించేందుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ముందుగా ఆసుపత్రిలోని నాణ్యతను అధికారులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ కదీర్ఆనంద్, ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్, అములు, మేయర్ సుజాత, ఆరోగ్యశాఖ అధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
అ‘పూర్వ’ కలయిక
సాక్షి, చైన్నె : దశాబ్దాల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఒక చోట చేరారు. నాటి జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు. చైన్నెలోని 73 సంవత్సరాల పాటుగా విద్యా రంగంలో అగుర్చంద్ మన్ముల్ జైన్ కళాశాల సేవలను అందిస్తోంది. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులకు 1500 మందికి పైగా ఏకం అయ్యారు. తమ కళాశాలకు చేరుకున్నారు. బ్రహ్మాండ వేడుకతో ఎఎం జైన్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. తమ మిత్రులతో, అధ్యాపక సిబ్బందితో పూర్వ విద్యార్థులు ఆనందాన్ని పంచుకున్నారు. ఏడు దశాబ్దాలకు పైగా తరాలను తీర్చిదిద్దిన సంస్థతో పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను, అనుబంధాన్ని, ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మెంటలిస్ట్ అభిషేక్ భాస్కర్ ప్రదర్శన ఆహుతలను ఆకట్టుంది. గాయని నిత్యశ్రీ వెంకటరామన్ సంగీత విభావరి వీనుల విందుగా జరిగింది. పదవీ విరమణ పొందిన ప్రిన్సిపాల్స్, అధ్యాపకులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించుకున్నారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు నరేంద్ర నహర్ మాట్లాడుతూ, 73 సంవత్సరాలకు పైగా ఏంఎం జైన్ కళాశాల అభ్యాసం, విలువలు, శ్రేష్టతకు కేంద్రంగా ఉంటూ వస్తుందని వివరించారు. తమ పూర్వ విద్యార్థుల సమావేశం 2026 అఖండ విజయం సాధించిందన్నారు. ఎక్కడెక్కడ స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్న వారందరూ ఇక్కడకు వచ్చి తన ఆనందాన్ని పంచుకున్నట్టు పేర్కొన్నారు. -
స్టెరాయిడ్ల వాడకంతో పెరిగిన గ్లాకోమా కేసులు
సాక్షి, చైన్నె: విస్తృతంగా వాడుతున్న స్టెరాయిడ్ల రూపంలో సెకండరీ గ్లాకోమా ఉద్బవిస్తున్నట్టు వై ద్యులు ప్రకటించారు. స్టెరాయిడ్ల విస్తృతం వాడకం, పర్యవేక్షణ లేక పోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ద్వితీయ గ్లాకోమాకు ప్రధాన ట్రిగ్గర్గా ఉద్భవిస్తున్నదని హెచ్చరిస్తున్నారు. ఇది తిరిగి పొందలేని అంధత్వానికి దారితీసే భయంకరమైన పరిస్థితిగామారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇప్పటికే 12 నుంచి 13 మిలియన్ల మంది గ్లాకోమాతో జీవిస్తున్నటు అంచనా వేశారు. ఈ సంఖ్య 2040 నాటికి రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళనతో తాజాగా జరిపిన పరిశోధన వివరాలను చైన్నెలోని డాక్టర్ అగర్వాల్స్ ఐ ఆస్పత్రి క్లినికల్ సర్వీసెస్ రీజినల్ హెడ్ డాక్టర్ సౌందరి ప్రకటించారు. వైద్య పర్యవేక్షణ లేకుండా స్టెరాయిడ్ మందులు లేదా కంటి చుక్కలను ఉపయోగించే రోగులలో గ్లాకోమా ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. కంటి ఒత్తిడి నిశ్శబ్దంగా పెరుగుతూనే ఉంటుంది, ఇది శాశ్వత నష్టాన్ని కలిగిస్తుందన్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా, వైద్యులు నిర్ధారణ చేయబడిన గ్లాకోమా కేసులలో గణనీయమైన పెరుగుదలను గుర్తించామన్నారు. గ్లాకోమా సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వ్యక్తులలో నిర్ధారణ అవుతుందని, అయితే, తాజాగా స్టెరాయిడ్ల వాడకంతో మరింత విస్తృతం అవుతోందన్నారు. సకాలంలో రోగ నిర్ధారణ చికిత్సను పొందడం, వార్షిక స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా సమస్య నుంచి గట్టెక్క వచ్చు అని అని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ మురళి వివరించారు. గ్లాకోమాపై అవగాహన కార్యక్రమంలో భాగంగా, డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి భారతదేశం అంతటా డయాబెటిక్ రోగులకు ఉచిత గ్లాకోమా చికిత్సను అందించేందుకు నిర్ణయించామన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ సేవలు ఉంటాయని, అవసరమైన వారు 95949 01868 కు కాల్ చేయవచ్చని సూచించారు. -
ఎన్కౌంటర్లో రౌడీ హతం
సాక్షి, చైన్నె : పేరు మోసిన రౌడీ కొట్టురాజ్ (30) పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. మంగళవారం ఈ ఘటన పెరంబలూరు జిల్లా తిరుమాదురైలో కలకలం సృష్టించింది. వివరాలు..మదురైలో పేరు మోసిన దాదా వెల్లకాళీని గతంలో పోలీసులు అరెస్టు చేసి కట కటాలలోకి నెట్టారు. దిండుగల్ జైలులో ఉన్న ఇతడిని ఈనెల 24న ఓ కేసు విచారణ నిమిత్తం పుదుకోట్టై కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాలతో గట్టి భద్రత నడుమ చైన్నె పుళల్కు తరలించారు. మార్గం మధ్యలో పెరంబలూరు సమీపంలోని తిరుమాదురై వద్ద పోలీసులు, రౌడీ కాళీతో పాటు హోటల్లో భోజనం చేయడానికి వెళ్లారు. అప్పటికే రహస్యంగా వీరిని రెండు కార్లలో వెంబడిస్తూ వచ్చిన ముఠా రౌడీ కాళీని హత్య చేసేందుకు స్కెచ్ వేసి నాటు బాంబులతో దాడిచేసింది. అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. దీంతో ఎస్ఐ రామచంద్రన్ రివాల్వర్కు పని పెట్టారు. ఆయన ఫైర్ చేయడంతో కారులో వచ్చిన వారంతా ఉడాయించారు. సమాచారం అందుకున్న తిరుమాదురై, మంగళ మేడు పోలీసులు ఆ రెండు కార్లను సినీఫక్కీలో ఛేజింగ్ చేశారు. సమీపంలోని చెక్ పోస్టును ఢీకొట్టి మరీ ఆ కార్లు అదృశ్యమయ్యాయి. ఓ కారు ఎలత్తూరు సమీపంలో ఆపి పారిపోయారు. ఇక, నాటు బాంబుల దాడిలో గాయపడ్డ పోలీసులు మరుదు పాండి, రామచంద్రన్, విఘ్నేష్ను ఆస్పత్రికి తరలించారు. ఐదు బృందాలతో.. రౌడీ వెల్లకాళీపై హత్యాయత్నానికి తెగబడింది మరో రౌడీ..అళగురాజ్ అతడి అనుచరులని పెరంబలూరు పోలీసులు గుర్తించారు. ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలించాయి. సోమవారం ఊటీలో కొందరిని, కళ్లకురిచ్చి జిల్లా నైనార్ పాళయం వద్ద ఏడుగురిని అరెస్టుచేశారు. వీరిలో రౌడీ కొట్టు రాజ్ సైతం ఉండటంతో అతడిని విచారణ చేశారు. నాటు బాంబులు, ఆయుధాలను తిరుమాదురైలో దాచి పెట్టినట్టు అతడు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు భద్రత నడుమ అక్కడకు వెళ్లారు. అయితే, రాజ్ నాటు బాంబులతో దాడులు చేయడంతో పోలీసులకు కంగుతిన్నారు. ఈ దాడిలో ఎస్ఐ శంకర్తో పాటు కానిస్టేబుల్ గాయపడడంతో మంగళమేడు పోలీసు ఇన్స్పెక్టర్ నందకుమార్ కాల్పులు జరిపాడు. తూటా తలకు తగలడంతో కొట్టు రాజ్ కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. గాయపడ్డ ఎస్ఐ, కానిస్టేబుల్ పెరంబలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.పెరంబలూరు జిల్లా ఎస్పీ జీఎస్ అనిత సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. అలాగే తిరుచ్చి జోన్ ఐజీ బాలకృష్ణన్ సైతం హుటాహుటిన పెరంబలూరుకు చేరుకుని గాయపడ్డ పోలీసులను పరామర్శించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్టు ఐజీ పేర్కొన్నారు. కొంత కాలంగా తమిళనాడులో పోలీసులు ఎన్కౌంటర్ చేయడం మానేశారు. పట్టుబడే రౌడీలకు పిండికట్టు ట్రీట్ మెంట్ అన్నట్టుగా కాళ్లూచేతులు విరిచి పడేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్కౌంటర్ చర్చనీయాంశమైంది. -
ఘనంగా తైమాస ఉత్సవాలు
వేలూరు: తమిళ తైమాసంలో నిర్వహించే తై క్రిత్తిక, తైపూజోత్సవాలను వేలూరు, తిరువణ్ణామలై ఆలయాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో తైపూజోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వారికి అన్నాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా వేలూరు రత్నగిరి మురుగన్ ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి ప్రార్థనలు చేశారు. వాలాజ సమీపంలోని శ్రీ దన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పీఠంలో శక్తి గాంచిన పరిహార దైవాలతో పాటు ఫలితాలిచ్చే హోమ పూజలు రోజూ జరుగుతుంది. అనంతరం పీఠంలో తైపూసాన్ని పురష్కరించుకొని స్వామి వార్లుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి దీపారధన పూజలు చేశారు. అనంతరం ప్రత్యేక పౌర్ణమి హోమ పూజలు చేశారు. అనంతరం పీఠంలోని 27 నక్షత్రాలకు పరిహార పూజలు, పుష్పాలంకరణ జరిగింది. అదే విధంగా వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని మురుగన్ ఆలయాల్లో తైపూజోత్సవాలను ఘనంగా నిర్వహించి భక్తులకు అంబలిని ప్రసాదంగా అందజేశారు. ఇదిలా ఉండగా వేలూరు, తిరువణ్ణామలై అలయాల్లోని మురుగర్ ఆలయాల్లో స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, దీపారధన, పుష్పాలంకరణలు చేయడంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కావళ్లతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. -
ఆగిన బ్యాంక్ సేవలు
– ఉద్యోగుల నిరసన పోరాటాలు సాక్షి, చైన్నె: రాష్ట్రంలో మంగళవారం బ్యాంక్ల సేవలు స్తంభించాయి. ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన పోరాటాలలో నిమగ్నమయ్యారు. వివరాలు.. బ్యాంక్లలోని ఉద్యోగులు గత కొంత కాలంగా తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోరాటాలు చేస్తూ వస్తున్నారు. ఈ డిమాండ్లతో పాటూ వారంలో 5 రోజుల పని విధానాన్ని ప్రవేశ పెటాలన్న డిమాండ్తో మంగళవారం ఒక రోజు సమ్మెకు పిలుపు నిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగంలోని వివిధ బ్యాంక్లకు చెందిన సుమారు 16 వేల శాఖలు స్తంభించాయి. ఉద్యోగులు విధులను బహిష్కరించి తమతమ ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినదించారు. చైన్నెలోని యూనియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసనకు మహిళా ఉద్యోగులు సైతం దిగారు. పలుచోట్ల తమ తమ శాఖల వద్ద నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. బ్యాంకులన్నీ మూత పడటంతో సేవలు స్తంభించాయి. ఇప్పటికే శుక్ర వారం నుంచి సోమవారం వరకు నాలుగు రోజులు సెలవులతో బ్యాంక్ల లావాదేవీలు ఆగాయి. మంగళవారం సమ్మెతో పూర్తిగా సేవలు స్తంభించినట్టైంది. రాష్ట్రంలోని సుమారు 2 లక్షల మందికి పైగా సిబ్బంది విధుల్ని బహిష్కరించి తమ డిమాండ్ల సాధనకు నిరసనలలో పాల్గొన్నారు. వరుస సెలవులు, ఒక రోజు సమ్మె కారణంగా ఖాతా దారులకు అవస్థలు తప్పలేదు. డిజిటల్ లావాదేవిల నేపథ్యంలో నగదుకు డిమాండ్ అన్నది లేనప్పటికీ , ఇతర డిపాజిట్లు, చెక్కులు తదితర వ్యవహారాల సేవలు ఆగినట్లయ్యింది. -
అన్బుమణి ఇంటర్వూలు
– ఆశావహుల రాక సాక్షి,చైన్నె : తన మద్దతు ఆశావహులతో ఇంటర్వ్యూలపై పీఎంకే నేత అన్బుమణి దృష్టి పెట్టారు. మంగళవారం చైన్నెలో ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్య సాగుతున్న సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల కమిషన్ ద్వారా పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకున్న అన్బుమణి ఎన్నికలో బీజేపీ, అన్నాడీఎంకే కూటమితో కలిసి పయనించనున్నట్టు ప్రకటించారు. ఇందులో 20లోపు సీట్లు అన్బుమణి శిబిరానికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితులలో తన తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆశావహులతో ఇంటర్వ్యూలపై అన్బుమణి దృష్టి పెట్టారు. చైన్నె పనయూరులోని పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్న వారితో ఇంటర్వ్యూలకు చర్యలు తీసుకున్నారు. తొలి రోజున చైన్నె, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, కోయంబత్తూరు, నీలగిరి, తిరుచ్చి జిల్లాలకు చెందిన ఆశావహులను ఇంటర్వ్యూ చేశారు. 28వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆ తదుపరి వీరిలో తమకు కేటాయించే నియోజకవర్గాల మేరకు అభ్యర్థులను అన్బుమణి ఎంపిక చేయనున్నారు. కాగా, నిన్నటి వరకు డీఎంకేతో దోస్తీ కట్టాలన్న యోచన దిశగా రాందాసు శిబిరం ముందుకు సాగిన విషయం తెలిసిందే. అయితే,డీఎంకే నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో తాజాగా డీఎంకేకు వ్యతిరేకంగా రాందాసు గళం విప్పడం గమనార్హం. విద్యా రుణాల మాఫీ మాటేమిటో అంటూ సీఎం స్టాలిన్ను ప్రశ్నిస్తూ ప్రకటన విడుదల చేశారు. విజయవంతంగా పెనాంగ్ పర్యాటక రోడ్ షో సాక్షి,చైన్నె : సింప్లీ పెనాంగ్ నినాదంతో చైన్నెలో పెనాంగ్ రోడ్ షో విజయవంతంగా మంగళవారం జరిగింది. భారత్, పెనాంగ్ మధ్య పర్యాటక, వర్తక రీత్యా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తూ ఈ కార్యక్రమం జరిగింది. దేవ వ్యాప్తంగా పెనాంగ్ నేతృత్వంలో జరుగుతూ వస్తున్న రోడ్ షో కార్యక్రమం మంగళవారం చైన్నెకు చేరింది. వీఎం 2026 పేరిట 9వ ఎడిషన్గా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెనాంగ్ దేశ ప్రతినిధులు, దౌత్య వేత్తలు హాజరయ్యారు. భారతీయ పౌరులకు వీసా మినహాయింపు కొనసాగింపు , ప్రయాణ సౌలభ్యం విస్తృతం, పర్యాటకం, వర్తక కార్యక్రమాలు రెండింటి బలోపేతం చేస్తూ ఈ రోడ్ షోలో నిర్ణయాలు తీసుకున్నారు. పెనాంగ్ రోడ్ షో టూ ఇండియా 2026 విజయవంతంగా జరిగిందని పెనాంగ్ దౌత్య, పర్యాటక అధికారులు స్థానికంగా ప్రకటించారు. చైన్నె వేదికగా ట్రాక్ ఆసియా కప్ సాక్షి, చైన్నె: యూసీఐ క్లాస్ 2 ట్రాక్ సైక్లింగ్ పోటీలకు చైన్నెను వేదికగా ఎంపిక చేశారు. ట్రాక్ ఆసియా కప్ 2026 పేరిట ఈనెల 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ క్యాంపస్లోని ఎస్డీఏటీ సైక్లింగ్ వెలోడ్రోమ్లో ఈ పోటీలు జరగనున్నాయి. తమిళనాడు సైక్లింగ్ అసోసియేషన్, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు సహకారంతో జరుగుతున్న ఈ పోటీల అంతర్జాతీయ ట్రాక్ సైక్లింగ్కు 11 దేశాల నుంచి 70 మంది అంతర్జాతీయ సైక్లిస్టులు హాజరు కానున్నారు. అలాగే ఎస్డీఏటీ సైకిలిస్టులతో సహా 50 మంది భారతీయ సైక్లిస్టులు ఈ పోటీలకు తరలి రానున్నారు. 11 ఈవెంట్లుగా పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయంపై స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సభ్యకార్యదర్శి జె. మేఘనాథరెడ్డి మాట్లాడుతూ, ఎస్డీఏటీ వెలోడ్రోమ్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సీఎఫ్ఐ, టీఎన్సీఏ మధ్య బలమైన సహకారం, కొత్త ప్రమాణాలను నిర్దేశించి ఉన్నట్టు వివరించారు. తమిళనాడు సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి మణీందర్ పాల్ సింగ్ పేర్కొంటూ, యూసీఐ క్లాస్ 2 ఈవెంట్ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతుందని ప్రకటించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు చైన్నె వాటర్ బోర్డు సమాలోచన కొరుక్కుపేట: తాగునీటి వినియోగదారుల వినియోగాన్ని పర్యవేక్షించడానికి కొత్త స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని చైన్నె వాటర్ బోర్డు విభాగం సమాలోచన చేస్తున్నట్లు తెలిసింది. కాగా తాగునీటి బోర్డు అందించే నీటికి (దీనిని ఎక్కువగా వాణిజ్య సంస్థలు ఉపయోగిస్తాయి) వినియోగదారులు పన్ను చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో వినియోగ స్థాయిని తెలుసుకునేందుకు కొత్త స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే తాగునీటిని, నీటిని ఉపయోగించే భవనాలు మెట్రోలలో నీటి ట్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
లక్ష్యాలను సాధించడంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని సీఎం స్టాలిన్ పిలుపు నిచ్చారు. ప్రతి బాలిక చదుకోవాలని, ప్రతి మహిళ స్వేచ్ఛగా జీవించాలని, మంచి సంపాదనతో వ్యవస్థాపకులుగా మారాలని, అన్ని రంగాల్లో నిర్భయంగా ముందడుగు వేయాలని సూచించారు.
పింక్ బస్సులు, ఆటోలకు జెండా ఊపుతున్న సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: చైన్నె నందంబాక్కం ట్రేడ్ సెంటర్లో మంగళవారం తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రాజెక్టుల అమలు విభాగం నేతృత్వంలో రెండురోజుల పాటూ ప్రపంచ మహిళ ఉపాధి, భద్రత పేరిట ఉమెన్స్ సమ్మిట్ 2026 ప్రారంభమైంది. రాష్ట్రాన్ని ఆర్థికంగా సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మహిళల భాగస్వామ్యం, భద్రతే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సును సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. అలాగే తమిళనాడు మహిళా ఉపాధి, భద్రత(టీఎన్డబ్ల్యూఈ సేఫ్) నినాదంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తంగా రూ. 5 వేల కోట్లు విలువైన సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. ఇందులో ప్రపంచ బ్యాంకు సాయంతో రూ. 1,185 కోట్ల ఆర్థిక సహాయం పంపిణి చేశారు. మహిళల కోసం వివిధ వాహన సేవలను ప్రారంభించారు. సీఎం మహిళా అరుణోదయం పేరిట యాత్ర చేపట్టడంతో పాటూ మహిళల కోసం ప్రత్యేక పది పింక్ బస్సులకు జెండా ఊపారు. పింక్ ఆటోలను పంపిణీ చేశారు. అబలల భద్రత కోసం పింక్ జీపులను మహిళా పోలీసులకు అందజేశారు. పారిశ్రామిక రంగంలో.. భాగస్వామ్యాన్ని మెరుగుపరిచే సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ సమక్షంలో అవగాహన ఒప్పందాలు జరిగాయి. నాన్ మొదల్వన్ పథకం కింద నైపుణ్య శిక్షణ పొంది ఉద్యోగాలు దక్కించుకున్న మహిళలకు నియామక ఉత్తర్వులను అందజేశారు. తమిళనాడు మహిళా అభివృద్ధి సంస్థ, అంబేడ్కర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పథకం, టాడ్కో, సీఎం అరైస్ పథకం, కలైంజర్ క్రాఫ్ట్ స్కీమ్ సహా వివిధ పథకాల కింద మహిళలు వ్యాపారాలు ప్రారంభించడానికి రుణాలను ఈసందర్భంగా పంపిణీ చేశారు. వివిధ విభాగాలు, సంస్థలు, మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆయన సందర్శించారు. ఈ మహిళా సదస్సులో రాష్ట్ర ప్రణాళిక కమిటీ, రాష్ట్ర మహిళలు కమిషన్, పరిశ్రమ ప్రతినిధులు, పౌర సమాజ సంస్థలు విధాన చర్చలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, కార్యాలయ భద్రత, నిర్వహణ సేవలకు సంబంధించి చర్చలు, ముఖ్యంగా మహిళా వ్యవసాయ రంగం నుండి, అనధికారిక, అధికారిక ఉపాధి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమావేశంలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రులు అన్బరసన్, గీతాజీవన్, ఎం. సుబ్రమణియన్, సీఎం మురుగానందం, ఎంపీ తమిళచ్చి తంగ పాండియన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా చైన్నెలో గిండిలోని కింగ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్లో రూ. 417 కోట్ల అంచనా వ్యయంతో పిల్లల కోసం హై–స్పెషాలిటీ ఆసుపత్రి, పరిశోధనా కేంద్ర భవనానికి సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. అలాగే ఆస్పత్రి నమూనాను ఆవిష్కరించారు. అలాగే గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి మొదటి అడుగుగా ధర్మపురి, పెరంబలూరు, తిరువణ్ణామలై , అరియలూర్ జిల్లాలలో 30,209 మంది పాఠశాల విద్యార్థినులకు హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టీకాలు వేసే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. తమిళనాడు క్యాన్సర్ నివారణ, సంరక్షణ ఉద్యమం కార్యాచరణ ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సంతకం చేశారు. మహిళలకు సీఎం స్టాలిన్ పిలుపు పురుషులతో సమానంగా.. మహిళా సదస్సులో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, సీ్త్రలు పురుషులతో సమానంగా ముందడుగు వేయాలని, అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలలో సైతం రాణించాల్సిన అవశ్యం ఉందన్నారు ఉన్నత పదవుల్లో సీ్త్రలు పురుషులతో సమానంగా ఎదగాలని ఆకాంక్షించారు. అందుకే ప్రపంచ బ్యాంక్ ద్వారా రూ.1,185 కోట్లు తాజాగా తమిళనాడు మహిళా ఉపాధి, భద్రత ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టామన్నారు. ఈ సదస్సు ద్వారా సృజనాత్మక ఆలోచనలు , ప్రణాళికలు లక్ష్యాలను నెరవేర్చే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సమాజానికి సీ్త్రలే వెన్నెముక అని పేర్కొంటూ, గతంలో దివంగత నేతలు పెరియర్, అన్నా, కలైంజ్ఞర్ కరుణానిధిలు మహిళా సంక్షేమం, హక్కుల కోసం చేసిన కృషిని గుర్తు చేశారు. మహిళల సామాజిక స్థితి, జీవనోపాధికి ప్రభుత్వం తాజాగా అందిస్తున్న పథకాలను వివరించారు. ప్రస్తుతం మహిళా పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దే దిశగా కార్యాచరణను వేగవంతం చేశామన్నారు. మహిళల నేతృత్వంలో స్టార్టప్ల వైపుగా విస్తృత చర్యలు చేపట్టామని వివరించారు. గర్భాశయ వ్యాధులను అరికట్టే విధంగా బాలికలకు టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. రొమ్ము క్యాన్సర్ సహా, వివిధ క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు వీలుగా 38 మొబైల్ అంబులెన్స్ ద్వారా వెల్నెస్ ఆన్ వీల్స్ పేరుతో పరిశోధనలు విస్తృతం చేశామన్నారు. రానున్న రోజులలో మహిళలకు ఉద్యోగ పరంగా మరింత విస్తృత ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రత్యేక ప్రణాళిక సన్నద్ధం అవుతోందని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, మహిళ నేతృత్వంలో ‘ది వరల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ‘ అనే అంతర్జాతీయ సమావేశానికి కూడా చర్యలు తీసుకున్నామన్నారు. తమిళనాడు ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసమే పని చేస్తున్నదని పేర్కొంటూ ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి పాఠశాలు, కళాశాలల వరకు, ఉద్యోగిగా, గృహిణిగా మహిళలు అన్ని రంగాలలో రాణించడమే కాదు, వారి సంరక్షణ లక్ష్యంగా టీఎన్డబ్ల్యూఈ సేఫ్ పథకాన్ని రూపొందించామని వివరించారు. -
జల్లికట్టు క్రీడాకారులకు రూ. 10 లక్షలు
సాక్షి, చైన్నె : జల్లికట్టు క్రీడలో ఎద్దుల దాడిలోమరణించే క్రీడా కారుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళణి స్వామి ప్రకటించారు. నామక్కల్లో మంగళవారం జల్లికట్టు సాహస క్రీడ ఉత్కంఠగా జరిగింది. తమిళుల వీరత్వాన్ని చాటే సాహస క్రీడ సంక్రాంతి సందర్భంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. కొద్ది రోజుల పాటుగా వివిధ ఉత్సవాలలో జల్లికట్టు హోరెత్తించడం జరుగుతుంది. ఆదిశగా నామక్కల్ చల్లపాళయంలో జరిగిన జల్లి కట్టు పోటీలను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జల్లికట్టు పూర్వీకులు అందించిన నైపుణ్యాల విద్య అని వ్యాఖ్యలు చేశారు. మన ఎద్దులను పరిరక్షించుకునే తంత్రంగా పేర్కొన్నారు. జల్లికట్టు క్రీడాకారులు తనకు అనేక సమస్యలు విన్నవించారని ప్రస్తావించారు. అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే ఆ సమస్యలన్నీ పరిష్కరించ బడుతాయని వివరించారు. అలాగే ఎద్దుల దాడిలో మరణించే క్రీడాకారుడి కుటుంబానికి రూ. 10 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. అలాగే జల్లికట్టు క్రీడాకారులు, ఎద్దులకు ప్రభుత్వమే బీమా చేయిస్తుందన్నారు. కాగా, ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఐదు వాగ్దానాలను పళణిస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జల్లికట్టు క్రీడాకారుల కోసం వాగ్దానం ప్రకటించడం విశేషం. -
పెరంబలూర్: పోలీసుల కాల్పుల్లో రౌడీషీటర్ మృతి
తిరుచ్చి: పెరంబలూరు జిల్లా తిరుమందరై అటవీ ప్రాంతం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో రౌడీ షీటర్ను పోలీస్ ఇన్స్పెక్టర్ కాల్చి చంపారు. విచారణ తీసుకెళ్తుండగా తప్పించుకునేందుకు యత్నించాడు. ఎస్ఐపై దాడి చేసి.. పోలీసు వాహనంపై నాటు బాంబు విసిరి పారిపోవడానికి ప్రయత్నించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తిని మదురైలోని మేల అనుప్పనడికి చెందిన రౌడీ షీటర్ సి. కొట్టు రాజా(అళగురాజా)గా గుర్తించారు. ఇతనిపై మదురై, తూత్తుకుడి జిల్లాల్లో హత్య, హత్యాయత్నంతో సహా ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి.అళగురాజా.. నాటు బాంబును పోలీసు వాహనంపై విసిరి, వేటకొడవలితో ఎస్ఐ శంకర్పై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇన్స్పెక్టర్ నందకుమార్ కాల్పులు జరపగా.. తూటా అళగురాజా తలకు తగిలింది. దీంతో రౌడీషీటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఎస్ఐ శంకర్ను చికిత్స నిమిత్తం పెరంబలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. -
కేవీబీ, ఐఓబీలలో..
కరూర్లోని కేంద్ర కార్యాలయంలో దేశ భక్తిని చాటే విధంగా జరిగిన వేడుకలకు కరూర్ వైశ్యా బ్యాంక్(కేవీబీ) ఎండీ బి రమేష్ బాబు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. కేవీబీ ఉద్యోగులు, వారి కుటుంబంతో కలిసి వేడుకలలో భాగస్వామ్యమయ్యారు. జాతీయ ఐక్యతకు తమ బ్యాంక్ అంకిత భావాన్ని గుర్తు చేశారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)నేతృత్వంలో చైన్నెలోని ప్రధాన కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ బ్యాంక్ ఎండీ అజయ్కుమార్ శ్రీవాస్తవ జాతీయ జెండాను ఎగుర వేశారు. జాతీయ సమైఖ్యతను చాటే విధంగా సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ధనరాజ్, చీఫ్ విలిజెన్స్ ఆఫీసర్ రాజీవ్కుమార్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్లు ఈ కార్యక్రమానికి హజరయ్యారు. ఇండియన్ ఆయిల్ భవన్లో జరిగిన వేడుకలలో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అన్నాదురై, ఎం సుధాకర్లు హాజరై జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. బాబు జగజ్జీవన్రామ్ స్టేడియంలో చైన్నె ఫోర్ట్ ఛైర్మన్ విశ్వనాథన్ నేతృత్వంలో వేడుకలు జరిగాయి. -
ప్రయణికులకు మెరుగైన సేవ
దక్షిణ రైల్వే నేతృత్వంలో పెరంబూరులోని రైల్వే స్టేడియంలో ఆర్పీఎఫ్ ఐజీ, ప్రధాన సెక్యూరిటీ కమిషనర్ కె. అరుల్ జ్యోతి సమక్షంలో జాతీయ జెండాను దక్షిణ రైల్వే జీఎం ఆర్ఎన్ సింగ్ ఎగుర వేశారు.రైల్వేబోర్డుమాజీ సభ్యుడు నవీన్ గులాటి, దక్షిణ రైల్వే అదనపు జీఎం విపిన్ కుమార్, చైన్నె డీఆర్ఎం శైలేంద్ర సింగ్,దక్షిణ రైల్వే మహిళా ప్రధాన కార్యాలయ సంస్థ అధ్యక్షురాలు సోనియా సింగ్, ఉపాధ్యక్షురాలు చారు గుప్తా , ఇతర రైల్వే అధికారులు హాజరయ్యారు. రైల్వేలో తమ సేవలు, శ్రామిక శక్తి, ప్రయాణికులకు మెరుగైన సేవలు, జోన్ పనితీరు గురించి ఈసందర్భంగా ఆర్ఎన్ సింగ్ వివరించారు. ఎగ్మూర్లోని రైల్వే నిర్మాణ సంస్థ చీప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సుశీల్కుమార్ మౌర్య, డీఆర్ఎం శైలేంద్ర సింగ్, లోకో వర్క్ మేనేజర్ డి నీలకంఠన్లు రైల్వే కార్యాలయాలలో జెండా ఆవిష్కరించారు. చైన్నెలోని రైల్వే క్లైయిమ్స్ ట్రిబ్యునల్ అదనపు రిజిస్టార్ జయంతి, రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ ప్రతిభా దేవేంద్రన్ యాదవ్లు వారివారి కార్యాలయాలలో జెండా ఎగుర వేశారు. జాతీయ సమైక్యతను చాటే విధంగా బెలూన్లను ఎగుర వేశారు. -
త్రివర్ణశోభితం!
ఎగ్మోర్లో రైల్వే స్టేషన్లో నిర్వహణ పనులు తిరువొత్తియూరు: ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో మరమ్మతు పనులు కారణంగా, ఎక్స్ప్రెస్ రైళ్ల సేవల్లో అధికారులు మార్పులు చేశారు. ఈ మేరకు 3 రైళ్లు చైన్నె బీచ్ రైల్వే స్టేషన్ నుండి నడుస్తాయి. వీటిలో చైన్నె బీచ్– ముంభై సీఎస్ఎమ్డీ ఎక్స్ప్రెస్ రైలు ఫిబ్రవరి 4 నుండి ఏప్రిల్ 4 వరకు, చైన్నె బీచ్– హైదరాబాద్ చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ఫిబ్రవరి 4 నుండి ఏప్రిల్ 5 వరకు, హైదరాబాద్ –చైన్నె బీచ్ ఎక్స్ప్రెస్ రైలు ఫిబ్రవరి 3 నుండి ఏప్రిల్ 4 వరకు బీచ్ రైల్వే స్టేషన్కు చేరుతుందని ఓ ప్రకటనలో సోమవారం వెల్లడించారు. డీఎండీకే, పీటీ పార్టీలతో మంతనాలు సాక్షి, చైన్నె : కూటమి విషయంగా లోక్ సభన్ విందు సమయంలో డీఎండీకే, పుదియ తమిళగం నేతలతో బీజేపీ, అన్నాడీఎంకే నేతలు తీవ్ర మంతనాలలో మునగడం చర్చకు దారి తీసింది. ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే, కృష్ణస్వామి నేతృత్వంలోని పుదియ తమిళగంలు ఇంత వరకు కూటమి విషయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో గవర్నర్ ఆర్ఎన్ రవి విందు ఏర్పాటు చేశారు. ఇందుకు డీఎండీకే తరపున సుదీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్నాగేంద్రన్ పదిహేను నిమిషాల పాటూ సుదీష్తో చర్చల్లో మునగడం గమనార్హం. ఈ ఇద్దరు విందు కార్యక్రమం జరిగిన ప్రదేశానికి కాస్త దూరంలో తీవ్రంగా చర్చించుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. అలాగే కృష్ణ స్వామితో అన్నాడీఎంకే నేతలు మంతనాలలో జరపడం గమనార్హం. ఘనంగా కలైమామణి నాగిరెడ్డి అవార్డుల వేడుక సాక్షి, చైన్నె: పాటర్సన్ క్యాన్సర్ సెంటర్ (పీసీసీ) – క్యాన్సర్ అల్లేవియేషన్ ఫౌండేషన్ నేతృత్వంలో కలైమామణి డాక్టర్ బి. నాగిరెడ్డి మెమోరియల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వేడుకను ఘనంగా నిర్వహించారు. చైన్నె వడపళణిలోని విజయ హెల్త్ సెంటర్ ప్రాంగణంలోని పాటర్సన్ క్యాన్సర్ సెంటర్లో జరిగిన వేడుకలో కథాడి ఎస్ రామమూర్తి (నటుడు, దర్శకుడు, రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్), డాక్టర్ వి. సుకుమార్ ఎంఎస్. (ఆర్థోపెడిషియన్), ఎస్బీఎస్. రామన్ (థియేటర్ డైరెక్టర్), డాక్టర్ సుధా శేషయ్యన్ (సాహిత్యం, ఆధ్యాత్మికత), ఎస్డి విజయ్ మిల్టన్ (సినిమాటోగ్రాఫర్, ఫిల్మ్ డైరెక్టర్)లకు ప్యాటర్సన్ క్యాన్సర్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. విజయరాఘవన్, డాక్టర్ ఆదర్శ్ రాఘవన్లు అవార్డులను అందజేసిన సత్కరించారు. వారి విజయాలు ,వారు ఎంచుకున్న రంగంలో వారి అద్భుతమైన సేవలను ప్రస్తావించి నగదు పురస్కారం అందజేశారు. అవార్డు గ్రహీతలందరూ తమ ప్రసంగాలలో డాక్టర్ బి నాగి రెడ్డి సమాజానికి చేసిన కృషి, చలనచిత్ర పరిశ్రమలో , ఆరోగ్య రంగంలో అందించిన సేవలను గుర్తు చేశారు. వాడీవేడిగా గ్రామసభలు తిరువళ్లూరు: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ గ్రామసభలను నిర్వహించారు. పూండి యూనియన్ తిరుప్పాచ్చూర్లో జరిగిన గ్రామసభలో కలెక్టర్ ప్రతాప్, డీఆర్వో సురేష్, ప్రాజెక్టు డైరెక్టర్ జయుమార్తోపాటు పలువురు పాల్గొన్నారు. అత్తివాక్కంలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గ్రామసభను బహిస్కరించిన నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. అత్తివాక్కంలో శ్మశాన వాటిక ఏర్పాటు, వీధిధీపాలు ఏర్పాటు, రోడ్డు వసతి కల్పించాలని కోరుతూ సభను బహిస్కరించి నిరసన చేపట్టారు. అలాగే వెంగత్తూరులో రోజూవారీగా చెత్తకుప్పలను సేకరించడం లేదని, వీధిధీపాలు సైతం వెలగడంతో లేదని ఆరోపిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు శాంతించకపోవడంతో అర్ధాంతరంగా సభను ముగించి వెళ్లిపోయారు. కాగా చాలా గ్రామాల్లోనూ తూతూ మంత్రంగా గ్రామసభలు నిర్వహించడం విమర్శలకు దారితీసింది. సాక్షి, చైన్నె: దేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో వాడవాడలా ఉదయం జాతీయ పతావిష్కరణ ఘనంగా సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో, రాజకీయ పార్టీల కార్యాలయాలలో వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరణతో పిల్లలకు మిఠాయిలు, చాక్లెట్లు, స్వీట్లు పంచి పెట్టారు. ఆయా విద్యాసంస్థల్లో జరిగిన వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో కలెక్టర్లు జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మెరీనా తీరంలో.. చైన్నె మెరీనా తీరంలో రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో శ్రామిక విగ్రహం వద్ద బ్రహ్మాండ ఏర్పాట్లతో వేడుకలు నిర్వహించారు. ఉదయాన్నే జనం త్రివర్ణ పతకాలను చేతబట్టి మెరీనా తీరం మార్గంలో రోడ్డుకు ఇరువైపుగా నిలబడి దేశభక్తి భావం మిన్నంటే విధంగా నినదించారు. చిరు జల్లులతో వర్షం పడుతున్నా, దేశ భక్తి విషయంలో తగ్గేది లేదన్నట్టుగా జనం కదిలారు. తొలుత సీఎం ఎంకే స్టాలిన్ శ్రామిక విగ్రహం వద్దకు చేరుకున్నారు. దారి పొడవున వేచి ఉన్న ప్రజలకు అభివాదం తెలియజేశారు. రాజ్భవన్ నుంచి గవర్నర్ ఆర్ఎన్రవి శ్రామిక విగ్రహం వద్దకు రాగానే ఆయనకు సీఎం స్టాలిన్ ఆహ్వానం పలికారు. పుష్పగుచ్ఛం అందజేశారు. త్రివిధ దళాలకు చెందిన అధికారులను ఈ సందర్భంగా ీసీఎస్ మురుగానందం గవర్నర్ రవికి పరిచయం చేశారు. అనంతరం జాతీయ పతాకాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి ఎగుర వేశారు. ఈ సమయంలో భారత కోస్ట్గార్డ్ హెలికాప్టర్ ఆకాశం నుంచి పుష్పపు జల్లులు కురిపించింది. మెరీనా తీరంలో గుమికూడిన ప్రతి ఒక్కరు జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. మారుమోగిన తమిళం జాతీయ పతాక ఆవిష్కరణతో త్రివిధ దళాల కవాతు, సీఆర్పీఎఫ్, మహిళా కమాండో బలగాలు, సీఐఎస్ఎఫ్, ఆర్పీఎఫ్, తమిళనాడు ప్రత్యేక పోలీసు విభాగం, పోలీసు విభాగం, రిజర్వ్ పోలీసు, కోస్టల్ సెక్యూరిటీ గ్రూపు, కోస్ట్గార్డ్ విన్యాసాలు, అశ్వదళాల మార్చ్ ఫాస్ట్లు జరిగాయి. వీరి నుంచి గౌరవ వందనాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి స్వీకరించారు. తర్వాత తమిళనాడు చరిత్రను, సంస్కృతి సంప్రదాయాన్ని, భాషాభిమానాన్ని, తమిళ నినాదాన్ని చాటే విధంగా విద్యార్ధినుల సాంస్కృతిక ప్రదర్శనలు హోరెత్తాయి. తమిళం వర్దిల్లాలి అన్న గీతాలే కాదు, తమిళం గొప్పతనాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటే విధంగా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరిగాయి. అలాగే గ్రామీణ కళల్ని, దేశభక్తిని చాటి చెప్పే రీతిలో, వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబంబించే విధంగా ఆయా రాష్ట్రాల విద్యార్థినుల ప్రదర్శనలు అలరించాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా కర్ణాటక, రాజస్థాన్, అరుణాచల్ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల నృత్య ప్రదర్శనలు మరింత ఆకట్టుకున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని చాటే రీతిలో వివిధ విభాగాలు శకటాలు అబ్బుర పరిచాయి. ఇందులో క్రీడల శాఖ ఘనతను చాటే ప్రదర్శన మరింత ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో పాటూ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఐఓబీలో జెండాకు అధికారుల వందనం పెరంబూరులో అష్రయా ప్రత్యేక బడిలో ప్రత్యేక ప్రతిభావంతులకు చేయూతను అందించే విధంగా గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. దక్షిణ రైల్వే మహిళాసంక్షేమం ప్రధాన కార్యాలయం సంస్థ అధ్యక్షురాలు సోనియా సింగ్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఇక్కడి ప్రత్యేక విద్యార్థులతో కలిసి నిర్వాహకులు ఆనందాన్ని పంచుకున్నారు. – సాక్షి, చైన్నె తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ గోగర్భం డ్యాం వద్ద ఉన్న ఆక్టోపస్ బిల్డింగ్ వద్దకు చేరుకుతుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 35,131 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.69 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. శ్రీవారి దర్శనానికి 20 గంటలు విశిష్ట పతకాల ప్రదానం విశిష్ట సేవా పురస్కారాలు, అన్నా, గాంధి పతకాలు, బిరుదులు, ప్రత్యేక అవార్డుల ప్రదానోత్సవం సీఎం స్టాలిన్ చేతల మీదుగా జరిగింది. అన్నా పతకంను అగ్నిమాపక శాఖకు చెందిన వి. శంకర్, పి. సురేష్, ఎస్ రమేష్కుమార్లకు ప్రదానం చేశారు. తామర భరణి నదిలో కొట్టుకెళ్తున్న ఇద్దరు పిల్లలను రక్షించి ప్రాణ త్యాగం చేసిన పీటర్ జాన్సన్ తరపున ఆయన సతీమణి జెస్సీ అన్నా పతకం అందుకున్నారు. కోట్టై అమీర్ మత సామరస్య బిరుదును తిరుప్పూర్కు చెందిన ఎం కలీముల్లాకు ప్రదానం చేశారు. అత్యాధునిక పద్దతులను ఉపయోగించి అధిక శాతం వరి దిగుబడి సాఽధించినందుకు గాను వ్యవసాయ శాఖ నేతృత్వంలో తంజావూరుకు చెందిన జి. వీరమణికి సీ నారాయణ స్వామి నాయుడు అవార్డు , రూ. ఐదు లక్షల నగదును అందజేశారు. మహాత్మా గాంధి పతకాలను విల్లుపురం జోన్కు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు పి నటరాజన్, విల్లుపురం జిల్లాఅరో వెళ్లి పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం. సత్యా నందన్, కళ్లకురిచ్చి జిల్లా చిన్న సేలం పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణిగండన్, కడలూరు జిల్లా పుదూర్ పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కె నటరాజన్,సేలం జిల్లా సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ విపీ కన్నన్కు ప్రదానం చేశారు.ఇక, ఉత్తమ పోలీసు స్టేషన్ గా మదురై నగరం ఇన్స్పెక్టర్ పి భూమినాథన్ తొలి బహుమతి, తిరుప్పూర్నగరం ఇన్స్పెక్టర్ కె ప్రేమ రెండవ, కోయంబత్తూరు ఇన్స్పెక్టర్ పి.చిన్న కమనన్ మూడో బహుమతి అందుకున్నారు. గణతంత్ర వేడుకల అనంతరం సీఎం స్టాలిన్ ఎక్స్ పేజిలో ట్వీట్ చేశారు. వైవిధ్య భరితమైన భారత దేశాన్ని , సమైఖ్య భారత దేశానికి ప్రతీకగా అందరం కలిసి గెలుద్దాం..అంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా గవర్నర్ లోక్భవన్లో ఇచ్చిన విందును డీఎంకె కూటమి పార్టీలు బహిష్కరించాయి. కాగా కేంద్ర ప్రాంతం పుదుచ్చేరి సముద్రతీరంలో బ్రహ్మాండంగా జరిగిన వేడుకలలో గవర్నర్ కై లాసనాథన్, సీఎం రంగస్వామి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు సోమవారం మిన్నంటాయి. తివ్రర్ణ శోభితంగా వాడ వాడలా జాతీయ జెండా రెపరెప లాండింది. చైన్నె మెరీనా తీరంలో రిపబ్లిక్ డే సంబరాలు కోలాహలంగా సాగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఎగుర వేశారు. విశిష్ట సేవలు అందించిన వారికి సీఎం ఎంకే స్టాలిన్ పతకాలను ప్రదానం చేశారు. -
రజనీకాంత్ చిత్రంలో సాయిపల్లవి?
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ హీరోగా నటించనున్న నూతన చిత్రంలో నటి సాయిపల్లవి నటించనున్నారా? ఈ ప్రశ్నకు అలాంటి అవకాశం ఉందనే బదులే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ –2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి కమలహాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో నటుడు రజనీకాంత్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సీబీ చక్రవర్తి తెరకెక్కించనున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందించే ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వవెళ్లనుందని సమాచారం. కాగా ఇందులో నటించే ఇతర తారాగణం గురించిన వివరాలు ఇంకా వెలువడకున్నా, ముఖ్య పాత్రలో నటి సాయిపల్లవిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మధ నటుడు కమలహాసన్ నిర్మించిన అమరన్ చిత్రంలో సాయిపల్లవి కథానాయకిగా నటించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈమె హిందీలో ఏక్ ధిన్, రామాయణ 1,2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళంలో రజనీకాంత్ హీరోగా నటించనున్న ఆయన 173వ చిత్రంలో సాయిపల్లవి నటించనున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. కాగా నటుడెవరైనా, దర్శకుడెవరైనా తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటి సాయిపల్లవి నటించడానికి అంగీకరిస్తారన్నది తెలిసిందే. దీంతో ఈమె రజనీకాంత్ చిత్రంలో నటించడానికి సై అంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాగా ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రంలో నటి శృతీహాసన్ ముఖ్య పాత్రలో నటించడం గమనార్హం. నటి సాయిపల్లవి -
మువ్వన్నెల జెండా రెపరెపలు
కొరుక్కుపేట : చైన్నెనగరంలోని తెలుగు సంఘాలు, తెలుగు పాఠశాల, కళాశాలల్లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని కోలాహలంగా జరుపుకున్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచిపెట్టారు. చైన్నె పెరియామేట్లోని మహర్షి విద్యా మందిర్ ఘనంగా నిర్వహించారు. సీనియర్ సెకండరీ పాఠశాలలో కరస్పాండెంట్ టీవీ రామకుమార్, సీవీ సుబ్బారావు, ట్రస్టీలు దేసు లక్ష్మీనారాయణ, సీఆర్ కిషోర్బాబు, ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం, వైస్ ప్రిన్సిపల్ కవిత, మేనేజర్లు శ్రీలత, వి.శివకుమార్ పాల్గొన్నారు. స్థానిక వేపేరే హైరోడ్లో ఉన్న మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చి ప్రాంగణంలో సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎస్.రాజేంద్రప్రసాద్ జాతీయజెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ప్రొటెం చైర్మన్ ఏ.భాస్కర్, రికార్డింగ్ సెక్రటరీ శేషం రమేష్ల పర్యవేక్షణలో యవ్వనస్తుల రిట్రీట్ నిర్వహించారు. పాటల పోటీలకు విజేతలను బహుమతులు ప్రదానం చేశారు. చైన్నె జార్జి టౌన్ గిడ్డంగి వీధిలో ఉన్న ఇండియా వైశ్య అసోసియేషన్ ప్రాంగణంలో సంఘ అధ్యక్షుడు అజంతా డాక్టర్ శంకరరావు, కె.శ్రావణ్కుమార్, కె.నవీన్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. చైన్నెలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం అండ్ చారిటీస్ నిర్వహణలో ఉన్న కేటీసీటీ , ఎస్కేపీడీ డ ప్రాథమిక , మహోన్నత పాఠశాలలు, ఎస్కేపీసీ మహిళా కళాశాలలో ఘనంగా జరుపుకున్నారు. వైవిఎస్ గ్రూప్ కంపెనీల అధినేత ౖవైవి హరికృష్ణ పాల్గొని ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. అలాగే విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కేసరి మహోన్నత పాఠశాల మైలాపూర్లో విద్యార్థులు, పూర్వవిద్యార్థులు పాలక కమిటీ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ఐఐటీ ప్రొఫెసర్ డా.సారఽథ జాతీయజెండా ఆవిష్కరించారు. చైన్నె మైలాపూర్ అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు అమరజీవి స్మారక భవనంలో ఘనంగా జరిగాయి. కె.ఆనంద్ కుమార్ రెడ్డి, ఏ వెంకట్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కమిటీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి, సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య, జె.ఎం.నాయుడు పాల్గొన్నారు. పాల్గొన్నారు. అలాగే.. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగుల గోపాలయ్య అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రవాస భారతీయులు, అమెరికాలో సుప్రసిద్ధ వైద్యులు డాక్టర్ వేముల పల్లి రాఘవేంద్ర చౌదరి పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విద్యార్థులకు స్వీట్లు పంచి పెట్టారు. తెలుగుపై మక్కువ చూపుతున్న విద్యార్థులకు తనవంతుగా నగదు బహుమతులను డాక్టర్ వేములపల్లి రాఘవేంద్ర చౌదరి చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాతృభాషపై మక్కువతో అనేకమంది ప్రముఖులు పాఠశాల కార్యదర్శి కేఎస్వీ ప్రసాద్, కెన్సెస్ గ్రూప్ అధినేత కె.నరసారెడ్డి, జె.వెంకట రమణ, శైలేంద్ర కుమార్లు పాల్గొని వేడుకను జయప్రదం చేశారు. సేలంలో: సేలం మహాత్మాగాంధీ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఆర్.రవికుమార్ జాతీయ జెండాను ఎగురవేసి నివాళులర్పించి స్వాతంత్య్ర సమరయోధులకు, దివ్యాంగులకు సహాయకాలను అందించారు. తిరువత్తియూరు: చైన్నె కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జీకే వాసన్ జెండా ఎగురవేశారు. తిరువళ్లూరులో: కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతాప్ జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేశారు. పోలీసుల నుంచి ఎస్పీ వివేకానందశుక్లాతో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వాహణలో ఉత్తమ సేవలు అందించిన 900 మంది ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. అనంతరం ఆదిద్రావిడ, మైనారిటీ సంక్షేమశాఖ, తాడ్కో ఆద్వర్యంలో సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. ఆవడిలోనీ కామరాజర్ నగర్లో వున్న శ్రీ వెంకటేశ్వర తెలుగు మాధ్యమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తెలుగు వికాస సమితి ఆధ్వర్యంలో, గుమ్మిడిపూండి సిప్కాట్ సిగ్మా ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. పళ్లిపట్టులో: పొదటూరుపేట టౌన్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో చైర్మన్ రవిచంద్రన్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. పళ్లిపట్టు టౌన్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో చైర్పర్సన్ మణిమేగళై జాతీయ జెండా ఎగురవేశారు. బీడీఓ కార్యాలయంలో బీడీఓ అర్పుదరాజ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. వెళిగరం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన జాతీయ వేడుకల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.. వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో.. వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వేలూరు కోట మైదానంలో కలెక్టర్ సుబ్బలక్ష్మి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం జిల్లాలోని వివిధ శాఖల్లో విశిష్ట సేవలు అందజేసిన పోలీసులు, వివిధ శాఖల అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం సంక్షేమ పథకాలను అందజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి మాలతి, ఎస్పీ మదివాణన్ పాల్గొన్నారు. తిరువణ్ణామలై జిల్లాలో:. తిరువణ్ణామలైలోని క్రీడా మైదానంలో కలెక్టర్ భాస్కరపాండియన్ జాతీయ జెండాను ఎగరవేసి లబ్దిదారులకు సంక్షేమ పథకాలను అందజేశారు. ఎస్పీ కార్తికేయన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అదేవిధంగా తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలోనూ కలెక్టర్లు జాతీయ జెండాను ఎగరవేశారు. -
రాజకీయ సుడిగుండంలో రామన్న
సాక్షి, చైన్నె: రాజకీయాలలో సీనియర్గా ఉన్న రాందాసు తాజాగా సుడిగుండలో చిక్కుకున్నట్టుగా పరిస్థితి మారింది. తనయుడు రూపంలో ఎదురైన సమస్యతో ఆయన ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటారా? అన్న చర్చ ఊపందుకుంది. పీఎంకే వ్యవస్థాపకుడిగా రాందాసు రాజకీయ చాతుర్యం గురించి తెలిసిందే. వన్నియర్ సామాజిక వర్గం అంతా ఆయన కనుసన్నల్లోనే ఉండేది. కాలక్రమేనా ఆయన కూటములను మార్చడంతో ఆ సామాజిక వర్గం దూరం అవుతూ వస్తున్నది. తాజా ఎన్నికల ద్వారా తమ బలాన్ని మళ్లీ చాటుకోవాలన్న వ్యూహంతో ఉన్న రాందాసుకు తనయుడు అన్బుమణి రూపంలో పెద్ద సమస్య వచ్చి పడింది. రాందాసును పక్కన పెట్టి పార్టీని ఆయన తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. పార్టీకి తానే అధ్యక్షుడ్ని అని ప్రకటించుకోవడమే కాకుండా అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలోకి పీఎంకేను చేర్చేశారు. అయితే తాజాగా రాందాసు శిబిరంగా , అన్బుమని శిబిరంగా పీఎంకే రాజకీయాలు సాగుతూ వస్తున్నాయి. ఈసమయంలో రాందాసు పరిస్థితి ఎటు వెళ్లాలో అంతు చిక్కనట్టుగా మారింది. ఇందుకు కారణం డీఎంకేతో కలిసి వెళ్లే ప్రయత్నం చేసినా, అక్కడ వీసీకే ఉండటం చిక్కుల్లో పడేసినట్టైంది. వీసీకేను డీఎంకే దూరం చేసుకునే అవకాశాలు ఉండబోవు. ఒక వేళ డీఎంకేలో చేరడానికి ప్రయత్నాలు చేసినా, వీసీకే రూపంలో వ్యతిరేకత వస్తుందేమో అన్న కలవరం తప్పడం లేదు. అలాగే, ఆశించిన సీట్లు దక్కవేమో అన్న బెంగ తప్పన్నట్టు సమాచారం. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేతులు కలిపే యోచనలో సైతం ఉన్నట్టు సమాచారం. రాజకీయ అనుభవాలను విజయ్కు పంచే దిశగా టీవీకేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సంబంధించి పార్టీ వర్గాలతో రాందాసు మంతనాలలో మునిగి ఉండడం గమనార్హం. రాజకీయ సుడిగుండలో చిక్కుకున్న రాందాసు, ఒకటి రెండు రోజులలో కూటమి విషయంగా నిర్ణయం తీసుకోవచ్చు అని, లేదా, ఎన్నికలకు దూరంగా ఉన్నా... ఉండవచ్చు అన్న భావనలో ఉన్నట్టుగా ఆయన మద్దతు నేతలు పెదవి విప్పుతున్నారు. రాందాసు -
మీరే అసలైన సైన్యం..!
సాక్షి, చైన్నె: డీఎంకేకు మహిళా కేడర్ కీలక సైన్యంగా మారిందని, అందరూ శ్రమిద్దాం ...గెలుద్దాం ..ద్రావిడ మోడల్ 2.ఓను అధికారంలోకి తీసుకొద్దాం అని సీఎం స్టాలిన్ పిలుపు నిచ్చారు. డీఎంకే మహిళా విభాగం నేతృత్వంలో తంజావూరు వేదికగా డెల్టా జిల్లాలను ఏకం చేస్తూ మహిళలు వర్ధిల్లాలి నినాదంతో బ్రహ్మాండ మహానాడు సోమవారం జరిగింది. ఇందులో పెద్దఎత్తున మహిళా లోకం తరలి వచ్చారు. డీఎంకే పార్టీ జెండావర్ణంతో కూడిన వస్త్రాలను ధరించి మహిళలు తమ మద్దతును తెలియజేశారు. ఇందులో డీఎంకే యువజన ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ, తమిళనాడులోకి చొరబడాలని పాసిస్టులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటూ, ఇక్కడ మహిళా సైన్యం రక్షణగా ఉన్నంత కాలం డీఎంకేను గానీ, ఈ రాష్ట్రాన్ని గానీ ఎవ్వరూ తాక లేరని హెచ్చరించారు. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి మాట్లాడుతూ, డబుల్ ఇంజిన్ అంటున్నారని పీఎం మోదీ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, కాలం చెల్లిన ఈ ఇంజన్లు, డీఎంకే అనే ఇంజన్ ముందు తట్టుకోలేవని హెచ్చరించారు. డబుల్ కాదు.. డబ్బా ఇంజిన్ సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, మణీపూర్ ఘటనలను గుర్తు చేస్తూ, బీజేపీ పాలిత రాష్ట్రాలపై విరుచుకు పడ్డారు. మణీపూర్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులకే భద్రత కల్పించ లేని వాళ్లు తమిళనాడులో శాంతి భద్రతలు క్షీణించాయని వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ద్వారానే దేశంలోని మాదక ద్రవ్యాల చొరబడుతున్నట్టుగా మీడియాల్లో కథనాలు వస్తుంటే, చొరబాటును కట్టడి చేయలేని వాళ్లంతా తమిళనాడు మత్తులో మునిగి ఉందని వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాత కూటమికి కొత్త రంగులు వేసుకుని ప్రగల్భాలను మోదీ పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. తమరిది డబుల్ కాదు...డబ్బా ఇంజిన్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ కూటమిలో ఉన్న వాళ్లంతా ఈడీ, సీబీఐ, ఐటీ అంటూ అనేక కేసులు ఎదుర్కొంటూ బానిసలుగా మారిన వారే ఉన్నారని ధ్వజమెత్తారు. ఎంత మందితో వచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా, వ్యూహాలకు పదును పెట్టినా, ఇక్కడున్న మహిళాసైన్యం మద్దతుతో తిప్పికొట్టేందుకు తాను సిద్ధం అని సవాల్ చేశారు. ఇక్కడున్న మహిళా లోకం మరింతగా శ్రమించాలని, గెలుద్దామని, ద్రావిడ మోడల్ 2.ఓను అధికారంలోకి తీసుకొద్దామని పిలుపు నిచ్చారు. ముందుగా తంజావూరులో ఉదయం బ్రహ్మాండ కార్యక్రమం జరిగింది. ఇటీవల అన్నాడీఎంకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి డీఎంకేలో చేరిన వైద్యలింగం తన బలాన్ని చాటుకున్నారు. 10 వేల మంది స్టాలిన్ సమక్షంలో వైద్యలింగం మద్దతు దారులు డీఎంకేలో చేరారు. -
ఎల్కే అక్షయ్కుమార్ కొత్త చిత్రం షురూ
తమిళసినిమా: సిరై చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయ్యి తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని అందుకున్న వర్గమాన నటుడు ఎల్కే. అక్షయ్కుమార్. కాగా తాజాగా ఈయన ఫాజిల్ జోసఫ్తో కలిసి నటిస్తున్న చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ఎస్.లలిత్కుమార్ నిర్మిస్తున్నారు. జాన్విజయ్, సత్యన్, జాఫర్ సాధిక్, నోబల్. కే.జేమ్స్, అరుణాచలేశ్వరన్ .పీఏ, సాధిక్ హాసన్, నటి ఐశ్వర్య శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విఘ్నేశ్ వడివేల్ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా వైవిధ్యభరిత కథాంఽశంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో ఈ చిత్రాన్ని తమిళం, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా చిత్రానికి రావడి అనే టైటిల్ను నిర్ణయించినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా రావడి చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రానికి లియోన్ బ్రిట్టో ఛాయాగ్రహణం, జన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రావడి చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ -
రాష్ట్ర కమిటీ జాబితాపై కసరత్తు
సాక్షి, చైన్నె: టీఎన్సీసీలో రాష్ట్ర కమిటీ జాబితా కసరత్తు వేగవంతం చేశారు. వారం రోజులలో 150 మందితో రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు టీఎన్సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సెల్వ పెరుంతొగై లోక్సభ ఎన్నికలకు ముందుగా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తదుపరి పార్టీ బలోపేతం దిశగా విస్తృతంగా చర్యలు చేపట్టారు. అలాగే జిల్లాల కార్యవర్గాలను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా ఏఐసీసీపై ఒత్తిడి తెచ్చి సఫలీకృతులయ్యారు. ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగి జిల్లాల అధ్యక్షులను ఎంపిక చేసింది. ఆ మేరకు గత వారం 71 జిల్లాలకు అధ్యక్షులు నియమించారు. ఇందులో ఆరేడుగురు తప్పా, మిగిలిన వారంతా కొత్త వారే, ఈసారి మహిళకు సైతం అధ్యక్ష పదవి అప్పగించారు. ఈ పరిస్థితులలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు అంటూ ఇతర కమిటీలకు ప్రతినిధిల ఎంపిక కసరత్తు వేగవంతం చేశారు. రెండు లేదా మూడు రోజులలో ఈ జాబితాను ఢిల్లీకి పంపించే దిశగా టీఎన్సీసీ వర్గాలు కసరత్తులు చేపట్టారు. ఈసారి 150 మందితో రాష్ట్ర స్థాయి కమిటీ పదవులు భర్తీ చేయబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే జిల్లా కమిటీలలోని ఇతర పదవుల భర్తీ జాబితాను సిద్దం చేసి ఉన్నారు. ఈ రెండు జాబితాలను ఏఐసీసీ ఆమోదంతో వారం రోజులలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు టీఎన్సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పదవులు కీలకం కావడంతో కీలక పదవుల కోసం టీఎన్సీసీలో జాతీయ స్థాయిలో పైరవీలు మొదలైనట్టుగా చర్చ ఊపందుకుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గిరీశ్ చోదన్కర్ నేతృత్వంలోని కమిటీని ప్రసన్నం చేసుకుని పదవులను దక్కించుకునేందుకు నేతలు కుస్తీ మొదలెట్టి ఉండడం గమనార్హం. -
లైట్ హాటెడ్ కథా చిత్రాలు చేయడం రాదు
తమిళసినిమా: మానగరం చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన లోకేశ్ కనకరాజ్ ఆ తరువాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. ఇవన్నీ భారీ యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రాలే అన్నది గమనార్హం. కాగా ఈయన ఇటీవల రజనీకాంత్ హీరోగా చేసిన కూలీ చిత్రం అంచనాలను అందుకోలేకపోయిందనే విమర్శలను ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఈయన డ్రగ్స్ నేపధ్యంలోనే చిత్రాలు చేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇక రజనీకాంత్, కమలహాసన్ కలిసి నటించే చిత్రం, హిందీలో అమీర్ఖాన్ హీరోగా చేయాల్సిన చిత్రం వెనక్కి పోయాయనే ప్రచారం జరిగింది. అదే విధంగా కార్తీ హీరోగా తెరకెక్కించనున్న చిత్రానికి సుమారు రూ. 70 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా వీటన్నింటికీ సోమవారం చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు లోకేశ్ కనకరాజ్ బదులిచ్చారు. ముందుగా రజనీకాంత్ హీరోగా చేసిన కూలీ చిత్రం మంచి లాభాలను తెచ్చిపెట్టిందని నిర్మాతల వర్గం చెప్పారన్నారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడానికి హైప్ ప్రచారమే కారణం అన్నారు. అయితే తాము అలాంటి ప్రచారం చేయకపోతే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనదని, అలాంటప్పుడు తాము ఇక్కడ నిలబడలేమని అన్నారు. రజనీకాంత్, కమలహాసన్ కలిసి నటించే చిత్రం నుంచి తానే వైదొలిగినట్లు చెప్పారు. వారి కోసం ఒక యాక్షన్ ఎంటర్ టెయినర్ కథను సిద్ధం చేసినట్లు, దాన్ని వారిద్దరికీ విడివిడిగా చెప్పినట్లు పేర్కొన్నారు. ఇద్దరికీ కథ నచ్చిందని అయితే రజనీకాంత్, కమలహాసన్ ప్రస్తుతం యాక్షన్ కథా చిత్రాలే చేస్తుండడంతో మంచి లైట్ హార్టెడ్ కథ కావాలని వారు చెప్పారన్నారు. కానీ తనకు లైట్ హార్టెడ్ కథతో చిత్రం చేయడం రాదని, అందుకే ఆ చిత్రం నుంచి బయటకు వచ్చానని చెప్పారు. ఇకపోతే డ్రగ్స్ నేపధ్యంలోనే చిత్రాలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారని, తన చిత్రాల్లో డ్రగ్స్ సన్నివేశాలు చోటు చేసుకుంటున్నా, అందులో అంతిమంగా డ్రగ్స్ వాడటం మంచిది కాదనే చెబుతున్నానని చెప్పారు. కాగా తాను చేయాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయన్నారు. ఖైదీ– 2, విక్రమ్– 2, అమీర్ఖాన్ హీరోగా చిత్రం ఉన్నాయని చెప్పారు. అమీర్ఖాన్తో చేసే చిత్రం ఆగిపోలేదని చెప్పారు. కాగా తాజాగా టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా చిత్రం చేయనున్నట్లు చెప్పారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందని తెలిపారు. ఆ తరువాత కార్తీ హీరోగా ఖైదీ– 2 చిత్రం ఉంటుందని దర్శకుడు లోకేశ్ కనకరాజ్ క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం ఈయన డీసీ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. -
తిరువళ్లూరులో ఆగిన డబుల్ డెక్కర్ రైలుకు స్వాగతం
తిరువళ్లూరు: ఏళ్ల తరబడి పోరాటం చేసిన తిరువళ్లూరు రైలు ప్రయాణికులకు కోరిక మేరకు తిరువళ్లూరు రైల్వేస్టేషన్లో చైన్నె–బెంగుళూరు( డబుల్ డెక్కర్ ) రైలు ఆగిన క్రమంలో బీజేపీ నేతలు పూలు చల్లి స్వాగతం పలికారు. వివరాలు.. జిల్లా కేంద్రమైన తిరువళ్లూరు నుంచి బెంగుళూరుకు నిత్యం వేలాది మంది ప్రయాణికులు రైలు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. గతంలో తిరువళ్లూరు నుంచి బెంగుళూరు, హోసూరు, కాట్పాడి, జోలార్పేట తదితర ప్రాంతాలకు డబుల్ డెక్కర్ రైలు ద్వారా వెళ్లే ప్రయాణికులు అరక్కోణం, చైన్నెకు వెళ్లి రాకపోకలు సాగించేవారు. ఈ క్రమంలో రైలు ప్రయాణికులు డబుల్ డెక్కర్ రైలు తిరువళ్లూరులో ఆగి వెళ్లేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఇప్పటికే పలుమార్లు వినతి పత్రం అందజేయడంతో పాటూ పోరాటాలను చేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల పోరాటాన్ని గుర్తించిన రైల్వేశాఖ డబుల్ డెక్కర్ రైలు తిరువళ్లూరులో జనవరి 26 నుంచి ఆగి వెళ్లేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం తిరువళ్లూరులో డబుల్ డెక్కర్ రైలు మొదటి సారి ఆగి వెళ్లడంతో బీజేపీ జిల్లా కార్యదర్శి, సంప్రదింపుల కమిటీ సభ్యుడైన పన్నీర్సెల్వం ఆధ్వర్యంలో పూవ్వులు చల్లి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అశ్విన్కుమార్, ఓబిసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ్కుమార్, జిల్లా ఉపాధ్యాక్షుడు బాలాజీ, ఆర్థిక విభాగం జిల్లా అధ్యక్షుడు సతీష్, నేతలు రవికుమార్, ఉమామహేశ్వరి, చిత్రదేవి, రాకేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవంతంగా క్రీడోత్సవం
సాక్షి, చైన్నె : ముక్తి – ఎంఎస్ దాదా ఫౌండేషన్ నేతృత్వవంలో మీనంబాక్కంలోని ఏఎం జైన్ కళాశాల మైదానంలో జరిగిన క్రీడోత్సవాలు ఘనంగా ముగిశాయి. శారీరక సవాళ్లు ఎదుర్కొంటున్న వారిలోని స్ఫూని, అసాధారన సామర్థ్యాలను వెలికి తీసే విధంగా ఇక్కడ పోటీలు జరిగాయి. ఐఎఫ్ఎస్ అధికారి, వన్య ప్రాణుల నేర నియంత్ర బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ తేన్ మొళి, మోహన్ గోయోంకా ఫౌండేషన్ ట్రస్టీ మోహన్, అర్జున అవార్డు గ్రహీత, పారా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అరున్ మొళి అరుణ గిరి, ఎంఎస్ దాదా ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ మీనా దాదాతో పాటుగా వివిధ రంగాల ప్రతినిధులు, ట్రస్టీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులు, పిల్లలందరికి సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. -
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం.. ఆదుకోండి!
సాక్షి, చైన్నె : తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాం... పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితి...ఆదుకోండి.. అని పద్మశ్రీ అవార్డుకు ఎంపికై న చిత్రకారుడు కృష్ణన్ కుటుంబం కన్నీటిపర్యంతమవుతోంది. ఆదివాసి కళాకారుడిగా ఆర్ కృష్ణన్కు పద్మశ్రీ దక్కిన నేపథ్యంలో ఆయన కుటుంబం కడు పేదరికంలో కొట్టు మిట్టాడుతుండటంతో వెలుగులోకి వచ్చింది. రిపబ్లిక్ డే వేడుకలలో భాగంగా ఆదివారం కేంద్రం పద్మా అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఇద్దరికి పద్మ భూషన్, పది మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇందులో తాజాగా ఆర్ కృష్ణన్ కుటుంబం వార్తలోకి చేరింది. కృష్ణన్ ఈ భూమి మీద లేరు. జీవించి ఉన్నప్పుడే పద్మశ్రీ ఇచ్చి ఉంటే తమ తలరాతలు వేరే విధంగా ఉండి ఉంటాయి... ఏమో అని కృష్ణన్(53) అలియాస్ కిట్నా సతీమని సుశీల ఆవేదన వ్యక్తం చేశారు. చదివింది ఆరో తరగతి.. నీలగిరిజిల్లా కోతగిరి తాలుకా వనప్పకుడి కొంబై గిరిజన గ్రామానికి చెందిన కృష్ణన్ అలియాస్ కిట్నా చదువుకుంది ఆరో తరగతి వరకే . అయితే, చిత్రకారుడిగా తనలోని ప్రతిభతో అందరి దృష్టిలో పడ్డారు. 30 సంవత్సరాలుగా కాన్వాస్, ఫాబ్రిక్ పెయిటింగ్స్ ద్వారా కురుంబర్ల కళా ప్రతిభను చాటుతూ వచ్చారు. తన చిత్రాలను చిత్రీకరించేందుకు ఆకులు, గడ్డి, పేడ, మట్టి , ఇతర మూలికలతో తయారు చేసిన సహజ రంగులను మాత్రమే ఉపయోంచే వాడు. ఆయనకు భార్య సుశీల, ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కృష్ణన్ జీవించి ఉన్నంత వరకు కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోషించారు. అయితే గత ఏడాది మార్చిలో కృష్ణన్ కన్నుమూశారు. దీంతో ఆకుటుంబం ఆర్థిక కష్టాలలో మునిగింది. తమను ఎవరూ పట్టించుకోక పోవడంతో కొంబై గ్రామాన్ని వీడి కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం సమీపంలోని కల్లార్ ప్రాంతంలోని ఉన్న ఓ తోటలో సుశీల కూలి పనులకు వెళ్తూ తన పిల్లలను పోషిస్తూ వచ్చారు. తాజాగా కృష్ణన్కు పద్మశ్రీ అవార్డు దక్కిందన్న సమాచారంతో మీడియా వారిని వద్దకు చేరుకోగా కడు పేదరికంలో పడుతున్న పాట్లు వెలుగులోకి వచ్చాయి.జీవించి ఉన్నప్పుడు ఇచ్చి ఉంటే : భార్య సుశీల కృష్ణన్కు పద్మశ్రీ దక్కడం ఆదివాసి సంఘాలలో ఆనందాన్ని నింపాయి. అతడి కుటుంబంలో సైతం ఆనందం వెల్లి విరిసింది. అయితే, తన భర్త జీవించి ఉన్నప్పుడు ఈ అవార్డు ఇచ్చి ఉంటే, తమ తలరాతలు వేరే విధంగా ఉంటాయి ఏమో....మరింత ఆనందం కలిగి ఉండేదేమో అని ఉద్వేగానికి సుశీల లోనయ్యారు. తన పిల్లలకు ఫీజులు కూడా చెల్లించ లేని పరిస్థితులలో జీవనం సాగిస్తున్నామన్నారు. పెద్ద కుమార్తె వాసుకి కళాశాల చదువును మానేసి తనతో పనులకు వస్తున్నట్టు పేర్కొన్నారు. కుమారుడు రాహుల్ 9వ తరగతి, మరో ఇద్దరు కుమార్తెలు గీత ఏడో తరగతి, కీర్తన 4వ తరగతి చదువుతున్నారని వివరించారు. ప్రభుత్వం స్పందించాలని, సాయం అందించాలని, తన పిల్లల చదువుకు బాట వేయాలని ఆమె విన్నవించారు. -
క్లుప్తంగా
గోనె సంచిలో యువకుడి మృతదేహం గుర్తింపు అన్నానగర్: చైన్నెలోని అడైయార్ ఇందిరా నగర్లోని ద్విచక్ర వాహన విక్రయ కేంద్రం సమోపంలో సోమవారం ఉదయం రోడ్డు పక్కన ఒక గోనె సంచి పడి ఉంది. దాని నుండి రక్తం ప్రవహించడం చూసి షాక్ అయిన బాటసారులు అడైయార్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి గోనె సంచెను తెరిచి చూసి ఓ యువకుడిని నరికి చంపినట్లు గుర్తించారు. తర్వాత ఆ ప్రాంతంలోని నిఘా కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలించగా, సోమవారం తెల్లవారుజామున 12.30గంటల ప్రాంతంలో మోటారు సైకిల్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ యువకుడి మృతదేహం ఉన్న గోనె సంచిని రోడ్డుపై విసిరేస్తున్నట్లు గుర్తించారు. వారు బెసెంట్ నగర్, సిద్ధిర్ నగర్ ప్రాంతాల నండి వచ్చినట్లు వెల్లడైంది. అసిస్టెంట్ కమిషనర్ మురుగేశన్, ఇనెస్పెక్టర్ ఇలంగాని మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ నంబర్, వారి చిత్రాలను ఉపయోగించి అనుమానితులను గుర్తించడానికి యత్నిస్తున్నారు. అడైయార్ పరిసర ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రానికి చెందిన యువకులు ఎవరైనా అదృశ్యమయ్యారా అనే దానిపై కూడా వారు సమాచారాన్ని సేకరిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల భద్రతలో పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్న స్థితిలో ఓ యువకుడిని దారుణంగా చంపి, అతని మృతదేహాన్ని గోనే సంచిలో మోసుకెళ్లి రద్దీగా ఉండే రోడ్డుపై విసిరేసిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. అమ్మవారి పురాతన విగ్రహం లభ్యం తిరువొత్తియూరు: ఉత్తరమేరూర్ సమీపంలో ఉన్న నెయ్యాడుపాక్కం సయ్యా నదిలో లభ్యం అయిన అమ్మవారి విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఉత్తరమేరూర్ సమీపంలో ఉన్న నెయ్యాడుపాక్కం ఇళయనార్వేలూర్ మధ్య సెయ్యారు నది ప్రవహిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ నదిని దాటి వాలాజాబాద్, కాంచీపురం, ఉత్తరమేరూర్ వంటి ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఈ ప్రాంతంలో నదిపై వంతెన లేకపోవడంతో, వరదలు వచ్చినపప్పుడు సుమారు 10 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్తున్నారు. దీన్ని నివారించడానికి గత సంవత్సరం సెయ్యారు నదిపై హైలెవల్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిరంతరం జరుగుతున్న ఈ పనుల కోసం ఆదివారం నదిలో గుంతలు తవ్వారు. అప్పుడు నాలుగు అడుగుల ఎత్తు ఉన్న అమ్మవారి విగ్రహం ఒకటి దొరికింది. తర్వాత దొరికిన అమ్మవారి విగ్రహాన్ని నెయ్యాడుపాక్కం గ్రామ ప్రజలు అలంకరించి పూజించారు. ఈ విషయం తెలుసుకున్న ఉత్తరమేరూర్ తాహసీల్దార్ నటరాజన్ నేతృత్వంలోని రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి వచ్చి గ్రామ ప్రజలు నుండి దొరికిన అమ్మవారి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో దొరికిన అమ్మవారి విగ్రహం ఏ కాలానికి చెందింది అనే దానిపై రెవెన్యూ అధికారులు పరిశోధన చేస్తున్నారు. 33 పంచాయతీల్లో గ్రామసభలు పళ్ళిపట్టు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొడివలసలో నిర్వహించిన గ్రామసభలో ఆదాయం. ఖర్చు వివరాల పట్టికను ప్రవేశపెట్టి గ్రామీణులు వివరాలు తెలుసుకున్నారు. వివరాలు.. పళ్లిపట్టు యూనియన్లోని 33 గ్రామ పంచాయతీల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామసభలు నిర్వహించారు. కొడివలస పంచాయతీలో నిర్వహించిన గ్రామసభ గ్రామ కార్యదర్శి హేమనాదన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డిప్యూటీ బీడీఓ రఘుపతి, డీఎంకే మండల కార్యదర్శి బీడి. చంద్రన్ సహా గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీలో ఆదాయం ఖర్చులకు సంబందించిన నివేదికను ప్రవేశపెట్టారు. గ్రామీణులు దాన్ని తనిఖీ చేశారు. అలాగే కలైంజర్ ఇళ్ల నిర్మాణ పథకం ద్వారా కొత్తంగా ఎంపిక చేసి లబ్ధిదారుల వివరాలకు సంబందించిన జాబితా గ్రామసభలో ప్రవేశపెట్టారు. వర్షాకాలంలో దోమలు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున పరిసర ప్రాంతాలు పరిశుభ్రతకు సంబంధించి అధికారులు అవగాహన కల్పించి తీర్మానం ఆమోదించారు. అమ్మవారిని దర్శించుకున్న నటి సన చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని సీనియర్ సినీ నటి సన సోమవారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు ఆలయ సూపరింటెండెంట్ రమేష్ స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
సెన్సార్ బోర్డు, కేంద్రప్రభుత్వం ఆలోచించాలి
ప్రామిస్ చిత్ర ఆడియోను ఆవిష్కరించిన దర్శకుడు పేరరసు, కె.రాజన్ తదితరులతో యూనిట్ సభ్యులు తమిళసినిమా: కోర్టు వరకూ వెళ్లినా జననాయకన్ చిత్ర విడుదల విషయంలో పరిష్కారం లేకపోవడం సబబు కాదని దర్శకుడు పేరరసు పేర్కొన్నారు. ప్రమాణం అనే అంశాన్ని ఇతి వృత్తంగా తీసుకుని ప్రామిస్ అనే చిత్రం రూపొందుతోంది. సంఘమిత్రన్ ప్రొడక్షన్స్, అమ్మన్ ఆర్ట్స్ క్రియేషన్స్ సంస్థలపై ఎన్.నాగరాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అరుణ్కుమార్ శేఖరన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు పేరరసు, నటుడు, నిర్మాత కే.రాజన్, గిల్డ్ అద్యక్షుడు జాగ్వర్తంగం తదితరులు పాల్గొన్నారు. మందుగా చిత్ర నిర్మాత ఎన్.నాగరాజ్ మాట్లాడుతూ ఈ చిత్ర కథను చెప్పిన దర్శకుడు దీన్ని మీరే నిర్మించాలి అని చెప్పారన్నారు. తనకు కథ న చ్చినా, వెంటనే ఒకే చెప్పకుండా, తన భార్యతో సంప్రదించానన్నారు. ఆమె చేద్దామని చెప్పడంతో 2024 ఆగస్ట్ 15వ తేదీన పూజా కార్యక్రమాలతో షూటింగ్ను పూర్తి ప్రారంభించినట్లు చెప్పారు. మంచి ప్రతిభ కలిగిన దర్శకుడు కావడంతో ప్రామిస్ చిత్రాన్ని జనరంజకంగా తెరపై ఆవిష్కరించారని చెప్పారు. చిత్ర దర్శకుడు అరుణ్కుమార్ శేఖరన్ మాట్లాడుతూ ఇది భారీ బడ్జెట్ చిత్రం కాదని, తమకు ఎలాంటి నేపధ్య బలం లేదని, అలాంటిది తమను ప్రోత్సహించడానికి దర్శకుడు పేరరసు, కె.రాజన్, జాగ్వర్ తంగం వంటి ప్రముఖులు రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ప్రామిస్ అంటే ఇంతకు ముందు విలువ ఉండేదన్నారు. ఇప్పుడు అది కొందరిలో కనిపించడం లేదన్నారు. అయినా మంచి కథతో ప్రామిస్ అనే టైటిల్తో నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం పాటలు, ట్రైలర్ చూస్తే అనిపిస్తోందన్నారు. ఇకపోతే జననాయకన్ చిత్రం కోర్టు వరకు వెళ్లినా విడుదలకు పరిష్కారం లభించకపోవడం బాధాకరం అన్నారు. సెన్సార్కు వచ్చిన చిత్రానికి అభ్యంతకరమైన సన్నివేశాలు ఉంటే కట్స్ ఇవ్వాలని, వాటిని నిర్మాతల వర్గం అంగీకరించకపోతే రివైజింగ్ కమిటీకి పంపాలన్నారు. అలాంటిది కట్స్కు నిర్మాతల వర్గం అంగీకరించినా, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం చేయడం సెన్సార్బోర్డు సభ్యులకు, కేంద్రప్రభుత్వానికి సబబు కాదన్నారు. ఇది విజయ్ చిత్రానికి మాత్రమే సంబంధించిన విషయం కాదని, అన్ని చిత్రాలకు వర్తిస్తుందని పేరరసు పేర్కొన్నారు. -
మన పద్మాలు
– ఇద్దరికి పద్మ భూషణ్ – 10 మందికి పద్మశ్రీ సాక్షి, చైన్నె : రాష్ట్రానికి ఈసారి పద్మశ్రీ అవార్డులు ఏకంగా పది మందికి దక్కాయి. మరో ఇద్దరికి పద్మ భూషన్ వరించింది. వివరాలు.. ఏటా గణతంత్ర వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన, అందిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం పద్మా అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మేరకు ఏటా రాష్ట్రానికి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల్లో ప్రాధాన్యత దక్కుతూ వస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా అవార్డుల జాబితాలో తమిళనాడు సినిఈ రంగానికి ప్రాధాన్యత దక్కుతూ వస్తున్నది. కానీ కోలీవుడ్కి చెందిన వారెవ్వరికీ ఈసారి పద్మా అవార్డులలో చోటు దక్కకపోవడం గమనార్హం. పద్మ భూషణ్కు ఎంపికై న వారు.. ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, వైద్య విద్యావేత్త పద్మశ్రీ డాక్టర్ కల్లి పట్టి రామస్వామి పళణి స్వామి( కేఆర్ రామస్వామి)ని పద్మ భూషన్ వరించింది. వైద్యరంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా మెడిసిన్ విభాగంలో పద్మ భూషన్ కేటాయించారు. అలాగే పారిశ్రామికవేత్తగా, దాతగా, సామాజిక కార్యకర్తగా ముందుకు సాగుతున్న ఈరోడ్కు చెందిన ఎస్కేఎం గ్రూప్ అధినేత పద్మశ్రీ ఎస్కేఎం మైలానందన్కు సైతం పద్మ భూషన్ను ప్రకటించారు. సామాజిక సేవ విభాగంలో ఆయన్ని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. పద్మశ్రీ దక్కించుకున్నవారు.. పద్మశ్రీ అవార్డులు ఈసారి ఏకంగా 10 మందికి అందజేశారు. ఆర్ట్ విభాగంలో గాయత్రి బాలసుబ్రమణియన్ – రజనీ బాల సుబ్రమణియన్ మెడిసన్లో హెచ్ వి హెన్డే, సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో కె.రామస్వామి, సివిల్ సర్వీస్లో కె.విజయకుమార్, ఆర్ట్ విభాగంలో ఓదువార్ తిరుత్తణి స్వామినాథన్ మెడిసన్లో డాక్టర్ పుణ్యమూర్తి నటేషన్, ఆర్ట్లో ఆర్.కృష్ణన్, ఆర్ట్లో రాజస్థపతి కల్లియప్ప గౌండర్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ శివశంకరి ,ఆర్ట్ కేటగిరిలో తిరువారూర్ భక్తవత్సలం, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వీలినాథన్ కామకోటిని పద్మశ్రీ వరించాయి. వీరిలో వీలినాథన్ కామ కోటి(వీ కామకోటి) ఐఐటీ మద్రాసు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఐఐటీ మద్రాసు ప్రగతిలో కామ కోటి కీలక పాత్ర పోషిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థ జాబితాలోఐఐటీని మొదటి స్థానంలో నిలబెట్టడంలో ఆయన కృషికి తాజాగా పద్మ శ్రీ దక్కడం విశేషం. తమిళ్ కడవుల్ మురుగన్కు ప్రసిద్ది చెందిన ఆరు పడై వీడులలో ఒకటి గా ఉన్న తిరుత్తణి సుబ్రమణ్య స్వామి ఆలయంలో 26 సంవత్సరాల పాటూ ఓదువార్గా ప్రత్యేక పూజా సమయాలలో ఆధ్యాత్మిక భక్తి పాటలను ఆలపించిన తిరుత్తణి స్వామినాథన్కు పద్మశ్రీ దక్కింది. వీఆర్ఎస్ తీసుకున్న తదుపరి ఆయన తాజాగా మైలాడుతురైలోని ధర్మపురం ఆధీనం మఠంలో యువతకు ఆధ్యాత్మిక భక్తి గీతాల శిక్షణలో నిమగ్నమై ఉన్నారు. -
క్లుప్తంగా
మృతిచెందిన సేలం విద్యార్థిని కుటుంబానికి సాయం – సీఎం స్టాలిన్ ప్రకటన తిరువొత్తియూరు: సేలం జిల్లా, తలవాసల్ సర్కిల్, సదాశివపురం గ్రామం, అరిజ్ఞర్ అన్నా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుతున్న కృష్ణగిరి జిల్లా, హోసూర్ రాయకోట్టైకి చెందిన దివ్యదర్శిని (17) తోటి విద్యార్థులతో ఫుట్బాల్ ఆడుతుండగా అనుకోకుండా స్పృహతప్పి పడి పోయి చికిత్స నిమిత్తం ఆత్తూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈనేపథ్యంలో సీఎం స్టాలిన్ ఆదివారం ఓ పకటనలో సీఎం పబ్లిక్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ.3 లక్షలు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రక్తస్రావ నిరోధక మందు నాణ్యత నిర్ధారణ పరీక్షపై పిటిషన్ కొరుక్కుపేట: గాయాలకు పూసే పెరాక్రిల్ జల్కు పూర్తిస్థాయి నాణ్యత నియంత్రణ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందించాలని మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాలు.. మహారాష్ట్రకు చెందిన కెమికల్ ఇంజినీర్ వినయ్ ఆనంద్ జీవేకర్ తరపున న్యాయవాది ఎం. హరిస్కుమార్ దాఖాలు చేసిన పిటిషన్లో పెరాక్రిల్ జెల్ అనేది మంటను నియంత్రించడానికి, గాయాలు త్వరగా మానడానికి ఉపయోగించే ఓ క్రిమినాశక మందు. దీనికి రక్తం గడ్డకట్టడాన్ని వేగవంతం చేసే ఇన్ఫెక్షన్ నివారించే లక్షణం ఉంది. దీనిని రాపిడి, కోతలు, కాలిన గాయాలు దంత శస్త్రచికిత్సలకు ఉపయోగిస్తారు. ఈ ఔషదాన్ని కఠినమైన నాణ్యత పరీక్షల తర్వాతే మార్కెట్ చేయాలి. కాబట్టి పూర్తి పరీక్ష తర్వాతే ఈ ఔషధానికి అనుమతి ఇవ్వాలని ఆయింట్మెంట్ను అమ్మకం నుండి ఉపసంహరించుకోవాలని తమిళనాడు ఆరోగ్యశాఖను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎం.శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుళ్ మురుగన్, తమిళనాడు ఆరోగ్య శాఖ, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్తో కూడిన ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. హత్య కేసులో నలుగురి అరెస్ట్ తిరువొత్తియూరు: కార్మికుడి హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. తిరుచ్చి జిల్లా పుత్తాదంతం సమీపంలోని కావల్కారన్పట్టికి చెందిన సుబ్రమణియన్ (51) కార్మికుడు. గత 19వ తేదీ రాత్రి ఇంటి ముందు నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురయ్యాడు. పుత్తానత్తం పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. పోలీసులు విచారణలో కావల్కారన్పట్టికి చెందిన బాలికను రాధాకృష్ణన్ (22) గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. విషయం తెలిసి శివసుబ్రమణియన్ అతని బంధువులు వెళ్లి ఆ బాలికను మందలించారు. దీనికి సంబంధించి వివాదం కొనసాగుతోంది. దీంతో రాధాకృష్ణన్ను పిలిచి విచారించగా, బాలికతో ప్రేమను వదులుకోవాలని శివసుబ్రమణియన్ ఒత్తిడి చేయడంతో కోపంతో అతన్ని హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. అలాగే శివసుబ్రమణియన్న్ను హత్య చేయడానికి రాధాకృష్ణన్ ప్రేయసి ప్రోత్సహించినట్లు, రాధాకృష్ణన్ తమ్ముడు చేరన్, కావల్కారన్పట్టికి చెందిన శివనేససెల్వన్ (19) రాధాకృష్ణన్ పారిపోవడానికి సాయం చేసినట్లు తెలిసింది. రాధాకృష్ణన్, బాలిక, చేరన్, శివనేససెల్వన్ నలుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇంట్లోకి దూసుకెళ్లిన టిప్పర్ – తప్పిన పెనుప్రమాదం పళ్లిపట్టు: ఇంట్లోకి టిప్పర్ దూసుకెళ్లిన ప్రమాదంలో అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పళ్లిపట్టు ప్రాంతంలోని క్వారీల నుంచి టిప్పర్లలో ఎం సాండ్, గ్రావెల్, చిప్స్ తరలిస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో పాటు రాత్రి సమయాల్లో వాహనాలు నడపడంతో నొచ్చిలి, కేజీ కండ్రిగ జిల్లా రహదారిలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.ఈ క్రమంలో ఆదివారం వేకువజామున పళ్లిపట్టు నుంచి తిరుత్తణి వెళుతున్న టిప్పర్ అదుపుతప్పి యూఆర్ఆర్ కండ్రిగ వద్ద రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీకొని పక్కనే వున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈఘటనలో మూడు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇంటి ముందు భాగం దెబ్బతింది. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్కేపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాసిమేడ్లో పెరిగిన చేపల ధర కొరుక్కుపేట: వర్షాలు కారణంగా చేపల సరఫరా గణనీయంగా తగ్గింది. ఫలితంగా సముద్ర ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. వివిధ రకాల చేపలు, రొయ్యలు, ఆంకోవీస్, పీతలు ధరలు సాధారణం కంటే రూ. 100 నుంచి రూ.200 వరకు ఎక్కువగా పలికారు. ఆదివారం ఉదయం నుండి చైన్నె దాని శివారు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చేపలు కొనడానికి కాసిమేడ్కి వచ్చే ప్రజలు, వ్యాపారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తగినంత ఉత్పత్తులు కూడా లేకపోవడంతో సెలవు దినం రోజున ఎక్కువ ధరకు అమ్ముడైనట్లు వ్యాపారుల తెలిపారు. -
ద్రౌపది–2ను దెబ్బ తీసిన మంగాత్తా
తమిళసినిమా: మంగాత్తా చిత్రం కారణంగా తమ ద్రౌపది–2 చిత్ర వసూళ్లకు బాధ పడ్డానని ఆ చిత్ర దర్శకుడు మోహన్కి ఆవేదనను వ్యక్తం చేశారు. అజిత్, అర్జున్, త్రిష ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మంగాత్తా. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత 2011 లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా ఈ చిత్రం ఈనెల 23న రీ రిలీజ్ అయ్యి మళ్లీ మంచి వసూళ్లను సాధిస్తోంది. కాగా ఇదే తేదీన విడుదలైన స్ట్రైట్ చిత్రం ద్రౌపది–2. చారిత్రిక కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి మోహన్.జి దర్శకత్వం వహించారు. రిచర్డ్ రిషి కథానాయకుడిగా నటించిన ఇందులో ద్రౌపదిగా రక్షణ నటించారు. నట్టి నటరాజ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం భారీ బడ్జెట్తో రూపొందింది. ఈచిత్రాన్ని ముందు జనవరి 30న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావించారు.అయితే జనవరి 9న విడుదల కావాల్సిన విజయ్ జననాయకన్ చిత్రం వాయిదా పడడంతో పలు చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. అదేవిధంగా విజయ్ నటించిన తెరి చిత్రాన్ని ఈనెల 23న రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత కలైపులి ఎస్.థాను ప్రకటించి ఆ తర్వాత ఆ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అదే తేదీన అజిత్ నటించిన మంగాత్తా చిత్రం రీ రిలీజ్కు సిద్ధమైంది. ఈచిత్రంతోపాటు ద్రౌపది–2 ఇతర చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. మంగాత్తా వసూళ్ల ముందు చిత్రాలు నిలవలేకపోతున్నాయి. ఇదే విషయాన్ని ద్రౌపది–2చిత్ర దర్శకుడు మోహన్జి ఒక వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ద్రౌపది–2 చిత్రాన్ని మంగాత్తాతో పాటు విడుదల చేయడం పొరపాటు అయిందని పేర్కొన్నారు. ఒక మంచి చారిత్రక కథా చిత్రాన్ని ప్రేక్షక్షుల్లోకి తీసుకెళ్లలేకపోయామని మోహన్ జి పేర్కొన్నారు. అదేవిధంగా కొందరు ద్రౌపది–2 చిత్రాన్ని వివాదాస్పద చిత్రంగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. -
స్టాలిన్కుమళ్లీ అధికారం కల్లే!
సాక్షి,చైన్నె : స్టాలిన్కు మళ్లీ అధికారం అన్నది కల్లే అని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యాఖ్యానించారు. డీఎంకేకు పతనం మొదలైందన్నారు. చూలైలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పళణిస్వామి మాట్లాడుతూ, 2021 ఎన్నికలలో మ్యానిఫెస్టోతో ప్రజల్ని ఆకర్షించిన స్టాలిన్ పాచికలు ఈ సారి పారబోవన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగ, కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందన్నారు. ప్రజలు సైతం ఈ పాలకుల తీరుపై గుర్రుగా ఉన్నారని, ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. 2026లో అన్నాడీఎంకే అధికారంలోకి రావడం తథ్యమన్నారు. స్టాలిన్ పేర్కొంటున్నట్టుగా ద్రావిడ మోడల్ 2.ఓ, మళ్లీ అధికారం అన్న మాటలన్నీ ఆయనకు కలగానే మిగలబోతున్నాయని ఎద్దేవా చేశారు. మళ్లీ అమిత్ షా పర్యటనసాక్షి, చైన్నె: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ రెండు రోజుల పర్యటనకు సన్నద్దమవుతున్నారు. ఇందులో భాగంగా బహిరంగ సభ కసరత్తులలో బీజేపీ వర్గాలు నిమగ్నమయ్యాయి. డీఎంకే గద్దె దించి తీరుతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శపథం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యూహాలకు పదును పెడుతున్నారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిన అమ్మ మక్కల్మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ను మళ్లీ కూటమిలోకి తీసుకు రావడంలో సఫలీకృతులయ్యారు. తాజాగా తమ కూటమిలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, టీటీవీ దినకరన్లు సమష్టిగా పనిచేసే దిశగా ఉరకలు తీస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో విస్తృత పర్యటనల దిశగా కేంద్ర మంత్రులను ఒకరి తర్వాత మరొకర్ని రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితులలో ఈనెల మొదటి వారంలో రెండు రోజుల పాటుగా పుదుకోట్టై, తిరుచ్చిలో అమిత్ షా పర్యటన జరిగింది. తాజాగా మళ్లీ ఆయన పర్యటనకు సన్నద్ధం అవుతున్నారు. శుక్రవారం ఉత్తర తమిళనాడులో బలాన్ని చాటే విధంగా చైన్నె శివారులోని మదురాంతకంలో ప్రధాని నరేంద్ర మోదీ సభసూపర్ సక్సెస్కావడంతో బీజేపీ వర్గాలు మంచి జోష్ మీదున్నాయి. అదేఊపుతో ఈ నెల 28, 29 లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అమిత్ షా పర్యటనకు సంబందించిన కసరత్తు మొదలెట్టారు. ఈసారి కొంగు మండలంలోని ధర్మపురి, సేలం ,నామక్కల్ పరిసరాలను గురి పెట్టి అమిత్ షా పర్యటనకు అవసరమైన ఏర్పాట్లకు కమలం నేతలు సిద్ధమయ్యారు.ఓమ్ని బస్సు ఢీకొని ముగ్గురు మృతి – 20 మందికి గాయాలు తిరువొత్తియూరు: మేలూరు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఓమ్ని బస్సును మరో బస్సుఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు..చైన్నె నుంచి నాగర్కోయిల్కు ఓ ప్రైవేట్ ఓమ్ని బస్సు శనివారం రాత్రి చైన్నె నుంచి బయలుదేరింది. బస్సులో 40 మందికి పైగా ప్రయోణికులు ఉన్నారు. మధురై జిల్లా మేలూరు దగ్గర కొట్టాంపట్టికి ఆనుకుని ఉన్న పళ్ళపట్టి ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు కాలకృత్యాల కోసం బస్సును రోడ్డు పక్కన నిలిపారు. ఆ సమయంలో చైన్నె నుంచి నాగర్కోయిల్కు వెళ్తున్నా మరో ప్రైవేట్ ఓమ్ని బస్సు, రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఓమ్ని బస్సు వెనుక భాగాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ క్రమంలో తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టికి చెందిన రంజితం(65), చెంగల్పట్టు జిల్లాకు చెందిన సుదర్శన్ (23) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. బస్సు డ్రైవర్ చైన్నెకి చెందిన గురుమూర్తి (28)తో పాటు రెండు బస్సుల్లో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈక్రమంలో కన్యాకుమారి జిల్లా మార్తాండంకు చెందిన మేరీ సుధ (45) ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో మరణించారు. ఈ ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం మధురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో వాహన రాకపపోకలకు అంతరాయం ఏర్పడింది. -
పైప్లైన్ లీకేజీతో తాగునీరు కలుషితం
పళ్లిపట్టు: జంగాళపల్లెలో పైపులైన్లు లీకేజీతో తాగునీరు పేరుకుపోవడంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. పళ్లిపట్టు యూనియన్లోని జంగాళపల్లె గ్రామంలో గ్రాంథాలయం, సహాయ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చౌక దుకాణం పరిసర ప్రాంతంలో పంచాయతీ ద్వారా 60 వేల లీటర్ల సామర్థ్యం వున్న ఓవర్హెడ్ వాటర్ ట్యాంకు ఉంది. ట్యాంకు నుంచి పైపు లైన్లు ద్వారా గ్రామీణులకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. రెండేళ్ల నుంచి ఓవర్హెడ్ వాటర్ ట్యాంకు పైపు లైన్ లీకేజీతో తాగునీరు వృథాగా ట్యాంకు కింద భాగంతో పాటూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద పేరుకుపోతోంది. ఈ క్రమంలో ఇటీవల అదే ప్రాంతంలోని మినీ ట్యాంకును అధికారులు కూల్చి వేశారు. ఈ సందర్భంగా పైపులైన్ ధ్వంసం కావడంతో తాగునీరు నిల్వ ఉంటోంది. రోజుల తరబడి తాగునీరు పేరుకుపోవడంతో అందులో దోమలు వ్యాపించి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో రోజూ చౌక దుకాణం, గ్రంధాలయం, ఆరోగ్యకేంద్రానికి వచ్చి వెళ్లే గ్రామీణులు అవస్థలు పడుతున్నారు. పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామంలో పారిశుధ్యం మెరుగుపరిచి తాగునీరు నిల్వ చేరకుండా పైపులైన్లు మార్చాలని స్థానికులు కోరారు. -
పిల్లలకు మారథాన్ పోటీలు
సేలం: నామక్కల్–తిరుచెంగోడ్లో చిన్న పిల్లల కోసం స్వల్ప దూర పరుగు పోటీ ఆదివారం జరిగింది, ఇందులో 200 మందికి పైగా పిల్లలు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి నామక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్ ప్రైవేట్ స్కూల్ తరఫున ఆదివారం చిన్న పిల్లలకు షార్ట్ రన్ పోటీ జరిగింది. తిరుచెంగోడ్ బాలుర హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ పరుగు పందెం 2 కిలోమీటర్ల దూరం నిర్వహించి మహాదేవ విద్యాలయం వద్ద ముగిసింది. తర్వాత కిండర్ గార్టెన్ పిల్లలకు వారి తల్లిదండ్రులతో కలిసి 400 మీటర్ల పరుగు పోటీని నిర్వహించారు. ఈ పోటీల్లో పిల్లలు ఉత్సాహంగా పరిగెత్తారు. విజేతలైన విద్యార్థులకు నగదు బహుమతులు, ట్రోఫీలు, పతకాలు సర్టిఫికెట్లు అందజేశారు. ప్రతి విభాగంలో మొదటి మూడు బహుమతులు ప్రదానం చేశారు. -
కవులకు మార్గదర్శకుడు పింగళి
కొరుక్కుపేట: తెలుగు సినిమా రచనలో సరికొత్త ఒరవడిని ప్రవేశపెట్టి, అనేకమంది కవులకు మార్గదర్శకుడైన విశిష్ట రచయిత పింగళి నాగేంద్రరావు అని ప్రముఖ రచయిత, గాయకులు డా. వివి రామారావు కొనియాడారు. వేద విజ్ఞాన వేదిక చైన్నె ఆధ్వర్యంలో తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధోరణిలో భాగంగా 169వ ప్రసంగ కార్యక్రమం ఆదివారం సాయంత్రం టీ.నగర్ ఆంధ్రా క్లబ్లోని కృష్ణా హాల్లో జరిగింది. పింగళి సినీ సాహిత్య సౌరభం అనే అంశంపై డాక్టర్ వివి రామారావు ప్రసంగం చేశారు. ఆంధ్రకవిత్వంలో నన్నయ, తిక్కన, ఎర్రనతో తెలుగు సినీ కవిత్రయంలో సముద్రాల, మల్లాది, పింగళిలను పోల్చవచ్చన్నారు. తెలుగు పాట ఎలా రాయాలో, ఎలా రాయకూడదో తెలిసిన విజ్ఞుడు పింగళి. శ్రీపాతాళభైరవి, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి చిత్రాల ద్వారా ఆయన కథా కల్పనలో, సంభాషనలలో, గీత సృజనలో నవ్యతను సాధించారు. ఆయన సృస్టించిన వింతైన పేర్లు (అరమతి కాలమతి, త్రిశోకానందుడు), మాటలు (సాహసం చేయ రా డింభక, అస్మదీయులు – తస్మదీయులు, హైహై నాయక) నేటికీ సజీవంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పింగళి రాసిన మధుర గీతాలను గుర్తు చేశారు. ‘కలవరమాయో మది లో’ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ‘మనసు పరిమళించెలే’ వంటి పాటలను ఆలపించి సభాసదులను అలరించారు. కార్యక్రమంలో వేద విజ్ఞాన వేదిక సంస్థఅధ్యక్షుడు జేకె రెడ్డి, కార్యదర్శి కందనూరు మధు తదితరులతో కలిసి వక్తను జ్ఞాపికతో సత్కరించారు. -
ఒకేసారి దర్శకులైన 34మంది
తమిళసినిమా: ప్రతిభను నిరూపించుకునే మాధ్యమం సినిమా. ఈ కలల ప్రపంచంలో తమ వినూత్న ఆలోచనలకు పదును పెట్టి సృజనాత్మక కథా చిత్రాలను తెరపై ఆవిష్కరించడానికి యువత ఉవ్విళ్లూరుతుంది. అందుకు శిక్షణ కేంద్రాలు ఎంతగానో దోహదపడుతాయి. అలాంటి వారి ఆలోచనలకు పదును పెట్టే విధంగా ప్రముఖ చాయాగ్రాహకుడు, దర్శకుడు, రచయిత అంటూ పలు ముఖాలు కలిగిన చెళియన్ సినిమా పరిశ్రమకు భావితరాలను అందించే విధంగా ది ఫిలిం స్కూల్ పేరుతో ఇన్స్టిట్యూట్ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ది ఫిలిం స్కూల్లో శిక్షణ పొందిన 34 మంది విద్యార్థులు ఒకేసారి 34 చిత్రాలను తెరకెక్కించడం విశేషం. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇటీవల చైన్నెలో నిర్వహించారు. ఇది కచ్చితంగా తమిళ చిత్ర పరిశ్రమలో చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. ఈ కార్యక్రమంలో ఎడిటర్ బి.లెనిన్, శ్రీకర్ ప్రసాద్, చాయాగ్రాహకుడు పీసీ.శ్రీరామ్, రవి వర్మన్, నిర్మాత జి ధనుంజయన్, దర్శకుడు ట్రాస్కీ మరుదు, జ్ఞాన రాజశేఖరన్, హరిహరన్ హాజరై చెళియన్ను అభినందించారు. చెళియన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ది ఫిలిం స్కూల్ ఇన్స్టిట్యూట్ ద్వారా దర్శకులుగా పరిచయం అవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. -
వైభవంగా కన్యకా పరమేశ్వరి గర్భగుడి నిర్మాణ పూజలు
కొరుక్కుపేట: టీకేకేఎన్ఎన్ వైశ్య ఛారిటీస్ 200వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని రూ.2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించాలని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆదివారం శ్రీకన్యకా పరమేశ్వరి గర్భగుడి నిర్మాణ పూజలను వైభవంగా నిర్వహించింది. 108 దివ్యదేశాల్లో ఒకటైన ట్రిప్లికేన్లో తెలుగువారి మూలాలున్న పార్థసారిథి స్వామి ఆలయ సమీపంలో సుంకువార్ వీధిలోవున్న అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ఈ నిధులతో ఆదివారం ఉదయం 9.50 నుంచి 11.40 గంటలలోపు శుభలగ్నంలో శంకుస్థాపనం, యంత్రస్థాపనం, నవరత్నాల స్థాపనం, పంచలోహ స్థాపనాలను సంప్రదాయబద్ధంగా వేదపండితులు నిర్వహించారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అద్దంకి నాగకుమార్, తెల్లాకుల నాగేంద్రన్, జె.వెంకటకృష్ణన్, అవ్వా అశోక కుమార్, ఎ.బాలాజీ, టెంపుల్ కమిటీ సభ్యులు అద్దంకి నాగసురేష్, డి.నరసింహన్, ఫైనాన్స్ కమిటీ టీజీ శ్రీనివాసన్, చేగు భక వత్సల గిరి, మాజీ అధ్యక్షులు పి.ఈశ్వరగుప్తా, వైశ్య ప్రముఖులు ఎంవీ నారాయణగుప్తా, మహేంద్రగుప్తా, మన్నారు ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. -
కోలాహలంగా ఆర్యవైశ్య మహిళా సభ కార్నివాల్
కొరుక్కుపేట: తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ –మద్రాస్ యూనిట్ 43వ వార్షిక కార్నివాల్ ఆదివారం స్థానిక ఆళ్వార్పేటలోని యతిరాజ హాలులో కోలాహలంగా జరిగింది. చైర్పర్సన్ సి.ప్రశాంతి సతీష్ వేడుకలను ప్రారంభించారు. కార్యదర్శి డి. భార్గవి అశోక్ వార్షిక నివేదికను చదివి వినిపించారు. చిన్నారులకు హరి అష్టకం, కృష్ణాష్టకం, చిత్రలేఖనం, సుందరకాండపై క్విజ్ తదితర పోటీలతో పాటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సీఎస్ఆర్ ప్రాజెక్టు కింద తమిళనాడు ఆర్య వైశ్య మహిళా సభ సంయుక్తంగా ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.50 లక్షల విలువగల పరికరాలు, అదేవిధంగా ఎగ్మూర్ ప్రభుత్వ చిల్డ్రెన్స్ ఆస్పత్రికి రూ.లక్ష 8వేల విలువతో ట్రాన్ఫరెంట్ వెంటిలేటర్ను విరాళంగా అందజేశారు. కాంచీపురం యురేఖ ఆస్పత్రులకు మూడు ల్యాప్ ట్యాప్లను, మహిళల స్వయం సహాయ ఉపాధి పథకం కింద 17 కుట్టుమిషీన్లు, నాలుగేళ్ల క్యాన్సర్ బాధిత చిన్నారికి వైద్య చికిత్సల కోసం రూ.30 వేలు వితరణ చేశారు. కార్నివాల్లో భాగంగా సంస్థకు చెందిన 15 మంది మహిళలు రెట్రో వాక్ పేరిట అలనాటి సినీ నటీమణులు సావిత్రి, కాంచన, వాణిశ్రీ, వైజయంతి మాల, వహిదారెహ్మాన్, బి. సరోజాదేవి, పద్మిని, రాగిని తదితర నటీమణుల వేషధారణలో వారి నటించిన సినిమాల్లోని పాటలకు హావాభావాలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. నగరంలోని పలు తెలుగు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అదేవిధంగా హౌస్ఏస్, క్విజ్ తదితర పోటీల్లో సత్తాచాటిన విజేతలకు ముఖ్య అతిథి గీతాంజలి బహుమతులు అందజేశారు. -
శింబుతో జోడీకి ఓకే అంటారా?
తమిళసినిమా: కోలివుడ్లో సంచలన కథానాయకుడిగా ముద్ర వేసుకున్న నటుడు శింబు. మంచి విజయాన్ని అందుకుని చాలాకాలమైంనే చెప్పాలి. ఇటీవల కమలహాసన్తో కలసి నటించిన థగ్స్ లైఫ్ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నిర్మాణంలో ఉంది. వి.క్రియేషన్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరసన్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇది ఉత్తర చైన్నె యూనివర్సల్లో సాగే ఒక కథతో రూపొందుతున్న చిత్రమని యూనిట్ వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి. కాగా మదురైకి చెందిన ఒక సాధారణ కబడ్డీ క్రీడాకారుడు అనూహ్య పరిస్థితుల్లో చైన్నెకి రావడం, ఆ తర్వాత అక్కడ ఒక డానుగా మారడం వంటి కథాంశంతో సాగే చిత్రం అరసన్ అని సమాచారం. దర్శకుడు వెట్రిమారన్, శింబు కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇది కావడం గమనార్హం. ఇందులో శింబు యువకుడిగా, మధ్య వయస్కుడిగాను రెండు గెటప్పుల్లో కనిపించనున్నారని తెలిసింది. ఇకపోతే ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రను విజయ్ సేతుపతి పోషించనున్నారు. దీంతో ఇది మల్టీ స్టారర్ చిత్రంగా మారుతోంది. తాజాగా ఈ చిత్రంలో శింబుకు జంటగా సమంతను కథానాయకిగా నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. సమంతతో నిర్మాతల వర్గం చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఇదే కనుక నిజమైతే శింబు, సమంత కలసి నటించే తొలి చిత్రం కూడా ఇదే అవుతుంది. ఇంతకుముందు విజయ్, సూర్య, విజయ్ సేతుపతి, వంటి స్టార్ హీరోల సరసన నటించిన సమంత తమిళంలో నటించి కూడా చాలాకాలమైంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తర్వాత షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం అవుతుందని సమాచారం. -
35 స్థానాలు కమ్మ వారికి కేటాయించాలి
తిరువళ్లూరు: రాష్ట్రంలో బలంగా వున్న 35 స్థానాల్లో అన్ని రాజకీయ పార్టీలు కమ్మ కులానికి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం కల్పించాలని కమ్మ గ్లోబర్ ఫెడరేషన్ అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ డిమాండ్ చేశారు కమ్మ సామాజిక వర్గాన్ని ఏకం చేసే విధంగా పిబ్రవరి 8న తిరువళ్లూరు జిల్లా వేపంబట్టులో భారీ బహిరంగ సభ, మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాంగానే సభ జరగనున్న ప్రాంతాన్ని నిర్వాహకులతో కలసి పరిశీలించారు. అనంతరం జెట్టి కుసుమకుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా కమ్మవారు వున్నారని, 35 స్థానాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు నిర్ణయాత్మక శక్తిగా వున్నట్టు వివరించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా వున్న స్తానాల్లో టికెట్లను కేటాయించాలని సూచించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకుంటే తాము రాజకీయ పార్టీనీ సైతం ప్రారంబిస్తామని ప్రకటించారు. మహానాడుకు పెద్ద ఎత్తున కమ్మసామాజికవర్గం నేతలు హాజరై తమ బలాన్నీ ఐక్యతను చాటి చెప్పాలని సూచించారు. సంఘం నిర్వాహకులు బజరంగ్ కళాశాల చైర్మన్ భాస్కరన్, శ్రీలక్ష్మీ హయగ్రీవ పరిశోధన, ఎడ్యుకేషనల్ ట్రస్టీ జయచంద్రన్, సభ్యులు సుబ్రమణ్యం, వీఎస్ రామన్, ధనపాల్, రామమూర్తి, గోవర్దన్నాయుడు పాల్గొన్నారు. -
సూర్య @50
తమిళసినిమా: జయాపజయాలు ఎవరి చేతిలోనూ ఉండవు. అయితే ఎవరైనా మంచి చిత్రాలు చేయాలనే ప్రయత్నిస్తుంటారు. అలా వైవిధ్య భరిత కథా చిత్రాలు చేయాలని తపించే హీరోలలో నటుడు సూర్య ఒకరు. ఈయన ఇటీవల నటించిన చిత్రాలన్నీ విభిన్న కథాంశంతో కూడినవే. అలా తాజాగా నటిస్తున్న చిత్రం కరుప్పు. త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ జే.బాలాజీ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. ఇది సూర్య నటిస్తున్న 46వ చిత్రం. కాగా తన 47వ చిత్రాన్ని మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. తర్వాత సూర్య తన 48వ చిత్రాన్ని పాండిరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐద విధంగా సుధా కొంగర దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇదిలా ఉంటే సూర్య తన 50 వ చిత్రాన్ని సంచలన దర్శకుడు మారిసెల్వరాజ్ దర్శకత్వంలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఈ ప్రచారం నిజం అయితే ఇది సూర్య నటించే 50వ చిత్రం అవుతుంది. దీన్ని వి.క్రియేషన్న్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మించనున్నట్లు సమాచారం. కాగా వరుసగా విజయవంతమైన చిత్రాలను అందిస్తున్న దర్శకుడు మారి సెల్వరాజ్ ఇటీవల బైసన్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈయన సూర్య హీరోగా చేసే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీనికి మరింత సమయం పడుతుంది. -
కొలువుదీరిన వామ్
సాక్షి, చైన్నె: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల వామ్ బజార్ చైన్నెలో కొలువు దీరింది. ప్రత్యేక రాయితీలతో బంగారు, వెండి, రాగి, ఆభరణాలు, నాణేలు, వివిధ డిజైన్ వస్త్రాలు, వస్తువులతో కొలువైన ఈ బజార్ను ఆదివారం వామ్ గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ ప్రారంభించారు. రిపబ్లిక్ డే సెలవుల సందర్భంగా వ్యా పార రంగంలో రాణిస్తున్న ఆర్యవైశ్య వ్యాపారులందరితో చిరు వర్తకులతో పరిచయాలు కల్పించే ఉద్దేశంతో ఈ వామ్ బజార్ను చూళై మేడులోని వామ్ కార్యాలయంలో ఏర్పాటు చేశామని ఈసందర్భంగా తంగుటూరి రామకృష్ణ తెలిపారు.ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు నిర్వహిస్తున్న ఈ బజార్లో 40 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఒకగ్రాము నుండి 12 గ్రాముల వరకు 22 క్యారెట్ల గోల్డ్ ఆర్టికల్స్, సిల్వర్ ఐటమ్స్, 100 గ్రాముల సిల్వర్ మెటల్స్లు ప్రదర్శనలో ఉంచామన్నారు. రెడీమెడ్, చేనేత వస్త్రాలు, ప్యాషన్ దుస్తులు, ఆటబొమ్మలు, ఆర్టిఫిషయల్ జూవెలరీ, ఆంధ్రా పచ్చళ్లు, ఫుడ్ అండ్ ఫన్ కోర్టులు, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితర వాటిని కూడా ఇక్కడ కొలువు దీర్చామన్నారు. వ్యాపార సంస్థల సహకారంతో తమ కార్యాలయ ప్రాంగణంలో 3వ సంవత్సరం ఏర్పాటు చేసిన ఈ ప్రయత్నంకు మంచి స్పందన వచ్చిందన్నారు. ఆది, సోమవారాలు ప్రతిగంటకూ లక్కీడిప్ తీసి సందర్శకులను ఎంపిక చేసి బహుమతులు అందిస్తున్నామన్నారు. ఇకపై ప్రతినెలా ఆదివారం వామ్ బజార్ ఏర్పాటు చేసి అదనంగా కూరగాయలు, పండ్లు, ఆర్గానిక్ వస్తువులను అందించనున్నామన్నారు. టీయారా జూవెలర్స్ సహకారంతో తమ కార్యాలయంలో సంవత్సరమంతా 100 గ్రాము సిల్వర్ గొలుసుల హోల్సేల్ ధరలకు లభించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే సదరన్ ట్రావెల్స్ తరపున బహుమతులు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వామ్ గ్లోబల్ అడ్వైజర్ తాడేపల్లి రాజశేఖర్, సీనియర్ సిటీజన్స్ ఫోరమ్ చైర్మన్ వూరా బాబురావు, డాక్టర్ ఎంవీ నారాయణగుప్తా, యూత్ ఫోరమ్ కో–ఆర్డినేటర్ కేకే త్రినాథ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
విమాన సేవలకు పెరగనున్న డిమాండ్ సాక్షి, చైన్నె: భారత్ – యూఏఈ మధ్య విమాన ప్రయాణ సేవల డిమాండ్ పెరుగనున్నట్టు టూరిజం ఎకనామిక్స్ కన్సల్టింగ్ డైరెక్టర్ మాథ్యూ దాస్ వ్యాఖ్యానించారు. అయితే డిమాండ్ను పూర్తిస్థాయిలో తీర్చ లేని పరిస్థితులు ఉంటాయన్నారు. యూఏఈ విమాన ప్రయాణ డిమాండ్ల గురించి జరిపిన అధ్యయన నివేదిక వివరాలను స్థానికంగా ప్రకటించారు. ఆ మేరకు రానున్న దశాబ్దంలో ప్రయాణ డిమాండ్లో 27 శాతం తీర్చలేని పరిస్థితులు ఉంటాయని తమ అధ్యయనంలో వెలుగు చూసిందన్నారు. సీట్ల సామర్థ్యం , ప్రస్తుతం ఉన్న పరిమితులు , పెరుగుతున్న ప్రయాణ డిమాండ్కు అనుగుణంగా ఉండక పోవచ్చునని వివరించారు. ఈ కారణంగా బలమైన వాయు కనెక్టివిటీ మద్దతు ఇవ్వగల ఆర్థిక ప్రయోజనాలు తగ్గే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నారు. 2026– 2035 మధ్య సుమారు 54.5 మిలియన్ల ప్రయాణికులకు ప్రయాణాల కొరత తప్పదన్నారు. అబుదాబి – ఇండియా కారిడార్లో మాత్రమే 13.2 మిలియన్ల మందికి సేవలు అందించేందుకు అవకాశాలు తక్కువగా ఉంటయాన్నారు. పెరుగుతున్న ఆదాయాలు, అంతర్జాతీయ వాణిజ్యం విస్తరణ, అవుట్ బౌండ్, ఇన్ బౌండ్ పర్యాటకం డిమాండ్ పెరుగుదలకు మద్దతుగాఉంటాయని వ్యాఖ్యానించారు. ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం తిరువళ్లూరు: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. తిరువళ్లూరు తాలుకా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు భారీ ర్యాలీ, వేర్వేరు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. తాలుకా కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీని ఆర్డీఓ రవిచంద్రన్ ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో పేరు వున్న ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య హక్కును పరిరక్షించాలన్నారు. ఓటర్లు జాబితాలో పేర్లు లేని వారు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాల్లో పాల్గొని తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కును నిజాయితీగా ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం తాలుకా కార్యాలయంలో విద్యార్థులు నిర్వహించిన విల్లుపాట, అవగాహన నాటకం, పాటలు పలువురిని ఆకట్టుకుంది. తహసీల్దార్ బాలాజీ పాల్గొన్నారు. నవ వధువు మోసం అన్నానగర్: తిరుచెందూరు సమీపంలో పెళ్లి అయిన రెండు రోజులకే నగలు, డబ్బు దొంగిలించిన యువతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. రామస్వామిపురం ప్రాంతానికి చెందిన భాస్కర్ (35) తిరుచెందూర్ ఆలయ ప్రాంగణంలో పండ్లు విక్రయించేవారు. ఇతడికి సాతంగుళంకు చెందిన ముక్కాండి అనే వివాహ బ్రోకర్తో పరిచయం ఏర్పడింది. సదరు బ్రోకర్ నాగర్ కోయిల్కు చెందిన ఓ మహిళను పరిచయం చేశాడు. తద్వారా భాస్కర్ నుండి రూ. 40.వేలు కమీషన్ పొందాడు. పెళ్లికి సిద్దంగా ఉన్న భాస్కర్, ఆ నిరుపేద యువతికి అవసరమైన బట్టలు, చీర సహా ఇతర వస్తువల కోసం రూ. 10ఇచ్చాడు. 20వ తేదీ ఉదయం తిరుచెందూర్లోని శివాలయం వెనుక ఉన్న దుర్గా అమ్మన్ ఆలయం ముందు ఆ యువతి మెడలో 4 గ్రాముల బంగారు తాళిని కట్టి వివాహం చేసుకున్నాడు. తరువాత భాస్కర్ ఆ యువతిని తన ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఆ రోజులు ఆ యువతి భాస్కర్తో కలిసి అదే ఇంట్లో నివసించింది. అయితే 22వ తేదీ ఉదయం భాస్కర్ ఇంట్లో వంటకు అవసరమైన పదార్థాలు కొనడానికి తిరుచెందూర్ వెళ్లి తిరిగి వచ్చినప్పుడు భార్య ఇంట్లో లేకపోవడం వెతికాడు. 10,000 నగదు, బట్టలు లేకపోవడం, భాస్కర్ సెల్ఫోన్లోని చిత్రాలు, ఆధారాలను కూడా తొలగించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఐజీ కార్యాలయ అధికారి ఇంట్లో చోరీ తిరువొత్తియూరు: ఐజీ కార్యాలయ అధికారి ఇంట్లో 6 కిలోల వెండి వస్తువులు, 12 గ్రాముల బంగారు నగలు చోరీ చేసిన గుర్తు తెలియని దుండగులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. శివగంగై జిల్లా తిరుప్పువనం భాగ్యానకరైకి చెందిన నాగసుందరి (55) మధురైలోని ఐజీ కార్యాలయంలో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త మణి పోలీసు శాఖలో ఆపీస్ అసిస్టెంట్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. మణి అనారోగ్యంతో మధురైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇన్పేషెంట్గా చేరి చికిత్స పొందుతున్నారు. నాగసుందరి తన భర్తతో కలిసి ఆసుపత్రిలో బస చేస్తున్నారు. ఈ నేపధ్యంలో శనివారం నాగసుందరి ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. ఈ విషయంపై స్థానికులు ఆమెకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆమె నేరుగా తన ఇంటికి వచ్చి చూడగా, బీరువాలోని 6 కిలోల వెండి వస్తువులు, 12 గ్రాముల బంగారు ఉంగరం చోరికి గురైనట్లు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టీవీకే ఓ మహాశక్తి
సాక్షి, చైన్నె: టీవీకే ఓ మహాశక్తి అని.. దానికి సమరశంఖం పూరించే గొప్ప సైనికశక్తి ఉందని ఆ పార్టీ అధినేత విజయ్ ధీమా వ్యక్తం చేశారు. మిత్రులు చేతులు కలిపినా, కలపకున్నా, ఒంటరిగానైనా ఎన్నికలను ఎదుర్కొని గెలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు మిలటరీ కంటే బలమైన సైన్యం తన వెన్నంటి ఉందని వ్యాఖ్యానించారు. గత నెల రోజులుగా టీవీకే అధ్యక్షుడు విజయ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా కరూర్ కేసు సీబీఐ విచారణ నిమిత్తం ఢిల్లీ పర్యటనతో బిజీగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు విజయ్ ఆశించినట్టుగా ఎన్నికల చిహ్నం విజిల్ ఆ పార్టీ గుప్పెట్లోకి చేరింది. దీంతో నెల రోజుల తదుపరి కేడర్ ముందుకు విజయ్ వచ్చారు. ఆదివారం మహాబలిపురం వేదికగా ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, సమన్వయ కమిటీ కన్వీనర్ సెంగొట్టయ్యన్తో పాటూ నిర్మల్కుమార్, ఆదవ్ అర్జున, జేసిటీ ప్రభాకర్, నాంజిల్ సంపత్ వంటి ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా నాంజిల్ సంపత్ మాట్లాడుతూ, విజయ్ సీఎం కావడం తథ్యం అని, దీనిని ఎవ్వరూ ఆపలేరన్నారు. సెంగొట్టయన్ మాట్లాడుతూ, విజయ్ను ఏశక్తి నిలువరించే లేవు అని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేను గద్దె దించే శక్తి ఒక్క విజయ్కు మాత్రమే ఉందన్నారు. ఈ సమావేశంలో పార్టీ చిహ్నం విజిల్ను విజయ్ ఆవిష్కరించారు. తన బిగిల్ చిత్రంలోని కప్పు ముఖ్యం బిగిలే అన్న డైలాగుతో విజల్ మోతతో అధికారం చేజిక్కించుకుంద్దామన్న డైలాగులతో కేడర్ను విజయ్ ఆకర్షించే ప్రయత్నం చేశారు. గెలుపే లక్ష్యంగా శ్రమించే విధంగా అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అలాగే మాజీ సీఎం పన్నీరు సెల్వం మద్దతు నేత, అన్నాడీఎంకే మాజీ మంత్రి కూపా కృష్ణన్ విజయ్ సమక్షంలో టీవీకేలో ఈసందర్భంగా చేరారు. తలొగ్గే ప్రసక్తే లేదు.. విజయ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ, డీఎంకే, అన్నాడీఎంకేలను గురి పెట్టి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఒత్తిడినా... ఎవరి నుంచి ఒత్తిడి... తానేమీ బానిసను కాను.. ఏ ఒక్కరికి తలొగ్గే ప్రసక్తే లేదంటూ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని గురి పెట్టి వ్యాఖ్యల తూ టాలు పేల్చారు. విజయ్ అంత సామాన్యంగా ఎవరి ముందు తలొగ్గడని, ఇది వరకు రాష్ట్రాన్ని ఏలిన వాళ్లు బీజేపీకి బానిసగా మారి ఉన్నారని , వీరిని నమ్ముకుంటే ప్రయోజనం లేదన్నది ప్రజలు గ్రహించారని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే వాళ్లు వారిని తలదన్నే వారు అన్నది కూడా ప్రజలు గ్రహించారని, అందుకే టీవీకే కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలు విజయ్ను నమ్ముతున్నారని, మనల్ని నమ్మేవారికి నమ్మకంగా సేవ చేయడానికి సిద్ధం.. అని ప్రకటించారు. తాజాగా ఎన్నికలలో పొత్తు కసరత్తులు, చర్చలు, జోస్యాలు విస్తృతం అయ్యాయని వ్యాఖ్యానిస్తూ, 30 ఏళ్లుగా తనను అత్యున్నత స్థానంలో ఉంచిన రాష్ట్ర ప్రజలు, వారి ఇళ్లల్లో ఒ తమ్ముడిగా, అన్నగా, బిడ్డగా చూస్తున్నారని వివరించారు. నమ్ముకున్న వారి కోసం శ్రమించాలని, రాజకీయాలలోకి వచ్చినా, అధికారంలోకి వచ్చినా, అవినీతిని రూపు మాపడంలో ఈ విజయ్ రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. తానూ అవినీతికి పాల్పడను, అవినీతికి పాల్పడే వాళ్లను వదలి పెట్టను అని హెచ్చరించారు. సినిమాలలో వినేందుకు ఈ డైలాగులు బాగానే ఉంటాయని గుర్తు చేస్తూ, ఒకే రోజులో అన్నింటీనీ మార్చేయలేనని, దశల వారీ ప్రయత్నంతో అవినీతి నిర్మూలనలో విజయం వైపుగా అడుగులు వేస్తానన్నారు. ఒంటరికై నా రెడీ దుష్టశక్తి, అవినీతి శక్తికి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని, డీఎంకే, అన్నాడీఎంకేలు అధికారంలోకి రాకూడదన్న లక్ష్యంతోనే తాను మరింత ముందుకు వెళ్లనున్నట్టు వివరించారు. ఈ రెండు శక్తులను ఢీ కొట్టే దమ్ము , ధైర్యం తనకు ఉందన్నారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఒత్తిడి తెచ్చినా తగ్గబోనని, బానిసగా ఉండేందుకు తాను రాజకీయాలలోకి రాలేదన్నారు. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజలను రక్షించేందుకు దళపతిగా రాజకీయాలలో మరింతగా దూసుకెళ్లనున్నట్టు వివరించారు. ఇందుకు తన వెన్నంటి మహా మహిళా శక్తి, మహా కేడర్ సైన్యం ఉందని, అందరూ మనస్ఫూర్తిగా శ్రమిస్తే అధికారం తథ్యం అని వ్యాఖ్యాలు చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు బూత్ కమిటీలు దొంగ ఓట్లు వేయించే గుడారం అని, అయితే, టీవీకేకు బూత్ కమిటీలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సైన్యం అని వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఇంటా విజయ్ ఉన్నాడని, ఆ ఇళ్లల్లో మనకంటూ ఉన్న ఒక్కో ఓటు కూడా చేజారకుండా బూత్ కమిటీలు శ్రమించాలని పిలుపు నిచ్చారు. పార్టీకి కేడర్ పునాది అని, అందరూ స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు. ఎన్నిలకు మూడు నెలలు కూడా సమయం లేదని, తాను సూచించే అభ్యర్థికి మద్దతుగా కేడర్ పనిచేయాలని, గెలిపించాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా రాణి వేలునాచ్చియార్ వీరోచితాన్ని గుర్తు చేస్తూ, తనతో కలిసి పనిచేయడానికి మిత్రులు వచ్చినా, రాకున్నా, ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీ అని ప్రకటించారు. నాడు వేలునాచ్చియార్కు అండగా చిన్న మరుదు, పెద్ద మరుదు, సయ్యద్ ఉండే వారని, ఇప్పుడు తన సైన్యంలో ఉండే వాళ్లందరూ ఈ ముగ్గురే అని వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి శక్తులు వచ్చినా సరే వారిని ఎన్నికల యుద్ధంలో ఢీ కొట్టేందుకు తన వెన్నంటి మిలటరీ కన్నా బలమైన సైనిక శక్తి ఉందని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ సైన్యం గురించి రాజకీయ విశ్లేషకులకే అంతు చిక్కడం లేదని, అవినీతి, దుష్ట శక్తులను తరిమి కొట్టేందుక ప్రజా శక్తితో కలిసి ఎన్నికల కదన రంగంలోకి దిగుతున్నానని, గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. -
నూతన రథం ట్రయల్ విజయవంతం
సేలం: నామక్కల్ – తిరుచెంగోడ్ వద్ద అర్ధనారీశ్వరునికి రూ.3 కోట్లతో కొత్త రథం నిర్మించారు. ఈక్రమంలో ట్రయల్ నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో భక్తి పారవశ్యంతో రథాన్ని లాగారు. వివరాలు.. ప్రసిద్ధ తిరుచెంగోడు అర్థనారీశ్వర దేవాలయంలోని రథం తమిళనాడు రాష్ట్రంలోనే నాల్గవ అతిపెద్ద రథంగా గుర్తింపు పొందింది. ఇది వైకాసి విశాఖ తీర ఉత్సవంలో అర్ధనారీశ్వరుడిని ప్రదక్షిణ చేయడానికి సుమారు 450 సంవత్సరాల క్రితం రూపొందించారు. ఈక్మరంలోపెరియ తేర కాలం నాటి వైకాసి విశాఖ తేర ఉత్సవాలు పాతబడిపోయాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం కొత్త రథాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇలుప్పై ,వేపతో సహా 100 టన్నుల కలపను ఉపయోగించి 23 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పు కలిగిన ఇనుప ఇరుసుతో రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో కొత్త రథాన్ని నిర్మించే పని జూలై 12, 2024న ప్రారంభించారు. ఇటీవల ఇది పూర్తయింది. ఈ నేపథ్యంలో కొత్త రథాన్ని ఆదివారం ప్రారంభించారు. తిరుచెంగోడ్లోని అర్థనారీశ్వరర్ ఆలయం నుండి అస్త్ర తేవర్ తిరుమూర్తిని రథంపై తీసుకెళ్లి వెల్లోట్ట వేడుకను నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. తిరుచెంగోడ్లోని కై లాసనాథర్ ఆలయం నుండి ప్రారంభమైన అస్త్ర తేవర్ ఊరేగింపు రథం వద్దకు చేరుకుంది. తిరుచెంగోడ్ శాసనసభ సభ్యుడు , కొంగునాడు పీపుల్స్ నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈశ్వరన్, పరమతి వెల్లోటూరు మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. మూర్తి, తిరుచెంగోడ్ అర్బన్ కౌన్సిల్ అధ్యక్షురాలు నళిని సురేష్ బాబు రథాన్ని లాగి వెల్లోట్ట వేడుకను ప్రారంభించారు. ఈ రథం వేదిక నుంచి ప్రారంభమై, తూర్పు రథ వీధి, పశ్చిమ రథ వీధి, దక్షిణ రథ వీధి, ఉత్తర రథ వీధి మీదుగా మళ్లీ వేదికకు చేరుకుంది. ఈ ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తితో రథాన్ని లాగారు. మైలాట్టం, కరకట్టం, తప్పట్టం వంటి వివిధ గ్రామీణ ప్రదర్శనలతో రథోత్సవం వైభవంగా సాగంది. -
ఓటు హక్కును వినియోగించుకోవాలి
వేలూరు: కుల మతాలకు అతితంగా ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించుకొని ఆదివారం ఉదయం వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు ఓటు హక్కు వినియోగించడంపై అవగాహన కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరికీ కుల మతాలు తేడా లేకుండా ఓటు వేసే హక్కు ఉందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురష్కరించుకొని ఈనెల 21వ తేది నుంచి ప్రతి తాలుకాలోను, కళాశాలలోను అవగాహన కార్యక్రమాలు చేపడుతునట్లు తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లతో పాటు వృద్ధ ఓటర్లు, యువ ఓటర్లను అభినందించారు. డీఆర్ఓ శివసుబ్రమణియన్, సబ్ కలెక్టర్ సెంథిల్కుమార్, రెవెన్యూ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
భాషోద్యమ వీరులకు నివాళి
సాక్షి, చైన్నె: భాషోద్యమంలో అమరులైన వీరులకు సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో పాటూ మంత్రులు ఆదివారం నివాళులర్పించారు. మూల కొత్తలం, ఎగ్మూర్లో భాషా ఉద్యమంలో అమరులైన తాలముత్తు, నటరాజన్ స్మారక చిహ్నాం, విగ్రహాలను ఆవిష్కరించారు. వివరాలు.. 1938లో హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో అతిపెద్ద నిరసన ఉద్యమం జరిగింది. 8వ తరగతి విద్యార్థులకు హిందీని తప్పనిసరి సబ్జెక్టుగా తీసుకు రావడంతో రగిలిన ఈ ఉద్యమం అప్పట్లో ఆత్మ గౌరవ సమస్యగా మారింది. ఎ.డి. పన్నీర్ సెల్వం, పెరియార్, మరైమలై అడిగలర్, నవలా రచయిత సోమసుందర భారతియార్, కె.ఎస్. పిళ్లై, పూర్ణలింగనార్, మీనాంబాల్ శివరాజ్, ఇలం తడిగల్, పట్టుకోట్టై అళగిరి, ఎం. తారుమాంబాల్, కంచి మణి మొదలియార్, కవి అరుణగిరినాథర్, విప్లవ కవి భారతీదాసన్, అన్నా వంటి గొప్ప పండితులు, నాయకులు హిందీకి వ్యతిరేకంగా భాషా ఉద్యమం ఏడాదిన్నర కాలం పాటూ కొనసాగింది. ఈ ఉద్యమంలో వేలాది మంది యువత జైలుపాలయ్యారు. ఈ ఉద్యమంలో చైన్నె పెరంబూర్ పన్నైక్కార ఆండియప్పన్ వీధిలో నివసించే నటరాజన్ తనను అంకితం చేసుకుని ఆస్పత్రిలో మరణించారు. అలాగే, తంజావూరుకు చెందిన తాలముత్తు సైతం కన్నుమూశాడు. భాషా ఉద్యమంలో నటరాజన్, తాలముత్తుల కీర్తిని తమిళులు తమ హృదయాలలో చెరగని ముద్రగా వేయించుకున్నారు. హిందీకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అశువులైన వారిని అమర వీరులుగా స్మరిస్తూ ఏటా జనవరి 25వ తేదిన తమిళ భాషా అమర వీరుల దినోత్సవంగా అనుసరిస్తున్నారు. అమరవీరులకు నివాళులు చైన్నె మూల కొత్తలంలో నటరాజన్, తాల ముత్తు స్మారకంగా ప్రత్యేక స్తూపం ఏర్పాటు చేశారు. గత ఏడాది దీనిని పునరుద్దరించి, ఆ ఇద్దర విగ్రహాల ప్రతిష్టకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ఎగ్మూర్ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఆదివారం అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం స్టాలిన్ నేతృత్వంలో మౌన ర్యాలీ జరిగింది. సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ త నల్ల వస్త్రాలను ధరించి అడుగులు వేశారు. మూల కొత్తలంలోని స్మారక ప్రదేశంలో అంజలి ఘటించారు. ఎగ్మూర్లోని తాళ ముత్తు, నటరాజన్ల విగ్రహాలను ఆవిష్కరించారు. నాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ వీర వందనం సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ, తమిళనాడులో నాడు, నేడు, రేపు..ఎన్నటికీ హిందీకి చోటు అన్నది లేదని స్పష్టం చేశారు. ఇక, భాషోద్యమంలో ఒక్క ప్రాణం కూడా బలయ్యేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. తమిళుల మనో భావాలు ఎన్నటికి అజరామరం అని వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో మంత్రులు స్వామినాథన్, ఎం సుబ్రమణియన్, శేఖర్బాబు, మేయర్ ఆర్ ప్రియ, ఎమ్మెల్యేలు సుదర్శనం, తాయకంకవి, ఆర్.టి. శేఖర్, జోసెఫ్ శామ్యూల్, వెట్రి అళగన్, ఐడ్రీమ్స్ మూర్తి, కె.పి. శంకర్, కె. గణపతి, అరవింద్ రమేష్, ఎ.ఎం.వి. ప్రభాకర్ రాజా, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కాకర్ల ఉషా, సీఎండీఏ సభ్య కార్యదర్శి కె ప్రకాష్, చైన్నె కార్పొరేషన్కమిషనరన్ కుమర గురుబరన్ పాల్గొన్నారు. -
గణతంత్ర ముస్తాబు!
గణతంత్ర వేడుకలకు రాష్ట్రం ముస్తాబయ్యింది. కేంద్ర ప్రభుత్వ వర్గాల హెచ్చరికతో రాష్ట్రాన్ని అధికారులు నిఘానీడలోకి తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. చైన్నెలో వేడుకలు జరిగే మెరీనా తీరాన్ని డేగకళ్లతో కాపుకాస్తున్నారు. ఈ పరిసరాలను రెడ్జోన్గా ప్రకటించి 7 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. సాక్షి, చైన్నె: దేశవ్యాప్తంగా సోమవారం జరగనున్న 77వ రిపబ్లిక్ డే వేడుకలకు తమిళనాడుతో పాటూ పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముస్తాబైంది. ఈమేరకు ఉదయాన్నే వాడ వాడల్లో మువ్వన్నెల జెండా రాష్ట్ర వ్యాప్తంగా రెప రెపలాడించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ప్రభుత్వ, ప్రైవేటు, కార్యాలయాలు, విద్యా సంస్థల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. శనివారం రాత్రి నుంచి వాహన తనిఖీలు అన్ని జిల్లాల్లో విస్తృతంగా చేపట్టారు. జన సంచారం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో భద్రతను పెంచారు. చైన్నె ఎంజీఆర్ సెంట్రల్, ఎగ్మూర్, తాంబరం, తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు, సేలం, ఈరోడ్, విల్లుపురం, తిరునల్వేలి తదితర ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రముఖ ఆలయాలు, ప్రార్థనా మందిరాలను నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. చైన్నెతో పాటూ మదురై, తిరుచ్చి, తూత్తుకుడి, సేలం విమానాశ్రయాల్లో భద్రతను మరింతగా పెంచారు. వేడుకలు జరిగే ప్రధాన నగరాలలో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. జెండా ఆవిష్కరణ, వేడుకల అనంతరం గ్రామ పంచాయతీలలో గ్రామసభల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఇక, అన్ని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ భవనాలన్నీ విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. పుదుచ్చేరిలో అయితే పండుగ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా మిరుమిట్లు గొల్పే దీప కాంతాలతో కార్యాలయాలు అలరారుతున్నాయి. ఇక్కడ ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నరన్ కై లాస్ నాథన్ జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నారు. చైన్నె మెరీనా తీరంలో.. చైన్నెలో వేడుకలు జరిగే మెరీనా తీరం పరిసరాల్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మెట్రో పనుల దృష్ట్యా గాంధీ విగ్రహం వద్ద కాకుండా ఈసారి కూడా వేడుకలను శ్రామిక విగ్రహం వద్దే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వేడుకలను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం మెరీనా తీరం వైపుగా తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందుగా ఈ వేడుకల నిమిత్తం సీఎం స్టాలిన్ శ్రామిక విగ్రహం వద్దకు ఉదయం రానున్నారు. దారి పొడవున ఉండే ప్రజలకు అభివాదం తెలుపుతూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తారు. అనంతరం గవర్నర్ ఆర్ఎన్ రవి ఇక్కడికి వస్తారు. ఆయన జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు. ఆ తదుపరి పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన జరగనున్నాయి. ఈసారి వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు చాటే ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. వేడుకలు జరిగే ప్రాంతాన్ని పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. కాగా గత కొంతకాలంగా లోక్ భవన్తో సాగుతున్న సమరం నేపథ్యంలో గణతంత్ర వేడుకల సందర్భంగా గవర్నర్ ఇచ్చే విందుకు ఈసారి కూడా డీఎంకే కూటమి పార్టీలు దూరంగా ఉండేందుకు నిర్ణయించాయి. సెంట్రల్ రైల్వే స్టేషన్లో విద్యుత్ కాంతులు రాష్ట్రపతి పతకాలు గణతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్రపతి పతకాలకు రాష్ట్రం నుంచి పలువురు పోలీసు అధికారులు ఎంపికయ్యారు. పోలీసు శాఖలో ఉత్తమ సేవలను అందించిన చైన్నె ఐజీ మహేశ్వరి, ఎస్పీ అన్వర్బాషా, డీఎస్పీ కుమర వేల్లకు రాష్ట్రపతి పతకాలను ప్రకటించారు. మరో 21 మందికి కేంద్ర హోంశాఖ నేతృత్వంలో పోలీసు సర్వీస్ మెడల్స్ అందజేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో పోలీసు మెడల్స్ను 44 మందికి సీఎం స్టాలిన్ ప్రకటించారు. వీరికి పది గ్రాముల బంగారు పతకంతో పాటూ తలా రూ. 25 వేలు నగదు అందజేయనున్నారు. -
అగూర్లో సుబ్రహ్మణ్యస్వామి చిద్విలాసం
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి శుక్రవారం రాత్రి అగూరులో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి పల్లకి మోసే కార్మికులకు చెందిన గ్రామాల్లో ఏడాదిలో ఒక్కరోజు సుబ్రహ్మణ్యస్వామి ఊరేగి దర్శనభాగ్యం కల్పించడం పరిపాటి. ఆ ప్రకారం తిరుత్తణి, ఎగువ తిరుత్తణి, అగూరు, ధరణివరాహపురం, పట్టాభిరామపురం, కుమారకుప్పం గ్రామాల్లో స్వామి విహరిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి అగూరులో విహరించారు. కొండ నుంచి మెట్లు మార్గంలో అగూరుకు చేరుకున్న శ్రీవళ్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవర్లకు అభిషేక పూజలు చేపట్టి విశేష అలంకరణలో గ్రామ వీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి స్వామి దర్శనం చేసుకున్నారు. స్వామివారు ఊరేగింపు సందర్భంగా గ్రామ వీధులు విద్యుద్దీపాలతో కనువిందు చేశాయి. రాత్రి స్వామి ఊరేగింపు పూర్తి చేసుకుని అర్ధరాత్రి కొండ ఆలయం చేరుకున్నారు.


